దాతలు సహకరించండి
బంట్వారం: మండల పరిధిలోని తొర్మామిడిలో చర్చి నిర్మాణానికి దాతల సహకారం ఎంతో అవసరమని మెథడిస్టు చర్చి కమిటీ కోశాధికారి పద్మారావు అన్నారు. మంగళవారం ఆయన సర్పంచ్ సంజీవులు తదితరులతో కలిసి చర్చి నిర్మాణం పనులను పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనుల్లో స్థానికులు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని తెలిపారు. నిధులు చాలా అవసరమని, ఇందుకు సంబంధించి దాతల సహకారం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మెథడిస్టు చర్చి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్గా ఎమ్మెల్యే వీర్లపల్లి
షాద్నగర్: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీచేశారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి
తుక్కుగూడ: పల్లె దవాఖానాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 158 పల్లె దవాఖానాలు ఉన్నాయన్నారు. పల్లెల్లో మాతాశిశు సంక్షేమం, కేన్సర్ కేర్, వయో వృద్ధుల సేవలు తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం వైద్య సిబ్బందికి సిమ్కార్డ్స్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ పాపారావు, సిబ్బంది వినోద్, రాకేశ్, శ్రీనివాసులు, అక్రమ్ పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాల
కల్పనకు చొరవ చూపాలి
అబ్దుల్లాపూర్మెట్: గ్రేటర్లోని శివారు డివిజన్లలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చొరవ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డిరంగారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. నాగోల్ సర్కిల్–11 పరిధిలోని పెద్దఅంబర్పేట, కుంట్లూర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దఅంబర్పేట లక్ష్మారెడ్డిపాలెంలోని ఎస్ఎన్ఆర్ కళా కన్వెన్షన్ హాల్లో అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడంతో ఇక్కడి ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారని, వారిలో అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేయడానికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. నిధులు కేటాయింపులో శివారు డివిజన్లపై చిన్న చూపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దఅంబర్పేట, కుంట్లూరు డివిజన్ల అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించడంతో పాటు అన్ని విభాగాల అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీల వాసులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కృష్ణకుమారి, చీఫ్ ఇంజనీర్ అశోక్రెడ్డి, నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, బాటసింగారం సహకార సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.
దాతలు సహకరించండి
దాతలు సహకరించండి


