breaking news
Vikarabad District Latest News
-
చెట్లను ‘కొట్టే’శారు!
ధారూరు: రహదారి పక్కనున్న చెట్లను నరికేసిన ఘటన సోమవారం వెలుగుజూసింది. ధారూరు ఫారెస్ట్ రేంజ్ రుద్రారం సెక్షన్ కోట్పల్లి ప్రధాన రోడ్డు పక్కనున్న భారీ వృక్షాలను కొట్టివేయడంతో స్థానికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమయింది. వివరాలు.. విద్యుత్ తీగలకు తగులుతున్న కొమ్మలను నరికివేస్తామని విద్యుత్ సిబ్బంది ఫారెస్టు అధికారి, గ్రామ పంచాయతీ దృష్టికి తెచ్చింది. దీంతో కొమ్మల్ని మాత్రమే తొలగించాలని సూచించారు. ఓ అటవీ శాఖ అధికారి సహకారంతో విద్యుత్ సిబ్బంది పేరిట కట్టెల వ్యాపార రోడ్ల పక్కనున్న భారీ వృక్షాలను మిషన్ల సహకారంతో నేల మట్టం చేసి లారీల్లో కలప తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఫారెస్ట్ అధికారి జ్ఞానేశ్వర్, ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ శ్యాంకుమార్ ఎన్ని చెట్లు నరికారు? వృక్ష పరిమాణం, ఎక్కడ నుంచి ఎక్కడ కొట్టివేశారు అనే పూర్తి సమాచారం ఇవ్వాలని సంబంధిత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ను ఆదేశించారు. ఈ విషయం తెలంగాణ ఫారెస్టు చీఫ్ కన్జర్వేటర్ దృష్టికి వెళ్లడంతో అధికారుల్లో దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. -
వసతి గృహంలో విద్యార్థి అదృశ్యం
● ఆలస్యంగా వెలుగులోకి ● వార్డెన్ తీరుపైకుటుంబ సభ్యుల ఆగ్రహందోమ: వసతి గృహంలో ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చౌదర్గూడెం మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన ప్యాట జంగయ్య కుమారుడు ప్రవీణ్ కుమార్(13) దోమ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. స్థానికంగా ఉంటున్న జంగయ్య చిన్నమ్మ కొమ్ముగాళ్ల చంద్రమ్మ సోమవారం పాఠశాలకు వెళ్లింది. బాలుడు కనిపించలేదు. దీంతో ఆమె తోటి విద్యార్థులను ఆరా తీయగా.. సరైన సమాధానం రాలేదు. విషయాన్ని బాలుడి తండ్రికి చెప్పింది. జంగయ్య వార్డెన్ను ఆరా తీయగా ఈ నెల 13వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదని చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. తెలిసిన వారి వద్ద, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 13 నుంచి బాలుడు కనిపించక పోయినప్పటికీ.. వార్డెన్ సమాచారం ఇవ్వక పోవడంతో బంధువులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం
● మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ ● ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 2కే రన్ తాండూరు టౌన్: యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని ప్రజలంతా కలిసి కట్టుగా తరిమి కొట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ పిలుపునిచ్చారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా స్థానిక శివాజీ చౌక్ నుంచి ఇందిరాచౌక్ వరకు 2 కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. డ్రగ్స్ రహిత తాండూరుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై, ఉజ్వల భవిష్యత్పై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఓ మాజీ ప్రజాప్రతినిధి డ్రగ్స్ కేసులో పట్టుబడటం తాండూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాండూరు పేరు డ్రగ్స్ అంశంలో వినిపిస్తోందని, అలాంటి చెడ్డ పేరు రాకుండా ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై యువతకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆదేశించారన్నారు. తాండూరు ప్రజలంతా కలిసి డ్రగ్స్ మహమ్మారిపై తిరుగబాటు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు రామకృష్ణ, నాగారం మల్లేశం, స్వరూప, బాలకృష్ణారెడ్డి, వెంకట్, నాయకులు సర్దార్ ఖాన్, నయీం, సోమశేఖర్, రవి, మాధవి, పర్యాద రామకృష్ణ, వంశీ, సత్యమూర్తి, ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అవస్థల ‘వేదిక’లు!
నిర్వహణ కరువైన రైతు వేదికలు ● నీటి వసతి లేక నిరుపయోగంగా టాయిలెట్స్ ● ఇబ్బంది పడుతున్న రైతులు, ఏఈఓలు ● పట్టించుకోని ప్రభుత్వం నిధులు లేక రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శుభ్రం చేసేందుకు సహాయకులను సైతం ఏర్పాటు చేయకపోవడంతో ఏఈఓలు ఇబ్బంది పడుతున్నారు. మర్పల్లి: రైతు వేదికలు నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏఈఓలకు ఇబ్బందులు తప్పడం లేదు. 2020లో గత ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం గత ప్రభుత్వం మర్పల్లి, కల్ఖోడ, సిరిపురం, పట్లూర్, బిలకల్ గ్రామాలలో రైతు వేదికలను నిర్మించింది. ఇక్కడ సమావేశాల కోసం ఫర్నిచర్ సైతం సమకూర్చారు. వ్యవసాయశాఖ ద్వారా చేపడుతున్న టెలీ కాన్ఫరెన్స్కు హాజరయ్యే రైతులకు ఇబ్బంది తప్పడం లేదని వాపోతున్నారు. తాగునీరు సైతం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని.. నీటి వసతి లేక టాయిలెట్స్ సైతం నిరుపయోగంగా మారాయంటున్నారు. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించే సమావేశాలకు ప్రతీ నెల రూ.9 వేల వరకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. 2022లో ఐదు నెలలకుగాను రూ.45 వేలు విడుదల చేశారు. దీంతో ఎప్పటికై నా నిధులు వస్తాయనే నమ్మకంతో ఏఈఓలు సొంత ఖర్చుతో రైతు వేదికల నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. 2022–2026 మార్చి వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతు వేదికల్లో అత్యవసరమైన సేవలకు కనీస వసతులు కల్పించాలని విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, తదితర ఖర్చులకు మరమ్మత్తులు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
లారీ కిందకు దూసుకెళ్లిన కారు
● సంతాపూర్ ఉప సర్పంచ్ దుర్మరణం ● మరొకరి పరిస్థితి విషమం ● ఏపీలో దుర్ఘటనపెనుకొండ రూరల్: టమాట పైరు కోసం వచ్చిన కేశంపేట ప్రాంతానికి చెందిన ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అంజయ్య(45), తన పొలంలో టమాట సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దున ఉన్న నర్సరీల్లో టమాట పైరు కొనుగోలు చేసేందుకు సమీప బంధువు శ్రీకాంత్తో కలసి కారులో ఆదివారం రాత్రి బయలుదేరాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఏపీ లోని పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో.. డ్రైవర్ శ్రీనివాసులు నియంత్రణ కోల్పోవడంతోలారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసుతో పాటు పక్కనే ముందు సీటులో కూర్చున్న అంజయ్య తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులనుపెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అంజయ్య మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసుకు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి రెఫర్ చేశారు. వెనుక సీటులో ఉన్న మరో వ్యక్తి శ్రీకాంత్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
తండ్రీకొడుకులు అదృశ్యం
కుల్కచర్ల: తండ్రీకొడుకులు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామానికి చెందిన భీమమ్మకు ఏడేళ్ల క్రితం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్తో వివాహమైంది. శ్రీరా మ్ అత్తగారి ఇంటి దగ్గరనే ఉంటూ ఆటో నడిపించేవాడు. ఈనెల 13న శ్రీరామ్ శంషాబాద్లోని తన తల్లిని చూసి వస్తానని చిన్నకొడుకు గౌతమ్ను తీసుకుని వెళ్లాడు. సాయంత్రం భీమమ్మ తన అత్త చిట్టెమ్మకు ఫోన్ చేసిన శ్రీరామ్, గౌతమ్ వచ్చారా అని అడగ్గా రాలేదని చెప్పడంతో సాధ్యమైన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం వారు కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. నిందితులకునాలుగు రోజుల జైలు ఎస్ఐ భరత్ భూషణ్ మోమిన్పేట: పీటీ కేసు నిందితులకు నాలు గు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ భరత్భూషన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని కాస్లబాదు గ్రామానికి చెందిన సండ్ర మొగులయ్య, సండ్ర కిష్టయ్య పరస్పరం గొడవపడి ఠాణలో ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఏన్కతల గ్రా మానికి చెందిన గోపాల్ తన అన్నపై ఇంటి విషయమై గొడవపడగా ఆయనపై పీటీ కేసు నమోదు చేశామన్నారు. వారిని వికారాబాద్ కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యుడీషియ ల్ మెజిస్ట్రేట్ రెండవ తరగతి కోర్టు న్యాయమూర్తి మాయ బ్రహ్మనర్సింహ నిందితులకు నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. దుకాణం దగ్ధం బొంరాస్పేట: మండలంలోని తుంకిమెట్లలో ఆదివారం అర్ధరాత్రి ఓ దుకాణం కాలిపోయింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అంజిలయ్య కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో కూల్డ్రింక్స్ తోపాటు ఫొటో స్టూడియో కూడా ఉంది. దుకాణంలో మంటలు చెలరేగడంతో స్థానికులతో కలిసి అదుపు చేశారు. అప్పటికే రూ.2 లక్షల విలువ చేసే సామగ్రి కాలిపోయిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 4న జగ్జీవన్రాం విగ్రహావిష్కరణ అనంతగిరి: దోమ మండలం కిష్టాపూర్లో ఏప్రిల్ 4న బాబూ జగ్జీవన్రాం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని, కార్యక్రమాన్ని జ యప్రదం చేయాలని వికారాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి కోరారు. సోమవారం అసోసియేషన్ కార్యాల యం ఎదుట కరపత్రం ఆవిష్కరించారు. సంయుక్త కార్యదర్శి ఆనంద్, లవకుమార్, గోవర్ధన్రెడ్డి, రాంచంద్రరావు, జనార్దన్రెడ్డి, అశోక్కుమార్, మహేశ్, శుభప్రద్ పటేల్, మహేశ్రెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత తీర్చడంలో కేంద్రం విఫలం
తాండూరు టౌన్: ఎల్పీజీ గ్యాస్ కొరత తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ ఆరోపించారు. గ్యాస్ ధరల పెంపు, కొరతపై సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌక్లో ఖాళీ సిలిండర్లతో ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరశిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు, కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడినప్పటికీ కేంద్రం మాత్రం కొరత లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పెరిగిన ధరలను తగ్గించడంతో పాటు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్లా, రవీందర్, మునీర్ అహ్మద్, పుష్ప, లక్ష్మి, దస్తప్ప, రాజేందర్, రాజు, బుగ్గప్ప, నర్సింలు, మంగమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు. గ్యాస్ కొరత.. హోటళ్ల మూత దుద్యాల్: గ్యాస్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే పలు హోటళ్లు మూత పడ్డాయి. దీంతో పలువురికి పని లేకుండా పోయింది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. దుద్యాల్ గేట్ వద్ద రెండు, మండల కేంద్రంలో మరి కొన్ని హోటళ్లు మూత పడ్డాయి. అల్పాహారం దొరక్క ప్రయాణికులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూడాలని ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు.ఆందోళన చేపట్టిన సీపీఐ నాయకులు -
ఆలయ భూములు కాపాడండి
దోమ: సంజీవ స్వామి వారి ఆలయ భూములను కాపాడి గుడి పునఃనిర్మాణానికి చర్యలు తీసుకోవాలని దొంగఎన్కేపల్లి మాజీ సర్పంచ్ అశోక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి 104.16 ఎకరాల భూములు ఉన్నాయని, వాటిని కొంత మంది రాజకీయ నేతలు, రియల్టర్లు కబ్జాలకు పాల్పడి విక్రయానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. పరిగి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 383లో 9.18 ఎకరాలులు, పూడూర్ మండలంలోని సర్వే నంబర్ 311, 312లో 4.26 ఎకరాల భూములు ఉన్నాయని, ఆ భూములను పట్టాలుగా మార్చి ఇతర పేర్లపైకి చేసుకున్నారన్నారు. వెంటనే ఆ భూములను త్వరితగతిన ఆలయ పేరిట మార్చాలన్నారు. ఆ భూములను వ్యాపార కార్యక్రమాలకు లీజుకు ఇస్తే ఆలయానికి రూ.కోట్లల్లో ఆదాయం వస్తుందన్నారు. సమకూరిన ఆదాయంతో ఆలయాన్ని సుందరీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు శేరిరాంరెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, కృష్ణారెడ్డి, హన్మంత్, యాదయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. దొంగఎన్కేపల్లి మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి -
రైతు సంక్షేమానికి ప్రత్యేక పథకాలు
పరిగి: రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చిందని పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రంగాపూర్లోని రైతు వేదికలో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు, మార్పులను రైతులు అవగతం చేసుకోవాలన్నారు. నానో యూరియా, నానో డీఏపీల ఉపయోగాలను తెలుసుకుని వాటి వినియోగాన్ని పెంచాలని సూచించారు. వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను సాగు చేయడంతో అధిక దిగుబడుల పాటు లాభాలను ఆర్జించవచ్చునని చెప్పారు. పంటల సాగు, చీడపురుగుల నివారణ చర్యల కోసం ప్రతీ రైతు కృషివాస్ యాప్ గురించి తెలుసుకోవాలని.. అందులో పూర్తి సమాచారం ఉంటుందన్నారు. ప్రభుత్వం రాయితీలపై వ్యవసాయ పరికరాలు, విత్తనాలను అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం, రైతు విజ్ఞాన కేంద్ర విశ్రాంత శాస్త్రవేత్త నర్సింహారెడ్డి, ఏడీఏ శంకర్రాథోడ్ వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
చేవెళ్ల: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని సోలిపేటలో రూ.40 లక్షలతో సీసీరోడ్డు, హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో రూ.20 లక్షల నిధులతో సీసీరోడ్లకు శంకుస్థాపన, సోలిపేటలో ఇందిరమ్మ ఇళ్లు, చందనవెళ్లిలో చలివేంద్రంను ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభు త్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గ్రామాల్లో ఎ లాంటి సమస్యలు ఉన్న వాటిని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్ధార్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, సర్పంచులు రాజేందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, నవనీతస్వామి, శాంతమ్మయాదయ్య, స్వరూప మహేందర్గౌడ్, రాజునాయక్ పాల్గొన్నారు. -
శ్రీవారి సేవకుమరో 13 మంది
బొంరాస్పేట: శ్రీవారి సేవకు మండల పరిధి రేగడిమైలారానికి చెందిన మరో 13 మంది భక్తులు సోమవారం వెళ్లారు. టీటీడీ సేవా బృందం ఆర్గనైజర్ చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో.. సభ్యులు గ్రామంలోని శ్రీ ఆంజనేస్వామి, శివాలయంలో పూజలు చేశారు. అనంతరం తిరుపతికి బయల్దేరారు. ఈ నెల 17 నుంచి 23 వరకు వారు సేవలు అందించనున్నారు. సేవకు తరలిన వారిలో మంగలి వెంకటయ్య, వెంకట్రాములు, విష్ణువర్ధన్, కుర్వ శ్రీశైలం, శేఖర్గౌడ్, నర్సింహులు, నందు, బాబు, ఉప్పరి అనిల్, నెల్లి ఆనంద్, కోటగారి మల్లప్ప, శాంతుకుమార్, కుమ్మరి రమేశ్లున్నారు. ఈ నెల 10న ఇదే గ్రామం నుంచి శ్రీవారి సేవకు 11మంది వెళ్లిన విషయం తెలిసిందే. క్విజ్ పోటీల్లో చిన్నారుల ప్రతిభ ధారూర్: శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభు త్వ పాఠశాలలో సోమవారం మండల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ఎంపీపీఎస్ తరిగోపుల ప్రథమ స్థానం, ఎంపీపీఎస్ గట్టెపల్లి ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన చిన్నారులకు ఎంఈఓ చెన్నయ్య బహుమతులు అందజేశారు. సబ్బండ వర్గాల ఉన్నతికి కృషి డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి కుల్కచర్ల: సబ్బండ వర్గాల ఉన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రంజాన్ను పురస్కరించుకొని ముస్లింలకు కానుకలు అందజేశారు. కుల, మతాలకు అతీతంగా రంజాన్, ఉగాది పండుగలు జరుపుకోవాలని సూచించారు. గిర్దవరి రవి, జలీల్, జాఫర్, షర్పొద్దీన్ ఉన్నారు. వ్యక్తిపై దాడి చేసినఐదుగురికి రిమాండ్ పరారీలో మరో నిందితుడు బొంరాస్పేట: పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని రిమాండ్కు తరలించగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని దుప్చర్లకు చెందిన దానని వెంకటేశ్పై ఇదే గ్రామానికి చెందిన మైసని నర్సింలు, ఇతని సోదరుడు వెంకటేశ్, బంధువులైన చిన్ననందిగామకు చెందిన పోలెపల్లి ప్రవీణ్కుమార్, అచ్యుతాపూర్కు చెందిన మంగిమళ్ల నర్సింలు, గౌతాపూర్కు చెందిన మ్యాతరి నర్సిలు, మ్యాతరి రాజు ఆదివారం ఉదయం 11గంటలకు ఊరి శివారులో మూకుమ్మడిగా దాడి చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. సోమవారం క్షతగాత్రుడి మెడికల్ సర్టిఫికెట్ను పరిశీలించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి శ్రీరామ్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురిని పరిగిలోని సబ్ జైలుకు తరలించగా, మ్యాతరి రాజు పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా పాత కక్షల నేపథ్యంలోనే దానని వెంకటేశ్పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. -
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్
దౌల్తాబాద్: రాష్టంలో వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తో పాటు గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ తేజస్వి పాటిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి.. ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. ఎన్ని ఫీడర్ల ద్వారా సరఫరా జరుగుతోంది.. వేసవిలో ఎంతమేర విద్యుత్ లోడ్ వస్తుందని ఏడీఈ రంగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అంతరాయాన్ని తగ్గించేందుకు ప్రతి సర్కిల్కు ఎమర్జెన్సీ రీ స్టోరేషన్ టీం వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బందాన్ని పంపించాలని సూచించారు. మూడేళ్ల క్రితం ఎంపికై న జూనియర్ లైన్మెన్లకు ప్రొబిషన్ పీరియడ్ పూర్తయినా ఇంతవరకు ధ్రువీకరణపత్రాలు అందజేయలేదని పలువురు సీఎండీ దృష్టికి తెచ్చారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీయర్ బాలస్వామి, ఎస్ఈ రవిప్రసాద్ ఏఈ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. మరమ్మతుల్లో నిర్లక్ష్యం వద్దు పరిగి: ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల్లో నిర్లక్ష్యం చేయరాదని ఎస్పీడీసీఎల్ సీఎండీ తేజస్వి పాటిల్ సూచించారు. సోమవారం పరిగి పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఈ బాగస్వామి, ఎస్ఈ రవిప్రసాద్, డీఈ సంజీవి, ఏడీ వెంకట్నాయుడు, ఏఈ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తిరుచ్చి వాహనంపై దేవదేవుడు
కొడంగల్: పట్టణంలో కొలువుదీరిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బాలాలయంలో సోమవారం తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని వజ్ర వైడూర్యలు, పూలమాలలతో అలంకరించి తిరుచ్చి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల తిరుపతి తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం స్వామివారు చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. -
ఉపాధి నిధులతో అభివృద్ధి
● రూ.6.69 కోట్లు మంజూరు ● గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మోమిన్పేట: మండలంలో రూ.6.69 కోట్ల ఉపాధి నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఎన్కేపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల పనులను పంచాయతీరాజ్ ఈఈ ఉమేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో 18 డ్వాక్రా భవనాలు, 18 వర్క్ షెడ్లు నిర్మించనున్నట్లు వివరించారు. అంగన్వాడీ భవనం, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, ఉప సర్పంచ్ మన్నాన్, ఇన్చార్జ్ ఎంపీడీఓ రాజ మల్లయ్య, ఎంపీఓ యాదగిరి, పీఆర్ ఏఈఈ ప్రణీత్కుమార్, ఏపీఓ శంకర్, కార్యదర్శి తిరుపతమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ అడ్విరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఇంటింటా సోలార్
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ప్యానల్స్ అమర్చడానికి కృషి చేస్తున్నట్లు ట్రాన్స్కో సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం కొడంగల్ మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన లబ్ధిదారుల ఇళ్లపై బిగించిన సోలార్ ప్యానల్స్ను పరిశీలించారు. వాటి పని తీరును గమనించారు. అనంతరం వినియోగదారులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 34 గ్రామాల్లో సుమారు 3వేల ఇళ్లకు సోలార్ ప్యానల్స్ బిగించినట్లు తెలిపారు. త్వరలో మిగతా గ్రామాలకు విస్తరించనున్నట్లు వివరించారు. వినియోగదారులు వాడుకున్నాక మిగిలిన విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మిగులు విద్యుత్ ద్వారా లబ్ధిదారులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా మోడల్ సోలార్ విలేజ్ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇళ్లు, వ్యవసాయ రంగానికి ఈ పథకం అమలు చేయనున్నట్లు వివరించారు. ఇళ్లకు 240 యూనిట్లు, వ్యవసాయ రంగానికి 7.5 కిలోవాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా ప్యానల్స్ను బిగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాన్స్కో సీఈ బాలస్వామి, ఎస్ఈ రవిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ట్రాన్స్కో డీఈఈ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం దౌల్తాబాద్ సబ్స్టేషన్ను సందర్శించారు. విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ నిర్వహణను పరిశీలించారు. -
రెండు దశల్లో జనగణన
అనంతగిరి: జన గణన సంక్షేమ పథకాల అమలు, దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జన గణన – 2027పై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జనగణనలో మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రెండు దశల్లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా వివరాలు సేకరించనున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ మే 11న ప్రారంభమై జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. రెండో దశలో జన గణన ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ 2007 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా (కచ్చా, పక్కా, తదితర,) పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. అనంతరం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ప్లానింగ్ శాఖ జనాభా లెక్కల అధికారులు శ్రీకాంత్ నాయక్, వంగపండు గీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జన గణన, హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్ చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్ఓ మాంగీలాల్, తాండూరు డీఆర్ఓ అనిత, ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వేగవంతం చేయండి జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల, ఇతర భవన నిర్మాణాల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, సీసీ రోడ్లు, ఎస్ఎస్జీ భవనాలు, పాఠశాలల ప్రహరీలుపై సమీక్ష చేశారు. వెంటనే పనులు పూర్తి చేసి నివేదిక పంపాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, డీపీఓ జయసుధ, హౌసింగ్ పీడీ సయ్యద్ మొక్రం బాబా తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దుప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచరాదని, సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు 119 దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆయా శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వారంలోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోజువారి కార్యక్రమాలపై తప్పనిసరిగా ఫొటోలు పంపించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
టీకాయే.. శ్రీరామరక్ష
దుద్యాల్: పశువులకు సంక్రమించే ప్రాణాంతకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు ప్రభుత్వ చర్యలు ఊపందుకున్నాయి. ఈ వ్యాధికి టీకాలు అందించే కార్యక్రమం ఈ నెల 10న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల పశువులు మొత్తం 7.20 లక్షల వరకు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పాడి రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి సిబ్బంది గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి ఎలా వస్తుంది ● గాలికుంటు పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన అప్తోస్ వైరస్ వల్ల వస్తుంది. వ్యాధి సోకిన ఆవులు, గేదెలు పాల ద్వారా దూడలకి వ్యాపిస్తుంది. ● కలుషితమైన నీరు, ఆహారం(మేత, దాణా) ద్వారా వ్యాప్తిస్తుంది. వ్యాధి సోకిన పశువుల లాలాజలం, మలమూత్రలతో కూడా వస్తుంది. వ్యాధి సోకిన పశువులను ఆరోగ్యంగా ఉన్న వాటితో ఉంచడంతో సంక్రమిస్తుంది. పశువులకు కలిగే నష్టాలు ● పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ● ఎద్దులు, దుక్కి దున్నే పశువుల కాళ్లు కుంటుపడడంతో అవి పొలం పనులకు పనికిరావు. ● లేత వయసు గల దూడలలో ఈ వ్యాధి ప్రాణాంతకరంగా మారుతుంది. ● గర్భంతో ఉన్న పశువులకు వ్యాధి సోకితే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. ● నోటిలో పుండ్లు ఏర్పడడంతో అవి సరిగ్గా తినలేవు. దీంతో విపరీతమైన నీరసంతో బరువు తగ్గుతాయి. ● కోలుకున్న తర్వాత కూడా కొన్ని పశువులలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది. ఇటీవల రెండు మృతి దుద్యాల్ మండల కేంద్రంలో గాలికుంటు వ్యాధి సంక్రమించి రెండు పశువులు మృత్యువాత పడ్డాయి. వ్యాధి సోకిన పశువులకు సరైన వైద్యం అందక మృతి చెందాయి. మండల కేంద్రంలో పశువుల ఆసుపత్రి ఉన్న వైద్యులు లేకపోవడం కూడా ఒక కారణమే. నిపుణులు అందుబాటులో ఉండి చికిత్స అందించి ఉంటే ఆవులు మరణించేవి కావని పాడి రైతులు వాపోతున్నారు. పశువులకు ప్రాణాంతకంగా గాలికుంటు వ్యాధి గ్రామాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ సూచనఆవులు: 1.60లక్షలు గేదెలు: 80 వేలు గొర్రెలు: 2.20లక్షలు మేకలు: 2.60లక్షలు టీకాలు తప్పనిసరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గాాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం టీకాల కార్యక్రమం 100 పశువుల ఆసుపత్రుల్లో కొనసాగుతుంది. పశుసంవర్ధక శాఖలో పని చేస్తున్న సిబ్బంది 50 బ్యాచ్లుగా సేవలందిస్తున్నారు. – సదానందం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి -
కేజీబీవీలో తరగతి గదులు ప్రారంభం
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మారెపల్లి గేటు వద్ద కేజీబీవీలో రూ.2.30 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆదివారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మారెపల్లి గేటు వద్ద ఉన్న ఆరే మైసమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, సర్పంచ్ మంగళి సునీత, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అంజయ్య, నారాయణరెడ్డి, నాయకులు శోభరాణి, లొంక నర్సింలు, గోపా ల్రెడ్డి, కరణం పురుషోత్తంరావు, ఉప్పరి మల్లేశం, ఎల్లారెడ్డి, రియాజ్, హరీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
హాం ఫట్
బొంరాస్పేట: ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో అందినకాడికి ఇసుకను తోడేస్తూ అక్రమార్కులు రూ.కోట్లకు పడగలేస్తున్నారు. అప్పట్లో తుంకిమెట్ల, కొత్తూరు, ఏర్పుమళ్ల తదితర గ్రామాలు తండాల్లో పూర్తిగా ఇసుకను తోడేశారు. ప్రస్తుతం కాగ్నావాగు పరివాహక గ్రామాలు, బొంరాస్పేట, మహంతీపూర్, మద్దమడుగుతండా, దుప్చర్ల గ్రామాల్లోనే టిప్పర్ల కొద్దీ ఇసుకను పగలు, రాత్రి తరలిస్తున్నారు. ఇందుకు అధికారులు, నాయకులకు సైతం ముడుపులు చేరుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలనకు వచ్చిన జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల బృందం కళ్లేదుట తుంకిమెట్లలో టిప్పర్ల కొద్దీ ఇసుక డంపులున్నా పట్టించుకోలేదు. సదరు సీఐ, ఎస్ఐల వాహనాలు చూస్తూ వెళ్లారు. చివరకు స్థానికుల చొరవతో డంపులు సీజ్ చేయించారు. సఖ్యత కరువు సీఎం రేవంత్రెడ్డి చొరవతో నియోజకవర్గానికి రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల భవనాలు, వంతెనలు, ప్రహరీలు ఇలా ప్రతి మండలంలో పనులు జరుగుతున్నాయి. కానీ మరోవైపు రెండేళ్లుగా విచ్చలవిడిగా రోజుకు 50 నుంచి 80 టిప్పర్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య పొంతన లేకపోవడంతో ఇసుక అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోలీసుసిబ్బందిలో ఇద్దరు ఇసుక అక్రమ రవాణాకు ఇన్ఫార్మర్లుగా ఉంటున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. గోరంత అనుమతి రూ.కోట్ల నిధులతో నిర్మాణాలు చేస్తున్న బడా కాంట్రాక్టర్లు గోరంత అనుమతి తీసుకొని కొండంతగా తవ్వుకుంటున్నారు. కొడంగల్, పరిగి తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను నిల్వ చేసి యథేచ్ఛగా రూ.లక్షలకు అమ్ముకుంటున్నారు. మండల కేంద్రంతోపాటు బొట్లోనితండా, మద్దిమడుగుతండా, తుంకిమెట్ల ఇసుక రవాణా కేసమే టిప్పర్లు, దుప్చర్ల, మహంతీపూర్, నాగిరెడ్డిపల్లి, తదితర గ్రామాలు తండాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మామూళ్ల మత్తులో అధికారులు మునిగి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతోపాటు మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. బరితెగిస్తున్న ఇసుకాసురులు నిత్యం టిప్పర్ల కొద్దీ తరలింపు రూ.కోట్లకు పడగలెత్తుతున్న అక్రమార్కులు పట్టించుకోని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటాం ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో రెవెన్యూకు పోలీసు, మైనింగ్ అధికారులు సహకరించాలి. రెవెన్యూ పరంగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. డంపులు సీజ్ చేసి వేలం నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులకు అనుమతులిస్తున్నాం. అక్రమదందా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. – పద్మావతి, తహసీల్దార్, బొంరాస్పేట -
దొరకని గ్యాస్.. హోటళ్లు క్లోజ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మంటలు మన టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లను తాకాయి. ఇప్పటికే గృహ సిలిండర్పై రూ.60, వాణిజ్య సిలిండర్పై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. డిమాండ్కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో సిలిండర్ల కోసం ఆయా ఏజెన్సీల ముందు జనం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఉన్న సిలిండర్లు ఖాళీ కావడం, కొత్తగా బుక్ చేసినప్పటికీ సకాలంలో సరఫరా లేకపోవడంతో చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చేతినిండా పనితో బిజీగా ఉన్న వంటమనుషులు, సప్లయర్లు ప్రస్తుతం పని లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అధికారుల ప్రకటనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. గ్యాస్కు కొరత లేదని, ఆ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తుండటం గమనార్హం. ఇరుగు పొరుగు సహకారం కరువే జిల్లాలోని మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 14.93 లక్షలకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. వీటిలో 12 వేలకుపైగా కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి రోజుకు సగటున 22 వేల రీఫిల్స్ బుకింగ్స్ ఆర్డర్స్ ఉండగా, ప్రస్తుత సంక్షోభంలో ముందస్తు బుకింగ్స్ 26 వేలకు చేరడం విశేషం. నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న సిలిండర్లను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నింపి పెట్టుకుంటుండటమే ఇందుకు కారణమని తెలిసింది. మెజార్టీ టిఫిన్ సెంటర్లు, టీస్టాల్ యజమానులు కమర్షియల్ కనెక్షన్లు తీసుకోలేదు. బంధువులు, ఇరుగు, పొరుగు వారి నుంచి ఖాళీ సిలిండర్లను సేకరించి, రీఫిల్ చేసుకుని వాడుకునే వారు. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు పెంచడం, కొత్త కనెక్షన్ల మంజూరుకు నిరాకరిస్తుండటం, ప్రస్తుతం ఇరుగు పొరుగు నుంచి కూడా ఆశించిన సహకారం లభించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో టిఫిన్ సెంటర్లు, టీస్టాల్ యజమానులు తమ హోటళ్లను మూసి వేస్తున్నారు. ఇంట్లో పిండి వంటలు బంద్ వంటింట్లో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్న వాళ్లు పిండి వంటలు బంద్ చేశారు. బయటి ఫుడ్డుతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని భావించి తమ పిల్లలకు వివిధ రకాల స్నాక్స్ చేసి పెట్టే తల్లులు ప్రస్తుతం పండ్లు, రెడీమేడ్ బేకరీ ఫుడ్డును బాక్సుల్లో సర్దుతున్నారు. వారం, పది రోజులకోసారైనా ఇంట్లో తయారు చేసుకునే పిండివంటలను గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుందనే భయంతో మానేశారు. ఆలస్యమైతే కాల్ చేయండి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. డెలివరీ ఆలస్యమైతే ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 1800–2333–555 లేదా 77189 55555కు, భారత్ గ్యాస్ కస్టమర్లు 1800–22–4344 లేదా 77150 12345కు, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు 1800– 2333–555 లేదా 94936 02222కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. నిలిచిన కివి పండ్ల దిగుమతులు యుద్ధ వాతావరణం బాటసింగారం పండ్ల మార్కెట్పైనా ప్రభావం చూపుతోంది. ఇరాన్ నుంచి ఇక్కడి మార్కెట్కు కివీ, యాపిల్, కర్జూర పండ్లు దిగుమతి అవుతుంటాయి. యుద్ధం కారణంగా దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్ సహా నగరంలోని ఏ పండ్ల మార్కెట్లో కూడా కివీ పండ్లు దొరకడం లేదు. న్యూజిలాండ్, ఇటలీ, ఫ్రాన్స్ నుంచి కొద్ది మొత్తంలో దిగుమతి అవుతున్నా నగరవాసులు అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఇరాన్ నుంచి యాపిల్ దిగుమతి లేకపోవడంతో సిమ్లా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాపిల్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. అదనపు చార్జీల వడ్డన అంతో ఇంతో గ్యాస్ నిల్వలు ఉన్న హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు అమాంతం ధరలు పెంచేశాయి. నిన్న మొన్నటి వరకు ఓ సాధారణ టిఫిన్ సెంటర్లో ప్లేటు ఇడ్లీ, వడ, పూరి ధర రూ.40 ఉండగా, ప్రస్తుతం రూ.60 వరకు పెంచారు. సింగిల్ టీ ధర రూ.10 నుంచి రూ.15కు పెంచేశారు. అదేమంటే గ్యాస్ సర్ చార్జీ అంటున్నారు. మెజార్టీ హోటళ్లలో మెనూలోని ఐటెమ్స్ సగానికి తగ్గించారు. గ్యాస్ ఎక్కువ ఖర్చయ్యే ఆహార పదార్థాలను వండడం మానేశారు. తక్కువ సమయంలో ఉడికే ఆహార పదార్థాలనే రెడీ ఫర్ ఈట్ ప్లేస్లో ఉంచుతున్నారు. ఇక కేటరింగ్ సంస్థలు సైతం ధరలను అమాంతం పెంచేశాయి. రోజుకు కనీసం వెయ్యి మందికి 20 రకాల ఐటమ్స్ సరఫరా చేసేవారు రెండు మూడింటితో సరిపెడుతున్నారు. జిల్లాలో గ్యాస్ వినియోగం ఇలా. డొమెస్టిక్ సిలిండర్లు 14,93,250 వాణిజ్య సిలిండర్లు 12,708 రోజుకు సగటున రీఫిల్ బుకింగ్స్ 22,500 ప్రస్తుతం బుకింగ్స్ 26,300 నిండుకున్న వాణిజ్య సిలిండర్లు.. నిలిచిన సరఫరా మూతపడుతున్న టిఫిన్ సెంటర్లు.. టీ స్టాళ్లు తెరిచి ఉన్న వాటిల్లోనూ అదనపు చార్జీల వడ్డన రోజురోజుకూ మరింత ముదురుతున్న సంక్షోభం -
గుంతల రోడ్డు.. నరక ప్రయాణం
● పోల్కంపల్లి రహదారి పనులు చేపట్టండి ● సీపీఎం జిల్లా నాయకుడు జగన్ ఇబ్రహీంపట్నం రూరల్: పోల్కంపల్లి– రాయపోల్ అధ్వాన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు పీ.జగన్ డిమాండ్ చేశారు. గుంతలయమమైన రోడ్డులో ప్రయాణం నరక ప్రాయంగా మారిందన్నారు. రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోతులు ఏర్పడి రోడ్డు రూపం కోల్పోయిందన్నారు. మరమ్మతు పనులు చేయించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో రోడ్డు పునరుద్ధరణకు రూ.56 లక్షలు మంజూరయ్యాయని, అయినా పనులు చేపట్టడం లేదన్నారు. ఇరాన్– ఇరాక్ యుద్ధం నేపథ్యంలో ప్రజలకు గ్యాస్ కష్టాలు వచ్చాయని, అవసరాల మేరకు సరిపడా బండను సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు చెరుకూరి నర్సింహ, శాఖ కార్యదర్శులు నర్సింహ, కరుణాకర్రెడ్డి, యాదయ్య, నాయకులు గూడెం అశోక్, బాల్రాజ్, ధనేశ్వర్, శ్రీనివాస్, పాండు, వెంకటేశ్, శివ, జంగయ్య, యాదగిరి, బాలయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిని బలిగొన్న వివాహేతర సంబంధం
కుల్కచర్ల: వివాహేతర సంబంధం ఓ యు వకుడిని బలిగొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డె రమేశ్(22)కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉంది. గతంలో కుటుంబ సభ్యులు మందలించడంతో రమేశ్ ఆమెను దూరంగా పెట్టాడు. కానీ కొంతకాలంగా ఆమె యువకుడికి ఫోన్ చేస్తూ ఇబ్బందులకు గురిచేసేంది. ఈ క్రమంలో 13వ తేదీ సాయంత్రం ఫోన్ చేసి రమేశ్ను పిలిపించుకుంది. అదే సమయంలో మాటువేసిన సదరు మహిళ కుటుంబసభ్యులు(అన్న, తమ్ముడు, భర్త) రమేశ్ను తీవ్రంగా కొట్టడంతో అక్కడి నుంచి ఎటో పారిపోయాడు. దీంతో మనస్తాపంతో అతడు ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ మేరకు తన కొడుకు మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి సత్యమ్మ కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. ఆత్మరక్షణకు కరాటే దోహదం కొడంగల్ రూరల్: చదువుతోపాటు విద్యార్థులు క్రీడలు కరాటేలో రాణించడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని సెకండ్ ఎస్ఐ సత్యనారాయణరాజు అన్నారు. ఆదివారం కేఎస్ఎస్ కరాటే అకాడమి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. పెద్దనందిగామ, రుద్రారం, చిట్లపల్లి యూపీఎస్, మాటూర్ యూపీఎస్, అప్పాయిపల్లి యూపీఎస్లకు సంబంధించిన 60 మంది విద్యార్థులు కరాటే గ్రేడింగ్ టెస్ట్లో పాల్గొన్నారు. ప్రతిభ చాటిన చిన్నారులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని, తద్వారా విద్యార్థులు చదువులో రాణించేందుకు అవకావం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు శ్రీనివాస్, మల్లేశ్, మోనిశ్ తదితరులు పాల్గొన్నారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య మేడిపల్లి: కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. చెంగిచెర్ల గణేష్నగర్కు చెందిన ఎల్లయ్య (37) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని పెద్దకుమారుడు వెంకటేష్ (19) ఓ యువతితో ఫోన్లో తరచుగా మాట్లాడుతుండటంతో తండ్రి ఎల్లయ్య మందలించాడు. ఈనెల 9న రాత్రి కుమారుడిని మందలించాడు. మనస్తాపానికి గురైన వెంకటేష్ మరుసటిరోజు తెల్లవారు జామున ఇంటినుండి వెళ్లి పోయాడు. ఈ క్రమంలో శనివారం తండ్రి ఎల్లయ్య ఇంటి వెనకభాగంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ చెట్టుకు వేలాడుతున్న ఓ మృతదేహాన్ని గమనించి దగ్గరకు వెళ్లి చూడగా అది వెంకటేష్దేనని గుర్తించాడు. అప్పటికే మృతదేహం కుళ్లిన స్థితి లో ఉంది. స్థానికుల సహాయంతో మృత దేహా న్ని కిందకు దించారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక బస్సు ఢీకొని యాచకురాలి మృతి గచ్చిబౌలి: కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ యాచకురాలిని ఢీకొనడంతో మృతి చెందింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్ జిల్లా తూమ్కుంటకు చెందిన పి.బాలమణి(68) గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కొద్ది సంవత్సరాలుగా భిక్షాటన చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వావాహనాల వద్ద యాచిస్తోంది. ఈ క్రమంలో గ్రీన్ సిగ్నల్ పడటంతో ఆర్టీసీ బస్సుఆమెను ఢీ కొట్టింది. రెండు కాళ్లపై నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కొద్ది సేపటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
చిన్నతరహా పరిశ్రమలో చేర్చండి
కేంద్ర మంత్రిని కోరిన స్టోన్ అసోసియేషన్ ప్రతినిధులు తాండూరు: నాపరాతి పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం భారీ పరిశ్రమల జాబితాలో చేర్చడంతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని తాండూరు క్వారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్ కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డికి విన్నవించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యూ.రమేశ్కుమార్తో కలిసి తాండూరు క్వారీ ఓనర్స్ అసోసియేషన్, స్టోన్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతంలో ఉన్న నాపరాతి పరిశ్రమ లైమ్ స్టోన్ స్లాబ్ చిన్నతరహా పరిశ్రమ జాబితాలో కొనసాగుతూ వచ్చిందన్నారు. ఇటీవల కేంద్రం భారీ పరిశ్రమల జాబితాలోకి చేర్చారని తెలిపారు. దీంతో లైమ్ స్టోన్, షాబాద్ స్టోన్, నాపా స్లాబ్ క్వారీ లీజ్ హోల్డర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 30 వేల కుటుంబాలు నాపరాతి పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయన్నారు. గుంటలు, అర ఎకరం నాపరాతి నిక్షేపాలు కలిగిన పట్టా భూముల్లో క్వారీ నిర్వహిస్తారని చెప్పారు. అందుకే నాపరాతి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమల జాబితాలో కొనసాగించాలని అభ్యర్థించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందిస్తూ.. తాండూరు నాపరాతి పరిశ్రమకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఓం ప్రకాష్సోమాని, మహ్మద్ అన్వర్, జైనుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్ అనంతగిరి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి జనగణన పకడ్బందీగా చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ) మంగీలాల్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనాభా లెక్కలకు సంబంధించి అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ సుధీర్ హాజరై జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మంగీలాల్ మాట్లాడుతూ.. మొదటి దశలో హౌస్ లిస్టింగ్(ఇండ్ల జాబితా)ను మే 11 నుంచి జూన్ 9 వరకు, రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుందన్నారు. 2027 మార్చి 1వ తేదీని రిఫరెన్స్గా పరిగణిస్తామన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనకు జనాభా గణాంకాలు కీలకంగా ఉంటాయన్నారు. మొదటిసారిగా డిజిటల్ విధానం ద్వారా మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ను ఉపయోగించి ఈ గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను రూపొందించారన్నారు. ఇందులో జనాభా లెక్కల అధికారులు శ్రీకాంత్నాయక్, వంగ పండు గీత పీపీటీ ద్వారా శిక్షణ నిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, తాండూరు ఆర్డీఓ అనిత, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ రూరల్: మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ను ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఆదివారం కమిటీ సభ్యులు నందారం ప్రశాంత్కుమార్కు శాలువా కప్పి సత్కరించారు. ఆర్యవైశ సంఘం సభ్యులు రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. వడివడిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగం పెంచిన అధికారులు ఆర్థిక చేయూతకు రంగం సిద్ధం 99 రోజుల ప్రణాళికలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు.. -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఆహ్వానం
అనంతగిరి: జిల్లాలోని షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలకు షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రూ.లక్ష వరకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు(90శాతం సబ్సిడీ), రూ.3లక్షలు విలువ గల త్రిచక్ర ఎలక్ట్రికల్ ఆటో ప్యాసింజర్ లేదా గూడ్స్ వాహనాలు(70శాతం సబ్సిడీ), రూ.3లక్షల నుంచి 7లక్షల వరకు(60శాతం సబ్సిడీ) విలువ గల సోలార్ యూనివర్సిల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగాల యూనిట్లను లోన్ల కింద ప్రకటించారన్నారు. అభ్యర్థి సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హత కలిగిన వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియ ఈనెల 17 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గల రెండో అంతస్తులోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కలెక్టర్ దీపక్ తివారి -
గూడుకట్టు శుభవేళ
వికారాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే పూర్తయిన వాటిని ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఆరు నెలలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. రేషన్ కార్డుల మంజూరు, ఉచిత విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ తదితర వాటిపై దృష్టి సారించారు. ఇందిరమ్మ ఇళ్లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే హౌసింగ్ శాఖలో ఇంజనీర్ల కొరత కారణంగా కొంత మేర ఇబ్బందులు ఎదురవుతున్నా అధిగమించి పథకాన్ని వేగవంతం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తి కాగానే బిల్లులు అందేలా చొరవ చూపుతున్నారు. వివిధ దశల్లో.. జిల్లాకు మొదటి విడతలో 2,345, రెండో విడతలో 10,518 ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్ కూడా అందజేశారు. 8,536 ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారు. 2,569 మంది బేస్మెట్ పనులు పూర్తి చేయగా ఒక్కొక్కరికి రూ.ఒక్కో లక్ష చొప్పున అందజేశారు. మరో 1,332 మంది రూప్ లెవెల్ వరకు పనులు పూర్తి చేశారు. 2,711 మంది రూప్ కాస్ట్ లెవెల్ వరకు పూర్తి చేయడంతో రూ.4 లక్షల చొప్పున బిల్లులు మంజూరు చేశారు. 286 ఇళ్లు పూర్తికాగా రూ.5 లక్షల చొప్పున జమ చేశారు. ఆయా స్థాయిల్లో ఉన్న 6,898 ఇళ్లకు రూ.143.45 కోట్లు చెల్లించారు. 4,327 మంది ఇళ్ల పనులు ప్రారంభించలేదు. అయోమయంలో మరి కొందరు రెండు విడతల్లోనూ స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. స్థలం లేని వారి పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని స్థలం లేని పేదలు కోరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాకు 5,740 డబుల్ ఇళ్లు అప్పటి మంజూరయ్యాయి. 2016లో నిర్మాణ పనులను ప్రారంభించారు. 2,257 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 1,031 పూర్తయ్యాయి. ధారూరులో 120, మర్పల్లిలో 120, యాలాల్ మండలం కోకట్లో 180, తాండూరు పట్టణంలో 401, పరిగిలో 180, చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్లో 30 ఇళ్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాకు రెండు విడతల్లో మంజూరైన ఇళ్లు 13,464 ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు 12,863 నిర్మాణ దశలో 8,536 ఇంకా ప్రారంభం కానివి 4,327 గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నవి 286 చెల్లించిన మొత్తం రూ.143.45 కోట్లు -
రంజాన్కు ప్రత్యేక సెలవులు ప్రకటించాలి
బొంరాస్పేట/యాలాల: ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగకు ప్రభుత్వం అధికారికంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ వసీం డిమాండ్ చేశారు. శనివారం ఆయన బొంరాస్పేట, యాలాలలో విలేకరులతో మాట్లాడారు. ముస్లింలు నెలరోజులపాటు ఎంతో నిష్టగా, పవిత్రంగా పండుగ జరుపుకొంటారని ఐదు రోజుల పాటు ప్రత్యేక సెలవులు ఇవ్వాలన్నారు. మైనార్టీల మనోభావాలను గౌరవించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. -
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
● పోలీసులు న్యాయంచేయడం లేదని ఆరోపణ ● డీఎస్పీ హామీతోకిందికి దిగిన నిరసనకారుడు మోమిన్పేట: పోలీసులు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన మోమిన్పేటలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన మర్రి మోహన్రెడ్డి మోమిన్పేటలో నివసిస్తున్నాడు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న తన మేనకోడలి తండ్రి చనిపోవడంతో మోహన్రెడ్డి సంరక్షణలో ఉంటోంది. ఇదిలా ఉండగా, బుద్ధేరాలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే తన కూతురు కనిపించడం లేదంటూ మోహన్రెడ్డి సోదరి వరలక్ష్మి ఫిబ్రవరి 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిరిపురం గ్రామానికి చెందిన పట్లోళ్ల సందీప్రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోహన్రెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయమై సీఐ వెంకట్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సందీప్రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి, వెంటనే రిమాండ్కు తరలించాలంటూ మోహన్రెడ్డి పలుమార్లు పోలీసులను ఆశ్రయించాడు. వారి నుంచి స్పందన లేకపోవడంతో శనివారం మోమిన్పేటలోని సెల్ టవర్ నిరసన వ్యక్తంచేశాడు. సీఐ వెంకట్తో పాటు అప్పట్లో విధులు నిర్వర్తించిన ఎస్ఐ అరవింద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మూడు గంటల పాటు టవర్పై ఆందోళన చేయడంతో డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకి దిగివచ్చాడు. సహకరించడం లేదు.. ఈవిషయమై సీఐ వెంకట్ను అడగగా.. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తేనే నిందితుడిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. అమ్మాయి మేనమామ ఇందుకు సహకరించడం లేదన్నారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చాలని, అక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుందని పలుమార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదన్నారు. బాలికను గత నెల 14న సఖి కేంద్రానికి తరలించగా మోహన్రెడ్డి ఆమెను తీసుకెళ్లాడని, ఎన్నిసార్లు చెప్పినా తీసుకురావడం లేదని స్పష్టంచేశారు. అమ్మాయి స్టేట్మెంట్ లేకుండా పోక్సో కేసు ఎలా నమోదు చేస్తామని ప్రశ్నించారు. -
చదువుతో పాటు ఆటల్లో రాణించాలి
అనంతగిరి: విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని వింటేజ్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని బసంత్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేయగా.. సీఐ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కృషి పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా.. వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు బహమతులు అందజేశారు. చిన్నారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ బాబుసింగ్, స్కూల్ డైరెక్టర్ అనితా, కరస్పాండెంట్ శ్రీధర్రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
కుల్కచర్ల: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన చీమ పూజ శ్రీనివాస్ ఆరోగ్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా.. రూ.1.20 లక్షల చెక్కు మంజూరు అయింది. ఈ మేరకు శనివారం ఆయన బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఇందులో మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, ఏఎంసీ డైరెక్టర్ రాంచంద్రయ్య, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, నాయకులు రాంరెడ్డి, కృష్ణయ్య, నర్సింహులు, రాములు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధే ధ్యేయం
మర్పల్లి: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎన్ఆర్జీఎస్ రూ.10 లక్షల నిధులతో సర్పంచ్ రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవీందర్, సీనియర్ నాయకులు సుభాష్యాదవ్తో కలిసి సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శేఖర్యాదవ్, మండల నాయకులునగేష్, నర్సింహులు యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగదీశ్, పట్లూర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మహేశ్, సర్వేశ్, దివాకర్, అనంత్రెడ్డి, రంగయ్య, గౌస్ తదితరులు ఉన్నారు. -
‘ప్రజా పాలన’ను సక్సెస్ చేద్దాం
అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ అనంతగిరి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు. శనివారం వికారాబాద్ పట్టణ పరిధిలోని నర్సరీని పరిశీలించారు. ఎన్ని మొక్కలు పెంచుతున్నారు.. ఏఏ రకాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఏపుగా పెరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం శివారెడ్డిపేట్లోని జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ లోకనాథం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బాలాలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉత్సవమూర్తులకు శేష వస్త్రం, పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ఆలయ ధర్మకర్తలు రత్నం, మధు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట పాల్గొన్నారు. బాలాలయం ఆవరణలో బ్రహ్మోత్సవాలు బాలాలయం ఆవరణలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, నిత్య పూజలు, సుప్రభాతం, తోమాల సేవ, అలంకరణ తదితర పూజలను భక్తుల సమక్షంలో చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహనం, 17న ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనం, 18న సింహ వాహనం, వ్యాళి వాహనం, 19న కల్ప వృక్ష వాహనం, ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం, రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనం, 20న పల్లకిలో మోహినీ అవతార ఉత్సవం, టీటీడీ శేష వస్త్రాల సమర్పణ, రాత్రికి గరుడ వాహనం, 21న హనుమంత వాహనం, గజవాహనం, 22న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 23న రథోత్సవం, అశ్వవాహనం, 24న రోహిణీ ఆస్థానం ఉంటుంది. రోజూ సాయంత్రం 7గంటలకు బాలాజీ పాడుతా తీయగా కార్యక్రమం ఉంటుంది. బాలాలయంలో ఆస్థాన సేవలు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం వైఖానస ఆగమంలో పూజలు తిరుమల తరహాలో వాహన సేవలు -
గ్రామాలకు న్యాయ అవగాహన వ్యాన్లు
అనంతగిరి: గ్రామాలకు న్యాయసేవలు విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ న్యాయసేవ అధికార సంస్థ రెండు మొబైల్ వ్యాన్లను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్,తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోసి ప్రారంభించారని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరి వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మొబైల్ వ్యాన్లు ఇక నుంచి గ్రామాలకు వెళ్లి, ప్రజలకు చట్టాలపై అవగాహన, న్యాయసేవాధికారాసంస్థ ఎలా పనిచేస్తుంది తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. -
నిత్య ధ్యానం.. ఆరోగ్యకరం
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ప్రచార కార్యదర్శలు ధారూరు: ‘ధ్యానం మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. రోగాలను నయం చేస్తుంది’ అని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యాన ప్రచార కార్యదర్శులు ఆంజనేయరెడ్డి, బాలకృష్ణలు తెలిపారు. మండల పరిధి కేరెళ్లి, బాచారం, ఎబ్బనూర్, మున్నూరు సోమారం, కాచారం గ్రామాల్లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తలనొప్పి నుంచి క్యాన్సర్ సైతం నిత్య ధ్యానంతో నయం అవుతాయని చెప్పారు. ఒత్తిడుల నుంచి ఉపహశమనం పొందుతారని తెలిపారు. యుక్త వయసులోనే వస్తున్న గుండె జబ్బులను దరి చేరకుండా చేస్తుందన్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి పెంపొందుతుందని వివరించారు. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పిరమిడ్ సంస్థ సభ్యులు సుబద్ర, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కొడంగల్ రూరల్: పట్టణంలోని కొత్త 11కేవీ లైన్ పనుల కారణంగా ఆదివారం పట్టణంలోని పలు కాలనీల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని ఏఈ ప్రవీణ్కుమార్ శనివారం తెలిపారు. పరిగి రోడ్, వడ్డర్గల్లి, బ్రాహ్మణవాడి, బాకారం గల్లి, కలాల్వాడి, ఇంద్రానగర్, కమర్కాలనీలకు సరఫరా నిలిపివేయనున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం కొడంగల్ రూరల్: తొలిదశలో రాష్ట్రంలోని 93 కేజీబీవీని వైఐఐఓఈగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయని కొడంగల్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్రవంతి తెలిపారు. 2026 – 27విద్యా సంవత్సరానికి గాను ఇంటర్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. టీజీ – ఆర్జెసీ సెట్ 2026 ద్వారా మెరిట్ సాధించిన విద్యార్థినులకు వైఐఐఓఈ కళాశాలల్లో సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఉంటాయని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మే నెల 3 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని వివరించారు. దౌల్తాబాద్ ఎస్ఐగా వేణుకుమార్ దౌల్తాబాద్: మండల ఎస్ఐగా వేణుకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజుకుమార్ వీఆర్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వికారాబాద్లో వీఆర్లో ఉన్న వేణుకుమార్ను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్గా మహేశ్ తాండూరు: తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రశ్వేర దేవాలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్గా మెడి మహేశ్, సభ్యులుగా గంగా శ్రవణ్కుమార్, గాజుల విజయ్కుమార్, లింగమంతుల శంకర్, శెట్టి చంద్రకాంత్, మాద్రికి చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గనూర్ సాంకేత్లను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు ఉగాది పండగ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దంపతులపై కేసు నమోదు తాండూరు రూరల్: ఒకరి చావుకు కారణమైన దంపతులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామని కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన అగ్గనూర్ లక్ష్మి(35)ని.. అదే గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారులు హన్మంత్రెడ్డి, ఉమాదేవి అప్పు తీర్చాలని ఒత్తిడి తేవడమే కాకుండా.. అవమాన పరిచారు. దీంతో మనస్తాపం చెందిన సదరు మహిళ శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మృతురాలి భర్త వీరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వ్యాపారులఇంటికి వెళ్లగా.. ఇరువురు పరారీలో ఉన్నారు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తోంది. కాగా.. కేసు వాపస్ తీసుకుంటే రూ.లక్షల్లో పరిహారం ఇస్తామని నిందితులు.. మధ్య వర్తుల ద్వారా మృతురాలి కుటుంబానికి రాయబారంపంపారు. ప్రాణం పోయిన తరువాత తమకు పరిహారం అవసరం లేదని, ఇరువురిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకునిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
దుద్యాల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీస్లు పట్టుకున్నారు. ఈ సంఘటన దుద్యాల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి పోలెపల్లి గ్రామవాసికి చెందిన (టీఎస్06 యూడీ4286) నంబర్ గల ట్రాక్టర్ గ్రామం నుంచి దుద్యాల్ మీదుగా వెళ్తున్న క్రమంలో దుద్యాల్ గేట్ సమీపంలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లుగా గుర్తించి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. వారికి క్లీన్చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం తాండూరు: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సందల్రాజుగౌడ్ అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. క్లీన్చిట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇదే విషయమై హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, సంతోష్గౌడ్, శ్రీనివాసచారి, కౌన్సిలర్లు అనిల్, ఇర్షద్, యోగానంద్ ఉన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా మహేశ్ కుమార్ అనంతగిరి: తెలంగాణ హైకోర్టు పరిధిలో నిర్వహించిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణానికి చెందిన అడ్వకేట్ ఆకుల మహేష్ కుమార్ ఘన విజయం సాధించారు. మొత్తం 203 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. మంచి పేరు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారనే పేరు ఉంది. పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. తనను విశ్వసించి గెలిపించిన న్యాయవాదులందరికీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గెలుపుపై న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు, మేధావులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ యార్డు, పరిసరాల్లో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు తెలిపారు. శనివారం సీసీ కెమెరాల ఏర్పాటుపై ఏఎంసీ కార్యదర్శి ఫసియొద్దీన్, ది గ్రేన్ మర్చంట్ కమిటీ అధ్యద్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్కుమార్తో చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సిబ్బంది సాయికుమార్, రాజు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో గ్యాస్ కొరత లేదు
కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ దీపక్ తివారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గృహ, విద్యాలయాలు, ఆస్పత్రులకు ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి లోటు లేదన్నారు. ప్రజలు ఆందోళన చెందరాదని సూచించారు. ప్రజా అవసరాల మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అన్ని పండుగలకు ప్రాధాన్యత
పరిగి:కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలు, పండుగలకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం పరిగి పట్ట ణంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చా రు. పేదలకు కానుకలు అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ముస్లింలకు అండగా ఉంటుందన్నారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అన్నారు. సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ హన్మంతు, నాయకులుకుడుముల వెంకటేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
మొదటి రోజు పరీక్ష ప్రశాంతం
● కేంద్రాలను సందర్శించిన డీఈఓ రేణుకాదేవి వికారాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం పదో తరగతి మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వికారాబాద్ జిల్లాలో మొత్తం 13,579 మంది టెన్త్ విద్యార్థులు ఉండగా అందులో 6,852 మంది బాలురు, 6,691 మంది బాలికలు. 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు పరీక్షకు 48 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ రేణుకాదేవి, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ వికారాబాద్ పట్టణంలోని పలు కేంద్రాలు సందర్శించారు. పలుచోట్ల రవాణా పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులు చెక్ చేసి సెంటర్లలోకి అనుమతించారు. మొదటి రోజు కావడంతో పిల్లల వెంట తల్లిదండ్రులు వచ్చారు. రంగారెడ్డి జిల్లాలో.. జిల్లాలో పదో తరగతి మొదటి రోజు పరీక్ష సజావుగా జరిగింది. 52.851 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా 52,487 మంది పరీక్ష రాశారు. 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ నారాయణరెడ్డి పరీక్ష కేంద్రాలు పరిశీలించారు. -
సీపీఆర్ చేసి.. ఆస్పత్రికి తరలించి
మోమిన్పేట: పురుగు మందు తాగిన ఓ వ్యక్తిని 108 సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన శుక్రవారం మోమిన్పేటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి దేవరంపల్లి గ్రామానికి చెందిన చాకలి ఎల్లయ్య.. అప్పుల పాలయ్యాడు. ఆ రుణం తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురై.. పరుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు అంబులెన్స్కు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది.. సీపీఆర్ చేశారు. అనంతరం మెరుగైన కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఈఎంటి తరుణ్, పైలట్ తాజొద్దీన్లను కుటుంబీకులు, స్థానికులు అభినందించారు. ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది -
సాహిత్య లోకానికి ఆదర్శం మొల్ల
● మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ ● ఘనంగా కవయిత్రి జయంతితాండూరు టౌన్: సాహిత్య లోకానికి కవయిత్రి మొల్ల ఆదర్శనీయమని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అన్నారు. శుక్రవారం తాండూరులో మొల్ల కళావేదిక, బాలల మాస పత్రిక మొలక సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ దర్భంగా మొల్ల చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో మొల్ల ధృవ తారగా నిలిచారని, ఆమె స్ఫూర్తితో నేటితరం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కవులు, వారి రచనలు, సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రముఖ కవయిత్రులు ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి, వాసరచెట్ల జయంతిని మొల్ల అవార్డుతో చైర్పర్సన్ సన్మానించారు. మొల్ల సాహిత్యంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో పాల్గొన్న 60 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించారు. కార్యక్రమంలో మొల్ల కళావేదిక అధ్యక్షుడు కేవీఎం వెంకట్, గౌరవాధ్యక్షుడు సత్యం, బస్వరాజ్, శ్రీనివాసాచారి, బాలకృష్ణ, విజయలక్ష్మి, శంకరమ్మ, గోవిందరావు, ప్రకాష్, ఆనందం, సురేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
పల్లె దవాఖాన ప్రారంభం
దుద్యాల్: మండల పరిధి గౌరారంలో రూ .29.5 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని శుక్రవారం సర్పంచ్ రాథోడ్ కిష్టిబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో చాలా రోజులుగా వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి భవనాన్ని వినియోగంలోకి తెచ్చామని, ఇక మీదట వైద్యం అందరికీ అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాజామైనొద్దీన్, పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, వైద్యుడు హర్షవర్ధన్, నాయకులు పులిందర్ రెడ్డి, సీసీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. రామలింగేశ్వరుడికి అడిషనల్ ఎస్పీ పూజలు కుల్కచర్ల: బండవెల్కిచర్ల గ్రామం పాంబండ రామలింగేశ్వరునికి శుక్రవారం అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు.. అడిషనల్ ఎస్పీని సన్మానించారు. కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, అర్చకులు పాండు పాల్గొన్నారు. మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ దోమ: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని పూర్వ విద్యార్థులు అన్నారు. శుక్రవారం మండల పరిధి బొంపల్లిలో 2009– 10బ్యాచ్నకు చెందిన బాల్య మిత్రులు.. స్థానిక మజీద్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. పండ్లు తినిపించి దీక్షలను విరమింపచేశారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ శ్రీశైలం బషీరాబాద్: ఎస్ఐ శ్రీశైలం యాదవ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందుకు ఇక్కడ పనిచేసిన ఎండీ నుమాన్అలీ వికారాబాద్ ఎస్పీ కార్యాలయం వీఆర్కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో శ్రీశైలం చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ ధారూరు: జిల్లా పౌరసరఫరాల అధికారులు శుక్రవారం ధారూరులోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ గ్యాస్ వినియోగాన్ని గుర్తించారు. కమర్షియల్ సిలిండర్లు వాడాల్సిన చోట దొరికిన ఆరు డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను ధారూరులోని హెపీ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. -
అవమాన భారంతో మహిళ ఆత్మహత్య
● పురుగుల మందు తాగి మృతి ● సిరిగిరిపేట్లో ఘటన ● కరన్కోట్ పీఎస్లో కేసు నమోదు తాండూరు రూరల్: వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక, మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాండూరు మండలం సిరిగిరిపేట్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వినోద్ రాథోడ్, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అగ్గనూర్ లక్ష్మి(35), వీరప్ప దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పంట పెట్టుల కోసం ఏడాది క్రితం ఇదే ఊరికి చెందిన హన్మంత్రెడ్డి వద్ద మూడు రూపాయల వడ్డీకి రూ.లక్ష తీసుకున్నారు. కొద్ది నెలలుగా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఇటీవల అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతినడంతో నష్టపోయి, వడ్డీ చెల్లించలేకపోయారు. ఈక్రమంలో శుక్రవారం హన్మంత్రెడ్డి తన భార్య ఉమాదేవితో కలిసి వీరప్ప ఇంటికి వెళ్లారు. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఉగాది వరకు చెల్లిస్తామని, అప్పటి వరకు తమ బైక్ తీసుకెళ్లమని లక్ష్మి చెబుతున్నా పట్టించుకోకుండా గ్రామస్తుల ఎదుట అవమానపర్చారు. ఈ ఘటనను అవమానంగా భావించిన లక్ష్మి మధ్యాహ్నం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి మరణాన్ని తట్టుకోలేని లక్ష్మి కొడుకు, కూతురు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వీరప్ప ఫిర్యాదు మేరకు కరన్కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సర్పంచ్పైనే ఫిర్యాదు చేస్తావా!
● ఫిర్యాదుదారుడినిచితకబాదిన హెడ్ కానిస్టేబుల్ ● మీడియా ఎదుటగోడు వెల్లబోసుకున్న బాధితుడుబషీరాబాద్: అధికార పార్టీ సర్పంచ్పైనే ఫిర్యాదు చేస్తావా..? అంటూ ఓ హెచ్ కానిస్టేబుల్ తనపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోజ్యానాయక్తండాకు చెందిన సేవ్యానాయక్ కూలీ పనులు చేస్తూ జీవనంసాగిస్తున్నాడు. ఈ నెల 3న గ్రామంలో జరిగిన ఓ గొడవలో తన ప్రమేయం లేకపోయినా సర్పంచ్పై అనుచిత వ్యాఖ్యలు చేశావంటూ ఆమె వర్గీయులు సేవ్యానాయక్ను దూషించారు. ఈవిషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు మరుసటి రోజైన 4న బీషీరాబాద్ పీఎస్కు వెళ్లి, సర్పంచ్ శాంతిభాయి, ఆమె భర్తపై ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా తాగిన మైకంలో తన భర్తను చంపేస్తానంటూ వాగుతున్నాడని సర్పంచ్ శాంతి కూడా ఫిర్యాదు చేశారు. పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న లోక్యానాయక్ ఫిర్యాదుదారుడైన సేవ్యానాయక్ను తీసుకెళ్లి చేతులు బొబ్బలు వచ్చేలా, వేల్ల నుంచి రక్తం కారేలా కొట్టాడు. ఈ విషయాన్ని బయట చెబితే ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు ఓ లాయర్ను కలిసి, ఆయన ద్వారా విషయాన్ని సీఐ, డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. సదరు కానిస్టేబుల్ గతంలో కూడా తండాకు చెందిన రవి అనే యువకుడిని తీసుకెళ్లి దాడి చేశాడని స్థానికులు తెలిపారు. ఈ విషయమై హెడ్కానిస్టేబుల్ లోక్యానాయక్ను అడగగా.. ‘రాజకీయ నాయకులు, పోలీసులను దూషిస్తున్నాడని పీఎస్కు తీసుకువచ్చాం. ఎస్ఐ నుమాన్అలీ ఆదేశాల మేరకు బెల్టుతో రెండు, మూడు దెబ్బలు కొట్టిన మాట వాస్తవమే. రాజకీయ నాయకులను, పోలీసులను దూషిస్తే కొట్టొద్దా..? శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు గట్టిగా మందలించిన మాట వాస్తవమే’ అని తెలిపారు. -
నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి
ఎస్పీ స్నేహమెహ్ర అనంతగిరి: పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శుక్రవారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీడీఆర్, ఐపీడీఆర్ల విశ్లేషణ, విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, సీసీఎస్సీఐ బల్వంత్ రాయ్, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
పొదుపు సంఘాల డబ్బు పక్కదారి!
కుల్కచర్ల: తమకు తెలియకుండా వీఓ శ్రీనివాస్ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేశారని పలువురు మహిళలు ఆరోపించారు. శుక్రవారం చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట ఆయా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు లోన్లు ఇప్పించే క్రమంలో రూ.2 లక్షలు డిపాజిట్ చేసి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డబ్బులు తీసుకున్నాడని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన జ్యోతి మహిళా పొదుపు సంఘానికి చెందిన ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. సంఘం పేరిట రూ.11 లక్షల లోను తీసి.. తమకు రూ.7 లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చారని, ఒక లక్ష డిపాజిట్ అని చెప్పి మిగతా డబ్బులు తన సొంతానికి వాడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే డ్రా చేసుకుని, మళ్లీ.. రూ.2 లక్షలు ఖాతాలో జమచేశాడని, మిగతా డబ్బులు తమనే కట్టమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఏపీఎం బాలకృష్ణను వివరణ కోరగా.. సర్పంచ్తో పాటు మరికొంత మంది వీఓ శ్రీనివాస్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారని తెలిపారు. సోమవారం ఒక్కో సంఘం వారీగా విచారణ చేపడతామని వివరించారు.బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన -
కేజీబీవీని సందర్శించిన నాయకులు
బషీరాబాద్: మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలను శుక్రవారం బషీరాబాద్ సర్పంచ్ వెంకటేశ్ మహరాజ్, ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భోజనం గురించి ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఓకు తెలిపారు. వంట గదిని తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజనం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అన్నం మాడిపోవడంపై అక్కడి సిబ్బందిని వివరాలు అడిగారు. ఇలా ఉంటే పిల్లలు ఎలా తింటారని ప్రశ్నించారు. తాజా కూరగాయలు వండి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా విజిటర్ డైరీలో కంప్లైంట్ రాశారు. మరోసారి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు నరేష్ చౌహన్, కాంగ్రెస్ నాయకులు పవన్ ఠాకూర్, సాయిలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
ఎస్పీ స్నేహమెహ్ర అనంతగిరి: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ స్నేహమెహ్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని, ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. వ్యక్తిపై కేసు నమోదు కుల్కచర్ల: సోదరిపై దాడి చేసిన సోదరుడిపై కేసు నమోదు అయింది. ఈ సంఘటనమండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. పాత్ల వత్ శంకర్.. జేసీబీ విషయంలో సోదరి ఉమ తో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను శంకర్ తోసివేయగా.. గాయపడింది. దీంతో బాధితురాలు భర్త గోపాల్ ఫిర్యాదు మేరకు.. శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రమేష్ తెలిపారు. కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య తాండూరు రూరల్: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కరన్కోట్ పోలీస్స్టేషన్ పరిధి చెంగోల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాథోడ్ వినోద్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైండ్ల లక్ష్మి(52), వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. కొన్ని నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో దూలానికి తాడుతో ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కేసు దర్యాప్తులో ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.లక్ష అందజేత అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 22వ వార్డు కౌన్సిలర్ లంకా లక్ష్మికాంత్రెడ్డి రూ.లక్ష అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న సంస్కరణల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎంతో దోహదపడుతుందన్నారు. తన వంతుగా రూ.లక్ష అందజేసినట్లు తెలిపారు. సీఐ రఘుకుమార్ లక్ష్మికాంత్రెడ్డిని అభినందించారు. జాతీయ సెమినార్లో షాద్నగర్ ప్రొఫెసర్ షాద్నగర్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో గ్రీన్ ఎనర్జీ రీసోర్సెస్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఇండియా పేరుతో నల్లగొండలో శుక్రవారం జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు షాద్నగర్కు చెందిన అర్ధశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పర్యావరణ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అంశంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ సదస్సుకు దేశంలోని విఽవిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల ప్రొఫెసర్లు హాజరయ్యారు. -
కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
మొయినాబాద్: విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్న గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి వారు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్ మాట్లాడుతూ.. కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పలువురు విద్యార్థులు జేఎన్టీయూకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో వైస్ ప్రిన్సిపాల్ అహ్మద్, సిబ్బంది మల్లేశ్లు కలిసి సంబంధిత విద్యార్థులను గదిలో బంధించి, దాడి చేసినట్లు ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అల్లి దేవేందర్, చరణ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ -
నిరాడంబరతకు నిదర్శనం
ఇబ్రహీంపట్నం: అశ్రునయనాల మధ్య ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు అంత్యక్రియలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేని నిరాడంబర రాజకీయ జీవితానికి నిదర్శనంగా నిలిచారు కొండిగారి రాములు. భేషజాలకు తావివ్వకుండా, ప్ర జాసేవకు, సమస్యల పరిష్కరానికే జీవితాన్ని అంకితం చేశారు. పదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగినా ఆస్తులు కూడబెట్టుకోలేదు. అనారోగ్యంతో పెద్ద కుమారుడు అరుణ్ ఆస్పత్రిపాలైతే చికిత్స అందించేందుకు సైతం పైకంలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. సొంత గూడు కట్టుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యేగా వచ్చే గౌరవ వేతనం పార్టీ ఫండ్కే ఇచ్చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేలకు బంజారాహిల్స్లో ఇంటి స్థలాన్ని కేటాయించినా తీసుకోలేదు. కమ్యూనిస్టు నేతగా నమ్ముకున్న పార్టీ సిద్ధాంతం కోసం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. సాదాసీదా జీవితాన్ని గడిపి ఆదర్శప్రాయంగా నిలిచారు. రాజకీయ ప్రస్థానం చిన్న వయస్సులోనే కమ్యూనిస్టు భావజాలంతో ఆయన స్వగ్రామమైన ఆరుట్ల నుంచి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1967లో భూ పోరాట సమితిలో కృష్ణమూర్తి నాయకత్వలో పనిచేశారు. భూ, ప్రజా సమస్యల పోరాటాల ఫలితంగా 1989 నుంచి 2007 వరకు ఆయనపై సుమారు 50 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నేతగా 1985–1989 వరకు పనిచేశారు. 1989 నుంచి 1999 వరకు పదేళ్ల పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. దుఃఖసాగరంలో కుటుంబం కొండిగారి రామలు ఆయన సతీమణి ముత్యాలమ్మ తొమ్మిది నెలల వ్యవధిలోనే కన్నుమూయడంతో కుటుంబసభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. చిన్న కుమారుడు త్రిలోక్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్గా విజయం సాధించాడు. బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా క్యాంపులో ఉండడంతో ఆయన కూడా అక్కడే ఉన్నారు. తండ్రి అంత్యక్రియలు జరిపించేందుకు త్రి లోక్ రాకకోసం ఎదురుచూశారు. కుమారుడి రాకతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహోన్నత వ్యక్తి కొండిగారి రాములు భౌతికకాయానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మచ్చలేని రాజకీయ నాయకుడని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకుశాంతి చేకూరాలని ప్రార్థించారు. నిస్వార్థ నాయకుడు నిస్వార్థ నాయకుడు, అందరినీ కలుపుకెళ్లే తత్వం కొండిగారి రాములుదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పెద్ద దిక్కున్న నాయకుడుని కోల్పోవడం బాధకరమన్నారు. ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పించారు. నిఖార్సైన ఉద్యమ నేత నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనం, నిఖార్సైన కమ్యూనిస్టు ఉద్యమ నేత కొండిగారి రాములు అని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సాధారణ జీవనం గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరనిలోటన్నారు. నేటి యవతకు ఆదర్శం ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యకి కొండిగారి రాములు అని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. పేదల హక్కుల కోసం ఆయన చేసిన కృషి నేటి యువతకు ఆదర్శమన్నారు. ప్రజాసేవకే జీవితం అంకితం ఆదర్శంగా కొండిగారి రాములు స్మరించుకున్న ప్రముఖులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి -
పరిశుభ్రత.. ఆరోగ్యానికి భద్రత
అనంతగిరి: పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పా టిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రజాపాలన – ప్ర గతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోజువారి కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శి శిల్పను అడి గి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రా యాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, ఎంపీఓ దయానంద్, సర్పంచ్ స్వేత శివ య్య, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సిద్దులూర్ను సందర్శించిన జెడ్పీ సీఈఓ మండలంలోని సిద్దులూర్ గ్రామామంలో జెడ్పీ సీఈఓ సుధీర్ పర్యటించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు. పిల్లలు, గర్భిణుల హాజరు శాతం తెలుసుకొన్నిరు. కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
గంట ముందు రావాలి
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తేవాలి. విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. – దీపక్ తివారి, కలెక్టర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర అసౌర్యాలు కలిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలి. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లరాదు. ఎగ్జామ్స్ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలి. బెస్ట్ ఆఫ్ లక్ – స్నేహ మెహ్ర, ఎస్పీ -
విజేతలకు బహుమతుల ప్రదానం
తాండూరు టౌన్: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026లో భాగంగా స్థానిక పీపుల్స్ డిగ్రీ కళాశాలలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. యాభై సంవత్సరాల అత్యవసర పరిస్థితి – భారత ప్రజాస్వామ్యం నేర్చుకున్న పాఠాలు అనే అంశంపై పోటీ నిర్వహించారు. ఓయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ వేంకటేశ్వర్లు, ప్రొఫెసర్ కృష్ణకుమార్, హన్మంతరావు, మహేందర్ రెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో విజేతలకు జిల్లా యువజన క్రీడాధికారి సత్తార్, ఈషయ్య బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకళ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య తాండూరు సాధిద్దాం
● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ● ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్తాండూరు టౌన్: అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమనే ఉద్దేశంతో ఆరోగ్య తాండూరు, అభివృద్ధి తాండూరు అనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5 కే రన్లో ఆయన పాల్గొన్నారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి విలియంమూన్ చౌరస్తా వరకు 5కే రన్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ముందడుగు వేస్తోందన్నారు. ప్రతి రోజూ ప్రజలను, అధికారులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో 99 రోజుల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు, క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు 5 కే రన్ ఏర్పాటు చేసిందన్నారు. అభివృద్ధితో పాటు ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యమన్నారు. కలిసి కట్టుగా తాండూరును క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా మార్చేద్దామన్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మఽధుసూదన్ రెడ్డి, ఎమ్మార్వో తారాసింగ్, కౌన్సిలర్లు, సహారా క్రికెట్ అకాడమీ క్రీడాకారులు, వాకర్స్ టీం సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. డబ్బు అడిగితే ఫోన్ చేయండి యాలాల: సంక్షేమ పథకాలకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తనకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. పథకాల మంజూరులో మధ్యవర్తుల జోక్యాన్ని సహించేది లేదన్నారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ.61.07 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కానుకలు అందజేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సింలు, సొసైటీ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షులు అక్బర్బాబా, బీమప్ప, సర్పంచ్లు అమర్నాథ్రెడ్డి, రాజేందర్రెడ్డి, నాయకులు పేరి రాజేందర్రెడ్డి, అమృతయ్య, మధుసూదన్రెడ్డి, పవన్కుమార్, హన్మంతు, మహిపాల్, ఖాసీం, ఉప సర్పంచ్లు కై లా రాఘవేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మహేష్, నరేష్ తదితరులు ఉన్నారు. -
దశదిశ మారేనా!
వికారాబాద్: నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం కేంద్రాల్లో హాల్ టికెట్ నంబర్లు వేశారు. విద్యార్థులు గంట ముందుగా సెంటర్లకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఎగ్జామ్ సెంటర్ల సమీపంలోని జిరాక్స్ షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల్లో తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నెలరోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,852 మంది బాలురు, 6,691 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధాహ్నం 12:30 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. అనుకోని పరిస్థితుల కారణంగా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మాస్ కాపీయింగ్ కట్టడికి చర్యలు మాస్ కాపీయింగ్ కట్టడికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎవరైనా చూసి రాస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులు చేయాలని నిర్ణయించారు. 2023లో మాస్ కాపీయింగ్, ఉపాధ్యాయుల ప్రమేయంపై గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. 72 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 20 మంది తహసీల్దార్లు, 20 మంది ఎంపీడీఓలు 20 మంది ఎంఈఓలు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల రవాణా కోసం ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. గడిచిన ఐదేళ్లుగా నిరాశపర్చిన పదో తరగతి ఫలితాలు.. గత రెండేళ్లలో జిల్లాను అట్టడుగు స్థానాలకు తీసుకెళ్లాయి. దీంతో ఈసారి ఎలాగైనా మంచి రిజల్ట్ సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వెనుకబడిన వారిపై దృష్టిసారించి, పరీక్షలకు సన్నద్ధం చేశారు. నేటి నుంచిపదో తరగతి వార్షిక పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జిల్లాలో మొత్తం విద్యార్థులు 13,579 మంది పరీక్ష కేంద్రాలు 69 ఐదు నిమిషాలలోపు ఆలస్యమైనా అనుమతి పరీక్షలు సజావుగా జరగాలి డీఈఓ రేణుకాదేవి కొడంగల్ రూరల్: పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని డీఈఓ రేణుకాదేవి ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ నుంచి అన్ని కేంద్రాల ఇన్విజిలేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్ఎం జాక వెంకటేశం, ఉపాధ్యాయ సిబ్బంది, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు. అనంతరం ఎంఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ మండలంలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 1,003మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. -
క్రీడా స్ఫూర్తి చాటాలి
క్రీడలు యువజన విభాగం జిల్లా అధికారి సత్తార్ దోమ: విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో దేశ సమైక్యతను చాటాలని క్రీడలు, యువజన విభాగం జిల్లా అధికారి సత్తార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ సమీపంలోని శ్రీ అనంత పద్మనాభ ఏఎస్ఏపీ కళాశాలలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. దోమ, పరిగి, పూడూరు, వికారాబాద్ కేజీబీవీలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా డీవైఎస్ఓ ఐజయ్య ఆధ్వర్యంలో రన్నింగ్, స్కిప్పింగ్, వాలీబాల్, ఖోఖో తదితర పోటీలు నిర్వహించారు. దోమ కేజీబీవీకి చెందిన 9వ తరగతి విద్యార్థినులు కే అనూష, కే. పావనీత పరుగు పందెంలో, అనూష స్కిప్పింగ్లో సత్తాచాటారు. వారిని అభినందించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో పీఈటీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి బంట్వారం: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి అన్నారు. శుక్రవారం కోట్పల్లి మండలం కరీంపూర్ పీహెచ్సీ పరిధిలోని బార్వాద్లో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కరీంపూర్ పీహెచ్సీ డాక్టర్ నిరోష, వైద్యులు జయలక్ష్మి, జయరాం, హెచ్ఈఓ రవీందర్రెడ్డి, ఎంఎల్హెచ్పీలు దివ్య, శ్రావణి, ఏఎన్ఎంలు నర్సమ్మ, ప్రభావతి, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వినియోగదారులకు ఏమైన సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 9885930418కు కాల్ చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సుదర్శన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతగిరి: ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. విద్యార్థులు తమ స్నేహితులతో కాసేపు ముచ్చటిస్తూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. రెండేళ్ల వారి స్నేహాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు భావోద్వేగానికి గురయ్యారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల వెంట సొంత గ్రామాలకు బయలుదేరారు. తాండూరు రూరల్: మండలంలోని కరన్కోట్ గ్రామానికి చెందిన గోవింద్గౌడ్ డాక్టరేట్ పట్టా పొందారు. నగరంలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రావణ పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. -
కృత్రిమ కొరత సృష్టించొద్దు
● సకాలంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలి ● ప్రభుత్వ ధరలకే విక్రయించాలి ● కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ దీపక్తివాలి ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీని సందర్శించారు. బుకింగ్ విధానం, అవలంబిస్తున్న పద్ధతులు, రికార్డుల నిర్వహణ తదితర వాటిని పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. సంబంధత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కృత్రియ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సకాలంలో గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు. అనంతరం పట్టణంలోని సివిల్ సప్లయ్ గోదాంను తనిఖీ చేశారు. పౌరసేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. స్టాక్, రికార్డులను పరిశీలించారు. సన్నబియ్యం, ఇతర సరుకులు లబ్ధిదారులకు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం మురళీ కృష్ణ, డీఎస్ఓ సుదర్శన్, తహసీల్దార్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల్లో తనిఖీ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, దుకాణ లైసెన్సులను పరిశీలించారు. ఎంఆర్పీకే ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. సాగుకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ రాజరత్నం, ఏడీఏ సందీప్కుమార్, ఏఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్లను నియమించాలి అనంతగిరి: బూత్స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నిక అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు మ్యాపింగ్, బూత్స్థాయి అధికారుల, ఏజెంట్ల నియామకంపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 68.30శాతం ఓటరు మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వేగవంతం చేయాలి ఏప్రిల్ 20లోపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 12,863 ఇళ్లు మంజూరయ్యాయని, 8,546 నిర్మాణాలు ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా వాప్తంగా 621మంది గుడిసెల్లో ఉన్నారని వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీపీఓ జయసుధ, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సురేష్, హౌసింగ్ పీడీ సయ్యద్ మొక్రం బాబా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో శుక్రవారం నగరం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు సూచించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్ రాజేశ్వరి, సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్, డీసీఎస్ మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సత్తార్, ఇరిగేషన్, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం
హయత్నగర్: మునుగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించనున్నట్టు రిజిస్ట్రార్ విజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మునుగనూరులోని పాత పంచాయతీ భవనంలోకి మార్చాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభు త్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్యాలయాన్ని మునుగనూరుకు మార్చినట్లు తెలిపారు. -
‘గ్రీన్ ఫీల్డ్’ పనుల అడ్డగింత
యాచారం: గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులను రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. కుర్మిద్ద అనుబంధ గిరిజన తండాలైన మంగలిగడ్డ, మర్లకుంట, పోతుబండ తండాల రైతులకు చెందిన 283, 286, 274 తదితర పట్టా సర్వే నంబర్లలోని 30 ఎకరాల భూమిలోంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తోంది. ఈ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు జేసీబీ, ఇతర యంత్రాలతో పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న రైతులు తరలివచ్చారు. పట్టా భూములకు సంబంధించి పరిహారం చెల్లింపుపై స్పష్టత లేదని.. సేకరణపై కోర్టుల్లో కేసులు, స్టేలు ఉన్నాయని.. అయినా అధికారులు బలవంతంగా పనులు ప్రారంభించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. దీంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ వద్ద సమావేశపర్చండి.. అక్కడే తేల్చుకుంటామని రైతులు అన్నారు. రెండు, మూడు రోజుల్లో కలెక్టర్ సమయం తీసుకుని సమావేశం అయ్యేలా చూస్తానని ఆర్డీఓ అనంత్రెడ్డి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
‘ఉపాధి’ని నీరుగార్చే కుట్ర
కందుకూరు: జాతీయ ఉపాధిహామీ చట్టానికి పేరు మార్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చట్టాన్ని పూర్తిగా తొలగించేలా చేస్తున్న తిప్పికొట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అంకగళ్ల కుమార్ ఆధ్వర్యంలో గురువారం కందుకూరులో ఉపాధిహామీ కూలీలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ పేరుతో ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి నూతనంగా వీబీ రామ్జీ 2025/197 చట్టాన్ని తేవడం అంటే రాబోయే రోజుల్లో చట్టాన్నే నిర్వీర్యం చేసే ప్రయత్నమేనన్నారు. ఎర్ర జెండా పోరాటంతో అప్పటి ప్రభుత్వం 2005లో వలసలు తగ్గించి పేదల కడుపు నింపాలనే లక్ష్యంతోనే తెచ్చిన ఉపాధిహామీ చట్టంలో పురుషులు, మహిళలు అనే తారతమ్యం లేకుండా సమాన పనికి సమాన వేతనం, వంద రోజుల పని దినాలు కల్పించేలా అమలైందన్నారు. ఈ చట్టానికి రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్ ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.90 వేల కోట్లకు పరిమితం చేశారన్నారు. సకాలంలో కూలీ డబ్బు అందించడంలో విఫలమవుతున్నారన్నారు. కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు మస్కు అరుణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల అంజయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రాంచందర్, సీఐటీయూ జిల్లా నాయకుడు బుడ్డీరపు శ్రీనివాస్, సీపీఎం మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్ పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
పాతాళానికి ఉల్లి ధరలు
పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళన మర్పల్లి: ఉల్లి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. పెట్టుబడి డబ్బు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మినుము, పెసర, సోయాబీన్ వంటి పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాల రైతులు సుమారు 600 ఎకరాల్లో యాసంగి పంటగా బావులు, బోర్ల కింద ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.60 నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టారు. 80 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. ఆశించిన మేర దిగుబడి వచ్చినా ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటాలు ఉల్లిపాయల బస్తా రూ.700 ఉందని తెలిపారు. నాట్లు, రవాణ, కూలీల ఖర్చులకే సరిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతుఽ ధర రూ.2 వేలు ప్రకటించాలని కోరారు. మండలంలోని పంచలింగాల ఒక్క గ్రామంలోనే 450 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేసినట్లు రైతు మొగులయ్య తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పలపాలవుతామని ఆవేదన వ్యక్తం చేశాడు. -
కేటీఆర్ను కలిసిన లైసెన్స్డ్ సర్వేయర్లు
అనంతగిరి: తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని లైసెన్స్డ్ సర్వేయర్లు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ను కోరారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి నగరంలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సర్వేయర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ధారూరు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్ ఆధ్వర్యంలో గురువారం స్పీకర్ ప్రసాద్కుమార్ సమక్షంలో ముగ్గురు సర్పంచులు హస్తం పార్టీలో చేరారు. ధారూరు ఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరిదాస్పల్లి సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, లక్ష్మినగర్తండా సర్పంచ్ కెతావత్ పూజ, అల్లాపూర్ సర్పంచ్ మంత్రి విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు తదితరులు పాల్గొన్నారు. తాండూరు: రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తాండూరు ఎమ్మెల్యే మనోమర్రెడ్డి పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఆమేర్ అబ్దుల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మత పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, డీసీసీబీ మాజా వైస్ చైర్మన్ రవిగౌడ్, నాయకులు సురేందర్రెడ్డి, నర్సిరెడ్డి, లొంక నర్సింహులు పాల్గొన్నారు. తాండూరు: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తాండూరు ఎకై ్సజ్ పోలీసులు గురువారం తెలిపారు. బస్వణ్ణ కట్ట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో బుధవారం తనిఖీలు చేయగా పాత తాండూరు ప్రాంతం అంబేడ్కర్ నగర్కు చెందిన సలీం పాషా, గాంధీ చౌక్ ప్రాంతం దోబీగల్లికి చెందిన నవీన్కుమార్ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ను సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపరాఉ. దాడుల్లో డీటీఎఫ్ ఎస్సై ప్రేమ్కుమార్రెడ్డి, సిబ్బంది హనుమంతు, రవికిరణ్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. -
అర్హులందరికీ సంక్షేమం
అనంతగిరి: ప్రజా సమస్యల పరిష్కారం.. సంక్షేమ పథకాల అమలే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలికార్ ఫంక్షన్ హాల్లో ప్రజా ప్రణాళికపై సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు శిక్షణ, సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకే సామాజిక అంశాలు, ప్రజా సేవపై ఎక్కువ అవగాహన ఉంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలనే ఉద్దేశంతోనే కొత్త సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు రెండు కళ్లు అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజారంజక పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, సహకారం అవసరమన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రజలకు అధికారులు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, జెడ్పీ సీఈవో సుధీర్, డీఆర్వో మంగీలాల్, ఆర్డీవో వాసుచంద్ర, డీపీవో జయసుధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్లు గడ్డం అనన్య, పట్లోళ్ల నీరజ, రజిత తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్రెపల్లిలో రూ.3.36 కోట్లతో ఎలక్ట్రికల్ స్టోర్స్కు, జైదుపల్లిలో రూ.2.98 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, కొత్రెపల్లి కౌన్సిలర్ స్రవంతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, వైస్ చైర్మన్ మల్లేశం, పార్టీ మండల అధ్యద్యక్షుడు రాజశేఖర్రెడ్డి, సర్పంచ్ మౌనిక, నాయకులు శివయ్య, కరుణాకర్రెడ్డి, తుల్జారాం, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ధారూరు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని నాగ్సాన్పల్లిలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని, ధారూరు ఆర్టీసీ బస్టాండు ఆవరణలో సీసీ రోడ్డును ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద సీసీ రోడ్డుకు, మురుగు కాల్వల నిర్వాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు రూ.600 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతన్నాయన్నారు. మండలంలోని రుద్రారం – నాగసమందర్ గ్రామాల మధ్య కొత్త వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, నాగ్సాన్పల్లి, ధారూరు సర్పంచులు రేఖ, ప్రమీలగౌడ్, తహసీల్దార్ సాజిదాబేగం, ఎంపీడీఓ నర్సింహులు, పీఆర్ డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దాం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొత్త సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం -
పాడైన మాంసం తింటే రోగాలు
కుళ్లిన, కల్తీ మాంసం తినడం ద్వారా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, అలర్జీ వంటి సమస్యలతో పాటు కాలేయం, మూత్ర పిండాల పని తీరు దెబ్బ తింటుంది. వధశాల నుంచే మాంసం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలి. వధశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంతో పాటు మాంసం పాడవకుండా ఎక్కువ సమయం నిల్వ ఉండేందుకు 0–4 సెల్సియస్ డిగ్రీల మధ్య నిల్వ చేసుకోవాలి. లేదంటే పాడవుతుంది. వధశాల నుంచి హోటళ్లకు పరిశుభ్రమైన వాహనాల్లోనే మాంసాన్ని తరలించాలి. – డాక్టర్ ఎంకే శ్రీకాంత్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, హైదర్గూడ -
పెచ్చులూడి.. ఇనుప చువ్వలు తేలి
బంట్వారం: మండల కేంద్రం కోట్పల్లిలో నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా మారింది. సుమారు 40 ఏళ్ల కిందట నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్.. ప్రస్తుతం వినియోగంలో ఉన్నప్పటికీ.. అధికంగా నీరు లీకవుతోంది. దీంతో పూర్తిగా నాచుపట్టింది. అక్కడక్కడా పెచ్చులు ఊడి, ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రధాన రహదారి పక్కన, ఇళ్ల మధ్య ఇంతటి ప్రమాదకర స్థితిలో ఉన్న ట్యాంకును ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కనుంచే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, పిల్లలు అక్కడే ఆడుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ప్రాణాపాయం తప్పదని వాపోతున్నారు. ఇదే విషయమై పలుమార్లు అధికారులకు విన్నవించామని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి, ట్యాంకును కూల్చివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్ -
డిప్యూటేషన్రద్దు చేయాలని వినతి
ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్పై వెళ్లిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని కౌన్సిలర్ ఆంజనేయులుయాదవ్ కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని విద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఈ మేరకు ఆయన వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్ను రద్దు చేసి పాఠశాలలోనే విధులు నిర్వహించేలా చూడాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు. 108 అంబులెన్స్లో ప్రసవం అబ్దుల్లాపూర్మెట్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ అంబులెన్స్లో ప్రసవించిన సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుంతపల్లి గ్రామానికి చెందిన లావణ్యకు పురిటి నొప్పుల రావడంతో 108 వాహనానికి కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 వాహన మెడికల్ టెక్నిషీయన్ దశరథ, పైలట్ చెరుకు శ్రీనివాస్ సాధారణ ప్రసవం చేశారు. ఫలితంగా లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో హయత్నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తల్లీశిశువును తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా లావణ్య కుంటుబీకులు అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలయజేశారు. బాధ్యతల స్వీకరణ శంకర్పల్లి: స్థానిక పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్గా గురువారం మీర్ ముదస్సర్ అలీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన వెయింటింగ్ లిస్ట్లో ఉండగా.. తాజాగా ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు శంకర్పల్లి ఠాణా ఇన్స్పెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇక్కడ పని చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ని కమిషనరేట్లోని సైబర్ క్రైమ్స్ విభాగానికి బదిలీ చేశారు. ఠాణాలో శాంతి భద్రతలను కాపాడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని, అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విసృత్తంగా అవగాహన కల్పించనున్నట్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ముదస్సర్ అలీ పేర్కొన్నారు. హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్టు మండలం మునుగనూరులోని సర్వే నంబర్ 83లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుండడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు గురువారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని అక్రమంగా దున్నుతూ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో బోర్డు తొలగించి ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసు కేసు కూడా నమోదైందని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదని, బోర్డును తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాద్నగర్: కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామ పరిధిలో ఉన్న జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ను కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని మంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సుమారు రూ.12 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, మరో రూ.8 కోట్లు మంజూరు చేయాలన్నారు. స్పందించిన మంత్రి దర్గాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టిందని, అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
● వెంటాడిన రోడ్డు ప్రమాద కేసు ● శ్రీశైలం హైవే పక్కన ఉరేసుకున్న వైనం ఇబ్రహీంపట్నం రూరల్: మద్యం మత్తులో ఇద్దరిని ఢీకొట్టడంతో మనోవేదన చెందిన ఓ వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శ్రీశైలం హైవేపై నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. యాచారం మండ లం మేడిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి బాల రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తుర్కయంజాల్లో నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు బాలకృష్ణ(28) ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి మద్యం తాగి కారులో తుర్కయంజాల్లోని బవర్చి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మనోజ్, మంజునాథ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులు ఆదిభట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు 9వ తేదీన బాలకృష్ణపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీస్స్టేషన్కు రావాలని తండ్రీకొడుకులను నోటీసు అందజేశారు. చనిపోతానని ఇంట్లో నుంచి వెళ్లి ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన తీవ్ర మనోవేదనకు బాలకృష్ణ లోనయ్యాడు. మధ్యాహ్నం తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే ఆయన భార్య స్పందించి 100 కాల్ చేసి చెప్పింది. ఆదిభట్ల పోలీసులు అప్రమత్తమై లోకేషన్ ఆమనగల్లులో గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు. అటవీ ప్రాంతం ఉండటంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మిస్సింగ్ కేసుగా సాయంత్రం నమోదు చేశారు. కుటుంబీకుల సపోర్ట్ లేక గురువారం ఉదయం శ్రీశైలం హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఉన్నాడని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు వెళ్లి పరిశీలించి బాలకృష్ణ(28)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు మద్యం మత్తులో ప్రమాదం కలిగించానని, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
తాండూరు: ఉపాధ్యాయుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారమయ్యేలా చూడాలని తపస్ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్రెడ్డిని కోరారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సీ బకాయిలు వెంటనే మంజూరయ్యేలా చూడాలని కోరారు. పెండింగ్ డీఏలు వచ్చేలా చొరవ చూపాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల పక్షాన తన వాణి వినిపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆనందం, నియోజవకర్గ కన్వీనర్ చంద్రశేఖర్, ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్కుమార్, రవికుమార్, వినోద్కుమార్, అనిల్, వీరేశం, లక్ష్మికాంత్రావు, కొత్త శ్రీనివాస్, శంకర్, ప్రభాకర్రావు, బాలకృష్ణ, పండరప్ప, ప్రమోద్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డినికోరిన తపస్ నాయకులు -
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
అనంతగిరి: మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. గురువారం పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలలో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. మహిళలు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నప్పుడే శక్తివంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి మహిళకు చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. వారి భద్రతకు ప్రభుత్వం, పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. ఈవ్ టీజింగ్, వేదింపుల నివారణపై షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని స్పష్టం చేశారు. అనంతరం వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ.. నేటి సమాజంలో చదువుతోనే ఏదైనా సాధించగలమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్ఓ స్వర్ణలత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మహిళా పీఎస్ ఇన్స్పెక్టర్ సరోజ, మహవీర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ భాస్కర్ రాజు, షీ టీమ్ సిబ్బంది, వైద్య విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ స్నేహ మెహ్ర -
పనుల్లో వేగం పెంచండి
● నాణ్యతలో రాజీ పడొద్దు ● 16 నెలల్లో ఎడ్యుకేషన్ హబ్ భవన నిర్మాణాలు పూర్తి కావాలి ● సీఎంఓ సెక్రటరీ మాణిక్కరాజ్ దుద్యాల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎంఓ సెక్రటరీ మాణిక్క రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 16 నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి కావాలని టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతి రెడ్డికి సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. భవనాలు అందుబాటులోకి రాగానే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ డీఈఈ విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈఈలు రాజయ్య, నాగేశ్వర్ రావు, ఏఈలు జనార్దన మూర్తి, విజయభాస్కర్ రెడ్డి, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ ముఖ్యం
కడ్తాల్: కళాశాలలు ప్రకృతి పరిరక్షణ కేంద్రాలుగా మారాలని వందేమాతరం ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్సెంటర్లో కాచిగూడ బంకట్లాల్ భద్రుక కాలేజీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన, అంకితభావం బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. అనంతరం సీజీఆర్ సంస్థ ప్రతినిధులు రజనీకాంత్, నాగేశ్లు విత్తనబంతుల తయారీ, మదర్ ట్రీ సంరక్షణ, నేచర్ వాక్, ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లలితాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ పాయే.. కట్టెలపొయ్యే
● వాణిజ్య సిలిండర్కు గండం ● హోటళ్లు, బేకరీలు, కర్రీ పాయింట్లు, హాస్టళ్లపై ప్రభావం ● ఆందోళనలో వ్యాపారులు, నిర్వాహకులు ● గృహ వినియోగదారులకూ తప్పని పాట్లు ● కట్టెల పొయ్యిలపై వంటకాలు ఇబ్రహీంపట్నం: గ్యాస్ సంక్షోభం ఇటు వ్యాపార, అటు గృహ వినియోగదారులను పట్టి పీడిస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తలెత్తిన సమస్య అన్నివర్గాల ప్రజలను, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. డివిజన్ పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, ఉన్నత విద్యాలయాలు, హాస్టల్స్ ఉన్నాయి. టీ, టిఫిన్ సెంటర్స్, హోటళ్లు, బేకరీలు, కర్రీ పాయింట్లు, పెద్ద సంఖ్యలో వెలిసాయి. వారం రోజులుగా గ్యాస్ కొరత నెలకొనడంతో వారి వ్యాపారం దెబ్బతింటోంది. కమర్షియల్ సిలిండర్లను నిలిపివేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. రోజుకు మూడు, నాలుగు సిలిండర్లు అవసరమయ్యే వ్యాపారులకు ఏం చేయాలో తోచడం లేదు. చేసేది లేక కట్టెల పొయ్యిలు పెట్టి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. హోటల్స్ను మూసివేస్తే భవనాల రెంట్, పనిచేసే సిబ్బంది జీతభత్యాలు భారంగా మారనున్నాయి. వివిధ హాస్టళ్లలో గ్యాస్ నిల్వలు నిండుకుంటుండడంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవకాశం ఉన్న వ్యాపారులు కట్టెల పొయ్యిలవైపు దృష్టి సారిస్తున్నారు. గ్యాస్ బుక్ కాక అగచాట్లు వంట గ్యాస్ కొరతతో సామాన్యులు సతమతమవుతున్నారు. రోజురోజుకూ సమస్య జఠిలంగా మారుతోంది. వారం రోజులుగా గృహ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నా డీలర్ పాయింట్ నుంచి రెస్పాన్స్ రావడం లేదు. -
లక్ష్యం.. ఆరోగ్యకరమైన సమాజం
దుద్యాల్: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్వేయంగా.. ప్రజా ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ మిషన్– 100 పేరిట వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు వైద్య సేవలు కొనసాగించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సేవలను వంద రోజుల్లో నాలుగు దశల్లో అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఈ నెల 31 వరకు.. మొదటి దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్, కంటి, ఎముకలు, దంతవైద్య నిపుణులు సేవలు అందించనున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో వృద్ధాప్య చికిత్స శిబిరాలు, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కంటి పరీక్షలు, పోషకాహరంపై అవగాహన, వ్యాధి నిరోధక టీకాల తనిఖీలు చేపడతారు. ఏప్రిల్ 1– 15.. ఈ దశలో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తారు. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయితే చికిత్సకు రెఫర్ చేస్తారు. ఏప్రిల్ 16– మే 15.. మూడో దశలో వేసవిలో వడదెబ్బ, అతిసారం వంటి సమస్యలపై దృష్టి సారిస్తారు. టీబీ(క్షయ) కేసులు గుర్తించడం, పోషకాహారం అందించడం, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడతారు. దీంతో పాటు అనుమానం ఉన్నవారికి డెంగీ, చికున్గున్యా, మలేరియా తదితర వ్యాధుల పరీక్షలు నిర్వహిస్తారు. రోగ నిర్ధారణ అయితే తగిన చికిత్స అందిస్తారు. మే 16– జూన్ 12.. చివరి దశలో పట్టణ, పల్లె, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి, తగిన వైద్య చికిత్స అందజేస్తారు. ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారు. అలాగే ఆర్బీఎస్కే వారితో కలిసి సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్థులకు రకరకాల వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందజేస్తారు. నాలుగు దశల్లో హెల్త్ మిషన్– 100 జూన్ 12 వరకు వైద్య సేవలు పీహెచ్సీ, కేజీబీవీ, వసతిగృహాల్లో శిబిరాల ఏర్పాటు విద్యార్థులకు సైతం వైద్య పరీక్షలు అన్ని రకాల వైద్య సేవలు హెల్త్ మిషన్ కోసం సిబ్బందికి అవగాహన కల్పించాం. ఎప్పుడు ఏ వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారో ఆశల ద్వారా తెలియజేస్తాం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందజేస్తాం. – డాక్టర్ రవీందర్ యాదవ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, వికారాబాద్ -
ముప్పు పక్కా!
పుట్టిన రోజు వేడుకలు.. పెళ్లిళ్లు.. దశదినకర్మలు.. సభలు.. సమావేశాలు..పండుగలు.. ఇలా ఒక్క‘ముక్క’లో చెప్పాలంటే వేడుక ఏదైనా మాంసం వంటకాలు తప్పని సరైంది. ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి వచ్చింది. మాంస ప్రియుల్లో ఉన్న ఈ బలహీనతను కొంతమంది వ్యాపారులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. కుళ్లిన మాంసానికి ఆయిల్, మసాలాలు దట్టించి హోటళ్లు,శుభ కార్యాలయాలకు సరఫరా చేస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. – సాక్షి, రంగారెడ్డిజిల్లా తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో వయసు పైబడి చావుకు దగ్గరగా ఉన్న, వ్యాధులు సోకిన జీవాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. తాజాగా మంగళ్హాట్ పరిధిలోని చిస్తీచమాన్దర్గా సమీపంలోని ఓ వ్యక్తి నుంచి 300 కిలోల కుళ్లిన మాంసాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ జిల్లాల్లో అధికారికంగా 7 వేలకుపైగా మాంసం విక్రయ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా 30 వేల వరకు ఉన్నట్లు అంచనా. గత ఏడాది ఫుడ్సేఫ్టీ అధికారులు తనీఖీలు నిర్వహించగా 5,730 విక్రయ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. మెజార్టీ కేంద్రాల్లో శుభ్రత లోపం, స్టాంపు లేని గొర్రెలు, మేకలు కోసి అమ్ముతుండటాన్ని గుర్తించారు. ఈరోజు కాదంటే.. మరుసటి రోజు నిజానికి ఏదైనా మేక, గొర్రె, కోడి కోసే ముందు పశువైద్యుడు క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. కానీ 99 శాతం మాంసం వ్యాపారుల వద్ద ఇవేవీ ఉండటం లేదు. గొర్రెలు, మేకల మాంసంలో పశువుల మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి గొర్రెను కోసిన తర్వాత సాధారణ వాతావరణంలో నిల్వ ఉంచితే త్వరగా పాడవుతుంది. మెజార్టీ మాంసం విక్రయ దుఖాణాల్లో రోజంతా రోడ్డు పక్కన ఓ తాడుకు వేలాడదీసి ఉంచుతున్నారు. ఈ రోజు కోసింది అమ్ముడు పోకపోతే.. దాన్ని మరుసటి రోజు అమ్ముతున్నారు. అప్పటికే అందులో అనేక రకాల బ్యాక్టీరియా చేరుతోంది. కుళ్లిన మాంసంతో కలర్ఫుల్ బిర్యానీ, ఫ్రై వంటకాలు తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలియక చాలామంది మాంసం ప్రియులు ఆరగించేస్తున్నారు చివరకు అనారోగ్యానికి గురవుతున్నారు. తాము కొన్న మాంసంపై ఏదైనా అనుమానం ఉంటే పరీక్ష కోసం చంగిచర్లలోని జాతీయ మాంసం పరిశోధన మండలి (ఎన్ఆర్సీఎం)ని సంప్రదించొచ్చు. యథేచ్ఛగా నాసిరకం, కుళ్లిన మాంసం విక్రయాలు తాజాగా మంగళ్హాట్లో300 కిలోల పట్టివేత వ్యాధులు సోకిన జీవాలను కోసి అమ్ముతున్న వైనం రోగాలు తప్పవంటున్న వైద్య నిపుణులుతలసరి మాంసం వినియోగం ఇలా గొర్రె మాంసం 4.02 కేజీలు మేక మాంసం 0.950 కేజీలు చికెన్ 3.5 కేజీలు ఇతర జంతువుల మాంసం 0.73 కేజీలు మొత్తం 9.2 కేజీలు -
కుప్పగిరిలో పోలీస్ పికెటింగ్
దౌల్తాబాద్: మండల పరిధి కుప్పగిరిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటీవల గ్రామంలో ఓ ఇంటి స్థలం విషయమై ఇరువర్గాల మధ్య పలుమార్లు తగాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఓ వర్గానికి చెందిన మహిళ.. గ్రామంలో ప్రదర్శిస్తున్న వీధి నాటకం చూసి వస్తానని మంగళవారం రాత్రి వెళ్లి.. విగతజీవిగా మారింది. విషయం బుధవారం ఉదయం వెలుగు చూడగా.. ఆమెను చంపి దూలానికి వేలాడదీశారని మృతురాలి భర్త మరో వర్గం వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా గురువారం పికెటింగ్ నిర్వహించారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాండూరు టౌన్: తాళం వేసిన ఇంట్లో చోరి జరిగింది. ఈ సంఘటన పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సాయిపూర్నకు చెందిన అంజిలయ్య వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలి సి వివాహ నిమిత్తం ఊరికి వెళ్లారు. బుధవారం వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి, బీరువా తెరిచి ఉన్నట్లు గమనించారు. పరిశీలించగా.. 8 గ్రాముల బంగారం, 5 తులాల వెండితో పాటు రూ. 50 వేలను దుండగులు అపహరించినట్లు గుర్తించారు. అనంతరం బాధిత కుటుంబం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘనంగా ఎంపీ కొండా జన్మదిన వేడుకలు దోమ: చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశ్, పాలేపల్లి గ్రామ బూత్ అధ్యక్షుడు నర్సింహులు ముదిరాజ్, కార్యకర్తలు వెంకట్రెడ్డి, కృష్ణ, శివ, రఘుపతి, రాఖీలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మండలంలో 71 పాఠశాలలు ఉండగా.. అందులో ఓ విద్యార్థికి రూ.2,500ల చెక్కును అందజేశారు. విద్యార్థుల ఉన్నతికి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎంతగానో తోడ్పాటునందిస్తున్నారని తెలిపారు. ఘనంగా స్వయం పరిపాలన బొంరాస్పేట: మండల కేంద్రంలోని రేయిన్బో పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్గా మాధురి, డీఈఓగా తరణుమ్, ఎంఈఓగా అభినయ, హెచ్ఎంగా హర్షిత, డాక్టర్గా అనిత, పొలిటికల్ లీడర్లుగా లోకేశ్, నాగనక్షిత్ తోపాటు 43 మంది ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. ఇందులో కరస్పాండెంట్ రాఘవేంద్రయాదవ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం హైమద్, అన్వర్, జనార్దన్, కవిత, స్వరూప, తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి ఎంతో కీలకం పూడూరు: విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకమని కడుమూరు సర్పంచ్ శివశంకర్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యసనాలకు, ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. సమయం తక్కువ ఉన్నందున పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం మర్రి అనిల్, చిన్న బందయ్య విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజు, ఉపాధ్యాయులు నవీన్, రాంచంద్రయ్య, సువానయ్య, షఫీ, స్వాతి, జ్ఞానేశ్వరి, రాంప్రసాద్, స్థానికులు సయ్యద్ గౌడ్, వెంకటస్వామి గౌడ్, రాజు, లింగం తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రతపై దృష్టి సారించాలి మర్పల్లి: వ్యక్తి గత పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచలింగాల సర్పంచ్ మహేందర్ అన్నారు. బుధవారం గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరాదన్నారు. పంచాయతీ ట్రాక్టర్లోనే వేయాలని సూచించారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు వేయరాదన్నారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను ఎంఈఓ అశోక్తో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం వేదవ్రత్, హెచ్ఎం కేశవులు, ఏఏపీసీ చైర్మన్ జగదాంబ, మహిళా ఉపాధ్యాయులు నవీన, బాలమణి, దివ్వ వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
మోటార్ వాహనాల దొంగ అరెస్ట్
● ఎనిమిది కేసుల్లో ప్రమేయం ● నిందితుడికి సహకరించిన బాలుడిని జువైనల్ హోంకు తరలించిన పోలీసులు పహాడీషరీఫ్: మోటార్ వాహనాలతో పాటు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుంచి మూడు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పహాడీషరీఫ్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ బి.ఎల్.ఎన్.రెడ్డితో కలిసి శంషాబాద్ ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్ కేసు వివరాలు వెల్లడించారు. కొందుర్గుకు చెందిన సల్లంగుల శ్రీకాంత్(23) బతుకుదెరువు నిమిత్తం వలస వచ్చి మైలార్దేవ్పల్లి పరిధిలోని లక్ష్మీగూడలో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టాడు. బహిరంగ పార్కింగ్ ప్రదేశాలు, ఇళ్ల ఎదుట పార్కు చేసి ఉన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను చోరీ చేసి అద్దెకివ్వడం లేదంటే విక్రయించడం చేసేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన పహాడీషరీఫ్ రంగనాయకుల కాలనీలో దాసరి శరత్బాబు అనే వ్యక్తి ఇంటి ఎదుట పార్కు చేసిన ఆటో(ఏపి 24డబ్ల్యూ 9588) చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టగా అటుగా వచ్చిన శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాల చిట్టా విప్పాడు. ఈ ఆటో దొంగతనం కేసులో తనకు తోడుగా డబ్బు ఆశజూపి బాలుడి సాయం తీసుకోవడంతో, బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. ఇళ్ల ఎదుట పార్కు చేసే ఆటోలకు తాళాలు పకడ్బందీగా వేసుకోవడంతో పాటు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఏసీపీ వాహనదారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది కేసుల్లో ప్రమేయం. నిందితుడు ఇప్పటి వరకు పహాడీషరీఫ్లో రెండు ఆటోలు, ఒక పల్సర్ బైక్, కర్నూల్ టూ టౌన్ పీఎస్ పరిధిలో ప్యాసింజర్ ఆటో, మహబూబ్నగర్లో పల్సర్ బైక్, యాక్టివా, మైలార్దేవ్పల్లిలో ఒక బైక్ను దొంగతనం చేశాడు. ఎనిమిది కేసులకు గాను పోలీసులు ఐదు కేసులకు సంబంధించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2025 డిసెంబర్లో జల్పల్లి శ్రీరామ కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ చోరీ చేసి రూ.70 వేల నగదును దోచేశాడు. ఆలయాల్లో ఇలాంటి నేరాలు చేసే వారితో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుందని ఏసీపీ పేర్కొన్నారు. -
పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి
ఎంపీడీఓ గ్యామా, సర్పంచ్ శివకుమార్రెడ్డి దోమ: కస్తుర్బాగాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎంపీడీఓ గ్యామా, సర్పంచ్ మాలి శివకుమార్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పాఠశాలలో ఎంఈఓ వెంకట్తో కలసి ఆర్వో ప్లాంట్ను వారు ప్రారంభించారు. తొలుత పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మధ్నాహ్న భోజనం వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించాలనిఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించేందుకు ఎస్ఓ శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపరాదని, పాఠశాలలో ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తేవాలని సూచించారు. పాఠశాల ఎస్ఓ శైలజ, ఆర్ఐ రాంచంద్రారావు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ సదస్సుకు సర్పంచ్ సౌభాగ్యలక్ష్మి
కొడంగల్ రూరల్: కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న సశక్త్ పంచాయత్ – నేత్రి అభియాన్ జాతీయ మహిళా సదస్సుకు మండలంలోని అంగడిరాయిచూర్ సర్పంచ్ సౌభాగ్యలక్ష్మి వెళ్లారు. బుధవారం న్యూఢిల్లీ జనపథ్ రోడ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పంచాయతీ మహిళా ప్రతినిధులకు నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. మహిళా సర్పంచ్లు పాలనలో చురుగ్గా పాల్గొంటూ గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసినట్లు సౌభాగ్యలక్ష్మి తెలిపారు. రాష్ట్రం నుంచి 17 మంది సర్పంచులు, 5గురు అధికారులు హాజరయ్యాని ఎంపీడీఓ ఉషశ్రీ తెలిపారు. కొడంగల్ మండలం అంగడిరాయిచూర్ గ్రామ సర్పంచ్ సౌభాగ్యలక్ష్మి, నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ సర్పంచ్ సి.రజిత హాజరయ్యారని పేర్కొన్నారు. -
దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో విఫలం
పరిగి: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ ఆరోపించారు. బుధవారం పరిగి బస్టాండ్లో దివ్యాంగులతో కలసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే.. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆర్టీసీలో వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి.. వాటిని నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.4 వేల పింఛన్ను రూ.6 వేలకు పెంచుతామని చెప్పి, విస్మరించారన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్మామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పసుల చంద్రయ్య, విద్యార్థి విభాగం నాయకుడు కడియం నరేశ్ పాల్గొన్నారు. -
కొత్త పింఛన్లు మంజూరు చేయాలి
ధారూరు: అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి అనసూయ డిమాండ్ చేశారు. మండల పరిధి మోమిన్కలాన్ గ్రామంలో బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పింఛన్లు రాక వృద్ధులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇచ్చిన మాటా ప్రకారం ప్రభుత్వం వారికి ఆసరా ఇచ్చి, ఆదుకోవాలని కోరారు. రోజురోజుకూ మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. అనంతరం మోమిన్కలాన్ గ్రామ ఐద్వా మహిళా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షురాలిగా సంతోష, ఉపాధ్యక్షురాలిగా వెంకటమ్మ, ప్రధాన కార్యదర్శిగా సుగుణమ్మ, సహాయ కార్యదర్శులుగా కాశమ్మ, యాదమ్మ, అమృతమ్మ, రాములమ్మ, మణెమ్మలను ఎన్నుకున్నారు. -
సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
అనంతగిరి: లైసెన్స్ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్లో పలువురు సర్వేయర్లు ఆయనను వికారాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడారు. సర్వేయర్లకు ఇచ్చిన హామీ ప్రకారం బాధ్యతలు అప్పగించి, వేతనాలు చెల్లించాలన్నారు. హామీ ఇచ్చి 8 నెలలు గడిచినా.. కాలయాపన చేయడం ఏంటని ప్రశ్నించారు. సుమారు పదివేల మంది లైసెన్స్ సర్వేయర్లను ప్రభుత్వం అయోమయంలో పెట్టి, రోడ్డున నిలబెట్టిందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమయిందని, దీంతో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం బయట పడిందన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 97 మంది సర్వేయర్లు ఉన్నారని, ఈ విషయంలో స్పీకర్ స్పందించి వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సర్వేయర్ల మండల అధ్యక్షుడు శ్యాం, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ -
సెమిస్టర్ ఫలితాల్లో ‘సింధు’ ప్రభంజనం
తాండూరు టౌన్: డిగ్రీ ఫస్టియర్ సెమిస్టర్ ఫలితాల్లో పట్టణంలోని సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బీఎస్సీ(బీజెడ్సీ) మొదటి సంవత్సరంలో సమ్రా ఫిర్దౌస్ 9.68 జీపీఏ, నుష్రా తరన్నుమ్ 9.52 జీపీఏ, జె.అక్షిత 9.36 జీపీఏ సాధించారు. బీఎస్సీ (ఎంపీసీ)ఫస్టియర్లో ఎం.స్వప్న 9.48 జీపీఏ, సాయికీర్తి 9.28 జీపీఏ సాధించారు. బీకాం ఫస్టియర్లో అలియా ఖాతూన్ 9.28 జీపీఏ, బీబీఏలో ఆయేషా నహీన్ 9.2 జీపీఏ, బీఏలో మదిహా ఫాతిమా 9.2 జీపీఏ సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కళాశాల వ్యవస్థాపకులు, యాజమాన్య సభ్యులు వి.రంగారావు, ప్రిన్సిపాల్ విజయాదేవి, వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి, అధ్యాపకులు, సహచర విద్యార్థులు వారిని అభినందించారు. -
కంప్యూటర్ విద్యతో విశ్వజ్ఞానం
● సాంకేతిక తరగతులనుసద్వినియోగం చేసుకోవాలి ● కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి బొంరాస్పేట: కంప్యూటర్ విద్యతో విశ్వజ్ఞానం పెంపొందుతుందని, ఈ సాంకేతిక విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధి రేగడిమైలారం ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ తరగతి ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్, సీహెచ్ఎం రవీందర్గౌడ్, హెచ్ఎం మల్లేశ్, ఉపాధ్యాయులున్నారు. వినతులు పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను తొలగించి, ఉపయోగకరంగా మార్చాలని కడా అధికారికి స్థానికులు విన్నవించారు. గ్రామంలోని జాతీయరహదారిపై వెళ్లే ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులకు ఫీడర్ఛానళ్లు ఏర్పాటు, పూడికతీత పనులు చేపట్టాలని పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు. దీంతో కడా అధికారి మాట్లాడుతూ.. కొత్తూరు, రేగడిమైలారం చెరువుల తూముల మరమ్మతు తదితర పనులకు రూ.18 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం కుబ్యానాయక్తండా, నాందార్పూర్, బొంరాస్పేట, తుంకిమెట్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు. 99రోజుల ప్రగతి ప్రణాళిక పనులపై ఆరా తీశారు. వీరి వెంట జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహులు గౌడ్,వెంకట్రాములు గౌడ్, జయకృష్ణ, మల్లేశ్, రాంచంద్రారెడ్డి, మల్లికార్జున్, చంద్రప్ప, గుండప్ప, వెంకట్రెడ్డి, వీరప్ప తదితరులు ఉన్నారు. -
అతివలు అన్ని రంగాల్లో రాణించాలి
● మున్సిపల్ చైర్పర్సన్ అనన్య ● ఘనంగా మహిళా దినోత్సవం అనంతగిరి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం సత్యభారతి గార్డెన్స్లో అనన్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, కమిషనర్ విక్రం సింహారెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతో అధిక దిగుబడులు
కొడంగల్ రూరల్: వవ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి టీ రాజరత్నం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టీ రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పర్సాపూర్ రైతు వేదికలో డివిజన్ ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో బీఎఫ్ఏసీ, ఆర్పీఎల్ నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు సలహాలు అందించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు, యాంత్రీకరణలో నవీన మార్పులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నానో యూరియా, డీఏపీ వినియోగంపై సలహాలు ఇచ్చారు. వరి పంటలో కొత్త వంగడాలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు, ప్రకృతి వ్యవసాయం, నూనె గింజల పంటల సాగు గురించి తెలియజేశారు. వ్యవసాయ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. డ్రోన్ పనితీరును డెమో ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ కె.శంకర్ రాథోడ్, మండల వ్యవసాయాధికారులు ఎన్.శ్రీలత, ఎన్.పొలప్ప, ఆత్మ స్టాఫ్ బీటీఎం కె.బాలకృష్ణ, ఏటీఎం ఎ.వినోద్, నానో యూరియా, డీఏపీ, కోరమండల్, స్పిక్ ప్రతినిధులు ప్రసాద్, శ్రీకాంత్, చంద్రం, హుస్సేన్, డ్రోన్ ప్రతినిధులు హేమంత్రాజు, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి -
అప్రమత్తంగా ఉండండి
● ఎమర్జెన్సీ అంబులెన్స్ల ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్ ● 108, 102 వాహనాలను తనిఖీ చేసిన జిల్లా అధికారులు కొడంగల్ రూరల్: ప్రమాద సమాచారం అందగానే తక్షణం స్పందించాలని ఎమర్జెన్సీ అంబులెన్స్ల ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. బుధవారం ఈఎంఈలు అబ్దుల్రహీం, శ్రీనివాస్, శ్రీహరితో కలిసి పట్టణంలో 102, 108 వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 108, 102 సేవలను ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రజలకు నిరంతర సేవలు అందించడంలో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. 108 వాహనాల్లో పనిముట్లు, మందులు, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది ఆంజనేయులు, వినయ్, వేణుగోపాల్, విజయకుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
వంటింట వార్ మంట!
హత్యచేసి.. వీధి నాటకం చూసి వస్తానని వెళ్లిన ఓ మహిళ.. పక్కింట్లో దూలానికి వేళాడుతూ విగతజీవిగా కనిపించింది. ఇరాన్ యుద్ధం వేళ గ్యాస్ ధరలకు రెక్కలు వినియోగదారులపై పెను భారం ఒక్కో సిలిండర్పై రూ.60 అదనం జిల్లాలో మొత్తం కనెక్షన్లు 2,08,553 మహాలక్ష్మి పథకం వర్తించేవి 1,16,990 ప్రతి నెలా ప్రభుత్వంపై రూ.58.49 లక్షల భారం ప్రజలపై రూ.45.78 లక్షలు -
పది హాల్ టికెట్లపై క్యూఆర్
దుద్యాల్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్యాశాఖ సమూల మార్పులు చేస్తోంది. ఎగ్జామ్స్ సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడరాదని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు అన్ని స్కూళ్లకు చేరినట్లు జిల్లా విద్యాశాఖ తెలిపింది. గతంలో మాదిరి కాకుండా ఈ సారి పోస్టల్ శాఖ ద్వారా పాఽఠశాలలకు హాల్ టికెట్లు పంపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జెడ్పీహెచ్ఎస్లు 272 ఉండగా 13,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. క్యూఆర్ కోడ్ ఈ సారి ప్రయోగాత్మకంగా పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. ఫోన్ ద్వారా ఈ కోడ్ను స్కాన్ చేస్తే విద్యార్థి పూర్తి వివరాలతోపాటు పరీక్ష కేంద్రం లైవ్ లోకేషన్ కూడా సూచిస్తుంది. అలాగే విద్యార్థుల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ను కూడా హాల్ టికెట్పై ముద్రించినట్లు అధికారులు తెలిపారు. తల్లిదండ్రుల ఫోన్లకు.. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందు కోసం వాట్సాప్ నంబర్ 80969 68096కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే వెల్కమ్ టు మీ సేవ అని సమాధానం వస్తుంది. ఆ తర్వాత ఎస్సెస్సీ హాల్ టికెట్ మార్చి – 2026 అని మెసేజ్ పంపితే.. ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరు టైప్ చేసి పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తొలిసారిప్రయోగాత్మకంగా అమలు స్కాన్ చేస్తే విద్యార్థి పూర్తి సమాచారం తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూపునకు కూడా.. జిల్లా వ్యాప్తంగా టెన్త్ విద్యార్థులు 13,579 మంది 14నుంచి వార్షిక పరీక్షలు -
నేడు శిక్షణ కార్యక్రమం
అనంతగిరి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై గురువారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్లోని గౌలికార్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దుద్యాల్: మండలంలోని సంట్రకుంట తండాలో తుల్జాభవాని పండుగను బుధవారం రాత్రి ఘనంగా జరుపుకొన్నారు. ఇళ్ల ముందు ధాన్యం బస్తాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సంట్రకుంట తండా, ఈర్లపల్లి గ్రామాల సర్పంచులు మాణిక్య నాయక్, మొగులప్ప పాల్గొన్నారు. -
మామిడిలో సస్యరక్షణ చర్యలు అవసరం
దుద్యాల్: మామిడి పంట సాగు చేస్తున్న రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యాన వన జిల్లా అధికారి ఎంఏ సత్తార్ సూచించారు. బుధవారం మండలంలోని హస్నాబాద్ రైతు వేదికలో మామిడి సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పంట పిందె దశకు చేరుకుందని సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. పిందె, కాయ దశలో మొక్కలకు అందించాల్సిన సూక్ష్మ ఎరువుల గురించి తెలియజేశారు. కూరగాయల సాగు విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రఽంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి, మెట్లకుంట పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, కొడంగల్ డివిజన్ ఉద్యానవన అధికారి సురేంద్రనాథ్, హెచ్ఈవో బాబ్యా నాయక్, ఏఈవో రేణుక తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన వన జిల్లా అధికారి సత్తార్ -
ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం
తాండూరు టౌన్: తాండూరు పట్టణం ఇందిరానగర్లోని రామమందిర పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి బుధవారం రూ.లక్ష విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం, 27న శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరుకావాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. ధారూరు: మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాన్సింగ్ తెలిపారు. నాగ్సాన్పల్లిలో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని, ధారూరు బస్టాండు వద్ద సీసీ రోడ్డును ప్రారంభిస్తారని తెలిపారు. ధారూరు రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. తాండూరు టౌన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తాండూరులో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. పట్టణంలోని అయ్యప్ప నగర్ అయ్యప్ప దేవాలయం వద్ద ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ఉంటుందని ఉత్సవ సమితి, అయ్యప్ప బస్తీ అధ్యక్షుడు భాస్కర్ హక్కే బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేసరవల్లి శ్రీ భువనేశ్వర పీఠాధిపతి కమలానంద భారతి స్వామి, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి అన్నదానం సుబ్రహ్మణ్యం పాల్గొంటారన్నారు. కావున హిందూ బంధువులందరూ తప్పకుండా హాజరుకావాలని వారు కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు కుల్కచర్ల: ధరణి తప్పిదాలను సరిచేయాలని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు కోరారు. బుధవారం ముజాహిద్పూర్కు చెందిన పలువురు రైతులతో కలిసి అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళిత సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రైతుల ఇనాం భూములను ధరణిలో మార్పులు చేర్పులు చేస్తున్న క్రమంలో ఆర్ఎస్ఆర్ (భూమి ఎక్కువగా చూపించడం)గా చేయడంతో అట్టి భూమిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి రెవెన్యూ సిబ్బందితో సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముజాహిద్పూర్ సర్పంచ్, నాయకులు, రైతులు చంద్రభూపాల్ రావు, భాస్కర్, యాదయ్య, శివ, అంబాదాస్ తదితరులు పాల్గొన్నారు. మర్పల్లి: మండలంలోని సిరిపురం సంగమేశ్వర(మార్కండేయ) స్వామి ఆలయ భూములకు ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు కౌలు వేలం నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా మండల ఇన్చార్జ్(కార్యనిర్వాహక) అధికారి శాంతికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సర్వే నంబర్లలోని 17 నుంచి 29 ఎకరాల భూమిని రెండేళ్ల పాటు (2026 నుంచి 28) కౌలుకు ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాట దక్కించుకున్న రైతుల ఆధీనంలో 1 – 4 –2026 నుంచి 31 –03 –28 వరకు భూములు ఉంటాయన్నారు. రూ.5 వేలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. కౌలు దక్కని వారికి డిపాజిట్ తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు వేలంలో పాల్గొనాలని కోరారు. -
అంకితభావంతో పని చేయండి
తాండూరు టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఐసీయూ, డయాలసిస్ సెంటర్, జనరల్ వార్డులు, ల్యాబొరేటరీ, మహిళా వార్డును పరిశీలించారు. వైద్య సేవలు, భోజన వసతి, మౌలిక సదుపాయాలపై రోగులను, వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్ సదుపాయం, సిటి స్కాన్ తదితరాల అందుబాటుపై డీసీహెచ్ డాక్టర్ ఆనంద్, సూపరింటెండెంట్ డాక్టర్ మూర్తి, డాక్టర్ వినయ్ కుమార్ను అడిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు విధుల పట్ల అంకితభావంతో ఉండాలన్నారు. అత్యవసర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య పరిరక్షణపై సిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు. భవన మరమ్మతులను త్వరలోనే పూర్తి చేయిస్తానన్నారు. మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సంక్షేమానికే ప్రత్యేక కార్యక్రమం తాండూరు రూరల్: సమస్యలు లేని గ్రామాలే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లక్ష్యమని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం తాండూరు మండలం గౌతాపూర్, చెంగోల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. గౌతాపూర్ జీపీలో సర్పంచ్ సుజన ఆధ్వర్యంలో స్థానికులతో సమావేశం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత ఉండరాదని తహసీల్దార్లు, ఎంపీడీఓలకు సూచించారు. ఆన్లైన్ విధానంలో ఇసుక పర్మిషన్లు ఇస్తామన్నారు. ఒకవేళ ఆన్లైన్లో సమస్య ఎదురైతే తహసీల్దార్ కార్యాలయం నుంచి మ్యాన్వల్ పద్ధతిలో పర్మిషన్లు పొందవచ్చని తెలిపారు. ఇసుక అక్రమ రవాణను సహించేది లేదన్నారు. టీచర్గా మారి.. గౌతాపూర్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు రావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చెంగోల్ గ్రామంలో పర్యటించారు. రైతుబంధు నిధులు విడుదల చేయాలని పలువురు కోరారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సమ్మ, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంఈఓ వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగప్ప, పంచాయతీ కార్యదర్శులు ఫక్రోజీ, అశోక్, రాములు తదితరులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలి అత్యవసర విభాగ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ దీపక్ తివారి -
ప్రజా సమస్యలపై సభ్యుల గళం
తాండూరు: తాండూరు తొలి మున్సిపల్ సమావేశం వాడీవేడిగా సాగింది. సోమవారం చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 11 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపట్టారు. పలు అంశాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దీపనర్సింహులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు అంశాలపై చైర్పర్సన్కు నోటీసు ఇచ్చారు. మరో రెండు అంశాలను టెబుల్ ఎజెండాలో చేర్చగా సభ్యులు ఆమోదం తెలిపారు. పట్టణ సుందరీకరణ, పెయింటింగ్ పనుల కోసం రూ.8.70 లక్షలు కేటాయించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.55 లక్షలు, జేసీబీ మరమ్మతులకు రూ.4.86 లక్షలు, వీధి దీపాల నిర్వహణకు రూ.3 లక్షల కేటాయింపునకు ఆమోదించారు. చెత్త సేకరణ వాహనాలకు మరమ్మతులు చేయించాలని సభ్యులు కోరారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సూచనలతో అన్ని పార్టీల సభ్యులకు జీరో అవర్లో మాట్లాడే అవకాశం కల్పించారు. పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, మురుగు కాలువలు, ప్రభుత్వ భవనాల నిర్వహణ, ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతంపై కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చారు. మోడల్ మున్సిపాలిటీగా మార్చుకుందాం తాండూరును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఆ తర్వాత పట్టణ అభివృద్ధే ధ్యేయంగా సభ్యులు సమన్వయ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్రెడ్డి, కౌన్సిలర్లు శ్రీకాంత్, షేక్ ఇర్షాద్, వెంకట్, సుప్రిత, నవీన, అనిల్, సురేష్నాయక్, జావీద్, రూప తదితరులు పాల్గొన్నారు. తాండూరు తొలి మున్సిపల్ సమావేశంలో ప్రశ్నల వర్షం ప్రధానంగా పారిశుద్ధ్య సమస్యలపైనే.. 13 అంశాలకు సభ్యుల ఆమోదం -
హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి
● ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ● కేజీబీవీలో ఉపాధ్యాయుల నిరసన దోమ: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధి కస్తుర్బాగాంధీ పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరంగల్ సభలో ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని ఆరోపించారు. ఉద్యోగులందరికీ ప్రభుత్వం కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. సమ్మె కాలపు వేతనాలను విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఈ నెల 20న అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ శైలజ, సీఆర్పీలు రెడ్యానాయక్, రఘుసింగ్, వెంకటేశ్, కంప్యూటర్ ఆపరేటర్ నజీర్, పీటీఏలు యాదగిరి, జంగయ్య, సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు. -
‘ప్రజాపాలన’ను సక్సెస్ చేద్దాం
జిల్లా నోడల్ ఆఫీసర్ విశాల్ రాజ్ అనంతగిరి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ శాఖ అసిస్టెంట్ డైరక్టర్, జిల్లా నోడల్ ఆఫీసర్ విశాల్ రాజ్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ – వెస్ట్ సేకరణను పరిశీలించారు. అక్కడి నుంచి రాజీవ్ గృహకల్పకు చేరుకొని మహిళా సంఘం సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అక్కడి నుంచి డంప్ యార్డు, కుక్కల జనన నియంత్రణ కేంద్రం, నగర వాటిక, శివసాగర్ చెరువును పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, డీఈ రాకేష్రెడ్డి, మెప్మా ఇన్చార్జ్ వెంకటేశ్, శానిటరీ ఇన్చార్జ్ ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణకు చర్యలు
బంట్వారం: నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ రాములు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆయన మాలసోమారంలో నర్సరీని పరిశీలించి, శుభ్రం చేయించారు. సిబ్బందికి సూచనలు చేశారు. వేసవి దృష్ట్యా ఎప్పటికప్పుడు నీరు పట్టాలన్నారు. వానాకాలంలో చేపట్టే వన మహోత్సవం నాటికి మొక్కలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. సంరక్షించాలి కుల్కచర్ల: మొక్కలను సంరక్షించాలని రాంరెడ్డిపల్లి సర్పంచ్ నర్సింహలు యాదవ్ అన్నారు. సోమ వారం గ్రామంలోని నర్సరీ పరిశీలించారు. అక్కడి సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు చేశారు. నీరు పట్టించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాల వద్ద మొక్కలను నాటాలని సూచించారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
యాలాల: నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలకు నీటిని పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధి రాస్నం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ– 2 విఠల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మక్త శశికళ(34), తల్లి అంజిలమ్మకు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయింది. స్లాబ్ లెవెల్ వరకు పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో గోడలకు చేసిన ప్లాస్టరింగ్ పనులకు రోజు నీటిని పడుతున్నారు. నీటిని పట్టేందుకు ఒక డ్రమ్ములో నీటిని నింపి, సింగిల్ ఫేజ్ మోటారును డ్రమ్ముపై బిగించి గోడలకు నీళ్లు చల్లుతుంటారు. రోజులాగే ఆమె ఆదివారం సాయంత్రం నీటిని పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శవానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలికి భర్త మంజునాథ్, కొడుకు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రభుత్వ భూములను రక్షిస్తున్నాం
మొయినాబాద్లోని విలువైన ప్రభుత్వ భూములను రక్షిస్తున్నాం. ఖాళీగా ఉన్న సర్కారీ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేయించాం. కొన్ని భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. వాటికి కౌంటర్లు వేస్తున్నాం. హిమాయత్నగర్ 151 సర్వేనంబర్లో విద్యాసంస్థ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఖాళీ చేయాలని చెప్పాం. విద్యా సంసవత్సరం పూర్తయ్యేవరకు సమయమిచ్చాం. సదరు విద్యాసంస్థవారు కోర్టుకు వెల్లడంతో కౌంటర్ వేశాం. కోర్టు ఆదేశాలు ఇస్తే కూల్చివేస్తాం. – గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్ -
రూ.12 వేల కోట్లతో రహదారుల నిర్మాణం
బషీరాబాద్: రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల బడ్జెట్తో 7వేల కిలోమీటర్ల మేర చేపట్టిన రాష్ట్ర రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ మోహన్నాయక్ తెలిపారు. తెలంగాణలోని 180 జిల్లా రోడ్లను రాష్ట్ర రహదారులుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, బషీరాబాద్ ప్రాంతాల్లో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న రహదారులను సోమవారం పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా బషీరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ జెడ్పీ రోడ్లను 3.5 మీటర్ల నుంచి 7 మీటర్లకు, మండల రోడ్లను 7నుంచి 10 మీటర్లకు, పట్టణాల్లో రహదారులను 10 నుంచి 14 మీటర్ల వెడల్పుతో విస్తరిస్తున్నామని తెలిపారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలోని రోడ్లన్నీ వేగంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. కల్వర్టుల నిర్మాణం కారణంగా పలుచోట్ల కొంత ఆలస్యమవుతోందని తెలిపారు. సీఎం ఆదేశాలతో పెండింగ్ బిల్లులు సైతం సర్దుబాటు చేసి, కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నామన్నారు. తాండూరు నుంచి అనంతగిరి హిల్స్లోని నంది ఘాట్ వరకు రూ.101 కోట్లతో 30కి.మీ. మేర రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు రూ.300 కోట్లతో జరుగుతున్న వికారాబాద్ – తాండూరు, మహబూబ్నగర్ – చించోళ్లి (టౌన్ పోర్షన్), అగ్గనూర్ – బషీరాబాద్, బషీరాబాద్ – మైల్వార్, – కరణ్కోట, గౌతాపూర్ – కరణ్కోట రోడ్ల పురోగతిని పరిశీలించారు. తాండూరు బైపాస రోడ్డు భూ సేకరణకు ఇంకా రూ.25 కోట్లు అవసరం ఉందన్నారు. భూ కరణ పూర్తయిన వెంటనే పనులు వేగవంతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్నాయక్, ఈఈ శ్రీధర్రెడ్డి, డీఈ శ్రావణ్కుమార్, ఏఈ రిషివరుణ్, కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ హైవేలుగా 180 జిల్లా రోడ్లు రెండున్నరేళ్లలో పనులు పూర్తి చేస్తాం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ మోహన్నాయక్ జిల్లాలోని పలు రహదారుల పరిశీలన -
చెంచులకు ఇళ్లు కట్టిస్తాం
● చైతన్యనగర్కు 176 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తాండూరు రూరల్: చెంచులకు ఇళ్లు కట్టిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం పెద్దేముల్ మండలం చైతన్యనగర్లో సర్పంచ్ గౌరమ్మతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామానికి 176 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతో పాటు, చెంచుల అభివృద్ధికి కేంద్రం పీఏం జన్మన్తో రూ.1 లక్ష చెల్లిస్తుందని చెప్పారు. నాయకులు మంబాపూర్ నారాయణరెడ్డి, లొంక నర్సింహులు.. చెంచులకు ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టు తీసుకుంటారని పేర్కొన్నారు. ఇళ్లను నాణ్యతగా నిర్మిస్తారన్నారు. అంతేకాకుండా చెంచుకాలనీలో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ దీపాలు, పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీహాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాణి, నాయకులు బిచ్చప్ప, శ్రీనివాస్, బాలయ్య పాల్గొన్నారు. అంతకు ముందు పెద్దేముల్ రైతు వేదికలో 67 కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ చెక్కులు పంపిణీ చేశారు. -
హెచ్పీవీపై అపోహలొద్దు
అనంతగిరి: హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మహిళల్లో గర్భకోస క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో కౌమార దశలోని బాలికలకు వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు వివరించారు. సోమవారం కలెక్టరేట్లో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా వాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఉమాశంకర ప్రసాద్, రాజేశ్వరి, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో.. బొంరాస్పేట: కౌమార దశలోని బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న హెచ్పీవీ పట్ల అపోహలొద్దని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రయాదవ్ అన్నారు. సోమవారం మండలంలోని బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్పీవీ పరీక్షలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భస్త ముఖద్వార క్యాన్సర్ను అరికట్టేందుకు ఈ వ్యాక్సినేషన్ ముందస్తు జాగ్రత్తగా పనిచేస్తుందన్నారు. దీనిపట్ల తల్లిదండ్రులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. 200మంది విద్యార్థినులకు వ్యాక్సినేషన్ చేశారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ హేమంత్కుమార్, ప్రిన్సిపాల్ విక్రమ్సింగ్, వార్డన్ రాజన్న, ఉపాధ్యాయులు, నాయకులు నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్ తివారి వాల్ పోస్టర్ ఆవిష్కరణ -
కనీస వేతనం చెల్లించాలి
యాలాల: రెండు దశాబ్దాలుగా అరకొర వేతనాలతో విధులు నిర్వహిస్తున్న కేజీబీవీ ఉద్యోగులకు కనీస మూలవేతనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యాలాల కేజీబీవీ ఎస్ఓ మంగమ్మ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం భోజన విరామ సమయంలో కేజీబీవీ ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఓ మాట్లాడుతూ.. కేజీబీవీ, సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. నిరసన కార్యక్రమంలో కేజీబీవీ సీఆర్టీలు, సిబ్బంది ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలి కుల్కచర్ల: కేజీబీవీ, సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి అజ్మత్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనికి తగ్గ వేతనం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, కోశాధికారి మల్లేశ్, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గాంగ్యనాయక్, సంఘ నాయకులు చందర్, ప్రసాద్, మహిపాల్, కేశవులు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ● కేజీబీవీ ఎస్ఓ మంగమ్మ ● భోజన విరామ సమయంలో ఉద్యోగులతో కలిసి నిరసన -
బకాయిలు విడుదల చేయండి
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పరిగి: మిల్లర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ దీపక్ తివారిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు విధించిన 25శాతం ఫెనాల్టీ, 12శాతం వడ్డీని మాఫీ చేయాలని కోరారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు అప్పుల ఊబీలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న రైస్ మిల్లు వ్యవస్థ దివాల స్థితికి చేరుకుందన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని, అధిక విద్యుత్ చార్జీలు, ధాన్యం ఇచ్చినంత త్వరగా బియ్యం తీసుకోకపోవడంతో నష్టాలు వస్తున్నట్లు చెప్పారు. వెంటనే బకాయిలు విడుదుల చేయడంతోపాటు ఫెనాల్టీ, వడ్డీని రద్దు చేయాలని కోరారు. -
మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు
అనంతగిరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. రంగోలి, క్యారమ్స్, చెస్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో క్రీడల విభాగం జిల్లా అధికారి సత్తార్, మహిళా సంక్షేమ శాఖ అధికారి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా ఉమాశంకరప్రసాద్ సోమవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. తాండూరు సబ్ కలెక్టర్గా పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ దీపక్ తివారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను బహూకరించారు. స్పీకర్ ప్రసాద్కుమార్ సమక్షంలో ఎన్నిక బంట్వారం: సర్పంచుల సంఘం బంట్వారం మండల అధ్యక్షురాలిగా సుల్తాన్పూర్ సర్పంచ్ బర్కత్పల్లి విజయలక్ష్మి ఎన్నికై ంది. మండలంలోని 12 జీపీలు ఉండగా ఏడుగురు సర్పంచులు సోమవారం నగరంలో స్పీకర్ ప్రసాద్కుమార్ సమక్షంలో విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని పేర్కొన్నారు. స్పీకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, మాజీ సర్పంచ్ నర్సింలు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: పేదలు, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని కేశవపల్లిలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలు గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని అది వారి భవిష్యత్తుకు బలమైన పునాది అన్నారు. ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందుకు మీ అందరి ఆశీర్వాదం, సహకారం ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతా సింగ్ నాయక్, సర్పంచ్ పావని, పార్టీ నాయకులు రామ్రెడ్డి, నాగిరెడ్డి, దేవయ్య, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు అన్ని గామ్రాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. షాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న పశువులకు ఆయా మండలాల్లో ఉన్న పశువైద్యాధికారుల బృందం టీమ్లుగా ఏర్పడి టీకాలు వేయనున్నట్లు చెప్పారు. -
బషీరాబాద్ ఎస్ఐ బదిలీ
బషీరాబాద్: మండల ఎస్ఐ నుమాన్ అలీ బదిలీ అయ్యారు. 2024 జులై 19న బాధ్యతలు తీసుకున్న ఆయన 8 నెలల పాటు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. విధుల పట్ల నిఖచ్చిగా ఉండే ఆయనను ఏడాది తిరగముందే ఎస్పీ కార్యాలయం వీఆర్కు బదిలీ చేశారు. ఈనెల 7న డీఐజీ ఎల్ఎస్ చౌహన్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఎస్పీ కార్యాలయం వీఆర్లో పనిచేస్తున్న వగ్గుల శ్రీశైలంయాదవ్ను నూతన ఎస్ఐగా నియమించారు. నేడో, రేపో ఆయన బాధ్యతలు తీసుకుంటారని సమాచారం.● ఎస్పీ కార్యాలయానికి అటాచ్ ● కొత్త ఎస్ఐగా శ్రీశైలం యాదవ్ -
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం.. ఆయిల్ చోరీ
యాలాల: గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి, ఆయిల్, రాగి(కాపర్) తీగను చోరీ చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రం నుంచి దేవనూరు మార్గంలో దీపక్ గగ్రాణి వ్యవసాయ క్షేత్రంలో 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇక్కడి నుంచి పలు పంట పొలాలకు విద్యుత్సరఫరా అవుతుంది. ఈ క్రమంలో రాత్రివేళదొంగలు భారీ ప్లాస్టిక్ పైపు సాయంతో ప్రధాన లైను నుంచి ఉన్న విద్యుత్ కనెక్షన్ను తొలగించారు. అనంతరం ట్రాన్స్ఫార్మర్ పైభాగం తెరచి, 25 లీటర్ల ఆయిల్, రాగి తీగను అపహరించారు. ఈ క్రమంలో దుండగుడు తన కాలి చెప్పును అక్కడే పడేసుకున్నాడు. ఇలాంటి ఘటన గతంలోనూ చోటు చేసుకుందని రైతులు తెలిపారు. ఈ ఘటనపై జేఎల్ఎం నరేందర్ సాయంతో రైతులు సోమవారం పీఎస్లో ఫిర్యాదు చేశారు. -
మహిళలు.. శక్తిమంతులు
తాండూరు టౌన్: అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు శక్తిమంతులు అని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మున్సిసల్ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప తోపాటు పలువురు మహిళా కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సాంకేతిక ప్రపంచంలో మగువలు, పురుషులకు సమానంగా ప్రగతి సాధించారన్నారు. అన్ని రంగాల్లో పైచేయి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మహిళా కౌన్సిలర్ల్లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బందికి సన్మానం -
రెవెన్యూ రక్షణ
మొయినాబాద్: హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. నగరానికి అతిచేరువలో ఉండటంతో వీటి విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో పలుచోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. పేదలకు పంపిణీ చేసిన భూములను, కొంత మంది పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. గతంలోనే రెవెన్యూ అధికారులు పీఓటీ చట్టం కింద వీటిని స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సదరు స్థలాలు కబ్జాదారుల చెరలోనే ఉన్నాయి. పలు చోట్ల కబ్జాకు గురైన ప్రభుత్వ, అసైన్డ్ భూములపై కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఓఆర్ఆర్ పక్కనే ఉన్న మొయినాబాద్ ప్రాంతంలోని భూముల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతోపాటు కబ్జాలకు గురైన స్థలాలను సైతం స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఎనికేపల్లిలో 99 ఎకరాలు స్వాధీనం మొయినాబాద్ మండలంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎనికేపల్లి రెవెన్యూ పరిధి 180 సర్వేనంబర్లోని 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు కొంతమంది భారీ పథకం వేశారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్లు సైతం పూర్తయ్యాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఎం దృష్టిసారించారు. వెంటనే ఆ భూములను గోశాలకు కేటాయించి, హెచ్ఎండీఏకు అప్పగించారు. వందలాది ఎకరాలకు కంచె పెద్దమంగళారం రెవెన్యూ సర్వేనంబర్ 149లో 159 ఎకరాలు, 218లో 220 ఎకరాల సర్కారు భూమి చుట్టూ కంచె నిర్మించారు. హిమాయత్నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 151లో 38.29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 10.36 ఎకరాల స్థలం ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఆధీనంలో ఉంది. ఇటీవల సర్వే చేసిన అధికారులు ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ భూములను సైతం సమీకృత మార్కెట్కు కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నారు. సర్కారీ భూములకు తహ‘సీల్’ ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఫెన్సింగ్ వేస్తున్న అధికారులు విలువైన భూములను స్వాధీనం చేసుకుంటున్న యంత్రాంగం కోర్టు వివాదాల్లోఉన్నవాటి వివరాల సేకరణ మొయినాబాద్లో రూ.వేలాది కోట్ల విలువైన భూముల స్వాధీనం పేదల భూములపై పెద్దల కన్ను నగర శివారులోని విలువైన ప్రభుత్వ భూముల కబ్జా చెర వీడుతోంది. ఖాళీగా ఉన్న సర్కారీ స్థలాలు పరాధీనం కాకుండా అధికారులు నడుం బిగించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ దస్త్రాల దుమ్ము దులుపుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ భూములను గుర్తించి ఫెన్సింగ్ వేస్తూనే మరో పక్క.. ఇతరుల కబ్జా, కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల వివరాలను సేకరిస్తున్నారు. అజీజ్నగర్ రెవెన్యూ 176 సర్వేనంబర్లో 220.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 1962లో పేదలకు 94.08 ఎకరాలను పంపిణీ చేశారు. ఈ భూములపై కొందరు పెద్దల కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పట్లోనే పీఓటీ చట్టం కింద రెవెన్యూ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, కబ్జా మాత్రం విడిపించలేకపోయారు. తాజాగా ఈ భూములను సమీకృత మార్కెట్కు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే సర్వే నంబర్లో కబ్జాకు గురైన 75.07 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి
నవాబుపేట: గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచులు కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలో ఐటీశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబును కలిసి విన్న వించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి, కలెక్టర్కు సూచించారని తెలిపారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇన్చార్జి బీమ్భరత్, మండల అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచులు నరసింహా రెడ్డి, నర్సింహులు, మల్లేశం, ప్రభాకర్, నాయకులు దశరథ్, అనంత రాములు, లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్, అమీర్ ఖాన్, మిరాజ్, పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను సోమవారం అధికారులు కూల్చి వేయించారు. పట్టణ శివారులో కోస్గి రోడ్డు పక్కన పర్మిషన్ లేకుండా నిర్మించిన కాంపౌండ్ వాల్ను జేసీబీ సాయంతో కూల్చి వేసినట్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతే కట్టడాలు చేపట్టాలని సూచించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి అనంతగిరి: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో దళిత కుటుంబాలపై దాడి చేసిన అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోఽశాధికారి బుస్స చంద్రయ్య, షబ్బీర్, దస్తప్ప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అత్యాచార నిందితుడికి రిమాండ్ మోమిన్పేట: బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన నిందితున్ని అరెస్టు చేసి, సోమవారం రిమాండుకు తరలించామని సీఐ వెంకట్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి ఓ గ్రామానికి చెందిన బాలిక.. 7వ తరగతి చదువుతోంది. గత దిపావళి పండుగను పురస్కరించుకొని హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి ఇంటి వద్దే ఉంది. ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. బాలిక గర్భవతని నిర్ధారించారు. విషయమై ఆరా తీయగా చిన్నారి జరిగిన విషయం చెప్పింది. అనంతరం వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టిన పోలీసులకు మండల పరిధి సయ్యద్అల్లిపూర్ గ్రామానికి చెందిన ఉద్దాల మాణిక్యం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించి, అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత ధారూరు: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నామని ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. సమాచారం మేరకు సోమవారం సిబ్బందితో కలసి మండల పరిధి కుమ్మర్పల్లి వాగులో ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్, దాని యజమాని అశోక్ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అక్కడే మరికొన్ని ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
మహిళలు అన్నింటా సత్తా చాటాలి
అనంతగిరి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయమూర్తి చంద్రకిశోర్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు ఉన్నత చదువులు చదవాలన్నారు. ప్రభుత్వ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. అందుకు చదువు ఒక్కటే మార్గమన్నారు. నేటి సమాజంలో మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణలర్పించిన వీరవణితలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజు పటేల్, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడు శంకరయ్య, జాయింట్ సెక్రటరీ ఆనంద్, సీనియర్ న్యాయవాదులు కమాల్రెడ్డి, నాగరాజు, యాదవరెడ్డి, శంకరయ్య, అశోక్కుమార్, నాగరాజు, నారాయణ, మాధవరెడ్డి, శుభప్రద్ పటేల్, తులసీరాం తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి చంద్రకిశోర్ -
ప్రజా వ్యథ!
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026వికారాబాద్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పొటెత్తారు. గతంతో పోలిస్తే రెండింతలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త కలెక్టరైనా తమ సమస్యలను పరిష్కరిస్తారనే గంపెడాశతో బాధితులు క్యూ కట్టారు. ఒక్కో సమస్య పరిష్కారానికి ఏళ్ల తరబడి సమయం పడుతుండటంతో అర్జీదారుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు అధికంగా పెండింగ్లో ఉన్నాయి. ఇవే కాకుండా చిన్నచిన్న సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవడం లేదు. దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ గ్రామ, మండల స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు కలెక్టరేట్లో కొలిక్కి వస్తాయని ప్రజలు క్యూ కడుతున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండటంటో ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిట్టూరుస్తున్నారు. జిల్లాలో వేల ఎకరాల భూములు నిషేధిత(ప్రొహిబిటెడ్) జాబితాలో పడటం రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ వరకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 90 శాతానికి పైగా రిజెక్టు చేసి పంపుతురు. కలెక్టరేట్కు వచ్చే బాధితులను పలకరిస్తే వారి బాధలు వర్ణతాతీతం. ఒక్కొక్కరిది ఒక్క వ్యథ. వినే వారికే కన్నీళ్లు తెప్పిస్తాయి కానీ అధికారుల మనసు మాత్రం కరగడంలేదు. ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని పరిగి మండలం రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. వందలాది మంది వచ్చి ప్రజావాణిలో కలెక్టర్కు వనతిపత్రం అందజేశారు. ఈ రెండు గ్రామాల పరిధిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు పరిగిలో ధర్నాలు, ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తామ భూములు ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. డబ్బు, ప్లాట్లు ఇంకేమి ఇచ్చినా తాము అంగీకరించమని పేర్కొన్నారు. ప్రభుత్వం భేషరతుగా నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు పండే భూముల్లో పరిశ్రమలు ఎలా పెడతారని ప్రశ్నించారు. భూములు పోతే తాము ఎక్కడికి పోవాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. కలెక్టరేట్కు క్యూ కట్టిన అర్జీదారులు నెల రోజుల్లో వచ్చే ఫిర్యాదులు ఒక్క వారంలోనే.. కొన్ని సామాజిక.. ఇంకొన్ని వ్యక్తిగత సమస్యలు ఏళ్లతరబడి దొరకని పరిష్కారం కొత్త కలెక్టర్కు సమస్యల స్వాగతం ఆదుకోకపోతే చావే శరణ్యం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని సహారా చిట్ఫండ్ కంపెనీ బాధితులు వాపోయారు. సహారా కంపెనీలో 20 ఏళ్లుగా ఏజెంట్లుగా పనిచేస్తూ వస్తున్న వారు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. వారి మాటల్లో.. జిల్లాలో మొత్తం 800 మంది వరకు ఏజెంట్లు ఉన్నారు. ప్రజల నుంచి దాదాపు రూ.600 కోట్లు సహారాలో జమ చేయించారు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో ఎక్కువ మంది డబ్బు డిపాజిట్ చేశారు. ఒక్క వికారాబాద్ నియోజకవర్గం నుంచే 300 మంది ఏజెంట్లు కలెక్టర్ను కలిశారు. తాము రూ. 50 లక్షల నుంచి ఆరు కోట్ల వరకు మొత్తం రూ. 50 కోట్లకు పైగా చిట్ ఫండ్లో డబ్బులు కట్టించామని వాపోయారు. ప్రస్తుతం కంపెనీ చేతులెత్తేయడంతో తాము డబ్బులు కట్టించిన కస్టమర్లు ఇళ్లపైకి వచ్చి గొడవలు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. టెన్షన్ తట్టుకోలేక ఇటీవల ఆలంపల్లికి చెందిన యూసఫ్ పాష, పట్లూరుకు చెందిన లక్ష్మయ్య గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. వారి భార్య, పిల్లలు అనాథలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కలెక్టర్ను కోరారు. జనవరిలో దరఖాస్తులు(4వారాలకు) 200 ఫిబ్రవరిలో 137 ఈనెల 9న (ఒక్కరోజే) 289 ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతులది పరిగి మండలం రావులపల్లి. ముగ్గరు అన్నదమ్ములు. మంగలి రామయ్య, కృష్ణయ్య, అంజయ్య పేరిట రెవెన్యూ రికార్డుల్లో పదిహేను ఎకరాల పొలం ఉంది.. వాస్తవంలో మూడెకరాలు తక్కువగా ఉంది. సర్వే చేయించి తమ పొలం హద్దులు చూపాలని మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అనేక సార్లు దరఖాస్తు కూడా చేశారు. అధికారులు వీరి అర్జీలను రిజెక్టు చేసి చేతులు దులుపుకొన్నారు. చివరి ప్రయత్నంగా కొత్త కలెక్టర్ను కలిసి వారి బాధను వెల్లబోసుకున్నారు. -
అధికారుల మధ్య సమన్వయం తప్పనిసరి
తాండూరు: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే ప్రారంభోత్సవాలు చేపట్టాలన్నారు. నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులతో అధికారులు త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. 99 రోజుల ప్రణాళిక పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యటించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో హౌజింగ్ అధికారులు, మండల పరిషత్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
విధులు పరిపూర్ణం.. వేతనాలు అసంపూర్ణం!
● అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే టార్గెట్గా బేసిక్ పే అమలుకు పోరాటం ● నిరసనలకు యూటీఎఫ్ సంఘం ఊతం బొంరాస్పేట: సమగ్రశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులుగా పనిచేస్తున్న కేజీబీవీ, యూఆర్ఎస్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై దశలవారీగా పోరాటం షురువైంది. ఈ పోరాటానికి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నేతృత్వం వహించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లుగా(పీటీఐ)గా పనిచేస్తున్న ఆర్ట్, పీఈటీ, క్రాఫ్ట్ ఉద్యోగులు, అలాగే కేజీబీవీ, గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్ఎస్ఏ, ఉద్యోగుల దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ నెలసరి వేతనాల్లో ప్రభుత్వాలు అసంపూర్ణంగా ఉన్నాయంటున్నారు. జిల్లాలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు వివిధ రకాలుగా మండలాల్లో 554 మంది ఉన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే టార్గెట్ కనీస వేతనాల చట్టం ప్రకారం విద్యాశాఖలో పనిచేస్తున్న ఎంఐఎస్, సీఆర్పీ, పీటీఐ, ఎస్ఎస్ఏ, కేజీబీవీ ఇతర కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. వంద రోజుల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినా ప్రభుత్వం మోసం చేస్తోంది. ఉద్యోగులను రెన్యూవల్ చేస్తామని కాలయాపన చేస్తోందంటున్నారు. ఇది వరకు చేసిన 29రోజుల సమ్మెకాలానికి సైతం వేతనాలు చెల్లిస్తామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పీటీఐ గా పనిచేస్తున్న ఆర్ట్, పీఈటీ, క్రాఫ్ట్, పీటీఐ, ఐఆర్పీ, కంప్యూటర్ ఆపరేటర్, మెసెంజర్, సీఆర్పీల వేతనాలు సరిగా పడడంలేదంటున్నారు. వివిధ కారణాలతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేసిక్ పే అమలు చేయాలని సీఆర్పీలు, ఎంఐఎస్, కేజీబీవీల్లోని సీఆర్టీ, పీజీ సీఆర్టీలకు స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్చేయాలని కోరుతున్నారు. దీన్ని అమలు చేస్తే నెలసరి వేతనం రూ.47,800 ఇంక్రిమెంట్లు, హెచ్ఆర్ఏ. డీఏ., సీఎల్లు అమలు సీఆర్పీలకు టీఏలు అందుతాయని ఆశగా ఉన్నారు. నిరసనల ప్రణాళిక ● మార్చి 9న నల్లబ్యాడ్జీలు ధరించి పాఠశాలల్లో నిరసన ● 16న డివిజన్, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు ● 20న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ ‘చలో అసెంబ్లీ’ ఎస్ఎస్ఏ కింద పని చేస్తున్న ఉద్యోగులు ఉద్యోగులు వేతనం ఎంఐఎస్–18 రూ.19,500 కంప్యూటర్ ఆపరేటర్లు–20 రూ.19,500 సీఆర్పీలు– 57 రూ.19,500 ఐఈఆర్పీలు–38 రూ.19,500 పీటీఐ–97 రూ.11,700 కేజీబీవీ(18)–304 రూ.26,000 (సీఆర్టీ)– రూ.29,000 (పీజీ సీఆర్టీ) మెసెంజర్లు–20 రూ.11,050 కష్టకాలంలో కుటుంబాలు 2014 నుంచి రూ.4,500 వేతనానికే ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఇచ్చే రూ.11,700 సక్రమంగా ఇవ్వడం లేదు. ఉ ద్యోగ భద్రత లేదు. ఇచ్చిన హా మీలు నెరవేర్చాలి. కష్టకాలంలో గడుపుతున్నాం. – వెంకటయ్య, పీటీఐ, జెడ్పీహెచ్ఎస్, రేగడిమైలారం -
కానిస్టేబుల్ హఠాన్మరణం
అనంతగిరి: మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి గన్మెన్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వికారాబాద్ పట్టణం రామయ్యగూడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ విజయ్కుమార్ అలియాస్ అప్పి(40) మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న పట్నం మహేందర్రెడ్డి రామయ్యగూడలోని కానిస్టేబుల్ నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయ్కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకుఆనంద్ మృతుడి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.సాయంత్రం పోలీసు లాంఛనాలతో జరిగిన అంతిమ సంస్కారంలో మహేందర్రెడ్డి కుమారుడు రితీశ్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేశ్కుమార్, ఆయా పార్టీల నాయకులు పోలీసు అధికారులు, గ్రామస్తులు నివాళి అర్పించారు. -
గ్యాస్ లీక్ అయితే సమాచారం ఇవ్వాలి
మోమిన్పేట: వంట గ్యాస్ లీక్ అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ వైదేహి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బూర్గుపల్లి వద్ద ఉన్న మేఘా గ్యాస్ పంపిణీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎక్కడ గ్యాస్ లీక్ అయిన వెంటనే పంపిణీ కేంద్రానికి సమాచారం అందుతుందన్నారు. వినియోగదారులు సైతం వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సేీఫ్టీ అథారిటీ టీం సభ్యులు వెంటనే మరమ్మతు చేస్తారని వివరించారు. సేఫ్టీ అథారిటీ టీం సభ్యులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మేఘా గ్యాస్ పంపిణీ పైపుల ద్వారా అవసరమైన వారికి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారన్నారు. రెగ్యులేటరు, ఆన్ఆఫ్ సిస్టం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ నితిన్కుమార్, జిల్లా ఫైర్ అధికారి పూర్ణచంద్ర, స్టేషన్ ఫైర్ అధికారి వికారాబాద్ ధనుంజయ స్వామి, సీఐ వెంకట్, ఎస్ఐలు, మేఘా గ్యాస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ వైదేహి -
మహిళలు రాణించాలి
డీఆర్డీఓ శ్రీనివాస్ అనంతగిరి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు మహిళా సమాఖ్య జిల్లా కార్యాలయంలో మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని, ఆర్థికంగా స్థిరపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నర్సింలు, డీపీఎం నర్సింలు, కొమరయ్య, శేఖర్, నర్సింలు, ఏపీఎంలు సవిత, మంజులవాణి, శోభ, సీసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, 19 మండలాల అధ్యక్షురాళ్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం
పరిగి డీఎస్పీ శ్రీనివాస్ పరిగి: శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే వెంటనే ట్రేస్ చేయవచ్చని చెప్పారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హన్మయ్య, ఉపసర్పంచ్ రాధమల్లేశ్, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా వార్డుల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టండి తాండూరు టౌన్: పట్టణంలో బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు మంగళవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలి కౌన్సిల్ సమావేశం సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నాగారం మల్లేశం, అంతారం కిరణ్ ముదిరాజ్, డి.శ్రీ కాంత్ రెడ్డి ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా తమ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. రోడ్డు అభివృద్ధి పనులు షురూ అనుమతులు లేవని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు బషీరాబాద్: నీళ్లపల్లి ఏకాంబరి ఆలయానికి వెళ్లే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్టర్ రూ.95 లక్షలతో మెయిన్ రోడ్డు నుంచి ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా సీసీ బెడ్ వేయనున్నారు. ఇదిలా ఉండగా మెయిన్ గేటు ప్రధాన ద్వారం వద్ద అటవీ శాఖ అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నారని ఆశాఖ అధికారులు మంగళవారం రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారు. ‘పది’ పరీక్షలకు 568 మంది తాండూరు రూరల్: పెద్దేముల్ మండలంలో పదో తరగతి పరీక్షకు మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దేముల్ జెడ్పీహెచ్ఎస్(బాలికల) పరీక్ష కేంద్రంలో 188 మంది విద్యార్థులు, పెద్దేముల్ జెడ్పీహెచ్ఎస్ (బాలుర)–200 మంది, మంబాపూర్ జెడ్పీహెచ్ఎస్–180 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. హిందూ సంప్రదాయంతో ప్రపంచానికి వెలుగు జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ కుల్కచర్ల: ప్రపంచానికి వెలుగుచూపేది హిందూ సాంప్రదాయమేనని తెలంగాణ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మఠం రాజశేఖర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నదుల మఠం శశిభూషణ సిద్ధాంతి రచించిన పరాభవ సంవత్సర భారతి పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్నింటికీ మూ లం హిందూ మతంలోని ఆచార సాంప్రదాయాలేనని అన్నారు. జంగమ అర్చకులకు ఉచితంగా పంచాంగం పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్, విశ్వం, అనిల్, శివకుమార్, నాగరాజు, వీరేశం పాల్గొన్నారు. -
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు కేటాయించాలి
చేవెళ్ల: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును అమలు చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ పార్థసింహారెడ్డికి వివనతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం విద్యను వ్యాపారంగా మార్చి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటీకీ ఎక్కడా ఎవరూ అమలు చేయడం లేదన్నారు. వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్స్ తీసుకునే సమయానికి చట్టం అమలయ్యేలా చర్యలు చెపట్టాలన్నారు. -
ప్రగతి ప్రణాళికను విజయవంతం చేస్తాం
అనంతగిరి: నూతన ప్రజాప్రతినిధులకు నిర్దేశిత అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లకు గురువారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందరి భాగస్వామ్యంతో ప్రగతిప్రణాళికను విజయవంతం చేస్తామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఇతర జిల్లాల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్తివారి -
హ్యపీ బర్త్డే బ్రదర్
బీఎస్ఆర్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే తాండూరు: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్రెడ్డి బర్త్డే వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. శ్రీనివాస్రెడ్డి నివాసంలో జరిగిన జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే బీఎంఆర్, సోదరుడు సత్యనారాయణరెడ్డి తమ్ముడు శ్రీనివాస్రెడ్డితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంతో పాటు పరిగి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అభిమానులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కుల్కచర్ల: ఆర్బీఎల్ కంపెనీ సీఎండీ బుయ్యని శ్రీనివాస్రెడ్డి పుట్టినరోజు వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, బస్టాండ్లో ప్రయాణికులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాంచంద్రయ్య, శంకర్, గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, ఉమాశంకర్, వినోద్, కృష్ణ, ఎల్రెడ్డి, మధూకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక వ్యక్తికి ఒకే ఓటుండాలి
పరిగి: ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండరాదని.. అది చట్టరీత్యా నేరమని తహసీల్దార్ వెంకటేశ్వరి సూచించారు. మంగళవారం పట్టణ కేంద్రంలో బీఎల్ఓలతో, రాజకీయ పార్టీలతో అధికారులతో సర్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో, పట్టణంలో బీఎల్ఓలు ప్రతీ ఇంటింటికి తిరిగి ఓటరు సవరణ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పారు. ఆయా పార్టీల నాయకులు గ్రామాల్లో పట్టణంలో సహకరించాలన్నారు. బీఎల్ఓలు అడిగిన ప్రశ్నలకు ఓటర్లు పూర్తిగా సమాచారం అందించి సహకరిస్తే ఓటరు సవరణ కార్యక్రమం త్వరగా పూర్తవుతుందని చెప్పారు. ఓటరు లిస్టులో మృతి చెందిన వారి పేర్లు, చిరునామా మార్పులు చేసుకున్న వారి పేరు, రెండు మూడు ఓటరు కార్డులు ఉన్న వారివి ఈ సర్వే ద్వారా తొలగిపోతాయన్నారు. ఇప్పటి వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోని యువత సైతం ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, డీటీలు విజయేందర్, అనిల్బాబు ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ వెంకటేశ్వరి -
రైతు భరోసా విడుదల చేయాలి
మహేశ్వరం: రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంత మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని తుమ్మలూరు, మెహబ్బత్నగర్, ఘట్టుపల్లి, ఆకన్పల్లి, దుబ్బచర్ల, కోళ్లపడకల్, పోరండ్ల, మహేశ్వరం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగియగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి ఇంకా విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. యాప్ ద్వారా పంపిణీ చేయడంతో యూరియా దొరకడం లేదని, రైతులకు యాప్ ద్వారా బుక్ చేసుకోవడం అర్థం కావడం లేదన్నారు. ఏ కొర్రీలు పెట్టకుండా సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాంచందర్, విజయ్, అశోక్, నరేందర్, ముజీబ్, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పన్నుల వసూలులో వేగం పెంచండి
● అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ రాజు ● తాండూరులో పలు అభివృద్ధి పనుల పరిశీలన తాండూరు టౌన్: ఆస్తి పన్ను వసూలులో తాండూరు మున్సిపాలిటీ వెనుకపడి ఉందని, వేగం పెంచాలని పట్టణాభివృద్ధి శాఖ నోడల్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ విశాల్ రాజు ఆదేశించారు. సోమవారం తాండూరులో నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పలు విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వసూల్ల లక్ష్యం చేరకపోతే రాష్ట్ర, కేంద్ర గ్రాంట్లు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. అందువల్ల 100 శాతం లక్ష్యాన్ని ఛేదించాలని వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం డంపింగ్ యార్డులోని బయో మైనింగ్ పనులను, డీఆర్సీ సెంటర్, ఏబీసీ సెంటర్లను పరిశీలించారు. శాంతినగర్ పార్కులో నిర్వహించిన క్లీనింగ్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజతో కలిసి పాల్గొన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. అమృత్ 2.0 కిఒంద నిర్మాణంలో ఉన్న రెండు వాటర్ ట్యాంకుల పనులను పరిశీలించారు. యూఐడీఎఫ్, అమృత్ 2.0 పథకం కింద పనులు ఎప్పుడు పూర్తవుతాయని ఇంజనీరింగ్ విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ను తయారు చేయాలని ఆదేశించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, కమిషనర్ మధుసూదన్రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ నాగారం మల్లేశం, ఏఈ ఖాజాహుస్సేన్, ఉదయ్, టిపిబిఓ ప్రియ, నరేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గుడ్ గవర్నెన్స్కు మెత్కుపల్లి జీపీ నామినేటెడ్
బంట్వారం: కోట్పల్లి మండలం మోత్కుపల్లి పంచాయతీ 2023 – 24 ఆర్థిక సంవత్సరం స్కోర్ ఆధారంగా గుడ్ గవర్నెన్స్కు నామినేటెడ్ అయ్యింది. దీంతో కేంద్ర బృందం సీనియర్ కన్సల్టెంట్ శ్రీపంత్ దీప్ సింగ్ మంగళవారం జీపీని సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు కోసం మోత్కుపల్లి గ్రామ పంచాయతీ గుడ్ గవర్నెన్స్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటికే నామినేటెడ్ కావండతో పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు. ఇంటి పన్నుల వసూలు, ఆన్లైన్ నమోదు, రికార్డుల నిర్వాహణ సంతృప్తికరంగా ఉందన్నారు. వీటి స్కోర్ ఆధారంగానే గుడ్ గవర్నెన్స్కు నామినేట్ చేయడం జరిగిందన్నారు. వీటిలో వచ్చిన పాయింట్ల ఆధారంగా నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సంధ్యారాణి, ఎంపీడీఓ సురేందర్రెడ్డి, సర్పంచ్ అమృతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా శక్తి గొప్పది
● సమాజాభివృద్ధిలో వారిదే కీలక పాత్ర ● కలెక్టర్ దీపక్ తివారి ● ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనంతగిరి: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో ప్రతిభ చాటుతున్నారని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళల గౌరవం, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. లింగ వివక్షత పూర్తి స్థాయిలో రూపుమాపాలన్నారు. మన ఇంటి నుంచే మార్పు ప్రారంభం కావాలన్నారు. ఆడ, మగ పిల్లలను సమానంగా చూడాలన్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి మాట్లాడుతూ.. మహిళలకు గౌరవం, సమాన అవకాశాలు లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, డీఎంహెచ్ఓ స్వర్ణ కుమారి, డీఈఓ రేణుకాదేవి, డీపీఆర్ఓ చెన్నమ్మ, మెప్మా పీడీ రవికుమార్ జిల్లా హార్టీకల్చర్ ఆఫీసర్ సత్తార్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అర్థ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందాలి ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన, తక్షణ వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణ పరిధిలోని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల సమయపాలనపై ఆరా తీశారు. రోజూ ఎంతమంది పేషెంట్లు, గర్భిణులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం రికార్డులు, మందుల స్టాక్ను పరిశీలించారు. ఆ తర్వాత సఖి కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ స్వర్ణ కుమారి, వైద్యులు సౌమ్య, రజని తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. పలువురు రక్తదానం చేశారు. కలెక్టర్ దీపక్ తివారి శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి, జిల్లా శిశు సంక్షేమాధికారి జ్యోత్స్న, జిల్లా క్రీడల శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
రుధిరవేదన
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026వికారాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ మూతపడింది. ఎనిమిది నెలలు కావస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ సగటున ఐదు నుంచి ఎనిమిది యూనిట్లు బ్లడ్ అవసరం. ఈ లెక్కన నెలకు 150 నుంచి 200 వరకు యూనిట్లు కావాలి. ఇంత పెద్ద మొత్తంలో రక్తం అవసరమున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. బ్లడ్ అవసరమైన ప్రతిసారీ పరిగి లేదా తాండూరుకు పరుగులు తీయాల్సి వస్తోంది. సమస్యను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. డయాలసిస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్లు రక్తం దొరక్క అవస్థలు పడుతున్నారు. జిల్లాలో చాలా మంది గర్భిణులు రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రసవ సమయంలో రక్తం దొరకడం లేదు. రక్తం నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోవడంలేదు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ల ఇష్టారాజ్యం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ సేవలు నిలిచి పోవడం.. ఇదే క్రమంలో స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటుపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇందు కోసం వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది. వికారాబాద్లో రెండు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఉండగా వాటిపై అధికారుల నియంత్రణ పూర్తిగా కరువైంది. నిర్వాహకులు డిమాండ్ను బట్టి అధిక ధరలకు బ్లడ్ విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉచితంగా బ్లడ్ ఇస్తారు. ఒక వేళ ప్రైవేటు ఆస్పత్రుల్లోని రోగులకు కావాల్సి వస్తే ఒక్కో యూనిట్ రూ.1,050 విక్రయిస్తారు. ప్రైవేటులో అయితే పెషెంట్ల అవసరాన్ని బట్టి ఒక్కో యూనిట్కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే 50 కిలోమీటర్ల దూరంలోని తాండూరు జనరల్ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. మూడు నెలల క్రితం జరిగిన టిప్పర్ – బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో వికారాబాద్ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం కలెక్టరేట్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు ఉద్యోగులు రక్త దానం చేశారు. ‘మహవీర్’పై విచారణ జరపాలిజిల్లా జనరల్ ఆస్పత్రిలో మూతబడిన బ్లడ్ బ్యాంక్ గర్భిణులు, డయాలసిస్ పేషెంట్ల అవస్థలు అత్యవసర సమయాల్లో తాండూరుకు వెళ్లాల్సిందే.. ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి పట్టించుకోని అధికారులు, పాలకులు బ్లడ్ బ్యాంక్లో విధులు నిర్వహించే వైద్యులు, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర కింది స్థాయి సిబ్బంది పది మంది వరకు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది నిర్వాకం కారణంగా పలు పరికరాలు పాడైనట్లు తెలిసింది. జనరల్ ఆస్పత్రిని పాత భవనం నుంచి కొత్త బిల్డింగ్లోకి మార్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో చాలావరకు పాడైనట్లు సమాచారం. రక్త నిధి కేంద్రం అందుబాటులోకి రావాలంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో సమస్యను కలెక్టర్కు విన్నవించినట్లు తెలుస్తోంది. బ్లడ్ బ్యాంక్ పరికరాలు పాడైన విషయాన్ని గత కలెక్టర్కు విన్నవించాం. ఏ మేరకు నిధులు అవసరమో అంచనాలు పంపమన్నారు. ఈ లోగా ఆయన బదిలీ అయ్యారు. ప్రస్తుత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. నెల రోజుల్లో బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – రాజ్యలక్ష్మి, జనరల్ ఆస్పత్రి సూపరింటిండెంట్ -
దేవర్ఫసల్వాద్లో కేంద్ర బృందం
దౌల్తాబాద్: మండలంలోని దేవర్ఫసల్వాద్ గ్రామం సామాజిక భద్రతలో ఉత్తమ పంచాయతీగా ఎంపికై ంది. మంగళవారం గ్రామంలో కేంద్ర బృందం పర్యటించింది. అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలు, రేషన్ దుకాణాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి తారాచంద్, కన్సల్టెంట్ సంత్దీప్సింగ్ తదితరులు డీపీఓ జయసుధతో కలిసి పరిశీలించారు. ముందుగా గ్రామసభ నిర్వహించి స్థానికులతో మాట్లాడారు. పింఛన్లు, రేషన్కార్డులు, ఉపాధి పనుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఎల్పీఓ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
సమయాన్ని వృథా చేసుకోవద్దు
● పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి ● రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి కొడంగల్ రూరల్: విద్యార్థులు లక్ష్యం దిశగా చదువుతూ ఉన్నత స్థానాల్లో నిలవాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ బాలాజీ కేజీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు అందించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, సమయాన్ని వృథా చేసుకోరాదని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తూ పాఠశాల పేరు నిలబెట్టాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, హెచ్ఎం వెంకటప్ప, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. -
వంటింటికి పరిమితం కావొద్దు
● మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి ● పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప పరిగి: మహిళలు వంటింటికి పరిమితం కారాదని, అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానంలో నిలవాలని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప సూచించారు. మంగళవారం పరిగి మండల పరిషత్ కార్యాలయంలో అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ మహిహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీ్త్ర అంటే శక్తి అని.. సీ్త్ర ఉంటేనే కుటుంబ, దేశం, ప్రపంచం బాగుంటుందన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తేనే మహిళలకు గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వరి, కమిషనర్ వెంకటయ్య, ఎంపీడీఓ కరీం, అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్, కౌన్సిలర్లు బాదం అఖిల, హబీబ్ఉనిసా, షాహేదాబేగం తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను స్పీకర్ ప్రసాద్కుమార్ తన కూతురు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనన్యతో కలిసి దర్శించుకున్నారు. సోమవారం రాత్రి దూప హారతి పూజలో, మంగళవారం ఉదయం సాయినాథున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదం అందజేశారు. ధారూరు: వ్యవసాయ విస్తరణ అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా సంజూ రాథోడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం వికారాబాద్లో వ్యవసాయ విస్తరణ అధికారులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పెంటయ్య, కోశాధికారిగా విశ్వనాథ్ను ఎన్నుకున్నారు. బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి బషీరాబాద్: వరి, పత్తి పంటల కొనుగోలుతో మార్కెట్ కమిటీకి రూ.14 లక్షల ఆదాయం సమకూరిందని బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ జి.మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం చైర్మన్ అధ్యక్షతన పాలకవర్గ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్కు పన్ను రూపంలో వచ్చిన ప్రతీ పైసాను రైతుల కోసం ఖర్చు చేస్తామన్నారు. మార్కెట్ కమిటీ పాలవ వర్గం సభ్యులతో త్వరలో వ్యవసాయ మార్కెటింగ్పై స్టడీ టూర్కు వెళ్లనున్నట్లు చెప్పారు. రైతులకు సకాలంలో గన్నీ బ్యాగులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చందర్నాయక్, కార్యదర్శి సిద్దమ్మ, సభ్యులు వనమాల, వడ్డే హన్మంతు, మహేందర్రెడ్డి, అనూప్ ప్రసాద్, నరేశ్ రాథోడ్, పెంటప్ప, సత్యానందం, మునీర్ తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి శ్రీవారి ఆస్థాన సేవలు
● తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు ● తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలు ● ఏర్పాట్లు చేస్తున్న ఆలయ ధర్మకర్తలు కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్లో వెలిసిన శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి బాలాలయంలో నిర్వహించనున్నారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఆస్థాన సేవలుగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి రూ.110 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవాలను తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వాహన సేవలు, నిత్య పూజలు, సుప్రభాత, తోమాల సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శేష వస్త్రాలు సమర్పిస్తారు. నిత్య కార్యక్రమ వివరాలు 16వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహనం, 17వ తేదీ ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనం, 18న సింహ వాహనం, వ్యాళి వాహనం, 19న కల్ప వక్ష వాహనం, ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం, రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనం, 20న పల్లకీలో మోహినీ అవతార ఉత్సవం, టీటీడీ శేష వస్త్రాల సమర్పణ, రాత్రికి గరుడ వాహనం, 21న హనుమంత వాహనం, గజవాహనం, 22న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 23న రథోత్సవం, అశ్వవాహనం, 24న రోహిణీ ఆస్థానం ఉంటుంది. రోజూ సాయంత్రం 7గంటలకు బాలాజీ పాడుతా తీయగా కార్యక్రమం ఉంటుందని ధర్మకర్తలు తెలిపారు. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కడ్తాల్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని ప్రజలు ఆదరించి ఆశీర్వదించడమే దీనికి నిదర్శనమన్నారు. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తోందని, అర్హులందరికీ కొత్త రేషన్కార్డులతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని గుర్తు చేశారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు గృహావసరాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు. క్షేత్ర స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్రెడ్డి, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాలరాజు, సేవాదళ్ మండల అధ్యక్షుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి -
బంజార నాయకుడికి అవకాశం హర్షణీయం
పరిగి: పదవులకు దూరంగా ఉన్న బంజారులకు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కల్పించేందుకు చొరవతీసుకోవడం హర్షణీయమని బంజార రాష్ట్ర నాయకులు అన్నారు. పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్ హన్మంత్ను ఆదివారం బంజార ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంజార నాయకుడికి అవకాశం రావ డం సంతోషించదగిన విషయమన్నారు. హన్మంతు భవిష్యత్లో మరిన్న పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాంగ్యనాయక్, వెంకట్, హరిలాల్, రూప్సింగ్, మాంగ్య, రాకేశ్, రెడ్యా, శ్రీను పాల్గొన్నారు. -
రేపు ‘చలో హైదరాబాద్’
● ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని ఆర్టిజన్ కార్మికుల ఆందోళన ● హెచ్–82 యూనియన్ నాయకుడు జమీల్ అనంతగిరి: విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికుల హక్కుల సాధనకు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నట్లు హెచ్–82 యూనియన్ నాయకులు జమీల్, జైపాల్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం వికారాబాద్లో ఆర్టిజన్ ఉద్యోగుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 23 వేల ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలన్నారు. విద్యాఅర్హతలను బట్టి కన్వర్షన్ చేయాలన్నారు. కార్మికులందరికీ విద్యుత్ శాఖలో ఒకే విధమైన రూల్స్ ఉండాలన్నారు. ఈ విషయంలో యాజమాన్యానికి, ప్రభుత్వానికి పలుమార్లు నోటీసు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహాధర్నాకు ఆర్టిజన్ కార్మికులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింలు, వెంకటయ్య, సుభాన్, తేజ, శేఖర్, ఆలం తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకు హాజరవ్వండి కుల్కచర్ల: ఆర్టిజన్ కార్మికుల హక్కుల సాధనకు ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హెచ్82 యూనియన్ వికారాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శివని వెంకటయ్య తెలిపారు. విద్యుత్ శాఖలో ఉద్యోగులందరికీ ఒకే విధమైన రూల్స్ ఉండాలని డిమాండ్ చేశారు. శ్రమదోపిడీకి పాల్పడుతూ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులపై నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టీజీపీడీసీఎల్, సెక్రెటేరియెట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ఆందోలనకు ఆర్టిజన్ కార్మికులంతా హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు లక్ష్మయ్య, చంద్రకాంత్, చుక్కయ్య, శ్రీరాములు, యూసప్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ధరలు తగ్గించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మండలంలోని జైదుపల్లిలో వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అంతర్జాతీయ విషయాలు సాకు చూపుతూ పేదోడిపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనసూయ, వెంకటమ్మ, సుక్కమ్మ, లక్ష్మి, స్వరూప, స్పందన తదితరులు పాల్గొన్నారు. యుద్ధం సాకుతో ఆర్థికభారం దుద్యాల్: కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బుస్స చంద్రయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఖాళీ సిలిండర్తో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధం సాకుతో పేదలపై ఆర్థిక భారం మోపితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సందీప్, నరేశ్, సాయి కుమార్, ప్రసాద్, కృష్ణవేణి, రేణుక, సావిత్ర తదితరులు పాల్గొన్నారు. పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి పరిగి: కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ రూ.60వేల కోట్ల భారాన్ని దేశ ప్రజలపై వేయడాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న యుద్దం పేరుతో చమురు నిల్వల కొరత ఉండనున్నదనే సాకుతో ధరలను పెంచారన్నారు. విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని మోదీ యుద్దాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు హబీబ్, సత్తయ్య, అక్బర్, రాఘురాం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ధరల పెంపు సబబు కాదు తాండూరు టౌన్: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు ఆదివారం ఖాళీ సిలిండర్తో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇరాన్, అమెరికా యుద్ధం సాకుతో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం సబబు కాదన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలను సైతం పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను తగ్గించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ ఆందోళనలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులు చంద్రయ్య, రత్నం, దస్తప్ప, రవికుమార్, రాములు, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
రియల్ మాయ!
వికారాబాద్: వెంచర్లకు అనుమతులు, అక్రమ నిర్మాణాల విషయంలో రియల్టర్లు నిబంధనలు తుంగలో తొక్కుతుండగా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. విమర్శలు, ఆరోపణలు వస్తే నామమాత్రపు చర్యలు, నోటీసులతో సరిపెడుతున్నారు. ఫిర్యాదులు అందిన సమయంలో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారనే అపవాదు ఉంది. రియల్టర్లకు అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రైతులు, వారికి మేలు చేసే చట్టాల ముసుగులో ఫాం లేఅవుట్లు ఏర్పాటు చేస్తూ నాలా కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల చెరువులు, నాలాలు సైతం కబ్జా చేస్తున్నారు. ఫాం లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా.. కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పంచాయతీ, టౌన్ ప్లానింగ్ అధికారులు అటుగా కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గజాల్లో విక్రయం.. గుంటల్లో రిజిస్ట్రేషన్ వ్వవసాయ భూములను ప్లాట్లు చేయాలన్నా.. గజాల్లో విక్రయించాలన్నా.. ముందుగా ఆ భూమికి సంబంధించి నిర్దేశిత రుసుము చెల్లించాలి. అనంతరం వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ భూములు వ్యవసాయ భూముల నుంచి కమర్షియల్ పర్పస్ ల్యాండ్గా మారుతుంది. కాగా వ్యవసాయ యోగ్యంగా లేని భూములు మాత్రమే నాలా కన్వర్షన్ చేయాలనే నిబంధన కూడా ఉంది. ఇవన్నీ పట్టించుకోని అక్రమార్కులు నాలా కన్వర్షన్ చేయకుండానే గజాల్లో విక్రయిస్తూ గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. భూమిని నాలా చేయకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో బీటీ రోడ్డు, సీసీ రోడ్డు వేయడానికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయకుండా.. ప్రభుత్వ రుసుము చెల్లించకుండానే వ్యవసాయ భూములు లేఅవుట్గా మార్చి విక్రయిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొత్త దందాకు తెరలేపారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తున్నారు. గజాల చొప్పున విక్రయిస్తూ గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే బీటీ, సీసీ రోడ్లు నిర్మించి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. పుట్టగొడుగుల్లా ఫాం లేఅవుట్స్ అనుమతులు లేకుండా బీటీ, సీసీ రోడ్లు నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్ల విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ల నిర్మాణం మిన్నకుంటున్న రెవెన్యూ, పంచాయతీ, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వాదాయానికి భారీగా గండి అవకతవకలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అవకతవకలకు పాల్పడుతున్న రియల్టర్లతో అధికార యంత్రాంగం సైతం కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పంచాయతీలతో పాటు, మున్సిపల్ పరిధిలోనూ ఫాం హౌస్ల పేరుతో పంచాయతీల అనుమతులు సైతం లేకుండా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవటంలేదు. మరికొన్ని చోట్ల వ్యవసాయ భూమిని ఫాం లే అవుట్ల పేరుతో అభివృద్ధి చేసి ఐదు, పది గుంటలు, అర ఎకరం చొప్పున విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తతంగం కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రెపల్లి సమీపంలో సుమారు పదెకరాలకు పైగా ఫాం లేఅవుట్లు చేశారు. మర్పల్లి మండలం తుమ్మలపల్లిలో, పరిగి మండలంలో, వికారాబాద్, నవాబుపేట, మోమిన్పేట, పూడూరు తదితర చోట్ల ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో 20 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిలో రోడ్లు నిర్మించారు. ప్రహరీ ఏర్పాటు చేసి ఫాం లేఅవుట్గా అభివృద్ధి చేశారు. మండల పరిధిలోని పీరంపల్లి, సిద్దులూరు గ్రామాల పరిధిలో సైతం 130 ఎకరాల్లో ఇలాంటి ఫాంలేఅవుట్లే చేసి గజాల చొప్పున విక్రయిస్తూ గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. -
పెండింగ్ డీఏ విడుదల చేయాలి
తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య తాండూరు టౌన్: ట్రెజరీ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న డీఏ వాయిదాల బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తాండూరు తపస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన నివేదిక అశాసీ్త్రయమైందని, తప్పులు తడకగా ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలన్నారు. అనంతరం తపస్ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి హన్మంతరావు మాట్లాడుతూ.. తపస్ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారానికి ఎమ్మెల్సీ, రాష్ట్ర బాధ్యులతో కలిసి కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సంగమేష్, ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, రాష్ట్ర కార్యదర్శి అంజిరెడ్డి, సభ్యులు ఆనందం, లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అనంతగిరి: వికారాబాద్లో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు ఖర్జురా ఇచ్చి ఉపవాస దీక్షను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎండీ హఫీజ్, కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేశ్కుమార్, నాయకులు రంగరాజు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: పాంబండ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పాంబండ ఉత్సవ కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పాండు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ మహేశ్వర్రెడ్డి మొయినాబాద్: రాష్ట్ర సాధనకోసం చేసిన ఉద్యమాలను వృథా కానివ్వమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ యాలల మహేశ్వర్రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్వహించనున్న ‘చలో గన్పార్క్ మిలియన్ మార్చ్’ కార్యక్రమానికి ఉద్యమకారులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఉద్యమ మహిళలకు సన్మానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకుడు కేబుల్ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి రమేష్, మండల అధ్యక్షుడు మహిపాల్, ఉద్యమకారులు సుభాష్ చంద్రబోస్, ముకుందరెడ్డి, బన్సీలాల్, మధు, వెంకటరత్నం, అరవింద్, నవీన్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో చేరిక
మీర్పేట: రాష్ట్రంలో బీజేపీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. బడంగ్పేట సర్కిల్ జిల్లెలగూడ మాజీ ఉప సర్పంచ్, మాజీ కార్పొరేటర్ మేకల విజయలక్ష్మీ రవీందర్రెడ్డి దంపతులు వారి అనుచరులతో కలిసి ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రామచందర్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలపడుతోందని, త్వరలోనే ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, జిల్లెలగూడ డివిజన్ అధ్యక్షుడు ముఖేష్ ముదిరాజ్, స్థానిక నాయకులు గాజుల మధు, సిద్దాల శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, ఉదయ్కుమార్ ఉన్నారు. -
రెడ్ అలెర్ట్
● ఆస్తి పన్ను కట్టని వారికి నోటీసులు ● వసూలుపై స్పెషల్ ఫోకస్ తాండూరు: మున్సిపల్ యంత్రాంగం ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేసింది. మరో మూడు వారాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ప్రభుత్వానికి మున్సిపల్ ఆదాయం, ఖర్చులు లెక్క చూపాలి. కాగా మున్సిపాలిటీకి ప్రధానంగా వచ్చే ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్ యంత్రాంగం వెనుకబడింది. ఇప్పటి వరకు కేవలం 40 శాతం ఆస్తి పన్ను మాత్రమే వసూలు చేసింది. గతంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే బిల్కలెక్టర్లు పన్నులు వసూలు చేసి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వంత శాతం లక్ష్యాన్ని చేరుకున్న ధాఖలాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం వసూళ్లలో వెనుకబడడంతో సిబ్బంది పనితీరుపై మున్సిపల్ కమిషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పన్ను కట్టకుంటే రెడ్ నోటీస్ తాండూరు మున్సిపాలిటి ప్రక్షాళనకు పాలకవర్గం అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని రాబట్టుకుని అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులను సమకూర్చేందుకు సిద్దమవుతోంది. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల సమయంలో మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్రెడ్డి పాలన వ్యవహారాలను చక్కబెడుతున్నారు. బకాయిదారులు పన్ను చెల్లించకపోతే మున్సిపల్ చట్టం–2019 ప్రకారం ఆస్తులు జప్తు చేస్తామని రెడ్ నోటీసులను జారీ చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో 14,750 ఆవాసాలున్నాయి. ప్రతి ఏటా ఆస్తి పన్నుల రూపంలో మున్సిపాలిటికి రూ.9.82కోట్ల ఆదాయ లక్ష్యం ఉంది. అందులో ఇప్పటి వరకు రూ.2.88 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశారు. ఇంకా రూ.6.94 కోట్ల పన్నులను వసూలు చేయాల్సి ఉంది. పన్ను వసూళ్లలో రెవెన్యూ అధికారి, ఆర్ఐ, బిల్ కలెక్టర్లు. వార్డు అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ విభాగంలో సిబ్బంది అవినీతి నిరోధక శాఖకు లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్కు గురయ్యారు. దీంతో రెండు మూడు నెలల పాటు పాలన వ్యవహారాలు స్తంభించాయి. అనంతరం మున్సిపల్ అధికారుల బదిలీలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వరుసగా రావడంతో ఆస్తి పన్ను వసూళ్లకు ఆటంకం కలిగింది. బకాయిదారులు ఆస్తిపన్నులు చెల్లించి సహకరించాలి. మున్సిపల్ రెవెన్యూ విభాగం నుంచి బిల్ కలెక్టర్లు పన్నుల వసూలుకు వార్డులకు వస్తారు వారికి బిల్లులు చెల్లించాలి. ఆన్లైన్ సదుపాయం కూడా కలదు. ఈ నెల 31వ తేదీ నాటికి పన్ను చెల్లించకపోతే 2 శాతం అదనపు పన్నుతో పాటు చక్రవడ్డీ వసూలు చేస్తాం. – మధుసూదన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తాండూరు -
సీఎం కప్ పోటీల్లో దినేశ్ సత్తా
రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు సిల్వర్ మెడల్స్ బొంరాస్పేట: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో బాపల్లితండాకు చెందిన యువకుడు ఎం.దినేశ్ సత్తాచాటాడు. ఈ నెల 3 నుంచి 6వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించిన సీఎంకప్ రాష్ట్రా స్థాయి పారా పోటీల్లో వంద మీట ర్ల పరుగుపందెం, జావలిన్త్రో, క్రికెట్లో రన్నరప్టీంలో సభ్యుడిగా ఉత్తమ ప్రతిభ కనబరిచి మూడు వెండి పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆదివారం సర్పంచ్ కోమల్, నాయకులు తారాసింగ్, రతన్నాయక్, చందర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి తాండూరు టౌన్: భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎస్ఎఫ్ఐ తాండూరు డివిజన్ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు మోడల్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్లో మీరు సాధించాల్సిన ఉన్నత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికారాదని, ఇన్ని రోజులు చదివిన ప్రశ్న జవాబులను ఏకాగ్రతతో రివిజన్ చేసుకోవాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఎస్ఎఫ్ఐ ఎల్లవేళలా ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రకాశ్, రాజు పాల్గొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి నాంపల్లి: మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని హరియాణ రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఆదివారం పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తెలుగు వర్సిటీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... సమాజంలో మహిళల పాత్ర విస్మరించలేనిదని అన్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విశిష్ట అతిథి ఈస్ట్ ఇండియా అగరపుడ్ కంపెనీ చైర్మన్ యామినేని ఉప్పల్ రావు మాట్లాడుతూ... ప్రతి మహిళా ఆర్థిక స్వాతంత్య్రురాలు కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందించిన 25 మంది మహిళలకు విమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో లుక్ అప్ ట్రెంజ్ డైరెక్టర్ కాంతిరేఖ, పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ చైర్మ న్ అద్దంకి రాజా యోనా, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు బాల్సన్ నాయక్ పాల్గొన్నారు. కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కడ్తాల్– అన్మాస్పల్లి రహదారిపై చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలివీ.. మండలంలోని గానుగుమార్లతండాకు చెందిన ఇస్లావత్ ఘాంస్య(47) ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై తండా నుంచి కడ్తాల్ వస్తున్నాడు. అదే సమయంలో కడ్తాల్ నుంచి అన్మాస్పల్లి వెళ్తున్న ఓమ్నీ కారు పోచమ్మ గడ్డతండా వద్ద ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఘాంస్యకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘హర్ ఘర్ జల్’గా కొండాపూర్ఖుర్దు
● డీపీఓ జయసుధ ● ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చాం: ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఈఈ రవికుమార్ ధారూరు: మండల పరిధిలోని కొండాపూర్ఖుర్దును హర్ ఘర్ జల్ గ్రామంగా ఆర్డబ్ల్యూఎస్, గ్రిడ్ అధికారులు ప్రకటించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు గ్రామంలో ఆదివారం జల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వాతి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం, సరఫరా చేస్తున్న నీటిని సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారికి జయసుధ మాట్లాడుతూ.. జల్ జీవన్ గ్రామంలోని అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామన్నారు. నీటి అవసరం, గ్రిడ్ ద్వారా వచ్చే నీటి స్వచ్ఛత, తాగునీటి సరఫరాలో స్వచ్ఛత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఈఈ రవికుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో 1.20 కిలోమీటర్ల పైప్లైన్ వేయించి 116 ఇళ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. గ్రామంలో నిర్మించిన ఆర్డబ్ల్యూఎస్ ఆస్తులను పంచాయతీకి అప్పగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ గ్రిడ్ ఈఈ సురేశ్కుమార్, పంచాయతీ కార్యదర్శి విజయరాణి, గ్రామస్తులు దయాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణ పనుల్లో నాణ్యత తప్పనిసరి
దుద్యాల్: ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నాణ్యత నియంత్రన ఎస్ఈ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని హకీంపేట్ శివారులో కొనసాగుతున్న ఎడ్యుకేషన్ హబ్లో కొనసాగుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా స్కూల్, వెటర్నరీ ఆస్పత్రి, సైనిక్ స్కూల్కు సంబంధించిన హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ కేఎల్ఎస్ఆర్ ప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఎడ్యుకేషన్ హబ్ సుపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ విజయవర్ధన్ రెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ ఈఈ నాగేశ్వర్ రావు, రాజయ్య, ఏఈ విజయ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఈ సుదర్శన్ రెడ్డి -
బాలికలకు వరం.. ‘హెచ్పీవీ’
బషీరాబాద్: గర్భాశయ ముఖద్వార కేన్సర్ నియంత్రణకు హెచ్పీవీ వ్యాక్సిన్తో చెక్ పెట్టొచ్చని బషీరాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం హెపీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలపాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బాలికలు తమ ఆధార్కార్డు తీసుకుని వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత నెల రోజులకు రెండో డోసు, ఆరు నెలల తర్వాత మూడో డోసు ఉంటుందని చెప్పారు. హెచ్పీవీ వ్యాక్సిన్ బాలికలకు వరమన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి డాక్టర్ గోపాల్, ఉప సర్పంచ్ అబ్దుల్ రజాక్, స్టాఫ్ నర్స్ గీత, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. బషీరాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్ గౌడ్ -
వీడని పీఠం ముడి
ఇబ్రహీంపట్నం: ‘పట్నం’ మున్సిపల్ పీఠంపై చిక్కుముడి ఇంకా వీడడం లేదు. హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా అన్న చర్చ సర్వత్రా కొనసాగుతోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను గరిష్టంగా నాలుగు వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు గత మంగళవారం (3వ తేదీ) రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. వారం రోజులు కావస్తున్నా ఎన్నిక వ్యవహారంపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలు కొలువుదీరినా ఇక్కడ మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ పీఠంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఎన్నికకు అడ్డంకిగా మారింది. ఆకుల యాదగిరి తిరుగుబాటుతో రచ్చ ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరుగ్గా 13న ఫలితాలు వెలువడ్డాయి. మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఒక వార్డు నుంచి ఇండిపెండెంట్ గెలుపొందారు. ఫలితాలు వెలువడిన వెంటనే కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. 16న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగాల్సి ఉండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగరి తిరుగుబాటుతో వ్యవహారం రచ్చరచ్చగా మారింది. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారానికి ఆకుల యాదగిరి హాజరుకాకపోవడం.. కిడ్నాప్ చేశారని వారి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడం.. వారికి మద్దతుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు జతకట్టడంతో ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడింది. తిరిగి 17న జరిగిన సమావేశానికి ఆకుల యాదగిరి హాజరైనప్పటికీ వారి కుటుంబసభ్యులు న్యాయస్థానానికి వెళ్లడం.. స్టే ఇవ్వడం తదితర పరిణామాల నేపథ్యంలో ఎన్నిక మళ్లీ మొదటికే వచ్చింది. కోర్టులు, ఫిర్యాదుల పర్వం ఇక అక్కడి నుంచి వ్యవహారమంతా కోర్టులు, ఫిర్యాదుల పర్వంతో గడిచింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేశారని, మూడు పోలింగ్ కేంద్రాలల్లో ఓటు హక్కు ఉందని బీఆర్ఎస్ కౌన్సిలర్లు నీలం శ్వేత, బుగ్గరాములుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రత్యర్థులు, కాంట్రాక్టర్గా పనులు చేసుకుంటూ కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచిన రాఘవేందర్రావు పదవికి అనర్హుడంటూ బీజేపీకి చెందిన ప్రత్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. నేనే చైర్మన్ అంటూ.. మరోవైపు తానే మున్సిపల్ చైర్మన్ అంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శన్రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 17న జరిగిన సమావేశంలో తనను చైర్మన్గా మెజార్టీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారని, అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో కోర్టు స్టే ఇచ్చిందనే నెపంతో ఉద్దేశపూర్వకంగా రిటర్నింగ్ అధికారి పెండింగ్లో పెట్టారంటూ వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలు రాకముందే ఎన్నిక జరిగినందున తననే చైర్మన్గా ప్రకటించాలని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కోర్టు తీర్పు ఏమొస్తుందో, ఎలా ఉంటుందో, ఎవరికి అనుకూలంగా వస్తుందోనని ఎదురుచూస్తున్న తరణంలో మూడు లేదా గరిష్టంగా నాలుగు వారాల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఉలుకూపలుకు లేదాయె.. కోర్టు ఆదేశాలు జారీ చేసి వారం సమీపిస్తున్నా ఎన్నికల అధికారుల నుంచి ఎలాంటి ఉలుకూపలుకు లేదు. అనిశ్చిత పరిస్థితులు అలాగే నెలకొన్నాయి. న్యాయస్థానం ఆదేశించింది కాబట్టి గడువులోపు తప్పక ఎన్నిక నిర్వహిస్తారనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు వివాదాలు, గొడవలు, గందరగోళ పరిస్థితులు అన్నీ సర్దుకుపోయి సాఫీగా ఎన్నిక ప్రక్రియ ముగుస్తుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్పై అదే ఉత్కంఠ హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా..? వారం గడిచినా ఎన్నిక నిర్వహణపై వెలువడని ప్రకటన తప్పని ఎదురుతెన్నులు ఎప్పటికి పూర్తవుతుందోననిసర్వత్రా చర్చ మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తేదీని ఎప్పుటిలోగా ప్రకటిస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏమేర తిప్పికొడుతుందోననే చర్చ నడుస్తోంది. పట్టణంలో ఏ నలుగురు కలిసినా మున్సిపల్ రాజకీయంపైనే ముచ్చటించుకుంటున్నారు. ఆకుల యాదగిరి మినహా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, వారికి మద్దతిస్తున్న ఒక బీజేపీ, మరో స్వతంత్ర కౌన్సిలర్లు ఇంకా క్యాంపుల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపును వదిలి బయటకు వచ్చారు. ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటివరకు ఎన్నికపై నోరుమెదపలేదు. ఎప్పుడు ఎన్నిక జరుగుతుందో.. ఈ వ్యవహారం ఎప్పుడు ముగుస్తుందో వేచిచూడాల్సిందే. -
చెత్తగా చూడొద్దు.. సొత్తుగా వాడాలి
బొంరాస్పేట: పంచాయతీల్లో సేకరించి డంపింగ్యార్డులలో పోగు చేస్తున్న చెత్తను ఉపయోగించుకునే ఉపాయాలెన్నో ఉన్నాయని, వాటిని సొత్తుగా వాడాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్బాబు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ప్రజాపాలన ప్రజా ప్రణాళికలో భాగంగా ఆదివారం ఆయన మండల సందర్శన చేశారు. మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం మండల పరిధిలోని రేగడిమైలారంలో డంపింగ్యార్డును పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్మికులు వాహనం ద్వారా నిత్యం సేకరిస్తున్న చెత్తపై ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచి ఎరువుగా వాడే చెత్తను వేరుచేయాలన్నారు. ప్లాస్టిక్ చెత్తను పోగుచేసి విక్రయించాలన్నారు. నిరుపయోగ చెత్తను కాలుష్యం లేకుండా చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీడీఓ వెంకన్గౌడ్, ఎంపీఓ రవి, స ర్పంచ్ చిట్టెమ్మ, ఉపసర్పంచ్ దాసరి చంద్రప్ప, కాంగ్రెస్ నాయకులు వెంకట్రెడ్డి, గుండప్ప, ప్రసాద్గౌడ్, విశ్వనాథం తదితరులున్నారు. అదనపు కలెక్టర్ సుధీర్బాబు -
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
మొయినాబాద్: ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లోని 5వ వార్డు కౌన్సిలర్ సన్వెల్లి అమరేందర్రెడ్డి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ముస్లింలకు సోదరులకు పవిత్ర మాసమన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరేందర్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలును సైతం అమల్లోకి తెచ్చారు. ఆడపిల్ల పెళ్లికి రూ.51 వేలు, ఆడపిల్ల పుడితే రూ.11 వేల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాణయ్య తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎంపీ రంజిత్రెడ్డి -
బోరు మోటార్లవిద్యుత్ తీగ అపహరణ
దుద్యాల్: వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల విద్యుత్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు అహరించారు. ఈ సంఘటన మండల పరిధి పోలేపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత రైతులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త ఎల్లప్ప, రెబ్బని యాదయ్య, కొత్త వెంకట్రాములు, బోయిని అంజిలయ్యలు బోరు బావుల కింద వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రైతులకు చెందిన మోటార్ల కరెంట్ వైరు సుమారు 100 మీటర్లు చోరీకి గురైంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సౌకర్యాల కల్పనపై శ్రద్ధ చూపాలి దోమ: విద్యార్థుల చదువుతో పాటు సౌకర్యాల కల్పనపై అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీసీడీఓ శ్రీదేవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ప్రత్యేకాధికారి శైలజతో కలసి పరిసరాలు, స్టోర్రూమ్, వంట గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించేలా చూడాలన్నారు. వైద్యసేవలు అభినందనీయం కుల్కచర్ల: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని పుట్టపహాడ్ సర్పంచ్ బోయిని అంజిలయ్య అన్నారు. శనివారం గ్రామంలో ‘ఔషధి హోమియోపతి క్లినిక్’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు.. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యురాలు సాయికీర్తి, ఉప సర్పంచ్ శాస్త్రి, మాజీ వైస్ ఎంపీపీ రాజశేఖర్, నాయకులు హరినాథ్ రెడ్డి, గోపాల్, పాష తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్లకు సన్మానం తాండూరు: బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లను శనివారం ఆ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింహులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 9న జరిగే కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, గద్దే శ్రీనివాసచారి, నరేందర్గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు
తుర్కయంజాల్: మితి మీరిన వేగం, నిద్ర మత్తులో కారును డ్రైవింగ్ చేస్తుండటంతో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ రహదారిపై రాగన్నగూడలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 5 గంటలకు పాటిగూడకు వెళ్లే దారి వద్ద ఉన్న ఓ ఇనుప విద్యుత్ స్తంభాన్ని క్రెటా కారు నడుపుతున్న వ్యక్తి బలంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా స్తంభం కింద కూలి రోడ్డుపై పడింది. దీనికి ఉన్న తీగలు కూడా తెగిపోయాయి. వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సరఫరాను నిలిపివేశారు. నిత్యం రద్దీతో ఉండే సాగర్ రహదారిపై తెల్లవారుజామున జన సంచారం తక్కువగా ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కారును నడుపుతున్న వ్యక్తి అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మరో యువకుడికి తీవ్ర గాయాలు చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నవాబుపేట మండలం ఎత్రాజ్పల్లి గ్రామానికి చెందిన పామేన వెంకటేశ్, మనీలా దంపతులు. వారి కుమారుడు వినీల్(19) చిన్నపప్పటి నుంచి చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి లోని అమ్మమ్మ ఇంట్లో మేనమామ కరికె సత్యనారాయణ వద్ద ఉంటున్నాడు. నగరంలో మోకానిక్గా పనిచేస్తున్నాడు. శనివారం దేవునిఎర్రవల్లి నుంచి స్నేహితుడు అభిలాష్తో కలిసి బైక్పై వస్తున్నాడు. మండలంలోని పామెన గేట్ వద్దకు రాగానే ఓ కారు రివర్స్ తీసుకుంటుండగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు ఎగిరి కింద పడిపోయారు. వినీల్ అక్కడిక్కడే మృతి చెందగా అభిలాష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు, ఇతర స్నేహితులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వినీల్ అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన అభిలాష్ను మెరుగైన చికిత్సకోసం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


