breaking news
Vikarabad District Latest News
-
సాగు కళకళ
● పొలం బాటలో అన్నదాతలు ● వరినాట్లు వేసేందుకు కరిగెట్లు ● ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి అన్నదాతలు పొలం బాట పట్టారు. ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతులను వరుణుడు కరుణించాడు. దీంతో వరి నాటు వేసేందుకు కరిగెట్లు చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు కళకళలాడుతున్నాయి. – షాబాద్ నరెడ్లగూడలో పత్తి పంట మల్లారెడ్డిగూడలో కళకళలాడుతున్న మొక్కజొన్న -
సమన్వయంతో పనిచేయండి
నవాబుపేట: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ సుధీర్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్షాసమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, ఆర్అండ్బీ, ఉద్యాన, ఎకై ్సజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, వెటర్నరీ తదితర శాఖల అధికారులతో మాట్లాడి ఆయా విభాగాల పురోగతిని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఈఓ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధకారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. వీబీజీరాజ్జీ పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్అండ్బీ ఏఈ సుస్మిత సభలో నివేదికను వివరిస్తుండగా.. ఆర్అండ్బీ రోడ్లు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఎందుకు నిర్మించడం లేదని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొండల్ యాదవ్ ప్రశ్నించారు. రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కాలె యాదయ్య చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదన్నారు. ఈవిషయంపై దాతాపూర్ సర్పంచ్ బల్వంత్రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్యే గ్రామాలను అభివృద్ధి చేశారని, రోడ్ల నిర్మాణం కూడా జరుగుతోందని చెప్పడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు, అధికారులు కలగజేసుకొని ఇద్దరికీ నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మండల ప్రత్యేక అధికారి కవిత అధ్యక్షతన, ఎంపీడీఓ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంఈఓ అబ్దుల్ రహమాన్, ఎంహెచ్ఓ రోహిత్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్రెడ్డి, ఎంపీఓ విజయ్కుమార్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించండి జెడ్పీ సీఈఓ సుధీర్ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష -
చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు
కుల్కచర్ల: అదుపు తప్పిన కారు చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల్కచర్లకు కారులో వస్తుండగా ముందు టైరు పేలడంతో రోడ్డు కిందకు వేగంగా దూసుకెళ్లింద. వాహనంలోని ఇద్దరు పిల్లలకు స్వల్పగాయాలయ్యాయి. రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం హుజూర్నగర్: మార్కెట్లో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ డీఏపీ దందాకు తెరలేపారు. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ డీఏపీని తయారు చేసి అక్కడి నుంచి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రైతులకు నకిలీ ఎరువు బస్తాలు వస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈనెల 15న మఠంపల్లి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు రఘునాథపాలెంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యాపారి దగ్గర నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మఠంపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో ఇద్దరు పిచ్చిరెడ్డి ఇచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్మెట్లోని జగదీష్ అలియాస్ జక్కప్ప, ఆనంద్ రావుకు సంబంధించిన తయారీ కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ 1000 డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షించగా.. నకిలీదని తేలింది. దీంతో రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి, వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామానికి చెందిన పొలే వెంకటేశ్వర్లు, ఏపీలోని కర్నూలు పట్టణానికి చెందిన పింజారి మౌలాలి, జోగులాంబ గద్వాల జిల్లాలోని లింగనవాయి గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్, కర్నాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లా దేవరౌప్పరి తాలూకా మానూర్ గ్రామానికి చెందిన హీర్లకొండ సంతోష్ కుమార్, మఠంపల్లి మండలం బక్కమంతుగూడేనికి చెందిన పింగళి గంగామహేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి డీసీఎం, ఓ కారు, ఐదు సెల్ఫోన్లు, వివిధ కంపెనీల లేబుల్ కలిగిన నకిలీ డీఏపీ బస్తాలు, నకిలీ ఎరువు మందులు తయారు చేయడానికి వాడిన మిషన్, నకిలీ పాస్పేట్, దాదాపు రూ.2 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్, జగదీశ్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐలు ప్రవీణ్, నవీన్, ఏఎస్ఐ బలరాం రెడ్డి, సిబ్బంది శంభయ్య, నాగరాజును అభినందించారు. షాబాద్: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన నాగరగూడ ఎక్స్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగరగూడ ఎక్స్ రోడ్డు వద్ద షాద్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును శంషాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారికి నాగరగూడ శ్రీనివాస ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన నామ మమత, శంషాబాద్ మండలం సుల్తాన్పల్లికి చెందిన శిరీష, మరో ఇద్దరు ఉన్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట చేవెళ్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్గుప్తా ఉన్నారు. షాద్నగర్: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నందిగామ సీఐ వీరబాబు అన్నారు. శుక్రవారం నందిగామ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. 80 వాహనాలు తనిఖీ చేసి 53 వాహనాలకు పెండింగ్లో ఉన్న చలాన్లను క్లియర్ చేయించారు. ఎనిమిది మంది వాహనదారులకు స్పాట్ చలాన్లు విధించారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వీరబాబు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టామన్నారు. -
గుప్త నిధుల పేరిట మోసం!
బషీరాబాద్: గుప్తనిధి ఆశ చూపించాడు.. ఇంటి ఆవరణలో కోట్ల విలువైన నిధి దాగి ఉందంటూ నమ్మించాడు. ప్రత్యేక పూజలు, తంత్రాలు చేస్తే అది బయటపడుతుందని చెప్పాడు. ఇందుకోసం విడతలవారీగా రూ.8 లక్షలు వసూలు చేసి, మాయమయ్యాడు. నమ్మకంగా వల.. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా జీవన్గీకి చెందిన ఇద్దరు వ్యక్తులకు గతేడాది ఆగస్టులో హైదరాబాద్ దూల్పేట వాసి లక్ష్మణ్సింగ్ హజారీ పరిచయమయ్యాడు. అతీంద్రియ శక్తులు కలిగిన బాబాగా తనకు తాను చెప్పుకొన్నాడు. ఒకరోజు జీవన్గీకి వచ్చి ఓ ఇంటిని పరిశీలించిన సదరు బాబా.. ఇంట్లో కోట్ల విలువైన బంగారు నిధి ఉందని, ప్రత్యేక పూజలు, మంత్రాలతో వెలికి తీస్తానని నమ్మించాడు. ఆతర్వాత నిధికి నాగబంధం ఉందని, దాన్ని తొలగించేందుకు ప్రత్యేక హోమాలు, అరుదైన పూజా సామగ్రి అవసరమని చెప్పాడు. ఇందుకోసం దశలవారీగా ఇద్దరి నుంచి సుమారు రూ.8 లక్షలు వసూలు చేశాడు. మట్టి కుండతో మాయాజాలం ఓ రోజు నిధిని బయటకు తీస్తానని చెప్పిన బాబా.. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి, ఎవరినీ రావొద్దన్నాడు. అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించి, తవ్వకాలు చేపట్టి ముందుగానే పాతిపెట్టినట్లు అనుమానిస్తున్న ఓ మట్టి కుండను వెలికి తీశాడు. అందులో నుంచి ఓ బంగారు రంగున్న బిల్లను చూపించి నిధి బయటపడిందని చెప్పాడు. దీంతో తవ్వకాలు చేయించినవారు ఎంతో సంతోషించారు. అయితే నాగబంధం పూర్తిగా తొలగిపోలేదని, వారం రోజుల్లో తిరిగి వచ్చి, ప్రత్యేక పూజల అనంతరం పూర్తి నిధిని అప్పగిస్తానని, అప్పటి వరకు కుండను ఎవరు తాకినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఆరోజు నుంచి నకిలీ బాబా తిరిగిరాలేదు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కుండను తెరిచి చూడగా అందులో 78 బంగారు రంగు బిళ్లలను గుర్తించారు. వీటిని కర్ణాటకలోని ఓ బంగారం వ్యాపారి వద్దకు తీసుకెళ్లి పరీక్షించగా నకిలీవని తేలడంతో మోసపోయామని గుర్తించి లోలోపలే మదనపడ్డారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎలాగైనా తమను మోసగించిన బాబాను పట్టుకోవాలని పలుమార్లు దూల్పేట్లోని అతని ఇంటికి వెళ్లినా ఆచూకీ లభించలేదు. అతడి భార్య దివ్యభాయి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లిందని చుట్టుపక్కల వారు చెప్పడంతో బాధితులు నిరాశగా తిరిగి వచ్చినట్లు సమాచారం. గుప్తనిధులు తవ్వించిన ఇద్దరు వ్యక్తులు.. బాబాకు సమర్పించిన రూ.8 లక్షల్లో.. మరికొంత మంది వద్ద తీసుకున్న డబ్బులు కూడా ఉన్నాయి. నిధి దొరికిన తర్వాత పెద్దమొత్తంలో తిరిగిస్తామని చెప్పడంతో వారు కూడా సరేనన్నారు. కానీ, ఏడాది కావస్తున్నా ఇచ్చిన డబ్బులైనా చేతికి అందకపోవడంతో సదరు వ్యక్తుల ఇళ్లకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. బాబా ఎవరో తమకు తెలియదని, మిమ్మల్ని నమ్మి ఇచ్చాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈవిషయం ఈనోటా ఆనోటా బయటకు పొక్కింది. ఇద్దరి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసిన నకిలీబాబా జీవన్గీలో నాటకీయంగా వెలుగుచూసిన ఘటన -
రైతుల త్యాగం గుర్తుండిపోతుంది
● భూ సేకరణకు సహకరించాలి ● బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ● తాండూరు ఆర్డీఓ అనితబొంరాస్పేట: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములిచ్చే రైతుల త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తాండూరు ఆర్డీఓ అనిత అన్నారు. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలువ నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు రూ.20 లక్షల చొప్పన నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. శుక్రవారం మండలంలోని చౌదర్పల్లి భూ సేకరణలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 1,400 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 900 ఎకరాలు, బొంరాస్పేట మండలంలో 200 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి, నీటూరు, మాటూరు, కొడంగల్ మండలం పెద్దనందిగామ, దుద్యాల్ మండలం గౌరారం, హంసాన్పల్లి, బొంరాస్పేట మండలం చౌదర్పల్లి, తుంకిమెట్ల తదితర గ్రామాల మీదుగా కాలువ వెళ్తుందన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. భూగర్భ జలాలు పెరిగి సస్యశ్యామలం అవుతుందన్నారు. భూములు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, ఇరిగేషన్ అధికారి కృష్ణమోహన్గౌడ్, ఆర్ఐ శిరీష, సర్పంచ్ కల్పనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పట్నం కుటుంబానికి పరామర్శ
షాబాద్: శాసన మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌర్ పరామర్శించారు. మహేందర్రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనరెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రమేశ్మహరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధూసూదన్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, పామెన భీంభరత్, కాలె శ్రీకాంత్, పెంటారెడ్డి, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పరిగి: తెలంగాణ ఉద్యమకారుల రెండు తరాల అపూర్వ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సమ్మేళనం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 16న నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల న్యాయమైన హక్కులు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించడం స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు నక్క రమేష్, సురేష్, రహీం, పీర్మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు: మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. పది రోజుల పాటు వర్జీనియా రాష్ట్రంలో పర్యటించనున్నారు. లీస్బర్గ్లోని స్టోన్ టవర్ వైనరీని పరిశీలించారు. వైనరీల తయారీ విధానం, ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అనంతగిరి: జర్నలిస్టుల సమస్యలు, ఇళ్ల స్థలా ల సాధన కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్143) ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం సాగిస్తామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చి న హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయా లని డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్లో జిల్లా అడహక్ కమిటీ సన్నాహక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాల కేటాయించాలన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా నూతన అడహక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్గా ఎం.రవీందర్, కోకన్వీనర్లుగా ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నర్సింలు, ఆనంద్, జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ, రాజేందర్ గౌడ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాఽ దికారి యేగానంద్, జాతీయ కౌన్సిల్ స భ్యుడు తిరుపతినాయక్, కన్వీనర్ ఆసీఫ్ హు స్సేన్, జిల్లా నాయకులు రవీందర్, ఆసీఫ్ ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నర్సింలు, ఆనంద్, జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ పాల్గొన్నారు. ఘన సన్మానం అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సే వలే చిరకాలం నిలిచిపోతాయని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ఉద్యోగ విరమణ పొందన చంగోముల ఎస్ఐ చంద్రయ్య, డీసీఆర్బీ ఎస్ఐ అబ్దుల్ గఫార్, బషీరాబాద్ ఏఎస్ఐ చంద్ర శేఖర్, నవాబ్పేట్ పీఎస్ కానిస్టేబుల్ ఇర్షాద్ అలీని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. -
చివరికి చిక్కారు
చోరీబాట పట్టారు..ఇబ్రహీంపట్నం రూరల్: తాళాలు పగులగొట్టి ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను ఆదిభట్ల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏసీపీ ప్రదీప్రెడ్డి, సీఐ రమేష్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం జుజువార్ గ్రామానికి చెందిన ముకేష్ చౌదరి (35) హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటూ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గతంలో యాప్రాల్లో హార్డ్వేర్ దుకాణం నిర్వహించిన అతను చెడు అలవాట్లకు లోనై వ్యాపారంలో నష్టాలు రావడంతో చోరీబాట పట్టాడు. అతనిపై పీడీయాక్ట్ కూడా నమోదైంది. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన చోరీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.ఆరు లక్షల విలువైన బంగారం, 30 తులాల వెండి అభరణాలు, మొబైల్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయా పోలీస్స్టేషన్లలో 17 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు బైక్ దొంగల అరెస్టు పార్కింగ్ చేసిన బైక్లను దొంగిలిస్తున్న యువకులను ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్ ఖాసీం హుస్సేన్ (18), మహమ్మద్ కరీమ్ (19) బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. నిందితులను శుక్రవారం ఆదిభట్ల, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన ఎస్ఐ నోయల్రాజ్, క్రైమ్టీం ఎల్.రవికుమార్, కిరణ్రెడ్డి, ఎల్లయ్య, ఉపేందర్రెడ్డి, సందీప్, శివచంద్ర, సంతోష్కుమార్, సంతోష్, భరత్కుమార్గౌడ్ను ఏసీపీ అభినందించారు. ఆయా కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్టు బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
ఆయిల్ పామ్తో స్థిర ఆదాయం
చేరువైన దూరవిద్య! చదువు మానేసి, చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా దూరవిద్య అందనుంది.● రైతులు మొగ్గు చూపాలి ● త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ● కలెక్టర్ దీపక్ తివారి పరిగి: ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని, రైతులు మొగ్గు చూపాలని కలెక్టర్ దీపక్ సూచించారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్పూర్ తండాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను, అంతర పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందజేస్తోందని తెలిపారు. త్వరలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిగి మండలంలో వెయ్యి ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారుల సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్(ట్రైయినీ) సచిన్ బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుడిగాలి పర్యటన బొంరాస్పేట: మండలంలో శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారి పర్యటించారు. బొంరాస్పేట్ పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాల, పూరిళ్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. వంటలను తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం తుంకిమెట్ల శివారులో గల రెండు ఎకరాల భూమిని కేటాయించాలని తహసీల్దార్ పద్మావతికి సూచించారు. నాగిరెడ్డిపల్లిలో పూరింట్లో ఉన్న వారిని పలకరించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, డీటీడీఓ జనార్దన్, ఇంచార్జ్ ఎంపీడీఓ వెంకన్గౌడ్, వైద్యాధికారి హేమంత్కుమార్, హెచ్ఎం విక్రమంసింగ్, వార్డన్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచండి దుద్యాల్: హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ఎస్సీ స్నేహమెహ్రతో కలసి ఎడ్యుకేషన్ హబ్లో పర్యటించారు. నర్సింగ్ కళాశాల, పార మెడికల్, ఫిజియోతెరపీ, వెటర్నరీ హాస్పిటల్, మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న వనరులు సరిపోకుంటే మరిన్ని యంత్రాలు సమకూర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు కంటే ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్(ట్రైయినీ) సచిన్ బస్వరాజ్ గుట్టూర్ తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● రోగులకు మెరుగైన వైద్యం అందాలి ● డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ దోమ: పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులు, ఆస్పత్రి గదులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో పెరిగిన గడ్డిని సిబ్బందితో కలిసి తొలగించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రజిత, సర్పంచ్ మాలిష్ శివకుమార్ రెడ్డి, హెచ్ఈఓ ప్రభులింగం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని స్కైలార్క్ డయాగ్నస్టిక్స్ సెంటర్ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ శుక్రవారం తనిఖీ చేశారు. ప్రయోగశాల, మౌలిక వసతులు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. -
పనుల్లో వేగం పెంచండి
● బ్రహ్మోత్సవాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కావాలి ● సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనుల్లో వేగం పెంచాలని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు అన్నారు. శుక్రవారం కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కొడంగల్లో పర్యటించారు. శ్రీవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలను గమనించారు. పనుల్లో పురోగతి సాధించాలని కాంట్రార్లకు సూచించారు. అనంతరం కడా కార్యాలయంలో ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీ, ప్లానింగ్ డిజైనర్స్, కాంట్రాక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేయాలన్నారు. సంప్రదాయ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, ప్రత్యేక అవసరాల గదులు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు నిర్మించాలన్నారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ట్రైయినీ అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా, ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్, డీఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ డీఏపీ పట్టివేత
తాండూరు రూరల్: నియోజకవర్గంలో నకిలీ డీఏపీ కలకలం రేపుతోంది. ఇప్పటికే పరిగి, యాలాల మండలాల్లో నకిలీ డీఏపీని వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. శుక్రవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో నకిలీ డీఏపీ పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కరన్కోట్ పోలీసులు 89 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు ఏడీఏ అరుణ, పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం గ్రామంలోని పలువురి రైతుల ఇళ్లల్లో తనిఖీ చేశారు. 89 బస్తాలను స్వాధీనం చేసుకొని కరన్కోట్ పోలీస్స్టేషన్కు తరలించారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజు, ఆత్కూర్కు చెందిన శివకుమార్ వీటిని విక్రయించినట్లు తేలింది. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన సూత్రధారి పెద్దేముల్ వాసి జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయించడంలో పెద్దేముల్ గ్రామానికి చెందిన పోల రాజుగా పోలీసులు గుర్తించారు. పరిగి, యాలాల కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. చెంగోల్లో దాదాపు 200 బస్తాలు విక్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం 89 బస్తాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన 111 బస్తాలను రైతులు పొలాల్లో వరి, పత్తి పంటలకు వాడినట్లు అధికారులు గుర్తించారు. రైతులు నకిలీ డీఏపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏడీఏ అరుణ, మండల అధికారి కొమురయ్య సూచించారు. ● 89 బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ● చెంగోల్లో ఘటన -
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది
అనంతగిరి: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. వికారాబాద్ మండలం సిద్దులూర్ జెడ్పీహెచ్ఎస్ జీహెచ్ఎం రామకృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పదన్నారు. విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. రామకృష్ణారెడ్డి ఎక్కడ విధులు నిర్వహించినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. విద్యార్థులతో మమేకమై విద్యాబుద్ధులు నేర్పించారని కొనియాడారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, మున్సిపల్ వైస్చైర్మన్ సుధాకర్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్, సీనియర్ నాయకులు కిషన్నాయక్, ఎండీ హఫీజ్, సిద్దులూర్ సర్పంచ్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బాదం అనురాధ అశోక్, రమ్య శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ -
‘ఫీజు’ బకాయిలు చెల్లించాలి
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ ● ఆర్డీఓ కార్యాలయం ముట్టడి తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ మాట్లాడారు. ఏళ్ల తరబడిగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కళాశాల యాజమాన్యాలకు చెల్లించకపోవడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే బకాయి పడిన రూ.8 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మధులత, జిల్లా నాయకులు వెంకటేష్, వీరమణి, బస్వరాజ్, జోసఫ్, రాజుగౌడ్, పరమేష్, తాండ్ర నరేష్, రాజు, రాము, కిరణ్, పలు కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
హడల్!
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026సీజనల్..వికారాబాద్: సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి. జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులతో ప్రజలు మంచాన పడుతున్నారు. అంటువ్యాధులతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరోచనాలతో చేరుతున్న వారి సంఖ్యలో క్రమంగా పెరుగుతోంది. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వందకుపైగా ఓపీ నమోదు అవుతోంది. ఇందులో 50కి పైగా సీజనల్ వ్యాధుల బారిన పడిన వారే ఉన్నారు. పది మందికి పైగా వాంతులు, విరేచనాలతో చేరుతున్నారు. వికారాబాద్ జనరల్ ఆస్పత్రిలో 400 పైగా ఓపీ నమోదు అవుతోంది. వందకు పైగా సీజనల్ వ్యాధులతో చేరుతున్నారు. ఓపీలో 50 వరకు వాంతులు విరేచనాలతో వస్తున్న వారు ఉంటున్నారు. పది మందికి పైగా అడ్మిట్ అవుతున్నారు. ఇంతకు రెండు మూడు రెట్లు ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. చికన్గున్య, మలేరియా, టైఫాయిడ్ తదితర రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఫీవర్ సర్వే నిర్వహించగా వందల సంఖ్యలో రోగులు మంచం పట్టినట్టు తేలింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,77,452 ఇళ్లకు వెళ్లి 4,82,798 మందికి చెందిన శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహించారు. ఇందులో 1,980 జ్వర పీడితులు ఉన్నారు. డెంగీ కేసులు మూడు నమోదయ్యాయి. గురువారం రాత్రి వాంతులు విరేచనాలతో ఓ మహిళ మృతి చెందింది. నవాబుపేట మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి కాంతమ్మ వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పడకేసిన పారిశుద్ధ్యం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండగా.. పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ప్రస్తుతం వరుసగా వర్షాలు కురుస్తుండటంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. మున్సిపాలిటీల్లో చెత్త సక్రమంగా సేకరించడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా డంప్ చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధంతోపాటు దోమలు, ఈగలు పెరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. గతంలో పట్టణ ప్రగతి పేరుతో హడావిడి చేసిన మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల సమయంలో వీధుల్లో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెద్దేముల్ మండలం మంబాపూర్ బీసీ గురుకుల పాఠశాల గేటు ముందు మురుగు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పలు సార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం నిత్యం పదుల సంఖ్యలో చేరుతున్న రోగులు జిల్లాలో నమోదైన ఫీవర్ కేసులు 1,980 డెంగీ కేసులు 3 వాంతులు విరేచనాలతో మహిళ మృతి రోజురోజుకూ పెరుగుతున్న పారిశుద్ధ్య సమస్య జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వాటి పరిధిలోని చాలా కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఇళ్ల మధ్య మురుగు చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడంతో పందులు సంచరిస్తున్నాయి. అధికరులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. -
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం
● బీజేవైఎం జిల్లా నేత సాయిచరణ్రెడ్డి ● ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలకు డిమాండ్ తాండూరు టౌన్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయిచరణ్రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. మూడేళ్లుగా రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఎంతో మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, కౌన్సిలర్ కిరణ్ ముదిరాజ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు తాండ్ర నరేష్, నాయకులు శోభన్, శ్రీనివాస్, హర్షవర్ధన్రెడ్డి, మంజునాథ్రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసేవను అదృష్టంగా భావించాలి
● లయన్స్ క్లబ్ ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి ● నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కొడంగల్: పేదలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించాలని కొడంగల్ లయన్స్ క్లబ్ ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని రాఘవేంద్ర గార్డెన్స్లో లయన్స్ క్లబ్ 37వ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న గురునాథ్రెడ్డి, నటరాజ్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. కొడంగల్లో కంటి ఆసుపత్రి నిర్మించడానికి కృషి చేయాలన్నారు. స్థలం కేటాయిస్తే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకునే అవకాశం ఉందన్నారు. కొడంగల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత కంటి వైద్య శిబిరాలు, ఉత్తమ సేవకులకు నన్మానాలు, మొక్కలు నాటడం, వినికిడి యంత్రాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ.. 2026– 27లో తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. ఇన్స్టాలేషన్ అధికారిగా డాక్టర్ శశికాంత్, ఇండక్షన్ ఆఫీసర్గా మృత్యుంజయ, చైర్మన్గా ముద్దప్ప దేశ్ముఖ్ వ్యవహరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు దాసప్ప యాదవ్, భీమన్న గౌడ్, రాంరెడ్డి, వెంకట్రెడ్డి దేశ్ముఖ్, శ్రీకిషన్రావు, శివకుమార్ గుప్త, మిఠాయిరాజు, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ఐనన్పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. పట్టణ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రవీంద్రయాదవ్, కార్యదర్శిగా డాక్టర్ సాకేత్, కోశాధికారిగా ముర హరి వశిష్టను లయన్స్క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా గురువారం రాత్రి వీరు ప్రమాణ స్వీకారం చేశారు. కొడంగల్ లయన్స్ క్లబ్లో కొత్తగా ఏడుగురు సభ్యులు చేరారు. -
వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి
కోట్పల్లి ఎస్ఐ శైలజ బంట్వారం: వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోట్పల్లి ఎస్ఐ శైలజ తెలిపారు. గురువారం ఆమె ఠాణాలో విలేకరులతో మాట్లాడారు. ఉధృతంగా పారే వాగులు, వంకలు దాడకూడదన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చిన్నపిల్లలు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించే వారిని గుర్తించి ఖాళీ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు సరికాదు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ మొయినాబాద్: పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ తీరు ‘ఒడెక్కే వరకు ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అనే చందంగా ఉందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాలె శ్రీకాంత్ అన్నారు. గురువారం మొయినాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భీంభరత్, మాజీ ఎంపీ రంజిత్రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి పనిచేయడంతోనే దర్శన్ సతీమణి సోనియాకు మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కిందన్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే యాదయ్యపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించి, పరిష్కరించుకోవాలని అంతేకానీ బహిరంగ వేదికలపై విమర్శలు చేయడగం తగదని హితవుపలికారు. -
ధారూరులో భారీ వర్షం
● వాగులు, చెరువులకు జలకళ ● హర్షం వ్యక్తంచేస్తున్న అన్నదాతలు ధారూరు: మండలంలో బుధవారం 10.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా గురువారం 4.02 సెంటీమీటర్ల వర్షం కురిసిందని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. ప్రమాదకరమైన వాగులు, కాల్వలను దాటొద్దని సూచించారు. భారీ వానలు కరుస్తున్న నేపద్యంలో అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దన్నారు. వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతన్నలకు భారీ వాన ఊరటనిచ్చింది. తుఫాను ప్రభావంతో కురిసిన కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నీటి వనరులైన కోట్పల్లి ప్రాజెక్టుతో పాటు అల్లీపూర్, ఎబ్బనూర్, మున్నూరుసోమారం, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్తండా, అంపల్లి, గురుదోట్ల, నాగారం, రాజాపూర్, కేరెళ్లి తదితర గ్రామాల్లోని చెరువుల్లో నీరు చేరి జలకళను సంతరించుకున్నాయి. -
పెండింగ్ 36,676
తాండూరు నియోజకవర్గంలో యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కోట్పల్లి(సగం) తాండూరు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 90 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. తాండూరు మున్సిపాలిటీలో మాత్రం భారీగా తగ్గింది. ఇక్కడ 70 పోలింగ్ కేంద్రాలు.. 73,959 మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియలో 50,991 మంది మాత్రమే ఫారాలు ఇచ్చారు. 22,968 మంది ఎన్యూమరేషన్కు దూరంగా ఉన్నారు. సొంత గ్రామాల్లో నమోదు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు ఆయా రాజకీయ పార్టీ నాయకులు భావిస్తున్నారు. తాండూరు: నియోజకవర్గంలో భారీగా ఓట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. సర్ గడువు సమీపిస్తున్నా వేలాది మంది ఎన్యూమరేషన్కు దూరంగా ఉన్నారు. ఓటరు జాబితా నుంచి సుమారు 36,676 మంది పేర్లు తొలగనున్నట్ల సమాచారం. ఇవి డబుల్ ఓట్లా.. లేకుంటే వలస ఓటర్లా, మరణించిన వారా అనేది తేలాల్సి ఉంది. తాండూరు మున్సిపల్ పరిధిలో 36 వార్డుల్లో సర్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నియోజకవర్గంలో 269 పోలింగ్ బూత్లు.. 2,52,235 మంది ఓటర్ల కోసం బీఎల్ఓలు ఎన్యూమరేషన్ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 2,15,559 మంది ఫారాలను పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేశారు. ఇందులో 1,82,804 మంది ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. మరో 36,676 మంది ఎన్యూమరేషన్కు దూరంగా ఉన్నారు. 33 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం ఎన్యూమరేషన్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఎన్యూమరేషన్కు దూరంగా వేలాది మంది ఓటర్లు తాండూరు మున్సిపాలిటీలో భారీగా తగ్గనున్న ఓట్లు 33 పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి మండలం పోలింగ్ బూత్ ఓటర్లు డిజిటలైజేషన్ పెండింగ్ శాతం పెద్దేముల్ 46 41326 38,304 3,022 92.69 కోట్పల్లి 8 6,315 5,817 498 92.11 తాండూరు (మం) 50 46,983 41,197 5786 87.68 తాండూరు అర్బన్ 70 73,959 50,991 22,968 68.94 యాలాల 48 42,331 39,272 3.059 92.77 బషీరాబాద్ 47 41,321 39,978 1,343 96.75 మొత్తం 269 2,52,235 2,15,559 36,676 85.46 -
అభివృద్ధిలో సర్పంచ్లే కీలకం
డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి కేశంపేట: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలకపాత్ర పోషించాలని డీఆర్డీఓ పీడీ, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి రమాదేవి అధ్యక్షతన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లతో పాటుగా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మండల స్థాయి సమావేశంలో సర్పంచ్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను మళ్లీ నిర్వహించే మండల స్థాయి సమావేశం లోపు పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇంటింటికి ఇంకుడుగుంతలను నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీటి సరాఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. జలసిరి పథకంలో భాగంగా రైతులు వ్యవసాయ పొలాల్లో ఫాంపాండ్లు నిర్మించుకోవాలలని చెప్పారు. అనంతరం కేశంపేట, అల్వాల గ్రామాల్లో విబిజీ రామ్జీ పథకంలో భాగంగా ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీఓ దయానంద్, విద్యుత్ ఏఈ ఈశ్వర్, పంచాయతీరాజ్ ఏఈ నర్సింగ్రావు, ఎంపీఓ అజీజ్, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
నాలుగు కిలోమీటర్లు మట్టే..
బంట్వారం: మండల పరిధిలోని మాద్వాపూర్– కోట్పల్లి లింక్ రోడ్డు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది. నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న మట్టి రోడ్డుతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు జంకుతున్నారు. మాద్వాపూర్ నుంచి కోట్పల్లి వెళ్లేవారు సల్బత్తాపూర్ మీదుగా వెళ్తే ఎక్కువ దూరం అవుతుందని ఈమార్గాన్నే ఆశ్రయిస్తుంటారు. ప్రతీ సోమవారం కోట్పల్లిలో నిర్వహించే సంతకు వెళ్లి సరుకులు, కూరగాయలు తెచ్చుకుంటారు. రోడ్డు బురదమయం కావడంతో కాలినకడన కోట్పల్లి వెళ్తున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈమార్గంలో బీటీ వేయాలని కోరుతున్నారు. -
చేప పిల్లల అంచనాలు సిద్ధం
వికారాబాద్: చేప పిల్లల పంపిణీకి మత్స్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకూలంగా ఉన్న చెరువులను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనుమతులు రాగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది. జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా 779 చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. 1.29 కోట్ల చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువుల్లోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఆగస్టు మొదటి రెండో వారంలో చేప పిల్లలు వదిలే అవకాశం కనిపిస్తోంది. లక్ష్యానికి దూరంగా పంపిణీ చెరువుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోతోంది. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే వదిలి చేతులు దులుపుకొంటున్నారు. ఈ ఏడాది అయిన చెరువుల్లో సరిపడా చేపపిల్లలు వదలాలని మత్స్య సహకరా సంఘాలు కోరుతున్నాయి. నాసిరకం పిల్లలు ఏటా నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మూడు నుంచి నాలుగు ఇంచులు ఉండాల్సిన పిల్ల ఒక ఇంచుకు మించి ఉండటంలేదని తెలిపారు. గతంలో ఇలాంటి వాటిని మత్స్యకారులు వెనక్కు పంపారు. అధికారులతో గొడవలు కూడా జరిగాయి. లక్ష చేప పిల్లల వదిలితే అందులో 50వేలు కూడా బతకడం లేదని తెలిపారు. సైజు కూడా రావడం లేదన్నారు. ఈ సారైనా. అధికారులు దృష్టి సారించి నాణ్యమైన చేపపిల్లలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చేరిన నివేదిక జిల్లాలో మొత్తం చెరువులు 1,179 చేపలు వదిలేందుకు ఎంపిక చేసినవి 779 మత్స్య సహకార సంఘాలు 152, సభ్యులు 5,665 మందిజిల్లాలోని చెరువుల ఆధారంగా ఎన్ని చేప పిల్లలు అవసరం అనే దానిపై అంచనాలు సిద్ధం చేశాం. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపాం. ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. అనుమతులు రాగానే టెండర్ ప్రక్రియను ప్రారంభించి చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తాం. – వెంకయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి -
సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్గా అరుంధతి
షాద్నగర్: ఉమ్మడి జిల్లా సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్గా ఫరూఖ్నగర్ మండలం నాగులపల్లికి చెందిన అరుంధతి ఎన్నికయ్యారు. మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పని చేస్తున్న ఆమె ఇటీవల నిర్వహించిన బోర్డు ఎన్నికల్లో విజయం సాధించారు. గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ కుల్కచర్ల: చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ అన్నారు. గురువారం మండలంలోని సాల్వీడు గ్రామంలో పర్యటించారు. అధికారులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం కింద కాలనీకి రూ.1.72 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందుకు అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ సంధ్యారాణి, పంచాయతీ కార్యదర్శి హర్శద్ తదితరులు పాల్గొన్నారు. యాలాల: రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన 43 బస్తాల నకిలీ డీఏపీని అధికారులు పట్టుకున్నారు. గురువారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల వ్యవసాయ అఽధికారి శ్వేతరాణి తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్లో నకిలీ డీఏపీ రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రాచూరి ఆశన్న, శంకిరి బిచ్చప్ప ఇంట్లో నిల్వ ఉన్న 43 నకిలీ డీఏపీ బ్యాగులను గుర్తించారు. వీటిని పెద్దేముల్ మండలానికి చెందిన పోల రాజు అనే వ్యక్తి విక్రయించినట్లు గుర్తించామన్నారు. నకిలీ డీఏపీ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఇలా విక్రయించే వారి విషయంలో వ్యవసాయ శాఖ, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి కుల్కచర్ల: ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు నష్టపోకుండా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మాలె కృష్ణయ్య, రైతుబంధు మాజీ అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ మాజీ డైరక్టర్ కొండయ్య, నాయకులు మహేశ్వరం రాములు, జనార్దన్ రెడ్డి, మొగులయ్య, బిచ్చయ్య, సత్యయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
● దరఖాస్తులకు చివరి తేదీ ఆగష్టు 6 ● 8నుంచి తరగతుల ప్రారంభం ● మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ కొడంగల్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశంతో పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ తెలిపారు. గురువారం కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు కృషిచేయాలని తెలిపారు. ఉచిత శిక్షణ శిబిరంలో చేరేందుకు ఆగష్టు 06వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగష్టు 8వ తేదీలోపు ఆధార్కార్డు జిరాక్స్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఇంటర్, డిగ్రీ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లు కడా కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇదే రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు. అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ అందజేస్తామని, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఈవెంట్స్ తదితర అంశాలపై పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుందన్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, కర్నూల్ తదితర ప్రాంతాలకు చెందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
వానలే వానలు
మండలం వర్షపాతం మర్పల్లి 20 మోమిన్పేట్ 29.8 నవాబుపేట 29 వికారాబాద్ 37.1 పూడూరు 43.4 పరిగి 33.3 కుల్కచర్ల 36.7 దోమ 24.3 బొంరాస్పేట్ 42.8 ధారూరు 42 కోట్పల్లి 19.6 బంట్వారం 13.8 పెద్దేముల్ 32.8 తాండూరు 29.2 బషీరాబాద్ 49.8 యాలాల 43.1 కొడంగల్ 37.6 దౌల్తాబాద్ 43.2 చౌడాపూర్ 30 దుద్యాల్ 36.8వికారాబాద్: రెండు రోజుల క్రితం ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. జన జీవనం స్తంభించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వస్తోంది. వాగులు తీవ్ర రూపం దాల్చడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో ఆరు మండలాల్లో 40 మిల్లీ మీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. రెండు రోజుల క్రితం వరకు 15 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా ప్రస్తుతం అధికం, అత్యధిక వర్షపాతం నమోదైంది. అప్రమత్తమైన యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. 50కి పైగా ప్రమాద ప్రదేశాలను గుర్తించి వాటి వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. వానలు తగ్గే వరకు ఎవరూ బయటకు రావొద్దని, ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధారూరు మండలం కోట్పల్లి ప్రాజెక్టుకు, పరిగి మండలం లఖ్నాపూర్కు, యాలాల మండలం జుంటుపల్లి, శివసాగర్, వికారాబాద్ మండలం శివారెడ్డిపేట్ ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. దెబ్బతిన్న రోడ్లు కాగ్నా, మూసీ, ఈసీ నదులు ఉధృతగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు పొలాల్లోకి వెళ్ల లేని పరిస్థితి నెలకొంది. ● ధారూరు మండలం దోర్నాల, రుద్రారం, నాగసముందర్, పరిగి, గొడుగోనిపల్లి, గెర్గేట్పల్లి మార్గాల్లో వాగులు తీవ్ర రూపం దాల్చాయి. పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ● వికారాబాద్ – పరిగి మార్గంలో చిట్టెంపల్లి వద్ద తాత్కాలిక రోడ్డుకు గండి పడింది.అధికారులు, పోలీసులు మరమ్మతులు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. నవాబుపేట మండలం మూలమడ వాగుపై గల బ్రిడ్జికి ఓ వైపు గండి పడటంతో పోలీసులు దగ్గరుండి మరమ్మతులు చేయించారు. ● తాండూరు నియోజకవర్గంలో కగ్నా పరవళ్లు తొక్కుతోంది. బషీరాబాద్, యాలాల, తాండూరు మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ● భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 8712670056 లేదా డయల్ 100కు కాల్ చేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పారుతున్న వాగులు, వంకలు చెరువుల్లోకి చేరుతున్న వరదనీరు పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం పలు మండలాల్లో లోటు నుంచి అధిక వర్షపాతం -
మానవ అక్రమ రవాణా నేరం
అనంతగిరి: మానవ అక్రమ రవాణాను అరికడదామని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి కాంతారావు అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం వికారాబాద్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి తీవ్రమైన ముప్పన్నారు. అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. మానవ అక్రమ రవాణా వల్ల మహిళలు, చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలు, బాధితులకు అందుబాటులో ఉన్న రక్షణ, పునరావాస సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం అవగాహన వాల్ పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఎల్ఎస్ ఏ వెంకటేశం, కార్యక్రమ ఇంచార్జి సీఐ అన్వర్ పాషా , సీడీపీఓ శ్రీలత, మెప్మా కోఆర్డినేటర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి కాంతారావు -
సింధూరం వెంకటేశ్కు ఉత్తమ పురస్కారం
దౌల్తాబాద్: మండలంలోని సురాయిపల్లి గ్రామానికి చెందిన రచయిత సింధూరం వెంకటేష్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో అవార్డు తీసుకున్నారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల అప్పగింత ధారూరు: చోరీకి గురైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని గురువారం బాధితులకు అప్పగించామని ధారూరు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్, ధారూరు మండలం దోర్నాల్తండాకు చెందిన రవీందర్, నాగర్కర్నూల్కు చెందిన శ్రీశైలంకు సెల్ఫోన్లు అందజేశామని స్పష్టంచేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు విక్రయించే ఫోన్లను కొనుగోలు చేయొద్దని తెలిపారు. విద్యుత్ షాక్తో పాడి గేదె మృతి బొంరాస్పేట: విద్యుత్ షాక్తో ఓ గేదె మృతిచెందిన ఘటన రేగడిమైలారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న నర్సిరెడ్డికి చెందిన రూ.70 వేల విలువచేసే పాడి గేదె గురువారం మేతకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఊరి శివారులోని మహాదేవుని ఆలయం వెనక ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈశ్వరప్ప సేవలు అభినందనీయం బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు కుల్కచర్ల: ఆలయాల అభివృద్ధికి బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప చేస్తున్న సేవ ఎంతో అభినందనీయమని పార్టీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఈశ్వరప్ప లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను పరిరక్షించుకోవడం, అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందన్నారు. మన చరిత్రకు మూలం ఆలయాలే అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, మాజీ సర్పంచ్ సౌమ్యారెడ్డి, నాయకులు మైపాల్, చందు, భీమయ్య, కర్ణయ్య, సురేందర్, ప్రవీణ్, చంద్రకాంత్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల భవనాన్ని పూర్తి చేయాలి ఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్ షఫీమియా దౌల్తాబాద్: మండల కేంద్రంలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని ఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్ షఫీమియా ఆదేశించారు. గురువారం భవన నిర్మాణ పనులను పరిశీలించా రు. పనులు ఎంత మేరకు జరిగాయి.. ఇంకా పెండింగ్ ఉన్నవి ఏమిటని ఆరా తీశారు. సీఎం సూచనల మేరకు దౌల్తాబాద్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ విజయ్భాస్కర్రెడ్డి, డీఈ శ్రీనివాసులు, నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
‘కోట్పల్లి’కి వరద
● 21.5 అడుగులకు చేరిన నీటి మట్టం ధారూరు: మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు క్రమంగా నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో గురువారం నాటికి 21.5 అడుగుల మేర నీరు చేరింది. కాలువలు సరిగ్గా లేక గత ఏడాది జూలై నెలలో చుక్కనీరు రాలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాల్వలకు నీరు వదలకపోవడంతో ప్రాజెక్టులో 18 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. మరో 2.5 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. ఆధునీకరణ పనులు పూర్తయితే తప్ప రబీ పంటలకు నీరు అందే అవకాశం లేదు. పనుల్లో వేగం పెంచి సాగుకు నీరందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
ప్రమాదాలకు మార్గం!
తాండూరు రూరల్: పెద్దేముల్ రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి, ప్రమాదకరంగా తయారైంది. రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాండూరు నుంచి సంగారెడ్డికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. ఈ మార్గంలో తాండూరు నుంచి అంతారం, కందనెల్లితండా, గాజీపూర్, బుద్దారం, పెద్దేముల్ మీదుగా సంగారెడ్డికి వెళ్తుంటారు. ఈరూట్లో బుద్దారం బ్రిడ్జి నుంచి పెద్దేముల్ కొత్త బస్టాండ్ వరకు రహదారి పూర్తిగా ధ్వంసమైంది. గాజీపూర్ బ్రిడ్జి బురదమయం గాజీపూర్ వాగు వద్ద కొద్ది సంవతర్సాల క్రితం కొత్త బిడ్జ్రి నిర్మించారు. దీనికి ఇరువైపులా బీటీస వేయకుండా మట్టి నింపి వదిలేశారు. దీంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా బురదమయమవుతోంది. మనోహార్రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి 30 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి వద్ద బీటీ వేయించడంలేదని గాజీపూర్వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిధులు మంజూరు చేయాలి మద్వాపూర్ నుంచి కోట్పల్లికి వెళ్లే మట్టి రోడ్డును బీటీగా మార్చాలి. ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. వర్షాకాలం ముగిసే వరకూ కనీసం కంకర రోడ్డయినా వేస్తే వాహనదారులకు కొంత సౌకర్యం కలుగుతుంది. – ప్రభు, మద్వాపూర్ అధ్వానంగా పెద్దేముల్, మాద్వాపూర్– కోట్పల్లి రహదారులు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు పట్టించుకోని పాలకులు, అధికారులు త్వరలో మరమ్మతులు గుంతలమయమైన పెద్దేముల్ రోడ్డుకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్)కింద ప్రభుత్వం తాండూరు నుంచి కోట్పల్లి వరకు 25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.74 కోట్ల 71 లక్షలు మంజూరు చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. – శ్రవణ్, డీఈ, ఆర్అండ్బీ శాఖ -
మాపై ఎందుకీ వివక్ష?
బషీరాబాద్: కొంతమంది అధికారులు తమపట్ల వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ సర్పంచ్లు, ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అంతకుముందు కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ మండల పరిషత్ సూపరింటెండెంట్ విజయకుమారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది తమ గ్రామాలకు సంబంధించిన ఏఒక్క పనిని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదని ఆరోపించారు. కంప్యూటర్ ఆపరేటర్లు మొదలుకుని ఎంపీడీఓ వరకు బీఆర్ఎస్ సర్పంచ్లను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ పనులకు సంబంధించిన చెక్కులను నెలల తరబడి ఆన్లైన్ చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా జీపీల చెక్కులు క్లియర్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందంచడం లేదని, ఆఫీసుకు వెళ్లి అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, సర్పంచులు పాండురంగారెడ్డి, నవీన్కుమార్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, బసప్ప, జైపాల్రెడ్డి, కృష్ణకుమార్తో పాటు నాయకులు రంగారెడ్డి, వడ్డీ శ్రీనివాస్, శ్రీనివాస్, వెంకట్రెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్లో ఒక్క పని కూడా కావడం లేదు చెక్కుల క్లియరెన్స్లో నెలల తరబడి జాప్యం చేస్తున్నారు బీఆర్ఎస్ సర్పంచ్లు, నాయకుల ఆవేదన ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా -
శరవేగంగా డిజిటలైజేషన్
● ఇప్పటి వరకు 83శాతం ప్రక్రియ పూర్తి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 10,17,671 ఓటర్లకు గాను ఇప్పటి వరకు 7,96,005 డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు. 83 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. 1,13,092 ఏఎస్డీ(ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్) ఓటర్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రదర్శించడం జరిగిందన్నారు. జాబితాలో ఏవైనా సమస్యలు ఉంటే రాజకీయ పార్టీ ప్రతినిధులు, బూతు స్థాయి ఏజెంట్లు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఆగస్టు 3వ తేదీ నాటికి 100 శాతం పూర్తి చేసేలా అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1,200 మంది ఓటర్లు ఉంటే అదనంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటు అనేది చాలా ముఖ్యమని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎస్ఐఆర్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్ఓ స్వర్ణలత, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్ వెంకటాచారి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జెడ్పీ సీఈఓ సుధీర్, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చన్గోముల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
● ప్రజాసంఘాల నేతల డిమాండ్ ● బాధితుడిపైనే కేసు నమోదు చేశారని ఆందోళన బొంరాస్పేట: దళితుడి భూమి ఆక్రమణకు సహకరిస్తూ బాధితుడిపైనే కేసు నమోదు చేసిన పూడూరు మండలం చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొంరాస్పేటలో గురువారం వారు మాట్లాడుతూ.. పూడూరు మండల సోమన్గుర్తి గ్రామానికి చెందిన దళిత రైతు జైదుపల్లి నర్సింలుకు చెందిన సర్వే నం.120లో 1.35 ఎకరాల్లోని 30గుంటల భూమిని ఏసీఈ టైర్స్ కంపెనీ యాజమాన్యం ఆక్రమించిందన్నారు. దీనిపై విచారణ చేయకుండా స్థానిక ఎస్సై దళిత రైతుపై కేసు పెట్టారని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ఆక్రమించిన భూమిని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుడి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నర్సింలు, ప్రజాసంఘాల నాయకులు రమేశ్, మొగులయ్య, రాములు, ఎల్లప్ప, వెంకటయ్య, నరేశ్, ప్రవీణ్, రాంచందర్ తదితరులు ఉన్నారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
కుల్కచర్ల: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన కుల్కచర్ల స్టేషన్ను సందర్శించారు. దొంగతనాలు, చిన్నారులు, వృద్ధులపై దాడులు జరగకుండా ప్రత్యేక కార్చాచరణతో ముందుకుసాగాలన్నారు. సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం చౌడాపూర్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమన్నారు. కారక్రమంలో పరిగి సీఐ కొండల్ రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చౌడాపూర్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంగా ఏర్పడి ఐదేళ్లు కావస్తున్నా చౌడాపూర్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయలేదని వెంటనే చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బీ వెంకటేష్ కోరారు. చౌడాపూర్కు వచ్చిన పరిగి డీఎస్పీకి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ -
ఆర్టీసీపై నమ్మకం పెంచండి
తాండూరు టౌన్: సమయానుకూలంగా బస్సులు నడిపిస్తూ ప్రయాణికులకు ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచాలని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం ఆమె డిప్యూటీ రీజినల్ మేనేజర్ సరస్వతితో కలిసి తాండూరు డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమయ్యారు. డిపో నుంచి రోజు వారీగా తిరుగుతున్న బస్సులు, ఆదాయం, ఖర్చులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కను నాటి మాట్లాడారు. మహాలక్ష్మి పథకం ఉచిత టికెట్లతో పాటు, నగదు టికెట్ల జారీపై దృష్టి సారించాలన్నారు. విధుల పట్ల బాధ్యత, క్రమశిక్షణతో మెలిగితే డిపో లాభాల బాటలో నడుస్తుందన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఆర్టీసి సిబ్బంది ఉన్నారు. ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ అధికారులు టీజీ ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్ఎం సరస్వతి, డీఎం ప్రవీణ్ కుమార్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, మహాలక్ష్మి పథకం ఆటంకం లేకుండా కొనసాగేలా చూడాలని ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులకు సూచించారు. తాండూరు డిపో ఎదుట తొలగించిన డబ్బాల స్థానంలో త్వరితగతిన స్టాల్స్ నిర్మించి చిరు వ్యాపారులకు అప్పగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. డిపోలోని పలు సమస్యలను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టీజీ ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి -
అభివృద్ధి పేరిట భూముల కబ్జా
తాండూరు టౌన్: అభివృద్ధి పేరిట ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళిత, పేద రైతుల భూములు కబ్జాకు పాల్పడుతున్నారని.. ఇట్టి భూమికి భూమి ఇవ్వాల్సిందేనని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు బాధిత రైతులతో కలిసి తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాలాల మండలం దౌలాపూర్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 73లో చెన్నారం, దౌలాపూర్కు చెందిన 11 మంది దళిత, వడ్డెర కులస్తులకు 25 ఎకరాల భూమిని 1980లో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరిట రైతులకు సమాచారం లేకుండా సాగు భూమల నుంచి ఎర్రమట్టి తరలిస్తున్నారన్నారు. ఎలాంటి నష్టపరిహారం ఇప్పించకుండా రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దళితుల భూములను సాగుకు పనికిరాకుండా చేయడం దారుణమని, భూమికి భూమి లేదా వెంటనే నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, పలు సంఘాల నాయకులు చంద్రయ్య, గుమ్మడి రత్నం, చంద్రమ్మ, అంజిలమ్మ, వెంకటయ్య, మన్యప్ప, బాలరాజ్, సత్యమ్మ, అమృతమ్మ తదితరులు ఉన్నారు.కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య -
31న అథ్లెటిక్స్ సెలక్షన్స్
తాండూరు టౌన్: వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన తాండూరులో బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు, సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రాములు, రాము మంగళవారం ఓసంయుక్త ప్రకటనలో తెలిపారు. తాండూరులోని పాత శాలివాహన మైదానంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఉదయం 8.30 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. బాలబాలికలకు అండర్ 6, 8, 10, 12 విభాగాల్లో 60 మీటర్లు, 150, 200, 300, 400ల మీటర్ల రన్నింగ్ పోటీలు, బ్రాడ్ జంప్, లాంగ్ జంప్, అండర్ 14, 16, 20 విభాగాల్లో జావెలిన్ త్రో, అండర్ 18 విభాగంలో రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తహసీల్దార్చే జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. వివరాలకు 99513 43432, 63000 75229 నంబర్లలో సంప్రదించాలన్నారు. సీఆర్పీఎఫ్ జిల్లా కన్వీనర్ శివరాజ్ అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి తాగునీటి వసతి కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక(సీఆర్పీఎఫ్) జిల్లా కన్వీనర్ శివరాజ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం కళాశాలకు భవనం మంజూరైనప్పటికీ నేటికీ నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. గతేడాది కలెక్టర్ చొరవ తీసుకుని అయిదు గదులు పూర్తిచేయించారన్నారు. కళాశాలలో వసతులు లేక 600 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా స్పందించి కళాశాలలో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీఆర్పీఎఫ్ ఉపాధ్యక్షుడు నాగరాజ్, శ్రీనివాస్ ఉన్నారు. తాండూరు టౌన్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన సంఘం సభ్యులతో కలిసి మున్సిపల్ కమిషనర్ రాకేశ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు పేదరికంలో మగ్గుతున్నారని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం తాండూరు ప్రధాన కార్యదర్శి పి.నర్సింలు, నాయకులు అశోక్, లాలప్ప, వెంకటేశ్, వెంకటప్ప తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ మర్పల్లి: సర్ ప్రక్రియను గడువు లోపు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కట్మర్పల్లి గ్రామంలో బూత్ లెవల్ అధికారులు చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సర్పంచ్ అధక్షతన గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమీక్షలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు తప్పని సరిగా సర్ ఫారం పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్, నాయకులు రాములుయాదవ్, మహేష్, బూత్ లెవల్ పార్టీ శ్రేణులు, అధికారులు ఉన్నారు. -
నిష్పక్షపాతంగా సర్వే
విద్యార్థుల్లేక.. మూతబడి గొల్లగూడలో గ్రామంలో విద్యార్థుల కొరత కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మూతపడింది.కొడంగల్ రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మంగళవారం ఆయన పట్టణంలోని కడా కార్యాలయంలో కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుడిసెల్లో నివసిస్తున్న వారి గుర్తింపునకు ప్రత్యేక సర్వే చేపట్టి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా సర్వేలో మిగిలిపోకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ జాబితాలను సిద్ధం చేయాలన్నారు. అనంతరం కొడంగల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జెడ్పీ సీఈఓ సుధీర్, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, హౌసింగ్ పీడీ ముక్రమ్బాబా, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ఎంపీడీఓ ఉషశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 220 పడకల ఆస్పత్రి సమావేశం హాలులో జిల్లాలోని ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పాము, కుక్క కాటుకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. త్వరితగతిన వైద్యం చేయాలి: ఎమ్మెల్యే ప్రభుత్వ ఆస్పత్రులను దేవాలయాలుగా భావిస్తూ రోగులకు త్వరితగతిన వైద్య సేవలందించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. తాండూరు మెడికల్ కళాశాల రెండేళ్ల అనంతరం హకీంపేటకు తరలిస్తారని అప్పటి వరకు తాండూరులోనే కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. సెప్టెంబర్లో ప్రారంభించాలి: నందారం 220 పడకల ఆస్పత్రిని సెప్టెంబర్ చివరి వరకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్కుమార్ అన్నారు. కొడంగల్ ఆస్పత్రికి వచ్చే రోగులను తాండూరు, వికారాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేయంకుడా అన్ని వసతులు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది, పరికరాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్స్పాల్ రాజు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, టీడీఆర్ఐ ఎంఏ ప్రెసిడెంట్ జయప్రసాద్, టీజీఎంఈ ఐడీసీ ఈఈ రామ్మోహన్రెడ్డి, డీఎంహెచ్ఓ సుధాకర్లాల్, ఆర్ఎంఓలు సునీల్, రవీంద్రయాదవ్, పీహెచ్సీ సూపరింటెండెంట్ చంద్రప్రియ, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, డాక్టర్ పద్మ సాకేత్ పాల్గొన్నారు. ఎకోపార్కు పనుల పరిశీలన బొంరాస్పేట్: కొడంగల్ రేంజ్ పరిధిలోని బొంరాస్పేట్లో ఏర్పాటు చేస్తున్న ఏకో పార్క్ పనులను మంగళవారం కలెక్టర్ దీపక్తివారి పరిఽశీలించారు. ఈ పార్క్కు రూ.5.65 కోట్ల నిధులు మంజూరవగా.. ఇప్పటి వరకు రూ.40లక్షలు మాత్రమే ఖర్చు చేశారని అధికారులు కలెక్టర్కు వివరించారు. దీంతో ఆయన పనులను వేగిరం చేయాలని సూచించారు. ఆయన వెంట కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, వికారాబాద్ అటవీ శాఖ అధికారి విశాల్, బాత్తుల, ఐఎఫ్ఎస్ విజయ్ కుమార్, కొడంగల్ ఎఫ్ఆర్ఓ రమేశ్, బొంరాస్పేట్ ఎఫ్ఎస్ఓ కార్తీక్ రెడ్డి ఉన్నారు. కలెక్టర్ దీపక్తివారి -
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
కడ్తాల్/షాద్నగర్ రూరల్: భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ షాద్నగర్ 16వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి బుధవారం తీర్పునిచ్చినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. వివరాలు.. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెంది వల్లపుడాస్ స్వరూప, శ్రీనివాస్ భార్యాభర్తలు. వీరు మండల పరిధిలోని కర్కల్పహాడ్ శివారులోని ఓ ఫాంహౌస్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ స్వరూపను తరుచూ వేధించేవాడు. 2023 జూన్ 11న రాత్రి దంపతులు గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్య స్వరూపను హత్య చేసి పరారయ్యాడు. 2023 జూన్ 12న సమాచారం అందుకున్న అప్పటి సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో షాద్నగర్ 16 వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి స్వాతిరెడ్డి నిందితుడు శ్రీనివాస్కు జీవిత ఖైదుతో పాటు, రూ.5 వేలు జరిమానా విధి స్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారుల అభినందనలు హత్య కేసు దర్యాప్తులో సమర్థవంతంగా పనిచేయడంతో పాటు, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన సీఐలు ఉపేందర్, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, ఎస్ఐ హరిశంకర్గౌడ్, కానిస్టేబుల్స్ సుమిత్ర, దివ్యవాణిలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. -
ఆయిల్పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్ దుద్యాల్/బొంరాస్పేట్: ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎంఏ సత్తార్ అన్నారు. మంగళవారం ఆయన దుద్యాల్, బొంరాస్పేట్ మండలాల్లో పర్యటించారు. దుద్యాల్ మండలం పల్లెగడ్డకు చెందిన వెంకట్రెడ్డి, బొంరాస్పేట్ మండలానికి చెందిన వెంకటరాములు గౌడ్ ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందన్నారు. రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసి రైతులను ప్రోత్సహింస్తోందని.. ఆసక్తి ఉన్నవారు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. దుద్యాల్ మండలంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుండడం ఇక్కడి రైతుల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ ఉద్యన అధికారి సురేంద్రనాథ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
పరిగి: ప్రజాప్రభుత్వం అభివృద్ధి, రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దోమ మండలం గూడూరు, దొంగఎన్కేపల్లి, కుల్కచర్ల మండలంలోని అల్లాపూర్ గ్రామాల పరిధిలో రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. 66 ఎకరాల భూమికి రూ.16.227 కోట్ల పరిహారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సహకరిస్తున్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ పారదర్శకంగా మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందజేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయమన్నారు. పరిగి ప్రాంతప్రజలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథిపంతులు, కాంగ్రెస్ దోమ మండల అధ్యక్షుడు శాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.60 లక్షలు ఇస్తే ఓకే
● ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఈర్లపల్లి రైతులు ● చట్టం ప్రకారం న్యాయం చేస్తాం: అదనపు కలెక్టర్ వెంకటాచారి దుద్యాల్: మార్కెట్ విలువ ఆధారంగా భూ పరిహారం చెల్లించాలని ఈర్లపల్లి, నన్యానాయక్ తండా, సంట్రకుంటతండా రైతులు అధికారులను కోరారు. పారిశ్రామిక వాడ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు ఆర్డీఓ అనిత మాట్లాడుతూ.. 146.30 ఎకరాల పట్టాభూములున్న రైతుల వివరాలు, 88 సర్వే నంబర్లో 213 ఎకరాలు ఉండగా భూ భారతిలో నమోదైన 95 ఎకరాల రైతుల వివరాలు చదివి వినిపించారు. మిగిలిన 118 ఎకరాల అసైన్డ్ భూములకు సమస్యలున్నాయని చెప్పారు. పొజిషన్లో ఉండి పట్టా లేకపోవడం, పట్టా ఉండి పొజిషన్లో లేకపోవడం వంటి సమస్యలు గుర్తించామని.. ఎంజాయ్మెంట్ సర్వే చేపడితే పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ.. మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, హకీంపేట్లో మాదిరిగా భూములు కోల్పోయే రైతులకు ఇళ్ల స్థలాలు, పారిశ్రామికవాడలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకటాచారి మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ప్రతీ రైతుకు న్యాయం చేస్తామని.. ఆందోళన చెందొద్దని సూచించారు. 118 ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రైతులు సహకరించాలని కోరారు. గిరిజనులకు సంబంధించిన అసైన్డ్ భూములు వారికే చెందాలని కోరగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, డీటీ శివకుమార్, ఆర్ఐ నవీన్, జీపీఓలు రమేశ్, గోపాల్, పంచాయతీ కార్యదర్శులు కిషన్, సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు మొగులయ్య, మాణిక్యనాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. భారీగా పోలీసు బందోబస్త్ ఈర్లపల్లిలో నిర్వహించిన రైతు ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ రాజేశ్ మీనా ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసు బలగాలు అక్కడ మోహరించాయి. వికారాబాద్, పరిగి డీఎస్పీలు వీరేశ్, శ్రీనివాస్లు భద్రతాఏర్పాట్లను పర్యవేక్షించారు. నలుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. -
అడ్రస్ లేకపాయె!!
వికారాబాద్: మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా విద్యాశాఖ పరిస్థితి తయారైంది. బడులు ఓపెన్ చేసే నాటికే యూనిఫాం, షూ, నోట్బుక్స్, బ్యాగులతో కూడిన నాణ్యమైన కిట్లు అందజేస్తామని చెప్పిన విద్యాశాఖ నేటికి వాటిని అందిచలేదు. పాఠశాలలు పునఃప్రారంభమై నెల పదిహేను రోజులు గడిచినా ఏకరూప దుస్తులు విద్యార్థులకు అందలేదు. కొందరు విద్యార్థులు ఏదో ఒకటి కుట్టించుకుని వేసుకుని వెళ్తుండగా.. మరికొందరు గతేడాది ఇచ్చిన దుస్తులే వేసుకుంటున్నారు. గతేడాది ఇదే తరహాలో జాప్యం చేస్తూ విద్యా సంవత్సరం చివరి వరకు ఇస్తూ వెళ్లిన అధికారులు ఈ ఏడాది సైతం అదే దోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దుస్తుల వెతలు తప్పడం లేదు. సర్కారు బడి అయినా.. ప్రైవేటు స్కూల్ అయినా తల్లిదండ్రులకు యునిఫాంల తిప్పలు తప్పటంలేదు. స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు యునిఫాంలు కొనుగోలు చేయక తప్పడంలేదు. ఈ ఏడాది నుంచి నూతన తరహాలో యూనిఫాంలు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించి డిజైన్ చేసిన కలర్లకు అనుగుణంగా ఇటీవలే బట్ట కొనుగోలు చేశారు. బట్ట పంపిణీ ఆలస్యం వికారాబాద్ జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 73,861 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వీరికి విద్యాశాఖ నుంచి ప్రతీ సంవత్సరం రెండు జతలు యునిఫాంలు ఉచితంగా అందజేస్తుంది. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే బట్ట పంపిణీ చేసి కుట్టిస్తుంది. వాటికి సంబంధించి మండలాలు పాఠశాలల వారీగా విద్యాశాఖ కూలీ డబ్బులు అందిస్తుంది. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 1,47,722 దుస్తులు అవసరం కాగా ఇప్పటి వరకు విద్యాశాఖ ఒక జత కూడా అందజేయలేదు. కాగా ఈ ఏడాది స్థానిక మహిళా సంఘాలకు బట్ట పంపిణీ చేసి కుట్టిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. బట్ట పంపిణీలో ఆలస్యం వల్లే కుట్టడం లేట్ అవుతోందని మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. కూలీ డబ్బులు సైతం సకాలంలో చెల్లించకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. యునిఫాంలు కుట్టించేందుకు 820 స్వయం సహాయక సంఘాలను గుర్తించిన జిల్లా అధికారులు ఇటీవలే వారికి బట్ట అందజేశారు. కేజీబీవీ విద్యార్థులకు మాత్రం యూనిఫాంలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవలే షూ చేరినా.. యూనిఫాంలతో పంపిణీ చేయాలని నిర్ణయించి పక్కన పెట్టారు. ఈ ఏడాది నుండి పంపిణీ చేస్తామన్న బ్యాగులు ఇతర వస్తువులపై స్పష్టత కొరవడింది. బడులు ప్రారంభమై నెలన్నర గడిచినా అందని యూనిఫాంలు పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నాణ్యతలోపం కారణంగా ఒక్కో బడికి ఒక్కోరకం దుస్తులు తల్లిదండ్రులకు ఆర్థిక భారం యూనిఫాంల విషయంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే ఉండే యునిఫాంలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ తప్పనిసరి చేశారు. పంపిణీ చేస్తున్న దుస్తులు ఒక్కో ఏడాది ఒక్కో రంగులో ఉంటున్నాయి. అవి నాణ్యతగా ఉండకపోవడంతో పాఠశాలల ఉపాధ్యాయులు ఆకర్శణీయంగా ఉండే వేరే రంగుల దుస్తులను తమ పాఠశాలలకు యునిఫాంగా పెట్టుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులు యూనిఫాంలు కొనుగోలు చేయకతప్పడం లేదు. ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు ఒక్కోరకం దుస్తులు యూనిఫాంలుగా ఉంటున్నాయి. -
పనుల్లో పురోగతి కనిపించాలి
దుద్యాల్: హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో పురోగతిపై కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నర్సింగ్, మెడికల్ కళాశాలలు, బాలికల, బాలుర హాస్టళ్లు, డిగ్రీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎక్కువ మంది లేబర్లతో రెండు షిప్టులుగా పనులు చేపట్టాలని కాంట్రాక్లర్లకు, ఎడ్యుకేషన్ హబ్ ఇంజినీర్లకు సూచనలిచ్చారు. ఆగస్టు 5వ తేదీ వరకు పనుల్లో పనుల్లో పురోగతి కనిపించాలన్నారు. అనంతరం ఎడ్యుకేషన్ హబ్లో నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ సీఈ షఫీ, ఏఈ విజయ భాస్కర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రఫీక్, ఇంజనీర్ కృష్ణ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చినుకు పడి.. చిత్తడిగా మారి
అసౌకర్యంగా మారిన రోడ్లు తాండూరు టౌన్: చిరుజల్లులకే రోడ్లన్నీ బురదమయంగా మారాయని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన.. పట్టణ శివారు ఇందిరమ్మ, రాజీవ్కాలనీల రోడ్లను పరిశీలించి మాట్లాడారు. కాలనీల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీఅధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయినా వార్డుల్లో పూర్తి స్థాయిలో సీసీరోడ్లు, మురుగు కాల్వలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి స్పందించి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. లేని పక్షంలోఆందోళనలు తప్పవన్నారు. అధైర్యం వద్దు.. వచ్చేది మనమే తాండూరు: అధైర్య పడకండి.. మరో రెండేళ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపనర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు, నాయకులు నగరంలో రోహిత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు రాజకీయాలపై కౌన్సిలర్లతో చర్చించారు. తమకు తాండూరులో భద్రత లేదని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయగా.. పైలెట్ పై విధంగా భరోసా ఇచ్చారు. విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత యాచారం: విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలోని కుర్మిద్ద అనుబంధ గ్రామం మంగలిగడ్డ తండాలో చోటు చేసుకుంది. నేనావత్ సోనాకు చెందిన రూ.50 వేల విలువ చేసే పాలిచ్చే ఆవు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసిన గదుల వద్దకు వెళ్లింది. అక్కడ స్తంభానికున్న స్టార్టర్ డబ్బాకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు మృతికి కారణమైన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్: ఆరాంఘర్ చౌరస్తా నుండి పీడీపీ చౌరస్తా వైపు వెళ్తున్న కారులో బుధవారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు నడుపుతున్న వ్యక్తి భయంతో కారు దిగి బయటికి వచ్చాడు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కరుణాకర్ అటుగా వెళుతూ వెంటనే స్పందించాడు. పక్కనే ఉన్న ఇంటి నుంచి పైపును తీసుకొని మంటలను అదుపులోకి తెచ్చాడు. 20 నిమిషాల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే కారు దాదాపు 50 శాతం కాలిపోయింది. అతి వేగమే ఉసురు తీసింది గచ్చిబౌలి: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. మంగళవారం నియో పోలీస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగిఉన్న లారీని కారు ఢీకొనడంతో కత్రావత్ సురేందర్ (19), ముత్యాల ప్రణతి రెడ్డి (20) మృతి చెందిన విషయం తెలిసిందే. కోకాపేట్ నుంచి కొల్లూరు వైపు వెళుతున్న కారు ఆగిఉన్న లారీని 120 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కారు మీటరు కూడా పగిలిపోవడంతో ఓఆర్ఆర్పై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతివేగంగా వెళ్లడమే కాకుండా బ్రేక్ కూడా వేసే ప్రయత్నం చేయకపోవడంతో లారీ వెనక భాగంలో కారు కూరుకుపోయిందని చెబుతున్నారు. కారు నడిపిన సురేందర్కు లైసెన్స్ లేదని, డ్రైవింగ్ కూడా సరిగ్గా రాకపోవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. కొంతకాలంగా ఇద్దరూ స్నేహంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కారులో వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో ముత్యాల ప్రణతి రెడ్డి, కత్రావత్ సురేందర్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మరియాల గ్రామానికి ప్రణతి మృతదేహం, పక్కనే ఉండే నాయకుని తండాకు సురేందర్ మృతదేహాలను తరలించారు. -
భూ బాధితులకు ప్రభుత్వ అండ
● సర్వేకు రైతులు సహకరించాలి ● అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి దోమ: రేడియల్ రోడ్డు, పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. బుధవారం మండలంలోని కొండాయపల్లిలో ఆర్డీఓ వాసుచంద్రతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సర్వేకి సహకరించాలని కోరారు. మెరుగైన పరిహారం అందించడం తోపాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సి పని లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, డీటీ నర్సింహులు, ఆర్ఐలు వెంకటేశ్, రాంచంద్రరావు, జీపీఓలు, వీఆర్ఏలు, గ్రామ రైతులు పాల్గొన్నారు. సమాచారం ఇవ్వలేదు భూములు కోల్పోతున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పోలీసు బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించారని గ్రామానికి చెందిన నిమ్మలి సాయిలు, ఇరుకుంట భీములు, వార్ల నరేందర్ మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 456 ఎకరాల భూములు పోతాయని కేవలం కొంత మంది రైతులతో సమావేశం నిర్వహించడం ఏమిటని వారు ప్రశ్నించారు. చాలా మంది రైతులు హైదరాబాద్లో ఉంటున్నారని ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో వారు రాలేదన్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమం చేస్తామని రైతులు హెచ్చరించారు. -
లబోదిబోమంటున్న రైతులు
జొన్నల డబ్బుల్లో కోత ధారూరు: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన జొన్నలకు సంబంధించిన డబ్బుల్లో కోత పెట్టి వేధిస్తున్నారని మండలంలోని చింతకుంట గ్రామ రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రైతులు ఎం.వెంకటయ్య, పి.విజయలక్ష్మి, పట్లోళ్ల ప్రభాకర్రెడ్డి, వడ్డె పరమానందం, శేఖర్రెడ్డి, పి.సింధు జొన్నలు విక్రయించగా నిర్వాహకులు తక్ పట్టీలు ఇచ్చారు. బుధవారం వారి ఖాతాల్లో డబ్బు జమ అయినట్లు ఫోన్లకు సమాచారం వచ్చింది. విక్రయించిన బస్తాల కంటే తక్కువ వాటికి డబ్బు జమ చేసినట్లు గుర్తించారు. పరమానందంకు 1.50 క్వింటాళ్లు, ప్రభాకర్రెడ్డి, విజయలక్ష్మి, వెంకటయ్యలకు క్వింటాలు చొప్పున, శేఖర్రెడ్డి సింధుకు 50 కిలోల సంబంధించిన డబ్బులు తక్కువగా జమ చేసినట్లు బాధితులు తెలిపారు. మా సమక్షంలో తూకం వేసి తక్ పట్టీలు ఇచ్చినా డబ్బు తక్కువ వేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ విషయమై ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదన్నారు. ఈ విషయమై పీఏసీఎస్ సీఈఓ నర్సింహులును వివరణ కోరగా రైతుల విషయం తమ దృష్టికి వచ్చిందని, మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
షాబాద్: మత్తు పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కుర్వగూడ, లక్ష్మారావుగూడ గ్రామాల్లోని పలు దుఖాణాల్లో డాగ్స్వాడ్ బృందంతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోకి మత్తుపదార్థాలు, గంజాయి సరఫరా అవుతుందనే అనుమానంతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పటికప్పుడూ నిఘా పెట్టాలని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో కంపెనీలు రావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగులు, కూలీలు ఇక్కడికి వస్తున్నారని.. వారంతా ఏం చేస్తున్నారో ప్రజలు నిఘా పెట్టి ఉంచాలన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, 100కు డయల్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ చెన్నారెడ్డి, సర్పంచ్లు సంధ్యమల్లికార్జున్గౌడ్, కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి -
సమస్యల తహసీల్ కథనంపై చర్చ
యాచారం: తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారుల ఆరా తీసినట్లు తెలిసింది. బుధవారం ‘సాక్షి’దినపత్రికలో ‘సమస్యల తహసీల్!’కథనంపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగింది. తహసీల్దార్ అయ్యప్ప, ఇతర అధికారులపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో యాచారం తహసీల్దార్ అయ్యప్పను తక్షణమే సెలవులో వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు సంజాయిషీ ఇచ్చుకునేందుకు వెళ్లిన తహసీల్దార్ మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి విచ్చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఉపాధి కోసం వచ్చి.. చోరీలు ● ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాసభ్యులకు రిమాండ్ ● ఏడు తులాల బంగారుఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్జోషి షాద్నగర్: ఉపాధి పేరుతో వచ్చి.. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్దేవ్సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్ ఉపాధి కోసం కొంతకాలం క్రితం రాష్ట్రానికి వచ్చారు. హార్వెస్టర్ డ్రైవర్లు, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్లకు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన కేశంపేట మండలం సంతాపూర్లో ఈ నలుగురు దుండగులు బైక్లపై వచ్చి ఓ వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. కడ్తాల్ ఠాణా పరిధిలో మరో మహిళను బెదిరించి ఆమె మెడలోంచి మూడు తులాల పుస్తెల తాడును అపహరించుకెళ్లినట్లు తెలిపారు. జూలై 24న మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం వద్ద పార్కు చేసిన బైకును, జూన్లో వనపర్తి జిల్లా కొత్తకోటలో చోరీ చేసిన ద్విచక్రవాహనాలపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కేశంపేటలో అరెస్టు కేశంపేట చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సుఖ్దేవ్సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా కేశంపేట, కడ్తాల్, మహబూబ్నగర్, కొత్తపేట ఠాణాల పరిధిలో చేసిన చోరీలను ఒప్పుకొన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపా రు. ఈ సమావేశంలో షాద్నగర్ డీసీపీ శిరీషా రాఘవేంద్ర, ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ నరహరి, ఎస్ఐ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
సర్.. వందశాతం లక్ష్యం
● కలిసికట్టుగా ముందుకు సాగండి ● ఆర్డీఓ వాసుచంద్ర పరిగి: సర్ ప్రక్రియలో పురోగతి తక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్లపై దృష్టి సారించాలని ఆర్డీఓ వాసుచంద్ర అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఓటరు జాబితా సవరణ గురించి మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఆగస్టు 3 లోపు పూర్తికావాలని చెప్పారు. వందశాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఇందుకు సమష్టిగా అందరూ ముందుకు సాగాలన్నారు. ఎన్యుమరేషన్ పత్రాలనుబీఎల్ఓలకు తిరిగి ఇవ్వని పక్షంలో హక్కు కోల్పోతారని ఓటర్లకు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదే విషయమై నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్బాబు, విజయోందర్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్కు పూర్వ వైభవం ఖాయం
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బంట్వారం: బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని రొంపల్లిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకీ బలం బలగమన్నారు. కాంగ్రెస్ మునిగే నావలాంటిదన్నారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనన్నారు. నాయకులు మనస్పర్థలు వీడి కలిసి పని చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు సర్ ప్రక్రియను పరిశీలించి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ ఓట్లు గల్లంతు కాకుండా జాగత్త పడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, నాయకులు బల్వంత్రెడ్డి, ఫిరోజ్, చందూ సింగ్, వీరప్ప, సాయిలు యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
తాండూరు టు అరుణాచలం
● ఆగస్టు 3నుంచి ఆర్టీసీ డీలక్స్ బస్సు ● ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి ● డిపో మేనేజర్ ప్రవీణ్కుమార్ తాండూరు టౌన్: తాండూరు నుంచి అరుణాచల క్షేత్రానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు అరుణాచలం ఆధ్యాత్మిక యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాత్రకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. పెద్దలకు రూ.3,600, పిల్లలకు హాఫ్ టికెట్ రూ.2 వేలు ఉంటుందన్నారు. రాత్రి 9గంటలకు తాండూరు నుంచి బస్సు బయలుదేరి కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తమిళనాడు వేలూరులోని గోల్డెన్ టెంపుల్, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి దర్శనం కల్పిస్తారన్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 5వ తేదీ సాయంత్రం 5గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుందని, 6వ తేదీ ఉదయం వరకు తాండూరుకు చేరుకుంటారన్నారు. ఆలయ దర్శనం, భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందన్నారు. టికెట్ల బుకింగ్ కోసం సెల్ నంబర్ 9948947422, 8309348157లలో సంప్రదించాలన్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్రను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. -
కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు
మొయినాబాద్: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, ఎమ్మెల్యే కాలె యాదయ్య కుమారుడు కాలె శ్రీకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ సోనియా భర్త, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరినవారికి పదవులు కట్టబెడుతున్నారంటూ కార్యకర్తలు మండిపడ్డారు. మొయినాబాద్ మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల సమీక్ష సమావేశం బుధవారం పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముందే పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. షాబాద్ దర్శన్, కాలె శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వేదికపై ఉన్న నాయకులంతా ఇద్దరిని సమాదాయించారు. నామినేటెడ్, పార్టీ పదవులను డబ్బులకు అమ్ముకుంటున్నారని.. కష్టపడ్డవారికి పదవులు దక్కడంలేదంటూ కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితి మారకుంటే రాబోయే రోజుల్లో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని జ్ఞానేశ్వర్ హామీ ఇవ్వడంతో కార్యకర్తలు కాస్త వెనక్కితగ్గారు. ఎస్ఐఆర్ వంద శాతం పూర్తి చేయాలి ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)ను అన్ని గ్రామాలు, వార్డుల్లో వంద శాతం పూర్తి చేసే విధంగా చూడాలని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరోషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ అన్నారు. బీఎల్ఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫారంలో సమగ్ర వివరాలు నమోదు చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధంగా బీఎల్ఏలు కృషి చేయాలన్నారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
మీర్పేట: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం ఆయన ప్రశాంతి హిల్స్ ద్వారకామయి సాయిబాబ పీఠంలో పీఠాధిపతి గోపాలకృష్ణానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్ఆర్తో కలిసి రహస్య తత్వార్థ బోధనలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ జానకి కొడపి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యులు సామిడి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు -
గ్రామసభ.. తీర్మానాల వేదిక
ధారూరు: గ్రామసభ.. తీర్మానాలకు వేదికగా మారింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పలు అంశాలపై చర్చించి, వాటి పరిష్కారానికి నిర్ణయించారు. బుధవారం ధారూరులో సర్పంచ్ ప్రమీళగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో.. కార్యదర్శి అంజానాయక్ జలసిరిపై వివరించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిషన్ ద్వారా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊటకుంట, బోరుబావు రీచార్జి నిర్మాణాలు చేపట్టేందుకు తీర్మానించారు. మండల కేంద్రంలో మొత్తం 3,930 ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశామని, వాటిలో ఇప్పటి వరకు వరకు 2,841 ఫారాలను తిరిగి తీసుకొని, ఆన్లైన్లో నమోదు చేశామని సర్పంచ్ తెలిపారు. గుంతల్లో మట్టి వేయించి పూడ్చాలని ప్రజలు కోరారు. వీరభద్రేశ్వరస్వామి దేవాలయం నుంచి శాలివాహన కాలనీ వరకు మురికి కాల్వ నిర్మించాలని, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. సమావేశంలో ఎల్ఎన్తండా సర్పంచ్ పూజ, ఉప సర్పంచ్ జహంగీర్, కోఆప్షన్ మాజీ సభ్యుడు హఫీజ్, డీసీసీ కార్యదర్శి బాబాఖాన్, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. సమష్టి చర్చ..సమస్యల పరిష్కారానికి నిర్ణయం -
నీటి ప్రవాహం ఉన్న వాగులు దాటొద్దు
● రైతులు జాగ్రత్తగా ఉండాలి ● ఎస్పీ స్నేహ మెహ్ర మోమిన్పేట: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. బుధవారం మోమిన్పేట పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పొలాలకు వెళ్లే రైతులు మార్గమధ్యలోని వాగులను దాటే క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే దాటే సాహసం చేయరాదని సూచించారు. గత ఏడాది మండలంలోని మేకవనంపల్లి వద్ద వాగు దాటుతూ ఓ యువకుడు గల్లంతై మృతి చెందిన ఘటనను ఆమె గుర్తు చేశారు. మద్యం సేవించి, హెల్మెట్, సీటు బెల్టు లేకుండ వాహనాలు నడిపితే చర్యలు ఉంటాయన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మండలంలోని 29 గ్రామ పంచాయల్లో 293 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ భరత్భూషణ్ ఎస్పీకి తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ అంజయ్య. సీఐ వెంకట్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోం
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ తాండూరు రూరల్: సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు యాజమాన్యాలు అన్యాయం చేస్తే ఊరుకోమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. బుధవారం మండల పరిధి బెల్కటూర్లో ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నాలుగో జిల్లా మహాసభలు నిర్వహించారు. ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. లెబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిమెంట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రతినిధులు విజయలక్ష్మి పండిత్, బాల శంకర్, దశరథ్ గౌడ్, జైపాల్రెడ్డి, రవీంధర్, వంశీకృష్ణ, తహర్ పాషా, జంగయ్య, అజయ్, రాజేశ్వర్రెడ్డి, పాండు, అశోక్, నర్సిములు, నాయకులు శరణు బసప్పలు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
● భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న ముందస్తు చర్యలు తీసుకోవాలి ● ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు ● లోతట్టు ప్రాంతాలు, వాగులపై ప్రత్యేక దృష్టి సారించాలి ● కలెక్టర్ దీపక్ తివారి అనంతగిరి: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఇరిగేషన్, వైద్యం, గ్రామ పంచాయతీ, విద్యుత్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు, చెరువులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రహదారులపైకి నీరు చేరడం, పాత భవనాలు, చెట్లు కూలడం వంటి ఘటనలు జరిగితే వెంటనే స్పందించాలన్నారు. అవసరమైన యంత్రాంగాన్ని, సహాయక బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాగులు, వరద ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. అనంతరం ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడారు. పోలీస్ శాఖ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని సహాయం కాల్సిన వారు కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ 8712670056కు సమచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్ 78శాతం పూర్తి జిల్లాలో ఇప్పటి వరకు సర్ డిజిటలైజేషన్ 78శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం నగరం నుంచి ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో ఎస్ఐఆర్ గురించి కలెక్టర్ వివరించారు. -
నైపుణ్య శక్తిని పెంపొందించుకోవాలి
షాద్నగర్రూరల్: విద్యార్థులు నైపుణ్య శక్తిని పెంపొందించుకొని ఉద్యోగాల్లో రాణించాలని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీత అన్నారు. బుధవారం షాద్నగర్లోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంక్వి ల్యాబ్ ఫౌండేషన్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఐడియేషన్, డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్ స్కిల్స్, స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ నీత మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాస్తవ జీవిత, సామాజిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు వేర్వేరు బృందాలుగా విడిపోయి వినూత్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సిబ్బంది ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. గిరిజన మహిళా డిగ్రీ కళాశాలప్రిన్సిపాల్ డాక్టర్ నీతా -
చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు
పదేళ్లుగా పాటిస్తున్న కుటుంబం తాండూరు టౌన్: భౌతికంగా కుటుంబ పెద్ద తమ మధ్య లేకపోయినా, ఆయన నాటిన మొక్కను సంరక్షిస్తూ ఆ మొక్కలోనే ఆయనను చూసుకుంటోంది తాండూరు పట్టణానికి చెందిన ఓ కుటుంబం. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి, భర్త కొట్రిక వెంకటయ్య పదేళ్ల క్రితం ఇంటి ఎదుట ఓ మొక్కను నాటారు. తర్వాత ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనపై ఉన్న ప్రేమ, వాత్సల్యంతో ఆ చెట్టుకు ఏటా వెంకటయ్య జయంతి రోజున పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ చెట్టు సంరక్షణార్థం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో తిరిగి నాటారు. తాజాగా బుధవారం ఆయన జయంతి రోజు కావడంతో కుటుంబ సభ్యులు చెట్టుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కొట్రిక విజయలక్ష్మి, కొడుకు, కోడలు కొట్రిక శ్రీకాంత్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ తాండూరు టౌన్: పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు అర్హుల జాబితాపై మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ బుధవారం కలెక్టరేట్లో సమాచార హక్కు కింద దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పూర్తిగా వ్యాపార ధోరణిలో అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఏకంగా సీఎం చురకలంటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులను ముందుగా గుర్తించి వారికి ఇళ్లు కేటాయించాల్సి ఉండగా, తొలుత ఇళ్లు కేటాయించి వారి అర్హతపై విచారణ చేపట్టడం హాస్యాస్పదమన్నారు. డబుల్ ఇళ్లకు కేసీఆర్ హయాంలో దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణలోకి తీసుకున్నారా? ప్రస్తుతం కేటాయించిన ఇళ్ల విచారణాధికారి వివరాలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, అర్హుల జాబితాను కోరుతూ కలెక్టరేట్లో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశానన్నారు. ఇట్టి ప్రశ్నలకు సరైన వివరణ రాకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్నాయక్ పరిగి: ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అధ్యాపకులు కార్యాచరణను రూపొందించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్నాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, కళాశాలకు పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు భాస్కరయోగి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు: చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకరమని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ అన్నారు. పట్టణంలోని పెంజర్ల కూడలిలో బుధవారం ఆయన వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఇటీవలి రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగానే మృతి చెందారన్నారు. కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్టులు, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. -
డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా
రాజేంద్రనగర్ ఎస్ఈ శ్రీరామ్ మోహన్ మహేశ్వరం: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా సామర్థ్యం పెంచుతున్నామని రాజేంద్రనగర్ విద్యుత్ సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్ఈ) శ్రీరామ్ మోహన్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని తుమ్మలూరులో 33–11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో రూ.కోటి నిధులతో అదనపు 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్ సరఫరాను అందిస్తామన్నారు. విద్యుత్ డిమాండ్ను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడం, పవర్ ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ను సమతుల్యం చేయడం, ఓవర్ లోడింగ్ను నివారించడం, వినియోగదారులకు నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్లు దోహదపడుతుందన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా సబ్స్టేషన్ల సామర్థాన్ని పెంచడం, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కందుకూరు విద్యుత్ డీఈ గోపాలకృష్ణ, ఎంఆర్టీ ఏడీఈలు శంకర్, స్వాతి, శ్రీనివాస్, రామలింగారెడ్డి, మహేశ్వరం ఏఈ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
విస్తారంగా వర్షాలు
వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో పంటలకు జీవం పోసినట్లయింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. ఒకటి రెండు చోట్ల భారీగా.. మిగతా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. రైతన్నకు కాస్త ఉపశమనం లభించింది. వాగులు, వంకలు పారుతూ చెరువుల్లోకి నీరు చేరుతోంది. గడచిన మూడు రోజుల్లో మోమిన్పేటలో అత్యధికంగా 45మిల్లీమీటర్లు, నవాబుపేటలో 31 మి.మీ. మర్పల్లిలో 26.9మి.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. పలు కాలనీలు నీటి కుంటలను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఆనందంలో రైతులు వానాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పంటలకు సరిపడా వర్షం పడలేదు. అప్పుడప్పుడు కురిసినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. చెలకలు, ఇసుక పొలాల్లో మొక్కజొన్న తదితర విత్తనాలు సగం మొలకెత్తగా మిగతావి ఎండిపోయాయి. ప్రస్తుత వర్షాలు వరి నాట్లు వేసుకునే రైతులకు మేలు చేయనున్నాయి. వానలు ఇలాగే కొనసాగితే బోరు బావులు, చెరువుల్లో నీటి మట్టం పెరిగి నాట్లు ఊపందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, కూరగాయలు, పసుపు తదితర పంటలకు జీవం పోసినట్టయ్యింది. పంటలు పచ్చగా ఉండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలోని నాలుగు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా మూడు మండలాల్లో సాధారణం, మరో 13 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. రెండు మూడు మండలాల్లో మినహా మిగతా అన్ని చోట్ల సాధారణ వర్షపాతానికి చేరువయ్యాయి. మొత్తంగా చూస్తే జిల్లాలో ఇంకా 25 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కనిపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు గత అనుభవాల నేపథ్యంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. వాగులు, వంకల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి అధికారుల ను అలర్ట్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలల హెచ్ఎంలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్ కేంద్రాలు, ఫెర్టిలైజర్ షాపుల బాట పడుతున్నారు. ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మండలం వర్షపాతం – మర్పల్లి 26.9 లోటు మోమిన్పేట్ 45.5 అధికం నవాబుపేట 30.00 సాధారణం వికారాబాద్ 11.00 సాధారణం పూడూరు 11.5 అధికం పరిగి 4.5 లోటు కుల్కచర్ల 5.7 లోటు దోమ 6.5 లోటు బొంరాస్పేట్ 5.5 అధికం ధారూరు 10.6 లోటు కోట్పల్లి 7.2 లోటు బంట్వారం 12.1 లోటు పెద్దేముల్ 7.6 లోటు తాండూరు 4.7 లోటు బషీరాబాద్ 2.9 లోటు యాలాల 3.2 లోటు కొడంగల్ 14.00 లోటు దౌల్తాబాద్ 13.7 లోటు చౌడాపూర్ 6.8 అధికం దుద్యాల్ 6.8 సాధారణం పంటలకు జీవం రైతుల్లో చిగురించిన ఆశలు మూడు రోజులుగా కురుస్తున్న వానలు ఈ సీజన్లో ఇదే అత్యధికం మోమిన్పేటలో 45మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు ఎరువుల కోసం అన్నదాతల పరుగులు -
మోయలేని భారం
విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు ప్రైవేట్ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువ నోట్బుక్స్ ఇవ్వకూడదు. ప్రాజెక్టు బుక్స్, టెక్ట్స్ బుక్స్ పాఠశాలలోనే ఉంచుకునేలా యజమాన్యాలు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలను ఇబ్బందులకు గురి చేయకూడదు. – వెంకట్స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్ దౌల్తాబాద్: బడికి వెళ్లే చిన్నారులు రోజురోజుకూ స్కూల్ బ్యాగుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో అధిక సంఖ్యలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, గైడ్లు, ప్రాజెక్ట్ ఫైళ్లు, డ్రాయింగ్, స్క్రాప్ బుక్స్ వంటి వాటిని తప్పనిసరి చేయడంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, బూట్లు తదితర వస్తువులు కూడా బ్యాగు బరువును మరింత పెంచుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు పిల్లల బాధను చూసి స్వయంగా బ్యాగులు మోసి పాఠశాల వరకు తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఆందోళనకరం మండలంలోని 33 గ్రామపంచాయతీల పరిధిలో 50 పాఠశాలలు ఉండగా, వాటిలో 6 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. గతంలో కొన్ని సబ్జెక్టుల పుస్తకాలు, ఒక రఫ్ బుక్తో సరిపెట్టే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక నోట్బుక్తో పాటు గైడ్లు, ప్రాజెక్ట్ వర్క్, రికార్డులు, డైరీలు వంటి పుస్తకాలు తీసుకు రావాల్సి వస్తోంది. దీంతో 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 6 నుంచి 12 కిలోల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులు 12 నుంచి 18 కిలోల వరకు బరువున్న బ్యాగులను నిత్యం మోస్తున్నారు. కొన్ని పాఠశాల బస్సులు గేట్ వరకు మాత్రమే వెళ్లడంతో, అక్కడి నుంచి బ్యాగులు మోసుకుంటూ నడవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి కారణంగా చిన్నారుల్లో వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలుకాని మార్గదర్శకాలు విద్యార్థులపై బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర విద్యాశాఖ 2017లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం 1, 2 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు 1.5 కిలోలు, 3 నుంచి 5వ తరగతుల వారికి 3 కిలోలు, 6, 7 తరగతుల వారికి 4 కిలోలు, 8 నుంచి 10వ తరగతుల వారికి 5 కిలోలు మించకూడదని స్పష్టం చేసింది. అయితే ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా సొంత సిలబస్ పేరుతో అదనపు పుస్తకాలను విద్యార్థులపై మోపుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో బ్యాగుల బరువుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. బడి పిల్లలపై బ్యాగు బండ విద్యార్థులపై పెరుగుతున్న పుస్తకాల మోత ప్రైవేట్ పాఠశాలల్లో మరింత బరువు తిప్పలు పడుతున్న చిన్నారులు -
‘సర్’ను వేగవంతంగా పూర్తిచేయాలి
చేవెళ్ల: సర్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, చేవెళ్ల పార్లమెంట్ సర్ ఇన్చార్జి జగదీశ్ అన్నారు. పట్టణంలోని అట్లాస్ ఫంక్షన్హాల్లో ఆదివారం నియోజకవర్గ స్థాయిలోని పార్టీ బీఎల్ఏ(బూత్ స్థాయి ఏజెంట్ల) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగదీశ్తో పాటు నియోజకవర్గ సర్ ఇన్చార్జి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్లో పార్టీ తరఫున బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సర్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీఎల్ఏల పనితీరు శూన్యంగా ఉందని, ఈ కారణంగా నియోజకవర్గం సీ–కేటగిరిలో ఉందన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కట్టుబడి పనిచేయాలన్నారు. ఇప్పటికై నా బూత్స్థాయిలో ఉన్న ఓటర్లును కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నారు. వెంటనే బీఎల్ఏలతో మండలాల వారీగా సమావేశం నిర్వహించి, ప్రతి బీఎల్ఏ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సమతారెడ్డి, మార్కెట్ చైర్మన్ పెంటయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, ఐదు మండలాల అధ్యక్షులు, మూడు మున్సిపాలిటీల అధ్యక్షులు, గిరిధర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పెంటారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రమౌళి, వెంకట్రెడ్డి, నాయకులు జన్ధార్రెడ్డి, బల్వంత్రెడ్డి, ఆగిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రభాకర్, గోపాల్రెడ్డి, వీరేందర్రెడ్డి, ఐదు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, సర్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి జగదీశ్ -
రెండు చోట్ల ఓటు నేరం
● ఎక్కడైనా ఒకే చోట నమోదు చేయించుకోవాలి ● బషీరాబాద్ తహసీల్దార్ షాహేదాబేగం బషీరాబాద్: ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టరిత్యా నేరమని, ప్రతి అర్హుడైన ఓటరు తన సాధారణ నివాసం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని బషీరాబాద్ తహసీల్దార్ షాహేదా బేగం సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అధికారులు, బీఎల్వోలు అప్రమత్తంగా పనిచేసి, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి నమోదులను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. బషీరాబాద్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ సంత్కుమార్తో కలిసి బీఎల్ఓలు, వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఏఎస్డీలతో కలిపి ఇప్పటివరకు 95.11 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసి, వందశాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అలాగే ఏఎస్డీ(అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాంటి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా ధ్రువీకరించాలని ఆదేశించారు. ఓటరు జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ప్రజలు కూడా సహకరించాలని, అర్హులైన ప్రతిఒక్కరూ తమ వివరాలను సరిచూసుకుని అవసరమైతే అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించాలన్నారు. అధికారులు, బీఎల్వోలు సమన్వయంతో మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ను వెంటనే ప్రారంభించాలి
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను చేవెళ్లలో వెంటనే ప్రారంభించాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ పురన్దాస్కు బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పాఠశాల ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎందుకు ప్రారంభించలేకపోయారో అధికార పార్టీ నాయకులు చెప్పాలన్నారు. మంజూరు చేసిన పాఠశాలను సైతం ఏర్పాటు చేసేందుకు ఇన్నాళ్లుగా కాలయాపన చేయటం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చేవెళ్లకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి బీజేపీ పెద్దఎత్తున ందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణగౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి అశోక్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు తదితరులు ఉన్నారు. ఎంఈఓకు బీజేపీ నాయకుల వినతి -
ఇంటింటికి వెళ్లి.. ఫారాలు సేకరించి
ధారూరు: తొలుత ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసిన బీఎల్ఓలు, అధికారులు.. సోమవారం మండల కేంద్రంలో సర్పంచ్తో కలసి ఇంటింటికి వెళ్లి పత్రాలు సేకరించారు. ఆగస్టు 3వ తేదీతో ఎస్ఐఆర్ గడువు ముగియనుండటంతో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వార్డుల్లో పర్యటించారు. నింపని ఫారాలను పూరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీలగౌడ్, ఎంపీడీఓ నర్సింహులు, ఆర్ఐ స్వప్న, కార్యదర్శి ఆంజానాయక్, బీఎల్ఓలు పాల్గొన్నారు. ఫీజు కట్టకుంటే పరీక్షలు రాయనీయం గోల్కొండ: మొత్తం వార్షిక ఫీజు కడితేనే ఫార్మేటివ్ పరీక్షలు రాయనిస్తామని మెహిదీపట్నంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు తేల్చిచెప్పింది. ఫార్మేటివ్ టెస్టు లు సోమవారం నుంచి ప్రారంభం కాగా, విద్యార్థులు ఉదయం స్కూల్కు రాగానే ‘మీ రు ఫీజు కట్టలేదు, పరీక్షలు రాయనివ్వం’ అంటూ సిబ్బంది పలువురిని బయటే నిలబెట్టా రు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. ఫీజు విషయంపై ఒత్తిడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో సిబ్బందికి, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. బోనాలకు మంత్రి శ్రీధర్బాబుకు ఆహ్వానం రాంగోపాల్పేట్: ఆగస్టు 2,3 తేదీల్లో జరుగనున్న ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు రావాలని మంత్రి శ్రీధర్బాబుకు నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దేవాలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ శివకుమార్లాల్, గుండెల్లి వరప్రసాద్, మల్లికార్జున్, గీత, సోనల్, ముప్పిడి కిరణ్, రాజేందర్, ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ మంత్రిని ఆహ్వానించారు. -
యంత్రంలో నలిగి కార్మికుడి మృతి
షాద్నగర్: ఫరూక్నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని ఓ పరిశ్రమలో వలస కార్మికుడు ప్ర మాదం బారిన పడి మృతిచెందాడు. ఆదివారం రాత్రి 7గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా కంపెనీ నిర్వాహకులు విషయాన్ని బయటకు రానీయలేదు. బతుకుదెరువు కోసం వచ్చి.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజయ భద్ర (21)కు ఏడాదిన్నర క్రితం నూనిసింగ్తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ మూడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం షాద్నగర్కు వచ్చి, ఎలికట్ట శివారులోని చెట్టినాడ్ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఇటీవల సొంతూరుకు వెళ్లిన భద్ర.. డెలివరీ నిమిత్తం భార్యను అక్కడే వదిలేసి ఎలికట్టకు వచ్చాడు. పది రోజుల క్రితం పాప పుట్టిందని తెలియడంతో మరో రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. కేసు నమోదు.. కార్మికుడు భద్ర కంపెనీలో టైల్స్ పౌడర్ తయారు చేసే యంత్రం వద్ద పనిచేస్తాడు. ప్రమాదవశాత్తు యంత్రంలో పడిపోయిన భద్ర అందులోనే నలిగి చనిపోయాడు. మృతదేహాన్ని వెలికి తీసి మార్చురీకి తరలించారు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న మృతుడి పెద్దనాన్న కొడుకు దూమ బదరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పది రోజుల బిడ్డతో నూనీ బిజయ భద్ర (ఫైల్)అనాథలైన తల్లీబిడ్డ.. భద్ర రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్న నూనీ తన బిడ్డను ఎప్పుడెప్పుడు అతనికి చూపిస్తానా అనే ఆత్రుతతో గడుపుతోంది. ఇంతలోనే పిడు గులాంటి వార్త ఆమె బతుకును దుర్భరం చేసింది. భద్ర ఇకలేడని, ప్రాణాలతో రాడని తెలియడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. పరిశ్రమ నిర్లక్ష్యం కారణంగానే భద్ర మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలికట్ట శివారులోని పరిశ్రమలో ప్రమాదం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికుల డిమాండ్ -
‘ఆ నాయకుడి తీరు సిగ్గుచేటు’
చేవెళ్ల: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. చేవెళ్లలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ అర్ధరాత్రి మద్యం తాగి, పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో హల్చల్ చేయడమే కాకుండా తానే స్వయంగా వీడియో తీసుకుంటూ వైద్యులు, యాజమాన్యాన్ని దూషించాడన్నారు. అంతటితో ఆగకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని తెలిపారు. అధికార పార్టీ కౌన్సిలర్ననే అహంకారంతోనే ఆయన ఇలా ప్రవర్తించాడని మండిపడ్డారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసి క్షేమాపణ చెబితే సరిపోదని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు పి.ప్రభాకర్, కె. ఆనంద్, విజయ్భాస్కర్రెడ్డి, డీఎం.చందు, అనంత్రెడ్డి, మల్లారెడ్డి, దండు సత్తి, భాస్కర్రెడ్డి, దూత మల్లేశ్, శ్రీధర్రెడ్డి, కుర్వ మల్లేశ్, క్రిష్ణ, నరేందర్రెడ్డి, బాలు, శంకరయ్య, రాంప్రసాద్, మానిక్యరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బషీరాబాద్: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం తెల్లవారుజామున బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని మైల్వార్ గ్రామానికి చెందిన మున్నూర్ శామప్ప మైల్వార్ వాగు నుంచి అర్ధరాత్రి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుంటే నిఘాపెట్టిన పోలీసులు పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న శ్యామప్పపై కేసు నమోదు, ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ విఠల్ తెలిపారు. యాచారం: పేకాడుతున్న ఏడుగురిని యాచారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ మధు కథనం ప్రకారం.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన జోగు కృష్ణయ్య, తాండ్ర లింగం, నారిమల్ల రమేష్, ఇస్లావత్ అరుణ్, గుర్రం రంజిత్, గడ్డం యాదయ్య, బోయపల్లి లింగం ఆదివారం యాచారంలోని ఓ ప్రాంతంలో పేకాడుతుండగా పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వారి నుంచి మూడు మోటార్సైకిళ్లు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన చేసిన సేవలు మరువలేనివని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, మంత్రి అట్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య వారి చేతుల మీదుగా అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్రీయ అధ్యక్షుడు గౌతమ్ మల్లేశ్, డాక్టర్ రాజు, మణీ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. వీర జవాన్లకు దత్తాత్రేయ నివాళి ముషీరాబాద్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత మాత కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘన నివాళులు అర్పించారు. రామ్ నగర్లోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో జవాన్ల సేవలను కొనియాడారు. వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయడం, దేశభక్తి స్ఫూర్తిని యువతలో పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారులకు అండగా ప్రభుత్వం ● మంత్రి దామోదర్ రాజనర్సింహ మల్లాపూర్: మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ (సాధన ఫౌండేషన్)కు చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులు, సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు, ప్రత్యేక విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను రూపొందించే దిశగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సాధన దివ్యాంగుల వ్యవస్థాపకురాలు పడమటి సురేఖారెడ్డి, కార్యదర్శి మధుసూదన్రెడ్డి తదితరులున్నారు. కల్తీ టీ పొడి తయారీ ముఠా అరెస్టు ఫిలింనగర్: కల్తీ టీపొడి తయారీ ముఠాను ఫిలింనగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1,290 కిలోల కల్తీ టీ పొడితో పాటు రసాయన ఫ్లేవరింగ్ పదార్థాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఫిలింనగర్లోని దీన్దయాళ్నగర్లో కల్తీ టీ పొడి తయారీ జరుగుతుందన్న సమాచారంతో ఫిలింనగర్ ఎస్ఐ షేక్ సలీం ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. -
అవకాశాలు ఓపెన్
● చదువు మధ్యలో ఆపేసిన వారికి వరం ● ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు ● వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు కేశంపేట: అనివార్య కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన యువతీయువకులకు ఓపెన్ స్కూల్ వరంగా మారింది. ఓపెన్లో విద్యలో చదువు కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరినవారిలో ఎందరో ఉన్నారు. చదువుకోవాలనే ఆశ ఉన్నా పాఠశాలలకు వెళ్లలేని వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యను అందిస్తోంది. పనులు చేసుకుంటూనే సెలవు దినాల్లో ఓపెన్ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, కొన్ని ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందాలన్నా పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. దీంతో చాలామంది ఓపెన్ విద్య వైపు ఆసక్తి కనబురుస్తున్నారు. ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ద్వారా అపరాధ రుసుంతో ఆగస్టు 29 వరకు అడ్మిషన్లు స్వీకరించనుంది. జిల్లావ్యాప్తంగా 68 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 68 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పహాడీషరీఫ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, హఫీజ్పేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎన్టీఆర్నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ మీడియంలో అడ్మిషన్లు పొంది చదువుకునేందుకు సైతం అవకాశం ఉంది. వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో.. వికారాబాద్ జిల్లాలో 25 ఓపెన్ టెన్త్, ఇంటర్ అధ్యయన కేంద్రాలు, మేడ్చల్ జిల్లాలో 34 సెంటర్లు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం రూ.లక్షల్లో నిధులు వెచ్చిస్తూ తోడ్పాటు అందిస్తోంది. అడ్మిషన్లు ఇలా.. ● చదువు మధ్యలో ఆపేసినవారు, గృహిణులు, వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు ఓపెన్ విద్యలో అడ్మిషన్లు పొందొచ్చు. ● ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సమర్పించాలి. ● అడ్మిషన్లు పొందిన వారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ● మరింత సమాచారం కోసం www.telanganaopenschool.org వెబ్సైట్లో సంప్రదించాలి. పదో తరగతి ప్రవేశాలకు.. ● ఆగస్టు 31 నాటికి 14 ఏళ్ల వయస్సు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● గతంలో రెగ్యులర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు ఓపెన్లో రెండు సజ్జెక్టుల మార్కులను బదలాయించుకోవచ్చు. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు రూ.1,150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,250 చెల్లించాలి. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యా పుస్తకాలు అందిస్తుంది. ● అడ్మిషన్ తీసుకున్న ఐదేళ్ల వరకు పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు.. ● పదో తరగతి పాసై, ఒక్క ఏడాది గ్యాప్ ఉంటేనే అర్హులు. ● ఇంటర్మీడియెట్ విద్యార్థులకు 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలకు రూ.1,500 స్కూల్ ఫీజు ఉంటుంది. జనరల్ పురుషులు రూ.1,850 చెల్లించాలి. ● ప్రభుత్వం ఉచితంగా పాఠ్యాపుస్తకాలు అందిస్తుంది. అవసరమైన పత్రాలు ● ఇటీవల తీసిన పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు ● ఇంటర్మీడియెట్ చదివేవారికి ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్ ● పుట్టిన తేదీ సర్టిఫికెట్ . ఆగస్టు వరకు అవకాశం పదో తరగతి, ఇంటర్మీడియెట్లో ఆగస్టు 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ పొందొచ్చు. ప్రభుత్వం నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలలో చదివే విద్యార్థుల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వివరాలు, మహిళా సంఘాల నుంచి నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తున్నారు. పదో తరగతి వరకు చదవలేని వారు, చదువు మధ్యలో ఆపిన వారు, చదవడం, రాయడం వచ్చిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేర్పించేందుకు ప్రతి మండలంలో అధికారులు అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. -
విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి
మొయినాబాద్రూరల్: విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. మేడిపల్లి గ్రామానికి చెందిన చాకలి బాబయ్య, బాబు తండ్రీకొడుకులు. వారి వద్ద ఉన్న గేదెలను గడ్డి మేపేందుకు ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని శివాలయం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. గడ్డి మేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు బాధితులను ఓదార్చారు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.రెండున్నర లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: తాటి చెట్లు నరికి గీత వృత్తికి దూరం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నాయకుడు గుండ్ల దానయ్యగౌడ్, కార్యదర్శి భాస్కర్గౌడ్ డిమాండ్ చేశారు. పోల్కంపల్లిలో తాటి చెట్లు నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ గుండ్ల కొండల్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇంటి స్థలాలు చూపించండి.. యాచారం మండలంలోని చింతుల్లలో ఇచ్చిన సర్టిఫికెట్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలను చూపించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబరు 327లో ఐదెకరాల స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చారన్నారు. అప్పటి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే నర్సింహ వీటిని పంపిణీ చేసినా, ఇప్పటికీ పొజిషన్ చూపించలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్కు విజయ్, సామర్తి జగన్, వినోద్కుమార్, నర్సింహ, కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట గీత కార్మికుల ధర్నా -
మద్యం మత్తులో వీరంగం
చేవెళ్ల: పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ ఎం.కృష్ణానాయక్ మద్యం మత్తులో ఆదివారం రాత్రి పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో హంగామా చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడాడు. రాత్రి తన స్నేహితుడికి ప్రమాదం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిబ్బంది వచ్చి చికిత్స ప్రారంభిస్తుండగానే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఫ్రీ అని ప్రచారం చేసూకుంటూ.. డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. తాను అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్నని, తనకే ఇక్కడ న్యాయం జరగడం లేదని వీడియో తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతన్ని పిలిపించి విచారించారు. తాను ఓ దావత్కు వెళ్లానని, తన స్నేహితుడు ఆస్పత్రిలో ఉండటంతో అక్కడికి వెళ్లి మద్యం మత్తులో వైద్యులు, సిబ్బందిపై అమర్యాదగా మాట్లాడానని అంగీకరించారు. తన వల్ల ఇబ్బంది పడిన వారికి క్షమాపణ చెబుతున్నానని, తనకు ఎవరిపైనా దురుద్దేశం లేదని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేశారు. క్షమాపణ చెబుతూ కృష్ణానాయక్ఆసుపత్రిలో కౌన్సిలర్ హ ంగామా మైకం వదిలిన తర్వాత క్షమాపణ చర్చనీయాంశమైన కౌన్సిలర్ వ్యవహారం -
అదుపు తప్పి లారీ బోల్తా
డ్రైవర్కు గాయాలు యాలాల: వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్కు ప్రాణాపాయం తప్పింది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గేటు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటుక లోడ్ ఖాళీ చేసిన ఓ లారీ తాండూరు నుంచి కొడంగల్ వైపు వెళ్తుండగా మలుపు వద్ద బోల్తా పడింది. లారీ అద్దాలను పగలగొట్టిన స్థానికులు అందులో ఇరుక్కుపోయిన డ్రైవర్ నవీన్ను బయటకు తీసి తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తా పడిన ప్రదేశంలో పొలాల వద్ద పనిచేస్తున్న కూలీలు భోజనం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో వీరు కూర్చున్న ప్రదేశానికి సమీపంలోనే లారీ బోల్తా పడటంతో భయాందోళనకు గురయ్యారు. యాలాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపుతప్పి కారు బోల్తా
నలుగురికి గాయాలు తాండూరు రూరల్: అతివేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ఈ సంఘటన పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తాండూరు పట్టణం ఇంద్రానగర్కు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ నుంచి తాండూరుకు వస్తున్నారు. మార్గమధ్యలో పెద్దేముల్ మండలం కందనెల్లి శివారు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు గమనించి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. తర్వాత పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షత్రగాత్రుల్లో ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ విషయమై పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్వర్థన్ను వివరణ కోరగా.. కారు బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదన్నారు. -
కాలేజీ.. ఏ క్యాజీ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నాణ్యమైన వైద్య విద్య సంగతేమో కానీ.. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేపోతున్నారు మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులు. వైద్య విద్య ఇక్కడ మిథ్యలా మారింది. నగరానికి సమీపంలో ఉందని, మౌలిక సదుపాయాలకు కొదవ ఉండదని భావించి.. అడ్మిషన్ పొందిన మెజార్టీ విద్యార్థులు ఆ తర్వాత తాము ఇక్కడెందుకు వచ్చిపడ్డామా అని ఆందోళనకు గురవుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ కాలేజీని అనుబంధ ఆస్పత్రి సమీపంలోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం కాలేజీ సందర్శనకు వచ్చిన అదనపు కలెక్టర్ కిరణ్మయికి విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఇదే అంశంపై మొరపెట్టుకున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ భవనాన్ని చూసి ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్దె భవనం.. అరకొర సదుపాయాలు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం జిల్లాకు మహేశ్వరం మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. మీర్ఖాన్పేటలో ఏర్పాటు చేయాలని భావించి ఆ మేరకు అక్కడ స్థలాన్ని కేటాయించింది. 2023లో శంకుస్థాపన చేసింది. తీరా ప్రభుత్వం మారిపోవడంతో కాలేజీ.. ఎంపిక ప్రదేశం కూడా మారింది. సొంత క్యాంపస్ సహా కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వ కాలేజీ కావడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. 2024లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. 50 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఈ కాలేజీలో ఇప్పటికే రెండు బ్యాచ్లు కొనసాగుతున్నాయి. 2026–27లో మూడో బ్యాచ్ అడుగుపెట్టబోతోంది. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో అధికారులు మంగళ్పల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.16 లక్షలు చెల్లిస్తున్నారు. విశాలమైన క్యాంపస్ సహా ఐదు అంతస్తుల భవనం ఉన్నట్లు ఎంసీఐకి చూపించారు. తీరా అడ్మిషన్లు పూర్తై..తరగతులు మొదలైన తర్వాత అసలు విషయం బయటపడింది. భవన యాజమాన్యం, అప్పటి అధికారులు కుమ్మకై ్క మార్కెట్లో లేని అద్దె నిర్ణయించారు. అద్దె పెంపు విషయంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఆర్థికశాఖ నుంచి కాలేజీకి షోకాజ్ నోటీసులు అందినట్లు తెలిసింది. ఈనెల 31తో భవనం అద్దె గడువు ముగియనుంది. అద్దెను 20 శాతం పెంచాల్సిందిగా భవన యజమాని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఐదంతస్తుల ఈ భవనంలో రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తరగతి గదుల కిటికీలకు గ్లాసులు లేవు. చిన్నపాటి వర్షానికే గదుల్లోకి నీరు చేరుతోంది. చలిగాలులకు విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, కాలేజీకి కరెంట్ కనెక్షన్, ఫ్యాకల్టీ గదుల్లో ఫ్యాన్లు లేవు. అయినా నెలకు రూ.ఐదు లక్షల వరకు కరెంట్ బిల్లుల చెల్లింపునకు కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం 60 శాతం మంది విద్యార్థులకు అదే క్యాంపస్లో వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఇక్కడ వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇరుకై న ప్రైవేటు హాస్టల్ గదుల్లో ఇతర విద్యార్థులతో కలిసి ఉండాల్సి వస్తోంది. అంతేకాదు కాలేజీకి అనుబంధంగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేశారు. నిబంధనల మేరకు పది కిలోమీటర్లలోపే ఆస్పత్రి ఉండాలి. ఇక్కడ మాత్రం 18 కిలోమీటర్ల దూరం ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుబంధ ఆస్పత్రిలో పని చేసి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసు రూమ్లో ఉండాల్సి వస్తోంది. ఇటు నుంచి అటు..అటు నుంచి ఇటు రాకపోకలకే రెండు గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ రద్దీలో కాలేజీ నుంచి ఆస్పత్రికి వచ్చి వెళ్లడం విద్యార్థులకు ప్రహసనంగా మారింది. దీనిపై కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అద్దె భవనంలో మహేశ్వరం మెడికల్ కళాశాల కనీస మౌలిక సదుపాయాలు కరువు అయినప్పటికీ భవనానికి నెలకు రూ.16 లక్షల అద్దె కాలేజీ ఒకచోట.. అనుబంధ ఆస్పత్రి మరోచోట అటు, ఇటు తిరగలేక విద్యార్థుల అవస్థలు ఎంసీఐ నిబంధనలు బేఖాతరు -
దళారులపై చర్యలకు వినతి
ఆమనగల్లు: స్థానిక కూరగాయల మార్కెట్లో రైతులను మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా మార్కెట్లో మోండా పేరుతో కొంతమంది దళారులు రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేయడంతో పాటు తరుగు, కమీషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వీరికి గతంలోనే మార్కెట్ కమిటీ నుంచి నోటీసులు అందజేశారని తెలిపారు. క్వారీ పనులు నిలిపివేయాలి.. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లిలోని సర్వే నంబర్ 302, 304లో కొనసాగుతున్న క్వారీ పనులను ఆపేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపతంర అందజేశారు. క్రషర్తో విపరీతమైన దుమ్ము, శబ్ద కాలుష్యం వెలువడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు తరుగు, కమీషన్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపణ -
ఎల్నినో వర్రీ
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026వికారాబాద్: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాధారణంగా 1.31 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, గత ఏడాది అది 1.41 లక్షల ఎకరాలకు చేరింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 15 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని 1,187 చెరువుల్లో చాలా వరకు ఇంకా నీరు చేరకపోవడం, భూగర్భ జలాలు పెరగకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 20 మండలాల్లో కేవలం ఐదు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదవగా, మిగతా ప్రాంతాల్లో లోటు లేదా అధిక లోటు వర్షపాతం నమోదైంది. వాతావరణం ఇప్పటికీ వేసవిని తలపించేలా ఉండటంతో సాగుపై ప్రభావం పడుతోంది. ఆందోళనలో కర్షకులు ఇప్పటికే నాట్లు సిద్ధం చేసుకున్న రైతుల్లో బోరుబావుల నీరు ఉన్నవారు మాత్రమే నాట్లు వేస్తున్నారు. చెరువులు, కుంటలపై ఆధారపడిన రైతులు మాత్రం వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు బోరుబావుల్లోనూ నీటి మట్టం తగ్గిపోవడంతో వేసిన పంట నిలుస్తుందా లేదా అనే సందేహం రైతులను వేధిస్తోంది. అధికారులు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకు, అవసరమైతే సెప్టెంబర్ మొదటి వారం వరకు కూడా వరి నాట్లు వేయవచ్చని సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యతను బట్టి మాత్రమే వరి సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ విత్తనాలు అనుకూలం ప్రస్తుతం జిల్లాలో రైతులు బీపీటీ–5204, ఎంటీయూ–1010, ఎంటీయూ–1001, చిట్టిముత్యాలు వంటి రకాల విత్తనాలు సాగు చేస్తున్నారు. అయితే ఖరీఫ్లో సంబామసూరి, బరణి, కాటన్ దొరసన్నలు, సోమశిల, సింహపురి, తెలంగాణ సోనా రకాలు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎంటీయూ–1010, ఎంటీయూ–1001 రకాలు రబీ సీజన్కు మరింత అనుకూలమని అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ తొలి వారంలోపు నాట్లు వేస్తే ఎకరానికి సుమారు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, రబీలో మరో 5–10 బస్తాలు అధికంగా వచ్చే అవకాశముందని తెలిపారు. చెరువులు నిండక తగ్గనున్న సాగు విస్తీర్ణం 15 వేల ఎకరాల్లోనే నాట్లు వర్షాల కోసం రైతుల ఎదురుచూపు నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన వికారాబాద్లో వర్షాభావ పరిస్థితులు -
నేడు వాహనాల వేలం
తాండూరు: స్థానిక ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో సోమవారం రెండు వాహనాలను వేలం వేస్తున్నట్లు తాండూరు ఎకై ్సజ్ సీఐ రాణి ఓ ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిఽధిలో పలు రకాల కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను(టీవీఎస్ స్టార్ సిటీ, ఫ్యాషన్ ప్లస్) మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ వేలంలో పాల్గొని వాహనాలను సొంతం చేసుకోవాలని సూచించారు. కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వసతులను కల్పించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆస్పత్రిలో పలు వార్డులను సందర్శిస్తూ.. మరుగుదొడ్లు, తాగునీరు, బ్లడ్ బ్యాంకు, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్, అన్ని రకాల సర్జన్లను నియమించాలన్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజుకుమార్గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రామ్రెడ్డి, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి నయిమత్అలీ మోమిన్పేట: ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి నయిమత్అలీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మేకవనంపల్లి, మోమిన్పేట గ్రామాల్లో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. దేశంలో ఎక్కడైన పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉంటుందన్నారు. గతంలో ఎక్కడ నివసిస్తే అక్కడ ఓటరుగా నమోదు చేసుకునే వారని, అందుకే ఒకటి రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకునేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం పూర్తిగా ఆన్లైన్ కావడంతో ఒక్క చోటే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. గడువు దగ్గర పడుతుందని, వేగంగా డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఆయన వెంట బీఎల్ఓలు సుభాష్గౌడ్, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. తుర్కయంజాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు డి.కిషన్ పిలుపునిచ్చారు. రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన కొన్ని రోజులుగా కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్ భరోలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎ. భాస్కర్ రెడ్డి, లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు కె.అరుణ్ కుమార్, నాయకులు ఐ.భాస్కర్, కె.వెంకటకృష్ణ, శ్రీనివాసులు, అండాలు తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. పోటీలను మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్లో 32 టీమ్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతిని దేవునిపడకల్, రెండో బహుమతిని పడకల్, మూడో బహుమతిని పాపిరెడ్డిగూడ, నాలుగో బహుమతిని ఆకుతోటపల్లి టీమ్ గెలుచుకున్నాయి. విజేతలకు సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్ పులిజాల మహేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఏరువాక.. నామమాత్రపు రుసుముతో అద్దెకు ఇవ్వాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఏరువాక రైతుసేవా కేంద్రం నిరుపయోగంగా మారింది.
దోమ: వానాకాలంలో విష సర్పాలు, తేళ్ల సంచారం ఎక్కువ. పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాము, తేలు కాటుకు గురైనప్పుడు నాటు వైద్యం కాకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని చెబుతున్నారు. ఆందోళనకు గురైతే గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 33 మంది పాముకాటు బారిన పడి మృతి చెందారు. మరో 692 మందికి ఏఆర్వీ వ్యాక్సిన్ ఇచ్చారు. నాటు వైద్యం వద్దు వేసవిలో ముళ్ల పొదలు, రాళ్ల మధ్యలో దాగి ఉన్న పాములు, తేళ్లు వర్షాలు కురవడంతో బయటకు వస్తుంటాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు వాటి కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. పాము కాటు బాధితుడిని ప్రశాంతంగా ఉంచి సమీప ఆస్పత్రికి తరలించాలి. భయపడితే గుండె వేగంగా కొట్టుకోవడంతో విషం శరీరమంతా త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాయాన్ని బ్లేడ్తో కోయడం, విషాన్ని నోటితో పీల్చడం వంటి చర్యలు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. చేతికి ఉంగరాలు, గడియారాలు, బిగుతైన దుస్తులు ఉంటే వెంటనే తొలగించాలి. ఆ తేళ్లు ప్రమాదకరం పంట పొలాల్లో ఎక్కువగా ప్రమాదకర తేళ్లు బయటకు వస్తుంటాయి. నల్ల తేలు కుట్టినప్పుడు తీవ్రమైన నొప్పి, వాపు, మంట కలుగుతుంది. ఎరుపు తేలు కాటు గుండె, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పసుపు రాతి తేళ్లు, చెక్క దిమ్మెల కింద ఎక్కువగా కనిపిస్తాయి. తేలు కుట్టిన శరీర భాగాలను సబ్బుతో శుభ్రంగా కడిగి ఐస్ప్యాక్ ఉంచాలి. కుట్టిన భాగాన్ని ఎక్కువగా కదపకుండా ఉంచి వెంటనే వైద్యులను సంప్రదించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు బాధితులు వెంటనే సమీప సర్కారు దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించాలి. నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. రైతులు పొలాలకు వెళ్లేటప్పడు తగిన జాగ్రత్తలు పాటించాలి. – సుధాకర్లాల్, జిల్లా వైద్యాధికారి విష సర్పాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వెంటనే సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంపొందించడం ద్వారా విషసర్పాలు, తేళ్ల కాటుతో జరిగే మరణాలను గణనీయంగా తగ్గించే ఆస్కారం ఉంది. – రజిత, మండల వైద్యాధికారి, దోమ వర్షా కాలంలో విషసర్పాలు, తేళ్ల బెడద కాటేస్తే ప్రథమ చికిత్స తప్పనిసరి జిల్లా వ్యాప్తంగా 33 మంది మృతి దౌల్తాబాద్: పాముకాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజాషా(60) ఉదయం తన సొంత పొలంలో గడ్డి కోస్తున్నారు. ఈ క్రమంలో చేతికి పాము కాటు వేసింది. వెంటనే గమనించి ఇంటికి వచ్చారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరంలోకి పాకడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ వేణుకుమార్ తెలిపారు. -
నమ్మించి.. మోసగించి
పరిగి: నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్న అధికార యంత్రాంగం మాటలు నీటి మీద రాతలుగా మారాయి. మరోవైపు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రైతుల పరిస్థితి దాపురించింది. అసలే వర్షాభావ పరిస్థితులకు విలవిలలాడుతున్న సమయంలో నకిలీ డీఏపీ వ్యవహారం కలకలం రేపుతోంది. పూడూరు, పరిగి మండలాల్లో నకిలీ ఎరువులతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్ కన్నా తక్కువ ధరలకు ఎరువులను విక్రయిస్తుండటంతో ఎగబడి కొనుగోలు చేశారు. ఇప్పుడవి నకిలీవని ప్రచారం జరుగుతుండడంతో అయోమయంలో పడ్డారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు డీఏపీకి డిమాండ్ పెరిగింది. డీలర్లు కూడా ప్రభుత్వం అందించాల్సిన ధర బస్తాకు రూ.1,350 కాకుండా రూ.1,800 విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా కేటుగాళ్లు నేరుగా కంపెనీ నుంచి వచ్చి విక్రయిస్తున్నామని నమ్మించి మార్కెట్లో దొరికే హోలోగ్రామం ఉన్న బస్తాలను రూ.1,700 చొప్పున రైతులకు విక్రయించారు. అధికారుల కనుసన్నల్లోనే! ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ డీఏపీని కొనుగోలు చేసి గ్రామాల్లోని రైతులకు మధ్యవర్తుల ద్వారా విక్రయించారు. వారం పది రోజుల పాటు ఎలాంటి అనుమతులు లేకుండా దళారులు డీఏపీ విక్రయిస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా జరిగిందని పలువురు రైతులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిగి చర్యలు తీసుకోవాలని ఆరుగాలం శ్రమించే అన్నదాతలు కోరుతున్నారు. గ్రామాల్లో నకిలీ డీఏపీ కలకలం పరిగి, పూడూరు మండలాల్లో వెలుగులోకి దందా వేల బస్తాలు రైతులకు విక్రయించినట్లు అనుమానాలు పట్టించుకోని వ్యవసాయ అధికారులుమార్కెట్ కన్నా తక్కువ ధరకు, నేరుగా ఇంటికే డీఏపీ ఎరువు వస్తుందని రైతులు సంబరపడ్డారు. తీసుకొని పంటకు వేస్తుండగా.. చేతులకు బొబ్బలు రావడం, నీటిలో కరగకపోవడంతో ఖంగుతిన్నారు. ఇదీ పరిగి, పూడూరు మండలాల్లో కొంతమంది రైతుల పరిస్థితి. పూడూరు మండలం మంచన్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత వారం రోజులుగా సుమారు 500 బస్తాల నకిలీ డీఏపీ ఎరువును విక్రయించినట్లు సమాచారం. ఇదే వ్యక్తి పరిగి మండలం చిగురాల్పల్లిలో 200 బస్తాలు, బసిరెడ్డిపల్లిలో 100 బస్తాలు, కల్నాపూర్లో సుమారు 350 బస్తాల వరకు విక్రయించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాల్లో డీఏపీ ఎరువును వేస్తున్న సమయంలో కొందరి చేతులకు బొబ్బలు వచ్చాయి. అలాగే డీఏపీ నీటిలో కరగకపోవడంతో అది నకిలీ ఎరువని రైతులు అనుమానించారు. దీంతో సదరు వ్యక్తిని రైతులు నిలదీయగా, తాను తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు, వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి రావనే భయంతో పలువురు కర్షకులు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. -
● వైభవంగా బోనాల ఊరేగింపు
కొడంగల్ రూరల్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని తెలంగవాడలో ఆదివారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. మత్స్య సహకార సంఘం, ముదిరాజ్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగవాడ నుంచి బండల ఎల్లమ్మ దేవాలయం వరకు మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బాజాబజంత్రీలు చప్పుళ్లు చూపరులను కనువిందు చేశాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని అమ్మవారికి బోనాల నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ ధర్నాలో విదేశీ శక్తులు
ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అనంతగిరి: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో విద్యార్థులకన్నా ఇతరులే ఎక్కువగా ఉన్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఈమేరకు శనివారం ఆయన వికారాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ధర్నాలో దేశాన్ని విచ్ఛిన్నం చేసే విదేశీ శక్తులే ఉన్నాయన్నారు. అక్కడ ధర్నా శాంతియుతంగా చేయకపోవడంతో పాటు బారికేడ్లు దాటుకుని వచ్చారన్నారు. కాక్రోచ్ పార్టీ అమెరికాలో పుట్టిందని, దీన్ని సృష్టించింది ఒక సోషల్ మీడియా కన్సల్టెంట్ అని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ నేరుగా సమీక్షిస్తున్నారని స్పష్టంచేశారు. మోదీకి విద్యార్థులపై నమ్మకం ఉందని తెలిపారు. పేపర్ లీకై న వెంటనే ఆయన పరీక్షను రద్దు చేశారన్నారు. వికారాబాద్లో బీజేపీ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్రావు, మాధవరెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, శ్రీధర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
దరఖాస్తు చేసుకోండి
దుద్యాల్: మండలంలోని చిలుముల్ మైల్వర్ గ్రామంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాఘవేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో ఎస్సీ –1, ఎస్టీ –1, 7వ తరగతిలో ఎస్సీ –1, బీసీ –1, 8వ తరగతిలో బీసీ –1, 9వ తరగతిలో ఎస్సీ –1, ఓసీ ఒక సీటు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటో, బోనఫైడ్ సర్టిఫికెట్తో పాఠశాలలో సంప్రదించాలని సూచించారు. లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్ల తెలిపారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 9676927579, 9493449755, 9949764208లలో సంప్రదించాలన్నారు. రైతు ఆత్మహత్య బంట్వారం: ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం కోట్పల్లి మండల పరిధిలోని రాంపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ శైలజ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మదారం కృష్ణ (35) వ్యవసాయం చేస్తుంటాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో శనివారం ఉదయం పత్తి చేనుకు పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. అప్పటికే మద్యం తాగిన కృష్ణ అదే మత్తులో పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. కృష్ణ భార్య గంగోత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
అంతిమ నివాళి
షాబాద్: ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిల తల్లి పట్నం రుక్కమ్మ అంత్యక్రియలను ఆమె స్వగ్రామమైన గొల్లూరుగూడలో శనివారం పూర్తిచేశారు. మాజీ మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్, బైరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్కుమార్రెడ్డి, దామోదర్రెడ్డి, ఏవీన్రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, వీర్లపల్లి శంకర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, మహేశ్రెడ్డి, మెతుకు ఆనంద్, కేఎస్ రత్నం, జైపాల్యాదవ్, కేఎల్లార్, ప్రతాప్రెడ్డి, అల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, సుధీర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగేందర్గౌడ్, వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి, నాయకులు కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి తదితరులు రుక్కమ్మ మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
తోటికూలీలతో వెళ్తుండగా..
కడ్తాల్: తోటి కూలీలతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. మక్తమాధారం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.. సీఐ సైదిరెడ్డి, బాధితురాలి కథనం ప్రకారం.. న్యామతాపూర్ గ్రామానికి చెందిన జాల మణెమ్మ తోటి మహిళా కూలీలతో కలిసి పనికోసం మక్తమాధారం వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో షాద్నగర్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు మాస్క్ ధరించిన దుండగులు మణెమ్మ మెడలోంచి పుస్తెల తాడును లాక్కుని పరారయ్యారు. నంబర్ లేని బైక్పై వచ్చిన ముసుగు దొంగల చర్యతో మిగిలిన మహిళలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అంతా అరుస్తుండగానే మక్తమాధారం వైపు పారిపోయారు. సమాచారం అందుకున్న సీఐ సైదిరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి, వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం
కొత్తూరు: సోషల్మీడియా వినియోగంపై విద్యార్థులు నియంత్రణ పాటించాలని షాద్నగర్ డీసీపీ శిరీష సూచించారు. పట్టణంలోని కేజీబీవీ హాస్టల్, కొత్తూరు పోలీస్స్టేషన్ను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో చదువుకున్న వారికే అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని గ్రహించి చదువుపై దృష్టి సారించాలని అన్నారు. క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా అతి వినియోగంతో చెడు వ్యసనాలకు బానిసలుగా మారే అవకాశం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో వచ్చే సమస్యలను వివరించారు. సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం స్టేషన్లో ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కేసుల ఛేదనలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ నర్సయ్య, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
చైన్స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు జిల్లాలోని మూడు చోట్ల పంజా విసిరారు. కేశంపేట మండలం సంతాపూర్, కడ్తాల్ మండలం మక్తమాధారం సమీపంలో ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు పుస్తెల తాళ్లు లాక్కెళ్లారు. కందుకూరు మండలం సాయిరెడ్డిగూడెంలో బాధిత మహిళ అప్రమత్తతతో చోరీ తప్పింది. కేశంపేట: మనవరాలితో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఈ ఘటన శనివారం ఉదయం సంతాపూర్లో కలకలం రేపింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సోమరాజు బాలమ్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇటీవల పనులకు వెళ్లిన డబ్బులు తెచ్చుకునేందుకు తన మనవరాలు భవాని (15)తో కలిసి ఇంటి నుంచి గ్రామంలోకి వెళ్తుండగా.. శ్మశానవాటిక సమీపంలోకి చేరుకోగానే నంబర్ ప్లేట్ లేని బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు బాలమ్మ ముందు వాహనం నిలిపారు. వెనక కూర్చున్న వ్యక్తి కొల్లాపూర్ ఎలా వెళ్లాలి..? అని అడుగుతూనే.. రెప్పపాటులో బాలమ్మ మెడలోని బంగారు పుస్తెలతాడును లాగేశాడు. ఊహించని ఈపరిణామంతో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు పెద్దగా అరవడంతో దుండగులు మక్తమాధారం వైపు పారిపోయారు. నిందితులిద్దరూ నలుపురంగు మాస్కులు ధరించారని, వీరి వయస్సు సుమారు 40 సంవత్సరాల లోపు ఉంటుందని బాలమ్మ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ రాజ్కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ గ్రామానికి వెళ్లి, బాధితురాలితో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. సాయిరెడ్డిగూడెంలో.. యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కందుకూరు మండల పరిధిలోని సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిందం మంజుల శనివారం ఉదయం కాలినడకన ఇంటి నుంచి పొలానికి వెళ్తోంది. మార్గమధ్యలో మోటార్ సైకిల్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మంజుల మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించడానికి ప్రయత్నించగా, వెంటనే అప్రమత్తమైన మంజుల గట్టిగా కేకలు వేసింది. ఈ సమయంలో రోడ్డు పైనుంచి ఆటో రావడం, సమీపంలోని రైతులు రావడాన్ని గమనించిన దుండగుడు ముచ్చర్ల వైపు పారిపోయాడు. ఈ ఘటనలతో గ్రామీణ మహిళలు, పొలాల వద్దకు వెళ్తున్న కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రెండు చోట్ల మహిళల మెడలోంచి పుస్తెల తాళ్ల చోరీ మరోచోట దోపిడీకి యత్నించి విఫలం రోడ్డుపై వెళ్తున్న మహిళలే లక్ష్యంగా దాడులు ఆందోళనలో గ్రామీణ ప్రజలు -
పోరాటం ఆపొద్దు
ఇబ్రహీంపట్నం: దండుమైలారంలో ఓ దొర కబంధహస్తాల్లో ఉన్న గ్రామకంఠం భూమిని దక్కించుకునేంత వరకు పోరాటం ఆపొద్దని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. గ్రామకంఠం భూమి సాధన కోసం సర్పంచ్ ఈదులకంటి నరేష్గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షను శనివారం ఆయన ప్రారంభించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదెకరాల భూమి ఎవరిదో తేలేవరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అన్నారు. పది ఎకరాలు సాధిస్తే 700 మంది పేదలకు 70 గజాల చొప్పున ఇంటి స్థలం దక్కుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూస్వామి చెరలో ఉన్న భూమిని విడిపించి, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజ్కమల్, రాష్ట్ర కమిటీ సభ్యుడు తులసిగారి రవీందర్, ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి,రాకేష్, పీఏసీఎస్ చైర్మన్ ఎం.అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
యూనిఫాంలు వచ్చేశాయ్
చేవెళ్ల: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫాంలు, షూ, సాక్స్లు వచ్చేశాయి. శనివారం మండల విద్యావనరుల కేంద్రానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఈఓ పురన్దాస్ పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనిఫాంలు, షూ, సాక్స్, వసతి గృహంలోని విద్యార్థులకు టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్లు మండలాలకు సరఫరా అయ్యాయన్నారు. మండలంలోని మొత్తం 65 పాఠశాలలకు సంబంధించి మొత్తం 4,229 మంది విద్యార్థులు యూనిఫాంలు వచ్చాయన్నారు. ఆగస్టు 15 నాటికి యూనిఫాంలను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. -
ముస్కాన్ను సమర్థవంతంగా నిర్వహించాలి
అనంతగిరి: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ –12ను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు ఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. శనివారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆపరేషన్ ముస్కాన్పై సబ్ డివిజన్ బృందాలు, సంబంధిత శాఖల అధికారులు, భాగస్వామ్య విభాగాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇది వరకు చేపట్టిన కేసులపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీసీపీయూ ఇన్చార్జ్ కాంతారావు, కార్యక్రమ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ అన్వర్పాషా తదితరులు పాల్గొన్నారు.అదనపు ఎస్పీ రాజేశ్ మీనా -
ప్రాణాలుపోతున్నా పట్టించుకోరా..
● చిన్నారి సహస్ర మృతిపై విద్యార్థి సంఘాల ఆందోళన ● విద్యాశాఖ, రవాణా శాఖ అధికారుల పనితీరుపై విమర్శలు కొందుర్గు: కాసులకు కక్కుర్తి పడుతున్న పలు ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు విద్యార్థులను తరలించేందుకు కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తున్నాయి. అరకొర వేతనాలు ఇస్తూ వచ్చీరాని డ్రైవర్లకు స్టీరింగ్ అప్పగిస్తున్నాయి. ఫిట్నెస్ లేని వాహనాలను నడపడంతో పాటు కనీసం హెల్పర్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అమాయక చిన్నారులు గాయాలపాలవడంతో పాటు పలు సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతలోనే దారుణం.. కాస్లాబాద్ గ్రామానికి చెందిన మనీష, కృష్ణయ్య దంపతుల నాలుగేళ్ల కూతురు సహస్ర శుక్రవారం పాఠశాల బస్కింద పడి చనిపోయిన ఘటన బాధిత తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. ఇరవై రోజుల క్రితమే చిన్నారిని జిల్లేడ్చౌదరిగూడలోని అభ్యాస్ విద్యాపీఠంలో చేర్పించారు. ఉదయం సహస్రను స్కూల్కు పంపించిన అనంతరం తల్లిదండ్రులు పనులకు వెళ్తారు. మరో కూతురును కృష్ణయ్య తల్లి చూసుకుంటుంది. సాయంత్రం బస్సు వద్దకు వెళ్లి సహస్రను ఇంటికి తీసుకువస్తుంది. శుక్రవారం సహస్ర కోసం వేచిచూస్తుండగా చిన్నపాప నీళ్లు కావాలని ఏడ్వడంతో అప్పటివరకూ వేచి ఉన్న నాయనమ్మ అప్పుడే ఇంటికి వెళ్లింది. ఆమె తిరిగివచ్చేలోపే దారుణం జరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లేడ్చౌదరిగూడలో ఆందోళన నిర్వహించారు. కాలం చెల్లిన బస్సే.. అభ్యాస్ విద్యా పీఠంలో 1నుంచి 8వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిని వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చేందుకు మూడు బస్సు లను వినియోగిస్తున్నారు. ఇందులో ఓ బస్సును ఇటీవలే కొనుగోలు చేశారని ఎంవీఐ స్వప్న తెలిపారు. మిగిలిన రెండు బస్సుల కాలపరిమితి ముగిసి ఉండవచ్చన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు కాలం చెల్లినదేనని ధ్రువీకరించారు. -
ఐదు ట్రాక్టర్లు సీజ్
తాండూరు: కాగ్నానదిలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్ల సీజ్ చేశామని తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్గౌడ్ శనివారం పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి రెండు వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు మరో మూడు ట్రాక్టర్లను పట్టుకొని అప్పగించారన్నారు. మొత్తం ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసు నమోదు చేశామని స్పష్టంచేశారు. ట్రాక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా, యువకుడికి గాయాలయ్యాయి. శనివారం ఈ సంఘటన తిమ్మాపూర్ సమీపంలోని హెచ్ఐఎల్ పరిశ్రమ వద్ద చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్లోని శాసీ్త్రపురం ప్రాంతానికి చెందిన సానియాబేగం (20), ఫలక్నుమాకు చెందిన మునీర్(24)కు వివాహం నిశ్చయం కాగా, ఇటీవల ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఈక్రమంలో కాబోయే దంపతులు మొక్కులో భాగంగా ఇద్దరి ఇళ్లలో చెప్పి, నగరం నుంచి బైక్పై జేపీదర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా, హెచ్ఐఎల్ సమీపంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సానియాబేగం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఖైరాఉన్మీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుడికి విద్యుత్ షాక్ షాద్నగర్: కరెంట్ షాక్కు గురైన మున్సిపల్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపాలిటీ విద్యుత్ విభాగంలో పని చేస్తున్న భూషణ్ లింగం శనివారం ఉదయం పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ పాఠశాల సమీపంలో స్తంభం పైకెక్కి లైట్లకు మరమ్మతులు చేస్తున్నాడు. ఈసమయంలో ఒక్కసారిగా షాక్ రావడంతో నిచ్చెన పైనుంచి కిందపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానిక కౌన్సిలర్ రాజునాయక్ అతనికి సీపీఆర్ చేసి, చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, మున్సిపల్ కమిషనర్ సునీత, వైస్ చైర్మన్ అందె మోహన్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖదీర్, ఏఈ ఇలియాస్ తదితరులు బాధితుడిని పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శంషాబాద్లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విత్తన మేళాను విజయవంతం చేయండి ఇబ్రహీంపట్నం రూరల్: అన్ని రైతు వేదికల్లో ఈనెల 27, 28, 29 తేదీల్లో ఏర్పాటు చేయనున్న విత్తన మేళాను విజయయంతం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత కోరారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్నినో నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటే వేసుకోవాలని రైతులకు సూచించారు. కంది, పెసర, ఆముదం, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. డిగ్రీలో ప్రవేశానికి నేడు చివరి అవకాశం షాద్నగర్: గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల షాద్నగర్లో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరడానికి ఆదివారంతో గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఎంపీసీ, ఎంజెడ్సీ, బీజెడ్సీ, ఎంపీసీఎస్, బీఏ, బీకాం, ఇంటిగ్రేటెడ్ పీజీ కెమిస్ట్రీ కోర్సులు ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 97034 41345, 81252 14019 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కబ్జా భూమిని రీ సర్వే చేయించండి
యాచారం: సర్వేనంబర్ 127లో అసైన్డ్ రైతుల కబ్జా భూమిని రీ సర్వే చేయించాలని, కబ్జాలోని రైతులకు పరిహారం చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మొండిగౌరెల్లి రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సర్పంచ్ కోలన్ రమాదేవి ఆధ్వర్యంలో 127 సర్వేనంబర్తోపాటు 19, 68 సర్వేనంబర్ల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టాదారు, పాసుపుస్తకాల్లో కంటే తక్కువ ఎకరాలకు పరిహారం అందజేసేలా జాబితా ప్రకటించారని పేర్కొన్నారు. రీ సర్వే చేయించాలని తహసిల్దార్ను కోరితే సమాధానం ఇవ్వకపోగా వెళ్లిపొండని దురుసుగా మాట్లాడారని మండిపడ్డారు. కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. వ్యక్తిగత పని మీద వచ్చిన రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి రైతులతో మాట్లాడినా వినిపించుకోలేదు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు కల్పించుకుని వారిని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. సర్వేనంబర్ 127ను రీ సర్వే చేయిస్తానని, కబ్జా రైతులకు పరిహారం చెల్లింపై త్వరలో కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశం ఏర్పాటు చేయిస్తానని ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా -
ఢిల్లీ అల్లర్ల వెనుక విదేశీ కుట్ర
● కాక్రోచ్ జనతా పార్టీకి నక్సలైట్ల అండ ● దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాహుల్ ప్రయత్నం ● రేవంత్రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుషాద్నగర్: దేశంలో అశాంతిని సృష్టించి, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ శక్తులు కుట్రలు పన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. షాద్నగర్ శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. కొంతమంది సినిమా వాళ్లు, ఆటగాళ్లు, నక్సలైట్లు కలిసి దేశంలో అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీతో ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. గతంలో హైదరాబాద్లో ఈపార్టీ నిర్వహించిన సమావేశానికి నక్సలైట్లు హాజరయ్యారని తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలో కాంగ్రెస్ నాయకులు సైతం ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ అనేక ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, అప్పుడు కేంద్ర మంత్రులు ఎవరైనా రాజీనామా చేశారా.. అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాహుల్గాంధీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని, విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రాజకీయ డ్రామాలు సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ ఒక్కటేనని, వీదిద్దరూ కలిసి రాష్ట్రంలో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని రాంచందర్రావు దుయ్యబట్టారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ఎంఐఎంకు మద్దతు తెలిపాయన్నారు. దేశంలో ఏం జరిగినా రేవంత్రెడ్డి, కేటీఆర్లు ఒక్కటై ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు ఆందోళనలు చేస్తుంటారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో గ్రూప్– 1, ఇంటర్ పేపర్లు లీకయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, యూనివర్సిటీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ అన్ని స్థానాలను క్లీన్స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్గౌడ్, నాయకులు బూర నర్సయ్య గౌడ్, బొక్కా నర్సింహారెడ్డి, రఘునాథ్రావు, అంజన్కుమార్ యాదవ్, శ్రీవర్ధన్రెడ్డి, అందెబాబయ్య, కక్కునూరి వెంకటేశ్గుప్తా, డాక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
కుల్కచర్ల: వసతిగృహ విద్యార్థులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కే జనార్దన్ సూచించారు. శుక్రవారం మండలంలోని బండవెల్కిచర్ల, కుల్కచర్ల గ్రామాల్లోని వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే ఉంటారని, వారికి అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో బాలుర వసతిగృహ ప్రత్యేకాధికారి సుందర్రాజ్, ఉపాధ్యాయులు రాజేందర్ రాథోడ్, సతీష్, గోపాల్, రమేష్, రాముడు, నర్సింలు, వంశీకృష్ణ, శ్రీకాంత్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జనార్దన్ -
పరిహారం ఇచ్చాకే భూమి
దౌల్తాబాద్: నష్టపరిహారం అందిన తర్వాతే భూములు అప్పగిస్తామని రైతులు స్పష్టం చేశారు. నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం తహసీల్దార్ వెంకట్స్వామి మాట్లాడగా.. వారు పై విధంగా స్పందించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. తగిన పరిహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. కొడంగల్ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎత్తిపోతల పథకం అమలు చేయనుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డీటీ వెంకటాచారి ఉన్నారు. దుద్యాల్: నారాయణపేట్– కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్, దుద్యాల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాలతో పాటు నారాయణపేట్ జిల్లా పరిధి కోస్గి, మద్దూర్, గుండుమల్, కొత్తపల్లి మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏటీ కాల్వల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దుద్యాల్ మండలం హస్నాబాద్, కుదురుమల్ల గ్రామంలో భూ సర్వే పూర్తయింది. శుక్రవారం రెండు బృందాలుగా ఏర్పడి, కుదురుమల్లలో 21 ఎకరాలు, హస్నాబాద్లో 28 ఎకరాల సర్వే ప్రక్రియను ముగించామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇందులో సర్వేయర్ దేవెందర్, జీపీఓ గోపాల్, రెవెన్యూ సిబ్బంది ఊషప్ప, రైతులు తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తాండూరు: కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. శుక్రవారం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తాండూరులో ఎన్ఎస్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. జిల్లా ఆస్పత్రి, మాతా శిశు కేంద్రంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్పీ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీవాణి, సభ్యులు అబిద్, భానుప్రసాద్, జావీద్, రాము, సాయి, మహేశ్, మొయిజ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్: మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి పరిశీలించారు. చిట్లపల్లిలో పర్యటించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అంగడిరాయిచూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కొడంగల్ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనులను పరిశీలించి వేగవంతంగా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, ముస్తాక్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ రాగి తీగల చోరీ మహేశ్వరం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, పాండు రంగారెడ్డి వ్యవసాయ పొలంలో ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని సుమారు 60 కిలోల రాగి తీగలను దుండగులు గురువారం అర్ధరాత్రి దొంగిలించారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలను ఎత్తుకెళ్లిన ఆనవాళ్లను గమనించి పోలీసులు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సభా నిర్వహణ దక్కలేదనే ఆరోపణలు
షాద్నగర్రూరల్: అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో నిర్వహణ దక్కలేదనే అక్కసుతో ఆరోపణలు చేయడం సరికాదని టీజేఏసీ చైర్మన్ జనార్దన్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన టీజేఏసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మారకార్థం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో స్తూపాన్ని నిర్మించి ఆవిష్కరణ చేశారు. దీనికి జేఏసీ నాయకులు రేయింబవళ్లు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఆవిష్కరణ సభా నిర్వహణ ఇవ్వలేదనే అక్కసుతో టీచర్ టీజేఏసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి టీజేఏసీ చైర్మన్పై సమైక్యవాది అని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నానరు. ఉద్యమ సమయంలో టీజేఏసీ సన్నాహాక సమావేశాన్ని ప్రస్తుత టీజేఏసీ చైర్మన్ ఇంట్లోనే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. శ్రీధర్రెడ్డి ఆరోపణలను టీజేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో టీజేఏసీ నాయకులు వెంకటయ్య, శివారెడ్డి, నర్సింలుగౌడ్, కృష్ణయ్య, సత్యం, లక్ష్మీదేవమ్మ, కృష్ణ, బాలయ్య, రాములు, అర్జున్కుమార్, తావుర్యా, బాల్రాజ్, తిరుమలయ్య, రాము, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
భూ బాధితులకు ప్లాట్ల కేటాయింపు
షాబాద్: హెచ్ఎండీఏ వెంచర్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసే దిశగా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ పేర్కొన్నారు. శుక్రవారం షాబాద్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 311లో 290 ఎకరాల భూమి కుమ్మరిగూడ, షాబాద్, సంకేపల్లిగూడ, బోనగిరిపల్లి గ్రామల రైతులకు ఎకరాకు 750 గజాల ప్లాటు చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు లక్కీ డ్రా పద్ధతిలో కేటాయింపు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐ విజయ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య, సర్పంచులు అశోక్, శ్రీశైలం, లావణ్యచెన్నయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చెన్నయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
మంచాల: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరగాయల జంగారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం అడుగుజాడలోనే నడుస్తుందన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదల గురించి ఆలోచించే స్థితిలో ఈ ప్రభుత్వాలు లేవని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. అదానీ, అంబానీల ఆస్తులు ఊహించనిస్థాయిలో పెరగడం వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. నెల రోజుల వ్యవధిలోనే రూ.8 పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఘనత కేంద్రానికే దక్కుతుందన్నారు. ఆగస్టు 10న రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగే జైల్భరో కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జంగయ్య, నాయకులు కృష్ణ, యాదయ్య, జంగయ్య, జానీ, జంగారెడ్డి, మల్లేష్, పాండు, విజయ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి -
కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు
మొయినాబాద్: పెండింగ్ కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దని.. వేగవంతంగా దర్యాప్తు చేసి నాణ్యతతో పూర్తి చేయాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. మొయినాబాద్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణ, కార్యాచరణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సీసీటీఎన్ఎస్, ఈ–సాక్షి వ్యవస్థల వినియోగం, మాదకద్రవ్యాల నివారణ తదితర అంశాలపై నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్ను సందర్శించి రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్గౌతం, ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి, డీఐ ఉపేందర్ తదితరులు ఉన్నారు. ఫ్యూచర్సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి -
ఉద్యాన పంటలతో లాభాలు
అనంతగిరి: తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చే పూలు, పండ్లు, కూరగాయల వంటి పంటలు సాగు చేయాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శుక్రవారం వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగుతో లాభాలు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలన్నారు. ఆర్గానిక్ పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఉద్యాన శాఖ ఎండీహెచ్ పథకం కింద సెర్ప్ డీఆర్డీఓ సహకారంతో మహిళా రైతు అలివేలు షేడ్ నెట్లో సాగు చేస్తున్న చామంతి పంటను పరిశీలించారు. ఈ విధానంలో పంటలు సాగు చేస్తే చీడపీడల సమస్య ఉందన్నారు. అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సర్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్, డీఆర్డీఏ శ్రీనివాస్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సత్తార్, ఎంపీడీఓ వినయ్కుమార్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సర్పంచ్ జయలక్ష్మి, డీఈఓ మహమ్మద్ అబ్దుల్ ఘని, కేఏటీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో విద్యార్థులకు యూనిఫాం విద్యార్థులకు త్వరలో రెండు జతల యూనిఫాంలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల యూనిఫాంపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా విద్యార్థులకు యూనిఫాం అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, సీసీఓ వెంకటేశ్వర్లు, డీఏఓ కవిత, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కలెక్టర్ దీపక్ తివారి మహిళా రైతులతో సమావేశం -
ఒకరికి ఒకే ఓటు ఉండాలి
మోమిన్పేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆదేశించారు. శుక్రవారం మోమిన్పేటలో సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకోవాలని బీఎల్ఓలకు సూచించారు. ఎవరైతే ఫారాలు ఇవ్వరో వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు చెప్పారు. ఒకరికి ఒకే ఓటు ఉండాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో సర్ ప్రక్రియ 90శాతం పూర్తి కావచ్చిందన్నారు. తప్పులు లేకుండా ఫారాలు నింపాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునిరొద్దీన్, ఎంపీఓ సంజయ్కుమార్, ఆర్ఐ గోవర్ధన్, కార్యదర్శి మల్లేశం గౌడ్, బీఎల్ఓలు, నాయకుడు శుభాష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలి జిల్లా పంచాయతీ అధికారి జయసుధ -
నేడు విష్ణు సహస్ర నామ పారాయణం
కొడంగల్: ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం 9గంటలకు విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మొసలి కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులకు చెరువు ఒడ్డున కనిపించింది. 15 రోజుల క్రితం ఇదే చెరువులో మొదటి సారి కంటపడింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. త్వరలో మొసలిని పట్టుకుంటామని, అప్పటి వరకు ఎవరూ చెరువు పరిసరాల్లోకి.. చేపల వేటకు వెళ్లరాదని ఫారెస్టు అధికారులు సూచించారు. కొడంగల్: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ, యువతి మృతి పట్ల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనలో మృతి చెందిన యువతికి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎరన్పల్లి శ్రీనివాస్, బుస్స చంద్రయ్య, సాయిలు, శ్రీనివాస్, రాములు, కృష్ణ, వెంకటయ్య తదితరలు పాల్గొన్నారు. తాండూరు టౌన్: ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా పట్టణంలోని 9వ వార్డులోని రాయకుంట కట్టమైసమ్మ ఆలయంలో శుక్రవారం గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీప ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరింటాకు నూరి చేతులకు పెట్టుకున్నారు. గోరింటాకు పండినట్లుగా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నట్లు దీప తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సుప్రీత, నాగలక్ష్మి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. తాండూరు టౌన్: బీజేపీ నాయకులను అరెస్టు చేయడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీజేపీ నాయకులను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి భారతీయునికి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ముందస్తు అరెస్టులు చేయడం సబబు కాదని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్, లలిత, కిరణ్, శ్రీకాంత్రెడ్డి, ప్రకాష్, షాబుద్దీన్ తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
షాద్నగర్రూరల్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం డీఎం కరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలంటే టీజేఎంయూ బలపరిచిన నాయకులను గెలిపించాలని అన్నారు. గతంలో రెండు సార్లు టీఎంయూ గెలిచినా కార్మికులకు ఆశించిన ప్రయోజనాలు అందలేదన్నారు. పనిభారం, కిలోమీటర్ల పెంపుతో ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కార్మికుల కష్టాలను పట్టించుకోని నాయకులు ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపఽథ్యంలో మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఆర్డీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే లక్ష్యసాధనకోసం పని చేస్తున్న టీజేఎంయూకు మద్దతివ్వాలని కోరారు. అనంతరం సంఘం డిపో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ డిపో గౌరవ అధ్యక్షుడిగా గడ్డం శ్రీనివాస్యాదవ్, అధ్యక్షుడిగా నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేందర్గౌడ్, వైస్ ప్రెసిడెంట్గా శేఖరయ్య, కార్యదర్శిగా శ్రీధర్రావు, ప్రచారకార్యదర్శిగా నర్సింహ, కోశాధికారిగా రవి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనయ్య, ప్రధానకార్యదర్శి హన్మంత్, కార్యదర్శులు రాజు, ఆర్ఎన్ రావు, రీజినల్ కార్యదర్శి నాగేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు -
నీటి ఆధారిత పంటలు వద్దు
పరిగి: ఎల్నినో పరిస్థితుల కారణంగా వర్షాలు చాలా తక్కువ కురిసే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి, పరిగి ఏడీఏ అరుణ సూచించారు. శుక్రవారం పరిగి ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని రైతులకు ఎల్నినో ప్రభావం, పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. వరి, ఎక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేస్తే నష్టాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ రచిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎల్నినో నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్రెడ్డి -
ఆగని రెవెన్యూ దోపిడీ!
తాండూరు: భూ హక్కుదారులను రెవెన్యూ అధికారులు ఏదో ఒక మెలిక పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. భూ సమస్యలు ఉన్న రైతులను అష్టకష్టాలపాలు జేస్తున్నారు. ఇటీవల కాలంలో భూ సమస్యలు మరింత పెరిగిపోయాయి. రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పహాణి నకలు తీసుకోవాలన్నా కాసులు ఇవ్వాల్సిందే. ఇందు కోసం రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 8.73లక్షల ఎకరాల భూములున్నాయి. అందులో పట్టాదారులు దాదాపు 2.70లక్షల మంది వరకు ఉన్నారు. సేవలు దారుణం తాండూరు నియోజకవర్గంలో రెవెన్యూ సేవలు మరీ దారుణంగా తయారయ్యాయి. ప్రభుత్వ భూములను రక్షించడం తోపాటు రైతుల భూములకు సంబంధించి పట్టా మార్పిడి, విరాసత్, తప్పులను సరిదిద్దడంలో రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో సమస్య పరిష్కారానికి ఒక్కో రేటు విధించి దండుకుంటున్నారు. తండ్రి పేరిట ఉన్న భూమిని వారసుల పేరిట మార్చాలంటే పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు బాధిత రైతులు తెలిపారు. తప్పులు సరిచేయడానికి కూడా ఇదే తరహాలో వసూలు చేస్తున్నట్లు మరి కొందరు ఆరోపించారు. ప్రజావాణిలో 70శాతం మేర.. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి భూ సమస్యలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. గత సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి 70శాతం వరకు రెవెన్యూ పరమైన దరఖాస్తులే అందాయి. దీన్నిబట్టి చూస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. సర్వే చేయాలన్నా సంబంధిత అధికారికి ఇంత ముట్టజెబితే కానీ పొలానికి రాని పరిస్థితి నెలకొంది. రెవెన్యూలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం సర్కారు భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు ముందుండి అన్యాక్రాంతం అయ్యేలా చేస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీ తోపాటు తాండూరు, బషీరాబాద్ మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో నాపరాతి నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అందుకోసం ప్రతి నెలా రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా దేవాదాయ శాఖ భూములను పట్టాగా మార్చి కాసులు గడిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను పట్టాలు చేస్తూ రూ.లక్షల్లో అక్రమార్జన ప్రజావాణి ఫిర్యాదుల్లో 70శాతానికి పైగా ఆ శాఖ పరిధిలోనివే.. భూ భారతితో మరింత పెరిగిన అవినీతితాండూరుకు చెందిన ఖాసీంఅలీకి చెంగోల్ రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారు. గ్రామ సర్వే నంబర్ 200, 212లో ఖాసీం అలీ పేరిట 4.27 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు కుటుంబ సభ్యులకు తెలియకుండా పెద్ద మొత్తంలో లంచం తీసుకొని మహబూబ్బీ అనే మహిళ పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో ఖాసీంఅలీ కుమారులు అక్బర్అలీ, జాఫర్అలీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పట్టాను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.తాండూరు పట్టణం సాయిపూర్ గ్రామానికి చెందిన రాకేశ్ తాండూరు మండలంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. రెవెన్యూ పరమైన సమస్య తలెత్తడంతో సబ్ డివిజన్ కార్యాలయానికి వెళ్లాడు. సమస్య పరిష్కరించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ఓ ఉద్యోగి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే మనోహర్రెడ్డిని కలిసి తన బాధను వ్యక్తం చేశాడు. -
కాంగ్రెస్ – బీజేపీ నాయకుల బాహాబాహి
అనంతగిరి: ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల వ్యవహరించిన తీరుకు నిరసనగా శుక్రవారం వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరాస్తాలో బీజేపీ నాయకులు రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందుకు నిరనసగా యూత్ కాంగ్రెస్ నాయకులు మధ్యాహ్నం ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను ఉరి తీసి దహనం చేశారు. అటుగా వెళ్తున్న బీజేపీ నాయకులు మోదీ దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తోపులాటకు దారి తీసింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ నాయకులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అటుగా వెళ్తున్న ఎస్పీ స్నేహ మెహ్ర వాహనాన్ని ఆపి స్టేషన్కు వచ్చి ఘటనపై ఆరా తీశారు. మోదీ దిష్టిబొమ్మ దహనంపై ఘర్షణ ఇరు వర్గాలను అరెస్టు చేసిన పోలీసులు -
అధికలోడు.. అజాగ్రత్త
తాండూరు రూరల్: అధిక లోడు, ఆపై అజాగ్రత్తగా టిప్పర్లు దూసుకుపోతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా.. లోడుపై టార్పాలిన్ కవర్లు కప్పకుండా తరలిస్తున్నారని తెలిపారు. దీంతో వెనకాల వచ్చే వాహనదారులు దుమ్ముధూళితో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా వేసిన సీసీరోడ్లు సైతం ధ్వంసం అయ్యాయన్నారు. జిల్లాలోని మేజర్ పంచాయతీ కరన్కోట్ గ్రామ శివారులో ఆదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన క్రషర్ ఉంది. ఇక్కడి నుంచి లైమ్స్టోన్ను నిత్యం టిప్పర్ల ద్వారా బెల్కటూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారానికి తరలిస్తుంటారు. టిప్పర్లు రెండు రకాలుగా ఉంటాయని, అందులో ఒకటి 26 టన్నుల సామర్థ్యం కలిగిన దాంట్లో 41 టన్నుల వరకు, మరో టిప్పర్లో 21 టన్నులకు బదులు 35 టన్నుల లైమ్స్టోన్ను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇలా ఓవర్ లోడ్ తీసుకెళ్లడమే కాకుండా.. లోడుపై కనీసం టార్పాలిన్లు కూడా కప్పడం లేదంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, ఓవర్లోడ్ను అరికట్టాలని కరన్కోట్ గ్రామస్తులు కోరుతున్నారు. కనీస ప్రమాణాలు పాటించని టిప్పర్లు పట్టించుకోని అధికార యంత్రాంగం రోడ్లు ధ్వంసం.. వాహనదారుల ఇబ్బంది -
శాకాంబరిదేవిగా వాసవి మాత
తాండూరు పట్టణం నగరేశ్వర ఆలయంలో కొలువుదీరిన వాసవి మాత శుక్రవారం శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం ప్రారంభం కావడంతో వాసవీ మహిళా సంఘం సభ్యులు తీరొక్క కూరగాయలతో అమ్మవారిని అలంకరించి బోనాలు సమర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అమ్మవారిని దర్శించుకున్నారు. మహా కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలో సంఘం అధ్యక్షురాలు ప్రగతి, కార్యదర్శి కవిత, కోశాధికారి పల్లవి, ఆలయ చైర్మన్ సతీష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట మురళి, కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. – తాండూరు టౌన్ -
ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలి
దోమ: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ సూచించారు. శుక్రవారం మండలంలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావుతో కలిసి తనిఖీ చేశారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, ధరల పట్టికలు, లైసెన్సులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బషీరాబాద్ మండలంలో.. బషీరాబాద్: మండలంలోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు శ్రీనివాస్, రఘురామ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయాధికారితో కలిసి ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, ధరల పట్టికలు, లైసెన్సుల చెల్లుబాటు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ఎరువులను తగిన నిల్వలతో అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. విక్రయాల సమయంలో తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు చేయరాదని హెచ్చరించారు. నిబంధలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ -
బాల పురస్కార్కు దరఖాస్తు చేసుకోండి
అనంతగిరి: వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలబాలికలు పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్ – 2026కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికలు అర్హులని తెలిపారు. సోషల్ సర్వీస్, క్రీడలు, ధైర్య సాహసాలు, పర్యావరణం, కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని తెలిపారు. జాతీయ అవార్డు పోర్టల్లో జూలై 31 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రతిని జిల్లా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. బాలుడి అరెస్టు, రిమాండ్కు తరలింపు తాండూరు టౌన్: పక్కా సమాచారంతో తాండూరు పట్టణ పోలీసులు శుక్రవారం ఓ బాలుని వద్ద 10కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తాండూరుకు వచ్చాడు. అప్పటికే మాటు వేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని బ్యాగ్ను తనిఖీ చేశారు. అందులో 10 కిలోల గంజాయి లభ్యమైంది. బాలున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తనిఖీల్లో పట్టణ ఎస్ఐ నుమాన్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. -
కారు బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు
పూడూరు: కారు బైక్ ఢీ కొన్న ఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి వికారాబాద్కు వస్తున్న కారు.. వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న బైక్ మండలంలోని మన్నెగూడ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కొందుర్గు: స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందిన ఘటన జిల్లేడ్చౌదరిగూడ మండలం కాస్లాబాద్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మనీష, కృష్ణయ్య దంపతుల కూతురు సహస్ర(4) చౌదరిగూడలోని అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో యూకేజీ చదువుతోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు చిన్నారిని స్కూల్ బస్సులో పాఠశాలకు పంపించి, పనులకు వెళ్లారు. సాయంత్రం కాస్లాబాద్కు చేరుకున్న స్కూల్ బస్సు లోనుంచి అందరితోపాటు సహస్ర కిందికి దిగింది. బస్సును రివర్స్ తీసే క్రమంలో చక్రాల కింద పడిపోయింది. గమనించిన స్థానికులు షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే సహస్ర చనిపోయిందని స్థానికులు తెలిపారు. శంకర్పల్లి: నేరాల నియంత్రణ కోసమే తనిఖీలు చేపడుతున్నట్లు చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. మోకిల ఠాణా పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ ఫేజ్–2లో చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 52 బైక్లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం తనిఖీలు చేపట్టామని, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. శంకర్పల్లి: వారసత్వంగా వచ్చిన తమ భూమిని కొంత మంది వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు విజయానంద్గుప్తా గురువారం రాత్రి మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. జన్వాడలోని సర్వే నంబర్ 146లో 4.13 ఎకరాల భూమిని 1991లో తమ తాతలు కొనుగోలు చేశారని, అప్పటి నుంచి తామే కబ్జాలో ఉన్నామని తెలిపారు. గురువారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రహరీని కూల్చి, అక్రమంగా తన స్థలంలో కంటైనర్ని వేశారని తెలిపారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని మోకిల ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
హెల్మెట్ తప్పనిసరి
మొయినాబాద్: రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాలపాలవడంతోపాటు ప్రాణాలు కోల్పోతున్నారని ఫ్యూచర్సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ పాత గేటు వద్ద గురువారం ద్విచక్రవాహనదారులకు హెల్మెట్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనం నడిపే రైడర్తోపాటు వెనుక కూర్చున్నవారు సైతం తప్పనిసరి ఐఎస్ఐ ప్రమాణాలు ఉన్న నాణ్యమైన హెల్మెట్లు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతాయని.. వేగ నియంత్రణ పాటించాలన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్, కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్ -
ఉచిత వైద్య శిబిరం
కేశంపేట: రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శంషాబాద్లోని లిమ్స్ న్యూరో కార్డియో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వారు కేశంపేటలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కేశంపేట గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల నుంచి సుమారు 300 మంది రోగులు పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ భీమ్రెడ్డి, శ్రీశైలం, స్వచ్ఛంద సేవకులు ప్రవీణ, జ్యోతి, వేంకటేశ్వర్రావు, రామోదర్రెడ్డి, భీమయ్య, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన బాల్రాజ్
కొడంగల్ రూరల్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ అభిమాని తమ్మళి బాల్రాజ్ కలిశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పేలిన గ్యాస్ సిలిండర్ పరిగి: పట్టణంలోని ఓ హోటల్లో గురువారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై ంది. గమనించిన నిర్వాహకులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని, సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారని హోటల్ నిర్వాహకులు తెలిపారు. విద్యుదాఘాతంతో గేదె మృతి యాలాల: విద్యుదాఘాతంతో గేదె మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కమాల్పూర్ శివారులో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని నర్సింహులుకు చెందిన గేదెను మేతకు తీసుకెళ్లాడు. గ్రామ శివారులో పౌల్ట్రీ షెడ్డు కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు బాధిత రైతు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇబ్రహీంపట్నం: అనుమానాస్పదస్థితిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ వృద్ధుడి (సుమారు 70 ఏళ్లు) మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడిని మంచాల మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పూర్యా నాయక్గా గుర్తించారు. అక్కడున్న సీసీ పుటేజీలను పరిశీలించగా వృద్ధుడిని ఓ యువకుడు కాళ్లతో తంతున్నట్లు నమోదైంది. ఆ యువకుడి కారణంగానే వృద్ధుడు మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ట్రాక్టర్ యజమానిపై కేసు బొంరాస్పేట: విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాల వెంకటరమణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని మహంతీపూర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకోగా నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. దండ్ల జనార్దన్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని మహేశ్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కొందుర్గు: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహ్మద్ కుర్షీద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు శుక్ర, శనివారం నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు 10వ తరగతిడ మెమో, కుల, ఆదాయం సర్టిఫికెట్లు జిరాక్స్ ప్రతులను జతచేసి మధ్యాహ్నం 1 గంటలలోపు అందజేయాలన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీట్ల కేటాయింపు ఉంటుందని సూచించారు. -
భూగర్భ జలాల పెంపునకే జలసిరి
షాద్నగర్రూరల్: కురిసిన ప్రతీ వర్షపు చుక్కను ఒడిసిపట్టుకొని, నీటి సమస్యను ఎదుర్కొందామని డీపీఓ సురేష్మోహన్ పిలుపునిచ్చారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీఓ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎల్నినో వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీపీఓ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో నీటి మట్టం తగ్గిపోతోందని, భూగర్భ జలాలను పెంచుకునేందుకు ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతీ పంచాయతీ 200 ఇంకుడు గుంతలు, పొలాల్లో రైతులు నీటి కుంటలు, వర్షపు నీరు వృథా పోకుండా ఊట కుంటలను నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వీబీజీరాం పథకం ద్వారా ఈ పనులను అక్టోబర్ వరకు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్లు, అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. అనంతరం జలసిరి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో తహసీల్దార్ నాగయ్య, పీఆర్ ఏఈ గోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఏపీఓ అరుణ, ఏపీఎం జంగయ్య, ఉద్యనశాఖ అధికారి హిమబిందు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీపీఓ సురేష్మోహన్ -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
షాద్నగర్: ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి నిషాంత్కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో వానాకాలం పంటల ప్రణాళికపై రైతులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ నిషాంత్కుమార్ మాట్లాడుతూ.. బోర్లలో నీటి శాతం తక్కువగా ఉండటంతో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. జొన్న, మొక్కజొన్న, పెసర్లు, మినుములు, కంది, ఆయుధం, పొద్దుతిరుగుడు, తదితర పంటలను సాగు చేయాలని కోరారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మాత్రమే రైతులు వరినాట్లు వేయాలన్నారు. నారుమడిని తేమతో రక్షించాలని సూచించారు. నేల పరీక్ష ఆధారంగా రైతులు ఎరువులు వాడాలని, తేమ ఉన్నప్పుడు మాత్రమే యూరియా వేయాలని సూచించారు. జీవ ఎరువులు, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని రైతులు పెంచాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీకాంత్, రైతులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మండల వ్యవసాయాధికారి నిషాంత్కుమార్ -
వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలి
సాక్షి, సిటీబ్యూరో: కళాశాల స్థాయిలో విద్యతో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం బంజారాహిల్స్లో ‘ఒయాసిస్ ఫెర్టిలిటీ’ ఏర్పాటు చేసిన జననీ డైలాగ్స్– 2026 ప్యానల్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ వైద్యారోగ్య శాఖలో నేను పనిచేశాను. ఫెర్టిలిటీ సమస్యలపై నాకు అవగాహన ఉంది. లైఫ్ స్టైల్ మార్పులు, ఆహారపు అలవాట్లు ప్రభావం చూపిస్తున్నాయి. ఫెర్టిలిటీ సమస్యలు ఎదురైనపుడు ఐవీఎఫ్, ఇతర అధునాతన పద్ధతుల వైపు చూస్తున్నారు.. పిల్లలు కళాశాల విద్యార్థిగా ఉన్నపుడే తల్లిదండ్రులు ఐఐటీ, మెడికల్ సీటు కోసం ఆరాటపడుతున్నారు. శారీరక వ్యాయామం గురించి పట్టించుకోవడం లేదు. దక్షిణ భారతంలో ఇంటర్ విద్యార్థులు 17 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. శారీరక వ్యాయామానికి సమయం ఇవ్వడంలేదు. ఇది దీర్ఘకాలంలో దుష్ప్రభావాలను చూపిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి డా.ఎన్ సుమలత, ఒయాసిస్ ఫెర్టిలిటీ కో– ఫౌండర్ జి.కిరణ్, డైరెక్టర్లు హరిప్రసాద్, దుర్గారావు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ -
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
ఇబ్రహీంపట్నం రూరల్: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం బొంగ్లూర్లోని ప్రమిద గార్డెన్లో యువ చైతన్య వేదిక, శక్తి నైపుణ్యం పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్కు బానిసలు కావొద్దని సూచించారు. యువతను ప్రోత్సహించడానికి ఎంఆర్ఆర్ ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు. మాదక ద్రవ్యాలను రూపుమాపడానికి పోలీసులకు సహకరించాలని కోరారు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో యువత ఎక్కువగా మృత్యువాతపడుతున్నారని తెలిపారు. తప్పకుండా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కుమారుడు అభిషేక్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీలు కేపీవీ రాజు, ప్రదీప్కుమార్రెడ్డి, సీఐలు రమేష్, మహేందర్రెడ్డి, నందీశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు గురునాథ్రెడ్డి, చిలుక మధుసూదన్రెడ్డి, నాయకులు పైళ్ల శ్రీనివాస్రెడ్డి, కరుణాకర్రెడ్డి, పట్నం శివశంకర్, భరత్రెడ్డి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి -
వడివడిగా గ్రీన్ఫీల్డ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఔటర్ నుంచి ఆర్ఆర్ఆర్ను అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ దాదాపు పూర్తయింది. ఎత్తుపల్లాల చదును, అండర్పాస్లు, వంతెనల నిర్మాణ పనులు మొదలయ్యాయి. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎత్తయిన కొండలు, గుట్టలను తొలగించే పని మొదలైంది. 41.50 కిలోమీటర్ల దూరం 100 మీటర్ల విస్తీర్ణంలో 6 లేన్ల రహదారి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొత్తం వెయ్యి ఎకరాలు సేకరించారు. దీనిలో 87.66 హెక్టార్ల అటవీ భూమి కూడా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.4,030 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. రావిర్యాల ఎగ్జిట్ –13 నుంచి మీర్ఖాన్పేట, అటు నుంచి ఆకుతోటపల్లి వరకు 19.20 కిలో మీటర్లు ఫేజ్–1 కింద రూ.1,665 కోట్ల అంచనా వ్యయంతో పనులను చేస్తున్నారు. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ పనులను దక్కించుకుంది. ఇక మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు వరకు 22.30 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులను ఫేజ్–2 కింద చేపడుతున్నారు. రూ.2,365 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ పనులను ఎల్అండ్టీ దక్కించుకుంది. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతుల నష్టపరిహారాన్ని అదాలత్లో జమ చేశారు. ఎలాంటి వివాదం లేని చోట రోడ్డు విస్తరణ, కల్వర్టులు, వంతెనలు, అండర్పాస్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే భూ సేకరణ శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. కొత్వాల్గూడ, అమ్మపల్లి, నర్కూడ, సుల్తాన్పూర్, మల్కారం, కాచారం, రాయన్నగూడ, రామాంజాపూర్, సోలిపేట, హైతాబాద్, పెద్దవీడు, దామర్లపల్లి, మానపల్లి, నాగర్కుంట, బోన్గిరిపల్లి, కొమరబండ, ఉబ్బకుంట, కంకల్, మాచన్పల్లి, పరిగి, మాదారం, రాకంచర్ల మీదుగా త్రిబుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మెజార్టీ రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మార్కెట్ ధరకు మించి నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో కొంతమంది రైతులు భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. మరికొంత మంది మొండికేస్తుండటంతో వారి నష్టపరిహారాన్ని కోర్టులో జమ చేసి, భూ సేకరణ పనులు మొదలుపెట్టారు. కొనసాగుతున్న రేడియల్ రోడ్డు పనులు మొదటి విడతలో ర్యావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు సెకండ్ ఫేజ్లో మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి వరకు పనులు బుద్వెల్ నుంచి కొడంగల్ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు వేగంగా భూసేకరణ -
ఓటరు జాబితాలో అనర్హులు ఉండొద్దు
అనంతగిరి: రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ దీపక్తివారి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల్లో సర్ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో అర్హులు మాత్రమే ఉండాలని, అనర్హుల పేర్లు తొలగించాలని తెలిపారు. మార్పులు, చేర్పులు, సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. బూత్ లెవల్ అధికారులను సమన్వయం చేసుకుని ఇంటింటి ధ్రువీకరణను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నేమత్ అలి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కుల్కచర్ల: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్గా గ్రామానికి చెందిన కోట్ల మైపాల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాంబండ ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బాల నర్సయ్య, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో, చౌడాపూర్లో రైతు వేదికలో ఆయా మండలాల అధికారులు, సర్పంచులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్లు పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ అశోక్కుమార్, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ రామ్మోహన్శర్మ, కాంగ్రెస్ పార్టీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, చౌడాపూర్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఓట్లను కాపాడుకుందాం
తాండూరు/యాలాల: కాంగ్రెస్ ఓట్లను కాపాడుకుందామని, ఇందుకోసం బీఎల్ఏలు బాధ్యతగా పని చేయాలని పీసీసీ సర్ పర్యవేక్షకుడు కోటం వినయ్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వచ్చేలా చూడాలన్నారు. గురువారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్ ప్రక్రియపై బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, సర్ తాండూరు కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా నిర్వహించాలి ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సూచించారు. గురువారం యాలాల మండలం చెన్నారం గేటు వద్దగల అనిల్కుమార్ గార్డెన్లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ అధ్యక్షతన బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజుల్లో సర్ ప్రక్రియపూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ సర్ పర్యవేక్షకులు వినయ్రెడ్డి, జగదీశ్వర్రావు, నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివయ్య, ఉపసర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచ్లు అమర్నాథ్రెడ్డి, నరేష్కుమార్, అనిల్కుమార్, శ్రీవాణి, నాగమణి, రుక్మిణి, బీ బ్లాక్ అధ్యక్షుడు అనిల్కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు భీమప్ప, నాయకులు హన్మంతు, మధుసూదన్రెడ్డి, కలాల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాల కట్టడికి చర్యలు
ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతగా పని చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. గురువారం నగరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల ఎస్పీలతో సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తులో పురోగతి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించి సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే బాధితులకు సత్వర సహాయం అందేలా చర్యలు తీసుకోవా లని సిబ్బందికి సూచించారు. కేసుల దర్యాప్తు లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వి నియోగించాలన్నారు. అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలు, ఆన్లైన్ మోసాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. స్పోర్ట్స్ స్కూల్కు చెల్లాపూర్ విద్యార్థిని కుల్కచర్ల: రాష్ట్ర స్థాయి లో స్పోర్ట్స్ స్కూల్కు జరిగిన ఎంపిక పరీక్ష లో చెల్లాపూర్ ప్రాథ మిక పాఠశాల విద్యార్థిని కోస్గి హరిప్రియ ఎంపికై ంది. ప్రస్తుతం బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన పోటీల్లో ప్రతిభ చాటి ఎంపికై ంది. విద్యార్థిని హరిప్రియను హెచ్ఎం ఆనంద్కుమార్, ఉపాధ్యాయులు సంతోష, శ్రీనివాసులు, దస్తయ్య అభినందించారు. పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ బొంరాస్పేట: తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఏనెమీది తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, సర్పంచ్ సోమ్లానాయక్, సీనియర్ నాయకుడు భీంరెడ్డి, తండా పెద్దలు పాల్గొన్నారు. కార్పొరేట్కు దీటుగా గురుకులాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హుడాకాంప్లెక్స్: కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకులాలను ప్రభుత్వం తీర్చిదిద్దిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. సరూర్నగర్లోని విక్టోరి యా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూ ల్లో గురువారం ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్, అమెనిటీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం’ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. వీఎం హోంలో చదివే క్రీడాకారులు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని అభినందించారు. నీట్లో సరూర్నగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీ విద్యార్థులు సత్తా చాటి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్సీడీడీ కార్యదర్శి విజయేందిర బోయి, వీఎం హోం సెక్రటరీ సల్మాభాను, రోడ్లు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్రెడి పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
అనంతగిరి: విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జి, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీట్ పరీక్ష ఎంతో కఠినమైనదని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు భరించి పిల్లలను చదివిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో పేపర్ లీక్ అయ్యిందన్నారు. కోట్లాది మంది విద్యార్థులు భవిష్యత్తును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. విద్యార్థులకు క్షమాపణలు చెప్పడంతో పాటుగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి, నాయకులు చింటూ రెడ్డి, నిఖిల్ రెడ్డి, శివానందం, పలువురు నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు
అనంతగిరి: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. కేటీఆర్ రేపటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ వికారాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో గురువారం వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. రామయ్యగూడ పాఠశాలలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్సిళ్లు, పలకలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అన్నదానం చేశారు. అనంతరం కేక్ కట్చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఎన్నికల ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సూది ఉంటే దూది ఉండదన్నారు. రామయ్యగూడ పాఠశాల భవనం కూలిపోయేందుకు సిద్ధం ఉందన్నారు. స్కూల్లోకి పాములు వస్తున్నాయని, విద్యార్థులను భయాందోళన చెందుతున్నారని తెలిపారు. పాత భవనాన్ని తొలగించి కొత్తది నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కోటి ఆశల ‘కోట్పల్లి’
ధారూరు: కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు కావడంతో అలుగు, కుడి, ఎడమ, బేబి కెనాల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులో పూడిక పేరుకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. కాలువలు దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. సంవత్సరాల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో ఆయకట్టు ఆరుతడి పంటలకే పరిమితమైంది. ప్రాజెక్టు కింద మొత్తం 9,200 ఎకరాల ఆయకట్టు ఉండగా కేవలం 4,500 ఎకరాలకే సాగునీరు అందే పరిస్థితికి చేరింది. అనేక మార్లు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది. రైతుల ఆందోళనలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రత్యేక చొరవతో ఇటీవల ప్రాజెక్టు ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.86.30 కోట్లు మంజూరు చేసింది. నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభం కాగా 50శాతం మేర పూర్తయ్యాయి. ఆయకట్టు ఇలా.. ప్రాజెక్టు కుడి కాలువ 24కిలో మీటర్లు ఉండగా 7,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువ 11 కిలోమీటర్లు.. 1,640 ఎకరాల ఆయకట్టు, బేబి కెనాల్ 1.6 కిలోమీటర్లు.. 360 ఎకరాల ఆయకట్టు ఉంది. అలుగు, కాలువలు దెబ్బతినడంతో సగం ఆయకట్టుకే సాగునీరు అందుతోంది. చివరి ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లాకే తలమానికం కోట్పల్లి ప్రాజెక్టును 1967 సెప్టెంబర్ మాసంలో 1,784 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. ఈ ప్రాజెక్టు సాగునీటి వనరే కాకుండా పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ధారూరు మండలంలోని ఐదు గ్రామాలకు, పెద్దేముల్ మండలంలోని 18 గ్రామాలకు సాగునీరు అందిస్తోంది. నాణ్యతకు తిలోదకాలు కాలువల నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. ఇసుక స్థానంలో డస్ట్ వాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా త్వరగా కాలువలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలువలను గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ప్రస్తుతం వాటిని తొలగించి నిర్మాణాలు చేస్తున్నారు. తొలగించిన రాళ్లను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని విక్రయిస్తే ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదా యం వస్తుందని రైతులు అంటున్నారు. శరవేగంగా ప్రాజెక్టు ఆధునీకరణ పనులు నాణ్యత పాటించాలి స్పీకర్ ప్రసాద్కుమార్ ప్ర త్యేక చొరవతో ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.86.30 కోట్లు మంజూరయ్యాయి. పనులు నాణ్యతగా ఉండాలి. ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. సీసీ పనుల్లో వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయాలి. – వరద మల్లికార్జున్, రైతు, నాగసమందర్ -
అందని యూనిఫాం
పరిగి: పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందలేదు. గత ఏడాది పంపిణీ చేసిన వాటితోనే స్కూళ్లకు వస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా ప్రభుత్వం దుస్తులు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించింది. కానీ క్లాత్ సరఫరా చేయలేదు. ఈ కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 1,037 ప్రభుత్వ పాఠశాలలు.. 1,41,319 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 2,82,638 యూనిఫారాలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి యూనిఫాం రంగు, డిజైన్లో మార్పులు చేశారు. బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్, బాలురకు నీలం రంగు చొక్కా.. లేత నీలం రంగు నిక్కర్, లేదా ఫ్యాంటు తరగతుల వారీగా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన క్లాత్ సరఫరా కాకపోవడంతో విద్యార్థులకు ఎప్పుడు అందుతాయి అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. పాత వాటితో ఇబ్బంది ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉంటారు. గత ఏడాది పంపిణీ చేసిన యూనిఫారాలు చాలా వరకు చిరిగిపోయాయి. వాటినే వేసు కొని స్కూళ్లకు వస్తున్నారు. మరి కొందరు సాధా రణ దుస్తులతో వస్తున్నారు. యూనిఫారాల విషయంలో విద్యాశాఖ అలసత్వం వహిస్తోందనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే సరఫరా చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరింత ఆలస్యం కావొచ్చు.. ఏకరూప దుస్తులకు సంబంధించి ఇప్పటి వరకు వస్త్రమే జిల్లాకు చేరలేదు. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల కొలతలు తీసుకుని దుస్తులు కుట్టడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. పంద్రాగస్టు నాటికై నా కొత్త యూనిఫాం అందుతుందా లేదా అనే అనుమానం విద్యార్థుల్లో ఉంది. గత ఏడాది కూడా దుస్తుల కొలతల్లో తేడాలు వచ్చాయి. కొందరు విద్యార్థులకు చిన్నగా, మరి కొందరికి పెద్దవి పంపిణీ చేశారు. దీంతో వాటిని వేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. చేసేదేమీ లేక సరిపెట్టుకున్నారు. ఈ సారైనా సరైన కొలతలు తీసుకొని యూనిఫాం కుట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నెలరోజులవుతున్నా విద్యార్థులకు చేరని దుస్తులు పాత వాటితోనే సరిపెట్టుకుంటున్న చిన్నారులు పంద్రాగస్టుకై నా అందేనా? జిల్లాలో మొత్తం పాఠశాలలు 1,037 విద్యార్థుల సంఖ్య 1,41,319. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున.. కావాల్సిన దుస్తులు 2,82,638 రెండ్రోజుల్లో వస్త్రం వస్తుంది రెండు రోజుల్లో యూనిఫాంకు సంబంధించిన వస్త్రం వస్తుంది. కుట్టేందుకు మహిళా సంఘాలు సిద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటాం. – అంజయ్య, ఎంఈఓ, పరిగి -
స్కూల్ వ్యాన్ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్
● నలుగురు విద్యార్థులకు గాయాలు ● ఇద్దరిని తాండూరు ఆస్పత్రికి తరలింపు బొంరాస్పేట: స్కూల్ వ్యాన్ను ఇసుక ట్రాక్టర్ ఢీ కొనడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం మండలంలోని మహంతీపూర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 11 మంది విద్యార్థులు కొడంగల్లోని శ్రీ గాయత్రి పాఠశాలలో చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం వ్యాన్లో ఊరికి బయలుదేరారు. ఈ క్రమంలో మహంతీపూర్ చెందిన అచ్చమోళ్ల రాములు గ్రామ సమీపంలోని వాగు నుంచి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్నారు. కొత్తూరు శివారులో డంపు చేసేందుకు వెళ్తుండగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యానులోని చందన(నాలుగో తరగతి) తలకు, యశశ్విని(మూడో తరగతి) కాలికి, మోక్ష(ఆరో తరగతి), నికిల్ (రెండో తరగతి)కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం మోక్ష, నికిల్ను తాండూరులోని ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ను పోలీసు స్టేషనుకు తరలించారు. -
జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి కృషి
షాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు కనీస సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, కార్పొరేట్ వైద్యం అందేలా ఉచిత హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని, కుటుంబాలకు భరోసా కల్పించే గ్రూప్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా) సౌకర్యాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, జిల్లా సంయుక్త కార్యదర్శులు సత్యనారాయణ, సూర్యనారాయణ, రమేష్, ఈసీ సభ్యుడు ఇలియాజ్ షరీఫ్, చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్య, సభ్యులు రాంచంద్రయ్య, రమేశ్యాదవ్, గోవర్ధన్రెడ్డి, కరుణాకర్చారి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక టీయూడబ్ల్యూజే షాబాద్ మండల నూతన అధ్యక్షుడిగా రవీందర్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్, గౌరవ అధ్యక్షుడిగా రాంచంద్రయ్య, ఉపాధ్యక్షులుగా నర్సింలు, శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీలుగా నరేందర్, లక్ష్మణ్, శివరాజ్గౌడ్, కోశాధికారి పూర్ణచందర్ గుప్తా, ఈసీ మెంబర్లుగా అనిల్, రాజేష్, మధు, రాజేందర్, రవి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి -
ఫలమా.. ఫలహారమా?
బోనాల ఉత్సవ ఏర్పాట్లకు రూ.26 కోట్లు మంజూరు సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగర సంస్కృతికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెత్తకుండా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధమైంది. ఆరు జోన్లలో వివిధ సర్కిళ్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.26 కోట్లు కేటాయిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 444 అత్యవసర పనులను గుర్తించి నిధులు మంజూరు చేశారు. జోన్ల వారీగా ఇలా.. కేటాయింపుల్లో రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లకు సింహభాగం నిధులు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 160 పనుల కోసం రూ.8.79 కోట్లు కేటాయించారు. ఇందులో ముఖ్యంగా జంగమ్మెట్ సర్కిల్లో 96 పనులకు రూ.5.63 కోట్లు ఖర్చు చేయనున్నారు. చార్మినార్ జోన్లో 137 పనులకు రూ.8.65 కోట్లు మంజూరయ్యాయి. చార్మినార్ సర్కిల్లోనే రూ.3.98 కోట్లతో పనులు చేపట్టనున్నారు. గోల్కొండ జోన్లో 89 పనులకు రూ.5.95 కోట్లు, గోల్కొండ సర్కిల్లో రూ.2.54 కోట్లతో 27 పనులు చేపట్టనున్నారు. ఉజ్జయినీ మహంకాళి బోనాలకు కేంద్రమైన సికింద్రాబాద్ పరిధి లో 32 పనులకు రూ.1.35 కోట్లు మంజూరు చేశారు. శంషాబాద్ జోన్లో 20 పనులకు రూ.93.40 లక్షలు కేటాయించారు. ఖైరతాబాద్ ఈ జోన్లో కేవలం 6 పనులను మాత్రమే గుర్తించి అత్యల్పంగా రూ.30.55 లక్షలు మంజూరు చేశారు. ఇందులో జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్గూడ సర్కిళ్లలో పనులేవీ ప్రతిపాదించలేదు. బిల్లులకు చిల్లు బోనాల ఏర్పాట్లకు నిధుల మంజూరు హర్షణీయమే.. కానీ.. ఈ సారైనా పనులు సక్రమంగా చేస్తారా? లేక గతంలో మాదిరిగానే బిల్లులతోనే ఫలహారంలా పంచుకుంటారా? అని నగర వాసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనుభవాలను పరిశీలిస్తే.. బోనాల ఉత్సవాల వేళ జీహెచ్ఎంసీ చేసే ఖర్చులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగం పనులు కూడా పూర్తి చేయకుండానే, ఉత్సవాలు ముగిసిన వెంటనే ‘పపనులు పూర్తయ్యాయి’ అంటూ దొంగ బిల్లులు సృష్టించి ఖజానాను గుల్ల చేయడం పరిపాటిగా మారింది. చాలా ప్రాంతాల్లో పాత రంగులపైనే మళ్లీ నాసిరకం సున్నాలు చల్లడం, గుంతల రోడ్లకు మొక్కుబడిగా మట్టి కొట్టడం మినహా శాశ్వత పనులు చేసిన దాఖలాలు లేవు. కొన్ని పనులు కేవలం కాగితాల్లోనే ఉంటాయి. విచిత్రమేమిటంటే, బోనాలు ముగిశాక పనులు ప్రారంభించినట్లు పేర్కొనడం. ఈసారి కూడా అదే తంతు కొనసాగనుందా? లేక ఉన్నతాధికారులు నిఘా ఉంచి దుబారాను అడ్డుకుంటారా? అనేది వేచి చూడాలి. జీహెచ్ఎంసీ పారదర్శకంగా వ్యవహరిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీలో 444 చోట్ల పనులు రాజేంద్రనగర్కే రూ.8.79 కోట్లు సక్రమంగా వినియోగించాలంటున్న నగర వాసులు -
సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత అనంతగిరి: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి స్వర్ణలత ఆదేశించారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని పురపాలిక కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్, మండలంలోని బీఎల్ఓలు, సూపర్ వైజర్లలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్ బూత్ల వారీగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని 57.25శాతం, మండల పరిధిలో 81.90 శాతం పూర్తయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని డీఆర్ఓ ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి అనంతగిరి చిన్న జాతర
స్పీకర్ ప్రసాద్కుమార్కు ఆహ్వానం అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో వెలసిన అనంతపద్మనాభ స్వామి ఆలయ ఆషాఢ మాసం చిన్న జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ట్రస్టీ పద్మనాభం, ఈఓ నరేందర్ బుధవారం తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వా న పత్రికను స్పీకర్ ప్రసాద్కుమార్కు అందజేశారు. ఈ నెల 29వ తేదీ వరకు జాతర జరగనుంది. ప్రజారోగ్యం ఎంతో ముఖ్యం డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ పూడూరు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ అన్నారు. బుధవారం మండలంలోని మన్నెగూడ ఆరోగ్య మందిరంలో సేవల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ మృల్యాంకన బృందం రాజస్థాన్, మధ్యప్రదేష్ నుంచి వర్చువల్గా పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు మహమూద్ ఫారూఖీ, అజయ్, సీహెచ్ఓ పద్మ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. యాచారం: కూలీ పనికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన వి.శివాజీ ఈ నెల 15న ఇంట్లో నుంచి కడ్తాల్కు సెంట్రింగ్ పనికి వెళ్తున్నానని, వాళ్ల అమ్మ సువర్ణకు చెప్పి వెళ్లాడు. నాలుగు రోజులైన ఇంటికి తిరిగి రాకపోవడం, వివిధ గ్రామాల్లో బంధువులు, స్నేహితుల వద్ద ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆరా తీసిన జాడలేదు. దీంతో బుధవారం గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్లోని తమ్మిడికుంట, సున్నం చెరువు అభివృద్ధి పనులను ఆగస్టు మూడో వారానికి పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. వర్షం నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ రెండు చెరువుల పునరుద్ధరణ పనులను ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు చుట్టూ పాత్వే నిర్మాణంతో పాటు ప్రధాన గేట్ల ఏర్పాటును చూశారు. వరద కట్టడి, భూగర్భ జలాల వృద్ధితో పాటు.. ఓ చెరువు వల్ల సమకూరే ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలిసి వచ్చేలా చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. కబ్జా కోరల్లో చిక్కి 16.4 ఎకరాలకు పరిమితమైన సున్నంచెరువును ఆక్రమణలను తొలగించి 30.5 ఎకరాలకు హైడ్రా విస్తరించింది. అలాగే తమ్మిడికుంట కూడా 16.2 ఎకరాలకు పరిమితం కాగా...29.3 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేస్తోంది. ఈ చెరువుల చుట్టూ బలమైన బండ్ ఏర్పాటుతో పాటు చుట్టూ విశాలమైన పాత్వే నిర్మాణం చేపట్టాలని హైడ్రా కమిషనర్ సూచించారు. చెరువుల చెంత పార్కులు, ఓపెన్ జిమ్లు, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా ఎస్టీపీల నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాల ని సూచించారు. చెరువు పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. హైడ్రా అసెట్ ప్రొటెక్షన్ విభాగం అడిషనల్ కమిషనర్ డి.ఆనంద్కుమార్, ఏసీపీ తిరుమల్, చెరు వు పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రా ట్స్ యజమాని యూనస్తో పాటు పలువురు అధికారులు హైడ్రా కమిషనర్ వెంట ఉన్నారు. -
బీసీల సమస్యలపై నిరంతర పోరాటం
షాబాద్: బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకుడు పల్నాటి యాదయ్య పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో హక్కుల సాధన సమితి నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జీవో నంబర్ 9ని అమలుపరచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర విడనాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం చేవెళ్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కమిటీలు ఏర్పాటు చేశారు. బీసీ హక్కుల సాధన సమితి షాబాద్ మండల కమిటీ అధ్యక్షుడిగా పాలమాకుల ఆనందం, ప్రధాన కార్యదర్శిగా నర్సింలు, ఉపాధ్యక్షుడిగా తెలుగు శేఖర్, సహాయ కార్యదర్శి రుక్కయ్య, కోశాధికారిగా నాగరాజుతో పాటు 13 మంది తో కమిటీ ఏర్పాటు చేశారు. చేవెళ్ల మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పాపయ్య, మొయినాబాద్ మండల అధ్యక్షుడిగా ఉప్పరి సురేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, శంకర్పల్లి మండల అధ్యక్షుడిగా మంగలి నర్సింహా, ప్రధాన కార్యదర్శిగా వడ్ల బ్రహ్మాచారి తదితరులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, చేవెళ్ల మండల కార్యదర్శి సత్తిరెడ్డి, మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీనివాస్, శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్, అంజయ్య, మాక్బుల్, మంజుల తదితరులు ఉన్నారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకుడు పల్నాటి యాదయ్య -
అస్తిత్వం కోల్పోతాం.. డంప్యార్డు వద్దు
కొత్తూరు: సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటు చేస్తే ఆస్తులు, అస్తిత్వంతో పాటు సర్వస్వం కోల్పోతామని బాధితులు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం డంప్యార్డుతో కలిగే అనర్థాలపై జేఏసీ నేతలు కలెక్టర్ కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ధర్నా విరమణ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కలెక్టర్ సుమారు గంట పాటు చర్చించారు. డంప్యార్డు ప్రతిపాదిత స్థలం రైలు, రోడ్డు, విమానాశ్రయాలకు సమీపంలో ఉందన్నారు. ఎన్నో బహుళజాతి పరిశ్రమలు, పవిత్రమైన జేపీదర్గా, అనంతపద్మనాభస్వామి ఆలయం, గురుకుల పాఠశాల కొనసాగుతున్నాయని వివరించారు. సీఎం మానసపుత్రిక అయిన ఫ్యూచర్సిటీ అతి సమీపంలో ఉందన్నారు. జనాభా, అభివృద్ధి పరంగా దూసుకెళ్తున్న ప్రాంతంలో డంప్యార్డు ఏర్పాటు చేస్తే వీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ.. బాధితులు పేర్కొన్న అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్యాంసుందర్రెడ్డి, నాయకులు ప్రభాకర్, శేఖర్రెడ్డి, సుదర్శన్గౌడ్, రవికుమార్గుప్తా, జంగయ్య, బాల్రాజు, శంకర్నాయక్, సర్పంచులు బాసునాయక్, గోవింద్నాయక్, ఎర్రొళ్ల జగన్, సుమిత్రమల్లారెడ్డి, విష్ణుశాంతినాయక్ తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రంలోని ప్రధాన అంశాలు ● స్టోన్క్రషర్ బ్లాస్టింగ్లతో ప్రకంపనలకు భూమి పొరలు వదులుగా ఉన్నాయి. డంప్యార్డు ఏర్పాటు చేస్తే వాటి వ్యర్థాలు భూపొరల్లోకి సులువుగా ఇంకి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. ● హైదరాబాద్ జంట జలాశయాలకు ఈ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం ఉండటంతో నీటి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందన్నారు. ● జాతీయ రహదారిపై ఇప్పటికే ట్రాఫిక్ రద్దీ ఉన్న నేపథ్యంలో చెత్త వాహనాల రాకపోకలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయని తెలిపారు. ● డంప్యార్డు నిర్వహణలో లోపాలు ఉంటే ఈగలు, దోమలు, ఇతర కీటకాలు పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ● ముఖ్యంగా విమానాశ్రయం దగ్గరగా ఉండడంతో విమానాలు కింది నుంచి వెళ్లే క్రమంలో గద్దలు, ఇతర పక్షులు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ● ఇక్కడ కొనసాగుతున్న పీఅండ్జీ, నాట్కో, మైక్రోసాఫ్ట్ ఇతర పరిశ్రమలపై ప్రతికూల పరిస్థితులు ఉంటాయన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవించిన సిద్ధాపూర్ బాధితులు -
చినుకు పడితే చిత్తడే
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. చినుకు పడితే చిత్తడిగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలికపాటి వర్షానికే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లోని సీసీ రోడ్లను తవ్వారు. పైప్లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తవ్వకాలు చేపట్టారు. పనులు త్వరితగతిన చేయకపోవడంతో స్థానికులకు ఇబ్బందిగా మారింది. శాంతినగర్, లాహోటీకాలనీ, కార్గిల్ కాలనీ, గాంధీనగర్, తెలంగ్వాడీ, వడ్డర్గల్లీ తదితర ప్రాంతాల్లో దారులు రాకపోలకు అనుకూలంగా లేవు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
‘సర్’కు నాయకుల సహకారం తప్పనిసరి
పరిగి: సర్ ప్రక్రియకు ఆయా పార్టీల నాయకులు సహకరించాలని ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 3వ తేదీ నాటికి వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వలస వెళ్లిన వారికి సమాచారం అందించి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేలా నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వకుంటే ఓటు హక్కు కోల్పోతారని స్పష్టం చేశారు. ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి, డీటీలు అనిల్బాబు, విజయేందర్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఫైళ్లను తొక్కిపెట్టొద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఉద్దేశ పూర్వకంగా అర్జీలను తొక్కిపెట్టే ఇంజనీర్లపై వేటు తప్పదని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, ప్రతీ ఇంజనీరు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం మింట్కాంపౌండ్ కార్పొరేట్ ఆఫీసు నుంచి 21 సర్కిళ్ల పరిధిలోని ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, బిల్లింగ్, నెట్వర్క్ బలోపేతం, భద్రతా చర్యలు, పెండింగ్ పనులు, కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, కొత్త లైన్ల ఏర్పాటుకు అంచనాల తయారీలో జాప్యం, నెట్వర్క్ మ్యాపింగ్, మోడల్ సబ్స్టేషన్లు తదితర అంశాలపై సమీక్షించారు. అంగన్వాడీలు, ఇతర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే వసూలు చేయాలన్నారు. 33కేవీ, 11 కేవీ లైన్లు, డీటీఆర్లు, స్ట్రక్చర్ కోడ్ మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న వాణిజ్య కేటగిరీలకు వెంటనే కనెక్షన్లు జారీ చేయాలని, కొత్త విద్యుత్ కనెక్షన్లు, అంచనాలు, వర్క్ ఆర్డర్లు, సాంకేతిక అనుమతులు, పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. బకాయిల వసూళ్లతో పాటు విద్యుత్ చోరీ, అనధికార కనెక్షన్లు, నిబంధనలకు విరుద్ధంగా బహుళ మీటర్ల వినియోగాన్ని గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ కనెక్షన్ల నమోదులో క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మోడల్ సబ్స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించి, అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ప్రతీ పనికి స్పష్టమైన లక్ష్యాలు, గడువు నిర్ణయించి అమలు చేయాలని, ఆగస్టు 10న జరిగే సమీక్ష నాటికి అన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు శివాజీ, పి.కృష్ణారెడ్డి, ఎన్.నరసింహులు, చక్రపాణి, సీఈలు, సీజీఎంలు ఉన్నారు. -
ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేయండి
పరిగి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రంలో డిపో కమిటీ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్జెంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా విశ్వనాథ్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా నరేందర్, ఉపాధ్యక్షుడిగా బీవీఆర్ రెడ్డి తోపాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వేతన సవరణ ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉద్యోగులు చనిపోతే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. మెరుగైన వైద్య సేవలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కొంత మంది ఆర్టీసీ కార్మికుల్లో అపోహాలు సృష్టిస్తున్నారని వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. కార్మికుల హక్కుల సాధనకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. నూతన కార్యవర్గం సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పరిగి డిపో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ట్రస్మా తాండూరు డివిజన్ అధ్యక్షుడిగా మోహన్ కృష్ణ
తాండూరు టౌన్: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) తాండూరు డివిజన్ అధ్యక్షుడిగా మోహన్ కృష్ణ గౌడ్ (అక్షర స్కూల్) నియమితులయ్యారు. బుధవారం పట్టణంలో ట్రస్మా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలిగా కీర్తి శర్మ, అధ్యక్షుడిగా మోహన్ కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడిగా వహీద్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్, సంయుక్త కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా ఎం రమేష్ గౌడ్, సలహా కమిటీ సభ్యులుగా ఇందూర్ రాములు, సోహెల్ ఉమ్రిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తాండూరు పరిధిలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షిస్తానని, సంఘం ఐక్య తను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మద్యం మత్తులో ఎస్ఐపై దాడి బంజారాహిల్స్: నో పార్కింగ్లో ఉన్న వాహనాన్ని తొలగించాలని చెప్పిన ట్రాఫిక్ ఎస్ఐపై మద్యం మత్తులో ఉన్న యువకుడు దాడి చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ షేక్సలాం ఈ నెల 21న బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని వైన్షాపు సమీపంలో నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన వాహనాలను తొలగింపు చేపట్టారు. ఓ ౖబైక్ను అక్కడి నుంచి తరలించాలని సయ్యద్నగర్ నివాసి సయ్యద్ జాకర్కు సూచించారు. అయితే వాహనాన్ని తొలగించకుండా ఎస్ఐను దుర్బాషలాడడంతో పాటు తోసివేసి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో షేక్సలాం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా జాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. -
అభివృద్ధి చేసుకుందాం
అవకాశం వచ్చింది కొడంగల్/దుద్యాల/బొంరాస్పేట: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈప్రాంతానికి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. గత పాలకులు వివక్షతోనే కొడంగల్ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసం వద్ద నిర్వహించిన సర్ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. పదవులు, నిధులు, సంక్షేమం తదితర అన్ని అంశాల్లో కొడంగల్ వెనకబడింది. నన్ను గెలిపించిన మీకోసం నిత్యం 18గంటలు పనిచేస్తున్నా.. ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది.. చేసుకుందాం అన్నారు. ఓటు లేకపోతే శవంతో సమానం ఓటు లేని పౌరుడు శవంతో సమానం. సుశిక్షితులైన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం. ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రతీ పేదవాడికి అండగా నిలవాలి. ఇంటింటికీ, గల్లీగల్లీకి తిరిగి ప్రక్రియను పూర్తిచేయాలి. మనకు వచ్చే ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల పప్పులు ఉడకనీయొద్దు. ఓటర్ నమోదు ఇలా.. కొడంగల్లో నియోజకవర్గంలో మొత్తం 2,51,255 మంది ఓటర్లున్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,96, 620 మంది మాత్రమే సర్ పత్రాలు సమర్పించారు. మిగిలిన 54,635 మంది ఫారాలు ఇవ్వలేదు. 78 శాతం నమోదు పూర్తయింది. కోస్గి మండలంలో 9,864 మంది, కొడంగల్లో 8,260, మద్దూరులో 8,421,దుద్యాలలో 5,460,గుండుమాల్లో 4,070, కొత్తపల్లిలో 3,630, దౌల్తాబాద్లో 9,300, బొంరాస్పేటలో 5,930 మంది ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్తివారి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, డీసీసీ అధ్యక్షు డు ధారాసింగ్, మండల అధ్యక్షులు నర్సింలుగౌడ్, ఆవుటి శేఖర్, కౌన్సిలర్ కృష్ణంరాజు, నాయకులు నయీమ్, వెంకట్రాములుగౌడ్ పాల్గొన్నారు. నెమ్మదిగా సాగుతున్నాయనే.. హకీంపేట్ శివారులో చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయనే సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి దుద్యాల పర్యటనకు నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి 11గంటల వరకూ ఇక్కడే ఉండి పనులను పరిశీలించడంతో పాటు సీఎం హోదాలో సుమారు ఐదు గంటల పాటు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని లేదంటే చర్యలు తప్పవని అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. తాగునీరు, సాగునీరుతో పాటు రోడ్లు, పంచాయతీ భవనాలు నిర్మించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వర్షంతో ఇబ్బంది పడ్డారు. గత పాలకుల వివక్షతోనేఅన్నిఅంశాల్లో వెనకబడ్డాం -
ఇంట్లోకి జింక
కుక్కల బారి నుంచి తప్పించుకునే క్రమంలో.. యాలాల: కుక్కలు వెంట పడటంతో తప్పించుకునే క్రమంలో ఓ జింక ఇంట్లోకి ప్రవేశించింది. ఈ ఘటన బుధవారం ఉదయం మండలంలోని అడాల్పూర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ జింక గ్రామ శివారులోకి వచ్చింది. ఐదు కుక్కలు వెంటపడ్డాయి. తప్పించుకునే క్రమంలో గ్రామానికి చెందిన గజ్జల బాలప్ప ఇంట్లోకి దూరింది. గమనించి సర్పంచ్ రక్మిణి గౌడ్ భర్త మొగులప్ప, మాజీ సర్పంచ్ బోయిని శేఖర్ కుక్కలను తరిమేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చి జింకను అప్పగించారు. స్పీకర్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు ధారూరు: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను బుధవారం కాంగ్రెస్ పార్టీ ధారూరు పట్టణ కమిటీ నూతన అధ్యక్షుడు తిరుపతిగారి మల్లేశం, సభ్యులు నగరంలో కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని స్పీకర్ అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి బాబాఖాన్, నాయకులు సంగమేశ్వర్, కుమ్మరి సాయికుమార్, బుజ్జయ్యగౌడ్, శ్రీనివాస్రెడ్డి, సాయి, దామోదర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అరెస్టులు చట్టవిరుద్ధం యాలాల: జిల్లాలోని ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పలి మల్కయ్య, మైనార్టీ హక్కుల పోరాట సమితి ప్రతినిఽఽధి సాధిక్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య అన్నారు. బుధవారం యాలాల పీఎస్ ఎదుట అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాము ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తే అక్రమంగా అరెస్టు చేసి భయాందోళనకు గురి చేయడం తగదన్నారు. పైలెట్కు ఊరట తాండూరు: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ నగరం విడిచి వెళ్లకుండా న్యాయస్థానం ఆయనకు విధించిన ఉత్వర్వులను బుధవారం తొలగించింది. దీంతో రోహిత్రెడ్డి ప్రజల్లోకి రానున్నారని బీఆర్ఎస్ తాండూరు శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మార్చి 14న తన ఫాంహౌస్లో ఏర్పాటు చేసిన పార్టీలో డ్రగ్స్ వినియోగించారనే అభియోగంపై రోహిత్రెడ్డి 44 రోజుల పాటు రిమాండ్ ఉన్నారు. ఏప్రిల్ 28న షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చారు. కోర్టు రేడియస్ పరిధిలోని అరవై కిలోమీటర్లు దాటి వెళ్లకుండా నిబంధన విధించింది. దీంతో ఆయన మణికొండలోని తన నివాసంలో ఉన్నారు. వచ్చే నెల మొదటి వారంలో తాండూరులో పర్యటించనున్నట్లు పైలెట్ స్పష్టం చేశారు. హయత్నగర్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు ఖాళీల్లో బీబీఏ–2, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–3, సంస్కృతం–1, స్టాటిస్టిక్స్–1 ఖాళీలు ఉన్నాయని, సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) మార్కులతో పీజీ పొందిన వారు అర్హులన్నారు. -
పేపర్ లీకేజీకి బాధ్యత వహించాలి
యాలాల: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ధర్నాకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ పీఎం మోదీ, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, మాజీ అధ్యక్షుడు భీమప్ప, గాజుల మన్నాన్, సర్పంచ్లు అమర్నాథ్రెడ్డి, అనిల్కుమార్, శ్రీవాణి, నరేష్కుమార్, సీనియర్ నాయకులు హన్మంతు, అమృతయ్య, పెద్దపులి ఖాసీం, సత్యనారాయణరెడ్డి, జనార్దన్రెడ్డి, కై లా రాఘవేందర్రెడ్డి, రాచూరి రాజు, ఆరీఫ్ హుస్సేన్, పంతుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నాయకుల ముందస్తు అరెస్ట్
సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో మండలంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కొంత మందిని అరెస్టు చేయగా మరి కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. వీరిలో ఎంఐఎం తాలూకా అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్, సీపీఐ నాయకులు ఇందనూర్ బషీర్, మైమూద్, శ్యాంసుందర్, సురేష్గౌడ్, మూతుల రాజు, శ్రీనివాస్, మల్లప్ప, రహీం, వెంకటప్ప, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్ ఉన్నారు. దుద్యాల్ మండలం లగచర్ల గ్రామానికి చెందిన బొగమోని సురేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన ముగిసిన తర్వాత వీరందరినీ వదిలి పెట్టారు. -
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయండి
అనంతగిరి: వికారాబాద్ పట్టణ పరిధి శివారెడ్డిపేట జెడ్పీహెచ్ఎస్లో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను బుధవారం డీఈఓ అబ్దుల్ ఘని సందర్శించారు. శిక్షణలో అన్ని అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఈ విషయాలను పాఠశాలల్లో బోధించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం చదవి మంచి మార్కులు సాధించాలని తెలిపారు. పాఠశాలలోని పూల మొక్కలు, కిచెన్ గార్డెన్ను సందర్శించి ప్రిన్సిపాల్ నజీమున్సీసా, జహంగీర్ను అభినందించారు. కార్యక్రమంలో పీడీ ప్రతాప్రెడ్డి, సీఆర్పీ రవి, శిక్షణ డైరక్టర్ గోపాల్, ఆర్సీలు మల్లేశం, యాదయ్య, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ అంశాలను విద్యార్థులకు నేర్పండి ధారూరు: శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రామ్మస్త సూచించారు. మండలంలోని కేరెళ్లి ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయ వృత్తాంతర మొదటి విడత ఇంటిగ్రేటెడ్ సర్వీస్ టీచర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణలో తెలుసుకున్న కొత్త విషాలను విద్యార్థులకు నేర్పించాలని తెలిపారు. విద్యారంగంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ చెన్నయ్య, రిసోర్స్ పర్సన్లు నిజామొద్దీన్, అంజయ్య, శ్రీనివాస్, రఘు, అశోక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ధారూరు: మాట్లాడుతున్న డీఏఎంఓ రామ్మస్త అనంతగిరి: మాట్లాడుతున్న డీఈఓ అబ్దుల్ ఘని -
వర్షపు నీటిని ఒడిసి పడతాం
తాండూరు: వర్షపు నీటిని వృథాగా పోనివ్వమని, ప్రతి చుక్కా చెరువుల్లోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు నీటి పారుదల శాఖ ఈఈ అశోక్ తెలిపారు. బుధవారం పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలోని డీఈఈలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లోని చెరువుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు మండలం జిన్గుర్తిలోని శ్రీరాముల ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పెద్దేముల్ మండలం పాషాపూర్లో తెగిన సీతమ్మ చెరువును రూ.45 లక్షలతో పునర్నిర్మించనున్నట్లు తెలిపారు. మోమిన్పేట్ నందివాగు ప్రాజెక్టు వద్ద రూ.1.8 కోట్లతో బతుకమ్మ ఘాట్, వినాయకుడి విగ్రహాల నిమజ్జన ఘాట్లను నిర్మించనున్నట్లు చె ప్పారు. కాగ్నా, కకరవేణి నదులపై 12 చెక్ డ్యామ్లకు గాను 11 పూర్తి చేసినట్లు తెలిపారు. యాలాల మండలం జుంటిపల్లి ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.4.75 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఆరు నెలల క్రితం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంపై నోటీసులు ఇస్తామన్నారు. కోట్పల్లి ప్రాజెక్టు ఽఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50శాతం మేర పనులను పూర్తి చేశామని తెలిపారు. కుడి, ఎడమ, బేబీ కెనాల్ను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ డీఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
● కాలినడకనే బడికి
మారుమూల తండాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ సేవలు లేకపోవడం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు శాపంగా మారింది. గత్యంతరం లేక కాలినడకన బడికి వెళ్లాల్సి వస్తుందని చిన్నారులు వాపోతున్నారు. అదే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు మాత్రం ఎంచక్కా స్కూల్ బస్సులో వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పే ప్రభుత్వ పెద్దలు రవాణా సదుపాయంపై దృష్టి సారించాలి. బొంరాస్పేట మండలంలో అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేడుకొంటున్నారు. – బొంరాస్పేట -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలం కేటాయింపు
షాద్నగర్రూరల్: ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం షాద్నగర్, ఫరూఖ్నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయిచింది. ఫరూఖ్నగర్ తహసీల్దార్ నాగయ్య మంగళవారం పట్టణంలోని పాతజాతీయ రహదారి పక్కన ఉన్న పాత కోర్టు స్థలాన్ని పరిశీలించారు. సర్వే నంబర్ 178లోని 35 గుంటల భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు హద్దులు ఏర్పాటు చేసి సబ్ రిజిస్ట్రార్లు వికాస్రెడ్డి, శేషగిరికి అప్పగించారు.


