breaking news
Vikarabad District Latest News
-
హాస్టల్.. హడల్ !
మొయినాబాద్: ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులు ప్రాణాలు ఫణంగా పెట్టి ఉంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరుసగా జరగుతున్న ఘటనలను చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోంది. రూ.లక్షలు కట్టి పిల్లలను చేర్పిస్తున్న హాస్టళ్లు భద్రమేనా అని తల్లిదండ్రులు కలవరానికి గురవుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రైవేటు హాస్టల్ భనం కుప్పకూలిన ఘటనతో వారి ఆందోళన మరింత పెరిగింది. అనుమతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా.. మొయినాబాద్ ప్రాంతంలో విద్యా సంస్థలు అధికంగా ఉండటంతో విద్యార్థుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు హాస్టళ్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. భవన నిర్మాణం నుంచి హాస్టల్ ఏర్పాటు వరకు ఎలాంటి అనుమతులు లేకుండా చకచకా జరిగిపోతున్నాయి. మొయినాబాద్ ప్రాంతం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అధికారిక అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే అధికారులు అడ్డుకో వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు వాటాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోశారు. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి అక్రమ నిర్మాణాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు, ఎనిమిది అంతస్తులు కట్టేసి.. ఎలాంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో హాస్టల్లో వందల మంది.. మున్సిపాలిటీలోని చిలుకూరు, హిమాయత్నగ ర్, అజీజ్నగర్, మొయినాబాద్లో సుమారు 30కి పైగా ప్రైవేటు హాస్టళ్లు ఉన్నాయి. ఒక్కో హాస్టల్లో సుమారు 200–400 మంది విద్యార్థులు ఉంటున్నారు. మరికొన్ని భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులను ఆసరాగా చేసుకుని భవనాల నిర్మాణం పెరుగుతోంది. ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.8–10 వేలు వసూలు చేస్తూ నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు మంగళం 111 జీవో నిబంధనలు తుంగలో తొక్కి 200–300 గజాల ప్లాటులో 7–8 బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో సుమారు 70–80 గదులు నిర్మించి హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గదిలో 7–10 మంది విద్యార్థులు ఉంటున్నారు. హాస్టళ్ల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడంలేదు. వాటి నుంచి వచ్చే మురుగునీరు, డ్రైనేజీ, చెత్తా చెదారం అంతా ఖాళీ ప్రదేశాల్లో వదలడంతో పరిసర ప్రాంతాలు దుర్గంధంగా మారుతున్నాయి. తనిఖీలు కరువు హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతగా ఉంటోదా.. అగ్నిప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. భవనానికి అనుమతి ఉందా.. మురుగునీరు, డ్రైనేజీ, చెత్తాచెదారం ఎక్కడ వేస్తున్నారు.. అనే అంశాలపై అధికారులెవరూ తనిఖీలు నిర్వహించకపోవడంతో నిర్వాహకులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. భవనాలు నిర్మించే సమయంలో ప్రజాప్రతినిధులు, టౌన్ప్లానింగ్, మున్సిపల్ అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేబీఐటీ కళాశాల ఎదుట ఉన్న ప్రైవేటు హాస్టళ్లు అజీజ్నగర్ చౌరస్తా వద్ద ఇటీవల షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్న హాస్టల్ భవనం అనుమతులు లేకుండా ఏర్పాటు మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఇటీవల మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది.నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడకపోవడంతో లోడ్ ఎక్కువై తీగలు అంటుకుని మంటలు వచ్చినట్లు గుర్తించారు. అదే సమయంలో కరెంటు సరఫరాఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల రోజుల క్రితం ఎన్టీఆర్ విద్యా సంస్థలోని హాస్టల్లో సుమారు 60 మందికి పైగా విద్యార్థి నులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు, ఫుడ్ పాయిజన్ దీనికి ప్రధాన కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. చాలా మందిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు. ఉన్నతాధికారుల దృష్టికి.. మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా ప్రైవేటు హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నాయా.. డ్రైనేజీ ఎక్కడ వదులుతున్నారు.. తదితర అంశాలపై త్వరలో తనిఖీలు నిర్వహిస్తాం. – జాకీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, మొయినాబాద్ -
మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణం కాపాడుదాం
పీసీసీ మెంబర్ రితీక్రెడ్డి మంత్రి సీతక్కకు సన్మానం చేవెళ్ల: పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా మహిళా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్య క్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో మంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు తిప్పని మాధవిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ధైర్యం కాంగ్రెస్కు లేదు చేవెళ్ల: ప్రజల్లో కాంగ్రెస్పార్టీకి ఆదరణ లేదనే భయంతో ఎన్నికలకు వెళ్లకుండా సొసైటీ పదవులను నామినేటెడ్ పద్ధతిలో కట్టబెడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ మాల్గారి వైభవ్రెడ్డి విమర్శించారు. చేవెళ్లలో శనివారం ఆయన బీజేవైఎం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే దమ్ము లేద న్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, పార్టీ గుర్తుపై ఎన్నికలకు వెళ్తే తిరస్కరిస్తా రనే భయం పట్టుకుందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం కుల్కచర్ల: పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కామునిపల్లి అంగన్వాడీ టీచర్ పండరీబాయి అన్నారు. శనివారం కామునిపల్లి గ్రామంలో పోషణమాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు వ్యక్తిగత స్వచ్ఛతను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. వైద్యసిబ్బంది సూచనలను పాటించడంతో వ్యాధులబారినపడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విదేశీ పర్యటనకు నాగరాజు ఎంపిక పూడూరు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విదేశీ ఎక్స్పోజర్ పర్యటన (ఫారన్ ఎక్స్ పోజర్ విజిట్)లో భాగంగా సింగపూర్ పర్యటనకు మండల పరిధి కొత్తపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బెన్నూరు నాగరాజుకు అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ఎంఈఓ వి.సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి, ఆధునిక బోధనా పద్ధతుల పరిశీలనకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశం ఎంతో దోహదపడనుందని పేర్కొన్నారు. అనంతరం నాగరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. -
వరుస చోరీలు.. చిక్కని చోరులు!
కొందుర్గు: అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించలేకపోతున్నారు. ఈ అంశాన్నే దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్లు, డాగ్స్క్వాడ్ వంటి సదుపాయాలు ఉన్నా చోరీలకు పాల్పడిన వారిని గుర్తించకపోవడం విశేషం. కొందుర్గు మండలంలోని శ్రీరంగాపూర్లో పది నెలల వ్యవధిలో మూడు ఇళ్లల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన నివాసాలే లక్ష్యంగా రాత్రి వేళ్లల్లో తాళాలు విరగొట్టి, ఇళ్లు గుల్ల చేశారు. శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి గత ఏడాది నవంబర్ 18న రామేశ్వరం దేవుని దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం విరగొట్టిన దుండగులు బీరువాలోని 4.5 తులాల బంగారు అభరణాలు, 20 తులాల వెండి పట్టీలు, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల యాదయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి షాద్నగర్ వెళ్లారు. మరుసటిరోజు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం విరగొట్టి బీరువాలో ఉన్న మూడున్నర తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.25 వేల నగదును ఎత్తుకెళ్లారు. తాజాగా చాకలి యాదయ్య ఈనెల 2న కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. 4న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం విరగొట్టి తులంన్నర కమ్మలు, బుట్టాలు, 20 తులాల వెండి పట్టీలు, 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లల్లో కలిసి దాదాపు 10 తులాల బంగారు అభరణాలు, ఒక కిలో వెండి, ఒక లక్ష రూపాయలు దొంగిలించారు. అయితే అన్ని ఇళ్లల్లోనూ ఒకే విధంగా దొంగలు తమ తెలివిని ప్రదర్శించినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకొని, బీరువాల తాళాలు తీయడం బీరువాలో ఉన్న అభరణాలు,నగదు ఎత్తుకెళ్లడం గమనార్హం. తాజాగా వారం రోజుల క్రితం చాకలి యాదయ్య ఇంట్లో దొంగలు పడగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా బెడ్ కింద గ్లౌజ్లు లభించినట్లు తెలిసింది. దొంగలు తమ ఫింగర్ ప్రింట్లు గుర్తించకుండా ఉండేందుకు చేతులకు గ్లౌజులు వేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పోలీసులు దొంగలను పట్టుకుంటారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. శ్రీరంగాపూర్లో తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా వరుస దొంగతనాలు గడిచిన పది నెలల్లో మూడు ఇళ్లలో దొంగల బీభత్సం ఒక్క కేసును కూడా ఛేదించని పోలీసులు -
ఊరి పేరు తారుమారు!
కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో భాగంగా మండల పరిధిలోని కొత్తగూడకు పంపించిన కార్డుల్లో ఊరి పేరు మారిపోయింది. కొత్తగూడలో పాత, కొత్త కార్డులు అన్ని కలిపి 460కి పైగా ఉన్నాయి. కాగా శనివారం రెవెన్యూ అధికారులు జీపీఓల ద్వారా వీటిని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం గ్రామంలో డప్పు చాటింపు వేయించి, వాట్సప్ గ్రూపుల ద్వారా కూడా సమాచారం అందించారు. తీరా పంపిణీ చేయడానికి చూసే సమయంలో కొత్తగూడ గ్రామం బదులు కూపర్చంద్గూడ అని ఉండటంతో అవాక్కయ్యారు. దీంతో కార్డులు పంపిణీ చేయకుండా ఆపేశారు. అప్పటికే కొందరికి అందజేసిన కార్డులను కూడా వెనక్కి తీసుకున్నారు. అసలు కూపర్చంద్గూడ అనే గ్రామం ఎక్కడ ఉందో కూడా తమకు తెలియదని స్థానికులతో పాటు కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగ్రామం లేకపోయినా ఆ పేరుతో రెవెన్యూ గ్రామం మాత్రం ఉంది. ఇది జైత్వారం నుంచి పులిమామిడికి వెళ్లే దారిలో ఉత్తరం వైపున ఉంటుంది. గ్రామం లేకుండా కేవలం రెవెన్యూ కొంత విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. దీంతో చాలా మంది ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనాభా లేకుండా కేవలం ఇలా రెవెన్యూ గ్రామాలు కందుకూరు మండలంలో కూపర్చంద్గూడతో పాటు నేదునూరు గ్రామ పరిధిలోని అలిఖాన్పల్లి, అక్బర్జా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డుల్లో కొత్తగూడ బదులు కూపర్చందర్గూడ ఇచ్చిన కార్డులు వాపస్ తీసుకున్న అధికారులు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనంతగిరి: పొలంలో విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వెంకటాపూర్తండా సర్వే నంబర్ 121లో తుకారం అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఉదయం 6:30 గంటలకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం కాలుకు విద్యుత్ తీగ ఉన్నట్లు గుర్తించారు. మృతుడు రాళ్లచిట్టంపల్లికు చెందిన లాలయ్య (45)గా గుర్తించారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పి, శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని మృతుడి భార్య పీలారం లలిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్లువిక్రయిస్తున్న దంపతుల అరెస్ట్ కొత్తూరు: గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన భోలా(42), సుమనాత్రి దేవి దంపతులు. కొంత కాలంగా కొత్తూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. బీహార్ నుంచి గంజాయి కలిపిన చాక్లెట్లు అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరిపై అనుమానం కలిగిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శనివారం కల్లుదుకాణం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి సుమారు రూ.2 వేల విలువైన 78 గంజాయి చాక్లెట్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరొకరికి గాయాలు ఆమనగల్లు: రోడ్డు ప్రమా దంలో యువకుడు మృతిచెందిన సంఘటన ఆమనగల్లు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం మర్రిగుంత తండాకు చెందిన ఇస్లావత్ అనిల్కుమార్ (23) శనివారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం నుంచి బుల్లెట్ బైక్ తీసుకుని బైక్ మెకానిక్ శశికుమార్తో కలిసి ఆమనగల్లు వైపు వస్తున్నారు. ఆమనగల్లు పట్టణంలోని మార్కెట్యార్డు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చిన కారు యూటర్న్ తీసుకుంటూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా స్థానికులు చికిత్స నిమిత్తం వెల్దండలోని ఎన్నం హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ అనిల్కుమార్ మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కేపీహెచ్బీకాలనీ: రుణం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1.23 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... నిజాంపేట రోడ్డులో నివాసం ఉండే కోగంటి హరిబాబు రుణం అవసరంతో ఫిబ్రవరి 20న గ్రిడెన్ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ సంస్థను సంప్రదించారు. వారు ఆస్తి పత్రాల జిరాక్స్ తీసుకుని రుణ మంజూరు లెటర్ పంపారు. అనంతరం ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.15 లక్షలు తీసుకున్నారు. రుణ మంజూరు పత్రాలు, చెక్కులు చూపించి బీమా, లాయర్ ఫీజు, డాక్యుమెంటేషన్, స్టాంప్ డ్యూటీ పేరుతో మొత్తం రూ.1.23 కోట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. గత ఏప్రిల్ 5న సూరత్ నుంచి హైదరాబాద్కు విమాన టికెట్లు బుక్ చేశామని, ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యామని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కలుద్దామని చెప్పారు. ఆ తరువాత రాలేదు. నాలుగు రోజులు ఫోన్లు ఎత్తలేదు, ఆ తరువాత ఫోన్ స్విచ్ఆఫ్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరిబాబు పోలీసులను ఆశ్రయించాడు. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్కు బదిలీచేశారు. హరిబాబు ఇచ్చిన ఆధారాల ప్రకారం పోలీసులు 23 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీఆర్ఎస్ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ
తుక్కుగూడ: బీఆర్ఎస్ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ విమర్శించారు. తుక్కుగూడ ఔటర్ సర్కిల్ వద్ద శనివారం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ క్యారగారి శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అత్యంత హేయంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత బిడ్డను అవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి, ఫామ్హౌస్ సమీపంలో దళితులు నిరసన చేసిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. దీనిని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు సమర్థిస్తారా అని నిలదీశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్లార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన ఢీ విజేత రాజు
● నిందితుడి అరెస్ట్ మియాపూర్: ఢీ సీజన్ – 10 టీవీ షో టైటిల్ విన్నర్ రాజును మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మి తనతో శారీరక సంబంధం కొనసాగించడంతో పాటు, సుమారు రూ. 12 లక్షల నగదు తీసుకొని మోసం చేశాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. మియాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. గోకుల్ ప్లాట్స్లో ఓ భవనంలో ఓ మహిళ బోటిక్ నిర్వహిస్తోంది. అదే భవనంలోని ఐదవ అంతస్తులో ఢీ పేమ్, చిట్టి మాస్టర్ డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నారు. ఆ స్టూడియోకు రాజు తరచూ వచ్చేవాడు. ఒకే భవనంలో ఉండటంతో బోటిక్ నిర్వహిస్తున్న మహిళతో రాజుకు పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని రాజు హామీ ఇవ్వడంతో కొన్ని సంవత్సరాలుగా అతనితో సన్నిహితంగా ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో రాజు పలు దఫాలుగా ఫోన్ ద్వారా, నగదు రూపంలో సుమారు రూ. 12 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి గురించి అడిగితే వాయిదా వేస్తూ చివరకు పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో పాటు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని పేర్కొంటూ బాధితురాలు ఈ నెల 9న మియాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
భారతి సిమెంట్కు అవార్డు
మణికొండ: వ్యాపార, పారిశ్రమ, ఆసుపత్రి, నిర్మాణ, ఫార్మా తదితర రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న 60 మంది ప్రముఖులకు హైబిజ్ టీవీ అవార్డులను అందజేసింది. నార్సింగి సర్కిల్ గౌలిదొడ్డిలోని ప్రధాన్ కన్వెన్షన్లో శనివారం రాత్రి ఈ వేడుక నిర్వహించారు. అంతకు ముందు 60 మంది ప్రముఖుల జీవిత విశేషాల ఇంటర్వూలతో సిద్ధం చేసిన కాఫీ టేబుల్ బుక్ను ఏపీ మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. అనంతరం భారతి సిమెంట్ మార్కెటింగ్ జీఎం రవీందర్రెడ్డి, శాంత బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్రెడ్డి, సియాసత్ ఉర్దూ ప్రతిక ఎడిటర్ జాహీద్ ఆలీఖాన్, కరాచీ బేకరీ ఎంీడీ లేక్రాజ్, ప్రగతి రిసార్ట్ చైర్మెన్ జీబీకే, జనప్రియ బిల్డర్స్ రవీందర్రెడ్డి తదితరులకు అవార్డులు అందజేశారు. -
1.65 లక్షల కేసులు పరిష్కారం
సిటీ కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 1,65,000 పైగా కేసులు పరిష్కరించామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ తెలిపారు. 33 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ, ప్రీ–లిటిగేషన్ తదితర రాజీకి అనుకూలమైన కేసులను పరిష్కరించామన్నారు. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ఓ జంటకు కౌన్సెలింగ్ నిర్వహించగా, మనస్పర్థలు వీడి కలిసి జీవించేందుకు అంగీకరించారని తెలిపారు. దీంతో ఓ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా వారిని లోక్అదాలత్ కలిపిందని స్పష్టంచేశారు. శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఈఆర్జీఓ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా మోటారు వాహన ప్రమాద కేసుల బాధితులకు రూ.80 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. అన్ని కేసులలో కలిపి రూ.10 కోట్ల, 3 లక్షల 33 వేల నష్ట పరిహారాన్ని కక్షిదారులకు అందజేసినట్లు తెలిపారు. 33 బెంచీల్లో జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులకు రూ.10,03,33,000 పరిహారం అందజేత రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ -
పేదలకు అండగా ఉంటాం
కుల్కచర్ల: నిరుపేదలు, బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు తాము అండగా ఉంటామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం ఘనపూర్ గ్రామానికి చెందిన లేగల బచ్చయ్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. అండగా ఉంటాం అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఘనపూర్ ఇంచార్జి వెంకట్, మండల నాయకులు రాజు, మల్లేశ్, శ్రీనివాస్, చిన్న రాములు, మొగులప్ప, కిష్టయ్య, చంద్రయ్య, దేవేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి -
అరుదైన రుగ్మత ఉన్న మహిళకు సురక్షిత ప్రసవం
● 5 లక్షల్లో ఒకరికి అలెగ్జాండర్స్ ఫ్యాక్టర్ 7 డెఫిసియన్సీ వ్యాధి ● పండంటి ఆడశిశువు జననం.. ● ప్రైవేటులో రూ.40 లక్షలు..‘గాంధీ’లో ఉచితంగాంధీఆస్పత్రి: రక్తం గడ్డకట్టే అరుదైన రుగ్మతతో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం విజయవంతంగా నిర్వహించారు సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి వైద్యులు. గాంధీఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన యడ్ల లక్ష్మీ (21) ప్రసవం కోసం గతనెల 21న గాంధీఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అలెగ్జాండర్స్ కన్జ్నిటల్ ఫ్యాక్టర్ 7 డెఫిసియన్సీ వ్యాధి కారణంగా రక్తం గడ్డ కట్టే అరుదైన రుగ్మత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రసవం సమయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. లక్షలాది రూపాయల విలువైన రికాంబినెంట్ ఫ్యాక్టర్–7 మందును తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రత్యేకంగా అందించింది. ఈనెల 11న వైద్యుల పర్యవేక్షణలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఐదు లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదైన అలెగ్జాండర్స్ కన్జ్నిటల్ ఫ్యాక్టర్–7 డెఫిసియాన్సీ వ్యాధి ఉంటుందని, ప్రసవ సమయంలో రక్తం గడ్డకడితే తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రసవానికి సుమారు రూ.40 లక్షలు తీసుకుంటారని, గాంధీఆస్పత్రిలో పూర్తి ఉచితంగా నిర్వహించామన్నారు. గాంధీ గైనకాలజీ వైద్యులు ప్రొ. జానకీ, ప్రొ.శకుంతల, లేబర్రూమ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత తదితరులు వైద్య సేవలందించారు. -
పార్టీ బలోపేతానికి పనిచేయాలి
చేవెళ్ల: పార్టీ బలోపేతానికి కొత్తగా ఎన్నికై న కమిటీల సభ్యులు నూతనోత్సహంతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఎమ్మెల్యే కాలెయాదయ్యతో కలిసి నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు, ఐదు మండలాల్లో ఇటీవల ఎంపికై న పార్టీ నూతన అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్లు శైలజారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, నాయకులు ఆగిరెడ్డి, రాములుగౌడ్, గోపాల్రెడ్డి, పాండు యాదవ్, పడాల ప్రభాకర్, రవీందర్, టేకుపల్లి శ్రీనివాస్, కార్తీక్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, ప్రాకర్రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతోహనుమాన్ ఊరేగింపు
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంట గ్రామంలో హనుమాన్ ఊరేగింపు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం ముగింపు సందర్భంగా అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పూజల్లో పాల్గొన్నారు. హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్న ప్రసాదం పంపిణీ చేశారు. అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్ సూచించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు పోలీసులు, కక్షిదారులు, న్యాయవాదులు సహకరించాలని ఆయన కోరారు. బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య అనంతగిరి: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అ ణచలేరని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బీ కృష్ణయ్య అన్నారు. ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో పోలీసులు కృష్ణయ్యను, ఆశ వర్కర్ల యూనియన్ నాయకులను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజయ, లలిత, అనసూయ, కళావతి, రజిత, రమణి, మాధవి, మార్తా, సునీత, అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: జిల్లాలో వరి ధాన్యం సేకరణకు 129 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వరి కొనుగోలుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు సేకరించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కవిత, జిల్లా మార్క్ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో కొలువుదీరిన పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం శుక్రవారం భక్తుల సందడిగా మారింది. శ్రావణ మాసం ముగింపు సందర్భంగా భారీగ తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. -
హక్కులపై అవగాహన అవసరం
అనంతగిరి: దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక సూచించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని రవీంద్ర మండపంలో దివ్యాంగుల హక్కులు, ఉచిత న్యాయ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కాంతారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం, పునరావాస సేవలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాము, డీసీపీఓ శ్రీకాంత్, సీడీపీఓ శ్రీలత, ఆయా సంఘాల ప్రతినిధులు కావలి నర్సింహులు, సుధీర్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉచిత న్యాయ సహాయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక -
భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే
తాండూరు రూరల్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రీ సర్వే చేస్తోందని, ఇందుకు రైతులు, ప్రజలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్టిఘనాపూర్లో భూ రీసర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో చింతమణిపట్నం, చిట్టిఘనాపూర్, వీర్శెట్టిపల్లి, గుంతబాసుపల్లి గ్రామాల్లో సర్వే చేయనున్నట్లు తెలిపారు. అధికారులు గ్రామాన్ని సందర్శించిన సమయంలో రైతులు పట్టాదారు పాసుపుస్తకం, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర ఆధారాలతో సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, తహసీల్దార్ తారాసింగ్, సర్పంచ్ విజయ్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శి అమరేశ్వరి, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, ఏఎంసీ డైరక్టర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు సహకరించాలి అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి -
ఇందిరమ్మా.. ఇదేందమ్మా..!
బషీరాబాద్: ఇల్లు పూర్తయింది.. గృహప్రవేశం చేసుకున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి చివరి బిల్లు మాత్రం అందలేదు. అప్పులు చేసి ఇంటిని నిర్మించుకున్న పేద కుటుంబాలు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నాయి. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు. నిర్మాణంలో ఒక్కో దశ పూర్తవుతున్నా సాయం సకాలంలో అందడం లేదు. దీంతో సొంతింటి కల నెరవేరిన ఆనందం కంటే.. అప్పుల భారం, బిల్లుల నిరీక్షణే మిగులుతోంది. ప్రజాప్రతినిధుల సమక్షంలో గృహప్రవేశాలు ఆర్భాటంగా సాగుతున్నా.. తుది చెల్లింపుల కోసం లబ్ధిదారులు మాత్రం పడిగాపులు కాస్తున్నారు. నత్తనడకన పనులు జిల్లాలో మొదటి విడత కింద 12,467 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 9,237 ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారు. 3,230 ఇళ్ల పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు 7,982 గ్రౌండింగ్ పూర్తయింది. బేస్మెంట్ లెవల్లో 1,498, రూఫ్ లెవల్లో 723 ఉన్నాయి. 3,279 స్లాబ్ దశ పూర్తి కాగా 2,482 ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. 661 ఇళ్లకే చెల్లింపులు నిర్మాణాలు పూర్తయిన 2,482 ఇళ్లలో 661 ఇళ్లకే చెల్లింపులు జరిగాయి. ఇంకా 1,821 ఇళ్లకు తుది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంటే పూర్తయిన గృహాల్లో మెజారిటీ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తం అందలేదు. దీంతో నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చడం భారంగా మారింది. బీఎల్, ఎల్ఎల్, ఆర్ఎల్ దశల్లో ఉన్న గృహాలకు సైతం చెల్లింపులు నిలిచిపోయాయి. ఒక దశ బిల్లు రాకపోవడంతో తదుపరి పనులకు సొంత డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. కొరవడిన పర్యవేక్షణ మంజూరైన ఇళ్లలో 3,230 ఇంకా ప్రారంభం కాకపోగా.. పూర్తయిన 2,482లో 1,821 ఇళ్లకు బిల్లులు రాకపోవడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లింపులు జరగకపోవడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నిర్మాణాల్లో కూడా.. అప్పులు చేసి పనులు ఆందోళనలో లబ్ధిదారులు వెంటనే చెల్లించాలని విన్నపాలుమంజూరైనవి – 12,467 మార్కింగ్ ఇచ్చినవి 9,237 పనులు ప్రారంభం కానివి 3,230 గ్రౌండింగ్ పూర్తయినవి 7,982 బేస్మెంట్ లెవల్ 1,498 రూఫ్ లెవల్ 723 స్లాబ్ పూర్తయినవి 3,279 నిర్మాణం పూర్తయినవి 2,482 చెల్లింపులు జరిగినవి 661 తుది బిల్లులు పెండింగ్ 1,821 -
రోడ్డు పనులు పూర్తి చేయండి
పరిగి: పరిగి – లక్నాపూర్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మిట్టకోడూర్, చిగురాల్పల్లి, లక్నాపూర్, గోవిందాపూర్ గ్రామాల ప్రజలు పాదయాత్రతో నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2024లో రోడ్డు పనులను ప్రారంభించినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. బాగున్న రోడ్డును తవ్వి వదిలివేయడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వర్టుల నిర్మాణం కోసం తవ్వి మధ్యలో ఆపేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. వెంటనే రోడ్డు పనులను ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పంచాయితీరాజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పాదయాత్రతో నిరసన తెలిపిన పలు గ్రామాల ప్రజలు అడ్డుకున్న పోలీసులు -
స్పందన లేదు సర్!
వికారాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. సకాలంలో ఎస్ఐఆర్ను పూర్తి చేయాలని పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కానీ నోటీసులు అందుకున్న మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లు స్పందించడం లేదు. జిల్లాలో మొత్తం 10,17,671 మంది ఓటర్లు ఉండగా సర్ మొదటి విడతలో చనిపోయిన వారు, పెళ్లిళ్లు చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న 2,10,842 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. తదనంతరం 8,06,829 మంది క్రియాశీలకంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో పేర్లు, వివరాలు తప్పుగా నమోదు చేసుకున్న వారు 2,10,842 మంది ఉన్నారు. ఇందులో 1,85,228మందికి నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారికి ఇవ్వాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో కేవలం 43,224 మందే స్పందించారు. అధికారులను కలిసి సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించారు. వలస ఓటర్లపై.. ఎస్ఐఆర్ ప్రక్రియ వలస ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు చోట్ల ఓట్లు ఉంటే తొలగిస్తే ఎవరికి నష్టం లేదుకానీ.. ఒకే చోట ఉన్న ఓటును తొలగించే ప్రమాదం కనిపిస్తోంది. తండాలు, మారుమూల గ్రామాలకు చెందిన అనేక మంది పూణే, ముంబై, బెంగళూరు తదితర పట్టణాలకు వలస వెళ్లారు. వారికి ఇక్కడే ఓటు ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతి సారీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. నోటీసులు జారీ చేసే వారిలో ఎక్కువ మంది వారే ఉన్నట్లు సమాచారం. ఎక్కడెక్కడో ఉన్నందున ఇక్కడికి వచ్చి నోటీసులకు వివరణ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో అర్హులైన ఓట్లు జాబితా నుంచి తొలగించే ప్రమాదం పొంచిఉంది. దీనిపైనే రాజకీయ పార్టీలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు వికారాబాద్ పట్టణంలోని గంగారంలో 421 మందికి నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు 210 మంది మాత్రమే స్పందించారు. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాలు, తండాల్లో చెప్పాల్సిన పని లేదు. దోమ మండలం మైలారం పంచాయతీ అనుబంధ గ్రామాల్లో రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక బూత్ పరిధిలో 352 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 254 మందికి ఇచ్చారు. మరో 98 మందికి ఇవ్వాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటి వరకు పది శాతం కూడా స్పందించలేదు. ప్రధాన సమస్యలివే.. నోటీసులు ఇచ్చే విషయంలోనూ.. వారి నుంచి ధ్రువపత్రాలు తీసుకునే విషయంలోనూ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో బీఎల్ఓలు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇస్తున్నారు. వారు ఇచ్చే సమాచారాన్ని అధికారులు అంగీకరించడంలేదు. ఓటర్లు వచ్చి ఫొటో దిగి సరైన పత్రాలు అందజేయాలని చెబుతున్నారు. తండ్రీ కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులకు వయసులో వ్యత్యాసం ఉంటే ఇతర తప్పులు ఉంటే 12 రకాల సర్టిఫికెట్లతో సరిపోయేది ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంది. అయితే ఏ సమస్య ఉంటే వారు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలలో బీఎల్ఓలకు కూడా అవగాహన లేదు. దీంతో అవసరమైన సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సకాలంలో ఇవ్వడం లేదు. ఇది కూడా సర్ ప్రక్రియ ఆలస్యం అవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. నోటీసులు ఇచ్చినాసమాచారం ఇవ్వని ఓటర్లు అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి ధ్రువపత్రాలు ఇవ్వకుంటే తొలగనున్న మరిన్ని ఓట్లు వలస వెళ్లిన వారిపై ప్రభావంజిల్లాలో సర్ ప్రక్రియ ఇలా.. మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లు 2,6,7873 మంది నోటీసులు అందుకున్న వారు 1,85,228 ఇంకా ఇవ్వాల్సినవి 82,224 స్పందించిన జనం 43,224 మందే ధ్రువపత్రాల అందజేతకు గడువు పొడిగింపు నవంబర్ 5వరకు అవకాశం, 9న ఓటర్ల తుది జాబితా ప్రచురణ మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ధ్రువపత్రాల అందజేతకు, అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించింది. 8,06,829 మంది క్రీయాశీలక ఓటర్లలో మ్యాపింగ్ కాని వారు 35,262, పేర్లు, వివరాలు తప్పుగా నమోదు చేసుకున్న వారు 2,32,611 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కేటగిరీల్లో 2,67,873 మంది ఉండగా 1,85,228 మందికి నోటీసులు జారీ చేశారు. మరో 82224 మందికి నోటీసులు త్వరలో ఇవ్వనున్నారు. ఇప్పల వరకు కేవలం 20 శాతం మంది ఓటర్లు మాత్రమే స్పందించారు. నిర్ణీత గడువుగా సమాచారం ఇవ్వకుంటే వీరి ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది. అయితే ధ్రువపత్రాల అందజేతకు ఎన్నికల సంఘం గడువు పొడించింది. నవంబర్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది, నవంబర్ 9న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. -
9 పాఠశాలలకు రూ.106 కోట్ల నిధులు
కొడంగల్: నియోజకవర్గంలోని 9 పాఠశాలలకు రూ.106.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పాఠశాల విద్యాశాఖ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరున నిధులు విడుదలయ్యాయి. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు అభ్యాసన ఫలితాలను మెరు గు పరచడానికి వీలుగా వివిధ పనులను చేసేందుకు పరిపాలనా అనుమతులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, సమగ్ర విద్యా సౌకర్యాల ద్వారా అనుకూలమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించే ఆదర్శ సంస్థలుగా ఈ పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. నియోజకవర్గంలోని కొడంగల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బొంరాస్పేట, దుద్యాల, దౌల్తాబాద్, కోస్గి, కొత్తపల్లి, మద్దూరు, గుండుమల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
తాండూరు టౌన్: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తాండూరు ఆర్డీఓ అనిత సూచించారు. శుక్రవారం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ తదితర శాఖలు, హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు రోజులు నిర్వహించనున్న వినాయక ఉత్సవాలు తదనంతర నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల్లో భక్తులకు ఏమాత్రం లోటు రాకుండా చూసుకోవాలన్నారు. మంటపాలు, నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా కొనసాగేలా నిర్వాహకులు, హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, ప్రభాకర్ గౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిమజ్జన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు పీస్ కమిటీ సమావేశంలో ఆర్డీఓ అనిత -
రూ.5 భోజనం భేష్
కొడంగల్: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటిన్లో భోజనం బాగుందని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంటిన్ను సందర్శించి భోజనం చేశారు. రూ.5లతో పేదల ఆకలి తీరుస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు, నిరుపేదలకు తక్కువ ధరకు మంచి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం రూ.5లకే అల్పాహారం, మధ్యాహ్నం రూ.5లకే భోజనం పెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పురోగతి సాధించాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. -
సమస్యలపై పోరాటం
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్బంట్వారం: ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ అలుపెరుగని పోరాటం చేస్తోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కోట్పల్లి మండలం రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో పీఆర్టీయూ సర్వసభ్య నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ అమలు చేసే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే వెంటనే సానుకూల ప్రకటన చేయాలన్నారు. అనంతరం పీఆర్టీయూ కోట్పల్లి మండల అధ్యక్షుడిగా విశ్వేశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నవీన్, గౌరవ అధ్యక్షుడిగా వేణుగోపాల్, కార్యదర్శిగా సంపత్ నియమితులయ్యారు. మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా మరియా, ఉపాధ్యక్షులుగా పరమేశ్వరి, కార్యదర్శిగా మాధవి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనందర్రావు, ఎంఈఓ చంద్రప్ప, ఎస్ఐ శైలజ, హెచ్ఎం శారద, సర్పంచ్ నీలమ్మ, సంఘ నాయకులు రామకృష్ణగౌడ్, శేఖర్, మొహినొద్దీన్ పాల్గొన్నారు. -
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు
తాండూరు: సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తులసీ గార్డెన్లో నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి ఎంతో ఉంటుందన్నారు. అంతకు ముందు తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాలకు చెందిన ఎంఈఓలు ఎమ్మెల్యేను సత్కరించారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నాపరాయి పరిశ్రమలను ఆదుకోండి తాండూరు నాపరాయికి దేశ వ్యాప్తంగా ఎంతో పేరు ఉందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తాండూరు నాపరాతి పరిశ్రమ సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్బాబును కోరారు. పట్టణంలో భారీ వాహనాల పార్కింగ్ కోసం 18 ఎకరాల స్థలం సేకరించడం జరిగిందని, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమన్నారు. ఎన్నో ఏళ్లుగా సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన ట్రాన్స్జెండర్లకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించడం ప్రజా ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఉత్తమ టీచర్లకు సన్మానం -
కష్టపడితే మంచి భవిష్యత్తు
చేవెళ్ల: వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆదర్శ కళాశాల వసతిగృహం విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సరఫరా చేసిన నిత్యావసర వస్తువులు ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, జగ్గులు, బెడ్షీట్లు, ట్రంక్ పెట్టెలు తదితర సామగ్రిని స్తానిక కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్తో కలిసి శుక్రవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను, వసతిగృహాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు, కళాశాలతోపాటు ప్రభుత్వానికి గుర్తింపు వస్తుందని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు తీసిపోని విధంగా ప్రభుత్వం విద్యారంగాన్ని పురోగమనం వైపు నడిపిస్తోందన్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. స్థానికంగా కళాశాలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంటామని ఎలాంటి, ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రోత్సాహకాలు విడుదల చేయాలి
అనంతగిరి: మూడేళ్లుగా నిలిచిపోయిన ఎస్సీ, ఎస్టీ బాధితుల ఎక్స్గ్రేషియా, కులాంతర వివాహితుల ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతగిరి: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని వికారాబాద్ సీఐ రఘుకుమార్ సూచించారు. శుక్రవారం రాత్రి వికారాబాద్లోని ప్రధాన చౌరస్తాలో వాహనాల తనిఖీ చేశారు. పలువురు మైనర్లు బైకులు నడుపుతుండటంతో వారికి కౌన్సిలింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బషీరాబాద్: ఎలాంటి పత్రాలు లేకుండా వాగు నుంచి మైల్వార్ గ్రామానికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇసుక లోడ్తో వస్తున్న ట్రాక్టర్ను ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ శ్రీకాంత్ పోలీసుల మీదకు ట్రాక్టర్ను నడిపేందుకు ప్రయత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు బషీరాబాద్ ఎస్ఐ విఠల్ తెలిపారు. డ్రైవర్తోపాటు ట్రాక్టర్ యజమాని సూర్యప్రకాశ్పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవాబుపేట: ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం ఎల్లకొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాశీపురం కిష్టమ్మ(50) ఉదయం జిరాక్స్ షాపునకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ట్రాక్టర్ డ్రైవర్ ఇర్లపల్లి ప్రశాంత్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమార్తె స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యాపారి అదృశ్యం మీర్పేట: ఇంట్లోంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపిన ప్రకారం.. మీర్పేటకు చెందిన పెద్దయ్య కుమారుడు చెంగల బంగారి (41) వ్యాపారి. ఈ నెల 8వ తేదీన ఆఫీసుకు వెళ్తున్నానని భార్యకు చెప్పి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం కుటుంబ సభ్యులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి షాద్నగర్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేశంపేట మండలం బొదనంపల్లికి చెందిన శేఖర్, మాజీ ఉప సర్పంచ్ లింగారెడ్డి ఎమ్మెల్సీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలకు కష్టాలు తప్ప మేలు జరిగిందేమీ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ పంతులు, తాండ్ర విష్ణువర్ధన్రెడ్డి, యారం శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంజాయి చాకెట్లు స్వాధీనం కొత్తూరు: పట్టణంలో అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ, స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకితీసుకున్నారు. 8వ వార్డులోని హనుమాన్ ఆలయం సమీపంలో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన భోలా(45) తన ఇంట్లోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసి నిషేధిత గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోదాలు నిర్వహించి, 70 చాక్లెట్లు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి జగదీశ్ శర్మ అన్నారు. సీజీఆర్ పర్యావరణ సంస్థ–తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నిర్వహించిన (లీడ్ ఎర్త్ లీడర్) రెండు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో తీసుకువస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. పాఠశాలలు పర్యావరణ చైతన్య కేంద్రాలుగా మార్చాలనే ఆలోచన అభినందనీయమన్నారు. లీడ్ ఎర్త్ లీడర్స్ అనే పేరులోనే నాయకత్వ లక్షణం ఉందన్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తలుచుకుంటే గ్రామ భవిష్యత్ను మార్చేయగలడని చెప్పారు. ఎర్త్ క్లబ్ అంటే ఉద్యమమని పాఠశాలల్లో పిల్లల చేత మొక్కలు నాటించి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. సేంద్రియ తోటలను పెంచడం, వర్షం నీటిని సంరక్షించడం, నీటి సంరక్షణ, అటవీ పరిరక్షణ, వ్యర్థాల నిర్వాహణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, కిచెన్గార్డెన్ల ఏర్పాటు, హరితహారం, జీవవైవిధ్యం, సోలార్ ఎనర్టీ వంటి అంశాలపై ఆచారణత్మతక శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, ఫౌండర్ లక్ష్మారెడ్డి, విద్యావేత్త ఉపేందర్రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, వైఈఎల్పీ కోఆర్డినేటర్ వెంకట్రెడ్డి, విశ్రాంత డీఈఓ వెంకటేశ్వర్లు, పర్యావరణ వేత్త ఉమామహేశ్వర్రెడ్డి, నవ్య, నగేశ్, రజనీకాంత్, వైష్ణవి, మహాలక్ష్మి, మద్దిలేటి, శివ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దుర్గం చెరువు ప్రక్షాళనకు పక్కా వ్యూహం
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: దుర్గం చెరువులోకి మురుగు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువులోకి వచ్చే నాలాలు, మురుగునీటి ప్రవాహాలు, ఎస్టీపీలు వర్షపు నీటి కాలువల పనితీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. 2047 నాటికి పెరిగే మురుగునీటి పరిమాణానికి అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. నాలాల ప్రారంభ స్థానం నుంచి చెరువు వరకు ప్రవాహ మార్గాలన్నింటినీ గుర్తించి సమగ్ర ప్రవాహ మ్యాప్ను సిద్ధం చేయాలన్నారు. వర్షం లేని రోజుల్లో నాలాల్లో మురుగు లేకుండా ప్రత్యేక పైపులైన్ ద్వారా ఎస్టీపీలకు తరలించాలని సూచించారు. చెరువు పరీవాహక ప్రాంతంలోని హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, హైరైజ్ భవనాలలోని ప్రైవేట్ ఎస్టీపీల పనితీరు, ఉత్పత్తి అయ్యే మురుగు, నీటి శుద్ధి నాణ్యతపై సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే మూలస్థాయిలోనే వాటిని అడ్డుకునే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం హైడ్రా , జీహెచ్ఎంసీ , హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలతో కలిసి పనిచేయాలని జలమండలి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అశోక్రెడ్డి వెంట సైబరాబాద్ ఈడీ సంతోష్, ఎస్టీపీ సీజీఎం పద్మజ, జీఎం హరిశంకర్తదితరులు ఉన్నారు. షాద్నగర్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ శ్రీవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలో బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభిస్తే హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించిందన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించిన ఎంతో మంది తెలంగాణ వీరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన రోజని తెలిపారు. అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, దేపల్లి అశోక్గౌడ్, ప్యాట అశోక్, మచ్చ సుధాకర్, వంశీకృష్ణ, మురళీ, నర్సింహ్మ, ఇస్నాతి శ్రీను, సురేష్, రుషి, రణదీర్, రాజు, శ్రీను, మల్లేష్, రఘు, రవి నాయక్, సాయికుమార్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్యంతోనే సత్ఫలితాలు
షాద్నగర్ రూరల్: విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే సత్ఫలితాలను సాధిస్తారని డాక్టర్ ముస్తాకిన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ పరిధిలోని శ్రీనివాసకాలనీ ప్రాథమిక పాఠశాలలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు డీపీటీ, టీడీ వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిన్నపాటి అనారోగ్యానికి గురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలన్నారు. విద్యార్థులు డీపీటీ, టీడీ టీకాలను తీసుకోవాలని, టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం, స్వల్పంగా జ్వరం వస్తుందని, ఆందోళన అక్కర్లేదని తెలిపారు. అనంతరం విద్యార్థులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రజిత, ఉపాధ్యాయులు లక్ష్మీదేవమ్మ, వనజ, ధనలక్ష్మి, మాధవాచారి, ఏఎన్ఎంలు రమాదేవి, కవిత, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
కీలక ఆధారాలు లభ్యం!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నేదునూరు గ్రామంలో జరిగిన రియల్ఎస్టేట్ వ్యాపారి బాణాల రాంరెడ్డి ఆత్మహత్య ఘటన సంగారెడ్డి జిల్లాలోనూ కలకలం రేపింది. ఈ ఆత్మహత్యకు కారణం పటాన్చెరు ప్రాంతంలోని ఓ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ భూ వివాదాలే కారణమని ప్రాథమికంగా తేలడం చర్చనీయాంశంగా మారింది. రాంరెడ్డి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రామేశ్వరం బండ ప్రాంతంలో రాంరెడ్డి సుమారు 200 ఎకరాలకు భారీ వెంచర్ వేశారు. ఈ వెంచర్ భూవివాదాలే ఆత్మహత్యకు దారితీశాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం. వాయిస్ రికార్డులో కీలక అంశాలు పోలీసులు స్వాధీనం చేసుకున్న రాంరెడ్డి సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డుల్లో కీలక అంశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన డెవలప్చేస్తున్న వెంచర్కు సంబంధించిన భూమి యజమానులకు ఈ వాయిస్ రికార్డులు పంపినట్లు సమాచారం. ఈ భూవివాదాన్ని పరిష్కరించుకునేలా చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ఈ రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత భూమి యజమానుల నుంచి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ వెంచర్కు భూములను హెచ్ఎండీఏ క్లియరెన్స్ల కోసం ఇప్పటికే ఆయన రెండు, మూడు పర్యాయాల్లో సుమారు రూ.28 కోట్ల వరకు వెచ్చించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాగా రాంరెడ్డి క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ వెంచర్తోపాటు, పటాన్చెరు ప్రాంతంలో మరికొన్ని వెంచర్లు అభివృద్ధి చేశారు. రాంరెడ్డి దగ్గరి బంధువుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ వెంచర్లో పెట్టుబడులు పెట్టి వివాదంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రమేయంపైనా ప్రచారం! ఈ కేసులో రాంరెడ్డికి ఉన్న ఆర్థిక ఇతర ఇబ్బందులు ఒక అంశమైతే.. పటాన్చెరుకు చెందిన ప్రజాప్రతినిధుల వేధింపులు కూడా మరో కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్కు సంబంధించి స్థానిక కీలక ప్రజాప్రతినిధులు వాటాలు, పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ భూముల జోన్ మార్పిడి వ్యవహరంలోనూ ఈ ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అధికారులకు సిఫార్సులు చేసినట్లు సంబంధిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వెంచర్ భూవివాదంలో పోలీసు అధికారి పాత్ర కూడా తెరపైకి వస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఓ పోలీసు అధికారి ఈ భూవివాదాల్లో కలగజేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు పోలీసు అధికారి సెటిల్మెంట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. కలకలం రేపిన రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య పటాన్చెరు సమీప వెంచర్ భూవివాదాలే కారణం! పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో కీలక అంశాలు -
రేషన్ బియ్యం పట్టివేత!
పరిగి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పరిగి పోలీసులు పట్టుకున్నారు. అయితే గోప్యత పాటిస్తున్నారు. బుధవారం ఉదయం మండలంలోని రాఘవాపూర్ వద్ద ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఎన్ని క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. నిందితులు ఎవరు అనే విషయాలు వెల్లడించడం లేదు. దోమ: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కుమ్మరికుంట తండాలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతు కేతావత్ తుల్చా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. తన వద్ద ఉన్న పశువుల్లో ఓ ఆవు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికాడు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ సమీపంలో కరెంట్ షాక్కు గురై చనిపోయింది. ఆవు విలువ రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సిటీ కోర్టులు : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్కు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు, వ్యక్తిగత బాండ్లను పోలీస్స్టేషన్లో అందజేయాలని శనివారం ఆదేశాలు జారీ చేయగా, బుధవారం సుమంత్ తరఫున న్యాయవాదులు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో వ్యక్తిగత బాండ్తోపాటు పూచీకత్తులను అందజేశారు. వ్యాపారవేత్తపై దాడి చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతోపాటు దాడికి పాల్పడ్డారని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ’జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న సుమంత్ మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన నాంపల్లి కోర్టులో బెయిల్ దాఖలు చేయగా పలు షరతులతో నాంపల్లి సెషన్స్ కోర్టు జడ్జి సాయిరమాదేవి మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. -
బీజేవైఎం నాయకుడికి ఎంపీ పరామర్శ
మొయినాబాద్ రూరల్: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో పోలీసుల లాఠీచార్జీ ఎంతవరకు సమంజసమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలో గాయపడిన బీజేవైఎం నాయకుడు శ్రీకాంత్ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాయకుడు ప్రభాకర్రెడ్డితో కలిసి పరామర్శించారు. ఉద్యమ ఉధృతి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పోరాటం అభినందనీయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, బట్టు జ్ఞానేశ్వర్, రెడ్డిపల్లి సర్పంచ్షాపురం రాజు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో కలిసి సాగండి
● చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ● మున్సిపాలిటీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం చేవెళ్ల: మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. 17 వార్డు రంగారెడ్డి కాలనీలో 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను బుధవారం స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్లుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటి అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. కొత్త మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు. ఏన్నో ఏళ్లుగా ఉన్న రంగారెడ్డి కాలనీలోని సీసీ రోడ్డు సమస్య తీరడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డు నాణ్యతతో వేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపాల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. టీయూటీఎఫ్డీసీ నిధులు మంజూరు ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో మున్సిపాలిటీకి రూ.28.5కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరైనట్లు చైర్పర్సన్ దేవర సమతారెడ్డి తెలిపారు. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు పూర్తి చేస్తామాన్నరు. తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన పనులను పరిశీలించి, సూచనలు చేశారు. -
సెక్యూరిటీ గార్డును ఢీకొట్టిన కారు
● యువకుడి దుర్మరణం ● బీటెక్ విద్యార్థి అరెస్ట్ ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటు చేసుకోగా.. బుధవారం ప్రమాదానికి కారణమైన యువకుడిని అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. రోహిత్సింగ్యాదవ్(22) మూడు రోజుల క్రితం కోహెడ రోడ్డులోని ఓ ఫంక్షన్ హల్లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీని ముగించుకుని శ్రీ గురు కాలేజీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీ టీవీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా ఎర్టిగా వాహనం అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపిస్తూ ఆయన్ను ఢీకొట్టినట్టు గుర్తించారు. సేకరించిన ఆధారాలతో ఈ ప్రమాదానికి కారకుడైన ఫిర్జాదిగూడకు చెందిన బీటెక్ విద్యార్థి వరుణ్ను బుధవారం అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సబితారెడ్డిని కలిసిన చేవెళ్ల నేతలు
చేవెళ్ల: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిని చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నగరంలోని ఆమె నివాసానికి చేరుకుని పరామర్శించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ సమాజం మండిపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దౌర్జన్యాలపై గట్టిగా పోరాడాలని సూచించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆమెను కలిసిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, గోనె కరుణాకర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, కుర్వ మల్లేశ్, విజయ్భాస్కర్రెడ్డి, తలారి యాదయ్య, డీఎం.చందు, వెంకటేశ్వర్రెడ్డి, దండు సత్యం, వెంకటేశ్, రామగౌడ్, క్రిష్ణారెడ్డి, రాజు, వెంకటేశ్వర్రెడ్డి, అనంత్రెడ్డి, కృష్ణ, రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు. -
సదక్కతుల్లా ఎక్కడ?
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్ విమానాశ్రయ కేంద్రంగా ఎస్కేప్స్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. లుక్ ఔట్ సర్క్యులర్ ఆధారంగా (ఎల్ఓసీ) ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి.. వీరి కస్టడీ నుంచి పరారైన ధవల్ దోషి ఉదంతం మరువక ముందే... కస్టమ్స్ అధికారుల వంతు వచ్చింది. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్లో కీలక నిందితుడిగా ఉన్న కేరళ వాసి సదక్కతుల్లా కస్టమ్స్ అధికారుల కస్టడీ నుంచి పారిపోయాడు. గత నెల 17న తిరువనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానంలో ఓ వ్యక్తి బంగారం పేస్టుతో వస్తున్నాడనే సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ కస్టమ్స్లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అప్రమత్తమైంది. కేరళకు చెందిన టీపీ సదక్కతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్రే స్కానింగ్లో ఓ నల్లరంగు ప్యాకెట్ ఉన్నట్లు గుర్తించారు. తన వద్ద బంగారం పేస్ట్ ఉన్నట్లు విచారణలో అంగీకరించాడు. ఓ సీటు కింద ఓ ప్రయాణికుడు వదిలివెళ్లిన ప్యాకెట్ను తీసుకున్నట్లు అంగీకరించాడు. ఆ బంగారాన్ని తీసుకొచ్చినందుకు తనకు రూ.10 వేల కమీషన్ ఇస్తామని చెప్పారని, హైదరాబాద్ విమానాశ్రయం బయట వేచిఉన్న వ్యక్తికి అప్పగించాల్సి ఉందని చెప్పాడు. ప్యాకెట్ మొత్తం బరువు ప్యాకేజింగ్తో కలిపి 697 గ్రాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాక్షులు సమక్షంలో సదక్కతుల్లాను శంషాబాద్లోని ఆర్బీ నగర్లో ఉన్న బంగారం కరిగించే కేంద్రానికి తీసుకువెళ్లారు. పసిడిని బయటకు తీయడానికి పేస్టును కరిగించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో సదక్కతుల్లా కస్టమ్స్ అధికారి లవ్కేశ్ కుమార్ మీనాను తోసేసి ప్రధాన రహదారి వైపు పరుగెత్తాడు. అధికారులు వెంటపడినా అతడు జనంలో కలిసిపోయి తప్పించుకున్నాడు. దీంతో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ పేస్టును కరిగించిన తర్వాత 570 గ్రాముల బంగారం బయటపడగా దీని మార్కెట్ విలువను రూ.90,56,067గా తేల్చారు. ఈ కేసు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఆర్జీఐఏ ఠాణా సబ్–ఇన్స్పెక్టర్ పి.అశోక్ వర్మ ‘సాక్షి’కి తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ కీలక పాత్రధారి తిరువనంతపురం నుంచి సిటీకి పసిడి పేస్ట్తో... సమాచారంతో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు వారి కస్టడీ నుంచి తప్పించుకుని పరారీ -
అనుమతులు తీసుకోండి
మొయినాబాద్: గణేశ్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చేవెళ్ల డీసీపీ యోగేష్గౌతం అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో బుధవారం గణేష్ ఉత్సవ కమిటీలు, గణేశ్ విగ్రహాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహం ఎత్తు, నిమజ్జనం చేసే తేదీ, ప్రదేశం తదితర వివరాలను పోలీస్ ప్రొటోకాల్ వెబ్సైట్లో నమోదు చేసి అనుముతు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో శబ్ద కాలుష్యం లేకుండా నిబంధనలను పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ మండపాల్లో అగ్ని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ ఊరేగింపులు నిర్వహించాలని తెలిపారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటించి, సహకరించాలన్నారు. ఎవైనా అనుమానాస్పద కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో ఏసీపీ కిషన్, ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీలకు డీసీపీ యోగేష్గౌతం సూచన ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పిలుపు డీజేలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక ర్యాలీలతో ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని వెల్లడి -
చేపల వేటకు వెళ్లి..
చెరువులో పడి వ్యక్తి మృతి పరిగి: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుడగజంగం హన్మంతు(42) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి రాలేడు. ఉదయం గ్రామ సమీపంలోని చెరువు గట్టుపై చెప్పులు, దుస్తులు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలించగా మృతదేహం లభించింది. మృతుడికి భార్య మేరమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యాలాల: మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామకంఠం పరిధిలో ఏర్పాటు చేసిన మంచినీటి బావితో పాటు రాకపోకలకు వినియోగించే దారి కబ్జాకు గురైందని యాలాల సర్పంచ్ శివయ్య, కాంగ్రెస్ నేత పేరి రాజేందర్రెడ్డి బుధవారం ఆరోపించారు. 1970 ప్రాంతంలో మంచినీటి బావిని తవ్వించారని, ప్రస్తుతం అది ఆక్రమణకు గురవుతోందన్నారు. బావిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బావితో పాటు ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు గ్రామకంఠం పరిధిలో ఉన్న రహదారి సైతం పూర్తిగా ఆక్రమణకు గురై, నిత్యం ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి కబ్జా నుంచి బావి తోపాటు దారిని రక్షించాలని వారు కోరారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి షాబాద్: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్షం కారణంగా ఓ విద్యార్థి కాలు విరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన విద్యార్థి జశ్వంత్ షాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చేందుకు షాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో వేచియున్నాడు. షాద్నగర్ నుంచి రేగడి చిల్కమర్రికి వెళ్లే బస్సు బస్టాండ్లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుండగా బాలుడు బస్సు ఎక్కుతుండగానే ఒక్కసారిగా కదలడంతో కిందపడిపోయాడు. దీంతో అతడి కాలు మీదుగా బస్సు టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఓప్రైవేట్ వాహనంలో క్షతగాత్రుడిని పాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. శంకర్పల్లి: పాఠశాలకి వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శంకర్పల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సురేశ్ తెలిపిన ప్రకారం.. రావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన మల్లికార్జున్(16) శంకర్పల్లిలోని అన్నపూర్ణ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. పాఠశాల దగ్గర బస్సు దిగిన విద్యార్థి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారుడు మృతి అబ్దుల్లాపూర్మెట్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వెలువర్తి గ్రామానికి చెందిన మారబోయిన వినయ్(25) మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్మెట్ నుంచి బాటాసింగారం వైపు ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యలో ఇనాంగూడ బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. రాంగోపాల్పేట్ పోలీసులు తెలిపిన మేరకు.. కేరళకు చెందిన అధిరా అనీష్ (24) కిమ్స్లో నర్సుగా పనిచేస్తూ పీజీరోడ్లోని హాస్టల్లో ఉంటుంది. అధిరా అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కేరళ నుంచి పరామర్శించేందుకు వచ్చారు. ఆస్పత్రి వద్దను ఆమెను కలువగా చిన్న విషయానికి వాగ్వివాదం జరిగింది. తాను హాస్టల్కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయింది. అన్ని చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తల్లి రాంగోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కిసాన్ మోర్చా నారాయణపేట ఉపాధ్యక్షుడిగా బుగ్గప్ప
దౌల్తాబాద్: కిసాన్ మోర్చా నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని గోకఫసల్వాద్ గ్రామానికి చెందిన పోతుల బుగ్గప్ప ఎన్నికయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తనకు పదవి అప్పగించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా చేస్తానన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్ అనంతగిరి: నర్సరీలు ఏర్పాటు చేసేవారు, ఇప్పటికే నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎంఏ సత్తార్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నర్సరీలను ఏర్పాటు చేయరాదన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని నర్సరీల యజమానులకు తెలంగాణ నర్సరీ చట్టంపై అవగాహన కల్పించారు. కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల నారు పెంచుతున్న వారు ఉద్యాన శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన నారు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు కమల, సురేంద్రనాథ్, యమున, సంతోష్ కుమార్, అక్షిత రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: అణగారిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. బుధవారం వికారాబాద్లోని అతిథి గృహంలో ఏఐసీసీ సంఘటన సృజన్ అభియాన్లో భాగంగా ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్ష పదవికి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్లో అర్జీలు స్వీకరించామని, సెప్టెంబర్ 12న పరిగి, 13న కొడంగల్, తాండూరులో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఎస్టీ సెల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ లింగం నాయక్, సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రానాయక్ పరిశీలకులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు శివరాంనాయక్, నాయకులు రవి నాయక్, పరుశరాం నాయక్, రాములు నాయక్, విఠల్ నాయక్, శాంత నాయక్, సత్యహరిచంద్ర, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి నవాబుపేట: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఇచ్చే ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా చూడాలని చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి సూచించారు. బుధవారం నవాబుపేట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో సర్ ప్రక్రియపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ్యాపింగ్ కాని, అనామలిస్ జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లు నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలు సమర్పించాలని సూ చించారు. నియోజకవర్గంలో 52,359 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారు లు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, ఎంపీఓ విజయ్ కుమార్, డీటీ నవీన్ కుమార్ రెడ్డి, సర్పంచ్ గాజుల గూడెం నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవనీత, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
మహోన్నత వ్యక్తి కాళోజీ
అనంతగిరి: ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళోజీ తన రచనలు, కవిత్వంతో ప్రజా సమస్యలను ప్రపంచానికి చాటారని తెలిపారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన సాహిత్యంలో ప్రతిబింబించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆలోచనా విధానం నేటి తరానికి స్ఫూర్తి దాయకమన్నారు. యువత ఆయన సాహిత్యాన్ని అధ్యయనం చేసి సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు మాధవరెడ్డి, జైపాల్రెడ్డి, డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర, డిప్యూటీ కలెక్టర్ పూజ, డీఏఓ కవిత, డీపీఆర్ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతులనే పూజిద్దాం మట్టి గణపతులనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం కలెక్టర్కు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ఇంజనీర్ శరత్చంద్ర మట్టి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం వినాయక చవితి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువులు, కుంటల్లో నీరు కలుషితమవుతుందన్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూ చించారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బందికి విగ్రహాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జెడ్పీ సీఈఓ సుధీర్, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు మాధవరెడ్డి, జయపాల్ రెడ్డి, డీపీఓ జయసుధ, డీపీఆర్ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం కలెక్టర్ దీపక్ తివారి -
చోరీ సొత్తు రికవరీ
అనంతగిరి: దొంగతనం కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంతోపాటు చోరీ సొత్తు రికవరీ చేస్తామని అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో అంతర్రాష్ట్ర దొంగ వికాస్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్ కాలనీలో మే ఒకటో తేదీ రాత్రి ఓ ఇంట్లో బంగారం, నగదు చోరీకి గురైంది. కేసు విచారణ చేపట్టిన జిల్లా సీసీఎస్, వికారాబాద్ టౌన్ పోలీసులు జూన్ 4న వికాస్ సింగ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు అనుమతితో నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా అనేక విషయాలు బయటికి వచ్చాయి. వికాస్ సింగ్పై వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు, పరిగి పీఎస్ పరిధిలో ఒక కేసు ఉంది. ఈ కేసులకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లా కుడువర్ పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో తన తల్లి ద్వారా తనఖా పెట్టిన సుమారు 25 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. అశోక్ కుమార్ సోనీ, వికాస్ అగ్రహారి తదితరుల బంగారం దుకాణాల నుంచి దొంగ సొత్తును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కేసులో పురోగతి సాధించిన డీఎస్పీ అంజయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ను ఎస్పీ అభినందించారు. అంతర్రాష్ట్ర దొంగ వికాస్ సింగ్ కేసులో పురోగతి యూపీలో 25 తులాల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా -
జిల్లాకు అసెంబ్లీ సెగ
వికారాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేరిగిన మంటల సెగ జిల్లాకు తాకింది. స్పీకర్ ప్రసాద్కుమార్పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి. స్పీకర్ సొంత నియోజకవర్గం వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ అనన్యతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ర్యాలీలు తీశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు, తాతా మధు దిష్టి బొమ్మలను దహనం చేశారు. మంగళవారం ఇరు పార్టీల నేతలు పోటా పోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ సైతం.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సబితారెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా పోలీసులు దురుసుగా వ్యవహరించటంపై ఆ పార్టీ జిల్లా నాయకులు రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తోపాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. పరస్పర విమర్శలు, ఆరోపణలు, ధర్నాలు, ర్యాలీలతో జిల్లా కేంద్రం అట్టుడికింది. తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో కూడా ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు కొనసాగాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి నాలుగు రోజుల క్రితం కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కొడంగల్, బొంరాస్పేట, వికారాబాద్, పరిగి ప్రాంతాల్లో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని సైతం అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారు. అప్పటి నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణ ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలు ముఖ్యనేతల దిష్టి బొమ్మల దహనం తాతా మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం కేటీఆర్, సబితారెడ్డిపై పోలీసుల తీరును విమర్శించిన గులాబీ నేతలు -
15నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు
అనంతగిరి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈనెల 15 నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్లాల్ సిబ్బందికి సూచించారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పారామెడికల్ ఆప్తమిక్ అధికారులు, రాష్ట్రయ బాల స్వస్త కార్యక్రమం టీంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కంటి సంబంధ సమస్యలు గుర్తించడం, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించడం, కళ్లద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అందుకు పాఠశాలల వారీగా సిద్ధం కావాలని సూచించారు. అనంతరం సీహెచ్సీ సెంటర్ల వైద్యాధికారులతో మాట్లాడారు. సీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలను హెచ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. రక్తపోటు, మధుమేహం వ్యాధి గ్రస్తుల స్క్రీనింగ్ అనంతరం ఎన్సీడీ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులను ఎప్పటికపుడు నమోదు చేయాలని సూచించారు. డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ -
చెరువుకు చేరని చేప
నెల రోజుల్లో ముగియనున్న వర్షాకాలంవికారాబాద్: ఈ సారి చేప పిల్లలు చెరువుకు చేరడం కష్టంగానే కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వర్షాకాలం ముగియనుంది. ఇప్పటి వరకు టెండర్లు కానీ.. చేప పిల్లల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. చెరువుల్లోకి వదులుతారా లేదా అనే సందేహం మత్స్య సహకార సంఘాల్లో నెలకొంది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు మాత్రం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి.. అనుకూలంగా ఉన్నవి ఎన్ని అనే వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి కూడా అందజేశారు. టెండర్ల ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 14.97లక్షల రొయ్య పిల్లలు జిల్లాలో మొత్తం 1,179 చెరువులు, కుంటలు ఉండగా చేపల పెంపకానికి 779 అనుకూలమని గుర్తించారు. వీటిలో 1.29 కోట్ల చేప పిల్లలు, 14.97 లక్షల రొయ్య పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకున్నారు. 152 మత్స్య సహకార సంఘాలు.. 5,665 మంది సభ్యులు ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు తగ్గిన విషయం తెలిసింది. ఇది కూడా చేప పిల్లల పెంపకంపై ప్రభావం చూపుతోంది. పెద్ద చెరువుల్లో నీరు బాగానే ఉంది. కొన్నింటిలో 75 శాతం మేర నీరు ఉంది. ఇలాంటి చెరువుల్లో చేప పిల్లలు వదలవచ్చని మత్స్య సహకార సంఘాల సభ్యులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం చెరువులు 1,179, ఎంపిక చేసినవి 779 వదలాల్సిన చేప పిల్లలు 1.29 కోట్లు మత్స్య సహకార సంఘాలు 152 ఏటా లక్ష్యానికి దూరమే.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపపిల్లలు వదిలే విషయంలో అధికారులు ఎంచుకున్న లక్ష్యానికి వదులుతున్న దానికి ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఏటా ఇదే తంతు కనిపిస్తోంది. ఎంచుకున్న లక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకే వదిలి చేతులు దులుపుకొంటున్నారు. ఎక్కువ శాతం నాసిరకం పిల్లలను వదులుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా చేపల ఎదుగుదల సరిగ్గా ఉండలం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన పిల్లలను వదిలితే దిగుబడి బాగా వస్తుందని అంటున్నారు. -
అందరికీ సంక్షేమ ఫలాలు
చేవెళ్ల: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి అందించేందుకు కృషి చేస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని ఖానాపూర్ గేట్ సమీపంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం చేవెళ్ల మండల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ, నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ఆదుకుంటోందని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన సమస్య తీరిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం డిజిటల్గా ఉండేలా స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని చెప్పారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య, చేవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, వైస్ చైర్మన్ రాములుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షఱుడు గిరిధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అద్యక్షుడు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, రవి, రాంచంద్రయ్యగౌడ్, జ్యోతిభూపాల్, కౌన్సిలర్లు శైలజారెడ్డి, ఎం.కళ్యాణి, గోపాల్రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, నాయకులు మదుసుదన్గుప్తా, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు. -
నాణ్యమైన బోధన చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం ఆమె మండల పరిధిలోని ఉప్పరిగూడ ప్రీప్రైమరీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధిస్తున్న తీరును తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీపై అంగన్వాడీ టీచర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య పెంచేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ పోషణ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఐదవ తరగతిలో కూర్చుని పాఠాలు విన్నారు. టీచర్ సపోర్టు గ్రూపులుగా విభజించి వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని చెప్పారు. వర్ణమాల, గుణింతాలు రాని మూడు, నాలుగు, ఐదవ తరగతి విద్యార్థులను కేటగిరీలుగా విభజించి టైం టేబుల్ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీవేణి, ఎంఈఓ హీర్యానాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వినితాదేవి, హెచ్ఎం వీకే లక్ష్మీ, టీఆర్పీ రంగారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు . రంగారెడ్డి అదనపు కలెక్టర్ కిరణ్మయి -
డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి
పరిగి: డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌస్, నందు మిత్రులు. సెంట్రింగ్ పనులు కలిసి, విడిగా చేస్తుంటారు. ఇటీవల నందు వికారాబాద్లో ఓ సెంట్రింగ్ పనిని గుత్తకు తీసుకున్నాడు. పని సక్రమంగా చేయకపోవడంతో నిర్వాహకులు గౌస్కు అప్పగించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పాత బకాయి, ఎన్నెపల్లిలో పని చేసిన డబ్బులు ఇవ్వాలని గౌస్ నిత్యం నందును అడగ సాగాడు. గతంలో ఇద్దరు కలిసి కొన్ని పనులు చేయగా అందులో గౌస్ లెక్క తేలాల్సి ఉందని గ్రామస్తులు తెలిపారు. గౌస్ తరచూ నందును డబ్బులు అడగడం, రోడ్లపై నిలదీస్తుండటంతో నందు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బర్కత్పల్లి రోడ్డు పక్కన కూర్చున్న గౌస్తో నందు గొడవకు దిగి కత్తితో దాడి చేశాడు. గౌస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. వ్యక్తికి తీవ్ర గాయాలు నస్కల్ గ్రామంలో ఘటన -
గులాబీ పురుగు నివారణకు ముందస్తు చర్యలు
దోమ: పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్రావు సూచించారు. మంగళవారం శివారెడ్డిపల్లి రైతు వేదికలో అర్కా ఎప్పిసి ఆధ్వర్యంలో వాసన్, ఎల్డీసీ, కారుణ్య సేవా సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎల్డీసీ ప్రతినిధులు అఖిలేష్, కార్తీక్ రైతులకు పురుగు గుర్తింపు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. పత్తి పంట 45 రోజుల దశ నుంచి లింగాకర్షణ బుట్టలతో నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వరుసగా మూడు రోజులు బుట్టల్లో ఎనిమిది తల్లి పురుగులు కనిపిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం లింగాకర్షణ బుట్టల ఏర్పాటు, వినియోగంపై రైతులకు డెమో నిర్వహించి బొంపల్లి, బాసుపల్లి, గూడూరు గ్రామాలకు చెందిన రైతులకు లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం కారుణ్య సంస్థ ప్రతినిధి మధుసూదన్రావు మాట్లాడుతూ... రైతుల ప్రయోజనం కోసం మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీసీ అసిస్టెంట్ మేనేజర్ అఖిలేష్, వాసన్ ప్రతినిధులు సత్యం, గోపాల్, ప్రేమ్, నరేశ్, సుష్మిత, మోహన్, తిరుమలేశ్, విష్ణుమూర్తి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్రావు -
రైతుల ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి రెవెన్యూ శివారులో ఉన్న సుందర్ ఇస్పాత్ ఐరన్ కంపెనీపై రైతులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయని సమీపంలోని రైతులు అరుంధతి, కార్తీక్రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పొల్యూషన్ కంట్రోల్బోర్డు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణరెడ్డి రెవెన్యూ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ, పీసీబీ, ఇండస్ట్రియల్, వ్యవసాయశాఖతో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి షాద్నగర్ ఆర్డీఓ సరిత, వ్యవసాయ శాఖ నుంచి జిల్లా వ్యవసాయాధికారి సుజాత, పీసీబీ నుంచి సురేష్, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ నుంచి జిల్లా అధికారి సురేష్, ఇండస్ట్రియల్ నుంచి జనరల్ మేనేజర్ కలిసి ఐరన్ కంపెనీతో పాటు సమీపంలోని రైతుల వ్యవసాయ భూములు, వేసిన పంటలను పరిశీలించారు. కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రభావంతో పంటలు, భూములు నాశనం అవుతున్నాయని రైతులు ఆరోపించారు. హైకోర్టు ఆదేశించినా కంపెనీని తరలించడం లేదని వాపోయారు. కమిటీ వెంట తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి, ఆర్ఐ విజయలక్ష్మి, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు. కమిటీ సభ్యులు కలెక్టర్కు నివేదిక అందించనున్నట్టు సమాచారం. -
‘సర్’ సమర్థవంతంగా చేపట్టాలి
అనంతగిరి: సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ విచారణ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలంపల్లి జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విచారణకు వచ్చిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. అనామలీస్, మ్యాపింగ్ కానీ, ఓటర్ జాబితాలో పుట్టిన తేదీల మార్పుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు నోటీసులు జారీ చేయని వారిని గుర్తించి విచారణకు హాజరు అయ్యేలా బీఎల్ఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట ట్రెయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, వీఆర్ఓ స్వర్ణలత, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తదితరులు ఉన్నారు. బాలికలగురుకుల పాఠశాల, పీహెచ్సీ తనిఖీ ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి విద్యార్థులు సూచించారు. మంగళవారం ఆయన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, రామయ్యగూడ పీహెచ్సీలకు ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక హక్కులు, విధులపై పదోతరగతి విద్యార్థులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని భోజనశాల, స్టోర్, కిచన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం రామయ్యగూడ పీహెచ్సీ సందర్శించి ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఆస్పత్రి మరమ్మతు పనులకు అవసమరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్ఓ ప్లాంట్, ఆస్పత్రి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ట్రెయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డాక్టర్ సౌమ్య తదితరులు ఉన్నారు. రైతులకు అవగాహన కల్పించండి సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వికారాబాద్ మండలం నారాయణపూర్లో మొక్క జొన్న, కంది పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు పంటల సాగుపై నూతన సాంకేతికతపై అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డీఏఓ బి.కవిత, మండల వ్యవసాయ అధికారి ప్రసన్న లక్ష్మి తదితరులు ఉన్నారు. ‘టాస్’ ప్రవేశాల లక్ష్యాన్ని అధిగమించాలి టాస్ అడ్మిషన్లకై తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర సమన్వయకర్త ఏనుగు క్రాంతిరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ దీపక్తివారి ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ను కలిసి అడ్మిషన్ల పక్రియపై చర్చించారు. టాస్ అడ్మిషన్లు పెరిగేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీపీఓ జయసుధ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దీపక్ తివారి -
ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం
మొయినాబాద్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకుడు బండి నర్సింహ్ సన్మానించారు. గౌతమ్కుమార్ ఇటీవల ట్రెసా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు అల్తాఫ్ హుస్సేన్, సయ్యద్ అయూబ్ తదితరులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ పథకం కింద రైతుల కోసం బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కిసాన్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి సుజాత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం, నూతన పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడుల సాధన, సుస్థిర వ్యవసాయం, యాంత్రీకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్య, పశుసంవర్థక శాఖలు, ఆయా కంపెనీల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై సమాచారం అందిస్తామన్నారు. రైతులు– శాస్త్రవేత్తల పరస్పర చర్చా కార్యక్రమం ఉంటుందన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సాగుపై అవగాహన అవసరం కేశంపేట: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత అన్నారు. మండల పరిధిలోని కొత్తపేట రైతువేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులు, డీలర్లకు పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆరుతడి పంటల సాగుతో పాటు పశుపోషణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సన్నవడ్లకు బోనస్ లభించాలంటే ధాన్యం కొనుగోలు చేసిన షాపులోనే రైతు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. బోనస్కు సంబంధించి డీలర్లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామశివరావు, ఏఈఓలు వినయ్, తేజ్కుమార్, ప్రశాంత్, రాజేశ్వరి పాల్గొన్నారు. -
మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే సంకల్పం
మర్పల్లి: పొదుపు సంఘాల్లోని మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వ సంకల్పమని ఐకేపీ డీపీఎం కొమరయ్య, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సమాఖ్య అధ్యక్షురాలు అనురాధ అధ్యక్షతన మండల సమాఖ్య 18వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కొమరయ్య, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మండల సమాఖ్య పనితీరు బాగుందని కితాబిచ్చారు. 2026 సంవత్సరంనాటికి 1,036 చిన్న సంఘాల్లో 10,317 మంది సభ్యులను చేర్పించడం అభినందనీయమన్నారు. 12 దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేసి 126 మంది సభ్యులను చేర్పించడం సమాఖ్య పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది మహిళ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని మరో 40 లక్షల మంది మహిళలను సంఘాల్లో చేర్పించి కోటీశ్వరులను చేయాలనేది ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా అర్హులైన ప్రతీ కిషోర బాలికను, వృద్ధులను, దివ్యాంగులను మహిళా పొదుపు సంఘాల్లో చేర్పించేలా ఐకేపీ సీసీలు పనిచేయాలన్నారు. అంతకు ముందు మండల సమాఖ్య ఆదాయ వ్యయాలను, రుణాలను ఏపీఎం సమయ్య చదివి వినిపించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సంరద్భంగా ఆర్అండ్బీ రోడ్డు నుంచి రైతు వేదికవరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు జ్యోతి, మమత సీసీలు పోచయ్య, సంగమ్మ, మల్లేశం, సత్యమ్మ, అక్ష్మయ్యతో పాటు సీనియర్ సహాయకులు నవీన్, కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజు ఆయా గ్రామాల మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఐకేపీ డీపీఎం కొమరయ్య -
హష్ ఆయిల్ విక్రేతకు రిమాండ్
కొత్తూరు: నిషేధిత హష్ హాయిల్ విక్రయించడానికి యత్నిస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ, కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్కు చెందిన హెచ్.ధృవ్ అలియాస్ ధృవ్జోషి (30) ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు. ఒడిశా నుంచి హష్ ఆయిల్ తెచ్చి కొత్తూరు పరిధిలో విక్రయించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మంగళవారం ఇన్ముల్నర్వ శివారులో పీఅండ్జీ పరిశ్రమకు వెళ్లే రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ధృవ్జోషి కనిపించాడు. అతని వద్ద ఉన్న బ్యాగులో సుమారు 11.319 కిలోల హష్ ఆయిల్ను గుర్తించారు. స్టేషన్కు తరలించి విచారించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన రోహిత్ అనే వ్యక్తి నుంచి హష్ ఆయిల్ తీసుకొచ్చి కమీషన్ ప్రాతిపదికన విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు రూ.1.42 కోట్ల విలువైన ఆయిల్ ప్యాకెట్లు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. రూ.1.42 కోట్ల సరుకు స్వాధీనం -
నీరు నిల్.. కష్టాలు ఫుల్
వికారాబాద్: భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రతతో చెరువులు, కుంటలు, బోరుబావులు వట్టిపోతున్నాయి. దీంతో పంటలు ఎండుముఖం పట్టాయి. దిక్కు తోచని రైతులు ఆందోళనతో ఆకాశం వంక చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది నీరు పాతాలానికి చేరింది. గతేడాది ఆగస్టు చివరన జిల్లాలో సగటున 6.57 మీటర్లు ఉండగా ఈ ఏడాది 11.73 మీటర్ల లోతుకు పడిపోయాయి. వర్షాకాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక వేసవి పరిస్థతి ఎలా ఉండబోతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి లభ్యతకు కారణాల అన్వేషణ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో సగటున 25.56 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇది వేసవి సీజన్కు చెందిన మార్చి, ఏప్రిల్ మాసాలతో సమానమవడం ఆందోళన కలిగించే విషయం. కోట్పల్లి మండలంలో అత్యల్పంగా 6.40 మీటర్ల లోతులోనే నీళ్లు ఉన్నాయి. దోమ, మర్పల్లి మండలాల్లోనూ 18–20 మీటర్ల లోతుకు అడుగంటాయి. కోట్పల్లి మండలంలో నీటి లభ్యతకు కారణాలను విశ్లేషించి మిగిలిన మండలాల్లో ఆ దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన లఖ్నాపూర్, కోట్పల్లి, జుంటుపల్లి, శివసాగర్ లాంటి ప్రాజెక్టులు మినహా చిన్న చిన్న చెరువులు, కుంటలు ఇప్పుడే అడుగంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులే కారణం ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుంచి తలెత్తిన వర్షాభావ పరిస్థితుల కారణంగానే భూగర్భజలాలు అడుగంటుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 12 మండలాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో అత్యధిక లోటు వర్షపాతం, ఒక మండలంలో అధిక వర్షపాతం, ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు 533 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం 409 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇంకుడు గుంతలు మచ్చుకై నా కనిపించడం లేదు. జిల్లాలో వేలల్లో ఇంకుడు గుంతలు తవ్వించామని అధికారులు చెబుతున్నా.. వాటి నిర్వహణ గాలికొదిలేశారు. చెక్ డ్యామ్లు, ఫాంఫండ్స్, చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవటంతో అవి నామమాత్రంగా మారాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా అడుగంటి పోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బోరు బావులు తవ్వుతున్నారు. వాతావారణ పరిస్థితులు, నీటి లభ్యత లాంటి విషయాలపై అవగాహన లేకుండా బోర్లు వేయడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. కొందరు రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లు వినియోగించి బోరుబావుల ద్వారా పొలాలకు నీరు పారిస్తున్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక భూగర్భజలాల నీటి మట్టాలు పడిపోతున్నాయి. పంటలు ఎండుముఖం పట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో కరువు ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లాలో ముంచుకొస్తున్న జల సంక్షోభం అడుగంటుతున్న భూగర్భ జలాలు 13 మండలాల్లో లోటు వర్షపాతం ఆందోళనలో ప్రజలు నీటి పొదుపు సామాజిక బాధ్యత భూగర్భ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. ఇందుకు అందరూ సహకరించాలి. ఇంకుడు గుంతలు తవ్వి నిర్వహణ చేపట్టాలి. కుంటలు, చెరువులు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లలో పూడిక తీసి నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వాడడం సామాజిక బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో అనుమతులు లేకుండానే బోరుబావులు తవ్వుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే పరీక్షలు నిర్వహించి రిపోర్టు ఇస్తాం. దీంతో బోరుబావులు తవ్వుకునే వారు నష్టపోకుండా ఉంటారు. – రవి, జిల్లా అధికారి, గ్రౌండ్ వాటర్ -
బుద్వేల్ టు నాచారం
● రేడియల్– 2 రోడ్డు నిర్మాణానికి కార్యాచరణ ● ఔటర్ నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు కనెక్టివిటీ ● మూడు దశల్లో నిర్మాణానికి హెచ్జీసీఎల్ టెండర్లు ● టెక్నికల్ బిడ్లకు దరఖాస్తుల ఆహ్వానంసాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు– 2 నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు వివిధ ప్రాంతాల్లో రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రావిర్యాల నుంచి ఫ్యూచర్సిటీ మీదుగా ట్రిపుల్ ఆర్ సమీపంలోని ఆమనగల్లు వరకు ఒకటో రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బుద్వేల్ నుంచి ఎన్హెచ్–167 (ఎన్) సమీపంలోని నాచారం వరకు 81.15 కి. మీ మేర రెండో రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) తాజాగా నోటిఫికేషన్ వెల్లడించింది. నిర్మాణ సంస్థల నుంచి టెక్నికల్ బిడ్లను ఆహ్వానించింది. ఈ నెల 30 వరకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొంది. మొత్తం 81.15 కి.మీ.. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వెలుపలి పారిశ్రామిక ప్రాంతాలకు ఈ రేడియల్ రోడ్డు కనెక్టివిటీ సదుపాయాన్ని ఇవ్వనుంది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ సమీపంలోని తుర్క ఎంకపల్లి వరకు.. అక్కడి నుంచి ఎన్హెచ్ 67 (ఎన్) వరకు ఈ రోడ్డును పొడిగించనున్నారు. మొత్తం నాలుగు వరుసల్లో నిర్మించనున్న రేడియల్ రోడ్డు– 2ను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు హెచ్జీసీఎల్ అధికారులు తెలిపారు. మొదటి దశలో బుద్వేల్ నుంచి షాబాద్ వరకు 29.50 కి.మీ, రెండో దశలో షాబాద్ నుంచి గూడూర్ వరకు 27, మూడో దశలో గూడూర్ నుంచి నాచారం వరకు 24.65 చొప్పున మొత్తం 81.15 కి.మీ మేర పూర్తి చేయనున్నారు. ఈ రేడియల్ –2 రోడ్డు నిర్మాణానికి రూ.5,060 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను అందజేసింది. ఈ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్పేట్ జిల్లాల్లోని 41 గ్రామాల పరిధిలో 1,486.30 ఎకరాలను సేకరించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 21 గ్రామాల్లో 831.36 ఎకరాలు (44.70 కి.మీ.), వికారాబాద్లోని 18 గ్రామాల్లో 558.18 ఎకరాలు (31.50 కి.మీ.), నారాయణ్పేట్ జిల్లాలోని 2 గ్రామాల్లో 96.16 ఎకరాల (5.05 కి.మీ.) భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 902.16 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. భూసేకరణకు ప్రభుత్వం రూ.3,800 కోట్లు కేటాయించింది. -
పది నెలలైనా పట్టించుకోరా
కుల్కచర్ల: మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పది నెలలుగా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. వివరాలు.. మండల కేంద్రంలోని అజయ్ జ్యువెలర్స్ యజమాని నరేందర్ అనే వ్యక్తి తమను మోసం చేసి నగదు, బంగారు తీసుకుని పరారయ్యాడని.. దాదాపు రూ. 2కోట్ల వరకు నష్టపోయామని 40 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో ఎటువంటి పురోగతి లేదని మంగళవారం బాధితులు సదరు దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పది నెలలు గడుస్తున్నా పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రాజస్థాన్కు వెళ్లి నిందితుడు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని చెప్పిన పోలీసులు దొంగ పారిపోయాడని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పటికై నా పోలీసులు చొరవ తీసుకుని తాము కష్టపడి సంపాదించుకున్న నగదు, బంగారం తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆందోళనలో రఘు, శ్రీను, గోపాల్, హన్మ్యనాయక్, చందర్, తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయమై ఎస్ఐ రమేశ్ను వివరణ కోరగా విచారణ కొనసాగుతోందని గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం బంగారు దుకాణం ఎదుట ఆందోళన -
మహిళతో అసభ్య ప్రవర్తన
యాలాల: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను స్థానికులు దేహశుద్ధి చేసిన పోలీసులకు అప్పగించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణ శివారులోని జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపల్ నరేష్, అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలుడి తల్లితో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం యాలాల మండల పరిధిలోని అగ్గనూరు శివారులో సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో స్థానికులు గమనించి దేహశుద్ధి చేశారు. అనంతరం యాలాల పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పీఎస్కు తరలించారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ నరేష్ను వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం, కేవీపీఎస్ నాయకులు యాలాల పీఎస్ ఎదుట డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ వేధింపులు, అసభ్య ప్రవర్తన విషయంలో పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని తెలిపారు. బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్కుమార్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, నాయకులు షుకూర్, గడ్డం వెంకటేష్, మండల బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణచారి ఉన్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కు దేహశుద్ధి -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
యాచారం: పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వస్తున్న వారు ఆ తర్వాత వాటిని విస్మరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూ సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఈ విషయంలో నాటి కేసీఆర్ సర్కార్కు, నేటి రేవంత్రెడ్డి సర్కార్కు ఏ మాత్రం తేడా లేదన్నారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని ప్రజలు ఓట్లేసి పంపిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగత ధూషణలకు దిగుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పాలక ప్రభుత్వాలు పేదల నుంచి వేలాది ఎకరాలు సేకరిస్తూ వారికి జీవనోపాధి లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.సామేల్, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం
పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ వద్ద చోటు చేసుకున్న ఘటనలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయడం సరికాదన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం హేయనీయమన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్రెడ్డి, శ్రీవణ్రెడ్డి, శషాంక్రెడ్డి, హన్మంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలి
కొడంగల్: స్పీకర్ ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును అరెస్టు చేయాలని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. ప్రజా ప్రతినిధిగా సభా మర్యాదలు కాపాడాల్సిన బాధ్యతను ఎమ్మెల్సీ విస్మరించారని విమర్శించారు. మధుపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, కోస్గి మున్సిపల్ చైర్మన్ నరేందర్, పార్టీ జిల్లా కార్యదర్శి బాల్రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, టౌన్ ప్రెసిడెంట్ నయీమ్, ఏఎంసీ డైరెక్టర్ ఆసిఫ్ఖాన్, కౌన్సిలర్ హమీద్, అశ్వాక్, రాము, బత్తుల నర్సింహ తదితరులు పాల్గొన్నారు. తాతా మధును సస్పెండ్ చేయాలి దౌల్తాబాద్: స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ మండల నాయకులు మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ను అవమానించిన తాతామధును బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ దళితుడు కావడం వల్లే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, రెడ్యానాయక్. నర్సింలు, మధుసూధన్, భీంరెడ్డి, అంబయ్య, రవినాయక్, నరేందర్, అమర్నాథ్, రాములుగౌడ్, షఫీ, తదితరులున్నారు. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణంరాజు -
మహిళలు ఐక్యంగా ఉండాలి
కొడంగల్ రూరల్: మహిళల భధ్రతకు మహిళలే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఐఏఎస్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో జెండర్ రీసోర్స్ సెంటర్ విజిట్లో భాగంగా సెర్ఫ్ జెండర్ డైరెక్టర్ జమున ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనితా రామచంద్రన్ మాట్లాడుతూ.. మహిళల్లో జెండర్ సమస్యలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగకుండా, మహిళలకు అన్యాయం జరుగకుండా మహిళలంతా ఐక్యంగా ఉండాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే సమీపంలోని మహిళా కమిటీలు స్పందిస్తూ మండల రీసోర్స్ సెంటర్కు వివరాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ ఎస్సీఎంయూ లింగమయ్యగౌడ్, డీఆర్డీఏ ఏపీడీ నర్సింలు, డీపీఎం ఐబీ నర్సింలు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, కార్యదర్శి శ్వేత, మండల సమాఖ్య అధ్యక్షురాలు అంజమ్మ, కార్యదర్శి మాసనమ్మ, కోశాధికారి సత్యమ్మ, ఏపీఎం పి.గోపాల్, సీసీలు రాములు, అరవింద్కుమార్, బసంత్కుమార్, వాణిశ్రీ, జి.రాములు, అకౌంటెంట్ పుష్పలత, వివిధ గ్రామాల జెండర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ -
కేంద్రం నిధులతోనే మల్టీపర్పస్ భవనాల నిర్మాణం
బీజేపీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు కుల్కచర్ల: చెంచు ప్రజల అభ్యున్నతికి మల్టీ పర్పస్ భవనాల నిర్మాణం చేపడతున్నట్లు బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. మంగళవారం ఆయన రాంపూర్ పంచాయతీ పరిధిలో నిర్మానంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇస్తున్న నిధులపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అబివృద్ధి పనులు కొనసాగుతున్న విషయాన్ని గ్రామస్తులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తిరుపతయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. తాండూరు రూరల్: అతివేగం కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన మండల పరిధిలోని చంద్రవంచ దర్గా సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఓగిపూర్ శివారు నా పరాతి బండల కోసం గనుల్లోకి వెళ్తున్న ట్రాక్టర్ చంద్రవంచ దర్గా సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. డ్రైవర్ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జేసీబీ సాయంతో ట్రాక్టర్ను పైకి లేపి నాపరాతి గనులకు తరలించారు. పూడూరు: ఆర్టీసీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన చన్గోముల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. నవాబుపేట మండలం అక్నాపూర్కు చెందిన అశోక్ (33) సోమవారం బైక్పై చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో తాండూరు డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో కండ్లపల్లి గేట్ సమీపంలో బైక్ను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అశోక్ను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. భార్య శశికల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగం కారణంగా.. మర్పల్లి: బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్ప పొందతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటన మర్పల్లి ఠాణా పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవూఫ్ తెలిపిన ప్రకారం.. బంట్వారం మండలం మాల సోమారం గ్రామానికి చెందిన అమ్రాది నర్సింలు(45) తన బైక్ ఈ నెల 3న మర్పల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అతివేగంగా వెళ్తున్న ఆయన పెద్దపూర్ గేట్ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుటుంసభ్యులకు చెప్పి చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తమ్ముడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేశంపేట: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొన్న సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం బోధునంపల్లికి చెందిన రిటైర్డు పట్వారీ బండ వెంకట్రెడ్డి మంగళవారం కేశంపేట చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా డ్రైవర్ లారీని అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకట్రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడి కుమారుడు శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పరమేశ్ తెలిపారు. -
పక్కాగా సాగు లెక్క
దౌల్తాబాద్: పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మండల పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియమించింది. సర్వే కోసం కేంద్రం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. ఈ మేరకు వలంటీర్లు యాప్ డౌన్లోడ్ చేసుకుని పంటల వివరాలు అందులో నమోదు చేస్తున్నారు. 25 మంది నియమాకం మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం 25 మంది వలంటీర్లు నియమించారు. వారు తమకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు చేస్తున్నారు. వలంటీర్లు సదరు గ్రామానికి చెందిన వారే కావడంతో సర్వే చురుగ్గా సాగుతోంది. కచ్చితమైన డేటా రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణతో మండలంలో ఏ పంట ఎంతమేర సాగవుతుందో కచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుంది. దీని ఆధారంగా రైతులకు ఎరువులు ఇతర సంక్షేమ పథకాలు, పంట నష్టపరిహారం అందుతాయి. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ రైతుబంధు, ఇతర పథకాలు వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే సర్వేతో నమోదు చేసిన మేరకు రైతులు పండించిన పంట ఉత్పత్తులుకు సరైన గిట్టుబాటు లభించే అవకాశం ఉంటుంది. పంట సర్వే చేస్తున్న వలంటీర్వానాకాలం సీజన్లో భాగంగా రైతులు సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేసేందుకు డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టాం. ప్రస్తుతం వలంటీర్లు గ్రామాల్లో క్రాప్ బుకింగ్ సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేస్తాం. – తులసి, ఏఓ, దౌల్తాబాద్ డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియామకం -
తల్లీకొడుకుల ఆత్మహత్య
తాండూరు రూరల్: కుటుంబ కలహాలతో తల్లీకొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డి కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రవీణ్కుమార్ రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు మండలం కోటబాసుపల్లికి చెందిన కమ్మరి శంకర్, తుల్జమ్మ(46) దంపతులు. వీరికి నరేష్(26) కొడుకు ఉన్నారు. గ్రామంలోని మైసమ్మ దేవాలయం సమీపంలో కమ్మరి వృత్తి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నరేష్కు నాలుగేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం మిర్యాణ్కు చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి పాప భవాని ఉంది. నరేష్ దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో కూతురును తీసుకుని ఏడాది క్రితం మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై మాట్లాడేందుకు నరేష్ తండ్రి శంకర్ పది రోజుల క్రితం మౌనికను గ్రామానికి పిలిపించి, పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అయితే మౌనికను ఎందుకు పిలిచావంటూ నరేష్, అతని తల్లి శంకర్తో గొడవపడ్డారు. పురుగు మందు తాగి శంకర్ కుటుంబానికి ఐనెల్లి గ్రామ శివారులోని ఇంద్రారెడ్డినగర్లో ఉన్న ఓ ఇల్లు కొన్నాళ్లుగా వృథాగా ఉంది. ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయిన తుల్జమ్మ, నరేష్ రెండు రోజుల పాటు ఈ ఇంట్లోనే ఉన్నారు. వారం రోజుల క్రితమే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో మంగళవారం ఓ పశువుల కాపరి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి, కరన్కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తుల్జమ్మ సోదరుడు రమేష్ అక్క, అల్లుడి మృతదేహాలను గుర్తించాడు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తుల్జమ్మ, నరేష్ను వెతికేందుకు శంకర్ తమ బంధువుల గ్రామానికి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణం తాండూరు మండలం ఐనెల్లి శివారులో ఘటన కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు కేసు నమోదు చేసిన కరన్కోట్ పోలీసులు -
ఆశ వర్కర్ల హామీలు నెరవేర్చండి
అనంతగిరి: ఆశ వర్కర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపచేయాలన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి నేటికి అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సమస్యల సాధనకు కృషి చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మంజుల, అనిత, జమున, విజయలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య -
నేటి నుంచి ఎస్జీఎఫ్ పోటీలు
కొడంగల్ రూరల్: 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) క్రీడా పోటీలు బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు కొడంగల్ ఎస్జీఎఫ్ కార్యదర్శి పి.అజీజ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొడంగల్ జోన్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల, బొంరాస్పేట మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు ఉంటాయన్నారు. 9న పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ (బాలుర) పాఠశాలలో వాలీబాల్ పోటీలు, 11న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖో ఖో పోటీలు, హస్నాబాద్ జెడ్పీహెచ్ఎస్లో కబడ్డీ, 19న కొడంగల్ ప్రభుత్వ జూనియర్కళాశాలలో అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. అండర్–14, అండర్–17 బాల, బాలికల విభాగంలో పాల్గొనే క్రీడాకారులు అర్హత ఫామ్, బోనోఫైడ్ సర్టిఫికెట్, ఆధార్కార్డుతో ఉదయం 9గంటలకు హాజరుకావాలని తెలిపారు. కుల్కచర్ల: మండల పరిధిలోని అల్లాపూర్కు చెందిన గణేశ్ నాయక్ ఏబీవీపీ జిల్లా కన్వీనర్గా నియమితులయ్యారు. ఖమ్మం జిల్లాలో మూడురోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర కార్యవర్గసమావేశాల్లో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం గణేశ్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర నాయకత్వం తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, విద్యావ్యవస్థ ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతామన్నారు. తాండూరు టౌన్: తెలంగాణ లీగల్ స్టూడెంట్ అ సోసియేషన్ జిల్లా అధ్య క్షుడిగా ఎ.సచిన్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె.బాలునాయక్ ఆయనకు నియామకప త్రం అందజేశారు. తాండూరు పట్టణానికి చెందిన సచిన్ ప్రస్తుతం హైదరాబాద్లోని మహాత్మా గాంధీ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ తృతీయ సంవత్సరం చదువుతుత్నాడు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లా విద్యార్థుల సమస్యల పరిష్కారం, సంస్థ లక్ష్యాల సాధనకు కృషి చేస్తానన్నారు. కొడంగల్ రూరల్: కొడంగల్–నారాయణపేట–మఖ్తల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అధికారులు సర్వే చేసిన భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. ఈ మేరకు మంగళవారం పర్సాపూర్ రైతువేదికలో సర్పంచ్ కన్నం రాధాశ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, డిప్యూటీ తహసీల్దార్ అనిత, జీపీఓ వెంకటేశ్, సర్వేయర్ మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులు తమ భూమిని ఇచ్చేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సర్వే నిర్వహించిన భూమికి సంబంధించి 87 మంది రైతులు 12.29 ఎకరాలు ఇచ్చేందుకు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారని సర్పంచ్ రాధారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాములు, శ్రీశైలం, మల్లేశం, రాములు, వెంకటేశం పాల్గొన్నారు. -
భద్రతా చర్యలు చేపట్టండి
అనంతగిరి: గణేశ్ ఉత్సవాల సందర్భంగా భద్రతా, బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రతా చర్యలను తప్పకుండా పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాలకు మందస్తు ప్రణాళిలు చేపట్టాలన్నారు. ప్రతీ పీఎస్ పరిధిలోని మండపాలు, నిమజ్జన మార్గాలను, ప్రదేశాలు, ముందుగానే గుర్తించి పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, పార్కింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖల సమన్వయంతో చేట్టాలని ఆదేశించారు. మండపాల పూర్తి వివరాలను సేకరించి నిర్వాహకులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించండి దోమ: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె దోమ ఠాణాను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, కేసుల దర్యాప్తు తీరును పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఎస్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పెట్రోలింగ్ ముమ్మరం చేయలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ వసంత్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్స్ భీంరెడ్డి, నర్సింలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్రీడల్లోనూ రాణించాలి కుల్కచర్ల: విద్యార్థులు దృఢమైన సంకల్పంతో ముందుకు సాగితే అనుకున్న విజయాలను సాధించవచ్చునని ఎస్పీ స్నేహమెహ్ర అన్నారు. మంగళవారం సాల్వీడు గ్రామంలో ఎస్జీఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, పీడీ ఖాజ, పీఈటీలు ప్రవీణ్కుమార్, కేశవులు, కృష్ణారెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం స్వయంప్రకాష్, స్థానిక సర్పంచ్ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ సంధ్యారాణి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, నాయకులు కొండయ్య, బాలయ్య, నర్సింలు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ -
కాల్వల నిర్మాణంలో తీవ్ర జాప్యం
భవనం అడ్డుగా ఉందని ఆగిన పనులుఅసంపూర్తిగా మురుగు కాల్వ నిర్మాణంకొడంగల్: పట్టణ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరవుతున్నా అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అలసత్వంతో పనులు ముందుకు సాగడం లేదు. కొడంగల్లోని మహబూబ్నగర్ – చించోలీ జాతీయ రహదారికి ఇరువైపులా చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణం ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంధీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా పేదల ఇండ్లు కూల్చారు. ఆలయాలు, మసీదులు, దర్గాలకు సంబంధించిన కట్టడాలను తొలగించారు. నిరుపేదలు నివాసం ఉండే గాంధీనగర్లో సైతం కట్టడాలను కూల్చివేశారు. ఎక్కడా కూడా ఆటంకం లేకుండా పనులు చకచక జరిగిపోయాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం అడ్డుగా ఉన్న భవనాలను ఎందుకు తొలగించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులను పెట్టి మా ఇళ్లు, పూరి గుడిసెలను తొలగించిన అధికారులు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాల్వల నిర్మాణానికి అడ్డుగా ఉన్న తమ భవనాలు కూల్చ వద్దని సదరు యజమాని అధికారులతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారులు ఆ భవనాలను వదిలేసి పనులను అర్ధాంతరంగా ఆపినట్లు కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు -
దాతల సహకారం మరువలేనిది
కొడంగల్: పట్టణ శివారులో శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు చేస్తున్న సహకారం మరువలేనిదని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు డాక్టర్ రవీంద్ర యాదవ్, పీ.శ్రీనివాస్గౌడ్, కానుకుర్తి నర్సిరెడ్డి అన్నారు. అయ్యప్ప స్వామి మూలమూర్తి (విగ్రహం) తయారీలో తమవంతు భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ఎంతో మంది భక్తులు బంగారం, వెండి, నగదు తమ వంతు సాయంగా విరాళాలు అందిస్తున్నారు. కొడంగల్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కరెంటు రాములు తన వంతు సాయంగా రూ.1,11,111, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ రూ.50వేలు, క్రాంతి కృష్ణారావు, సరాఫ్ శ్రీనివాసా చారీ, పర్సాపూర్ సర్పంచు రాధ శ్రీనివాస్రెడ్డి, చిట్టెం నర్సింహ్మరెడ్డి, జగదీశ్ కుమార్ ఢాగ, శ్రీనివాస్ యాదవ్, కటుకం పవన్కుమార్, గంట రాజుగౌడ్, ఆవుల శివరాజ్, పూరి మధు, పూరి చంద్రశేఖర్, చిట్టెం పద్మమ్మ, తాండూరుకు చెందిన కళావతి, ముదేలికి చెందిన జయశ్రీ, బషీరాబాద్ చందుచారీ, రుక్మిణి, డాక్టర్ సాహితి సంకేత్ గౌడ్, తారాపురం నాగలింగం, తూం అమృతమ్మ, సురాయిపల్లి కిష్టప్ప, షేక్రఫీ, గాండ్ల శ్రీనివాస్ గౌడ్, బాకారం చంద్రశేఖర్, జయశ్రీ రామకృష్ణ గౌడ్, కృష్ణవేణి రాజగోపాల్ గౌడ్, మేడిశెట్టి రవికుమార్లు తమ వంతు సాయంగా మూలమూర్తిలో కలపడానికి బంగారం, వెండి అందించారు. ఆలయ నిర్మాణం కోసం చక్రవర్తి మధుసూదన్రావ్ రూ.లక్ష, అరిగె అనంత ప్రసాద్ రూ.25వేలు విరాళం ఇచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. పరిగికి చెందిన ముక్కు నర్సిములు ఆలయ ప్రాంగణం, మండపంలో రూ.3,41,000 ఖర్చుతో గ్రానైట్, మార్బల్ స్టోన్స్ వేయించారు. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చిన భక్తులు సహకరించాలని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కోరారు. -
రైతు విశ్రాంతి భవనం నిర్మిస్తాం
● మార్కెట్ యార్డులో బెంచీలు ఏర్పాటు చేస్తాం ● వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అనంతగిరి: రైతు విశ్రాంతి భవనం నిర్మాణానికి పాలకవర్గం తీర్మానించిందని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. ఈమేరకు సోమవారం మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మార్కెట్ కమిటీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ నిర్మించాలని, రైతులు కూర్చునేందుకు మార్కెట్ యార్డులో బెంచీలు ఏర్పాటు చేయాలని పాలకవర్గం నిర్ణయించిందని వివరించారు. పంట ఉత్పత్తులు తీసుకువచ్చిన రైతులకు తూకాల్లో ఆలస్యం జరిగితే సేద తీరేందుకు విశ్రాంతి భవనం నిర్మిస్తామన్నారు. స్పీకర్ ప్రసాద్కుమార్ చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాలకవర్గ సభ్యులు, రైతులతో కలిసి మార్కెట్ యార్డులో ఉచిత సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి, డైరెక్టర్లు విజయేందర్రెడ్డి, ప్రభాకర్, పాండురంగారెడ్డి, రంగారెడ్డి, రమేష్ నాయక్, రాజునాయక్, పాపిరెడ్డి, మిర్యానం సురేష్, నాగిరెడ్డి, భీమయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
క్రిటికల్ కేర్లో ఓపీ ప్రారంభం
కొడంగల్: పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ నూతన భవనంలో సోమవారం నుంచి అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు ప్రారంభమైనట్లు ఆర్ఎంఓ డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని విభాగాల్లో సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే బాధితులకు అత్యవసర సేవలు అందించడానికి అత్యవసర సేవలు అండుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో రూ.5 భోజనాన్ని (ఇందిరమ్మ క్యాంటిన్) ప్రారంభించారు. రోగులకు ఉదయం పూట రూ.5కే టిఫిన్, మధ్యాహ్నం రూ.5కే భోజనం వడ్డించారు. రోగుల వెంట వచ్చే వారికి భోజనం అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ సాకేత్, జూనియర్ అసిస్టెంట్ మోహన్ పాల్గొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్ఎంఓ డాక్టర్ రవీంద్రయాదవ్ -
ప్రజాపాలనను ఓర్వలేకే విమర్శలు
● బీఆర్ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యం ● కాంగ్రెస్ నేతలు రాజేశ్రెడ్డి, నర్సింలుగౌడ్ బొంరాస్పేట: సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న రెండేళ్ల ప్రజాపాలనను, ప్రజాదరణను ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. పదేళ్ల నిరంకుశ పాలనపై తిరగబడ్డ ప్రజలు కాంగ్రెస్ పాలనను తెచ్చుకున్నారని తెలిపారు. కొడంగల్ను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పికొడుతారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, గోవర్ధన్రెడ్డి, జయకృష్ణ, సర్పంచు వీరేశలింగం, సంగాయిపల్లి నర్సింలు, సూర్యప్రకాశ్గౌడ్, బ్యాగరి రాములు, పుట్టి నర్సింలు తదితరులున్నారు. -
హమారా ప్రసాద్పై డీఎస్పీకి ఫిర్యాదు
నవాబుపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కించపర్చేలా ‘అంబేడ్కర్ కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాసి, సోషల్ మీడియా వేదికలపై అంబేడ్కర్ను అవమానించేలా వ్యవహరిస్తున్న హమారా ప్రసాద్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ డీఎస్పీ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఆనందం, దళితరత్న అవార్డు గ్రహీత శివరాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ వెంకటరెడ్డి, నాయకులు వెంకటయ్య, ప్రభాకర్రెడ్డి, ప్రసాద్, దళిత సంఘాల నాయకులు చంద్రశేఖర్, శామయ్య, చంద్రం తదితరులు పాల్గొన్నారు. దేశద్రోహం కేసు నమోదు చేయాలని వినతి -
తాతా మధును తప్పించాలి
● స్పీకర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణం ● కాంగ్రెస్ నేతల ఆందోళన ధారూరు: శాసనసభ స్పీకర్, దళిత ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్పై సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ధారూరులో ధర్నా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, డీసీసీ కార్యదర్శి బాబాఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ హన్మంత్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాములు అధ్వర్యంలో తాండూరు– హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై నిరసన వ్యక్తంచేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ రఘరామ్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ధారూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతిగారి మలేశం, నాయకులు కల్వ కిరణ్కుమార్, బుజ్జయ్యగౌడ్, అమరేశ్వర్రావు, లింగనపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేరెళ్లిలో మధుసూదన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు చెన్నారెడ్డి, దయాకర్రెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. అనర్హుడిగా ప్రకటించాలి ధారూరు: దళిత నేత, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వాక్యలు చేసిన ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్పై కేసు నమోదు చేసి, ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ధారూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాన్సింగ్ డిమాండ్ చేశారు. ఆయనను పదవి నుంచి శాశ్వతంగా తొలగిస్తేనే ఇతర ప్రజా ప్రతినిధులను కనువిప్పు కలుగుతుందన్నారు. దిష్టిబొమ్మ దహనం మోమిన్పేట: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై తాత మధు చేసిన వ్యాఖ్యలను దారుణమని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. ఈ మేరకు మోమిన్పేటలో మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సిరాజొద్దీన్, మహంత్స్వామి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వికారాబాద్ పీఎస్లో ఫిర్యాదు అనంతగిరి: స్పీకర్ ప్రసాద్కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే తొలగించాలని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరాస్తాలో తాతా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేశం పెండ్యాల అనంతయ్య, మధుకర్, మల్లికార్జున్గౌడ్, పరుశరాం, సతీష్రెడ్డి, నిఖిల్రెడ్డి, శివయ్య, శ్రీనివాస్, బాదం అశోక్, సర్ఫరాజ్, నాగరాజు, షరీఫ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దిష్టిబొమ్మ ఊరేగింపుమర్పల్లి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ ఆధ్వర్యంలో మర్పల్లిలో ఆందోళన నిర్వహించారు. తాతా మధు దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రవిందర్, సురేష్, నాగేశ్, అబ్రహం, రవి, పంచలింగాల సురేష్, సర్వేశ్, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. డీఎస్పీకి ఫిర్యాదునవాబుపేట: స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై వెంటనే కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ డీఎస్పీ అంజయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీధర్, ప్రసాద్, దశరథ్, లక్ష్మణ్, సర్పంచులు నర్సింహారెడ్డి, నర్సింలు తదితరులు ఉన్నారు. బంట్వారంలో..బంట్వారం: తాత మధు వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ మండల నాయకులు సోమవారం బంట్వారంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమయపాలన ఏదీ?
బంట్వారం: ప్రజావాణికి సైతం అధికారులు సమయ పాలన పాటించడం లేదని బీఆర్ఎస్ కోట్పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కోరుతూ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం ఉదయం 10.30 గంటలకు కోట్పల్లి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆఫీసుకు తాళం వేసి కనిపించింది. దీంతో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమయ పాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావాణిలో కాంగ్రెస్ ఎన్నికల హమీలు ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు మాజీ సర్పంచ్లు వెంకటేశ్యాదవ్, రాంచందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఆలస్యమైంది ఈ విషయమై ఎంపీఓ సురేందర్రెడ్డిని సంప్రదించగా కొద్దిగా అలస్యమైందన్నారు. అటెండర్ దగ్గర తాళాలు ఉండడంతో 10.45 గంటలకు ఆఫీసు తెరిచామన్నారు. యథావిధిగా ప్రజావాణి జరిగిందని, రెండు ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. ఉదయం పదిన్నర దాటినా తెరుచుకోని ఎంపీడీఓ కార్యాలయం ప్రజావాణికి వెళ్లిన బీఆర్ఎస్ నేతల అవాక్కు ఆఫీసు ముందే కూర్చుని ఆందోళన -
అనామలిస్ ఓటర్లకు నోటీసులు
అదనపు కలెక్టర్ వెంకటాచారి అనంతగిరి: సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వెంకటాచారి ఆదేశించారు. సోమవారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఫిర్యాదులు, అభ్యంతరాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,67,872 అనామలిస్ ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 1,47,738 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మరో 1,20,134 మందికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కొడంగల్: పట్టణంలోని మున్సిప్ కోర్టు ఆవరణలో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ ఉంటుందని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. వివాదాల పరిష్కారానికి ఇది చక్కటి వేదిక అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్ అనంతగిరి: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్ అన్నారు. సోమవారం నగరంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాండూరు టౌన్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ పోలీసు స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై ఆయన మాట్లాడిన తీరు సమంజసం కాదన్నారు. అసభ్య పదజాలం ఉపయోగించి స్పీకర్ మనోభావాలను దెబ్బతీసిన తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, ఉర్దూ ఘర్ చైర్మన్ జలాల్, నాయకులు వెంకటేష్, బాలరాజు, సుదర్శన్ గౌడ్, ఎబినైజర్, పార్టీ నాయకులు తదితరులు డిమాండ్ చేశారు. బొంరాస్పేట: పాడి పశువులతో ఉపాధి పొందవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చౌదర్పల్లిలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. రంగారెడ్డి ఈఓ డీఎల్డీఏ డాక్టర్ అరుణశ్రీ పశువులకు చికిత్స చేశారు. నట్టల నివారణ మందు తాపాదరు. కార్యక్రమంలో సర్పంచ్ కల్పనారెడ్డి, ఉపసర్పంచ్ వెంకటయ్య, గోపాల మిత్ర సూపర్వైజర్ కేశవులు, గోపాలమిత్రలు బాలరాజుగౌడ్, మహేశ్, విశ్వనాథం, స్వయం ప్రకాశ్, అశోక్, వెంకటప్ప, రఘురామకృష్ణ, శివకుమార్, ఆశప్ప, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి బాధ్యతలతో యువత శక్తివంతం
శంకర్పల్లి: విభిన్న రంగాలకు చెందిన విద్యార్థులు సమష్టి బాధ్యతలు చేపట్టడం ద్వారా యువత శక్తివంతంగా తయారవుతారని ఇక్ఫాయ్ గ్రూప్స్ చైర్పర్సన్ శోభారాణి యశస్వీ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అపరాజిత అండర్ గ్రాడ్యుయేట్ క్లబ్’ని ఆమె రిజిస్ట్రార్ విజయలక్ష్మితో కలిసి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఇది ఒక అధికారిక విద్యార్థి క్లబ్ అని, భిన్న రంగాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒకేచోట తమ అభిప్రాయాలు, ఆసక్తులు, అభిరుచులు తెలుసుకొని, సమష్టిగా పని చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొ.మహేంద్ర హెచ్.సోనావానే, కో–ఆర్డినేటర్లు డా.చెంజి, ప్రొ.వి.పద్మావతి, డా.టి.నేహా తదితరులు పాల్గొన్నారు. ఇక్ఫాయ్ గ్రూప్స్ చైర్పర్సన్ శోభారాణి -
పెడచెవిన ప్రజావాణి
కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మంగలి ఆంజనేయులు. వికారాబాద్ మండలం గొట్టిముక్లకు చెందిన ఇతను 1990లో గ్రామ సర్వే నంబర్ 53లో 2.8ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. 2006లో ఈ భూమి వేరేవారి పేరున రిజిస్ట్రేషన్ అయ్యింది. తహసీల్దార్, కలెక్టరేట్ వెళ్లినా పరిష్కారం కాలేదు. చేసేది లేక కోర్టును ఆశ్రయించాడు. ఏడాది క్రితం ఆ భూమి ఆంజనేయులకే చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదు. ● ధారూరు మండలం కేరెళ్లి గ్రామానికి చెందిన కావలి నర్సింహులుకు ఐదెకరాల పొలం ఉంది. అటవీ భూమికి సమీపంలో ఉండటంతో నిషేధిత జాబితాలో వేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం బాధిత రైతు ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.. కానీ ఫలితం లేక అవస్థలు పడుతున్నాడు.. ఇవి మచ్చుకు కొన్నే.. పెద్ద సంఖ్యలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతునే ఉన్నారు. వికారాబాద్: ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బాధితులు ప్రతి సోమవారం కార్యాలయాల గడపు తొక్కుతున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కలెక్టరేట్లో శాఖల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేయడం, మండల, నియోజకవర్గ స్థాయి సమస్యలను అక్కడి అధికారులకు రెఫర్ చేస్తున్నారు. కానీ చాలా సమస్యలు పెండింగ్లోనే ఉంటున్నాయి. బాధితుల వాణి వినడమే తప్ప వారి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వందకు పైగా అర్జీలు వస్తున్నా పది కూడా పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ సమస్యలే అధికం గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏళ్ల తరబడి బాధితులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ధరణిపై ఆనేక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం కూడా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపలేకపోతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రజావాణికి పాత సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. పైసలిస్తేనే క్లియర్ భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో డబ్బుల కోసం ప్రజల దరఖాస్తులను కావాలనే రిజక్ట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పైసలు అందిన వెంటనే ఫైళ్లలో కదలిక మొదలవుతున్నట్లు సమాచారం. లేకుంటే సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంచుతున్నట్లు తెలిసింది. సాధారణంగా భూ సమస్యల పరిష్కారం కోసం బాధితులు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరిస్తారు. అయితే డబ్బులిస్తే నివేదిక ఇస్తున్నట్లు తెలిసింది. లేకుంటే రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.కలెక్టరేట్కు ప్రతి సోమవారం వందకు పైగా అర్జీలు పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు మళ్లీ మళ్లీ వస్తున్న బాధితులు ఏళ్ల తరబడి పెండింగ్లోనే.. అధిక శాతం రెవెన్యూ సమస్యలే.. భూ భారతి చట్టం వచ్చినా ఫలితం శూన్యం -
దామగుండంలో ప్రత్యేక పూజలు
పూడూరు: శ్రావణమాసం చివరి సోమవారం సందర్బంగా మండల పరిధిలోని దామగుండ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మండల పరిధిలోని భక్తులేకాకుండా ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్రెడ్డిలు స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రహీస్ఖాన్, నాయకులు రాజేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మైపాల్రెడ్డి, హరీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతరకు పోటెత్తిన భక్తజనం
భక్తులతో కిక్కిరిసిన సప్తకొలనులుబషీరాబాద్: జిల్లా సరిహద్దులోని నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో కొలువుదీరిన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి జాతర సోమవారం భక్తజన సంద్రంగా మారింది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి సప్తకొలనుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు యాకూబ్సాబ్ దర్గాను సందర్శించారు. పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూలతో సుందరంగా అలంకరించిన స్వామివారి రథాన్ని భక్తులు ఆలయ పరిసరాల్లో ఘనంగా ఊరేగించారు. జాతరలో మిఠాయిలు, గాజులు, ఆటబొమ్మల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నీళ్లనల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్ గ్రామాల సర్పంచులు వేణుగోపాల్రెడ్డి, జయవీర్లాల్, నామ్యానాయక్, నీళ్లపల్లి గ్రామ నాయకులు సుధాకర్రెడ్డి, రుక్మారెడ్డి, గోపాల్రెడ్డి, మధుసూధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవుడి వద్ద రాజకీయాలా? ఏకాంబరి రామలింగేశ్వర ఆలయం పేరున యువత ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవ చేస్తుంటే రాజకీయాలు చేస్తారా అని ట్రస్ట్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆలయం వద్ద ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడారు. ఏడేళ్ల నుంచి రూ.10 లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆలయ చైర్మన్ రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్కుమార్, సభ్యులు వెంకట్నాయక్, గురుప్రసాద్, పీకే శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఏకాంబరి రామలింగేశ్వరుడి దర్శనానికి భక్తుల బారులు సప్తకొలనుల్లో పుణ్యస్నానాలు యాకూబ్సాబ్ దర్గాలో పూజలు కనుల పండువగా రథోత్సవం -
అసెంబ్లీ ముట్టడిలో బీజేవైఎం నాయకుడికి గాయం
మొయినాబాద్ రూరల్: పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో బీజేవైఎం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీకాంత్ గాయపడ్డారు. సోమవారం అసెంబ్లీ వద్దకు చేరుకున్న పలువురు కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో జరిగిన శ్రీకాంత్ చేతికి బలమైన గాయమైంది. ఈ స్పందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నగరానికి తరలివెళ్లిన వారిలో యువజన, విద్యార్థి విభాగాల నేతలు మహేష్, ఎల్లేష్గౌడ్, రామకృష్ణ, జగన్మోహన్, సురేందర్రెడ్డి, సాయి, వికాస్, చరణ్గౌడ్, ఓంప్రకాష్, వంశీ తదితరులు ఉన్నారు. -
‘ఎస్ఐఆర్’ను పూర్తి చేయండి
అనంతగిరి: సర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఓటరు పూర్తి వివరాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కడా జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. మ్యాపింగ్ కాని, అనామలిస్ ఓటర్లకు నోటీసులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అనంతరం 22ఏ భూముల వివరాలు, పెండింగ్ దరఖాస్తులు తదితర వాటిపై ఆరా తీశారు. భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిశీలించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, సీపీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ జయసుధ, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నోటీసుల ప్రక్రియను వేగవంతం చేయాలి కలెక్టర్ దీపక్ తివారి -
ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి?
మోమిన్పేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయో చెప్పాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను వ్యతిరేకిస్తూ సోమవారం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ మీదుగా వెళ్లి తహసీల్దార్ మునిరొద్దీన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి 420 హామీలు, ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్కు పంగనామం పెట్టారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ గట్టు రాంచందర్రావు, జెడ్పీ వైస్ చైర్మన్ బీ విజయ్కుమార్, పార్టీ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకట్, సర్పంచులు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, నాయకులు తిరుపతిరెడ్డి, అనూప్రెడ్డి, మశ్చేందర్రెడ్డి, మైబల్లి, కలేద్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ -
విద్యతోనే గౌరవం
కొడంగల్: నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల మండలాలకు చెందిన 8మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సోమ వారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులకు మంచి విద్యను బోఽధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి ఏడాది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయులు నర్సిములు, అమూల్య, మోహన్, కేశవులు, శ్రీనివా సులు, ఉమా మహేష్, అశోక్, సత్యవతి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ సాకేత్, కోశాధికారి మురహరి వశిష్ట, సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సన్నరకం వరి నమోదు తప్పనిసరి
బొంరాస్పేట: ఖరీఫ్– 2026లో సన్నరకం వరి పంటలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఏఈఓలు సూచించారు. మండల పరిధిలోని బాపల్లి, నాందార్సూర్, బొట్లోనితండా, తుంకిమెట్ల గ్రామాల్లో సోమవారం సన్నరకం వరి వేసిన రైతుల బోనస్ కోసం సంబంధిత డీలర్ లేదా ఏఈఓల వద్ద నమోదుపై అవగాహన కల్పించారు. ఈనెల 10 వరకు సన్నరకం వరి పంటను నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఏడు రకాల ధాన్యాలకు బోనస్ కల్పిస్తోందన్నారు. పట్టాదారు పాసుబుక్కు, ఆధార్కార్డు తీసుకెళ్లి నమోదు చేయించుకోవాలని తెలిపారు. హామీల అమలులో విఫలం బీఆర్ఎస్ నాయకులు కొడంగల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో డీటీ అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల గడిచినా హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 ఎక్కడని ప్రశ్నించారు. వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు పింఛన్ల మొత్తం పెంచలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎరన్పల్లి శ్రీనివాస్, మున్నూరు బిచ్చప్ప, శ్రీనివాస్రెడ్డి, మాఫీ వెంకటయ్య, ఏర్పుల మోహన్, జగన్, బాల్రాజు, హన్మంతు, రాజశేఖర్, రఫీ తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వం.. శివపార్వతుల కల్యాణం అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త సాత ఆత్మలింగం కుటుంబీకులు కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం ప్రత్యేక హారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రజావాణికి 92 ఫిర్యాదులు మర్పల్లి: మండల పరిసత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదుదారులు పోటెత్తారు. మొత్తం 92 మంది అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శాంతతో పాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
వెయ్యి రోజులైనా అమలు కాని హామీలు
● బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీశైల్ రెడ్డి ● ఆర్డీఓకు వినతిపత్రం అందజేత తాండూరు టౌన్: అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వంద రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలు, 420 హామీలు తక్షణమే అమలయ్యేలా చూడాలంటూ ఆర్డీఓ అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు, గ్యారంటీల పేరుతో కల్లబొలి మాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా హామీలు, గ్యారంటీలు అమల్లోకి రాలే దన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా కాంగ్రెస్ను ఓడిస్తారన్నారు. ఇప్పటికే గ్రామగ్రామాన ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడిన సంక్షేమ పథకాలపై బాకీకార్డులతో ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల్లో గ్రామాల్లోకి వెళితే ప్రజలే వారిని నిలదీస్తారన్నారు. బాధిత కుటుంబానికి ‘సీపీఎస్’ చేయూత పరిగి: కొడంగల్ జూనియర్ కాలేజీలో పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన రంగంపల్లి లెక్చరర్ చంద్రశేఖర్ కుటుంబానికి తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయూస్ యూనియన్ అండగా నిలిచింది. సంఘం నాయకులు సోమవారం బాధిత కుటుంబానికి రూ.71,200 అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విజయ్ భాస్కర్రెడ్డి, నర్సింహరాజ్, యాదగిరి, శ్రీనివాస్రెడ్డి, నరేందర్, శ్రీనివాసులు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు
అనంతగిరి: ప్రజల సహకారంతో గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేస్తామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. సోమవారం నగరం నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, బందోబస్తు తదితర వాటిపై సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్ర, ఏఎస్పీ రాజేష్ మీనాతో కలిసి మాట్లాడారు. ఉత్సవాలు, నిమజ్జనం వేడుక ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండపాలను క్రమం తప్పకుండా సందర్శించి భద్రతను పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. నిమజ్జన రూట్లను ముందుగానే చెక్ చేసి ట్రాఫిక్ నియంత్రణ, బారికేట్ల ఏర్పాట్లు, పార్కింగ్ తదితర వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ స్నేహ మెహ్ర -
అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి..
● బైక్పై వెళ్తుండగా ప్రమాదం ● అక్కడికక్కడే ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు మొయినాబాద్: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన కృష్ణ (50), అదే గ్రామానికి చెందిన నర్సింహ సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వైపు బైక్పై వెళ్తున్నారు. అజీజ్నగర్ రెవెన్యూలో ఉన్న రాణే ఇంజన్వాల్స్ కంపెనీ వద్దకు రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయాలైన నర్సింహను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా కల్యాణోత్సవం, పల్లకీసేవ
ధారూరు: మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో పూజారులు చెన్న బసవయ్యస్వామి, కుమార స్వామి ఉదయం 8 గంటల నుంచి కపిలేశ్వరస్వామికి రుద్రాభిషేకం చేశారు. గణనాథుడు, కుమారస్వామి, నందీశ్వరుడు, వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీమాత శాకాంబరీదేవిగా దర్శనమిచ్చారు. పార్వతిమాత, కపిలేశ్వరస్వామి కల్యాణం నిర్వహించి కళ్యాణ వివరణను బీరంగుడకు చెందిన గౌతంస్వామి, సంగారెడ్డి అర్చక సంఘం అధ్యక్షుడు సంతోష్కుమార్ భక్తులకు అందించారు. సాయంత్రం వీరభద్రేశ్వరుడి పల్లకీ సేవ నిర్వహించారు. -
టిప్పర్ను ఢీకొట్టిన కారు
● దంపతుల దుర్మరణం ● ఒకరి పరిస్థితి విషమం పరిగి: ముందు వెళ్తున్న సిమెంట్ టిప్పర్ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామం చింతల్చెరువు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. పూడూరు మండలంలోని గంగోనిపల్లి గ్రామానికి చెందిన మున్నూరు నర్సింలు, భార్య అంజమ్మ, తమ్ముడి కుమారుడు అభిరామ్ పనినిమిత్తం నారాయణపేట జిల్లా కోస్గికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలోని చింతల్ చెరువు ప్రాంతానికి రాగానే కారు ముందు వెళ్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగడంతో నర్సింలు అక్కడికి అక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులు అంజమ్మ. అభిరామ్ను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న అంజమ్మ మృతి చెందగా.. అభిరామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాస్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
డబ్బా ధ్వంసంతో దుమారం
● రూ.1.50 లక్షల పెట్టుబడి బూడిద ● పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు బషీరాబాద్: మండల పరిధిలోని మైల్వార్లో రేకుల డబ్బా ధ్వసం ఘటన వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన యువకుడు కందనెల్లి నగేశ్ స్వయం ఉపాధి కోసం రూ.1.50లక్షలు వెచ్చించి బస్టాండ్ సమీపంలో జిరాక్స్, స్టేషనరీ షాపు ఏర్పాటు చేశాడు. గత నెలలో షాపు ఏర్పాటుకు సర్పంచ్కు రాతపూర్వకంగా దరఖాస్తు చేశానని, పంచాయతీ కార్యదర్శి మౌఖిక సూచనల మేరకే డబ్బా ఏర్పాటు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలో సర్పంచ్ సీమా సుల్తానా అనుచరులు ప్రారంభానికి ముందే డబ్బాను ధ్వంసం చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా డబ్బా ఏర్పాటు చేసి తమపై దాడికి యత్నించాడని సర్పంచ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్ఐ విఠల్ గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వాంగ్మూలాలు నమోదు చేసి ఘటనా స్థలిని పరిశీలించారు. దర్యా ప్తు అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆటోవాలాలను ఆదుకోవాలి
తాండూరు: ఎన్నికల సమయంలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డు నిరసన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఆటోవాలాలను ఆదుకోవాలని ఆటో ర్యాలీ నిర్వహించారు. స్వయంగా ఆటో నడుపుతూ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరాచౌక్ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతో పాటు ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల జీవిత బీమా, ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఆటోవాలలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై వినూత్న నిరసన తెలిపారు. కౌన్సిలర్లు, మహిళలతో కలిసి బస్వణ్ణకట్ట ప్రాంతంలో రోడ్లను శుభ్రం చేశారు. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అంతకు ముందు తాండూరు పట్టణంలోని విలియంమూన్ మైదానంలో మార్నింగ్ వాక్ చేసి వాకర్లతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపనర్సింహులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మహేశ్వరి, నవినాగౌడ్, సురేశ్, ఇర్షద్, జావీద్, మా జీ కౌన్సిలర్లు శోభారాణి, పరిమళ, అనురాధ నాయకులు శ్రీనివాసచారి, నర్సింలు తదితరులున్నారు. కాంగ్రెస్ను గద్దె దించేవరకు ఉద్యమిద్దాం బషీరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలను గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం బషీరాబాద్లో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ అనంతరం వివేకానంద చౌరస్తాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, హామీల అమలు కోసం ప్రభుత్వాన్ని ప్రజలే గల్లాపట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు. అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తాండూరులోని మెడికల్ కాలేజీ, ఆర్డీఓ కార్యాలయం కొడంగల్కు సీఎం రేవంత్రెడ్డి తన్నుకు పోతున్నాడని, ఇక్కడి ప్రజల దాహార్తి తీర్చే కాగ్నా నది నుంచి తాగునీటిని కొడంగల్కు తరలిస్తున్నా ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మళ్లీ బీఆర్ఎస్దే అధికారం యాలాల: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, సంక్షేమ పథకాల అమలుగురించి ప్రశ్నిస్తే బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమరభేరి’కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అలవి కానీ హామీలిచ్చి ప్రజలు మోసం చేసిందన్నారు. తాండూరులో స్థానికేతరుడైన ఎమ్మెల్యే మనోహర్రెడ్డితో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాగ్నా నది నుంచి కొడంగల్కు తాగునీటి తరలించే ప్రక్రియలో మొదట తాండూరుకు సాగు, తాగునీరు ఇచ్చాకే తరలించేలా ఉద్యమిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారం రాబోతుందని, అప్పుడు ఒక్కొక్కరిని విడిచిపెట్టేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వడ్డే రాములు, బీఆర్ఎస్ మండల గౌరవ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యుడు శివకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీలు అనంతయ్య, రమేశ్, మాజీ సర్పంచ్లు రవికుమార్గౌడ్, బోయిని సాయిలు, మాజీ డైరెక్టర్ ముస్తఫా, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, శరణుభూపాల్, శ్రీనివాస్గౌడ్, మహేశ్వర్రెడ్డి, కిరణ్కుమార్, మెట్లి కృష్ణ, లాలప్ప, రాంచంద్రాడ్డి తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి -
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
● తాండూరు ఠాణా ఎదుట ఉద్రిక్తత ● ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు తాండూరు: పట్టణంలోని ఇందిరాచౌక్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్, బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆసీఫ్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అనంతరం తోపులాటకు దారి తీసినట్లు సమాచారం. రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న ఇరువర్గాల నాయకులు కార్యకర్తలు నిమిషాల వ్యవఽధిలోనే పెద్ద సంఖ్యలో పట్టణ ఠాణా వద్దకు చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తాండూరు డీఎస్పీ నర్సింగ్యాదయ్య ఠాణాకు చేరుకుని పోలీసులతో కలిసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆసీఫ్ పోలీస్స్టేషన్లోకి వెళ్లగా, పట్టణ అధ్యక్షుడు నాగరాజ్ను కారులో ఎక్కించి పంపించారు. డీఎస్పీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఠాణా ఎదుటే ఘర్షణకు దిగేందుకు యత్నించిన నాయకులపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై మాజీ కౌన్సిలర్ ఆసీఫ్ నాగరాజ్పై ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇందిరాచౌక్కు రావాలని సవాళ్లు తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్, బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆసీఫ్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలకు చేసుకుంటున్నారు. ఇందిరాచౌక్కు రావాలంటూ ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. ఆదివారం పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ హైదరాబాద్లో జరిగిన ధర్నాకు వెళ్లారు. మాజీ కౌన్సిలర్ ఆసీఫ్ ఇందిరాచౌక్కు రావాలంటూ ఫోన్లు చేశాడు. రాత్రి 8 గంటలకు వస్తానంటూ చెప్పిన నాగరాజ్ 9 గంటల సమయంలో ఇందిరాచౌక్కు వచ్చారు. అప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఉండటంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. -
ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం
దోమ: ఆరు గ్యారంటీలు, 420 దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని దిర్సంపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ గౌడ్ అధ్వర్యంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో పల్లెల విధ్వంసం, పడకేసిన పారిశుద్ధ్యంపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమం, అభివృద్ధిలో పూర్తి విఫలమైందని ఆరోపించారు. కేవలం సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని, పరిగిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రుల పర్యటన, పత్రిక సమావేశాలకు మాత్రమే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ 24 గంటలు ఇచ్చేదని, నేడు కోతలు విధిస్తుందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ అందక ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. రైతులకు అండగా ఉంటాం మండలంలోని అనంతరెడ్డిపల్లి, కొండాయపల్లి, బట్ల చందారం రైతులకు బీఆర్ఎస్ పార్టీతో పాటు తాము అండగా ఉంటామన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ల పేరుతో దాదాపు 900 ఎకరాలు ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని, రేడియల్ రోడ్డు పేరుతో నియోజకవర్గంలోని 18 గ్రామాల నుంచి భూములు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. తమతో పాటు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయిస్తున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పులు నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ రాజాగోపాలచారి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు నవాజ్రెడ్డి, రాములు, బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు హన్మంతునాయక్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాజపాష, మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మశ్చేందర్రెడ్డి, మండల అధికార ప్రతినిఽధి శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రావణ్రెడ్డి, సంతోష్, హైమద్పటేల్, హన్మంతు, గ్రామ ఉపసర్పంచ్ తిరుపతయ్య, వార్డు సభ్యులు, పరిగి మాజీ ఎంపీపీ అరవీందర్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్.ఆంజనేయులు, మాజీ కోఆప్షన్ సభ్యులు మీర్మహాముద్అలీ, కౌన్సిలర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి -
సీఎంకు ఓటమి భయం
● మహబూబ్నగర్లో రేవంత్కు ఎనిమిదో స్థానం ● మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట: సీఎం రేవంత్రెడ్డికి ఇప్పటికే ఓటమి భయం చుట్టుకుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ దుద్యాల, బొంరాస్పేట మండలాల నాయకులతో కలిసి పాత పోలీసు స్టేషన్ నుంచి భూలక్ష్మి చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యేల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, తనకు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం చుట్టుకుందని విమర్శించారు. సీఎం వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై నిర్భందాలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే ప్రజలు మిమ్మల్ని రానివ్వకుండా తిరగబడే రోజులొస్తాయని హెచ్చరించారు. రేవంత్రెడ్డికి తమ అధినేత కేసీఆర్ను ప్రశ్నించే అర్హత లేదన్నారు. వందకోట్లు సీఎం ఫ్యామిలీకే ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. కొడంగల్ ప్రాంతంలో తన హయాంలోనే అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ప్రస్తుతం ఇళ్లు, పెన్షన్లు, ఫైరవీలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు. నేడు ప్రజావాణిలో.. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు సోమవారం ప్రజావాణిలో తమ వినతులు, ఫిర్యాదులు స్వేచ్ఛగా అందజేయాలనే కార్యక్రమం చేపట్టామన్నారు. అందుకు అవసరమైన వినతిపత్రాలను తయారు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల వద్ద ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్రెడ్డి, యాదగిరి, శేరి నారాయణరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, చాంద్పాషా, లగచర్ల సురేశ్, మధుయాదవ్, శ్రీనివాస్, మహేందర్, రమణారెడ్డి, శ్రీనివాస్గౌడ్, తిరుపతయ్య, వెంకటయ్య, సలామ్, బుగ్గప్ప, తదితరులున్నారు. గిరిజనులకు అండగా ఉంటా నియోజవకగర్గంలోని గిరిజనులకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఇటీవల ఫారెస్టు అధికారులు మండలంలోని ఏనెమీదితండా పంచాయతీ ఊరెనికితండాలో కూల్చిన ఇంటిని ఆదివారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సందర్శించి బాధిత రవినాయక్, తండావాసులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ని కలిసి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల తాండూరు పట్టణంలో ఇంటిదొంగతనం సంఘటనలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వడిచర్లకు చెందిన మాజీ సర్పంచ్ పట్లోళ్ల ఉమాదేవి నరేందర్రెడ్డి, నాయకులు పరామర్శించారు. కోట్ల యాదగిరి, మహేందర్రెడ్డి, రాజుగౌడ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మల్రెడ్డి, రవిచారి, రవిగౌడ్, తూక్యారామ్, బాబ్యానాయక్లున్నారు -
సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు వినతి
తాండూరు: పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని తాండూరు బార్ అసోషియేషన్ ప్రతినిధులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ఎమ్మెల్యే బీఎమ్మార్తో కలిసి వెళ్లి, కొడంగల్ పర్యటనకు వచ్చిన సీఎంను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కురువ శ్రీనివాస్, న్యాయవాదులు మహేందర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మస్తాన్ తదితరులు ఉన్నారు. మహాధర్నాకు తరలిన బీజేపీ నేతలు తాండూరు: రైతుల భూములను 22– ఏ నిషేధిత జాబితా పేరుతో అక్రమంగా నమోదు చేస్తున్నారంటూ బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నా దీక్ష కార్యక్రమానికి శనివారం ఆ పార్టీ నాయకులు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్ ఆధ్వర్యంలో తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజవకర్గాల నుంచి నగరానికి తరలివెళ్లారు. వీరిలో నాయకులు మాధవరెడ్డి, బాలేశ్వర్గుప్తా, శివరాజ్, మారుతి, కిరణ్, రాజ్, కృష్ణముదిరాజ్, రాముయాదవ్, కేశవులు, భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు అందజేయండి తాండూరు రూరల్: సర్ నోటీసులు వచ్చిన ఓటర్లు సరైన ధ్రువపత్రాలు అందజేయాలని ఆర్ఐ రాఘవేందర్రావు అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో నో మ్యాపింగ్కు సంబంధించి నోటీసులపై విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధింత బీఎల్ఓలకు సంప్రదించాలని సూచించారు. నో మ్యాపింగ్, అనామలిస్కు నోటీసులు పొందిన ఓటర్లు సంబంధింత ఈఆర్ఓలకు ఆధారాలు చూపిస్తే తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కల్పన, బీఎల్ఓలు పాల్గొన్నారు. తాండూరులో దొంగల హల్చల్ వరుస చోరీలతో ప్రజల్లో ఆందోళన తాండూరు: పట్టణంలోని సాయిజానకి నగర్లో మరో ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ పరమేశ్వర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన ఆంజనేయులుగౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వేరే గ్రామానికి వెళ్లారు. శనివారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోకి చొరబడిన దొంగలు రెండు తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి సాయిజానకినగర్లో ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్రవాహనాలను దొంగలు అపహరించిన విషయం తెలిసిందే. అలాగే శ్రీ రామ్నగర్లోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి 10 తులాల బంగారం.. 2 కిలోల వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఒకే రోజు పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరు స చోరీలు జరగడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరమైంది. శ్రీరాంనగర్లో సాయిజానకినగర్ ప్రాంతాల్లో జరిగిన చోరీలకు ఒకే ముఠా పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. -
ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి
బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదదరావు కుల్కచర్ల: ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేని వని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదద రావు, దిశ జిల్లా కమిటీ సభ్యులు జానకిరాం, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సౌ మ్యారెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల జెడ్పీ బాలికల పాఠశాల, కేజీబీవీలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మండలంలోని ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజిలయ్య పాల్గొన్నారు. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నాయకులు కొడంగల్: మండల పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముందు జాగ్రత్తగా పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని గృహ నిర్బందంలో ఉంచారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ వాణిశ్రీ యాదవ్, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్తో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని బొంరాస్పేట మండలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేటి మహాధర్నాను విజయవంతం చేయాలి డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అనంతగిరి: నగరంలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరించడంతోపాటు.. ప్రతిపక్ష నేతగా విఫలమైన మాజీ సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. భాస్కరయోగికి రాష్ట్ర స్థాయి అవార్డు పరిగి: పరిగి ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న రచయిత భాస్కరయోగి శనివారం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. కొడంగల్ జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి అభిలాష చేతుల మీదుగా పురస్కారం స్వీకరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలి అనంతగిరి: మా సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. కొడంగల్ పర్యటనలో ఉన్న ఆయనకు శనివారం వినతిపత్రం అందజేశారు. 12 నెలల తో కూడిన కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలన్నారు. రెగ్యులర్ లెక్చరర్లు లేని చోట అతిథి అధ్యాపకులను నియమించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు గెస్ట్ లెక్చరర్లు పాల్గొన్నారు. -
ఓటరు నమోదుకు మరో ఛాన్స్
బషీరాబాద్: ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులు ఫారం – 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించినట్లు బషీరాబాద్ తహసీల్దార్ షాహేదా బేగం శనివారం తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే సంబంధిత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారాల ద్వారా ఆయా గ్రామాల్లోని పోలింగ్ బూతుల వారీగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండలంలోని కాశీంపూర్, మల్కన్గిరి, బాద్లాపూర్, గొట్టిగ ఖుర్ధు, దామర్చెడ్ గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. పేరు తొలగింపు అభ్యంతరాలకు ఫారం –7, వివరాల సవరణకు ఫారం –8 వినియోగించుకోవచ్చని తెలిపారు. బూత్స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని, అవసరమైతే ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే నోటీసులు అందుకున్న వారు సరైన ధ్రువపత్రాలను బీఎల్ఓలకు సమర్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు కావడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ సుధ, జీపీఓలు, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టదా?
పూడూరు: అంగడిచిట్టంపల్లి – కంకల్ లాల్పహాడ్ రోడ్డు పనులు చేపట్టడంతో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టడం లేదని బీజేపీ ఐటీ విభాగం జిల్లా ఇన్చార్జ్ రవీందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేనేళ్లుగా బీటీ రోడ్డు గుంతలమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. శనివారం పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు అంగడిచిట్టంపల్లి స్టేజ్ హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 24 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. 18 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కంకల్ నుంచి లాల్పహాడ్ వరకు డబు ల్ రోడ్డు పనులు ప్రారంభించారు. అయితే సకాలంలో బిల్లులు రాక కాంట్రాక్టర్ పనులు మధ్యలో ఆపేశాడని తెలిపారు. రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో వాహనాలు పాడవడం, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఆర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేరుకే సీఎం జిల్లా అని అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉందన్నారు. వెంటనే రోడ్డు పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు పాండు, శ్రీనివాస్, బీజేపీ నాయకులు రవీందర్, రాజు, మనోహర్గౌడ్, మహేందర్ గౌడ్, భూపాల్, కోట్ల శంషూ, ఆయా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ది మోసపూరిత పాలన
తాండూరు: ఎన్నికల ముందు యువతకు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయలేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో యువత, విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పీఠాన్ని కదిలించడం తమకు పెద్ద లెక్క కాదని, ప్రజలే సరైన సమయంలో తమ తీర్పుతో మార్పునకు నాంది పలుకుతారని అన్నారు. యువత ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే రాజకీయాల దిశనే మార్చగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్రాజుగౌడ్, మున్సిపల్ కౌన్సిల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప, కౌన్సిలర్లు నీవీన సంతోష్గౌడ్, ఇర్షద్, జావీద్, సురేష్, మాజీ కౌన్సిలర్లు అనురాథ, పరిమళ, శోభరాణి, నరేందర్గౌడ్, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాసాచారి, ఇందర్చెడ్ రాజు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
అరెస్టులు అప్రజాస్వామికం
● ప్రతిపక్ష నేతల మండిపాటు ● సీఎం పర్యటన నేపథ్యంలో పలువురి ముందస్తు అరెస్ట్ బొంరాస్పేట: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో బొంరాస్పేట, దుద్యాల తదితర మండలాలకు చెందిన ప్రతిపక్ష, మిత్రపక్ష పార్టీల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం నాయకులు, ఇతర పార్టీల సర్పంచ్లు ఉన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, మానవ హక్కులను హరించడమేనని దుద్యాల మండలం చెట్టుపల్లితండా సర్పంచు గోపాల్ మండిపడ్డారు. శనివారం సాయంత్రం పోలీసులు వీరిని విడుదల చేశారు. వీరిలో సీపీఐ నాయకులు ఎండీ మహెమూద్, సురేశ్గౌడ్, చెట్టుపల్లితండా సర్పంచ్ ముడావత్ గోపాల్, దౌల్తాబాద్ మండల నాయకుడు మూతల రాజు, నీటూరు మాజీ సర్పంచు సున్నపు వెంకటప్ప, వ్యవసాయ కార్మిక సంఘం ఎండీ రహీమ్, ఎండీ రఫీక్ తదితరులు ఉన్నారు. బొంరాస్పేట మండల శివారులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. -
వేతనాలు మహాప్రభో!
వికారాబాద్: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన వెతలు తప్పడంలేదు. వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు సక్రమంగా అందడంలేదు. ఒక్కోసారి రెండు నుంచి ఆరు నెలల ఆలస్యం అవుతోంది. ఇటీవల కాలంలో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు వారం పది రోజులు ఆలస్యమైతే ఆగ్రహం వ్యక్తం చేసే సంఘాల నాయకులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల విషయంలో నోరు మెదపడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య, విద్య శాఖల్లో, డీఆర్డీఏలో విధులు నిర్వహిస్తున్న వందలాది మంది జీతాల కోసం అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ కష్టంగా ఉందని వాపోతున్నారు. అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తోందని తెలిపారు. డాక్టర్లు మొదలుకొని.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారిలో డాక్టర్లు మొదలుకొని ఏఎన్ఎంలు, జూనియర్ ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, లెక్చరర్లు ఉన్నారు. విద్యాశాఖలో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. నెలనెలా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ సమస్యను చక్కదిద్దారు. ప్రస్తుతం పాత పరిస్థతి తలెత్తుతోంది. కొన్ని శాఖల్లో రెండు మూడు నెలలు, మరి కొన్ని శాఖల్లో నాలుగు నెలలకు పైగానే జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. మండల విద్యావనరుల కేంద్రాల్లో, కస్తూర్బా గాంధీ గురుకులాల్లో విధులు నిర్వహించే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. సీఆర్పీలు, ఎంఐసీలు, పీటీఐలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఈఆర్సీలు కూడా ఉన్నారు. అప్పులు పుట్టడంలేదు నెల రోజులు కష్టపడ్డా జీతం అందకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పది నుంచి ఇరవై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా గుర్తింపు లేదన్నారు. క్రమబద్దీకరించాలని కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం అప్పులు కూడా పుట్టని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. వేతనాల విషయంలో వివక్ష చూపడం తగదని వేడుకుంటున్నారు. పరిస్థి తి ఇలాగే కొనసాగితే రోడ్లపైకి వస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు డీఏ, పీఆర్సీ, ఇతర పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు నుంచి ఆరు నెలల వరకు పెండింగ్ విద్య, వైద్యం, డీఆర్డీఏ ఉద్యోగుల అవస్థలు ఒక్కో శాఖలో 120 నుంచి 200 వరకు సిబ్బంది అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న వైనం.. -
విద్యార్థులే దేశ నిర్మాతలు
తాండూరు: నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాతలని ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బి.శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని సరస్వతి విద్యాపీఠం, శిశుమందిర్ విద్యాలయాల్లో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి హాజరై పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం స్కూల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.5లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షు డు మల్లేశం, పాఠశాల అధ్యక్షుడు కట్కం విరేందర్, మున్సిపల్ కౌన్సిలర్ జుంటిపల్లి వెంకట్, యాజమాన్య కమిటీ సభ్యులు అనంత్రెడ్డి, రాంరెడ్డి, నరేందర్రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
నేటినుంచి ఏకాంబరి జాతర
● నాలుగు రోజుల పాటు వేడుకలు ● ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి ● సప్తకొలనుల్లో స్నానం.. సర్వ పాప హరణం ● తెలంగాణ, కర్ణాటక నుంచి వేలాదిగా తరలిరానున్న భక్తులు ● భారీగా పోలీసు బందోబస్తు బషీరాబాద్: జిల్లా సరిహద్దులోని నీళ్లపల్లి అటవీ ప్రాంత సప్తకొలనుల మధ్య వెలసిన పురాతన శ్రీ ఏకాంబర రామలింగేశ్వరస్వామి జాతర ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేయగా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఏటా శ్రావణమాసం చివరి సోమవారం వేడుకలను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా సప్తకొలనుల్లో పుణ్యస్నానం ఆచరించి, అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ స్నానం చేస్తే ఏళ్లనాటి పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తాండూరు, వికారాబాద్, మహబూబ్నగర్, సేడం తదితర ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆలయ చరిత్ర త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా పాతక విముక్తి కోసం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే స్థానిక గాథ ఈ క్షేత్రానికి చారిత్రక విశిష్టతను తీసుకొచ్చింది. ఆలయ సమీపంలోని యాకూబ్సాబ్ జీవసమాధి మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హిందూ, ముస్లిం భక్తులు ఆలయం, దర్గాను దర్శించుకోవడం ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘనటలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాండూరు సబ్డివిజన్ నుంచి 60 మందికి పైగా పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ విఠల్ తెలిపారు. కార్యక్రమాల వివరాలు ● ఆదివారం నీళ్లపల్లి గ్రామం నుంచి పల్లకీ ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ● సోమవారం జాతర మహోత్సవం, సాయంత్రం రథోత్సవం, ప్రత్యేక పూజలు ● మంగళవారం అర్ధరాత్రి లంకాదహనం ● బుధవారం జాతర ముగింపు కార్యక్రమాలు జరగతాయని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
అందుబాటులోకి అత్యవసర వైద్య సేవలు
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం పట్టణంలోని పలు భవనాలను అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు. ఉదయం నుంచి కొడంగల్లో సీఎం షెడ్యూల్ బిజీ, బిజీగా ఉన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల క్రిటికల్ కేర్ యూనిట్ నూతన భవనాన్ని ప్రారంభించారు. విపత్కర పరిస్థితుల్లో కొడంగల్ ఆస్పత్రికి వచ్చే బాధితులకు అత్యవసర సేవలు అందించడానికి ఈ యూనిట్ను మంజూరు చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొని రావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు హైదరాబాద్కు వెళ్లకుండా అన్ని రకాల వైద్య సేవలు కొడంగల్లోనే కల్పించారు. ఈ సందర్భంగా పలువురు నర్సులు, నర్సింగ్ విద్యార్థులు సీఎంకు రాఖీలు కట్టారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించిన రూ.5 భోజనం ఇందిరమ్మ క్యాంటిన్ ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చిన పలువురికి సీఎం భోజనం వడ్డించారు. క్యాంటిన్ ద్వారా హరే కృష్ణ పౌండేషన్ ఆధ్వర్యంలో రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తారని చెప్పారు. పట్టణంలో మెయి న్ రోడ్డు పక్కన రూ.8.5 కోట్ల వ్యయంతో ఆధునాతన వసతులు, సౌకర్యాలతో నిర్మించిన ఆర్అండ్బీ అతిథి గృహాన్ని ప్రారంభించారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్, అరబిందో ఫార్మా లిమిటెట్ సీఎస్ఆర్ నిధులు రూ.8 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల నూతన భవనాలను ప్రారంభించారు. కొత్త భవనంలో గణపతి, సరస్వతి, వేంకటేశ్వర స్వామి ఫొటోలకు పూజలు చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించిన అరబిందో ఫార్మా పౌండేషన్ను రేవంత్రెడ్డి అభినందించారు. కోస్గిలో రూ.4 కోట్ల తో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం శిలాఫలకాన్ని కూడా కొడంగల్లోనే ప్రారంభించారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారి, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ సదానందరెడ్డి, సీనియర్ వైస్ ప్రసిడెంట్ డాక్టర్ ఐఎస్ఆర్ రావ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్రెడ్డి, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్నుప్రారంభిస్తున్న సీఎం రేవంత్రెడ్డిముఖ్యమంత్రికి రాఖీ కడుతున్న నర్సు -
రోహిత్రెడ్డిని విమర్శిస్తే సహించం
తాండూరు: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాండూరులోని వనరులను కొడంగల్కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. నర్సింగ్ విద్య తాండూరు విద్యార్థులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నాడు రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి నర్సింగ్ కళాశాల భవనాన్ని నిర్మించారని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్రెడ్డి నర్సింగ్ కళాశాల భవనాన్ని కొడంగల్కు తాకట్టు పెట్టి, కొడంగల్ మెడికల్ కళాశాల నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్ కోసం జిల్లా ఆస్పత్రిని కూడా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తాండూరు ప్రజలకు కాగ్నానది నీటిని సరఫరా చేయకుండా కొడంగల్కు నీటి సరఫరా చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఇర్షద్, సురేష్నాయక్, అనిల్అర్మి, మాజీ కౌన్సిలర్లు ఆసిఫ్, నాయకులు సంతోష్గౌడ్, రుద్రపటేల్, కరుణాకర్, ఏజాజ్, అనంత్రెడ్డి తదితరులు ఉన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు -
చారాణా అభివృద్ధి.. బారాణా దోపిడీ
● ఇదీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన ● కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట: సీఎం జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం సరికాదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మెట్లకుంట గేటు వద్ద విలేకరులతో మాట్లాడారు. చారాణా అభివృద్ధి.. బారాణా దోపిడీ అన్న చందంగా కాంగ్రెస్ ప్రజాపాలన సాగుతోందని ఆరోపించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సమస్యలు తిష్ట వేశాయని, ప్రజల కష్టాలను సీఎం దృష్టికి తెచ్చేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలను సీఎంకు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్రెడ్డి, కోట్ల యాదగిరి, చాంద్పాషా, సలామ్, మహేందర్, రవిగౌడ్, మల్లేశ్గౌడ్ విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ ర్యాలీలు సిగ్గుచేటు
తాండూరు: ఉపాధ్యాయ దినోత్సవం వంటి పవిత్రమైన రోజున విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు వినియోగించడం సిగ్గుచేటని ఎన్ఎస్యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ విమర్శించారు. రోడ్లపై సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునే రోజున విద్యార్థులు ఉపాధ్యాయులు వేడుకల్లో పాల్గొనాల్సిన సమయంలో వారిని రోడ్లపై నిలబెట్టి రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల మద్దతు లేక విద్యార్థులను ర్యాలీలకు తీసుకువచ్చి రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు, యువత సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు చేపట్టిందని అన్నారు. ఇప్పటి వరకు 60 వేల ఉద్యోగాలను భర్తీ చేపట్టడంతో పాటు హాస్టల్ మెస్ చార్జీలను పెంచామని తెలిపా రు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రే క్ఫాస్ట్ అందిస్తున్నామన్నారు. తాండూరులో జీఓల కు పరిమితమైన ఐటీఐ కళాశాల సమస్యను పరిష్కరించి ఏటీసీ ద్వారా విద్యార్థులకు నైపుణ్య విద్య అందుతోందని తెలిపారు. ఇంతటి కార్యక్రమాలను చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోహిత్రెడ్డి విమర్శించడం సరికాదని అన్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
కార్యకర్తలే నా బలం
కొడంగల్/బొంరాస్పేట/వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తమ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలే తనకు బలమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వారి సహకారం.. అండ దండలతోనే తనకు ఈ పదవి, హోదా దక్కిందని పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు తొలగించడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తడి బట్టతో గొంతు కోసినట్లు ఓట్లను తొలగించి పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పేద వాడికీ ఓటు హక్కు ఉండాలన్నారు. ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే బాధ్యత తనపై ఉందన్నారు. కొడంగల్లో మాత్రమే ప్రతి కార్యకర్త ఒక రేవంత్రెడ్డిగా భావించి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. దేశ స్థాయిలో కొడంగల్కు గుర్తింపు వచ్చిందంటే అది మీ వల్లే సాధ్యమైందని కార్యకర్తలకు సూచించారు. కొడంగల్లో 81 వేల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. పేర్లలో తప్పులు, అడ్రసులో మార్పులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నోటీసులు ఇచ్చారని అన్నారు. వాటిని సరి చేయించి ఓటును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నా రు. ఇది పేదల సమస్య. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు తొలగించడానికి కుట్రలు జరుగుతున్నాయని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పేద వాడికి ఓటు హక్కు కల్పించాలన్నారు. కొడంగల్లో 35వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు చెప్పారు. ఓట్లను కాపాడుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్నారు. లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇంటింటికి వెళ్లి సర్లో పేర్లు నమోదు చేయించాలన్నారు. ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా పోతాయని హెచ్చరించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసి కొడంగల్ను ముందు వరుసలో నిలబెట్టాలన్నారు. కొడంగల్ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. మళ్లీ కొడంగల్పై కక్ష కట్టి సర్లో ఓట్ల తొలగించడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి సహకారంతోనే పదవి, హోదా -
ఘనంగా గురుపూజోత్సవం
ధారూరు: సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూజ చేస్తున్న హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి బొంరాస్పేట: కొత్తూరు యూపీఎస్లో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లకు సన్మానం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుల సేవలను అధికారులు, పాలకులు కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన మండల నాయకులు
బొంరాస్పేట: కొడంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభివృద్ధి పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. మండలంలోని మహంతీపూర్ వద్ద నిర్మిస్తున్న భారీ వంతెన పనులు, కొత్తూరు – మహంతీపూర్ రోడ్డు, మెట్లకుంట, బొంరాస్పేట బీటీ రోడ్లు, బొంరాస్పేట –దేవనూర్ రోడ్డు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఓ నాయకుడిని సీఎం ఆప్యాయంగా పలకరిస్తూ చేపల పులుసు ఎప్పుడు తినిపిస్తావ్ అన్నా అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు వెంకట్రాములుగౌడ్, రాంచంద్రారెడ్డి, మల్లేశ్, మల్లికార్జున్, దేశ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన బాలగోపాలం
కొడంగల్ రూరల్: పట్టణంలోని బ్రాహ్మణవాడలో వెలసిన అతి ప్రాచీన కేశవస్వామివారి ఆలయంలో శనివారం శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4గంటల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు బాలగోపాలం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఎంతగానో అలరించారు. ప్రతిభ చూపిన అచ్యుతాకృష్ణ, డి.జ్యోత్స్న, హేమంత్ అద్వత్, సభాపతి అమ్యుక్తా, కొండేటి శ్రేష్ట, గాండ్ల అపూర్వ, చిట్టెపు నేహంత్రెడ్డి, మాన్విక్ నరేష్కుమార్కు ఉమిద్వార్ మాణిక్యమ్మ ట్రస్ట్ ఆధ్వరయంలో మురారీ వషిష్ట కుటుంబ సభ్యులు ఒకొక్కరికి ఐదు గ్రాముల చెప్పొన వెండి పతకాలు బహూకరించారు. -
హామీల అమలులో విఫలం
అనంతగిరి: ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. శనివారం పట్టణంలో కాంగ్రెస్ వెయ్యి రోజల పాలనను నిరసిస్తూ యువతీయువకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో మాట్లాడారు. అధికారం కోసం ఆచరణ సాధ్యం హామీలు ఇచ్చారని ఆరోపించారు. యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలన్నారు. విద్యా భరోసా కార్డు ఏమయ్యిందని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి లేదన్నారు. పెండింగ్లో ఉన్న రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ అధ్యక్షుడు శుభప్రద్పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, నాయకులు వేణుగోపాల్, గోపాల్, మైపాల్రెడ్డి, అనంత్రెడ్డి, కమాల్రెడ్డి, దత్తు, కిశోర్, సుభాన్రెడ్డి, షఫీ, మల్లికార్జున్, వేణుగోపాల్రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు
కేశంపేట: స్థానిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న విద్యావతి ఉత్తమ జీహెచ్ఎంగా, పాపిరెడ్డిగూడ, కొత్తపేట, నిర్ధవెళ్లి హైస్కూళ్లలో పనిచేస్తున్న ఆనంద్బాబు, హారతి, కరుణాకర్గౌడ్, కేశంపేట, పాపిరెడ్డిగూడ, మంగళిగూడ, కేశంపేట, అల్వాల ప్రాథమిక పాఠశాలలకు చెందిన అప్పారావు, అరుణ, లక్ష్మీశిరీష, అపర్ణ, శ్రీధర్ పురస్కారాలకు ఎంపికయ్యారు. శనివారం మధ్యాహ్నం శ్రీ హిందు ఇంజనీరింగ్ కళాశాల మంగళ్పల్లి, ఇబ్రహీంపట్నం వద్ద పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. -
రేపు లక్ష బిల్వార్చన పూజ
ధారూరు: మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర ఆలయంలో కపిలేశ్వర స్వామికి ఆదివారం లక్ష బిల్వార్చన పూజ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు పత్రి దళాలు తెచ్చుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకు దీపారాధన, వినాయక, కుమారస్వామి, నందీశ్వర, వీరభద్రేశ్వర, పార్వతీమాత, నవగ్రహాలకు పూజలు, 9:30 గంటలకు మహా గణపతి పూజ, రుద్రాభిషేకం, అలంకరణ, 10:30 గంటలకు లక్ష బిల్వార్చన పూజ, 11:55 గంటలకు స్వామి అమ్మవారి కల్యాణం, అనంతరం మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పల్లకీ సేవతో వేడుకలు ముగుస్తాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్ అనంతగిరి: ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర కీలకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్లోని పార్టీ కార్యాలయంలో సర్ రెండో విడతపై ముఖ్య నాయకులు, కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటరు జాబితాలో అర్హులైన వారందరి పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. నోటీసు అందుకున్న వారికి అవగాహన కల్పించాలన్నారు. ఓ ఒక్కరి ఓటు పోకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర నాయకులు శివరాజు, పాండుగౌడ్, కేపీ రాజు, వడ్ల నందు, నవీన్కుమార్, అనిల్యాదవ్, రాములు, భద్రేశ్వర్, కృష్ణ ముదిరాజు, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు కుల్కచర్ల: ప్రవేటు వైద్యశాలలు సేవా భావంతో పనిచేయాలని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తులసీ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల పరిస్థితులను గ్రహించి వారికి ఇబ్బంది లేకుండా వైద్యసేవలు అందించాలన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం ఒకే దగ్గర అందించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజిలయ్య, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం, గోరిగడ్డ తండా మాజీ సర్పంచ్ నీలి బాయి, సేవాలాల్ సేన మండల అధ్యక్షులు అంగూర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: సీఎం వచ్చిన ప్రతీసారి ఇతర పార్టీల నేతలను అదుపులోకి తీసుకోవడం ఎంటని దిశ జిల్లా కమిటీ సభ్యులు జానకిరాం చౌహాన్ ప్రశ్నించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ స్థానిక నేతలను బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కుల్కచర్ల సర్పంచ్ అంజిలయ్య, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మైపాల్, తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్ల: మండలంలోని ముజాహిద్పూర్లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆర్.నర్సింలు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపించింది. భయాందోళనతో గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే చిరుత సమీప అడవిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకొని వ్యక్తి మృతి
యాలాల: ప్రమాదవశాత్తు ఇంట్లో స్విచ్ బోర్డుకు ఏర్పడిన నిప్పురవ్వలతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ముద్దాయిపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. యాలాల ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులవోని రాజు గౌడ్(40) కిరాణా దుకాణంతోపాటు పెట్రోల్ విక్రయిస్తుంటాడు. గురువారం రాత్రి ఇంట్లో కరెంటు బోర్డు స్విచ్ ఆన్చేసే క్రమంలో చెలరేగిన నిప్పురవ్వలు పెట్రోల్ డబ్బాపై పడటంతో మంటలు చెలరేగాయి. మంటల నుంచి రక్షించుకునే క్రమంలో రాజు ఒంటికి సైతం నిప్పంటుకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని హుటాహుటిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతుడి మామ నరేందర్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విలీన పంచాయితీ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఫ్యూచర్సిటీలో పంచాయతీల విలీన అంశం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాస్పదంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కై వసం చేసుకున్న పంచాయతీలు విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేసి పంపుతుండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సర్పంచులుగా ఉన్న గ్రామాలు ఇందుకు నిరాకరిస్తున్నాయి. భారత్ ఫ్యూచర్సిటీ భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామమని అధికార కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని, తర్వాత ఫ్యూచర్సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో పంచాయతీల విలీన అంశం రెండు పార్టీల మధ్య రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. ఇప్పటికే 56 రెవెన్యూలు విలీనం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని భావించింది. ఆ మేరకు 2023 నాటికి 13,500 ఎకరాలు సేకరించింది. 2024లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలుష్య భూతాన్ని వెదజల్లే ఫార్మాసిటీని రద్దు చేసి, దాని స్థానంలో కాలుష్య ఉద్గరాల రహిత నెట్ జీరోసిటీ/ భారత్ ఫ్యూచర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి 12న ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 74 పంచాయతీలు, 765.28 చదరపు కిలోమీటర్లు (1,88,959 ఎకరాలు)తో ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ని ఏర్పాటు చేసింది. కందుకూరు 18, యాచారం 17, ఇబ్రహీంపట్నం ఎనిమిది, కడ్తాల్ ఆరు, మంచాల మూడు, ఆమనగల్లులో రెండు, మహేశ్వరం రెండు రెవెన్యూ గ్రామాల చొప్పున ఇందులో విలీనం చేశారు. తర్వాత యాచారం, మహేశ్వరం, మాడ్గుల, కడ్తాల్ మండలాల నుంచి కొత్తగా మరికొన్ని విజ్ఞప్తులు అందాయి. ఒకే అంశం.. భిన్న స్వరాలు ఎఫ్సీడీఏ పరిధిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానుండడం, శరవేగంగా అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరడం సహా భవిష్యత్తులో ఇక్కడి భూములకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సరిహద్దు పంచాయతీల నుంచి విజ్ఞప్తులు మొదలయ్యాయి. తమ గ్రామాలను సైతం ఎఫ్సీడీఏ పరిధిలోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు తీర్మానం చేసివ్వాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విలీన పంచాయతీ షురూ అయింది. విలీనానికి అనుకూలంగా కాంగ్రెస్ అనుబంధ పంచాయతీలు తీర్మాణాలు చేసి ఇవ్వగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోని పాలక వర్గాలు ఇందుకు విముఖత చూపుతున్నాయి. తీరా విలీనం చేసిన తర్వాత పరిశ్రమల పేరుతో ప్రభుత్వం ప్రజల భూములను స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందనే ప్రచారం కూడా విముఖతకు కారణమని తెలుస్తోంది. జేఏసీగా ఏర్పడి దీక్షలు మహేశ్వరం మండలంలో 30 పంచాయయతీలు ఉండగా, వీటిలో ఇప్పటికే తుమ్మలూరు, మొహబ్బత్నగర్ రెవెన్యూ గ్రామాలను ఎఫ్సీడీఏలో విలీనం చేసింది. మరో 28 పంచాాయతీలు మిగిలిపోగా, కాంగ్రెస్ పాలక వర్గాల చేతిలో 11 ఉండగా, బీఆర్ఎస్ పాలక వర్గాల చేతిలో 14, బీజేపీ పాలక వర్గాల చేతిలో ఐదు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రోజుకో తరహా ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుండగా, ప్రతిపక్ష పార్టీల నేతలు ఇందుకు దూరంగా ఉంటున్నారు. వీరంతా అంతర్గతంగా విలీనానికి తాము అనుకూలమేనని చెప్పి.. బహిర్గతంగా మాత్రం ఈ అంశంపై మౌనం వహిస్తున్నారు. అధినాయకుల అభీష్టానికి భిన్నంగా తాము మాట్లాడమని చెప్పి తప్పించుకుంటున్నారు. అభివృద్ధికి బాటలు ఫ్యూచర్ సిటీలో గ్రామాలు విలీనమైతే హైటెక్ సిటీ తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో భారీ ఐటీ పరిశ్రమలు, కంపెనీలు వస్తా యి. విల్లాలు నిర్మాణం కావడంతో పాటు రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేసి అభివృద్ధికి బాటలు వేయాలి. – కడారి జంగయ్య యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం అన్ని గ్రామాలను విలీనం చేయాలి మహేశ్వరం మండలంలోని మొత్తం 30 పంచాయతీలకుగాను తుమ్మ లూరు,మొహబ్బత్నగర్ను ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో విలీనం చేసింది. ఇంకా 28 గ్రామాలను విలీనం చేయాలని కోరాం. సర్పంచ్లతో తీర్మానాలు చేసివ్వాలని చెప్పడంతో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సర్పంచ్లు తీర్మానాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్లు తీర్మానాలు ఇవ్వడం లేదు. – వత్తుల రఘుపతి, ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్, మహేశ్వరం -
నష్టాల బాటలో తాండూరు ఆర్టీసీ డిపో
తాండూరు: నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. మహిళలకు ఆర్థిక భారం పడకుండా ఉచిత ప్రయాణంతో మరింత చేరువైంది. అలాంటి ఆర్టీసీ నాలుగు నెలలుగా నష్టాల బాటలో నడుస్తోంది. ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలతో ప్రతి నెలా భారంగా మారుతోంది. దీంతో అధికారులు లాభాల బాట పట్టించేందుకు ప్రత్నామ్నాయలు మొదలు పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తాండూరు ఆర్టీసీ డిపోకు ఏకంగా రూ.5.76 కోట్ల మేర నష్టం వాటిల్లింది. డిపోలో మొత్తం 92 బస్సులు ఉండగా అందులో 32 అద్దె బస్సులు ఉన్నాయి. నిత్యం 46 రూట్లలో.. 35వేల కిలోమీటర్లు తిరుగుతూ.. 46వేల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తోంది. తద్వారా డిపోకు రోజు రూ.17 లక్షలు సమకూరుతోంది. టికెట్ల రూపంలో రూ.9 లక్షలు, మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా మరో రూ.8 లక్షలు వస్తోంది. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోని దుకాణాల ద్వారా నెలకు రూ.2.65 లక్షల ఆదాయం వస్తోంది. నాలుగు నెలల్లో రూ.5.76 కోట్ల నష్టం తాండూరు ఆర్టీసీ డిపో నిర్వహణ ప్రతి నెలా భారంగా మారుతోంది. బస్సుల మరమ్మతులు, ఉద్యోగుల వేతనాలు మేరకు కూడా అదాయం రావడం లేదని అధికారులు అంటున్నారు. ప్రతి నెలా సగటున రూ.5కోట్ల ఆదాయం వస్తుండగా 32 బస్సుల అద్దెలు, డీజిల్ ఽకొనుగోలు, ఉద్యోగుల వేతనాల, మరమ్మతులకు రూ.6.56 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ప్రతి నెలా రూ.1.56 కోట్ల మేర అదనంగా భరించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నేటి వరకు రూ.5.76 కోట్ల నష్టం వచ్చిందన్నారు. తాండూరు బస్టాండ్ ప్రతి నెలా రూ.1.56 కోట్ల భారం -
కళాత్మక బోధన
బొంరాస్పేట: కళాత్మక బోధనతో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొదిస్తున్న వడిచర్ల ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం నరేందర్గౌడ్ 2025లో తెలంగాణ నుంచి సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ అనే జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఢిల్లీలోని భారత్ భవన్లో ప్రత్యేక శిక్షణపొందారు. మండల, జిల్లా స్థాయిల్లోని సమావేశాలు, ఆదర్శ బోధన తరగతులు, కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక గుర్తింపుతో ఉపాధ్యాయుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ధన అభ్యసన సామర్థ్యాలు పెంచింది. విద్యార్థులు చురుకుగా మారారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాలి
తాండూరు టౌన్: మతం మారిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాల్సిందేనని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆలిండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక విలియంమూన్ స్కూల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతం మారిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దవుతుందని కోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 341 ఆర్టికల్ను పార్లమెంటులో సవరించాలని డిమాండ్ చేశారు. మతం మారిన ఓసి, బిసి, ఎస్టీలకు లేని ఆంక్షలు కేవలం దళిత క్రైస్తవులకే ఎందుకని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరపాగ గోవింద్, కోశాధికారి మోహనకృష్ణ మాట్లాడుతూ కుల వివక్ష ఉన్నన్ని రోజులూ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఉండాల్సిందేనన్నారు. సమావేశంలో జిల్లా పాస్టర్ల సంఘం అధ్యక్షుడు జనార్దన్, పాస్టర్లు జోసెఫ్, ఆశీర్వాదం, నాయకులు చక్రవర్తి, కిష్టప్ప, లక్ష్మయ్య, మల్లేశ్, మధు తదితరులు పాల్గొన్నారు. -
సంతోషంగా ఉంది
జిల్లా స్థాయి ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. విద్యార్థుల్లోని క్రీడా సామర్థ్యాలను వెలికి తీసి, ప్రోత్సహించా. పలువురు కబడ్డీ, వాలీబాల్ రాష్ట్ర స్థాయిలో సత్తాచాటారు. – వెంకటేశ్, పీడీ, ముద్వీన్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా స్థాయి అవార్డుతో బాధ్యత పెరిగింది. 25 ఏళ్ల ఉపాధ్యాయ జీవిత ప్రయాణాన్ని గుర్తించినందుకు కృతజ్ఞతలు. తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఉన్నతికి నా వంతు కృషిచేస్తా. – మంజుల, రావిచేడ్ జెడ్పీహెచ్ఎస్ -
వేయి రోజుల్లో కాంగ్రెస్ చేసింది శూన్యం
మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి: కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు అరచేతిలో అద్బుతం చూపించి అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో బీఆర్ఎస్ నియోకవర్గ ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ పిలపు మేరకు నేటి నుంచి 8 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వేయి రోజుల దగా పాలనపై సమరభేరి ఉంటుందన్నారు. కాంగ్రెస్ 420 హమీలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభుత్వంపై పోరాడడానికి ప్రతీ కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్రావు, నాయకులు కొప్పుల నాగిరెడ్డి, శ్యాంసుందర్రెడ్డి ప్రవీణ్రెడ్డి, శివనోళ్ల భాస్కర్, ఆయా మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కిరాణ దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల సర్కిల్ పరిధి కమ్మగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో కిరాణ దుకాణం నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం షాపు మూసి భోజనానికి వెళ్లారు. కొద్ది సేపటికే దుకాణం నుంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. వెంటనే హయత్నగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.లక్షన్నరకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడం, అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 3 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ శంకర్పల్లి: తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అయ్పప్పరెడ్డిగూడలో సరస్వతి అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గతనెల 30న ఇంటికి తాళం వేసి వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం దుర్గం చెరువుకి తన కూతురు, అల్లుడుతో కలిసి రాఖీ కట్టేందుకు వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికులు ఆమెకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి చేరుకొని దొంగతనం జరిగినట్లు గుర్తించింది. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 30 తులాల వెండి, కొంత నగదు దొంగలు అపహరించుకొని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
తాగునీటి కోసం ధర్నా
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం కందనెల్లితండాలో గిరిజనులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. మంగళవారం తాండూరు–సంగారెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కందనెల్లి తండాలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై సర్పంచ్ను ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికారులు కల్పించుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎంపీడీఓ హామీతో ధర్నా విరమించారు. తాండూరు టౌన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కొనుగోలు చేసి తీసుకువస్తున్న వినాయక విగ్రహాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతులు లేవని పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ అన్నారు. విగ్రహాల ప్రతిష్ట కోసం సాదాసీదాగా ప్రతిమలను తెచ్చి మండపంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహిస్తే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తాండూరు రూరల్: జీవితంపై విరక్తిచెంది ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. మృతుడు తాండూరు మండలం అంతారం వాసిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొర్ర నాగప్ప (35) భార్యాపిల్లలతో కలిసి బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద నివాసముంటున్నాడు. సోమవారం సాయంత్రం బేగంపేట్ స్టేషన్ సమీపంలో రైలు వస్తుండగా, కింద పడ్డాడు. మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు సాయంతో రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. ● కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలి ● రౌడీ షీటర్లకు ఎస్ఐ భరత్రెడ్డి కౌన్సెలింగ్ పూడూరు: ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి మంగళవారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. పోలీసుల సూచనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో భాగంగా రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. మొయినాబాద్: బతుకుదెరువుకోసం భార్యపిల్లతో వలస వచ్చిన ఓ మేసీ్త్ర పనిచేసే చోటే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన బుధ్రం సత్నామి (54) నెల రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి మొయినాబాద్ ప్రాంతానికి వలస వచ్చాడు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లిలో ఉన్న వనమ్ విల్లాస్లో మేస్త్రిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పనిచేస్తూ సత్నామి తల తిరుగుతోందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు చికిత్స నిమిత్తం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
పైకప్పు.. ముప్పు!
బషీరాబాద్: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. పైకప్పు ఎప్పుడు కూలిపోతుందోననే ఆందోళన వీరిని వెంటాడుతోంది. సోమవారం రాత్రి ఓ గదిలో మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. రాత్రివేళ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం ఆఫీసు తెరిచిన సిబ్బంది అధికారుల గదిలో పడిన కొన్ని శిథిలాలను బయట పడేశారు. అనంతరం తహసీల్దార్ షాహెదాబేగం, ఆర్ఐ నాగార్జున రెడ్డి ఇతర గదులను పరిశీలించగా పలుచోట్ల పైకప్పు పెచ్చులు వదులుగా కనిపించాయి. దీంతో ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని వదులుగా ఉన్న పెచ్చులను సిబ్బందితో ముందుజాగ్రత్తగా తొలగింపజేశారు. తరుచూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఎప్పుడు ఏ భాగం కూలుతుందోనని హడలిపోతున్నారు. ప్రతిరోజూ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే కార్యాలయం కావడంతో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే ఆఫీసును మరో భవనంలోకి మార్చాలని సిబ్బంది కోరుతున్నారు. శిథిలావస్థలో బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం తరచూ ఊడిపడుతున్న స్లాబ్ పెచ్చులు భయంభయంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది -
తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్
● సంస్థ టెక్నికల్ ఇంజనీర్ శ్రీకాంత్ ● సెంట్రింగ్ మేసీ్త్రలకు బీమా బాండ్ల అందజేత పరిగి: సిమెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా వికాట్ గ్రూప్కి చెందిన భారతి సిమెంట్ ఎదుగుతోందని సంస్థ టెక్నికల్ ఇంజనీర్ శ్రీకాంత్ తెలియజేశారు. మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలో శ్రీలక్ష్మి చెన్నకేశవ ట్రేడ్ డీలర్ షాప్లో సెంట్రింగ్ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. భవనాల స్లాబులు, బ్రిడ్జిలు, రహదారుల ఏర్పాటుకు భారతి సిమెంట్ సరైన ఎంపిక అని వివరించారు. అనంతరం 25 మంది తాపీ మేసీ్త్రలకు లక్ష రూపాయల ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. డీలర్ గోపాల్ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీసు వేగవంతంగా ఉంటుందని, త్వరితగతిన స్పందించి టెక్నికల్ సాయం అందజేస్తారని పేర్కొన్నారు. -
పిల్లల మధ్య కూర్చుని.. పాఠాలు విని
కొందుర్గు: అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థిగా మారి పిల్లల మధ్య కూర్చుని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలంలో మంగళవారం ఆమె పర్యటించారు. చౌదరిగూడ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఐదో తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయురాలు లీలామోహన్నాయక్ బోధించిన తెలుగు, మహేశ్ బోధించిన ఆంగ్లం పాఠాలు విన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్న తీరును విద్యార్థులకు వివరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న పథకాలపై సమీక్షించారు. ఆరోగ్య ఉపకేంద్రంలో ఆశా కార్యకర్తలతో మాట్లాడారు. ఆ తర్వాత ఇంద్రానగర్లో ఏర్పాటుచేసిన వీబీజీరామ్జీ గ్రామసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. కూలీలకు ఉపాధిహామీ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేసిందన్నారు. ఈ పథకం ద్వారా కూలీలకు 125 పనిదినాలు, 318 రకాల పనులు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. గ్రామసభల్లో చర్చించి ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికలు చేసుకొని అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, ఎంపీడీఓ పుష్పలత, ఎంఈఓ కిరణ్కుమార్ రెడ్డి, ఎంపీఓ హన్మంతు రెడ్డి, ఏపీడీ చరణ్గౌతమ్, ఏపీఓ నర్సింగ్రావు, ఏపీఎం హరిలాల్, ఏఈ వంశీ, ఇంద్రానగర్ సర్పంచ్ మహబూబ్బీ, హెచ్ఎం సునీత పాల్గొన్నారు. -
వసతి గృహాలు వెంటనే నిర్మించాలి
చేవెళ్ల: పట్టణంలో కళాశాల విద్యార్థులకు వసతి గృహాలను వెంటనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్లలో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్లలో వసతి గృహాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం 2018లోనే ఎస్సీ, బాలుర, బాలికల కళాశాలల వసతి గృహాలు మంజూరు చేసిందన్నారు. కానీ ఇప్పటివరకు పనులను ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహించారని వాపోయారు. మంజూరైన వసతిగృహాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తు న్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు సరైన సవతి లేక ఇబ్బందులు పడుతున్నారని, అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తుందని తెలి పారు. ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించి వెంటనే వస తిగృహాల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేసి, రోడ్డు దిగ్భందాలు భారీ నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మాల చందు, నాయకులు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన -
బిల్లుల కోసం మాజీ సర్పంచ్ హల్చల్
బషీరాబాద్: మండలంలోని నంద్యానాయక్ తండా మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్నాయక్ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో హల్చల్ సృష్టించాడు. తనకు రావాల్సిన పాత బిల్లులను ప్రస్తుత సర్పంచ్ సుమ్మిబాయి చెల్లించడంలేదని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగడంతో కార్యాలయంలో ఉన్న అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎంపీడీఓ సంపత్కుమార్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు శంకర్నాయక్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా వారితోనూ వాగ్వాదానికి దిగాడు. అనంతరం కార్యాలయం వద్దే తిరుగుతూ ఉద్యోగులను బెదిరించేలా ప్రవర్తించి, ఒక్కసారిగా ఎంపీడీఓ చాంబర్ వైపు దూసుకెళ్లాడు. దీంతో ఎంపీడీఓ సంపత్కుమార్ కార్యాలయంపైకి పరుగులు తీశారు. మద్యం మత్తులో ఉన్న మాజీ సర్పంచ్పై గతంలోనూ అధికారులను బెదిరించాడు. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్పై తిరుగుతున్న శంకర్నాయక్తో తమకు ప్రాణహాని ఉందని ఎంపీడీఓ, కార్యదర్శి దశరత్ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శంకర్ ప్రవర్తనతో అప్రమత్తమైన పోలీసులు అతడిని స్టేషన్కు తరలించారు. భయభ్రాంతులకు గురైన అధికారులు -
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
తాండూరు టౌన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు మంగళవారం పట్టణంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారికి తగిన న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆదిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. కేకే కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలంతో పాటు పలు బెనిఫిట్స్ కల్పిస్తామని సీఎం ప్రకటించడం అభినందనీయమన్నారు. మేనిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమం కోసం పొందుపరిచిన హామీలను ప్రభుత్వం నెరవేరస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంజయ్గౌడ్, కో ఆర్డినేటర్ జిలాని, ప్రకాశ్గౌడ్, శివకుమార్, అశోఖ్, మోయిజ్ బేగ్, వెంకటయ్య, ధన్రాజ్, శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనపై తెలంగాణ ఉద్యమకారుల హర్షం -
కక్షపూరిత చర్యలు మానుకోవాలి
అనంతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి అన్నారు. లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను నిరసిస్తూ, ఉత్తరాఖాండ్లో జరిగిన ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న రాహుల్గాంధీపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. కేసులకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్తోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. నీట్ పేపర్ లీకేజీ, కాక్రోచ్ ఉద్యమంతో బీజేపీ క్రమంగా బలహీనమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్ ముదిరాజు, వడ్డే శ్రీనివాస్, భాస్కర్రెడ్డి, మహేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, సీనియర్ నాయకులు కిషన్నాయక్, సత్యనారాయణ, మైపాల్రెడ్డి, ఉత్తమ్చంద్, అమీర్ అబ్దుల్లా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీశ్రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సంతోష, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాజా సలావుద్దీన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీ ప్రతినిధులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ -
మాస్టర్ప్లాన్లో మార్పులు
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం మాస్టర్ప్లాన్లో మార్పులకూ ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న రోడ్ల మధ్య ఏర్పడిన మిస్సింగ్ లింక్లను గుర్తించి కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్డు వెడల్పుల పెంపు, అవసరమైన చోట్ల భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మంగళవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి ఐదు రోడ్డు అభివృద్ధి ప్రతిపాదనల్లో 595 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నిబంధనలు, చట్టాల మేరకు వాటిని సేకరించనున్నారు. ఎక్కడెక్కడ? ● బైరాగిగూడ–నార్సింగి: గ్రీన్వ్యాలీ నుంచి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వరకు 30 మీటర్ల వెడల్పుతో మిస్సింగ్ లింక్ రోడ్డు. ● బడంగ్పేట్–నాదర్గుల్: బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి రామాలయం–నాదర్గుల్ మీదుగా వెళ్లే 925 మీటర్ల మార్గాన్ని 30 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నారు. బడంగ్ మెయిన్ రోడ్ నుంచి నాదర్గుల్ రోడ్ వరకు మరో మిస్సింగ్ లింక్ 30 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి. ● తొండుపల్లి–ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్: ఎన్హెచ్–44 తొండుపల్లి జంక్షన్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు 24, 36 మీటర్ల వెడల్పుతో రోడ్డు. ● తొర్రూరు–నాగార్జునసాగర్ రోడ్: ఇప్పటికే మాస్టర్ప్లాన్లో ఉన్న 18 మీటర్ల రోడ్డును 30 మీటర్లకు పెంచనున్నారు. ఇంజాపూర్ లేక్ నుంచి రామ్జీ చాయ్ హోటల్ వరకు మార్గంలో 135 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం రోడ్డు విస్తరణ కాదు.. మాస్టర్ప్లాన్లో మార్పులు ఈ మిస్సింగ్ లింక్ రోడ్లను మాస్టర్ప్లాన్లో చేర్చాలని, అవసరమైన చోట్ల ప్రస్తుత రోడ్డు వెడల్పులను పెంచా లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంటే శివారు ప్రాంతాల్లో భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ నెట్వర్క్ను ఇప్పుడే రీడిజైన్ చేసే ప్రక్రియ మొదలైనట్టే.మరోవైపు రోడ్ల కోసం ప్రభావితమయ్యే ఆస్తుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ముఖ్యంగా బడంగ్పేట్–తుర్కయంజాల్ మార్గంలో 216, బడంగ్పేట్–నాదర్గుల్ మార్గంలో 148, తొర్రూరు–నాగార్జునసాగర్ రోడ్డులో 135 ఆస్తులు ప్రభావితం కానుండటంతో భూసేకరణ ప్రక్రియ కీలకంగా మారనుంది. మిస్సింగ్ లింక్లకు మోక్షం శివార్లలో కొత్త రోడ్లకు రంగం సిద్ధం కసరత్తు చేపట్టిన జీహెచ్ఎంసీ -
కాంగ్రెస్ది అరాచక పాలన
మొయినాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ మంగళవారం మొయినాబాద్లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ మోసాలను ఎండగడుతుంటే తట్టుకోలేని ఆ పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. దీనిపై మరింత అవగాహన పెంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, సీనియర్ నాయకుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్ జగపతి, నాయకులు ప్రభాకర్రెడ్డి, నీలకంఠం, సుధాకర్రెడ్డి, రవీందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
అరెస్టులు అప్రజాస్వామికం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్ ● రాంచంద్రావు అరెస్టును నిరసిస్తూ వికారాబాద్లో ధర్నా అనంతగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్ అన్నారు. నల్గొండలో బీజేపీ నేత ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ, పరామర్శకు బయలుదేరిన ఆయనను నగరంలో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వికారాబాద్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రమేష్కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో దాడులు సరైన పద్ధతి కాదన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసి వికారాబాద్ పీఎస్కు తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్ నాయకులు శ్రీధర్రెడ్డి, చరణ్రెడ్డి, రాజు, పాండుగౌడ్, వివేకానందారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అమర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖర్గేను కలిసిన స్పీకర్
అనంతగిరి: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మంగళవారం రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ కమిటీ హాల్లో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ సన్నాహక సమావేశం కోసం స్పీకర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట ఓఎస్డీ వెంకటేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెం మైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొడంగల్: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పట్టణంలో నిరసన ర్యాలీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వినాయక చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఊరేగింపు తీస్తామన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాండూరు రూరల్: తాండూరు డివిజన్ ఇన్చార్జ్ డీఎల్పీఓగా రతన్సింగ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పని చేసిన ప్రవీణ్కుమార్ సెలవుపై వెళ్లారు. దీంతో డీపీఓ జయసుధ ఆదేశాల మేరకు పెద్దేముల్ ఎంపీఓగా పని చేస్తున్న రతన్సింగ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు నిత్యం గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తాండూరు టౌన్: ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కింద అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాకేష్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 18నుంచి 55 ఏళ్ల లోపున్న నిరాశ్రయులు, నిరు పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరుద్యోగులైన బీసీ వర్గాలకు చెందిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా లేదా దరఖాస్తు చేసుకుని, మెప్మా ఆఫీసులో అందజేయాలన్నారు. కొత్తూరు: జాతీయ ఎస్టీ కమిషన్ కాలుష్య నియంత్రణ మండలి, కలెక్టర్కు సిద్ధాపూర్ డంప్యార్డుపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు జేఏసీ చైర్మన్ రాంబాల్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిద్ధాపూర్లో డంప్యార్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 641తో సమీపంలోని గిరిజన తండాలతో పాటు 50 గ్రామాల ప్రజలు తమ ఆస్తులు, అస్తిత్వన్ని కోల్పోతారని జేఏసీ సభ్యులు ఇటీవల జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటావత్ హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన కమిషన్ నోటీసులు అందుకున్న 15 రోజుల్లో కమిషన్కు పూర్తి వివరాలతో కూడిన వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. హుడాకాంప్లెక్స్: సరూర్నగర్లోని దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని మంగళవారం దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుద్ధిమాంద్యం పిల్లలకు అందిస్తున్న చికిత్స, సేవలను నోడల్ ఆఫీసర్ రమేశ్, పునరావాసకేంద్రం అధికారి అతుల్ శ్రీవాస్తవ ఆయనకు వివరించారు. కేంద్రంలో అందిస్తున్న సేవా కార్యక్రమాలపై సత్యనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. తనవంతు సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు. -
‘ఒంటరి మహిళ’ సర్టిఫికెట్ వివాదాస్పదం
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట సర్పంచ్, ఉప సర్పంచ్ ఆందోళన ● రాజకీయ కక్షలో భాగమేనని మహిళ ఆరోపణ దోమ: భర్త ఉండగానే ఒంటరి మహిళ అని సర్టిఫికెట్ ఇచ్చిన రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా దిర్సంపల్లి అనుబంధ గ్రామమైన గోవింద బుడ్యానాయక్ తండాకు చెందిన చంద్యానాయక్కు కమ్లిబాయి, శాంతిబాయి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కమ్లీబాయికి స్థానిక రెవెన్యూ అధికారులు ఒంటరి మహిళ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అయితే, తమకు ఎలాంటి సమాచారం లేకుండా, రహస్యంగా పంచనామా చేసిన అధికారులు తప్పుడు సర్టిఫికెట్ జారీ చేశారని, గ్రామ సర్పంచ్ లాలీబాయి, ఉప సర్పంచ్ సోమ్లానాయక్ ఆరోపించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. ఇదిలా ఉండగా, పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్కు తాను ఓటు వేయలేదనే కక్షతోనే తనకు పింఛన్ రాకుండా అడ్డుపడుతున్నారని సదరు మహిళ ఆరోపించారు. తన భర్త రెండో వివాహం చేసుకోవడంతో 2022లోనే గ్రామ పెద్దల సమక్షంలో తాము విడిపోయామని చెప్పారు. ప్రస్తుం తన కుమారుడు, కూతురుతో కలిసి నగరంలో జీవిస్తున్నానని తెలిపారు. -
తప్పుల తడక!
కొత్త రేషన్ కార్డుల్లో తప్పుడు వివరాలు ● లబోదిబోమంటున్న లబ్ధిదారులు ● భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయని ఆవేదన వికారాబాద్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ తప్పుల తడకగా మారింది. భవిష్యత్తులో బీపీఎల్ కుటుంబాల గుర్తింపు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కీలకంగా మారుతాయని చెబుతున్న వీటి ముద్రణలో అనేక తప్పులు దొర్లడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అధికారులు ఇప్పటికే కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించగా, వీటిని అందుకున్న వారు అయోమయానికి గురవుతున్నారు. కార్డులు వచ్చిన ఆనందం, క్షణాల్లోనే ఆవిరవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా, మరో ఎనభై వేల మందికి పాత కార్డుల్లో చోటు కల్పించింది. గతంలో మాదిరిగా సాధారణ కార్డులు కాకుండా స్మార్ట్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 588 రేషన్ దుకాణాలు ఉండగా, 2,88,895 కార్డులు ఉన్నాయి. అడ్రస్లోనూ తప్పులే.. అడ్రస్ ప్రూఫ్ కోసం ఎంతగానో ఉపయోగపడే స్మార్ట్ రేషన్ కార్డులో చాలా మంది చిరునామా వివరాలు తప్పుగా ఉన్నాయి. ఒక్కో చోట గ్రామం పేరే తప్పుగా ప్రచురితమైంది. కొత్తగా ముద్రించిన రేషన్ కార్డులను మండలాల వారీగా విభజించి, తహసీల్దార్లకు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యేల సమయం తీసుకుని వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు మండలాల్లో ఇప్పటికే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవగా, మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సమయం ఇవ్వడం లేదని ప్రారంభించలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న అధికారికంగా పంపిణీ ప్రక్రియను ప్రారంభించినా, జిల్లాలో ఇప్పటి వరకు యాభై శాతం కూడా పంచలేదు. కుటుంబ పెద్దగా మహిళను పేర్కొనగా ఆమె ఫొటో కూడా ప్రింట్ చేయలేదు. ఆమె ఒక్క పేరునే కార్డుపై ఉంచారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తేనే మిగిలిన కుటుంబ సభ్యుల పేర్లు పీడీఎఫ్ రూపంలో కనిపిస్తున్నాయి. దీంతో ఈకార్డును అడ్రస్ ప్రూఫ్ కోసం పెట్టే వీలులేకుండా పోయింది. తప్పుల విషయం తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన లబ్ధిదారుల ఊరి పేరు మోత్కూర్గా ముద్రించారు. చాలా గ్రామాలకు సంబంధించిన పిన్ కోడ్ వివరాలు తప్పుగా ప్రచురితమయ్యాయి. పూడూరు మండలం తిర్మలాపూర్తండాకు చెందిన కేతావత్ గోపీచంద్ వయస్సు 35 సంవత్సరాలు కాగా కార్డులో 15 ఏళ్లుగా ఉంది. స్మార్ట్ కార్డుపై లబ్ధిదారుల ఫొటో లేకుండా కేవలం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఫోటోలు మాత్రమే ఉండటంపై విమర్శలు వినిపిన్నాయి. -
సీపీఎస్ను రద్దు చేయాలి
● పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలి ● కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ జేఏసీ నిరసన అనంతగిరి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వికారాబాద్ జిల్లా ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా అభివర్ణించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్ను రద్దు చేసి, న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పెండింగ్ ఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా ప్రఽతిఽనిధులు అజ్మత్ పాషా, సత్తార్, నర్సింలు, వెంకటరత్నం, ఆనంద్, శుక్రవర్ధన్రెడ్డి, రమేష్, బాలు, అరుణ్కుమార్, బాలకృష్ణ, శారద, శ్రీల, సీత, అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
● ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ● కొడంగల్, బొంరాస్పేట్,దౌల్తాబాద్లో పలు నిర్మాణాల పరిశీలన కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 4, 5 తేదీల్లో కొడంగల్లో పర్యటించనున్న నేపథ్యంలో సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మంగళవారం పట్టణంలోని ఆస్పత్రి భవనం, ఆర్అండ్బీ అతిథి గృహం, పాఠశాల భవనాలను పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం హెలిపాడ్ను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ దీపక్ తివారి, కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు. దేశానికే తలమానికం.. బొంరాస్పేట: హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూపుదిద్దుకుంటోందని సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్బాబు అన్నారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉమెన్ డిగ్రీ కాలేజీ, నర్సింగ్ హాస్టల్ను వచ్చే మార్చి వరకు పూర్తి చేయాలన్నారు. ఫిజియోథెరపీ, పారామెడికల్, నర్సింగ్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. ఇంజనీరింగ్, వెటర్నరీ కాలేజీ పనులను పరిశీలించారు. 35 ఎకరాల్లో నిర్మించే సైనిక్ స్కూల్పై ఆరా తీశారు. ఎత్తిపోతల కాల్వలకు రైతులు అంగీకరించారని, రేడియల్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అదనపు ఎస్పీ రాజేష్మీన, ఎస్ఈ విజయభాస్కర్ రెడ్డి, కేఎల్ఎస్ఆర్ సీజీఎం కృష్ణప్రసాద్, జీఎం హర్షవర్ధన్రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్రెడ్డి, తహసీల్దార్ కిషన్నాయక్, ఎంఈఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు చేయండి.. దౌల్తాబాద్: మండలంలో సుమారు రూ.25 కోట్లతో నిర్మిస్తున్న మహాత్మజ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతం చేసి, మార్చి నెలాఖరువరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గోకఫసల్వాద్ సమీపంలో కొనసాగుతున్న పూలే పాఠశాల, దౌల్తాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీటిని సందర్శిస్తారని తెలిపారు. అనంతరం దౌల్తాబాద్లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కానున్న దౌల్తాబాద్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట ఈడబ్ల్యూడీసీ చీఫ్ ఇంజనీర్ షఫీమియా, డీఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉసేనప్ప, నాయకులు రెడ్డిశ్రీనివాస్, భీంరెడ్డి తదితరులు ఉన్నారు. భూసేకరణలో జాప్యం తగదు.. కొడంగల్ రూరల్: కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఇండస్ట్రియల్ పార్క్, రేడియల్ రింగ్ రోడ్ల భూ సేకరణ పనులను అక్టోబర్ చివరినాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఆదేశించారు. భూసేకరణలో జాప్యం జరుగుతోందని తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కొడంగల్లో ఆస్పత్రిని పరిశీలిస్తున్న సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్హకీంపేటలో పనులను పరిశీలిస్తున్న అధికారులు -
సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట
పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్యసమావేశం నిర్వహించారు. మొత్తం 22 అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బీఆర్ఎస్ సర్పంచ్లు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో తమ పాత్రపై ప్రశ్నించారు. ప్రభుత్వం సర్పంచ్లకు ఇందిరమ్మ కమిటీలో హక్కు కల్పిస్తున్న గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో మాకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్పంచ్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు సమావేశ మందిరంలోకి వచ్చి సర్పంచ్లకు సర్ధిచెప్పారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. పలు శాఖలపై సమీక్షలో విద్యుత్ శాఖ ఏఈ హరికృష్ణపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో పరిగి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. మా పరిపాలననలో నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా తానే చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు రేషన్ స్మార్టు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథి, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎంపీడీఓ హరిప్రియారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి పార్టీ నాయకులు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాల్సిన సర్వసభ్య సమావేశంలో పార్టీ నాయకులు రావడంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇందుకు అధికారుల నిర్లక్షమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
లబ్ధిదారులకు రేషన్కార్డుల పంపిణీ
షాద్నగర్: మండల పరిధిలోని లింగారెడ్డిగూడలో గురువారం స్మార్ట్ రేషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వారు రేషన్కార్డులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగయ్య, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ఖాన్, సర్పంచ్ ప్రవీణ్, ఉపసర్పంచ్ అశోక్, నాయకులు చెంది తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ రేషన్కార్డులు కొందుర్గు: అర్హులైన పేదలందరికీ రేషన్కార్డులు అందిస్తున్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఆయన కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఆజాంఅలీ, జగదీశ్వర్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్కార్డులను పంపిణీ చేశారు. అదేవిధంగా చౌదరిగూడ ఉన్నత పాఠశాలలో ఆయన వాటర్ఫిల్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు కనీసం ఒక్క రేషన్కార్డులు ఇచ్చిన పాపన పోలేదన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుషోత్తంరెడ్డి, చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు. -
హైదరాబాద్షాలే
సాక్షి, సిటీబ్యూరో నగరంలోని ఓ కుటుంబ సగటు వార్షికాదాయం రూ.21.2 లక్షలు.. వ్యయం రూ.13.8 లక్షలు.. అప్పు రూ.3 లక్షలు.. ఆదాయంలో చేస్తున్న ఖర్చు 64.7 శాతం.. టాటా సంస్థ ‘ది మెనీ అర్బన్ ఇండియాస్’ పేరుతో నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఐటీ, ఔషధ, రియల్ ఎస్టేట్, సేవలు, వ్యాపార రంగాల విస్తరణతో శరవేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఆర్థిక బలాన్ని ఈ అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. నగర కుటుంబాలు ఎంత సంపాదిస్తున్నాయి? అందులో ఎంత ఖర్చు చేస్తున్నాయి? ఎంత పొదుపు చేస్తున్నాయి? ఎంత అప్పు తీసుకుంటున్నాయి? అనే అంశాలపై దేశ వ్యాప్తంగా ఈ అధ్యయనం జరిగింది. ఆరు ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చైన్నె, కోల్కతా, బెంగళూరులను ఈ అధ్యయనం పోల్చింది. అగ్రస్థానంలో బెంగళూరు నగరంలోని ఓ కుటుంబం సగటున ఏడాదికి రూ.21.2 లక్షల ఆదాయం ఆర్జిస్తూ ఆరు ప్రధాన నగరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరు కుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ.28.3 లక్షలతో మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రూ.25.9 లక్షలు, ముంబై రూ.24.2 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైన్నె రూ.18.9 లక్షలు, కోల్కతా రూ.16.8 లక్షలతో హైదరాబాద్ కంటే వెనుక ఉన్నాయి. సగటు ఆదాయం మాత్రమే నగర ప్రజల ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి సరిపోదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆదాయ పంపిణీని పరిశీలించినప్పుడు హైదరాబాద్ ప్రత్యేకత బయటపడుతోందని స్పష్టం చేసింది. ఖర్చు 64.7 శాతమే.. హైదరాబాద్ కుటుంబాలు తమ ఆదాయంలో సగం కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నాయి. సగటున వార్షిక ఆదాయంలో 64.7 శాతాన్ని ఖర్చు చేస్తున్నాయి. ఒక్క కుటుంబం ఏడాదికి సగటున రూ.13.8 లక్షలు వెచ్చిస్తోంది. చైన్నెలో అత్యధికంగా 67 శాతం ఆదాయం ఖర్చవుతుండగా.. కోల్కతా 59.4, ముంబై 57.9, ఢిల్లీ 56.1, బెంగళూరు 54.1 % ఖర్చు అవుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తక్కువ ఆదాయం ఉన్న నగర కుటుంబాలు తప్పనిసరిగా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తాయని చెప్పలేకపోవడం. వినియోగ అవసరాలు, జీవనశైలి, నగరంలో వస్తువులు–సేవల ధరలు వంటి అంశాల ఆధారంగా ఖర్చు తీరులో భారీ తేడాలు ఉంటాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఆదాయం రూ.21 లక్షలు.. వ్యయం 13 లక్షలు ఆహారేతర అవసరాలే అధికం ప్రధాన నగరాల్లోని కుటుంబాలు ఆహారం, ప్రాథమిక అవసరాలకే పరిమితం కాకుండా ఇళ్లకు సంబంధించిన ఖర్చులు, ఆరోగ్యం, రవాణా, విద్య, వినోదం, అందం–వ్యక్తిగత సంరక్షణ వంటి అంశాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం వ్యయంలో ఆహారంపై 29.9 శాతం, ఆహారేతర అంశాలపై 70.1 శాతం ఖర్చవుతోంది. ఆహారేతర వ్యయంలో గృహ నిర్మాణం, సంబంధిత సౌకర్యాలు, రవాణా, విద్య, ఫ్యాషన్, ఆరోగ్యం, వినోదం, అందం–వ్యక్తిగత సంరక్షణ వంటివి ఉన్నాయి. పొదుపు 35.3 శాతం హైదరాబాద్ కుటుంబాలు సగటున ఆదాయంలో 35.3 శాతాన్ని పొదుపు చేస్తున్నాయి. అంటే ఒక్క కుటుంబం ఏడాదికి సగటున రూ.7.5 లక్షలు పొదుపు చేస్తోంది. బెంగళూరు కుటుంబాలు మాత్రం 45.9 శాతం పొదుపుతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఢిల్లీ 43.9, ముంబై 42.1, కోల్కతా 40.6 శాతాలో హైదరాబాద్ కంటే ముందున్నాయి. చైన్నె 33 శాతం పొదుపుతో హైదరాబాద్ కంటే వెనుక ఉంది. దేశంలోని 100 నగరాల్లోని కుటుంబాలు సగటున తమ ఆదాయంలో 25 శాతాన్ని పొదుపు చేస్తుండగా.. ఆరు ప్రధాన నగరాల కుటుంబాలు 42 శాతం వరకు పొదుపు చేస్తున్నాయి. భాగ్యనగర కుటుంబాల ఆర్థిక ప్రణాళిక భేష్ వార్షికాదాయంలో దేశంలోనే 4వ స్థానం నగరవాసి సగటు అప్పు రూ.3 లక్షలు ‘ది మెనీ అర్బన్ ఇండియా’ సర్వేలో వెల్లడి ఆరు నగరాల్లో హైదరాబాద్ స్థానం ఇలా.. సగటు వార్షిక కుటుంబ ఆదాయం రూ.21.2 లక్షలు 4వ స్థానం సగటు వార్షిక కుటుంబ వ్యయం రూ.13.8 లక్షలు 3వ స్థానం ఆదాయంలో ఖర్చు వాటా 64.7 శాతం 2వ స్థానం వార్షిక పొదుపు రూ.7.5 లక్షలు 4వ స్థానం ఆదాయంలో పొదుపు వాటా 35.3 శాతం 4వ స్థానం రుణ–ఆదాయ నిష్పత్తి 14 శాతం అత్యల్పం సగటు కుటుంబ అప్పు రూ.3 లక్షలు అత్యల్పం వినియోగ మార్కెట్ రూ.2.9 లక్షల కోట్లు 6వ స్థానం -
విద్యుదాఘాతంతో పాడి ఆవులు మృతి
షాద్నగర్రూరల్: వైర్లు తెగిపడడంతో రెండు పాడి ఆవులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ఈ సంఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామశివారులో చోటచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఎలికట్ట గ్రామానికి చెందిన ఆర్ల అనురాధ పాడి ఆవులపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎప్పటిలాగే గురువారం ఉదయం పాలు పిండిన తరువాత తమ వ్యవసాయ పొలంలో మేతకోసం రెండు పాడి ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి విద్యుత్ తీగలు తెగి పడటంతో మృతి చెంది కనిపించాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పాడి ఆవులు మృత్యువాత పడటంతో మహిళా రైతు బోరున విలపించింది. పొలంలో చేతికి అందే ఎత్తులోనే విద్యుత్ తీగలు ఉన్నాయని, సరి చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యంగానే ఆవులు మృతి చెందాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన పాడి ఆవుల విలువ రూ.2లక్షలపైనే ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
గుడుంబా నుంచి హవాలా వరకు
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు గుడుంబా విక్రయం.. ఆ తర్వాత గంజాయి వ్యాపారం.. మొదట చిన్న స్థాయిలో మొదలైన దందా క్రమంగా భారీ నెట్వర్క్గా మారింది. అనేక ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి విక్రేతలు, వినియోగదారులకు ఆమె కేంద్రంగా మారింది. అంచెలంచెలుగా ఎదిగింది. మొదట్లో ధూల్పేట్లో కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలను ప్రారంభించిన నీతుబాయి.. ఇప్పుడు రూ.కోట్లలో అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి డాన్గా మారింది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ సిబ్బందిని లక్ష్యంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. వరుసగా కేసులు నమోదైనా, పలుమార్లు అరెస్టయినా.. పీడీ యాక్ట్ కింద నిర్బంధించినా.. ఆమె దందా మాత్రం యథావిధిగా కొనసాగడం గమనార్హం. గంజాయి విక్రయాలతో ప్రారంభించి హవాలా వ్యాపారం దిశగా సాగింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. అక్రమ వ్యాపార విస్తరణ.. నీతుబాయి స్వస్థలం ధూల్పేట్ అయినప్పటికీ, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ బాయ్లను లక్ష్యంగా చేసుకోవడానికి నానక్రామ్గూడలోని లోథాబస్తీలో ఒక చిన్న కిరాణా దుకాణం ముసుగులో విక్రయాలు ప్రారంభించింది. ధూల్పేట్కు చెందిన అంగూరిబాయి (అరుణాబాయి)తో పాటు ఒడిశా, ఏపీ సరిహద్దు ప్రాంతాల ద్వారా గంజాయి దిగుమతి చేసుకునేది. కిలో గంజాయిని రూ.8వేలకు కొనుగోలు చేసి 5 గ్రాముల చిన్న పొట్లాలుగా మార్చి, ఒక్కో పొట్లాన్ని రూ.500 కి విక్రయించేది. ఈ లెక్కన కిలోపై రూ. 50 వేల వరకు నికర లాభం ఆర్జించేది. ఆమె కుటుంబం మొత్తం కూడా ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములేననే ఎకై ్సజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. రోజుకు సగటున రూ.10 లక్షల విక్రయాలు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అమ్మకాలు జరిగేవని ఎకై ్సజ్ అధికారుల దాడుల్లో తేలింది. నీతుబాయిపై 18కి పైగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. గతంలో గచ్చిబౌలి పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2024లో నిర్వహించిన దాడిలో 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నీతుబాయి నేరపూరిత సంపాదనపై ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎఎల్ఏ చట్టం కింద మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి, నానక్రామ్గూడలోని ఇంట్లో సోదాలు నిర్వహించింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆమె వ్యాపారాన్ని విస్తరించినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఇక్కడి నైట్లైఫ్ కూడా ఇందుకు దోహదం చేసినట్లు చెప్పారు. -
మహాసభలను విజయవంతం చేయాలి
షాబాద్: ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ అన్నారు. గురువారం మండల పరిధిలోని నాగర్గూడ పీఎస్ఆర్ గార్డెన్లో ఎమ్మార్పీఎస్ మండల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదలకు, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. మహనీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలను గుర్తించి ఉద్యమా లు చేపట్టాలని సూచించారు. గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని బలోపేత చేయాలన్నా రు. ఈ నెల 9న వరంగల్లో జరిగే జాతీయ మహా సభకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏట్లఎర్రవల్లి సర్పంచ్ శంకర్, ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఎన్నిక మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఉపేందర్ మాదిగ తెలిపారు. అధ్యక్షుడిగా మల్కి ప్రవీణ్, అధికార ప్రతినిధిగా ఎస్. రమేశ్, ప్రధాన కార్యదర్శిగా జే.ఆనందం, ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా ఎంఎస్పీ మండల కమిటీ అధ్యక్షుడిగా అశో క్, అధికార ప్రతినిధిగా యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా దయాకర్ను ఎన్నుకున్నారు. ఎంఎస్ఎఫ్ మండల కమిటీ అధ్యక్షుడిగా నర్సింలు, అధికార ప్రతినిధిగా ఎం.అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, జగన్ తదితరులను ఎన్నుకున్నారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
యాలాల: కాగ్నా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను గురువారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. తాండూరు – కొడంగల్ మార్గంలో ఇసుక లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ను ఆపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని గుర్తించి వాహనాన్ని సీజ్ చేసి పీఎస్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అసభ్యకర ప్రవర్తన.. కేసు నమోదు యాచారం: కూలీ పని ఇప్పిస్తానని చెప్పి..అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాలివీ.. నాగార్జునసాగర్ హైవేపై తుర్కయంజాల్ అడ్డాపై కూలీ పని కోసం వేచి ఉన్న ఓ మహిళను మార్బుల్ పని ఉందని నమ్మించిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం తన మోటార్సైకిల్పై ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి యాచారం మండల పరిధిలోని తాడిపర్తి అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి డబ్బులిస్తానని చెప్పి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి మోటార్ సైకిల్పై పరారయ్యాడు. వెంటనే ఆ మహిళ 112కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. స్పందించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు అక్కడికి వెళ్లి కుర్మిద్దలోని పీఎస్కు తీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. కుల్కచర్ల: ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకులు పోరాటం పేరుతో డ్రామాలు చేస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్లలో విలేకరులతో మాట్లాడారు. అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు పోరాటాల పేరుతో బయటకు వచ్చారని అన్నారు. ఇన్ని రోజులు ప్రజలు గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. ఒకరి మృతి, మరొకరికి గాయాలు ఇబ్రహీంపట్నం రూరల్: ఇనుప రాడ్లతో వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరి తీవ్ర గాయాలైన సంఘటన ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఏపీ నంద్యాల జిల్లా డోన్ మండలం దేవరబండ గ్రామానికి చెందిన కోటకొండ శివ (22), నాగేశ్వరావుతో కలిసి బొలేరో వాహనంలో గురువారం కూరగాయల లోడ్తో డోన్ నుంచి ఔటర్రింగ్రోడ్డు మీదుగా వరంగల్ జిల్లా పరకాల వైపు వెళ్తున్నారు. ఎగ్జిట్13 రావిర్యాల వద్దకు రాగానే ఇనుప రాడ్లతో వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న శివ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ పక్కనే ఉన్న నాగేశ్వర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పహాడీషరీఫ్: బ్లాక్ మార్కెట్కు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై పహాడీషరీఫ్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ బీఎల్ఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్నుమా అచ్చిరెడ్డినగర్ కాలనీకి చెందిన మహ్మద్ నహీద్ (30) గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం, గోధుమలను కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విక్రయించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే రెండు పర్యాయాలు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయయి. ఇతనిపై పీడీ యాక్ట్ కోరుతూ పహాడీషరీఫ్ పోలీసులు పంపిన ప్రతిపాదనకు నగర పోలీస్ కమిషనర్ ఆమోదం తెలిపారు. వివాహిత మృతి తాండూరు టౌన్: పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో నివాసముంటున్న ఓ వివాహిత గురువారం మృతి చెందింది. సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణ్పేట్ జిల్లా రాయకోడ్కు చెందిన మమత(23)కు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన లారీ డ్రైవర్ ఉప్పరి అనిల్తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. గురువారం ఉదయం మృతురాలి అత్త ఎంత పిలిచినా లేవకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు తాండూరుకు చేరుకున్నారు. తన కూతురు ఎలా మృతి చెందిందో దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. -
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
షాద్నగర్: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి అన్నారు. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలోని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కొప్పునూరి శ్రీశైలం పదవీ విరమణ కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని కేకేఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాలశ్రవణ్ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీశైలం దంపతులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమన్నారు. విద్యారంగాభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శశిరేఖ యాదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి -
ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిది
పరిగి: ఉత్తమంగా విధులు నిర్వహించిన ఉద్యోగులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ నాయక్ అన్నారు. చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామపరిధి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రత్యేకాధికారి బసప్ప సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా బసప్పను సన్మానించి మాట్లాడారు. సమాజంలో వెలకట్టలేనిది ఒక్క ఉపాధ్యాయ వృత్తేనని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంచందర్, వసతిగృహ ప్రత్యేకాధికారులు రాజన్న, రాజు, బాలవరలక్ష్మి, సబితారాణి, గోవింద్, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకిరాం, టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు ఘణపురం వెంకటయ్య, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, అంబేడ్కర్ సంఘం మండల నాయకులు అశోక్కుమార్, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మొయినాబాద్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీశ్ హెచ్చరించారు. సోమవారం మొయినాబాద్ బస్టాప్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, రోడ్లు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ను ఉపయోగించాలన్నారు. పాదచారులు రహదారికి ఎడమవైపునే నడవాలని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని.. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, ప్రమాదకరమైన ఓవర్టెక్లు చేయొద్దన్నారు. మద్యం సేవించి, మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని చెప్పారు. ఈ నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంగించినవారిపై కేసులు నమోదు చేశారు. చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీశ్ -
మిల్లర్ల మాయాజాలం!
వికారాబాద్: ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు బియ్యంగా మార్చే ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మిల్లర్లకు అధికారులు, నేతలు కొమ్ము కాస్తుండటంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పో తోంది. ఏటా ఏదో ఒక మిల్లులో అక్రమాలు వెలు గు చూస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బొంరాస్పేట మండ లం కేతకీ సంగమేశ్వర రైస్ మిల్లులో రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బియ్యం తిరిగి ఇవ్వడంలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం వీరికి కేటాయించిన ధాన్యం కానీ, ఆడించిన బియ్యం కానీ మిల్లులో కనిపించలేదు. సీఎంఆర్ను బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కూడా ఇదే తరహాలో పలు చోట్ల అవకతవకలకు జరగ్గా అధికారులు కేసులతో సరి పెట్టారు. రికవరీ జోలికి వెళ్లలేదు. దోమ, బషీరాబాద్, యాలాల మండలాలల్లో కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లు మాయం చేశారు. యజమానులను రిమాండ్ చేసేరే తప్ప తదుపరి చర్యలు చేపట్టలేదు. దోమ మండలం మోత్కూర్ గేట్ సమీపంలోని మహాలక్ష్మి రైస్ మిల్లులో ఇటీవల విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. 2022 ఏడాదికి సంబంధించి ధాన్యం బకాయిలు రూ.17.5 కోట్లు నేటికీ చెల్లించలేదని తెలింది. వికారాబాద్ మండలం ధన్నారం సమీపంలోని ఓ రైస్ మిల్లు యజమానులు సైతం రూ.22.5 కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తీవ్ర జాప్యం ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాల ద్వారా వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోంది. వడ్లను మిల్లులకు కేటాయించి సీఎంఆర్ రూపంలో తిరిగి తీసు కుంటుంది. అయితే ఆడించిన బియ్యం తిరిగి ఇవ్వడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి.. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని బయట రూ.2,200 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. బహిరంగ మా ర్కెట్లో క్వింటాలు రూ.900 నుంచి రూ.1,200 ల కు లభించే తక్కువ రకం బియ్యాన్ని కొనుగోలు చే సి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మిల్లర్లు క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు అక్రమంగా లాభం పొందుతున్నారు. కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు. మిల్లర్లతో అధికారుల కుమ్మక్కు రైస్ మిల్లర్లతో సివిల్ సప్లయ్ అధికారులు కుమ్మక్కు కావటంతో వారి నుంచి సీఎంఆర్ సకాలంలో అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. భారీ అక్రమాలు జరిగినట్లు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరి సు న్నారు. గడువులోగా సీఎంఆర్ సేకరించాలని ప్రభు త్వం పదే పదే చెబుతున్నా అధికారులు మా త్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గతంలో ఇచ్చిన ధాన్యం సగానికిపైగా మిల్లర్ల వద్దే ఉంది. గతంలో కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక వడ్ల ను నేరుగా మిల్లులకు తరలించారు. ఇదే అదునుగా భావించిన మిల్లు యజమానులు రైతుల వద్ద క్వింటాలుకు 6 నుంచి 10 కిలోలు తరుగు రూపంలో కోత విధించారు. ఈ విషయమై రైతులు మిల్లుల ముందు ఆందోళన కూడా చేశారు. నేతల చేతుల్లో మెజార్టీ మిల్లులు జిల్లాలో ఏడు బాయిల్డ్ రైస్ మిల్లులు.. 23 రా రైస్ మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం సేకరించిన వడ్లను ఈ మిల్లులకే తరలిస్తారు. మెజార్టీ మిల్లులు నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉన్నారు. ప్రస్తుతం రారైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా అధికార పార్టీ నాయకుడు ఉండగా.. బాయిల్డ్ మిల్లర్ల అసోసియోషన్ అధ్యక్షుడుగా మరో పార్టీకి చెందిన నాయకుడు ఉన్నారు. వీరు మిల్లర్లకు అండగా నిలుస్తున్నట్లు సమాచారం. -
చోరీ సొత్తు స్వాధీనం
తాండూరు టౌన్: ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన నిందితున్ని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చెరువెంటి ఈశ్వరాలయం సమీపంలో నివాసం ఉంటున్న పట్లోళ ఉమాదేవి ఇంటికి శనివారం గతంలో ఆమె వద్ద పనిచేసిన పనిమనిషి భర్త మొగులప్పతో పాటు మరో వ్యక్తి వచ్చారు. ఆమె మెడకు చీరకొంగు బిగించి, స్పృహ తప్పిన తర్వాత మెడలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన విషయం విధితమే. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే ఇద్దరు నిందితుల్లో ఒకరైన సంజీవ్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఐదున్నర తులాల మంగళసూత్రం, నల్లపూసల దండను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు మొగులప్ప పరారీ ఉన్నట్లు చెప్పారు. సంజీవ్ను రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు -
‘చేయూత’కు 14,167 దరఖాస్తులు
జిల్లాలో కొత్త పింఛన్ల కోసం వెల్లువెత్తిన అర్జీలుగడువు పొడిగింపు బషీరాబాద్: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎంతన్నది తేలింది. జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 14,167 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం పెట్టిన గడువు సోమవారంతో ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 10,090మంది వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మరో 4,077 మంది వివిధ కేటగిరీల్లో అర్జీలు సమర్పించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో వితంతువులు ఎక్కువగా ఉన్నారు. కుటుంబ ఆధారం లేని ఒంటరి మహిళల నుంచి 827, దివ్యాంగుల నుంచి 2,852, నేత కార్మికుల నుంచి 20, గీత కార్మికుల నుంచి 378 అర్జీలు వచ్చాయి. అధికారులు వీటిని ఆన్లైన్లో నమోదు చేశారు. తాండూరు మున్సిపాలిటీతో పాటు తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే తాండూరు నుంచి 4,657 దరఖాస్తులతో మొదటి స్థానంలో నిలిచింది. పరిగిలో 3,949, వికారాబాద్లో 2,905, కొడంగల్లో 2,656 అర్జీలు నమోదయ్యాయి. వితంతు పింఛన్లకు తాండూరు నుంచి 3,381, పరిగి నుంచి 2,684, వికారాబాద్ నుంచి 2,081, కొడంగల్ నుంచి 1,944 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే 1.07లక్షల మందికి.. జిల్లాలో ఇప్పటికే 1,07,113 చేయూత పింఛన్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 48,508 వితంతు పింఛన్లు ఇస్తున్నారు. తాజాగా మరో 10,090 మంది దరఖాస్తు చేసుకోవడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ‘వృద్ధాప్య’ పింఛన్కు కొత్త అర్జీలు లేవు జిల్లాలో ఇప్పటికే సుమారు 40 వేల మందికి వద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. ఈసారి ప్రభుత్వం వద్ధాప్య పింఛన్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించలేదు. నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వద్ధాప్య పింఛన్ పొందే అవకాశం ఉంది. భార్య లేదా భర్త మరణించిన సందర్భంలో.. ఆ కుటుంబంలో అర్హత ఉన్న మరో వ్యక్తికి పింఛన్ను బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడగించింది. ఆగస్టు 31తో గడువు ముగియగా లబ్ధిదారుల సౌకర్యార్థం మరో 15 రోజుల పాటు పొడగిస్తూ సెర్ఫ్ సీఈఓ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.


