breaking news
Vikarabad District Latest News
-
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
యాలాల: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను యాలాల పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాగాయిపల్లి సమీపంలో ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసుల రాకను గుర్తించి ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. వాహనాన్ని పీఎస్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ధారూరు: మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు గౌరప్ప శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాలీబాల్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్లోళ్ల రాములు ఆయనకు పార్టీ ఖండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పి.బసప్ప, నాయకులు చాంద్పాషా, వీరేశం తదితరులు పాల్గొన్నారు. బొంరాస్పేట: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఢిల్లెం పల్లెం ప్రదర్శనలో పాల్గొన్న మండలంలోని తుంకిమెట్లకు చెందిన డోలు కళాకారుడు జోగు మల్లేశ్గౌడ్ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. మల్లేశ్ ప్రదర్శన గ్రామానికి గర్వకారమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నర్సింలు, నాయకులు నాగూరావు, బాబయ్య నాయుడు, అనిల్కమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పహాడీషరీఫ్: తండ్రి మందలించడంతో యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన పబ్బు నారాయణ కుమార్తె మనీష (21) శంషాబాద్ విమానాశ్రయంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. జాబ్ మానేయాలని ఈ నెల 26న తండ్రి మందలించాడు. దీంతో అదేరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన ఆమె, హాస్టల్లో ఉన్నానని తన సోదరికి రాత్రి మెసేజ్ పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. ఈ విషయమై ఆమె తండ్రి గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ ఠాణాలో గానీ, 87126 62367 నంబర్లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. శంషాబాద్ రూరల్: శ్రీ భగవద్రామానుజలకు అభిషేకంతో ముచ్చింతల్లో సమతాకుంభ్ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రం ఆవరణలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలకు అంకురారోపణ జరిగింది. శ్రీ భగవద్రామానుజుల సువర్ణ మూర్తికి జీయర్స్వామి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విశిష్టతను తెలియజేశారు. అహోబిల జీయర్స్వామి తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో మూగజీవాలు జాగ్రత్త
మొయినాబాద్ రూరల్: వేసవి కాలంలో పాడి పశువులతో పాటు మూగ జీవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని రంగారెడ్డి జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ వైద్యుడు డాక్టర్ శ్రీకర్రెడ్డి, పశువైద్య అధికారి దేవిరెడ్డి, మండల సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి రాజేందర్రెడ్డి సూచించారు. కాశీంబౌలి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన నదీమ్నగర్లో శుక్రవారం పాడిపశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్యాదవ్, పశువైద్యాధికారి దేవిరెడ్డి, మండల పశువైద్యాధికారి డాక్టర్ అహ్మద్, గోపాలమిత్ర సూపర్ వైజర్ వెంకటేశ్, శ్రీను, బాలకృష్ణ, యాదయ్య, పశువైద్య సిబ్బంది రవి, రైతులు పాల్గొన్నారు. -
అసైన్డ్ భూముల సర్వే
యాచారం: ఫార్మాసిటీ భూసేకరణలో నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల్లో భూసేకరణ చేయకుండా వదిలేసిన సర్వే నంబర్లల్లోని భూమిని సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఆర్ఐ మురళి ఆధ్వర్యంలో శుక్రవారం నక్కర్తమేడిపల్లిలోని సర్వేనంబరు 430 లోని అసైన్డ్ భూమిని సర్వే నిర్వహించారు. ఈ సర్వేనంబర్లో 39 ఎకరాల భూమి ఉంటుంది. అసైన్డ్ సర్టిఫికెట్లు పొందిన రైతుల వివరాలతో కూడిన కబ్జాను సర్వే చేశారు. కుర్మిద్దలోని 309, 328 సర్వేనంబర్లల్లోని అసైన్డ్ భూమిని సర్వే చేయనున్నారు. ఈ రెండు సర్వే నంబర్లల్లో కేవలం 30 ఎకరాల వరకే భూమి ఉంటుంది. సర్వే చేసి కబ్జా రైతుల వివరాలను గుర్తిస్తారు. రెండు గ్రామాల్లో సర్వే చేసే అసైన్డ్ భూమికి ప్రస్తుతం ఏ మేరకు పరిహారం చెల్లిస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఫార్మాసిటీ భూసేకరణ సమయంలో అసైన్డ్ భూములు ఎకరాకు రూ.8లక్షలు, కబ్జాలో ఉన్న రైతులకు ఎకరాకు రూ.7.70 లక్షల పరిహారం చెల్లించారు. ప్రస్తుతం సర్వే చేసే భూములకు గతంలోని పరిహారాన్నే చెల్లిస్తారా.. లేదా పరిహారం పెంచి ఇస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పరిహారంపై స్పష్టత కరువు -
అభివృద్ధే కాంగ్రెస్ నినాదం
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని 12 వార్డులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అప్పాయిపల్లికి అగ్రికల్చర్ యూనివర్సిటీ మంజూరైనట్లు తెలిపారు. హుస్సేన్పూర్లో 300 ఎకరాల భూ సేకరణ చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధర్మాపూర్ శివారులో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కసరత్తు జరుగుతోందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్లతో చర్చించి సమన్వయంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎవరికి అపోహలు వద్దని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మహ్మద్ యూసూఫ్, నయీమ్, మురహరి వశిష్ట, ఆసీఫ్ఖాన్, దాము, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి రోజు జోరుగా..
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డులకు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో ఉదయం నుంచే అభ్యర్థులు తరలివచ్చారు. సాయంత్రం 5గంటల వరకు కేంద్రంలో ఉన్న వారి నుంచి అధికారులు పత్రాలు స్వీకరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు బీ ఫామ్లు లేకుండా నామినేషన్లు వేశారు. ఆయా పార్టీలు బీఫామ్లు ఎవరికి ఇస్తాయో వేచి చూడాలి. నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి.రవి పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ అనుచరులతో వచ్చి నామినేషన్ వేశారు. చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న గడ్డం అనన్య రెండు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేయగా, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి 10వ వార్డు నుంచి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్కుమార్ 18వ వార్డు నుంచి, మాజీ కౌన్సిలర్ లక్ష్మికాంత్రెడ్డి ఆలంపల్లి నుంచి నామినేషన్లు వేశారు. కొడంగల్లో.. కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలోని 12 వా ర్డులకు గాను శుక్రవారం 52 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు ఒక్కటి కూడా రా లేదు. రెండో రోజు 20, చివరి రోజు 52తో మొత్తం 72 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామినేష న్ పత్రాలు సమర్పించిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ తదితరులు ఉన్నారు. తాండూరు టౌన్లో.. తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నామినేషన్ల సమర్పణకు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు 28న 11 మంది, 29న 94 మంది, 30న 85 మంది మొత్తం 190 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో బీఎస్పీ ఒకటి, ఎంఐఎం 16, బిజెపి 49, కాంగ్రెస్ 88, బిఆర్ఎస్ 96, ఇతరులు 8, స్వతంత్రులు 15 సెట్ల నామినేషన్లు సమర్పించారు. వీరిలో బిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల న ర్సింహులు, పట్లోళ్ల దీప దంపతులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జి శ్రీశైల్ రెడ్డితో కలిసి డప్పువాయిద్యాల నడుమ ఊరేగింపుగా నామినేషన్ కేంద్రానికి వచ్చారు. పట్లోళ్ల నర్సింహులు 10వ వార్డుకు, ఆయన సతీమణి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీప 9వ వార్డుకు బిఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. కొట్రిక నాగలక్ష్మి 24వ వార్డుకు నామినేషన్ వేశారు. మరో వైపు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి పట్లోళ్ల బాల్రెడ్డి 12వ వార్డుకు, బంటు వేణుగోపాల్ 11వ వార్డుకు, గౌరి రాములు 18వ వార్డుకు, 8వ వార్డుకు సాయప్ప, 20వ వార్డుకు బిర్కట్ జ్యోతి, మరికొందరు కూడా పలు వార్డులకు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్కుమార్తో కలిసి పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 11వ వార్డులో ఇందూరు రాములు, 24వ లో సాహు శ్రీలత, ఆరులో దోమ కృష్ణ, 31లో అరవింద్, తొమ్మిదిలో విజయశాంతి తదితరులు నామినేషన్ వేశారు. అంతే కాకుండా పలువురు ఎంఐఎం అభ్యర్థులు సైతం పలు వార్డులకు నామినేషన్లు వేశారు. కాగా నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ బీఆర్ నాయక్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు అమ్రయ్య, సాజిద్ బందోబస్తులో ఉన్నారు. అభ్యర్థులకు మద్దతుగా నేతలు పరిగి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా పలువురు నేతలు తమ అభ్యర్థులకు మద్దతుగా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ బలపర్చిన వారితో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, బీజేపీ కేండెట్లతో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్లు వేయించారు. నామినేషన్ల దాఖలు -
కాషాయ జెండా ఎగురవేస్తాం
తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం చివరి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 32 స్థానాల్లో పోటీకి దిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ దౌర్జన్యం పెచ్చుమీరిందని, వారికి సరైన అభ్యర్థులు దొరకడం లేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయించారని ఆరోపించారు. పట్టణంలో 14వేలకు పైగా మైనార్టీ ఓటర్లను కొత్తగాఓటరు లిస్టులో చేర్పించారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారన్నారు. 36 వార్డులకు గాను 18కి పైగా స్థానాలను బీజేపీ కై వసం చేసుకుని కాషాయజెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎన్నికల ఇన్చార్జ్, నాయకులు బాలేశ్వర్ గుప్తా, మల్లేశం, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రోహిత్రెడ్డీ.. డ్రామాలు మానుకో!
తాండూరు: రెండేళ్ల తర్వాత తాండూరుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి రాజకీయ డ్రామాలకు తెర లేపారని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ సెంటర్కు వెళ్లారు. 36 మందితో నామినేషన్ వేయించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తాండూరు మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. రోహిత్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విషయం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని, ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మానుకోవాలని హితవు పలికారు. 36 వార్డుల్లో 30కి పైగా కై వసం చేసుకుంటామన్నారు. రోహిత్రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. 4వ వార్డుకు చెందిన అంజద్ఖాన్ను కిడ్నాప్ చేశామనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాము రూ.40 లక్షలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. -
అర్ధరాత్రి హైడ్రామా
తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అభ్యర్థిని బుధవారం రాత్రి కిడ్నాప్ చేసి భయాందోళనకు గురిచేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. తాండూరు పట్టణంలోని 3వ వార్డులో బీఆర్ఎస్ తరుఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన అమ్జద్ఖాన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కిడ్నాప్ చేయించి 24 గంటల పాటు తన క్యాంపు కార్యాలయంలో బంధించారన్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరాలని, లేకుంటే నీ వ్యాపారాలను నాశనం చేస్తామని భయపెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా అమ్జద్ఖాన్ మెడలో బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పి, రూ.40 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. కిడ్నాప్ నుంచి మొదట బయట పడాలనే ఉద్దేశంతో నగదు అక్కడే వదిలి కండువా మాత్రం కప్పుకుని ఆయన బయట పడ్డారన్నారు. గురువారం రాత్రి నేరుగా తన వద్దకు వచ్చి కిడ్నాప్ విషయాన్ని చెప్పాడని వివరించారు. తిరిగి గులాబీ కండువా కప్పుకుని, శుక్రవారం అదే 3వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేశాడని రోహిత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు. -
ముళ్ల పొదల్లో పసికందు మృతదేహం
అనంతగిరి: నెలన్నర పసికందును ముళ్ల పొదల్లో పడేసిన ఘటన వికారాబాద్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్ పరిసరాల్లోని ముళ్లపొదల్లో మగశిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాబును పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. మృతశిశువును వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా, పసికందు బతికి ఉండగానే ఇక్కడ పడేశారా..? చనిపోయాక పడేశారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుకుమార్ తెలిపారు. అవగాహన కల్పించండి అనంతగిరి: మహిళా సమాఖ్య విధి విధానాలు, వాటి బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని డీఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. వికారాబాద్లోని జిల్లా మహిళా సమాఖ్యలో మహబూబ్నగర్ మహా సమాఖ్య నుంచి వచ్చిన సీనియర్ సీఆర్పీలకు పది రోజులుగా శిక్షణ ఇచ్చారు. -
దరఖాస్తు చేసుకోండి
మోమిన్పేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొంటున్న ఎస్సీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మర్పల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ తుల్జారాం గౌడ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మోమిన్పేట, మర్పల్లి, బంట్వారం, కోట్పల్లి మండలాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, మోమిన్పేట ఎస్సీ హాస్టల్ వార్టెన్ జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: మున్సి పల్ ఎన్నికలు స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా.. శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తోందని ఎస్పీ స్నేహ మెహ్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం, అవాస్తవాల వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. తప్పుడు సమాచారం చేరవేసినా, రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలు విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్నారు. యువత, సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని కోరారు. పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి బొంరాస్పేట: ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి సదానందం అన్నారు. శుక్రవారం మండలంలోని దుప్చర్లలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించడం మేలన్నారు. పశువులకు సోకే వ్యాధులు, మందుల వాడకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి ప్రమీల, సర్పంచ్ పట్లోళ్ల మల్రెడ్డి, ఉపసర్పంచ్ దానని గోపాల్, సూపర్వైజర్ కేశవులు, గోపాల మిత్రలు విశ్వనాథం, బాల్రాజ్గౌడ్, మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి పరిగి: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి సూచించారు. శుక్రవారం పరిగి మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 5గంటల లోపు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, తహసీల్దార్ వెంకటేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
పరిగి: భవిష్యత్తు, జీవితం ఎలా ఉంటుందోననే ఆందోళనతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి వసతి గృహంలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం పరిగిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం పాషాపూర్తండాకు చెందిన సంతోష్రాథోడ్(20) పట్టణంలోని తుంకుల్గడ్డ గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ, ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం విద్యార్థులు టిఫిన్కు వెళ్లగా, సంతోష్ మాత్రం రాలేదు. తిరిగి వచ్చిన స్నేహితులకు సంతోష్ వాంతులు చేసుకుంటూ కనిపించడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగినట్లు ఆస్పత్రిలో చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం వికారాబాద్లోని పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. హాస్టల్ వార్డెన్ శంకర్ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించా రు.తన భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయంతో, తెల్లవారుజామున ఆత్మహత్యయత్నానికి పా ల్పడినట్టు సంతోష్ వారికి చెప్పాడు.విద్యార్థి చికిత్స పొందుతుండగానే న్యాయమూర్తి అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు వార్డెన్ తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంతోష్ను నిమ్స్ కు తరలించారు.ఇంత జరిగినా వార్డెన్ హాస్టల్లో అందుబాటులో లేరని,అంతా జరిగిన తర్వాత ఆస్పత్రికి వచ్చారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బీజేపీ గెలుపు ఖాయం
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ప్రధాని మోదీతోనే అభివృద్ధి సాధ్య మని పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్లోని మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్లు వేసేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థులను ఆయన పలకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందన్నారు. మున్సి పాలిటీలకు, పంచాయతీలకు కేంద్రం నుంచే నిధులు వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా మోదీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ బంగారు శ్రుతి, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
మర్పల్లి: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మండల పరిధిలోని బిల్కల్లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చేరాల నర్సింలు (39) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. మూడు నెలలుగా తన ప్రియురాలితో నర్సింలు కొంత దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆమె తరచూ నర్సింలుకు ఫోన్ చేస్తోంది. నర్సింలు ఆమెతో మాట్లాడుతుండగా భార్య వసంత ఫోన్ లాక్కుని హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింలు ప్రియురాలు వసంతను దుర్భాషలాడింది. నిన్ను చంపి, నీభర్తతోనే ఉంటానని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసిన నర్సింలు పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. ఉదయం పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో వసంత ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. కొద్ది సమయం తర్వాత గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో నర్సింలు విగత జీవిగా, రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందింది. డాగ్స్క్వాడ్తో తనిఖీలు విషయం తెలుసుకున్న మర్పల్లి ఎస్ఐ రవూఫ్, మోమిన్పేట్ సీఐ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేయగా ఘటనా స్థలం వద్ద పలు బండరాళ్లను గుర్తించారు. అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ వెంచర్ వద్దకు వెళ్లిన జాగిలం అక్కడే ఆగిపోయింది. కుటుంబీకుల ఆందోళన నిందితులను గుర్తించే వరకూ శవాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని మృతుడి బంధవులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో బాడీని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య వసంత, కుమారులు సాయికృష్ణ, శ్రీహరి ఉన్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బేగరి నర్సమ్మ, ఆమె భర్త పాపయ్య కలిసి తన భర్తను బండరాళ్లతో కొట్టి హత్య చేశారని వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. బిల్కల్ గ్రామంలో ఘటన -
కలెక్టరేట్లో మీడియా పాయింట్
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వార్తలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీపీఆర్ఓ కార్యాలయంలో మీడియా పాయింట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే రాజకీయ వార్తలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. దినపత్రికలు, స్థానిక ఛానళ్లలో వచ్చే వార్తలను నిశితంగా గమనించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సుధీర్, రాజేశ్వరి, ఆర్డీఓ వాసుచంద్ర, డీపీఆర్ఓ చెన్నమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, అసిస్టెంట్ పీఆర్ఓ ప్రభాకర్, తహసీల్దార్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేస్తా
అనంతగిరి: ప్రజా సేవ చేసేందుకు అవకాశం ఇస్తే అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్లోని అనంతగిరిపల్లి 10 వార్డులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10వ వార్డు ప్రజలు తనకు అవకాశం ఇస్తే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వెనకబాటుకు కారణం వారే
ఆమనగల్లు: బీఆర్ఎస్తోనే ఆమనగల్లు అభివృద్ధి సాధ్యమని గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్చార్జ్ రజినిసాయిచంద్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రాము, శ్వేత, విఠాయిపల్లికి చెందిన బీజేపీ నాయకుడు జగదీశ్వర్, పద్మ దంపతులు గురువారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆమనగల్లు వెనకబాటుకు కారకులను గుర్తించి ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మున్సిపాలిటీకి రూ.100 కోట్లు తెచ్చి, అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ హయాంలో మంజూరైన పనులకు ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీ వెనుకబాటుకు బీజేపీ నేతలే కారణమని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించి, మార్పు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జీఎల్ఎన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నిర్మల శ్రీశైలంగౌడ్, అనురాధ, నిరంజన్గౌడ్, సయ్యద్ ఖలీల్, శ్రీశైలంగౌడ్, నాలాపురం శ్రీనివాస్రెడ్డి, అర్జున్రావ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హాయంలోనే ఆమనగల్లు అభివృద్ధి రజనీసాయిచంద్, జైపాల్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ పిలుపు గులాబీ గూటికి పలువురు నేతలు -
బరిలో ఉన్నత విద్యావంతురాలు
● బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కవితరాంచంద్రయ్య ● వికారాబాద్ 21వ వార్డు నుంచి పోటీ అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామయ్యగూడ ఎంఐజీ 21వ వార్డు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కవితారాంచంద్రయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎంఏ, పీహెచ్డీ(సోషియాలజీ) చదివిన ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోదీ ఆలోచనా విధానాలకు ఆకర్షితురాలై ఆపార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఏకై క లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టంచేశారు. వార్డు ప్రజలందరూ ఆదరించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
బీజేపీలోకి ముకుంద నాగేశ్
● ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సమక్షంలో చేరిక ● పార్టీ బలోపేతం, అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని వెల్లడి పరిగి: తెలంగాణ ఉద్యమ నేత, జేఏసీ రాష్ట్ర నాయకుడు ముకుంద నాగేష్ గురువారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. పదిహేనేళ్లుగా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ఆయన బీజేపీ నుంచి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు మున్సిపల్ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టంచేశారు. పరిగి ఎన్నికల్లో బీజేపీ కీలక భూమిక పోషించనుందన్నారు. ఎంపీని కలిసిన వారిలో బీజేపీ నాయకులు కరణం ప్రహ్లాద్రావు, వెన్న ఈశ్వరప్ప, మారుతికిరణ్, శరత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆచితూచి అడుగులు
వికారాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఇరు పార్టీల ముఖ్య నేతలు వేచి చూసే ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఆయా వార్డుల్లో సాధారణ కౌన్సిలర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కొంత వరకు ప్రకటించగా చైర్ పర్సన్ అభ్యర్థుల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తాండూరులో మాత్రం బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ వైస్ చైర్పర్సన్ భర్త నర్సింహులు మొదటి రోజే తన నామినేషన్ను దాఖలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. పరిగిలోనూ చైర్మన్ అభ్యర్థి ఎవరనే విషయంలో తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు శివన్నొళ్ల భాస్కర్ తన సతీమణిని 4వ వార్డు నుంచి బరిలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. వికారాబాద్లో ఇరు పార్టీల నుంచి ముఖ్య నేతల వారసులు బరిలో ఉంటారనే ఊహాగానాల మధ్య రాజకీయం వేడెక్కినప్పటికీ ఇప్పటి వరకు ఏ పార్టీ కూ డా తమ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనేది చెప్పలేదు. వార్డుల విషయంలోనూ.. చైర్మన్ అభ్యర్థుల తరహాలోనే వార్డుల విషయంలోనూ వేచి చూసూ ధోరణి కనిపిస్తోంది. ఫలానా వార్డులో ఫలానా నాయకుడికి టికెట్ ఇద్దామని ముఖ్య నేతలు మనసులో ఫిక్స్ అయినా బయటకు మాత్రం చెప్పడం లేదు. ఒకే పార్టీ నుంచి ఒకే వార్డుకు ఒకటి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ముందుగానే ప్రకటిస్తే టికెట్ ఆశించి భంగపడిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేసే ప్రమాదం ఉండటంతో నేతలు ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. బీఆర్ఎస్లో ఇప్పటి వరకు చైర్మన్ అభ్యర్థి ఎవరనే విషయంలో రెండు మున్సిపాలిటీల్లో స్పష్టత రాగా అధికా ర కాంగ్రె స్లో అన్ని మున్సిపాలిటీల్లో నూ డోలాయమానంలోనే ఉండి పో యింది. మరోవైపు బీజే పీ ఇప్పటి వర కు ఎలాంటి కార్చా చరణ కూడా ప్రారంభించలేదు. అన్ని పార్టీలు వేచి చూసే ధోరణి అవలంబిస్తుండటంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తే వార్డుల్లో పర్యటించి తమకు అనుకూల వాతావరణం కల్పించుకునేందుకు వీలవుతుందని.. లేదంటే సమయం సరిపోక ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావనలో ఉన్నారు. ఆ వార్డులే కీలకంమున్సిపల్ పీఠం కై వసం చేసుకునే విషయంలో వార్డులే కీలకం. చైర్పర్సన్ అభ్యర్థులు పోటీ చేసేందుకు వీలున్న వార్డులు మరింత ప్రాధాన్యంగా మారనున్నాయి. దీంతో పార్టీలు సైతం ఆ వార్డులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అలాంటి వార్డుల్లో ఆయా సామాజిక వర్గాలకు చెందిన బలమైన నేతలను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొడంగల్ పురపాలిక జనరల్ కాగా 4, 6వ వార్డులు అన్ రిజర్వ్ వార్డులుగా ఉన్నాయి. ఇక్కడ ఓసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలో దింపేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి వర్గానికి చెందిన ప్రశాంత్ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరు భావిస్తుండగా గురునాథ్ రెడ్డి వర్గం సపోర్టు చేస్తుందా..? లేదా అనే ఆత్మరక్షణలో పడిపోయి ప్రకటించేందుకు వెనకాడుతున్నట్టు సమాచారం. పరిగి మున్సిపల్ బీసీ మహిళకు రిజర్వ్ కాగా ఇక్కడ 1, 13, 14వ వార్డులు బీసీ మహిళకు కేటాయించారు. వాటితో పాటు బీసీ జనరల్ స్థానిల్లో కూడా మహిళలను పోటీ చేయించేందుకు వీలుంది. వికారాబాద్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా ఇక్కడ 9, 13, 21వ వార్డులు ఎస్సీ మహిళకు కేటాయించారు. చైర్మన్ అభ్యర్థులను ఈ వార్డులతో పాటు ఎస్సీ జనరల్ స్థానాలు, అన్ రిజర్వ్ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. తాండూరులో చైర్మన్ పదవి బీసీ జనరల్ కాగా ఇక్కడ బీసీ మహిళలు, పూర్తిగా అన్ రిజర్వ్ స్థానాల నుంచి గెలిచిన బీసీ అభ్యర్థులు కూడా చైర్మన్ పదవికి అర్హులు కానున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యేందుకు అనుకూలంగా ఉండే ఈ వార్డులే ప్రస్తుత ఎన్నికల్లో కీలకం కానున్నాయి. పార్టీలు కూడా ఈ వార్డులపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. చైర్మన్ అభ్యర్థులప్రకటనపై సందిగ్దత -
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
యాచారం: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం భూ రికార్డులు తమ పేరిట నమోదయ్యేలా చూడాలని ఫార్మాసిటీ భూ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం నగరంలోని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసంలో నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, నానక్నగర్ గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ భూ బాధితులు ఆయనను కలిశారు. ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, కోర్టులు ఆదేశాలిచ్చిన అధికారులు తమ పేర్లపై భూ రికార్డులు నమోదు చేయడం లేదని తెలిపారు. తమ పేర్లపై భూ రికార్డులు లేక రైతు భరోసా, బ్యాంకు రుణాలు, అత్యవసర సమయాల్లో అమ్ముకుందామన్నా అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫ్యూచర్సిటీ మీ బంగారు భవిష్యత్తు కోసమేనని, ఇందుకోసం సహకరించాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మల్రెడ్డికి భూ బాధితుల విజ్ఞప్తి -
జంప్ జిలానీలు
మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న నేతలు తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల వేళ పలు పార్టీలకు చెందిన నాయకులు అటూ ఇటు మారుతున్నారు. తాము నమ్ముకున్న పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదని కొందరు, వేరే పార్టీ తరఫున పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకంతో మరి కొందరు పార్టీలు మారుతున్నారు. మాజీ కౌన్సిలర్ భీంసింగ్ రాథోడ్ గురువారం కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత తిరిగి బీఆర్ఎస్లో చేరారు. అలాగే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్నాయక్ అల్లుడు సురేష్ నాయక్ సైతం కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్లో చేరారు. 13వ వార్డు నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్లో చేరిక.. మున్సిపల్ పరిధిలోని 3వ వార్డుకు చెందిన అమ్జద్ఖాన్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. సదరు నాయకుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు యత్నించగా, అతన్ని కాంగ్రెస్లో చేర్చుకున్నట్లు తెలిసింది. అలాగే 13, 17వ వార్డులకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. -
సీఎం సభకు స్థల పరిశీలన
● ఫిబ్రవరి 7న పరిగిలో భారీ బహిరంగ సభకు అవకాశం ● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎరగనుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 7న సీఎం రేవంత్రెడ్డి పరిగికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం స్థానిక నాయకులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. పార్కింగ్ సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న సభ కోసం రూప్ఖాన్పేట్ సమీపంలో స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని స్పష్టంచేశారు. అఽధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ప్రజలను మోసం చేసిందని, పదేళ్లు అధికారంలో ఉండి ఆ పార్టీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సభా స్థలాన్ని పరిశీలించిన వారిలో డీఎస్పీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోడ్ను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ స్నేహ మెహ్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. రూ.50 వేలకు మించి నగదు తరలించాలంటే తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే సందేశాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నవారిని, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే గుర్తించి తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం బషీరాబాద్: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మొపుతామని ఎస్పీ స్నేహమెహ్ర హెచ్చరించారు. ప్రభుత్వ వనరులను దోచుకోవాలని చూస్తే సహించేది లేదని తెలిపారు. బుధవారం రాత్రి జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు బషీరాబాద్ మండలం మంతట్టిలో కాగ్నానది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారని తెలిపారు. డ్రైవర్లతో పాటు, ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సీజ్ చేసిన ట్రాక్టర్లకు గురువారం తహసీల్దార్ షాహెదాబేగం భారీ జరిమానా విధించారు. ఎస్పీ స్నేహ మెహ్ర -
నేడే ఆఖరు..
● రెండో రోజు భారీగా దాఖలు ● ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు.. అంతకంటే ఎక్కువ ● పోటాపోటీగా జన సమీకరణసాయంత్రంతో ముగియనున్న నామినేషన్ల పర్వం వికారాబాద్: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీలు తమ బలం నిరూపించుకునేందుకు పోటీ పడ్డాయి. నామినేషన్లకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దీంతో కేంద్రాలు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఇప్పటికే దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవారం భారీగా వచ్చే అవకాశం ఉంది. ముందుగా నామినేషన్ పత్రాలకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి అధికారులకు అందజేస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కొందరు పూర్తి స్థాయి నామినేషన్లు వేయగా మరికొందరు డమ్మి సెట్లు వేశారు. పరిగి, తాండూరులో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాగా కొడంగల్, వికారాబాద్లో ప్రకటించలేదు. కాంగ్రెస్ తరఫున వికారాబాద్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలిసింది. పరిగి, కొడంగల్, తాండూరులో స్పష్టత రావాల్సి ఉంది. వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున స్పీకర్ ప్రసాద్కుమార్ కుమార్తె గడ్డం అనణ్య నామినేషన్ దాఖలు చేశారు. పరిగిలో బీఆర్ఎస్ తరఫున పార్టీ సీనియర్ నాయకుడు శివన్నొళ్ల భాస్కర్ సతీమణి చైర్పర్సన్ అభ్యర్థిగా రంగంలోకి దింపగా గురువారం నామినేషన్ వేశారు. తాండూరులో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన భర్త నర్సింహులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్లు వేసే విషయంలో పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో వార్డులో రెండు అంతకంటే ఎక్కువ దాఖలు చేస్తున్నారు. ఒకవేళ అభ్యర్థి వేరే పార్టీల ప్రలోభాలకు లోనైతే మరో వ్యక్తిని పోటీలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు ఏ వార్డూ ఏకగ్రీవం కాకుండా చూసుకుంటున్నారు. వికారాబాద్లో మొదటి రోజు 12 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు 83 వచ్చాయి. పరిగిలో మొదటి రోజు రెండు, రెండో రోజు 41 దాఖలయ్యాయి. తాండూరులో మొదటి రోజు 12, రెండో 97, కొడంగల్లో మొదటి రోజు జీరో కాగా రెండో రోజు 20 నామినేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు నాలుగు మున్సిపాలిటీల్లో 100 వార్డులకు 265 నామినేషన్లు వేశారు. మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం స్వతంత్ర మొత్తం వికారాబాద్ 34 43 29 15 05 03 95 తాండూరు 36 37 37 18 08 08 108 పరిగి 18 12 18 08 – 05 43 కొడంగల్ 12 04 09 02 02 03 20 మొత్తం 100 96 93 43 15 18 266 -
ఎన్నికలు సజావుగా సాగాలి
● అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయండి ● కలెక్టర్ ప్రతీక్జైన్ కొడంగల్: నామినేషన్లు వేసే క్రమంలో అభ్యర్థులకు వచ్చే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. నామినేషన్ పత్రాలకు ఏయే పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలన్నారు. గురువారం కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కొడంగల్లో ఏర్పాటు చేసిన 4 కౌంటర్లలో ఉన్న 8 మంది ఆర్వోలతో మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 261 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తాండూరు: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ సెంటర్ను పరిశీలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 261 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాలుగు పురపాలికల్లో 54 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
ఊపందుకున్న నామినేషన్లు
అనంతగిరి: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. మొదటి రోజు మొత్తం 25 దాఖలు కాగా గురువారం భారీగా వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీ 17వ వార్డుకు స్పీకర్ ప్రసాద్కుమార్ కుమార్తె అనన్య కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మాజీ కౌన్సిలర్లు లంకా లక్ష్మికాంత్రెడ్డి, కిరణ్ పటేల్, ప్రవళిక, కొండేటి కృష్ణ, శ్రీదేవి సదానంద్రెడ్డి, రమేష్గౌడ్, నేనావత్ జమునాబాయి, స్వరూప తోపాటు ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేశారు. నేటితో గడువు ముగియనుండటంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ నామినేషన్ సెంటర్ను అడిషనల్ కలెక్టర్ సుధీర్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ రఘు కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిగి మున్సిపాలిటీలో.. పరిగి: పరిగి మున్సిపాలిటీలో రెండో రోజు భారీ నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 38 మంది 41 సెట్ల నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్ నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 13 మంది, బీజేపీ నుంచి 8 మంది, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు.. మొత్తం 43 మంది నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. తాండూరులో భారీగా.. తాండూరు: తాండూరులో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. 36 వార్డులకు గాను 12 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పార్టీలకు చెందిన 108 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొదటి రోజు 25 దాఖలు కాగా, రెండో రోజు 97 వేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 37 మంది, బీఆర్ఎస్ తరఫున 37 మంది, బీజేపీ నుంచి 18 మంది, ఎంఐఎం తరఫున 8 మంది, ఇతర పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు, మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి తెలిపారు. రెండోరోజు తాండూరులో 97, పరిగిలో 38 చివరి రోజు భారీగా వచ్చే అవకాశం కేంద్రాల వద్ద నేతల హడావుడి పరిశీలించిన అధికారులు -
సన్నాల సాగుతో అధిక లాభాలు
● నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలి ● ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరిఅనంతగిరి: అధిక దిగుబడి తోపాటు లాభసాటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధిక సాంద్రత పంటల సాగు, నానో యూరియా, డీఏపీ వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధిక లాభాలు వచ్చే పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. సన్న రకం వరి సాగు చేస్తే ప్రభుత్వ క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తోందని తెలిపారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వంగడాలు సాగయ్యేలా చూస్తామన్నారు. రైతులకు వివిధ కంపెనీలు నాణ్యమైన విత్తనాలు అందించకపోవడంతో నష్టపోతున్నారని తెలిపారు. ఆలస్యంగా నాట్లు వేస్తే దిగుబడి తగ్గుతుందన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ మోహన్కృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్రెడ్డి, రాజా మధు శేఖర్, ఏడీఏలు సందీప్, శంకర్ రాథోడ్, లక్ష్మీకుమారి, వెంకటేశం, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో మహాయాగం
తుర్కయంజాల్: ఆదిబట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం గురువారం రెండో రోజుకు చేరింది. ప్రాతఃకాల పూజలు, వేద పారాయణాలు, చండీ అనుష్టానములు, రుద్రపారాయాణాదులు, అభిషేకం, లక్ష బిల్వార్చన, మేధా దక్షిణమూర్తి హోమం, హంస వాహనసేవ, కొడకండ్ల రాధాకృష్ణచే నాదనీరాజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
కాంగ్రెస్కు ఓట్లు అడిగే అర్హత లేదు
కొడంగల్: కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని బీఆర్ఎస్ కొడంగల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ గట్టు రాంచందర్రావ్ అన్నారు. బుధవారం పట్టణంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆశావహులతో మాట్లాడారు. అనంతరం రెండో వార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15 వేలు రైతు బంధు ఇవ్వాలన్నారు. మహిళలకు రూ.2,500 ఇవ్వడం లేదన్నారు. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు పింఛను మొత్తం పెంచలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో గెలుపే లక్ష్యంగా సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ జాడే లేదన్నారు. తులం బంగారం ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను పథకాలపై నిలదీయాలని ప్రజలకు సూచించారు. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేసి తెలంగాణ వాదాన్ని గెలిపించాలన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ వెళ్లి గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్కు ఏమి చేశారో ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి మాటలు కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కొడంగల్కు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను, విద్యా సంస్థలను లగచర్లకు తరలించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి వాణీ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, మహిపాల్, శేరి నారాయణరెడ్డి, బాకారం అరుణ్, మాటూరు భీములు, నరేష్గౌడ్, ఎరన్పల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెను జయప్రదం చేయండి
తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీఓకు కార్మికులతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రమ శక్తి నీతి 2025 పేరుతో మోదీ ప్రభుత్వం కార్మిక విధానాన్ని ప్రకటించిందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్ర కార్మిక సంఘాలను సంప్రదించకుండా అప్రజాస్వామికంగా, దొడ్డిదారిన తెచ్చిన కొత్త చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మని తెలిపారు. లేబర్ కోడ్లు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జీపీ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి నర్సింలు, ఉపాధ్యాక్షులు జిలానీ, నాయకులు బాలప్ప, దస్తప్ప, శాంతమ్మ, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీకి ‘జుంటుపల్లి’ గుడ్బై
● ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరిక ● 19వ వార్డు నుంచి పోటీకి సుముఖత తాండూరు టౌన్: బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్కు లేఖ పంపారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి 18 ఏళ్లుగా ఎనలేని సేవలందించానని, ప్రస్తుతం ఆ పరిస్థితులు తాండూరు నియోజకవర్గంలో కరువయ్యారన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెంకట్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ఉన్న 19వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పాఠశాలనుసందర్శించిన డీపీఓ కొడంగల్ రూరల్: మండలంలోని చిట్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆకస్మికంగా సందర్శించారు. స్కూల్ ఆవరణలోని పాత భవనాన్ని పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేపట్టాలా తొలగించాలా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తరగతి గదుల కొరత లేకుండా చర్యలు చేపడతామన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత గుర్తించి విద్యార్థులను అడిగారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ, గ్రామ సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్ చంద్రకళ, వార్డు సభ్యులు హబీబుల్లా, సాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి బంట్వారం: దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హామీ ఇచ్చారు. బీవీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు బుధవారం నగరంలోని ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చూడాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖగా ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన వీరయ్య ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సత్ప్రవర్తనతో మెలగాలి డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడరాదని. సత్ప్రవర్తనతో మెలగాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. బుధవారం పలువురు రౌడీ షీటర్లకు పట్టణ పోలీసు స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కొన్ని పరిస్థితుల కారణంగా ఏదో ఒక తప్పు చేసి కేసుల్లో ఇరుక్కుని ఉంటారని, ఇకపై అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంత జీవితాన్ని గడపాలన్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు పుష్పలత, సాజిద్ పాల్గొన్నారు. -
పట్టు సాగుతో అధిక లాభాలు
యాలాల: పట్టు పురుగుల పెంపకంతో రైతు లు అధిక ఆదాయం పొందవచ్చని హార్టికల్చర్, సెరికల్చర్ జిల్లా అధికారులు సత్తార్, నాగరత్న అన్నారు. బుధవారం మండలంలోని బషీర్మియా తండాలో పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు హార్ట్టికల్చర్, సెరికల్చర్ సాగు పట్ల అవగాహన లేకపోవడంతో రైతులు ముందుకు రా వడం లేదన్నారు. తక్కువ సమయంలో ప్రతి నెలా అధిక ఆదాయం పొందేందుకు పట్టు సా గు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి సబ్పిడీ అందజేస్తుందన్నా రు. బషీర్మియాతండా నుంచి ఆరుగురు రైతు లు పట్టు సాగుకు ముందుకు వచ్చినట్లు తెలి పారు.కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వినోద్కుమా ర్,రాఘవేంద్ర, తేజశ్విని, నిఖిత,విజయ్కుమా ర్,కమల,నర్సింగ్ నాయక్, యూసుఫ్జానీ, మాజీ సర్పంచ్ మిత్రునాయక్ పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా సాగాలి
● తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు ● అడిషనల్ కలెక్టర్ సుధీర్ పరిగి: మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం పరిగి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. అవసరానికి అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు. అభ్యర్థులకు కావాల్సిన ధ్రువపత్రాలు అందజేయాలని తెలిపారు. నామినేషన్ పత్రాలను ఆర్ఓలు జాగ్రత్తగా పరిశీలించి తిరస్కరణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక వార్డుల్లో పోలీసుల పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు సజావుగా జరగాలి
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికలపై నోడల్ ఆఫీసర్లకు పూర్తి అవగాహన ఉండాలని మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జీ రవి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని, నిబద్దతతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీ అమలయ్యేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, సీపీఓ వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మాధవరెడ్డి, ఆర్టీఏ వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు రవి పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్జైన్ మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి -
చదువే ఆయుధం
ధారూరు: చదువు ఒక ఆయుధమని.. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. ధారూరు బాలుర ఉన్నత పాఠశాల లో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని బు ధవారం డీఈఓ రేణుకాదేవితో కలిసి సందర్శించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వీయ అనుభవాలను పంచుకున్నారు. తాను కలెక్టర్ కావడానికి ఎంతలా శ్రమించాల్సి వచ్చిందో ఉపాధ్యాయులకు వివరించారు. ఫిబ్రవరి చివరి వారంలో దేశవ్యాప్తంగా 3వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎఫ్ఎల్ఎస్ పరీక్ష కోసం ఉపాధ్యాయులు చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక గురించి ఆరా తీశారు. పరీక్ష స్వరూపం, ప్రశ్నల సరళి, మూల్యాంకణ విధానాలను అడిగి తెలుసుకున్నారు. భాష అలాగే గణితానికి సంబంధించిన అన్ని ప్రశ్నలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యతోనే సామాజిక మార్పు వస్తుందన్నారు. ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధన చేయాలని తెలిపారు. హెచ్ఎంలు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను సమన్వయంతో నడిపిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం డీఈఓ రేణుకాదేవి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, సామర్థ్యాల పెంపునకు పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. వాటిని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి, సెక్టోరల్ అధికారులు రమేశ రజనీ, రిసోర్స్ పర్సన్లు నర్సింహరాజు, శ్రీనివాస్, నిజామొద్దీన్, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి అనంతగిరి: ఇంటర్ పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 25నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రతి రోజూ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 16,400 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 37 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. నిర్ణీత సమయానికి ప్రశ్న పత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను అనుమతించరాదన్నారు. తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. సమావేశంలో ఇంటర్ మీడియట్ జిల్లా అధికారి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ సెంటర్ పరిశీలన వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ను బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కారక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్, వార్డు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలి -
మొదలైన మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ
● వికారాబాద్లో 12 ● తాండూరులో 11 ● పరిగిలో 2 ● కొడంగల్లో నిల్ తాండూరు: బీఆర్ఎస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న నర్సింహులుఅనంతగిరి: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్లో 12, తాండూరులో 11, పరిగిలో 2 రెండు చొప్పున నామినేషన్లు వేశారు. కొడంగల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 1, 9, 18, 24, 27, 28, 29 వార్డులకు ఒకటి చొప్పున, 11, 23 వార్డులకు రెండు చొప్పున నామినేషన్లు వచ్చినట్లు మున్పిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి తెలిపారు. పరిగిలో.. పరిగి: పరిగి మున్సిపల్ పరిధిలోని రెండు వార్డులకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 7వ వార్డుకు పద్మ, 15వ వార్డుకు శ్రీను నామినేషన్ పత్రాలను ఆయా వార్డుల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పరిగి పట్టణ పరిధిలో 18 వార్డులు ఉండగా నామినేషన్ల స్వీకరణకు ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్లలో మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఆరుగురు ఆర్ఓలు, ఆరుగురు ఏఆర్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. తాండూరులో.. తాండూరు: తాండూరులో మొదటి రోజు 11 నామినేషన్లు నమోదయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 5 మంది, బీఆర్ఎస్ పార్టీ తరఫున 5 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పట్లోళ్ల నర్సింహులు నామినేషన్ వేశారు. 1వ వార్డుకు ధనసిరి నాగలక్ష్మి, 15వ వార్డుకు బొబ్బిలి శోభారాణి, 23వ వార్డుకు పరిమళ, 30వ వార్డు నుంచి మహ్మద్ సాబియా ఫాతిమా బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేశారు. 8వ వార్డుకు తలారి సాయప్ప, 14వ వార్డు నుంచి మ్యాతరి సురేషన్, 16వ వార్డు నుంచి నారా శ్రీలత, 24వ వార్డు నుంచి పోలీస్ బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. 28వ వార్డు నుంచి నాగారం మల్లేశం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. -
రోడ్డు నియమాలు పాటిద్దాం
ఆర్టీవో వెంకట్రెడ్డి అనంతగిరి: రోడ్డు భద్రత మసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల బస్సు డ్రైవర్లకు బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీవో వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం సహకరించినప్పుడు ఏ పనైనా చేయగలమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్కూల్ బస్సులు నడిపేవారు విద్యార్థులను సురక్షితంగా గమ్యాలకు చేర్చాలన్నారు. అనంతరం ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ మాట్లాడారు. రోడ్డు భద్రత మనందరి బాధ్యత అన్నిరు. మహావీర్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ గురురాజ్ వాలి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో ఏఎంవీఐ వరుణ్ కుమార్, స్కూల్ బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం
మొయినాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలని ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జిలు ముఠా జయసింహా, అమృత్లాల్ చౌహాన్ అన్నారు. బుధవారం వారు మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో వార్డు అభ్యర్థుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థు లను గెలిపించుకోవడానికి కృషి చేయాలన్నా రు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని చెప్పారు. అభ్య ర్థుల ఎంపిక దాదాపు ఖరారైందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అంనతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యు డు కొత్త మాణిక్రెడ్డి, నాయకులు జయవంత్, మల్లారెడ్డి, శంకరయ్య, మాణిక్యం, రాజు, డేవిడ్, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జిలు ముఠా జయసింహా, అమృత్లాల్ చౌహాన్ -
బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత
షాద్నగర్రూరల్: బాల్యవివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బూర్గుల జెడ్పీహెచ్ఎస్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగతా వ్యాసరచన పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం సంఽధ్యారాణి మాట్లాడుతూ.. బాల్య వివాహాలను చేయడం చట్టరీత్యా నేరమన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలుడికి పెళ్లి చేసుకుంటే శిక్ష ఉంటుందన్నారు. బాల్య వివాహాలను జరిపించినా, ప్రోత్సహించినా చట్టపరంగా చర్యలుంటాయన్నారు. పిల్లలకు చిన్న వయసుల్లో వివాహాలు చేయకుండా వారికి ఉన్నత విద్యను అందించేందుకు తల్లితండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు జరిపిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. పాఠశాల హెచ్ఎం రవికుమార్, అంగన్వాడీ టీచర్లు శ్రీలత, రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి -
ట్రాక్టర్ బోల్తా.. బాలిక మృతి
● మరో మహిళకు తీవ్ర గాయాలు ● కేసు నమోదు చేసిన నవాబుపేట పోలీసులు నవాబుపేట: ట్రాక్టర్ బోల్తాపడి ఓ బాలిక మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ముబారక్పూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం చైతన్యనగర్కు చెందిన మాదాస్ కిష్టయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు సంతానం. భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు నిమిత్తం నవాబుపేట మండలం ముబారక్పూర్కు చెందిన దయాకర్రెడ్డి (బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు) వద్ద పనిచేస్తూ, స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. చైతన్యనగర్కే చెందిన గోపి, అతని భార్య మౌనిక సైతం ఇక్కడే పనిచేస్తున్నారు. ఉదయాన్నే గోపీ తన భార్యతో పాటు కిష్టయ్య పెద్ద కూతురు అనూష(14)ను తీసుకుని ట్రాక్టర్లో పొలానికి బయల్దేరాడు. ఈక్రమంలో గుబ్బడిపత్తేపూర్ వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో అనూష (14) అక్కడికక్కడే చనిపోగా మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యజమాని దయాకర్రెడ్డి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మౌనికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి, అనూష మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే తన కూతురు కూలీ పనులకు వెళ్లదని, ఇంటి వద్దే ఉండేదని, తమకు చెప్పకుండా ట్రాక్టర్పై వెళ్లిందని అనూష తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా, గోపీ ట్రాక్టర్ నడపలేదని, వెంకట్రెడ్డి నడిపాడని పోలీసులకు చూపింనట్లు సమాచారం. ఈ విషయమై నవాబుపేట ఎస్ఐ పుండ్లిక్ను వివరణ కోరగా మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
‘మున్సిపల్’ సందడి
ఇబ్రహీంపట్నం: ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పట్టణంలోని 24 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ, హెల్ప్ డెస్క్ కౌంటర్ల ఏర్పాటు కోసం అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మున్సిపల్ పన్నులు, విద్యుత్, నీటి బిల్లుల బకాయిల చెల్లింపులకు, కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాల కోసం పోటీదారులు పడరానిపాట్లు పడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు చేరుకుని బిల్లులు చెల్లించారు. నామినేషన్ల స్వీకరణకు తక్కువ గడువు ఉండటంతో త్వరగా పని పూర్తి చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఎటూ తెల్చుకోలేని కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆయా వార్డులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. గెలుపు గుర్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గురువారం పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ముందంజలో బీఆర్ఎస్.. అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. రెండుమూడు వార్డుల్లో మినహా కేండెట్ల ఎంపికను పూర్తి చేసింది. బుధవారం ఉదయం 12 మంది పోటీదారుల పేర్లను ప్రకటించింది. పోలీసు పహారా మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న దారులను పోలీసులు మూసేశారు. దీంతో ఆయా రూట్లలో వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. కార్యాలయం వద్ద సిబ్బంది పహారా కాస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపులకు పరుగులు పెడుతున్న పోటీదారులు నామినేషన్లకు ఎక్కువ గడువు లేకపోవడంతో హడావుడి -
విద్యార్థులకు చేయూత
బషీరాబాద్: మండలంలోని నావంద్గీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అంకిత ఫౌండేషన్ చేయూతనందించింది. ఫౌండేషన్ చైర్మన్, పరిగి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పెద్దరగాళ్ల చంద్రయ్య విద్యార్థులకు బ్యాగులు, ష్యూస్, చెప్పులు, మ్యాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ ఉత్తమ సేవా అవార్డు గ్రహీత యాస మల్లారెడ్డి మాట్లాడుతూ.. సొంత గ్రామం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ ప్రకాష్,, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న అతిరుద్ర హోమాలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో అతిరుద్ర మహా యజ్ఞం, హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమాల్లో కూర్చునే భక్తులతో పాటు సాధారణ భక్తులకు సైతం అభిషేకం చేసే అవకాశం కల్పించడంతో వందలాదిగా వస్తున్నారు. 200 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణల నడమ హోమాలు, యాగాలు కొనసాగాయి. మహా యజ్ఞాన్ని తిలకించేందుకు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇసుక లారీ సీజ్ దోమ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని బుధవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం పగిడాల గ్రామం నుంచి పూడూరు మండలం బొంగుపల్లి తండాకు శ్రీనివాస్ తన లారీ లో దోమ మండలం మల్లేపల్లి తండా మీదుగా పరిగి పట్టణానికి ఇసుకను తరలిస్తున్నాడు. పక్క సమాచారంతో తమ సిబ్బందితో లారీని పట్టుకున్నట్లు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మట్టి టిప్పర్ సీజ్ పూడూరు: అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేసినట్లు చన్గోముల్ ఎస్ఐ భరత్త్రెడ్డి తెలిపారు. బుధవారం మన్నేగూడ సర్కిల్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓవర్ లోడ్తో అతివేగంగా వెళ్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ సిబ్బందిపై ఫిర్యాదు ధారూరు: మండలంలోని కుమ్మర్పల్లి జీపీ పరి ధిలోని బోజ్యానాయక్తండా, నాగారంతండా, కుమ్మర్పల్లి అంగన్వాడీ కేంద్రాలు ఎప్పుడూ మూతబడి ఉంటున్నాయని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఈ విషయమై మహిళాశిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవా రం కుమ్మర్పల్లి అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారులు అక్కడ ఆయా, టీచర్ లేకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. సెంటర్ తెరుస్తారని భావించిన ఓ తల్లి తన చిన్నారిని అక్కడే కూ ర్చోబెట్టి పొలం పనులకు వెళ్లిపోయింది. అప్ప టి వరకూ ఉన్న తోటి పిల్లలు ఇళ్లకు వెళ్లిపోవడంతో సదరు చిన్నారి అక్కడే కూర్చుని ఏడుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన కుమ్మర్పల్లి వార్డు మెంబర్లు సిబ్బంది పనితీరుపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీడీపీఓకు విజ్ఞప్తి చేశారు. కుమ్మర్పల్లి అంగన్వాడీ టీచర్కు ఫోన్ చేసినా స్పందించలేదని, పంచాయతీ తరఫున ఫిర్యాదు చేశామని స్పష్టంచేశారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం యాలాల: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన యాలాల మండలంలో బుధవారం జరిగింది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ప్రతిభ పాఠశాల వెనుక కంది పంటలో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వివరాలు సేకరించారు. సుమారు 10 రోజలు క్రితం చనిపోయి ఉండొచ్చని, మృతుడు వయస్సు సుమారు 45–50 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహానికి సంబంధించిన ఓ కాలును జంతువులు పీక్కు తిని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఒంటిపై నల్లటి నైట్ ప్యాంట్, గడ్డం ఉందన్నారు. ఎవరైనా ఆనవాళ్లు గుర్తిస్తే వెంటనే సెల్ నంబరు 8712670054లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
● రన్నింగ్లో ఊడిపోయిన స్టీరింగ్ రాడ్డు ● డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు మహేశ్వరం: విద్యార్థులను దింపి, తిరిగి వెళ్తున్న స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్డు ఊడిపోయిన ఘటనలో పెను ప్రమాదమే తప్పింది. ఈ సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులే ఉండటం, ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరానికి చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్ విద్యార్థులను తీసుకుని బయల్దేరింది. విద్యార్థులను దింపి తిరిగి వస్తున్న క్రమంలో మహేశ్వరం సెంట్రల్లో బొడ్రాయి వద్ద స్టీరింగ్ రాడ్డు ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేశాడు. ఊరి మధ్యలో ఈ ఘటన జరగడంతో వాహనం నెమ్మదిగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వారిని పక్కనే ఉన్న ఇళ్లకు పంపించారు. స్కూల్ బస్సులకు సరైన ఫిట్నెస్ పరీక్షలు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
దౌల్తాబాద్: మండలంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని కడా ప్రత్యే కాధికారి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం దేవర్ఫసల్వాద్ గ్రామంలో రూ.27 లక్షలతో నిర్మించనున్న వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కృషితో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యలేకుండా చూస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ ర వికుమార్,డీఈ శశాంక్,ఏఈ శివసాయి తేజ, సర్పంచ్ రాజు,నాయకులు వెంకట్రావు,వీరన్న, వెంకట్రాములు,రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. కొడంగల్ మండలంలో.. కొడంగల్ రూరల్: మండలంలోని కస్తూర్పల్లిలో బుధవారం వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు అధికారులు భూమిపూజ చేశారు. 60 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్ను నిర్మించనున్నారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శశాంక్మిశ్రా, ఏఈ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి జగదీష్గౌడ్ పాల్గొన్నారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి -
ఆవిష్కరణలపై దృష్టిసారించాలి
పీఎంశ్రీ స్కూల్స్ సదస్సుల్లో విద్యావేత్తల పిలుపు అబ్దుల్లాపూర్మెట్: ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో తెలంగాణ రీజియన్లోని పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాకులకు మూడు రోజుల పాటు మెంటరింగ్ సదస్సులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని పిగ్లీపూర్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఇందుకు వేదికై ంది. రాష్ట్రంలోని మొత్తం 3 కళాశాలలో మాత్రమే ఈ సదస్సులు నిర్వహిస్తుండగా బుధవారం సదస్సును ప్రారంభించారు. పీఎంశ్రీ స్కూల్స్కు చెందిన వంద మంది విద్యార్థులు, వంద మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి సి.గంగిరెడ్డి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ఎల్వీ వేణుగోపాలరావు, ఏఐసీటీఈ నోడల్ హెడ్ అసీమ్కల్టా, వాడ్వాని ఫౌండేషన్ వక్త డాక్టర్ రాజేశం, శ్వేతలు పాల్గొని ఏఐసీటీఈ నుంచి పరిశోధన నిధుల కోసం వినూత్న ఆలోచనలు అంశంపై వివరించారు. -
బంగారం కోసమే మహిళ హత్య
● సీసీ పుటేజీలతో కేసు ఛేదించిన పోలీసులు ● ఇద్దరు నిందితులకు రిమాండ్ ● వెల్లడించిన డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూరు టౌన్: ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 24వ తేదీన యాలాల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన లొంకల బందెమ్మ(54), పెద్దేముల్ మండలం రేగొండి గ్రామ శివారులో దారుణ హత్యకు గురైంది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దేముల్ ఎస్ఐ శంకర్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంకు, డాగ్ స్క్వాడ్కు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో తాండూరు పట్టణంలోని లేబర్ అడ్డా సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా మృతురాలు బందెమ్మ ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్లినట్లు గుర్తించామన్నారు. ఈమేరకు పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన మాల నర్సింలు, కర్ణాటకకు చెందిన కిషోర్ షిండే అనే అడ్డా కూలీలను పట్టుకుని విచారించగా బంగారం, వెండి ఆభరణాల కోసమే అంతమొందించినట్లు అంగీకరించారు. బందెమ్మను నమ్మించి బస్సులో రేగొండి శివారుకు తీసుకెళ్లారు. నర్సింలు పదునైన కత్తితో ఆమె మెడను కోశాడు. అనంతరం బండరాయితో మొదారు. మృతురాలి నుంచి 30 తులాల వెండి కాళ్ల కడియాలు, రెండు గ్రాముల బంగారు గుండ్లు, ముక్కు పుడక తీసుకుని పరారయ్యారు. వీటిని శంకర్పల్లిలోని ఓ బంగారం దుకాణంలో రూ.49 వేలకు నర్సింలు విక్రయించాడు. ఈమేరకు నిందితులపై కేసు నమోదు చేసి, బంగారం, వెండిని రికవరీ చేశామన్నారు. నిందితుల్లో ఒకడైన నర్సింలు 2021లో యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళను ఇదే తరహాలో హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. నిందితులను తక్కువ సమయంలోనే పట్టుకున్న పెద్దేముల్ ఎస్ఐ శంకర్తో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
బొంరాస్పేట: పండిత పరిషత్ కృషితోనే భాషా పండితుల అప్గ్రెడేషన్ సాధ్యమైందని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (రూప్ టీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ అన్నారు. మండల కేంద్రంలో ఆ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ మేరకు పండిత పరిషత్ అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగోన్నతల సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్, సీహెచ్ఎం రవీందర్గౌడ్, ఆ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింలు, మహిళాధ్యక్షురాలు రిజ్వానా బేగం, నాయకులు కృష్ణ, బాల్రాజ్, వందన, అంజు, మధుబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిహామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
● వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దుచేయాలి ● మాజీ ఎంపీ విశ్వనాథ్ అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథ్ ఆరోపించారు. సోమవారం వికారాబాద్ మండలంలోని సిద్దులూర్ గ్రామంలో వీబీజీ రాంజీ వద్దు– ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ముద్దు అంటూ.. పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టం ప్రజా వ్యతిరేకమన్నారు. దీంతో కూలీలు మళ్లీ వలస వెళ్లే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త చట్టాన్ని వెంటనే రద్దుచేసి, ఇంతకు ముందులాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, ఆర్టీఏ సభ్యుడు జాఫర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కో చెరువుకు రూ.3 కోట్లు
● సుందరీకరణ పనులకు నిధులు మంజూరు ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి మీర్పేట/పహాడీషరీఫ్: నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన చెరువుల సుందరీకరణ కోసం రూ.మూడు కోట్ల చొప్పున హెచ్ఎండీఏ నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీర్పేటలోని క్యాంపు కార్యాలయంలో చెరువుల సుందరీకరణ, ఎస్ఎన్డీపీ నాలాల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీర్పేటలోని చందన చెరువు, పెద్దచెరువు, జల్పల్లి చెరువు, రావిర్యాల చెరువుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ముఖ్యంగా చెరువుల్లో మురుగునీరు చేరుతున్న చోట నాలాలు నిర్మించి మళ్లించాలని, ఆ తరువాత సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జల్పల్లి పెద్ద చెరువు కట్టపై మైసమ్మ ఆలయం వద్ద వినాయక ప్రతిమల నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. బతుకమ్మ ఘాట్ను కూడా మహిళా భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. అలాగే రెండో దశలో ఎస్ఎన్డీపీ నాలాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలైన లెనిన్నగర్, మిథులానగర్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే అసంపూర్తిగా ఉన్న ఎస్ఎన్డీపీ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. వాదే ముస్తఫా ప్రజలు చెరువును ఆనుకొని ఉన్న శ్మశాన వాటికకు రాకపోకలు సాగించేలా మార్గం ఉంచాలని ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్ అఫ్జల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఇరిగేషన్ ఏఈ వంశీ, వర్క్ ఇన్స్పెక్టర్ జనార్దన్, మాజీ కౌన్సిలర్ పల్లపు శంకర్, నాయకులు అర్జున్, పటేల్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు తీర్చేందుకు చోరీల బాట
ఏటీఎం లూటీకి యత్నించిన దొంగల అరెస్టు షాద్నగర్ రూరల్: అప్పులు తీర్చేందుకు ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బార్గా జిల్లాకు చెందిన మనపడి రామకృష్ణ, మహారాష్ట్ర సోలాపూర్ చెందిన రాహుల్ సౌరప్ప, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం మాధారం గ్రామానికి చెందిన ఎరుకలి బన్నప్ప, అదే మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి రాజు బంధువులు. వీరందరూ హైదరాబాద్కు వచ్చి ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక గ్రామంలో తల్లిదండ్రులు చేసిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించి అప్పులు కట్టాలనే ఆలోచనతో పథకం పన్నారు. ఏటీఎంలలో ఎక్కువ డబ్బులు ఉంటాయనే భావనతో ఈ నెల 18న హైదరాబాద్ నుంచి మొయినాబాద్కు ఆటోలో జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని లాల్పహాడ్కు చేరుకున్నారు. అక్కడ అర్ధరాత్రి ఏటీఎం సెంటర్లోకి వెళ్లి సుత్తెతో మెషిన్ పగులగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద శబ్దం కావడంతో ఎవరో వస్తున్నట్లు కదలికలు గమనించారు. దీంతో దొరికిపోతామనే భయంతో పరారయ్యారు. దీనిపై ఈ నెల 19న ఏటీఎం నిర్వాహకుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను గుర్తించి పట్టుకున్నారు. చోరీకి ఉపయోగించిన ఆటో, రెండు సెల్ఫోన్లు, రెండు సుత్తెలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. -
పుర పోరు.. హడావుడి షురూ!
● పట్టణాల్లో వేడెక్కిన రాజకీయం ● పోటీకి సిద్ధమైన ఆశావహులు ● వార్డుల్లో ప్రచారం మొదలు ● టికెట్ల కోసం తీవ్ర కసరత్తు పట్టణాల్లో ఓట్ల పండగ షురూ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. పురపాలక సంఘాల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్, విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా తలపడుతున్నాయి. ఆశావహులు ఆయా పార్టీల టికెట్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయం వేడెక్కింది. ఆశావహులంతా పోటీకి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది. ఏయే వార్డుల్లో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంలో పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. బలమైన నాయకులకే టికెట్లు ఇవ్వాలని ఆయా ప్రధాన పార్టీలు భావిస్తుండడంతో.. పార్టీ టికెట్లు దక్కవనుకున్న ఆశావహులు ఇప్పటికే కండువాలు మార్చేశారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధ మైన నాయకులు ప్రచారాలు సైతం మొదలు పెట్టా రు. వార్డుల్లో తిరిగి ప్రజలను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మారుతున్న కండువాలు మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. ఈ నెల 17న రిజర్వేషన్లు ఖరారు కావడంతో రిజర్వేషన్లు కలిసి వచ్చిన ఆశావహులంతా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రిజర్వేషన్లు కలిసిరానివారు పక్క వార్డుల్లో పోటీ చేసే ప్రయత్నాలు చేస్తుండగా కొందరు తమ సతులను పోటీలో దింపేందుకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ టికెట్లు రావని భావించిన నాయకులు కొందరు ఇప్పటికే కండువాలు మార్చారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరితే.. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో, బీజేపీలో చేరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జంపింగ్లు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముగ్గురి గురి మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కావడంతో ఆ కేటగిరికి చెందిన ప్రధాన పార్టీల నాయకులు దానిపై గురిపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పదవిపై ఇద్దరు నాయకులు కన్నేశారు. ఓ నాయకుడు ఓ స్థానంలో తాను పోటీ చేస్తూ మరో స్థానంలో తన భార్యను బరిలోకి దింపేందుకు పావు లు కదుపుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలోనూ చైర్మ న్ పదవి కోసం తీవ్ర పోటీనే ఉంది. ముగ్గురు ఎస్సీ నాయకులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ముందుగా కౌన్సిలర్లుగా గెలిచిన తరువాత చైర్మన్ స్థానం ఎవరికనేది తేలుద్దాం అంటూ పార్టీ అధి ష్టానం ఆశావహులకు సూచించినట్లు తెలిసింది. మరో వైపు బీజేపీ సైతం చైర్మన్ స్థానంపై కన్నేసింది. పూర్తి మెజార్టీ రాకపోయినా చైర్మన్ ఎన్నికలో కీలకంగా మారుతామనే ఆశాభావంతో ముందుకెళ్తోంది. ఇంటింటికీ తిరుగుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకులంతా వార్డుల్లో ప్రచారాలు మొదలు పెట్టారు. ఇంటింటికి తిరిగి తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని.. తమను గెలిపించాలని ఓటర్లకు చెబుతూ అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్థాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీల టికెట్ల విషయంలో గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో ఏ వర్గానికి టికెట్లు దక్కుతాయోనని పార్టీ వర్గాలే అయోమయానికి గురవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్లోనూ టికెట్ల కోసం గట్టి పోటీ కొనసాగుతుంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని 26 వార్డులకు సంబంధించిన నామినేషన్లను మున్సిపల్ కేంద్రంలోని మెథడిస్ట్ స్కూల్లో స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియకు 9 మంది ఆర్ఓలను కేటాయించారు. ఒక్కో ఆర్ఓ అధికారి మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 30న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
దోపిడీదారుల లబ్ధికే భూసేకరణ
● రైతులను బెదిరించి లాక్కుంటున్న సర్కారు ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ యాచారం: జిల్లాలో రూ.కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించి దోపిడీదారులకు కట్టబెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. మండలంలోని నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములను మంగళవారం ఆయన పరిశీలించి కౌలు రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా రంగారెడ్డి జిల్లా భూములపై గద్దల్లా వాలిపోతున్నారని విమర్శించారు. ఏళ్లుగా సాగులో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములకు నోటిఫికేషన్లు ప్రకటిస్తూ రైతులను బెదిరింపులకు గురి చేసి తక్కువ ధరలకే సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. మార్కెట్లో ఎకరా భూమి రూ.కోట్లలో పలుకుతుంటే కేవలం రూ.35 లక్షల్లోపే చెల్లించి బలవంతంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే అన్నదాతలు అడ్డుకుంటారనే భయంతో రాత్రిపూట డ్రోన్లతో వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. కర్షకులు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. లేదంటే గజం భూమి కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు. 30న యాచారంలో ధర్నా నందివనపర్తి ఓంకారేశ్వరాలయానికి చెందిన 1,400 ఎకరాల భూములను ఏళ్లుగా సాగు చేసుకుంటున్న నందివనపర్తి, నస్దిక్సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల కౌలు రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ 37ఏ సర్టిఫికెట్లు పొందినప్పటికీ, 38ఈ సర్టిఫికెట్లు ఇచ్చి పట్టాదారు, పాసుపుస్తకాలు ఇవ్వకుండా అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టాదారు, పాసుపుస్తకాల కోసం ఈ నెల 30న స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాకు కౌలు రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, మండల కార్యదర్శి నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పి.అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్, నస్దిక్సింగారం గ్రామ సర్పంచ్ బోడ కృష్ణ, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మోగిన పుర నగారా
● టికెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు ● కొడంగల్పై ఫోకస్ చేసిన నాయకులు కొడంగల్: పురపాలక సంఘాలకు ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీల్లో రాజకీయ వేడి రాజుకుంది. అందరి చూపు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మున్సిపాలిటీపై పడింది. ఆయా వార్డు స్థానాల్లో పోటీ చేయడానికి ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ల కోసం అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. ఇందులో 11,668 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 5,661 మంది, మహిళలు 6,007 మంది ఓటర్లు ఉన్నారు. కొడంగల్ మున్సిపాలిటీ 2018లో ఏర్పడింది. మొదటిసారి 2020లో ఎన్నికలు జరిగాయి. తొలి చైర్మన్గా జగదీశ్వర్రెడ్డి(జగ్గప్ప) ఎంపికయ్యారు. రెండోసారి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు ఇప్పటికే ఇంటి పన్ను, నల్ల బిల్లులు చెల్లించారు. కొడంగల్లో ఉన్న 12 వార్డుల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల్లో ఇప్పటికే కొంతమంది సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల నుంచి బీ ఫారాలు రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాజకీయ పార్టీలు వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. రిజర్వేషన్లు ఇలా.. కొడంగల్ మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్కు కేటాయించారు. మున్సిపాలిటీలో ఉన్న 12 వార్డుల వారీగా రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. 1వ వార్డు (బీసీ జనరల్), 2వ వార్డు (జనరల్ ఉమెన్), 3వ వార్డు (జనరల్ ఉమెన్), 4వ వార్డు (జనరల్), 5వ వార్డు (ఎస్సీ ఉమెన్), 6వ వార్డు (జనరల్), 7వ వార్డు (ఎస్సీ జనరల్), 8వ వార్డు (ఎస్టీ జనరల్), 9వ వార్డు (బీసీ మహిళ), 10 వార్డు (బీసీ జనరల్), 11వ వార్డు (జనరల్ మహిళ), 12వ వార్డు (జనరల్ మహిళ)కు కేటాయించారు. -
దాతలు సహకరించండి
బంట్వారం: మండల పరిధిలోని తొర్మామిడిలో చర్చి నిర్మాణానికి దాతల సహకారం ఎంతో అవసరమని మెథడిస్టు చర్చి కమిటీ కోశాధికారి పద్మారావు అన్నారు. మంగళవారం ఆయన సర్పంచ్ సంజీవులు తదితరులతో కలిసి చర్చి నిర్మాణం పనులను పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనుల్లో స్థానికులు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని తెలిపారు. నిధులు చాలా అవసరమని, ఇందుకు సంబంధించి దాతల సహకారం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మెథడిస్టు చర్చి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్గా ఎమ్మెల్యే వీర్లపల్లి షాద్నగర్: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులను జారీచేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి తుక్కుగూడ: పల్లె దవాఖానాలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 158 పల్లె దవాఖానాలు ఉన్నాయన్నారు. పల్లెల్లో మాతాశిశు సంక్షేమం, కేన్సర్ కేర్, వయో వృద్ధుల సేవలు తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం వైద్య సిబ్బందికి సిమ్కార్డ్స్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ పాపారావు, సిబ్బంది వినోద్, రాకేశ్, శ్రీనివాసులు, అక్రమ్ పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ చూపాలి అబ్దుల్లాపూర్మెట్: గ్రేటర్లోని శివారు డివిజన్లలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చొరవ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డిరంగారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. నాగోల్ సర్కిల్–11 పరిధిలోని పెద్దఅంబర్పేట, కుంట్లూర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దఅంబర్పేట లక్ష్మారెడ్డిపాలెంలోని ఎస్ఎన్ఆర్ కళా కన్వెన్షన్ హాల్లో అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడంతో ఇక్కడి ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారని, వారిలో అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేయడానికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. నిధులు కేటాయింపులో శివారు డివిజన్లపై చిన్న చూపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దఅంబర్పేట, కుంట్లూరు డివిజన్ల అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించడంతో పాటు అన్ని విభాగాల అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీల వాసులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కృష్ణకుమారి, చీఫ్ ఇంజనీర్ అశోక్రెడ్డి, నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, బాటసింగారం సహకార సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. -
కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
అనంతగిరి: జిల్లాలో కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ తహిమీనా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొడంగల్, మర్పల్లి, తాండూరు, పరిగి, వికారాబాద్, ధారూర్, పూడూరులోని పీఏసీఎస్, డీసీఎంఎస్లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్వింటాలుకు రూ.8 వేలు కనీస మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులకు కందులు విక్రయించి మోసపోరాదన్నారు. తాండూరు రూరల్: మండలంలోని కరన్కోట్ గ్రామానికి చెందిన నితిన్గౌడ్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారం, సిల్వర్ పతకాలు సాధించారు. ఈ నెల 23న నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. నితిన్గౌడ్ సీనియర్ విభాగంలో సిల్వర్, జూనియర్ కేటగిరిలో బంగారం పతకం సాధించారు. వికారాబాద్లోని అలీ ఫిట్నెస్ జోన్ ట్రైనర్ సద్దాం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్లు నితిన్గౌడ్ తెలిపారు. తనను ప్రోత్సహించిన శ్రీనివాస్గౌడ్, సచిన్, భరత్, పవన్, సాయిమణికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు, రేపు జాతీయ సదస్సు ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధ, గురువారాల్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాధిక, సదస్సు కన్వీనర్ రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వికసిత్ భారత్–2047 డిజిటల్ ఇండియా, పరివర్తన, సాధికారిత వైపు ఒక చొరవ అనే అంశంపై సదస్సు ఉంటుందున్నారు. దేశంలోని వివిధ వర్సిటీల నుంచి నిష్ణాతులైన అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు హాజరై పరిశోధన పత్రాలను సమర్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి పాడిరైతుల వినతికడ్తాల్: పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని వివిధ గ్రామాల విజయ డెయిరీ సొసైటీ చైర్మన్లు, పాడి రైతులు కోరారు. మంగళవారం వారు హైదరాబాద్లోని తెలంగాణ పాడి పారిశ్రామాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్డీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, సంస్థ ఎండీ చంద్రశేఖర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ.. ఎస్ఎన్ఎఫ్ డిటెక్షన్ను తీసివేయాలని కోరారు. పాడిరైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పాలసేకరణ ధరలను పెంచాలని కోరారు. సకాలంలో పాలబిల్లులు అందించాలని, సబ్సిడీపై దాణ, మినరల్ మిక్చర్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్గుప్తా, పాడి రైతులు, సొసైటీ చైర్మన్లు కడారి రామకృష్ణ, రంగయ్య, శ్రీకాంత్రెడ్డి, నర్సింహారెడ్డి, జితేందర్రెడ్డి, కృష్ణయ్య, రంగనాయక్, హరి ప్రవీన్యాదవ్, నర్సింలు, దశరథ్, బాలాచారి, దుర్గేశ్, శంకర్నాయక్ తదితరులు ఉన్నారు. కొందుర్గు: గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహిస్తే సహించేది లేదని కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్ హెచ్చరించారు. భగత్సింగ్, ఛత్రపతి శివాజీ యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను విప్పి, పారబోశారు. గ్రామంలో మరోసారి మద్యం విక్రయించినట్లు తెలిస్తే స్థానికులతో కలిసి పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు పట్టించడంతో పాటు కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
పరిగి: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం 2026వ సంవత్సరం క్యాలెండర్ను మంగళవారం పరిగి పట్టణంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు. నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. పరిగి పట్టణాన్ని ఆదర్శంగా నిలుపుతాం పరిగి పట్టణ ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించి ఆదర్శంగా నిలుపుతామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.20 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
పకడ్బందీగా కోడ్ అమలు
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా కోడ్ అమలు చేస్తామని కలెక్ట్రర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తక్షణమే కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని కోరారు. మున్సిపల్ కేంద్రాల్లోని రాజకీయ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఫొటోలను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్ సుధీర్, తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
జినుగుర్తిలో క్రికెట్ అకాడమీ
● 25 మంది విద్యార్థులకు అవకాశం ● రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ తాండూరు టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ నైపుణ్యం సాధించాలని రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ అన్నారు. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు మండలం జినుగుర్తి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను క్రికెట్ శిక్షణ కేంద్రం కోసం ఎంపిక చేశారన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాల్లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తాండూరు పట్టణంలో క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. వీరు ఏ గురుకులంలో చదువుతూ క్రికెట్కు ఎంపికయ్యారో అదే గురుకులంలో వారి అడ్మిషన్ కొనసాగుతుందని, కానీ క్రికెట్లో శిక్షణ మాత్రం జినుగుర్తి మైనార్టీ గురుకులంలో ఉంటుందన్నారు. మైనార్టీ విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకే గురుకుల సొసైటీ సెక్రటరీ బి షఫీవుల్లా, స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేశ్వర్ గురుకులాల్లో క్రీడా అకాడమీలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్రీడకు ఒక్కో మైనార్టీ గురుకులాన్ని ఎంపిక చేశారన్నారు. దీనిలో భాగంగానే జినుగుర్తి ౖమైనార్టీ గురుకుల పాఠశాలలో క్రికెట్ అకాడమీ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి ఆర్ఎల్సీ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు గురుకుల ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా, కొడంగల్ కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేందర్, పీడీ గోపాల్, శ్రీశైలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
● జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి ● పలు ఆస్పత్రుల సందర్శన తాండూరు టౌన్: విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించరాదని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి సిబ్బందికి సూచించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రం, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్స్తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించాలని, రోగులకు ఓర్పుతో వైద్య సేవలందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎంసీహెచ్లో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లను తనిఖీ చేశారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలకు తగిన పోషకాహారం అందించాలన్నారు. అలాగే పిల్లలతో ఉండే తల్లులకు ప్రభుత్వం కేటాయించిన దినసరి వేతనాన్ని అందజేయాలన్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని, విధులను సక్రమంగా నిర్వర్తించని ఎడల శాఖాపరమైన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీనివాసులు, ఆస్టిన్, సత్యం, సువర్ణ పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి పాలీయేటివ్ కేర్ సెంటర్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బందికి హెపటైటీస్ బీ వాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో వీ శ్రీనివాసులు, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యం, ఇన్ సీడీ కోఆర్డినేటర్ జయరాములు తదితరులు పాల్గొన్నారు. -
‘వీబీ జీ రామ్ జీ’తో గ్రామ స్వరాజ్యం
తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టంతో మహాత్మాగాంఽఽధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మండలం వీర్శెట్టిపల్లిలో సర్పంచ్ లక్ష్మి అధ్యక్షతన వీబీ జీ రామ్ జీ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యానికి జీవం పోసే సంస్కరణ, అవినీతికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ కొత్త చట్టం తెచ్చారని తెలిపారు. ప్రజాధనం ప్రజల చేతుల్లోకి చేరేలా చేసే బలమైన మార్గమన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బిహార్లో రూ.5 వేల కోట్లు, ఉత్తర్ప్రదేశ్లో రూ.10 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నిధుల వినియోగంలో సర్పంచులే కీలకం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకానికి ఆధార్తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. తద్వారా నకిలీ లబ్ధిదారులకు చెక్ పెట్టామన్నారు. కొత్త చట్టం ద్వారా వంద రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచామని పేర్కొన్నారు. గ్రామాల్లో శాశ్వత ఆస్తులు సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం తెచ్చామని తెలిపారు. నిధులపై తుది నిర్ణయం ఢిల్లీది కాదని.. క్షేత్రస్థాయిలో ఉండే సర్పంచ్లదే అన్నారు. పని చేసిన 15 రోజుల్లో కూలీల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. గతంలో పోలిస్తే ఉపాధి హామీ పథకం కింద రూ.86 వేల కోట్ల నుంచి రూ.లక్ష 51 వేల కోట్ల నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.07లక్షలు ఇస్తోందన్నారు. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఇచ్చి కాంగ్రెస్ కార్యకర్తలకు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రూ.38 వేల కోట్లతో వడ్లను కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెబుతున్నారని.. కానీ ఇందులో రూ.34 వేల కోట్లు కేంద్రం ఇచ్చినవేనని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.1.20 లక్షల వరకు లాభం చేకూరుస్తోందన్నారు. 90 శాతం సబ్సిడీతో యూరియా ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం బైక్పై పాత తాండూరు – వీర్శెట్టిపల్లి రోడ్డును పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ బాలేశ్వర్ గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, మండల అధ్యక్షుడు విజయ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంజీవ్రెడ్డి, ఉప సర్పంచ్ జర్నప్ప తదితరులు పాల్గొన్నారు. గాంధీ ఆశయాలను నెరవేరుస్తున్న ప్రధాని మోదీ సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
పుర నగారా
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026వికారాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలింగ్ బూత్లను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12న పోలింగ్, 13న కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం నాలుగు పురపాలికలు.. 100 వార్డులు ఉన్నాయి. వికారాబాద్ పుర పీఠం ఎస్సీ మహిళకు, తాండూరు బీసీ జనరల్కు, పరిగి బీసీ మహిళకు, కొడంగల్ జనరల్కు కేటాయించారు. అమలులోకి ఎన్నికల కోడ్ మున్సిపల్ ఎన్నికల కోడ్ మంగళవారం సాయంత్రం నుంచి అమలులోకి వచ్చింది. ఓటర్లను ప్రలోభపెట్టే కొత్త పథకాలు, కార్యక్రమాలు నిర్వహించరాదు. నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మరో నెలరోజుల పాటు బ్రేక్ పడనుంది. కొత్త లబ్ధిదారుల ఎంపిక ఉండదు. పాత పథకాలు యథావిధిగా కొనసాగనున్నాయి. గోడలపై రాతలు, పార్టీ సంబంధ పోస్టర్లను తొలగిస్తున్నారు. దేశ నాయకులు మినహా ఆయా పార్టీల నేతల విగ్రహాలకు ముసుగులు తొడగనున్నారు. రేసులో.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల్లో రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లు ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వికారాబాద్లో కాంగ్రెస్ తరఫున స్పీకర్ కూతురు లేదా మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె బరిలో ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ తరఫున బలమైన అభ్యర్థి పోటీలో ఉండే అవకాశం ఉండటంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అదేస్థాయి నాయకులను పోటీలో ఉంచాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాండూరులో కాంగ్రెస్ తరఫున రవిగౌడ్, బీఆర్ఎస్ తరఫున మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ భర్త నర్సింహులు పోటీలో ఉండే అవకాశం ఉంది. పరిగిలో బీఆర్ఎస్ తరఫున శివన్నొళ్ల భాస్కర్ భార్యను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. కొడంగల్ జనరల్ కావడంతో ఇరు పార్టీలు బలమైన నేతల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ఒకే విడతలో పోలింగ్ అమలులోకి వచ్చిన కోడ్ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం జిల్లాలో నాలుగు పురపాలికలు వంద వార్డులుమున్సిపాలిటీల వారీగా వార్డులు, ఓటర్లు మున్సిపల్ వార్డులు పురుషులు సీ్త్రలు మొత్తం ఓటర్లు జనాభా వికారాబాద్ 34 28,751 29,339 58,117 63,649 తాండూరు 36 37,547 39,558 77,110 71,008 పరిగి 18 13,822 13,792 27,614 18,241 కొడంగల్ 12 5,661 6,007 11,688 14,294 అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్లో రెండు నుంచి మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి సెంటర్ వద్ద ఆర్ఓ, ఏఆర్ఓ అందుబాటులో ఉంటారు. ఉదయం 10.30నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు మొత్తం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ వార్డులు జనరల్ మహిళ జనరల్ మహిళ జనరల్ మహిళ జనరల్ మహిళ వికారాబాద్ 34 1 1 4 3 4 4 9 8 పరిగి 18 1 0 1 1 3 3 5 4 కొడంగల్ 12 1 0 1 1 2 1 4 2 తాండూరు 36 1 0 1 1 8 7 10 8 మొత్తం 100 4 1 7 6 17 15 28 22 మున్సిపాలిటీ -
విద్యుత్ ఏఈ కార్యాలయం ప్రారంభం
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి సంబంధించి ట్రాన్స్కో ఏఈ కార్యాలయాన్ని డీఈ శ్యామ్సుందర్ రెడ్డి ప్రారంభించారు. ఇదివరకు కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ రెండు మండలాలకు ఒకే ఏఈ విధులు నిర్వహించేవారు. అయితే ఇటీవల జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి నూతనంగా నర్సింలు అనే ఏఈని నియమించారు. కాగా సోమవారం తాత్కాలిక ఏఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ ఇక నుంచి మండలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఏఈ అందుబాటులో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో ఏడీ సత్యనారాయణ, కేశంపేట ఏఈ ఈశ్వర్, కొందుర్గు ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ పోలీసులకు అవార్డులు
● 29 మందికి ప్రశంసా పత్రాలు ● అందజేసిన కలెక్టర్, ఎస్పీ అనంతగిరి: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 29 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ స్నేహ్రమెహ్ర ప్రశంసా పత్రాలు అందజేశారు. ధారూరు సీఐ సీహెచ్.రఘురాములు, మోమిన్పేట్ ఎస్ఐ ఎం.అరవింద్, డీపీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు మొహమ్మద్ అయూబ్, ఎం.సాయిప్రసాద్, ఐటీ సెల్ ఎం.కేశవులు అవార్డు అందుకున్నారు. కృష్ణ(డీసీఆర్బీ), ఎస్.ప్రమీల, కె.మీన (డీఎస్బీ, టి.రామకృష్ణ (క్లూస్ టీమ్), ఎం.పార్వతీశం (పీసీఆర్), చంద్రశేఖర్(డీటీసీ) ప్రశంసా పత్రాలు అందుకున్నారు. భరోసా కేంద్రం సపోర్ట్ పర్సన్ జి.హెప్జిబా, టాస్క్ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ వి.రమేష్ తోపాటు హెడ్ కానిస్టేబుళ్లు జమీల్(చెంగోముల్), రమేష్ వర్మ(కొడంగల్), ఎస్.గోపాల్, జహంగీర్ పాషా(పరిగి), బలరామ్(మోమిన్పేట్), నర్సింలు(వికారాబాద్), నరేష్(ధారూరు), జయవర్ధన్(సీసీఎస్), సాయికృష్ణ యాదవ్(తాండూరు), అశోక్ కుమార్(కరంకోట్), శ్రీనివాస్(యాలాల), కె.నాగేంద్ర (బషీరాబాద్), జగ్గమ్మ, హోంగార్డులు ఆర్.వెంకటయ్య, సత్యనారాయణ, శేఖర్,(డీఏఆర్) అవార్డులు పొందారు. -
ట్రాక్టర్ బోల్తా, వ్యక్తి మృతి
కొడంగల్ రూరల్: పంటపొలంలో కరిగెట చేస్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి ఉడిమేశ్వరం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అప్పాయిపల్లికి చెందిన చిన్నదస్తప్ప(36)గ్రామంలోని చంద్రమ్మ ఇంటికి ఇళ్లరికం వచ్చాడు. అంజిలప్ప దగ్గర ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సదరు వ్యక్తి.. కరిగెట కొడుతుండగా.. ట్రాక్టర్ బోల్తాపడి మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య శ్యామల, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతుడి అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. బస్సు ఎక్కుతుండగా మహిళల ఘర్షణ శంకర్పల్లి: బస్టాండ్లో మహిళల మధ్య జరిగిన గొడవ కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్లిన సంఘటన సోమవారం శంకర్పల్లిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెహదీపట్నానికి చెందిన ఓ యువతి(19) రెండు రోజుల క్రితం తన అమ్మమ్మ ఊరైన మండలంలోని చెందిప్ప గ్రామానికి వచ్చింది. సోమవారం తిరుగు ప్రయాణం అయ్యేందుకుగాను శంకర్పల్లి బస్టాండ్కి వచ్చింది. మెహదీపట్నం బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయత్నించగా.. ఓ కుటుంబానికి చెందిన నలుగురు మహిళలతో ఆ యువతికి ఘర్షణ తలెత్తింది. అది కాస్త పెద్దది కావడంతో నలుగురు కలిసి ఆ యువతిని కొట్టడంతో పాటు, కొద్దిమేర దుస్తులు చించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళలు సైతం ఆ యువతే తమని ఇబ్బందులకు గురి చేసిందంటూ ఫిర్యాదు చేశారు. ఇరువురు ఫిర్యాదులు స్వీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు. ఓపెన్ వర్సిటీలో వ్యవసాయ ఆధారిత కోర్సులు బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో త్వరలో వ్యవసాయ ఆధారిత వృత్తి నైపుణ్య కోర్సులను ప్రారంభిస్తామని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి చెప్పారు. వర్సిటీలో సోమ వారం జరిగిన గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు, రైతులకు మేలు జరిగేలా ఈ కోర్సులను రూపొందిస్తామని తెలిపారు. మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమ య్యే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆదిబట్ల ఏసీపీగా..ప్రదీప్కుమార్ బాధ్యతలు ఇబ్రహీంపట్నం: ఆదిబట్ల ఏసీపీగా డీకే ప్రదీప్కుమార్ సోమ వారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్స్టేషన్ను ఇటీవల హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చి డివిజన్ ఏసీపీ స్థాయి హోదాను కల్పించిన సంగతి తెలిసిందే. నూతన డివిజన్ కార్యాలయానికి ఏసీపీగా ప్రదీప్కుమార్ను నియమించడంతో అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో సమావేశమై ప్రజా భద్రత, నేరాలను అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు, స్నేహపూర్వక పోలీసింగ్ వ్యవస్థ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
పల్లెల్లో షార్ట్ ఫిల్మ్ షూటింగ్
దుద్యాల్: మండల పరిధిలోని లగచర్లకు చెందిన ఈర్లపల్లి రమేశ్ షార్ట్ ఫిల్మ్లతో ఆకట్టుకుంటున్నారు. తాను నూతనంగా నిర్మిస్తున్న ఓ లఘు చిత్రంలోని పాటను సోమవారం దుద్యాల్, చౌడాపూర్ మండలాల్లోని పలు గ్రామాలతో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించారు. మారుమూల పల్లెల్లో జరిగిన షూటింగ్ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. జెండావిష్కరణ వివాదాస్పదం బషీరాబాద్: మండల పరిధి జీవన్గీ గ్రామం చావడి కార్యాలయంలో ఉప సర్పంచ్ జర్నప్ప జాతీయ జెండా ఎగురవేయడం వివాస్పదంగా మారింది. రెవెన్యూకు సంబంధించిన కార్యాలయంపై ఎప్పుడైనా జెండాను రెవెన్యూ అధికారులే ఎగురవేసేవారని, అలాంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎలా చేశాడని అధికార పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఇదే విషయమై తహసీల్దార్ షాహెదాబేగంకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఉప సర్పంచ్ హోదాలో కానీ, పార్టీ నాయకుడిగా జెండా ఎగరవేయలేదని, గ్రామస్తుల సూచన మేరకే చేశానని ఉప సర్పంచ్ జర్నప్ప మీడియాకు వివరణ ఇచ్చారు. ప్రత్యేక అలంకరణలో కపిలేశ్వర స్మామి ధారూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఆలయంలో కపిలేశ్వర స్మామి త్రివర్ణ పతాకం వర్ణంతో భక్తులకు దర్శనమిచ్చారు. పూజారి చెన్నబసవయ్యస్వామి సోమవారం.. మూడు రంగులతో అలంకరించి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదం వితరణ చేశారు. కారుతో బీభత్సం కేసులోఇద్దరికి రిమాండ్ యాచారం: మద్యం మత్తు, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐని కారుతో ఢీకొట్టిన ఇద్దరిని యాచారం పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వివరాలిలా ఉన్నాయి. సాగర్ హైవేపై ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలో సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధులు తమ సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం తాగి కారులో ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కొహెడ్కు చెందిన కె.శ్రీకర్, హయత్నగర్కు చెందిన పి.నితిన్లు మండల కేంద్రం వద్దకు రాగానే డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి తప్పించుకునే యత్నం చేశారు. అది గమనించిన ఎస్ఐ మధు ఆపే ప్రయత్నం చేయగా కారును నడిపిస్తున్న శ్రీకర్ మరింత వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. కారును నిలిపే ప్రయత్నంలో ఎస్ఐ బానెట్ను గట్టిగా పట్టుకున్నాడు. మరింత వేగం పెంచి మార్గమధ్యలో మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్రెడ్డి, ఆయన కొడల దివ్యను, ఆమె కొడుకును ఢీకొట్టాడు. ఈ సంఘటనలో శ్రీకర్ ఉద్దేశపూర్వకంగా ఎస్ఐతో పాటు మరో ముగ్గురిని కారుతో ఢీకొట్టాడని కేసు నమోదు చేశారు. ఈ మేరకు శ్రీకర్, నితిన్లను సోమవారం రిమాండ్కు పంపినట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. -
హెపటైటిస్– బి టీకా తప్పనిసరి
పూడూరు: వ్యాధినిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ హెపటైటిస్– బి వాక్సిన్ (హెచ్బీవీ)ను తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ దేవిక సూచించారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కామెర్ల వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ టీకా అందిస్తుందని తెలిపారు. తొలుత ఆస్పత్రి సిబ్బందికి వేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ కిజర్పాషా, నాయకులు వెంకట్రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉండాలి కుల్కచర్ల: హెపటైటిస్– బీ వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మండల వైద్యాధికారి కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం నేషనల్ వైరస్ హైపటైటిస్– బి కంట్రోల్ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో అక్కడి వైద్య సిబ్బందికి హెపటైటిస్– బి వ్యాక్సిన్ మూడు డోసులకు గాను మొదటి డోస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలుషిత రక్తమార్పిడి, సూదుల వాడకం తదితర వాటి వలన ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. ఆకలి లేకపోవడం, బలహీనత, వాంతులు, ముదురుగా మలవిసర్జన, పసుపు చర్మం వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరికై నా ఇలాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యురాలు మాధురి, అరుణ, హెల్త్ అసిస్టెంట్ వెంకట్, అంజూ, టీబీ కోఆర్డినేటర్ రాజు, శ్రీను వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆ పనులకే శంకుస్థాపనలు
ఇబ్రహీంపట్నం: గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులకే తిరిగి శంకుస్థాపనలు చేస్తూ.. రూ.220 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు గొప్పలు చెప్పుకొంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పట్లో తాను నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చిన నిధుల వివరాలను ప్రొసీడింగ్స్తో సహా మీడియా మందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తున్నాడే తప్ప కొత్తగా నిధులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.220 కోట్లు మంజూరు చేయించినట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ విసిరారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందా చేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధిచెబుతారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అన్నీ బీఆర్ఎస్ హయాంలో మంజూరైనవే.. -
జాతీయ జెండాకు అవమానం
చేవెళ్ల: మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఇక్కడ ఓ స్థానిక నాయకుడు జెండాను ఆవిష్కరించగా, అపసవ్య దిశలో ఎగుతున్న జెండాను గమనించిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ మాధవిరాంరెడ్డి జాతీయ జెండాను కిందికి దించి, సరిచేసిన అనంతరం మళ్లీ ఎగురవేశారు. ఈ విషయంపై సర్పంచ్, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేయగా, పొరపాటు జరిగిందని జెండా కట్టిన వారు చెప్పారు. అయితే, పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను సర్పంచ్ లేదా పంచాయతీ సెక్రటరీ ఎగరేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ సీనియర్ నాయకుడితో జెండావిష్కరణ చేయించారు. ఈ విషయమై ఎంపీడీఓ, ఎంపీఓను అడగగా, విషయం మా దృష్టికి రాలేదని, తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జెండావిష్కరణలో అపశ్రుతి మంచాల: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో మండలంలోని ఆంబోత్ తండాలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేస్తుండగా తాడుతో పాటు పతాకం కింద పడింది. మువ్వెన్నెల జెండా ఎగుర వేసే సమయంలో అపశ్రుతి జరగడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. జెండా ఎత్తని పాఠశాలలు పహాడీషరీఫ్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని విద్యా సంస్థల్లో సోమవారం సంబురాలు నిర్వహించగా, జీహెచ్ఎంసీ జల్పల్లి సర్కిల్లోని సెయింట్ ఫ్లవర్, సెయింట్ మర్యామ్ పాఠశాలలు వేడుకలకు దూరంగా ఉన్నాయి. కనీసం ఆయా స్కూళ్ల గేట్లు కూడా తెరవలేదు. ఇది గమనించిన గ్రామ యువజన సంఘాల నాయకులు గౌర మురళీకృష్ణ, శ్రీకాంత్గౌడ్, యంజాల శివకుమార్, యాదగిరి, దూడల శివకుమార్ తదితరులు స్కూళ్ల వద్దకు వెళ్లి నివ్వెరపోయారు. వెంటనే ఫోన్లో సదరు యాజమాన్యాలను సంప్రదించగా, తమకు ఆరోగ్యం బాగోలేదని, పరీక్షలు ఉన్నాయని పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆగ్రహానికి గురైన యువకులు ఆయా స్కూళ్ల ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయాన్ని పహాడీషరీఫ్ పోలీసులతో పాటు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
‘కండల ఇంజెక్షన్ల’ పట్టివేత!
సాక్షి, సిటీబ్యూరో: అత్యవసర వైద్య సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ సోమవారం వివరాలు వెల్లడించారు. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ ఖాన్ ఫర్మిచర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. జిమ్కు వెళ్లే అలవాటు ఉన్న ఫైజల్ అక్కడ కొందరు యువకులు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా వాడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇదే అదనుగా తేలిగ్గా డబ్బు సంపాదించడానికి వీటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇండియా మార్ట్ యాప్ ద్వారా సూరత్ నుంచి ఈ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.150కి ఖరీదు చేసి జిమ్కు వచ్చే యువతకు రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నాడు. యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ బరువులు ఎత్తడానికి, కండలు పెంచుకోవడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్గా ఈ ఇంజెక్షన్ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా అనేక దుష్పరిణామాలు.. ఫైజల్ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ యదేందర్, ఎస్సై మహ్మద్ జాహెద్ తమ బృందాలతో వలపన్ని అత్తాపూర్లోని ఏసియన్ థియేటర్ వద్ద పట్టుకున్నారు. అతడి వద్దనున్న 133 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఇంజెక్షన్లను కొన్నాళ్లు ఫైజల్ కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతోపాటు మానసిక ఇబ్బందులు వస్తాయని అదనపు డీసీపీ హెచ్చరించారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆయన కోరారు. -
దేవాలయం ధ్వంసంపై ఆందోళన
షాద్నగర్: మండల పరిధిలోని కిషన్నగర్లో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనంతో ఢీకొట్టి బంగారు మైసమ్మ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, వీహెచ్పీ రాష్ట్ర ప్రముఖ్ మఠం రాచయ్య, బజరంగ్దళ్ నాయకులు దేవాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవాలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొంత కాలంగా కొందరు దేవాలయాలను టార్గెట్చేశారని, ఆలయాల పరిరక్షణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కక్కునూరు వెంకటేశ్గుప్తా, వంశీకృష్ణ, చెట్ల వెంకటేశ్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్సిగ్, సురేష్, మహేందర్రెడ్డి, మల్చలం మురళి, వెంకటనోళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
యువకుడి పరిస్థితి విషమం పూడూరు: బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చన్గోముల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంగడిచిట్టంపల్లికి చెందిన ప్రశాంత్గౌడ్(26) మన్నెగూడ నుంచి స్వగ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కండ్లపల్లి రెవెన్యూ పరిధిలోని నీలగిరి కేఫ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ క్రమంలో మరో వాహనం ఢీకొట్టడంతో తల, కాలికి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందన్నారు. బాధితుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలయ భూముల పరిరక్షణకు కృషి దేవాదాయ శాఖ అధికారి ప్రణీత్కుమార్, ఈఓ బాలనర్సయ్య దోమ: ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తు న్నామని దేవాదాయ శాఖ అధికారి ప్రణీత్కుమార్, ఈఓ బాలనర్సయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని గంజిపల్లిలో సర్వే నంబర్ 2లో 3.18 ఎకరాల భూమి హనుమాన్ దేవాలయం పేరిట ఉంది. ఈ భూ మిలో టి.బాలసింగ్, సుందర్బాయి, నరేందర్సింగ్, చందర్సింగ్, అజయ్సింగ్, రత్నబాయి, మోహన్సింగ్ అనే వ్యక్తులు కబ్జాలో ఉండగా. గ్రామానికి చెందిన అలిగిరి వెంకటేశ్ సర్వేకు పెట్టారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారి ప్రణీత్కుమార్, ఈఓ బాలనర్స య్య, నవాబుపేట ఈఓ శాంతకుమార్, పోలేపల్లి ఈఓ రాజేందర్రెడ్డితో కలసి సర్వేయర్ కిరణ్కుమార్ సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు. ఆలయ భూముల ఆక్రమనకు యత్నిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ మల్లేశ్, మాజీ సర్పంచ్ కల్పన, గ్రామస్తులు వెంకటేశ్, లాలు, సత్తి పాల్గొన్నారు. రెచ్చిపోయిన వీధి కుక్కలు యాచారం: మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో శనివారం వీధి కుక్కల దాడిలో నలుగురు గాయపడ్డారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఎ.మణికుమార్, మంగమ్మ, సునీల్, కృష్ణవేణి తమ వ్యక్తిగత పనుల నిమిత్తం బయట ఉండగా వీధి కుక్కలు వారిపై దాడి చేసి గాయపరిచాయి. మరో ఘటనలో యాచారం గ్రామానికి చెందిన మస్కు యాదయ్య, కొండాపురం యాదయ్యకు చెందిర రెండు మేకలపై దాడి చేసి చంపివేసాయి. -
సర్కారు బడిలో చోరీ
● తలుపులు, బీరువా ధ్వంసం ● ట్యాబ్, ప్రైజ్ల అపహరణ ● కుల్కచర్ల పీఎస్లో కేసు నమోదు కుల్కచర్ల: మండల పరిధిలోని పీరంపల్లి ప్రాథమిక పాఠశాలలో చోరీ జరిగింది. శనివారం ఉదయం ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చేసరికే స్కూల్ తలుపులు తెరిచి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా, బీరువా ధ్వంసం చేసి ఉంది. అందులో దాచిన ట్యాబ్తో పాటు 26న విద్యార్థులకు బహూకరించాల్సిన 13 ప్రైజ్లు, చిన్నచిన్న వస్తువులు చోరీకి గురయ్యాయి. గతంలో కూడా దొంగతనం జరిగిందని, అప్పట్లో ట్యాబ్ ఎత్తుకెళ్లారని హెచ్ఎం అలివేలు తెలిపారు. ఉపాధ్యాయులు సొంత డబ్బులు వేసుకుని మరో ట్యాబ్ తీసుకురాగా అది కూడా చోరీకి గురైందన్నారు. వీటి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
వెరీ ‘గుడ్డు’
● స్పెషల్ టెండర్ల ద్వారా అంగన్వాడీ, వసతి గృహాలకు కోడిగుడ్డు సరఫరా ● పారదర్శకత పెంచేందుకుప్రత్యేక ముద్రలు ● ప్రతీ పదిరోజులకు రంగు మార్పు అంగన్వాడీలకు, వసతిగృహాలకు సరఫరా చేసే కోడిగుడ్లలో అక్రమాలు అరికట్టేందుకు, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గుడ్లపై ప్రత్యేక వర్ణంలో ముద్రలు వేసి సరఫరా చేస్తోంది. దౌల్తాబాద్: ప్రభుత్వ పథకాలలో నాణ్యత, పారదర్శకతకు రాష్ట ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాల్లో అందించే పౌష్టికాహార సరఫరాలో లోపాలకు తావివ్వకుండా టెండర్ల విధానం తీసుకువచ్చింది. గతంలో కోడిగుడ్లు చిన్నవిగా ఉన్నాయని.. మురిగిన గుడ్లు సరఫరా చేసశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థులకు తాజా గుడ్లు అందించేందుకు కొత్త టెండర్ విధానాన్ని తీసుకొచ్చారు. గుడ్లపై ముద్రలు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మండలంలో అన్ని గ్రామాల్లోని కేంద్రాల్లో ముద్ర ఉన్న గుడ్లను అందిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలోనే టెండర్లు గతంలో జిల్లా స్థాయిలో శాఖల వారీగా కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు నిర్వహించేవారు. గతంలో గుడ్ల నాణ్యతపై విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాకి శ్రీకారం చుట్టింది. జిల్లా అధికారుల పర్యవేక్షణలోనే టెండర్లు ఖరారు చేస్తున్నారు. నాణ్యత, సరఫరా విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించింది. నిబంధనలు ● ఒక్కో గుడ్డు బరువు 45–52 గ్రాములు ఉండడంతో పాటు 30 కోడిగుడ్ల ట్రే బరువు 1,350 గ్రాములు ఉండాలి. ● ప్రతీ నెలా మూడు విడతలుగా నాణ్యమైన గుడ్లను అందించాలి. ● ప్రతి గుడ్డుపై 8మి.మీ చుట్టు కొలతలతో జిల్లా వివరాలు ఉండాలి. ● పదిరోజులకు ఒకసారి గుడ్డుకు వేసే రంగు ముద్ర మారుతుంది. దీంతో కోడిగుడ్ల సరఫరాలో పారదర్శకత ఏర్పడుతుంది. -
గంజాయి విక్రేతల అరెస్ట్
తాండూరు టౌన్: నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని పట్టణ సీఐ సంతోష్ కుమార్ శనివారం తెలిపారు. తాండూరు పట్టణ శివారులోని మాధుర్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు గాంజాను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి, ఎండీ ఫయాజ్ అబ్దుల్ ఖాన్, రఫీక్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి నుంచి 1.8 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు పట్టణ శివారులోని చెన్గేస్పూర్ రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి పేకాట స్థావరంపై దాడి చేశామని, అమీర్, ఇమ్రాన్, సద్దాం, అబ్దుల్ మెహరాజ్, జమీర్ అనే ఐదుగురిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. వారి నుంచి కొంత నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని వెల్లడించారు. 1.8 కిలోలు స్వాధీనం -
సర్వేతో భూమి హక్కులకు భద్రత
పూడూరు: ప్రభుత్వం భూభారతి భూ సర్వే, రీ సర్వే ద్వారా రైతుల భూమి హక్కులకు పూర్తి భద్రత కల్పిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని పోతిరెడ్డిగూడలో భూసర్వే రీసర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డు మాదిరి భూభారతిలో భూధార్ కార్డులు అందిస్తామన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారాని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ మధుసూదన్, అదనపు కలెక్టర్ వాసుచంద్ర, తహసీల్దార్ విజయ్కుమార్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ షకీల్, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
లాభాల సంక్రాంతి
షాద్నగర్: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వలస జీవులు, ఉద్యోగులు, పట్టణాల్లో నివాసం ఉంటున్నవారు సొంతూళ్లకు వెళ్లారు. సంతోషంగా పండుగ ముగించుకుని తిరిగి తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. పది రోజుల పాటు బస్సులు, బస్టాండ్లు జనంతో కిటకిటలాడాయి. పది రోజుల్లో రూ.2.18 కోట్లు సంక్రాంతిని పురస్కరించుకుని షాద్నగర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించారు. ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు నడిపించిన బస్సులతో భారీగా ఆదాయం సమకూరింది. పది రోజుల్లో 3,27,000 కిలోమీటర్లు తిరిగిన బస్సులతో 3,94,505 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో రూ.2.18 కోట్ల రాబడి వచ్చింది. పండగ సెలవుల ప్రారంభం రోజు 10న రూ.24 లక్షలు, చివరి రోజు 19న రూ.34 లక్షలకు పైగా సమకూరింది. మహిళా ప్రయాణికులే అధికం మహిళలకు ఉచిత బస్సు పథకంతో సంక్రాంతి వేళ భారీ సంఖ్యలో మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. పది రోజుల్లో మొత్తం 3,94,505 మంది ప్రయాణించగా అందులో మహిళలు 2,39,972 మంది ఉండడం గమనార్హం ఆర్టీసీకి దండిగా ఆదాయం పది రోజుల్లో పండుగేపండుగ షాద్నగర్ డిపోకు రూ.2.18 కోట్ల రాబడి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపించాం. పది రోజుల్లో డిపోకు రూ.2.18 కోట్ల ఆదాయం వచ్చింది. మహిళా ప్రయాణికులు అధికంగా బస్సుల్లో ప్రయాణించారు. – ఉష, డిపో మేనేజర్, షాద్నగర్ -
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ దుద్యాల్: పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సేవల ఏర్పాటుపై డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్యాదవ్ శనివారం పలు సూచనలు చేశారు. హకీంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు డాక్టర్ వందనతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతరకు దాదాపుగా 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అందుకు తగిన విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. అవసరమైన చోట క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలని సూచించారు. మందుల నిల్వలను సరిచూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ కృష్ణయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు. కొత్త లేబర్ కోడ్లతో కార్మికులకు అన్యాయం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు కొత్తూరు: కార్మికచట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న నాలుగు లేబర్కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్లో ఉన్న ఓ రిసార్ట్స్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సవరణ బిల్లు, వీబీ రామ్జీ చట్టం, నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని వచ్చేనెల 16న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కోడ్ల కారణంగా కార్మికులు అన్ని విధాలా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, ప్రజలు, రైతులకు నష్టం చేసే నూతన చట్టాల అమలును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, మల్లేష్, జైపాల్రెడ్డి, కిర్య, శ్రీకాంత్, శ్రీశైలం, హరికుమార్, సతీష్, శ్రీకాంత్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. క్రీడాపోటీలతో స్నేహభావం పెంపు ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్రెడ్డి ఆమనగల్లు: యువత క్రీడల్లోనూ రాణించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని అయ్యప్పకొండ సమీపంలో నిర్వహిస్తున్న మహేశ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా పోటీల నిర్వహణతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీలు ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు యాదవ్, టోర్నీ నిర్వాహకులు సతీశ్, ప్రసాద్, లక్ష్మణ్, స్థానిక నాయకులు చంద్రశేఖర్రెడ్డి, అంజినాయక్, ఒగ్గు మహేశ్, రాజు, రంజిత్, సుమన్, కిరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు. -
వీబీ జీ రామ్జీ బిల్లు రద్దు చేయాలి
కొడంగల్ రూరల్: వీబీ జీ రామ్జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని మార్కెట్యార్డు సమీపంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుస్స చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి పనులు ప్రారంభించాలని కోరారు. రోజు కూలి రూ.600 ఇవ్వాలన్నారు. ఏళ్లుగా కష్టపడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కొత్తగా నాలుగు కోడ్లు తీసుకురావడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు మల్లయ్య, వెంకటయ్య, గుండప్ప, రాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
షాద్నగర్రూరల్: షాద్నగర్ మున్సిపాలిటీని ఆ దర్శంగా తీర్చిద్దిదడమే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో వ్యత్యాసం ఏమిటో ప్రజలే గ్రహిస్తున్నారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచి చేసేవారికి ఓటువేసి న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించాలని కోరారు. మాకు ఎవరు నాయకులు లేరని, ప్రజలే మాకు బాసులని, వాళ్లు చెప్పిందే మాకు వేదమన్నారు. అవినీతికి దూరంగా, అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన అందిస్తున్నామన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకోసం పనిచేసే నాయకులకే టికెట్ ఇస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్యాంసుందర్రెడ్డి, తాండ్ర విశాలశ్రావణ్రెడ్డి, నాయకులు కాశీనాథ్రెడ్డి, అగ్గనూరు విశ్వం, వన్నాడ ప్రకాశ్గౌడ్, మహ్మద్ అలీఖాన్బాబర్, శివశంకర్గౌడ్, కృష్ణారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బాల్రాజ్గౌడ్, సర్వర్పాషా, దామోదర్రెడ్డి, బస్వం, అందె మోహన్, ఖాజాఇద్రీస్అహ్మద్, రఘునాయక్, పురుషోత్తంరెడ్డి, జితెందర్రెడ్డి, కొమ్ముకృష్ణ, మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
మహిళ దారుణ హత్య
తాండూరు రూరల్: మహిళ గొంతుకోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్దేముల్ ఎస్ఐ శంకర్ వివరాల ప్రకారం.. రేగొండి గ్రామ శివారు అటవీ ప్రాంతాంలోని ఓ కాల్వ వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి వద్ద ఉన్న ఆధార్ కార్డులోని వివరాల ద్వారా ఆమె, యాలాల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన లొంకల పద్మమ్మ(45)గా గుర్తించారు. వికారాబాద్ నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నిత్యం తాండూరుకు వచ్చి అడ్డా కూలీగా పని చేసుకుంటుందని, గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పనికోసం తీసుకెళ్లి, హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఐ శంకర్తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పద్మమ్మ నాలుగు రోజుల క్రితం పనికోసం బయటకు వెళ్లి, ఇంటికి వెళ్లలేదని తెలిసింది. వరినాట్లు వేసేందుకు వెళ్లి, ఒక్కోసారి వారం రోజుల వరకూ పని ప్రాంతంలోనే ఉంటారని, అలాగే వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. మృతురాలి భర్త చనిపోగా, ఓ కూతురు ఉంది. పెద్దేముల్ మండలం రేగొండిలో ఘటన డాగ్స్క్వాడ్, క్లూస్టీంతో ఆధారాలు సేకరించిన పోలీసులు మృతురాలిది యాలాల మండలం పగిడిపల్లి -
ఉమ్మడి రంగారెడ్డిని పునర్నిర్మించాలి
● జిల్లా సాధన సమితి సభ్యుల డిమాండ్ ● తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికివినతిపత్రం అందజేతతాండూరు టౌన్: రంగారెడ్డి జిల్లా పునర్నిర్మాణం జరగాలని ఉమ్మడి జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి తిరుపతి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలను విడదీసి, పూర్తిగా గ్రామీణ నేపథ్యం కలిగిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 317 జీఓతో రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి వికారాబాద్ జిల్లాకు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు శాశ్వతంగా బదిలీ అయ్యారని, దీంతో ఇక్కడి నిరుద్యోగులు నష్టపోతున్నారని తెలిపారు. వీటితో పాటు అనేక అంశాల్లో జిల్లా నష్టపోతోందని, ప్రభుత్వం పునరాలోచించి పూర్వ రంగారెడ్డి జిల్లాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిశ్రావణ్, శ్రీశైలం, రాజు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
బీసీలను దగా చేస్తున్న ప్రభుత్వం
● రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డు పడుతోంది ● కోర్టు కేసు తేలకుండా ఎన్నికలకు వెళ్లడం పెద్ద కుట్ర ● బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యఅనంతగిరి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల జీవితాలు, ఆత్మగౌరవంతో ఆడుకుంటోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. వికారాబాద్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టు కేసు తేలకుండా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించ డం ఆవర్గాలను దగా చేయడమేనని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే కేసు హైకోర్టులో నడుస్తోందని తెలిపారు. గత నవంబర్లోనే విచారణ ఫుల్ బెంచ్పైకి రావాల్సి ఉన్నా.. కేసు వాదించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.300 కోట్ల గ్రాంట్ రా దనే కారణంతోనే ఎన్నికలు పూర్తిచేశారన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల అంశం బలంగా ఉందని వివరించారు. ఏ కోణంలో చూసినా కేసు గెలుస్తామని, ఇందుకోసం అన్నివిధాలా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు గెలిపించడానికి ప్రయత్నం చేయని ప్రభుత్వం, ఎన్నికలకు తొందరపడటంలో కుట్ర దాగి ఉందన్నారు. రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగపరమై, న్యాయపరమైన అవరోధాలేమీ లేవన్నారు. ప్రజల్లో బీసీ ఉద్యమం బలంగా ఉందని, ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ ల మేరకే రిజర్వేషన్ల పెంపును అడుగుతున్నా మని స్పష్టంచేశారు. ఈవిషయంలో సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేయడం సరికాదన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఉన్న 200మందికిపైగా ఎంపీలతో ఇండియా కూటమి తరఫున పార్లమెంట్లో అడగడమో, నిరసన తెలపడమో చేయాలని సూచించారు. లేదంటే అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి, సభలో ప్రైవేటు బిల్లు పెట్టి ఆమోదింపజేయాలన్నారు. నూతనంగా గెలుపొందిన బీసీ సర్పంచ్లకు అండగా ఉంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని గౌలికార్ నర్సింగ్రావు ఫంక్షన్ హాల్లో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సర్పంచ్లను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు సరైన న్యాయం జరగలేదన్నారు. అనంతరం శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడారు. రాజ్యాధికారంలో మనవాటా మనకు దక్కాల్సిందేనని పేర్కొన్నారు. అనంతరం బీసీ సర్పంచులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ ర్యాగ అరుణ్కుమార్, బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ గుడిసె లక్ష్మణ్, కన్వీనర్ యాదగిరి యాదవ్, ప్రతినిధులు శ్రీనివాస్గౌడ్, నర్సింలు, వెంకటయ్య, మారుతి, విజయ్కుమార్, అనంతయ్య, శివరాజు, పాండుగౌడ్, లాల్కృష్ణ ప్రసాద్, రాజ్కుమార్, షుక్రూ, శ్రీనివాస్, హన్మంతు, రామకృష్ణ, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి అడిగినన్ని నిధులు
బంట్వారం: అభివృద్ధి పనులకు అడిగినన్ని నిధులు మంజూరు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి అన్నారు. కోట్పల్లి మండలం లింగంపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు నిరంతరం పాటు పడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, సర్పంచ్ చంద్రకళ, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, పార్టీ నాయకులు జ్ఞానేశ్వర్, వెంకటేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు యాలాల: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వస తులు ఉంటాయని, తల్లిదండ్రులు వారి పిల్లలను సర్కారు స్కూళ్లకే పంపాలని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పగిడియాల ఉన్నత పాఠశాలల్లో కొత్తగా నిర్మించిన స్టేజీ ప్రాంతాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, సర్పంచ్ రిశిత, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నర్సింలుగౌడ్, ఎంఈఓ రమేష్, హెచ్ఎం కృష్ణయ్య, ఉపాధ్యాయులు రవి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి -
రూ.400 కోట్లతో పనులు
● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ● రోడ్డు విస్తరణ బాధితులకు చెక్కుల అందజేత కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలో రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి తెలిపారు. పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి శనివారం కడా కార్యాలయంలో పరిహారం చెక్కులు అందజేశారు. 108 మందికి సుమారు రూ.3 కోట్ల విలువ చేసే చెక్కు లు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.10వేల కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరీ, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, నాయకులు, అధికారులు శివకుమార్ గుప్తా, మహ్మద్ యూసూఫ్, కృష్ణంరాజు, దాము, నయీం తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో వేగం పెంచండి
● పంచాయతీ, అంగన్వాడీ భవనాలను పూర్తి చేయండి● కలెక్టర్ ప్రతీక్ జైన్అనంతగిరి: జిల్లాలో పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న పంచాయతీ, అంగన్వాడీ, మండల సమాఖ్య భవనాలను, పాఠశాలల ప్రహరీ పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలన్నారు. నాణ్యత ఉండాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వసూలైన డబ్బులను దుర్వి నియోగం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్ కుమార్, అడిషనల్ డీఆర్డీఓ నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఇష్టంతో చదవాలి పరిగి: ఇష్టంతో చదివినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ ప్రతీక్జైన్ విద్యార్థులకు సూచించారు. శనివారం పరిగి పట్టణం తుంకుల్గడ్డలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో మహిళా శిశుసంక్షేమ శాఖ, మహిళా సాధికారత, బేటీ బచావో బేటీ పడావో ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే వివిధ భాషలపై పట్టు సారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, ప్రిన్సిపాల్ సుజాత, అధికారులు కాంతారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అనంతగిరి: కొడంగల్ మండలంలో గుర్తించిన 1,204 నిరుపేద కుటుంబాలకు తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. కలెక్టర్ ప్రతీక్జైన్ను ఆదేశించారు. శనివారం నగరం నుంచి వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొడంగల్ మండలంలో పలువురు పేదలకు నేటికీ ఆధార్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లేవని వారికి ఆయా పథకాలను అమలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. కొడంగల్ మండలంలో ఎంపిక చేసిన 18 గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు అన్ని పథకాలు అమలయ్యేలా చూస్తామన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, కో ఆర్డినేటర్ రవి, ఈడీఎం మహమూద్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల్లో రాజీ పడొద్దు
● సైబర్ క్రైమ్పై అవగాహనసదస్సులు నిర్వహించాలి ● ఎస్పీ స్నేహ మెహ్ర అనంతగిరి: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని ఎస్పీ స్నేహ మెహ్ర పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. హత్యలు, దొంగతనాలు వంటి తీవ్రమైన నేరాల్లో దర్యాప్తును వేగవంతం చేసి పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ను పెంచాలన్నారు. గ్రామాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. అపరిచితులు పంపే లింకులు, కాల్స్ పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు. గంజాయి, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యల చేపట్టాలన్నారు. విధి నిర్వహణలో ప్రతి అధికారి క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా పనిచేస్తూ వికారాబాద్ను నేరరహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములునాయక్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి నేటి పోటీ ప్రపంచంలో బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శనివారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కొత్తగడి బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములనాయక్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, మహిళ పీఎస్ సీఐ సరోజ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ మున్సిపల్ ఇన్చార్జ్ల నియామకం
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ అధిష్టానం శనివారం పార్టీ ఇన్చార్జ్లను నియమించింది. వికారా బాద్ మున్సిపల్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పరిగికి పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్, తాండూరుకు శ్రీశైల్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ ఇన్చార్జ్గా గట్టు రాంచందర్రావును నియమించింది. సర్పంచ్ వెంకట్ శ్రీయారెడ్డి దోమ: మా ఊరిపేరు దొంగ ఎన్కేపల్లి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే పేరు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ డాక్టర్ వెంకట్ శ్రీయారెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్లో డీపీఓ జయసుధను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. ఊరి పేరులో దొంగ అని ఉండటంతో విద్యావేత్తలు, విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారని తెలిపారు. ఎక్కడికి వెళ్లిన తమను చిన్నచూపుతో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సంజీవ స్వామి పురాతన ఆలయం ఉందని ఆ పేరున సంజీవ నగర్గా నామకరణం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని కోరారు. స్పందించిన డీపీఓ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్కుమార్, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. తాండూరు: పట్టణంలోని మాతశిశు ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా ఎల్ నయన్రాజ్ను నియమిస్తూ కలెక్టర్ ప్రతీక్జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్ శనివారం నయన్రాజ్కు నియామకపత్రం అందించారు. కొడంగల్ ప్రాంతానికి చెందిన నయన్రాజ్ ఎంబీబీఎస్ (డీసీహెచ్) పూర్తి చేసి పట్టా అందుకున్నారు. పరిగి: పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని అడిషనల్ ఎస్సీ రాములునాయక్ హెచ్చరించారు. శనివారం పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని ఇటుక బట్టీల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, పరిగి, కొడంగల్ సీఐలు శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్రెడ్డి, ఎస్సై మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత అన్నారు. శనివారం బాలిక దినోత్సవాన్ని పుర స్క రించుకుని వికారాబాద్ పట్టణ పరిధిలోని కొత్తగడి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయరాదన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సాయిలత తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
దోపిడీలు, దొంగతనాలు, బ్యాంక్ రాబరీ వంటి ప్రధాన కేసుల్లో పోలీసులు చేతులెత్తేయగా సీసీఎస్ తన మార్క్ పనితనం చూపుతోంది. ఎలాంటి ఆధారాలు లేని.. మొండి కేసులను సైతం కొలిక్కి తెచ్చి నిందితులను కటకటాలపాలు చేస్తోంది.. ఎన్నో కేసుల్లో పురోగతి సాధించి చోరీ సొత్తు రికవరీ చేస్తోంది. పోలీస్ స్టేషన్లలో కొలిక్కి రాని అనేక కేసులు మెజార్టీ ఫైల్స్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చెంతకు సిబ్బంది కొరత.. సౌకర్యాలు లేకున్నా పురోగతి అనేక ఘటనల్లో నిందితులకు శిక్ష చోరీ సొత్తు రికవరీ వికారాబాద్: రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వాటి ఛేదనలో ఆయా పోలీస్ స్టేషన్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దొంగతనాలు, రాబరీలు, హత్యలు, అటెన్షన్ డైవర్షన్ కేసులు, చీటింగ్ తదితర నేరాలు పెరుగుతున్నాయి. చాలా వరకు నమోదుతో సరిపెడుతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రమే పురోగతి కనిపిస్తోంది. ముఖ్యమైన కేసుల్లో ఎఫ్ఐఆర్లతో సరిపెడుతున్నారు. చాలా వాటిని సీసీఎస్కు అప్పగిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్, నిఘా వ్యవస్థల వైఫల్యమే నేరాల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. సివిల్ తగాదాల్లో పోలీసులు ప్రమేయం ఎక్కువ అవుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చన్గొముల్, వికారాబాద్, నవాబుపేట, మోమిన్పేట, తాండూరు, ధారూరు, పరిగి, మర్పల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో సివిల్ తగాదాల్లో పోలీసుల జోక్యం పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక దందా, కలప అక్రమ రవాణాను కూడా కట్టడి చేయలేకపోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. క్రైమ్ బ్రాంచ్ రంగ ప్రవేశంతో.. చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనా కొలిక్కి రావడం లేదు. దీంతో అధికారులు వాటిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగిస్తున్నారు. సిబ్బంది కొరత, సదుపాయాలు లేకున్నా సీసీఎస్ పోలీసులు వాటిని ఛేదిస్తున్నారు. నిందితులతో ఊచలు లెక్కెట్టిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని.. అనంతపురం జిల్లా గుంతకల్కు చెందిన శికారి గ్యాంగ్ దొంగతనాలు చేయడంతో ఆరితేరింది. ఈ ముఠా జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పరిగి, వికారాబాద్, కుల్కచర్లలో వీరిపై పలు కేసులు నమోదయ్యాయి. కానీ ఫలితం లేక ఆ కేసును సీసీఎస్కు అప్పగించారు. 15 రోజుల్లో కేసు పరిష్కరించి నిందితులను జైలుకు పంపారు. వికారాబాద్లోని మణప్పురం బ్యాంక్లో కుదవ పెట్టిన సుమురు రూ.3 కోట్ల విలువైన రెండు కిలోల బంగారం మాయమైంది. పోలీసుల విచారణలో బ్యాంక్ మేనేజరే బంగారంతో ఉడాయించినట్లు తేలింది. నిందితుడు కర్ణాటకలోని బెల్గావ్లో దాక్కోగా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు. హర్యాణాకు చెందిన మేవాత్ గ్యాంగ్ జిల్లాలో వరుసగా పశువులను దొంగిలిస్తూ రైతులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. సీసీఎస్ పోలీసుల రంగప్రవేశంతో గ్యాంగ్ ఆటకు తెర పడింది. ఉత్తరప్రదేశ్ కక్రాలకు చెందిన మోస్ట్ వాంటెడ్ దొంగల ముఠ పరిగిలో బ్యాంక్ దోపిడీకి యత్నించింది. గన్తో హల్చల్ చేసి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయారు. ఈ కేసును కూడా సీసీఎస్ పోలీసులే ఛేదించారు. తాజాగా ముగ్గురు మహిళా దొంగల ముఠా నకిలీ బంగారాన్ని ఎరగా వేసి మహిళల నుంచి తొమ్మిది తులాల బంగారం, 50 తులాల వెండితో ఉడాయించింది. వికారాబాద్, నారాయణ్పేట జిల్లాల్లో ఈ ముఠాపై కేసులు నమోదు కాగా సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. కేవలం వారం రోజుల్లో నిందితులను అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు. గతేడాది సోలాపూర్కు చెందిన దొంగల ముఠా పరిగి, నవాబుపేట, మోమిన్పేట ప్రాంతాల్లో అటెన్షన్ డైవర్షన్ నేరాలకు పాల్పడగా సీసీఎస్ పోలీసులు నిందితుల స్వగ్రామానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి కాలంలో పలు ఆలయాల్లో వరుస దొంగతనాల కేసును కూడా సీసీఎస్ పోలీసులే కొలిక్కి తెచ్చారు. మొత్తం 23 కేసులు నమోదు కాగా ఇందులో మన జిల్లా పరిధిలో 13, ఇతర జిల్లాల పరిధిలో 10 కేసులు ఉన్నాయి. దొంగలను అరెస్టు చేశారు. ఇటీవల పరిగి, కుల్కచర్ల, పూడూరు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు గొర్రెల దొంగతనాలకు పాల్పడ్డారు. స్పల్ప కాలంలోనే ఏడు కేసులు నమోదయ్యాయి. పోలీసులు చేతులెత్తేయగా సీసీఎస్ పోలీసులు వారిని అరెస్టు చేసి గొర్రెలు వాటిని తరలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఓ దొంగ వరుసగా ద్విచక్ర వాహనాల(బుల్లెట్)ను దొంగిలించాడు. నిందితుడిని అరెస్టు చేసి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ధారూరు మండలంలో జరిగిన పోక్సో కేసులో నిందితుడు తప్పించుకు తిరగ్గా రెండు రోజుల్లో సీసీఎస్ పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల వరుస సెల్ఫోన్ దొంగతనాల కేసున పోలీసు ఉన్నతాధికారులు సీసీఎస్కు అప్పగించగా 78 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఇలా అనేక కేసుల్లో సీసీఎస్ పోలీసులు పురోగతి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
పరిగి: విద్యార్థులపై తల్లిదండ్రులు సైతం శ్రద్ధ చూపాలని కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ లాల్ కృష్ణ సూచించారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి అది సాధించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. కళాశాల అభివృద్ధికి తాను ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ముదిరాజ్, సీపీఎం నాయకులు వెంకటయ్య, ప్రిన్సిపాల్ విజయ్కుమార్, భాస్కరయోగి తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ లాల్కృష్ణ -
టీచర్ల కొరతపై నివేదిస్తాం
బొంరాస్పేట: మండలంలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను ఉన్నతాకారుల దృష్టికి తీసుకెళ్తామని డీఈఓ రేణుకాదేవి తెలిపారు. శుక్రవారం బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులను జిల్లా కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డీఈఓకు వినతిపత్రం అందజేశారు. కొడంగల్ తోపాటు మొత్తం ఏడు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని డీఈఓ తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ జిల్లా కన్వీనర్ శివరాజ్, కో కన్వీనర్ నాగరాజు, పరిగి నియోజకవర్గ అధ్యక్షుడు రాములు, ఎంవీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలగా మార్చాలి ఎన్కేపల్లి యూపీఎస్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చి, ఉన్నత పాఠశాలగా మార్చాలని గ్రామ సర్పంచు బాల్రాజు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు శుక్రవారం కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన వచ్చే విద్యాసంవత్సరం నాటికి నూతన పోస్టులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినధులు మణెమ్మ, కళావతి, అనంతమ్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రేణుకాదేవి -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
తాండూరు టౌన్: అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు ఓ బాలుడు గాయపడ్డారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చేటుచేసుకుంది. సీఐ సంతోశ్కుమార్ తెలిపిన ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన బస్సు మెట్లకుంటకు వెళ్లేందుకు బస్టాండ్నుంచి బయటకు వస్తోంది. ఈ క్రమంలో కొడంగల్ రోడ్డు నుంచి ఇందిరాచౌక్వైపు ప్రయాణిస్తున్న లారీ వేగంగా బస్సును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో బస్సు, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన డ్రైవర్ నారాయ ణ, కండక్టర్ యాదమ్మ, బాలుడికి గాయాలవడంతో స్థానికులు వారిని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బ స్సులో 11మంది ప్రయాణికులున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు బాలుడికి గాయాలు -
ఓటే పౌరుడి వజ్రాయుధం
రేపే జాతీయ ఓటరు దినోత్సవం ● ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రతిజ్ఞ నవాబుపేట: ఓటే పౌరుడి వజ్రాయుధమని.. 18 ఏళ్లు నిండిన వయోజనులంతా ఓటు హక్కు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, ఎస్ఐ పుండ్లిక్, పలు గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొని ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి యాలాల: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని యాలాల తహసీల్దార్ వెంకటస్వామి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ కార్యాలయం ఎదుట ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఓటు హ క్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐలు వేణు, చరణ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్కుమార్, జీపీఓలు సిబ్బంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగం బాధ్యత మోమిన్పేట: ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు వజ్రాయుధంలా పనిచేస్తుందని ఎంపీడీఓ సృజనసాహిత్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం కార్యాలయం సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంఈఓ మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థల నిర్మాణానికి ఓటే కీలకం కుల్కచర్ల: ప్రజాస్వామ్యంలో వ్యవస్థల నిర్మాణానికి ఓటు హక్కు కీలకంగా పనిచేస్తుందని కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. మండల పరిధిలోని ముజాహిద్పూర్లో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముజాహిద్పూర్ సర్పంచ్ చంద్రభూపాల్ రావు, రాంరెడ్డిపల్లి సర్పంచ్ నర్సింలు యాదవ్, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జనార్ధన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోశ్, వార్డుసభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు పరిగి: ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు అని తహసీల్దార్ వెంకటేశ్వరి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ కేంద్రంలోని నంబర్–1 ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరి మాట్లాడుతూ.. ఓటు విలువను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఎంఈఓ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన ర్యాలీ దుద్యాల్: ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని తహసీల్దార్ కిషన్, మండల విద్యాధికారి విజయరామారావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, అధ్యాపకులు తాండూరు టౌన్: ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత అని తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసంతకుమారి అన్నారు. శుక్రవారం కళాశాల పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు. పలువురు విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, ఏఓ సులేమాన్ హైమద్, అకాడమిక్ కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి, ఐఓఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ కిషన్, ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారులు సంగమేశ్వర్, కళావతి, అధ్యాపకులు నారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన దోమ: ఓటు హక్కుపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూప్సింగ్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని దిర్సంపల్లి పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు కొడంగల్ రూరల్: ప్రజాస్వామ్యానికి ఓటు పునాదిలాంటిదని, 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ రాంబాబు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు విలువలతో కూడిన నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్స్పాల్ రఫియాఖానమ్, అధ్యాపక సిబ్బంది రాంబాబు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సోమ్లా, నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. -
సొంతగూటికి మాజీ కౌన్సిలర్
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ నవీన్కుమార్ బీఆర్ఎస్లో చేరారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన కారుదిగి కాంగ్రెస్లో చేరిన విషయం విదితమే. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకొన్నారు. కాగా 32వ వార్డు నుంచి వారి కుటుంబీకులను బరిలో నిలుపనున్నట్లు సమాచారం. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి అనంతగిరి: గిరిజన ఆశ్రమ వసతిగృహ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కమలాకర్రెడ్డి వినతిపత్రం అందజేశారు. అవుట్సోర్సింగ్, డైలీవేజ్ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. తొమ్మిది నెలలుగా వేతనాలు అందక సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వివరించారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, రా ములు, శశికళ, మంగమ్మ, లక్ష్మి పాల్గొన్నారు. ఆర్యూపీపీక్యాలెండర్ ఆవిష్కరణ అనంతగిరి: రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్(ఆర్యూపీపీ)ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, డీఈఓ రేణుకాదేవి ఆవిష్కరించారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో పలు విద్యారంగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావలి శ్రీశైలం, కార్యదర్శులు రఘునాథ్, మున్నూరు రాజు, ఎర్రవల్లి రవి, ఫారూఖ్, కరుణాకర్ మహేందర్, పలువురు జిల్లా బాధ్యులు, మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. వీరభద్రేశ్వరాలయంలో దీపోత్సవం కొడంగల్ రూరల్: మండల పరిధిలోని అంగడిరాయిచూర్ వీరభధ్రేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఏకోపాధ్యాయ పాఠశాల, గ్రామ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠాపన రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీపాలంకరణ చేశారు. అనంతరం భక్తులకు పురోహితులు భానుప్రకాశ్, శివకుమార్ తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఏకల్ పాఠశాల అంచల్ అభియాన్ జె.కృష్ణాజీ, సంచు సాధక్ అశోకచారి, మాతాజీ చంద్రకళ, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు
దోమ: ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ రూపలక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లితండ్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం జూనియర్ కళాశాలల అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. 2025–26వ సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నూతన విధి విధానాలను తీసుకువచ్చిందన్నారు. ఎఫ్ఆర్ఎస్ విధానంతో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులను మంజూరు చేసిందన్నారు. కళాశాలలో ల్యాబ్ ఏర్పాటు, క్రీడా పరికరాలు, పరిసరాల పరిశుభ్రత, స్వీపర్స్, స్కావెంజర్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. హెచ్ఈఎల్పీ ఆర్గనైజర్ సహకారంతో ప్రతీ శనివారం యోగ, ధ్యానంతో పాటు స్కిల్ డెవలప్పెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంసెట్, నీట్, జేఈఈ, క్లాట్, లాసెట్ వంటి పరీక్షల ప్రిపరేషన్కు ప్రముఖ విద్యా సంస్థలు ఫిజిక్స్వాలి, ఖాన్ అకాడమీ వారిచే రెగ్యులర్ తరగతులతో పాటు ప్రత్యేక తరగతులను డిజిటల్ రూపంలో అందిస్తున్నామన్నారు. ప్రతీ విద్యార్థి మెరుగైన ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రుల సహకారం సైతం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాధ, శ్రీవిద్య, రాములు, లక్ష్మయ్య, సునీత, మధుసూదన్, శ్రీధర్కుమార్, సువర్ణ, శ్రీకాంత్, సానియాసూల్తాన, చంద్రశేఖర్రెడ్డి, బందయ్య, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ రూపలక్ష్మి -
చోరీ కేసులో పురోగతి
యాలాల: మండల పరిధిలోని కమాల్పూర్ శివారులో ఈ నెల 21న బైక్పై వెళుతున్న మహిళను పోలీసులమని బెదిరించి నాలుగు తులాల బంగారం చోరీ చేసిన ఘటనలో యాలాల పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో రెండు ముఠాలకు చెందిన ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. వీరు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం కలబురిగి గ్రామీణ పోలీసుల అదుపులో ఉండగా, వారు తెలంగాణ పోలీసులకు సహకరించకపోవడంతో చోరీ సొత్తు రికవరీ, కేసు దర్యాప్తులో ఇబ్బందిగా మారింది. సీసీ పుటేజీతో దొరికిన ఆచూకీ.! ఈ నెల 21న సాయంత్రం మండల పరిధిలోని రాస్నం గ్రామానికి చెందిన కోటం వెంకటలక్ష్మి తన అన్న గోపాల్రెడ్డితో కలిసి బైక్పై తాండూరు నుంచి రాస్నం వైపు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్పూర్ సమీపంలో వారి బైక్ను అడ్డగించిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని, కొద్ది దూరంలో బంగారం కోసం మహిళ హత్య జరిగిందని చెప్పి మహిళ నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితులు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఐ విఠల్రెడ్డి తన సిబ్బందితో తాండూరు మార్గంలో సీసీ పుటేజీలను పరిశీలించారు. ఈ చోరీ ఘటనలో రెండు బైకులు, ఒక కారులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. వీరు తాండూరు నుంచి చించోలి మీదుగా కలబురిగి వెళ్లినట్లు గుర్తించి కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటక పోలీసులతో చర్చలు ఈ చోరీ కేసులో నిందితులు యాలాలతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో బంగారం చోరీ చేసినట్లు గుర్తించారు. ఇవి పర్లీ, కల్యాణి గ్యాంగ్ సభ్యులే చేసినట్లు నిర్ధారించారు. కాగా కలబురిగి గ్రామీణ పోలీసులు రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తు రికవరీతో పాటు దొంగలను తెలంగాణ పోలీసుల కస్టడీకి ఇవ్వకుండా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నా రని దర్యాప్తు అధికారి పేర్కొంటున్నారు. వారిని తీసుకువచ్చేందుకు యాలాల పోలీసులు కలబురిగి గ్రామీణ పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. మహిళను బెదిరించి..బంగారం చోరీ చేసింది పర్లీ, కల్యాణి గ్యాంగ్ సభ్యులే కలబురిగి జిల్లాలో దొంగల ఆచూకీ.. కర్ణాటక పోలీసుల అదుపులో ముఠా రెండు రోజులుగా కలబురిగిలో యాలాల పోలీసులు -
సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో మేలు
నవాబుపేట: సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో రైతులకు మేలు చేకూరుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. వ్యవసాయ పరికరాలను తీసుకున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్నాయక్, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశం, ఏఓ జ్యోతి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి, శ్రీధర్, లావణ్య, సర్పంచ్లు నర్సింహారెడ్డి, జగన్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ రాంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, నాగిరెడ్డి, వెంకట్రెడ్డి, పరమేశ్, మాణిక్యం, ఏఈఓలు, ఏఎంసీ డైరెక్టర్లు ఖదీర్, రాజశేఖర్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
ఓటు వజ్రాయుధం
అనంతగిరి: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధంతో సమానమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని తెలిపారు. పంచాయతీ సర్పంచ్ మొదలు ప్రసిడెంట్ వరకు ఓటు ద్వారానే ఎన్నికవుతారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్, డీఆర్ఓ మంగీలాల్, జిల్లా స్వీప్ అధికారి సత్తార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ అలీ తదితరులు పాల్గొన్నారు. అర్హులు విధిగా ఓటు హక్కు పొందాలి కలెక్టర్ ప్రతీక్ జైన్ ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. పోలింగ్ తోపాటు కౌంటింగ్ కోసం భవనాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్, తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ఓవర్ లోడ్!
వికారాబాద్: ఆర్టీసీ బస్సు.. టిప్పర్ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన ఘటన జరిగి రెండు నెలలు కాక ముందు మళ్లీ ఓవర్ లోడ్తో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఘోర ప్రమాదానికి టిప్పర్ ఓవర్ లోడే కారణమని నివేదికలు తేల్చినా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత నెల రోజుల పాటు లారీలు, టిప్పర్లపై ప్రత్యేక నిఘా ఉంచి ఓవర్లోడ్కు అడ్డుకట్ట వేశారు. తర్వాత షరా మామూలే అన్న చందంగా తయారైంది. ఓవర్ లోడ్ వాహనాల కారణంగా ప్రజలు ప్రాణాలు గాల్లో కలుస్తుండగా మరో పక్క ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది. సామర్థ్యానికి రెండింతల లోడ్ వేస్తుండటంతో రోడ్లు సైతం వేసిన కొద్ది రోజులకే పాడవుతున్నాయి. కట్టడి చేయాల్సిన అధికారులు మైనింగ్ మాఫియా ఇచ్చే మామూళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో హడావుడి చేసి ఆ తర్వాత మిన్నకుండి పోతున్నారు. మైనింగ్ ప్రదేశంలో ఓవర్లోడ్ను కట్టడి చేయాల్సిన మైనింగ్ ఏడీ, వాహనాలు రోడ్డెక్కాక కంట్రోల్ చేయాల్సిన ఆర్టీఏ అధికారులు, పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు. పోలీస్ స్టేషన్ ముందు నుంచే రోజూ వందల సంఖ్యలో టిప్పర్లు, లారీలు అధిక లోడ్తో తిరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇసుక వ్యాపారులు, మైనింగ్ మాఫియా ఇచ్చే డబ్బులకు ఆశపడి వారికి అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. డీటీఓ, మైనంగ్ ఏడీలపై కలెక్టర్ ఆగ్రహం ఓవర్ లోడ్ వ్యవహారం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన సీరియస్గా తీసుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో మైనింగ్ ఏడీ, జిల్లా రవాణా శాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్, ఇసుక వ్యాపారులు పేట్రేగి పోతుంటే ఏం చేస్తున్నారని.. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని ఆదేశించారు. వెంటనే కట్టడి చేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టమైనా ఆదేశాలు ఇచ్చారు. ఓవర్ లోడ్, ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్లపై తిరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని డీటీఓ వెంకట్రెడ్డిని కలెక్టర్ ప్రశ్నించారు. గతంతో కూడా ఇదే విషయంపై హెచ్చరించారు. తీరు మారక పోవడంతో మూడు రోజుల క్రితం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఓ పక్క ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నా వారి తీరు మారడంలేదు. పరిగి, చన్గోముల్, తాండూరు, యాలాల, నవాబుపేట, మోమిన్పేట పోలీసులు, రెవెన్యూ అధికారులను సైతం మైనింగ్ మాఫియా మ్యానేజ్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. సామర్థ్యానికి మించి ఎర్రమట్టి, ఇసుక రవాణా అధికారులను శాసిస్తున్న మైనింగ్ మాఫియా సంబంధిత శాఖలపై కలెక్టర్ ఆగ్రహం డీటీఓకు షోకాజ్ నోటీసు అయినా మారని తీరు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిచాలా కాలంగా ఓవర్ లోడ్ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇటీవల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో టిప్పర్ ఓవర్ లోడ్ కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందనే వాదన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ల్యాట్రేట్, ఇసుక, నాపరాయి, సుద్ద, గ్రానైట్ తదితర ఉత్పత్తులను రవాణా చేసే ఓనర్లలో చర్చ మొదలయ్యింది. నెల రోజుల పాటు వాహన సామర్థ్యం మేరకు ముడి సరుకు రవాణా చేశారు. ఆ తర్వాత పాత పద్ధతి మొదలు పెట్టారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఓవర్ లోడ్తోనే మైనింగ్ రవాణా చేస్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం ఉన్న లారీలు, టిప్పర్లలో 50 నుంచి 60 టన్నుల వరకు తరలిస్తున్నారు. రోజుకు సగటున రెండు నుంచి మూడు వేల టన్నుల ఐరన్ ఖనిజాన్ని తరలిస్తున్నారు. టన్నుకు రూ.279.50 చొప్పున ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో డీఎంఎఫ్టీ నిధుల కింద జిల్లాకు టన్నుకు రూ.36 చొప్పున జమ చేస్తారు. అయితే ఓవర్ లోడ్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ 50 శాతమే సమకూరుతోంది. మిగతా సగం మైనింగ్ యజమానుల జేబుల్లోకే వెళుతుంది. వారిచ్చే లంచాలకు తలొగ్గి కట్టడి చేయకుండా వదిలేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఒకటి అర కేసులు, ఫైన్ వేసి చేతులు దులుపుకొంటున్నారు. -
‘కోట్పల్లి’ పనులు పూర్తి చేస్తాం
తాండూరు రూరల్: ధారూరు, పెద్దేముల్ మండలాల సరిహద్దులోని కోట్పల్లి ప్రాజెక్టు మరమ్మతు పనులు మే నెల నాటికి పూర్తి చేస్తామని ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణ శివారులోని కాగ్నా వాగులో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న చెక్డ్యాం పనులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్పల్లి ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరు చేసిందన్నారు. 24 కిలో మీటర్లు కాల్వల పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కాల్వల ద్వారా ధారూరు, పెద్దేముల్, కోట్పల్లి మండలాల్లోని 12 వేల ఎకరాలను సాగు నీరు అందుతోందన్నారు. ప్రస్తుతం క్రాప్ హాలిడే ప్రకటించి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ‘నారాయణపేట్’ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట్ ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.4,800 కోట్లు మంజూరు చేసిందన్నారు. 4,200 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రాథమిక పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి -
రేపు రథసప్తమి వేడుకలు
కొడంగల్: పట్టణంలోని బాలాజీ నగర్లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ, చిన్న శేష, గరుడ, హనుమంత, కల్ప వృక్ష, సర్వ భూపాల, చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు. రథ సప్తమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని ధర్మకర్తలు కోరారు. అనంతగిరి: వికారాబాద్ పట్టణ సీఐగా రఘు కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ పని చేసిన భీంకుమార్ నుంచి ఆయన చార్జి తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతానని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. అనంతర భీంకుమార్కు ఘనంగా వీడ్కోలు పలికారు. దుద్యాల్: మండలంలోని హకీంపేట్లో ఏర్పాటు కానున్న ఏటీసీ(అధునాతన సాంకేతిక కేంద్రం) శిక్షణ అధికారిగా కామర్థి కవితను నియమించినట్లు ప్రిన్సిపాల్ శ్యాంసుదర్ శుక్రవారం తెలిపారు. మహబూబ్నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కవిత స్వగ్రామం హకీంపేట్ కావడంతో ఇక్కడ విధులు నిర్వర్తించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. అనంతగిరి: తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం(2026–27) అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 28లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ బీ సత్యానందం తెలిపారు. శుక్రవారం వికారాబాద్లోని కళాశాల ఆవరణలో ముస్లిం ప్రతినిధులు, తల్లిదండ్రుల సమక్షంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాండూరు టౌన్: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకునిగా విధులు నిర్వర్తిస్తున్న చెలిమల్ల కిషన్ మధ్యప్రదేశ్లోని శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రొఫెసర్ అరవింద్ కుమార్ నేతృత్వంలో ‘విజిల్ మోడ్ తరంగాల ప్రేరణతో భూమి మాగ్నెటోస్పియర్లో ఎలక్ట్రాన్ పిచ్ యాంగిల్ స్కాటరింగ్ సంక్లిష్టతల అధ్యయనం’ అనే అంశంపై పీహెచ్డీ పరిశోధన చేశారు. ఫైనల్ వైవా అనంతరం యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ పట్టా అందజేసింది. తమ కళాశాల అధ్యాపకుడు ఫిజిక్స్లో డాక్టరేట్ సాధించడం పట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ వసంత కుమారి, సూపరింటెండెంట్ ఎండీ సులేమాన్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ లక్ష్మణ్, అధ్యాపకులు ఎస్ మహేందర్ రెడ్డి, సంగమేశ్వర్, డాక్టర్ డీ నారాయణరావు అభినందనలు తెలిపారు. -
నిబంధనలు పాటిద్దాం
● ప్రమాదాలను అరికడదాం ● ‘అలైవ్ అరైవ్’లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎస్పీ స్నేహ మెహ్ర తాండూరు టౌన్: రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికడదామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం తాండూరు పట్టణంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అలైవ్ అరైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్ర, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పాల్గొన్నారు. ముందుగా ఇందిరాచౌక్ నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మంటపం వరకు పలు కళాశాలల విద్యార్థులు, ఆటో, జీపు, లారీ డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికారాదన్నారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడం వల్ల అతని కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. 2026లో రోడ్డు ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో వాహనదారులు సహకరించాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్, పట్టణ, రూరల్ సీఐలు సంతోష్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులకు విముక్తి అనంతగిరి: జిల్లాలో ఆపరేషన్ స్మైల్ –12 కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. ఇప్పటి వరకు 106 మంది పిల్లలను రక్షించడం జరిగిందన్నారు. ఇందులో 90 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు చెందిన పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు. బిహార్ నుంచి 5 మంది చిన్నారులు, రాజస్థాన్ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక నుంచి ఒక్కొక్కరు చొప్పున బాల కార్మికులు ఉన్నారని తెలిపారు. వీరిని తల్లిదండ్రులు లేదా సంరక్షణాలయాల్లో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాలల హక్కులకు భంగం వాటిల్లే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. -
రైతు సంక్షేమమే లక్ష్యమవ్వాలి
● ఆత్మ కమిటీకి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సూచన ● చైర్మన్గా శంకర్రెడ్డి ప్రమాణ స్వీకారం బషీరాబాద్: అన్నదాతల సంక్షేమమే ఆత్మ కమిటీ ఏకై క లక్ష్యం కావాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సూచించారు. శుక్రవారం బషీరాబాద్లో ఆత్మకమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాంత్రిక సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోందని తెలిపారు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు చైర్మన్గా శంకర్రెడ్డితో డీఏఓ రాజరత్నం ప్రమాణం చేయించారు. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇందులో భాగంగానే ఆత్మ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శంకర్రెడ్డి రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీ పరికరాలు అందించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సబ్సిడీ పరికరాల ఊసే లేదన్నారు. ప్రస్తుత ఒక్క సీజన్లోనే జిల్లాలో 227 మంది రైతులకు రూ.53 లక్షలతో సబ్సిడీ యంత్రాలు అందిస్తున్నామని చెప్పారు. పైలెట్ రోహిత్రెడ్డిపై ఫైర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిరెడ్డి ఎమ్మెల్యేపై చేసిన విమర్శలకు తీవ్రంగా స్పందించారు. కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి సొంత లాభం కోసం పార్టీ మారిన వారు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్రెడ్డి తాండూరుకు చేసిందేమీ లేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన రెండేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి వందల కోట్ల నిధులు తెలిచ్చనట్లు చెప్పారు. అంతకుముందు డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు రవిగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మాధవ్రెడ్డి మాట్లాడారు. అనంతరం ఆత్మకమిటీ చైర్మన్ శంకర్రెడ్డిని, సభ్యులను ఎమ్మెల్యే, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, యాలాల సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డి, నాయకులు సత్యనారాయణ, నారాయణరెడ్డి, ఉత్తంచంద్, శ్రీధర్ ముదిరాజ్, శాంతిబాయి, శ్రీనివాస్రెడ్డి, మాణిక్ రెడ్డి, నర్సిరెడ్డి, రామ్నాయక్, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్, తలారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల కొరత ఉంటే చెప్పరా?
డీఈఓ, ఎంఈఓలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆగ్రహం బొంరాస్పేట: మండలంలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు రావడంతో గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పందించారు. డీఈఓ, ఎంఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత ఉంటే ఎందుకు నివేదించలేదని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని ఎంఈఓ హరిలాల్కు సూచించారు. ఇదిలా ఉండగా పాఠశాలను బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు సందర్శించారు. సర్పంచ్ బాల్రాజుతో కలిసి ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. అనంతరం సర్పంచ్ మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తామన్నారు. అనంతరం కొడంగల్ కడా కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల కొరతను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు మణెమ్మ, ఏఏపీసీ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జగతి ఫౌండేషన్ నుంచి ఇద్దరు వలంటీర్లు ఉపాధ్యాయుల కొరత సమస్యను తాత్కాలికంగా పరిష్కరించేందుకు జగతి ఫౌండేషన్ ముందుకు వచ్చింది. గ్రామానికి చెందిన అమృతమ్మ, పద్మను వలంటీర్లను నియమించినట్లు ఎంఈఓ హరిలాల్ తెలిపారు. పాఠశాల కమిటీ, గ్రామస్తుల సూచన మేరకు ఈ విద్యాసంవత్పరం చివరి వరకు వీరు విధుల్లో ఉంటారని తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయండి
అనంతగిరి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేసే వాహనాలను సీజ్ చేయడంతోపాటు జరిమానా విధించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. నదులు, వాగులు, చెరువులను నుంచి ఇసుక తరలించడం ద్వారా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. ఆన్లైన్లో పర్మిషన్లు పొందిన తరువాతే ఇసుక రవాణా జరగాలన్నారు. విస్తృత తనిఖీలు, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తరవాతే ఇసుక తీసుకెళ్లాలని సూచించారు. లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పనుల్లో వేగం పెంచండి ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను క్లియర్ చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్లకు సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్(రెవెన్యూ) రాజేశ్వరి, జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, గనుల శాఖ ఏడీ సత్యనారాయణ, రవాణా శాఖ జిల్లా అధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సృజనాత్మకతను వెలికి తీయాలి ఇంటర్ నెట్ సేవలను మంచి పనులకు ఉపయోగించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ జెడ్పీహెచ్ఎస్లో సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలోని రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆర్ఐఏ కార్యక్రమం ద్వారా సోహం అకాడమీ ఇప్పటి వరకు జిల్లాలో 15 పాఠశాలల్లో రోబోటిక్స్ వర్క్షాప్లను విజయవంతంగా పూర్తి చేసింది. వాటిలోంచి 5 పాఠశాలలను ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ వినూత్న నమూనాలు ప్రదర్శించారు. కలెక్టర్ వాటిని పరిశీలించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకా దేవి, సోహం అకాడమీ వ్యవస్థాపకులు సహదేవ్ కొమరగిరి, గోపీ ఉడురు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. పరిగి: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. పరిగి పట్టణంలో మూడు రోజులుగా జరుగుతున్న సర్పంచ్ల శిక్షణ కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలన, విధుల వివరాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామ సర్పంచ్ బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు మంచి చేస్తే పేరు ప్రతిష్టలు వస్తాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలన్నారు. పరిశుభ్రత, తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో డీపీఓజయసుధ, ఎంపీడీఓలు హరిప్రియ, పంచాయతీ పాలక వర్గం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం -
వారసులొస్తున్నారు..
పుర రంగంలోకి ముఖ్య నేతల కూతుళ్లు వికారాబాద్: పురు పోరులో ఇద్దరు ముఖ్య నేతల కూతుళ్లు రంగం ప్రవేశం చేస్తారనే ఊహాగానాలతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వికారాబాద్ రాజకీయం వేడెక్కుతోంది. వారం రోజుల క్రితం మున్సిపల్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవగా వికారాబాద్ చైర్పర్సన్ పీఠం ఎస్సీ మహళకు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ సామాజిక వర్గానికి పదవి కేటాయించడంతో పోటీ చప్పగా ఉంటుందని అందరూ భావించారు. అయితే అధికార కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూతురు గడ్డం అనన్యను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. స్పీకర్ కూడా పార్టీ శ్రేణులకు సానుకూల సంకేతాలివ్వడంతో వారిలో ఉత్సాహం పెరిగింది. ఇక వికారాబాద్ మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవడం తమ పార్టీకి నల్లేరు మీద నడకేనని అందరూ భావించారు. అయితే ఈమెకు పోటీగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ శ్రేణులు పట్టుబట్టడంతో ఆనంద్ అందుకు నిరాకరించినట్టు సమాచారం. దీంతో మరో నాయకుడు విజయ్కుమార్ సతీమణి బీఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో ఉంటుందనే ప్రచారం జరిగింది. తెరపైకి చంద్రప్రియ పేరు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పనిచేశారు. ఆయన ఇటీ వల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఏసీఆర్ కూతురు చంద్రప్రియ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆమె బీఆర్ఎస్ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం చంద్రశేఖర్ ముందు కొందరు నేతలు ప్రస్తావించగా ఎవరి పార్టీ వారిది.. పోటీ చేస్తే తప్పేముంది అని చెప్పినట్టు సమాచారం. ఇలా ఇద్దరు ముఖ్య నేతల వారసులుగా వారి కూతుళ్లు ఒకే సారి పుర పోరులో రంగం ప్రవేశం చేస్తారనే ప్రచారంతో వికారాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రప్రియ బీఆర్ఎస్ తరఫున రంగంలోకి దింపే యోచనతో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఆనంద్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ ఇప్పటి వరకు ప్రత్యేక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా తండ్రుల తరఫున చాలా సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు వస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల నుంచి వీరి పోటీ ఖాయమైతే వికారాబాద్లో జనరల్ స్థానాలను మించి రసవత్తర పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఆనంద్ అంగీకరిస్తారా..? మాజీ మంత్రి చంద్రశేఖర్ కూతురు చంద్రప్రియ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడాన్ని ఆనంద్ అంగీకరిస్తారా..? లేదా అనే చర్చ జరుగుతోంది. ముందుగా స్థానిక నేతలందరూ ఆనంద్ సతీమణి చైర్పర్సన్ రేసులో ఉంటారని భావించారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆనంద్ ఎక్కడా చెప్పకున్నా స్పీకర్ ప్రసాద్కుమార్ రంగంలోకి దిగే పరిస్థితిలో ఆనంద్ సతీమణి అయితేనే గట్టి పోటీ ఇవ్వగలదని బీఆర్ఎస్ శ్రేణులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం అధికార పార్టీ మంచి ఫామ్లో ఉన్న తరుణంలో చైర్ పర్సన్గా పోటీ చేసి ఓటమిపాలైతే పరువుపోతుందనే భావనతో ఆనంద్ తన సతీమణినిపోటీకి నిరాకరించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వాలంటే చంద్రప్రియ బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉంటే బాగుంటుందని ఆ పార్టీ శ్రేణులు అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని ఆనంద్తో చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన అంగీకరిస్తారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. చంద్రప్రియ గెలుపొంది చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకుంటే భవిషత్తులో ఎమ్మెల్యే సీటుకు పోటీగా మారే అవకాశం లేకపోలేదని ఆనంద్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆయన్ను హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరు రంగంలోకి వస్తే రసవత్తర పోరు ఖాయంగానే కనిపిస్తోంది. -
సాగు ప్రోత్సాహానికే సబ్సిడీలు
మోమిన్పేట: వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇస్తోందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి సత్తార్ తెలిపారు. గురువారం మండలంలోని కేసారం గ్రామ రైతు వేదికలో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద ఎంపికై న రైతులకు టమాటా, తేనెటీగల బాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమ కోసం అనేక రకాల సబ్సిడీలు అందిస్తున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆధిక దిగుబడులు సాధించాలన్నారు. పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. తద్వార పంట నష్టం జరిగితే పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కూరగాయల పంటలు పడించే రైతుల కోసం వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న రైతులు సేంద్రియ ఎరువుల తయారీ, తేనెటీగల పెంపకం లాంటివి చేపట్టాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. అనంతరం మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. నీటి వసతి కలిగిన రైతులు ఒక సారి ఆయిల్ పామ్ మొక్క నాటితే 30 సంవత్సరాల పాటు దిగుబడి పొందవచ్చని పేర్కొన్నారు. ఉచితంగా మొక్కలు, బిందు సేద్యం పరికరాలు, ఎరువులు, మూడు సంవత్సరాల పాటు సాగు ఖర్చులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కూరగాయలు పండించే రైతులకు ఉచితంగా టమాటా, వంకాయ, మిర్చి నారులు ఇస్తామని చెప్పారు. నారు కావాల్సిన రైతులు 20 రోజుల ముందు ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ మండల అధికారి అక్షితరెడ్డి, ఏఈఓ శ్రీనివాస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, సర్పంచులు కిష్టయ్య, లలిత, కార్యదర్శి రవి, క్లస్టరు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
బస్సులు రాక.. బడికి వెళ్లలేక..
● ప్రైవేటు వాహనాలే దిక్కు ● నిత్యం ఇదే తంతు ● విద్యార్థులకు తప్పని తిప్పలు ధారూరు: పాఠశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు రాక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం చింతకుంట, హరిదాస్పల్లి, అల్లీపూర్, అవుసుపల్లి, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్ తండా, స్టేషన్ ధారూరు నుంచి మండల కేంద్రమైన ధారూరులోని ప్రాథమికోన్నత పాఠశాలకు దాదాపు 20 మంది విద్యార్థులు వస్తుంటారు. చిన్నారులు ఎదుర్కొంటున్న బస్సు సమస్యలపై గురువారం ‘సాక్షి’ పరిశీలించగా పలు విషయాలు వెలుగు చూశాయి. ఉదయం అష్టకష్టాలు పడి స్కూల్కి వెళ్లిన రాంపూర్తండా విద్యార్థులు.. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ధారూరు చౌరస్తాలో బస్సుల కోసం దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బస్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో గ్రామానికి వెళ్లారు. మరి కొందరు ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగి వెళ్లారు. అంతకుముందు విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతి రోజూ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. ఒక్కోసారి చీకటి పడిన తర్వాత గ్రామానికి చేరుకోవాల్సి వస్తోందన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు వచ్చినా పాయింట్ వద్ద ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పడుతూ.. లేస్తూ.. చేవెళ్ల: చదువుల కోసం విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. నిత్యం పాఠశాలలకు వెళ్లేందుకు అటు సరైన రవాణా సదుపాయం లేక.. ఇటు రోడ్లు బాగాలేక అవస్థలు పడుతున్నారు. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు వెళ్లే వారితో బస్సులు రద్దీగా ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో సమయానికి అనుకూలంగా లేకపోవడంతో ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. మరికొన్ని గ్రామాలకై తే కనీసం బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థుల కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్నారు. మరికొంతమంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మండలంలో మొత్తం 25 పంచాయతీలు, 11 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. సగానికిపైగా పంచాయతీల్లో ఆటోలను నమ్ముకుని ప్రయాణం సాగిస్తున్నారు. ఇక రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనాల్లో ప్రయాణం ఇబ్బందిగా మారింది. నిత్యం ఈ రోడ్లపై దుమ్ముధూళితో అవస్థలు పడుతున్నారు. -
ఈ లైన్మెన్ మాకొద్దు
నవాబుపేట: ఈ లైన్మెన్ మాకొద్దని, వెంటనే ఆయన్ను తొలగించాలంటూ మైతాప్ఖాన్గూడ ప్రజలు గురువారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ శంకర్ విద్యుత్ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామానికి రావడం లేదన్నారు. పని రాని పిల్లలను విద్యుత్ పనులకు వాడుకుంటున్నాడని తెలిపారు. గతంలో మాదిరెడ్డిపల్లిలో ఒక వ్యక్తి కరెంట్ పనులు చేస్తూ మృత్యువాత పడ్డాడని గుర్తు చేశారు. ఎప్పుడూ మద్యం మత్తులో ఉండే శంకర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల నుంచి గ్రామంలో విద్యుత్ సరఫరా లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా లైన్మెన్స్పందించడం లేదన్నారు. ధర్నాలో మాజీ సర్పంచ్ రంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ శ్రీకాంత్రెడ్డిని వివరణ కోరగా.. లైన్మెన్ శంకర్పై ఇది వరకు అనేక ఫిర్యాదు వచ్చాయని.. తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తర్వలో మరో లైన్మెన్ను నియమిస్తామని చెప్పారు. -
వేగంగా ఇంటిగ్రేటెడ్!
● కొందుర్గులో యంగ్ ఇండియారెసిడెన్షియల్ పాఠశాల ● కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు ● అన్ని వర్గాలకు ఒకేచోట విద్యాబోధనషాద్నగర్: పల్లె ప్రకృతి ఒడిలో.. చదువుల కోవెలను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో కూడిన గురుకులానికి సీఎం రేవంత్రెడ్డి షాద్నగర్ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.150 కోట్లతో నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కొందుర్గు తూర్పు శివారులోని సర్వే నంబర్ 109లో సుమారు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. దీనికి 2024 అక్టోబర్ 11న సీఎం రేవంత్రెడ్డి భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టే స్థలాన్ని చదును చేసి 10 ఎకరాల విస్తీర్ణంలో పునాదులను బేస్మెంట్ లెవల్ వరకు పిల్లర్లు పూర్తి చేశారు. మిగితా సెంట్రింగ్ పనులు కొనసాగుతున్నాయి. పనులు చురుకుగా చేపట్టేందుకు నిర్మాణం చేస్తున్న ప్రదేశంలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణం పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రతి నియోజకవర్గంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాలమైన ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదులే కాకుండా అంతర్జాతీయ స్కూల్స్తో సమానంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. విద్యార్థులకు ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యనభ్యసించుతారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందనుంది. నాణ్యమైన విద్య ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలో అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందుతుంది. ఈ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి సూచనలు ఇస్తున్నా. – వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్నగర్ -
పదకొండు దాటినా పత్తాలేరు!
● సమయపాలన పాటించని అధికారులు ● కార్యాలయాల్లో ఖాళీగా కుర్చీల దర్శనం బొంరాస్పేట: ప్రభుత్వ అధికారుల్లో సమయపాలన కొరవడింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. రాకపోకలు సాగిస్తున్నారు!.. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత వారివారి కార్యాలయాలకు వస్తున్న విషయం ‘సాక్షి’ విజిట్లో వెలుగు చూసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీఓ, ఎంఈఓ, తహసీల్దారు, వ్యవసాయశాఖ, ట్రాన్స్కో తదితర కార్యాలయాలను సందర్శించగా.. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు.. అధికారుల రాకకోసం పడిగాపులు కాశారు. అనంతరం తిరిగి వెళ్లిపోయారు. పనుల నిమిత్తం పొరుగూరుకు అధికారుల అలసత్వంపై ఆరా తీయగా తహసీల్దారు పద్మావతి ఓ కేసు విచారణ నిమిత్తం వెళ్లినట్లు తెలిసింది. ఎంఈఓ హరిలాల్ను వివరణ కోరగా.. గణతంత్ర దినోత్సవం వేడుకకు బహుమతుల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లానని చెప్పారు. ట్రాన్స్కో ఇన్చార్జి ఏఓ నాగరాజు నెలరోజుల క్రితం కుల్కచర్ల మండలానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నేటికీ ఎవరూ రాలేదని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఏఓ పోలప్ప ఫీల్డ్ పని నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లినట్లు సమాచారం. ఇన్చార్జి ఎంపీడీఓ వెంకన్గౌడ్, ఎంపీఓ తదితర సిబ్బంది మధ్యాహ్నం తర్వాత విధులకు హాజరయ్యారు. -
సర్వం.. సర్వే ప్రామాణికం
మున్సిపాలిటీల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. పురపాలిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ మాత్రం.. సర్వే ప్రామాణికంగా గెలుపు గుర్రాలనుబరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. పరిగి: మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పరిగి మున్సిపల్లో రాజకీయ సందడి మొదలైంది. ప్రధాన పార్టీలైనకాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చలు, పోటీకి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చిన వార్డుల్లో ఆశావహులను బుజ్జగించడం, వారిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నంలో బీజీగా ఉన్నారు. పట్టుదలగా.. పురపాలికలో 18 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా పోటాపోటీగా పోటీదారులు పార్టీల నుంచి బీఫామ్ పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దల ప్రసన్నంకోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. గడిచిన పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకుండా జరగగా.. ప్రస్తుత పుర పోరు పార్టీ గుర్తులతో జరగనున్న నేపథ్యంలో.. పట్టు సాధించేందుకు పట్టుదలతో ముందుకుసాగుతున్నారు. నిఘా సర్వేల ఆధారంగా మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు చొప్పున బరిలోకి దిగనున్నట్లు తెలియగా.. అభ్యర్థులను సర్వే ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం గత అనుభవంతో అధికార పార్టీకి దీటుగా గెలుపు గుర్రాలను ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. నోటిఫికేషన్ రావడమే ఆలస్యమన్నట్లుగా.. పోరులో తలపడేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కాగా.. అధికార పార్టీ సర్వేల ఆధారంగా.. ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్టులను అనుసరించి అభ్యర్థుల ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆశావహులకు నిరాశే.. పరిగి చైర్మన్ పీఠం బీసీ మహిళాకు రిజర్వు కాగా.. వార్డుల వారీగా రిజర్వేషన్లను సైతం అధికారులు ప్రకటించారు. కొందరికి అనుకూలంగా రాక పోవడంతో నిరాశ చెందుతున్నప్పటికీ.. తమ అనుకూలంగా ఉండే వారికి మద్దతుగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. అనుకూలంగా ఉండి, టికెట్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్న వారు లేకపోలేదు. దీనికి తోడు సర్వే, దాని ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రచారం జరగడంతో ఒక్కో వార్డుకు ముగ్గురు ఉన్న చోట మరో ఇద్దరికి నిరాశే మిగలనుంది. రెబల్గానైనా.. ప్రజల మద్దతు, ఆర్థికంగా బలంగా ఉన్న వారికి టికెట్లు దక్కని పరిస్థితుల్లో స్వతంత్రులుగా బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ పార్టీకి రెబల్ అభ్యర్థులు ఎక్కువ ఉంటే.. ఆ పార్టీకి నష్టం జరగనున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. పురపోరుకు సన్నద్ధమవుతున్న పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నేతల బిజీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ గత అనుభవంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ తమదైన శైలిని అనుసరిస్తున్న బీజేపీ -
ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం
ఇబ్రహీంపట్నం: ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలోని వెంకటరమణాకాలనీకి చెందిన మాదరి శివకుమార్(35) ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. మద్యానికి అలవాటుపడిన ఆయన తన భార్యతో గొడవ పడి బుధవారం రాత్రి ఇంట్లో నంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. సమీప రాయపోల్ రోడ్డు నల్లకంచె ఫారెస్ట్ ఏరియాలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
శివాలయంలో ప్రత్యేక పూజలు
దుద్యాల్: మండల పరధిలోని హస్నాబాద్ గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివస్వాముల మండల దీక్షలో భాగంగా ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమం చేశారు. అనంతరం శివాష్టకం, బిల్వాష్టకం, అష్టోత్తర శాత నామాలు పఠించారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు శ్రీనివాస్, సంజీవ, అశోక్, మోహన్, అనిల్, భీమేశ్, ఆంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి కృషి తాండూరు రూరల్: అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చెంగోల్ సర్పంచ్ మాల నర్సమ్మ అన్నారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాగునీటిని వృథా చేయొద్దని చెప్పారు. 7,8వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు వేయిస్తానని తెలిపారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఉప సర్పంచ్ అనిత, పంచాయతీ కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు. బీరువా విరగొట్టి రూ.మూడు లక్షలు చోరీ అనంతగిరి: ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలు విరగొట్టి రూ.మూడు లక్షల నగదును దొంగలించిన సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మోతిబాగ్ కాలనీలోగల బాలకేంద్రం సమీపంలో దోమ మండలం మల్లెపల్లికి చెందిన ప్రభులింగం కొన్ని రోజులుగా ఇక్కడ ఉంటూ క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారు. అయితే ఈనెల 9న ఆయన గుండెపోటుతో మృతి చెందగా కుటుంబీకులు స్వగ్రామానికి వెళ్లి వచ్చారు. కాగా సోమవారం కుటుంబీకులు దేవస్థానాల వద్ద నిద్ర చేయడానికి వెళ్లారు. మంగళవారం రాత్రి దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళం విరగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. కాగా కుటుంబీకులు ఉదయం వచ్చి చూసే సరికి ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం తాండూరు టౌన్: ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సురక్షితంగా కొనసాగుతుందని టీజీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత అన్నారు. బుధవారం తాండూరు బస్ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ లక్ష్యమన్నారు. ప్రతి రోజు విధులకు హాజరయ్యే ముందు డ్రైవర్లకు డ్రంకెన్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ మద్యం తాగి బస్సు నడిపి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తీసుకురాకూడదన్నారు. డ్రైవర్లను శాలువా, నగదుతో సత్కరించారు. -
చేపలు పట్టేందుకు శిక్షణ
దుద్యాల్: మత్స్యకారుల సంఘంలో చేరేందుకు దుద్యాల్కు చెందిన ముదిరాజులు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగా బుధవారం స్థానిక చెరువులో చేపలకు వల వేసే నైపుణ్యంపై శిక్షణ ఇచ్చారు. గతంలో 232 మంది మత్స్యకారులు ఉండగా ప్రస్తుతం 65 మంది మాత్రమే మిగిలారు. మరో 70 మంది సభ్యులను చేర్చుటకు అవకాశం ఉండడంతో వారికి చేపలు పట్టే విధానాన్ని నేర్పిస్తున్నారు. నీటిలో వల వేయడం, చెరువులో ఈదడం వంటివి నేర్చుకుంటున్నారు. ఈ నెల 31న జిల్లా కేంద్రంలో మత్స్యకారులుగా చేరుటకు సంబంధించిన పరీక్షను జిల్లా మత్స్య సహకార శాఖ అధికారులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. -
మహిళల హక్కుల పరిరక్షణకు కృషి
దోమ: మహిళల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని మా భరోసా కౌన్సిలర్లు రాజశ్రీ, పూజిత అన్నారు. బుధవారం మండల పరిధి బొంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓ వెంకట్తో కలసి విద్యార్థులకు మా భరోసాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవసరమైన సమయంలో భరోసా సభ్యులు మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడతారన్నారు. వారికి ఎక్కడైనా ఎదైనా జరిగితే 100 డయల్ చేయాలని సూచించారు. అతివల పక్షాన నిలబడి, న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు షఫీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పనిచేయించి.. ముంచి!
బషీరాబాద్: ‘ప్రజాపాలన’ ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కంప్యూటరీకరణ చేసిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా రిక్తహస్తం చూపెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల పథకాలు పొందుటకు 2023 డిసెంబర్ 28 నుంచి పలు దఫాలుగా గ్రామ సభలు పెట్టి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంది. ఈ దరఖాస్తులను కంప్యూటర్లో నిక్షిప్తం చేయడానికి ప్రభుత్వ ఆపరేటర్లు సరిపోకపోవడంతో ప్రైవేటు డాటాఎంట్రీ ఆపరేటర్లతో కంప్యూటరీకరణ చేయింది. ఇందులోభాగంగా జిల్లాలో సుమారు వెయ్యికి పైగా ప్రైవేటు ఆపరేటర్లు నవంబర్ 2024లో రాత్రింబవళ్లు శ్రమించి డాటాను ఎంట్రీ చేశారు. ఇందుకుగాను ఒక్కో దరఖాస్తు ఎంట్రీకి రూ.30 చెల్లిస్తామని అధికారుల చెప్పడంతో ఒక్కో ఆపరేటర్ 500 నుంచి వెయ్యి దరఖాస్తులు 15 రోజుల పాటు చేశారు. అయితే వీరికి రావాల్సిన గౌరవ వేతనం కోసం ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాలేదని సాకులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు కంప్యూటర్లో నిక్షిప్తం చేసిన తమకు 15 నెలలు గడిచిన డబ్బులు చెల్లించడంలేదని ఆపరేటర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రజాపాలనలో వీరితో పాటు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లులుగా పనిచేస్తే వారికి వెంటనే గౌరవ వేతనం అందజేసిన సర్కారు డాటాఎంట్రీ ఆపరేటర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సర్కార్ రిక్తహస్తం ఏడాది గడిచినా నేటికీ అందని గౌరవ వేతనం జిల్లాలో వెయ్యికి పైగా ప్రైవేట్ ఆపరేటర్లు ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు రూ.21 వేలు రావాలి ఎంపీడీఓ కార్యాలయం అధికారులు ప్రజాపాలన దరఖాస్తులు ఎంట్రీ చేయాలని టార్గెట్ ఇచ్చి రాత్రింబవళ్లు పనిచేయించుకున్నారు. 15 రోజుల పాటు పనిచేసి 700 దరఖాస్తులు కంప్యూటర్లో ఎంట్రీ చేశా. రూ.21 వేల వేతనం రావాలి. అధికారుల చుటూ్ట్ తిరుగుతున్నా పట్టించు కోవడంలేదు. – రాజశేఖర్, ఆపరేటర్, బషీరాబాద్ రాత్రి 3 వరకు పనిచేశా ఒక్క ప్రజాపాలన దరఖాస్తు కంప్యూటర్లో ఎంట్రీ చేస్తే రూ.30 చెల్లిస్తామని అధికారులు చెబితే నిత్యం రాత్రి 3 గంటల వరకు పనిచేశా. 660 దరఖాస్తులు ఎంట్రీ చేస్తే రూ.19,800 వేతనం రావాలి. 15 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు తమకు రావల్సిన డబ్బులు ఇవ్వడంలేదు. ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తుందని అనుకోలేదు. – ప్రశాంత్, ఆపరేటర్, బషీరాబాద్ -
వైభవంగా మార్కండేయ స్వామి జయంతి
తాండూరు టౌన్: పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో మార్కండేయ మహర్షి జయంతిని బుధవారం వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పద్మశాలి కులస్తులు, మార్కండేయ నగర్ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు అభిషేకం, 9గంటలకు గీతా పారాయణం, పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికై న సద్మశాలి సర్పంచులను, రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతగిరి గుట్టలో.. అనంతగిరి: వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతగిరి గుట్టలో వెలిసిన మార్కండేయ ఆలయంలో బుధవారం మార్కండేయ జయంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. పూజలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఊట్ల నరేందర్, సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలి
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య యాలాల: ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు సీసీపీని కోకట్, ఇందిరమ్మ కాలనీలో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించి అనుమానితుల వివరాలు సేకరించారు. తనిఖీల్లో భాగంగా ధ్రువీకరణ పత్రాలు లేని 17 ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నేర నియంత్రణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సమాజంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు పంపించే ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. కార్యక్రమంలో సీఐలు సంతోష్కుమార్, ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ఐలు విఠల్రెడ్డి, నుమాన్ అలీ, వినోద్ తదితరులు ఉన్నారు. -
మూడు ఇళ్లు దగ్ధం
పరిగి: పట్టణ కేంద్రంలోని మల్లెమోనిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకేసారి మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. బుధవారం మల్లెమోనిగూడలో రసూల్బీ, బషీర్, మౌలానా ముగ్గురు ఇంటికి తాళాలు వేసి పొలాలకు వెళ్లారు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి మంటలు చెలరేగాయి. ఇల్లు మూడు ఒకే దగ్గరలో ఉండటంతో వేగంగా మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా అప్పటికే తీవ్ర నష్టం జరిగింది. బషీర్కు చెందిన రెండు మేకపిల్లలు సజీవదహనం కాగా ముగ్గురు బాధితులకు కలిపి రూ.మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. -
రాయితీ పరికరాలను వినియోగించుకోండి
అనంతగిరి: ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాయితీపై పరికరాల పంపిణీ చేశారు. దరఖాస్తు చేసుకున్న 43 మంది రైతులకు కలెక్టర్ రొటావేటర్, కల్టివేటర్, తైవాన్ ప్రేయర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తుందన్నారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం, జిల్లా ఉద్యానవన అధికారి సత్తార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, అంజయ్య, విజయ భాస్కర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ -
సీసీ కెమెరాలతో నేరాల అదుపు
తాండూరు రూరల్: ప్రతి ఊరిలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పెద్దేముల్ ఎస్ఐ శంకర్ సూచించారు. పెద్దేముల్ మండలం ఓంమ్లనాయక్ తండా సర్పంచు సుమిత్ర భాయితో కలిసి కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులో ఉంటాయన్నారు. అంతేకాకుండా గ్రామస్తుల సహకారంతో సీసీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు దుగ్గాపూర్, చైతన్యనగర్, ఓంమ్లనాయక్ తండాలో ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి సిబ్బందికి సన్మానం
బంట్వారం: వీబీజీ–రామ్జీ(ఉపాధి హామీ) పథకంలో విధులు నిర్వహించే ఉద్యోగులను మండలంలోని తొర్మామిడి సర్పంచ్ సంజీవులు బుధవారం ఈజీఎస్ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తాను 2019–21 మధ్య కాలంలో రెండేళ్ల పాటు తొర్మామిడిలో ఈజీఎస్ వర్కర్గా తాత్కాలికంగా పని చేశానన్నారు. ఈజీఎస్లో విధులు నిర్వహించే వారందరూ సత్వరమే స్పందించడంతోనే ఉపాధి కూలీలందరికి సకాలంలో డబ్బులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సుధాకర్, ఈసీ శ్రీనివాస్, టీఏలు అశోక్రెడ్డి, హన్మంతు, ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత బంట్వారం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మర్పల్లి మార్కె ట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం బంట్వారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పైరవీలకు తావు లేకుండా నేరుగా అర్హులకే చెక్కులు అందిస్తున్నామన్నారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, బంట్వారం సర్పంచ్ మల్లేశం, తహసీల్దార్ విజయ్మార్, ఏఎంసీ డైరెక్టర్లు యాదగిరి, నర్సింలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలకు స్థలమివ్వాలని వినతి బొంరాస్పేట: మండల కేంద్రంలో క్రీడా మైదానానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని బుధవారం తహసీల్దార్ పద్మావతికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. క్రీడా మైదానం లేనందున యువకులు, క్రీడాకారులు నిరుత్సాహానికి గురైతున్నారని పేర్కొన్నారు. అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించి క్రీడా మైదానానికి స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని తహసీల్దారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరేశం, ఉపసర్పంచ్ నందినినరేందర్సాగర్, యువకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇసుక డంపింగ్ గుర్తింపు తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం రుక్మాపూర్లో అక్రమ ఇసుక డంపింగ్లను గుర్తించినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. తాండూరు మండలం బొంకూర్ శివారులోని కాగ్నా నది నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు రవీందర్రెడ్డి, జగన్నాథ్లు బుధవారం రుక్మాపూర్ శివారులో ఇసుక డంపింగ్ను గుర్తించారు. విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తామని ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థుల ఉన్నతికి తోడ్పడండి
తాండూరు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సూచించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్(జీటీఏ) నూతన సంవత్సర క్యాలెండర్తో పాటు డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే సమర్థులైన ఉపాధ్యాయులున్నారని, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. బోధనతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులను తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జీటీఏ జిల్లా అధ్యక్షుడు బందెప్ప, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, తాండూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సంతోష్, ఉపాధ్యాయులు సుధీర్, శ్రీశైలం, రామకృష్ణ, సంతోష్, హరీశ్, రమేశ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, నాయకులు రవిగౌడ్, రవూఫ్, నయీమ్, శ్రీనివాస్, చంద్రశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే పేదల సంక్షేమం
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య దుద్యాల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య, కొడంగల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్ అన్నారు. బుధవారం దుద్యాల్కు చెందిన కొప్పు సాయిలుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్తోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అర్హులైన వారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, నాయకులు ఖాజా, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్గా విక్రమ్సింహారెడ్డి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్గా విక్రమ్సింహారెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇది వరకు సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఇక్కడ విధులు నిర్వహించిన జాకీర్ అహ్మద్ మొయినాబాద్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా విక్రమ్సింహారెడ్డి మాట్లాడుతూ.. అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తాండూరు కమిషనర్గా మధుసూదన్రెడ్డి తాండూరు: తాండూరు మున్సిపల్ కమిషనర్గా మధుసూదన్రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న యాదగిరిని కొల్లాపూర్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో పఠాన్చెరువు మండలం ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న మధుసూదన్రెడ్డి తాండూరుకు బదిలీపై వచ్చారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు నెలల పాటు నిర్వహించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ నిర్వహించే 2025–26కు గాను స్టేట్ సర్వీసెస్, కానిస్టేబుల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు, స్టడీ మెటీరియల్స్ అందజేస్తామన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్టడీ సర్కిల్ నుంచి కోచింగ్ తీసుకున్నవారు అనర్హులని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 8న అర్హత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ఎల్.వెంకటయ్య హనరరీ డైరెక్టర్, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నంబర్ 94405 21419లో సంప్రదించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. సయ్యద్ మల్కాపూర్ గ్రామానికి చెందిన రాములుస్వామితోపాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలోనే పరిగి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాటం చేసేది బీఆర్ఎస్ ఒక్కటేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్కుమార్, మాజీ ఎంపీపీ అరవింద్రావు తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం బోధించేందుకు గెస్ట్ లెక్చరర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు రసాయన శాస్త్రంలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పీహెచ్డీ, ఎన్ఈటీ, ఎస్ఈటీ, ఎస్ఎల్ఈటీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 24 తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. హయత్నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
రైతు ముంగిట్లోకే శాస్త్రవేత్తలు
పరిగి: రైతుల ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలను పంపి సాగులో మెలకువలు నేర్పుతున్నామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్డస్ జానయ్య అన్నారు. బుధవారం పరిగి పట్టణంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కార్యాలయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతోందన్నారు. అన్ని ప్రాంతాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. రసాయన ఎరువుల వాడకం ద్వారా ఆహార పదార్థాలు కలుషితం అవుతున్నాయని, రైతులు సేంద్రియ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తెచ్చి రైతులకు మేలు చేసే 16 రకాల పథకాలను వెనక్కి నెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఏక కాలంలో రుణమాఫీ చేసి రైతులను అప్పుల భారం నుంచి బయటపడేశారని అన్నారు. మూడు జిల్లాల్లో వ్యయసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ.123 కోట్లు, వంద ఎకరాల భూమి, 183 మంది సిబ్బంది అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తేగా మంజూరు చేశారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాకే సబ్సిడీపై యంత్రాలు పంపిణీ చేస్తోందన్నారు. పరిగి పట్టణంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త వంగడాల సాగు కోసం పరిగి మండలంలో 30 ఎకరాల భూమి కేటాయిస్తామని తెలిపారు. అలాగే వసతుల కల్పనకు రూ.25 లక్షలు మంజూరు చెప్పారు. అనంతరం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం అధికారులు నరేందర్రెడ్డి, ఏకాత్రి, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఏడీఏ డీఎస్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. సేంద్రియ సాగుపై ఆసక్తి పెంచుకోవాలి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ జానయ్య పరిగి పట్టణంలో రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కార్యాలయం ప్రారంభం -
‘ఆత్మ’ చైర్మన్గా శంకర్రెడ్డి
బషీరాబాద్: తాండూరు నియోజకవర్గ ఆత్మ కమిటీ(అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.శంకర్రెడ్డి నియమితులయ్యారు. బషీరాబాద్ మండలం రెడ్డిఘణాపూర్ గ్రామానికి చెందిన శంకర్రెడ్డితో పాటు నియోజవకర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాల నుంచి 20 మంది సభ్యులకు కమిటీలో చోటుదక్కింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఇచ్చిన సిఫారసు లేఖతో జిల్లా వ్యవసాయశాఖ ఈ మేరకు పదువులు కేటాయించింది. నేడు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖలైన హార్టికల్చర్, సెరీకల్చర్, ఇరిగేషన్, పాడిపరిశ్రమ నుంచి రైతులకు అందించే పథకాలను ఈ కమిటీలు నడిపిస్తాయి. అయితే గతంలో టీడీపీ, టీఆర్ఎస్లో పనిచేసిన శంకర్రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. తనకు నామినేటెడ్ పదవి ఇచ్చిన ఎమ్మెల్యేకు శంకర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీ రేపు(శుక్రవారం) బషీరాబాద్ మండలం కొర్విచెడ్ సమీపంలోని గుర్రాల అనంతమ్మ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనుంది. కమిటీ సభ్యులు వీరే.. జి.నర్సిరెడ్డి(జీవన్గీ), శ్యానప్ప(ఇందర్చెడ్), శంకర్నాయక్(కొత్లాపూర్), ప్రతాప్రెడ్డి(గంగ్వార్), పాశమొల్ల అర్జున్(ఎక్మాయి), బబల్రామ్(గోరేపల్లి), నాగిరెడ్డి(అగ్గనూర్), అనంతయ్య(అడల్పూర్), మల్లప్ప(అక్కంపల్లి), సునీల్(బషీర్మియాతండా), శ్యామప్ప(జినుగుర్తి), జగదీశ్(మిట్టబాస్పల్లి), యాదప్ప(చింతామణిమట్నం), సాయిలు(బిజ్వార్), జైపాల్రెడ్డి(ఐనెల్లి), శివకుమార్(జనగాం), గోపీనాయక్(మన్సాన్పల్లి), పి.శ్రీనివాస్రెడ్డి(బుద్దారం), చాకలి లక్ష్మణ్(గోపాల్పూర్), పాశాపూర్ రవి(ఆడ్కిచర్ల) ఉన్నారు. 21 మందితో తాండూరు నియోజకవర్గ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయశాఖ బషీరాబాద్ నేతకు దక్కిన నామినేటెడ్ పదవి రేపు ప్రమాణ స్వీకారం -
మున్నూరు కాపులు రాజకీయాల్లో రాణించాలి
● 25న సర్పంచులకు ఆత్మీయ సన్మానం ● సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య కొడంగల్: మున్నూరు కాపులు రాజకీయాల్లో రాణించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య పటేల్ అన్నారు. బుధవారం ఆయన కొడంగల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర కమిటీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ నెల 25న సికింద్రాబాద్లోని శ్రీ రాజ రాజేశ్వరీ గార్డెన్లో సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన మున్నూరు కాపు సర్పంచులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. వారిని సన్మానించనున్నట్లు చెప్పారు. అదే రోజు సంఘం 2026 సంవత్సరం డైరీని ఆవిష్కరిస్తామన్నారు. జిల్లా, తాలూకా, మండల, గ్రామ కమిటీ సభ్యులు, కుల బంధువులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో విజయం సాధించిన వారు రావాలన్నారు. రాష్ట్ర మహాసభ ద్వారా విద్యార్థులకు కాచిగూడలో హాస్టల్ వసతి కల్పించినట్లు చెప్పారు. ఉపకార వేతనాలు, మెరిట్ స్కాలర్ షిప్పులు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యువక మండలి రాష్ట్ర కార్యదర్శి శేఖర్రెడ్డి, కొడంగల్ కమిటీ సభ్యులు కానుకుర్తి నర్సిరెడ్డి, మున్నూరు బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంపై దండయాత్ర చేద్దాం
● వీబీ జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి ● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు రూరల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దండయాత్ర చేద్దామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో సర్పంచ్ యాదమ్మ అధ్యక్షతన కేంద్రం తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న ప్రతి గ్రామంలో కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని కోరారు. ఆ ప్రతులను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి పంపుతామన్నారు. కేంద్రం తీరుతో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎలాగైతే ఉద్యమం చేశామో.. అదే స్ఫూర్తితో ఉపాధి హామీ కొత్తం చట్టం రద్దు కోసం పోరాటం చేద్దామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, ఉప సర్పంచ్ వాజీద్ మియా, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు శ్రీనివాస్చారి, మధుసూదన్రెడ్డి, కిరణ్, శోభారాణి, రియాజ్, మహిపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మల్లేశం, బుజ్జమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: స్పీకర్ ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం సమంజసం కాదని వెంటనే క్షమాపణలు చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి స్పీకర్గా దళిత ఎమ్మెల్యే ప్రసాద్కుమార్కు అవకాశం ఇచ్చారన్నారు. స్పీకర్ అందరినీ సమానంగా చూస్తూ సభను సమర్థవంతంగా నడిపిస్తూ మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు చైర్మన్ స్థానాలను కై వసం చేసుకుంటామన్నారు. స్పీకర్పై కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
అనంతగిరి: గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో వేదిక, వీఐపీలు, అధికారులు కూర్చునేందుకు ఏర్పాటు చేయాలన్నారు. అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావం పెంపొందేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహమెహ్ర, ఇన్చార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీ ఓ వాసుచంద్ర, కలెక్టరేట్ ఏవో పర్హీన బేగం, వివి ధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదకరం
తాండూరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్ ఎంతో ప్రమాదకరమని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను నిలిపి పరీక్ష చేశారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల డీఎస్పీ అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు కారాదన్నారు. అజాగ్రత్త, నిబంధనలు పాటించకపోవడం, తాగి వాహనాలు నడపడం వల్ల రోజు రోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులైతే కఠిన శిక్షలు తప్పవన్నారు. అలాగే తాగి నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ అంబర్య, పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో డీఎస్పీ -
వైభవంగా ఊరడమ్మ ఉత్సవాలు
మూడేళ్లకు ఒకసారి జాతర ● బోనమెత్తిన మంబాపూర్ ● ఆకట్టుకున్న పోతురాజుల నృత్యాలు తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో మంగళవారం ఊరడమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పోతురాజుల నృత్యాలు, శివసస్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు కొనసాగింది. బంధువుల రాకపోకలతో ఊరంతా పండుగ వాతవారణం నెలకొంది. -
పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాం
తాండూరు రూరల్: కమ్యూనిస్టు పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కరన్కోట్ శివారులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ వద్ద సీసీఐ శాఖను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో, గ్రామాల్లో పార్టీ శాఖలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం సీసీఐ శాఖ సహాయ కార్యదర్శి శరణప్ప మాట్లాడుతూ.. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగవిరమణ పొందిన కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యంలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్లో కార్మికులతో కలిసి ఫ్యాక్టరీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, నాయకులు అనంతయ్య, అశోక్, మదన్ పండిత్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ -
ఎకరాకు ఒక్క బస్తా మాత్రమే
కందుకూరు: యాసంగి పంటల సాగు కోసం అవసరమైన యూరియా కొనుగోలుకు రైతులు కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. మంగళవారం 450 బస్తాల యూరియా రాగా ఒక్కో ఎకరాకు ఒక బస్తా చొప్పున అధికారులు సరఫరా చేశారు. మొక్కజొన్న, వరి పంటల కోసం యూరియాను అధికంగా వినియోగిస్తారు. చాలా మంది పంటలు ఇంకా నారుమళ్ల స్థాయిలోనే ఉండగా, మున్నుందు దొరికదనే భావనలో యూరియా కొనుగోలు చేయడానికి ముందస్తుగా వస్తున్నారు. దీంతో పీఏసీఎస్ కార్యాలయంలో ఆన్లైన్లో వేలిముద్ర ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉండటంతో క్యూలో నిరీక్షిస్తున్నారు. -
మహాసభలను జయప్రదం చేయండి
యాచారం: అఖిల భారత మహిళా సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మస్కు అరుణ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చింతుల్ల గ్రామంలో మంగళవారం ఈనెల 25 తేదీ నుంచి 28వ తేదీ వరకు నగరంలో జరిగే సభలకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహా సభలను విజయవంతం చేయడం కోసం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సభలకు మాజీ ఎంపీ బృందా కారత్, అఖిల భారత మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి పీకె, ప్రధాన కార్యదర్శి ధావలే తదితరులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో మస్కు జ్యోతి, శ్యామల, పద్మజ, జంగమ్మ, సరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు అరుణ -
రసీదు ఇచ్చి.. శాంతపరిచి
● యూరియా కోసం రైతుల పడిగాపులు ● మంచాల పీఏసీఎస్ కేంద్రంలో ఉదయం నుంచే క్యూ ● మూడు రోజులుగా అవస్థలుపడుతున్న కర్షకులు మంచాల: గ్రామాల్లో ఓ వైపు వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మరో వైపు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు దఫాలుగా 1,800 బస్తాల యూరియా అందజేశారు. అయినా గ్రామాల్లో చాలా చోట్ల వరి నాట్లు పడలేదు. నాట్లు పడిన పొలాల్లో కలుపు సైతం తీయలేదు. దీంతో సరిపడా యూరియా దొరకడం లేదని కర్షకులు వాపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామునే గ్రామాల నుంచి వచ్చి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు. ఇస్తారనే ఆశతో గత మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. పీఏసీఎస్ సిబ్బంది రసీదులు కూడా పంపిణీ చేసింది. వాటిని చేతబట్టిన రైతులు యూరియా కోసం ఎదురు చేస్తున్నారు. ఇప్పటికై నా సకాలంలో ఎరువులు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదే విషయంపై మండల వ్యవసాయాఽధికారి వెంకటేశంను వివరణ కోరగా.. కచ్చితంగా యూరియా వస్తుందని చెప్పారు. రాగానే అందరికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. -
12 నుంచి పోలేపల్లి ఎల్లమ్మ జాతర
దుద్యాల్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతర వచ్చే నెల 12 నుంచి ప్రారంభం కానుందని ఆలయ ఈఓ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామ సర్పంచ్ చంద్రప్ప, గ్రామస్తుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మొదట వచ్చే నెల 6 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ప్రకటించినా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిందని వివరించారు. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతర ముఖ్య ఘట్టం సిడే లాగుట కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13వ తేదీకి సవరించారు. 12న రాత్రి 9 గంటలకు గ్రామంలో ఉన్న అమ్మవారి పూర్వ ఆలయం నుంచి ప్రధాన దేవస్థానం వరకు పల్లకీ సేవ. 13న సాయంత్రం 4 గంటలకు అమ్మవారి సిడే లాగుట(ముఖ్య ఘట్టం). 14న సాయంత్రం రథోత్సవం(తేరులాగుట). 15న అమ్మవారి ప్రత్యేక పూజలు. 16న అమ్మవారిని ఉరేగింపు ప్రధాన దేవాలయం నుంచి గ్రామంలోని ఆలయానికి పంపించుట. ఇలా ఐదు రోజుల్లో బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభోవంగా సాగనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరై అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల తేదీలో మార్పు చేసినట్లు ఈఓ వెల్లడి -
పేదలకు అండగా కాంగ్రెస్
కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు కుల్కచర్ల: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ముజాహిద్పూర్ గ్రామంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, భీమయ్య, శ్రీను, రమేశ్, రాజు పాల్గొన్నారు. మురుగు తొలగించాలని వినతి తాండూరు రూరల్: మండల పరిధిలోని వీర్శెట్టిపల్లి మార్గంలో మురుగుతొలగించాలని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పట్టణంలో మున్సిపల్ కమిషననర్ యాదగిరికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని పాత తాండూరు మీదగా వీర్శెట్టిపల్లికి వెళ్లే మార్గంలో మురుగు చేరి వీర్శెట్టిపల్లి, నారాయణపూర్, గోనూర్ గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించారని శ్రీహరి చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉపసర్పంచ్ జర్నప్ప, నాయకులు ఎర్ర శ్రీనివాస్ ఉన్నారు. బాల కార్మికులకు విముక్తి శంకర్పల్లి: భవన నిర్మాణంలో కార్మికులుగా పని చేస్తున్న ఆరుగురి బాలలకి పోలీసులు విముక్తి కల్పించిన సంఘటన మంగళవారం మోకిల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ ముస్కాన్, మోకిల పోలీసులు సంయుక్తంగా బాల కార్మికుల కోసం తనిఖీలు చేశారు. మోకిల గ్రామ పరిధిలోని పలు భవన నిర్మాణ కంపెనీలలో పని చేస్తున్న ఆరుగురు బాలలని గుర్తించి, పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం వారి తల్లిదండ్రులు, సంరక్షకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న సదరు కంపెనీల యాజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. యజమానులపై కేసు నమోదు కేశంపేట: మండల పరిధిలో ఇద్దరు బాల కార్మికులకు పోలీసులు మంగళవారం విముక్తి కలిగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని బోధునంపల్లి గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో పోలీసులు దాడులు చేసి ఓ బాలుడికి పనుల నుంచి విముక్తి కలిగించారు. అలాగే మంగళిగూడ గ్రామ శివారులోని ఇటుక బట్టీలో పని చేస్తున్న ఇద్దరు బాలురకు విముక్తి కలిగించారు. అనంతరం ఇద్దరు యజమానుల పైన కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు. బాల కార్మికులను పనులకు పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ డ్రైవర్పై కేసు నమోదు కేశంపేట: వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి మహిళ కింద పడిన సంఘటనలో డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరహరి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని మురళీనగర్కు చెందిన స్వప్న తన ఇద్దరు పిల్లలతో షాద్నగర్కు వెళ్లేందుకు ఈ నెల 18న కేశంపేట వద్ద బస్టాండ్ వద్ద వేచి ఉంది. ఆమనగల్లు నుంచి షాద్నగర్ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో చేతికి గాయాలైనట్లు బాధితురాలి తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చేవెళ్ల: ఎదురుగా వస్తున్న డీసీఎం, స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఆలూరు బస్టాప్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన విశ్వకర్మ అభిషేక్(23) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో స్కూటీపై హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో మండలంలోని ఆలూరు బస్టాప్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న అభిషేక్ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయానికి స్థలం కేటాయించండి
మొయినాబాద్: అయ్యప్ప ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మండలంలోని పెద్దమంగళారం గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు తహసీల్దార్ గౌతమ్కుమార్కు విన్నవించారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వే నంబర్ 218 ప్రభుత్వ భూమిలో అయ్యప్ప దేవాలయం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మంగళవారం స్థానికులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ నరోత్తంరెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, వీరారెడ్డి, ఓంరెడ్డి, ఉపేందర్రెడ్డి, అయ్యప్ప భక్తులు ఉన్నారు. -
చెత్త వేస్తే జరిమానా విధిస్తాం
మీర్పేట: రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విఽధిస్తామని బడంగ్పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ త్రిల్లేశ్వరరావు హెచ్చరించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా మంగళవారం మీర్పేట, జిల్లెలగూడ, ప్రశాంతిహిల్స్ డివిజన్లలో ఆయన పర్యటించారు. బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేయరాదని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా స్వచ్ఛ ఆటోల్లో వేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ అవగాహన కల్పించారు. అదే విధంగా 58 డివిజన్ బాలాపూర్ చౌరస్తాలోని ప్రధాన రహదారి, 59 డివిజన్ జిల్లెలగూడ ప్రధాన రహదారి, 60వ డివిజన్లోని భారత్ పెట్రోల్ బంకు వద్ద చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. కార్యక్రమంలో శానిటేషన్ డీఈ అభినయ్కుమార్, ఏఈ గంగాప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, జూనియర్ అసిస్టెంట్ నర్సింహ, పర్యావరణ ఇంజినీర్ రాము, జవాన్లు ఉన్నారు. -
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
● పరిగిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా ● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని పలు కాలనీలో రూ.20 కోట్ల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్లోని అన్ని వార్డుల్లో అండర్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలు, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సూచించారు. పరిగి మున్సిపాలిటీని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా నాయకులు, కార్యకర్తలు చూడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కుట్రను అడ్డుకోండి
మహేశ్వరం: మండల పరిధిలోని సిరిగిరిపురం సర్వే నంబర్ 72, 73 ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు పంచాయతీ పెద్దలు కుట్ర చేస్తున్నారని వడ్డెర సంఘం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ చిన్నప్పల నాయుడుకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి ఈస్థలంలో ఖననాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి తదితరులు శ్మశానవాటిక చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించారని తెలిపారు. ఎంపీడీఓ శైలజ, మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లుకు సైతం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా శ్మశానవాటిక చుట్టూ ఉన్న నక్షబాట కబ్జా కాకుండా చూడటంతో పాటు రైతుల పొలాలకు వెళ్లేందుకు రోడ్డును వెడల్పు చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. కొంత మంది కావాలనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. రోడ్డు, ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా పంచాయతీ తీర్మానంతో బొందల చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించామని, ఇది గిట్టని వారు రాత్రి వేళ కూల్చివేశారని తెలిపారు. ఈ విషయమై తాము కూడా పోలీసులు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశామన్నారు. తహసీల్దార్కు వినతి -
వసతుల్లేక.. సేవలు అందక
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడుతున్న రోగులు ● సరిపడా సిబ్బంది, గదులు, పరికరాలు లేని వైనం ● అన్ని చోట్ల రక్త పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు అరకొర వైద్య సేవలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. సిబ్బంది కొరతతో నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారు తోంది. సోమవారం సర్కారు వైద్యశాలలను ‘సాక్షి’ విజిట్ చేసింది. ఇందులో పలు అంశాలు వెలుగు చూశాయి. చాలా వైద్యశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించే కేంద్రం లేకపోవడంతో హైదరాబాద్కు పంపిస్తున్నారు. చికిత్స ఆలస్యం అవుతోందని రోగులు మదన పడుతున్నారు. అత్యవసరమైతే హైదరాబాద్కు అనంతగిరి: వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభం కాలేదు. దీంతో అత్యవసర సంబంధించిన కేసులు హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో సీటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లు లేవు. 2డీ ఈకో–మిషన్ అందుబాటులో ఉన్నా కార్డియాలజిస్టు లేడు. నిత్యం 600లకు పైగా ఓపీ చూస్తున్నారు. వైద్యులు ఉదయం 9 గంటలకు రావాల్సి ఉన్నా అరగంట ఆలస్యంగా వస్తున్నారు. మైనర్ ఆపరేషన్లు మాత్రమే అవుతున్నాయి. మేజర్ సర్జరీ పరికరాలు లేవు. పనిచేయని టీకా స్టోరేజ్ మిషన్ ధారూరు: స్థానిక పీహెచ్సీలో వ్యాక్సిన్ నిల్వ చేసే మిషన్ పనిచేయడం లేదు. దీంతో వికారాబాద్ ఆస్పత్రి నుంచి తీసుకరావడం పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే విధుల నిర్వహణ ఉంటుంది. డాక్టర్ వెళ్లిపోతే సిబ్బంది ఏం చేస్తామని రోగులకు చెబుతున్నారు. పర్మినెంట్ ఫార్మాసిస్ట్ లేకపోవడంతో మందుల నిల్వకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సీహెచ్సీలో డాక్టర్ల కొరత మర్పల్లి: స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఏడుగురు డాక్టర్లు, 12 మంది నర్సలు విధులు నిర్వహించాల్సి ఉండగా ముగ్గురు వైద్యులతో సేవలందిస్తున్నారు. ఒంటి గంట వరకు ఇద్దరు డాక్టర్లు, ఫార్మసిస్టు ఓపీ చూసి వెళ్లిపోతారు. ఆ తరువాత ఒకే డాక్టర్ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉండాల్సి వస్తోంది. అల్ట్రాసౌండ్, డయాలసిస్ సేవలు అందుబాటులో లేవు. నిత్యం 350 నుంచి 400 వరకు ఓపీ పేషంట్లు వస్తారు. అందులో 20–25 మంది అడ్మిట్ అవుతారని సిబ్బంది తెలిపారు. -
‘భూమి తీసుకుని బెదిరిస్తున్నారు’
శంకర్పల్లి: ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు అధినేత రాందేవ్రావు తమ భూములను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుని, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్రొద్దుటూరుకు చెందిన బాధితులు సోమవారం సదరు పొలాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 305/2లో ఎరుకలి మల్లమ్మకు 1.20 ఎకరాలు, 305/3లో ఎరుకలి రామయ్యకు 2 ఎకరాలు, 306లో ఎరుకలి పెంటయ్యకు 1.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములను 2020లో ఐదేళ్ల కోసం రూ.32 లక్షలకు లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని పలుమార్లు రాందేవ్రావు వద్దకు వెళ్లగా బెదిరింపులకు పాల్పడున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మలమ్మ, నర్సింలు, యాదగిరి, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. చట్టప్రకారం ముందుకెళ్తా.. ఈవిషయమై ఎక్స్పీరియం అధినేత రాందేవ్రావును వివరణ కోరగా.. 2020లో తాను భూమిని లీజుకు తీసుకున్న మాట వాస్తవమేనని, ఇందుకోసం 99 ఏళ్లకు గాను సదరు యజమానులకు రూ.13 లక్షలు ముందుగానే చెల్లించానని తెలిపారు. వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చట్టప్రకారం ముందుకు వెళ్తానని స్పష్టంచేశారు. -
నలుగురు గైనకాలజిస్టులు కావాలి
గైనకాలజిస్టుల కోసం ఎదురు చూస్తున్న గర్భిణులు, బాలింతలు తాండూరు టౌన్: పట్టణ శివారులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి(ఎంసీహెచ్) నిత్యం 140 మంది గర్భిణులు, 150 వరకు చిన్న పిల్లలు ఔట్ పేషెంట్లుగా వస్తుంటారు. సీజన్ సమయంలో చిన్న పిల్లల ఓపీ సంఖ్య 400 వరకు ఉంటుంది. ముఖ్యంగా వైద్యులు, సిబ్బంది కొరత ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఏడుగురు చొప్పున గైనకాలజిస్టులు, పిల్లల వైద్యులు ఉన్నప్పటికీ, వచ్చే రోగుల సంఖ్యను బట్టి మరో నలుగురు అవసరముంది. అలాగే ఇతర వైద్య సిబ్బంది ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులతో పాటు పలు విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ముగ్గురు గైనకాలజిస్టులు 10.30 గంటల తర్వాత ఆస్పత్రికి వచ్చారు. దీంతో గర్భిణులు ఎదురు చూశారు. -
రేషన్ డీలర్పై విచారణ
యాలాల: మండల పరిధిలోని నాగసముందర్ రేషన్ డీలర్ పద్మమ్మపై సోమవారం ఆర్ఐ శివచరణ్ విచారణ చేపట్టారు. లబ్ధిదారులకు ఐదు కిలోల చొప్పున బియ్యం తక్కువగా వేస్తున్నారని, నిలదీసిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మహేందర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఆర్ఐ విచారణ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. పాలిషింగ్ యూనిట్ యజమానికి రిమాండ్ తాండూరు రూరల్: వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన పాలిషింగ్ యూనిట్ యజమానిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని కరన్కోట్ పీఏస్ ఎస్ఐ రాథోడ్ వినోద్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. యాలాల మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన సంగెం సంతోష్(36), జగ్గమ్మ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వీరు జీవనోపాధికోసం తాండూరుకు వలస వచ్చారు. మండల పరిధి కోటబాసుపల్లి గ్రామశివారులోని కుర్వ శ్రీనివాస్ పాలిషింగ్ యూనిట్లో పనికి కుదిరారు. ఈ నెల 16న యూనిట్లోని అద్దెగదిలో సంతోష్ ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి భార్య జంగమ్మ.. యూనిట్ యజమాని శ్రీనివాస్పై అనుమానం వ్యక్తం చేశారు. ఆయన చావును అతనే కారణమన్నారు. భర్తను చంపేస్తానని బెదిరిస్తూ.. తనను లైంగిక ఇబ్బందులకు గురిచేసేవాడని పేర్కొంటూ.. ఆమె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శ్రీనివాస్పై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని ఎస్ఐ రాథోడ్ వినోద్ తెలిపారు. ‘రేడియల్ రోడ్డు పనులను అడ్డుకుంటాం’శంషాబాద్ రూరల్: రేడియల్ రోడ్డు పనులను అడ్డుకుని తీరుతామని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్రెడ్డి హెచ్చరించారు. కొత్వాల్గూడ నుంచి నాచారం వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న రేడియల్ రోడ్డు–2 నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులతో సోమవారం మల్కారంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్–షాబాద్ రోడ్డు విస్తరణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించినా జరగడం లేదన్నారు. పాత రోడ్డు అభివృద్ధికి నిధులు లేవంటున్నారని, అయితే కొత్త రోడ్డు నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పాత రోడ్డును రైతులకు అప్పగించి నూతన రోడ్డు వేసుకోవాలని సూచించారు. పెద్దల కోసం పేద రైతుల పొలాల మీదుగా రోడ్డు వేయడం అన్యాయమన్నారు. అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్తున్నట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు.. కాని సొంత పనుల కోసమే అని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు మురళీధర్రెడ్డి, నాయకులు శంకర్రెడ్డి,ౖ రెతులు పాల్గొన్నారు. ఏటీఎంలో చోరీకి యత్నం కొందుర్గు: దుండగులు ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన సంఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్పహాడ్ చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున దుండగులు ఇండియా–1 ఏటీఎం మిషన్ పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో శబ్దం విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి పారిపోయారు. ఏటీఎం మిషన్ స్క్రీన్ పగిలిపోయింది. దీనిపై సూపర్వైజర్ సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాల పరిశీలన కేశంపేట: ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు నాణ్యత పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని నిర్ధవెళ్లి సర్పంచ్ చెదురువెళ్లి భాస్కర్గౌడ్ అన్నారు. మండల పరిధిలోని నిర్ధవెళ్లిలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలను చేపట్టి, బిల్లులు పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి విజయ్కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
● సీఐటీయూ నేతల డిమాండ్ ● కడ్తాల్లో ర్యాలీ, తహసీల్దార్కు వినతిపత్రం కడ్తాల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉప సంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ సీఐటీయూఐ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాఽధి హామీలో తీసుకువచ్చిన వికసిత్ భారత్– జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్మికులకు పరిశ్రమల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, లేబర్కోడ్స్ ఉప సంహరణ, రైతాంగ సమస్యలు, ఉపాధి హమీ చట్టం పునరుద్ధరణ డిమాండ్లతో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. -
వడ్డీలేని రుణాల చెక్కు అందజేత
అనంతగిరి: వికారాబాద్లోని సత్యభారతి గార్డెన్లో సోమవారం మెప్మా స్వయం సహాయక సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కును అడిషనల్ కలెక్టర్ సుధీర్ అందజేశారు. 2023–24, 2024–25 సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకున్న 317 స్వయం సంఘాలకుగాను మొత్తం రూ.95 లక్షల చెక్కును ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్నాయక్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, డీఎంసీ అర్బన్ పీడీ రవికుమార్, టీఎంసీ వెంకటేష్, మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
క్యాలెండర్ల ఆవిష్కరణ
అనంతగిరి: తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్, డీఆర్ఓ మంగీలాల్, డీఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ ఫర్వీన్ ఖాన్, టీఎన్జీవో నాయకులు, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గెజిటెడ్ ఉద్యోగుల సంఽఘం ఆధ్వర్యంలో .. తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగుల సంఽఘం ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ సుధీర్, జిల్లా అధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తపస్ ఆధ్వర్యంలో.. అనంతగిరి: తపస్(తెలంగాణ ఉపాధ్యాయ సంఘం) ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను సోమవారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఆవిష్కరించారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి, ఆనందం, లక్ష్మీకాంతరావు, కృష్ణారెడ్డి, బస్వరాజు, కృష్ణకుమార్, రాఘవేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టీయూటీఎఫ్.. యాలాల: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) యాలాల మండల శాఖ తరఫున నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్ ప్రసాద్, దీపక్ రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, మండల ఉపాధ్యక్షుడు సంజీవ్కుమార్ తదితరులు ఉన్నారు.


