డీఆర్డీఓ శ్రీనివాస్
అనంతగిరి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు మహిళా సమాఖ్య జిల్లా కార్యాలయంలో మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని, ఆర్థికంగా స్థిరపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నర్సింలు, డీపీఎం నర్సింలు, కొమరయ్య, శేఖర్, నర్సింలు, ఏపీఎంలు సవిత, మంజులవాణి, శోభ, సీసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, 19 మండలాల అధ్యక్షురాళ్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


