బషీరాబాద్: గర్భాశయ ముఖద్వార కేన్సర్ నియంత్రణకు హెచ్పీవీ వ్యాక్సిన్తో చెక్ పెట్టొచ్చని బషీరాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం హెపీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలపాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బాలికలు తమ ఆధార్కార్డు తీసుకుని వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత నెల రోజులకు రెండో డోసు, ఆరు నెలల తర్వాత మూడో డోసు ఉంటుందని చెప్పారు. హెచ్పీవీ వ్యాక్సిన్ బాలికలకు వరమన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి డాక్టర్ గోపాల్, ఉప సర్పంచ్ అబ్దుల్ రజాక్, స్టాఫ్ నర్స్ గీత, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
బషీరాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్ గౌడ్


