వంటింట వార్‌ మంట! | - | Sakshi
Sakshi News home page

వంటింట వార్‌ మంట!

Mar 12 2026 9:12 AM | Updated on Mar 12 2026 9:12 AM

హత్యచేసి.. వీధి నాటకం చూసి వస్తానని వెళ్లిన ఓ మహిళ.. పక్కింట్లో దూలానికి వేళాడుతూ విగతజీవిగా కనిపించింది. వంటింట వార్‌ మంట! గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026 10లోu వికారాబాద్‌: ఇరాన్‌ యుద్ధం వేళ గ్యాస్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. వినియోగదారులపై పెను భారం పడనుంది. ఒక్కో సిలిండర్‌పై రూ.60 పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో ఆయా రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెంచారు. ఏడాది గడవక ముందే మరోసారి పెంచి సామాన్యులు నడ్డి విరిచారు. యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్‌ సరఫరా ఆగిపోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. తాజాగా వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌పై రూ.110 పెరిగింది.

న్యూస్‌రీల్‌

గ్యాస్‌ కనెక్షన్లు

జిల్లాలో మొత్తం 2,08,553 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్లరేషన్‌ కార్డు ఉన్న 1,16,990 మందికి మహాలక్ష్మి పథకం అమలవుతోంది. వీరికి రూ.500కే సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి నెలా మహాలక్ష్మి పథకానికి రూ.59 లక్షలు ఖర్చు చేస్తోంది. పథకం వర్తించని వారు 91,563 మంది ఉండగా వారిపై రూ.90 లక్షల భారం పడనుంది. జిల్లాలో కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు 3,209, దీపం కనెక్షన్లు 35,193, ఉజ్వల్‌ కనెక్షన్లు 38,753, సీఎస్‌ఆర్‌ కింద మంజూరైనవి 21,260 కనెక్షన్లు ఉన్నాయి.

హత్యచేసి.. వీధి నాటకం చూసి వస్తానని వెళ్లిన ఓ మహిళ.. పక్కింట్లో దూలానికి వేళాడుతూ విగతజీవిగా కనిపించింది.

ఇరాన్‌ యుద్ధం వేళ గ్యాస్‌ ధరలకు రెక్కలు

వినియోగదారులపై పెను భారం

ఒక్కో సిలిండర్‌పై రూ.60 అదనం

జిల్లాలో మొత్తం కనెక్షన్లు 2,08,553

మహాలక్ష్మి పథకం వర్తించేవి 1,16,990

ప్రతి నెలా ప్రభుత్వంపై రూ.58.49 లక్షల భారం

ప్రజలపై రూ.45.78 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement