విజేతలకు బహుమతుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

విజేతలకు బహుమతుల ప్రదానం

Mar 14 2026 10:25 AM | Updated on Mar 14 2026 10:25 AM

తాండూరు టౌన్‌: వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ – 2026లో భాగంగా స్థానిక పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. యాభై సంవత్సరాల అత్యవసర పరిస్థితి – భారత ప్రజాస్వామ్యం నేర్చుకున్న పాఠాలు అనే అంశంపై పోటీ నిర్వహించారు. ఓయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ వేంకటేశ్వర్లు, ప్రొఫెసర్‌ కృష్ణకుమార్‌, హన్మంతరావు, మహేందర్‌ రెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో విజేతలకు జిల్లా యువజన క్రీడాధికారి సత్తార్‌, ఈషయ్య బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకళ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement