కుళ్లిన, కల్తీ మాంసం తినడం ద్వారా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, అలర్జీ వంటి సమస్యలతో పాటు కాలేయం, మూత్ర పిండాల పని తీరు దెబ్బ తింటుంది. వధశాల నుంచే మాంసం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలి. వధశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంతో పాటు మాంసం పాడవకుండా ఎక్కువ సమయం నిల్వ ఉండేందుకు 0–4 సెల్సియస్ డిగ్రీల మధ్య నిల్వ చేసుకోవాలి. లేదంటే పాడవుతుంది. వధశాల నుంచి హోటళ్లకు పరిశుభ్రమైన వాహనాల్లోనే మాంసాన్ని తరలించాలి.
– డాక్టర్ ఎంకే శ్రీకాంత్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, హైదర్గూడ


