తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మారెపల్లి గేటు వద్ద కేజీబీవీలో రూ.2.30 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆదివారం ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మారెపల్లి గేటు వద్ద ఉన్న ఆరే మైసమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, సర్పంచ్ మంగళి సునీత, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అంజయ్య, నారాయణరెడ్డి, నాయకులు శోభరాణి, లొంక నర్సింలు, గోపా ల్రెడ్డి, కరణం పురుషోత్తంరావు, ఉప్పరి మల్లేశం, ఎల్లారెడ్డి, రియాజ్, హరీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.


