బషీరాబాద్: మండల ఎస్ఐ నుమాన్ అలీ బదిలీ అయ్యారు. 2024 జులై 19న బాధ్యతలు తీసుకున్న ఆయన 8 నెలల పాటు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. విధుల పట్ల నిఖచ్చిగా ఉండే ఆయనను ఏడాది తిరగముందే ఎస్పీ కార్యాలయం వీఆర్కు బదిలీ చేశారు. ఈనెల 7న డీఐజీ ఎల్ఎస్ చౌహన్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఎస్పీ కార్యాలయం వీఆర్లో పనిచేస్తున్న వగ్గుల శ్రీశైలంయాదవ్ను నూతన ఎస్ఐగా నియమించారు. నేడో, రేపో ఆయన బాధ్యతలు తీసుకుంటారని సమాచారం.
● ఎస్పీ కార్యాలయానికి అటాచ్
● కొత్త ఎస్ఐగా శ్రీశైలం యాదవ్


