పరిగి:కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలు, పండుగలకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం పరిగి పట్ట ణంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చా రు. పేదలకు కానుకలు అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ముస్లింలకు అండగా ఉంటుందన్నారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అన్నారు. సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ హన్మంతు, నాయకులుకుడుముల వెంకటేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి


