ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
తాండూరు టౌన్: అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు ఓ బాలుడు గాయపడ్డారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చేటుచేసుకుంది. సీఐ సంతోశ్కుమార్ తెలిపిన ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన బస్సు మెట్లకుంటకు వెళ్లేందుకు బస్టాండ్నుంచి బయటకు వస్తోంది. ఈ క్రమంలో కొడంగల్ రోడ్డు నుంచి ఇందిరాచౌక్వైపు ప్రయాణిస్తున్న లారీ వేగంగా బస్సును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో బస్సు, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన డ్రైవర్ నారాయ ణ, కండక్టర్ యాదమ్మ, బాలుడికి గాయాలవడంతో స్థానికులు వారిని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బ స్సులో 11మంది ప్రయాణికులున్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బస్సు డ్రైవర్, కండక్టర్తో
పాటు బాలుడికి గాయాలు
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ


