Yadadri District Latest News
-
కష్టం చూసి.. కల నెరవేర్చిన దంపతులు
మఠంపల్లి : మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలమ్మగూడేనికి చెందిన పగిడి సైదులు, సోమమ్మ దంపతులకు సొంత ఇల్లు లేక పూరి గుడిసెలో తలదాచుకుంటున్నారు. దీంతో వారి దీనస్థితిని చూసిన అదే గ్రామానికి చెందిన మల్రెడ్డి ఆదినారాయణరెడ్డి, పద్మావతి దంపతులు ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో స్థానికంగా రూ.1.50లక్షలతో రెండు గదులతో కొత్త ఇల్లు నిర్మించారు. శుక్రవారం శ్రీరామనవమి పండుగతో పాటు ఆదినారాయణరెడ్డి, పద్మావతి దంపతుల మనవడు నియాన్స్రెడ్డి పుట్టినరోజు కావడంతో గ్రామ పెద్దల సమక్షంలో కొత్త ఇంటిని సైదులు, సోమమ్మ దంపతులకు అప్పగించి గృహప్రవేశం చేయించారు. పేద దంపతుల కల నెరవేర్చిన ఆదినారాయణరెడ్డి, పద్మావతి దంపతులను గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సాముల శివారెడ్డి, గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ త్రివేణి, నాయకులు షేక్ ఖరీమ్, మట్టపల్లి యాదవ్, వేముల పిచ్చయ్య, తెలపాటి శ్రీనివాస్ గౌడ్, గాయం ఆదిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రహీమ్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ నిరుపేద కుటుంబానికి సొంత ఖర్చులతో కొత్త ఇల్లు కట్టించి అందజేత -
కోదాడ పబ్లిక్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవం
కోదాడ : నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపి, రెండుసార్లు వాయిదా పడిన కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు చివరకు ఏకగ్రీవంతో ముగిశాయి. శుక్రవారం రాత్రి క్లబ్ కార్యవర్గాన్ని ఎంపిక చేయడానికి నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ 2026–28 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారని, వీరు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్నికల అధికారిగా నియమితులైన న్యాయవాది ఎస్ఆర్కె.మూర్తి క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అధ్యక్షుడిగా కత్రం సీతారాంరెడ్డి, క్యార్యదర్శిగా విశ్రాంత ఉపాధ్యాయుడు పోటు రంగారావును ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా తోట రంగారావు, గుండపనేని వెంకట సత్యనారాయణరావు, సంయుక్త కార్యదర్శులుగా వంగవేటి గురునాథం, కోటమర్తి విద్యాసాగర్రావు, కార్యవర్గ సభ్యులుగా తమ్మనబోయిన రామయ్య, అమరనాయిని శేషగిరిరావు, సుంకర సత్యనారాయణ, మేకల ప్రతాప్, ముండ్రా రవికుమార్, ఇర్ల నాగమునీంధర్రెడ్డి, కుక్కడపు వెంకటేశ్వర్లు(బాబు)లను ఎంపిక చేశారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి సహకరించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మినారాయణ మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్లకు ఐదుగురు కమిటీ సభ్యులు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, పి.సత్యబాబు, ఎం.పాండురంగారావు, వేనేపల్లి వెంకటయ్య, పార సీతయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శులుగా కత్రం సీతారాంరెడ్డి, పోటు రంగారావు -
అంతర పంటలతో రైతుకు అదనపు ఆదాయం
హాలియా: జిల్లాలో పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూనే ఉంది. వివిధ పండ్ల తోటల్లో మొక్కలు నాటిన తర్వాత కాపునకు వచ్చే 4–5 సంవత్సరాల వరకు అంతర పంటలుగా మునగ, చిక్కుడు జాతి పంటలు, వేరుశనగ, పెసర, మినుము, కూరగాయలు, పుచ్చ సాగు చేసుకుంటే అదనపు ఆధాయం పొందే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై అనుముల ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారి మురళి అందిస్తున్న సలహాలు ఆయన మాటల్లోనే... అంతర పంటలతో లాభాలు ఫ పండ్ల తోటల్లో మొక్కలను ఎక్కువ దూరంలో నాటడం, ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల భూమిలో కలుపు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటలు కలుపును నివారిస్తాయి. ఫ సహజ వనరులైన భూమి, నీరు, సూర్యరశ్మి సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు. ఫ వివిధ రకాల అంతర పంటల సాగు వల్ల నేలలో వివిధ లోతుల్లో తేమ, పోషక పదార్ధాలు క్రమబద్ధంగా ఉపయోగపడటమే కాకుండా నేల లోపలి వరకు గుల్లబారి తర్వాత పంటలు బాగా పెరగటానికి దోహదపడుతుంది. ఫ ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు ఒకే సమయంలో పండించడం వల్ల రైతులకు రాబడులు స్ధిరంగా ఉంటాయి. ఫ అంతర పంటలుగా అపరాలు సాగు చేసుకుంటే భూసారం అభివృద్ధి చెందుతుంది. వేసుకోదగ్గ అంతర పంటలు ● మామిడిలో..నేల లోతు, ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి మామిడి మొక్కలను 7–10 మీటర్ల దూరంలో నాటుతారు. కాబట్టి మొక్కల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. లేత తోటల్లో సూర్యరశ్మి, గాలి ప్రసారం బాగా ఉంటుంది. ఇందులో అంతర పంటలుగా కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే బొప్పాయి, మునగ లాంటి మొక్కలు వేసుకోవచ్చు. పెద్ద తోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు అంతర పంటలుగా వేసుకోవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయానిచ్చే ఎర్రచందనం, శ్రీగంధం కూడా సాగు చేసుకోవచ్చు. ● బత్తాయి, నిమ్మలో.. బత్తాయి, నిమ్మ మొక్కలను 7్ఙశ్రీ7 మీటర్ల దూరంలో నాటుతాం. కాబట్టి కాపునకు వచ్చే ఐదు సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. వేరుశనగ, కంది, మినుము, పెసరతో పాటు దోస, ఉల్లి, పుచ్చ పంటలు వేసుకోవచ్చు. మిరుప, టమాట, వంగ పైర్లు వేయకూడదు. ఈ పైర్లు వేయడం వల్ల నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ● సపోటాలో..సపోటాను కూడా 7్ఙశ్రీ7 మీటర్ల దూరంలో నాటుకోవడం వల్ల అంతర పంటలుగా బొప్పాయి, మునగ లాంటి పంటలు వేసుకోవచ్చు. అలాగే కూరగాయల పంటలైన టమాట, వంగ, దోస కూడా సాగుచేయవచ్చు. చెట్ల వరుస మధ్యలో కొందరు ఎర్రచందనం, శ్రీగంధం కూడా సాగు చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా అంతర పంటల సాగు పండ్ల తోటల్లో అంతర పంటల సాగులో కొన్ని మెళకువలు పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా డ్రిప్ ద్వారా నీరందించినప్పుడు అంతర పంటల సాగుకు ప్రత్యేకంగా లాటరల్ పైపులైన్ వేసుకోవాలి. దీని ద్వారా ప్రధాన పంటకు, అంతర పంటకు వేర్వేరుగా సరిపడా నీరు అందించవచ్చు. ఫ అనుముల ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారి మురళి సూచనలు -
హోరాహోరీగా ఎడ్ల పందేలు
తిరుమలగిరి(సాగర్): శ్రీరామనవమి సందర్భంగా తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలను శుక్రవారం రాత్రి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎద్దుల పందేలకు ఆదరణ పెరగడంతో ఎక్కడ పోటీలు నిర్వహించినా ఔత్సాహికులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు. ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో మార్కెట్ యార్డులో కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ కాంసాని చంద్రశేఖర్, సర్పంచ్ పగడాల పున్నమ్మసైదులు, దేవస్థానం చైర్మన్ శాగం నాగిరెడ్డి, నాయకులు శాగం పెద్దిరెడ్డి, నాసర్రెడ్డి, డీఎస్పీ శంకర్రెడ్డి, చవ్వా బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుండు ఎత్తి.. సత్తా చాటి..
తిరుమలగిరి(సాగర్) : శ్రీరామనవమి సందర్భంగా నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో వివిధ క్రీడాపోటీలను ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 120 కిలోల బరువైన గుండు ఎత్తే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ముగ్గురు వ్యక్తులు పాల్గొనగా.. నిర్ణీత ఐదు నిమిషాల సమయంలో తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన అలేఖ్య తొమ్మిదిసార్లు పందెం గుండును లేపి ప్రథమ బహుమతిని గెల్చుకున్నాడు. అదేవిధంగా ప్రశాంత్ నిర్ణీత సమయంలో ఆరు సార్లు గుండును లేపి రెండవ బహుమతిని గెల్చుకున్నాడు. ఈ పోటీలను భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
వైభవంగా మహాలక్ష్మి యాగ శోభాయాత్ర
మిర్యాలగూడ : పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో శుక్రవారం త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాలక్ష్మి యాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం హౌసింగ్బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ వరకు వైభవంగా యాగ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, మిల్లర్లు గందె రాము, బండారు కుశలయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, మాధవి, చిలుకల రవికుమార్, ప్రసాద్, కారంపూడి జానకిరాఘవచార్యులు, గుడిపాటి నాగేందర్, రేపాల పురుశోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్ సీతారాములు పాల్గొన్నారు. -
భక్తులారా.. డ్రగ్స్ జోలికి వెళ్లకండి
డ్రగ్స్, గంజాయి సేవించొద్దు.. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ శ్రీరామచంద్రుడిలాగా ఆదర్శప్రాయంగా ఉందామంటూ శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ద శ్రీరాముడి వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. – సాక్షి ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
కుప్పకూలిన కల్యాణ వేదిక
కేతేపల్లి : కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో కల్యాణ వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బండపాలెంలో సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు నిర్వాహకులు సెంట్రింగ్ చెక్కలతో స్టేజీ నిర్మించి దానిపై కల్యాణ మండపం ఏర్పాటు చేశారు. కల్యాణ తంతు పూర్తయిన తర్వాత తలంబ్రాలు సమర్పించేందుకు మహిళలు ఒక్కసారిగా స్టేజీ పైకి ఎక్కారు. దీంతో కల్యాణ వేదిక కుప్పకూలింది. స్టేజీపై ఉన్న పూజా సామగ్రి చిందవందరగా పడిపోయింది. అర్చకులు ఉత్సవమూర్తుల విగ్రహాలను జాగ్రత్తగా పట్టుకోవటంతో పెనుప్రమాదం తప్పింది. ఏం జరుగుతుందో తెలియక భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు మహిళలు, చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. -
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
అర్వపల్లి : అనారోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్ఐ ఈట సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన కందుకూరి వెంకన్న (50) కొంతకాలంగా కుటుంబంతో కలిసి నల్లగొండలో నివాసముంటున్నాడు. రెండు నెలలుగా అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చి ఉంటున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ శివారులోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. బైక్ను ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి మిర్యాలగూడ టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద జరిగింది. మిర్యాలగూడ రూ రల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరా ల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కేశవాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (54) బైక్పై మిర్యాలగూడ పట్టణానికి వస్తుండగా.. కిష్టాపురం వద్దకు రాగానే దామరచర్ల నుంచి వస్తున్న టిప్పర్ బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనంమేళ్లచెరువు : కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన షేక్ జానీపాష శుక్రవారం యాక్టీవాపై మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎకై ్సజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 18 బీరు బాటిళ్లు, 47 క్వాటర్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బస్సులో ప్రయాణికుడి సెల్ఫోన్ చోరీకొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి జేబులోని సెల్ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. వివరాలు. కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బూడిద శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్కు వెళ్లేందుకు శుక్రవారం కొండమల్లేపల్లి బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి శ్రీనివాస్యాదవ్ జేబులో నుంచి అతడి సెల్ఫోన్ను దొంగలించాడు. అనంతరం బ్యాంక్ ఖాతా నుంచి రూ.25వేలు తస్కరించాడు. బాధితుడు కొండమల్లేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
సమాన దూరంలో ట్రిపుల్ఆర్ నిర్మించాలి
చౌటుప్పల్ : ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఇష్టానుసారంగా కాకుండా సమాన దూరంలో నిర్మించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనల మేరకు కాకుండా ఒక ప్రాంతంలో 28కిలోమీటర్లు, మరో ప్రాంతంలో 50కిలోమీటర్ల దూరంలో నిర్మించడం ఏమాత్రం సరికాదన్నారు. శుక్రవారం ఆయన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం సొమ్ముతో స్థానికంగా చిన్నపాటి ప్లాట్ను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. రైతులకు పరిహారంగా మూడు రెట్లు ఇవ్వాలని, లేకుంటే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరైన పరిహారం చెల్లించి రైతులను అన్ని విధాలుగా ఒప్పించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు పల్లె శేఖర్రెడ్డి, బచ్చనగోని గాలయ్య, భాస్కర్, సుధాకర్, సంజీవ, రాములు, అంజయ్య, కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
ముత్యాల పందిరిలో మురిసిన సీతారాములు
నేడు సాగర్కు బౌద్ధప్రతినిధుల రాకనాగార్జునసాగర్ (హాలియా) : నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని శనివారం ఉదయం 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు సందర్శించనున్నారని బుద్ధవనం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఈ బృందంలో శ్రీలంక దేశ బౌద్ధమత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్సెనేవి, వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షుడు తిచ్నహత్తు, శ్రీలంక దేశపు ఉన్నతస్థాయి పీఠాధిపతి అగ్గరహేరాక సపమహాతేరో, సౌత్కోరియాగ్లోబల్ పీస్ అంబాసిడర్ మున్యోగ్ జోలతోపాటు పలుదేశాల బౌద్ధప్రతినిధులు ఉంటారని వెల్లడించారు. -
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు
నార్కట్పల్లి : నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్పల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల, అయిటిపాముల ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే ఆసరా పెన్షన్లు పెంచలేదని ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అబద్ధపు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి బడ్జెడ్లో కూడా మొండిచేయి చూపిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ సొమ్ముతో దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3.75 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా స్థానిక నాయకులకు లంచం ఇస్తేనే పని మొదలుపెట్టే పరిస్థితి నెలకొందన్నారు. నేత, గీత కార్మికుల ప్రమాద బీమా సొమ్మును విడుదల చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ తొక్కుకుంటూ అడ్డదారిలో ముఖ్యమంత్రి సీటులో రేవంత్రెడ్డి కూర్చున్నాడని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బైరెడ్డి కరుణాకరరెడ్డి, కరణం బలరాం, కొండూరు శంకర్, వాజీదు అలీ, దోసపాటి విష్ణుమూర్తి, శ్రీనివాస్రెడ్డి, కొత్త నర్సింహా, కర్నాటి ఉపేందర్, పోగుల నర్సింహా, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
అవగాహనతోనే విపత్తులను ఎదుర్కోవచ్చు
చౌటుప్పల్ : అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కోవాలంటే ముందుగా అవగాహన అవసరమని ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్సింగ్, ఆర్డదో వెలమ శేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గల దివీస్ పరిశ్రమలో విపత్తులను ఎదుర్కొనే అంశాలపై జిల్లా స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. రసాయన పరిశ్రమల్లో కెమికల్, గ్యాస్ లీకేజీలతో సంభవించే ప్రమాదాలను గుర్తించడం ఎలా.. గుర్తించాక స్పందించాల్సిన పద్ధతులను ప్రదర్శించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ప్రమాదాలను ఎలా నియంత్రించాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి నిజ జీవితంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవగాహన ఉంటే నష్టనివారణ చాలా సులువు అవుతుందని తెలిపారు. జిల్లాలో విపత్తులు సంభవించినప్పుడు ఏదో రూపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడంలో దివీస్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ భద్రతా విభాగం జనరల్ మేనేజర్ బాలకిషోర్, పరిపాలనా విభాగం జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్రావు, దివీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఎన్. సాంబశివరావు, ఎన్. విశ్వనాథ్, మేనేజర్లు ఉమామహేష్, రంగారావు, లైజన్ ఆఫీసర్ కిషోర్కుమార్చౌదరి, ప్రతినిధులు శివప్రసాద్, గోపి పాల్గొన్నారు. విపత్తుల నిర్వహణపై మాక్డ్రిల్ నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఫ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఫ చౌటుప్పల్ దివీస్ పరిశ్రమలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్డ్రిల్ -
జనగణనలో తప్పులకు తావుండొద్దు
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి సాక్షి, యాదాద్రి : జనగణనపై పూర్తి అవగాహన కలిగి ఉండి తప్పులకు తావులేకుండా చూడాలని కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జనగణన –2027 ఫేస్ – 1 గృహ గణన నిర్వహణలో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల చార్జ్ క్లర్క్ లకు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జనగణన ప్రక్రియలో ప్రతి వివరాన్ని కచ్చితంగా నమోదు చేయాలని, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని, కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు దకే్కవి ఎని్న!
ఫ మహిళలకు ఏ నియోజకవర్గం రిజర్వు అవుతుందోనని చర్చ ఫ ఆశల పల్లకీలో మహిళా నాయకులు ఫ అంతటా పునర్విభజన ముచ్చటే..సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతోపాటు మహిళా రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు కేంద్రం సిద్ధంగా ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో రెండు నియోజకవర్గాలు పెరుగనున్నాయన్న చర్చ కొనసాగుతోంది. మహిళలకు అసెంబ్లీ స్థానాలు రిజర్వు చేస్తే జిల్లాలో కనీసం ఒక స్థానం మహిళలకు రిజర్వు కానుంది. లాభ నష్టాలు బేరీజుమహిళా రిజర్వేషన్ అమలు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంతో ముడిపడి ఉంది. దీంతో జిల్లాలోని ఎమ్యెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఆశావహులు నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. రిజర్వేషన్ తమకు అనుకూలంగా రాకుంటే ప్రత్యామ్నాయం ఏమిటన్న కోణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. ఎప్పటినుంచో ఎమ్మెల్యే పదవిపై ఆశపడుతున్న నేతలు పునర్విభజన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రయత్నాలు ఎమ్మెల్యే టికెట్ కోసం మహిళా నాయకులు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు నియోజకవర్గం మార్పులు, మరో రెండు కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ వంటి అంశాలపై ముందు చూపుతో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ అమలైతే భువనగిరి ఎమ్మెల్యే కుమార్తె కుంభం కీర్తిరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సతీమణి బీర్ల అనిత, మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్ తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించడానికి సానుకూలంగా ఉన్నారు. జనరల్ మహిళా రిజర్వుడు స్థానాల్లో పోటీకి మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణితోపాటు మరికొందరు అసెంబ్లీ పీఠంపై కన్నేశారు. ఒక వేళ మహిళా జనరల్ రిజర్వేషన్తోపాటు ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు రిజర్వు అయితే మరికొందరు కొత్తవారు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. విలీన మండలాలు, గ్రామాలు మళ్లీ ఎటు? పాత రామన్నపేట నియోజకవర్గాన్ని ముక్కలుగా విడగొట్టారు. గుండాల, ఆత్మకూర్(ఎం) మండలాలను ఆలేరు నియోకవర్గంలో, రామన్నపేటను నకిరేకల్ నియోజకవర్గంలో, వలిగొండను భువనగిరి నియోజకవర్గంలో విలీనం చేశారు. భువనగిరి నియోజకవర్గంలో ఉన్న రామన్నపేటలోని కొన్ని గ్రామాలు, చౌటుప్పల్ మండలం, చిట్యాల మండలంలోని కొన్ని గ్రామాలు, బొమ్మలరామారం మండలంలోని సగం గ్రామాలు విడగొట్టారు. అయితే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే పైనున్న గ్రామాలు మళ్లీ ఎందులోకి వెళ్తాయోనన్న చర్చ తెరపైకి వచ్చింది. -
పోచంపల్లిని టూరిజం హబ్గా మార్చాలి
భూదాన్పోచంపల్లి : చేనేత పరిశ్రమ, టూరిజంను అనుసంధానం చేస్తూ భూదాన్పోచంపల్లిని టూరిజం హబ్గా మార్చేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నిత్య, డెక్కన్ ఆర్కీవ్ ఏజెన్సీ హెడ్ సిబ్ఘట్తో కలిసి ఆయన టూరిజం పార్కు, లేక్వ్యూ పార్కు, పెద్ద చెరువు, వినోబాభావే మందిరం, చేనేత గృహాలు, చేనేత సహకార సంఘం, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ, ఎకో చిల్ట్రన్ పార్కు, అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి మినీట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హెచ్ఎండీఏ అధికారులను కోరారు. అయ్యప్పస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. భూదానోద్యమ పిత ఆచార్య వినోబాబావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఆర్టీఆర్ఐ చైర్మన్ డాక్టర్ ఎన్.కిషోర్రెడ్డి, జిల్లా ఉపాధికల్పన అధికారి సాహితీ, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు గున్నా రాజేందర్రెడ్డి, మాస్టర్వీవర్ భారత లవకుమార్, ఆర్ఐ వెంకట్రెడ్డి, ఎంపీఓ మాజిద్, డీఓ బాలమోహన్రెడ్డి, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, ఏపీఎం తౌర్యానాయక్, ఏపీఓ కృష్ణమూర్తి, జలాల్పురం సర్పంచ్ శాపాక లింగస్వామి, ఉపసర్పంచ్ మధు, కార్యదర్శి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
బీఈడీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలోని బీఈడీ ఒకటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డిలు బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 2,601 మందికి 1,982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది ప్రమోట్ అయ్యారు. మూడవ సెమిస్టర్లో 2,713 మంది విద్యార్థులకు 2,440 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 269 మంది ప్రమోటయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జి.ఉపేందర్రెడ్డి తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అవసరం భువనగిరి : విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మనోహర్ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గది, వంట సామగ్రిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకునేందుకు వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. మానసిక ఒత్తిడి, పరీక్షల భయం బారిన పడకుండా టెలిమానసను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ప్రిన్సిపాల్ యాకయ్య, వార్డెన్ ముజాయిద్దీన్, వైద్యులు మురళీమోహన్, సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు. -
వందశాతం పన్నులు వసూలు చేయాలి
రామన్నపేట : ఆర్థిక సంవత్సరం ఈనెల చివరి నాటికి గ్రామ పంచాయతీల్లో వందశాతం వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. బుధవారం రామన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పన్నుల వసూలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా పన్ను వసూలు లక్ష్యం పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ నర్సరీ, ఫారెస్ట్ నర్సరీ, ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆసుపత్రిలో శానిటేషన్ మెరుగు పడకుంటే సదరు కాంట్రాక్టర్ లైసెన్స్ను బ్లాక్లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేయాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ గరిక సత్యనారాయణ, తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, ఎంపీడీఓ ఎ.రాములు, ఎంపీఓ రవూఫ్అలీ, ఆసుపత్రి సూపరిండెంట్ శ్వేతప్రియాంక, ఏపీఓ పి.వెంకన్న, టీఏ ప్రవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
వేసవికాలం.. జర పైలం
భువనగిరి : ‘ఈనెల మొదటి వారం నుంచే ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల ప్రజలు వడదెబ్బ, డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం పొంచి ఉంది’ అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మనోహర్ అంటున్నారు. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజా రోగ్యం దృష్ట్యా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచామన్నారు. ఈ సందర్భంగా పలు వివరాలు వెల్లడించారు. ప్రశ్న : ఎండదెబ్బ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి? డీఎంహెచ్ఓ : ఎండ ప్రభావం వల్ల వడదెబ్బ మాత్రమే కాకుండా చిన్న పిల్లల్లో చెమటకాయలు, క్రీడాకారుల్లో కండరాల నొప్పులు, ఎక్కువ దూరం ప్రయాణించేవారికి కాళ్లవాపులు, కండరాలు బిగుసుకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ప్రశ్న : ఎవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? డీఎంహెచ్ఓ : వేసవి కాలంలో ప్రధానంగా 5 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, బీపీ, షుగర్, గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రశ్న : ఎలాంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ బారిన పడనిట్లుగా గుర్తించాలి? డీఎంహెచ్ఓ : శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే పెరగడం, మతిస్థిమితం తప్పి పడిపోవడం, ఫిట్స్ రావడం, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం పొడిబారి చాలా వేడిగా ఉండడం వంటివి వడదెబ్బ లక్షణాలుగా ఉంటాయి. ప్రశ్న : వడడెబ్బ తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్ఓ : వడడెబ్బ బారిన పడిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి తరలించి దుస్తులు వదులు చేయాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉష్ణోగ్రత తగ్గించాలి. స్పృహలో ఉంటే వెంటనే ఓఆర్ఎస్ తాగించాలి. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా చూడాలి ప్రశ్న :వేసవిలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? డీఎంహెచ్ఓ : రోజుకు 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మజ్జిగ, పుచ్చకాయ, బత్తాయి రసాలు, పొటాషియం కోసం అరటి పండ్లను తీసుకోవాలి. తెల్లని వదులుగా ఉండే వస్త్రాలను ధరించాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రాకపోవడం మంచింది. ప్రశ్న :వేసవి దృష్ట్యా జిల్లా వైద్యారోగ్య శాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఎంహెచ్ఓ : జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించాం. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పారాసిటమాల ట్యాబ్లెట్లను సిద్ధంగా ఉంచాం. ఉపాధి హా మీ పథకం కూలీలకు పనులు చేసే ప్రదేశంలో నీడ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించాం. ఫ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు ఫ అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యం ‘సాక్షి’తో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ -
మార్తో– 2026లో ఎంజీయూ విద్యార్థుల ప్రతిభ
నల్లగొండ టూటౌన్: ఎడ్యునేట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మార్తో – 2026లో ఎంజీయూ బీటెక్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 560 ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంచగా.. 29 టీమ్లు ఫైనల్కు ఎంపికయ్యాయి. నల్లగొండ ఎంజీయూ విద్యార్థులు ఎం. జయంతి పర్యవేక్షణలో ‘సెక్యూర్ గ్రాఫ్ క్రిప్టో సిస్టమ్ ఏ డీఎస్ఏ డ్రివెన్ మల్టీలేయర్ ఎన్స్క్రిప్షన్ ఫ్రేమ్ వర్క్’ అనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టు ఫైనల్కు ఎంపికై ంది. ఈమేరకు బీటెక్ సీఎస్సీ మూడవ సంవత్సరం విద్యార్థులు కొనడా సాంబప్రసాద్రెడ్డి, కార్తిక్, మాదిహ షాకూర్, మానసలను వీసీ అల్తాఫ్ హుస్సేన్ బుధవారం అభినందించారు. కోదాడవాసికి రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతికోదాడ: తపాలాశాఖ ‘డాయి ఆఖర్’ కార్యక్రమంలో భాగంగా లెటర్ టు మై రోల్ మోడల్ అనే అంశంపై సెప్టెంబర్ 2025 నుంచి డిసెంబర్ వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన లేఖల పోటీల్లో కోదాడ రచయితల సంఘం అధ్యక్షుడు పుప్పాల కృష్ణమూర్తి రాష్ట్ర స్థాయిలో ద్వితీయస్థానం సాధించాడు. ఈమేరకు ఆయనకు రూ.10వేలు నగదు పురస్కారాన్ని తపాలశాఖ అందించనుంది. విజేతగా నిలిచిన కృష్ణమూర్తిని పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య, కోదాడ సంఘం అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, రఘువరప్రసాద్, మారంరెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు అభినందించారు. విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలుమునగాల: మండల పరిధిలోని నేలమర్రిలో బుధవారం ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. గ్రామానికి చెందిన కాంపాటి సైదులు(50) తన వరి చేను పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రాత్రుడికి ప్రాఽథమిక చికిత్స అందించి సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చాంపియన్ ఫార్మర్గా పోలేపల్లి వాసిచందంపేట : మండలంలోని పోలేపల్లి గ్రామ రైతు లోకసాని పద్మారెడ్డికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఘజియాబాద్లోని ‘నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్’లో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన సెమినార్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘చాంపియన్ ఫార్మర్’ అవార్డును ప్రదానం చేసింది. తన 12 ఎకరాల పొలంలో కుంకుడు సాగు చేస్తూ పద్మారెడ్డి దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ఈ సెమినార్లో ఆయన మాస్టర్ ట్రైనర్గా వ్యవహరించి సాగు మెళకువలను వివరించారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా బత్తాయి, జామ, కుంకుడు, ఉసిరి, సీతాఫలం, కొబ్బరి తోటలను సాగు చేస్తున్న ఆయన కృషిని గుర్తించి కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈ పురస్కారాన్ని అందజేసింది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మర్రిగూడ(చింతపల్లి): కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన బుధవారం కుర్మేడు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం తూర్పుపల్లెకు చెందిన ముగ్గురు సోదరులు నాగవరం వెంకటేశ్వర్రావు, గోవర్ధన్రావు(63), రాజేందర్రావులు పని నిమిత్తం గ్రామం నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరారు. కుర్మేడు సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో గోవర్ధన్రావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడితోపాటు కారులో ప్రయాణిస్తున్న అతడి సోదరులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి భార్య నాగవరం లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపారు. -
రెండు ఇళ్లలో చోరీ
గుండాల : గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలోని రెండు ఇళ్లల్లో మంగళవారం రాత్రి బంగారం, వెండి, నగదును చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నత్తి యాకమ్మ ఇటీవల హైదరాబాద్లోని తన కుమారుడి ఇంటికి వెళ్లింది. అదేవిధంగా మచ్చ దీవనమ్మ మంగళవారం రాత్రి నిద్రపోవడానికి తన కుమారుడికి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నత్తి యాకమ్మ ఇంట్లో రూ.10 వేల నగదు, 6 తులాల వెండి పావు తులం బంగారం, దీవెనమ్మ ఇంట్లో రూ.3 వేలు, అర తులం బంగారంతో పాటు 20 తులాల వెండిని అపహరించాడు. మచ్చ దీవెనమ్మ ఉదయం తన ఇంటికి వచ్చి చూడగా తలుపులు విరగ్గొట్టి, బీరువా తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు క్లూస్ టీమ్తో గ్రామానికి చేరుకొని చోరీ జరిగిన ఇళ్లల్లో పరిశీలించారు. అనుమానితుడైన గడ్డం రామును పట్టుకుని విచారణ చేయగా.. తానే దొంగతనం చేసినట్లు అతను అంగీకరించాడు. యాకమ్మ, దీవెనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తేజమ్రెడ్డి తెలిపారు. -
అప్పు తీర్చాలని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన
మోత్కూరు : తనకు రావాల్సిన అప్పు డబ్బులు ఇవ్వాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని సదరు వ్యక్తి ఇంటి ఎదుట నిరసన తెలిపాడు. వివరాలిలా ఉన్నాయి. మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామానికి చెందిన కోమటిరెడ్డి ప్రభాకర్రెడ్డి మోత్కూరుకు చెందిన గుండగోని రామచంద్రు గౌడ్కు 2022లో రూ.15 లక్షలు అప్పుగా ఇచ్చాడు. 2023లో రామచంద్రు గౌడ్ తిరిగి రూ.10 లక్షలు ప్రభాకర్రెడ్డికి ఇచ్చాడు. మరో రూ.5 లక్షలు ఆరు నెలలకు ఇస్తానని పత్రం రాయించుకున్నాడు. రోజులు గడుస్తున్నా రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ప్రభాకర్రెడ్డి వాపోయాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని రామచంద్రును ఎంత బతిమిలాడినా పట్టించుకోకపోవడంతో బుధవారం అతడి ఇంటి ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వివరించాడు. అయితే ఈ సమయంలో రామచంద్రు ఇంటికి తాళం వేసి ఉన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై రామచంద్రు స్పందిస్తూ.. తాను రూ.15 లక్షలు అప్పు తీసుకున్నానని, రూ.10 లక్షలు తిరిగి చెల్లించానని పేర్కొన్నాడు. మరికొంత నగదు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ ప్రభాకర్రెడ్డి గొడవ చేస్తున్నాడని పేర్కొన్నాడు. -
ఆస్తిపన్ను బకాయిదారులపై మున్సిపల్ కొరడా
ఆలేరు: ఆలేరులో ఆస్తిపన్ను బకాయిదారులపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. రెడ్ నోటీసులు జారీ చేసినా బకాయిల చెల్లింపునకు యజమానులు ముందుకు రాకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. బుధవారం ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో విఘ్నేశ్వర కాటన్ మిల్లుతోపాటు సెల్టవర్ షెడ్లకు మున్సిపల్ చట్టం ప్రకారం సిబ్బంది తాళాలు వేశారు. కాటన్ మిల్లు యజమాని 2022 నుంచి 2026 వరకు దాదాపు రూ.3,41,463లక్షలు, సెల్టవర్ షెడ్కు సంబంధించి రూ.36,818 ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నోటీసులు ఇచ్చినా యజమానుల నుంచి స్పందన రాకపోవడంతో మిల్లు, సెల్టవర్ షెడ్లకు తాళాలు వేసినట్లు చెప్పారు. ఈనెల 31వ వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లించకపోతే నిబంధనల ప్రకారం ఆస్తుల జప్తు చేయనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. ఫ ఆలేరులో కాటన్ మిల్లు, సెల్ టవర్ షెడ్డుకు తాళం -
పశుగ్రాసం.. శాసీ్త్రయ సాగుతో ప్రయోజనం
పెద్దవూర: పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకు వచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం. జీర్ణంకాని భాగం ఎక్కువే. శాసీ్త్రయ పద్ధతిలో నాణ్యమైన పశుగ్రాసం అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక పాల ఉత్పత్తి సాధించవచ్చు. పశుగ్రాసం సాగు ఖర్చు కూడా తగ్గించవచ్చు. డెయిరీ ఫామ్స్ నిర్వహణ వ్యయంలో 70శాతం వరకు పశువుల మేతకే సరిపోతుంది. దీంతో మేత ఖర్చును తగ్గిస్తే అంతమేరకు లాభాలు పెంచుకునే అవకాశం ఉంది. అలాగే పాలశీతలీకరణ అధికారులు పాలు సప్లయ్ చేసే రైతులకు 50 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు అందిస్తారు. పశుసంవర్థక అధికారులు సైతం 50శాతం రాయితీపై విత్తనాలు ఇవ్వనున్నారు. పశువుల కాపరులు వీటిని సద్వినియోగం చేసుకుని పశుగ్రాసం సాగు చేస్తే గడ్డి కొరత తీరుతుందని పెద్దవూర మండల పశువైద్యాధికారి నులక నాగార్జున్రెడ్డి సూచిస్తున్నారు. సాగు విధానం ఫ పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్ నైపర్, కో1, కో 2, ఎస్ఎస్జీ–825 రకాలు. ఫ 85శాతం పచ్చిమేతను ఈ రకాల ద్వారా తీర్చుకోవచ్చు. ఫ ఒకసారి నాటితే 4 నుంచి 5 ఏళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ఫజనవరి నుంచి ఆగస్టు వరకు విత్తనాలు విత్తుకోవచ్చు. ఫ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆమ్ల గుణాలున్న నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది. ఫ పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఫ ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం. మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఫ దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఫ విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 22 కిలోల యూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. ఫ అధిక విస్తీర్ణంలో సాగు చేసి సైలే జీ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వ చేసి వాడుకోవచ్చు. పాల దిగుబడి ఎక్కువే పశుగ్రాసాల సాగుకు తక్కువ శ్రమ పెట్టుబడి అవసరం అవుతుంది. విత్తనాలు నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. పచ్చిమేలు రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి. సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చిమేత వలన పాల దిగుబడులు 25 శాతం వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దాణా అవసరం లేకుండా కేవలం పచ్చిమేత ద్వారా 5 నుంచి 6 లీటర్ల పాల దిగుబడి సాధించవచ్చు. పచ్చి మేతలో కాల్షియం, భాస్వరం వంటి మాంసకత్తులతో పాటు ఏ, డీ, ఈ విటమిన్లు, పిండి, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు. ఫ మెళకువలు పాటిస్తే అధిక పాల దిగుబడి -
ఏప్రిల్లో ‘సర్’ సర్వే
భువనగిరిటౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. కానీ, చాలా మంది ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో చివరి నిమిషం వరకు చూసుకోరు. తీరా పోలింగ్ రోజు ఓటరు జాబితాలోని పేర్లు, ఆధార్, ఇతర ప్రభుత్వ పత్రాలతో సరిపోలని సందర్భంలో ఓటు వేయకుండా వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వ్యత్యాసాలను తొలగించి, పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. దీంట్లో భాగంగా వచ్చె నెల మొదటి వారంలో స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ రివిజన్ (ఎస్ఐఆర్)పై సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వయస్సును బట్టి నిబంధనలు మార్పు వయస్సును బట్టి నిబంధనలు మారుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం మీరు ఏ సంవత్సరంలో జన్మించారు అనే అంశంపై మీరు సమర్పించాల్సిన పత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. సీనియర్లు (1987కంటే ముందు పుట్టిన వారు) వీరికి ప్రక్రియ సులభం. తమ పుట్టిన తేదీని తెలిపే ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. మధ్య వయస్కులు (1987–2004 మధ్య పుట్టిన వారు) : వీరు తమ పత్రాలతో పాటు, తమ తండ్రి లేదా తల్లిలో ఒకరి బర్త్ ప్రూఫ్ సమర్పించాలి. అప్పుడే వారి పౌరసత్వ ధ్రువీకరణ పూర్తవుతుంది. యువ ఓటర్లు (2004 డిసెంబర్ తర్వాత పుట్టిన వారు) : వీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తమ సొంత పత్రాలతో పాటు, తల్లి, తండ్రి ఇద్దరి పుట్టిన తేదీ ఆధారాలను జత చేయాల్సి ఉంటుంది. సర్వే సమయంలో ఉండాల్సిన పత్రాలు బీఎల్వోలు ఓటర్లకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారం నింపేటప్పుడు ఈ కింది పత్రాల జిరాక్స్ కాపీలపై మీ సంతకం చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందులో ఆధార్ కార్డు (అత్యంత కీలకం), పదవ తరగతి మార్కుల జాబితా (వయస్సు నిర్ధారణకు), నివాస ధ్రువీకరణ పత్రం లేదా ఇంటి పన్ను రసీదులు, కుల ధవీకరణ పత్రం (వర్తిస్తే) అందుబాటులో ఉంచుకోవాలి. సరైన పత్రాలు లేకపోతే ఓటు హక్కు పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు ఎన్యుమరేషన్ ఫారం నింపడంపై మార్గదర్శకాలు విడుదల ఇప్పటికే బీఎల్ఓలకు శిక్షణ బీఎల్ఓలు ఇచ్చే ఫాంలో ఉండే అంశాలివే.. వ్యక్తిగత వివరాలు : పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్. కుటుంబ సభ్యుల వివరాలు : తండ్రి పేరు, తల్లి పేరు లేదా జీవిత భాగస్వామి (భార్య/భర్త) పేరు మరియు వారి ఓటరు కార్డు (ఇపిక్) నంబర్లు. మునుపటి ఓటరు వివరాలు : ఒకవేళ మీరు ఇదివరకే వేరే చోట ఓటరుగా ఉంటే, ఆ పాత నియోజకవర్గం, ఓటరు కార్డు వివరాలు ఇక్కడ రాయాలి. డిక్లరేషన్ (ధ్రువీకరణ) ఇలా.. నేను భారత పౌరుడిని. నా పేరు మరెక్కడా ఓటరు జాబితాలో లేదు. నేను ఇచ్చిన సమాచారం తప్పని తేలితే శిక్షకు అర్హుడనని ఒప్పుకుంటున్నాను. మీరు చేయాల్సినవి.. ఫోటో: కుడి వైపుపైన ఉన్న బాక్స్లో మీ ప్రస్తుత పాస్పోర్ట్ సైజు ఫొటోను అతికించాలి. సంతకం : ఫారమ్ కింద ఎడమ వైపున అని ఉన్నచోట మీ సంతకం లేదా ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. కుటుంబ సభ్యుని సంతకం : మీ కుటుంబంలోని మరొక పెద్ద వ్యక్తి సంతకం కూడా అవసరం అవుతుంది. ఈ ఫారమ్ను పూర్తిగా నింపిన తరువాత మీ ప్రాంతంలో బూత్లేవల్ అధికారికి అందజేయాలి. -
యాత్ర స్పెషల్గా ఆలేరు రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక
సాక్షి, యాదాద్రి : జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణ వేగవంతమైంది. ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొలనుపాకకు చేరువలో ఉన్న ఆలేరు రైల్వే స్టేషన్ను యాత్ర స్పెషల్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రెండున్నర ఎకరాల భూసేకరణ ఆలేరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అదనపు లైన్ల నిర్మాణం కోసం ఆలేరు పట్టణ పరిధిలో సుమారు 2.20 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించనున్నారు. ఇందులో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. భూ సేకరణ బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించగా ఆ శాఖ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సమగ్ర నివేదికను రూపొందించారు. సేకరించిన భూములకు మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించనుంది. కొత్తగా మూడో ప్లాట్ఫాం నిర్మాణం ప్రస్తుతం ఉన్న రెండు ప్లాట్ఫాంలకు అదనంగా, కొలనుపాక రోడ్డు వైపు మూడవ ప్లాట్ఫాంను నిర్మించనున్నారు. దీనికోసం కొత్తగా లూప్ లైన్లు, డౌన్ లైన్ ట్రాక్లతో పాటు అత్యాధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఇప్పటికే సికింద్రాబాద్ – ఖాజీపేట మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వంగపల్లి నుంచి ఆలేరు మీదుగా పెంబర్తి వరకు అదనంగా 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆలేరు వరకు ప్రస్తుతం రైల్వే సరిహద్దులోనే ఈ రెండు లైన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆలేరు పట్టణంలోని రత్నాల వాగు నుంచి అదనపు భూ సేకరణ చేసే అవకాశం ఉంది. ఆలేరు వాగు మీదుగా పెంబర్తి వరకు అదనపు లైన్లు నిర్మిస్తారు. ఆలేరుతో పాటు జిల్లాలో మరో మూడు కీలక ప్రాజెక్టుల కోసం భూసేకరణ సాగుతోంది. ఇందులో భాగంగా బీబీనగర్ మండలం కొండమడుగు నుంచి భువనగిరి, రాయిగిరి మీదుగా వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ కోసం 46 ఎకరాలు సేకరిస్తున్నారు. అలాగే బీబీనగర్–నడికుడి మార్గంలో డబ్లింగ్ పనులకు రామన్నపేట వరకు 23 ఎకరాలు, పగిడిపల్లి వద్ద రైల్వే రైల్వే ఓవర్ లైన్ కోసం 16 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా డబ్లింగ్ పనులు, రైల్వే ఆర్వోఆర్ బ్రిడ్జిల నిర్మాణాలు కూడా చేపడతారు. ఫ 2.20 ఎకరాల భూసేకరణకు సన్నద్ధం ఫ కొలనుపాక భక్తులకు పెరగనున్న సౌకర్యాలు ఫ మరో మూడు ప్రాజెక్టులకూ భూ సేకరణ -
ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్
సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత ఆరోపించించారు. ఆదివారం భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించే విధంగా రేవంత్రెడ్డి సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నారు. మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామన్న ప్రభుత్వం రెండు పంటలకు కూడా ఇవ్వలేకపోతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు పంటకాలంలో పెట్టుబడిగా రైతుల చేతికి అందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు మంగళం పాడిందన్నారు. కరెంట్ కోతలతో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమే అని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, ఏవీ కిరణ్, రచ్చశ్రీనివాస్రెడ్డి, ఏనబోయిన ఆంజనేయులు, చెన్నామహేశ్, సుబ్బురు బీరు మల్లయ్య, అతికం లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులున్నారు. -
ముగిసిన ప్రగతి విద్యానికేతన్ పరీక్ష
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని తీరందాస్ గోపి మీటింగ్ హాల్లో పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రగతి విద్యానికేతన్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్న పత్రాలను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలోని అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా హైదరాబాద్లోని ప్రగతినగర్లో రెసిడెన్షియల్ విద్యను అందించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారు, జనగాం, నిజామాబాద్ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. వారం లోపు ఫలితాలను వెల్లడిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు గుజ్జ బాలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, పీపీటీ పరీక్ష పరిశీలకులు ప్రగతి, శ్రీవాణి , జిల్లా కమిటీ సభ్యులు కంచిగట్ల వెంకన్న, కోక వేణు తదితరులు పాల్గొన్నారు. యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన పూజ విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను జరిపించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. -
పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి
సాక్షి, యాదాద్రి: పార్టీ ఇచ్చిన పదవిని గౌరవంగా భావించి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని వివేరా హోటల్లో డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పదవి వచ్చిన వారు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడొద్దని వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిని సమానంగా చూస్తుందన్నారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న మండలం, గ్రామ శాఖల పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. మరికొందరికి నామినేటేడ్ పదవులు రానున్నాయన్నారు. పదవులు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల ఆదరణ పొందాలంటే నిరంతం వారి మధ్యన ఉండి పనిచేస్తే రెండోసారి గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ముందుగా జాతీయపతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను, ఎమ్మెల్యేలను పలువురు నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ చైర్పర్సన్లు తంగెళ్లపల్లి వాణి రవికుమార్, బీజన బాలమణి భాస్కర్, సంజీవరెడ్డి, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్, ఉపేందర్రెడ్డి, మంజుల, శ్రీనివాసరావు, అనిల్కుమార్, బాల్రాజ్, వెంకటేశ్, సత్తిరెడ్డి, వేణుగౌడ్, పింగల్రెడ్డి పాల్గొన్నారు. ఫ పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు ఫ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ -
దొంగ అరెస్టు
నల్లగొండ : వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను నల్లగొండ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గల అయ్యప్ప ఆలయంలో హుండీతో పాటు స్కూటీ, రెండు సెల్ఫోన్లు చోరీ జరిగినట్లు మాతంగి సాయినాథ్ అనే వ్యక్తి నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నల్లగొండ పట్టణంలోని పాతబస్తీలో నివాసముంటున్న పొలిసెట్టి కార్తీక్ కుమారస్వామి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి గురువారం సావర్కర్నగర్లో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అతడి నుంచి స్కూటీ, ఆటో, రెండు సెల్ఫోన్లు, రూ.3,000 రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఆటో నడిపేవాడని డీఎస్పీ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి తిప్పర్తి : అప్పుల బాధతో గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. తిప్పర్తి ఏఎస్ఐ సింగం రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామానికి చెందిన వీరమల్ల చంద్రయ్య(58)కు ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో శుక్రవారం ఇంట్లో గడ్డి మందు తాగాడు. అతడిని వెంటనే నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య వీరమల్ల వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణంపెద్దఅడిశర్లపల్లి : బైక్పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి రోడ్డుపై కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండల పరిధిలోని సంగారం గ్రామానికి మస్క యాదగిరి (23) బైక్పై అంగడిపేట ఎక్స్రోడ్ నుంచి స్వగ్రామం వెళ్తుండగా.. పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో యాదగిరికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సాగర్లో మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్
నాగార్జునసాగర్ : మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వాగ్మరే శనివారం కుటుంబ సమేతంగా కలిసి నాగార్జునసాగర్ను సందర్శించారు. శుక్రవారం హైదరాబాద్లో ఈవీఎంలు తయారుచేసే ఈసీఐఎల్ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. శనివారం సాగర్కు విచ్చేశారు. విజయ్ విహార్ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు తిరుమలగిరి(సాగర్) తహసీల్దార్ అనిల్కుమార్, ప్రొటోకాల్ ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, విజయ్ విహార్ మేనేజర్ కిరణ్ స్వాగతం పలికారు. అనంతరం దినేష్ వాగ్మరే తన కుటుంబ సభ్యులతో కలిసి లాంచీలో నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనంలో బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. వారిని బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవి చంద్ర సత్కరించారు. వారి వెంట ఈసీఐఎల్ సంస్థ ప్రతినిధి సౌరబ్, లైజనింగ్ ఆఫీసర్లు సుధీర్రెడ్డి, పాండు, అభిషేక్, టూరిజం గైడ్ సత్యనారాయణ, స్థానిక ఎస్ఐ ముత్తయ్య తదితరులు ఉన్నారు. -
పశువుల పెంటతో భూసారం పెంపు
పెద్దవూర : వ్యవసాయంలో పంట దిగుబడి కోసం రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో భూమి నాణ్యత దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. పశువుల పెంటను పొలాల్లో వేయడం వలన నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయన ఎరువుల భారం తగ్గుతుంది. సేంద్రియ ఎరువుల ఉపయోగంపై పెద్దవూర మండల వ్యవసాయాధికారి పి. సందీప్కుమార్ సూచనలు ఆయన మాటల్లోనే.. ● పశువులు, మేకలు, గొర్రెల పెంట పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇళ్లలో ఏడాది కాలంగా ఉన్న పశువుల పెంట, చెత్తాచెదారం పూర్తిగా కుళ్లిపోతుంది. దీనిని పొల్లాలో వేయడం వలన నేలలో సారం పెరుగుతుంది. ఇది సేంద్రియ ఎరువుతో సమానం. దీనిని దుక్కులు దున్నడానికి ముందే పంట పొలాల్లో వేసి దున్నితే చాలా మంచిది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. దుక్కులు దున్నిన తర్వాత పశువుల పేడ మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు పశువుల పేడ ఉపయోగపడుతుంది. ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల పెంటను వినియోగించాలి. ● పశువుల పేడను వేసిన తర్వాత భూమిని కలియదున్నితే నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు సూక్ష్మపోషకాలు తగిన మోతాదులో అందుతాయి. మొక్క బాగుండి మంచి దిగుబడి పొందవచ్చు. అలాగే చెరువుల్లో పూడిక తీసిన సమయంలో వచ్చే నల్లమట్టిని వ్యవసాయ భూమిలో పోయించుకుంటే భూసారం పెరుగుతుంది. ఇది నీటిని ఎక్కువగా పీల్చుకుని నేలలో చాలా సమయం వరకు తేమ ఉండేటట్లు చేస్తుంది. దీంతో మొక్కకు నీటి లభ్యత ఎల్లప్పుడూ ఉంటుంది. ● సాధారణంగా రైతులు వేసవిలో పశువుల ఎరువును వ్యవసాయ పొలాలకు తరలిస్తుంటారు. అదే సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఎండల కారణంగా పొలంలో వెదజల్లితే వాటిలోని పోషకాలు ఆవిరి అవుతాయి. పశువుల పెంటను పొలంలో కుప్పలుగా పోసుకోవాలి. భూమిలో తగిన తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి వెంటనే దుక్కిలో కలియదున్నాలి. దీనివలన భూసారం పెరుగుతుంది. భూమి గుల్లబారడానికి తోడ్పడుతుంది. సహజసిద్ధమైన లవణాలు అందుతాయి. నేలలోని ఆమ్లత్వం, క్షారత్వం, నీటిని నిల్వ ఉంచే గుణాన్ని అదుపు చేసి మొక్కలకు అందేవిధంగా సహాయపడతాయి. ఇలా దుక్కి దున్నాలిదుక్కిని ఎలా పడితే అలా దున్నడం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుంది. రైతులు వేసవిలో మెట్ట భూములను వానాకాలం సీజన్ కోసం సన్నద్ధం చేస్తుంటారు. వేసవిలో వచ్చే అధిక వర్షాలకు ఎంతో సారవంతమైన మట్టి నీటి వరదకు వాలు ప్రాంతంలో కొట్టుకుపోతుంది. దీంతో మెట్ట ప్రాంతాలలో భూమి వాలుకు అడ్డంగా దుక్కి చేయాలి. వాలుకు అడ్డంగా దుక్కి దున్నితే నీటి ప్రవాహం తగ్గి మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది. ఫ పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్కుమార్ సూచనలు -
నిరాహార దీక్షను విజయవంతం చేయాలి
కోదాడరూరల్ : ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న నిరాహార దీక్షను విజయవంతం చేయాలని టీ ఎమ్మార్పీఎస్ అనుబంధ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింత బాబుమాదిగ పిలుపునిచ్చారు. శనివారం కోదాడ పట్టణంలో దీక్ష పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పల్లేటి లక్ష్మణ్, నియోజకవర్గ ఇన్చార్జ్ బచ్చలకూరి నాగరాజు, బాణాల అబ్రహం, జానయ్య, రమేష్, ఆదినారాయణ, యాదగిరి, నాగేశ్వరరావు, స్వామి, హుస్సేన్, బాబురావు, కాశీ, ప్రసాద్, వినోద్, రాజేష్ తదితరులు ఉన్నారు. -
చెరువు తూము ధ్వంసం
ఆత్మకూర్(ఎస్) : మండల పరిధిలోని ముక్కుడుదేవులపల్లి గ్రామానికి చెందిన పెద్ద చెరువు తూమును శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు జేసీబీతో ధ్వంసం చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు కింద కొంతమంది పొలాలు నీరు లేక ఎండుతున్నాయని రాత్రివేళ తూమును ధ్వంసం చేసి నీటిని అక్రమంగా బయటకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం రైతులు తిరిగి ఆ తూమును గడ్డితో పూడ్చివేశారు. స్థానిక రైతులు తూమును ధ్వంసం చేసిన విషయమై ఇరిగేషన్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరువు నీటిని అక్రమంగా తరలించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఫ మరొకరికి గాయాలు మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన శ్రీరాముల రాములు(50) తన సోదరుడితో కలిసి బైక్పై త్రిపురారం మండలం బెజ్జికల్లో బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. మిర్యాలగూడ మండలం శ్రీనివాస్నగర్ గ్రామానికి రాగానే లారీ వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి సోదరుడికి గాయాలు కాగా.. స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు.. గరిడేపల్లి : మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన బాణోతు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు జ్ఞానేశ్వర్ కలిసి బైక్పై రేగులగడ్డ తండా నుంచి వస్తుండగా.. కీతవారిగూడెం యూటర్న్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలేసి పరారైన వ్యక్తిని కోదాడకు చెందిన నాగుల్మీరాగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. -
భక్తురాలి కాలు పైనుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తురాలు కొండపైన ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా కిందపడిపోగా.. ఆమె కాలు పైనుంచి బస్సు వెనుక టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నార్సింగికి చెందిన అనిత, అంజప్ప దంపతులు తమ కుమార్తె, ఐదు నెలల కుమారుడితో కలిసి శుక్రవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. శనివారం ఉదయం స్వామిని దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్సులో కొండ పైకి చేరుకున్నారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం కొండపైన గల ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. కొద్దిసేపు వేచి చూసిన తర్వాత ఆర్టీసీ బస్సు రావడంతో అది ఎక్కేందుకు వెళ్లారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును ముందుకు కదిలించగా.. అనిత కిందపడిపోయింది. దీంతో బస్సు వెనుక టైరు అనిత కాలు పైకి ఎక్కడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే అనితను అంబులెన్స్లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తన భార్య అనిత కాలు నుజ్జునుజ్జయ్యిందని ఆమె భర్త అంజప్ప కన్నీరు పెట్టుకున్నాడు. ఫ నుజ్జునుజ్జయిన కాలు.. ఆస్పత్రికి తరలింపు ఫ యాదగిరి కొండపైన బస్టాండ్లో ఘటన -
పవార్లూమ్స్పై ప్రభావం
రాజాపేట : పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం పవర్లూమ్స్(మరమగ్గాలు) పరిశ్రమపై పడింది. రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గత ఆరు దశాబ్దాలుగా వందలాది మంది కార్మికులు పవర్లూమ్స్ వివిధ వస్త్రాలు తయారుచేసి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రతినెలా రెండు లారీల వస్త్రాల లోడ్ను ముంబై నుంచి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేసేవారు. కాగా యుద్ధం కారణంగా వారం రోజులుగా ఎగుమతులు నిలిచిపోవడంతో గ్రామంలో వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మాస్టర్ వీవర్స్తో పాటు వీవర్స్, ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పవర్లూమ్స్లో వస్త్రాల ఉత్పత్తి కూడా నత్తనడకన సాగుతోందని మాస్టర్ వీవర్స్ బోగ లక్ష్మీనారాయణ, కటుకం వెంకటేశం, రాచకొండ స్వామి చెబుతున్నారు. పవర్లూమ్స్పై వస్త్రాల తయారీ ఇలా.. రఘునాథపురం గ్రామంలో 800కు పైగా పవర్లూమ్స్ ఉండగా.. ఇందులో 400 మరమగ్గాలపై కడ లుంగీలు తయారు చేస్తున్నారు. ఒక్క మరమగ్గంపై పది చొప్పున, గ్రామంలో రోజుకు 3000 వరకు కడ లుంగీలు ఉత్పత్తవుతాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1000కి పైగా కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. రోజుకు రూ.800 నుంచి రూ.1000 వరకు పవర్లూమ్స్ కార్మికులు, లుంగీలకు కడలు వేసే కార్మికులు రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే ఉగాండా, నక్కీ ఉగాండా, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బై పిక్ వంటి కడ లుంగీలను నేరుగా ముంబై నుంచి ఉగాండా, దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్తో పాటు ఇతర పశ్చిమాసియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. యుద్ధం కారణంగా ముడిసరుకు కొనలేక, తయారుచేసిన వస్త్రాలను ఎగుమతి చేయలేక కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఫ పశ్చిమాసియా యుద్ధం కారణంగా నిలిచిన వస్త్రాల ఎగుమతులు ఫ అయోమయంలో మాస్టర్ వీవర్స్, కార్మికులు -
వైభవంగా మహాలక్ష్మి యాగం ప్రారంభం
ఫ హాజరైన త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి మిర్యాలగూడ : పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో శనివారం శ్రీమహాలక్ష్మి యాగం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాగం సందర్భంగా టీకే శ్రీనివాసన్ శిష్య బృందం ప్రవేశ బలి, వాస్తు హోమం, ఆరాధనలు నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు సంప్రదాయబద్ధంగా పసుపు దంచే కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 27న నిర్వహించనున్న ప్రధాన యాగానికి మిర్యాలగూడ పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని యాగం నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్తో పాటు మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, కోశాధికారి గందె రాము, బండారు కుశలయ్య, మాధవి, చిలుకుల రవికుమార్, రేపాల పురుషోత్తంరెడ్డి, ప్రసాద్, కారంపొడి జానకి, రాఘవాచార్యులు, గూడూరు శ్రీనివాస్, గుడిపాటి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ యూనియన్ పట్టుదల.. ఎండిన పొలాలు
శాలిగౌరారం : ట్రాక్టర్ యూనియన్ పట్టుదల ఆరుగాలం కష్టపడిన రైతులను తీవ్ర నష్టాలకు గురిచేసింది. శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో 100 హెచ్పీ(ఎస్ఎస్–16) సామర్ధ్యం గల విద్యుత్ ట్రాన్స్పార్మర్ పరిధిలో 20 బోరు మోటార్లు ఉన్నాయి. ఆయా బోరు మోటార్ల కింద సుమారు 80 ఎకరాలకు పైగా వరి పంట సాగవుతోంది. ప్రస్తుతం వరి చేలు పొట్ట, కంకి దశలో ఉన్నాయి. అయితే వారం క్రితం ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ను నకిరేకల్లోని రిపేర్ సెంటర్కు తరలించేందుకు గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ను రైతులు కిరాయికి రమ్మని అడుగగా.. ట్రాక్టర్ యూనియన్ను సంప్రదించాలని సూచించాడు. దీంతో రైతులు ట్రాక్టర్ యూనియన్ను సంప్రదించగా.. రైతుల వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే దారికి మట్టిపోసిన డబ్బులు కొంతమేర పెండింగ్ ఉన్నాయని, వాటిని ఇస్తేనే ట్రాక్టర్ను పంపుతామని యూనియన్ ప్రతినిధులు రైతులకు తేల్చిచెప్పారు. దీంతో తాము ఎలాంటి బాకీలు లేమని దారికి మట్టిపోసిన డబ్బులు పూర్తిగా చెల్లించామని రైతులు తెలిపారు. దీంతో ట్రాక్టర్ యూనియన్ ప్రతినిధులు రైతుల వాదనను తిరస్కరించారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను తరలించేందుకు గ్రామంలోని యూనియన్కు చెందిన ట్రాక్టర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల ట్రాక్టర్లు కూడా వెళ్లొద్దని యజమానులను హెచ్చరించారు. దీంతో ట్రాన్స్ఫార్మర్ను తరలించేందుకు ట్రాక్టర్లు రాకపోవడంతో వారం రోజులుగా రిపేరుకు తరలించేందుకు అవకాశం లేకపోవడంతో రైతులు విద్యుత్ అధికారులకు ఫోన్చేసి విద్యుత్ శాఖకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను తరలించే వాహనాన్ని పంపించాలని కోరారు. విద్యుత్శాఖకు చెందిన ట్రక్కు వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో నీళ్లు లేక రైతుల వరి పొలాలు ఎండిపోయాయి. పంటలు ఎండిపోవడంతో రైతులు ట్రాక్టర్ యూనియన్ ప్రతినిధులపై శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా.. శనివారం విద్యుత్శాఖకు సంబంధించిన వాహనం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్లేందుకు రాగా.. ఆ వాహనం ట్రాన్స్ఫార్మర్ ఉన్న చోటుకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో రైతులు ఎద్దుల బండిపై కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను పెట్టుకొని స్వయంగా బండిని లాగుతూ విద్యుత్శాఖ వాహనం వద్దకు తీసుకెళ్లి అందులోకి ఎక్కించారు. రిపేర్ అనంతరం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తీసుకొచ్చి తిరిగి ఏర్పాటు చేశారు. ఫ అడ్లూరులో వారం క్రితం కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫ ట్రాన్స్ఫార్మర్ తరలింపును అడ్డుకున్న ట్రాక్టర్ యూనియన్ ఫ నీళ్లందక ఎండిన పొలాలు ఫ ట్రాక్టర్ యూనియన్ ప్రతినిధులపై పోలీస్ స్టేషన్లో రైతుల ఫిర్యాదు -
నిషేధిత జాబితా నుంచి ఇళ్లను తొలగించాలి
వలిగొండ : పేదలు నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం నిషేధిత జాబితా 22–ఏ నుంచి తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. వలిగొండ మండలం వేములకొండలో శనివారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 17 మండలాల్లోని 422 గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం నిషేధిత జాబితాను రూపొందించడం దారుణ చర్య అన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యతో భూముల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు నిలిచిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే నిషేధిత జాబితాను రద్దు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఎలగందుల అంజయ్య, ఎల్లంకి మహేష్,నరిగే యాదయ్య, బొడిగ సుదర్శన్, యాస జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతమూ అధికమే..
జిల్లాలోని భౌగోళిక ప్రాంతాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం రాష్ట్రంలోని ములుగు జిల్లాలోనే 64.64 శాతం ఉంది. ఇక యాదాద్రి జిల్లాలో 9.66 శాతం, నల్లగొండలో 9.57 శాతం, సూర్యాపేటలో 4.67 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నట్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వే–2023 వెల్లడించింది. జిల్లాలో ప్రస్తుతం 515 రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో ఆహార భద్రతా కార్డులు 2,36,555, అంత్యోదయ కార్డులు 13,737 ఉన్నాయి. అయితే జిల్లాలో నిరుపేదలకు ఇచ్చే అన్నపూర్ణ కార్డులు సున్నాగా నమోదయ్యాయి. -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
● ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ భగత్సింగ్ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కొత్త గుండ్లపల్లిలో శనివారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్టాప్ డ్రగ్స్–స్టార్ట్ స్పోర్ట్స్ పేరిట చేపట్టిన వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భగత్సింగ్ ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళుర్పించి మాట్లాడారు. నేటి యువత క్రీడలపై దృష్టిసారించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, మండల కార్యదర్శి కళ్లేపల్లి మహేందర్, పట్టణ కార్యదర్శి బబ్బురి శ్రీధర్, కౌన్సిలర్ పి.లావణ్య శ్రీధర్ పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తల మధ్యన నిత్య ఆర్జిత కై ంకర్యాలు విశేషంగా జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. సాయంత్రం భక్తుల కోలాహలం నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. నేడు భువనగిరికి పీసీసీ అధ్యక్షుడి రాకభువనగిరిటౌన్ : భువనగిరిలో ఆదివారం నిర్వహించే డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ముఖ్య అతిథులుగా రానున్నట్లు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా గణనీయమైన పురోగతి సాధించింది. గతేడాది 7వ స్థానంలో ఉండగా, ఈసారి 93.30 శాతం పనులు పూర్తి చేసి 5వ స్థానానికి ఎగబాకింది. ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల కంటే యాదాద్రి మెరుగైన పనులు చేపట్టింది. -
నేడు గవర్నర్, కేంద్ర మంత్రి రాక
భువనగిరిటౌన్ : పీఎం సంసద్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు ఆదివారం భువనగిరి పట్టణానికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ రానున్నారు. ఇందుకు గాను భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేస్తున్న వేదిక ఏర్పాట్లను శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, నాయకులు పాశం భాస్కర్, పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేంద్గుప్తా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. -
‘లవ్వాలా’ సినిమా డైరెక్టర్ అడ్లూరు వాసి
శాలిగౌరారం: మండలంలోని అడ్లూరు గ్రామానికి చెందిన దేశెట్టి రంజిత్కుమార్ డైరెక్టర్గా తొలి సినిమాను తీస్తున్నారు. అందుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్లోని మాదాపూర్లోగల కాకతీయహిల్స్లోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకులు బుచ్చిబాబు, కొరటాల శివ హాజరయ్యారు. మల్టీమీడియాలో ఎడిటింగ్ స్పెషలైజేషన్తో 2009లో డిగ్రీ విద్యను పూర్తిచేసిన రంజిత్కుమార్ గత 15 సంవత్సరాలుగా అనేక సినిమాలకు సహదర్శకుడిగా పనిచేశారు. స్వాన్ ఎంటర్టైన్మెంట్, శుభకరి ప్రొడక్షన్ సంయుక్త నిర్మాణంలో రవీంద్రతేజ్, ఆరియామోడీ నటీనటులుగా ‘లవ్వాలా’ అనే సినిమాకు రంజిత్కుమార్ దర్శకుడిగా తన మొదటి సినిమాను తీస్తున్నారు. రంజిత్కుమార్ తండ్రి జనార్దన్ అడ్లూరు గ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా, తల్లి భద్రమ్మ గృహిణి. రంజిత్కుమార్ సినిమా డైరెక్టర్ కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గడ్డి మందు పిచికారీతో పంట ధ్వంసం
నేరేడుచర్ల : పంట పొలానికి గడ్డి మందు పిచికారీ చేయడంతో ఐదెకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నేరేడుచర్ల మండలం దాచారం గ్రామానికి చెందిన పేర్వాల శ్రీదేవి 2003లో ఐదెకరాలు భూమిని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటుంది. 2018లో ధరణిలో ఆమెకు తెలియకుండా మరో వ్యక్తి పట్టా మార్పు చేసుకోవడంతో కోర్టును ఆశ్రయించింది. 2025లో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి భూమిని సాగు చేసుకుంటుంది. కోర్టు తీర్పు ఆధారంగా ఆమెకు కొత్త పాస్బుక్ వచ్చింది. ఈక్రమంలో కోట్ల సునిత, కోట్ల వెంకట్రెడ్డితో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 16న తన వరి పొలానికి గడ్డిమందు పిచికారీ చేయడంతో తన ఐదు ఎకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయిందని పేర్వాల శ్రీదేవి వాపోయింది. గురువారం రాత్రి పొలంలోని స్టార్టర్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తెలిపింది. దీంతో శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. -
రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్
నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి, వారి విశ్వాసాన్ని కోల్పోయిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శుక్రవారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ఇస్తామని మభ్యపెడుతున్నారే తప్ప రైతుల ఖాతాలో జమ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు, పండుగల ముందు సీఎం రేవంత్రెడ్డి బోగస్ మాటలు తప్ప రైతుబంధును పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏకకాలంలో రైతులందరికీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్దేని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తానని మాటలు తప్ప అవి ఇచ్చిన దాఖాలాలే లేవన్నారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. వరి కోతలు దగ్గర పడుతున్న సమయంలో కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు వస్తున్నా సరి చేయడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మహిళా సంఘాలకు కేటాయించకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఐకేపీ కేంద్రాలు ఎత్తి వేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పగించారని విమర్శించారు. అధికారులు పునఃపరిశీలన చేసి కేంద్రాలను ఐకేపీకి కేటాయించాలని కోరారు. సమావేశంలో మార్కెట్, మున్సి పల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొడ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అద్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, సర్పంచులు గోర్ల వీరయ్య, బంటు రవి, సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్రెడ్డి, గుర్రం గణేష్, పల్లె విజయ్, దైద పరమేషం, యానాల లింగారెడ్డి పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ఆటోను ఢీ కొట్టిన కారు
మరిపెడ రూరల్: ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం శివారు సీతారాంపురం స్టేజీ వద్ద మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం ఓ శుభకార్యం నిమిత్తం ఆటోలో మహబూబాబాద్కు బయల్దేరింది. ఈ క్రమంలో సీతారాంతండా స్టేజీ సమీపంలో మహబూబాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామస్వామి వెంకన్న (55) మృతి చెందగా, మరో ఆరుగురు.. పిట్టల శ్రీనివాస్, పిట్టల పద్మ, గాలి గిరి, గాలి అరుణ, కేసరి శేషమ్మ, ఆటో డ్రైవర్ రవీందర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పిట్టల పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఐదుగురిని మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిట్టల పద్మను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రామస్వామి వెంకన్నది సూర్యాపేట కాగా, శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డాడు. మరిపెడ పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ యాస రవి, చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ● ఒకరి మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు -
పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు అవసరం
పెద్దవూర: రైతులు, పాడి పశువుల నిర్వాహకులు మేలు జాతి పశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్రెడ్డి తెలిపారు. పశువు శరీర లక్షణాలు, పశువు వంశావళి, సంతతి, పశువు ఉత్పత్తి సామర్థ్యం వంటి విషయాలపై అవగాహనతో పశువులను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. పశు సంతతి గుర్తించాలిపశువుల యజమానులు పశువు ఉత్పత్తి సామర్థ్యం, పాల ఉత్పత్తి, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని బట్టి సంతానం సామర్థ్యం అంచనా వేయొచ్చు. పశువులకు సంబంధించిన ఇలాంటి వివరాలు పెద్ద పెద్ద ఫారాలు, ప్రభుత్వ ఫారాలలో మాత్రమే లభ్యమవుతుంది. సంతల్లో అమ్మే రైతుల దగ్గర ఇలాంటి రికార్డులు లభించవు. కావున పశువు శరీర లక్షణాలను బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువుల గరిష్ట స్థాయి పాల దిగుబడి పశువు ఈనిన 40–60 రోజుల లోపల ఉంటుంది. గరిష్ట స్థాయికి త్వరగా చేరి, గరిష్ట స్థాయిలో ఎక్కువ రోజుల్లో పాల దిగుబడి ఇవ్వగలిగిన పశువులే లాభదాయకంగా ఉంటాయి. మేలు జాతి పశువుల శరీర లక్షణాలుపాడి పశువులు నిండుగా, చురుకుగా ఉండాలి. సులువుగా ఉండాలి కానీ ఎద్దులాగా బాగా కండపట్టి ఉండకూడదు. శరీర అంగ సౌష్టవం త్రికోణాకారం కలిగి ఉండటంతో పాటు చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి. లాగితే ముడత సులువుగా రావాలి. వదిలితే యథాస్థానంలో ఉండాలి. తేలికగా నడవగలిగి సులువుగా కూర్చుని లేవాలి. కళ్లు చురుకుగా విశాలంగా ఉండి ముట్టె చెమ్మగిల్లి ఉండాలి. ఇలాంటి లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. మెడ పొట్టిగాను, సన్నగాను, ఉండి ఛాతీ భాగం విశాలంగా ఉండాలి. డొక్కలు నిండుగాను, కడుపు పెద్దదిగాను, పక్కటెముకలు బాగా వంచిన విల్లు ఆకారంలో ఉండాలి. పశువుల పిరుదుల భాగం వెనుక వైపు పొంగి ఉంటే సులభంగా ఈనగలదని గ్రహించాలి. అంతేకాకుండా కాళ్లు దృఢంగా ఉండి కాలి గిట్టలు వెడల్పుగా, గుండ్రంగా ఒక దానికి ఒకటి దగ్గరగా ఉండాలి. పొదుగు లక్షణాలుపశువు పొదుగు సాగి వేలాడకూడదు. బాగా విస్తరించి శరీరానికి హత్తుకుని ఉండాలి. 18 అంగుళాల పైనే ఉండాలి. చనుకట్ల పొదుగు మీద సమానంగా అమరి ఉండటంతో పాటు పొదుగు ఇరువైపులా రక్తనాళాలు స్పష్టంగా కనిపించాలి. ఎక్కువ వంకర్లు తిరిగి ఉంటే పాలను ఎక్కువగా ఇవ్వగలవని గుర్తించాలి. పశువుల కొనుగోలులో గుర్తుంచుకోవాల్సిన విషయాలుఅక్టోబర్, నవంబర్ మాసాలు పాడి పశువులను కొనటానికి అనువైన నెలలు. పశువు ఈనిన తర్వాత నెలా, నెలా పదిహేను రోజుల లోపల అత్యధికంగా పాల దిగుబడిని ఇస్తుంది. కావున ఈనిన నెలలోపు పశువులనే ఖరీదు చేయాలి. పశువుల మొదటి 5 ఈతల్లో గరిష్ట స్థాయి పాల దిగుబడిని ఇస్తాయి. కావున మొదటి ఈత, రెండవ ఈత పశువులను మాత్రమే కొనుగోలు చేయాలి. దురలవాట్లు లేని పశువులను కొనుగోలు చేయాలి. ముర్రా గేదె సరాసరి 10–12 లీటర్లు, గ్రేడెడ్ ముర్రా గేదె అయితే 6–7 లీటర్ల పాలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. బెదరకుండా మచ్చికగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువులను కొనుగోలు చేయటంతో పాటు ఎవరు పితికినా పాలిచ్చే పశువులను ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు పాలధారలు నిండుగా బలంగా వెలుపలికి రావాలి. చూడాల్సిన అంశాలు● జాతి లక్షణాలు, పశువు శరీర లక్షణాలు, బరువు, కొలతలు గమనించాలి. ● తండ్రి వారసత్వం, తల్లి వారసత్వం, దిగుబడి శక్తి, పునరుత్పత్తి శక్తి, గతంలో పుట్టిన దూడల శక్తి. ● పశువు ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఎన్ని ఈతలు ఈనినది, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉందా లేదా గమనించాలి. ● పళ్లు శుభ్రంగా ఉన్నాయా, కాళ్లు, డెక్కల్లో బెణుకులు, విరుగుడు ఉందా లేదా చూసుకోవాలి. ● చూపు సరిగా ఉందా, వట్టిదా, చూడిదా, పాడిదా గమనించాలి. ● పాడిడైతే ఎన్ని రోజుల క్రితం ఈనినది, దిగుబడి వివరాలు వెన్నశాతం తెలుసుకోవాలి. ● చూడిదైతే చూడి ఎన్ని నెలలు, ఏ ఆబోతుతో కలిపారనేది తెలుసుకోవాలి. ● వట్టిదైతే ఎదకు వచ్చిందా, ఎన్నిసార్లు, ఎద నిలువలేదా, చివరిసారి వచ్చిన తేదీ, వైద్యం చేయించారా అనేది తెలుసుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే పశువులను కొనకూడదు● తక్కువ పెరుగుదల (వయస్సుతో పోల్చితే) ● ఆలస్యంగా ఎదకు రావడం, ఎదకు రాకపోవడం ● ఈతకు, ఈతకు మధ్య హెచ్చుకాలం, నయంకాని దీర్ఘవ్యాధులు ● మెయ్యదిగుట, పాలు తక్కువ ఇచ్చుట, దూడ లేకపోతే పాలు ఇవ్వకపోవడం.పశువుల బరువు తెలుసుకోవడం పశువుల బరువును తెలుసుకుంటే వాటికి ఇవ్వాల్సిన మేతలు, దాణాలు, మందులు, సరైన మోతాదులో ఇవ్వొచ్చు. కాటాలో కాని, వేబ్రిడ్జి మీద కాని తూకం వేయడం వలన బరువు స్పష్టంగా తెలుస్తుంది. ఎల్జీ2బై 660. ఈ సూత్రం ఆధారంగా పశువు పొడవు, ఛాతీ భాగం, చుట్టు కొలతను బట్టి బరువు తెలుసుకోవచ్చు. ఎల్ అనగా పశువు ముందు జబ్బ పాయింట్ నుంచి వెనుక తొడల వరకు పొడవు అంగుళాల్లో. జీ అంటే పాడి పశువు ఛాతి చుట్టుకొలత అంగుళాల్లో. ఇది అన్ని పశువులకు అన్ని వయసుల్లో సుమారుగా సరిపోతుంది. పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్రెడ్డి సూచనలు -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సీతారాంరెడ్డి
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మన్నెం వెంకటరెడ్డి, సరోజనమ్మ దంపతుల పెద్దకుమారుడు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) మన్నెం సీతారాంరెడ్డి ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ క్రీడాపోటీలకు (నేషనల్ గేమ్స్) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 20 నుంచి 25వరకు న్యూఢిల్లీలో జరగనున్న వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరుపున ఆడనున్నారు. ప్రస్తుతం ఆయన చిలుకూరు మండలం పాలెఅన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
దేవరకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యవసాయ కూలీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డిన సంఘటన దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మంతు తిరుపతి(45) గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. తిరుపతి కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగానే పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే గల ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంతిప్పర్తి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన తిప్పర్తి మండలంలోని గడ్డికొండారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరమళ్ల చంద్రయ్య(55) ఓ వ్యక్తికి సంబంధించిన తోటలో కాపలాగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తోటలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. పడిపోయి ఉండడంతో కుటుంబసభ్యులు గమనించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం చంద్రయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. మహిళ అదృశ్యంనల్లగొండ: నల్లగొండలోని అన్సారీ కాలనీకి చెందిన వివాహిత అదృశ్యమైంది. ఈమేరకు కుటుంబసభ్యులు శుక్రవారం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్సారీ కాలనీకి చెందిన బోధ (45) తాను నందిగామకు వెళ్తున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆమె నందిగామకు చేరుకోలేదని తెలిసింది. ఈమేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోధ ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ ఎస్ఐ 87126 70176కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. -
అన్న ప్రసాదానికి రూ.6 లక్షల విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు నిత్యం అందించే అన్న ప్రసాదానికి హైదరాబాద్కు చెందిన పాలమూరు సీడ్స్ నిర్వాహకులు సుదర్శన్రెడ్డి రూ.6లక్షల విరాళం అందజేశారు. శుక్రవారం సుదర్శన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్ను ఆయన కార్యాలయంలో కలిసి రూ.6లక్షల చెక్కు, డీడీలను అందించారు. విరాళాన్ని అన్న ప్రసాద కేంద్రంతో భక్తులకు నిత్య అన్నదానం కోసం ఖర్చు చేయాలని కోరారు. గంజాయి పట్టివేత సూర్యాపేటటౌన్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. ఎస్ఐ ఐలయ్య, సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న 4 కేజీల గంజాయి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులను సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్కు చెందిన మోతె రామకిషన్, శ్రీనివాస కాలనీకి చెందిన మామిడాల రితిన్, రాజనాయక్ తండాకు చెందిన లూనావత్ వెంకటేష్లుగా గుర్తించి విచారించినట్లు తెలిపారు. మోతె రామకిషన్ సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకుస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తీసుకొచ్చిన గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్దకు గంజాయితో రాగా.. ఈ ముగ్గురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రెండు బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. కోతుల దాడిలో ఇద్దరికి గాయాలు అర్వపల్లి: కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈఘటన అర్వపల్లిలో పోలీస్స్టేషన్ రోడ్డులోని జెడ్పీహెచ్ఎస్ సమీ పంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అర్వపల్లిలో తాడూరి యాదగిరి కుమారుడు మనువర్మ, పురంశెట్టి తన్వికసాయి ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా సమీపంలో ఉన్న కోతులు ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. చిన్నారులను వారి తల్లిదండ్రులు స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. -
‘యూనిటీ’కి గద్దర్ అవార్డు
● కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ తీసిన భూదాన్పోచంపల్లి వాసి ● డిప్యూటీ సీఎం చేతులమీదుగా అవార్డు అందుకున్న దర్శకుడు, నిర్మాతభూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ మలి ఉద్యమనేత, మాజీ మంత్రి దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్పోచంపల్లికి యువ దర్శకుడు బడుగు విజయ్కుమార్ దర్శకత్వంలో, చౌటుప్పల్కు చెందిన చిత్ర నిర్మాత ధనుంజయ్య రూపొందించిన ‘యూనిటీ’ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీ గద్దర్ అవార్డు–2026కు దక్కింది. ఈమేరకు గురువారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు చేతుల మీదుగా దర్శకుడు బడుగు విజయ్కుమార్ అవార్డు, రూ.5లక్షల నగదు అందించి ఘనంగా సత్కరించారు. బాధ్యతను పెంచింది దర్శకుడు విజయ్కుమార్ మాట్లాడుతూ.. గద్దర్ ఫిల్మ్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. చిత్ర విజయంలో అండగా నిలిచిన నిర్మాత చిరందాస్ శ్రీకాంత్, ధనుంజయ్య, చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన మైమ్ మధు, సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత చిరందాసు ధనుంజయ్య మాట్లాడుతూ.. తాము రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఇప్పటికే 12 అవార్డులు లభించాయని తెలిపారు. కాగా.. పోచంపల్లి వాసి రాష్ట్రస్థాయిలో గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం పట్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, భారత లవకుమార్, కొండా లక్ష్మణ్బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్, అడ్వకేట్ రాపోలు జ్ఞానేశ్వర్, ఎంఏ షరీఫ్, కార్టూనిస్ట్ దయానంద్, రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. -
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట మోసం
సూర్యాపేటటౌన్ : స్టాఫ్ నర్సుల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం అనే వ్యక్తి క్రీడల ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. తనకు పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇలా హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్లో ఉద్యోగం చేస్తున్న వాణి అనే మహిళతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. సూర్యాపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బాధితుల నుండి రూ. కోటి 85 లక్షల వరకు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడు. ఈక్రమంలో పట్టణంలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బదిలీ చేయించడానికి గాను రూ.20 లక్షలు రఘురాం తీసుకున్నాడు. ఆ మహిళ గతంలో నర్సింగ్ కళాశాలలో కొంతమందికి రఘురాంను పరిచయం చేసింది. ఇలా అతడు హైదరాబాద్ కు చెందిన వాణితో కలిసి నకిలీ నియామక పత్రాలను చూపి బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. జమ్మిగడ్డకు చెందిన బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు దుగ్యాల రఘురాంను శుక్రవారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుని నుంచి నకిలీ జాబ్ సర్టిఫికెట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బులతో జల్సాలు చేసినట్లు, రూ.30 లక్షల విలువైన ప్లాట్, రూ.30 లక్షల విలువైన కారు కొనుగోలు చేసినట్లు సీఐ తెలిపారు. 60 మంది బాధితుల నుంచి రూ.కోటి 85లక్షల వసూలు నిందితుడి అరెస్టు, రిమాండ్ -
యువికా.. చక్కటి వేదిక
సూర్యాపేటటౌన్ : తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చక్కటి అవకాశం కల్పిస్తోంది. అంతరిక్ష సైన్స్, సాంకేతికత పరిజ్ఞానం అలాగే నూతన ధోరణులపై పాఠశాల విద్యార్థులకు మౌలిక విజ్ఞానాన్ని అందించేందుకు ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) పేరిట ప్రతి ఏటా ప్రత్యేక శిక్షణను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026 శిక్షణకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికై న విద్యార్థులకు దేశంలోని ఏడు ఇస్రో కేంద్రాల్లో ఆయా అంశాలపై శిక్షణ ఇస్తారు. అర్హులు వీరే... ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గత విద్యాసంవత్సరంలో 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50శాతం వెయిటేజీ, ఆన్లైన్ క్విజ్లో 10శాతం వెయిటేజీ ఉంటుంది. పాఠశాల, జిల్లా, రాష్ట్ర అంతకంటే ఎక్కువ స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్లు, పాఠ్యేతర అంశాల కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒలంపియాడ్, క్రీడల్లో ప్రతిభ, స్కౌట్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో పాల్గొనడం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదవడం తదితర అంశాలకు నిర్థేశిత వెయిటేజీలు ఉంటాయి. 31వ తేదీ వరకు గడువు ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు https://jigyasa.iirs.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారి తొలి జాబితా ఏప్రిల్ 13న వెల్లడిస్తారు. ఎంపికై న విద్యార్థులకు మే 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దేశంలోని వివిధ నగరాల్లో ఇస్రోకు చెందిన ఏడు కేంద్రాల్లో శిక్ష శిబిరాలు ఏర్పాటు చేసి శాస్త్ర, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తారు. రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రయోగాత్మక ప్రదర్శన, చాట్, సందర్శన, నిపుణులతో ప్రయోగాలు, ప్రముఖ శాస్త్రవేత్తల అనుభవాలు, చర్చా కార్యక్రమాలు ఉంటాయి. అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ ప్రయోగాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందజేస్తారు. ఎంపికై న విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరికి, గైడ్ ఉపాధ్యాయుడి ప్రయాణ ఖర్చులను ఇస్రోనే భరిస్తుంది.విద్యార్థులకు మంచి అవకాశంవిద్యార్థులకు ఇది చక్కటి అవకాశం. ప్రతి పాఠశాల నుంచి ఆసక్తి గల విద్యార్థులు యువికా శిక్షణకు దరఖాస్తు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తుండటంతో ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – దేవరాజ్, జిల్లా సైన్స్ అధికారి, సూర్యాపేట ఇస్రో ఆధ్వర్యంలో అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం -
నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి వినతి
నల్లగొండ టూటౌన్ : చండూరులో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గురువారం బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఎస్పీ శరత్చంద్ర పవార్కు వినతి పత్రం అందజేశారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రోజున బీజేపీ జిల్లా అధ్యక్షులపై దాడి చేసిన నల్లగొండ డీఎస్పీపై, ఉగాది సందర్భంగా నల్లగొండలో బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా ఇన్చార్జ్ ఉదయ్ ప్రతాప్, పాశం శ్రీనివాస్రెడ్డి, అరవింద్రెడ్డి, పిన్నింటి నరేందర్రెడ్డి, శాంతిస్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
వినూత్నంగా ఉగాది వేడుకలు
మోత్కూరు : మోత్కూరు పట్టణంలో గురువారం ఉగాది పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి స్థానిక జెడ్పీహెచ్ఎస్కు చేరుకున్నారు. అక్కడ నుంచి చెరువు కట్ట వద్ద గల తూర్పు ముత్యాలమ్మ ఆలయం, అంగడి బజార్లో ఉన్న పడమటి ముత్యాలమ్మ ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని దేవతలకు నైవేద్యం సమర్పించారు. అంతకుముందు స్థానిక కల్వల సుధాకర్రావు నివాసం నుంచి వారి కుమారుడు సుజిత్కుమార్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్నసోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్నగుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్రుగౌడ్, కౌన్సిలర్లు పన్నాల శ్రీవిద్య, కూరెళ్ల ప్రమీల, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్రెడ్డి తదితరులు చెరువు కట్ట ముత్యాలమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎడ్ల బండ్ల ప్రదర్శనలు.. బైక్ విన్యాసాలు.. ఉగాది వేడుకల్లో భాగంగా ఎడ్ల బండ్ల ప్రదర్శనలు, బైక్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎడ్ల బండ్లను వివిధ పార్టీల జెండాలతో అలంకరించి ప్రదర్శన నిర్వహించారు. శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను మున్సిపల్ కమిషనర్ కె. సతీష్కుమార్ పర్యవేక్షించారు. ఇన్స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు బందోబస్తు ఏర్పాటు చేశారు. మోత్కూరులో బోనాలు ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ప్రదర్శనలు -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
పెన్పహాడ్ : గంజాయి తరలిస్తున్న వ్యక్తులను గురువారం పెన్పహాడ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండలంలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద పెన్పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పెన్పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు ఈశ్వర్, పెన్పహాడ్ మండలం మాచారం గ్రామానికి చెందిన బొమ్మకంటి గోపి, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన చింతల వెంకటేష్ స్కూటీపై అటుగా వెళ్తూ పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు. స్కూటీని తనిఖీ చేయగా అందులో గంజాయి లభ్యమైంది. నాలుగు రోజుల క్రితం ఒడిశా సరిహద్దుల్లో రెండు కేజీల గంజాయి కొనుగోలు చేసి, అందులో కొంత వారు తాగి, మిగిలిన గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి వెళ్తున్నట్లు పట్టుబడిన ముగ్గురు ఒప్పుకున్నారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, స్కూటీ, 1.700 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ గోపికృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 1.700 కేజీల గంజాయి, స్కూటీ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం -
పోచంపల్లిలో త్రివిధ దళాల అధికారులు
భూదాన్పోచంపల్లి : ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణ పొందుతున్న బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, ఒమన్ దేశాలతో పాటు మన దేశానికి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్స్ఫోర్స్కు చెందిన 10 మంది బ్రిగేడియర్లు, కల్నల్స్, ఎయిర్ కమాండర్లు గురువారం పోచంపల్లిలో పర్యటించారు. స్థానిక చేనేత సహకార సంఘం, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, టూరిజం పార్కును సందర్శించారు. అక్కడ మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీలో అవలంబిస్తున్న విధానాలు, మార్కెటింగ్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వీరికి పోచంపల్లి ఇక్కత్కు ఉన్న గుర్తింపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్ వివరించారు. కాగా ఎంటెక్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మానేసి చేనేత వృత్తిలో రాణిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్న సాయిని భరత్ను వారు అభినందిస్తూ ఆయనకు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భరత్రెడ్డి మాట్లాడుతూ.. సాంఘిక, ఆర్థికాభివృద్ధిపై అధ్యయనం నిమిత్తం స్టేట్ టూర్లో భాగంగా త్రివిధ దళాల అధికారులు పోచంపల్లికి వచ్చారని తెలిపారు. వీరికి చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్ఐలు భాస్కర్రెడ్డి, జగన్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్రెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, ఏడీఓ బాలమోహన్రెడ్డి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, మేనేజర్ రుద్ర అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చేనేత విశిష్టతను తెలుసుకున్న భారత్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, ఒమన్ దేశాలకు చెందిన ఆఫీసర్లు -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
అనంతగిరి : భార్య మందలించిందని మనస్తాపానికి గురై గడ్డి మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన అనంతగిరి మండలం లక్కారం గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కారం గ్రామానికి చెందని మదాసు సాయిప్రవీణ్(24)కు భార్య, 17 నెలల బాబు ఉన్నారు. సాయిప్రవీణ్ ఎటువంటి పనిచేయకుండా ఖాళీగా ఉంటుండడంతో ఈ నెల 13న రాత్రి భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రవీణ్ గ్రామ శివారులోని చెరువు కట్ట వద్దకువె వెళ్లి గడ్డి మందు తాగాడు. స్ధానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి బావ సొమపంగి ఉపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్కుమార్ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. పెద్దఅడిశర్లపల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని యవకుడు మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలంలో గురువారం రాత్రి జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం కాసారం గ్రామానికి చెందిన బొజమోని అఖిల్(23) ద్విచక్ర వాహనంపై పెద్దవూర నుంచి అంగడిపేట ఎక్స్ రోడ్ వద్దకు వస్తుండగా.. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అఖిల్ పైనుంచి గుర్తుతెలియని వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం కట్టంగూర్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కట్టంగూర్ మండలంలోని పామనగుండ్ల బస్టాప్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్ విద్యార్థి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎరసానిగూడెం గ్రామానికి చెందిన కడారి శివాజీ(19) ఇటీవల నల్లగొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. పామనగుండ్ల గ్రామంలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన శివాజీ తిరిగి బైక్పై స్వగ్రామానికి వెళ్తూ.. పామనగుండ్ల బస్టాప్ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా నకిరేకల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న శివాజీ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రవీందర్ తెలిపారు. 108 వాహనంలో ప్రసవంఅడ్డగూడూరు: పురిటి నొప్పులతో బాధపడు తున్న గర్భిణిని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన ఆశ కార్యకర్త కడియం సుమన కుమార్తె మనీషాకు గురువారం పురిటి నొప్పులు రావడంతో 108 వాహనంలో నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. పురిటి నొప్పులు అధికమవ్వడంతో 108 మెడికల్ టెక్నీషియన్ యాకస్వామి, ఆశ కార్యకర్త సుమన ప్రసవం చేయగా ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినట్లు మెడికల్ టెక్నీషియన్ తెలిపారు. -
పండుగ పూట విషాదం
● కుంటలో మునిగి రైతు మృతినూతనకల్ : ఎద్దులను కడిగేందుకు కుంట వద్దకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నూతనకల్ మండలం పెదనెమిల గ్రామంలో గురువారం జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనెమిల గ్రామానికి చెందిన నాగెల్లి రామస్వామి(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా తన ఎద్దులను కడిగేందుకు గ్రామ శివారులోని ముత్యాలమ్మ కుంట వద్దకు తోలుకెళ్లాడు. ఎద్దులను శుభ్రం చేసి కుంట నుంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు కుంటలో మునిగి పోయాడు. పక్కనే ఉన్న దేవాలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహకారంతో రామస్వామి మృతదేహాన్ని కంటలో నుంచి బయటకు వెలికితీశారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు విక్రమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. 27 నుంచి శ్రీమహాలక్ష్మి యాగంమిర్యాలగూడ : పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో శ్రీమహాలక్ష్మి యాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మిర్యాలగూడ పట్టణంలో యాగం కరపత్రాన్ని నిర్వాహకులు ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ప్రతిరోజు ఉదయం 7గంటలకు తీర్థ గోష్ఠి, అనంతరం యజ్ఞ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారు యాగ ప్రాంగణంలో బిక్ష స్వీకరిస్తారని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యజ్ఞశాలలో నిత్య పూర్ణాహుతి, యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అమ్మవారి యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, జిల్లా నాయకుడు బండారు కుశలయ్య, ఉపాధ్యక్షులు గోళ్ల రామశేఖర్, పొలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, బీజేపీ నాయకుడు పురుషోత్తంరెడ్డి, న్యాయవాది గూడూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దంతూర్ గ్రామంలో విషాదఛాయలు
భూదాన్పోచంపల్లి : మండలంలోని దంతూర్ గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త శ్రీనివాస్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో చోటుచేసుకుంది. మృతుడి భార్య సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం.. దంతూర్ గ్రామానికి చెందిన బోదాసు శ్రీనివాస్ (37) హైదరాబాద్లోని సాయి లైఫ్ సైన్సెస్ సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో అన్నోజిగూడలో నివాసం ఉంటున్నాడు. కాగా, ఆయనకు సొంతూరులో వ్యవసాయ భూమి ఉంది. ఇదే గ్రామానికి చెందిన బోదాసు నర్సింహ, సిద్దగోని మల్లయ్య, కంబాలపల్లి నర్సింహ, బోదాసు చిన్న ఈదయ్య, బోదాసు బాలరాజు, బోదాసు యాదయ్య కలిసి పొలం బాట ఉందని తప్పుడు పత్రాలను సృష్టించి తమ భూమిని ఆక్రమించుకున్నారని సౌజన్య ఆరోపించారు. ఇదే విషయమై పోచంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని, దీంతో కోర్టుకు వెళితే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని తెలిపారు. అయినా, తన భర్తపై తప్పుడు కేసులు బనాయిస్తూ మానసికంగా వేధించారని ఆరోపించారు. కాగా, రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి బెడ్రూమ్లో పడుకున్న శ్రీనివాస్ మానసిక క్షోభతో అర్ధరాత్రి ఇంటి హాల్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్ల వారు జామున హాల్లోకి వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడని సౌజన్య తెలిపారు. తన భర్తకు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో గురువారం ఆమె ఫిర్యాదు చేశారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని దంతూర్ తీసుకొచ్చారు. కాగా, మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూసైడ్ నోట్ లభ్యం కాగా, శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకొనే ముందు రాసిన సూసైడ్ నోట్ లభించింది. వ్యవసాయ బాట లేకున్నా.. ఉన్నట్లు తప్పుడు సాక్ష్యాలతో తన భూమిని కబ్జా చేసి మానసికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని నోట్లో పేర్కొన్నాడు. తన ఆత్మకు శాంతి చేకూరాలంటే తన శవాన్ని కబ్జా చేసిన బాటలో పూడ్చాలని రాశాడు. తప్పుడు సాక్ష్యాలతో తనను ఇబ్బంది పెట్టారని, పోలీసులు కూడా విచారణలో పారదర్శకత పాటించలేదని నోట్లో పేర్కొన్నాడు. భూ వివాదంతో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న గ్రామవాసి -
ముందస్తు ఖరీఫ్ సాగుకు సిద్ధమవ్వండిలా..
గుర్రంపోడు : రైతులు మందస్తుగా ఖరీఫ్ సాగు చేపట్టేందుకు ఇప్పటికే పత్తి కట్టెను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు, నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు చేయాలని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి సూచిస్తున్నారు. ఖరీఫ్ ముందస్తు సాగుకు సన్నద్ధమ్యే రైతులకు ఆయన సూచనలు, సలహాలు.. లోతు దుక్కులతో మేలు లోతు దుక్కులు దున్నినప్పుడు భూమిలోని తెగుళ్లను నశింపజేసే అవకాశం ఉంటుంది. భూమిలో దాగి ఉన్న లేదా నిద్రావస్ధలో ఉన్న పురుగులు, తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలకు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. దుక్కిలో బయటపడిన గుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. కాబట్టి తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గే అవకాశం ఉంటుంది. భూమిలో 9 అంగుళాల వరకు లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం శ్రేయస్కరం. లోతు దుక్కులతో కలుపు నిర్మూలన తుంగ, గరిక వంటి కలుపు మొక్కలు పొలాల్లో పెరిగి పంటలు నాశనం చేస్తాయి. కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్ధాలను గ్రహించి సత్తువ లేకుండా చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గడమే కాకుండా భూమిలోని లోతైన పొరల్లో తేమ తగ్గుతుంది. తుంగ, గరికల వేర్లు దుబ్బుగా ఉండి నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టమవుతుంది. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు వేర్లు , దుంపలు ఏరి వీటిని అరికట్టవచ్చు. వేసవిలో లోతుగా దున్ని తొలకరి వర్షాలకు గొర్రు, గుంటులతో దున్నినప్పుడు నేల బాగా గుల్ల బారుతుంది. పైర్ల వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేలకోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, వర్షపు నీటికి ప్రవాహానికి అడ్డంగా చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు ఏర్పాటు చేసుకోవాలి. ● గత ఖరీఫ్లో వేసిన పత్తి, కంది, ఆముదం కట్టెలను తొలగించి పొలంలోనే కాల్చివేయాలి. పొలంలో గట్టిపొర ఏర్పడితే ఎర్రని ఇసుక మట్టిని తోలడం వల్ల భూమి బాగుపడుతుంది. వేసిన పంట నుంచి వేర్లు సులభంగా భూమిలోకి దిగుతాయి. వేసవిలోనే సేంద్రియ ఎరువులు పంట పొలాలకు తరలించుకోవాలి. నీటి లభ్యత ఉన్న రైతులు పెంట కుప్పలపై నీటిని చిలుకరించడం వల్ల తొందరగా ఎరువుగా మారుతుంది. కుళ్లని సేంద్రియ ఎరువులు వర్షాధార పంటల్లో త్వరగా బెట్ట పరిస్ధితులను కల్గిస్తాయి. పంట మార్పిడి తప్పనిసరి ఒకే భూమిలో ఏటా ఒకే పంటను కాకుండా వేర్వేరు పంటలు సాగు చేసుకుని పంట మార్పిడి చేసుకోవాలి. రైతులు ఒకే రకమైన పంటను వరుసగా సాగుచేస్తూ దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి పండించడం వల్ల చీడపీడలకు ఎప్పుడూ ఆహారం సమృద్ధిగా లభించి అవి వృద్ధి చెందుతాయి. ఆ పంట వేర్లు వ్యాపించిన మేర భూమి పొరలు నిస్సారమవుతాయి. పంట మార్పిడి నేలసారాన్ని కాపాడుకోవడంతోపాటు తేమను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు. వివిధ రకాల వేరు వ్యవస్థలు కలిగి భిన్నంగా పెరిగే పైర్లను పంట మార్పిడి కోసం ఎంపిక చేసుకోవాలి. పత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పైర్లు నేల లోపలి నుంచి పోషకాలు తీసుకుంటాయి. ● పోషకాలు ఎక్కువగా తీసుకునే నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటలకు బదులు భూమికి పోషకాలు సమకూర్చే అపరాలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇవి బెట్ట పరిస్ధితులను తట్టుకుంటాయి. వరుసగా పప్పుధాన్యాల పంట కాకుండా నూనె పంటలు సాగు చేయాలి. మిరుప, టమాట, వేరుశనగ, పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, సజ్జ, రాగి పంటల ఎర పంటలుగా వేసుకోవాలి. టమాట, మిరుప, పుచ్చ పంటల్లో బంతిని కూడా ఎర పంటగా కొన్ని సాళ్లు వేసుకుని తెగుళ్లు, ఆకుముడత నివారించవచ్చు. పంట మార్పిడి చేసేటప్పుడు అనుకూలమైన పంటలు ఎంచుకోకపోతే చీడపీడల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బెండ తర్వాత ప్రత్తి వేయకూడదు. జొన్న సాగు చేసిన వెంటనే మిరుప వేయకూడదు. ఈ పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్ట పరుస్తాయి.భూసార పరీక్షలు చేయించాలిపండ్ల తోటలు సాగు చేసే రైతులు భూసార పరీక్షలు చేయించి పంటలు సాగు చేసుకోవాలి. లేకపోతే ఐదేళ్ల వరకు పెంచి కాపు కొచ్చే దశలోనే క్షీణించి నష్టపోయే ప్రమాదం ఉంది. భూసార పరీక్షలు ద్వారా తమ నేల ఏ పంటలకు అనూకూలమో నిర్ధారించుకోవాలి. గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి సూచనలు -
యాదగిరిగుట్ట అర్చకులకు ఉగాది పురస్కారాలు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు జి. నర్సింహమూర్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాలు అందుకున్నారు. గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు చేతులమీదుగా వారు ఉగాది పురస్కారాలతో పాటు సత్కారం అందుకున్నారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ పాల్గొన్నారు. -
దర్శనానికి మూడు గంటలకు పైనే..
యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేల మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.34,24,189 వచ్చి నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఫ యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ -
గ్యాస్ తంటా.. కట్టెల మంట
రాజాపేట : వంట గ్యాస్ కొరత వల్ల చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గొల్లెన జానమ్మ రోజూ సాయంత్ర వేళ మిరపకాయ బజ్జీలు (మిర్చీలు) వేస్తూ జీవనం సాగిస్తోంది. గ్యాస్ దొరకక మూడు రోజులపాటు ఇబ్బంది పడిన జానమ్మ రూ.వెయ్యి వరకు ఖర్చు చేసి ఇనుప డ్రమ్మును కట్టెలపొయ్యిగా మార్చుకుని మిర్చీలు వేస్తూ తన వ్యాపారం కొనసాగిస్తోంది. అయితే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా మండల కేంద్రంలో కొన్ని చిన్న హోటల్స్తోపాటు టీ స్టాళ్లు మూతపడ్డాయి. -
నలుగురు దొంగల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలోని రాజీవ్నగర్కు చెందిన కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, కంచుకొమ్ముల సాయికిరణ్, సూర్యాపేటకు చెందిన షేక్ నస్రీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోలను దొంగిలించి అదే ఆటోలో ప్రయాణిస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేస్తుండేవారు. ఈ నెల 6న ఆత్మకూరు(ఎస్) మండలం కోటినాయక్తండా శివారులో ఓ వృద్ధురాలిని వీరు ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లి ఆమెను బెదిరించి ఆమె మెడలోని వెండి గొలుసు లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఈ నెల 10న ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆత్మకూరు(ఎస్) మండలం ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సీసీఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వీరి నలుగురితో పాటు మరో బాలుడు ఆటోలో నెమ్మికల్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట జిల్లాలోని మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, మేళ్లచెరువు, నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, హైదరాబాద్లోని ఫిల్మ్నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, 3 ఆటోలు, ట్యాబ్, ల్యాప్టాప్, బైక్, టీవీ, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫ 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, మూడు ఆటోలు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
పోచంపల్లిని సందర్శించిన అమెరికన్లు
భూదాన్పోచంపల్లి : ఇక్కత్ చేనేత వస్త్రాల తయారీ విధానాలు, కులవృత్తుల జీవన స్థితిగతులను తెలుసుకొనేందుకు శనివారం ఇద్దరు అమెరికన్లు పోచంపల్లిని సందర్శించారు. చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, నాణ్యత, డిజైన్లు, మార్కెటింగ్ విధానాలు, ఉపాధి అవకాశాలను కార్మికులను నేరుగా తెలుసుకున్నారు. చేనేత డిజైన్లు చూసి కార్మికుల కళా నైపుణ్యాలను అభినందించారు. అనంతరం టూరిజం పార్కును సందర్శించారు. పోచంపల్లి చేనేత పరిశ్రమ, భూదా నోద్యమ చారిత్రక నేపథ్యాన్ని స్థానిక చేనేత కార్మికురాలు నవనీత వారికి వివరించారు. హోటళ్లు, దుకాణాలపై ‘సివిల్ సప్లయ్’ దాడులుమోత్కూరు : మోత్కూరు పట్టణంలో డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా వినియోగిస్తున్న హోటళ్లు, ఇతర దుకాణాలపై శనివారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లయ్ ఏఎస్ఓ సురేందర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నర్సింగరావు, గిర్దావర్ నర్సింహారెడ్డి, భారత్ గ్యాస్ గోదాం ఇన్చార్జి చిప్పలపల్లి యాదగిరి తదితరులు ఉన్నారు. యాదగిరి క్షేత్రంలోవిశేష పూజలుయాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం విశేష పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కేసుల రాజీకి పోలీసులు సహకరించాలి చౌటుప్పల్ : కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేసేందుకు పోలీసులు కక్షిదారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత అన్నారు. శనివారం చౌటుప్పల్లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సివిల్, ట్రాఫిక్, ఎకై ్సజ్ విభాగాల పోలీసు అధికారులతో లోక్ అదాలత్పై నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 28న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ ఉన్న కేసులన్నీ పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, కక్షిదారులు రాజీ పడేలా వారిని ప్రోత్సహించాలన్నారు. కోర్టు పరిధిలోని ప్రతి మారుమూల గ్రామంలోనూ లోక్ అదాలత్ ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్, రూరల్ సీఐ రాములు, ఎకై ్సజ్ సీఐ బాలోజీనాయక్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంసర్వారం గ్రామానికి చెందిన కాంతయ్య రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కీతవారిగూడెం గ్రామం వద్ద మరో బైక్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతయ్యను పోలీసులు హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతయ్య వద్ధకే పోలీసులు వెళ్లి అతడిచ్చిన ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని కాంతయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా బాధితులకు సత్వర పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు
భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లూర్థయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదాను మొహిజు వ్యక్తిగత కక్షలతో శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి చౌటుప్పల్ : బైక్పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన వీరబోయిన కమలహాసన్ యాదవ్(28) హైదరాబాద్లోని కాచిగూడలో నివాసముంటూ ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివా రులోని చెరువుకట్ట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలహాసన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీకోదాడరూరల్ : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన బి. బాబుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
తొలిరోజు 18 మంది గైర్హాజరు
భువనగిరి : జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం 50 కేంద్రాల ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. తొలిరోజు తెలుగు పరీక్షకు మొత్తం 8,921 హాజరు కావాల్సి ఉండగా 8,903 మంది హాజరయ్యారు. 18 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాలకు రావడంతో సందడి కనిపించింది. భువనగిరి జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో పరీక్ష కేంద్రాలను పలువురు అధికారులు తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు భువనగిరి పట్టణంలో విజ్ఞాన్ హైస్కూల్, మరో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి మాంటిస్సోరీ, మథర్థెరిస్సా హైస్కూల్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. డీఈఓ సత్యనారాయణ జిల్లాలోని పలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ పదో తరగతి పరీక్షలు ప్రారంభం -
ట్రాన్స్ఫార్మర్ తరుచూ ట్రిప్ అవుతోంది
మూడు ఎకరాల్లో వరిసాగు చేశాను. రోజూ ఐదు నుంచి ఆరు గంటలే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో మూడు ఎకరాల వరిలో 30 గుంటల వరకు ఎండితే గొర్లను మేపాను. 12 గంటలు కరెంట్ సరఫరా చేస్తే ఉన్న పొలం ఎండిపోకుండా ఉంటుంది లేదంటే పూర్తిగా ఎండిపోతుంది. – కాకళ్ల శేఖర్, రాజపేట మా పక్క రైతు బోరు వేయడంతో మా బావి వట్టిపోయింది. కరెంట్ సక్రమంగా సరఫరా కాక మూడెకరాల వరి గింజదశలో పూర్తిగా ఎండిపోవడంతో మూగజీవాలకు మేతగా ఇచ్చాను. – రాజమణి, మహిళా రైతు, పల్లెర్ల, ఆత్మకూర్(ఎం) మండలం -
వృద్ధాప్యం.. ఉల్లాసం
ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్ సిటిజన్ల ఆటవిడుపు ఫ క్యారం, చెస్ ఆడుతూ కాలక్షేపం నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రం (ప్రణమ్ డే కేర్ సెంటర్) 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆటవిడుపుగా మారింది. ఈ సెంటర్ను జనవరి 12న ప్రారంభించగా.. కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఈ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేద తీరవచ్చు. ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడే వయోవృద్ధులు ఈ కేంద్రానికి వచ్చి వార్తాపత్రికలు చదువుకోవడంతో పాటు క్యారం, చెస్ ఆటలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ యోగా, ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే వయోవృద్ధులకు ఈ సెంటర్ నిర్వాహకులు ఉచితంగా టీ, స్నాక్స్ అందజేస్తారు. ప్రతిరోజు సుమారు 50 మంది వరకు వయోవృద్ధులు ఈ సెంటర్కు వచ్చి కాలక్షేపం చేయడంతో పాటు వివిధ ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
గడువులోగా లక్ష్యం చేరేనా!
భూదాన్పోచంపల్లి : మున్సిపాలిటీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్నుల వసూలుకు మరో 16 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా లక్ష్యం నెరవేరలేదు. ఈనెల 31 తేదీ వరకు గడువు ఉండడంతో ఆలోపు వంద శాతం పన్ను వసూలుకు అధికారులు అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించాలని ఇప్పటికే బకాయిదారులకు నోటీసులు జారీ చేశారు. గడువు సమీపిస్తుండడంతో వార్డు ఆఫీసర్లు, బిల్లు కలెక్టర్లు ఇంటింటా తిరిగి పన్నులు చెల్లించాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. పన్నులు చెల్లింపునకు మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు ఆన్లైన్లో కూడా చెల్లించుటకు వెలుసుబాటు కల్పించారు. 50 శాతం కూడా దరిచేరని లక్ష్యం.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు ఉండగా అందులో చౌటుప్పల్, మోత్కూరు మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఆస్తి పన్లు వసూలు 50శాతం కూడా లక్ష్యానికి చేరుకోలేదు. జిల్లాలో చౌటుప్పల్ మొదటి స్థానంలో ఉండగా, ఆలేరు చివరిస్థానంలో నిలిచింది. ఈ నెల 13 నాటికి చౌటుప్పల్లో 62.88 శాతం, ఆలేరులో 37.80 శాతం పన్నులు వసూలు అయ్యాయి. ఇక తెలంగాణలో 131 మున్సిపాలిటీలు ఉండగా, పన్నుల వసూలు విషయంలో రాష్ట్రస్థాయిలో వరుసగా చౌటుప్పల్ 34, మోత్కూరు 65, యాదగిరిగుట్ట 76, భువనగిరి 80, భూదాన్పోచంపల్లి 114, ఆలేరు 115 స్థానాల్లో నిలిచాయి. ఊరటనిచ్చిన మున్సిపల్ ఎన్నికలు.. గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు పన్నుల వసూలుకు కొంత ఊరటనిచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు వారిని బలపరిచే అభ్యర్థులు తప్పనిసరిగా ఆస్తి పన్నులు చెల్లించి నోడ్యూస్ సర్టిఫికెట్ జతపర్చాలనే నిబంధనతో అభ్యర్థులంతా ఆస్తి పన్నులు చెల్లించారు. దాంతో భువనగిరిలో రూ.20,85,000లు, చౌటుప్పల్లో రూ.15,89,526లు, యాదగిరిగుట్టలో రూ.14,39,000, భూదాన్పోచంపల్లిలో రూ.8,02,432లు, మోత్కూర్లోరూ.7,92,000లు, ఆలేరులో రూ. 5,69,730లు వసూలు అయ్యాయి. ఈనెల 13 నాటికి పన్ను వసూలు వివరాలు (రూ.కోట్లలో) మున్సిపాలిటీ గృహాలు డిమాండ్ వసూలు శాతం చౌటుప్పల్ 8,995 8.19 5.15 62.88 మోత్కూరు 5,024 1.37 0.72 52.55 యాదగిరిగుట్ట 5223 3.80 1.85 48.68 భువనగిరి 15,321 9.37 4.44 47.39 పోచంపల్లి 5,190 2.99 1.17 39.13 ఆలేరు 4,718 2.54 0.96 37.80 ఫ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు నెలాఖరు వరకే గడువు ఫ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న యంత్రాంగం ఫ ఇప్పటి వరకు 40 నుంచి 60 శాతమే వసూలు -
గ్యాస్ కొరతపై ఆర్డీఓ సమీక్ష
మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు. ఆర్డీవోను క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించడంతో శనివారం ఆర్డీఓ మోత్కూరుకు చేరుకొని తహసిల్దార్ కార్యాలయంలో వంట గ్యాస్ సిలిండర్లపై సమీక్షించారు. అనంతరం ఆర్డీవో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత అపోహ మాత్రమేనని, సరిపడు నిల్వలు ఉన్నాయని తెలిపారు. భువనగిరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం 20 ఏజెన్సీలు ఉన్నాయని, వాటిల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయబడతాయని తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారికి కచ్చితంగా డెలివరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు, పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని తెలిపారు. మరణించినా.. ఐదుగురికి ప్రాణదానంవేములపల్లి : వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లికంటి వెంకటయ్య(52) మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఐదుగురికి ప్రాణదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య ఈ నెల 8న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంకటయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ వెంకటయ్య భార్య ఎల్లమ్మ, కుమారుడు సురేష్ సామాజిక బాధ్యతతో ఆయన అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. వెంకటయ్య నుంచి సేకరించిన రెండు కిడ్నీలను హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి, కళ్లను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి, కాలేయాన్ని అపోలో ఆస్పత్రికి దానం చేశారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గ్రామస్తులు, ఆస్పత్రి సిబ్బంది అభినందించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి తిప్పర్తి : కాలినడకన వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన జొర్రిగల జ్ఞానేశ్వరి(38) శివుడి దీక్షలో భాగంగా చండూరు నుంచి వాడపల్లిలోని గుడికి కాలినడకన బయల్దేరింది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను శనివారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జ్ఞానేశ్వరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి అన్న జొర్రిగల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఏఎస్ఐ లింగయ్య తెలిపారు. మృతురాలికి వివాహం కాలేదు. -
వరి.. తడారి
ఈ రైతు పేరు వేలిమినేటి ముత్యంరెడ్డి. ఈయనది మోత్కూరు మండలం ముసిపట్ల. గ్రామంలో తనకున్న ఆరెకరాల భూమితోపాటు, మరో ఎకరంన్నర భూమి కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు ఆగిఆగి సన్నగా పోస్తుంది. పక్షం రోజుల నుంచి నీరందడం లేదు. ఎకరం పొలం నెర్రెలు వారి పోయింది. కౌలుకూడా ఎల్లే పరిస్థితి లేదని రైతు వాపోతున్నాడు. ఈ చిత్రంలోని రైతు గుండాల మండలం మాసంపల్లి గ్రామానికి చెందిన మలిపెద్ది మైపాల్రెడ్డి. ఈయన తనకున్న ఎకరంన్నర పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరిపంటసాగు చేశాడు. వ్యవసాయ బావిలో నీటి ఊటలు తగ్గి సాగుకు నీరందడం లేదు. దీంతో ఇప్పటికే సుమారుగా ఎకరంన్నర పొలం ఎండిపోయింది. -
పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు
ఫ పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన ఆటో వలిగొండ : పదో తరగతి పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ సమీపంలో శనివారం జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం పహిల్వాన్పురం గ్రామానికి చెందిన వనగంటి శివరాం స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకావడంతో తెలుగు పరీక్ష రాసేందుకు అతడు వలిగొండలోని పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రెడ్లరేపాక గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనానని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాంను స్థానికులు 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సహాయకురాలితో ‘పది’ పరీక్షకు హాజరుమిర్యాలగూడ : మండలంలోని యాద్గార్పల్లి జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని వెన్నెలకు పుట్టుకతోనే పోలియో వలన కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. దీంతో ఆమె పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినిని సహాయకురాలి(స్క్రైబ్)గా నియమించారు. శనివారం వెన్నెల సహాయకురాలి సహాయంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చి తెలుగు పరీక్ష రాసింది. పదో తరగతి పరీక్షల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెన్నెలతో కలిపి 13 మంది విద్యార్థులకు స్క్రైబ్లను అనుమతించారు. పదో తరగతిలో మొత్తం ఏడు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఇలాంటి వారికి ఏదో ఒక పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వెన్నెలకు ఇంగ్లిష్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. -
నేటి నుంచి శిక్షణ తరగతులు
ఫ నిర్వహణకు గణాంక శాఖ ఏర్పాట్లు ఫ మే నుంచి మొదటి దశ ఇళ్ల లెక్కింపు ఫ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ సాక్షి, యాదాద్రి : జనగణన–2027 ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మొదటి దశ నిర్వహించనున్న హౌస్ హోల్డ్ సమాచారం సేకరణకు సంబంధించి జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో సెన్సెస్ అధికారులకు ఆదివారం శిక్షణ ప్రారంభం కానుంది. ఈ శిక్షణ మూడు రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2011లో జనాభా లెక్కలు సేకరించారు. అనంతరం 2021లో జనగణన చేపట్టాల్సిన ఉండగా కరోనా కారణంగా జరగలేదు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా యూనిట్గా జనజనణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇళ్ల సర్వేపై శిక్షణ జనగణనలో భాగంగా ఇళ్ల లెక్కింపు సర్వేపై ఈనెల 15, 16, 17 తేదీల్లో కలెక్టరేట్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. గణాంక శాఖ రాష్ట్ర అధికారులు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మండల, మున్సిపల్ సెన్సెస్ చార్జ్ అధికారులు, మండల అడిషనల్ చార్జ్ అధికారులకు ఈ శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా 24, 25, 26 తేదీల్లో సెన్సెస్ క్లర్క్స్కు శిక్షణ ఇస్తారు. ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. వలిగొండ, భువనగిరి, చౌటుప్పల్ మండలాలకు ఇద్దరు, మల్టీపర్పస్గా ఒక్కరు చొప్పున 26 మంది క్లర్క్స్ ఉంటారు. అలాగే క్షేత్ర స్థాయిలో ఇళ్ల గణనకు ఫీల్డ్ ట్రైనీస్గా 26 మంది టీచర్లకు ఈనెల 28,29, 30 తేదీల్లో గణాంక శాఖ అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఎఫెక్ సర్వే ప్రకారం జిల్లాలో సుమారు 2.14 లక్షల ఇళ్లు ఉన్నాయి. ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా కలెక్టర్.. జనగణన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా సెన్సెస్ అధికారిగా సీపీఓ ఉంటారు. రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, ఏడుగురు అదనపు సెన్సెస్ అధికారులు ఉంటారు. ఇందులో భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు, సీపీవో, డీఈవో, డీఏవో, జెడ్పీ సీఈవో, డీపీవో, డీపీఆర్వో, ఏడీసీవోలు ఉంటారు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు చార్జ్ అధికారులు, మేనేజర్లు అదనపు చార్జ్ అధికారులు, మండలాల్లో తహసీల్దార్లు చార్జ్ అధికారులుగా, ఎంపీడీవోలు అదనపు చార్జ్ అధికారుగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి–2027లో గణన ఇళ్ల లెక్కలు తేలిన తర్వాత జనాభా లెక్కల సేకరిస్తారు. ఈ సారి జనగణన డిజిటల్ పద్ధతిలో చేపడతారు. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే 20 నుంచి 30 శాతం జనాభా పెరిగే అవకాశం ఉంది. జనగణనలో భాగంగా ప్రతి ఇంటిని లెక్కిస్తారు. మేలో ప్రారంభమై సెప్టెంబర్ 2026 వరకు గణిస్తారు. ఇంటి స్వరూపం, గదుల సంఖ్య, జీప్లస్ 1, అంతకుపైగా ఉన్న వివరాలు, ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యులు సంఖ్య వంటి పలు అంశాలను లెక్కిస్తారు. ఇళ్ల సంఖ్య తేలిన అనంతరం జనగణన చేపడతారు. ప్రతి 700 నుంచి 800 మందికి ఒకరు చొప్పున ఎన్యుమరేటర్ ఉంటారు. ప్రతి ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటారు. వీరందరిని ఇప్పటికే ఎంపిక చేశారు. 2011 జనాభా లెక్కల వివరాలు.. మొత్తం జనాభా 7,70,833 మహిళలు 3,80,341పురుషులు 3,90,492 -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్గౌడ్కు కడుపులో గాయాలయ్యాయి. ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీయగా.. అతడి కుడి కాలు విరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ వెంకట్రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పురాతన శివాలయాన్ని కాపాడుకోవాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఆయన బొత్తలపాలెం గ్రామాన్ని సందర్శించి నందిబోడు పైన గల శివాలయాన్ని, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను పరిశీలించారు. శివాలయం గోడలు పడిపోయాయని, ఆలయ వెనుక నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్డు కింద కాకతీయుల కాలం నాటి శివలింగం, పానపట్టం, ముట్టె, చెవులు, భిన్నమైన నంది, తల, కాళ్లు లేని శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఇవి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, నాయకులు పడిగపాటి శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, రవీందర్రెడ్డి, కందుల భిక్షారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్ స్కాలర్లు
నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్డీ చేస్తున్న మయన్మార్తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరితవనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనం సందర్శించారు. మహాస్థూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం లఘుచిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. అష్ట బుద్ధుల వద్ధ బుద్ధజ్యోతి వెలిగించి హారతి ఇచ్చారు. అదేవిధంగా నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం పూర్వ విద్యార్థి, బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, ప్రశాంత్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, బుద్ధభూమి, బౌద్ధమాస పత్రిక అధ్యక్షుడు, ఎడిటర్ సీతారామయ్య, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించండి
భూదాన్పోచంపల్లి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అయితే వీటి నుంచే తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం 2024 జనవరి నెలాఖరుతో ముగిసింది. అప్పటి నుంచి తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల వరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకాధికారులుగా పంచాయతీల్లో పాలన కొనసాగింది. ఈ క్రమంలో పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చాలా పనులు పూర్తిచేసేందుకు తన సొంత డబ్బులను ఖర్చు చేశారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేశాక తీసుకుందామంటే సకాలంలో రాక నానా ఇబ్బందులు పడుతూ వచ్చారు. 2024–25లో రూ.7.60 కోట్లు ఖర్చు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 390 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, వీద్యుద్ధీపాలు, పైప్లైన్ మరమ్మతులు, ఇతర పనులకు సుమారు రూ.7.60 కోట్ల మేర ఖర్చు చేశారు. కాగా ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.7,59,29,667లను విడుదల చేసింది. దాంతో విడుదలైన నిధుల నుంచే బకాయిలను సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఇదిలా ఉంటే తాజా మాజీ సర్పంచులు సైతం తమ కూడా బకాయిలు రావాలని తాజాగా గ్రామ పంచాయతీల్లో జమ అయిన నిధుల నుంచి చెల్లించాలని అధికారులకు వినతిపత్రాలను అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం విడుదలైన నిధులు ఇటు కార్యదర్శులు, అటు మాజీ సర్పంచులు తమకంటూ తమకే ఇవ్వాలని పట్టుబట్టుతున్నారు. చివరికి ఉన్నతాధికారులు ఎవరికి ఎలా సర్దుబాటు చేస్తారో వేచిచూడాల్సిందే. నిబంధనలు ఇవీ.. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను టైడ్, అన్టైడ్ పేరిట విడుదల చేస్తుంది. టైడ్ నిధులను తాగునీరు, పైప్లైన్ మరమ్మతులు, క్లోరినేషన్, బోరు మోటార్ల నిర్వహణ, పారిశుద్ధ్యం పనులకు వినియోగించాల్సి ఉంటుంది. అన్టైడ్ నిధులను పంచాయతీ అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఒక్కో పంచాయతీ కార్యదర్శి గరిష్టంగా రూ.3 లక్షల మేర సొంతంగా చేతి నుంచి గ్రామాభిృద్ధికి ఖర్చు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం నుంచి తమ బకాయిలు చెల్లించాలని ఇటీవల డీపీఓను కలిసి విన్నవించాం. – నరేందర్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యం, తాగునీరు, పైప్లైన్ మరమ్మతులు తదితర పనులకు చేసిన ఖర్చులకు మాత్రమే చెల్లింపులు చేస్తాం. మొదటి ప్రాధాన్యతగా పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలి. మిగిలిన బడ్జెట్తోపాటు వచ్చే విడతలో మంజూరయ్యే నిధుల నుంచి బకాయిలు తీసుకొనేందుకు ఉత్తర్వులు ఇస్తాం. – విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిఫ ఉన్నతాధికారులకు పంచాయతీ కార్యదర్శుల విన్నపం ఫ గ్రామాల అభివృద్ధికి రూ.7.60 కోట్ల మేర సొంత డబ్బులు ఖర్చు ఫ బిల్లులు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన -
ఉగాది వేడుకలకు కవి బాల్రెడ్డికి ఆహ్వానం
నార్కట్పల్లి: మద్రాస్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న ఉగాది వేడుకలకు నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, కవి, రచయిత, పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డికి శుక్రవారం ఆహ్వానం వచ్చింది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా ఈ నెల 18న చైన్నెలోని మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా కవి సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలుగు కవులు, తెలుగు వారి సాంస్కృతిక వారసత్వం, ఉగాది విశిష్టతను తమ కవితా పఠనంతో వివరించనున్నారు. బైక్ చెట్టును ఢీకొని వ్యక్తి మృతిభువనగిరి: మండల పరిధిలోని పగిడిపల్లి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని హన్మాన్వాడ్కు చెందిన మోతె శ్రీరాములు(38) బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో బంధువుల ఇంటికి బైక్పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి భువనగిరికి బయలుదేరాడు. భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న చెట్టును అదుపుతప్పి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. అవయవదానంతో నలుగురికి పునర్జన్మకేతేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి బ్రెయిన్డెడ్ కావడంతో అతడి అవయవాలను కుటుంబసభ్యులు జీవన్దాన్ సంస్థకు అప్పగించారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామానికి చెందిన శివాలయ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కంచర్ల జగన్మోహన్రెడ్డి(57) ఈనెల 10న బైక్పై నల్లగొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో తాటికల్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోధ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జగన్మోహన్రెడ్డి బతికే అవకాశం లేదని, బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఈమేరకు ఆయన కుటుంబ సభ్యులకు అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. వైద్యుల సూచనల మేరకు జగన్మోహన్రెడ్డి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు గురువారం రాత్రి ఆస్పత్రికి చేరుకుని అవయవాలను సేకరించారు. శుక్రవారం జగన్మోహన్రెడ్డి మృతదేహాన్ని ఇనుపాముల గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
టెన్త్ పరీక్షలకు 50 కేంద్రాలు
సాక్షి, యాదాద్రి : పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఈ సారి అనుమతిస్తారు. ఐదు నిమిషాలు దాటితే పరీక్ష రాయడానికి అనుమతించరు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఉదయం 9గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానికి పరికరాలను అనుమతించరు. మొత్తం 8,913 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు జరుగుతాయి. కేంద్రాల వద్ద 163 సెక్షన్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అలజడి జరుగకుండా బీఎన్ఎస్ 163 సెక్షన్ విధించారు. సీసీ కెమెరాల నిఘాలో కేంద్రాలు ఉంటాయి. పరీక్షా సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక సూపరింటెండెంట్ ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సూపరింటెండెంట్ చొప్పున మొత్తం 50 మంది సూపరింటెండెంట్లు, 50 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 572 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా అడిషనల్ షీట్స్ కాకుండా 24 పేజీలు, 12 పేజీలతో కూడిన బుక్లెట్స్ను విద్యార్థులకు ఇస్తారు. సౌకర్యాలు ఇలా.. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల కోసం ఓఆర్ఎస్ ద్రావణం ఇతర అనారోగ్య కారణాలకు చికిత్స దించడానికి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎంలను నియమించారు. కేంద్రాల్లో విద్యుత్, ఫర్నిచర్, చల్లని నీరు, మరుగుదొడ్లు వసతులు ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వాటి పరిష్కారానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం 9010772080ను టోల్ప్రీ నంబర్ను అధికారులు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాతంగా పరీక్షలు రాయాలి. గతేడాది కంటే ఈసారి మెరుగైన ఫలితాల సాధనకు పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించాం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తాం. –కె.సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ఫ పరీక్షలు రాయనున్న 8,913 మంది విద్యార్థులు ఫ ఫిర్యాదుల పరిష్కారానికి టోల్ప్రీ నంబర్ 9010772080 ఏర్పాటు -
గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదు
భువనగిరిటౌన్ : జిల్లాల్లో గృహ అవసరాలకు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా యంత్రాంగాలతో వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం భువనగిరి కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ అక్షాంక్షశ్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ఎల్పీజీ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా ప్రజలకు గ్యాస్ కొరత రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని, పలు చోట్ల దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 49 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. గృహవసరాలకు, ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులకు సిలిండర్ కొరత రాకుండా చూసుకోవాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు. వాణిజ్య సిలిండర్లకు కొంత ఇబ్బంది ఉంది తప్ప, గృహవసరాలకు ఎలాంటి కొరత లేనందున ప్రజలు ఆందోళన చెంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవద్దన్నారు. జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫిర్యాదులకు సెల్ 9281423623 నంబర్ సంప్రదించవచ్చన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మ్యాపింగ్ ప్రక్రియ సమగ్రంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, సివిల్ సప్లయ్ అధికారి రోజారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ కృష్ణ అధికారులు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం
చౌటుప్పల్ : ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారుల విఫలమయ్యారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. చౌటుప్పల్లో శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా ప్రాంతీయ సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, కె.నర్సింహ, ఎం.బాలరాజు, కృష్ణారెడ్డి, జి.శ్రీనివాసచారి, పెంటయ్య, పాషా, సైదులు, కరుణాకర్, కిష్టయ్య, నర్సిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, స్వామి, బి.నర్సింహ, సంజీవరెడ్డి, అంజిరెడ్డి, మధుకృష్ణ పాల్గొన్నారు. -
భూగర్భ జలాలను సంరక్షించాలి
భువనగిరిటౌన్ : భూగర్భజలాలను సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు తగినన్ని నీటి వనరులు అందుబాటులో ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. భూగర్భ జలాల సంరక్షణపై శుక్రవారం భువనగిరి కలెక్టర్లో కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకుడు గుంతలు, నీటి కుంటల ద్వారా భూగర్భ జలాలను పెంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్డీఓ నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీజీడబ్ల్యూ రీజినల్ డైరెక్టర్ జ్యోతికుమార్ మాట్లాడుతూ సాంకేతిక పద్ధతుల ద్వారా భూగర్భ జల సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు. జిల్లా భూగర్భ జల అధికారి జ్యోతికుమార్ మాట్లాడుతూ భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం భూగర్భ జలమండలి ఆధ్వర్యంలో ముద్రించిన నకీమ్ రిపోర్ట్, జిల్లా రీచార్జ్ మ్యాప్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీజీడబ్ల్యూ శాస్త్రవేత్త యాదయ్య, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, సుధీర్కుమార్, మాధవ్, సరిత, రేష్మ పిల్లాయి, సర్ధాజ్ భాషా, అధికారులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
తగ్గిన నీరు.. ఎండిన పైరు
ఆత్మకూర్ (ఎస్) : మండల వ్యాప్తంగా కరెంటు కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు తగ్గడంతో పాటు ఎస్సారెస్పీ కాలువ నీరు సరిగ్గా రాకపోవడం పంటలను ఎండుముఖం పట్టేలా చేసింది. పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు తగ్గడం, కరెంటు కష్టాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూర్లోని ఏనుబాముల రోడ్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పంటను కాపాడునేందుకు రైతు జనరేటర్ సాయంతో పంటకు నీళ్లు పెడుతున్నాడు. మరికొన్ని చోట్ల గత్యంతరం లేక పండించిన వరిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆత్మకూర్.ఎస్ మండలంలో సుమారు 10వేల ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదంలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్లతో నీరు మునుగోడు : వరి పంట చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యాసంగి సీజన్ ఆరంభంలో పుష్కలంగా నీరు పోసిన బోర్లు.. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు పడిపోవడంతో నీరు అడుగంటింది. పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకోవడానికి వేల రూపాయలు ఖర్చుచేసి ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి పొలాలకు పెట్టే పరిస్థితి ఎదురవుతోంది. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులకు కోలుకోలేని దెబ్బగా మారింది. గ్రామంలో దాదాపు 50 మందికిపైగా రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి వరి పొలాలకు అందిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా రైతులకు సరిపడా ట్యాంకర్లు దొరకకపోవడంతో ఇతర గ్రామాల నుంచి తీసుకొస్తున్నారు. నిత్యం పదికి పైగా ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఫ పంటను కాపాడుకునేందుకు రైతుల అష్టకష్టాలు ఫ ట్యాంకర్లతో నీటి సరఫరా ఫ కరెంటు కష్టాలు కూడా తోడవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు -
ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా అధికారులకు శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంలో ఈనె 16న సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. చేనేతకు రూ.4 వేల కోట్లు కేటాయించాలిమోత్కూరు : చేనేత, పవర్ లూమ్ పరిశ్రమకు వేర్వేరుగా రూ.2 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.4వేల కోట్ల నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ త్రిప్టు పథకంలో కార్మికుడికి రూ.1,200, అనుబంధ కార్మికుడికి రూ.800 రికరింగ్ డిపాజిట్ చేస్తే ప్రభుత్వం వాటా కింద చేయాల్సిన డిపాజిట్ను తొమ్మిది నెలలుగా చేయలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారివెంట చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముశం నరహరి, ఉపాధ్యక్షుడు వడకాల చంద్రశేఖర్ ఉన్నారు. ఇందిరమ్మ గృహం.. నిరుపేదలకు వరంయాదగిరిగుట్ట రూరల్ : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక వరంలాంటిదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం చొల్లేరు, వంగపల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ గృహాల ప్రవేశాలకు ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులకు పట్టువస్త్రాలు, పొట్టేలును కానుకగా అందజేసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన హామీల ప్రకారం గూడులేని వారికి ఇళ్లు కట్టించి వారి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచులు చిన్నం మమత, వగ్గు రవళి , కానుగు బాల్రాజ్, చిన్నం శ్రీను, కానుగు రాజీవ్, గుర్రం బాలస్వామి, చిన్నం మల్లేష్, కొక్కలకొండ అరుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రానికి గ్యాస్ ఇబ్బంది లేదు – ఆలయ ఈఓ భవాని శంకర్ యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆలయ ఈఓ భవాని శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత దేవస్థానానికి లేకుండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు లేఖ రాసి సంప్రదించామని పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గ్యాస్ ఏజెన్సీ అధికారులు నెలకు సరిపడా గ్యాస్ సిలిండర్లను అందించారని తెలిపారు. దేవాలయానికి సుమారు 425 కిలోలవి ప్రతినెలా 12 సిలిండర్లు, 19 కిలోలవి 250 సిలిండర్లు అవసరం పడుతున్నాయని, వీటిని అన్న ప్రసాదం, ప్రసాదాల తయారీ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ నిల్వలో ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు. -
పట్టు పరిశ్రమలో తెలంగాణది నాలుగో స్థానం
భూదాన్పోచంపల్లి : పట్టు పరిశ్రమ అభివృద్ధిలో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని సెంట్రల్ సిల్క్ బోర్డు (మైసూర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ దయానంద అన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో రీజినల్ సిల్క్ పరిశోధనా కేంద్రం, తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టు రైతులు, రీలర్లు, చేనేత కార్మికుల సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి శ్రీపట్టు కృషి మేళా–2026శ్రీను పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్థన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పట్టు పరిశ్రమ అభివృద్ధిలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. ఇతర పంటలతో పోల్చితే పట్టు పరిశ్రమ ఎంతో లాభదాయకంగా ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు 75 శాతం నుంచి 85 శాతం మేర రాయితీలు ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో 7వేల మంది పట్టు రైతులు 15వేల ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారని చెప్పారు. పద్మశ్రీ గజం అంజయ్య మాట్లాడుతూ.. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టు ఉత్పత్తి పెంచి ఆఽర్థికంగా లాభపడాలన్నారు. కాగా.. మేళాలో పట్టు ఉత్పత్తులు, మల్బరీతోటకు పిచికారీ మందులు తదితర స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పట్టు పరిశోధనా కేంద్రం మైసూర్ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ జయషిరాణి, మల్లికార్జున, సెంట్రల్ సిల్క్ బోర్డు రీజినల్ సిల్క్ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్యాదవ్, రాష్ట్ర జాయింట్ డైరెక్టర్లు ఎం. లత, అనసూయ, శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, జిల్లా సెరికల్చర్ అధికారిణి మాధవి, శ్రీరంజన్ సిల్క్ యూనిట్ నిర్వాహకుడు ఎన్నం శివకుమార్, టైఅండ్ డై సిల్క్ చీరెల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, భారత భూషణ్, రాజేశ్వరీ, చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ సెంట్రల్ సిల్క్బోర్డు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దయానంద -
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం
కోదాడరూరల్ : ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని రామిరెడ్డిపాలెం రోడ్డు క్రాసింగ్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని బాలాజీనగర్కు చెందిన అజ్మీర యశ్వంత్ అలియాస్ సన్నీ(14), గుండెపంగు రాకేష్ స్నేహితులు. చదువు మధ్యలో ఆపేసి ఇంటివద్దే ఉంటున్నారు. ఇద్దరు కలిసి లారీ ఆఫీస్ సమీపంలోని ఓ హోటల్లో భోజనం కోసం వెళ్లి పార్శిల్ తీసుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కోదాడ నుంచి కొరబండవైపు వెళ్తున్న డీసీఎం వీరి బైక్ను ఢీకొట్టింది. యశ్వంత్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేష్కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. ఫ యువకుడు మృతి, మరొకరికి గాయాలు -
వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మహిళ భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులను నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవాన్ని నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు పూజలు, నిత్యకల్యాణాన్ని విశేషంగా జరిపించారు. సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. -
స్ప్రేయర్ల ఎంపికలో జాగ్రత్త.. దిగుబడిలో రక్షణ
పెద్దవూర: ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల కు పురుగులు, తెగుళ్లు ఆశి స్తున్నాయి. దీంతో రైతులకు పంటలపై ఒకటికి రెండుసార్లు క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం పరిపాటిగా మారింది. పిచికారీ చేసేందుకు అవసరమైన స్ప్రేయర్లను సరిగ్గా ఎంపిక చేసుకోకపోతే రసాయనాలు వృథా కావడంతో పాటు పిచికారీ చేసే వ్యక్తి శరీరంపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల స్ప్రేయర్లకు సంబంధించి పెద్దవూర మండల వ్యవసాయ అధికారి పి.సందీప్కుమార్ వివరించారు. తైవాన్ పవర్ స్ప్రేయర్.. ఇటీవల అన్ని రకాల పంటలకు తైవాన్ పవర్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. దీని ఖరీదు కంపెనీలను బట్టి రూ.20వేల వరకు ఉంటుంది. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో వెదజల్లే సామర్థ్యం దీనికి ఉంది. ఇతర వాటితో పోల్చితే దీనిలో సస్యరక్షణ మందులు మూడు వంతులు అధికంగా పోయాల్సి ఉంటుంది. రోజుకు సగటున 8 నుంచి 10 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చు. దీనికి అమర్చిన బెల్డ్ ద్వారా భుజాల వెనుక సులభంగా తగిలించుకోవచ్చు. ఈ పవర్ స్ప్రేయర్ చదరపు సెంటీమీటర్కు 30–35 కిలోల ఒత్తిడిని కలగజేస్తుంది. ధ్వని కాలుష్యం కూడా తక్కువ. ఒకేసారి 20 అడుగుల వెడల్పుతో పిచికారీ చేయొచ్చు. ఇంజిన్ పనిచేయడానికి గంటకు లీటర్ పెట్రోల్ అవసరం అవుతుంది. లీటర్ పెట్రోల్ ఆరు ఎకరాలకు సరిపోతుంది. నిమిషానికి 7.2 లీటర్ల మందును చల్లవచ్చు. బరువు తొమ్మిది కిలోలు. దీనిలో 20 లీటర్ల రసాయం ద్రావణం, 900 మి.లీ.ల పెట్రోల్ పడుతుంది. ఇటీవల వచ్చిన ఆధునాతన పవర్ స్ప్రేయర్లతో ఒక వ్యక్తి మందు ద్రావణ డబ్బాను భుజానికి తగిలించుకుంటే , రెండు వైపులా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో రసాయన మందును పిచికారీ చేసే పరిస్థితి వచ్చింది. నాప్సాక్ స్ప్రేయర్ దీని బరువు తక్కువగా ఉండేందుకు పాలిథీన్తో తయారు చేస్తారు, స్ప్రేయర్ ట్యాంకు పరిమాణం 15–16 లీటర్లు. దీనికి ఉన్న బెల్టుల ద్వారా భుజాల వెనక సులువుగా తగిలించుకోవచ్చు. పంట అన్ని దశల్లో మందు పిచికారీకి స్ప్రేయర్ సులువుగా ఉపయోగపడుతుంది. ధర రెండు వేల లోపే ఉంటుంది. ట్యాంకు లోపలి భాగాన పంపు, గాలి గది, పైభాగాన ఒక రంధ్రానికి ప్లాస్టిక్ గొట్టం బిగించబడి ఉంటుంది. రెండో చివర నాజిల్ ఉంటుంది. ట్యాంకులో అమర్చబడిన పిస్టన్ పైకి కిందకు కదలడం వలన ద్రావణంపై ఒత్తిడి ఏర్పడి రబ్బరు గొట్టం ద్వారా నాజిల్ ద్వారా బయటకు వెలువడుతుంది. పిస్టన్ కదిలించటానికి హ్యాండిల్ ఉంటుంది. దీనితో రసాయన ద్రావణం అంతటా సమంగా పడుతుంది. ఫుట్ స్ప్రేయర్ ఇది కాళ్లతో పనిచేస్తుంది. మినుము, పెసర వంటి పంటలతో పాటు కూరగాయ తోటలు, మామిడి, బత్తాయి వంటి పండ్లతోటల్లో సస్యరక్షణ మందులను పిచికారీ చేయొచ్చు. రోజుకు రెండు ఎకరాల్లో, పండ్ల తోటల్లో సగటున రోజుకు 150 చెట్లకు పిచికారీ చేయొచ్చు. ధర రూ.4వేల లోపే ఉంటుంది. ఇత్తడితో తయారైన ఫుట్ స్ప్రేయర్లో ప్రధానంగా చిన్న బ్యారల్, కదిలే పిస్టన్ ఉంటుంది. బ్యారల్ అడుగుభాగానికి ప్లాస్టిక్ గొట్టం కలపబడి ఉంటుంది. రెండో చివరన ఫిల్టర్ గరాటు బిగించబడి ఒక పాత్రలోని రసాయన ద్రావణంలో మునిగి ఉంటుంది. పెడల్ను కాళ్లతో తొక్కినప్పుడు పిస్టన్ బ్యారల్లో పైకి కిందికి కదలడంతో ద్రావణం బ్యారల్ పైభాగానికి చేరి అక్కడి నుంచి గాలి గది ద్వారా రెండో గొట్టం చివర ఉన్న నాజిల్ గుండా బయటకు వెళ్తుంది. దీనిలో చదరపు సెంటీమీటర్కు 8 నుంచి 13 కిలోల ఒత్తిడి తీసుకురావచ్చు. అధిక ఒత్తిడి వలన ఎత్తుగా ఉన్న మామిడి చెట్లకు సులభంగా పిచికారీ చేయొచ్చు. ఫ వాతావరణ మార్పులతో పంటలకు తెగుళ్లు ఫ సరైంది ఎంచుకోకపోతే రసాయనం వృథా -
చెరువులో పడి యువకుడు మృతి
మోతె: కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన బుడ్డిపుడి రాములు – రాణి దంపతుల కుమారుడు బుడ్డిపుడి వెంకటేష్ (26) మోతె మండలం మామిళ్లగూడెం గ్రామంలోని తన అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బహిర్భూమికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువు నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న ఓ పిల్లవాడు కేకలు వేస్తూ గ్రామానికి వెళ్లి సమాచారం అందించాడు. బంధువులు చెరువు వద్దకు చేరుకుని వెంకటేశ్ను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్వలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంనిడమనూరు: సాగర్ ఎడమకాల్వలో గల్లంతైన మేకల కాపరి గంధం ఎల్లయ్య(54) మృతదేహం శుక్రవారం సాయంత్రం లభ్యమైంది. నిడమనూరు శివారులో బుధవారం సాగర్ ఎడమకాల్వలో మేకల కాపరి గంధం ఎల్లయ్య ప్రమాదవశాత్తు పడి గల్లంతు కాగా అతడి మృతదేహం శుక్రవారం ముకుందాపురం వద్ద లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు నిడమనూరు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పొలానికి వెళ్లిన వ్యక్తి వాగులో పడి మృతి మిర్యాలగూడ అర్బన్: పాలేరు వాగులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య(55) పాలేరు వాగు అవతల ఉన్న తన పొలానికి ప్రతి రోజు పాలేరువాగు దాటి వెళ్తుంటాడు. రోజుమాదిరిగా ఈ నెల 12న మధ్యాహ్నం 12గంటల సమయంలో పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పాలేరు వాగు వెంట వెతకగా శుక్రవారం తెల్లవారుజామున అతడి మృతదేహం లభ్యమైంది. ఈ విషయంపై మృతుడి కుమారుడు అనంతుల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. -
నిషేధిత జాబితా నుంచి ఇళ్లను తొలగించాలి
ఆలేరు రూరల్ : మండల వ్యాప్తంగా నిషేధిత జాబితాల్లో చేర్చిన పేదల ఇళ్లు, భూములను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని తహసీల్ధార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. మండలంలో 1,600లకుపైగా ఇళ్లు, భూములు నిషేధిత జాబితాల్లో చేర్చడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఇదే సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిషేధిత జాబితాలో చేరిన ఇళ్ల బాధిత మహిళలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది పేదల ఇళ్లు కూల్చుకోవడానికేనా అని ప్రశించారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే సమాదానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్, గ్యాదపాక నాగరాజు, కుండె సంపత్, కందుల శంకర్, రామ్నర్సయ్య, ఆరుట్ల లక్ష్మిప్రసాద్రెడ్డి, శోభన్బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తల, ఇళ్లు, భూముల బాధితులు, మహిళలు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత -
కారు ఢీకొని పోస్టుమెన్ దుర్మరణం
సంస్థాన్ నారాయణపురం: ఉత్తరాలను బట్వాడా చేసేందుకు పోస్టుమెన్ బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈసంఘటన సంస్థాన్నారాయణపురం మండలం దేవిరెడ్డిబంగ్లా వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వేల్ గ్రామ పోస్టుమెన్గా బూస వెంకటేశ్వర్లు గుప్త(60) పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ఉదయం దేవిరెడ్డిబంగ్లా గ్రామంలో ఉత్తరాలు బట్వాడా చేసి, తిరిగి ఎర్రగుంట గ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. ఈక్రమంలో హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వేగంగా వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు గుప్త అక్కడికక్కడే మృతి చెందాడు. కుంటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్ తెలిపారు. కాగా.. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
భూదాన్పోచంపల్లి: మహిళా చేనేత కార్మికులు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థిక స్వాలంబన సాధించాలని యునైటెడ్ నేషన్–ఉమెన్ సంస్థ (ఢిల్లీ) ప్రతినిధి షిరిన్ అన్నారు. భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్కులో నాలుగు రోజులుగా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ సహకారంతో మహిళా చేనేత కార్మికులకు శ్రీజన్ పేరిట నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరున్నా, ఆ బ్రాండ్ ఇమేజ్ను వినియోగించుకొని సరైన మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు మార్కెటింగ్ రంగంలో రాణించాలంటే వారికి శిక్షణ ఎంతో అవసరం అని అన్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు సొంతంగా వెబ్సైట్ రూపొందించుకొని నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు. తమ ఉత్పత్తులను ఏ విధంగా ప్రమోట్ చేయాలి, కొత్త డిజైన్ల రూపకల్పన, మార్కెటింగ్ తదితర అంశాలపై శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పించామన్నారు. అలాగే ఎంపిక చేసిన ఐదుగురు మహిళా చేనేత కార్మికులకు ఢిల్లీలో జాతీయస్థాయిలో మరింత శిక్షణ ఇచ్చి వ్యాపారవేత్తలుగా రాణించే విధంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జార్ఖండ్, వారణాసి, ఓడిశా, అహ్మదాబాద్లో మహిళలకు శిక్షణ ఇచ్చామన్నారు. త్వరలో పోచంపల్లి కేంద్రంగా చేనేత కార్మిక మహిళలకు ప్రత్యేకంగా చేనేత డిజైన్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ అవార్డు గ్రహీతలు భోగ సరస్వతీబాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, మహిళా చేనేత కార్మికులు పాల్గొన్నారు. -
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోహెన్ ఫార్మా కంపెనీలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీకై ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో నాగరాజు, అంజయ్య, వినోద్, లక్ష్మయ్య అనే నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయంపై కంపెనీ యాజమాన్యం బయటకు రానివ్వడం లేదని కంపెనీ ఎదుట సమీప ప్రాంతాల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కాలుష్యంతో సమీప ప్రాంతాల వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శ్వాస సంబంధ వ్యాధులతో తరచూ అనారోగ్యం పాలవుతున్నామన్నారు. కంపెనీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫ నలుగురు కార్మికులకు ఆస్వస్థత -
ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన సులువు
భూదాన్పోచంపల్లి : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తేనే తాము ఎంచుకొన్న లక్ష్యాన్ని సాధిస్తారని ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ అన్నారు. భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కన్ఫ్లూఝెన్స్–2026 వేడుకల్లో భాగంగా గురువారం రెండో రోజు విద్యార్థులకు స్పోర్ట్స్, అథ్లెటిక్స్, డ్యాన్స్, పాటలు, కవి సమ్మేళనం పోటీలతో పాటు ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా సుచిత్ర చంద్రబోస్తో పాటు ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్, సినీ గాయని గీతామాధురి, సినీ గేయరచయిత అనంత్ శ్రీరాం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గడ్డం మోహన్రావు వ్యవహరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సుచిత్ర చంద్రబోస్ మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్నవారు ఏ రంగంలోనైనా రాణించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థులు క్షణికావేశంలో తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంగా మార్చుకోవద్దని సూచించారు. యాంకర్ రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాలని అన్నారు. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం మాట్లాడుతూ.. మహిళలు శక్తి స్వరూపిణి అని, వారికి సాధించే సామర్థ్యం ఉంటుందని అన్నారు. సింగర్ గీతామాధురి మాట్లాడుతూ.. చదువును మించిన ఆయుధం మరొకటి లేదని అన్నారు. ఆశ, ఆశయం ఉంటే విజయం మనదే అని పేర్కొన్నారు. సినిమాలను ఎంటర్టైన్మెంట్గానే చూడాలి తప్ప నిజజీవితానికి అన్వయించుకోద్దని సూచించారు. అనంతరం వారిని కళాశాల నిర్వాహకులు శాలువాలు కప్పి మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ విద్యాలయాల జాయింట్ సెక్రటరీ వీఎస్ఆర్ శర్మ, మల్టీజోనల్ అధికారి రజిని, స్టేట్ ఆఫీసర్ నిర్మల, జోనల్ అధికారిణి విద్యాంజలి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీలత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, అధ్యాపకులు, అధ్యాపకయేతర బృందం పాల్గొన్నారు. మాట్లాడుతున్న యాంకర్ రష్మి గౌతమ్మాట్లాడుతున్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాంవిద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న గాయని గీతామాధురిఫ సినీ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ ఫ దేశ్ముఖిలోని సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాలలో స్పోర్ట్స్, కల్చరల్ మీట్ ఫ న్యాయ నిర్ణేతలుగా హాజరైన సినీ ప్రముఖులు -
బుకింగ్ టెన్షన్
భువనగిరిటౌన్ : ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ కోసం బుకింగ్ చేసుకుందామంటే సాంకేతిక కారణాలతో కావడంలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 8 నుంచి 10 రెట్లు అధికంగా కాల్స్ రావడంతో సర్వర్లపై విపరీతమైన భారం పడి సిస్టమ్ క్రాష్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి తోడు గృహ వినియోగ సిలిండర్ల సరఫరా ఏకంగా 50 శాతం మేర తగ్గిపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులుదీరుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం కనీస నిరీక్షణ సమయాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అయితే, చివరి డెలివరీ తర్వాత 25 రోజులు పూర్తి కాకముందే బుక్ చేయడానికి ప్రయత్నించే కస్టమర్లను నిరోధించే వ్యవస్థ టెలికం నెట్వర్క్ స్థాయిలో లేకపోవడంలో, ప్రతి కాల్ ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్ అప్లికేషన్లకు చేరుతోంది. ఈ అసాధారణ ట్రాఫిక్ వల్ల మొత్తం నెట్వర్క్ స్తంభించిపోయింది. ఫలితంగా ఫోన్ కాల్స్ కలవక, సిలిండర్లు అందక జనం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. 50శాతం తగ్గిన సరఫరా.. పెరిగిన డిమాండ్ గ్యాస్ పంపిణీదారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. సరఫరా సగానికి పడిపోగా, డిమాండ్ మాత్రం 50 శాతం పెరిగింది. బుకింగ్ కావట్లేదని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు వస్తున్న జనం, అక్కడ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. గతంలో ఒకట్రెండు రోజుల్లో వచ్చే సిలిండర్, ఇప్పుడు వారం దాటినా రాకపోవడంతో సామాన్యులు గోదాముల వద్దకు వెళ్లి నేరుగా సిలిండర్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు
కట్టంగూర్ : ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు జరిగిందని జల సంచయ్–జల భగీరథ ఇంపాక్ట్ స్టడీ కేంద్ర బృందం సభ్యులు నవనీత, రాచీ గార్గ్, ప్రతీక్ కోర్డే అన్నారు. గురువారం వారు నకిరేకల్ క్లస్టర్ ఏపీడీ నర్సింహారావు, ఏపీఓ కడెం రాంమోహన్తో కలిసి కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, కల్మెర, పరడ, కట్టంగూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులను పరిశీలించారు. సోక్పిట్, అమృత్ సరోవర్, ఓవర్హెడ్ ట్యాంకు, చెక్ డ్యాం, ఫాంపాండ్, చేపల చెరువు పనులను పరిశీలించి వాటి ప్రయోజనాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. నీటి నిల్వ పనులతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు చేకూరిందన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. వారి వెంట ఆయా గ్రామాల సర్పంచులు ముక్కాముల శ్యామలశేఖర్, తోటకూరి జలజ, కొలిపాక సురేందర్, ఇప్పలపల్లి అనిత, ఈసీ శ్రీధర్, టీఏ రమణ, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఫ జల సంచయ్–జల భగీరథ ఇంపాక్ట్ స్టడీ బృందం ఫ కట్టంగూర్ మండలంలో ఉపాధి హామీ పనుల పరిశీలన -
రసవత్తరంగా నాటక పోటీలు
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటక పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. గురువారం నాలుగో రోజు పోటీలను ప్రముఖ పారిశ్రామికవేత్తలు కర్నాటి రమేష్, బండారు కుశలయ్య, గొల్ల రామశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాటక రంగంలో మిర్యాలగూడ ఖ్యాతిని ఢిల్లీ వరకు చాటిన స్థానిక కళాకారుల కృషి అభినందనీయమని కొనియాడారు. అనంతరం విజయవాడ హర్ష క్రియేషన్స్ వారి చెరిగిపోని చిరునామా, విశాఖపట్నం నటరాజ డ్రమాటిక్ అసోసియేషన్ వారి నీళ్లు నీళ్లు, వరంగల్ మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వారి వివాహ బంధం నాటికలు ప్రేక్షకులను అలరించాయి. కళాకారులకు ప్రశంసా పత్రాలు, షీల్డులు అందజేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామవతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
మేకల అపహరణ
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన దొండ లింగమల్లుయాదవ్కు చెందిన 5 మేకలను గు రువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్య క్తులు అపహరించారు. దీంతో బాధితుడు మో త్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని మోత్కూరు సీఐ సి. వెంకటేశ్వర్లు తెలిపారు. చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. ఒకరు మృతికట్టంగూర్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం కల్మెర గ్రామ శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి యాదయ్య(59) గురువారం ఉదయం కట్టంగూర్లో ఉంటున్న తన కుమార్తె వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కల్మెర గ్రామ శివా రులోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. యాదయ్యను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. భార్యను వేధించిన వ్యక్తికి జైలు శిక్షరామగిరి(నల్లగొండ): భార్యను వేధించిన భర్తకు నల్లగొండ ప్రత్యేక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నేరాలు కోర్టు న్యాయమూర్తి దారా సాయిమేఘన రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన గిరిగాని వేణుకు నల్లగొండకు చెందిన మహిళతో వివాహమైంది. వేణు తన భార్యను వేధిస్తుండడంతో ఆమె నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్లో 2015లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసి వేణును కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా పబ్లిక్ ప్రొసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి నిందితుడికి రెండేళ్లు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బైక్ను ఢీకొట్టిన కారుఫ ఒకరికి గాయాలు అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు ఫ ప్రయాణికులు సురక్షితం మునగాల:హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మునగాల మండల కేంద్రం శివారులో గురువారం తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు అతివేగంతో వెళ్తున్న ఒక్కసారిగా బస్సు అదుపుతప్పడంతో డ్రైవర్ అప్రమత్తమై కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. -
పరీక్షల వేళ.. ఆరోగ్యం భద్రం
పరీక్షల వేళ ఉదయం అల్పాహారం తీసుకోవడం మంచిది. రోజూ సమయానికి భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం మితంగా భోజనం మాత్రమే తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం. కనీసం 15 నిమిషాలు నడవడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యంగా ఉంటారు. – మల్లెల వందన, వైద్యాధికారిణి తిరుమలగిరి (తుంగతుర్తి) : పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే పరీక్షల భయంతో విద్యార్థులు హైరానా పడుతుంటారు. తిండి సరిగా తినరు. సమయానికి నిద్రపోరు. ఈ సమయంలో పరీక్షలకు సన్నద్ధమయ్యే పిల్లల ఆహారంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం అందిస్తూ మనస్సుకు ప్రశాంతత చేకూరే వాతావరణం కల్పిస్తే ఒత్తిడిని అధిగమిస్తారని చెబుతున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులైతే పరీక్షల సమయంలో బరువు తగ్గిపోతున్నారని, పరీక్షలకు ఎంత కష్టపడి సన్నద్ధమవుతుంటారో అదే స్థాయిలో ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన ఆహారం తీసుకోని విద్యార్థుల్లో ఎక్కువ చిరాకు, జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుందని విద్య, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకోండి ఇలా.. అల్పాహారం : ఉదయం అల్పాహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఇవి మెదడుకు అదనపు శక్తిని ఇస్తాయి. ● పొట్టుతో కూడిన పదార్థాలతో తయారుచేసిన ఇడ్లీ, పెసరట్టు, గోధుమ ఉప్మా, బ్రౌన్ బ్రెడ్, జొన్న రొట్టె వంటివి తీసుకోవడం మంచిది. వీటితో పాటు గ్లాసు పాలు, పండ్లు తీసుకోవడం మంచిది. ● పీచు పదార్థాలు, కెరోటిన్ వంటి ఇతర ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆపిల్, నారింజ, క్యారెట్ మొక్కలు, బాదం, పిస్తాలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం : మధ్యాహ్నం అన్నం, గోధుమ రొట్టెలతో పాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం(పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు) తీసుకోవాలి. వాటిలో ఏకాగ్రత పెంచడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ● అంతేకాకుండా పెరుగు, మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి భోజనం : రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పప్పు ధాన్యాలతో పాటు కోడిగుడ్డు తీసుకోవడం ఉత్తమం. రాత్రి 10 గంటల వరకు చదివి పాలు తాగి పడుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా రోజూ తగినంత నీటిని తాగాలి. ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. నిద్ర ఎంతో ముఖ్యం పరీక్షల వేళ కొంతమంది విద్యార్థులు సమయానికి నిద్రపోరు. రాత్రంతా మేల్కోని చదువుతుంటారు. సరైన ఆహారం తినరు. ఇలా కొన్నిరోజులు అలవాటైతే తిండిపై ధ్యాస తగ్గిపోతుంది. ఎక్కువగా టీ, కాఫీలు తాగుతూ రాత్రంతా మేలుకొని ఉండటం వల్ల ఆకలి మందగిస్తుంది. దీంతో నిద్ర లేమికి గురవుతుంటారు. ఒత్తిడి అధిగమించేందుకు, జ్ఞాపకశక్తిని కలిగి ఉండేందుకు ఆహార పదార్థాలు తిన్న అరగంట వరకు మెదడుపై ప్రభావం ఉంటాయి. వీలైనంత వరకు బయటి ఫుడ్ తీసుకోకపోవడం ఉత్తమం. ఫ విద్యార్థులకు తల్లిదండ్రులు సమతుల ఆహారం ఇవ్వాలి ఫ సమయానికి నిద్ర తప్పనిసరి అంటున్న వైద్య నిపుణులు -
ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
భువనగిరి: జిల్లాలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షలు గురువారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్–1 పరీక్ష జరిగింది. ఆయా పరీక్షలకు మొత్తం 6,642 మంది విద్యార్థులకు గాను 6,359 మంది హాజరు కాగా 282 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షల ముగింపు రోజు కావడంతో విద్యార్థులు ఒకరినొకరి బైబై చెప్పుకుంటూ స్వగ్రామాలకు వెళ్లారు. -
పడవ మీద పడి వ్యక్తి మృతి
గరిడేపల్లి : లారీలో తరలిస్తున్న పడవ రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ స్తంభానికి తగిలి బైక్పై వెళ్తున్న వ్యక్తిపై పడడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం బెట్టితండా గ్రామానికి చెందిన మాలోతు లక్ష్మ(37) గురువారం కేసు విచారణ నిమిత్తం బైక్పై హుజూర్నగర్ కోర్టుకు బయల్దేరాడు. అదే సమయంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కాప శ్రీనివాస్ రాజమండ్రి నుంచి పడవను లారీలో సుంకేసుల డ్యాం వద్దకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గరిడేపల్లి మండల కేంద్రంలోకి రాగానే లారీపై ఉన్న పడవ రోడ్డు మధ్యలోని సెంట్రల్ లైటింగ్ స్తంభానికి తగలి రోడ్డుకు అటువైపు బైక్పై వెళ్తున్న మాలోతు లక్ష్మ తలపై పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఫ లారీలో పడవ తరలిస్తుండగా స్తంభానికి తగిలి మీదపడటంతో ఘటన -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
నల్లగొండ: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన గురువారం నల్లగొండ పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన బొజ్జ దేవకమ్మ(62) పని నిమిత్తం గురువారం నల్లగొండకు వచ్చింది. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు గాను బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి నల్లగొండ బస్టాండ్లోకి వస్తూ సుభాష్ విగ్రహం వద్ద దేవకమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమార్తె పబ్బతిరెడ్డి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. కోర్టులో స్పృహతప్పి పడిపోయిన వ్యక్తిరామగిరి(నల్లగొండ): నల్లగొండ కోర్టులో గురువారం ఓ వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. వలిగొండ మండలం అర్రూర్ గ్రామానికి చెందిన బండారు నర్సింహారెడ్డి కేసు నిమిత్తం నల్లగొండ జిల్లా కోర్టుకు వచ్చాడు. ఉన్నట్టుండి అతడికి చెమటలు పట్టి ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు కోర్టులో ఉన్న డిస్పెన్సరీకి తీసుకెళ్లి ఈసీజీ తీయగా హార్ట్ఎటాక్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో 108 వాహనంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
హోటళ్లకు గ్యాస్ తంటా
యాదగిరిగుట్ట: పశ్చిమాసియాలో యుద్ధప్రభావం మనప్రాంతంలో వంటగ్యాస్ సరఫరాపై పడింది. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అప్రమత్తమైన ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ల కోసం బుకింగ్ కష్టాలు తప్పడంలేదు. యాదగిరిగుట్ట పట్టణంలో సుమారు 20కి పైగా పెద్ద హోటళ్లు ఉన్నాయి. ఇందులో టిఫిన్స్ తయారు చేసేందుకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే ఎక్కువగా నిర్వాహకులు వినియోగిస్తున్నారు. తాజాగా హోటళ్లకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలివేశారు. దీంతో హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిపై టిఫిన్స్ను తయారు చేస్తున్నారు. అంతే కాకుండా పలు హోటల్స్ మూసివేసేందుకు సిద్ధమయ్యారు. వారం రోజులుగా.. యాదగిరిగుట్టలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నుంచి ప్రతి నెలా 250 కమర్షియల్ సిలిండర్లు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో వారం రోజులుగా హోటళ్లకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు. వారం రోజుల క్రితం కొనుగోలు చేసిన సిలిండర్లు ఉండటంతో కొన్ని హోటల్స్ టిఫిన్స్ తయారు చేస్తుండగా.. మరి కొన్ని హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు అయిపోయాయి. దీంతో పలువురు నిర్వాహకులు యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులకు టిఫిన్స్, భోజనాలను అందించేందుకు కట్టెల పొయ్యిలపై టిఫిన్స్, వంటలు చేసే పరిస్థితి నెలకొంది. ఇక యాదగిరి క్షేత్రంలో లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదానికి సరిపోను సిలిండర్లు అందజేస్తున్నట్లు హెచ్పీ గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇళ్లలో వాడుకునే గ్యాస్ సిలిండర్ల కొరత రాబోయే రోజుల్లో ఉంటుందనే ఆలోచనలో ప్రజలు ముందస్తుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు హెచ్పీ ఎజెన్సీ కస్టమర్ కేర్కు కాల్స్ చేస్తుంటే నెట్వర్క్ బిజీ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో సైతం గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడితే పరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు మాత్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ఓటీపీ వచ్చిన ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. యాదగిరిగుట్టలో కట్టెల పొయ్యిపై టిఫిన్స్, వంటలు చేస్తున్న ఓ హోటల్ నిర్వాహకుడుగుట్టలో మూతబడిన చాయ్ దుకాణం నిలిచిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఫ కట్టెల పొయ్యిపై టిఫిన్స్ తయారీ ఫ డొమెస్టిక్ రీఫిల్ బుకింగ్ కోసం వినియోగదారుల పాట్లు -
4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి భువనగిరిటౌన్ : జిల్లాలో రబీకి సంబంధించి సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై సివిల్సప్లయ్, అగ్రికల్చర్, కోఆపరేటివ్, మెప్మా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్ వంటివి అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరతలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం హరికృష్ణ, సివిల్ సప్లయ్ రోజారాణి , వ్యవసాయ అధికారి రమణారెడ్డి, రవాణాశాఖ అధికారి సాయి కృష్ణ పాల్గొన్నారు. -
వేతన బిల్లుల కోసం లంచం డిమాండ్
మోత్కూరు : ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన వేతన బిల్లులు క్లియర్ చేసేందుకు లంచం తీసుకున్న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ను గురువారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న పైళ్ల జనార్దన్రెడ్డి 38 రోజులకు గాను తనకు రావాల్సిన రూ.1,09,386 వేతన బిల్లులు క్లియర్ చేయాలని గత నెల 5న మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సంప్రదించగా.. సీనియర్ అకౌంటెంట్ ఎండీ ఖదీర్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఖదీర్తో పాటు అతడి సహచర ఉద్యోగి నిరంజన్ అకౌంట్కు విడతల వారీగా రూ.10 వేలు పంపించిన తర్వాతే ఆన్లైన్ చేసి టోకెన్ ఇచ్చారని ఈ నెల 4న కలెక్టర్తో పాటు ఏసీబీ అధికారులకు జనార్దన్రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం సబ్ ట్రెజరీ కార్యాలయంపై దాడి చేసి రికార్డులను పరిశీలించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ముందుగా భువనగిరిలోని ఖదీర్ నివాసంలో సోదాలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఖదీర్ను అరెస్టు చేశామని, శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఫ మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్ -
పనులు త్వరగా పూర్తి చేయాలి
భువనగిరిటౌన్ : జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను త్వరగా పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్ ఆదేశించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో చేపట్టిన ఇందిర మహిళా శక్తి భవనం, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరంలో సెర్ప్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాప్రమాణాలు మెరుగు పర్చేందుకే తనిఖీలుమోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నోడల్ బృందం సభ్యులు వనం వెంకటేశ్వర్లు, సత్తిరెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందం గురువారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్, పద్మశాలీ కాలనీ, కాశవారిగూడెం, ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసింది. పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత, క్రీడలు, లైబ్రరీ నిర్వహణ, ఉపాధ్యాయుల డైరీలు, లెస్సన్ ప్లాన్స్, స్టాక్ రిజిష్టర్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించింది. కార్యక్రమంలో పాఠశాలల హెడ్మాస్టర్లు పుష్పలత, పరమేశ్వరి, నర్సయ్య, సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు, రేపు సీపీఎం సమావేశాలుభువనగిరిటౌన్ : సీపీఎం జిల్లా ప్రాంతీయ సమావేశాలు చౌటుప్పల్, భువనగిరి కేంద్రాలుగా శుక్ర, శనివారం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వార్షిక బడ్జెట్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు అదనంగా నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, ధర్మారెడ్డి కాల్వ పనులు పూర్తి చేయాలని, బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలకు మరమ్మత్తులు చేయాలని, బీబీనగర్ ఎయిమ్స్ కు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. గురువారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
భువనగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99రోజుల కార్యచరణ ప్రణాళిక పై నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లు, సర్పంచ్లు, చైర్మన్న్లకు గురువారం స్థానిక వి కన్వెన్షన్లో నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్లు, వార్డు సభ్యులు, చైర్మన్న్లు గ్రామాలు, పట్టణాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతనరేషన్కార్డుల జారీ, సన్న బియ్యం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. రానున్న ఎండకాలంలో నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజలు మెచ్చేలా ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నుంచి నిధులుమంజూరు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు నచ్చేలా అభివృద్ధి పనులు చేయాలన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించినట్లయితే అందంగా తయారవుతాయన్నారు. సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై నప్రజాప్రతినిధులు పట్టుదలతో అభివృద్ధి పనులు చేపడితే విజయం సాధించవచ్చన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధులను దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలన్నారు. ఈ సందర్భంగా 10 అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, జెడ్పీ సీఈఓ శోభారాణి, సర్పంచ్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఫ భువనగిరిలో ప్రజాప్రతినిధులకు శిక్షణ -
జాడలేని చేయూత పెన్షన్లు
భువనగిరిటౌన్ : కొత్త ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నెలలు గడుస్తున్నా మంజూరు కాకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27నెలలు కావస్తున్నా ఇంకా చేయూత పింఛన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. చేయూత గ్యారెంటీ అమల్లోకి వస్తే పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకోనున్న నిరుపేద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రయోజనం చేకూరనుంది. 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57–64 ఏళ్ల వయస్సు ఉన్న వారికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఆసరా దరఖాస్తులతో పాటు 57– 64 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఒకేసారి పింఛన్లు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేయలేదు. లబ్ధిదారులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. వృద్ధాప్య పింఛన్న్దారులు మృతి చెందితే వారికి వచ్చే పింఛన్ వెంటనే నిలిపివేస్తున్నారు. కానీ ఆ వృద్ధుడి భార్యకు మాత్రం తిరిగి పింఛన్ మంజూరు చేయడం లేదు. జిల్లాలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం 12 వేలకు పైగానే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులు అధికంగా ఉన్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఆఫ్లైనన్లో వచ్చిన దరఖాస్తులు క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోకుండా కార్యాలయాల్లో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. తమకు ఆసరా పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయంటూ దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫ కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు ఫ అధికారంలోకి వచ్చి 27నెలలు కావొస్తున్నా ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
చివ్వెంల(సూర్యాపేట): విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిఖమ్మంపహాడ్ గ్రామానికి చెందిన వీరబోయిన సైదులు(32) మంగళవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. బోరు మోటార్లు పోయకపోవడంతో ట్రాన్స్పార్మర్ వద్ద ఫ్యూజులు ఏమైనా పోయాయా అని చూడటానికి వెళ్లాడు. ట్రాన్స్పార్మర్ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి సైదులును ఆటోలో సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
మోటకొండూర్ : పాఠశాలల్లో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) రామకృష్ణ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల, చందేపల్లిలోని అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మంది బాలికలు, 48 మంది బాలురకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గాంధీ, డాక్టర్ స్వప్న, డాక్టర్ స్వప్న, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కట్ట విజయ్, జయంత్, అనూష, గాయత్రి, సత్యనారాయణ, నరసింహ, ధనమ్మ తదితరులున్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసుకోవాలి ఆత్మకూరు(ఎం): మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని అడిషనల్ డీఆర్డీఓ జంగారెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో మండల సమాఖ్య ఓబీ, గ్రామ సంఘాల ప్రతినిధులకు, సీనియర్ సీఆర్పీఎస్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు, సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించి జీవనోపాధి కల్పించాలన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలన్నారు. అవసరం అనుకుంటే మండల సమాఖ్య సబ్ కమిటీ వేయాలని చెప్పారు. గ్రామంలో ప్రతి సభ్యురాలు మహిళా సమ భావన సంఘాల్లో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం ఫైనాన్స్ వెంకటేశం, డీపీఎం ఫామ్, నాన్ ఫామ్ రవీందర్, ఏపీఎం నర్సింహ, డీఆర్పీ హరిలాల్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రచ్చ పల్లవి, సీసీలు కొమురయ్య, హరిబాబు, సీఓ నల్ల చంద్రస్వామి, ఎంఎస్ మానస పాల్గొన్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష పూజలు కొనసాగాయి. మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ జరిపించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, నిజాభిషేకం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవోత్సవం, రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
నార్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
నార్కట్పల్లి : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్పల్లి మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. మరో బస్సు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నార్కట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మోజో ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయల్దేరి ఏపీలోని కాకినాడకు వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున బస్సు నార్కట్పల్లి మండల పరిధిలోని నల్లగొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే.. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ, బస్సు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ ఫ్లైఓవర్ పక్కన వాహనాలను వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కాకినాడకు వెళ్తున్న మరో మోజో ట్రావెల్స్ బస్సు అక్కడికి చేరుకోగా.. ఆ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్(30), చిట్టకేనా బంగారయ్య(45) బస్సును పక్కకు ఆపి అప్పటికే వాదించుకుంటున్న బస్సు, లారీ డ్రైవర్లతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న మరో లారీ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు డ్రైవర్లు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్, చిట్టికేనా బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. మొదట ప్రమాదానికి గురైన బస్సు క్లీనర్ సురేష్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్కట్పల్లి సీఐ, నార్కట్పల్లి, చిట్యాల ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని రెండు లారీలు, బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీనివాస్, బంగారయ్య మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన క్లీనర్ సురేష్ను నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. మృతుడు శ్రీనివాస్ హైదరాబాద్లోని మెహిదీపట్నం సమీపంలోని గుడిమల్కాపురం వాంబే కాలనీలో నివాసముంటుండగా.. బంగారయ్య స్వస్థలం ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ అని ఎస్ఐ పేర్కొన్నారు. ఫ లారీ ఢీకొని ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మృతి ఫ మరో బస్సు క్లీనర్కు తీవ్ర గాయాలు -
నానో యూరియాతో అధిక దిగుబడి
హాలియా : నానో యూరియా, నానో డీఏపీతో భూసారం పెరగడంతో పాటు దిగుబడి మెరుగవుతుందని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత రాములమ్మ, ఉద్యాన పంటల శాస్త్రవేత్త బిందు అన్నారు. మంగళవారం అనుముల రైతు వేదికలో సేంద్రియ వ్యవసాయం, నానో ఎరువుల వాడకం, హెచ్టీ పత్తి సాగు, ఆయిల్ పామ్, కిచెన్ గార్డెనింగ్పై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. యూరియా, డీఏపీని మోతాదుకు మించి వాడటం వల్లే భూసారం తగ్గి పంట దిగుబడి పడిపోతుందన్నారు. నానో యూరియా చాలా తక్కువ ధరకు దొరుకుతుందని, తక్కువ శ్రమతో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. యూరియా సరైన సమయంలో అందుబాటులో లేకపోతే నానో యూరియాను స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు. అధిక మోతాదులో యూరియా వినియోగం వలన పురుగులు, తెగుళ్లు పెరగడంతో పాటు నేల, నీరు, వాతావరణం కాలుష్యం అవుతుందని, దాని ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కూడా పడే అవకాశం ఉందన్నారు. రైతులు మేలైన విత్తనాలను ఎంపిక చేసుకున్నప్పుడే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. అధిక సాంద్రత కలిగిన పత్తి సాగు చేస్తే కూలీల ఖర్చు, పంట కాలం తగ్గడంతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. ఏడీఏ సరిత మాట్లాడుతూ.. సస్యరక్షణ చర్యలు, సాగులో మెళకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటీఎంఏ వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఏఓ వెంకన్న, హర్షిత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
సాగర్లో ముగిసిన జాతీయ భద్రతా వారోత్సవాలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లో జెన్కో పవర్హౌజ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 55వ జాతీయ భద్రతా వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి హాజరై మాట్లాడారు. ఏడీలు, ఏఈలు, ఉద్యోగులతో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. పరిశ్రమల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి సురక్షితంగా పనిచేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్కుమార్, ఎస్ఈలు రామకృష్ణారెడ్డి, రఘురాంరెడ్డి, ఫైర్ అండ్ సేఫ్టీ ఏడీ రజనీ, ఏఈ అజమ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక రవాణాను అడ్డుకున్న నాయకులు
శాలిగౌరారం : మండలంలోని వంగమర్తి వద్ద మూసీ నది సమీపంలోని ప్రభుత్వ ఇసుక రీచ్ నుంచి సంబంధిత కాంట్రాక్టర్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నాడని మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక రవాణాను అడ్డుకున్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో ఇసుక రీచ్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ సుమారు 50కి పైగా టిప్పర్లలో ఇసుకను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. మండల ఇసుక లారీల అసోసియేషన్ పరిధిలోని లారీలకు ఇసుక ఇండెంట్ లభించకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్కు సహకరించడం వల్లనే ఈ దందా కొనసాగుతుందని ఆరోపించారు. దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో అనుమతులు పొంది ప్రైవేట్ వ్యక్తులు, నిర్మాణ సంస్థలకు ఇసుక అమ్ముకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, నాయకులు చామల అనిల్రెడ్డి, నూక కిరణ్కుమార్, అన్నెబోయిన సుధాకర్, నోముల జనార్ధన్, వడ్లకొండ పరమేశ్, చింత ధనుంజయ్య, తొట్ల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇసుక క్వారీ వద్ద శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్కు చెందిన ఇసుక టిప్పర్లను కాంగ్రెస్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పీఓ తెలుపడంతో నాయకులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి ఇసుక రవాణాకు సంబంధించి డీడీలు పొందిన అన్ని లారీలను సాయంత్రం అనుమతించారు. నిలిచిపోయిన ఇసుక లారీలు వంగమర్తిలో ప్రభుత్వ ఇసుక రీచ్ వద్ద లారీలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఇసుక రీచ్ను మైనింగ్ ఏడీ బాలు పరిశీలించారు. మూసీ ప్రాజెక్టులో ఇప్పటి వరకు జరిగిన ఇసుక పూడికతీత పనులు, ఎంతమేర పూడికతీతతో తవ్వకాలు జరుగుతున్నాయనే విషయాలను తెలుసుకున్నారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ ఈఈ యాదగిరి, జియాలజిస్టు నామ కుమార్, మైనింగ్ పీఓ కిరణ్కుమార్ ఉన్నారు.ఫ ప్రభుత్వ పనులకు అనుమతి తీసుకుని.. కాంట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక అమ్ముకుంటున్నాడని ఆరోపణ ఫ పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం -
గుట్టలో ఎంట్రీ ఫ్లై ఓవర్ పనుల పరిశీలన
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపైకి వెళ్లేందుకు మొదటి ఘాట్ రోడ్ సమీపంలో జరుగుతున్న ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులను కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై, ప్రస్తుతం పనులు ఏయే దశలో ఉన్నాయో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా పనులను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ శాఖ అధికారి సరిత, సంబంధిత శాఖల అధికారులున్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
భూదాన్పోచంపల్లి: రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆశా కార్యకర్తలు భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేశారు. ఆశా డే సందర్భంగా విధులు బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. నెలనెలా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశాకార్యకర్తలు రాధిక, అలివేలు, సైదమ్మ, కవిత, శారద, జ్యోతి, నవ్య, బాలమణి, చంద్రకళ, అరుణ, నాగమణి, మనోహర, పద్మ, విమల, భార్గవి, సంతోష, లింగమణి పాల్గొన్నారు. -
23 గొర్రెలు మృత్యువాత
మునగాల : మండలంలోని కొక్కిరేణి గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతానికి గురై 23 గొర్రెలు మృతిచెందాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కిరేణి గ్రామానికి చెందిన చింతకాయల అరుణ్యాదవ్కు చెందిన గొర్రెల మంద నీటి కోసం గ్రామ శివారులోని గురప్పకుంట చెరువు వద్దకు చేరుకున్నాయి. ఇదే చెరువులో తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగునీటి కోసం విద్యుత్ (ఓపెన్ వెల్) మోటార్లు అమర్చారు. దీంతో చెరువులో నీరు తాగేందుకు వెళ్లిన 23 గొర్రెలు విద్యుదాఘాతానికి గరై మృతిచెందాయి. అంతేకాకుండా అరుణ్యాదవ్ కూడా విద్యుదాఘాతానికి గురి కాగా ప్రాణప్రాయం నుంచి బయటపడ్డాడు. బాధితుడికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని గొర్రెల కాపరుల సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల కృష్ణయ్యయాదవ్ డిమాండ్ చేశారు. -
తల్లి, కుమారుల అంత్యక్రియలు పూర్తి
● రూ.లక్ష ఆర్థికసాయం అందజేసిన ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డిభువనగిరి : మండలంలోని వడపర్తి గ్రామం వద్ద సోమవారం ఆటోను డీసీఎం ఢీకొనడంతో బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన కేతమ్మ, ఆమె ఇద్దరు కుమారులు నరేష్, సురేష్ మృతిచెందారు. ముగ్గురి మృతదేహాలకు మంగళవారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో బీఎన్ తిమ్మాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గేదెలు మేపేందుకు వెళ్లి అన్నదమ్ములు అదృశ్యం
మేళ్లచెరువు : చింతలపాలెం మండలం చింత్రియాల పరిధిలోని కృష్ణా నది వద్దకు గేదెలు మేపేందుకు వెళ్లి అన్నదమ్ములు అదృశ్యమయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింత్రియాలకు చెందిన షేక్ సైదుస్సేన్ కుమారులు సమీర్(12), సర్దార్ (13) ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మదరసాలో అరబిక్ నేర్చుకుంటున్నారు. మూడురోజుల క్రితం ఇంటికి వచ్చారు. వారిద్దరు మంగళవారం గేదెలు మేపేందుకు చింత్రియాల సమీపంలోని కృష్ణానది వద్దకు వెళ్లి అదృశ్యమయ్యారు. సాయంత్రమైనా వారిద్దరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కృష్ణా నది తీరంలో వెతికినా వారి ఆచూకీ లభించలేదు. అయితే నది ఒడ్డున జాలర్లకు చెందిన పడవలు, వలలు ఉండడంతో చేపలు పట్టేందుకు నదిలోకి వల వేసి మునిగినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదుచిలుకూరు : మండలంలోని పోలేనిగూడెంలో పక్క పక్క ఇళ్లలో ఉంటున్న ఇద్దరు గోడ విషయమై సోమవారం ఘర్షణ పడ్డారు. ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హనుమాన్నాయక్ మంగళవారం తెలిపారు. బిట్టు నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందా వెంకటేశ్వర్లు, సుమలతతో పాటు మరో నలుగురిపై, అదేవిధంగా చందా సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిట్టు నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. గంజాయి పట్టివేతభువనగిరిటౌన్ : గంజాయి విక్రయిస్తున్న యువకుడిని మంగళవారం ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సనౌలేక్ భువనగిరి పట్టణంలో గంజాయితో సంచరిస్తున్నాడని సమాచారం తెలియడంతో ఎకై ్సజ్ పోలీసులు అతడి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 170 గ్రాముల గంజాయి, ఇతర మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. 10 లీటర్ల నాటుసారా.. కొండమల్లేపల్లి : ద్విచక్ర వాహనంపై నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం దేవరకొండ ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్ఐ నర్సింగరావు, నరసింహ, వీరబాబు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఇసుక లారీల పట్టివేతకోదాడరూరల్ : ఏపీ నుంచి అనుమతి లేకుండా వస్తున్న ఇసుక లారీని కోదాడ రూరల్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కేంద్రం సమీపంలోని మున్నేరు వాగు నుంచి లారీలో ఇసుకను లోడ్ చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్కు తరలిస్తుండగా.. రామాపురం క్రాస్రోడ్లో వాహనాల తనిఖీల్లో భాగంగా కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. లారీ యజమానితో పాటు డ్రైవర్ బిల్లా సాంబశివరావు, క్లీనర్ కారం శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్యచందంపేట : మండలంలోని అచ్చంపేటపట్టి గ్రామానికి చెందిన జర్పుల పత్య(35) అప్పు ల బాధ తాళలేక మంగళవారం హైదరాబాద్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్పుల పత్య అచ్చంపేటపట్టి గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. సరైన దిగుబడి రాక, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక హైదరాబాద్లోని హస్తినాపురంలో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మంగళవారం హస్తినాపురంలోని అద్దె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పత్య మృతదేహాన్ని అచ్చంపేటపట్టి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
అన్నదాతలు.. అగ్ని ప్రమాదాలతో జాగ్రత్త
గుర్రంపోడు : పండ్ల తోటలు సాగు చేసే రైతులకు వేసవిలో అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తాయి. 20 ఏళ్ల పాటు దిగుబడులు ఇచ్చే బత్తాయి, నిమ్మ తోటలు అగ్ని ప్రమాదాలకు గురైతే రైతు ఆర్థికంగా కోలుకోవడం కష్టమే. ప్రతి ఏడాది వేసవిలో అగ్ని ప్రమాదాల కారణంగా పండ్ల తోటలు కాలిపోతుండగా.. అధికారులు నష్టం అంచనా వేస్తున్నా పరిహారం అందించిన దాఖలాలు లేవు. రెండు రోజుల క్రితం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పక్క పొలం రైతు చెత్తను తగలబెట్టేందుకు నిప్పు పెట్టగా ఆ మంటలు వ్యాపించి పక్కే గల బత్తాయి తోటలో 70 చెట్లు కాలిపోయాయి. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనుముల క్లస్టర్ ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి వివరించారు. ఆయన సూచనలు, సలహాలు ఇవీ.. ఫ రైతులు మోటార్ల సర్వీసు వైర్లు, కేబుల్ వైర్లు అతుకులు లేకుండా చూసుకోవాలి. నేల మీద వైర్లు లేకుండా చూసుకోవాలి. ఎండ వేడిమికి షార్ట్ సర్క్యూట్తో ఎండిన ఆకులకు నిప్పంటుకుంటుంది. ఫ విద్యుత్ సర్వీసు వైర్లు, ఫ్యూజుల నుంచి స్టార్టర్ వరకు గల వైరు నాసిరకంగా ఉంటే లోఓల్టేజీతో కాలిపోయి మంటలు అంటుకుని వ్యాపించే అవకాశం ఉంది. ఫ స్టార్టర్ డబ్బాలు నేలపై అడ్డంగా ఉంచడం వల్ల ఎలుకలు దూరి వైర్లు కత్తిరించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎండు ఆకులకు మంటలు అంటుకుంటాయి. ఫ తోటల్లో కరెంటు స్తంభాల మధ్య లూజ్ లైన్ లేకుండా చూసుకోవాలి. లూజ్ లైన్ల వల్ల గాలిదుమారాలకు తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు నేలపై పడి కింద ఉన్న గడ్డికి అంటుకుంటాయి. ఫ తోటల్లో చెట్ల మధ్యలో వేసవికి ముందే దన్నుకోవాలి. కలుపు మందులు వాడితే ఎండిన గడ్డిని పీకివేయాలి. ఫ ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో తోటల్లో చెత్తకు నిప్పుపెట్టకూడదు. ఫ తోటల చుట్టూ కంచె ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు అదుపులో ఉండేందుకు కంచె మధ్యలో ఎడం ఉండేలా ఖాళీ స్థలం ఉంచుకోవాలి. ఫ తోట గెట్ల వెంట గడ్డివాములు ఉంచకూడదు. ఫ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తోటల్లో అంతరకృషి లేకుండా ఎండు గడ్డి బాగా ఉంటే డ్రిప్ లాటరల్ పైపులు కాలిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. -
ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఈసం సత్తయ్య(43) కుటుంబంతో కలిసి చౌటుప్పల్లోని రాంనగర్కాలనీలో నివాసముంటూ తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా సోమవారం కూడా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి పనికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత రాత్రి ఆటోలో వచ్చి తంగడపల్లి క్రాస్రోడ్డు వద్ద దిగాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు గాను సత్తయ్య హైదరాబాద్–విజయవాడ హైవే దాటుతుండగా ఆటో ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై ఎగిరిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని అంబులెన్స్లో చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న ఈసం బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి
భువనగిరిటౌన్ : పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపాలిటీలోని సింగన్నగూడెంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, మిగిలిన పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ ఏడీ శ్రీరాములు, సంబంధిత అధికారులు ఉన్నారు. రేపు శిక్షణ కార్యక్రమం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా కార్యక్రమంపై మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై గురువారం ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
యాదగిరిగుట్ట: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని పూర్తి చేసుకొని శుక్రవారం గృహ ప్రవేశం చేసిన దూశెట్టి లలిత, రామచంద్రయ్య దంపతులకు నూతన వస్త్రాలు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్, వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య రాంచందర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, కౌన్సిలర్లు పెలిమెల్లి లావణ్య శ్రీధర్గౌడ్, బూడిద మధు, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, బిట్టు సరోజ హరీష్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సీనియర్ నాయకులు గుండ్లపల్లి భరత్గౌడ్, ఎరుకల హేమేందర్ తదితరులున్నారు. -
వైన్స్లో చోరీ.. దొంగ అరెస్టు
నల్లగొండ: వైన్ షాపులో చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నల్లగొండ వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల మహాలక్ష్మి వైన్ షాపులో గతేడాది డిసెంబరు 7న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి రూ.5 లక్షలకు పైగా నగదు ఎత్తుకెళ్లాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్లాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహరావుగా పోలీసులు గుర్తించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నర్సింహారావును అదుపులోకి తీసుకొని విచారించగా.. మూడు వైన్ షాపుల్లో చోరీలు చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.1.77లక్షల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నర్సింహారావు గతంలో వంట మాస్టర్గా పనిశాడని, అతడు ప్రస్తుతం ఏపీలోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మచ్చయపాలెం గ్రామంలో నివాసముంటున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి బెయిల్పై బయటకు వచ్చినట్లు తెలిపారు. -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.1.86కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలను ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.1,86, 44,511 నగదు, మిశ్రమ బంగారు 57గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 750 గ్రాములు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ వచ్చాయన్నారు. ఈ హుండీ ఆదాయం 28 రోజులదని ఈఓ పేర్కొన్నారు. -
టెన్త్ పరీక్షలకు 50 కేంద్రాలు
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. ఎండల నేపథ్యంలో కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా అన్ని శాఖల అధికారులతో చర్చించామని పేర్కొన్నారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించి యాదాద్రి భువనగిరి జిల్లా 7వ స్థానంలో నిలిచిందని, ఈ సారి ప్రథమ స్థానమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన మంగళవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కంట్రోల్ రూం ఏర్పాటు పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎండలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో కూల్ వాటర్ను ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్, ఫర్నిచర్, మూత్రశాలలు, మరుగుదొడ్లు వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నాం. సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాం. సందేహాలు ఉంటే 90107 72080 నంబర్కు ఫోన్ చేయాలి. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి పదో తరగతి పరీక్షలకు 8930 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 8913 మంది విద్యార్థులు రెగ్యులర్ కాగా 20 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులకు ఉదయం 9 గంటల లోపే కేంద్రాల వద్దకు చేరుకోవాలి. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 50 మంది సీఎస్, 50 మంది డీఓలతో పాటు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. వీరితో పాటు జిల్లాలో పరీక్షలను పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మను ప్రత్యేకంగా నియమించారు. 572 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రం వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల నిర్వహణ సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేయాలి. సీఎస్ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఆర్టీసీ అధికారులతో చర్చించాం అన్ని కేంద్రాల వైపు బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులతో చర్చించాం. ఉదయం కేంద్రాలకు వచ్చే సమయంతోపాటు, మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ వారికి సూచించాం. అదేవిధంగా పాఠశాలల్లో హాల్టికెట్ ఇవ్వకుంటే ఫిర్యాదు చేయొచ్చు. వెబ్సైట్ నుంచి హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిపై ప్రధానోపాధ్యాయుల సంతకం లేకున్నా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. ఈ సారి ప్రథమ స్థానమే లక్ష్యంగా పాఠశాలల ప్రారంభం నుంచే ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. ముందుగానే విద్యార్థులకు వేకప్ కాల్ పేరుతో తెల్లవారుజామునే పిల్లలను నిద్రలేపి చదివేటట్టు చేయడం, పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, దత్తత పేరుతో పాఠశాలలు ఉన్న గ్రామంలో సీ గ్రేడు విద్యార్థులను గ్రామంలోని విద్యావంతులకు గాని అధికారులకు గాని అప్పగించి వారి పర్యవేక్షణలో చదివే విధంగా ఏర్పాటు చేశాం. ఈ సారి అభ్యసన దీపికలు అన్ని సబ్జెక్టులకు ఇవ్వడం జరిగింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 200 సైకిళ్లను ఉచితంగా అందజేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి పరీక్షలకు మధ్య రెండు నుంచి మూడు రోజుల వరకు గడువు ఉంది. విద్యార్థులకు ముందు జరిగే పరీక్షలకు సంసిద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పాఠశాలలకు రావాలి. ప్రధానంగా పరీక్షల సమయంలో విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఫ 8930 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు ఫ ఎండల నేపథ్యంలో కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం ఫ అత్యత్తమ ఫలితాలు సాధించిన 200 మంది విద్యార్థులకు సైకిళ్లు అందిస్తాం ఫ సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు ‘సాక్షి’తో డీఈఓ సత్యనారాయణ -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
యాదగిరిగుట్ట రూరల్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామంలో గోదావరి జలాలతో నిండిన పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో రైతులకు సాగు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, నవాబ్పేట, తపాస్పల్లి ప్రాజెక్టుల నుంచి ఆలేరు ప్రాంతంలోని అన్ని చెరువులు నింపడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, జనగాం ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ కాల్నె సరిత, భాస్కర్, గుండ్ల పల్లి భరత్ గౌడ్, కానుగు బాలరాజ్ గౌడ్ పాల్గొన్నారు. ప్రభుత్వం.. రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే కుంభం భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిని భువనగిరి మండలంలోని పలు గ్రామాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భూగర్భజలాలు తగ్గి వరి పొలాలు ఎండుతున్న నేపథ్యంలో మొదటి సారి నీటిని విడుదల చేశామన్నారు. బీఎన్ తిమ్మాపురం భూ నిర్వాసితులకు త్వరలో పరిహారం కింద రూ. 50కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటిని విడుదల చేయడంలో సహకరించిన మంత్రి ఉత్తమకుమార్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ, రైతులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
అర్జీలు పెండింగ్ లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహంచిన ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రజలనుంచి 46 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. శ్మశాన వాటికను ఆక్రమించారు భువనగిరి మండలం గంగసానిపల్లి గ్రామాంలోని శ్మశాన వాటిక స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకున్నారని ఆ గ్రామస్తులు ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. అర్జీ ఇచ్చినవారిలో సత్యనారాయణ, వెంకటేష పాండు, నవీన్, స్వామి, సత్తయ్య, లక్ష్మయ్య ఉన్నారు. నష్టపరిహారం చెల్లించాలి బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న తమకు పరిహారం ఇవ్వాలని చోకళ్లతండా, కోట్య తండా, పీర్యతండాల వాసులు కోరారు. భూసేకరణ చేసి సంవత్సరాలు గడుస్తున్నా నష్టపరిహారం రాలేదన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
భూదాన్పోచంపల్లి : గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచ్ల పై ఉందని భువనగిరి డీఎల్పీఓ బి. శ్రీకాంత్రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోటకొండూర్, ఆత్మకూర్ (ఎం), గుండాల మండలాలకు చెందిన నూతన సర్పంచ్లకు చివరి విడత శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్ల విధులు, నిధుల వినియోగం, గ్రామంలో కల్పించాల్సిన మౌలిక వసతులపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనింగ్ కోఆర్డినేటర్ రాములు, టీఓటీలు నవీన్కుమార్, ఎం.డీ. మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉండాలి
భువనగిరిటౌన్ : ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రత్యేక అధికారులు రోజూ పాఠశాలకు వెళ్లి భోజనాన్ని స్వయంగా రుచి చూసి, నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం వంట చేస్తున్నారా లేదా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. సాంకేతిక విద్యకు ప్రభుత్వ ప్రాధాన్యంఆలేరు: ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ఆలేరులోని పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్వల్పకాలిక కోర్సులను మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణితో కలిసి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఈ కోర్సుల్లో శిక్షణ అనంతరం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈకార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బీజన భాస్కర్ పాల్గొన్నారు. భూభారతి కేసులో మరో నలుగురు రిమాండ్జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన భూ భారతి స్లాట్ బుకింగ్ కుంభకోణంలో రిమాండ్ సంఖ్య 19కి చేరింది. కొద్ది రోజుల క్రితం జనగామ, యాదాద్రి జిల్లాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుర్చగా, నాలుగు రోజుల క్రితం జనగామ పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లాకు చెందిన సర్పంచ్ దొమ్మాట బాబు, లింగస్వామి, భానుప్రకాశ్తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. మహాశివుడికి విశేష పూజలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం నిత్య పూజలను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామ లింగేశ్వరస్వామి వారి ఆలయలో శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు, కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను సంప్రదాయ బద్ధంగా చేపట్టారు. సాయంత్రం సేవోత్సవాన్ని జరిపించారు. ఇక ప్రధానాలయంలో వేకువజామునే స్వామి వారిని మేల్కొలిపి, సుప్రభాత సేవలు, అర్చనలను అర్చకులు చేశారు. గర్భాలయంలోని స్వయంభూవులకు అభిషేకాలను నిర్వహించారు. ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిపించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి
చౌటుప్పల్ : గ్యాస్ ధరల పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సీపీఎం మున్సిపల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, కృష్ణారెడ్డి, పాష, అవ్వారు రామేశ్వరి, బండారు నర్సింహ్మ, దాసు, ధర్మయ్య, మల్లేశం, రేష్మ, స్వామి, ఆనంద్, ఈదయ్య, ఐలయ్య, రాములు, పెంటయ్య పాల్గొన్నారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా గొంతువిప్పాలి రామన్నపేట :ప్రజలు మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం రామన్నపేటలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డీ జహంగీర్, మేక అశోక్రెడ్డి, పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, ఉపేందర్, ఏబూషి నర్సింహ, బోయిని ఆనంద్, హన్మంత్ పాల్గొన్నారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి వలిగొండ : అర్హులైన వారందరికీ ప్రభుత్వం వెంటనే నూతన పింఛన్లు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య డిమాండ్ చేశారు. సోమవారం వలిగొండలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జహంగీర్, బాలరాజు, రాజయ్య, సిర్పంగి స్వామి, తుర్కపల్లి సురేందర్, కూర శ్రీనివాస్, కందడి సత్తిరెడ్డి, కొండే కిష్టయ్య, శ్రీశైలం రెడ్డి, యాదయ్య, దుబ్బలింగం, సురేష్ పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య -
నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలి
ప్రభుత్వం నూలు సబ్సిడీకి బదులు నేతన్న భరోసా కింద ఏడాదికి చేనేత కార్మికుడికి రూ.18వేలు, అనుబంధ కార్మికుడి రూ.6వేల చొప్పున మొత్తం రూ.24వేలు ఇస్తామని చెప్పింది. కానీ పథకం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా నేటికీ అమలు కాలేదు. దాంతో చేనేత కార్మికులు నగదు డబ్బులు చెల్లించి నూలు కొంటున్నారు. పెరిగిన ధరలతో వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. నూలు ధరల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. –కర్నాటి పురుషోత్తం, తెలంగాణ చేనేత జనసమాఖ్య జిల్లా అధ్యక్షుడు -
క్రీడల్లో మెరికలు
రాజాపేట : రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన ముగ్గురు, దూదివెంకటాపురం హైస్కూల్ విద్యార్థిని చదువుతోపాటు క్రీల్లోనూ రాణిస్తున్నారు. గతేడాది నుంచి జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటి వివిధ మెడల్స్ సాధించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలు, 2036లో జరిగే ఒలింపిక్స్లో తెలంగాణ తరఫున ఆడి పతకాలు సాధిస్తామని అంటున్నారు. కబడ్డీలో సత్తాచాటుతున్న గురుకుల విద్యార్థులు రాజాపేట సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్న డి.దిలీప్ కబడ్డీలో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తున్నాడు. 2025 అక్టోబర్లో హైదరాబాద్లో నిర్వహించిన యువ ప్రో కబడ్డీలో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్నాడు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన 61 జూనియర్ నేషనల్ గేమ్స్ ఆడాడు. మహబూబాబాద్లో జరిగిన ఎస్జీఎఫ్ క్రీడల్లో అండర్–19 విభాగంలో కబడ్డీలో గోల్డ్ మెడల్ సాధించాడు. కరీంనగర్, మహబూబ్నగర్లో నిర్వహించిన సీనియర్, జూనియర్ స్టేట్ మీట్లో ఉత్తమ ఆటతీరు కనబర్చాడు. ఇదే కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ బైపీసీ విద్యార్థి ఎస్.అనుము మహబూబాబాద్లో 2025 అక్టోబర్లో నిర్వహించిన జూనియర్ స్టేట్ మీట్లో కబడ్డీ పోటీల్లోపాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. మహబూబ్నగర్లో 2024, 2025లో జరిగిన జూనియర్ స్టేట్ మీట్లో పాల్గొని బ్రౌంజ్ మెడల్ సాధించాడు. అలాగే సెకండియర్ విద్యార్థి బి.దేవరాజు హైదరాబాద్లో 2025 అక్టోబర్లో నిర్వహించిన యువ ప్రోకబడ్డీలో పాల్గొన్నాడు. ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన 69వ జాతీయ స్థాయి అండర్–17 పోటీల్లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చి బ్రౌంజ్ మెడల్ సాధించాడు. సాఫ్ట్బాల్లో దూదివెంకటాపురం విద్యార్థిని.. రాజాపేట మండలం దూదివెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుల్లెన ప్రణీత ఎస్జీఎఫ్ సాఫ్ట్బాల్ పోటీల్లో రాణిస్తోంది. ఈ ఏడాది జనవరిలో నిజామాబాద్లో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 4 నుంచి 8 వరకు ఛత్తీస్గఢ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని సత్తాచాటింది. డి.దిలీప్, రాజాపేట గురుకులం గుల్లెన ప్రణీత, దూదివెంకటాపురంఎస్.అనుము, రాజాపేట గురుకులం డి.దేవరాజు, రాజాపేట గురుకులం ఎస్జీఎఫ్లో రాణిస్తున్న గురుకుల విద్యార్థులు ఫ కబడ్డీలో దిలీప్, దేవరాజు, అనుము ఆటతీరు అద్భుతం ఫ జాతీయ స్థాయిలో పలు మెడల్స్ సొంతం ఫ సాఫ్ట్బాల్లో సత్తాచాటుతున్న ప్రణీత -
వంట గ్యాస్కు ధరల మంట
రంజాన్ కానుకల్లో కోత! ఫ ఈ ఏడాది 50 శాతం తగ్గింపు ఫ గతంలో 2,300 కుటుంబాలకు పంపిణీ ఫ ఈ సారి 1,250 మందికే.. ఫ ఆందోళనలో పేద ముస్లింలు భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రంజాన్ కానుకల (తోఫా) పంపిణీలో కోత పెట్టింది. గతం కంటే ఈసారి 50 శాతం తగ్గించింది. అయితే 2023లో భువనగిరికి 1,300, ఆలేరుకు వెయ్యి చొప్పున కానుకల ప్యాకెట్లను పంపిణీ చేసింది. ప్రస్తుతం ఒక కుటుంబానికి చీర, కుర్తా పైజామా, ఒక డెస్స్తో కలిపి ప్రత్యేక ప్యాకెట్(ను సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 4వేల పేద ముస్లిం కుటుంబాలకుగాను కనీసం 2వేల కుటుంబాలకై నా పంపిణీ చేయాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం భువనగిరి నియోజకవర్గానికి 750, ఆలేరు నియోజకవర్గానికి 500 మాత్రమే కేటా యించి సరఫరా చేసింది. అధికారులు ఒక్కొక్క గ్రామానికి కనీసం ముగ్గురికి కూడా పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందరికి ఎలా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎక్కువ మందికి పంపిణీ చేసి ఇప్పడు తగ్గించడమేంటని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పేద ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందించాలని ముస్లిం మతపెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఫ పెరిగిన గృహ, వాణిజ్య గ్యాస్ ధరలు ఫ మొత్తం 2.61లక్షల గ్యాస్ కనెక్షన్లు ఫ వినియోగదారులపై రూ.90లక్షల భారంమీము నెలకు రెండు గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగిస్తాం. పెరిగిన ధరతో ప్రతినెలా అదనంగా రూ.120 వరకు భారం పడుతుంది. పెరిగిన ధరను తగ్గించి పేద కుటుంబాలకు ఊరట కలిగించాలి. – గాజుల గీత, ఆత్మకూర్(ఎం) వంట గ్యాస్పై రూ.60, కమిర్షియల్ గ్యాస్ రూ.100 పెంచడం దారుణం. పెరిగిన వంట గ్యాస్ ధరల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనంగా భారం పడుతుంది. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలి. – కొండమడుగు నాగమణి, ఐద్వా మండల కార్యదర్శి భువనగిరి : ఇరాన్, ఇజ్రాయిల్–అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం భారత్లో వంట గ్యాస్ మంట పుట్టిస్తోంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా తగ్గింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చమురు సంస్థలు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుంచి వంటగ్యాస్ ధరలు పెంచేశాయి. మరోవైపు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరాను నిలిపేశాయి. దీంతో జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభావం ఇలా.. గ్యాస్ బుక్కింగ్ సరఫరాకు సంబంధించిన వెబ్సైట్లు ఈ నెల 6వ తేది అర్ధరాత్రి నుంచే డీలర్ల పరిధి నుంచి చమురు సంస్థల అజమాయిషిలోకి వెళ్లాయి. గృహ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసేందుకు గడువును 21 నుంచి 25 రోజులకు పెంచారు. ఈ వ్యత్యాసం రానున్న రోజుల్లో 30 నుంచి 35 రోజులకు పెరిగే అవకాశం ఉందని డీలర్ల అంచనా వేస్తున్నారు. బుక్ తర్వాత డెలివరీకి వారం, పది రోజులు పట్టే అవకావం ఉంటుంది. దీంతో గ్యాస్ ను పొదుపుగా వాడుకోవడంతోపాటు కట్టెల పొయ్యిలను కూడా పెట్టుకోవాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జిల్లాలో ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదరగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి పట్టణాల్లో కొన్ని పెద్ద హోటళ్లు ఉన్నాయి. వీరు నేరుగా అర్డర్ల త్వారా సంబంధిత డీలర్ల ద్వారా వాణిజ్య సిలిండర్లను తెచ్చుకుంటారు. కొందరు రెండు మూడు రోజులకు సరిపడా నిల్వ ఉంచుకుంటారు. కానీ, ప్రస్తుతం ఇ పరిస్థితి లేదు. దీంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల నుంచి పెరిగిన బుకింగ్లు జిల్లాలో వారం రోజుల నుంచి వంట, కమర్షియల్ గ్యాస్ గాని బుకింగ్లు పెరిగాయి. ప్రస్తుతం పెరిగిన ధరలతో పాటు మారిన విధానంతో రెండు మూడు రోజులుగా మరింతగా బుకింగ్లు పెరుగుతున్నాయి. కాగా ఈకేవైసీ లేకుండా గ్యాస్ బుకింగ్ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డీలర్ల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. అదనపు భారం.. రూ.90 లక్షలు జిల్లాలో ప్రస్తుతం 7,54,831 మంది జనాభా ఉంది. ఇండేన్, భారత్, హెచ్పీసీ గ్యాస్ డీలర్లు ఉన్నారు. ఆయా డీలర్ల పరిధిలో సుమారు 2,61,201 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గృహ సిలిండర్ ధర ఈ నెల 6 నుంచి రూ.60లు పెరగడంతో ప్రస్తుతం వంట గ్యాస్ ధర 14 కిలోల సిలిండర్కు రూ.960.50కు చేరింది. వాణిజ్య గ్యాస్ ధర 19 కేజీల సిలిండర్కు రూ.2,100కు చేరినా సరఫరా నిలిచింది. ప్రస్తుతం జిల్లాలోని ప్రజలు ప్రతినెలా 1.50 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుండగా 90 లక్షల రూపాయల వరకు అదనపు భారం పడనుంది. ఆలేరు : గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆదివారం ఆలేరు పట్టణంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆందోళన చేపట్టారు. రైల్వేగేట్ చౌరస్తాలో కట్టెల పొయ్యిమీద వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో పేద, మధ్యతరగతి వర్గాలపై ఆర్థికభారం పడుతుందన్నారు. పెంచిన గ్యాస్సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.జనార్దన్, సహదేవ్, అడివయ్య, నాగరాజు, బాలమల్లేష్, సమరసింహారెడ్డి, రాఘవరెడ్డి, కొమురయ్య, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గిరి ప్రదక్షిణలో కూచిపూడి నృత్య ప్రదర్శన
యాదగిరిగుట్ట రూరల్ : హైదరాబాద్కు చెందిన 12 ఏళ్ల కూచిపూడి నర్తకి పి.వైష్ణోదేవి యాదగిరీశుడి కొండ చుట్టూ కూచిపూడి నృత్యం చేస్తూ గిరి ప్రదక్షిణ చేసింది. సంస్కృతి, ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ, 3 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ మార్గమంతా నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకుంది. కాగా జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వైష్ణోదేవి ఈ ప్రదర్శన ఇచ్చారు. ఆమెను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈఓ భవానీ శంకర్ అభినందించారు. లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామికి, గోదాదేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల కల్యాణం అనంతరం తిరుమాడ వీధులలో స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలంరామన్నపేట : ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విమర్శించారు. ఆదివారం రామన్నపేటలో చేపట్టిన ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామన్నపేట సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే రూ.20 కోట్లు మంజూరు చేయాలన్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలు, పందుల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, కందుల హన్మంత్, గొరిగె సోములు, బావండ్లపల్లి బాలరాజు, మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, బాబుచారి, వేముల మల్లేశం, బండ శ్రీశైలం, కుందూరు వెంకటేశం, మునుకుంట్ల రాణి, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భాశయ క్యాన్సర్ నివారణకే హెచ్పీవీ టీకా
భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉచితంగా అందజేస్తున్న హెచ్పీవీ టీకాను 14 సంవత్సరాలు నిండిన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో హెచ్పీవీ టీకా పంపిణీని ఆయన ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా 14 సంవత్సరాల వయస్సు నిండిన బాలికలు హెచ్పీవీ టీకా వేసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.6వేల నుంచి రూ.12వేల విలువ చేసే టీకాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నారు. 30 రోజుల పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ సీహెచ్సీల్లో టీకాను అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపలి శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, కౌన్సిలర్ సూదగాని సరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖబాబురావు, డాక్టర్ ఇంద్రాణి, రామకృష్ణ, యామిని శృతి, నిరోష పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాదగిరీశుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ మాడవీధులతో పాటుగా, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, ప్రధానాలయం క్యూలైన్లు వంటి ప్రాంతాల్లో భక్తజనం సందోహం కనిపించింది. శ్రీస్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 35 వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా స్వామి వారికి రూ.45,46811 నిత్యాదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం
యాదగిరిగుట్ట రూరల్ : ఇందిరమ్మ పథకంతో పేదవాడి సొంతింటి కల సాకారం అవుతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరై లభ్ధిదారులు కోల మాధవి మల్లేష్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఇళ్లు లేని పేదలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నవీన్కుమార్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచ్ గడ్డం దేవేందర్, కుండె సిద్దులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
దొడ్డు బియ్యం.. పురుగులమయం
గుండాల : మండలంలోని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ముక్కి పురుగులు పట్టిపోతున్నాయి. అయినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. గుండాల మండల వ్యాప్తంగా 20 రేషన్ షాపులకు గతేడాది మార్చిలో ప్రభుత్వం దొడ్డు బియ్యం సరఫరా చేసింది. దీంతో ఒక్కో షాపులో సుమారు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు మొత్తంగా 400 నుంచి 500 క్వింటాళ్ల దొడ్డు బియ్యం ఏడాది కాలంగా నిల్వ ఉంటున్నాయి. గతేడాది ఏప్రిల్లో ఉగాది కానుకగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో దొడ్డు బియ్యాన్ని పట్టించుకోకపోవడంతో పురుగు పట్టిపోతున్నాయి. నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకోకపోవడం వల్ల సన్న బియ్యం నిల్వ చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని రేషన్ డీలర్లు చెబుతున్నారు. దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్న బియ్యానికి వచ్చే ప్రమాదం ఉందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఫ రేషన్ షాపుల్లో ముక్కిపోతున్న బియ్యం ఫ వాపస్ తీసుకోని ప్రభుత్వం ఫ సన్న బియ్యం నిల్వకు డీలర్ల ఇక్కట్లు -
పారదర్శక పాలన అందించాలి
భూదాన్పోచంపల్లి : సర్పంచ్లు పారదర్శక పాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, బీబీనగర్ మండలాలకు చెందిన నూతన సర్పంచ్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. నూతన సర్పంచ్లు పంచాయతీరాజ్ చట్టం, విధులు, రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో భువనగిరి డీఎల్పీఓ, ట్రైనింగ్ కోఆర్డినేటర్లు బి.శ్రీకాంత్రెడ్డి, రాములు, టీఓటీలు రాపర్తి భాస్కర్, నవీన్కుమార్, ఎండీ మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలను పరిశుభ్రంగా మారుద్దాం
బొమ్మలరామారం : పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి, మైసిరెడ్డి పల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని పర్యటించారు. పరిశుభ్రత కార్యక్రమంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి కాలువతో పాటు రోడ్లు, వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాన్నారు. మైసిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అనంతరం మల్యాలలోని కేజీబీవీని తనిఖీ చేశారు. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, కిచెన్, స్టోర్రూమ్, డార్మెంటరీని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సామర్థ్యాలను పరీక్షించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, హౌసింగ్ పీడీ శ్రీరాములు, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీఓ గడ్డం జ్ఞానప్రకాష్ రెడ్డి, ఎంపీఓ శ్రీమాలిని, ఏపీఓ శ్రీలక్ష్మి, ఎంఈఓ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
యాదగిరిగుట్ట : మహిళలు అన్ని రంగాల్లో రాణించి, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్, బీర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్ల అనిత ఐలయ్య పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ప్రాంగాణంలో శుక్రవారం మహిళ ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ప్రతిభను చాటుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజాప్రతినిధులను మహిళా ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య రాంచందర్, కస్తూరి, ఆర్టీసీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 141 మంది గైర్హాజరు
భువనగిరి : జిల్లాలో 28 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం గణితం–2బీ, జువాలజీ, హిస్టరీ పేపర్–2 పరీక్షలు జరిగాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 4,888 మంది విద్యార్థులకు 4,747 మంది హాజరు కాగా 141 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీవైష్ణవి జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ భాస్కర్రావు శుక్రవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రాల్లో కల్పించిన వసతులను అడిగి తెలుసుకున్నారు. నిత్యాన్నదానానికి విరాళంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అందజేస్తున్న నిత్యన్నదాన పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వేటపాలెం గ్రామానికి చెందిన అమటం శైలేంద్రనాథ్, పద్మావతి, షణ్ముక మయూర్లు రూ.లక్ష విరాళం అందజేశారు. శుక్రవారం శ్రీస్వామి వారిని దర్శించుకున్న సందర్భంగా వారు ఆలయాధికారి గజివెల్లి రఘుకు విరాళంగా ఇచ్చారు. భక్తుల అన్న ప్రసాదం కోసం విరాళం వినియోగించాలని వారు కోరారు. మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలుభువనగిరిటౌన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భువనగిరి కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు చెస్, స్పూన్, క్యారమ్స్, రిగ్బాల్ తదితర క్రీడా పోటీలు కొనసాగాయి. ఈ పోటీలకు ఈ సారి అంగన్వాడీ టీచర్లను ఆహ్వానించకపోవడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. రేపటి నుంచి ‘ఇంటింటికీ సీపీఎం’ భువనగిరిటౌన్ : ప్రజా సమస్యల అధ్యయనం కోసం ఈ నెల 8 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటికీ సీపీఎం కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి జహంగీర్ తెలిపారు. శుక్రవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. వీటి పరిష్కారంపై ఎమ్మెల్యేలు, ఎంపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలేరు రెవెన్యూ డివిజన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బొలగాని జయరాములు పాల్గొన్నారు. -
దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు
పెద్దవూర : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నగూడెం గ్రామ సమీపంలో ఉన్న ప్రతాపగిరి లక్ష్మీనర్సింహాస్వామి (గుండ్లకాడి) కల్యాణ మహోత్సవానికి జస్టిస్ రాజశేఖర్రెడ్డి దంపతులు హాజరయ్యారు. స్వామివారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త, ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం సమీప గ్రామాల ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్రెడ్డి–కళ్యాణి దంపతులను దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్ సన్మానించారు. ఉత్సవాల్లో ఆలయ చైర్మన్ యడవెల్లి మనోహర్రెడ్డి, ఆలయ పూజారులు కందాళ అజయ్కుమార్, లోకాచార్యులు, విజయ్కుమార్, సర్పంచ్ పోశం రమణమ్మకోటిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి -
కర్ల రాజేష్ మృతిపై విచారణలో జాప్యం
నల్లగొండ టౌన్: కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి డీఎస్పీ రవిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. విచారణ అధికారిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒత్తిడి మేరకే రీ పోస్టుమార్టం నిర్వహించారన్నారు. దాని రిపోర్టు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నెల 8లోగా విచారణ పూర్తి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని, విచారణ ఆలస్యం చేస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, మేడి శంకర్, సునిల్, తరి ఏడుకొండలు, గోపాల్, కమలమ్మ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


