breaking news
Yadadri District Latest News
-
31న యువజనోత్సవాలు
భువనగిరి : ఈ నెల 31న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కె.ధనుంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదరగిరిగుట్టలోని స్కిల్ డవెలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు డిక్లమేషన్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. నవంబర్ 4న ఉదయం 9 గంటలకు భువనగిరి కోట వద్ద ఫోక్ డ్యాన్స్, ఫోక్సాంగ్ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 15 సంవత్సరాల వయస్సు పైబడి 29 సంవత్సరాలలోపు ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ :8309992451, 8374333378 నంబర్లను సంప్రదించాలని కోరారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కేసులురాజాపేట : నాణ్యత లోపించిన, కల్తీ ఆహార పదార్థాలు విక్రయించినా కేసులు తప్పవని జిల్లా తూనికలు, కొలతల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం రాజాపేట మండల కేంద్రంలోని కిరాణం షాపులు, జ్యూవెలరీ, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న ఆహార పదార్థాల గడువు, కంపెనీల వివరాలు, తూకం వేసే మిషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువు దాటిన వస్తువులు, గుర్తింపులేని కంపెనీల పదార్ధాలను విక్రయించొద్దన్నారు. ఆయన వెంట సిబ్బంది, ఆయా షాపుల యజమానులు ఉన్నారు. ముగిసిన తిరునక్షత్ర వేడుకలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్ర వేడుకలు సోమవారం ముగిశాయి. గత రెండు రోజులుగా ఆలయంలో మహాముని తిరునక్షత్ర వేడుకలు కొనసాగాయి. సాయంత్రం వేళ శ్రీస్వామి వారి సేవతో పాటు ఆళ్వారుల సేవను ఆలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. తిరువీధిలో పురఫ్పాట్ సేవను ఊరేగిస్తూ, ప్రబంధ పాశురాలను ఆలయ పారాయణీకులు, అర్చకులు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. శివకేశవులకు విశేష పూజలు యాదగిరిగుట్ట : శివ కేశవులు కొలువున్న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివుడికి, స్పటిక లింగానికి పూజారులు రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలను కొనసాగించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి భువనగిరి : జిల్లా స్థాయిలో 5, 4 స్టార్ పొందిన పాఠశాలలను భౌతికంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. సోమవారం రాయగిరి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్, సీనియర్ ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఎంపిక చేసిన పాఠశాలల్లో పక్కాగా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ అండాలు, శిక్షకులు శ్రీనివాస్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
సాక్షి, యాదాద్రి : రైతుల పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు, అలాగే పత్తి కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలపై సోమవారం భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటావేసి మిల్లులకు తరలించాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్ష సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఏసీపీ రాహుల్రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ, డీఎస్ఓ రోజారాణి, డీఏఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించాలిరాష్ట్రంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
లకీ్కగా వరించిన కికు్క
భువనగిరి : కొత్త మద్యం దుకాణాలకు టెండర్ల వేసిన దరఖాస్తుదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో 82 మద్యం షాపులకు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించగా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఈ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగేలా ట్రాఫిక్ సమస్యతోపాటు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెండర్ల కోసం దరఖాస్తు వేసిన వారిని మాత్రమే ఫంక్షన్ హాల్లోకి అనుమతించారు. దీంతో ఫంపక్షన్ హాల్ దరఖాస్తులదారులతో నిండిపోయింది. లాటరీ పద్ధతిలో షాపుకు ఎంపికై న వారు కేరింతలు చేస్తుంటే ఎంపిక కానివారు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధికారి విష్ణుమూర్తి, ఏసీపీ రాహుల్రెడ్డి, రూరల్ సీఐ చంద్రబాబు, ఎకై ్సజ్ శాఖ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లక్కీ లాటరీలో విశేషాలు..● చౌటుప్పల్ మండలం ఎల్లంబావి మద్యం షాపునకు అత్యధికంగా 91 దరఖాస్తులు రాగా ఈ షాపు వలిగొండకు చెందిన పోలు అండాలుకు లాటరీ ద్వారా లక్కు దక్కింది. అలాగే 83 దరఖాస్తులతో రెండో స్థానంలో ఉన్న అరూర్ మద్యం షాపు వలిగొండలోని బీసీ కాలనీకి చెందిన మైసోళ్ల ప్రవీణ్కు దక్కింది. ఇతడు ఈ షాపుకు ఒకటే దరఖాస్తు వేయడం ఎంపిక కావడం విశేషం. ● ఈ సారి మద్యం షాపుల ఎంపిక 22 మంది మహిళలకు అదృష్టం వరించింది. ఇందులో యువతులు సైతం ఉన్నారు. సెంటిమెంట్ పనిచేస్తుందని చాలా వరకు వ్యాపారులు మహిళలు, యువతుల పేరు మీదగా దరఖాస్తులు వేశారు. ● మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ భువనగిరి, రామన్నపేట, ఆలేరు, మోత్కూర్ ఎస్హెచ్ఓ క్రమంలో ఎంపిక చేశారు. ఆయా ఎస్హెచ్ఓ పరిధిలో ఉన్న షాపులకు 15 నంబర్ గల వారికి ఎక్కువగా షాపులు దక్కాయి. ● మద్యం షాపులను దక్కించుకునేందుకు ఎక్కువగా 10 నుంచి 20 మంది వ్యాపారుల వరకు సిండికేట్గా మారి టెండర్లు వేశారు. ప్రతి సిండికేట్ గ్రూపునకు 3 నుంచి 6 వరకు షాపులు దక్కాయి. ● ఈ సారి పాత వ్యాపారుల కంటే కొత్త దరఖాస్తుదారులకు ఎక్కువగా షాపులు దక్కాయి. ● లక్కీ డ్రాలో భార్యభర్తలకు ఆత్మకూర్(ఎం)లో ఒకరికి, మోత్కూరులో మరొకరి షాపులు దక్కడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ● మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30వరకు నిర్వహించుకోనున్నారు. ప్రశాంతంగా మద్యం షాపుల లక్కీ డ్రా రెండు గంటల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో దుకాణాలు కేటాయింపు -
● పోలీస్ అమరులను స్మరించుకుంటూ..
హామీలన్నీ అమలు చేస్తాంమోటకొండూర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మోటకొండూర్ మండల కేంద్రంలో నూతన తహసీల్థార్, ఎంపీడీఓ కార్యాలయాల భవన నిర్మాణాలకు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. రూ.10 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో పాటు రూ.250 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు కూడా మంజూరు చేయించామన్నారు. ప్రజాపాలనలో భాగంగా పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సాకారం చేస్తున్నామన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం, మహిళకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు వడ్డీలేని రూణాలు అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భవిష్యత్లో మంత్రిగా ఎదగాలంటే ఇక్కడి ప్రజలంతా ఆయనకు అండగా ఉండాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి కేసీఆర్ ఆండ్ కో మాత్రం రూ.లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. మోటకొండూర్ మండల కార్యాలయాలకు శంకుస్థాపనలు చేయటం ఇందుకు నిదర్శనమన్నారు. రెండేళ్లలో ఎంతో అభివృద్ధి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసి చూపిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో రూ.10 కోట్ల వ్యయంతో ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలోపు మార్కెట్ యార్డు, పీఏసీఎస్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ నూతన భవన నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటానికి అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు అందించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు ఝెల్లంల సంజీవరెడ్డి, బీర్ల శంకర్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఆలేరు, మోత్కూరు మార్కెట్ కమిటీల చైర్మన్లు ఐనాల చైతన్య మహేందర్రెడ్డి, విమల వెంకటేష్, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీఓ ఇందిర, పచ్చిమట్ల మదార్గౌడ్, కొంతం మోహన్రెడ్డి, గంగపురం మల్లేష్, నెమ్మాణి సుబ్రమణ్యం, భాస్కరుణి రఘునాథరాజు, సిరబోయిన మల్లేష్ యాదవ్, తండ పాండురంగయ్య గౌడ్, భూమండ్ల శ్రీనివాస్, బాల్ధ రామకృష్ణ, ఆరె ప్రశాంత్గౌడ్, గుండ్లపల్లి భరత్, బి.అశోక్, పి.కార్తీక్, వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మోటకొండూరులో ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి భూమిపూజ -
గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను ఆదివారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డ మల్లెతోట సమీపంలో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నారనే విస్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. పున్రెడ్డి కార్తీక్రెడ్డి, గొర్రెల సాయిశ్రీరామ్, బంటు నగేష్ను అదుపులోకి తీసుకున్నారు. వారికి టీహెచ్సీ కిట్లతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని ఎస్ఐ తెలిపారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించినట్లు పేర్కొన్నారు. కల్వర్టుపై వరద నీటిలో అదుపుతప్పిన కారు పెద్దవూర: కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిలో కారు అదుపుతప్పి కిందికి జారిపోయింది. ఈ ఘటన ఆదివారం పెద్దవూర మండలంలోని తుంగతూర్తి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతూర్తి గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు బంధువులు కారులో వచ్చారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొంచెం లోతులోనే నీరు ప్రవహిస్తుందని తప్పుగా అంచనా వేసిన డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. కల్వర్టు సగానికి పోగానే వరద ప్రవాహానికి కారు అదుపుతప్పి కిందికి జారిపోయింది. గమనించిన గ్రామస్తులు కారులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. పది మందికి పైగా ప్రయత్నించినా కల్వర్టు కింది నుంచి కారును పైకి తీసుకురాలేకపోయారు. దీంతో ట్రాక్టర్కు తాళ్లను బిగించి అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. -
రామ్మూర్తి యాదవ్తో అనుబంధం మరువలేనిది
త్రిపురారం: చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్తో తన అనుబంధం మరువలేనిదని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన రామ్మూర్తి యాదవ్ విగ్రహాన్ని ఆదివారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కెతావత్ శంకర్నాయక్, రామ్మూర్తి యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి జానారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్లకంటిగూడెంలో ఉన్న ఎల్–10 లిప్టు ఇరిగేషన్కు రామ్మూర్తి యాదవ్ పేరు పెడుతున్నట్లు గ్రామస్తుల సమక్షంలో జానారెడ్డి ప్రకటించారు. వరద కాల్వకు కూడా రామ్మూర్తి యాదవ్ పేరు పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే జైవీర్రెడ్డి మాట్లాడుతూ.. రామ్మూర్తి యాదవ్ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. గుండెబోయిన కోటేష్ యాదవ్, గుండెబోయిన నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా మహిళ అధ్యక్షురాలు గోపగాని మాధవి, మండల అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి, అనుముల శ్రీనివాస్రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు సోమయ్య, బహునూతుల నరేందర్, మర్ల చంద్రారెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్, గుండెబోయిన వెంకటేశ్వర్లు, అనుముల వెంకట్రెడ్డి, బహునూతుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అంబటి రాము, నాయిని సంతోష్కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తి యాదవ్ సేవలు మరువలేనివి చలకుర్తి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్యాదవ్ అన్నారు. పెద్దదేవులపల్లి గ్రామంలో రామ్మూర్తి యాదవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు హాజరై నివాళులర్పించారు. వారి వెంట ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, త్రిపురారం మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, అనుముల శ్యాంసుందర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి -
అనూషారెడ్డి మృతదేహం బంధువులకు అప్పగింత
గుండాల: ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు. అక్కడి జిల్లా ఉన్నతాధికారుల సమాచారం మేరకు మృతురాలి ఆధార్ కార్డు, తండ్రి ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు అకౌంట్ జిరాక్స్లను తీసుకొని ఆస్పత్రికి చేరుకున్న బంధువులకు మృతదేహం అప్పగించినట్లు చెప్పారు. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని వస్తాకొండూర్ తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 2 గంటల సమయంలో మృతదేహం గ్రామానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనూషారెడ్డి కుటుంబానికి పరామర్శ అనూషారెడ్డి కుటుంబాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆదివారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతిసంస్థాన్ నారాయణపురం: తల్లి కళ్ల ముందే కుమారుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జ గ్రామానికి చెందిన చెన్నోజు రామాచారి(26) హైదరాబాద్లో అద్దెకు ఉంటూ చిన్న చిన్న కంప్యూటర్ పనులు చేస్తూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. గుజ్జ గ్రామంలో నెల రోజుల క్రితం తన ఇంటికి మర్మమతులు చేపట్టారు. శనివారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన రామాచారి కొత్తగా కొనుగోలు చేసిన మోటారును ఆదివారం ఫిట్టింగ్ చేసి గోడలకు నీళ్లు కొట్టాడు. ఈ క్రమంలో రామాచారి పూర్తిగా తడిసిపోయాడు. గోడలకు నీళ్లు కొట్టడం పూర్తికావడంతో తల్లి చంద్రకళను మోటారు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడు. ఈ క్రమంలో మోటారు దగ్గర ఉన్న వైరు ప్లగ్ తీస్తుండగా.. రామాచారి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చంద్రకళకు కూడా ఎర్తింగ్ రావడంతో ఆమె కర్ర తీసుకొని రామాచారి చేతిలోని వైరును తొలగించి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్ల వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్ తెలిపారు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరిణులున్నారు. -
అందుబాటులోకి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ భవనం
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్, అకాడమీ భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో నిమ్స్ ఆస్పత్రి కోసం 2009లో నిర్మించిన భవనంలో కొనసాగుతూ వచ్చిన కార్యకలాపాల విభాగాలను నూతన భవనం నుంచి కొనసాగిస్తున్నారు. నూతన భవనాన్ని అధునాతనంగా నిర్మించడంతో లోపలి భాగం అద్దాల మేడలా దర్శనమిస్తోంది. భవనం ముందు గ్రీనరీ, విద్యుత్ దీపాల ఏర్పాటు, ఎంట్రెన్సీ పనులను చేపడుతున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ భవనం ఆకట్టుకుంటోంది. -
రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది
నల్లగొండ: రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చైతన్యం లేకనే అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్(టీఆర్ఎల్డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. టీఆర్ఎల్డీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర ఆదివారం నల్లగొండకు చేరుకుంది. ఈ సందర్భంగా క్లాక్టవర్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 98శాతం బడుగు వర్గాలే ప్రాణాలు వదిలారన్నారు. అయినా బహుజన తెలంగాణ రాలేదన్నారు. హరీష్రావు, సంతోష్రావు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించారని కల్వకుంట్ల కవిత ఆరోపించిందని గుర్తుచేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆయనకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి బీఫారం లభించని వారు తనను సంప్రదిస్తే టీఆర్ఎల్డీ పార్టీ నుంచి బీఫారంలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు ముద్దము మల్లేష్, బండిపాడు జానయ్య, నర్సింగ్ రావు, సుధాకర్, బీరప్ప, కోరే సాయిరాం పాల్గొన్నారు. జాతీయ రహదారిపై వాహనాల బారులుచౌటుప్పల్ : 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్తో పాటు పెద్ద సంఖ్యలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండడంతో హైదరాబాద్–విజయవాడ మార్గంలో వాహనాలు బారులుదీరాయి. రద్దీ కారణంగా చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా జంక్షన్ను పోలీసులు మూసివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఆర్టీసీ బస్స్టేషన్, వలిగొండ క్రాస్రోడ్డుల మీదుగా రాకపోకలు కొనసాగించాల్సి వచ్చింది. వాహనాల రద్దీకి వారాంతపు సంత జనం సైతం తోడుకావడంతో మరింత గజిబిజి ఏర్పడింది. గూడూరు టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ బీబీనగర్: బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. ఉదయం భువనగిరి వైపు, సాయంత్రం హైదరాబాద్ వైపు వాహనాలు బారులుదీరాయి. ఫ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ -
త్రిఫ్ట్ డబ్బులేవీ..!
భూదాన్పోచంపల్లి: చేనేత కార్మికులకు నాలుగు నెలలుగా త్రిఫ్ట్ (పొదుపు పథకం) డబ్బులు రావడంలేదు. ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి త్రిఫ్ట్ (పొదుపు పథకాన్ని) అమలు చేస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉన్న మండలాలు, గ్రామాలలో అధికారులు సమావేశాలు నిర్వహించి త్రిఫ్ట్ పథకంపై అవగాహన కల్పిస్తూ కార్మికుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 10,790 మంది మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు త్రిఫ్ట్ పథకంలో చేరారు. అమలు ఇలా.. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న చేనేత కార్మికులు తమ వేతనం నుంచి 8 శాతం వాటాను రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) అకౌంట్–1లో జమ చేస్తే ప్రభుత్వం ఆ మొత్తానికి రెండింతలు అనగా 16 శాతం మ్యాచింగ్ గ్రాంటును ఆర్డీ అకౌంట్–2లో కార్మికుడి ఖాతాలో జమ చేస్తుంది. కార్మికుడు పనిచేసిన నెల వేతనం నుంచి గరిష్టంగా రూ.12వేలు, అనుబంధ కార్మికుడైతే రూ.800 బ్యాంకులో జమచేసుకోవచ్చు. రెండేళ్ల మెచ్యూరిటీ అనంతరం జమ అయిన మొత్తాన్ని కార్మికుడు డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మర మగ్గాలకు కూడా కార్మికులు గరిష్టంగా నెలకు రూ.1000, అనుబంధ కార్మికుడు రూ.600 జమచేస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో ఆర్డీ–2 అకౌంట్లో జమ చేస్తుంది. ఒక్క నెల మాత్రమే జమ.. త్రిఫ్ట్ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులు ఆయా బ్యాంకుల్లో ఆర్డీ–1 అకౌంట్లు తెరిచి నెలనెలా వస్తున్న ఆదాయం నుంచి తమ వాటా కింద రూ.1.85 కోట్లు జమ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా తమ వాటా కింద రెండింతలు అనగా రూ.2.17 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం మే నెల మాత్రమే తమ వాటా జమ చేసింది. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలలుగా అకౌంట్లో డబ్బులు జమ చేయడంలేదు. ఫ నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి జమకాని డబ్బులు ఫ నెలనెలా డబ్బులు జమ చేయాలని కోరుతున్న చేనేత కార్మికులు -
స్కాన్ చేస్తే పాఠాలు
రామగిరి(నల్లగొండ): కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. విద్యార్థులకు సాంకేతికతను వినియోగించి ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో దీక్ష(డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) యాప్ను ప్రవేశపెట్టింది. విద్యార్థులు రోజువారీ పాఠాలు వినేలా ఈ యాప్ను రూపొందించారు. ఇదొక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఏదైనా కారణాల చేత విద్యార్థి పాఠశాలకు గైర్హాజరు అయితే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినే అవకాశం ఉండదు. ఆ ఇబ్బంది లేకుండా దీక్ష యాప్ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పాఠ్యపుస్తకంపై ఉన్నక్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠాలు వినవచ్చు. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం, మరాఠీ వంటి ప్రముఖ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఫ దీక్ష యాప్లో పాఠశాల సిలబస్ ఫ ప్రతి పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఫ సులభంగా అర్ధమయ్యేలా రూపకల్పన -
ముగిసిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆఖరి రోజు నాకౌట్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ద్వితీయ స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి ట్రోఫీలు అందజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను మధ్యప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ పోటీల రాష్ట్ర పరిశీలకుడు ప్రసాద్, కళాశాల పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు అంజనేయులు, నర్సింహ, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ఫ ప్రథమ స్థానంలో వరంగల్, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్లు ఫ జాతీయ స్థాయి పోటీలకు 15 మంది ఎంపిక -
వలస కూలీలపై ఫోకస్
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలో ఇటీవల పశ్చిమబెంగాల్కు చెందిన ఓ వ్యక్తి ఒకరికి రూ.12 వేల నగదు ఇచ్చి తనకు అకౌంట్కు ఫోన్ పే చేయించుకున్నాడు. తీరా చూస్తే అవి దొంగనోట్లుగా తేలాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్కు చెందిన మరో వ్యక్తి చైన్ స్నాచింగ్కు పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు. ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వలస కూలీలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది.వారు అద్దెకు ఉంటున్న ఇళ్లకు వెళ్లి యజమానులను సంప్రదించి కూలీల వివరాలు సేకరిస్తుంది. వేలల్లో వలస కార్మికులు జిల్లాలో వలస కూలీలు నానాటికీ పెరిగిపోతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వలస కార్మికులు భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్తో పాటు ఆయా మండల కేంద్రాల్లో నివాసం ఉంటూ పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు, ఇటుకబట్టీలు, గృహ నిర్మాణ పనులు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో అధికంగా.. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ఎక్కువగా జిల్లా కేంద్రంలో తిష్టవేశారు. అనధికార లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 30వేల మంది వలస కార్మికులు ఉండగా.. వీరిలో భువనగిరి పట్టణంలోనే 10 వేల మంది వరకు ఉంటున్నట్లు తెలిసింది. చాలా కాలనీల్లో ఐదారుగురు కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వస్తున్నారు. వారి డేటాను పోలీసుల ఆధీనంలో ఉండాలన్న ఉద్దేశంతో సెర్చ్ చేస్తున్నాం. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో వలస కార్మికుల కార్యకలాపాలపై నిఘా పెట్టాం. అందులో భాగంగానే వారి వివరాలు సేకరిస్తున్నాం. ఇక నుంచి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి భువనగిరికి ఎవరు వచ్చినా పట్టణ పోలీస్స్టేషన్లో వివరాలు నమోదు చేయించుకోవడంతో పాటు బయోమెట్రిక్ వేయాలి. –రమేష్కుమార్, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే మకాం ఫ పలు నేరాల్లో వీరి ప్రమేయం ఫ అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఫ భువనగిరి పట్టణంలో తనిఖీలు, వివరాల సేకరణ, రికార్డుల్లో నమోదు ఫ కొత్తగా వచ్చిన కూలీలు పోలీస్స్టేషన్లో బయోమెట్రిక్ వేయాల్సిందేభువనగిరిలో పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ నెల 22వ తేదీ నుంచి వలస కూలీల వివరాలు సేకరిస్తున్నారు. పట్టణంలో వివిధ ప్రాతాల్లో నివాసం ఉంటున్న వలస కార్మికుల వద్దకే పోలీసులు వెళ్లి ఒక్కొక్కరిని పిలిచి పేరు, రాష్ట్రం, చేస్తున్న పని, ఇల్లు అద్దెకు ఇప్పించిన వ్యక్తి పేరు రికార్డులో నమోదు చేసుకుంటున్నారు. ఆధార్కార్డులను పరిశీలించి నంబర్ రికార్డ్ చేస్తున్నారు. సెల్ఫోన్లో వారి ఫొటోలను తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంటి యజమానులను సైతం ప్రశ్నిస్తున్నారు. ఎవరి చెబితే వలస కార్మికులు ఇల్లు అద్దెకు ఇచ్చారని వివరాలు తీసుకుంటున్నారు. -
నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీమణవాళ మహాముని తిరునక్షత్ర వేడుకలను ఆదివారం నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం స్నపన తిరుమంజన అభిషేకం, సేవా కాలాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి పురఫ్ఫాట్ సేవ జరిపించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆల య ముఖ మండపంలో సేవాకాలం జరిపించి, ప్రబంధ పారాయణాలను పఠించారు. మోటకొండూరుకు నేడు మంత్రుల రాక మోటకొండూర్: రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సోమవారం మోటకొండూర్కు రానున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంత రం బహిరంగ సభలో మంత్రులు ప్రసంగిస్తారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్యరెడ్డి, పచ్చిమట్ల మదార్గౌడ్, నెమ్మాణి సుబ్రహ్మణ్యం, కొంతం మోహన్రెడ్డి, భాస్కరుణి రఘునాథరాజు, తహసీల్దార్ నాగదివ్య, భూమండ్ల శ్రీనివాస్, బాల్ద సిద్ధులు, సీఐ శంకర్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని తహసీల్దార్ పరిశీలన చేస్తుండగా ఎమ్మార్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తమ భూములు అంటూ వాగ్వాదానికి దిగారు. ఎస్సీల భూములు తీసుకోబోమని, ఇది ఎస్సీలది అయితే పక్కన అంతే భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు. స్వర్ణగిరీశుడికి తిరువీధి సేవ భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో అదివారం సాయంత్రం శ్రీవేంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ కనుల పండువగా నిర్వహించారు.అంతకు ముందు ఉదయం ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాలసేవ, సహస్రనామార్చన సేవ, నిత్యకల్యాణం, దామోదర హవనం, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. చేనేత కళ భేష్చౌటుప్పల్ రూరల్: ప్రాచీన హస్తకళలు, ప్రకృతి రంగులతో చేనేత వస్త్రాలు తయారీ చేయడం అభినందనీయమని నార్వే దేశస్తుడు లాస్ నీల్సన్ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలో చేనేత వస్త్రాలు తయారు చేసే విధానం, దండుమల్కాపురం టెక్స్టైల్ పార్క్లో వస్త్రాల తయారీని ఆదివారం పరిశీలించారు. కొయ్యలగూడెంలో జాతీయ పురస్కార గ్రహీత దుద్యాల శంకర్ ఇంటిని సందర్శించారు.మగ్గంపై వస్త్రాలను నేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వెదురుతో ఇళ్లు నిర్మించడంతో పాటు కళాకారుడు శ్రవణ్ వివిధ రకాలుగా తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. -
నిరుపేదల కళ్లలో వెలుగులు
రామన్నపేట: తల్లితండ్రులను స్ఫూర్తిగా తీసుకొని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి పూనుకున్నారు.. మునిపంపులకు చెందిన ఎన్నారై దేవిరెడ్డి పద్మా వీరేందర్రెడ్డి దంపతులు. స్వగ్రామంతో 14 పరిసర గ్రామాల ప్రజల కోసం మునిపంపులలో ఉచిత కంటి పొర చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి చికిత్సలు చేసి వారికి వెలుగులు పంచుతున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో సామాజిక సేవ దేవిరెడ్డి రామిరెడ్డి 25 ఏళ్లు మునిపంపుల సర్పంచ్గా పనిచేశారు. ఆయన సతీమణి సావిత్రమ్మ కూడా ఏడేళ్లు సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్దికి పాటుపడ్డారు. 80 పదుల వయసులోనూ సావిత్రమ్మ ఇప్పటికీ గ్రామాభివృద్ధికి, పేదవారి బాగోగుల కోసం తాపత్రయ పడుతుంది. వారి కుమారుడు దేవిరెడ్డి వీరేందర్రెడ్డి అమెరికాలో స్థిరపడ్డాడు. తల్లిచేతుల మీదుగా పేదలకు, అపన్నులకు సహాయం అంద జేస్తున్నారు. కంటిపొర చికిత్స శిబిరానికి భారీ స్పందనకొద్ది రోజుల క్రితం ఊరికి వచ్చిన వీరేందర్రెడ్డి–పద్మ దంపతులు ఉచిత కంటిపొర చికిత్స శిబిరం నిర్వహించాలని సంకల్పించారు. తల్లి సావిత్రమ్మతో తమ అభిప్రాయాన్ని గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు 50 మందికి వలంటీర్లుగా ఏర్పడి తో డ్పాటునందించారు. వైద్యశిబిరం ఏర్పాటుపై 14 గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామాల వారీగా తేదీలు నిర్ణయించి టోకెన్లు జారీ చేశారు. ఈనెల 22న నకి రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ హను మంతరావు చేతుల మీదుగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. హెదరాబాద్ శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఐదు రోజుల్లో 1,200 మందికి నేత్ర పరీక్షల చేసి 914మందికి ఉచితంగా కళ్ల దాలు పంపిణీ చేశారు. 60మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించి.. ఆదివారం మొబైల్ థియేటర్లో 24మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ వైద్యశిబిరం ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఫ ఎన్ఆర్ఐ చొరవతో మునిపంపులలో ఉచిత కంటిపొర చికిత్స శిబిరం ఫ ఇళ్ల వద్దకు వెళ్లి ఆపరేషన్లు, ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ ఫ శంకర్ నేత్రాలయం వారి మొబైల్ థియేటర్లో 1,200 మందికి చికిత్స -
లక్కు ఎవరికో?
భువనగిరి: మద్యం దుకాణాలకు సోమవారం డ్రా తీయనున్నారు. ఇందుకోసం భువనగిరి మండలం రాయగిరిలోని సోమరాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఎకై ్సజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,766 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి షాపునకు 91, కని ష్టంగా మోటకొండూరులోని వైన్స్కు 18మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. అదృష్టం ఎవరిని వ రించనుందోనని దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంట్రీపాస్ ఉంటేనే అనుమతి కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎంట్రీ పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. ఫంక్షన్ హాల్లోకి ఫోన్ అనుమతి లేదు. మొదట భువనగిరి, తర్వాత రామన్నపేట, ఆలేరు, మోత్కూర్ సర్కిళ్ల పరిధిలోని వైన్స్లకు డ్రా తీయనున్నారు. ఉదయం 11 గంటలకు డ్రా ప్రారంభం కానుందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. కార్యక్రమం సాఫీగా ముగిసేందుకు దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు. ఫ నేడు మద్యం దుకాణాలకు డ్రా ఫ సోమరాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు -
పత్తి రైతుకు కపాస్ కష్టాలు
అడ్డగూడూరు: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకువచ్చిన నూతన నిబంధనలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దళారుల ప్రమేయాన్ని నివారించేందుకు కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తెచ్చింది. సీసీఐలో పత్తి అమ్మాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. అందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబర్ ఆధారంగా వచ్చే ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్పై రైతులకు వారం రోజులుగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దళారులకు చెక్ పెట్టడానికి, కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి రైతులు నిరీక్షించకుండా ఉండేందుకు కొత్త విధానం బాగానే ఉన్నప్పటికీ రైతుల్లో అయోమయం నెలకొంది. ప్రధాన సమస్యలివీ.. పత్తి సాగు చేసిన రైతుల్లో అధికంగా నిరక్షరాస్యులే ఉన్నారు. వీరిలో చాలా మందికి స్మార్ట్ఫోన్లు లేవు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న రైతులకు వాటి వినియోగంపై సరైన అవగాహన లేదు. దీంతో యాప్ను ఫోన్లో డౌన్లోడ్, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఇతరులపై రైతులు ఆధారపడాల్సి వస్తుంది. వ్యవసాయ శాఖ ద్వారా స్లాట్ బుక్ చేసుకునేందుకు వెళ్లినా వారు సమయానికి అందుబాటులో ఉండటం లేదని రైతులు అంటున్నారు.మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగా రావడం లేదని రైతులు అంటున్నారు. ఫోన్లలో ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని సిగ్నల్స్ అందే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇన్ని గందరగోళ పరిస్థితుల్లో రైతులు మళ్లీ ప్రైవేట్ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే అవకాశాలున్నాయి. కొనుగోళ్లకు ఏర్పాట్లు పత్తి కొనుగోళ్లకు సీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జిన్నింగ్ మిల్లులను అలాడ్ చేయగా.. సోమవారం (నేడు) నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుంది. జిల్లాలో 65,198 మంది రైతులు 1,27,06 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 6 నుంచి 8లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు 12 జిన్నింగ్ మిల్లుల్లో సీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ.8,110, 12 శాతం ఉన్న ఉన్న పత్తికి క్వింటాకు రూ.7,785 మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చిన సీసీఐ ఫ యాప్లో స్లాట్ బుక్ చేస్తేనే కొనుగోళ్లు ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు ఫ నిరక్షరాస్యత, స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, సిగ్నల్స్ అందక కర్షకుల ఇబ్బందులు ఫ మరొకరిపై ఆధారపడాల్సిన దైన్యం ఫ నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పత్తి విక్రయించే రైతుల కోసం సీసీఐ హెల్ప్లైన్ 8978978517, టోల్ఫ్రీ 8005995779 నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్ల ద్వారా సీసీఐ కేంద్రాల వివరాలు, స్లాట్ బుకింగ్ తేదీ, తక్ పట్టి, చెల్లింపులు తదితర అంశాలను రైతులు తెలుసుకునేందుకు వీలుంటుంది. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం. సోమవారం నుంచి కపాస్ కిసాన్ యాప్ అందుబాటులో వస్తుంది. సీసీఐకి పత్తి విక్రయించే రైతులు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలి. నూతన విధానంతో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సీసీఐకి పత్తి అమ్ముకోవచ్చు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పత్తి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి. –వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
అప్పు చేసి.. జూదం ఆడి
ఆలేరు: అప్పు చేసి జూదం ఆడి లక్షల రూపాయలు నష్టపోయిన వ్యక్తిని అప్పు ఇచ్చినవారు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. శనివారం వారి కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి తాళం వేవశారు. బాధిత కుటుంబం డయల్ 100కు ఫోన్చేసి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఆలేరు పోలీసులు వచ్చి విడిపించారు. బాధిత కుటుంబం, ఆలేరు సీఐ యాలాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన బిర్రు లక్ష్మీపతి వాటర్ ప్లాంట్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొందరు వ్యక్తులు గోవా క్యాసినో జూదం ఆడితే లక్షల్లో సంపాదించవచ్చని లక్ష్మీపతికి ఆశ చూపారు. మల్లేష్ అనే వ్యక్తి లక్ష్మీపతితో పాటు మరికొందరిని 30 రోజులకొకసారి గోవాకు తీసుకువెళ్లి క్యాసినో జూదం ఆటను పరిచయం చేశాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా దడిగ రమేష్ అనే వ్యక్తి అప్పు రూపంలో లక్ష్మీపతికి ఇస్తూ వచ్చాడు. ఇందుకు గాను రూ.లక్షకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వడ్డీ వేశాడు. గడిచిన ఆరు నెలలుగా రమేష్ నుంచి లక్ష్మీపతి సుమారు రూ.13లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. ఇందుకు లక్ష్మీపతికి చెందిన రెండు వందల గజాల ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టుకున్నాడు. మరికొందరి నుంచి కూడా లక్ష్మీపతి అధిక వడ్డీకి రూ.17లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. ఆరు నెలల్లో రూ.30లక్షలు నష్టం ఇలా మొత్తం రూ. 30లక్షల మేరకు అప్పులు చేశాడు. మొదట క్యాసినో జూదంలో కాస్తోకూస్తో డబ్బులు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత లక్ష్మీపతి రూ.లక్షల్లో నష్టపోవడంతో రూ.30లక్షల అప్పు మిగిలింది. ఈ విషయం తెలుసున్న అప్పు ఇచ్చినవారు తీసుకున్న అప్పు చెల్లించాలని లక్ష్మీపతిపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. తాకట్టు పెట్టిన ఇంటి స్థలాన్ని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని రమేష్ లక్ష్మీపతిపై ఒత్తిడి పెంచాడు. ఆరు నెలలు గడువు ఇస్తే దశలవారీగా అందరి అప్పు చెల్లిస్తానని లక్ష్మీపతి ప్రాధేయపడినా అప్పు ఇచ్చినవారు వినకుండా వేధించడం మొదలుపెట్టారు. రెండు నెలల కిత్రం లక్ష్మీపతికి చెప్పకుండా అతడి ఇంటి వద్ద ఉన్న ఆటోను సైతం అప్పు ఇచ్చినవారు తీసుకెళ్లారు. శనివారం ఉదయం లక్ష్మీపతితో పాటు అతడి కుటుంబ సభ్యలు ఇంట్లో ఉండగా బయట నుంచి అప్పు ఇచ్చిన రమేష్ తాళం వేసి వారిని నిర్బంధించాడు. దీంతో లక్ష్మీపతి డయల్ 100కు ఫోన్చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆలేరు పోలీసులు వచ్చి నిర్బంధం నుంచి వారిని విడిపించారు. అనంతరం లక్ష్మీపతి, అతడి భార్య పోలీస్ స్టేషన్కు చేరుకొని దడిగే రమేష్తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి అప్ప ఇచ్చినవారి నుంచి రక్షణ కల్పించాలని, అప్పు తీర్చడానికి ఆరు నెలలు గడువు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ యాలాద్రి పేర్కొన్నారు. ఫ లక్షల రూపాయలు నష్టపోయిన బాధితుడు ఫ అప్పు తీర్చాలంటూ బాధిత కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి తాళం ఫ డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో వచ్చి విడిపించిన పోలీసులు -
యాదగిరిగుట్టలో భక్తులకు అన్న ప్రసాదం
యాదగిరిగుట్ట: కార్తీక మాసంలో వచ్చే ప్రతి శని, ఆదివారాల్లో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే రెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తామని ఇటీవల ఆలయ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం దీక్షపరుల మండపంలో రెండు వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేసి అన్న ప్రసాదాన్ని అందించారు. నల్లబెల్లం, పటిక పట్టివేత ఫ నలుగురి అరెస్ట్, రిమాండ్కు తరలింపు తిప్పర్తి: అక్రమంగా నల్లబెల్లం, పటిక తరలిస్తున్న వ్యక్తులను తిప్పర్తి శివారులో శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తిప్పర్తి మండల కేంద్రం శివారులో వాహనాలు తనిఖీల్లో భాగంగా పోలీసులు అటుగా వచ్చిన గూడ్స్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 2880 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటికను గుర్తించారు. గూడ్స్ వాహనంలోని గరికమల్ల హిమవత్తు, దూదేకుల ముబారక్, యన్నమల్ల సాయి, మాలవత్ సాయిని అదుపులో తీసుకొని విచారించగా.. ఏపీలోని చిత్తురు నుంచి మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ బంగ్లాకు సరఫరా చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నాఉ. పట్టుబడిన నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వి. శంకర్ తెలిపారు. -
శోకసంద్రంలో అనూషారెడ్డి కుటుంబం
గుండాల: కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహేశ్వరం విజిత, శ్రీనివాస్రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుర్లే కావడంతో అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించారని బంధువులు పేర్కొన్నారు. కూతుర్లే అండగా ఉంటారని ఆశించిన తమకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడని అనూషారెడ్డి తల్లిదండ్రులు విలపించారు. చిన్నతనం నుంచి అనూషారెడ్డి తన తెలివితేటలతో తమకు వారసుడు లేడన్న ఆలోచన లేకుండా చేసిందని విలపిస్తున్న తీరును చూసి బంధువులు కంటతడి పెట్టారు. కాగా కాలిపోయిన మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. మృతదేహాన్ని 48 గంటల తర్వాత కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు తెలిపినట్లు బంధువులు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి ఆత్మహత్యయాదగిరిగుట్ట రూరల్: ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతం ఆదిత్య నగర్లో నివాసముంటున్న లింగాల భానుప్రకాష్(30)కు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రసన్నతో వివాహం జరిగింది. భానుప్రకాష్కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై స్కూటీపై ఇంటి నుంచి బయల్దేరి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలో రైల్వే ట్రాక్ ప్రక్కన స్కూటీని ఉంచి, శుక్రవారం అర్ధరాత్రి ఆలేరు–వంగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహాత్య చేసుకున్నాడు. శనివారం రైల్వే మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో మృతి
మోత్కూరు, ఆత్మకూరు(ఎం): ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో పనిచేస్తున్న వర్కర్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరులో శనివారం జరిగింది. ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామానికి చెందిన మద్దిపడిగె నర్సిరెడ్డి–శ్రీలత దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు భాస్కర్రెడ్డి (23) మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో పనిచేస్తున్నాడు. శనివారం వైండింగ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ను టెస్టింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. గమనించిన తోటి వర్కర్లు కరెంట్ బంద్ చేసి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భాస్కర్రెడ్డి మృతిచెందాడు. రిపేరు సెంటర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే భాస్కర్రెడ్డి చనిపోయారని తోటి సిబ్బంది ఆరోపించారు. షెడ్డులో వర్కర్లకు సరైన రక్షణ పరికరాలు సమకూర్చడం లేదన్నారు. గతంలో రెండు సంవత్సరాల పాటు ట్రాన్స్ఫార్మర్ రిపేరు సెంటర్లో పనిచేసి జీతం సరిపోవడం లేదని హైదరాబాద్కు వెళ్లిపోగా.. జీతం పెంచుతానని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో తిరిగి ఇక్కడికి వచ్చినట్లు తోటి వర్కర్లు తెలిపారు. భాస్కర్రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భాస్కర్రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం పారుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో..
చౌటుప్పల్ రూరల్: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెగూడెం గ్రామానికి చెందిన గండికోట విగ్నేష్(26) ఇంటర్ వరకు చదివి ట్రాక్టర్ కొనుక్కొని గ్రామంలోనే తమకున్న వ్యవసాయ భూమితో పాటు మరో 10ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. విగ్నేష్ అన్న దుబాయ్లో పనిచేస్తుండగా దీపావళి పండగకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం విగ్నేష్ అన్న తిరిగి దుబాయ్కి వెళ్తుండడంతో అతడిని కారులో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దించి వచ్చాడు. అనంతరం రాత్రి తాను ప్రేమించిన యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన విగ్నేష్ తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ స్టేటస్లో పోస్టు చేశాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లి చూడగా.. అప్పటికే విగ్నేష్ పురుగుల మందు తాగి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం విగ్నేష్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు దుబాయ్ నుంచి రాగానే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి గండికోట రాందాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నర్సిరెడ్డి తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య -
పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు
భూదాన్పోచంపల్లి: పోచంపల్లిలో శనివారం ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు సందడి చేశారు. హైదరాబాద్లోని హామ్స్టక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటిక్ టెక్నాలజీకి చెందిన 42 మంది విద్యార్థులు స్థానిక టూరిజం పార్కును సందర్శించారు. అక్కడ ఇక్కత్ ప్రాముఖ్యతను తెలియజెప్పే ఏవీని తిలకించారు. అనంతరం మగ్గాలు, ఆసు యంత్రం, చిటికి కట్టడం, ఇక్కత్ చేనేత వస్త్రాలు, డిజైనింగ్ను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల తయారీ విధానం, వాటి ప్రాముఖ్యత, కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటు ధర తదితర విషయాలను చేనేత కళాకారుడు భారత ప్రవీణ్ వారికి వివరించారు. అనంతరం కళాశాల టెక్స్టైల్ ఫ్యాకల్టీ సౌజన్య మాట్లాడుతూ.. ఫ్యాషన్ డిజైనింగ్, స్టైలిష్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా చేనేత కార్మికుల జీవన స్థితిగతులు, ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత, వారు అవలంబిస్తున్న సాంప్రదాయ విధానాలు, కళాకారుల శ్రమ విలువను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి పోచంపల్లికి వచ్చారని తెలిపారు. వారి వెంట మార్కెటింగ్ ఫ్యాకల్టీ దివ్యలక్ష్మి, క్యాడ్ ఫ్యాకల్టీ ప్రతిమ ఉన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు(అండర్–19) శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడా రంగానికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు పెంచాలని అన్నారు. క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఆడి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అననారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ రమణి, ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, పీడీ ఎన్. ప్రసాద్, వాలీబాల్ క్రీడల రాష్ట్ర పర్యవేక్షకుడు శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపాల్ బాలరాజు, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. ఫ వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు -
మిర్యాలగూడ డిపో బస్సుకు ఏపీలో ప్రమాదం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద శనివారం జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు లారీకి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ గోనానాయక్, కండక్టర్ వి. లింగయ్య, ప్రయాణికులు ఎస్. రవి, మంజుల, ధనమ్మ, సంతోషం, దేవసాయం, రజనిబాయి, నజీమా, రిజ్వానాకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గురజాల, దాచేపల్లిలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డిపో మేనేజర్ రాంమోహన్రెడ్డి, సేఫ్టీ వార్డెన్ శ్రీనివాస్, టీఐ– నాగమణి, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ జానకిరాంరెడ్డి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికులను పరామర్శించారు. ఈ మేరకు దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన పల్లె వెలుగు బస్సు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద ఘటన -
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
హాలియా: బైక్పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి చెట్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఆడపు వెంకటయ్య(55) శనివారం బైక్పై గుర్రంపోడులో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డ్రయ్యర్ ట్రయల్ రన్
చౌటుప్పల్: ‘నిరుపయోగంగా డ్రయ్యర్లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ అధికారులు స్పందించారు. మార్కెట్ యార్డులో నిర్మించిన గోదాంలో ఉంచిన డ్రయ్యర్ను శనివారం యార్డులోకి తీసుకొచ్చారు. మార్కెట్ సెక్రటరీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్తో పాటు డ్రయ్యర్ కోసం 40లీటర్ల డీజిల్ను తెప్పించారు. ట్రాక్టర్ ట్రాలీ నిండుగా ఉన్న ధాన్యాన్ని డ్రయ్యర్లో నింపారు. డ్రయ్యర్ వినియోగంపై రైతులు అవగాహన కల్పించారు. -
వాలీబాల్ పోటీలు..
భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. - 8లో- 9లోయూత్ లైఫ్స్టైల్ మారింది. క్రీడా రంగంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొస్తోంది. ఇలా పాశ్చాత్య క్రీడ అయిన స్నూకర్ చిన్నపట్టణాలకూ విస్తరిస్తోంది. ఈ ఆటకు గతంలో మన దగ్గర మంచి ఆదరణ ఉండేది. సినిమాల్లో హీరోలు స్నూకర్ గేమ్ ఆడుతూ ఉన్న సీన్లు ఉండేవి. కొంతకాలం కనుమరుగైన ఈ స్నూకర్ గేమ్ ఇప్పుడు మెల్లమెల్లగా నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తోంది. స్టేటస్కు ప్రతీకగా భావించే ఈ క్రీడను ఆడేందుకు ప్రస్తుతం యువత ఆసక్తి చూపిస్తోంది. స్నూకర్.. చిన్న పట్టణాలకు విస్తరిస్తున్న పాశ్చాత్య క్రీడ పట్టణాల్లో వెలుస్తున్న స్నూకర్ పాయింట్లు ఆసక్తి చూపుతున్న యువతరిలాక్సేషన్ గేమ్రామగిరి (నల్లగొండ) : స్నూకర్ గేమ్ మళ్లీ విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి తదితర పట్టణాల్లో స్నూకర్ పాయింట్లు వెలుస్తున్నాయి. స్నూకర్ ఆడేందుకు పట్టణవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రూ.లక్షల వెచ్చించి స్నూకర్ పాయింట్లను ఏర్పాటు చేస్తూ నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. బ్రిటన్ గేమ్ స్నూకర్.. పార్టీ గేమ్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుంచి మన దగ్గరకు దూసుకొచ్చింది. యూరప్లోని బ్రిటన్ దేశంలో స్నూకర్ ఆట పురుడు పోసుకుంది. కాలక్రమేణా మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. రిలాక్సేషన్తోపాటు టీమ్ బాండింగ్కు ఉపయోగపడే ఈ స్నూకర్ ఇప్పుడు యూత్కు క్రేజ్గా మారింది. చిన్న పట్టణాలకు విస్తరణ ఒకప్పుడు క్లబ్బులు, స్పోర్ట్స్ అకాడమీల్లో ఉండే స్నూకర్ గేమ్ ఇప్పుడు చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ మాదిరిగా ప్రస్తుత యువతకు స్నూకర్ ఒక గేమ్గా మారింది. దీని కోసం ప్రత్యేకంగా హాల్ నిర్మించి గేమ్ ఆడడానికి కావాల్సిన సామగ్రిని సమకూర్చుతున్నారు. ఒకేచోట రెండు నుంచి మూడు టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆడేవారి నుంచి గంటల వారీగా లేదా ఒక ఆటకు రూ.150 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు. స్నూకర్ పాయింట్లలో చదువుకునే వారు ఉద్యోగాలు చేసేవారు రోజూ సాయంత్రం వచ్చి గేమ్ ఆడుతున్నారు. కొన్నిసార్లు యువతులు కూడా వచ్చి స్నూకర్ ఆడుతున్నారు. స్నూకర్ ఆట అంటే అమితమైన ఇష్టం. 1994 నుంచి స్నూకర్ ఆడుతున్నా. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే స్నూకర్ గేమ్ ఆడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో కూడా స్నూకర్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువత ఎక్కువ మంది ఆడడానికి అవకాశం ఉంది. – షకీర్, నల్లగొండ నేను రోజూ స్నూకర్ ఆడతాను. ఏడు సంవత్సరాలుగా ఈ గేమ్ అడుతున్నాను. ఒకవేళ హాలిడేస్లో వేరే పట్టణాలకు వెళ్తే అక్కడ కూడా ఆడుతాను. రోజుకు కనీసం రెండు గేమ్లు ఆడతాను. –ఎండీ.ఇమద్, నల్లగొండ నల్లగొండ స్నూకర్ పాయింటు ఏర్పాటు చేసి సంవత్సరం అవుతోంది. మొదటగా ఆడేవారు పెద్దగా రాలేదు. ఇప్పుడు యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సమయాల్లో లేడీస్ కూడా వచ్చి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆదరణ బాగానే ఉంది. హాలిడేస్లో ఆడే వారి సంఖ్య ఎక్కవగా ఉంటుంది. – ఎండీ.ముజఫర్, స్నూకర్ పాయింట్ నిర్వాహకుడు, నల్లగొండ -
ఆరు మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు విడుదల
డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పార్కులు, ఓపెన్ జిమ్ల అభివృద్ధి చేస్తారు. అలాగే విలీన గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో నిధులు ఖర్చు చేయనున్నారు.సాక్షి, యాదాద్రి: నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు కొంత మేర ఊరట కలిగింది. తెలంగాణ రైజింగ్ విజన్ –2027లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.90 కోట్లు విడుదల చేసింది. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున కేటాయించింది. నిధుల విడుదల పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భువనగిరి మినహా కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీలు అనేక సమస్యలు తిష్టవేశాయి. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక మురుగు నీరు వీధుల్లో, నివాసాల మధ్య పారుతోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. నిధులు రాకతో సమస్యలు కొంతమేర పరిష్కారం అవకాశం ఉంది. 2026 మార్చి నాటికి పనులు పూర్తి జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో భువనగిరి మినహా మిగతా ఐదు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డాయి. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం (యూఐడీఎస్) కింద ప్రభుత్వం రెండు నెలల క్రితమే రూ.90 కోట్లు మంజూరు చేయగా.. శనివారం వాటిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. కలెక్టర్ ఆమోదం కొరకు పంపారు. పరిపాలనా ఆమోదం పొందగానే టెండర్లు పిలువనున్నారు. వెంటనే పనులు ప్రారంభించి 2026 మార్చి నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉంది. ● భువనగిరిలో.. జిల్లా కేంద్రంలో డ్రెయినేజీల నిర్మాణానికి రూ.46.4లక్షలు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీలకు రూ.45లక్షలు, పార్కుల అభివృద్ధికి రూ.4లక్షలు, ప్రధాన రహదారులపై బాక్స్ కల్వర్టుల నిర్మాణానికి రూ. ఒక కోటి, జంక్షన్ల అభివృద్ధికి రూ. 4 కోట్లు ఖర్చు చేయనున్నారు. ● ఆలేరు.. హైస్కూల్ ఆవరణలో ఓపెన్ జిమ్, వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణంతో పాటు ఒక పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థల పరిశీలన చేస్తున్నారు. విలీన గ్రామమైన బహుద్దూర్పేటలో కొన్ని పనులకు నిధులు ఖర్చు చేస్తారు. ● భూదాన్పోచంపల్లి.. సీసీ రోడ్లకు రూ.5 కోట్లు, డ్రెయినేజీలు, పార్కు నిర్మాణం, మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి సమీపంలో కల్వర్టు నిర్మాణం, మున్సిపల్ కేంద్రంతో పాటు విలీన గ్రామాలైన ముక్తాపూర్, రేవనవల్లిలో శ్మశానవాటికల నిర్మాణానికి రూ.5కోట్లు వెచ్చించనున్నారు. మిగతా నిధులతో మరికొన్ని అభివృద్ధి పనులు చేస్తారు. ● మోత్కూర్.. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణంతో పాటు గతంలో ప్రారంభించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తారు. విలీన గ్రామాలైన కొండగడప, బుజ్జిలాపురంలోనూ పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ● యాదగిరిగుట్ట.. రూ.5 కోట్లతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మిస్తారు. మిగతా 10 కోట్లు డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. మున్సిపాలిటీలో విలీనం చేసిన పాతగుట్ట, పెద్దిరెడ్టిగూడెంలోనూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఫ ఒక్కో పట్టణానికి రూ.15 కోట్ల చొప్పున కేటాయింపుఫ మౌలిక వసతులకు ప్రాధాన్యం ఫ కలెక్టర్ ఆమోదం పొందగానే టెండర్లు -
వైన్స్లకు 27న లక్కీ డ్రా
భువనగిరి: జిల్లాలో మద్యం దుకాణాల కేటా యింపునకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భువనగిరి మండలం రాయగిరి పరిధిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీయనున్నారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలకే ఫంక్షన్హాల్కు చేరుకోవాలని, కార్యక్రమం సజావుగా సాగేలా సహకరించాలని అధికారులు కోరారు. కేసుల పరిష్కారానికి చొరవ చూపండిభువనగిరి: డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు కోరారు. శనివారం భువనగిరిలోని కోర్టులో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ అదా లత్పై కక్షిదారులకు అవగాహన కల్పించి కేసులు రాజీపడేలా చూడాలన్నారు. అనంతరం పెండింగ్ కేసులు, సబ్ జైలులో ఖైదీలకు సంబంధించిన కేసుల వివరాలపై వారితో చర్చించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిద, న్యాయ సేవా అధి కార సంస్థ కార్యదర్శి మాదవిలత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, ఏసీపీలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్ నా యు డు, సబ్జైలు సూపరింటెండెంట్ నెహ్రూ, పట్టణ సీఐ రమేష్ పాల్గొన్నారు. అదే విధంగా ఫోక్సో చట్టం కింద పెండింగ్లో ఉన్న కేసుల గురించి న్యాయమూర్తి ముక్తిద చర్చించారు. బాధితులకు అందాల్సిన పరిహారం గురించి సమీక్షించారు.గ్లోస్టర్ నగరంలో నృసింహుడి కల్యాణం యాదగిరిగుట్ట: లండన్లోని గ్లోస్టర్ నగరంలో యాదగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణాన్ని ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు స్వామి వారి కల్యాణం ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన నారసింహుడి ఘట్టాలు భక్తులను అలరించాయి. ఈ వేడుకలో ఆలయ ఉప ప్రధానార్చకుడు నర్సింహమూర్తి, అర్చకులు కిరణ్ కుమారాచార్యులు, యూకే తెలుగు అసో సియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మూసీకి 5,015 క్యూసెక్కుల ఇన్ఫ్లోకేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. శనివారం ప్రాజెక్టులోకి 5,015 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్ట్గేట్లను పైకెత్తి 4,719 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు 244 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు.. కాగా 4.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
పర్యాటకుల భద్రతకు భరోసా..
భూదాన్పోచంపల్లి: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిస్టు పోలీసులను నియమించింది. పర్యాటకులకు మెరుగైన భద్రత, ఆతిథ్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు, ఆర్కియాలజీల్లో విధులు నిర్వహించేలా 80 మంది పోలీసులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. అందులో యాదాద్రి జిల్లాలోని భూదాన్పోచంపల్లికి ఐదుగురు, యాదగిరిగుట్టకు ఆరుగురు, భువనగిరి ఖిలాకు నలుగురు చొప్పున మొత్తం 15 మందిని నియమించింది. వీరంతా వారం రోజుల క్రితం విధుల్లో చేరారు. పర్యాటక ప్రాంతాల్లోనే విధులు నిర్వరిస్తున్నారు. షిఫ్ట్ల వారీగా విధులు భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్కులో ఇప్పటి వరకు కేవలం టూరిజం మేనేజర్, సిబ్బంది మాత్రమే ఉండేవారు. తాజాగా పోలీసులు కూడా చేరారు. టూరిజం పోలీసులు ప్రత్యేకంగా షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. టూరిజంశాఖ, పోలీస్ శాఖ సంయుక్త పర్యవేక్షణలో వీరు పనిచేస్తారు. టూరిజం పోలీసుల రాకతో పర్యాటక కేంద్రాల పరిసరాల్లో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పడనుందని స్థానికులు అంటున్నారు. కాగా భూదాన్పోచంపల్లికి కేటాయించిన టూరిజం పోలీసుల్లో రాజశేఖర్, ప్రవీణ్రెడ్డి, భవానీ, జాహ్నవి, లావణ్య ఉన్నారు. ఫ జిల్లాకు 15 మంది టూరిస్టు పోలీసుల నియామకం ఫ పర్యాటక ప్రాంతాల్లో భద్రత వీరి డ్యూటీ -
మెగా స్పందన
ఫ ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు ఫ 20,523 మంది అభ్యర్థులు హాజరు ఫ ఉద్యోగాలకు ఎంపికై న 3,041 మంది హుజూర్నగర్ : డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హుజూర్నగర్లో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ఉదయం 8 గంటల నుంచే మెగా జాబ్మేళా ప్రాంగణానికి అభ్యర్థుల రాక మొదలైంది. వచ్చిన అభ్యర్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా జాబ్మేళాను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం నిర్వహించిన జాబ్మేళా ద్వారా వచ్చన అనుభవం, గుణపాఠంతో మున్ముందు ఇంతకన్నా మెరుగ్గా జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. 20వేల మందికిపైగా హాజరు జాబ్మేళాకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 40 వేల మందికిపైగా ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 20 వేల మందికిపైగా హాజరయ్యారు. వచ్చిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టోకెన్లు ఇచ్చి వారిని వరుస క్రమంలో కూర్చోబెట్టారు. అ నంతరం విద్యార్హతలను బట్టి వారికి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు. కంపెనీల వారీగా ఇంటర్వ్యూలు ఐటీ, ఎడ్యు టెక్నాలజీ, స్కిల్స్ ట్రైనింగ్ విభాగంలో 5,547 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 827 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశా రు. మరో 370 మంది అభ్యర్థుల ఉన్నత అర్హతల ఆధారంగా షార్ట్లిస్ట్ రూపొందించారు. అలాగే సర్వీస్ మొబైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 3,850 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 391 మందిని ఎంపికచేసుకున్నారు. 804 మంది అభ్యర్థుల షార్ట్లిస్టు రూపొందించారు. మ్యాన్ఫ్యాక్చరింగ్, టెక్నికల్ రంగంలో 4,520 మంది హాజ రుకాగా 610 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ విభాగంలో 2,440 మందికి 713 మంది, ఫార్మా హెల్త్కేర్, హాస్పిటాలిటీ విభాగంలో 2,167 మందికి 210 మంది ఎంపికయ్యారు. మరో 195 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును రూపొందించారు. ఆటోమొబైల్స్ రంగంలో 952 మందికి 102 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. 154 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును సిద్ధం చేశారు. లాజిస్టిక్, ఎయిర్ పోర్ట్ రంగంలో 1,047 మందికి 188 మంది ఎంపిక కాగా 10 మంది షార్ట్లిస్టును ఆయా కంపెనీల ప్రతినిధులు రూపొందించారు. మొత్తంగా 20,523 మంది ఇంటర్వ్యూలకు రాగ 3,041 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 1,533 మంది అభ్యర్థులతో షార్ట్లిస్టును రూపొందించారు. నేటి జాబ్మేళా వాయిదా ఇతర ప్రదేశాలలో కూడా జాబ్ మేళా నిర్వహించాల్సి ఉన్న కారణంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఆదివారం నిర్వహించే జాబ్ మేళాకు హాజరుకావడం లేదు. ఈ కారణంగా ఆదివారం నిర్వహించే జాబ్మేళా వాయిదా వేస్తునట్లు ఆయన తెలిపారు. తిరిగి ఈ జాబ్ మేళాను ఎప్పుడు నిర్వహించేది ఆతేదీని తర్వాత ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. -
పూజితమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది
యాదగిరిగుట్ట: ‘పూజితమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి భోజనం చేస్తున్నావా.. మందులు వేసుకుంటున్నావా? గర్భధారణ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.. పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతాడు’ అని కలెక్టర్ హనుమంతరావు సూచించారు.అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా శనివారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధి గుండ్లపల్లిలో గర్భిణి పూజిత ఇంటికి కలెక్టర్ వెళ్లారు. పూజితకు న్యూట్రిషన్ కిట్ అందజేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమెకు సూచించారు. కాన్పు అనంతరం 102 వాహనంలో తల్లీబిడ్డను ఇంటి వద్ద చేరుస్తారని పేర్కొన్నారు. సమయానికి భోజనం చేయాలని, డాక్టర్ల సూచన మేరకు మందులు వేసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ, మెడికల్ ఆఫీసర్, వైద్యసిబ్బంది ఉన్నారు. ఫ ఆరా తీసిన కలెక్టర్ హనుమంతరావు,న్యూట్రిషన్ కిట్ అందజేత -
రైలు కింద పడి యువకుడి బలవన్మరణం
బీబీనగర్, భూదాన్పోచంపల్లి: రైలు కింద పడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి బీబీనగర్ మండల కేంద్ర పరిధిలోని ఎయిమ్స్ ఎదురుగా రైల్వే ట్రాక్పై జరిగింది. రైల్వే జీఆర్పీ ఇన్చార్జి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు వస్పరి వెంకటేశ్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు అభిలాష్(19) సంతానం. అభిలాష్ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రోజుమాదిరిగా బుధవారం కళాశాలకు వెళ్లి వచ్చిన అభిలాష్ అర్ధరాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారు తీసుకొని బయటకు వచ్చాడు. బీబీనగర్ ఎయిమ్స్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన సర్వీస్ రోడ్డులో కారును నిలిపి ట్రాక్పై చేరుకొని ఎదురుగా వస్తున్న మణుగూరు ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని, అందులోని సిమ్ తీసి వేరే మొబైల్లో వేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అంతమ్మగూడెంలో విషాదఛాయలుఅభిలాష్ మృతితో అంతమ్మగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే ముందు అభిలాష్ తన చిన్న సోదరికి ఫోన్కు తన మెడలో బంగారు చైన్ ఉందని, అలాగే కొందరు స్నేహితులు డబ్బులు ఇవ్వాలని మెసేజ్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం స్వగ్రామంలో అభిలాష్ అంత్యక్రియలు నిర్వహించారు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు ఆత్యహత్య చేసుకోవడంతో అభిలాష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభిలాష్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. -
నిరుపయోగంగా డ్రయ్యర్లు !
చౌటుప్పల్: తడిసిన, తేమ అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని ఎండబెట్టేందుకు గాను చౌటుప్పల్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలను(డ్రయ్యర్లు) యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సమకూర్చారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో దానికి రూ.14.90లక్షలు వెచ్చించి ఈ ఏడాది మే నెలలో కొనుగోలు చేసి మార్కెట్ యార్డులకు పంపించారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో ఈ యంత్రం సాయంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చు. అయితే ఆయా మార్కెట్ యార్డులలో ఉన్న ఈ యంత్రాలను ఇప్పటివరకు ఒక్క రైతు కూడా వినియోగించుకోలేదు. ట్రాక్టర్ ధాన్యానికి రూ.4000 ఖర్చు.. ఈ డ్రైయింగ్ మిషన్ ద్వారా ధాన్యం ఆరబెట్టుకోవడం రైతులకు పెను భారంగా మారింది. ఒక్కో ట్రాక్టర్ ధాన్యం(సుమారు 24 క్వింటాళ్లు) ఆరబెట్టేందుకు సుమారుగా రెండు గంటల సమయం పడుతోంది. ఈ యంత్రాన్ని నడిపించేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్ కావాల్సి ఉంది. ధాన్యం ఆరబెట్టుకోవాలంటే ట్రాక్టర్తో పాటు డ్రయ్యర్కు 10లీటర్ల చొప్పున డీజిల్ అవసరం అవుతుంది. రెండు గంటల సమయంలో ఒక ట్రాక్టర్ ధాన్యం మాత్రమే ఆరబెట్టే అవకాశం ఉంది. అలా ఒక్కో ట్రాక్టర్ ధాన్యం ఆరబెట్టేందుకు గాను రైతుకు సుమారుగా అన్ని ఖర్చులు కలిపి రూ.4000కు పైగానే అవుతుండడంతో ఈ యంత్రాన్ని వినియోగించుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. మార్కెట్ యార్డులోనే యంత్రం డ్రయ్యర్ వినియోగించకపోవడంతో ప్రస్తుతం చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉంది. ఈ విషయాన్ని మార్కెట్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిరుపయోగంగా ఉన్నందున వేరే చోటుకై నా తీసుకెళ్లాలని కోరారు. అయితే ఆ యంత్రాల వినియోగానికి అయ్యే ఖర్చు మార్కెట్ నుంచి భరించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఖర్చులు భరించలేమని పాలకవర్గం, అధికారులు చేతులెత్తేశారు. అటు రైతులు ముందుకు రాక, మరోవైపు అధికారులు స్పందించక చివరికి ఆ డ్రయ్యర్లు నిరుపయోగంగా మారాయి. చౌటుప్పల్, రామన్నపేట మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు సమకూర్చిన మార్కెటింగ్ శాఖ రెండు గంటల పాటు వినియోగించడానికి రూ.4000 ఖర్చు ఆర్థిక భారంతో ముందుకురాని రైతులు -
రోడ్డు నిండా ధాన్యం.. బురదలోకి స్కూల్ వాహనం
తిప్పర్తి : నల్లగొండ పట్టణం నుంచి తిప్పర్తి మండలం దుప్పలపల్లి వరకు ఉన్న అద్దంకి–నార్కట్పల్లి రహదారి సర్వీస్రోడ్డులో రైతులు ధాన్యం కుప్పలు పోశారు. దీంతో వాహనాలు రోడ్డు దిగి వెళ్లాల్సి వస్తోంది. గురువారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రోజు మాదిరిగానే విద్యార్థులను తీసుకెళ్లడానికి దుప్పలపల్లికి వస్తుండగా ధాన్యం రాశులు రోడ్డు కిందకు దిగింది. రోడ్డు కింది భాగం వర్షాలతో బురదమయంగా మారడంతో బస్సు బురదలో కూరుకుపోయి ఒక పక్కకు ఒరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులోకి ఇంకా పిల్లలు ఎక్కలేదు. దీంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. -
గాలికుంటు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
చిట్యాల: తెలంగాణను గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి తెలిపారు. గురువారం చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆవులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకా వేయించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం ప్రతి యేటా రెండు పర్యాయాలు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు వస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన పాడి, పశు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వివరించారు. రైతులు విధిగా తమ ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి జీవీ రమేష్, మండల పశువైద్యాధికారులు అభినవ్, అమరేందర్, సిబ్బంది శ్రీను, సైదులు, శ్రీనివాస్, మల్లారెడ్డి, వెంకన్న, సునీత, సతీష్ గోపాలమిత్ర సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకుడు గోపి -
‘మీ డాడీ బాగున్నాడా అమ్మ.. మళ్లీ కేసీఆర్ రావాలి’
యాదగిరిగుట్ట: ‘మీ డాడీ బాగున్నాడా.. మళ్లీ కేసీఆర్ రావాలి.. ఒక్క మీటింగ్ పెట్టమను నాయనను.. అందరం కలిసికట్టుగా వస్తాం.. రేవంత్రెడ్డి వచ్చినాక బంగారం లేదు.. చీరలు లేవు.. ఏమీ ఇస్తలేడు’ అంటూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో మహిళలు సంభాషించారు. గురువారం యాదగిరి క్షేత్రానికి వచ్చిన కల్వకుంట్ల కవితను కొండపైకి వెళ్లే మార్గంలో రెండవ ఘాట్ రోడ్డు వద్ద వడాయిగూడెం గ్రామానికి చెందిన సుక్కల లక్ష్మితో పాటు పలువురు మహిళలు కలిశారు. ఈ సందర్భంగా బాగున్నారా అంటూ కవిత వారిని పలకరించి ‘రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.4వేలు ఇస్తుందా.. కాంగ్రెస్ పాలన ఏవిధంగా ఉంది.. అందరికి చీరలు వచ్చాయా.. పథకాలు అందుతున్నాయా’ అని అడిగారు. దీంతో సుక్కల లక్ష్మి మాట్లాడుతూ.. కేసీఆర్ ఉండగా చీరలు ఇచ్చిండు, ఒక్కసారి కేసీఆర్ను మీటింగ్ పెట్టమనుండ్రి ఎంత మందిమి వస్తామో రేవంత్రెడ్డికి తెలుస్తుంది. డాడీ బాగుండా.. మీ నాయన ఆరోగ్యంగా ఉండాలి అంటూ చెప్పింది. రేవంత్రెడ్డికి ఓటు వేసి ఘోరంగా మోసపోయామని కవితతో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ● వాహనాల నిలిపివేతకల్వకుంట్ల కవిత కాన్వాయ్లోని వాహనాలు కొండపైకి వెళ్లకుండా ఎస్పీఎఫ్ సిబ్బంది నిలిపివేశారు. అన్ని వాహనాలకు అనుమతి లేదని, కవిత వాహనంతో పాటు మరో 4 వాహనాలను మాత్రమే పంపిస్తామని చెప్పారు. అనంతరం దేవస్థానం అధికారులు జోక్యం చేసుకొని వాహనాలను కొండపైకి పంపించారు. యాదగిరిగుట్టలో కల్వకుంట్ల కవితతో మహిళల సంభాషణ -
ఖర్చు ఎక్కువ అవుతోంది
మంచి ఉద్దేశంతో అదనపు కలెక్టర్ డ్రయ్యర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దానిని వినియోగించాలంటే ప్రత్యేకంగా ట్రాక్టర్ అవసరం ఉంటుంది. సొంత ట్రాక్టర్ లేని రైతులు అద్దెకు తెచ్చుకోవాలి. ట్రాక్టర్కు కిరాయితో డీజిల్, డ్రయ్యర్కు డీజిల్ ఖర్చు భరించడం రైతులకు సమస్యగా మారుతోంది. 20 నుంచి 30ఎకరాల్లో పంట సాగు చేసే రైతులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం సాధ్యమవుతుంది. సాధారణ రైతులకు సాధ్యమయ్యే పరిస్థితి ఎంతమాత్రం లేదు. – ఉబ్బు వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, చౌటుప్పల్ -
వివాహేతర సంబంధంతో పరువు తీసిందని హత్య
సూర్యాపేటటౌన్: వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబం పరువు తీస్తుందని కుటుంబ సభ్యులే మహిళను హత్య చేశారు. ఈ నెల 21న ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, భిక్ష్మమమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. మల్లయ్య డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భిక్ష్మమమ్మ సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు హెచ్చరించినా భిక్షమమ్మ మాట వినకపోవడంతో కుటుంబం పరువు పోతుందని భర్త మల్లయ్య, ఇద్దరు కుమారులు ప్రవీణ్, భరత్తో కలిసి భిక్ష్మమ్మను హత్య చేయాలని స్కెచ్ వేశారు. ఈ మేరకు మల్లయ్య అన్న కుమారుడు మహేష్, స్నేహితులు వంశీ, జనార్దన్తో కలిసి గ్రామంలో నడిరోడ్డుపై భిక్షమమ్మని కర్కశంగా కత్తితో గొంతుకోసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు శ్రీకాంత్గౌడ్, మహేశ్వర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపూర్ గ్రామంలో మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు -
పాడి పశువుల పెంపకంపై రైతులకు శిక్షణ
గరిడేపల్లి: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం–రాజేంద్రనగర్, సద్గురు ఫౌండేషన్ సంయుక్త సహకారంతో గరిడేపల్లి మండలంలో ని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో పాడి రైతులకు పాడి పశువుల యాజ మాన్యంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించినట్లు కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జి నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వెటర్నరీ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ కిషన్కుమార్ ముఖ్యఅతిధిగా హాజరై రైతులకు పాల ఉత్పిత్తి పెంపుదల, తక్కువ ధరలో దాణా తయారీ, పునరుత్పత్తి, విచక్షణాపూరితంగా ఔషధ వినియోగం గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ డాక్టర్ కిరణ్కుమార్ రైతులకు సబ్సిడీలు, ఇతర పథకాల గురించి తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్లోని మామ్నూరు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బిందుమాధురి, మామ్నూరు కేవీకే శాస్త్రవేత్తలు అరుణజ్యోతి, సాయికిరణ్, గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు ఎన్. సుగంధి, సీహెచ్. నరేష్, ఎ. కిరణ్, పి. అక్షిత్, పశువైద్యాధికారిణి జయసుధ, 50మంది రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
చండూరు: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండల మెండువారిగూడంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెండువారిగూడానికి చెందిన నంద్యాల నర్సిరెడ్డి(48) వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం చెంది గ్రామాని వెళ్లే దారిలో చండూరు శివారులోని మూతబడిన పాఠశాల సమీపంలో బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. నర్సిరెడ్డి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతకగా మూతబడిన పాఠశాల సమీపంలో మృతిచెంది కనిపించాడు. గురువారం మృతుడి కుమారుడు కిరణ్కుమార్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. విద్యుదాఘాతంతో మేసీ్త్ర మృతి మునగాల: విద్యుదాఘాతంతో మేసీ్త్ర మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం ముకుందాపురంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురం గ్రామానికి చెందిన షేక్ పెదబోడయ్య(57) సుతారి మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా గురువారం పెదబోడయ్య పిల్లర్లు ఏర్పాటు చేసే క్రమంలో పిల్లర్లకు ఉండే సువ్వలు పైన ఉన్న కరెంట్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల వివాహాలు చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. బంగారం అపహరణ కేసులో ఇద్దరికి జైలు శిక్ష చివ్వెంల(సూర్యాపేట): బంగారం అపహరణ కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. ఆత్మకూరు(ఎస్) మండల కోటినాయక్తండాకు చెందిన కోమటిరెడ్డి ఇంట్లో 2005 మార్చి 23న గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బంగారు చైన్, బ్రేస్లెట్, చెవి బుట్టలు, రూ.10 వేల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేకు స్థానిక ఎస్ఐ బత్తిని శ్రీకాంత్గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన తుపాకుల చందు, కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన సున్పపు ధనుంజయ్ చోరీ చేసినట్లు గుర్తించి వారిని రిమాండ్కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.హేమలతనాయుడు వాదనలతో ఏకీభవిస్తూ తుపాకుల చందుకు 4 నెలల 23 రోజులు, ధనుంజయ్కి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు కోర్టు కానిస్టేబుల్ చైతన్య సహకరించారు. -
పాలకుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
చిట్యాల: పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులకు శాపంగా మారిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి గ్రామ శివారులోని పత్తి చేలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పత్తి పాడవుతుందని, సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఏరిన పత్తిని నిల్వ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు చిరుమర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం దళారుల చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పత్తితీత మొదలై నెలరోజులు దాటినా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రైతుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలిందని ఆరోపించారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల ఐలయ్య, కల్లూరి మల్లారెడ్డి, కొలను వెంకటేష్, ఆరూరి శ్రీశైలం, మర్రి జలేంధర్రెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించాలి
భువనగిరి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఈనెల 31న ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల పోస్టర్ను పలు రాజకీయ పార్టీల నాయకులతోకలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పటేల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మహా ఐక్యత పాదయాత్రలు నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని కోరారు. వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల సాంస్కృతి శాఖ అధికారి ధనుంజయనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, పోలేపాక అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
మద్యం టెండర్లు 2,766
● ముగిసిన గడువు.. స్పందన అంతంతేభువనగిరి: మద్యం టెండర్ల దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. గడువు పొడిగించినా స్పందన రాలేదు. అదనంగా 129 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లాలో 82 మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 26నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ నెల 18వ తేదీతో గడువు ముగియగా 2,647 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ అంచనాలు తప్పడంతో ఈ నెల 23 వరకు గడువు పొడిగించింది. మొత్తంగా 2,766 దరఖాస్తులు వచ్చాయి. గతసారి 3,969 దరఖాస్తులు రాగా.. ఈసారి గడువు పెంచినా 1,193 దరఖాస్తులు తక్కువగానే వచ్చాయి. గతసారి రూ.79.38 కోట్లు సమకూరగా.. ఈసారి రూ.83.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఎల్లంబావి వైన్స్కు 91 దరఖాస్తులు అత్యధికంగా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ వైన్స్కు 91 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈనెల 27న రాయగిరిలోని సోమా రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో డ్రా తీయనున్నారు.పాఠశాలల తనిఖీఅడ్డగూడూరు: మండలంలోని కోటమర్తి జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల, డి.రేపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను డీఈఓ సత్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం రుచి చూశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులో పాఠాలో ఎలా బోధిస్తున్నారని ఆరా తీశారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవి వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓ సబిత, ఉపాధ్యాయులు ఉన్నారు. పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి, సీఈఓకు నోటీసులుగుండాల: గుండాల పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి, సీఈఓకు జిల్లా సహకార అధికారి (డీసీఓ) నోటీసులు జారీ చేశారు. గుండాల మండలం సుద్దాల గ్రామంలో చేపట్టిన పెట్రోల్ బంక్ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సంఘం మాజీ డైరెక్టర్ సంగి బాలకొమురయ్య ఆగస్టు 18వ తేదీన డీసీఓకు ఫిర్యాదు చేశారు. డీసీఓ ఆదేశాల మేరకు మోత్కూరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారణ చేపట్టారు. రికార్డులు, తీర్మానాలను పరిశీలించారు. పెట్రోల్బంక్ సివిల్ వర్క్సను సంఘం డైరెక్టర్ విద్యాసాగర్రెడ్డికి, ఐవోసీఎల్ మిషనరీ పనులను లలితా ఎంటర్ప్రైజెస్ (దినకర ఎంటర్ ప్రైజెస్) అప్పగించారు. విద్యాసాగర్రెడ్డి, దినకర ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలోనే పనులను చేపట్టాల్సి ఉంది. కానీ కొన్ని పనులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా టెండర్లు పిలవకుండా, ఒప్పంద పత్రం లేకుండా రూ.30 లక్షల పనులను డైరెక్టర్ విద్యాసాగర్రెడ్డికి అప్పగించినట్లు తేలింది.వీటిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పర్సన్ ఇంచార్జి లింగాల భిక్షంగౌడ్, సీఈఓ నాగయ్యకు గురువారం నోటీసులు జారీ చేసినట్లు డీసీఓ తెలిపారు. సదరు డైరెక్టర్కు ఇచ్చిన రశీదులపై పర్సన్ ఇంచార్జి, సీఈఓ సంతకాలు ఎందుకు చేశారని, చేసిన పనులకు కాంట్రాక్టర్ నుండి కాకుండా సంఘం నుండి ఎందుకు చెల్లించారో సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
యాదగిరిగుట్ట రూరల్: రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి ధాన్యం కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం తేమశాతం రాగానే వెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేదని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో సమస్యను పరిష్కరించాలని ఏఈని ఆదేశించారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
సత్ఫలితాలినిస్తున్న రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ ● బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెరిగిన ఓపీ ● అందుబాటులో స్పెషలిస్టు డాక్టర్లుభువనగిరి: రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్ విమర్శించారు. గురువారం భువనగిరిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, అర్హత ఉన్నా రైతుభరోసా అందలేని ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా పథకాన్ని వెంటకనే అమలు చేయాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రత్నపురం బలరాం, సురేష్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, పట్నం శ్రీనివాస్, కోటేష్, బాలస్వామి, మాణిక్యంరెడ్డి, సురేష్, ఉడుత భాస్కర్, రత్నపురం శ్రీశైలం, సతీష్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్ -
ప్రత్యేక గ్రీవెన్స్కు 67 దరఖాస్తులు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్కు 67 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 20 దరఖాస్తులు ఉన్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఉద్యోగులు, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఉద్యోగులు సైతం తమ సమస్యలు తెలియజేసేందుకు ప్రతి నెల మూడో గురువారం ఉద్యోగవాణి పేరుతో కలెక్టర్ వెసులుబాటు కల్పించారు. దీంతో రాత్రి వరకు దరఖాస్తులు అందజేశారు. వినతులు ఇలా..● మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని చౌటుప్పల్లోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగి జాహెదా బేగం వినతిపత్రం అందజేశారు. ● టీఎస్ స్వాన్ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని పలువురు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడారు. ● ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తమకు వేతనాలు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్య తెలుసుకున్నారు. ● ఆలేరులోని రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ కోసం కందుల రాజు అనే విద్యార్థి విన్నవించగా ప్రిన్సిపాల్కు ఫోన్ చేసి సీటు ఇవ్వాలని ఆదేశించారు. ● బ్రాహ్మణపల్లిలో వైన్స్కు రెండు వైపులా దారి ఇవ్వడంపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. -
ప్రజల చెంతకే ఎయిమ్స్ సేవలు
బొమ్మలరామారం : బీబీనగర్ ఎయిమ్స్ సేవలు గ్రామీణులకు సైతం చేరువ అవుతున్నాయి. బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎయిమ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్హెచ్టీసీ) సత్ఫలితాలనిస్తోంది. సాధారణ జబ్బులతో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ సేవలందిస్తున్నారు. నిత్యం వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందజేస్తుండటంతో ప్రజలు ఎయిమ్స్, భువనగిరి, హైదరాబాద్కు వెళ్లాల్సిన బాధ తప్పింది. ఓపీ గతంలో 30 నుంచి 60 వరకు వస్తుండగా.. ప్రస్తుతం 180కి పైగా నమోదవుతోంది. సీజన్ వ్యాధుల సమయంలో రెట్టింపు పేషెంట్లు వస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకురూరల్ హెల్త్ సెంటర్లో ఎయిమ్స్ వైద్య బృందం వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. మంగళవారం సైక్రియాటిస్ట్, బుధవారం పిల్లల డాక్టర్, పిడియాట్రిక్, గురువారం కంటి వైద్యుడు, ఆప్తామాలజీ, శుక్రవారం జనరల్ సర్జన్ విధులు నిర్వహిస్తున్నారు. మిగతా రోజుల్లోనూ జనరల్ మెడిసన్, గైనకాలజిస్టులు సేవలను అందజేస్తున్నారు. రోజూ ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సేవలు అందిస్తున్నారు. సీరియస్ కేసులు ఉంటే బీబీనగర్ ఎయిమ్స్కు రెఫర్ చేస్తున్నారు. అవగాహన సదస్సులుప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ వైద్యులతో కలిసి ఎయిమ్స్ డాక్టర్లు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణ, తల్లి,బిడ్డకు పోషకాహారం, ముర్రుపాల ప్రాధాన్యత వంటి అంశాలపై కళా రూపాల ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు.ఔట్ పేషెంట్లు పెరిగారు స్పెషలిస్టు వైద్యుల సేవలు అందుబాటులోకి రావడంతో ఓపీ పెరిగింది. ప్రస్తుతం రోజూ 150కి పైగా పేషెంట్లు వస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులే ఆర్హెచ్టీసీ ద్వారా పీహెచ్సీలో ప్రభుత్వ వైద్యులతో కలిసి సేవలందిస్తున్నారు. దీంతో రోగులు బీబీనగర్ ఎయిమ్స్కు వెళ్లే పనిలేకుండా పోయింది. అత్యవసర వైద్యం అవసరమైతే ఎయిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. – సుమలత, బొమ్మలరామారం మండల వైధ్యాధికారిస్థానికంగానే నాణ్యమైన వైద్యసేవలు బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఎయిమ్స్ వైద్యసేవలు అందుతున్నాయి. దీంతో బీబీనగర్కు వెళ్లకుండా దూరభారం తప్పుతుంది.అన్నిరకాల స్పెషలిస్టు వైద్యులు వస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు లభిస్తున్నాయి. తప్పనిసరి అయితేనే బీబీనగర్ ఎయిమ్స్కు పంపుతున్నారు. నాతో పాటు చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – జూపల్లి లింగం, బొమ్మలరామారం -
గడువు పెంచినా ఆలస్యమే..!
ఆలేరు: ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనులకు మరోమారు బ్రేక్ పడింది. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్లే కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 70 శాతం మేర పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా.. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే మరో ఏడాదైనా పట్టే అవకాశం లేకపోలేదు. ప్రజల ఇక్కట్లు● ఆర్యూబీ కోసం చేపట్టిన తవ్వకాలతో వచ్చిన మట్టిని రోడ్డు పక్కనే పోశారు. వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో దుమ్ము,ధూళి వస్తుందని స్థానికులు, వ్యాపారులు చెబుతున్నారు. ● ఆర్యూబీకి ఇరుపక్కలా రోడ్డు గుంతలమయంగా మారడంతో వర్షపు నీరు నిలిచినప్పుడు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ● ఆర్యూబీ ఎంట్రీ పాయింట్ నుంచి రైల్వేగేట్ చౌరస్తా వరకు రెండు వైపులా సుమారు 140 మీటర్ల పొడవు అప్రోచ్ రోడ్డు వేయాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ మధ్య రోజూ ఆర్టీసీ బస్సులతోపాటు వందల్లో ఇతర వాహనాలు అప్రోచ్ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. మోకాలు లోతు గుంతలు ఏర్పడటంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ● వివేకానంద విగ్రహం వద్ద ఆర్యూబీ లోపల ఎంట్రీ పాయింట్ నుంచి సీసీ రోడ్డు పనులు పెండింగ్లో ఉన్నాయి. 2019లో పనులు ప్రారంభంఆర్యూబీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేసింది. రూ.6 కోట్లు నిర్వాసితులకు, రూ.7కోట్లు సివిల్ పనులకు కేటాయించింది. పనులు 2019లో మొదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే సూచించినా పట్టింపేదీ?ఆలేరు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆర్యూబీ వద్ద మట్టి రోడ్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. బీటీకి బదులు రెండు వైపులా సీసీ రోడ్లు వేయాలని అధికారులకు సూచించినా నేటికీ అతీగతి లేదు. ఆర్యూబీ పనులు పూర్తి చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయిస్తామని గతంలో పాలకులు ఇచ్చిన హామీ ఏమైంది. పనుల ఆలస్యంతో స్థానికులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టింపు లేదు. అప్రోచ్ రోడ్లు లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఆర్యూబీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి. – కామిటికారి కృష్ణ, బీజేపీ జిల్లా కార్యదర్శిఆర్యూబీ పనుల జాప్యంతో విపరీతంగా దుమ్ము వస్తుంది. షాపులో కూర్చోలేకపోతున్నాం. కొనుగోలుదారులు రావడం లేదు. కిరాణం, కొబ్బరి బొండాల వ్యాపారం తగ్గింది. శ్వాసపీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కొందరు చిరువ్యాపారులం మున్సిపల్ అధికారులను కలిసి దుమ్ము రాకుండా నీళ్లు కొట్టాలని విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. – చింతకింది బాలరాములు, వ్యాపారిఆలేరులో మళ్లీ నిలిచిన ఆర్యూబీ నిర్మాణం బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్ ఆరేళ్లుగా ఆగుతూసాగుతున్న పనులు వాహనదారులు, స్థానికుల అవస్థలుప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు సాంకేతిక కారణాల వల్ల పనులు ఆగాయి. తిరిగి ఆర్యూబీ పనులు ప్రారంభించేలా చూస్తాం. కాంట్రాక్టర్కు దాదాపు రూ.4.50 కోట్ల పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు జరిగేలా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఈ ఏడాది ఆగస్టులో గడువు ముగిసినప్పటికీ అగ్రిమెంట్ను వచ్చే మార్చి వరకు పొడిగించాం. – కరుణాకర్, ఆర్అండ్బీ ఏఈ -
రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ జూడో పోటీలకు ఎంపిక
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల జూడో పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు జూడో కోచ్ అన్నెపు వెంకట్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అండర్–14(44 కేజీల) విభాగంలో కె. నిధి, 50 కేజీల విభాగంలో ఎ. సాయిసృజిత్ చంద్ర, అండర్–17(36 కేజీల) విభాగంలో ఎం. విమలశ్రీ, 52 కేజీల విభాగంలో ఎం. సాక్షి, 45 కేజీల విభాగంలో ఎస్కే పరహాన్, 50 కేజీల విభాగంలో పి. అర్జున్, 55 కేజీల విభాగంలో అవినాష్, 40 కేజీల విభాగంలో ఎ. రాకేష్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులను ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు, ఎంఈఓ గోపాల్రెడ్డి, స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ దశరథరెడ్డి అభినందించారు. ఉరేసుకుని ఆత్మహత్యరాజాపేట: ఇంట్లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజాపేట మండలం కొండ్రెడ్డిచెర్వు గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన కర్రె కనకయ్య మొదటి భార్య 13 సంవత్సరాల క్రితం మృతిచెందింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య మృతిచెందిన తర్వాత కనకయ్య లలిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి అక్షిత్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా కనకయ్య తల్లి పెంటమ్మ అనారోగ్యానికి గురికావడంతో నాలుగు రోజుల క్రితం చికిత్స నిమ్తితం ఆమెను గజ్వేల్ సమీపంలోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో నాయనమ్మ వద్ద ఉన్న కనకయ్య మొదటి భార్య కుమారుడు కర్రె మహేష్(22) మంగళవారం రాత్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. మహేష్ను అన్నం తినమని కనకయ్య రెండో భార్య లలిత చెప్పగా సరే అంటూ ఇంట్లోకి వెళ్లాడు. బుధవారం ఉదయం అతని గది తెరిచి చూసేసరికి చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. దీంతో లలిత భర్త కనకయ్యకు విషయం చెప్పింది. మహేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. -
భక్తుల దీపారాధన
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం భక్తులు దీపారాధన చేశారు. కార్తీక మాసం ప్రారంభం, స్వాతి నక్షత్రం కావడంతో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వైకుంఠద్వారం వద్ద, కొండపైన శివాలయం, ఆలయ మాడ వీధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శివకేశవులు కొలువైన యాదగిరి క్షేత్రంలో కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఎంతో పవిత్రమని భక్తుల విశ్వాసం. దీంతో ఈ మాసమంతా ఆలయంలో భక్తులు కార్తీక దీపారాధనలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. -
పేద కుటుంబానికి పెద్ద కష్టం
మఠంపల్లి: ఆ కుటుంబాన్ని విధి వంచించింది. కుటుంబ పెద్దతో పాటు అతడి ఇద్దరు కుమారులు వివిధ రకాల జబ్బులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంచానికే పరిమితమయ్యారు. వైద్య ఖర్చుల కోసం దాతలు సాయం చేయాలని ఆ ఇంటి మహిళలు కోరుతున్నారు. వివరాలు.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన తవిడబోయిన చంద్రయ్య(50)కు ఐదేళ్ల క్రితం పక్షవాతం రావడంతో చికిత్స చేయించుకుంటూ మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అప్పటి నుంచి అతడి పెద్ద కుమారుడు వీరబాబు(30) కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నాడు. అయితే గత మూడేళ్లుగా వీరబాబు కూడా కిడ్నీ, లివర్ జబ్బుతో మంచానికే పరిమితమయ్యాడు. అంతేకాకుండా పాఠశాలకు వెళ్లి చదువుకునే చంద్రయ్య చిన్న కుమారుడు గోపాలకృష్ణ(11)కు కూడా ఏడాది క్రితం మెదడు సంబంధిత వ్యాధి సోకింది. దీంతో చంద్రయ్య భార్య సైదమ్మ, పెద్ద కుమారుడు వీరబాబు భార్య సంధ్య అతి కష్టం మీద కుటుంబ భారాన్ని మోస్తూ వారికి వైద్య చికిత్స చేయిస్తున్నారు. చంద్రయ్య, వీరబాబు ఖమ్మంలోని ప్రశాంతి ఆస్పత్రిలో, చిన్న కుమారుడు గోపాలకృష్ణకు నల్లగొండలోని ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం వారికి ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు కూడా అమ్ముకోవడంతో కుటుంబం పోషణ భారంగా మారింది. వైద్యానికి అయ్యే ఖర్చు భరించలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దయార్ధ హృదయులు ఎవరైనా ఉంటే తమకు ఆర్థిక సాయం అందజేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రయ్య భార్య సైదమ్మ, కోడలు సంధ్య కోరుతున్నారు. మా కుటుంబంలో మగవాళ్లందరు అనారోగ్య కారణాలతో ఇంటికే పరి మితమయ్యారు. దీంతో గత ఐదేళ్లుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. కుటుంబ పోషణకు, వైద్యం చేయించడానికి నేను, నా కోడలు మా శక్తినంతా దారపోస్తున్నాం. ప్రసుత్తం దిక్కులేకుండా అయ్యాం. మమ్ములను దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలి. – తవిడబోయిన సైదమ్మ, చంద్రయ్య భార్య ఫ అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తండ్రి, ఇద్దరు కుమారులు ఫ వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఇబ్బందులు ఫ దాతల సాయం కోసం ఎదురుచూపులు -
అన్ని రాష్ట్రాల్లోనూ నిరుద్యోగ సమస్య
సూర్యాపేట: దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామీణ యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుందని, ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం అందరికీ ఆవేదన కలిగించే విషయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 20 నెలల కాలంలో 75వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడమే కాకుండా లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్లు ఇచ్చామన్నారు. ప్రైవేటు రంగంలోనూ ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి కాలరీస్, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ సహకారంతో హుజూర్నగర్లో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, చింతల లక్ష్మీనారాయణరెడ్డి, చకిలం రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఫ 20 నెలల కాలంలోనే 75వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
బ్రెయిన్ డెడ్ .. యువకుడి అవయవాలు దానం
నార్కట్పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను అతడి తల్లిదండ్రుల దానం చేశారు. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన నడింపల్లి సత్యనారాయణ, హేమలత దంపతులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారు. సత్యనారాయణ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల సొంతూళ్లో ఇల్లు కట్టుకుందామని నిర్ణయించుకొని బేస్ మెంట్ వరకు పనులు చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శ్రీహర్ష(18) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వద్ద గల బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం, రెండో కుమారుడు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ నెల 17న పెద్ద కుమారుడు శ్రీహర్ష కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీహర్షను ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులు చికిత్స పొందిన శ్రీహర్ష మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఇంత బాధలోనూ తమ కుమారుడు మరణించినప్పటికీ మరో నలుగురికి ప్రాణం పోయాలనే ఉద్దేశంతో శ్రీహర్ష గుండె, కిడ్నీ, ఇతర అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేశారు. నార్కట్పల్లిలో బుధవారం శ్రీహర్ష అంత్యక్రియలు నిర్వహించారు. -
షార్ట్ సర్క్యూట్తో సెలూన్ షాపు దగ్ధం
ఆలేరు: షార్ట్ సర్క్యూట్తో సెలూన్ షాపులో ఫర్నిచర్ దగ్ధమైంది. ఈ ఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం ఆలేరు ఎస్ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన బొప్పాపురం కిష్టయ్య ఆలేరు పట్టణంలోని వేణు కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ప్రిన్స్ హెయిర్ సెలూన్ షాపు నడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం దుకాణాన్ని మూసివేసి యాదగిరిగుట్టకు వెళ్లాడు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సెలూన్ షాపు నుంచి పొగలు రావడాన్ని గమనింంచారు. షాపు యజమానికి పోలీసులు ఫోన్ చేయగా.. షాపు పక్కన గదిలో ఉంటున్న వారి వద్ద తాళం ఉందని చెప్పాడు. పోలీసులు షాపు తెరిచి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. షాపులోని కుర్చీలు, ఫర్నిచర్ దగ్ధం కాగా.. సుమారు రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు యజమాని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు పట్టణ అధ్యక్షుడు ఇజాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఫోన్లో విషయం వివరించగా.. బాధితుడి మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ తరపున సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
నకిరేకల్: ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్లోని చీమలగడ్డలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20రోజులు అవుతున్నా తేమ శాతం పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం మిల్లర్లను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, నాయకులు గోర్ల వీరయ్య, సిలివేరు ప్రభాకర్, రాచకొండ శ్రవణ్, గుర్రం గణేష్, ఇమడపాక వెంకన్న, పేర్ల కృష్ణకాంత్, గోనె నర్సింహారావు, చెట్టిపల్లి జానయ్య, దైద పరమేశం, మాద నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
సూర్యాపేటటౌన్: హుజుర్నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి వెనుక నివాసముంటున్న చెన్న అనసూర్యమ్మ ఈ నెల 14వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హుజుర్నగర్కు చెందిన లింగం సతీష్ అనసూర్యమ్మ ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటాడు. వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నట్లు గమనించిన లింగం సతీష్ ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో సతీష్, అతని మేనల్లుడు(మైనర్ బాలుడు) ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి మద్యం మత్తులో అనసూర్యమ్మ ఇంటికి వెళ్లారు. లింగం సతీష్ ఆమె నోరు, ముక్కు చేతులతో మూయగా మైనర్ బాలుడు ఆమె రెండు కాళ్లను గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనసూర్యమ్మ చనిపోయిందని గ్రహించిన వారు ఆమె చెవులకు ఉన్న బంగారు దిద్దులు, మాటీలు, ఆమె బొడ్డు సంచిలో గల బంగారు ఉంగరం, నాను తాడు(బనరు గొలుసు)లను దొంగిలించి, గతంలో సతీష్ ఆమె వద్ద అప్పుగా తీసుకున్న రూ.50,000కు సంబంధించిన ప్రామిసరీ నోట్ను కూడా బీరువాలో నుంచి అపహరించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో సతీష్ తన భార్య లింగం మౌనికకు చోరీ చేసిన సొత్తును చూపించి ఆమె సలహా ప్రకారం బంగారాన్ని విజయవాడ తీసుకెళ్లి అక్కడ కరిగించి తమ వద్ద ఉంచుకున్నారు. దర్యాప్తులో భాగంగా హుజూర్నగర్ పోలీసులు లింగం సతీష్, లింగం మౌనిక, మైనర్ బాలుడు ముగ్గురిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు ముద్ద, బంగారు కడ్డీ స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించిన హుజూర్నగర్ సీఐ చరమంద రాజు, కానిస్టేబుళ్లు డి. నాగరాజు, జి. శంభయ్యకు ఎస్పీ రివార్డు అందించి అభినందించారు. ఫ రూ.3.60లక్షల విలువైన బంగారం స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
యాదగిరీశుడికి శతఘటాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ముఖ మండపంలో స్వాతి హోమం, పంచామృతాలు, శుద్ధ జలాలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో నింపిన బంగారు, వెండి కలశాలకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి. స్వాతి నక్షత్రం పురస్కరించుకొని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 5గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, భక్తులు, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు. ఫ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు -
పవర్ హౌస్ టెయిల్ రేస్ను పరిశీలించిన జెన్కో డైరెక్టర్
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం టెయిల్ రేస్ను బుధవారం జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ సందర్శించారు. వ్యాప్కో సంస్థ కొన్ని రోజుల క్రితం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దిగువ భాగాన నీటి ప్రవాహం సాఫీగా వెళ్లే విధంగా ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రివర్స్ పంపింగ్ జరిగే తరుణంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు గాను చేపట్టాల్సిన చర్యల నివేదికను జెన్కో అధికారులకు అందించారు. ఈ సందర్భంగా జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ ఆధ్వర్యంలో పవర్ హౌస్ టెయిల్ రేస్ ప్రాంతాన్ని సందర్శించి చేపట్టవల్సిన పనుల గురించి అధికారులకు సూచించారు. ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దిగువ భాగాన భారీగా రాళ్లగుట్టలు ఉన్నందున విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విడుదలైన నీటి ప్రవాహానికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా పవర్హౌస్లో రివర్స్ పంపింగ్ జరిగే ప్రక్రియలో అడ్డంకులు కూడా ఉత్పన్నమవుతుండటంతో పవర్ హౌస్ దిగువ భాగాన ఉన్న రాళ్ల గుట్టలను తొలగించనున్నారు. త్వరలోనే వీటికి సంబంధించిన పనులను ప్రారంభంచనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట సాగర్ జెన్కో సీఈలు మంగేష్కుమార్, నారాయణ, ఎస్ఈలు రఘురాం, రామకృష్ణారెడ్డి, డీఈలు, ఏఈలు ఉన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష, జరిమానా
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని బుధవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చగా.. అందులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2000 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4,000 జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి పీవీ రమణ తీర్పు వెలురించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదంభూదాన్పోచంపల్లి: ఎదురుగా వచ్చే వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు పంట పొలంలోకి ఒరిగిపోయింది. ఈ ఘటన బుధవారం ఉదయం భూదాన్పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల మధ్యలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పోచంపల్లి నుంచి వయా శివారెడ్డిగూడెం, ఇంద్రియాల, పెద్దరావులపల్లి గ్రామా ల మీదుగా భువనగిరికి వెళ్తోంది. ఈ క్రమంలో శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల మధ్య న ఇరుకు రోడ్డులో మరొక వాహనం ఎదురుగా రావడంతో దానికి దారిచ్చే క్రమంలో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లగా.. పక్కనే ఉన్న పంటపొలంలో దిగబడి బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులంతా వెంటనే బస్సులో నుంచి కిందకు దిగారు. అనంతరం జేసీబీ సహాయంతో బస్సును పంట పొలంలో నుంచి బయటకు లాగారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్డంతా గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
ఎడమ కాల్వ పవర్హౌస్ లక్ష్యం చేరింది
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం ఎడమ కాల్వ పవర్ హౌజ్లో విద్యుత్ ఉత్పత్తిలో కేటాయించిన లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్నట్లు జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్కుమార్ పేర్కొన్నారు. బుధవారం నాగార్జునసాగర్ జెన్కో కార్యాలయంలో ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిర్ణయించిన లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్న సందర్భంగా కేట్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ ప్రాజెక్టు ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 2025–26 విద్యుత్ సంవత్సరానికి గాను 70 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల ద్వారా మంగళవారం రాత్రి తమ లక్ష్యాన్ని అధిగమించినట్లు తెలిపారు. కాగా ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనలో 1450 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని రెండు వారాల క్రితమే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్ అజయ్, హైడల్ చీఫ్ ఇంజనీర్ నారాయణ, జెన్కో ఎస్ఈలు రామకృష్ణారెడ్డి, రఘురాం, లెఫ్ట్ కెనాల్ పవర్ హౌజ్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల్లేవ్
సాక్షి, యాదాద్రి: జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలను మందుల కొరత పీడిస్తోంది. సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఉండటం లేదు. మందుల కొరత వల్ల రోగులు ఆస్పత్రులకు వచ్చి వట్టి చేతులతో తిరిగిపోతున్నారు. జ్వరానికి వాడే పారాసిటమాల్, జలుబు, దగ్గుకు వాడే మందులు సైతం ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సి వస్తుందని రోగులు చెబుతున్నారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సాక్షి విజిట్ చేయగా వాస్తవాలు వెలుగుచూశాయి. జ్వరం, జలుబు, దగ్గు ట్యాబ్లెట్లకూ కటకట ● మోటకొండూరు పీహెచ్సీలో ఆరు నెలలుగా ఐడ్రాప్స్ కొరత ఉంది. ● బొమ్మలరామారం పీహెచ్సీలో పారాసెట్మల్, ఎంబ్రాసిల్, మెట్రోజిన్, సిట్రోజెన్, అల్బెండజోల్ సిరప్లు, హైడ్రోజన్ ఫెరాకై ్సడ్, అమాక్సలిన్ మాత్రలు లేవు. ఇక్కడ బ్యాండేజీకి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ● తుర్కపల్లి మండలంలోని మాదాపూర్లో కుక్కల దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. కుక్కలు, కోతుల దాడిలో గాయపడి ఈ పీహెచ్సీకి రోజూ ఐదారుగురు బాధితులు వస్తున్నారు. వారం రోజులుగా వ్యాక్సిన్ లేదు. గత్యంతరం లేక బాధితులు భువనగిరి, హైదరాబాద్, జనగామకు వెళ్తున్నారు. ● సంస్థాన్ నారాయణపురం పీహెచ్సీలో దగ్గు మందు కొరత ఉండి. వారం క్రితం ప్రతిపాదనలు పంపించామని అధికారులు చెబుతున్నా ఇంత వరకు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. గడువుతీరిన మందులు పీహెచ్సీల్లో అయిపోయిన మందుల జాబితాను ఫార్మాసిస్టులు నల్లగొండలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్(సీడీఎస్)కు పంపిస్తే రెండుమూడు రోజుల్లో వస్తాయి. కానీ, రోజుల తరబడి జాబితా పంపడం లేదని తెలిసింది. మరోవైపు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి గడువుతీరిన మందులు పంపుతున్నారు. ఇటీవల తుర్కపల్లి, దండుమల్కాపురం పీహెచ్సీల్లో రోగులకు గడువుతీరిన మందులు పంపిణీ చేయడం వెలుగుచూసింది. ఫ సాధారణ జబ్బులకూ మాత్రలు ఇవ్వలేని దైన్యం ఫ చాలా వరకు బయటకు రాస్తున్న వైద్యులు ఫ కుక్క కరిచినా భువనగిరి, హైదరాబాద్, జనగామ పోవాల్సిందే ఫ కొన్ని చోట్ల గడువుతీరిన మందులతో సరిపెడుతున్న సిబ్బంది ఫ తమ కష్టాలు తీర్చాలంటున్న ప్రజలు -
కలెక్టర్.. ఉపాధ్యాయుడిగా మారిన వేళ
రామన్నపేట: కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవి పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. బుధవారం రామన్నపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం పదో తరగతికి వెళ్లారు. గణితం సబ్జెక్ట్కు సంబంధించి బహుపదులు పాఠం బోధించి విద్యార్థులకు ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పిన విద్యార్థులను అభినందించారు. ఈశ్వర్ అనే హాస్టల్ విద్యార్థి నాలుగు రోజులుగా పాఠశాలకు రాకపోవడంతో నేరుగా అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు. అనారోగ్యం చేయడంతో బడికి పంపలేదని ఆమె కలెక్టర్ తెలిపారు. ఇంట్లోనే ఉన్న ఈశ్వర్తోనూ కలెక్టర్ మాట్లాడి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. హాస్టల్లో వసతులు, భోజనం, వార్డెన్ పనితీరు గురించి ఈశ్వర్ను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడిన తరువాత క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని సూచించారు. ఆయనవెంట తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, హెచ్ఎం జరీనా ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరి సస్పెన్షన్ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన రికార్డ్ అసిస్టెంట్ చక్రపాణి, సబార్డినేట్ కోటేశ్వర్ను సస్పెండ్ చే యాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పరిశీలించి.. అవగాహన పెంచుకొని
బీబీనగర్: గ్రామీణ ప్రాంతాల్లోని స్థితిగతులు, అభివృద్ధి పనులను అధ్యయనం చేయడంతో పాటు పరిపాలనా విధానాలు తెలుసుకునేందుకు 50 మందితో కూడిన ట్రైనీ ఏంపీడీఓల బృందం బుధవారం బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో పర్యటించింది. వైకుంఠధామం, డంపింగ్యార్డు, క్రీడా ప్రాంగణం, నర్సరీలను పరిశీలించింది. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓతో సమావేశం అయ్యారు. పరిపాలన అంశాలపై వారికి ఎంపీఓ అవగాహన కల్పించారు. ఎంపీడీఓల విధుల గురించి డీఆర్డీఏ నాగిరెడ్డి, ఏపీడీ సురేష్, ఏంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, టీజీఐఆర్డీ ఫ్యాకల్టీ అనిల్కుమార్ వారికి వివరించారు. శిక్షణలో భాగంగా అన్నంపట్ల గ్రామంలో పర్యటించా మని, ఈనెల 25తేదీన శిక్షణ ముగుస్తుందని ట్రైనీ ఎంపీడీఓలు తెలిపారు. ఫ అన్నంపట్లలో పర్యటించిన 50 మంది ట్రైనీ ఎంపీడీఓలు ఫ అభివృద్ధి పనుల పరిశీలనభువనగిరిటౌన్ : అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ట్రైనీ ఎంపీడీఓలు బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. తహసీల్దార్, ఎంపీడీఓలు రెండు కళ్లలాంటి వారని.. సేవా దృక్పథంతో పని చేయాలని వారికి సూచించారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టర్ తనిఖీలోనూ వెలుగులోకి..
మందుల కొరతకు వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా కారణమని తెలుస్తోంది. కలెక్టర్ హనుమంతరావు ఇటీవల బీబీనగర్ మండలంలోని ఓ పీహెచ్సీని తనిఖీ చేశారు. అదే సమయంలో ఓ పేషెంట్ మందుల చీటితో వెనుదిరిగి వెళ్తుండగా కలెక్టర్ కంట పడ్డాడు. అతన్ని కలెక్టర్ ప్రశ్నించగా మందులు లేవు, ప్రైవేట్లో తీసుకోవాలని సిబ్బంది తనకు సూచించినట్లు చెప్పాడు. వెంటనే డీఎంహెచ్ఓకు ఫోన్ చేయగా మందులు ఉన్నట్లు సమాధానం ఇచ్చాడు. పీహెచ్సీలో ఉండగానే తనకు తప్పుడు సమాచారం ఇస్తున్నావని డీఎంహెచ్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేసినా మందుల కొరత ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది. -
ఎయిమ్స్ నూతన డైరెక్టర్ నేడు బాధ్యతల స్వీకరణ
బీబీనగర్: ఎయిమ్స్ నూతన డైరెక్టర్ అమితా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో డైరెక్టర్ పని చేసిన వికాస్ భాటియా మే నెలలో ఢిల్లీ ఎయిమ్స్కు బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతా శాంతాసింగ్ను ఇంచార్జిగా నియమించారు. కాగా పూర్తిస్థాయి డైరెక్టర్గా లక్నోలోని సంజయ్గాంధీ పోసు్ట్రగాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్లో సీనియర్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న అమితా అగర్వాల్ను బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నేడు బాధ్యతలు స్వీకరిస్తారని ఎయిమ్స్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్ తప్పనిసరి సాక్షి,యాదాద్రి : రైస్ మిల్లర్లు అగ్రిమెంట్, బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా ఇవ్వాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తన చాంబర్లో మిల్లర్లతో సమావేశమైన సీఎంఆర్ డెలివరీ, బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. గత వానాకాలం సీఎంఆర్ 91 శాతం పూర్తయ్యిందని, మిగతాది నిర్దేశిత గడువులోపు అందజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. 25న జాబ్మేళా సాక్షి యాదాద్రి: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈనెల 25వ తేదీన జాబ్మేళాఉంటుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. జాబ్మేళా నేపథ్యంలో బుధవారం జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. జాబ్మేళా ద్వారా తమ కంపెనీల్లో కల్పించను న్న ఉద్యోగ అవకాశాలపై చర్చించారు. జిల్లాలో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తమవంతుగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు రవీందర్, శ్రీదేవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చిల్లర లేదా.. ఫోన్ పే కొట్టు ఆత్మకూరు(ఎం): వలిగొండ మండలం వేములకొండకు చెందిన బొల్లు వెంకటయ్య అనే వ్యక్తి యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఆత్మకూర్(ఎం)కు వచ్చి యాచిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న టీటైం వద్దకు వెళ్లాడు. చిల్లర లేవని టీటైం నిర్వాహకుడు చెప్పడంతో.. ఫోన్పే కొట్టు అంటూ తన సంచిలోనుంచి ఫోన్పే క్యూర్ఆర్ కోడ్ ప్లేట్ తీశాడు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. -
సీపీఆర్ చేద్దాం.. ప్రాణం పోద్దాం
రాజాపేట: ఎవరైనా కార్డియాక్(గుండెపోటు)కు గురైనప్పుడు తొలిక్షణం మనం స్పందించగలిగితే వారికి పునర్జన్మ ఇచ్చిన వారమవుతాం. ఎలాంటి పొరపాటు చేసినా, సమయోచితంగా వ్యవహరించకపోయినా ఎంతో విలువైన ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అందుకే సీపీఆర్ (కార్డియో పల్మొనరీ రెససిటేషన్)పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపాటి మెలకువలు నేర్చుకుంటే ఎంతోమందికి ఉపయోగపడుతామని అంటున్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవేర్నెస్ వీక్వయసుతో నిమిత్తం లేకుండా ఇటీవల కాలంలో ఎంతోమంది గుండెపోటుతో మృతి చెందుతున్నారు.గుండె ఆగిపోయిన వెంటనే బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే హృదయ శ్వాసకోశ పునరుజ్జీవ చర్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్య శాఖ ‘సీపీఆర్ అవేర్నెస్ వీక్’ పేరుతో ఈనెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు ఇటీవల ముగిశాయి. వీరికి అవగాహనఫ్రంట్లైన్ వర్కర్లు పోలీసులు, ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది, మున్సిపాలిటీలు, పంచాయతీ సిబ్బందితో పాటు కళాశాలలు, ఉన్నత పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు డాక్టర్లను ఎంపిక చేశారు. వీరిలో డాక్టర్ విజయ్, డాక్టర్ కాటమరాజు, డాక్టర్ అశ్వినికుమార్, డాక్టర్ హేమంత్ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,516 మందికి సీపీఆర్పై అవగాహన కల్పించినట్లు సీపీఆర్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్ తెలిపారు.పెరుగుతున్న గుండెపోటు మరణాలు కార్డియో పల్మొనరీ రెససిటేషన్తో పునర్జన్మ ఎంపిక చేసిన కేటగిరీల్లో 1,516 మందికి సీపీఆర్పై అవగాహన ముగిసిన అవేర్నెస్ ప్రోగ్రాంసీపీఆర్ ద్వారా ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ సీపీఆర్పై అవగాహన కలిగి ఉండాలి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బందికి సీపీఆర్పై ప్రత్యేక అవగాహన కల్పించాను. – డాక్టర్ విజయ్కుమార్, మోటకొండూరు మండల వైద్యాధికారి సీపీఆర్ చేసే విధానం సీపీఆర్ అనేది అత్యవసర పరిస్థితుల్లో.. ముఖ్యంగా ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ప్రాణా లను కాపాడే పద్ధతి. ఈ ప్రక్రియలో బాధితుడి చాతీపై రెండు చేతులతో రెండు నిమిషాల్లో కనీసం 150 సార్లు కుదింపులు చేయాలి. ఇలా చేస్తూనే మధ్యమధ్యలో నోటి ద్వారా కృత్రిమ శ్వాస అందజేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరంలోని అవయవాలతో పాటు మెదడుకు ఆక్సీజన్ చేరుతుంది. పడిపోయిన వ్యక్తి తిరిగి శ్వాస తీసుకుంటున్నాడా లేదా గమనించాలి. తిరిగి శ్వాస తీసుకున్నట్లయితే సీపీఆర్ చేయడం ఆపేసి బాధితుడుని అతను ఉన్నస్థానం నుంచి పక్కకు ఒక వైపునకు తిప్పి పడుకోబెట్టాలి. ఆ తరువాత 108కు సమాచారం అందజేయడం, లేదా మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాలి. -
‘ఫారన్’డాక్టర్లపై విచారణ
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఏడుగురు ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల(ఎఫ్ఎంజీ)పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణ చేపట్టింది. విదేశీ యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు ప్రైవేట్ నర్సింగ్ హోంలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ మెడికల్ కౌన్సిళ్లు జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కాపీలు, వీసా, పాస్పోర్ట్, నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఢిల్లీ జారీ చేసిన స్క్రీనింగ్ టెస్ట్ సర్టిఫికెట్, విశ్వవిద్యాలయం జారీ చేసిన డిగ్రీ పట్టా తదితర సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయా డాక్టర్లకు నోటీసులు జారీ చేసింది. వారంలోగా హెదరాబాద్లోని మెడికల్ కౌన్సిల్ చైర్మన్, రిజిస్ట్రార్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. వెలుగులోకి వచ్చిందిలా.. చైనా, టాంజానియా, జర్మనీ, ఉక్రెయిన్, పిలిఫ్పైన్స్, రష్యా, నేపాల్, కజకిస్తాన్, బెలారస్ దేశాల్లో పలు యూనివర్సిటీలు వైద్య విద్యను అందజేస్తున్నారు. కొందరు చదువుకోసం అక్కడికి వెళ్లకుండానే ఇక్కడి నుంచే సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తోంది. ఆర్టీఐ యాక్టివిస్టు ఒకరు ఎఫ్ఎంజీ వైద్యుల వివరాల సమాచారం కోసం దరఖాస్తు చేయగా.. నకిలీ వ్యవహారం వెలుగుచూసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జిల్లాలో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. కొందరు తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లను అందజేయగా.. మరికొందరు ఇవ్వలేదని తెలుస్తోంది. వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. నర్సింగ్హోంల నిర్వహణ విదేశీ యూనివర్సిటీలకు వెళ్లి చదవకుండానే డాక్టర్ సర్టిఫికెట్లు పొందిన వైద్యులు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు నర్సింగ్హోంలు నిర్వహిస్తున్నారు. వీరినుంచి వైద్యారోగ్యశాఖ అధికారులకు ముడుపులు ముడుతున్నాయని సమాచారం. పీహెచ్సీలలో అరకొరగా విధులు నిర్వహిస్తూ తమ సొంత నర్సింగ్ హోంలలో మాత్రం పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ హనుమంతరావు పలు పీహెచ్సీలను సందర్శించినప్పుడు అక్కడ వైద్యుల గైర్హాజరీని గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు.ఫ జిల్లాలో ఏడుగురికి నోటీసులు ఫ విచారణ చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ -
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి స్వస్థలం వనిపాకల
చిట్యాల: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వనిపాకల గ్రామం. చాలా ఏళ క్రితమే ఆయన హైదరాబాద్లో సిర్థపడ్డారు. 2023 శాసనసభ ఎన్నికల్లో సైతం ఆయన ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా కూడా కొనసాగుతున్నారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో ఆయనతో పాటు చిట్యాల మండలానికి చెందిన పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సరస్వతీ పుత్రికలను ఆదుకోరూ..
కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన అందుగుల వెంకటయ్య, సైదమ్మ దంపతుల రెండో కుమార్తె తేజశ్రీ నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించి రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే కళాశాలలో చేరడానికి ఫీజు కట్టలేక తల్లిదండ్రులతో కూలీ పనులకు వెళ్తోంది. తేజశ్రీ అక్క ప్రవళ్లిక కూడ మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతోంది. చదువులో ముందంజలో ఉన్న తేజశ్రీ, ప్రవళ్లిక ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ చదివిస్తున్నారు. చదువు కొనసాగించేందుకు ప్రవళ్లికకు రూ.1,80,000, తేజశ్రీకి రూ.1,22,000 అవసరం ఉంది. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు. -
ప్రత్యక్ష బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి
విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రత్యక్ష పద్ధతి దోహద పడుతుంది. పాఠ్యాంశాల్లోని వేషధారణల ద్వారా విద్యాబోధన చేస్తే పిల్లలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకుంటారు. పాఠాలు వారికి సులభంగా అర్థమవుతాయి. అందుకే ఈ విధానాన్ని ఎంచుకున్నాను. – నివేదిత, హిందీ టీచర్, జెడ్పీహెచ్ఎస్, వెలుగుపల్లిసులభంగా అర్థమవుతున్నాయి మా హిందీ టీచర్ వివిధ వేషధారణలతో పాఠాలు చెబితే మాకు సులభంగా అర్థమవుతుంది. హిందీ భాషపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. బుక్కులో ఉన్న పాఠం కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నారు. – హిందూ శ్రీ, 10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, వెలుగుపల్లి -
అధిక వడ్డీ కేసులో మరికొందరి అరెస్ట్
నల్లగొండ: అధిక వడ్డీ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ బాలాజీనాయక్ అనుచరుడు మధును తో పాటు మరికొంత మంది ఏజెంట్లు పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం పలుగుతండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రమావత్ మధునాయక్ ఓ ఫర్టిలైజర్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తూ జిల్లాలోని వివిధ మండలాల్లో మార్కెటింగ్ చేసేవాడు. ఆ క్రమంలో అతడికి చాలా మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తన సొంత గ్రామంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న అన్న వరుస అయిన రమావత్ బాలాజీనాయక్ వద్ద ఏజెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత తన బావలు భరత్, బాబు, రమేష్తో కలిసి జీఎన్ఐ(గోకులానందన్ ఇన్ప్రా) అనే కంపెనీని మధునాయక్ ఏర్పాటు చేశాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర వెంచర్లున్నాయని, హైదరాబాద్లో పబ్బులు, స్పా సెంటర్లు, ఏపీలోని కర్నూలు వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని డాక్యుమెంట్లు ప్రజలకు చూపారు. బాలాజీనాయక్ కంటే అధికంగా నెలకు రూ.15 నుంచి రూ.18 వడ్డీ ఇస్తామని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి పెద్దఎత్తున డబ్బుల వసూలు చేయడం మొదలుపెట్టారు. అంతేగాక ఏజెంట్లను నియమించి డబ్బులు వసూలు చేసి తన బావల ఆదేశాల మేరకు ఆస్తులు కొనడం ప్రారంభించాడు. ఆ డబ్బుతో 2025 జనవరిలో హైదరాబాద్లో గోకులానందన్ ఇన్ప్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. ఫార్చునర్ కారు కొనడంతో పాటు సొంతూరిలో పెద్ద ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. దీంతో మధునాయక్కు పెద్దఎత్తున ప్రచారం వచ్చింది. దీంతో పలుగుతండా, చుట్టుపక్కల గిరిజన తండాలు, గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి రూ.10 వడ్డీ ఇస్తామని ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు. ఆ డబ్బులతో వ్యవసాయ భూములు, ఇళ్లు, ఖరీదైన కార్లు, బైక్లు కొని జల్సాలు చేయడం మొదలుపెట్టారు. అసలు డబ్బులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదు.. కొన్ని నెలల నుంచి అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వకపోవడంతో మధునాయక్పై అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో అతడు తప్పించుకు పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ మొదటి వారంలో మధునాయక్, అతడి ఏజెంట్లపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. మధునాయక్ బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాలాజీనాయక్ కేసులో ఏజెంట్గా ఉన్న అతడి అన్న రవీందర్తో పాటు గణేష్, రాంప్రసాద్, సట్టు నరేష్ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి థార్ వాహనం, ఎంజీ కారు, ఆల్టో కారు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ శరత్చంద్ర పవార్ నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు ఫ కార్లు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
కార్తీక మాసం.. పరమ పవిత్రం
యాదగిరిగుట్ట: కార్తీక మాసాన్ని పవిత్రమైన మాసంగా భావిస్తారు. కార్తీక మాసం వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు, శుభకార్యాలకు ఎంతో ముఖ్యమైనది. ఈ మాసం ప్రారంభం నుంచి సూర్యోదయానికి పూర్వమే లేచి నది స్నానం ఆచరించి పొడి బట్టలతో దీపారాధన చేస్తారు. మహిళలు వ్రతాలు, నోములు ఆచరిస్తారు. తులసీ, మారేడు, ఉసిరికాయలతో శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించిన వారికి శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభమవుతుండటంతో మహిళలు ప్రత్యేక పూజలకు సిద్ధమయ్యారు. నవంబర్ 20వ తేదీ వరకు ప్రత్యేక పూజలు అందుకునేందుకు యాదగిరి క్షేత్రం, కొండపైన శివాలయంతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో శివాలయాలు సిద్ధమయ్యాయి. ఉసిరి చెట్టుకు పూజలు.. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేస్తే విష్ణువుకు పూజ చేసినంత ఫలితం లభిస్తుందని భక్తులు భావిస్తారు. ఉసిరి కాయలు, ఆకులను నీటిలో వేసుకుని తల స్నానాలు ఆచరిస్తారు. ఉసిరికాయలు, ఆకుల్లో పోషక గుణాలు ఉండటంతో పాటు వాటితో స్నానం ఆచరిస్తే భక్తి, ముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. అదేవిధంగా స్నానాలాచరించే ముందు తిలామలక మిశ్రమాన్ని శరీరానికి లేపనం చేసుకుంటారు. ఆమలకం అంటే ఉసిరిక, తిలలు అంటే నువ్వులు ఈ రెండింటి మిశ్రమాన్ని రాసుకోవడం ద్వారా శరీర రుగ్మతులు నశించి ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరిక, నువ్వుల్లో ఆరోగ్య ప్రదాయకమైన ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుండడం వల్ల శరీరంపై కురుపులు, దద్దుర్లు, ఫంగస్ నశించడానికి ఈ స్నానం ఎంతో ఉపకరిస్తుంది. వన భోజనాలు.. కార్తీక మాసంలో వన భోజనాలకు ప్రత్యేకత ఉంది. రావి, ఉసిరి, మామిడి, మారేడు వంటి చెట్ల కింద సామూహిక వన భోజనాలు చేస్తారు. కార్తీక మాసంలో నెల రోజులూ ఆలయాల్లో దీపాలు పెట్టడం సంప్రాదాయం. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ద ద్వాదశి, చతుర్ధశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. శివాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం కడతారు. మూడు సిబ్బెలలో దీపాలు వెలిగించి ధ్వజ స్తంభం పైకి చేర్చుతారు. సాయంకాలం నువ్వుల నూనెతో ఆకాశ దీపారాధన చేస్తే రూప, సౌందర్య, సౌభాగ్య సంపదలు వృద్ధి చెందుతాయి. కార్తీక సోమవారం వ్రతం కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు పూజలు, అభిషేకాలు, దానాలు చేస్తే శివుడు తమ కోర్కెలు తీరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక శుక్లపక్షం మొదటి రోజున మహిళలు బొమ్మల కొలువు, గోవర్ధనపూజ నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడిని బొమ్మగా తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు. రెండో రోజు భగిని హస్త భోజనం అనే పండుగను సోదరుల సంక్షేమం కోసం సోదరీమణులు నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. కార్తీక శుక్లపక్ష ఏకాదశిని విష్ణుభగవానుడి క్షీర సాగరంతో పూజలు జరుపుతారు.ఫ నోములు, వ్రతాలకు ప్రత్యేక ప్రాధాన్యం -
మత్తు పదార్థాలు సేవిస్తున్న 17 మందిపై కేసు
నల్లగొండ: మత్తు పదార్థాలు సేవించడంతో పాటు విక్రయిస్తున్న ముఠాను, ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మెడికల్ షాపు యజమానిని సోమవారం తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బూరో సిబ్బంది, నల్లగొండ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండకు చెందిన మహ్మద్ జబీఉల్లా, మహబూబ్బాద్ జిల్లా తొర్రూర్లోని వెంకటరమణ మెడికల్ షాపు యజమాని దారం కృష్ణసాయితో పాటు మత్తు కలిగించే స్పాస్మో టాబ్లెట్స్ సేవిస్తున్న 15 మందిని గుర్తించి అందులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిబ్బంది, నల్లగొండ వన్టౌన్ పోలీసులు మునుగోడు రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా వెళ్తున్న మహ్మద్ జబీబ్ఉల్లా పోలీసులను చూసి పారిపోతుండగా అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని విచారించగా తాను ఫ్రిజ్ మెకానిక్ అని, గత ఐదేళ్లుగా మత్తు పదార్థాలకు బానిసైనట్లు ఒప్పుకున్నాడు. 2024లో కూడా అతనిపై 2 కేసులు నమోదై జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత తిరుమలగిరి దగ్గరలో ఉన్న ఒక మిల్లులో పనిచేశాడు. మూడు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లోని వెంకటరమణ మెడికల్ షాపు యజమాని దారంకృష్ణ సాయిని కలిసి ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు కలిగించే స్పాస్మో టాబ్లెట్స్ ఒక షీట్ను రూ. 100కు కొని నల్లగొండలో ఆ ట్లాబెట్లు వేసుకుంటున్న వారికి రూ.200కు అమ్మి లాభాం పొందవచ్చని పథకం వేశాడు. ఈ నెల 19న తొర్రూరు వెళ్లి 8 బాక్సులు(ఒక్కో బాక్సులో 18 షీట్లు) కొని మునుగోడులో ఉన్న అతడి స్నేహితుడు అఫ్రోజ్, అహ్మద్ అబ్దుల్ హఫీజ్ అలియాస్ ఖాజీం, ఓవైజ్, జావిద్, ఫెరోజ్కు ఒక్కొక్కరికి 8 షీట్లు అమ్మి మిగిలిన వాటిని నల్లగొండలో అమ్మడానికి బైక్పై వస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మెడికల్ షాపు యజమానితో పాటు మరో ఐదుగురిని పట్టుకుని, మెడికల్ షాపును సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న టీజీఏఎన్బీ డీఎస్పీ భిక్షపతిరావు, నల్లగొండ వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, పోలీస్ సిబ్బందిని టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. ఫ మెడికల్ షాపు సీజ్.. ఏడుగురి అరెస్ట్ -
వ్యవసాయబావిలో దూకి మహిళ బలవన్మరణం
రామన్నపేట: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ వ్యవసాయబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం రామన్నపేట మండలం దుబ్బాకలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక గ్రామానికి చెందిన జినుకుంట్ల సైదమ్మ(32)కు తొమ్మిది సంవత్సరాల క్రితం జానయ్యతో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె సంతానం. సైదమ్మ గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గ్రామశివారులోని వ్యవసాయబావి వద్దకు వెళ్లి అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు సైదమ్మ కనిపించకపోవడంతో ఆమె కోసం ఊరంతా వెతికారు. వ్యవసాయబావి వద్ద ఆమె రాసిపెట్టిన సూసైడ్ లెటర్ను చూసి ఆమె బావిలో దూకినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఫైర్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త జానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
యాదగిరిగుట్టలో ధనలక్ష్మి పూజ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ధనలక్ష్మి పూజను అర్చకులు వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అనంతరం ముఖ మండపంలో అధిష్టించారు. ఈ సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి ధనలక్ష్మి పూజను చేశారు. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు మంగళహారతి పూజ జరిపి, గర్భాలయ ప్రధాన ద్వారం వద్ద దీపావళి వేడుకల్లో భాగంగా క్రాకర్స్తో పాటు దీపాలు వెలిగించి వేడుకను నిర్వహించారు. ఆయా వేడుకలో అధికారులు, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. బుద్ధవనంలో ధమ్మ దీపోత్సవం నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో దీపావళిని పండుగను పురస్కరించుకొని సోమవారం బౌద్ధులు ధమ్మ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దార్ధుడు జ్ఞానోదయం పొంది మొదటిసారి కపిలవస్తు నగరానికి వచ్చిన సమయంలో ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికిన సందర్భాన్ని బౌద్ధులు, బౌద్ధ అభిమానులు దీపోత్సవం, దీపదానోత్సవం అని ఘనంగా జరుపుకుంటారు. ప్రతిఏటా దీపావళి రోజున బౌద్ధులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దీపోత్సవం సందర్భంగా బుద్ధవనంలోని మహాస్థూపాన్ని, వివిధ భాగాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. బుద్ధవనంలోని అశోక చక్రం వద్ద దీపాలు వెలిగించి దీపాలతో మహాస్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, సాక్షి పత్రిక మాజీ ఎడిటర్ రామచంద్రమూర్తి, బౌద్ధ అభిమానులు పాల్గొన్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యంపెద్దఅడిశర్లపల్లి: ఏఎమ్మార్పీ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన సయ్యద్ హర్షద్(45) ఆదివారం తన స్నేహితులతో కలిసి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజార్వాయర్ హెడ్ రెగ్యూలేటర్ వద్ద గల ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ వద్ద చేపల వేటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు కాలు జారిపడి కాలువలో గల్లంతయ్యా డు. సమాచారం తెలుసుకున్న గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి సరఫరాను నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టగా.. ప్రధాన కాలువ మెయిన్ గేట్ వద్ద హర్షద్ మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నుట్ల ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం దేవరకొండ: దేవరకొండ పట్టణంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద సుమారు 55ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు లేత గోధుమ రంగు టీషర్ట్, పొడగాటి జుట్టు కల్గి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712670154, 8712570236 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నార్కట్పల్లి: ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఢీకొని మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమ వారం సాయంత్రం నార్కట్పల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన కొత్త చంద్రశేఖర్(21) ఢిల్లీలో బీటెక్ చదువుతున్నాడు. చంద్రశేఖర్ సోమవారం రాత్రి మరో వ్యక్తి దుర్గం రిషికేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై అమ్మనబోలు నుంచి నార్కట్పల్లి వైపు వస్తుండగా.. అమ్మనబోలు చౌరస్తా కల్వర్టు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్, రిషికేష్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ మృతిచెందాడు. చంద్రశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పాఠం.. పది కాలాలు గుర్తుండిపోయేలా..
తుంగతుర్తి : పాఠ్యాంశాలు పిల్లలకు అర్థమవడంతో పాటు పది కాలాలు గుర్తుండేలా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయురాలు నివేదిత. మండలంలోని వెలుగుపల్లి జెడ్పీహెచ్ఎస్లో హిందీ టీచర్గా పనిచేస్తున్న కర్పూరపు నివేదిత ప్రత్యక్ష విధానంతో, వినూత్న పద్ధతుల్లో బోధిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. పిల్లలు హిందీ అంటే అంతగా ఆసక్తి చూపక పోవడంతో వారిని ప్రోత్సహించడంతో పాటు పాఠాలు బాగా అర్థం చేసుకునేలా ప్రభుత్వం అందిస్తున్న ఏఐ పరికరాలను వినియోగించుకుంటూ విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు హిందీని సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు ఆ సబ్జెక్ట్లో వెనుక బడిన వారికి ఉపయోగకరంగా ఉండేలా విద్యాబోధన చేస్తున్నారు. పాఠాల్లోని పాత్రలన్నీ ప్రత్యక్షంవిద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఉండేందుకు పాఠ్యాంశాల్లోని పాత్రలను విద్యార్థులతో వేయించి బోధన చేయడంతో పాటు తాను కూడా స్వయంగా వేషధారణ వేసి బోధిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. 10వ తరగతి హిందీలో ఉన్న భక్త్ పథ్ పాఠాన్ని మీరాబాయి రచించింది. ఆ పాఠాన్ని బోధించేందుకు తానే స్వయంగా మీరాబాయి వేషధారణలో పాఠశాలకు వచ్చి మరీ బోధించడం ద్వారా విద్యార్థులలో ఆ పాఠ్యాంశంపై ఆసక్తిని పెంచారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ..విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. విద్యార్థులను కూడా పలు రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీతో పాటు వారిని ఆటల్లో ప్రోత్సహించడం, డాన్స్, సింగింగ్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వడం చేస్తున్నారు. పేద విద్యార్థులకు సాయం అందిస్తూ వారిని చదువులో ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో విద్యాబోధన విజువల్, ఏఐ జోడించి విద్యార్థులకు బోధన ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయురాలు నివేదిత -
ఏటీఎం కేంద్రాలే టార్గెట్
ఇబ్రహీంపట్నం రూరల్: ఏటీఎం కేంద్రాలే టార్గెట్గా చేసుకుని అమాయకుల దృష్టి మళ్లించి నగదు మాయం చేస్తున్న కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మహేశ్వర్ జోన్ డీసీసీ సునీతారెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా తాళ్లగడ్డ కాలనీకి చెందిన సుధనబోయిన వెంకటేశ్ (37) బతుకుదెరువు కోసం వలసవచ్చి నాగారంలోని శ్రీనివాస్నగర్ కాలనీలో అద్దెకు ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఏటీఎం కేంద్రాలను లక్ష్యం చేసుకున్నాడు. కార్డులు స్వైప్ చేస్తున్నట్లు నటిస్తూ వృద్ధులు, మహిళలు డబ్బు డ్రా చేసుకోవడానికి రావడం గమనిస్తాడు. డబ్బులు తీసిస్తానని వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న కార్డులు తీసుకుని దృష్టి మళ్లించి తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డు ఇచ్చేస్తాడు. ఆ కార్డు స్వైప్ చేసినట్లు నటించి రావడం లేదని చెబుతాడు. వారు వెళ్లగానే నగదు డ్రా చేసుకుంటాడు. ఓ కేసు విచారణతో వెలుగులోకి.. 11 సెప్టెంబర్ 2025న సాయినాథ్ మోహన్ రావు జోషి అనే వ్యక్తిని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ఎస్బీఐ ఏటీఎం వద్ద దృష్టి మరల్చి రూ.40 వేల నగదు కాజేశాడు. బాధితుడు 15 సెప్టెంబర్ 2025న ఆదిబట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు అతనిపై 27 కేసులు ఉన్నట్లు తేలింది. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. 2021లో చర్లపల్లి జైలులో ఉన్నట్లు గుర్తించారు. 27 కేసుల్లో మొత్తం రూ.12,61,246 నగదు కాజేశాడు. నిందితుడి నుంచి రూ.6.31 లక్షల నగదు, సెల్ఫోన్, 23 వివిధ రకాల ఏటీఎం కార్డులు, ఓ కారును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఫ అమాయక వృద్ధులు, మహిళలే లక్ష్యం ఫ దృష్టి మళ్లించి నగదు మాయం ఫ అంతర్ రాష్ట్ర నేరగాడి అరెస్ట్ ఫ రూ.6.31 లక్షల నగదు, కారు, ఏటీఎం కార్డులు స్వాధీనం -
పోలీసుల సేవలు మరువలేనివి
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట: నిత్యం శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా చూస్తున్న పోలీసుల సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం గుండ్లపల్లి శ్రీరాంగౌడ్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్నాయుడు, రూరల్ ఎస్ఐ శంకర్గౌడ్, ట్రాఫిక్ సీఐ ఎ.కృష్ణ, ఎస్ఐలు యాదయ్య, సుధాకర్, సైదులు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
భూదాన్పోచంపల్లి : జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 320 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ సీజన్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఽకలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం పోచంపల్లి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభించలేదని, బుధవారం నాటికి అన్ని కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించామన్నారు. మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 38 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటా వేశామన్నారు. పనులు ఆపితే సస్పెండ్ చేస్తా.. పోచంపల్లి పీఏసీఎస్ ఆవరణలో రైతుల విశ్రాంతి కేంద్రాన్ని నిర్మిస్తుంటే జలాల్పురం పంచాయతీ కార్యదర్శి నిర్మాణ పనులను నిలిపివేశారని స్థానిక రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి ఎంపీడీఓ భాస్కర్తో ఫోన్లో మాట్లాడారు. పనులకు ఆటంకం కలిగిస్తే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. విశ్రాంతి కేంద్రానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిధులు పెంచాలని పీఏసీఎస్ సీఈఓ బాల్రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ వెంకట్రెడ్డి, ఏఓ శైలజ, ఏఈఓ శ్వేత పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తాం రామన్నపేట : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. రామన్నపేట మండలంలోని బోగారం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఇంద్రపాలనగరం పల్లె దవాఖానాను తనిఖీ చేసి రికార్డులు, మందుల స్టాక్ను పరిశీలించారు. అనంతరం రామన్నపేట మండల కేంద్రంలోని జంగాల కాలనీలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సి.లాల్బహదూర్శాస్త్రి, ఎంపీడీఓ ఎ.రాములు ఏపీఎం జానిమియా, మార్కెట్ డైరెక్టర్ వెంకటేశం ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం
చౌటుప్పల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ట్రాన్స్కో రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, జిల్లా ఎస్ఈ సుధీర్కుమార్ తెలిపారు. సీఎండీ ఆదేశాల మేరకు మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ట్రాన్స్కో ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరాయం కలుగకుండా అన్నిరకాల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ డీఈ మల్లికార్జున, ఏడీఈ పద్మ, ఏఈ రాజుల సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతోపాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతోపాటు పాలతో మన్యసూక్త పారాయణములతో అభిషేకం నిర్వహించారు. ఆంజనేయస్వామిని సుగంధం వెదజల్లే ద్రవ్యాలు, పూలతో అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. అదేవిధంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండిజోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి. -
నేడే దీపావళి పండుగ
రామగిరి(నల్లగొండ): దీపావళి పండుగను సోమవారమే జరుపుకోవాలని నిర్ణయించినట్లు అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నరకచతుర్ధశి నివాళులు, 21న ధనలక్ష్మి పూజలు జరుపుకోవాలని ఆయన అన్నారు. అమావాస్య ఘడియలు సోమవారం మధ్యాహ్నం 3.46 నుంచి మంగళవారం సాయంత్రం 5.56 నిమిషాల వరకు ఉన్నందున నోములు సోమవారం, మంగళవారం రెండు రోజులు జరుపుకోవచ్చని సూచించారు. ఈసారి కొత్త నోములు లేవని పాత వారు కేదారిశ్వరి వ్రతం చేసుకోవాలన్నారు. సోమవారం నివాళులు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. సాగర్లో ముగిసిన ఏపీ గవర్నర్ పర్యటననాగార్జునసాగర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల నాగార్జునసాగర్ పర్యటన ఆదివారం ముగిసింది. శనివారం కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్కు వచ్చిన ఏపీ గవర్నర్ నాగార్జున కొండ మ్యూజియాన్ని సందర్శించి.. రాత్రి విజయ విహార్ అతిధి గృహంలో బస చేశారు. ఆదివారం నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, డ్యాం, బుద్ధవనం సందర్శించారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. ఆయనకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీడ్కోలు పలికారు. అంతకుముందు టూరిజం, రెవెన్యూ అధికారులతో ఫొటోలు దిగి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్పీ రాజశేఖరరాజు, తహసీల్దార్లు శాంతిలాల్, అనిల్కుమార్, రఘు, కృష్ణయ్య, డ్యాం ఎస్ఈ మల్లికార్జునరావు, ఈఈ సీతారాం, జిల్లా టూరిజం అధికారి శివాజీ, భానుప్రసాద్, కృష్ణకుమారి, రవి, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోగల మినీ శిల్పారామంలో ఆదివారం శ్రీచంద్ర కళా నిలయం ఆధ్వర్యంలో పెరుమాండ్ల షంతోష్ శిష్య బృందం ఆంధ్ర నాట్య కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెలవు దినం కావడంతో శిల్పారామానికి వచ్చిన సందర్శకులు నృత్య ప్రదర్శనను తిలకించి ఆనందించారు. ఈ నృత్య ప్రదర్శనలో కళాకారులు వష్తిక, సుహని, రితిక, నిత్యశ్రీ, అశ్రిత, దీక్షిత, అక్షిత పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉంటేనే ఆనంద కేళి..
పెద్దవూర: వెలుగులు విరజిమ్మే దీపావళి రానే వచ్చింది. పండుగ రోజున టపాసులు పేల్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆనందకేళీ అవుతుంది. వ్యాపారులు పాటించాల్సిన జాగ్రత్తలు● టపాసుల దుకాణదారులు అధికా రుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ● దుకాణాలను బహిరంగ మైదా నాలు, అధికారులు సూచించిన స్థలాల్లోనే ఉండాలి. ● దుకాణాల వద్ద ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. ● ప్రమాదాల నివారణకు నీటిని, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి. ● వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి దుకాణదారుడు కరపత్రాలను అందజేయాలి. ● దుకాణానికి అనుమతి గడువు తీరిన అనంతరం టపాసులను సంబంధిత అధికారికి అప్పగించాలి. కాల్చేటప్పుడు జాగ్రత్తలు● అనుమతులు ఉన్న దుకాణాల్లోనే టపాసులను కొనుగోలు చేయాలి. ● పెద్దల సమక్షంలోనే చిన్న పిల్లల చేత పటాకులు కాల్పించాలి. ● టపాసులు కాల్చేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి. ● టపాసులు కాల్చే సమయంలో బిగుతుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ● పారపాటున దుస్తులకు నిప్పు అంటుకుంటే అటూ ఇటూ పరిగెత్తకుండా ఉన్న చోటే కింద పడుకుని దొర్లాలి. అలా చేయడం వలన నిప్పు త్వరగా ఆరిపోతుంది. ● ఇంట్లో కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల వద్ద టపాసులను నిల్వ ఉంచకూడదు. ● సగం కాలిన టపాసులను మళ్లీ కాల్చే ప్రయత్నం చేయరాదు. ● బాణసంచా కాల్చిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ● టపాసులను సొంతంగా తయారు చేసే ప్రయత్నం చేయరాదు. ● బాణసంచా పేలుళ్ల వలన వినికిడి సమస్యతో పాటు అధిక రక్తపోటు, గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. రసాయనాలు.. వాటి ప్రభావం..చైనా టపాసుల్లో పొటాషియం క్లోరైడ్ను ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని పేల్చగానే ఒకేసారి పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి మనిషిని అనారోగ్యం పాలు చేస్తుంది. టపాసుల్లో ఉపయోగించే రసాయనాలు పీల్చడం వలన కలిగే దుష్పలితాలు.. రాగి: శ్వాస నాళాల్లో మంట వస్తుంది. కాడ్మియం: రక్తహీనత, మూత్రపిండాలు దెబ్బతింటాయి సీసం: నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది మెగ్నీషియం: మెగ్నీషియం ధూళి కారణంగా జ్వరం వస్తుంది. సోడియం: చర్మవ్యాధులు వస్తాయి జింక్: వాంతులు వస్తాయి నైట్రేట్: మానసిక స్థితి అదుపు తప్పుతుంది. టపాసులు కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి -
సూక్ష్మ సైజులో అమరవీరుల స్థూపం
భువనగిరి: భువనగిరి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు చోల్లేటి శ్రీనివాసచారి ఈ నెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సూక్ష్మ సైజులో పోలీసు అమరవీరుల స్థూపాన్ని తయారు చేశారు. 40 గ్రాముల వెండితో నాలుగు ఇంచుల ఎత్తులో రూపొందించి ఔరా అనిపించారు. ఆయన గతంలోనూ బంగారం, వెండితో వీసా టవర్, క్రికెట్ స్టేడియం, క్రికెట్ వరల్డ్ కప్, భారత పార్లమెంటు భవనం, వీణ, బంగారు బతుకమ్మ, తెలంగాణ చిత్రపటం, ఫుట్బాల్ వరల్డ్ కప్, క్రికెట్ బాల్ వంటివి తయారు చేశాడు. వెండితో తయారు చేసిన పోలీసు అమరవీరుల స్థూపం -
అంతలోనే అనంతలోకాలకు..
తెల్లారితే కేఫ్ ఓపెనింగ్..మాడుగులపల్లి: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అందుకోసం కేఫ్ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ముందుగాను కేఫ్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేసుకుని రాత్రి అక్కడే నిద్రించారు. తెల్ల వారుజామున కేఫ్ పైకప్పుపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి కేఫ్ నిర్వాహకుడి భార్య, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి శివారులో జరగగా.. మృతుల స్వస్థలం మాడుగులపల్లి మండల కేంద్రం కావడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి. వివరాలు.. మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన తగుళ్ల వెంకన్న, నాగమణి(30) దంపతులకు కుమారుడు విరాట్ కృష్ణ(7), కుమార్తె నందిని సంతానం. వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరు ఆర్ధికంగా ఉన్నతంగా బతకాలన్న ఉద్ధేశంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నూతనంగా కేఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం కేఫ్ ప్రారంభించాలని అనుకుని శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కేఫ్ వద్దకు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వెంకన్న నిద్రలేచి పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో కేఫ్ రేకుల పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ అక్కడే నిద్రిస్తున్న వెంకన్న కుటుంబ సభ్యులపై పడిపోయింది. వెంకన్న వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అతడి భార్య నాగమణి(30), కుమారుడు విరాట్కృష్ణ(7) అప్పటికే మృతిచెందారు. అతడి కుమార్తె కూతురు నందిని, తల్లి పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నాగమణి, విరాట్ కృష్ణకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్థానికులు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం నాగమణి, విరాట్కృష్ణ మృతదేహాలకు మాడుగులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. నేత్రదానం..నాగమణి, విరాట్ కృష్ణ నేత్రాలను దానం చేసేందుకు గాను ఐ డొనేషన్ సెంటర్ వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను అవగాహన కల్పించగా.. వారు ఒప్పుకున్నారు. దీంతో నాగమణి, విరాట్ కృష్ణ కంటి కార్నియాను టెక్నీషియన్ బచ్చలకూరి జాని సేకరించారు. వాటర్ ట్యాంక్ కూలి తల్లి, కుమారుడు మృతి మాడుగులపల్లి మండల కేంద్రంలో విషాధచాయలు -
అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమించాలి
రామన్నపేట: అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం రామన్నపేటలో నిర్వహించిన యువ కమ్యూనిస్టుల సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారీ విధానం వల్ల అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రపంచంలో కమ్యూనిజం మహోన్నతమైన సిద్ధాంతమని, కమ్యూనిస్టులు పురోగామిశక్తులు అని చెప్పడానికి శ్రీలంక వంటి పరిణామాలే నిదర్శనమని వివరించారు. పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటి అమలు కోసం ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్య అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. యువత దోపిడి వ్యవస్థను నిలువరించాలని, మతోన్మాదశక్తులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో నాయకులు మేక అశోక్రెడ్డి, జెల్లెల పెంటయ్య, గడ్డం వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, కూరెళ్ల నర్సింహాచారి, బోయిని ఆనంద్, కందుల హన్మంత్, కల్లూరి నాగేష్, గొరిగె సోములు, నాగటి ఉపేందర్, విజయ్భాస్కర్, మీర్ఖాజా, బాలరాజు, రామచంద్రం, శ్రవన్, శివ, ఉదయ్ పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
22 నుంచి కార్తీక పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను నిర్వహింంచేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణాతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధికంగా యాదగిరి క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. వ్రత పూజల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండ దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని రెండు హాల్స్లో పూజ సామాగ్రి, వ్రత పీటలను, వ్రతంలో ఉపయోగించే ప్రసాదాలను ప్యాకింగ్ చేసి సిద్ధం చేశారు. యాదగిరి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్టలో సైతం భక్తులు వ్రతాలను జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ● యాదగిరి క్షేత్రంలో..యాదగిరి క్షేత్రంలో నెల రోజుల పాటు 6 బ్యాచ్లుగా వ్రతాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి బ్యాచ్ ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు, రెండో బ్యాచ్ ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు, మూడో బ్యాచ్ 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, నాల్గవ బ్యాచ్ మధ్యాహ్నం 1గంటల నుంచి 2గంటల వరకు, ఐదో బ్యాచ్ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, ఆరో బ్యాచ్ సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహించనున్నారు. ● పాతగుట్ట ఆలయంలో..యాదగిరీశుడి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నాలుగు బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్ ఉదయం 9గంటలకు, రెండో బ్యాచ్ 11గంటలకు, మూడో బ్యాచ్ మధ్యాహ్నం 2గంటలకు, నాల్గవ బ్యాచ్ సాయంత్రం 4గంటలకు నిర్వహిస్తారు. ● కార్తీక పౌర్ణమి రోజు..వచ్చే నెల 5వ తేదీన కార్తీక శుద్ధ పూర్ణిమ నేపథ్యంలో యాదగిరి కొండకు దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఉదయం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు 8 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించనున్నారు. ప్రతి గంటకు ఒక్క బ్యాచ్ చొప్పున 8 బ్యాచ్లు నిర్వహిస్తామని ఇప్పటికే ఆలయ ఈఓ రవినాయక్ వెల్లడించారు. కాగా పాతగుట్ట ఆలయంలో 6 బ్యాచ్లుగా వ్రతా లను భక్తులచే జరిపిస్తారు.వ్రత మండపంలో సిద్ధం చేస్తున్న వ్రత పీటలు యాదగిరి క్షేత్రంలో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు వ్రత మండపంలో పీటలు, ప్రసాదాలు రెడీ -
అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయండి
భువనగిరిటౌన్ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక అన్ని వర్గాల అభీష్టం మేరకే జరుగుతుందని, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఏఐసీసీ పరిశీలకుడు శరత్రౌత్, టీపీసీసీ పరిశీలకుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పేర్కొఅన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన భువనగిరి నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలు, నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేయడంతో పాటు, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో భద్రత కొరవడిందన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కాగా డీసీసీ అధ్యక్ష పదవికి తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, తడక వెంకటేశం, పంజాల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకుడు శరత్రౌత్ -
యాదాద్రి భువనగిరి
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025భువనగిరి: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక, చీకటిని పారదోలి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళి. సోమవారం పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. లక్ష్మీ పూజలు, నోములు, వ్రతాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూరు పట్టణాల్లో పూలు, టపాసులు, పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి. రోడ్లకు ఇరువైపులా ప్రమిదల విక్రయ కేంద్రాలు వెలిశాయి. డిజైన్ను బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు విక్రయించారు. బంతిపూలు కిలో రూ.50నుంచి రూ.80 వరకు ధర పలికాయి. పేలిన టపాసుల రేట్లు దీపావళి అంటేనే టపాసుల ప్రత్యేకం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చి ఆనందంగా గడుపుతారు. అయితే ఈసారి టపాసులు కాల్చకుండానే వాటి ధరలు పేలుతున్నాయి. టపాసులపై జీఎస్టీ ఎత్తివేయడంతో ధరలు తగ్గాయనుకున్న జనానికి ధరలు హడలిపోతున్నారు. నేడు దీపావళి నోములు, వ్రతాలకు సిద్ధం కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట -
కిక్కులేని మద్యం టెండర్లు
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వం మద్యం టెండర్ల దరఖాస్తు గడువు పెంచిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో జిల్లా ఎకై ్సజ్ శాఖ నిమగ్నమైంది. ఈనెల 23 వరకు గడువు ఉండటంతో మరిన్ని దరఖాస్తులను రాబట్టే పనిలో ఉంది. ఈ క్రమంలో తక్కువ దరఖాస్తులు వచ్చిన వైన్స్లపై దృష్టి సారించింది. అందుకు కారణాలను విశ్లేషిస్తోంది. ఆదాయం పెరిగినా అంచనాలను చేరలేదు2025–27 రెండు సంవత్సరాల కాలానికి గాను ప్రభుత్వం నూతన మద్యం టెండర్లు పిలిచింది. దరఖాస్తు గడువు ఈనెల 18న ముగిసింది. 2023లో నాన్ రిఫండబుల్ ఫీజు రూ.2 లక్షలు ఉండగా 3,969 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.79.38 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచింది. 2,674 దరఖాస్తులు రాగా.. రూ.79.41 కోట్ల రాబడి వచ్చింది. ఆదాయపరంగా చూస్తే గతంలో కంటే రూ.3 లక్షలు పెరిగింది. కానీ, ప్రభుత్వ అంచనాలను చేరలేదని తెలుస్తోంది. ఆలేరు సర్కిల్లో కనిపించని స్పందనజిల్లాలో భువగగిరి, రామన్నపేట, మోత్కూరు, ఆలేరు ఎకై ్సజ్ సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో ఆలేరు సర్కిల్లో తక్కువ దరఖాస్తులు వచ్చాయి. చాడలో రెండు, మోటకొండూరు, బొందుగుల, రుస్తాపూర్, రాజాపేట, తుర్కపల్లిలోని వైన్స్లకు 20 లోపే దరఖాస్తులు వచ్చాయి. రుస్తాపూర్లో 14, మోటకొండూరులో 15, చాడ షాప్ –1లో 16 దరఖాస్తులు అందాయి. ఇక్కడ మరిన్ని దరఖాస్తులు వచ్చేలా ఎకై ్సజ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. టెండర్లు వేయాలని మద్యం వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు. మిగతా చోట్ల కూడా టెండర్ల పెంపునకు ప్రయత్నిస్తున్నారు. ఎల్లంబావి వైన్స్కు అధికంగా..గతంలో మాదిరిగానే ఈసారి కూడా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ వైన్స్కు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. జనరల్ కేటగిరీలో ఉన్న ఈ వైన్స్కు 88 దరఖాస్తులు వచ్చాయి. ఆ తరువాత వలిగొండ మండలం అర్రూరు వైన్స్కు 80, బీబీనగర్ మండలం భట్టుగూడెం 74, భువనగిరి మండలం అనాజిపురం మద్యం షాప్కు 64 దరఖాస్తులు దాఖలయ్యాయి. వ్యాపారుల సిండికేట్ ప్రభావం ప్రస్తుతం వైన్స్లు నిర్వహిస్తున్న వ్యాపారుల్లో కొందరు మళ్లీ వాటినే దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సిండికేట్గా ఏర్పడి చక్రం తిప్పారని, గతంతో పోలిస్తే 1,322 దరఖాస్తులు తగ్గాయని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, సహకార ఎన్నికల నేపథ్యంలో కొత్తవారికి అవకాశం లేకుండా వ్యూహాత్మకంగా దరఖాస్తులు వేశారని తెలుస్తోంది.భారీగా తగ్గిన దరఖాస్తులు తప్పిన ఎకై ్సజ్ శాఖ అంచనాలు దరఖాస్తులు పెంచేలా ప్రయత్నం 23వ తేదీ వరకు గడువు పెంపు -
అభివృది్ధకి దారి లేదా!
డబుల్ రోడ్డుతోనే అభివృద్ధి సరైన రవాణా వ్యవస్థ లేక మోటకొండూర్ మండలం అభివృద్ధి జరగడం లేదు. మండల కేంద్రానికి వెళ్లడానికి సౌకర్యాలు లేవు. ఆలేరు–కాటేపల్లి వరకు వయా మోటకొండూర్ మీదుగా ఉన్న బీటీ రోడ్డును డబుల్ రోడ్డుగా మారిస్తే ఎంతో మేలు జరుగుతుంది. – పన్నాల చంద్రశేఖర్రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోటకొండూర్: పునర్విభజనలో భాగంగా ఏర్పడిన మోట కొండూరు మండల అభివృద్ధికి తొమ్మిదేళ్లయినా బాటలు పడటం లేదు. మండల కేంద్రానికి సరైన రోడ్డు లేకపోవడంతో రవాణా సౌకర్యం మెరుగుపడటం లేదు. హ్యామ్లో భాగంగా జిల్లాలో 129.9 కిలో మీటర్ల మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినా అందులో మోటకొండూరు మండలానికి చోటు దక్కలేదు. డబుల్ లేన్ వస్తే తగ్గనున్న దూరాభారంవరంగల్–నల్లగొండ మార్గంలో నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆలేరు నుంచి వయా భువనగిరి మీదుగా వలిగొండ చేరుకోవటానికి 46 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఆలేరు నుంచి మోటకొండూర్ మీదుగా వలిగొండకు కేవలం 34 కిలో మీటర్ల దూరం వస్తుంది. కాటేపల్లి నుంచి మోటకొండూర్ మీదుగా ఆలేరు వరకు 15 కి.మీ దూరం ఉన్న బీటీ రోడ్డును డబుల్ లేన్గా మారిస్తే ఇటుగా వెళ్లే వాహనాలకు 12 కి.మీ దూరం తగ్గటంతో పాటు సమయం ఆదా అవుతుంది. ఈ గ్రామాలకు ప్రయోజనంఆలేరు–కాటేపల్లి రోడ్డును డబుల్ లేనుగా చేయడం వల్ల ఆలేరు బైపాస్ నుంచి బహుదూర్పేట్, మంతపురి, దిలావర్పూర్, మోటకొండూర్, సికింద్రనగర్, కాటేపల్లి మార్గంలో పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. మోటకొండూర్ నుంచి భువనగిరి డబుల్ రోడ్డు సదుపాయం కల్పిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. మోటకొండూర్ నుంచి చీమలకొండూర్ మీదుగా భువనగిరికి డబుల్ రోడ్డు పడుతుందని మండల వాసులు ఎదురుచూశారు. కానీ, ఇప్పటి వరకు అడుగుపడలేదు. మోటకొండూర్ మండల అభివృద్ధికి దోహదపడే రహదారులన్నింటినీ అప్గ్రేడ్ చేయాలని, పునర్వి భజన హామీలను అమలు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. విస్తరణకు నోచని ఆలేరు–కాటేపల్లి రహదారి డబుల్ లేన్ చేస్తేనే మోటకొండూరు అభివృద్ధి వరంగల్–నల్లగొండ వెళ్లే వాహనాలకు తగ్గనున్న దూరంఆలేరు–కాటేపల్లి రోడ్డును రెండు వరుసలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐల య్య, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి విన్నవించాం. జీపీ రోడ్డుగా ఉన్నందున, ఆర్అండ్బీ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని తెలిపారు. రోడ్డును ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం. – పాండురంగయ్య గౌడ్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ -
కూరెళ్లలో కోతుల బెడద ఉండదిక
ఆత్మకూరు(ఎం): ఆ గ్రామంపై నిత్యం కోతులు దండయాత్ర చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి కనపడ్డ వస్తువునల్లా ఛిద్రం చేస్తున్నాయి. ఆహారపదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. పెంకుటిళ్లను పీకి పందిరేస్తున్నాయి. దారిన వెళ్లేవారిని గాయపరుస్తున్నాయి. ఇకనుంచి అటువంటి పరిస్థితి ఉండదు. ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్ల గ్రామ పంచాయతీలో సుమారు 2 వేల జనాభా ఉంది. గ్రామస్తులు పదేళ్లుగా కోతులతో ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను అధికా రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. చివరకు గ్రామస్తులంతా మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ నంచి ప్రత్యేక టీంలను రప్పించారు. పట్టి తరలించినందుకు ఒక్కో వానరానికి రూ.300 చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రామంలో 500 ఇళ్లు ఉండగా.. ఇంటికి రూ.1000 చొప్పున ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వానరాల పట్టివేతకు శ్రీకారంకరీంనగర్ నుంచి వచ్చిన ప్రత్యేక టీంలు ఆదివారం పాఠశాల ఆవరణలో బోన్లు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 20 వరకు వానరాలను బంధించారు. కోతులన్నింటినీ పట్టిన సురక్షితంగా అడవుల్లో వది లిపెట్టనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. వానరాలను పట్టి తరలించేందుకు కరీంనగర్ నుంచి వచ్చిన టీంలు ఒక కోతికి రూ.300 చొప్పున చెల్లింపు ఇంటికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చేందుకు ముందుకొచ్చిన గ్రామస్తులు దాదాపు పదేళ్లుగా కోతులు గ్రామస్తులకు కంటిమీద కు నుకు లేకుండా చేస్తున్నాయి. కోతుల వల్ల జరి గిన నష్టం అంతాఇంతా కాదు. పలువు రు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇంటికి వెయ్యి రూపాయల చొప్పున వేసుకొని కోతులను పట్టిస్తున్నాం. గ్రామస్తులంతా సహకరిస్తున్నారు. – బాషబోయిన ఉప్పలయ్య యాదవ్, కూరెళ్ల మాజీ సర్పంచ్ -
కేటీఆర్ను కలిసిన గొంగిడి దంపతులు
యాదగిరిగుట్ట : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ రైతు విభాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వా నించారు.ఆలేరు నియోజకవర్గంలో రాజ కీయ పరిస్థితులపై గొంగిడి దంపతులతో కేటీఆర్ చర్చించారు. అనంతరం మాజీ మంత్రులు హరీష్రావు, కుందూరు జానారెడ్డిని కలిసి పెళ్లి పత్రిక అందజేశారు. నకిలీ మందుల సమాచారమివ్వండిభువనగిరిటౌన్ : ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్పై సమాచారం ఇవ్వాలని ఔషధ తనిఖీ జిల్లా అధికారి ఏలె బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.నకిలీ మందులు వ్యాధిని నయం చేయకపోవడమే కాకుండా ఆరోగ్యంపై దుష్ప్రరిణామాలు సృష్టిస్తాయన్నారు. మత్తు కలిగించే నార్కోటిక్ సంబంధిత ఔషధాల తయారీ, వినియోగం, ఇతర నిషేధిత మందుల అమ్మకాలు, నాణ్యత సమాచారాన్ని టోల్ఫ్రీ నంబర్ 18005996969 ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు. సమాచారమిచ్చిన వ్యక్తులు వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గా వించారు. రాత్రికి స్వామివారికి శయనో త్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
నల్లగొండ: ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ నుంచి శనివారం ఆటోలో మిర్యాలగూడకు బయల్దేరిన నెమ్మాని సంధ్య తన గమ్యస్థానం రాగానే ఆటోలో ల్యాప్టాప్, రూ.1500 నగదు మర్చిపోయి వెళ్లిపోయింది. ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ బ్యాగును గమనించి నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో వాటిని అప్పగించాడు. పోలీసులు విచారణ చేసి సంధ్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆమెకు ల్యాప్టాప్, రూ.1500 నగదు అప్పగించి ఆటో డ్రైవర్ లతీఫ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అధిక వడ్డీ దందా.. గుండెపోటుతో యువకుడి మృతి
చందంపేట: అధిక వడ్డీ దందా ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన పలువురు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ నల్ల గొండ జిల్లా చందంపేట మండలం పోల్య నాయక్తండాలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. అనుకున్న ప్రకారమే మొదట్లో అధిక వడ్డీ ఇస్తుండడంతో మరికొందరు వారికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా గ్రామానికి చెందిన సుమారు పదిహేను మంది నుంచి రూ.2కోట్ల వరకు వసూలు చేశారు. అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ నాత్య కుమారుడు ఇస్లావత్ నరేష్(30) కుటుంబంతో పాటు హైదరాబాద్లో నివాసముంటూ శుభకార్యాలలో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నరేష్ కూడా రూ.9లక్షల వరకు అప్పు తెచ్చి వారికి వడ్డీకి ఇచ్చాడు. మొదట్లో అనుకున్న మేరకు అధిక వడ్డీ చేతికి అందగా.. ఆ ఆతర్వాత సరైన స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన నరేష్ వారిని గట్టిగా నిలదీశాడు. దీంతో రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. దీంతో నరేష్కు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. -
పుస్తెలతాడు చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి
నార్కట్పల్లి: పత్తి చేను వద్దకు వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని యువకుడు అపహరించేందుకు యత్నించగా గ్రామస్తులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన శనివారం నార్కట్పల్లి మండలం దాసరిగూడెం గ్రామ శివారులో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పల సునీత శనివారం ఉదయం 11గంటల సమయంలో తమ పత్తి చేను వద్దకు వెళ్తోంది. అదే సమయంలో అటుగా బైక్పై వచ్చిన గుర్తుతెలియని యువకుడు బైక్ను కొద్దిదూరంలో ఆపి సునీత వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ గుంట తంగడి ఆకు దొరుకుతదా అంటూ మాటల్లో పెట్టి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కోని పారిపోబోయాడు. సునీత అతడితో పెనుగులాడి కేకలు వేయడంతో అటుగా కారులో వెళ్తున్న వారు వచ్చి దొంగను పట్టుకున్నారు. గ్రామస్తులకు సమాచారం తెలియడంతో దొంగను చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అరెస్ట్ చేశారు. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు దాసరిగూడెం శివారులో ఘటన -
శివలీలారెడ్డికి జాతీయ సేవా పురస్కారం
కనగల్ : మండల కేంద్రానికి చెందిన డాక్టర్ కంబాల శివలీలారెడ్డికి విశ్వమాత మదర్ థెరిసా జాతీయ పురస్కారం ప్రకటించారు. హెల్ప్ ఫౌండేషన్ 4వ వార్షికోత్సవ సందర్భంగా తన సేవలను గుర్తించి ఈ పురస్కారం లభించినట్లు శివలీలారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 26న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పురస్కారం అందుకోనున్నట్లు తెలిపారు. నిత్యం పర్యవేక్షిస్తాంమునుగోడు: రైస్ మిల్లుల యజమానులు కోనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం తీసుకొని తిరిగి సీఎంఆర్కు అప్పగించేంత వరకు నిత్యం పరివేక్షిస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు. శనివారం ఆయన మునుగోడులోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టడిచేసేందుకు తనఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. -
కాలం చెల్లిన మందులిచ్చారని పీహెచ్సీ ఎదుట నిరసన
తుర్కపల్లి: కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ ఓ రోగి శనివారం సాయంత్రం తుర్కపల్లి పీహెచ్సీ ఎదుట నిరసనకు దిగాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన తొలిచుక్క అంజయ్య కాలుకు మూడు రోజుల క్రితం ఇనుప చువ్వ గుచ్చుకోగా.. చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకి వచ్చాడు. పీహెచ్సీ డాక్టర్ రుచిరారెడ్డి సూచన మేరకు స్టాఫ్ నర్సు రజిత అంజయ్యకు ఇంజెక్షన్తో పాటు మందులు ఇచ్చింది. ఇంటికి వెళ్లిన అనంతరం అంజయ్య కాలుకు ఇన్ఫెక్షన్ కావడం, తీవ్ర నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మందులను చూడగా కాలం చెల్లినట్లు గుర్తించారు. దీంతో అంజయ్య శనివారం సాయంత్రం పీహెచ్సీ ఎదుట ఆందోళన చేపట్టాడు. ఈ ఘటనపై డాక్టర్ రుచిరారెడ్డి స్పందిస్తూ.. స్టాఫ్ నర్సు రజిత, ఫార్మసిస్ట్ మహేశ్వరిపై విచారణ జరిగి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓకు నివేదిక అందజేస్తామని ఆమె తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య
చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చౌటుప్పల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణంలోని రత్నానగర్కాలనీలో నివాసముంటున్న పల్లె స్వామిగౌడ్(49)కు భార్య సుశీల, కుమార్తె అఖిల ఉన్నారు. అతడు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య లక్కారం శివారులోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తోంది. ఇటీవల వారి కుమార్తె వివాహం జరిగింది. స్వామిగౌడ్ పెట్రోల్ బంక్లో పనిచేయడంతో పాటు ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తుంటాడు. ప్రతి రోజు సాయంత్రం 6గంటల సమయంలో తన భార్య డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో బస్టాండ్ వద్దకు వెళ్లి ఆమెను బైక్పై ఇంటికి తీసుకొస్తుంటాడు. శనివారం సాయంత్రం కూడా స్వామిగౌడ్కు అతడి భార్య ఫోన్ చేయగా.. అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె నడుచుకుంటూనే ఇంటికి చేరుకుంది. తలుపులు దగ్గరకు వేసి ఉండడంతో నెట్టుకొని లోపలికి వెళ్లగా.. స్వామిగౌడ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 18 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం ఇంట్లో స్వామిగౌడ్ రాసిన 18 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన బంధువులకు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి, సొంత అల్లుడికి, స్థానికంగా తనతో అనుబంధం కలిగిన 18మంది రాజకీయ నాయకులకు, క్లాస్మేట్స్కు వేర్వేరుగా స్వామిగౌడ్ సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘నాకు అప్పులు అయ్యాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఈ అప్పులతో ఇబ్బంది పడుతున్న విషయం ఇంట్లో కూడా తెలియదు. తెలిస్తే ముందుగా నా భార్య చనిపోతుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. నా కుటుంబాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆదుకోవాలి. మనం ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం, కావున ఇకపై మీరంతా నా కుటుంబానికి అండగా నిలవాలి’ అని క్లాస్మేట్స్కు విజ్ఞప్తి చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యాదగిరీశుడిని దర్శించుకున్న పీవీ సింధు
యాదగిరిగుట్ట రూరల్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని పీవీ సింధుకు ఆలయ అధికారులు అందజేశారు. సాగర్ను సందర్శించిన ఏపీ గవర్నర్ నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నాగార్జునసాగర్కు వచ్చారు. ఆయనకు విజయవిహార్ అతిథిగృహం వద్ద నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు స్వాగతం పలికారు. మధ్యాహ్నం భోజనం అనంతరం ప్రత్యేక లాంచీలో ఆయన నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ మ్యూజియంలోగల బౌద్ధశిల్పాలు, బోధివృక్షం, అలనాటి నాగరికత విశేషాలను తెలుసుకున్నారు. సాయంత్రం విజయవిహార్ అతిథిగృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం స్థానికంగా మరికొన్ని సందర్శనీయ స్థలాలకు చూస్తారు. సాయంత్ర తిరిగి అమరావతికి వెళ్లనున్నారు. ట్రాక్టర్ ఢీకొని ఏఎన్ఎం దుర్మరణం వలిగొండ: స్కూటీపై వెళ్తున్న ఏఎన్ ఎంను ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన వలిగొండ మండలం వర్కట్పల్లిలో శని వారం జరిగింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి చెందిన పోలేపాక(దేవరాయ) సుజాత (43) వర్కట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఏంగా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం సాయంత్రం పీహెచ్సీలో విధులు ముగించుకొని తన కుమారుడిని తీసుకొని స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా.. పీహెచ్సీ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుజాత తలపై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడికి కాలు విరిగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
నందీశ్వరుడికి పంచామృతాభిషేకం
మేళ్లచెరువు : మండల కేంద్రంలో శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో శనివారం బహుళ త్రయోదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి పూజ, పూణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన, మహానివేదన, మంగళనిరాజనం అనంతరం తీర్థప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం ప్రదోష సమయంలో నందీశ్వరుడికి పంచామృతాభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ ఎన్.శంభిరెడ్డి, ఆలయ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయశర్మ, సిబ్బంది కొండారెడ్డి, నర్సింహరెడ్డి భక్తులు పాల్గొన్నారు. -
విధేయత, కష్టపడే వారికే ప్రాధాన్యం
యాదగిరిగుట్ట రూరల్: పార్టీ కోసం కష్టపడి, సమన్వయంతో ముందుకు వెళ్లే వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కుతుందని ఏఐసీసీ పరీశీలకుడు శరత్రౌత్ పేర్కొన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అన్ని డివిజన్లలోని కాంగ్రెస్ నాయకుల సలహాలు, సూచనల మేరకు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఎవరైతే బాధ్యతగా పనులు చేస్తూ, విధేయుడిగా పార్టీని నడిపిస్తున్నారో వారిని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని తెలి పారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఆరుగురి పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపిస్తామని చెప్పారు. ఇందులో ఒకరిని హైకమాండ్ ఎంపిక చేస్తుందని తెలిపారు. అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ, పేర్ల పరిశీలన ఈ నెల 21 వరకు జరుగుతుందని, తదనంతరం ఫైనల్ రిపోర్టును అధిష్టానానికి పంపిస్తామన్నారు. పార్టీలో ఐదేళ్ల కన్నా ఎక్కువ పనిచేసి ఉండాలని, పార్టీ కోసం శ్రమించే వారికి డీసీసీ పదవి దక్కుతుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము సపోర్ట్ చేస్తామన్నారు. అందరి అభిప్రాయం మేరకే ఎన్నిక : ఐలయ్యపార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే జిల్లా అధ్యక్షుని ఎంపిక ఉంటుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గతంలో మాదిరిగా సిఫారసు లేఖలతో కాకుండా, పార్టీ నాయకుల అభిప్రాయాలను హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఎవరైనా పోటీలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరిగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకుడు శరత్రౌత్ -
ఆబ్కారీ అంచనాలు తలకిందులు
భువనగిరి: నూతన మద్యం దుకాణాల టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంటుందని, దరఖాస్తు ఫీజు రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందని ఆశించిన ఎకై ్సజ్ శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. గత ఏడాది 3,900 దరఖాస్తులు రాగా ఈసారి కేవలం 2,541 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత సంవత్సరంతో పోలిస్తే 1,253 దరఖాస్తులు తగ్గాయి. కాగా 2025–27 సంవత్సరానికి గాను నూతన మద్యం దుకాణాల నిర్వహణకు ఎకై ్సజ్శాఖ సెప్టెంబర్ 26న ప్రకటన జారీ చేసింది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. శనివారం సాయంత్రం గడువు ముగిసింది. గతసారి రూ.78.50 కోట్ల ఆదాయంజిల్లాలోని నాలుగు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2023–24 సంవత్సరంలో 3,900 దరఖాస్తులు రాగా.. వీటి ద్వారా రూ.78.50 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి 2,541 దరఖాస్తులు దాఖలు కాగా రూ.79.41 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎల్లంబావి వైన్స్కు 88 దరఖాస్తులుఅత్యధికంగా చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి గ్రామ వైన్స్కు 88 దరఖాస్తులు వచ్చాయి. ఆ తరువాత మోత్కూరు సర్కిల్ పరిధిలోని అరూర్ వైన్స్కు 80, అత్యల్పంగా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ షాప్కు 14 దరఖాస్తులు వచ్చాయి. 23న డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు రాయగిరి పరిధిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఈనెల 23న కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి దుకాణాలు కేటాయించనున్నారు. దరఖాస్తులు తగ్గడానికి కారణం ఇదేనా?2023–24లో ఫీజు రూ.2లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు పెంచారు.ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని అధికారులు భావిస్తున్నారు. మద్యం టెండర్లకు తగ్గిన స్పందన 82 షాప్లకు 2,647 దరఖాస్తులు గత ఏడాదితో పోల్చితే 1,253 తక్కువ -
అత్యవసర సమయంలో 108కు కాల్ చేయాలి
భువనగిరి: దీపావళి పండుగ సందర్భంగా ఏవైనా ప్రమాదాలు సంభవించి అత్యవసర పరిస్థితి ఏర్పడితే 108 నంబర్కు కాల్ చేయాలని 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ రాష్ట్ర కార్య నిర్వహణ అధికారి సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టపాసులు కాల్చే క్రమంలో ప్రమాదాలు జరగడం, పొగకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు, అస్తమా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. 108 అంబులెన్స్లను 24 గంటలు సిద్ధంగా ఉంటాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరఆలేరురూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఆలేరులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. మార్క్ట్కు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం విక్రయించిన రైతు కిష్టయ్యతో మాట్లాడి అధికారులు ఏమైనా ఇబ్బందులు పెట్టారా, కేంద్రంలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయని ఆరా తీశారు. రైతులు ఎవ్వరూ ధాన్యాన్ని ప్రైవేట్కు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఆయన వెట తహసీల్దార్ ఆంజనేయులు ఉన్నారు. హైవేపై వాహనాల రద్దీ చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై శనివారం సాయంత్రం వాహనాల రద్దీ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల సాధనకోసం జరిగిన బంద్ కారణంగా ఉదయం నుంచి మధ్యాహం వరకు వాహనాలు పెద్దగా బయటకు రాలేదు. మధ్యాహ్నం తరువాత రాకపోకలు మొదలయ్యాయి. దీపావళి పండుగతో పాటు వరుస సెలవులు ఉండడంతో ప్రజానీకం సొంతూళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో సాయంత్రం సమయంలో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణంలో ఇరుమార్గాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో బారులుదీరాయి. కోతుల బెడద నివారణకు చర్యలు ఆత్మకూరు(ఎం): మండలంలోని కూరెల్ల గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కోతులను.. పట్టి తరలించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కరీంనగర్ నంచి కోతులను పట్టే వాళ్లను పిలిపించారు. కోతికి రూ.300 చొప్పున చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఇంటికి రూ.1000 చొప్పున ఇవ్వాలని గ్రామస్తులు శనివారం సమావేశమై తీర్మానించారు. గ్రామంలో సుమారు 500 ఇళ్ల వరకు ఉంటాయి. డబ్బులు వసూలు చేసే బాధ్యతలను కులసంఘాలకు అప్పగించారు. -
జువైనల్ జస్టిస్ బోర్డుతో సత్వర న్యాయం
భువనగిరిటౌన్ : జువైనల్ జస్టిస్ బోర్డు వల్ల బాల నేరస్తులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు అన్నారు. భువనగిరి కోర్టులో ఏర్పాటు చేసిన జువైనల్ జస్టిస్ బోర్డును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బోర్డు ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుందన్నారు. బాల నేరస్తులకు శిక్ష విధించడం కాకుండా సత్ప్రవర్తనతో సమాజంలోకి వెళ్లేలా చూస్తామని తెలిపారు. పునరావాసం, ఉపాధి శిక్షణ లభిస్తుందన్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఇంచార్జ్ న్యాయమూర్తిగా భువనగిరి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి స్వాతి బాధ్యతలు స్వీకరించారు. కాగా మొదటి రోజు 10 కేసులను విచారించినట్లు ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో న్యాయమూర్తులు, ముక్తిద, మాధవిలత, ఉషశ్రీ, శ్యాంసుందర్, సీడబ్ల్యూసీ చైర్మన్ బండారు జయశ్రీ, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా ప్రధాన జడ్జి జయరాజు -
నృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు ప్రధానాలయంలోని స్వయంభూలను సుప్రభాత సేవతో మేల్కొలిపారు. ఆ తర్వాత గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు అభిషేకం, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు తులసీదళాలతో అర్చించారు. ఇక ముఖమండపంలోని అలంకారమూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహా హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. సాయంత్రం వెండి జోడు సేవను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. -
50 శాతం దాటొద్దని ఎక్కడుంది?
సాక్షి, యాదాద్రి : బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడుందని, ఇది నిజం కాదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. అన్ని పార్టీలను ఒక్కటి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెడితే కొందరు కుట్రపూరితంగా నోటికాడి బుక్కను గుంజుకుంటున్నారని విమర్శించారు. బంద్లో భాగంగా భువనగిరిలోని జగ్జీవన్రాం చౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసి పంపిన బిల్లును గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్లో పెట్టి నానుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు, నాయకులు కేంద్రంపై ఎందుకు వత్తిడి తేవడం లేదని ప్రఽశ్నించారు. రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే భిక్ష కాదని, బీసీల హక్కు అన్నారు. వెయ్యి మంది బీసీలను ఢిల్లీకి తరలించి అక్కడ ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ శాఖ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్, వివిధ పార్టీల నాయకులు తంగెళ్లపల్లి రవికుమార్, పోత్నక్ప్రమోద్కుమార్, అవైస్ చీస్తీ, సుర్వి శ్రీనివాస్గౌడ్, ఎండీ ఇమ్రాన్, కొత్త నర్సింహస్వామి, భట్టు రామచంద్రయ్య, ఎండీ అతహార్, ఎండీ రఫీ, కస్తూరిపాండు, సాబన్కార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించాలని బాలికపై యువకుడి దాడి
కేతేపల్లి: తనను ప్రేమించాలని ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేతేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలానికి చెందిన కొరివి మధు అనే యువకుడు గ్రామంలోని బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు లోపలికి ప్రవేశించాడు. తనను ప్రేమించాలని బాలికను బెదిరించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించి, కత్తితో బాలికపై దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో రిమాండ్ చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ సతీష్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిభువనగిరిటౌన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. భువనగిరికి చెందిన యాకుబ్(38) భువనగిరి పట్టణంలో చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. మూడు రోజుల క్రితం యాకుబ్ తన దుకాణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో కారు ఢీ కొట్టడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. అతడికి భార్య, సంవత్సరంన్నర కుమార్తె ఉంది. -
ఆశలు నింపిన డిండి
డిండి: ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దుందుబి వాగు దిగువకు పరవళ్లు తొక్కుతుండడంతో మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తోంది. వానాకాలం సీజన్కుగాను ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 12,500 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 250 ఎకరాల సాగుకు నీటిని విడుదల చేశారు. గత రెండు నెలలుగా డిండి ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగు పోస్తుండడంతో వానాకాలంతోపాటు యాసంగి సీజన్లో కూడా పంటలకు నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చేపల వేటనే నమ్ముకున్న 600 మత్స్యకార కుటుంబాలకు డిండి ప్రాజెక్టు జీవనాధారంగా మారింది. రెండు సంవత్సరాల వరకు చేతినిండా పని దొరకుతుందని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిందని వారు పేర్కొంటున్నారు. రెండు నెలలుగా అలుగు పోస్తున్న డిండి ప్రాజెక్టు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, మత్స్యకారులు -
రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్రమంతా ఒకేలా నిర్మించాలి
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డును రాష్ట్రమంతటా ఒకేలా నిర్మించాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఆర్ఆర్ భూనిర్వాసితులు శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయంలో వారిని కలిసి న్యాయం చేయాలని కోరుతూ వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రైతుల న్యాయమైన పోరాటానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. కొన్ని పరిశ్రమలకు ప్రయోజనం కల్పించడం, కొంత మంది బడా వ్యక్తులకు మేలు చేకూరేలా అలైన్మెంట్ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా కాకుండా ఆర్ఆర్ఆర్ను శాసీ్త్రయంగా నిర్మించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తక్కువ ధరకు లాక్కోవాలని చూడడం భావ్యం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, నిర్వాసితులు నడికుడి అంజయ్య, గుజ్జుల సురేందర్రెడ్డి, పల్లె శేఖర్రెడ్డి, జాల వెంకటేశ్, జాల శ్రీశైలం, సందగళ్ల మల్లేష్, నాగవళ్లి దశరథ, నెల్లికంటి నాగార్జున, భరత్, శ్రీనివాస్, బద్రుద్దీన్, నవీన్ తదితరులున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి -
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్టు
బీబీనగర్ : మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. బొడుప్పల్కు చెందిన భూక్యా ఆజాద్నాయక్, హయత్నగర్ కుంట్లూరు పరిధిలోని రావినారాయణ కాలనీకి చెందిన వల్లెపు వంశీ, మేకల స్టాలిన్, బుడ్డ సునీల్ ఛత్తీస్ఘడ్లో గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. అందులో కొంత తాము సేవించేందుకు ఉంచుకొని మిగతా దానిని విక్రయించేందుకు కొండమడుగు మెట్టు వద్దకు ఆటోలో వచ్చారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వారిని పట్టుకొని విచారించారు. తాము గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు వారు చెప్పడంతో అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. వారి నుంచి 1.394 గ్రాముల గంజాయి, ఆటో, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. యువకులను పట్టుకున్న ఎస్ఐ రమేశ్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
నేడు నాగార్జునసాగర్కు ఏపీ గవర్నర్
నాగార్జునసాగర్ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నాగార్జునసాగర్కు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన కుటుంబసభ్యులతో కలిసి సాగర్లో పర్యటిస్తారు. ఉదయం 11.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఏపీ గవర్నర్ సాగర్కు చేరుకుంటారు. రెండు రోజుల పాటు ఆయన సాగర్లోనే ఉండి వివిధ ప్రదేశాలను సందర్శించనున్నారు. ఏపీ గవర్నర్ పర్యటకు సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అనంతరం విజయవిహార్లో అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం బీసీగురుకుల విద్యాలయంలో ఉన్న హెలీప్యాడ్, లాంచిస్టేషన్ను ఆమె సందర్శించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్కలెక్టర్ అమిత్ నారాయణ్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐ శ్రీనునాయక్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, పెద్దవూర తహసీల్దార్ శాంతిలాల్, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, వైద్యవిధానపరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మాతృనాయక్, డాక్టర్ రవి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మల్లికార్జున్రావు, మున్సిపల్ కమిషనర్ వేణు, అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన నల్లగొండ కలెక్టర్ -
అధిక వడ్డీ కేసులో మరో నలుగురి అరెస్టు
పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి : అధిక వడ్డీ ఆశచూపి అమాయక గిరిజనులను మోసం చేసిన బాలాజీనాయక్ కేసులో మరో నలుగురు ఏజెంట్లను శుక్రవారం గుడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మౌనిక కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్ వినోద్, రమావత్ సురేష్, రమావత్ రమేష్, రమావత్ చిరంజీవి అధిక వడ్డీ వ్యాపారంలో బాలాజీనాయక్కు ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. వీరిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు ఈ నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ6 కోట్ల 77 లక్షల విలువైన ఆస్తి పత్రాలు, నాలుగు కార్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఎస్పీ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నట్లు ఏఎస్పీ మౌనిక తెలిపారు. ఇప్పటికే బాలాజీనాయక్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కేసు విచారణను వేగవంతం చేశామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 310 మంది బాధితులు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారని తెలిపారు. సమావేశంలో సీఐ నవీన్కుమార్, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, పీఏపల్లి ఎస్ఐలు అజ్మీరా రమేష్, మధు, నరసింహులు, నల్లగొండ స్పెషల్ టీం ఎస్ఐ సంపత్ తదితరులు పాల్గొన్నారు. రూ.6.77కోట్ల విలువైన ఆస్తిపత్రాలు, నాలుగు కార్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం కొనసాగుతున్న విచారణ వివరాలు వెల్లడించిన ఏఎస్పీ మౌనిక -
చౌటుప్పల్లో చెడ్డీగ్యాంగ్!
చౌటుప్పల్ : చౌటుప్పల్లో చెడ్డీగ్యాంగ్ హల్చల్ చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో గల అంజనసాయి మెడోస్ వెంచర్లోకి చొరబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. చేతిలో మారణాయుధాలతో ముగ్గురు దొంగలు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. అంజనసాయి మెడోస్ వెంచర్లోని కృష్ణవేణి హైస్కూల్ వెనుక వైపున ఉన్న చీకూరి శ్రీనివాస్ ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని బంధువుల నివాసంలో జరిగిన ఫంక్షన్ కోసం ఈనెల 16న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించాడు. ఆందోళనకు గురై వెంటనే బీరువా తెరిచి చూడగా.. 8గ్రాముల బంగారం, 8.5తులాల వెండితోపాటుగా నగదు కన్పించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. చెడ్డీగ్యాంగ్ పనేనని అనుమానం ముగ్గురు సభ్యులు గల బృందం ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ముగ్గురు దొంగలు ముసుగులు ధరించారు. అందులో ఒక వ్యక్తి డ్రాయర్ మాత్రమే ధరించి, ఒంటికి నూనె రాసుకుని ఉన్నాడు. మరో ఇద్దరు వ్యక్తులు చేతుల్లో మారణాయుధాలు పట్టుకున్నారు. అయితే దొంగతనానికి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనా లేక స్థానికంగా ఉండే దొంగలే ముసుగులు ధరించి హల్చల్ చేశారా అని తెలియాల్సి ఉంది. బాధితుడు డొప్ప నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చౌటుప్పల్లోని అంజనసాయి మెడోస్ వెంచర్లో ఘటన -
నృసింహుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గులాబీ, చామంతి, బంతి, తులసీ దళంతో స్వామి, అమ్మవారికి పుష్పార్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. అంతకుముందు తెల్లవారుజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామర్చన జరిపించారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
అడవిదేవులపల్లి : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అడవిదేవులపల్లి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బాపన్బాయి తండాకు చెందిన సపావత్ రజిత (32)కు నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన రమావత్ ఆంజనేయులుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ఆంజనేయులు మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలను నడిపించేవాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా తరుచూ గొడవపడుతున్నారు. గురువారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో రాత్రి 10గంటల తరువాత రజిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రమత్తులో నుంచి లేచిన ఆంజనేయులు భార్య ఉరివేసుకున్న విషయాన్ని గమనించి హుటాహుటిన మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి పరశురాములు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అంబులెన్స్ సేవలు ఉపయోగించుకోవాలి
మిర్యాలగూడ అర్బన్: అత్యవసర సమయంలో 108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీవీకే ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ అన్నారు. గురువారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో 108 వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్లో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రకాల పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టెక్నీషియన్లకు సూచించారు. అంబులెన్స్లోని అత్యవసర సేవలకు ఉపయోగించే పల్స్ ఆక్సిమీటర్, మానీటర్, ఏఈడీ, ఆక్సిజన్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట 108 జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, ఈఎంఈ యల్లావుల మధు, ఈఎంటీ వెలిజాల సైదులు, పైలెట్ పగిళ్ల జానకిరాములు తదితరులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ తనిఖీ వేములపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల 108 అంబులెన్స్ వాహనాన్ని జీవీకే ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, ఈఎంఈ ఎల్లావుల మధు, సిబ్బంది విమల, అజ్రకుమార్ తదితరులున్నారు. ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ -
ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ అధికారి
నల్లగొండ: టపాకాయల దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం అధికారి సత్యనారాయణరెడ్డి గురువారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి సందర్భంగా టపాకాయల దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు గాను అనుమతి కోసం నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి సత్యనారాయణరెడ్డిని ఓ వ్యాపారి సంప్రదించాడు. ఎన్ఓసీ మొత్తం తానే చేసి ఇస్తానని ఇవ్వాలని సదరు వ్యాపారిని సత్యనారాయణరెడ్డి రూ.10వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.8వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో సదరు వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో వ్యాపారి నుంచి సత్యనారాయణరెడ్డి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా నల్ల గొండ రేంజ్ యూనిట్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సత్యనారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారించి నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1084 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. టపాకాయల దుకాణం ఏర్పాటుకు ఎన్ఓసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ -
ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని పులిపలపులు, కల్వలపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, ఎంపీడీఓ యుగేందర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు సింగం వెంకన్న, ఎన్.శేఖర్రెడ్డి, సీఈఓ సుఖేందర్, మాజీ ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, ఏఈఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి -
కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతి
కొండమల్లేపల్లి: పొలం వద్ద నేలపై పడి ఉన్న కరెంట్ తీగలు తగిలి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట్ల గ్రామానికి చెందిన జటమోని శ్రీను, వెంకటమ్మ దంపతుల పెద్ద కుమారుడు జటమోని వెంకటేష్(23) గురువారం ఉదయం తమ పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం గట్ల పైన నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే నేలపై పడి ఉన్న విద్యుత్ తీగలు అతడి కాలుకు చుట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం వద్దకు వెళ్లిన వెంకటేష్ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలం వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యుత్ తీగలు నేలపై పడి ఉన్నాయని నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికి లైన్మన్, విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా.. వెంకటేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ అతడి బంధువులు, గ్రామస్తులు కొండమల్లేపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు. పోలీసులు, విద్యుత్ సబ్ స్టేషన్ అధికారులు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడి మరణంతో తల్లిదండ్రులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువుల ఆరోపణ కొండమల్లేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా -
అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్
శాలిగౌరారం: అప్పులు తీర్చేందుకు గాను మహిళపై దాడి చేసి ఆమె మెడలోని పుస్తెలతాడు అపహరించిన దొంగను పోలీసులు 24 గంటలు గడువక ముందే అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నకిరేకల్లోని శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన నాగుల శ్రీనివాస్ వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని పద్మానగర్లో నివాసముంటున్నాడు. శ్రీనివాస్ గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహాలు చేసేందుకు గాను అప్పులు చేశాడు. దీనికి తోడు కరోనా సమయంలో అతడి భార్య అనారోగ్యానికి గురికావడంతో మరింత అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో పాటు వాటికి వడ్డీలు పెరిగిపోతుండటంతో అర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా అప్పులు తీర్చాలని శ్రీనివాస్ భావించాడు. ప్రస్తుతం బంగారం ధరలు విరీతంగా పెరగడంతో బంగారం దొంగతనం చేసినట్లైతే అప్పులు తొందరగా తీర్చవచ్చని అనుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ శాలిగౌరారం మండలం మాధారంకలాన్ శివారులో ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. శ్రీనివాస్ స్కూటీపై అటుగా వెళ్తూ.. సావిత్రమ్మను చూసి స్కూటీ ఆపాడు. ఎక్కడకు వెళ్తున్నావ్ అని ఆమెను అడగగా.. ఆమె మాధారంకలాన్ వెళ్తున్నానని చెప్పింది. తాను అటువైపే వెళ్తున్నానని చెప్పి ఆమెను శ్రీనివాస్ తన స్కూటీపై ఎక్కించుకున్నాడు. మాధారంకలాన్ గ్రామ పంచాయతీ పరిధిలోని చౌళ్లగూడెం వద్ద గల 365వ నంబర్ జాతీయ రహదారి జంక్షన్ సమీపంలోకి రాగానే టాయిలెట్ వస్తుందని స్కూటీని ఆపాడు. స్కూటీ దిగిన సావిత్రమ్మ రోడ్డు వెంట నడుచుకుంటూ చౌళ్లగూడెం జంక్షన్ వైపు వస్తుండగా.. వెనుక నుంచి స్కూటీపై వచ్చిన శ్రీనివాస్ ఇనుపరాడ్డుతో సావిత్రమ్మ తలపై విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. శ్రీనివాస్ వెంటనే సావిత్రమ్మ మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని స్కూటీపై పారిపోయాడు. దొంగిలించిన బంగారు పుస్తెలతాడును నల్లగొండ పట్టణంలోని మణప్పురం ఫైనాన్స్లో తాకట్టుపెట్టి రూ.3.11 లక్షలు రుణం తీసుకున్నాడు. అందులో నుంచి రూ.61వేలు సొంత అవసరాలకు వాడుకొని.. మిగిలిన రూ.2.50 లక్షలు ఇంట్లో పెట్టుకున్నాడు. బాధితురాలి కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు శాలిగౌరారం, నకిరేకల్ సీఐల నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు శ్రీనివాస్ను గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అతడి నుంచి ద్విచక్ర వాహనం, రూ.2.50 లక్షల నగదు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చిబ జడ్జి ఆదేశానుసారం రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు కొండల్రెడ్డి, వెంకటేశ్వర్లు, శాలిగౌరారం, నకిరేకల్, కేతేపల్లి ఎస్ఐలు సైదులు, లచ్చిరెడ్డి, సతీష్, పోలీస్ సిబ్బంది జానయ్య, లక్ష్మణ్, సతీస్, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సురేశ్, శ్రీకాంత్ను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. మహిళపై దాడిచేసి పుస్తెలతాడు అపహరించిన దొంగ 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు స్కూటీ, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై నుంచి జారిపడి మృతి
భూదాన్పోచంపల్లి: నూతనంగా నిర్మిస్తున్న ఇంటిపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం భూదాన్పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు పారిపల్లి కృష్ణారెడ్డి(55) గ్రామంలో నూతనంగా రెండంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నాడు. గురువారం ఇంటి స్లాబ్కు క్యూరింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు గమనించి చికిత్స నిమిత్తం కారులో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే కృష్ణారెడ్డి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య జయమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితంలేని వ్యక్తి.. తిప్పర్తి: తిప్తర్తి మండలం చిన్నాయిగూడెం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితంలేని వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30ఏళ్ల వయస్సున్న మతిస్థిమితంలేని వ్యక్తి చిన్నాయిగూడెం వద్ద రోడ్డు దాటుతుండగా డీసీఎం వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం తిప్పర్తి పంచాయతీ కార్యదర్శి నర్సింహ స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యంచందంపేట: నేరెడుగొమ్ము మండలం వైజాక్ కాలనీలో కృష్ణా నది వెనుక జలాల్లో గల్లంతైన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్ మృతదేహం గురువారం లభ్యమైంది. పృథ్వీరాజ్ మంగళవారం స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీలో సరదాగా గడిపేందుకు వచ్చాడు. అదే రోజు ఈత కొట్టేందుకు గాను కృష్ణా నది వెనుక జలాల్లోకి దిగి గల్లంతు కాగా.. గాలింపు చర్యలు చేపట్టిన ఎస్ఎడీఆర్ఎఫ్ బృందాలకు రెండు రోజుల తర్వాత గురువారం మృతదేహం లభ్యమైంది. -
యాసంగిలో వేరుశనగ సాగు అనుకూలం
పెద్దవూర: వేరుశనగ సాగుకు యాసంగి అనుకూలమైదని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్కుమార్ పేర్కొన్నారు. నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి ఆహార నూనెల జాతీయ యంత్రాంగం పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు నూరు శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను కొన్ని మండలాల్లో పంపిణీ చేసింది. ఈ పంటను వానాకాలం సీజన్లో ఏ పంట విత్తని పొలాల్లో, స్వల్పకాలిక పంటలను సాగు చేసిన పొలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. ● శనగను ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురై అధిక ఉష్ణోగ్రత వలన గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గుతుంది. ● వేరుశనగ సాగు చేయడానికి ముందు 70 రోజుల కాలపరిమితి ఉన్న తృణధాన్యాలైన స్వల్పకాలిక కొర్ర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ● వేరుశనగను బంక నేలల నుంచి నల్లరేగడి వరకు ఏ భూమిలోనైనా పండించవచ్చు. చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు దీని సాగుకు పనికిరావు. విత్తే విధానంసాధారణంగా వేరుశనగ పంటను వర్షాధార పంటగా సాగు చేస్తుంటారు. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు భూమికి ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల లోతున తడి మట్టి తగిలేలా జాగ్రత్త తీసుకోవాలి. ● ఒక చ.మీ.కు 33 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు లావు గింజలు కాబూలీ రకం ఎంచుకున్నప్పుడు వరుసల మ ధ్య 45 నుంచి 60 సెం.మీ. దూరం పాటించాలి. ● ట్రాక్టర్ ద్వారా వేరుశనగ విత్తు పరికరాన్ని వాడి పొలంలో మొక్కల మధ్య తగినంత సాంద్రత ఉండేలా చూసుకోవాలి. ఈ పరికరం ద్వారా విత్తనాన్ని, ఎరువును ఒకేసారి వేసుకోవచ్చు. విత్తనశుద్ధివిత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని, మూడు గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్తో విత్తనశుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల టెబ్యుకినజోల్ లేదా 1.5 గ్రాముల ఎటావాక్స్ పవర్ను కూడా విత్తనశుద్ధికి వాడవచ్చు. వేరుశనగను మొదటిసారి పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ పొడిని విత్తనానికి పట్టించాలి. ఎరువుల యాజమాన్యంనేల స్వభావం, నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడాలి. హెక్టారు శనగ సాగుకు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం అందించే ఎరువులను వేయాలి. నేలలో భాస్వరం నిల్వలు సరిపడా ఉన్నప్పుడు భాస్వరం ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. అనిన ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా 50 కిలోల డీఏపీని వేస్తే పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపంలో వేస్తే పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది. విత్తనాన్ని విత్తిన 24 గంటల్లోగా ఫ్లూక్లోరాలిన్ ఎకరాకు 1 లీటర్, లేదా పెండిమిథాలిన్ను 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే కలుపును పంట తొలి దశలో సమర్ధవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజల వరకు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కోత సమయంఆకులు పచ్చబారడం, రాలిపోవడం, కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజ గట్టిగా మారినప్పుడు కోత కోయాలి. పంట కోసిన వెంటనే గింజలను ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ, చేతితో గాని నూర్పిడి చేసుకోవచ్చు. రైతులు ఈ విధానాన్ని పాటిస్తే మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పంటను పొందవచ్చు.తెగుళ్లు, సస్యరక్షణ చర్యలువేరుశనగ పంటలో ఎండు తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఎండు తెగులును నివారించేందుకు వేసవిలో లోతుగా దుక్కి దున్నడం వల్ల ముందు పంట అవశేషాలు తీసేయడంతో తెగులు తీవ్రతను తగ్గించవచ్చు. వేరుశనగ పంటలో కుళ్లు తెగులు ద్వారా కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలిదశలో తెల్లని శిలీంధ్రం బీజాలు ఆవ గింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండటం, అంతగా కుళ్లని సేంద్రీయ పదార్థం ఉండటం, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతికి తోడ్పడతాయి. విత్తిన పది నుంచి పదిహేను రోజుల తర్వాత పొలంలో మొదలు కుళ్లు గమనించినప్పుడు ఎకరాకు 200 గ్రాముల కార్భండిజమ్, 600 గ్రాముల మాంకోజెబ్ను వాడి మొక్కల మొదలు బాగం తడిచే విధంగా పిచికారీ చేయాలి. వేరుశనగ పండించే అన్ని ప్రాంతాల్లో శనగపచ్చ పురుగు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. పురుగును తట్టుకునే రకాలు అందుబాటులో లేవు. పురుగు మందుల వాడకంతో వాటిని అరికట్టవచ్చు. పురుగు సంతతిపై నిఘా ఉంచడానికి పొలంలో ఒక మీటరు ఎత్తులో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. వేరుశనగ పంటలో పచ్చ రబ్బరు పురుగు నివారణకు ముందుగానే పంట వేసిన 15 రోజులకు ఒక లీటరు నీటిలో 5 మిల్లీలీటర్లు వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువైతే లీటరు నీటికి 200 మిల్లీలీటర్ల ఇండాక్సాకార్భ్ కలిపి పిచికారీ చేయాలి. -
యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టి, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. విద్యుదాఘాతంతో మహిళ మృతిమిర్యాలగూడ టౌన్: ఇంట్లో దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్లపల్లి గ్రామానికి చెందిన సిరశాల నర్సమ్మ(58) భర్త గతంలోనే మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇంట్లో ఆమె ఒంటరిగానే నివాసముంటోంది. నర్సమ్మ ఇంటికి కొంత దూరంలో ఆమె కుమారుడు లింగయ్యకు నివాసముంటున్నాడు. బుధవారం కూలి పనులను వెళ్లిన నర్సమ్మ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం ఇంటి ఆవరణలో దుస్తులు ఊతికి పక్కనే ఉన్న ఇనుప తీగపై ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. రాత్రివేళ ఎవరూ చూడకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం తోటి కూలీలు నర్సమ్మను కూలి పనులకు పిలిచేందుకు ఇంటికి ఆమె వెళ్లగా విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె కుమారుడికి సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు. వ్యవసాయ బావిలో పడి.. అడ్డగూడూరు: వ్యవసాయ బావిలో పడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామ శివారులో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురం గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య(86) మంగళశారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా లక్ష్మయ్య ఆచూకీ లభించకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో లక్ష్మయ్య మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బాధ విన్నారు.. భరోసా ఇచ్చారు
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని పెద్దకందుకూరులో బుధవారం కలెక్టర్ హనుమంతరావు ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొమ్మగాని రవి తల్లి లక్ష్మి తమ కుటుంబం పేదరికంతో ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. తన కుమారుడు పుట్టుకతో దివ్యాంగుడని, ఇంట్లో ఇద్దరమే ఉంటామని, చిన్న డబ్బాకొట్టు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపింది. పూటగడవడం కష్టంగా ఉందని, ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకుంది. వెంటనే స్పందించిన కలెక్టర్.. బ్యాంకు అధికారికి ఫోన్చేసి రవికి లోన్ ఇవ్వాలని ఆదేశించారు. బ్యాటరీతో నడిచే ట్రై వాహనాన్ని కూడా ఇప్పిస్తానని కలెక్టర్ రవికి హామీ ఇచ్చారు. -
‘ఉపాధి హామీ’లో జలసంరక్షణ
ఆలేరు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులకు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జలసంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు వాటిని సంరక్షించుకుంటే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి నుంచి గట్టెక్కవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఉపాధిహామీలో జలసంరక్షణ పనులు విరివిగా చేపట్టాలని సూచించింది. ఈ మేరకు అధికారులు పనులను గుర్తించారు. నవంబర్ 30 వరకు గ్రామసభలుజిల్లాలో 17 మండలాల పరిధిలో 428 గ్రామ పంచాయతీల్లో సుమారు 2.63 లక్షల ఉపాధి కూలీలు, 1.44 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2026–27 సంవత్సరానికి గాను మొత్తం 58 రకాల పనులను చేపట్టనున్నారు. పనుల గుర్తింపునకు మండలాల వారీగా గ్రామాల్లో సభల నిర్వహణకు డీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క మండలంలో పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా గ్రామ సభలను మూడు నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈనెలలో గ్రామ సభలు మొదలై నవంబర్ 30 తేదీ వరకు కొనసాగనున్నాయి. చేపట్టబోయే పనులను ప్రజల ఆమోదంతో గుర్తిస్తారు. భూగర్భ నీటి మట్టం పెంపు పనులకు ప్రాధాన్యం కార్యాచరణ సిద్ధం చేసిన డీఆర్డీఏ గ్రామసభల నిర్వహణకు సన్నాహాలు ప్రజల ఆమోదంతో పనుల గుర్తింపువీటికి మొదటి ప్రాధాన్యం అన్ని మండలాల్లో రెగ్యులర్ ఉపాధి పనులతోపాటు భూగర్భ జాలాల వృద్ధికి ఫాంపాడ్స్, మ్యాజిక్ సోప్ పిట్స్, కమ్యూనిటీ సోప్పిపట్స్, నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు, చెరువులు, కాల్వల్లో పూడికతీత వివిధ రకాల వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పనులకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది.గ్రామస్థాయిలో గుర్తించిన పనులను మండలానికి, అక్కడి నుంచి జిల్లాకు ప్రతిపాదనలు వచ్చిన తర్వాత ఆన్లైన్లో బడ్జెట్ కేటాయింపు జరుగుతుంది.ఈప్రక్రియ తర్వాత వచ్చే ఏప్రిల్ నుంచి పనులు మొదలవుతాయి. జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాం. త్వరలో గ్రామసభలు ప్రారంభిస్తాం. – నాగిరెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ -
కాంగ్రెస్కు కంచుకోట నల్లగొండ
● బిశ్వరంజన్ మహంతి మునుగోడు: నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుందని ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బిశ్వరంజన్ మహంతి అన్నారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం గురువారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మంచి పేరు ఉన్న నాయకుడని, ఆయనకు మంత్రి పదవి చాలా చిన్నదన్నారు. ఆయనకు తగిన పదవి దక్కుతుందన్నారు. రాజగోపాల్రెడ్డి ఆవేదన, కోరికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా తాము పూర్తి మద్దతు ఇస్తామని రాజగోపాల్రెడ్డితో పాటు నియోజకవర్గ కార్యకర్తలు ఏకగ్రీవంగా అంగీకరించారు. -
ఉద్యోగం వేటలో ఉన్నారా..
డీఈఈటీ యాప్లో వివరాలు నమోదు చేసుకోండిభువనగిరిటౌన్ : ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి బయటకు వస్తున్నారు. చాలామంది ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తెలుసుకోలేక పోతున్నారు. ఇలాంటి వారికోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది. అదే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈ ఈటీ). చదువు పూర్తయిన వారు, వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరంలో ఉన్నవారు డీట్ యాప్ deet. telangana.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకునే విధానం..అభ్యర్థులు తమ పేరు, వ్యక్తిగత వివరాలు, విద్యార్హత, అనుభవం, నైపుణ్యం తదితర వివరాలను యాప్లో నమోదు చేసుకోవాలి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. ఆ తరువాత ప్రైవేట్ రంగంలోని ప్రతి కంపెనీ, సంస్థల్లో ఉన్న ఉద్యోగాల వివరాలు వస్తాయి. ఆ సంస్థకు కావాల్సిన నైపుణ్యాలు, వేతనం, అనుభవం వివరాలు కనిపిస్తాయి. అవి ఓకే అనుకుంటే సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తరువాత సంస్థ ప్రతినిధులు యాప్లోనే మీ వివరాలు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూ ప్రాంతం, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, సమయం వివరాలు తెలియజేస్తారు. వివిధ రంగాల్లో ఉన్న పోస్టులు, కొత్త అప్డేట్ల గురించి ఈ యాప్లో నోటిఫికేషన్లుగా ఇస్తుంటారు. జనరద్దీ ప్రాంతాల్లో యాప్ పోస్టర్లు నిరుద్యోగులు ఎక్కడి నుంచైనా తమ వివరాలను యాప్లో నమోదు చేసుకునేందుకు వీలుగా ఉపాధి కల్పన శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో క్యూఆర్తో కూడిన డీప్ యాప్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్లో వాటిని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువతకు సమాచారం కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన ప్రభుత్వ కార్యాలయాలు, జనరద్దీ ప్రాంతాల్లో యాప్ పోస్టర్లు ఏర్పాటు -
కలెక్టరేట్లో ప్రజావాణి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు వినతులు అందజేశారు. కలెక్టర్ హనుమంతరావు వినతులు స్వీకరించడంతో పాటు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. తపాల శాఖ ద్వారా గుర్తింపు కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యగిరీశుడి హుండీ ఆదాయం రూ.11.93 లక్షలువలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలను గురువారం లెక్కించారు. 114 రోజులకు నగదురూపంలో రూ.11,93,431 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ మో హన్బాబు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్రెడ్డి సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సెల్లార్లను 31లోగా ఖాళీ చేయాలిభువనగిరిటౌన్ : సెల్లార్లలో ఏర్పాటు చేసిన దుకాణాలను ఈనెల 31లోపు ఖాళీ చేయాలని అనదపు కలెక్టర్ భాస్కర్రావు భవన యజ మానులను ఆదేశించారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని భవనాల యజమానులతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు వినియోగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సెల్లార్లలో దుకాణాలు నిర్వహిస్తున్న వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జగదేవ్పూర్ చౌరస్తాలో ఉన్న జన్మభూమి మడిగెల్లో మున్సిపాలిటీ కేటాయించిన వారు మాత్రమే ఉండాలని, సబ్ లీజ్ దారులు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. సోమవారం లోపు మడిగెల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. మడిగెల నుంచి మున్సిపాలిటీకి పూర్తిస్థాయిలో పన్ను రావడం లేదని, 115 షాపులకు గాను రూ.48.40 లక్షలు బకాయి ఉందని, వెంటనే వసూలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, సిబ్బంది పాల్గొన్నారు. 18 నుంచి జువైనల్ కేసుల విచారణ భువనగిరిటౌన్ : జిల్లాలోని జువైనల్ కేసుల విచారణ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జువైనల్ కేసుల విచారణకు వారంలో ఒక రోజు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తిగా భువనగిరి అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ జడ్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. జువైనల్ జస్టిస్ బోర్డును భువనగిరిలోని పాత మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల సందర్శన రామన్నపేట: రామన్నపేట మండలంలోని పల్లివాడ, కక్కిరేణి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ వీరారెడ్డి సందర్శించారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. వరి చేను పక్వానికి వచ్చిన తరువాతే కోత కోయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రైవేట్కు విక్రయించి నష్టపోవద్దని చెప్పారు. కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని కోరారు. రైతులకు అసౌకర్యం కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, పీఏసీఎస్ సీఈఓ జంగారెడ్డి ఉన్నారు. -
నేటి నుంచి అభిప్రాయ సేకరణ
సాక్షి, యాదాద్రి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి(డీసీసీ) ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం అధిష్టానం నియమించిన ఏఐసీసీ పరిశీలకుడు శరత్రావత్ గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన జిల్లాలోనే మకాం వేసి ప్రతి అంశాన్ని జల్లెడ పట్టనున్నారు. ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్లాక్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. సమావేశాలు తేదీల వారీగా..● శుక్రవారం ఉదయం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతారు. అనంతరం జరిగే బ్లాక్స్థాయి సమావేశంలో పాల్గొని పార్టీలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసి, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ● 18వ తేదీన ఆలేరు, యాదగిరిగుట్ట బ్లాక్స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ● 19న ఆదివారం భువనగిరి, భూదాన్పోచంపల్లి బ్లాక్స్థాయి సమావేశాల్లో పాల్గొంటారు. ● 20న భువనగిరిలో మరోసారి పార్టీ క్యాడర్తో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేయడంతో పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న వారు దరఖాస్తులు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఏఐసీసీ పరిశీలకుడితో పాటు పీసీసీ కోఆర్డినేటర్లు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, శాప్ చైర్మన్ శివచరణ్రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి హాజరుకానున్నారు.డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలు జిల్లాకు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకుడు నాలుగు రోజులు ఇక్కడే మకాం బ్లాక్ల వారీగా సమావేశాలు -
రెవెన్యూ ఉద్యోగుల జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కమిటీని గురువారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.కృష్ణ, కార్యదర్శిగా ఆర్. శ్రీకాంత్, కోశాధికారిగా జానయ్య, అసోసియేట్ అధ్యక్షులుగా ఎండీ లాయిఖ్అలీ, సీహెచ్ శోభ, మరో 19 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, టీజీఓ రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు ఐక్యంగా ఉంటూ తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, టీజీఓ జిల్లా అధ్యక్షుడిగా చికూరి జగన్మోహన్ప్రసాద్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా భగత్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా నారాయణరెడ్డి, నిరంజన్ వ్యవహరించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సేవలు
భువనగిరిటౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని, గర్భిణులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. పోషణమాసంలో భాగంగా భువనగిరిలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం జిల్లా సంక్షేమ శాఖ అధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. గర్భిణులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వైద్యసేవలు పొందాలన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పిల్లల నమోదు పెంచాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపర్చడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను త్వరలోనే ప్రాథమిక పాఠశాల్లో కలుపనున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయలో అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మనోహర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
అబ్దుల్ కలాం స్ఫూర్తితో చదవాలి
నకిరేకల్: విద్యార్థులు అబ్దుల్ కలాం స్ఫూర్తితో చదవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు అన్నారు. నకిరేకల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, గోల్డ్మెడల్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉన్నతమైన కళ, జ్ఞాన సముపార్జన, నిరంతరం శ్రమ, పట్టుదల ఈ నాలుగు నియమాలు అనుసరిస్తే ప్రతి విద్యార్థి అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజధానిలోని కళాశాలలతో పోటీ పడుతుండడం అభినందనీయమన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కళాశాలలో దాతల సహకారంతో మూడు గోల్డ్ మోడల్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ ఎన్జీ కళాశాల, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు ఎస్.ఉపేందర్, రహత్ ఖానం, ప్రోగాం కన్వీనర్ శ్రీనివాసాచారి, వైస్ ప్రిన్సిపాల్ నాగు, అధ్యాపకులు ప్రవీణ్రెడ్డి, శ్రీనివాస్, హరిత, మధుసూదన్రెడ్డి, శంకర్, రవీందర్, నర్సింహాచారి, శివశంకర్ పాల్గొన్నారు. ఫ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ రాములు -
బైక్ల చోరీ ముఠా అరెస్ట్
భువనగిరిటౌన్ : బైక్ల చోరీ ముఠాను భువనగిరి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను బుధవారం భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్లో పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ వెల్లడించారు. హైదరాబాద్లోని యాకుత్పుర చెందిన సయ్యద్ తలీబ్ అలియాస్ సమీక్(ఏ1) అలూబా(ఎ2), రేహన్ (ఏ3), ఎండీ సాజిద్(ఏ4)తోపాటు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గోమల్ గ్రామానికి చెందిన మహ్మద్ షోయబ్ అలియాస్ శ్రీనివాస్(ఏ5) ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడు సయ్యద్ తలీబ్ గతంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి ఆగస్టులో బెయిల్పై విడుదలయ్యాడు. అతడికి పరిచయమున్న అలూబా, రేహన్, సాజిద్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నలుగురు కలిసి ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసి ఉన్న బైక్లను చోరీ చేసి వికారాబాద్ జిల్లాకు చెందిన షోయబ్కు ఇచ్చేవారు. అతడు తనకు తెలిసిన వాళ్లకు విక్రయించేవాడు. ఇలా వచ్చిన డబ్బును ఐదుగురు కలిసి సమాన వాటాగా పంచుకునేవారు. ఈనెల 6వ తేదీన భువనగిరిలో జరిగిన ద్విచక్రవాహనం చోరీ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను సీసీ కెమెరాలో గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్లో సయ్యద్ తలీబ్, సాజిద్, మహ్మద్ షోయబ్ను అరెస్ట్ చేసి భువనగిరి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. పట్టుబడ్డ నిందితుల వద్ద రూ.4.80లక్షల విలువైన ఐదు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సైలు రమేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
జల హొయలు
మర్రిగూడ: 2500 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఉన్న కొండలు, వాటి మధ్య పరుచుకున్న పచ్చదనం ప్రకృతి ప్రేమికులను ఎంతో మైమరపింపజేస్తోంది. అక్కడే కొలువుదీరిన బుగ్గ శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తోంది. ఎత్తిపోతల పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. మర్రిగూడ మండల పరిధిలోని అజ్జలాపురం బుగ్గ వద్ద జలపాతం వర్షాకాలం మొదలుకుని ఆరు నెలల పాటు పర్యాటకులను కనువిందు చేస్తుంది. ప్రకృతి అందాలకు దాసోహం మర్రిగూడ మండల కేంద్రం నుంచి 10కిలోమీటర్ల దూరంలో ఈ బుగ్గ ఉంది. ఈ ప్రాంతమంతా కొండలు, లోయలు, పచ్చనిచెట్లతో కూడుకుని ఉంటుంది. వరద నీరంతా ఒకేచోట చేరి కొండపై నుంచి కిందకు దూకుతూ జలపాతాన్ని తలపిస్తుంటుంది. గత ఐదు రోజులుగా నీటి ప్రవాహం వస్తుండడంతో యువకులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడకు చేరుకుని సందడి చేస్తుంటారు. గుహ మధ్యలో వెలసిన శివలింగం మర్రిగూడ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా నిత్యం వందల సంఖ్యలో జలపాతం వస్తున్న సమయంలో వచ్చి వెళ్తుంటారు. యువత ఇక్కడ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ జలపాతం దగ్గరకు వెళ్లాలంటే అజ్జలాపురం గ్రామం నుంచి సుమారు 2కి.మీ మేరకు కాలినడక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాలినడకన వెళ్లే మార్గంలో వివిధ పక్షుల రాగాలు కాలినడక అలసటను మైమరపింపజేస్తాయి. ఈ ప్రాంతంలో కొలువైన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ కొండల నడుమ గుహ మధ్యలో శివలింగం కూడా వెలిసింది. ఈ ప్రాంతానికి వచ్చివారు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పెద్దఎత్తున మొగలి చెట్లు ఉండడంతో ఈ ప్రాంతమంతా మొగలి పూల సువాసన వెదజల్లుతుంది. ఫ కనువిందు చేస్తున్న అజ్జలాపురం బుగ్గ జలపాతం ఫ అటవీ ప్రాంతమంతా మొగలి పూల సువాసన -
భూ నిర్వాసితులకు రాచకొండలో భూములివ్వాలి
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు పరిహారంగా రాచకొండలోని భూములు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చౌటుప్పల్లో నిర్మించనున్న ట్రిపుల్ఆర్ జంక్షన్ ప్రాంతాన్ని బుధవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి సందర్శించారు. రీజినల్ రింగ్రోడ్డు కోసం గుర్తించిన పొలాలు, వెంచర్లను పరిశీలించారు. భూనిర్వాసితులను కలిసి వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివీస్, శ్రీని పరిశ్రమలను కాపాడేందుకు అలైన్మెంట్ను చౌటుప్పల్ ప్రాంతంలో 10కిలోమీటర్లు వంకర్లుగా మార్చారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తక్షణమే చౌటుప్పల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, సహాయకార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పల్లె శేఖర్రెడ్డి, బచ్చనగోని గాలయ్య, నిర్వాసితులు బోరెం ప్రకాష్రెడ్డి, వల్లూరి బోవయ్య, సందగళ్ల మల్లేష్, జాల శ్రీశైలం పాల్గొన్నారు. భూనిర్వాసితుల మద్దతుకు సీపీఐ ఉద్యమిస్తుంది సంస్థాన్ నారాయణపురం: రీజినల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ వారికి మద్దతుగా సీపీఐ ఉద్యమిస్తుందని ఆపార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తున్న దేవిరెడ్డిబంగ్లా, పుట్టపాక గ్రామాల్లో పర్యటించి పొలాలు పరిశీలించారు. ఉత్తర భాగం విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలుస్తామన్నారు. దక్షిణ భాగం భూనిర్వాసితులతో ప్రభుత్వ పెద్దలను కలుస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామెదర్రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు, నాయకులు తదితరులున్నారు. ఫ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి -
రాష్ట్ర హక్కులను కాపాడుతాం
కోదాడ: కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ఎంత వరకై నా వెళ్తామని ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కోదాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ను ప్రతిపాదిస్తున్నదని తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర జలవనరులశాఖకు, కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేశామని అన్నారు. రాష్ట్ర నీటిపారుదశాఖ మంత్రి హోదాలో తాను న్యాయస్థానంలో హాజరయ్యానని తెలిపారు. ప్రజల్లో అపోహలు కలిగించడానికి ప్రతిపక్షనేతలు అసత్య ప్రచారాలను చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం 811 టీఎంసీలలో 299 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని ఒప్పుకుందన్నారు. తమ ప్రభుత్వం 811 టీఎంసీలలో తెలంగాణకు 70శాతం నీటివాటా కావాలని పోరాడుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందిస్తామని దీనికి ఇప్పటికే రూ.4300 కోట్లు కేటాయించామని తెలిపారు. సొరంగం తవ్వకంలో ప్రమాదం జరిగి పనులు ఆగిపోయాయని, దేశంలోనే ఉత్తమ సొరంగ నిపుణులను తీసుకొచ్చి పనులను ప్రారంభించడానికి కృషి చేస్తున్నామన్నారు. డిండి ప్రాజెక్ట్కు రూ.1800 కోట్లను కేటాయించి పనులు చేయబోతున్నామని తెలిపారు. గోదావరి జలాలను శ్రీరాంసాగర్ పేజ్–2 ద్వారా సూర్యాపేట జిల్లాకు తీసుకొస్తామని తెలిపారు. ఈ సంవత్సరం వానాకాలంలో రాష్ట్రంలో 67 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారని, 148. 8 లక్షల టన్నుల ధ్యానం పండబోతున్నదని, దీనిలో 87 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు. దీని కోసం 8432 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో అన్ని సౌకర్యాలను కల్పించామని తెలిపారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
25లోగా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ అభ్యసిస్తున్న 1, 3, 5 సెమిస్టర్లకు చెందిన విద్యార్థులు ఈ నెల 25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఎంజీ యూనివర్సిటీ సీఓఈ ఉపేందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరిశోధనలే సమాజానికి దిక్సూచిఫ ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్: పరిశోధనలే సమాజానికి దిక్సూచి అని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఐక్యూ ఏసీ ఆధ్వర్యంలో 2028లో జరగనున్న మూడవ విడత నాక్ మూల్యాంకనంపై బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అధ్యాపకులు పరిశోధనలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి అధ్యాపకుడు విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించాలన్నారు. నాక్ ఏ గ్రేడ్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో గోపికృష్ణ, గోనారెడ్డి, అల్వాల రవి, మిరియాల రమేష్, కొప్పుల అంజిరెడ్డి, రేఖ, అన్నపూర్ణ, ఆకుల రవి, సుధారాణి, శ్రీదేవి, అరుణప్రియ పాల్గొన్నారు. -
రైలు నుంచి పడి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మృతి
గరిడేపల్లి: మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కీత వెంకటేశ్వర్లు బుధవారం వ్యక్తిగత పనులపై ఢిల్లీ వెళ్తుండగా మార్గమధ్యలో జార్ఖండ్ రాష్ట్రంలోని కడారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతం నుంచి చురుకై న పాత్ర పోషించారు. వెంకటేశ్వర్లు మృతి పట్ల మండల బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలుమునగాల: మండలంలోని ఆకుపాముల శివారులో జాతీయ రహదారిపై బుధవారం గుర్తు తెలియని కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కోదండరామాపురం గ్రామానికి చెందిన రెణబోతు అప్పిరెడ్డి, రెణబోతు లక్ష్మీనరసింహారెడ్డి ఇద్దరు సోదరులు. లక్ష్మీనరసింహారెడ్డికి చెందిన ద్విచక్రవాహనంపై అప్పిరెడ్డితో కలిసి కోదాడ మండలం కందిబండ గణపవరం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో ఆకుపాముల వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారు అతివేగంగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. గాయపడిన వీరిద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వారి కుటుంబసభ్యులు కోదాడకు చేరుకొని మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్ను సంప్రదించగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
రాజ్యాంగ హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
శాలిగౌరారం: దొంగ ఓట్లను సృష్టించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ దోపిడీకి పాల్పడుతుందని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రైజ్ యువర్ వాయిస్’ అనే నినాదంతో ‘ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్గాంధీకి మద్దతుగా దేశం బాగు కోసం మా సంతకం’ అనే కార్యక్రమాన్ని బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం కోసం ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తూ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో ఓట్లచోరీతో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు బిహార్లోనూ అదేవిధంగా కార్యాచరణ చేపట్టిందన్నారు. ఓట్లచోరీకి వ్యతిరేకంగా జరిగే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తనకు ఓటుహక్కు కలిగి ఉన్న సొంత గ్రామంలోని అదే బూత్ పరిధిలో సంతకాల సేకరణ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ తాళ్లూరి మురళి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగె నర్సింహ, సింగిల్విండో వైస్చైర్మన్ చామల మహేందర్రెడ్డి, పీసీసీ మాజీ అధికార ప్రతినిధి నూక కిరణ్యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, గంట్ల వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఎర్ర చైతన్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేశ్ పాల్గొన్నారు.ఫఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
సీఎం, మంత్రులకు రైతుల బాధలు పట్టడం లేదు
రామన్నపేట: సీఎం, మంత్రులకు రాజకీయాలు తప్ప.. రైతుల బాధలు పట్టడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు దళారులకు అమ్మి నష్టపోతున్నారన్నారు. మంత్రుల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారిందన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్ నాయకులు బందెల రాములు, వేమవరపు సుధీర్బాబు, గొరిగె నర్సింహ, బద్దుల ఉమారమేష్, సాల్వేరు అశోక్, ఎస్కే చాంద్, మిర్యాల మల్లేశం, జాడ సంతోష్, బొడ్డు అల్లయ్య, లవనం రాము, దండుగుల సమ్మయ్య, ఎండీ ఎజాజ్, ఆవుల శ్రీధర్, గర్దాసు విక్రం, రాస వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీశైలం, ఎండీ మోసబ్, సైదులు, ఎండీ అంజద్, బాబు, నరేష్, గణేష్, ఖలీం, యాదయ్య, లింగయ్య ఉన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్కార్డు
రామగిరి(నల్లగొండ): దీపావళి పండుగకు రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్కార్డు ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి, పోర్టబులిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్లోకి మారే వారికి వర్తిస్తుందని తెలిపారు. మహిళ అదృశ్యంభువనగిరి: మండలంలోని వడాయిగూడెం గ్రామంలో మహిళ అదృశ్యమైంది. గ్రామానికి చెందిన బబ్బూరి శంకరయ్య బుధవారం ఉదయం 10.30 గంటలకు పని నిమిత్తం యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంట్లో భార్య ఉమారాణి కనిపించకపోవడంతో చుట్టపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య మానసికస్థితి సరిగా లేక కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. జానకిపురంలో వ్యక్తి.. అడ్డగూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మయ్య (86) ఈనెల 13న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈమేరకు ఆయన కుమారుడు సోమయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రికి మతిస్థిమితం సరిగా లేదని తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. కొనసాగుతున్న గాలింపు చందంపేట : నేరెడుగొమ్ము మండలం వైజాక్ కాలనీలోని కృష్ణా వెనుక జలాల్లో మంగళవారం యువకుడు గల్లంతు కాగా.. అతడి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తిన్నారపు పృథ్వీరాజ్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తన స్నేహితులతో కలిసి వైజాక్ కాలనీకి రాగా ఈత కోసం కృష్ణా వెనుక జలాల్లో దిగి గల్లంతయ్యాడు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పృథ్వీరాజ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు బుధవారం తెలిపారు. -
శ్రీగంధం చెట్లను నరికి చోరీకి పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు
నల్లగొండ: రైతులు తోటల్లో పెంచుతున్న శ్రీగంధం చెట్లను నరికి చోరీకి పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. కేసు వివరాలను బుధవారం నల్లగొండలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన వెల్లడించారు. బుధవారం ఉదయం కనగల్ సమీపంలో రెండు బైక్లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద చెట్లు నరికే పరికాలను గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గందిగామ్ గ్రామానికి చెందిన దివానా, అరుద్వా గ్రామానికి చెందిన దద్దసింగ్, సుగువా గ్రామానికి చెందిన మజాన్లుగా గుర్తించారు. వీరి వద్ద 11 శ్రీగంధం మొద్దులు (దుంగలు), మూడు సెల్ఫోన్లు, రెండు బైక్లు, మూడు రంపాలు, రెండు గొడ్డళ్లు, ఫెన్సింగ్ వైర్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన మరో ముగ్గురు నిందితులు అన్నాబౌ లక్ష్మణ్ గైక్వాడ్, జవాస్, అజుబాలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, వెంకన్న, రంజిత్రెడ్డి పాల్గొన్నారు. ఫ 11 శ్రీగంధం దుంగలు, మూడు సెల్ఫోన్లు, రెండు బైక్లు, ఫెన్సింగ్ వైర్ కట్టర్ స్వాధీనం -
రైతుల కల సాకారం చేసిన దాత
పొలాలకు వెళ్లేందుకు రోడ్డు లేక 45 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. మా గ్రామస్తుడు శేఖర్గౌడ్ రైతుల ఇబ్బందులు చూసి తన సొంత డబ్బులతో 4 కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు వేయించాడు. శేఖర్గౌడ్కు రైతులంతా రుణపడి ఉంటాం. –యాదిరెడ్డి, రైతు, గూడూరు గ్రామంపై ఉన్న మమకారంతో అభివృద్ధికి నావంతు తో డ్పాటునందిస్తున్న. పొలాల కు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రైతులు సమస్యను నా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నా సొంత డబ్బులు రూ.2 కోట్లు వెచ్చించి నాలుగు కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు వేయించా. –తొర్పునూరి రాజశేఖర్గౌడ్, రోడ్డు నిర్మాణ దాత, గూడూరు బీబీనగర్: ఉన్నత హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోని ఈ రోజుల్లో రైతుల పడుతున్న ఇబ్బందులను చూసి వారి సమస్యను తీర్చేందుకు ముందుకువచ్చాడు ఓదాత. తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చు చేసి పంట పొలాలకు చక్కటి రోడ్డు నిర్మింపజేయించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. గూడూరుకు చెందిన తొర్పునూరి రాజశేఖర్గౌడ్. 4 కి.మీ మేర రోడ్డు నిర్మాణం బీబీనగర్ మండలం గూడూరు శివారు నుంచి భువనగిరి మండలం తాజ్పూర్కు వెళ్లే పానాదిబాట గుండా 4 కి.మీ మేర గూడూరుకు చెందిన 25 మందికి పైగా రైతుల భూములు ఉన్నాయి. రెవెన్యూ రికార్డు ప్రకారం నక్షలో 33 ఫీట్ల విస్తీర్ణం రోడ్డు ఉన్నప్పటికీ ఈబాట కోసం రైతులు 45 ఏళ్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. గ్రామాభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న తొర్పూనూరి రాజశేఖర్గౌడ్ దృష్టికి రైతులు సమస్యను తీసుకెళ్లగా 4 కి.మీ మేర 30 ఫీట్ల విస్తీర్ణంతో సీసీ రోడ్డు నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. పది రోజుల్లోనే పూర్తి రోడ్డు కోసం రాజశేఖర్గౌడ్ రూ.2 కోట్లు ఖర్చు చేశా డు. నాణ్యమైన మెటీరియల్ వినియోగించి కేవలం పది రోజుల్లోనే రోడ్డు వేయించాడు. రోడ్డు కోసం రైతులు తమ భూముల్లో కొంత వదులుకున్నారు. రోడ్డు నిర్మాణంతో తమ సమస్య తీరిందని రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఫ పంట పొలాల వద్దకు రహదారి కోసం సొంత నిధులు ఖర్చు ఫ రూ.2 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం ఫ 45 ఏళ్లకు సమస్య పరిష్కారం ఫ రైతులు, గ్రామస్తుల హర్షం -
డయల్ 112
అత్యవసర సహాయానికి ఒక్కటే నంబర్ ఆలేరు: ఒకే దేశం, ఒకే అత్యవసర నంబర్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన డయల్ 112పై హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ), పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్బాబు ఆదేశాల మేరకు ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట్ట, రాజాపేట, గుండాల, బీబీనగర్ మండలాల పరిధిలోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు 112 నంబర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నంబర్తోపాటు సైబర్నేరాలు, బాల్యవివాహాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాలు, మహిళలు, పిల్లల భద్రత, హ్యుమన్ ట్రాఫికింగ్, మత్తుపదార్థాల రవాణా నిరోధం, కొత్త చట్టాలపైనా ప్రచారం చేస్తున్నారు. అత్యవసర సహాయ సేవల పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. గతంలో వేర్వేరు సేవలకు విభిన్న నంబర్లు పోలీసుల సహాయ కోసం 100, బాలల రక్షణకు 1098, వైద్య సహాయానికి అంబులెన్స్ కావాలంటే 108, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు 101.. ఇలా వేర్వేరు అత్యవసర సేవలకు విభిన్నమైన నంబర్లు ఉండేవి. ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా కేవలం 112కు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఈ వ్యవస్థ ప్రజలకు సహాయాన్ని చేరువ చేయడమే కాకుండా వేగవంతమైన రెస్పాన్స్ అందిస్తుంది. నూతన వ్యవస్థలో జీపీఎస్ కీలకపాత్ర నూతన వ్యవస్థల్లో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) కీలకపాత్ర పోషిస్తుంది. ఎవరైనా 112కు ఫోన్ చేసిన వెంటనే, వారి కచ్చితమైన స్థానాన్ని గుర్తించి, సమీపంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను వెంటనే సంఘటన స్థలానికి పంపేలా ఈ వ్యవస్థను రూపొందించారు. సహాయం అందే వరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని బాధితులకు అప్డేట్ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులను కమాండ్ కంట్రోల్ రూం మానిటరింగ్ చేస్తుంది. సంఘటనా స్థలానికి వెళ్లిన సిబ్బంది తమ ట్యాబ్ ద్వారా తిరిగి క్లియరెన్స్ సమాచారం ఇచ్చే వరకు కంట్రోల్రూం సిబ్బంది పర్యవేక్షణ చేస్తుంది. ఫ జీపీఎస్ ద్వారా బాధితుల లొకేషన్ గుర్తింపు ఫ ఏహెచ్టీయూ, పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు112 నంబర్ 24గంటలు పని చేస్తోంది. బాధితులకు వివిధ భాషల్లో మద్ధతు లభిస్తుంది. తమ సెల్ఫోన్తోపాటు ల్యాండ్ ఫోన్ నుంచి 112కు డయల్ చేయొచ్చు. ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉంటే తమ సెల్ఫోన్లో పవర్ బటన్ను మూడుసార్లు నొక్కితే ఆటోమేటిక్గా 112కు కాల్ వెళ్లి, కావాల్సిన సహాయం బాధితులకు అందుతుందని ఏహెచ్టీయూ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ‘సాక్షి’తో చెప్పారు. సీపీ సుధీర్బాబు ఆదేశాల మేరకు ఏహెచ్టీయూ సిబ్బంది, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో 112 నంబర్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు, వైద్య, పోలీసు,అగ్నిమాపక తదితర అత్యవసర సహాయం కోసం ప్రజలు ఇకపై కొత్త నంబర్కే ఫోన్ చేయాలి. –యాలాద్రి, ఆలేరు సీఐ -
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
ఆలేరురూరల్ : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలూ తావుండరాదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. కొనుగోలు చేసిన వడ్లకు 12 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని, పాత బకాయిలతో కలిపి త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. గత పాలకుల తప్పిదాల వల్లే మదర్ డెయిరీకి నష్టాలు : బీర్ల ఐలయ్య గత పాలకుల తప్పిదాల వల్ల మదర్ డెయిరీ నష్టాల్లోకి వచ్చిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ వారితో చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. దీపావళి నాటికి రైతులకు పాల బిల్లులు అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం కొల్లూరు, మందనపల్లిలో కొనుగోలు కేంద్రాలను బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్య, పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేషం, వెంకటేశ్వరరాజు, ఆరె ప్రశాంత్, గంధమల్ల అశోక్, నీలం పద్మ, కట్టెగొమ్ముల సాగర్రెడ్డి, తుంగకుమార్, బుగ్గ నవీన్, గాజుల వెంకటేష్, శ్రీకాంత్, కర్రె అజయ్, ఎఫ్పివో నిర్వాహాకులు వస్పరి స్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
రూ.కోట్లు ఖర్చు.. వినియోగిస్తే ఒట్టు
మోటకొండూర్: రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా, దళారీల నుంచి వారిని కాపాడాలన్న ఉద్దేశంతో మోటకొండూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినా ఫలితం లేకుండాపోయింది. ఏడేళ్లయినా అక్కడ క్రయవిక్రయాలు జరగడం లేదు. వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వ్యాపారులు, దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు. ఇదీ పరిస్థితి ● మోటకొండూరు మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు జరగడం లేదు. ఇక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో 2018లో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో సబ్ మార్కెట్ యార్డు నిర్మించారు. యార్డులో 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారులు మార్కెట్లోనే కొనుగోలు చేయాల్సి ఉన్నా నిబంధనలు అమలు కావడం లేదు. ● పాత ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), గుండాల మండలాల పరిధిలోని పలు గ్రామాలను విడదీసి మోటకొండూర్ నూతన మండలం ఏర్పాటు చేశారు. కానీ, సగం గ్రామాలు ఆలేరు, మోత్కూరు మార్కెట్ల పరిధిలో కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు మోటకొండూరుకు కాకుండా పూర్వపు మార్కెట్లకు వెళ్తున్నారు. గ్రామాలన్నింటినీ మోటకొండూరు సబ్ మార్కెట్ పరిధిలోకి తీసుకువచ్చి ఇక్కడే క్రయవిక్రయాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అధికంగా సాగు విస్తీర్ణం ఇక్కడే.. జిల్లాలో అత్యధిక సాగు విస్తీర్ణం మోటకొండూర్ మండంలంలోనే ఉంది. ఇక్కడ 22,670 ఎకరాల సాగు భూమి, 11,617 మంది రైతులు ఉన్నారు. వా నాకాలం సీజన్లో పత్తి 10,800, వరి 10,500, ఇతర పంటలు 1,370 ఎకరాల్లో సాగయ్యాయి. స్థానికంగా మార్కెట్ యార్డు ఉన్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఇతర మండలాల మార్కెట్లకు వెళ్తున్నారు. మరికొందరు ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వృథాగా మోటకొండూరు వ్యవసాయ సబ్ మార్కెట్ ఫ నిర్మించి ఏడేళ్లు గడిచినా మొదలుకాని క్రయవిక్రయాలు ఫ దళారులను ఆశ్రయిస్తున్న రైతులు ఫ కొనుగోళ్లు ఇక్కడే చేయాలని వేడుకోలు మోటకొండూర్, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట మండలాలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి మోటకొండూర్ సబ్ మార్కెట్ యార్డును అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ఎమ్మెల్యే 2022లో సిఫారస్ చేశారు. అనుమతులు ఇచ్చే వేళ మునుగోడు ఉప ఎన్నిక రావడం, అనంతరం జనరల్ ఎలక్షన్లు కారణంగా అప్గ్రెడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదనకు కార్యరూపం తేవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ యార్డ్ను అప్గ్రేడ్ చేయడానికి గత ప్రభుత్వంలో ప్రతిపాదించారు. ప్రస్తుత సర్కార్ పరిశీలించాలి.అప్గేడ్ర్ చేయడం వల్ల మోటకొండూరుతో పాటు ఆలేరు, మోత్కుర్ మండలాల రైతులకు మేలు జరుగుతుంది. కొనుగోళ్లు జరగక పండించిన పంట దళారులకు చెందుతుంది. –ఎగ్గిడి బాలయ్య, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ సబ్మార్కెట్ యార్డులో గిడ్డంగులు నిర్మించినా ప్ర యోజనం లేదు. ధాన్యం, పత్తిని ఇంట్లో నిల్వ చేసుకునే పరిస్థితి లేక దళారులకు అమ్ముకుంటున్నారు. దీని ఆసరాగా తీసుకొని తక్కువ రేటుకు కొనుగోలు చే స్తున్నారు. సబ్మార్కెట్ను మార్కెట్ యార్డ్గా మార్చాలి. –గాదెగాని మాణిక్యం, సీపీఐ మండల కార్యదర్శి


