breaking news
Yadadri District Latest News
-
ఎడమ కాల్వకు నిలిచిపోయిన మరమ్మతులు
నిడమనూరు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మరమ్మతు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గత నెలన్నర పాటు సాగిన పనులు.. ఇటీవల ప్రధాన కాల్వకు నీటిని వదలడంతో కూలీలు, కొన్ని యంత్రాలు వెళ్లిపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ముకుందాపురం వద్ద 37.5 కిలోమీటరు నుంచి సాగర్ కాల్వకు కుడి, ఎడమ వైపున పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు పలు చోట్ల 2 కిలోమీటర్లకు పైగా సీసీ లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే ముప్పారం, వేంపాడు, వెంగన్నగూడెం మేజర్ వద్ద పలుచోట్ల కాల్వ మరమ్మతులు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం పనులు సాగడం లేదు. ఇరువైపులా కిలోమీటరుకు పైగా పాత నాప బండల లైనింగ్ తీసివేసి మట్టి పోసి లైనింగ్కు సిద్ధం చేసి వదిలేశారు. సాగర్ ఎడమకాల్వ సీసీ లైనింగ్ పనుల్లో 6 టీమ్లు పనిచేయగా.. ఒక్కో టీమ్ రోజుకు 40 మీటర్ల సీసీ లైనింగ్ చేసేది. కానీ ఇప్పుడు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు గుర్తించి స్థానిక ఎన్ఎస్పీ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇటీవల కేవలం ఒక్క టీమ్తో నామమాత్రంగా పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..గత నెలలో తాగునీటి అవసరాల కోసం వారం రోజుల పాటు సాగర్ ప్రధాన కాల్వకు నీరు విడుదల చేశారు. నీటి విడుదల సమయంలో పనులు లేక ఖాళీగా ఉన్న కూలీలు.. ఆ వారం రోజులకు కొంతైనా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు కాంట్రాక్టర్ నిరాకరించడంతో కూలీలు, యంత్రాలతో సహా వెళ్లిపోయినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు పనులు చేయాలని ఒత్తిడి చేసినా.. ‘నాకు ఇంకా 16 నెలల గడువు ఉంది’ అని కాంట్రాక్టర్ సమాధానం చెబుతుండటంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వానాకాలం సీజన్కు సాగునీరు ఉండదులే అన్న నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్ పనులను గాలికొదిలేశారని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా నారెళ్లగూడెం, ముదిమాణిక్యం మేజర్ల వద్ద మరమ్మతుల కోసం కాల్వ కూల్చివేతలు చేపట్టి పనులు నిలిపివేయడం గమనార్హం. పనులు పూర్తయ్యేనా..?ఇటీవల శ్రీశైలానికి భారీగా ఇన్ఫ్లో రావడంతో.. కొంత ఆలస్యంగానైనా వానాకాలం సాగు చేసుకోవచ్చని రైతులు అనుకున్నారు. కానీ ఎడమకాల్వ మరమ్మతు పనులు అడ్డంకిగా మారనున్నాయి. మరో నెల రోజులకై నా వానాకాలం సాగుకు సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల చేసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. అంతేగాకుండా ఇప్పటికే ఆయకట్టులో పలుచోట్ల వరినాట్లు వేశారు. దీంతో అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల కాల్వకు నీటిని వదలడంతో నిలిచిన పనులు పనులు లేక వెళ్లిపోయిన కూలీలు -
25 కిలోల సన్న బియ్యం రూ.1900
మిర్యాలగూడ : ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే.. మరోవైపు ప్రతి ఇంట్లో అత్యంత అవసరమైన బియ్యం ధరలు అదుపుతప్పి పరుగులు పెడుతున్నాయి. సన్న బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. గత కొంతకాలంగా మార్కెట్లో నిలకడ లేకుండా పెరుగుతున్న ఈ ధరలు సోమవారం నాటికి మరింత గరిష్ట స్థాయికి చేరుకోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్తా రూ.1,900.. కిలో రూ.85ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యమైన పాత సన్న బియ్యం (బీపీటీ, జేఎస్ఆర్, హెచ్ఎంటీ తదితర రకాలు) 25 కిలోల బస్తా ధర రూ.1,750 నుంచి రూ.1,900 వరకు పలుకుతోంది. కొన్ని బ్రాండెడ్ రకాలు, సూపర్ ఫైన్ క్వాలిటీ సన్న బియ్యాన్ని కిలో రూ.80 నుంచి రూ.85 చొప్పున విక్రయిస్తున్నారు. పాత బియ్యం క్వింటాల్ ధర రూ.7000 నుంచి రూ.7,600 దాటిపోయింది. కొత్త బియ్యం క్వింటాల్ సైతం రూ.6,200కు పైమాటే ఉంది. ప్రతి నెలా క్వింటాల్పై సగటున రూ.200 నుంచి రూ.400 వరకు పెరుగుతుండటంతో.. సామాన్యులు సతమతమవుతున్నారు. దిగుబడి తగ్గడం.. దళారుల దందా..వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా బేసిన్తో పాటు అనేక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు ధాన్యం దిగుబడి తగ్గడంతో మార్కెట్లో సన్న ధాన్యానికి తీవ్ర కొరత ఏర్పడింది. డిమాండ్కు తగినంత సరఫరా లేకపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, ఇదే అదనుగా భావించిన కొందరు రైస్ మిల్లర్లు, దళారులు క్షేత్రస్థాయిలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు చేసిన ధర కంటే కిలోపై అదనంగా రూ.5 నుంచి రూ.10 వరకు పెంచి విక్రయిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున బియ్యాన్ని ఎగుమతి చేయడం కూడా స్థానిక మార్కెట్లో ధరల మంటకు మరో కారణమని తెలుస్తోంది.నియంత్రణ ఏదీ?పెరిగిన ధరల వల్ల కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక పేద, మధ్య తరగతి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి రైస్ మిల్లులు, హోల్సేల్ షాపుల్లో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇష్టారాజ్యంగా జరుగుతున్న అక్రమ నిల్వలను అరికట్టి, బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రికార్డు స్థాయిలో పెరిగిన సన్న బియ్యం రేట్లు సూపర్ ఫైన్ సన్న బియ్యం కిలో రూ.80 పైమాటే సామాన్యులకు తప్పని తిప్పలు -
మహిళా ఉపాధికి ‘సీ్త్రనిధి’
మహిళల ఉన్నతే లక్ష్యంగా పని చేస్తున్నాం. రుణాలు పొందిన సభ్యులు యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలి. సకాలంలో వాయిదాలు చెల్లించాలి. ద్విచక్రవాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీపై రుణాలు పొందవచ్చు. – కట్ట వెంకటేశం, డీపీఓఆలేరురూరల్ : వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు సీ్త్రనిధి ద్వారా ఈ–ఆటో, ద్విచక్రవాహనాల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించింది. ఈ–వాహనాలతో స్వయం ఉపాధి రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందజేస్తోంది. వీటితో మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సులభ వాయిదాల్లో చెల్లింపులు ఈ–ఆటోకు రూ.2.74 లక్షలు, ఈ–ట్రాలీ వాహనాలకు ప్రభుత్వం రూ.3లక్షల వరకు రుణాలు అందించాలని నిర్ణయించింది. 60 నెలల సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 11 శాతం వార్షిక వడ్డీకే రుణాలు అందజేస్తారు. ఎలక్ట్రిక్ ఆటోలో 5 మంది వరకు ప్రయాణించవచ్చు. రోజుకు రెండు గంటలు చార్జింగ్ పెడితే 100 కిలో మీటర్లు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు గరిష్టంగా రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు. 48 వాయిదాలతో వీటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సంఘాల సభ్యులకు గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ప్రజా రవాణాకు అవసరమైన ఈ–ఆటోల ద్వారా మహిళలు ఉపాధి పొందవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ల ద్వారా డెలివరీ సేవలు, ఫీల్డ్ వర్క్ చిన్న వ్యాపారాల వంటివి చేసుకునే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ వ్యయం తగ్గించి తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు అప్పుల బారిన పడకుండా తక్కువ వడ్డీతో సంస్థాగత రుణాలు పొందవచ్చు. ఫ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రుణాలు ఫ ఈ–బైక్, ఆటోలు, ట్రాలీలకు రూ.లక్ష నుంచి రూ.3.13 లక్షల వరకు.. ఫ 11 శాతం వార్షిక వడ్డీతో అందించేలా ప్రణాళిక ఫ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయం మహిళా సంఘాలు వివరాలు మండల సమాఖ్యలు 17గ్రామైక్య సంఘాలు 652ఎస్హెచ్జీలు 15,439సభ్యుల సంఖ్య 1,62,546 -
లాక్రోస్లో సత్తా చాటుతున్న సంగీత
చిట్యాల : చిన్ననాటి నుంచే క్రీడలపై ఉన్న ఆసక్తితో లాక్రోస్ క్రీడలో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎదిగింది చిట్యాల మున్సిపాలిటీకి చెందిన చిర్రబోయిన సంగీత. అంతర్జాతీయ వేదికపై భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరగనున్న శ్రీసౌత్ ఈస్ట్ ఆసియా కప్–2026శ్రీ పోటీల్లో పాల్గొననున్న భారత లాక్రోస్ క్రీడా జట్టుకు ఆమె ఎంపికై ంది. ఈ మేరకు లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గురుకులంలో రాటుదేలి..చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు (వెంకటాపురం)కు చెందిన చిర్రబోయిన నర్సింహ–మహేశ్వరి దంపతుల కుమార్తె సంగీత ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాలలోని లోయోలా స్కూల్లో చదువుకుంది. అనంతరం ఐదో తరగతిలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బీసీ గురుకులంలో చేరింది. ప్రస్తుతం ఆమె అక్కడే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు క్రీడలపై ఉన్న మక్కువతో లాక్రోస్ ఆటపై సంగీత ప్రత్యేక దృష్టి సారించింది. క్రమం తప్పకుండా సాధన చేస్తూ రాష్ట్ర, దక్షిణ భారత స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలను అందించింది. స్వర్ణ పతకాలతో సత్తా..జూలై చివరి వారంలో జరిగిన దక్షిణ భారతదేశ మండల లాక్రోస్ జాతీయ ఛాంపియన్షిప్–2026లో తెలంగాణ స్టేట్ సీనియర్ గరల్స్ జట్టుకు సంగీత ప్రాతినిధ్యం వహించి విశేష ప్రతిభ కనబరిచింది. ఆమె ఆటతీరుతో తెలంగాణ జట్టుకు స్వర్ణ పతకం వరించింది. అలాగే గతంలో ఏపీలోని కర్నూలు, చైన్నెలలో జరిగిన సౌత్ జోన్ ఛాంపియన్షిప్లలో పాల్గొని బంగారు పతకాలను సాధించిన జట్టులోనూ ఆమె కీలక సభ్యురాలిగా ఉంది. వరుస పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే భారత లాక్రోస్ జట్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టులో చోటు సంపాదించిన చిట్యాలకు చెందిన గురుకుల విద్యార్థిని ఈ నెల 28 నుంచి మలేషియాలో జరగనున్న సౌత్ ఈస్ట్ ఆసియా లాక్రోస్ కప్–2026లో దేశం తరఫున బరిలోకి.. ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్న చిట్యాల వాసులుఅభినందనల వెల్లువ..సంగీతను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు, కమిషనర్ బాల మాయదేవి తదితరులు అభినందించారు. కాగా.. సంగీత నిరుపేద కుటుంబానికి చెందినది కావడంతో.. దాతలు, ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తే దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే అవకాశం ఉందని స్థానికులు, క్రీడాభిమానులు కోరుతున్నారు. -
వరుణుడు కరుణించి రైతులు మురవాలని పూజలు
మరింత అభివృద్ధి చేయాలి కాంగ్రెస్ పాలనలో యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026- 8లోనాగార్జునసాగర్ : వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు మురవాలని ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్ కృష్ణాతీరంలో మహావరుణ యాగం చేపట్టింది. కృష్ణమ్మ ఒడ్డున విజయవిహార్ ప్రాంగణం ఉదయం నాలుగు గంటల నుంచే వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన వరుణయాగం తెల్లవారు జామున 4.05 గంటలకు భారీనీటి పారుదల శాఖామంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు గోవుపూజ, యాగశాల ప్రదక్షిణతో మొదలైంది. 108 మంది రుత్విక్కు లు 11 హోమగుండాల్లో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. యాగంలో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునే సంకల్పంతో.. సనాతన హిందూ సంప్రదాయంలో యజ్ఞయాగాలకు విశిష్ట స్థానం ఉంది. వేదకాలం నుంచే వర్షాలకు అధిపతిగా భావించే వరుణ దేవుడిని ఆరాధి స్తూ ప్రత్యేక క్రతువులు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇదే సంప్రదాయంలో భాగంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనకుండా, రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగాలని, యాగం సందర్భంగా సంకల్పించారు. 11 హోమ గుండాల్లో వైదిక క్రతువులు విజయవిహార్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 11 హోమగుండాలు యాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.108 మంది రుత్విక్కులు వైదిక విధానాలను అనుసరిస్తూ మత్రోచ్ఛరణలతో హోమ క్రతువు నిర్వహించారు. హోమగుండాల్లో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ వరుణ దేవుడిని ఆరాధించారు. యాగశాల చుట్టూ దేవతా విగ్రహాలు, కలశాలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయడంతో వాతావరణం మరింత శోభాయమానంగా కనిపించింది. పూర్ణాహుతి ఘట్టం.. యాగంలో చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుత్విక్కులు వేద మంత్రాలను పఠిస్తూ పూర్ణాహుతి ద్రవ్యాలను హోమాగ్నికి సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దంపతులు యాగశాలలో పాల్గొని రుత్విక్కుల సూచనల మేరకు పూర్ణాహుతి నిర్వహించారు. యాగం విజయవంతంగా పూర్తయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని ప్రార్థనలు చేశారు. ప్రజలు వీక్షించేలా ఎల్ఈడీ తెరలు యాగశాలలో జరుగుతున్న వైదిక కార్యక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేలా విజయవిహార్ ప్రాంగణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ప్రవేశించలేని భక్తులు, ప్రజలు కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. ఫ ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి దంపతులు ఫ 108 మంది రుత్విక్కులతో 11 హోమగుండాల్లో వైదిక క్రతువులు ఫ వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగిన ప్రాంగణం వరుణ యాగంలో కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వేద పండితులు తెలిపారు. వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ నిర్ధిష్ట మంత్రోచ్ఛరణలతో ఆహుతులు సమర్పించడం, కలశాలను పవిత్ర జలంతో సిద్ధం చేసి పూజించడం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజాసామగ్రి, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు తదితరాలతో హోమగుండాల చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
పేదల సొంతింటి కల నిజమాయే
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లు ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోకుండా మూలనపడిపోయాయి. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివాస సముదాయాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇళ్లకు మరమ్మతులు చేసి.. సింగన్నగూడెం వద్ద బీఆర్ఎస్ హయాంలో 444 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. అప్పట్లో అర్హులనుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక కూడా చేశారు. కానీ వాటిలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో గృహ ప్రవేశాలు చేయడంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇళ్లన్నీ నిరుపయోగంగా మారాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇళ్ల పంపిణీలోజాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఇళ్లకు మరమ్మతులు పనులు చేపట్టారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లలో అధికారులు అన్ని మౌలిక వసతులను పూర్తి చేశారు. విద్యుత్ సరఫరా, తాగునీటి కోసం సంపుల నిర్మాణం, డెయినేజీలు తదితర పనులు పూర్తయ్యాయి. భవనాలకు రంగులు వేయడంతో పాటు, ప్రతీ ఇంటికి విద్యుత్ మీటర్ సైతం బిగించారు. అయితే, ఇళ్లలో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను మాత్రం లబ్ధిదారులే స్వయంగా చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 444 ఇళ్లు ఉండగా, మొదటి విడతగా 10 బ్లాకులకు చెందిన 162 ఇళ్లను సిద్ధం చేశారు. మిగిలిన 282 ఇళ్లకు మరమ్మతు పనులు చేపట్టి తదుపరి విడతల్లో పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతంలో కేటాయించిన జాబితా నుంచి 360 డిగ్రీల సర్వే ఆధారంగా 59 మంది అనర్హుల పేర్లను తొలగించారు. మిగిలిన దరఖాస్తులు, వస్తున్న ఫిర్యాదులపై విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ప్రారంభోత్సవం చేసి అర్హులకు ఇళ్ల తాళాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఫ సింగన్నగూడెంలో ప్రారంభానికి సిద్ధమైన డబుల్ బెడ్రూం ఇళ్లు ఫ బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరమ్మతులు ఫ తొలి విడతగా 10 బ్లాకుల్లో 162 ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం ఫ 59 మంది అనర్హుల ఏరివేత -
కాంగ్రెస్ పాలనలో గుట్టను మరింత అభివృద్ధి చేయాలి
యాదగిరిగుట్ట రూరల్ : మాజీ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను చాలా బాగా అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ పాలనలో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని స్వయంభూవులను దర్శించుకుని మొక్కులు చెల్లించి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖమండపంలోని ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని లక్ష్మీనరసింహస్వామి వారిని మొక్కుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి -
ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
నాగార్జునసాగర్ : రాష్ట్రంలోని 6,700 మంది ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించి, పేస్కేల్ వర్తింపజేయాలని అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం నాగార్జునసాగర్లో వరుణ యాగానికి హాజరైన సీఎంను తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నావజల ప్రసాద్శర్మ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పైడిమర్రి ప్రసాద్శర్మ తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. ‘స్కీం’ పరిధి నుంచి తొలగించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్న అర్చకులను ‘స్కీమ్’ పరిధి నుంచి తొలగించి దేవాదాయశాఖ చట్టంలోని సెక్షన్ 43 ప్రకారం గుర్తించాలని కోరారు. ప్రతి మండలానికి అర్చకులను గుర్తించి ఎగ్జిక్యూటి వ్ఆఫీసర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. పే స్కేల్ అమలు చేయాలి ప్రస్తుతం దేవాదాయశాఖ వివిధ దేవాలయాల నుంచి 22శాతం కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తోందని, దానిని 25 శాతానికి పెంచి అర్చకులకు 99వ పీఆర్సీ ప్రకారం పే స్కేల్ వర్తింపజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.10వేల గౌరవ వేతనం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను పిలిచి ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి వెంగలం సంతోష్శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సీఎంకి అర్చక ఉద్యోగ జేఏసీ వినతి -
26,163 ఓట్లు గల్లంతే..
సాక్షి, యాదాద్రి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జిల్లాలో 94.3 శాతం పూర్తయ్యింది. ఈప్రక్రియలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. 4,33,745 మంది ఫారాలు డిజిటలైజేషన్ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 4,59,943 ఓటర్లు ఉండగా ఎస్ఐఆర్ ప్రక్రియను 566మంది బీఎల్ఓలు చేపట్టారు. వీరు 4,33,745 మంది ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. అంటే 94.3 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది. 26,197 ఫారాలను సేకరించలేకపోయారు. 84,333 ఫారాలు తప్పుగా నమోదైయ్యాయి. ఈ ప్రక్రియలో జిల్లాలో దాదాపు 26,163 ఓట్లు గల్లంతయ్యే అవకాశం కన్పిస్తోంది. అన్కలెక్టబుల్ ఓట్ల కోసం మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తారు. ముగిసిన పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే మరో పొలింగ్కేంద్రం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇందులో భాగంగా ఆలేరులో 4 , భువనగిరిలో 5 పోలింగ్కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం, లప్పానాయక్ తండా, మాసాయిపేట, ఆలేరులో గుండ్లగూడెం, ఆత్మకూర్ (ఎం) మండలం పల్లెపహాడ్ ఉన్నాయి. భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గంలోని బండసోమారం, బీబీనగర్ మండలంలోని గూడూరు, కొండమడుగు, పడమటి సోమారం, చిన్నరావులపల్లిల్లో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఫ ముగిసిన సర్ ప్రక్రియ ఫ 94.3శాతం డిజిటలైజేషన్ పూర్తి ఫ రాష్ట్రంలోనే జిల్లా టాప్ ఫ 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల ఫ తొమ్మిది కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు -
రూ.140కోట్లు విడుదలకు సీఎం హామీ: ఎమ్మెల్యే
సాక్షి, యాదాద్రి : నృసింహసాగర్(బస్వాపూర్) ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్టపరిహారం రూ.140 కోట్లు విడుదల చేయడానికి సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి వెల్లడించారు. సోమవారం నాగార్జున సాగర్లో నిర్వహించిన వరుణ యాగానికి సీఎంతోపాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రాజెక్టు పూర్తి అయినప్పటికీ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్కు పరిహారం ఇవ్వలేకపోయామని సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన సీఎం ఆర్థిక శాఖముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారన్నారు. వారంలో పరిహారం డబ్బులు రానున్నట్లు తెలిపారు. పరిహారం ఇచ్చి గ్రామాన్ని అక్కడినుంచి తొలగిస్తే రిజర్వాయర్లో 9 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాగా పరిహారం చెల్లిస్తే ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సాగు, తాగు నీటి కష్టాలుతీరుతాయని ఆయన పేర్కొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్య పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సోమవారం స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో శివుడికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో, అభిషేకాలు, బిల్వార్చన పూజలు చేశారు. ముఖ మండపంలోని స్పటిక రామలింగేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజలు జరిపించి, అష్టోత్తర పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో వేకువజామునే స్వామి వారిని మేల్కొల్పి సుప్రభాత సేవ, అర్చనలు, ఆరాధనలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు చేపట్టారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలతో పాటుగా, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహహోమం, కల్యాణోత్సవం, గజవాహన సేవ, బ్రహ్మోత్సవం, జోడు సేవలను నిర్వహించారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. గీతకార్మికుల సమస్యలు తెలుసుకునేందుకే యాత్రఆలేరురూరల్ : గీత కార్మికుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే గీతన్నల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకట రమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు.గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారానికి చేపట్టిన అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర సోమవారం ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చేరుకుంది. గీతా కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమించి అమరులైన సూదగాని ఎట్టయ్య, బండి బాలరాజు, కోటగిరి మల్లయ్య, సీస బాలరాజుల చిత్ర పటాలకు పూలమలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దూపటి వెంకటేష్, సర్పంచ్ మొగులుగాని నర్సయ్య, జిల్లా అధ్యక్షుడు రాగేరు కృష్ణయ్య, బోలగాని జయ రాములు, కొరుకొప్పుల కిష్టయ్య, చంద్రశేఖర్, సుదగాని సత్యరాజయ్య, రమేష్, మల్లేష్, మురళి, సత్తయ్య, పరుశరాములు, గడ్డమీది నరేష్, రామచంద్రం, కృష్ణ, బాలరాజు, పాండరి, బాలయ్య, బండి రాజు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంఆలేరు : ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి పేర్కొన్నారు. బద్లావ్ జరూరీ హై అనే నినాదంతో సీపీఐ చేపట్టిన ప్రచార జాతా కార్యక్రమం సోమవారం ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైంది. ఆలేరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి ప్రచారజాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బోలగాని సత్యనారాయణ, చెక్క వెంకటేష్, కల్లెం కృష్ణ, ఇమ్రాన్, ముత్యాలు, కనకయ్య పాల్గొన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలిమోత్కూరు : తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జక్కుల రాము యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం మోత్కూరులో విలేకరులతో మాట్లాడారు. యాదవ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదుగుతున్న జానయ్యను అడ్డుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాంబాబు యాదవ్, శ్రీనివాస్, గుమ్మడెల్లి పరశురాములు, మల్లేష్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా నిల్వ ఉంచిన కలప సీజ్
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20 టన్నుల సండ్ర కలప(మొద్దులు)ను అటవీ అధికారులు సీజ్ చేశారు. తిమ్మాపురం గ్రామ శివారులో కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి వెంట ఓ వ్యవసాయ క్షేత్రం సమీపంలో కలప నిల్వ ఉన్నట్లు అటవీ అధికారులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు అందింది. దీంతో సూర్యాపేట జిల్లా అటవీ శాఖ రేంజర్ కిరణ్కుమార్ ఆదేశాల మేరకు నాగారం, సూర్యాపేట సెక్షన్ అధికారులు ఎస్. వెంకటేశ్వర్లు, ఎ. మంజులతో పాటు సిబ్బంది రాత్రంతా గాలించారు. ఓ బొలేరో వాహనం కలప లోడ్తో వెళ్తుండగా అటవీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. అందులోని కలపను సీజ్ చేశారు. సమీప ప్రాంతంలో తనిఖీ చేయగా సుమారు 20 టన్నుల నిల్వ చేసిన కలపను గుర్తించారు. సోమవారం ఆ కలపను ట్రాక్టర్లలో జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. సీజ్ చేసిన కలప విలువ రూ.15లక్షలకు పైగానే విలువ ఉంటుందని సమాచారం. బొలేరో డ్రైవర్ పరారీలో ఉన్నాడని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి కలప నిల్వ చేసిన వారిని గుర్తిస్తామని అటవీ శాఖ సెక్షన్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎఫ్బీఓలు ఆర్. అనిల్, వెంకన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థులకు నోట్బుక్స్
రామన్నపేట: ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటర్ విద్యను సర్వశిక్ష అభియాన్కింద చేర్చడంతో పాఠశాల విద్యార్థుల మాదిరిగానే ఇంటర్ పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ఒక్కొక్కరికి 200పేజీలు గల 12 నోట్బుక్స్ అందించనున్నారు. 12 ప్రభుత్వ కళాశాలల్లో.. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రఽభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ చేసేందుకు ఇంటర్బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 12 ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 3,698 మంది పేద విద్యార్థులకు 44,376 నోట్ బుక్స్ అవసరం ఉన్నాయి. ఇప్పటికే కళాశాల వారీగా అవసరమైన ఇండెంట్ను అధికారులకు జిల్లా యంత్రాంగం పంపించింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు నోట్బుక్స్ చేరనున్నాయి.విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు న్యూట్రిషన్ కమిటీలుఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 11 కళాశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కమిటీలను ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఫ ఒక్కొక్కరికి 12 నోట్బుక్స్ చొప్పున అందించేలా ఇండెంట్ ఫ 44వేల నోట్ బుక్స్ అవసరం ఫ 3,698 మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు 44,376 నోట్ బుక్స్ అవసరం. ఈ మేరకు ఇండెంట్ పెట్టాం. ఇప్పటికే కొన్ని జిల్లాలకు చేరాయి. మన జిల్లాకు కూడా నోట్బుక్స్ డెలివరీ అయినట్లు సమాచారం వచ్చింది. నోట్బుక్స్ వచ్చిన వెంటనే కళాశాలకు చేరవేసి పంపిణీ చేస్తాం. – బొందుగుల సురేష్, జిల్లా ఇంటర్బోర్డు అధికారి -
రోడ్డుపై దొరికిన నగదు పోలీసులకు అందజేత
చిట్యాల : రోడ్డుపై దొరికిన నగదును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకుంది ఓ యువతి. చిట్యాల మున్సిపాలిటీలోని వనిపాకల రోడ్డులో ఈ నెల 2న ఇమ్మడి లక్ష్మీప్రసన్నకు రూ.36వేల నగదు దొరికింది. నగదు పోగొట్టుకున్న వారి గురించి ఆరా తీయగా.. ఎలాంటి వివరాలు తెలియరాలేదు. దీంతో దొరికిన నగదును లక్ష్మీప్రసన్న సోదరుడు శివప్రసాద్ సోమవారం చిట్యాల పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పగించారు. నిజాయితీ చాటుకున్న లక్ష్మీప్రసన్న, ఆమె సోదరుడిని పోలీసులు అభినందించారు. కల్వర్టును ఢీకొని కారు దగ్ధంనూతనకల్ : ప్రమాదవశాత్తు కల్వర్టు ఢీకొని కారు దగ్ధమైంది. ఈ ఘటన నూతనకల్ మండలం ఎర్రపహాడ్ క్రాస్ రోడ్డు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం బక్కహేమ్లాతండాకు చెందిన కేతావత్ పవన్, సపావత్ మహేష్ హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా.. 365వ నంబర్ జాతీయ రహదారిపై ఎర్రపహాడ్ క్రాస్ రోడ్డు సమీపంలో అడవి పంది అడ్డువచ్చింది. దానిని తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో అకస్మత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కారులోని వ్యక్తులు వెంటనే అప్రమత్తమై బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు మంటల్లో కాలిబూడిదైంది. కాగా.. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు. కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యనిడమనూరు : కుటుంబ సమస్యలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిడమనూరు మండలం మార్తువారిగూడెంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్తువారిగూడెం గ్రామానికి చెందిన మేకల మైసమ్మ(52)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలయ్యాయి. మైసమ్మ భర్త గతంలోనే మృతిచెందాడు. కాగా.. పలు కారణాలతో గతేడాది నుంచి మైసమ్మ కోడలు కుమారుడికి దూరంగా ఉంటుంది. దీంతో కొడుకు సంసారం దెబ్బతిన్నదని మనస్తాపానికి గురైన మైసమ్మ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం మైసమ్మ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి తిరుమలగిరి(సాగర్) మండలం రాజవరం గ్రామంలో ఉంటున్న ఆమె చిన్న అల్లుడు పోలేపల్లి సోమరాజుకు సమాచారం అందించారు. అతడు వచ్చి చూసేసరికి మైసమ్మ ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి చిన్న అల్లుడు సోమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
కుక్కను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో
మర్రిగూడ : కుక్కను తప్పించబోయి ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో జరిగింది. ఛత్తీస్గడ్కు చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం మర్రిగూడ మండల కేంద్రానికి వలస వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలో పనులు ముగించుకుని ఆటోలో మండల కేంద్రానికి వస్తుండగా.. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోకి రాగానే కుక్క అడ్డురావడంతో దానిని తప్పించబోయి ఆటో డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఛత్తీస్గడ్కు చెందిన పరమేశ్వర్, కుమారి, రూపాబాయి, పురందాస్, మాల్కు చెందిన పవన్, సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురానికి చెందిన ద్వాలి, మర్రిగూడ మండలం తిరగండ్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కలకొండ సిద్ధుకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మర్రిగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుమారి, పరమేశ్వర్, రూపాబాయి, పురందాస్ను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురికి గాయాలు -
గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతి
నార్కట్పల్లి : గుర్తుతెలి యని వాహనాన్ని ఢీకొని డీసీఎం డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్పల్లి శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నానికి చెందిన వడ్లపాటి శాంతిస్వరూప్(26) డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సర్వి కర్రల లోడ్తో పత్తిపాడు నుంచి హైదరాబాద్కు బయల్దేరాడు. ఆదివారం తెల్లవారుజామున నార్కట్పల్లి శివారులోని ఓల్డ్ వివేరా హోటల్ సమీపంలోకి రాగానే డీసీఎం అదుపుతప్పి ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాంతిస్వరూప్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శాంతిస్వరూప్ మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పలి్ల్ ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి దుర్మరణం ● న్యాయం చేయాలని దేవరకొండ డిపో ఎదుట మృతుడి బంధువుల ఆందోళనచందంపేట : బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చందంపేట మండలం సర్కిల్తండా సమీపంలో జరిగింది. చందంపేట మండలం పొగిళ్ల గ్రామానికి చెందిన వాయిలపల్లి వజ్రమ్మ, ఈదయ్య దంపతుల కుమారుడు వాయిలపల్లి శ్రీను(38) పని నిమిత్తం బైక్పై కొండమల్లేపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో సర్కిల్తండా సమీపంలోని తెల్లపలుగు గుట్ట వద్దకు రాగానే ఆర్టీసీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు దేవరకొండ డిపో ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. చందంపేట ఎస్ఐ లోకేష్ అక్కడికి చేరుకొని మృతుడి బంధువులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చౌటుప్పల్ : మండల పరిధిలోని తూప్రాన్పేట గ్రామ శివారులో లక్ష్మి దుర్గ దాబా హోటల్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి విజయవాడ మార్గంలో ఉన్న దాబా వద్ద నుంచి హైదరాబాద్ వైపునకు రోడ్డు దాటుతుండగా డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు గులాబీ రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించాడు. కుడిచేతిపై అమ్మ అని పచ్చబొట్టు ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి. మన్మథకుమార్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 62744 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. -
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
రామన్నపేట : ప్రభుత్వం రైతులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రామన్నపేట సబ్స్టేషన్ను ముట్టడించారు. చిట్యాల–భువనగిరి రోడ్డుపై రాస్తారోకో చేశారు. భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో సీఐ రవి, ఎస్ఐ సతీష్ వారితో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన జాప్యం, యాప్ల పేరుతో యూరియా ఇబ్బందులు, అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులకు వ్యవసాయంపై విరక్తి కలిగేలా రేవంత్రెడ్డి చేస్తున్నాడని దుయ్యబట్టారు. విద్యుత్ వినియోగం తగ్గినా కరెంటు కోతలు ఎందుకు విధిస్తున్నారో కాంగ్రెస్ నేతలు రైతులకు సమాధానం చెప్పాలన్నారు. వరినాట్లు వేసిన తర్వాత విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులకు 24గంటల కరెంటు ఇవ్వకపోతే ఎస్ఈ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కమ్మంపాటి శ్రీనివాసులు, గర్దాసు విక్రం, నాయకులు పోచబోయిన మల్లేశం, బందెల రాములు, బద్దుల ఉమారమేష్, కన్నెబోయిన బలరాం, ఆమేర్, పున్న వెంకటేశం, రేఖ యాదయ్య, మెట్టు శ్రీనివాస్రెడ్డి, కూనూరు ముత్తయ్య, అంజి, మామిండ్ల కుమార్, బండ శ్రీనివాస్రెడ్డి, నక్క నరేందర్, బుర్ర శ్రీశైలం, జాడ సంతోష్, కోళ్ల కిషన్, కల్లూరి నరేష్, బొడ్డుపల్లి రాజు, కుమార్, రవి పాల్గొన్నారు.ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రామన్నపేట సబ్స్టేషన్ ముట్టడి -
పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ
యువకుడి అదృశ్యంకేపీహెచ్బీకాలనీ : అక్క ఇంట్లో పుట్టిన రోజు జరుపుకుంటానని చెప్పి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నల్లగొండకు చెందిన నర్సింగ్ రామ్(29) కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నరేష్ నగర్లో స్నేహితులతో కలిసి ఉంటూ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 8న నర్సింగ్ రామ్ పుట్టిన రోజు కావడంతో బోడుప్పల్లో నివాసముంటున్న తన అక్క ఇంటికి వస్తానని ఆమెకు చెప్పాడు. రాత్రి అయినా రాకపోవడంతో నర్సింగ్ రామ్కు తన అక్క ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. నర్సింగ్ రామ్ స్నేహితుడికి అతడి బావ చీకటి సోమన్న ఫోన్ చేయగా 8వ తేదీ ఉదయం జేఎన్టీయూ మెట్రో స్టేషన్కు వెళ్లాడని తెలిపాడు. దీంతో బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా, ఎంత వెతికినా నర్సింగ్ రామ్ ఆచూకీ లభించకపోవడంతో బావ చీకటి సోమన్న కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పెద్దవూర : తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంట అయిన బంతి సాగుతో లాభాలు అర్జించవచ్చు. ఇప్పటికే నర్సరీలలో బంతి నారును పెంచుకుంటున్నారు. బంతి సాగును మొదటగా జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో సాగు చేసేవారు. కానీ గత కొన్నేళ్లుగా రైతులు ఏడాది పొడవునా బంతిపూల సాగు చేస్తున్నారు. జూన్, జూలై నెలల్లో సాగు చేసిన బంతి సాగు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ, అక్టోబర్, నవంబర్ నెలలో సాగు చేసిన బంతిపూలు డిసెంబర్, జనవరితో పాటు ఫిబ్రవరిలో వచ్చే పండుగలు, పెళ్లిళ్లు, జాతరలు, ఫంక్షన్లకు దిగుబడి వస్తుండటంతో మంచి గిరాకీ వస్తుంది. బంతిని సులువుగా అన్ని కాలాల్లో సాగు చేయొచ్చు. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు. రైతులు తమకు ఉన్న పొలాల్లో నీటి వసతిని బట్టి బంతిని సాగు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి మురళీ తెలిపారు. రెండు రకాలు ఆఫ్రికన్ మేరీగోల్డ్: ఈ జాతి ఎత్తుగా పెరిగి అతి పెద్ద సైజు పూలు పూస్తాయి. దీనిలో ఆఫ్రికన్ జెయింట్, ఆరెంజ్ డబుల్, ఆఫ్రికన్ ఎల్లోజెయింట్ డబుల్, క్రాక్ జాక్, గోల్డెన్ ఏజ్ రకాలు అనువైనవి. ఫ్రెంచి మేరీగోల్డ్: ఈ జాతి పూలకుండీల్లో పెంచుకునే పొట్టి రకాలు. దీనిలో రెడ్ బ్రోక్డ్, రెస్పిన్ రెడ్, బట్టర్ స్కాచ్, వాలెన్నియా రకాలు అనువైనవి. నేలలు: నీరు త్వరగా ఇంకిపోయే తేలికపాటి సారవంతమైన నేలలు, ఇసుక నేలలు, నీటి తేమ తక్కువగా ఉండే నేలలు బంతి సాగుకు అనుకూలం. బంతిని మిరప, పత్తి పంటల్లో రక్షక పంటగా కూడా సాళ్లలో సాగు చేసుకోవచ్చు. వాతావరణం: మన వాతావరణ పరిస్థితులు బంతిసాగుకు అనుకూలం. జూలై మధ్య కాలం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటితే మార్కెట్కు పూల సరఫరా సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు చేయొచ్చు. నారుమళ్లు: ఎకరానికి సరిపడ నారు పెంచడానికి 800–1000 గ్రాముల విత్తనం అవసరం. మళ్లు తయారు చేసుకునే సమయంలో ఒక చదరపు మీటరుకి 8–10 కిలోలు బాగా చిలికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదలు వంటి ఇతర క్రీముల నుంచి రక్షణ పొందవచ్చు. ఎత్తు నారుమళ్లు చేసుకుని విత్తనాన్ని సాళ్లలో నాటుకుంటే మొక్కల మధ్యదూరం సమంగా ఉండి నారు మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దీనివలన కలుపు మొక్కలు, చీడపీడల నివారణ కూడా వీలవుతుంది. విత్తిన 5–7 రోజుల్లో మొలకలు వస్తాయి. నాటే దూరం.. విధానం: 15–20 రోజుల వయసు లేదా 3–4 ఆకులు వచ్చిన మొక్కలను 45్ఙశ్రీ25 సెంటీమీటర్ల దూరంలోర నాటితే మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండి పూల దిగుబడి పెరుగుతుంది. నారుని సాయంకాలం నాటుకుంటే బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్ మొక్కల్ని 40శ్రీ30 సెంటీమీటర్లు దూరంలోనూ, ఫ్రెంచ్ బంతి మొక్కల్ని 20శ్రీ20 సెంటీమీటర్ల దూరంలో నాటితే పూల దిగుబడి బాగా ఉంటుంది. నాటిన తర్వాత పల్చగా నీరు పెట్టుకోవాలి. ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వీనితోపాటు 20–40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 35 కిలోల పోటాష్ను ఇచ్చే ఎరువులను వేయాలి. మొక్కలు నాటిన 60 రోజుల వరకు శాఖీయంగా పెరిగే దశలో ఉంటాయి. ఈ సమయంలో తగినంత తేమ ఉండేలా చూడాలి. నేల స్వభావాన్ని బట్టి 5–8 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి. కత్తిరింపులు: వాణిజ్యపరంగా పెంచే ఆఫ్రికన్ బంతి రకాలు ఎత్తుగా పెరిగి చాలా తక్కువగా పూలు వస్తాయి. కనుక మొక్కలు 30–40 సెంటీమీటర్ల ఎత్తులో లేదా నాటిన 30–35 రోజులకు తలభాగం కత్తిరిస్తే మొక్క కింది భాగం నుంచి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి పూల దిగుబడి పెరుగుతంది. అంతేకాకుండా పూలన్నీ ఒకే పరిమాణంలో ఉండి మంచి రంగు సంతరించుకోవడంతో గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ రైతులను లాభదాయకంగా బంతి సాగు ఫ మిరప, పత్తి పంటల్లో రక్షణ పంటగా అనుకూలంనారుకుళ్లు తెగులు: నేలలో తడి ఎక్కువగా ఉండి వెచ్చని వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. మొలకెత్తిన నారు మొక్కల కాండం కుళ్లి చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 1.5 గ్రాముల కార్భండిజమ్ కలిపిన మందు ద్రావణంతో నారు మడిని తడిపి నివారించవచ్చును. మొగ్గ తొలిచే పురుగు: లార్వాలు పూమొగ్గలను తొలుస్తాయి. పూ మొగ్గలు విచ్చుకోవు. పూల దిగుబడి బాగా తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కార్బిరిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పేను: పెద్ద, పిల్ల పురుగులు మొగ్గల్ని ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు మలాథియాన్ లేదా 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసి నివారించుకోవచ్చు. తామర పురుగులు: పిల్ల, తల్లి పురుగులు ఆకులు, పూల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఆకుల మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆశించిన పూ మొగ్గలు గోధుమరంగుకు మారి ఎండిపోతాయి. నివారణకు లీటరు నీటికి 2 మిల్లీ లీటర్లు డైమిథోయేట్ ను కలిపి పిచికారీ చేయాలి. -
మద్యం మత్తులో ఎలుకల మందు తాగి వృద్ధుడి మృతి
నకిరేకల్ : మద్యం మత్తులో ఎలుక మందు తాగి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపర్తి గ్రామానికి చెందిన బొల్లం లింగయ్య(80) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగిన సమయంలో తాను చనిపోతానని పలుమార్లు కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉండేవాడు. శనివారం మద్యాహ్నం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న ఎలుక మందును నీటిలో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటి తర్వాత లింగయ్య వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు. చిరుత కలకలం రామగిరి(నల్లగొండ) : నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ సమీపంలో శనివారం చిరుత సంచరించినట్లు వార్తలు రావడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఆదివారం డంపింగ్ యార్డు దగ్గరలోని సీతాఫల చెరువు సమీపంలో బుడిగ మల్లయ్య వ్యవసాయ భూమిలో చిరుత పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. గేదెలు కాసేందుకు వెళ్లిన యువకుడు పాదముద్రలను గుర్తించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు పాదముద్రలను ఫొటో తీసి అటవీ అధికారులకు పంపించారు. అయితే ఆ పాదముద్రలు అడవి కుక్కల పాదముద్రలని అటవీ అధికారులు తెలిపినట్లు సమాచారం. ముగిసిన మల్లఖంబ్ శిక్షణ శిబిరంచౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన మల్లఖంబ్ క్రీడ రెండు రోజుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ శిబిరంలో వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 42మంది శిక్షకులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ చాంబర్స్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. అతి ప్రాచీనమైన మల్లఖంబ్ క్రీడను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మల్లఖంబ్ క్రీడలో విద్యార్థులు పాల్గొనేలా సర్టిఫికెట్లు పొందిన శిక్షకులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లఖంబ్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ పాటర్న్ కేవీబీ. కృష్ణారావు, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉజ్జిని మంజుల, కోశాధికారి పోలె అంజయ్య, కార్యదర్శి గోపాల్, శిక్షకులు కిరణ్, వెంకట్, కృష్ణమూర్తి, నరేష్, సందీప్, స్వాతి, స్వరూప, సుమతి, అరుణ, నందిని, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాధికారం సాధించే వరకు పోరు ఆగదు
రామగిరి (నల్లగొండ) : పోరాటాల గడ్డ అయిన నల్లగొండ జిల్లాలో బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించేవరకు పోరాటాలు కొనసాగుతాయని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం(బీసీఐఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జీఎల్ గార్డెన్స్ ఫంక్షన్హాల్లో ఉమ్మడి జిల్లా బీసీఐఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల హక్కుల సాధన సామాజిక న్యాయ పోరాట సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 56 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో ఇప్పటివరకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, చట్టసభలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టంతో పాటు బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లలో బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించడానికి స్వతంత్ర కమిషన్ వేయాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యమాలు మరింత బలపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విఠల్, చెరకు సుధాకర్, బీసీఐఎఫ్ జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్, గుండెబోయిన జానయ్యయాదవ్, ఆమంచి అంజయ్య, సుంకరి భిక్షంగౌడ్, చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల యాదగిరి, చెన్న శ్రీకాంత్, రావిరాల నర్సయ్య, ఎంఏ. కరీం, కొన్నె శంకర్గౌడ్ పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, బీసీఐఎఫ్ రాష్ట్ర చైర్మన్ చిరంజీవులు -
తెలంగాణపై వరుణుడు కరుణించాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణపై వరుణుడు కరుణ చూపాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సోమవారం నాగార్జునసాగర్లోని విజయవిహార్ ప్రాంగణంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి మహా వరుణయాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సాక్షితో మాట్లాడారు. రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాల జీవనోపాధి వ్యవసాయం పైనే ఆధారపడి ఉందని, వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండితే రైతులతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ ఏడాది వానాకాలంలో వర్షాల మధ్య విరామాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని, ఒకేసారి భారీ వర్షాలు కురవడం కంటే పంట కాలమంతా అవసరమైన సమయంలో, అవసరమైన మేరకు వర్షాలు కురవడం ముఖ్యమన్నారు. అప్పుడే పంటలు ఆరోగ్యంగా పెరగడంతో పాటు చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యం కొన్ని సందర్భాల్లో ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉండటంతో వర్షపాతంలో లోటు ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి టీఎంసీ నీటిని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వినియోగిస్తున్నామని తెలిపారు. వానాకాలం పంటలను కాపాడటం, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి జలాశయాల్లోకి వచ్చే నీటి ప్రవాహాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. అందుకోసమే నేడు సాగర్లో మహా వరుణ యాగం నీటిపాదరుల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి -
దైవదర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
చిట్యాల : దైవదర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన చిట్యాల పట్టణ శివారులో ఆదివారం జరిగింది. రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల శివ(32) ఆదివారం తెల్లవారుజామున నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి బైక్పై వచ్చాడు. దర్శనం అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో చిట్యాల పట్టణ శివారులో భువనగిరి రోడ్డులో గల శ్రీబాల వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోకి రాగానే బైక్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో శివ తన బైక్తో పాటు ఎదురుగా వస్తున్న లారీ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా.. శివ అక్కడిక్కడే మృతిచెందాడు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. సమాచారం తెలుసుకున్న చిట్యాల ఎస్ఐ వెంకట్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాత్రికి తరలించారు. మృతుడు అవివాహితుడు. మృతుడి అన్న నాగరాజు కూడా కొనేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిరుమర్తి.. అదే రోడ్డు గుండా రామన్నపేట వైపు వెళ్తున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. చిట్యాల–రామన్నపేట రోడ్డులో మలుపులున్న చోట రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లను తొలగించాలని, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన పోలీసులను కోరారు. కారు ఢీకొని యువకుడి దుర్మరణం -
యువకుడి ప్రాణం తీసిన డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం
నకిరేకల్ : డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నకిరేకల్ పట్టణ శివారులో ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వేణిగుండ్ల గ్రామానికి చెందిన భీమిరెడ్డి హేమంత్కిరణ్రెడ్డి(30) హైదరాబాద్లో ఉంటూ సివిల్ సైట్ ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వెళ్లిన హేమంత్ కిరణ్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై తిరిగి హైదరాబాద్కు బయల్దేరాడు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నకిరేకల్ పట్టణ శివారులోని పద్మానగర్ జంక్షన్ వద్దకు రాగానే.. నకిరేకల్ పట్టణంలో నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా హైవే పైకి వచ్చాడు. దీంతో హేమంత్ కిరణ్రెడ్డి బైక్ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హేమంత్ కిరణ్రెడ్డి మృతదేహాన్ని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరించారు. డీసీఎం నడుపుతున్న వ్యక్తి కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెంకు చెందిన నిమ్మనగోటి శేఖర్గా పోలీసులు గుర్తించారు. మృతుడి బావమరిది పులగం వేణుగోపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు. ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా హైవే పైకి వచ్చిన డీసీఎం వెనుక నుంచి ఢీకొన్న ద్విచక్ర వాహనం నకిరేకల్ పట్టణ శివారులో ఘటన -
30 నిమిషాల్లోనే నృసింహుడి దర్శనం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. హైదరాబాద్, సికింద్రాబాద్లో బోనాల పండుగ కావడంతో యాదగిరీశుడి సన్నిధికి భక్తుల రాక తగ్గింది. దీంతో ధర్మ దర్శనానికి 30 నిమిషాలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. స్వామివారిని 25వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువ కనిపించినా, మధ్యాహ్నం తర్వాత సాధారణంగానే ఉంది. వివిధ పూజల ద్వారా నిత్యాదాయం రూ.32,08,855 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. లష్కర్ బోనాల నేపథ్యంలో యాదగిరిగుట్టకు తగ్గిన భక్తులు -
మల్లఖంబ్లో ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలి
చౌటుప్పల్ : విద్యార్థులు మల్లఖంబ్ క్రీడలో మంచి పట్టు సాధించి ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథకుమార్ ఆకాంక్షించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ట్రినిటీ స్కూల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న మల్లఖంబ్ రాష్టస్థాయి శిక్షణ శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అత్యంత ప్రాచీణమైన క్రీడగా గుర్తింపు పొందిన మల్లఖంబ్ సాధన విద్యార్థులకు అన్నివిధాలుగా ఉపయోగపడుతుందన్నారు. మల్లఖంబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడను మరింతగా వ్యాప్తి చేసేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమన్నారు. వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 42మంది శిక్షకులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మల్లఖంబ్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ పాటర్న్ కేవీబీ. కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్లఖంబ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉజ్జిని మంజుల, ప్రధాన కార్యదర్శి ముడావత్ గోపాల్, ఎంఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ సాహూ పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధికి సర్పంచ్ వినూత్న ఆలోచన
రాజాపేట : గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు సర్పంచ్ వినూత్న ఆలోచన చేశారు. రాజాపేట మండలంలోని రేణికుంట సర్పంచ్ కర్రె వెంకటేశం.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలతోపాటు పలు అంశాలతో రూపొందించిన కరపత్రాలను పోస్టు ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తున్నారు. కరపత్రంలో ప్రభుత్వ పథకాలు, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, ప్రమాద బీమా పథకాలు, రక్తదాన శిబిరం నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, తడిచెత్త – పొడిచెత్త, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్ ఏర్పాటు వంటి అంశాలను వివరించారు. పోస్టు ద్వారా చేరిన ఉత్తరంతో ప్రతి వ్యక్తిలో చైతన్యం తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని సర్పంచ్ వెంకటేశం తెలిపారు. -
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కనగల్ : అత్తింటివారి వేధింపులు తాళలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామంలో శనివారం జరిగిది. ఎస్ఐ రాజీవ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన ఎస్కే హుజపాకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సుంకిశ గ్రామానికి చెందిన షేక్ రజియా(24)తో 2021లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. రజియాపై అనుమానంతో ఆమె భర్త హుజపాతో పాటు అత్తింటి వారు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవారు. వారి వేధింపులు తాళలేక రజియా శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం ఆమెను నల్లగొండకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతిరాలి తండ్రి షేక్ పకీర్సాబ్ ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శనివారం పోస్టుమార్టం అనంతరం రజియా మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి వేములపల్లి : రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులోని నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండల కేంద్రానికి చెందిన చెరుకు సత్యనారాయణ(49) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయల్దేరి శెట్టిపాలెంకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తూ.. శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద నార్కట్పల్లి–అద్దంకి రహదారి దాటుతుండగా నల్లగొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను స్థానికులు ఆటోలో మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య చెరుకు పారిజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ద్విచక్ర వాహనంతో పోలీస్ అధికారిని ఢీకొట్టిన బాలుడు ● బాలుడితో పాటు అతడి తండ్రిపై కూడా కేసు నమోదు నల్లగొండ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాలుడు పోలీస్ అధికారిని ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో బాలుడితో పాటు అతడి తండ్రిపై నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ మేకల అభినవ్ స్టేడియం సమీపంలో టూటౌన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆర్టీసీ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలుడు స్కూటీపై అటుగా వచ్చాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఏఎస్ఐ కంచర్ల చంద్రశేఖర్ను ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏఎస్ఐకి గాయాలయ్యాయి. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు బాలుడితో పాటు అతడి తండ్రిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మోత్కూరు–రాజన్నగూడెం రోడ్డు పనులు ప్రారంభం
మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పనకబండ చౌరస్తా నుంచి రాజన్నగూడెం వరకు బీటీరోడ్డు నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. మూడేళ్ల క్రితం రూ.5.80 కోట్లతో చేపట్టిన మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు అర్ధాంతరంగా వదిలేశారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని గత నెల 24న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. అయితే అప్పటికీ పనుల్లో కదలిక లేకపోవడంతో ‘మంత్రి ఆదేశించినా పనులు మొదలు కాలే’ అనే శీర్షికన ఈ నెల 6న సాక్షి దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం జేసీబీతో పాత రోడ్డును పెకిలించి మట్టి పోసి రోలింగ్ చేస్తున్నారు. ఈపనులను ఎమ్మెల్యే మందుల సామేల్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అవిశెట్టి అవిలుమల్లు, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మినర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్నాల శ్రీనివాస్రెడ్డి, పోచం జగన్, సింగిల్విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వంగరి రాములు, పట్టణ కాంగ్రెస్ నాయకులు గనగాని నర్సింహ్మ, పల్లపు సమ్మయ్య, గొలుసుల దుర్గయ్య తదితరులున్నారు. -
చిన్నారిపై వీధి కుక్క దాడి
దేవరకొండ : వీధి కుక్క దాడిలో మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వివరాలు.. దేవరకొండ పట్టణంలోని మగ్ధూంబాబ నగర్లో నివాసముంటున్న అరుణ్–సోనం దంపతుల మూడేళ్ల కుమార్తె నబియా శనివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుంది. ఈ క్రమంలో కాలనీలో సంచరిస్తున్న వీధి కుక్క నబియాపై దాడి చేయడంతో ఆమె దవడ కింది భాగంలో గల మూడు దంతాలు ఊడిపోయాయి. చిన్నారి అరుపులతో ఇంట్లో నుంచి వచ్చిన తల్లిదండ్రులు హుటాహుటిన దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. దేవరకొండ పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుదాఘాతంతో మృతి ● ఇటీవలే నూతన గృహప్రవేశం ● కొద్దిరోజులకే మృత్యుఒడికి..చిలుకూరు : ఇంట్లో విద్యుత్ వైర్లు మారుస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చిలుకూరు మండలం ఆర్లెగూడెం గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్లెగూడెం గ్రామానికి చెందిన గొర్రె రాంబాబు(45) వ్యవసాయంతో పాటు ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని ఇటీవలే గృహప్రవేశం చేశాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్న రాంబాబు.. ఇంటి నిర్మాణం సమయంలో పక్కనే ఒక కర్రకు ఏర్పాటు చేసిన విద్యుత్ బాక్స్, వైర్లను ఇంట్లోకి మారుస్తున్నాడు. ఈ క్రమంలో గడ్డపార సహాయంతో విద్యుత్ వైర్లు తీస్తుండగా.. గడ్డపారకు వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ తెలిపారు. వైద్యం వికటించి వ్యక్తి మృతికుషాయిగూడ(హైదరాబాద్) : వైద్యం వికటించి వ్యక్తి మృతిచెందిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లక్ష్మాపూర్కు చెందిన బొల్ల రవి(40) జీవనోపాధి కోసం భార్య, కుమారుడు, కూతురుతో కలిసి కుషాయిగూడకు వలస వచ్చి శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గత నెల 31న స్వగ్రామం సమీపంలోని వాసాలమర్రి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. తిరిగి వచ్చి దమ్మాయిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తరువాత ఈ నెల 4న ఈసీఐఎల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో నగరంలోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రవి మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. -
భువనగిరిలో ట్రాఫిక్ తిప్పలు
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైనప్పటికీ క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్య ఏమాత్రం తగ్గడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారులకే బెదిరింపులు మున్సిపల్ నిబంధనల ప్రకారం తోపుడు బండ్ల వ్యాపారులు ఒకేచోట శాశ్వతంగా కాకుండా సంచరిస్తూ విక్రయాలు జరుపుకునే వెసులుబాటు ఉంది. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం తోపుడు బండ్ల వ్యాపారులపైనే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. వ్యాపారులను అక్కడికక్కడ బెదిరించి పంపిస్తున్న పోలీసులు.. రోడ్లను ఆక్రమించి వ్యాపారం కొనసాగిస్తున్న దుకాణదారులు, ఇతర ఆక్రమణదారులను మాత్రం కనీసం హెచ్చరిస్తున్న పాపానపోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి బాబు జగ్జీవన్రామ్ చౌరస్తా వద్ద తోపుడు బండ్లు పెడుతున్న చిన్న వ్యాపారులను మాత్రం పోలీసులు అక్కడ పెట్టనివ్వడం లేదు. సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారుల పక్కన, జిమ్లు, వ్యాపార సముదాయాల ముందు గంటల తరబడి కార్లు, బైక్లను దర్జాగా పార్కింగ్ చేసి అర్ధరాత్రి వరకు ఉంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నిత్యం ఇబ్బందులే.. ఉడిపి హోటల్ నుంచి రియాల్స్ మార్ట్, బాబు జగ్జీవన్రామ్ చౌరస్తా నుంచి కుమ్మరివాడ వెళ్లే గల్లీ, జగదేవ్పూర్ చౌరస్తా, నల్లగొండ రోడ్డు, వినాయ చౌరస్తాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటోంది. ఇరువైపులా రోడ్లపైనే విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు, కార్లు నిలుపుతుండటంతో రాకపోకలు సాగించే ఇతర వాహనాలు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణంలో సరిపడా పార్కింగ్ స్థలాలు లేకపోవడం, ఉన్న స్థలాలు ఆక్రమణకు గురికావడం.. ఫుట్పాత్లు కూడా లేక బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ రోడ్లపైనే వాహనాల పార్కింగ్ ఫ ఇబ్బందుల్లో వాహనదారులు ఫ తోపుడు బండ్ల వ్యాపారులపైనే పోలీసుల ప్రతాపం -
తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం
భువనగిరి(బీబీనగర్): తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అమితా అగర్వాల్ అన్నారు. శనివారం బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ వంటి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మీసేవ సెంటర్ల దరఖాస్తుదారులకు రాతపరీక్ష భువనగిరిటౌన్ : జిల్లాలోని అడ్డగూడూరు, ఆత్మకూరు, మోత్కూరు, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో 8 నూతన మీసేవ సెంటర్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం భువనగిరిలో రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 209 మంది అభ్యర్థులకు హాల్టికెట్లు జారీ చేయగా, వారిలో 166 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగింది. ఈడీఎం సాయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైదా పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలు జరిపించారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం నిర్వహించారు. సాయంత్రం జోడు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మూడు అడుగులు పెరిగిన సాగర్ నీటిమట్టంనాగార్జునసాగర్ : జలాశయం నీటిమట్టం ఒక్క రోజులో మూడు అడుగుల మేర పెరిగింది. శ్రీశైలం జలాశయం విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయానికి 81,565 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద విద్యుదుత్పాదన చేస్తూ 31,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 900 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులు (312.0450టిఎంసీలు)కాగా.. ప్రస్తుతం 516.50 అడుగులు (142.9715 టీఎంసీలు)గా ఉంది. -
యాదగిరికొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు
యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి కొండపైకి భక్తులను ఎలక్ట్రిక్ బస్సుల్లో తీసుకెళ్తుంటారు. ఈ విధంగానే యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులను సైతం ఎలక్ట్రిక్ బస్సుల్లోనే కొండపైకి చేర్చే విధంగా వైటీడీ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం యాదగిరిగుట్ట పట్టణం, ఆధ్యాత్మిక వాడలోని ఉన్న బస్టాండ్ల నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపిస్తే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. కొండపైన కాలుష్య నివారణతో పాటు ఖర్చు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 2వేల మంది వరకు అన్నప్రసాదం అందించే యోచన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో కొండకు దిగువన ఉన్న ఆధ్యాత్మిక వాడలోని అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నారు. గతంలో 1000 మందికే అన్న ప్రసాదం అందించేవారు. ఉద్ఘాటన తరువాత భక్తుల సంఖ్య పెరగడంతో 1000 మంది భక్తుల నుంచి 1500 మందికి పెంచారు. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి భక్తుల రద్దీ పెరుగుతుండడంతో అన్న ప్రసాదానికి సైతం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2వేల మంది వరకు అన్నప్రసాదం అందించాలని వైటీడీ బోర్డు త్వరలో నిర్ణయించనుంది. త్వరలో చర్చించనున్న పాలకమండలి ఈ నెల 14న యాదగిరీశుడి ఆలయ సన్నిధిలో వైటీడీ బోర్డు పాలక మండలి సమావేశం నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైటీడీ చైర్మన్, సభ్యుల సమక్షంలో ఇందుకు సంబంధించిన ఎజెండాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలిసింది. వీటితో పాటు కొండపైన నిర్మాణం చేసే రంగ మండపం, డార్మింటరీ హాల్, వాహనాల పార్కింగ్, దీక్షా పరుల మండపం, మెట్ల మార్గంలో షెడ్డు ఏర్పాటు, లిఫ్టు వద్ద నూతన మెట్ల నిర్మాణం వంటి పనులకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాయగిరి సమీపంలో శ్రీస్వామి వారికి సంబంధించిన భారీ ఆర్చిని సైతం నిర్మించేందుకు పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. ఫ త్వరలో నిర్ణయం తీసుకోనున్న వైటీడీ బోర్డు ఫ భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కువ మందికి అన్నప్రసాదం అందించే యోచనలో అధికారులు -
పట్టభద్రుల సీటుపై గురి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీకాలం 2027 మార్చి 9తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయ కసరత్తు మాత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ స్థానంలో బీసీ వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తుండగా వచ్చే ఎన్నికల్లోనూ అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపితే రాజకీయంగా లాభం ఉంటుందనే అభిప్రాయం ప్రధాన పార్టీల్లో వ్యక్తమవుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో బీసీ పట్టభద్రుల ఓటర్ల ప్రభావం, సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జనరల్ అభ్యర్థులను కూడా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిప్రాయాలు సేకరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆశావహుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. మూడు జిల్లాల్లో పార్టీ బలోపేతం, పట్టభద్రులలో గుర్తింపు, ప్రజా ఉద్యమాల్లో చురుకై న పాత్ర, సామాజిక సమీకరణలు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థిని ఖరారు చేసే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానంలో వంశీచంద్రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ – ఖమ్మం – నల్లగొండ స్థానంలో బీసీవైపు మొగ్గు చూసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ స్థానం బీఆర్ఎస్ కూడా గత ఎన్నికల అనుభవాలను విశ్లేషిస్తూ గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. పట్టభద్రులతో అనుబంధం ఉన్న నాయకులు, విద్యావేత్తలు, సామాజికంగా గుర్తింపు పొందిన వ్యక్తుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తీన్మార్ మల్లన్న కంటే ముందు ఇది బీఆర్ఎస్ స్థానం. కాబట్టి దానికి పక్కాగా దక్కించుకోవాలంటే మరింత బలమైన వ్యక్తిని బరిలో నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీ వాదంపై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉన్నందున అభ్యర్థి ఎంపికపై ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వ్యూహరచనలో బీజేపీ బీజేపీ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందస్తు వ్యూహరచనలో నిమగ్నమైంది. పట్టభద్రుల ఓటర్లలో పార్టీ ప్రభావాన్ని మరింత పెంచేలా అభ్యర్థి ఎంపిక ఉండేలా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీలు ఫ బీసీలకే టికెట్ ఇచ్చే యోచన ఫ నెలాఖరులో అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఫ ఎవరిని నిలబెట్టాలని కాంగ్రెస్ అభిప్రాయ సేకరణమూడు ప్రధాన పార్టీల్లోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నా.. బీసీ ఓటర్లతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతును కూడగట్టగల అభ్యర్థికే ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు, జాబితాల రూపకల్పన చేపట్టనుంది. -
బంజారాల బతుకమ్మ.. తీజ్!
ఫ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఫ తొమ్మిది రోజుల పాటు యువతుల ఉపవాస దీక్షలు ఫ పాడిపంటలు సమృద్ధిగా పండాలని, మంచి భర్త రావాలని పూజలుబొమ్మలరామారం : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే ముఖ్యమైన పండుగల్లో ‘తీజ్’ ఒకటి. పెళ్లికాని యువతులు ప్రకృతిని ఆరాధించే ఈ పండుగతో తండాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమకు మంచి భర్త లభించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో గిరిజనులు ఏటా ఈ తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. గిరిజన తండాల్లో తీజ్ పండుగకు అంతే విశిష్టత ఉంది. అందుకే దీనిని ‘బంజారాల బతుకమ్మ’ అని కూడా పిలుస్తారు. దాటుడు పండుగతో అంకురార్పణ.. తండాల్లో నిర్వహించే తీజ్ పండుగకు గిరిజనులు దాటుడు (శీత్లా భవాని) పండుగతో అంకురార్పణ చేస్తారు. ఆషాఢ మాసంలో తొలకరి విత్తనాలు వేసిన తర్వాత వచ్చే మంగళవారం రోజున దాటుడు పండుగ జరుపుకుంటారు. గిరిజన మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి డప్పు చప్పుళ్లు, ఆటపాటలతో తండా పొలిమేరల్లో ఏర్పాటు చేసిన శీత్లా భవాని అమ్మవార్లకు నైవేద్యం తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. ఏడు రూపాల్లో శీత్లా భవానికి పూజలు.. దాటుడు పండుగలో శీత్లా భవాని అమ్మవార్లను గిరిజనులు ఏడు రూపాల్లో (మేరమ్మ, తుల్జా, సీత్లా, అంబా భవాని, హింగ్ళా, ధ్వాళాంగర్, కంకాళీ) ప్రతిష్ఠించి కొలుస్తారు. ఉల్లిగడ్డ, మిరపకాయలు, పసుపు కొమ్ములు, జొన్న గుడాలు, బియ్యం, నవధాన్యాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం తండాలోని పశుసంపదపై ఆ నైవేద్యాన్ని చల్లుతారు. ఇలా చేస్తే పశువులు, మూగజీవాలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వారి ప్రగాఢ విశ్వాసం. అనంతరం పచ్చని ప్రకృతిలో అమ్మవార్ల సన్నిధిలో నృత్యాలు చేస్తూ వన భోజనాలు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిష్ఠగా పూజలు.. దాటుడు పండుగ అనంతరం తండాలోని పెద్దమనుషులు (నాయక్) ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం, అనుమతి తీసుకుని తీజ్ను ప్రారంభిస్తారు. శ్రీతీజ్శ్రీ అంటే గోధుమ మొలకలు అని అర్థం. మొదటి రోజు తండా పెద్దల సమక్షంలో గోధుమలు నానబెడతారు. అందంగా అల్లిన బుట్టల్లో మట్టిని నింపి, అందులో ఆ గోధుమ విత్తనాలను నాటుతారు. ఆ బుట్టలను గిరిజన తండాలోని నాయకుడి ఇంటి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచైపె (ఎత్తైన వేదిక) ఉంచుతారు. ప్రతిరోజూ స్వచ్ఛమైన నీటిని తీసుకొచ్చి మొలకల బుట్టలపై చల్లుతారు. తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యువతులు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ కఠిన నియమాలు పాటిస్తారు. ఈ సమయంలో తండాలో మద్యం, మాంసం మానేయడంతో పాటు ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం యువతులు గిరిజన సంప్రదాయ వస్త్రాలు (పేటియా కాంచలి) ధరించి తీజ్ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. తొమ్మిదో రోజుకు బుట్టల్లో ఆకుపచ్చని మొలకలు దట్టంగా పెరుగుతాయి. మొలకలు ఏపుగా పెరిగితే గిరిజనులకు శుభ ఫలితాలు అందుతాయని నమ్మకం. ఇలా అకుంఠిత దీక్షతో ఉంటే యువతులకు మంచి గుణగణాలు గల భర్త లభిస్తాడని ప్రగాఢ విశ్వాసం. వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటామని గిరిజనులు నమ్ముతారు. తొమ్మిదో రోజు గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్కు, మేరమ్మ యాడీ (పార్వతీ దేవి), భవాని మాతలకు ప్రత్యేక పూజలు చేసి బెల్లం, బియ్యంతో వండిన పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం తండా పెద్దల ఆశీర్వాదం తీసుకుని మొలకల బుట్టలను తలపై పెట్టుకుని నృత్యాలు చేస్తూ స్థానిక చెరువులు, కుంటల వద్దకు వెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో తండా యువతులకు వారి సోదరులు కానుకలు ఇస్తారు. భవిష్యత్తులో పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్లే అమ్మాయిలకు ఈ వేడుక ఒక భావోద్వేగభరితమైన వీడ్కోలుగా నిలుస్తుంది. -
నిష్ఠగా పూజలు చేస్తాం
దాటుడు పండుగతో ప్రారంభించే ఈ తీజ్ వేడుకలో పెళ్లి కాని యువతులం తొమ్మిది రోజులు నిష్ఠగా పూజలు చేస్తాం. మాంసాహారం మానేసి ఉపవాస దీక్షలు ఉంటాం. ఇలా దీక్షలో ఉంటే వర్షాలు బాగా కురుస్తాయి. పాడిపంటలు పండి మానవాళికి ఏ లోటూ లేకుండా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉంటారనేది మా నమ్మకం. – వడ్త్యా నందిని, బోయిన్పల్లి గిరిజన తండాల్లోని యువతులకు తీజ్ పండుగ అంటేనే ఖుషీ. ఈ వేడుక కోసం ఏడాదంతా ఎదురుచూస్తాం. మా సంప్రదాయ వస్త్రాలు ధరించి తీజ్ పండుగలో పాల్గొంటే ఆ అనుభూతే వేరు. బంధువులందరితో కలసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతాం. – రమావత్ వసంత, బోయిన్పల్లి తండాల్లోని యువతులు చదువు కోసం, ఉపాధి కోసం ఎక్కడా ఉన్నా తీజ్ పండుగకు తండా రావాల్సిందే. ప్రతి తీజ్ పండుగకు యువతులందరం గిరిజన ఆరాధ్య దైవాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తాం. తీజ్ చివరిరోజు మొలకల బుట్టలను నిమజ్జన సమయంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. తీజ్ పండుగతో గిరిజనులలో ఐక్యత, ప్రేమానుబంధాలు బలపడుతాయి. – వడ్త్యా శ్రావణి, బోయిన్పల్లి -
కొత్త ‘చేయూత’కు మార్గదర్శకాలు ఇవే..
ఫ పింఛన్ల ఎంపికకు గైడ్లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం ఫ ఈ నెల 15న కొత్త పింఛన్దారుల ఎంపిక ఫ జిల్లా కలెక్టర్లకు అందిన ప్రభుత్వ ఆదేశాలు ఫ అర్హతలు, అనర్హతలపై స్పష్టతనిచ్చిన సర్కారుఫ పూర్తిచేసిన అప్లికేషన్ ఫారం ఫ ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం ఫ రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఫ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఫ బ్యాంకు ఖాతా (పాస్బుక్) మొదటి పేజీ జిరాక్స్ సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో కొత్త శ్రీచేయూతశ్రీ పింఛన్ల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులతో పాటు తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా పింఛన్లు ఇవ్వనున్నారు. ఈ నెల 15న కొత్త పింఛన్దారులను ఎంపిక చేస్తారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. వీరు అర్హులు.. వితంతువులు (రూ.2,016): 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. ఒంటరి మహిళలు (రూ.2,016): వివాహిత మ హిళలైతే 18 ఏళ్లు నిండి, భర్త నుంచి విడిపోయి లేదా భర్త వదిలివేసిన పరిస్థితిలో ఉండాలి. విడిపోయిన కాలం ఏడాదికి పైబడి ఉండాలి. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు నిండి ఉండాలి. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ధ్రువీకరణ అవసరం. గీత కార్మికులు (రూ.2,016): 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. టాడీ ట్యాపర్ కో–ఆపరేటివ్ సొసైటీలో సభ్యత్వంతో పాటు ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ శాఖ ధ్రువీకరణ అవసరం. చేనేత కార్మికులు (రూ.2,016): 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. హ్యాండ్లూమ్స్ – టెక్స్టైల్స్ శాఖ నుంచి ధ్రువీకరణ పొందాలి. దివ్యాంగులు (రూ.4,016): వయస్సుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం అంగవైకల్యం ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం ఉండాలి. ఇందుకు ఆన్లైన్ విధానంలో జారీ చేసిన యూడీఐడీ, సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఫైలేరియా బాధితులు (రూ.2,016): వయస్సుతో సంబంధం లేదు. గ్రేడ్–2, గ్రేడ్–3 ఫైలేరియా బాధితులు అర్హులు. డీఎంహెచ్ఓ ద్వారా ధ్రువీకరణ అవసరం. డయాలసిస్ రోగులు (రూ.2,016): వయస్సుతో సంబంధం లేదు. డయాలసిస్ చికిత్స పొందుతున్న వారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నమోదు, ధ్రువీకరణ అవసరం. ఒంటరి మహిళలకు ప్రత్యేక నిబంధనలు.. ఒంటరి మహిళల విభాగంలో.. వివాహిత మహిళలు భర్త నుంచి విడిపోయిన లేదా భర్త వదిలివేసిన వారై ఉండాలి. విడిపోయిన కాలం కనీసం ఒక సంవత్సరం ఉండాలి. ఇందుకు విడాకుల పత్రం, కోర్టు ఉత్తర్వులు లేదా విడిపోవడానికి సంబంధించిన పత్రంతో పాటు తహసీల్దార్ నిర్వహించే స్థానిక విచారణ నివేదిక అవసరం. వీరు పింఛన్ పొందేందుకు అనర్హులు కుటుంబంలో 3 ఎకరాలకు మించి తరి (నీటిపారుదల) భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట (పొడి) భూమి ఉన్నవారు అనర్హులు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగం, ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే అనర్హులు. దరఖాస్తుదారుల పిల్లలు వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఉన్నత స్థాయి స్వయం ఉపాధిలో ఉంటే అనర్హులవుతారు. పెద్ద వ్యాపార సంస్థలు, ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, పెద్ద దుకాణాల యజమానులు. ఇప్పటికే ప్రభుత్వ పింఛను లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పొందుతున్నవారు. నాలుగు చక్రాల వాహనాలు (కార్లు, జీపులు), భారీ వాహనాలు (ట్రాక్టర్లు, లారీలు తదితర) ఉన్నవారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటిన వారు అనర్హులు. జీవనశైలి, వృత్తి, ఆస్తుల ఆధారంగా కుటుంబం అనర్హమని విచారణ అధికారి భావించిన పక్షంలోనూ పింఛను నిరాకరించే అవకాశం ఉంది. -
రైతు పద్మారెడ్డిని అభినందించిన మంత్రి
చందంపేట : మండలంలోని పోలేపల్లికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డిని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం హైదరాబాద్లో అభినందించారు. పద్మారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కుంకుడు సాగుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన బత్తాయి సాగు అభివృద్ధికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల నాగపూర్లోని సిట్రస్ రీసెర్చ్ సెంటర్లో ఘనంగా సన్మానించారు. రైతు పద్మారెడ్డి సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల పండిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న పద్మారెడ్డిని ఇప్పటికే పలు అవార్డులు వరించాయి. జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికమోతె : మోతె మండల కేంద్రానికి చెందిన అప్పల వరుణ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో వరుణ్ పాల్గొని ద్వితీయ స్థానం పొంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పంజాబ్లో జరగనున్న జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. వరుణ్ను సూర్యాపేట జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ గడ్డం వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చెరుకు వెంకటేష్, కోచ్ పరమేష్ తదితరులు అభినందించారు. -
బడ్జెట్ తగ్గేలా రీడిజైన్
సాక్షి, యాదాద్రి: రెండున్నర దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న ‘బునాదిగాని కాలువ’ ఆధునీకరణ పనుల్లో ప్రజాధనం, రైతు భూములు వృథా కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును తక్కువ వ్యయంతో, శాసీ్త్రయంగా పూర్తి చేయడానికి రీడిజైన్ చర్యలు చేపట్టింది. భూసేకరణ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, అందుబాటులో ఉన్న భూమి పరిధిలోనే పనులు పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అత్యధికంగా భూసేకరణ చేశారని విమర్శలు గతంలో కాల్వకు తీసిన మట్టిదిబ్బలు (స్పోయిల్ బ్యాంక్), సర్వీస్ రోడ్ల పేరుతో అత్యధికంగా భూసేకరణ చేశారని విమర్శలు ఉన్నాయి. దాదాపు 20 మీటర్లు (70ఫీట్లు) కేవలం స్పోయిల్ బ్యాంక్ కోసమే కేటాయించడంతో బీబీనగర్ మండలంలోని రైతులు విలువైన భూములు కోల్పోవాల్సి వచ్చింది. గతంలో 40 మీటర్ల వెడల్పు సరిపోయే చోట ఏకంగా 80 మీటర్ల వరకు కెనాల్ను పెంచి భూసేకరణ చేపట్టారు. తీసిన మట్టి ప్రస్తుతం ఎక్కడా లేకపోగా, అదనపు భూసేకరణ కారణంతో పనులను ఏళ్లుగా వాయిదా వేస్తూ వచ్చారు. సగానికి పైగా తగ్గనున్న బడ్జెట్ అనవసరమైన మట్టిదిబ్బల కేటాయింపులను రద్దు చేసి, కాలువ పరిధిలోని భూమిలోనే పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టు వ్యయం సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది. గతంలో రూ.100 కోట్లుగా అంచనా వేసిన బడ్జెట్, పరిమిత భూసేకరణతో రూ.40 కోట్ల లోపే పూర్తవుతుందని అంచనా. మొత్తం 752 ఎకరాల సేకరించే ప్రక్రియలో 435 ఎకరాలు అవార్డు కాగా.. ఇంకా అవసరమని చెబుతున్న 317 ఎకరాల భూసేకరణను రద్దు చేస్తే, వివాదాలు తగ్గి పనులు వేగవంతం కానున్నాయి. 10 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం కాలువ రూపురేఖలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 10 రోజుల్లో డీపీఆర్ నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్, ఈఎన్సీలతో 15 రోజుల్లో మరోసారి సమీక్షించనున్నారు. బునాదిగాని కాలువ ఫ బునాదిగాని కాలువ సమస్యకు శాసీ్త్రయ పరిష్కారం ఫ రూ.100 కోట్ల అంచనా వ్యయం రూ.40 కోట్లకు కుదింపు ఫ అందుబాటులో ఉన్న భూమి పరిధిలో పనులు పూర్తిచేయాలని స్పష్టం చేసిన ఎమ్మెల్యే -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
నల్లగొండ : తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించారు. సీసీ ఫుటేజీ ఆధారంతో చిక్కిన దొంగ జూలై 26న నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీలో గల ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటనపై నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఈనెల 6న పానగల్ బైపాస్ వద్ద ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్ను అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి రూ.3.25 లక్షల నగదు, స్కూటీ, రెండు ఇనుప రాడ్లు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇర్షాద్, షరీఫ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రెక్కీ నిర్వహించి పగటి పూట దోపిడీ ఈ ముఠా ముందుగా తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించేవారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, పగటి సమయంలోనే ఇనుప రాడ్లతో తాళాలు పగులగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లేవారు. నల్లగొండలో నసీమ్, ఇర్షాద్ స్కూటీపై రాగా, షరీఫ్ కారులో వచ్చి బయట కాపలాగా ఉండేవాడని విచారణలో తేలింది. నల్లగొండతో పాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వేదాయపాలెం, తిరుపతిలోని తిరుచానూరు ప్రాంతాల్లోనూ వీరు చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసు బృందానికి అభినందనలు డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కేసును వేగంగా ఛేదించిన వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐలు సైదబాబు, ముత్తయ్య, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు. పాత నేరస్థుడే ప్రధాన సూత్రధారి ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్కు నేర చరిత్ర ఉంది. గతంలో ఢిల్లీ, మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతాల్లో అనేక చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం హైదరాబాద్లోని రాయదుర్గం, ఉప్పల్, మల్కాజిగిరి ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడి చర్లపల్లి జైలులో రెండేళ్లు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్లోని అత్తాపూర్లో నివాసం ఉంటూ తిరిగి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఫ రూ.3.25 లక్షల నగదు, స్కూటీ స్వాధీనం ఫ పరారీలో మరో ఇద్దరు నిందితులు ఫ వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రమేష్ -
నేతన్నలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే
చండూరు: చేనేత వృత్తిపై ఆధారపడిన కార్మికులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం చండూరులో చేనేత సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చేసిన చేనేత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాష్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేతతో కలిసి పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన అభిమాన నాయకుడు కొండాలక్ష్మణ్ బాపూజీ అని.. ఆయన ప్రాతినిధ్యం వహించిన స్థానంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అదృష్టమన్నారు. గత ప్రభుత్వం సొసైటీలకు ఎన్నికలు నిర్వహించలేదని, కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని, ఇప్పుడున్న ప్రభుత్వానికి సంకల్పం ఉంది కాబట్టే ఎన్నికలు పెట్టామని తెలిపారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు పెన్షన్లు, రుణాలు, అర్హులకు జియో ట్యాగ్స్, ఆప్కో ద్వారా చేనేత చీరల విక్రయం లాంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు పున్నా ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
ఆకుపాములలో విషాదఛాయలు
మునగాల: ముకుందాపురం గ్రామ స్టేజీ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. సకాలంలో 108 అంబులెన్స్ రాకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గౌరారపు ఎలమంద (65), ఆయన పెద్ద కుమారుడు గౌరారపు లింగయ్య (45)తో కలిసి ద్విచక్ర వాహనంపై నడిగూడేనికి వెళ్లి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ముకుందాపురం గ్రామ స్టేజ్ శివారు వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయగా, మునగాల మండల వాహనం అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. చివరికి కోదాడ నుంచి వేరే వాహనం వచ్చేసరికే లింగయ్య మృతిచెందాడు. తండ్రి ఎలమందను అంబులెన్స్లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనపై మృతుడు లింగయ్య సోదరుడు గౌరవరపు కోటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇరువురి మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులు అప్పగించామని ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. అంత్యక్రియలు పూర్తి ఎలమంద (65) వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె, ఉన్నారు. ఎలమంద పెద్ద కుమారుడు లింగయ్య(45) వృత్తిరీత్యా లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య , కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆకుపాములలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. వారి అంత్యక్రియలు శుక్రవారం గ్రామంలో నిర్వహించారు. ఫ రోడ్డుప్రమాదంలో తండ్రీకుమారుడికి తీవ్ర గాయాలు ఫ అక్కడికక్కడే కుమారుడు మృతి ఫ ఆస్పత్రికి తరలిస్తుండగా తండ్రి దుర్మరణం ఫ సుమారు గంటన్నర పాటు ఘటనా స్థలానికి చేరుకోని 108వాహనం -
కాంగ్రెస్ కార్యకర్తల్లా మారిన అధికారులు
చౌటుప్పల్ : నియోజకవర్గంలోని అధికార యంత్రాంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా మారారని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ సర్పంచ్లకు ప్రభుత్వ నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ సర్పంచ్లు ఉన్న గ్రామాలకే తరలించుకుపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌటేప్పల్లో నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఆర్డీఓను నిలదీశారు. ఈ సందర్భంగా గంగిడి మనోహర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే అన్న విషయాన్ని మరచి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చౌటుప్పల్లో ఓపెన్ బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉన్నప్పటికీ మట్టికట్టతో కూడిన అండర్పాస్ బ్రిడ్జి రావడానికి ఎమ్మెల్యే చేతగానితనమే కారణమన్నారు. ఇకపై వివక్ష లేకుండా నిధులు కేటాయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్శిత్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరు వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, సీనియర్ నాయకులు శాగ చంద్రశేఖర్రెడ్డి, రమనగోని శంకర్, సర్పంచ్లు కై రంకొండ స్వప్నఅశోక్, తంగెళ్ల వెంకటేశం, నందగిరి వెంకటేశం, టేకుల మంజులదిలీప్రెడ్డి, బోయ దేవేంద్రమణికుమార్, సుర్వి సౌజన్యరాజు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఫ బీజేపీ సీనియర్ నేత మనోహర్రెడ్డి -
రైతులు సమీకృత సాగు చేపట్టాలి
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి సాక్షి, యాదాద్రి : రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా సమీకృత వ్యవసాయ విధానం అవలంబించి స్థిరమైన ఆదాయం పొందాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రతి రైతు తమ వ్యవసాయ క్షేత్రంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ పాండ్ ఏర్పాటు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఏఓ రమణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వైభవంగా ఊంజల్ సేవయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని విశేషంగా అలంకరించిన అర్చకులు భజా భజంత్రీల నడుమ తిరు మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. అనంతరం అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించిహారతినిచ్చారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయండిభువనగిరిటౌన్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినీ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే ఈ వేడుకల్లో వీఐపీలు, ప్రజలకు ఇబ్బంది లేకుండా సీటింగ్తోపాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా శకటాలు, ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్రెడ్డి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వావలంబన సాధించాలిభూదాన్పోచంపల్లి : స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని రాష్ట్ర సెర్ప్ ఐటీ డైరెక్టర్ విశ్వేశ్వరరావు అన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామాన్ని ఇందిర మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా సెర్ప్ ఐటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మహిళలకు డిజిటల్ లావాదేవీలు, మహిళా సంఘాల అప్పులు, పొదుపు, మన పుస్తకం యాప్ ద్వారా చెల్లింపులపై అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ కోట జంగారెడ్డి, డీపీఎం సుధాకర్, సర్పంచ్ మచ్చ సుధాకర్, ఏపీఎం తవుర్యా నాయక్, సంఘబంధం అధ్యక్షురాలు ఎల్దండి ప్రశాంతి, మహిళా సంఘాల మహిళలు, వార్డుసభ్యులు పాల్గొన్నారు. వయోవృద్ధులను ఆదుకోవాలిభువనగిరి : వయోవృద్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలో గల సహృదయ అనాథ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అనంతరం వృద్ధులు, ఆశ్రమ నిర్వాహకులతో ముచ్చడించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ్రమంలో ఉంటున్న వైకల్యం ఉన్న వయోవృద్ధులకు వైద్య సేవలందించడంతో పాటు వారి పేర్లను మిస్సింగ్ పోర్టులో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ చెంత మహా వరుణయాగం
ఫ నాగార్జునసాగర్లో 10వ తేదీన నిర్వహణ ఫ వర్షాలు కురవాలని యాగం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఫ స్వయంగా పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి ఫ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా అధికారులుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్లో మహావరుణ యాగాన్ని తలపెట్టింది. ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున విజయవిహార్ ఆవరణలో ఈ మహాయాగం నిర్వహించనున్నారు. యాగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా పాల్గొననుండగా, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణయాగం నిర్వహించనున్నారు. దేవస్థాన పాలకమండలి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇంతటి స్థాయిలో వరుణయాగం నిర్వహిస్తుండడం విశేషం. యాగం విజయవంతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టగా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి యాగ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. 10వ తేదీ మధ్యాహ్నంఈనెల 10వ తేదీన మధ్యాహ్నం నుంచి యాగ కార్యక్రమాలు ప్రారంభమై, సాయంత్రం 3.20 నుంచి 3.24 గంటల మధ్య పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ మహాయాగంలో 108 మంది ఋత్విక్కులు, వేద పండితులు, అర్చక బృందం వర్ష పాశుపత వరుణ యాగంలోని విశేష మంత్రాలతో 11 హోమ గుండాల్లో ప్రత్యేక వేద మంత్రోచ్ఛరణల మధ్య హోమాలు నిర్వహించనున్నారు. వర్షాలు కురవాలనిరాష్ట్రంలో ఎల్నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయి, విస్తారంగా వర్షాలు కురవాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, జలాశయాలు నిండాలని ప్రభుత్వం ఈ యాగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందేలా జలాశయంలో సమృద్ధిగా నీరు చేరాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. ముమ్మరంగా ఏర్పాట్లు.. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నప్పటికీ, శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు ఇంకా ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం ప్రారంభం కాలేదు. దీంతో సాగర్ ఇంకా డెడ్ స్టోరేజ్కే పరిమితమై ఉంది. మరో వారం రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండితే సాగర్కు నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాగాన్ని తలపెట్టింది. ఇప్పటికే జిల్లా అధికారులు, దేవాదాయ, ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు యాగ వేదిక వద్ద ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత, రాకపోకలు, వాహన పార్కింగ్, వేదిక, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పరిశీలించారు. -
ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలి
భువనగిరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. సీపీఎం సీనియర్ నాయకుడు రాసాల వెంకటేష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం రాత్రి భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో స్తూపం ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో జాన్వెస్లీ మాట్లాడారు. నీట్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేసిన విద్యార్థులు, యువకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం రోజురోజుకు విద్య, వైద్యం వ్యాపారంగా మారుస్తుందని ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, బాలరాజు, మల్లేశం, పాండు, కృష్ణారెడ్డి, నర్సింహ, పల్లెర్ల అంజయ్య, సర్పంచ్ మచ్చ భిక్షపతి, మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, శ్రీశైలం, భాస్కర్ పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
బెల్టు దుకాణాలు నిషేధించాలని నిరసన
ఆలేరురూరల్: కొలనుపాక గ్రామంలో బెల్టు షాపులు నిషేధించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరులో ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట సర్పంచ్ బెదరబోయిన యాకమ్మవెంకటేష్ ఆధ్వర్యంలో పాలకవర్గం, ప్రజలు నిరసన తెలిపారు. వారు మాట్లాడు తూ.. గ్రామంలో బెల్టు షాపులు నిషేధించాలని ఇటీవల గ్రామ సభలో తీర్మానం చేసిన కాపీని ఎకై ్సజ్, పోలీస్శాఖలకు అందజేసినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు మల్లేష్, తేరాల బాలశంకర్, రమేష్, పల్లె సంపత్ పాల్గొన్నారు. -
వ్యవసాయంలో కొత్త విప్లవం
రామగిరి (నల్లగొండ): వరి, ఇతర పంటల సాగులో శ్రమతో కూడుకున్న పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ, రైతాంగానికి ఆశాకిరణంగా సగుణా రీజెనరేటివ్ టెక్నిక్ (ఎస్ఆర్టీ) నూతన వ్యవసాయ విధానం అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయకంగా చేసే దుక్కి దున్నడం, బురద చేయడం, నాట్లు వేయడం వంటి అవసరం లేకుండానే ఈ పద్ధతి ద్వారా సమర్థవంతంగా సాగు చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ‘సగుణా బాగ్’ అధినేత చంద్రశేఖర్ హరిబావు భడ్సావ్లే ఈ వినూత్న విధానాన్ని అభివృద్ధి చేయగా, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ( ఊఅౖ) దీనిని గుర్తించి ప్రశంసించింది. శుక్రవారం ఈ ఎస్ఆర్టీ సాగు విధానాన్ని నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామంలో శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆవిష్కర్త చంద్రశేఖర్ స్వయంగా హాజరై, హ్యాండ్ పుషింగ్ సీడర్ ద్వారా విత్తనాలు జల్లే విధానాన్ని ప్రదర్శించారు. ఏమిటీ ఎస్ఆర్టీ.. ● ఎస్ఆర్టి అనేది ఎలాంటి దుక్కి దున్నాల్సిన అవసరం లేని పునరుత్పత్తి వ్యవసాయ విధానం ● ఈ పద్ధతిలో పొలంలో ఒక్కసారి పర్మినెంట్ బెడ్స్ తయారు చేసుకుంటే, వాటిపైనే వరుసగా ఏళ్ల తరబడి పంటలు వేసుకోవచ్చు. ● వరితో పాటు పప్పుధాన్యాలు, పత్తి, వేరుశనగ, కూరగాయలు, మొక్కజొన్న, గోధుమలు వంటి దాదాపు 22 రకాల పంటలను ఈ బెడ్స్పై సాగు చేయొచ్చు. ప్రయోజనాలు ● దుక్కి దున్నడం, నాట్ల శ్రమ లేకపోవడంతో పెట్టుబడి, కూలీల ఖర్చు సగానికి పైగా ఆదా అవుతుంది. ● సంప్రదాయ పద్ధతితో పోలిస్తే నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది. వర్షాభావం, భారీ వర్షాలను సైతం తట్టుకునే శక్తి పంటకు లభిస్తుంది. ● పాత పంట వేళ్లను నేలలోనే ఉంచడం వల్ల సేంద్రియ కర్బనం, వానపాములు, మిత్ర సూక్ష్మజీవులు పెరిగి భూమి నిరంతరం సారవంతమవుతుంది. ● పంట 8 నుంచి 10 రోజులు త్వరగా చేతికి వస్తుంది. ఒకే సంవత్సరంలో వరుసగా 3 పంటలు తీసి ఆదాయాన్ని మూడింతలు చేసుకోవచ్చు. ● ట్రాక్టర్ల వాడకం తగ్గడం వల్ల డీజిల్ ఆదా అవ్వడమే కాక, బురద చేయకపోవడం వల్ల హానికర మిథేన్ ఉద్గారాలు నిరోధించబడతాయి. ఫ దుక్కి దున్నడం, నాట్లు వేయడం లేకుండానే లాభసాటి పంటలు ఫ సగుణా రీజనరేటివ్ టెక్నిక్తో సగానికి తగ్గుతున్న పెట్టుబడి ఫ మేళ్ల దుప్పలపల్లిలో సాగు పద్ధతిని ప్రారంభించిన ఆవిష్కర్త చంద్రశేఖర్ భడ్సావ్లేమేళ్ల దుప్పలపల్లిలో నిర్వహించిన ఎస్ఆర్టీ రైతు శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒకే విధానంలో పలు రకాల లాభదాయక పంటలను పండించే మార్గాలపై అవగాహన కల్పించారు. పొలంలో ప్రత్యక్ష ప్రదర్శనలు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్ఆర్టీ విధానంతో నేలను దున్నకుండానే పంటలను పండించడం ద్వారా రైతులకు శ్రమ తగ్గడంతో పాటు, ఇంధనం, సాగు ఖర్చులు భారీగా తగ్గుతాయని తెలిపారు. సహజసిద్ధంగా నేల గుల్లబారి, భూమిలోని పోషకాలు దెబ్బతినకుండా నేల సారవంతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎస్ఆర్టీ ప్రతినిధులు వెంకట్ రావు, పుట్ట జనార్దన్రెడ్డి, వినోద్ రెడ్డి, నామిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల యుగేంధర్, రైతులు, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. -
చేనేతల సంక్షేమానికి ప్రాధాన్యం
సాక్షి, యాదాద్రి : చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం రాయగిరి క్రాస్ రోడ్డు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు సుమారు 400 మంది చేనేత కార్మికులతో హ్యాండ్లూమ్ వాక్ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంలతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా పోచంపల్లి ఇక్కత్ చీరల ప్రామాణికతను కాపాడేందుకు రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డూప్లికేట్ ఇక్కత్ చీరలను తయారీని అరికట్టేందుకే ప్రభుత్వం క్యూఆర్ కోడ్ను తెచ్చిందన్నారు. ఆధునిక డిజైన్ల తయారీకి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, చేనేత జౌళి శాఖల మధ్య పోచంపల్లిలో డిజైన్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన చేనేత ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో నిలబెట్టేందుకు నూతన సాంకేతికతను జోడిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన 3 జాతీయ అవార్డులు భువనగిరి జిల్లా వాసులనే వరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న కలెక్టర్ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం నేతన్న భరోసా పథకం కింద రూ.3,29,16,000, చేనేత రుణ మాఫీ పథకం కింద రూ.19,24,84,200తో కలిసి మొత్తం రూ.22.54 కోట్లను లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. చేనేత కార్మికులను సన్మానించారు. వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. భోజన వసతిపై అసంతృప్తి అధికారులు చేనేత కార్మికులకు సరిపడా భోజన వసతి కల్పించకపోవడంతో కార్మికులు ఆకలితోనే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ అధికారి శ్రీనివాస్, యునైటెడ్ వే ఆఫ్ తిని ధులు రేఖ శ్రీనివాసన్, అనంతిక సింగ్, జెడ్పీ సీఈఓ శోభారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి ఫ భువనగిరిలో జాతీయ చేనేత దినోత్సవం -
భువనగిరిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని గంజ్ ఏరియాలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం వేకువజామున ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితుడు ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించేందుకు యత్నించాడు. రోజువారీ పెట్రోలింగ్ విధుల్లో భాగంగా వస్తున్న పోలీసులను గమనించి దుండగుడు బైక్పై పరారయ్యారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. మహిళపై కోతుల దాడిమోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో టి.మానస అనే మహిళపై శుక్రవారం కోతులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా గురువారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై కూడా కోతులు దాడి చేశాయని, పంట పొలాల్లోనూ నష్టం కలిగిస్తున్నాయని వాపోయారు. కోతుల బెడదను నివారించాలని కోరుతున్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిభువనగిరి: విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకుల మహేష్(40) శుక్రవారం ఇంటి వద్ద నీటి సంపు మోటార్ను ఆన్చేసే క్రమంలో విద్యుత్ షాక్ రావడంతో కిందపడిపోయాడు. ఆయన భార్య మాధవి గ్రామంలో ఉన్న కిరాణం దుకాణాకి వెళ్లి ఇంటికి వచ్చే సరికి భర్త కిందపడి ఉండడాన్ని గమనించి చికిత్స నిమిత్తం భువనగిరిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. అదుపుతప్పి బొలేరో వాహనం బోల్తాచిట్యాల: హైదరాబాద్ నుంచి ఏలూరులోని జంగారెడ్డిగూడేనికి ప్లాస్టిక్ కుర్చీల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం శుక్రవారం చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని పంజాబీ దాబా సమీపంలోకి రాగానే స్టీరింగ్ రాడ్ పిన్ ఊడిపోవటంతో అదుపుతప్పింది. దీంతో డివైడర్ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. రోడ్డుపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బొలేరో వాహనాన్ని క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. -
చేయూతకు పచ్చజెండా
కొత్త పింఛన్లకు నేటి నుంచే దరఖాస్తులు ప్రభుత్వం ముందుగా ఏడు రకాల ప్రత్యేక పింఛన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు (సింగిల్ ఉమెన్), ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ.. వాటికి తర్వాతి దశలో ప్రాధాన్యతను ఇస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల పరిశీలనను పక్కన పెట్టారు. వీటిపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అలాగే, ఆరోగ్యాధారిత పింఛన్ల కింద తలసేమియా, సికిల్ సెల్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సంబంధించి కూడా ప్రభుత్వం పింఛన్లు ఇవ్వనుంది. సాక్షి, యాదాద్రి : అర్హులైన నిరుపేదలకు అందించే చేయూత పింఛన్ల మంజూరుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పింఛన్ ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ లాగిన్లు ఓపెన్ అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 15 నాటికి అర్హులను ఎంపిక చేసి, సెప్టెంబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 95,296 మంది చేయూత పింఛన్దారులు ఉన్నారు. కొత్త నమూనాలోనే దరఖాస్తులు.. పింఛన్ కోసం అర్హులు గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్లోనే దరఖాస్తు చేయడం తప్పనిసరి. గతంలో ప్రజాపాలన, మీసేవ కేంద్రాల్లో లేదా సాధారణ తెల్ల కాగితాలపై దరఖాస్తు చేసిన వారు కూడా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్లోనే వివరాలు సమర్పించాలి. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలకు ఈ కొత్త దరఖాస్తు ఫారాన్ని జత చేసి సమర్పిస్తే సరిపోతుంది. లబ్ధిదారుల ఆన్లైన్ నమోదుకు వీలుగా దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్, సమగ్ర వ్యక్తిగత వివరాలను ఈ ఫారంలో పొందుపరిచారు. ఎక్కడ దరఖాస్తు చేయాలంటే.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో.. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయవచ్చు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఆన్లైన్ లాగిన్లో నమోదు చేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డీఆర్డీఓ ద్వారా కలెక్టర్ పరిశీలనకు పంపి, తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. ముగింపు తేదీ లేదు.. ఈ దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి చివరి తేదీ (డెడ్లైన్) లేదు. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.ఫ ఆగస్టు 15 నాటికి ఎంపిక.. సెప్టెంబర్లో పంపిణీ ఫ ముందుగా ఏడు రకాల పింఛన్లకే ప్రభుత్వ ప్రాధాన్యం ఫ దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు లేదు -
ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి
భువనగిరి : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్స్చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ర్యాలీలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు చింతల శివ, పట్టణ అధ్యక్షుడు నేహల్, నాయకులు జీవన్, సాయి, ప్రసాద్, స్నేహ, శరత్, మధన్, ప్రసన్న శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు అస్తవ్యవస్తంగా మారిన పారిశుద్ధ్యాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చెరువు, పెద్ద మోరీ, యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు వెళ్లే రహదారి పనుల ఆలస్యానికి గల కారణాలు, డ్రెయినేజీ నిర్మాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. పట్టణంలోని బాలిక సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి, విద్యార్ధినిలతో కలిసి ఉదయం భోజనం చేశారు. మంత్రి కొండా సురేఖ సూచనలతో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్ధినులకు తీసుకువచ్చిన కుర్చీలు, నోట్బుక్స్, టిఫిన్ బాక్స్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణిభరత్గౌడ్, వైస్ చైర్పర్సన్ రమ్య, కమిషనర్ శ్రీనివాస్, ఎంఈవో శరత్ యామిని, ఎంపీడీవో నవీన్ కుమార్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
రాష్ట్రంలో త్వరలోనే జెన్ జీ ఉద్యమం
భువనగిరి : యువతను అణిచివేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే జెన్ జీ ఉద్యమం రాబోతోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల విద్యార్థులు, యువత ఢిల్లీలో చేసిన జెన్ జీ ఉద్యమంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని కదించడంతో పాటు కేంద్ర మంత్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిండచంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఏఐ కాదు ఏనుముల ఇంటెలిజెన్స్ మాత్రమే పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, నాయకులు సూరేపల్లి రమేష్, సందెల సుధాకర్, ఇట్టబోయిన గోపాల్, ఓంప్రకాష్, అబ్బగాని వెంకట్, ర్యాలక శ్రీనివాస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్రెడ్డి -
రెవెన్యూ డివిజన్పై తప్పదోవ పట్టిస్తున్న ఎమ్మెల్యే
ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆలేరు : ఆలేరు రెవెన్యూ డివిజన్ అంశాన్ని పక్కనపెట్టి అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. శుక్రవారం ఆలేరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆలేరు రెవెన్యూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా గెలిచి 31 నెలలు గడిచినా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రెవెన్యూ డివిజన్ అవసరాన్ని గుర్తించి తానే అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా జిల్లా కలెక్టర్కు ఫిజిబిలిటీ నివేదిక కోరగా, జిల్లా యంత్రాంగం కూడా డివిజన్ ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక పంపిందని వివరించారు. రెవెన్యూ డివిజన్ ఫైల్ సిద్ధంగా ఉందని, ఈ ఫైల్ ఆధారంగా వంద రోజుల్లో డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పుట్ట మల్లేష్గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కోమల్ల మౌనిక, జెల్లి నర్సింహులు పాల్గొన్నారు. -
స్టీల్ పళ్లెం లేదంటే.. మట్టి పాత్రలో భోజనం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా వెంకటేశ్వర్లు ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లలో తినవద్దని, ప్లాస్టిక్, పేపర్ గ్లాసులలో టీ, నీళ్లు తాగవద్దని నిర్ణయించుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, ఫంక్షన్లు, సభలు, సమావేశాలకు ఎటు వెళ్లినా తన వెంట మట్టిపాత్ర లేదా స్టీల్ పళ్లెం, స్టీల్ గ్లాస్తో వెళతారు. ఇటీవల ఉపాధ్యాయుల శిక్షణకు సూర్యాపేట మండలం కుడకుడ జడ్పీహెచ్ఎస్కు వెళ్లారు. అక్కడ పేపర్ ప్లేట్లలో భోజనం పెడుతుండగా తన వెంట తీసుకెళ్లిన మట్టిపాత్రలో భోజనం చేసి స్టీల్ గ్లాస్లో నీటిని తాగారు. దీంతో అక్కడకు శిక్షణకు వచ్చిన ఉపాధ్యాయులంతా వెంకటేశ్వర్లు వైపే ఆసక్తిగా చూశారు. తాను ఆచరించటంతో పాటు పాఠశాలలో విద్యార్థులను కూడా ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లు, గ్లాసులకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వారిని కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు. -
చేనేత సంఘం అభివృద్ధికి కృషి చేయాలి
భూదాన్పోచంపల్లి: న్యూఢిల్లీలోని భీమ్హాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన జీఐ, అండ్ బీయాండ్ 2.0 సమ్మేళనంలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శించారు. ఈ సమ్మేళనానికి కేంద్ర చేనేత, జౌళిశాఖ మంత్రి పబిత్ర మార్గేరీటా, జౌళిశాఖ కార్యదర్శి నీలం షమీరావు, డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్ మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్ పోచంపల్లి చేనేత సహకార సంఘానికి కేంద్రం నుంచి రావాల్సిన 50 శాతం కార్పస్ ఫండ్ సుమారు రూ.37 లక్షల బకాయిలు విడుదల చేసి, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని చేనేత డెవలప్మెంట్ కమిషనర్ మీనాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్ ఉన్నారు. -
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
మరిపెడ రూరల్: ఒడిశా నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.12 లక్షల విలువైన గంజాయితో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ పవన్ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం మరిపెడ ఎస్సై సతీశ్, సిబ్బంది రవీందర్, రమేశ్, వెంకన్న, మహిళా కానిస్టేబుల్ శాంత మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులో ఉన్న వారు తప్పించుకోవడానికి యత్నించారు. అప్రమత్తమై పోలీసులు కారును నిలిపి తనిఖీ చేశారు. అందులో డ్రైవర్ సీటు కింద 2 కిలోల 240 గ్రాముల గంజాయి లభించింది. కారులో ఉన్న నల్లగొండ జిల్లా కనగల్ గ్రామానికి చెందిన గండికోట వంశీ, చిత్రం రాకేశ్, చింతల తిరుమలేశ్, కంచి మహేశ్, మాదాసు మహేశ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండలో సెల్ఫ్ డ్రైవ్కు కారును అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి నల్లగొండలో విక్రయించేందుకు వస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. 2.24 కిలోల గంజాయి, కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన మరిపెడ సీఐ -
ఆకస్మికంగా అస్వస్థతకు గురై రైతు మృతి
రామన్నపేట: పొలం పనులు ముగించుకుని వచ్చిన రైతు ఆకస్మికంగా అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య(46) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం భార్య, కుమారుడితో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి 8గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేశాడు. నిద్రకు ఉపక్రమించే సమయంలో నోటి నుంచి నురగలు వచ్చి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స చేస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. పొలం వద్ద విషపురుగు కరిచి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
నూలుపోగుల నవ్యశోభ
సరికొత్త ఆవిష్కరణలతో చేనేత కళకు జీవం ఈ చిత్రంలోని వ్యక్తి పోచంపల్లికి చెందిన రాపోలు శ్రీనివాస్. 8వ తరగతిలోనే చదువు మానేశాడు. 16 ఏళ్ల వయస్సులో మగ్గం నేయడం ప్రారంభించాడు. 30 ఏళ్లుగా చేనేతలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని చేనేత రంగంలో రాణిస్తున్నాడు. తాను ఉపాధి పొందుతూనే మరో 70 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాడు. 50 మగ్గాలను నిర్వహిస్తూ ఆధునిక పద్ధతులు పాటిస్తూ డిమాండ్కు తగ్గ వస్త్రాలను రూపొందిస్తున్నాడు. వస్త్రోత్పత్తులను తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు.భూదాన్పోచంపల్లి: అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసిన ఘనకీర్తి మన నేతన్నలది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి కేంద్రంగా చేనేత పరిశ్రమ ఏర్పడి సరిగ్గా 70 ఏళ్లు పూర్తవుతోంది. ఈ ఏడు దశాబ్దాల కాలంలో చేనేత పరిశ్రమ అనేక ఆర్థిక ఆటుపోట్లను, కరోనా లాంటి తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొని నిలబడింది. మారుతున్న కాలానికి అనుగుణంగా నేతన్నలు సరికొత్త ఆవిష్కరణలతో చేనేత కళకు జీవం పోస్తూ పరిశ్రమను నిలుపుకొస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి జీవనాధారంగా నిలుస్తున్న రంగం చేనేత కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 35వేలకుగా కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. చేనేతలో వినూత్న ఆవిష్కరణలుపోచంపల్లి వస్త్రాలకు 2003లో కేంద్ర ప్రభుత్వం శ్రీజియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) హక్కులను కల్పించింది. ఇందులో పోచంపల్లి చేనేత 11 రకాల డిజైన్లకు రిజర్వేషన్లతో పాటు చేనేత వస్త్రాలైన చీరలు, రుమాలు, కార్పేట్, బెడ్షీట్స్, మ్యాట్స్కు పేటెంట్ హక్కు కల్పించింది. దారం పోగుపై డిజైన్ వేసి ‘టై అండ్ డై’ పద్ధతిలో వస్త్రాలు నేయడం ఇక్కడి చేనేత కళాకారుల ప్రత్యేకత. 1956లో పోచంపల్లి కేంద్రంగా చేనేత పరిశ్రమ ఏర్పడిన తొలినాళ్లలో పాన్పటోలా, రాజస్థాన్, నారీకుండీ, ఏనుగు, చిలుక, అంబారీ, సీతాగీతా లాంటి సాంప్రదాయ చేనేత డిజైన్లతో వస్త్రాలను నేసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా రాజ్కోట్ డిజైన్లతోనే మడ్తాస్ చీరలు, సబర్పురి ఇక్కత్, బాందినీ ఇక్కత్ చీరలు, ట్విల్ చీరలు, పైతానీ, నారీకుంజీ, నవరత్న్ పటోల, పుల్ టిష్యూ, పోచంపల్లి ఇక్కత్లోనే గద్వాల, కంచి, ధర్మవరం డిజైన్లు కల్గిన వినూత్నంగా వస్త్రాలను రూపొందిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్పైనే జిల్లాలో ప్రధానంగా భూదాన్పోచంపల్లితో పాటు చౌటుప్పల్, కొయ్యలగూడెం, నారాయణపురం, పుట్టపాక, రామన్నపేట, రాజాపేట, మోత్కూర్, గుండాల, ఆలేరు, పుట్ట పాక, గట్టుప్పల, చండూర్, నల్లగొండ తదితర ప్రాంతాలలో పట్టు, కాటన్ వస్త్రాలు తయారు చేస్తున్నారు. కరోనా తరువాత వందలాది మంది యువత వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ ద్వారా ఆన్లైన్ వస్త్ర వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు● గడిచిన ఏడాది కాలంలో కిలో నూలు ధర రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. దీనికి అనుగుణంగా చీరల ధరలు పెంచలేక కార్మికులు గిట్టుబాటు కోల్పోతున్నారు. ● నూలు, ముడిసరుకుపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5శాతం జీఎస్టీ భారంగా మారింది. ● సూరత్, గుజరాత్ మిల్లుల్లో ఇక్కత్ డిజైన్లను ప్రింట్ చేసి తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో చేనేత రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ● చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రోత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి సరైన సదుపాయాలు, అవగాహన లేక స్టాక్ నిలిచిపోయి, కార్మికులకు చేతినిండా పనికల్పించలేకపోతున్నారు. ● నూలుపై గతంలో ఉన్న 40శాతం సబ్సిడీని ఎత్తివేయడం, నేతన్న చేయూత పథకం సరిగ్గా అమలు కాకపోవడం నేత కార్మికులను కుంగదీస్తోంది.చేనేత కార్మికుల విజ్ఞప్తులు ఇవే.. u నూలు ధరలను నియంత్రించి, 40 శాతం సబ్సిడీతో నేరుగా డిపోల ద్వారా నూలు అందించాలి. u ధాన్యం కొనుగోలు తరహాలోనే నేతన్నలు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే ‘టెస్కో’ ద్వారా పూర్తిగా కొనుగోలు చేయాలి. u కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో పట్టు చీరలను, స్కూల్ యూనిఫారమ్లకు చేనేత దుస్తులను ప్రభుత్వమే సరఫరా చేయాలి. u చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేసి, నేత కార్మికులకు జీరో వడ్డీ రుణాలు అందించాలి. u ఎగ్జిబిషన్లలో చేనేత వస్త్రాలను అమ్ముకునేందుకు స్టాల్స్ అవకాశం కల్పించాలి.ఉమ్మడి జిల్లాలో చేనేత, మరమగ్గాల వివరాలు ఇలా.. చేనేత మరయాదాద్రి భువనగిరి 7719 2240 నల్లగొండ 2700 4023 సూర్యాపేట 125 51 అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్న ఇక్కత్ వస్త్రాలు ఆన్లైన్ వస్త్ర వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్న చేనేత యువత అయినా ఒడిదుడుకుల్లో చేనేత రంగం నేడు జాతీయ చేనేత దినోత్సవం -
బడుల్లో ప్రయోగ పాఠాలు
ఆలేరురూరల్: విద్యార్థులకు గణిత బోధనను సులభతరం చేయడంతో పాటు, సైన్స్ ప్రయోగాలతో వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరిచిన రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పీఎంశ్రీ పాఠశాలలకు సైన్స్, గణిత కిట్ల కొనుగోలు కోసం నిధులను మంజూరు చేసింది. దీంతో ఇప్పటివరకు కేవలం పుస్తకాల చదువుతోనే సరిపెట్టుకున్న విద్యార్థులకు ఇకపై ప్రయోగాత్మక విద్య అందనుంది. 15లోగా కిట్ల కొనుగోలు సైన్స్ బోధనలో ప్రయోగ పాఠాలు అత్యంత కీలకం. అలాగే గణితంలో కూడా పరికరాల ద్వారా నేర్పిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇవి ఎంతో అవసరం. ఈ మేరకు జిల్లాలో ఎంపికై న 25 పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలకు కిట్ల కొనుగోలు కోసం రూ. 10,50,000 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయ్యాయి. ఈనెల 15వ తేదీలోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నిబంధనల ప్రకారం.. ఈ ఖర్చుల్లో జనరల్ కేటగిరీ కింద 72 శాతం, ఎస్సీ కేటగిరీ కింద 17 శాతం, ఎస్టీ కేటగిరీ కింద 11 శాతం నిధులకు సంబంధించిన బిల్లులను ఆయా పాఠశాలలు సమర్పించాల్సి ఉంటుంది. మౌలిక వసతుల మెరుగుకు నిధులు ఈ నిధులను ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా వినియోగించనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఆవరణ పరిశుభ్రత, పాఠశాల బోర్డులను అందంగా రాయించడం, చెత్త సేకరణ డబ్బాల ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయులకు విద్యాబోధనకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రస్తుతం 50 శాతం నిధులను విడుదల చేస్తూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు కిట్లతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసం, భద్రత కోసం ప్రభుత్వం పలు ప్రత్యేక కేటాయింపులు చేసింది. బాలికల ఆత్మరక్షణ: 20 పాఠశాలల్లో బాలికలకు 3 నెలల పాటు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కోసం రూ. 6 లక్షలు. సేఫ్టీ క్లబ్, సాధికారత: 21 పాఠశాలలకు (ఒక్కో దానికి రూ. 20 వేల చొప్పున) రూ. 4,20,000. తల్లిదండ్రుల సమావేశాలు: విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాల నిర్వహణకు రూ. 4.25 లక్షలు. దివ్యాంగ విద్యార్థులకు: విహార యాత్ర కోసం రూ. 2 లక్షలు, సంబంధిత మెటీరియల్ కోసం రూ. 7,400. చైల్డ్ ట్రాక్ సిస్టమ్: విద్యార్థుల పర్యవేక్షణకు రూ. 79 వేలు. స్పెషల్ ఎడ్యుకేషన్ శిక్షణ: జిల్లా స్పెషల్ ఎడ్యుకేషన్ శిక్షణ కింద ఒక్కో పాఠశాలకు రూ. 5 వేల చొప్పున కేటాయించారు. 25 పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 10.50 లక్షల నిధులు మంజూరు ఫ సైన్స్, గణిత కిట్ల కొనుగోలుకు 15వ తేదీ వరకు గడువు ఫ బాలికల ఆత్మరక్షణ, సాధికారత, దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక కేటాయింపులు -
బెయిల్ మంజూరు.. మాజీ సర్పంచ్కు ఉపశమనం
మోత్కూరు, అడ్డగూడూరు : అడ్డగూడూరు మండలం అజీంపేట గ్రామంలో జరిగిన ఓ హత్యకేసులో అప్పటి సర్పంచ్ పోలబోయిన లింగయ్యకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2017 దసరా పండుగ రోజున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్ట లింగయ్య హత్యకు గురయ్యారు. దీంతో మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కోర్టు వీరికి యావజ్జీవ శిక్ష విధించింది. విచారణలోనే జక్కుల భిక్షమయ్య అనే వ్యక్తి మృతి చెందగా మిగతా 17 మంది సికింద్రాబాద్, చర్లపల్లి జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేష్, బండగొర్ల వలరాజు, పండుగ యాదయ్య, జక్కుల రమేష్, పండుగ నర్సయ్య, పండుగ సత్యనారాయణ, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పోలబోయిన లింగయ్య, పండుగ నర్సింహ, పండుగ సతీష్, పండుగ శ్రీకాంత్ ఉన్నారు. దాడి చేసినట్లు ఫిర్యాదులో లేకపోవడంతో..పండుగ లచ్చయ్య అనే వ్యక్తి కుమార్తె వివాహం కోసం కొద్ది రోజులు బెయిల్ మంజూరు పొంది వివాహ అనంతరం జైలుకు వెళ్లాడు. పండుగ సత్యనారాయణ తన భార్య అనారోగ్యం బారిన పడడంతో నెల రోజులు బెయిల్ పొంది ప్రస్తుతం గ్రామంలో కుటుంబంతో కలిసి ఉన్నారు. ఇలా కొంత మంది కొద్ది రోజులు బెయిల్ మంజూరు పొంది కుటుంబంతో గడిపి తదుపరి జైలుకు వెళ్తున్నారు. అయితే నేరం జరిగిన సమయంలో పోలబోయిన లింగయ్య ప్రత్యక్షంగా దాడి చేసినట్లు ఫిర్యాదులో లేకపోవడంతో సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.మా గ్రామంలో జరిగిన హత్య కేసులో నా కుమారుడు మాజీ సర్పంచ్ లింగయ్యకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషంగా ఉంది. గ్రామంలో ఉన్న కక్షలతో అప్పుడు సర్పంచ్గా ఉన్న నా కుమారుడిని అక్రమంగా కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. ఇంతకాలం అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడు. నా కొడుకు నిర్దోషిగా కేసు నుంచి బయట పడతాడు. – పోలబోయిన యాదమ్మ, మాజీ సర్పంచ్ లింగయ్య తల్లి -
గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలి
భువనగిరి: గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేలా ఆదాయ వనరులు ఏర్పర్చుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ సూచించారు. గురువారం భువనగిరి మండలం అనంతారంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే మూడేళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకోవాలని ఇందులో భాగంగానే అనంతారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు. అనంతారంలో 63 సంఘబంధాలుండగా వీటిలో 616 మంది సభ్యులు ఉన్నారని వీరికి సీ్త్ర నిధి రుణాలు అందజేస్తాన్నారు. గ్రామంలో ఇంకుడు గుంతలు, పాఠశాలలో విద్యార్థుల యూనిఫాం పరిశీలించారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి ఫామ్ పాండ్ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. పంచాయతీ రూపొందించిన సమగ్ర ప్రణాళికను పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, అదనపు డీఆర్డీఓలు సురేష్, జంగారెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, డీపీఓ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, మండల ప్రత్యేక అధికారి శ్యామ్ సుందర్, సర్పంచ్ నాగరాణి, ఎంపీఓ దినకర్, ఎంఈఓ రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.ఫ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ -
యాదాద్రిలో సినీనటుడు శ్రీకాంత్ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటుడు శ్రీకాంత్ గురువారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈఓ భవాని శంకర్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.10 లీటర్ల సారా స్వాధీనంహుజూర్నగర్ : సారా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం హుజూర్నగర్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ఎకై ్సజ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో పాలకీడు మండలం జానపాడు గ్రామ శివారులో మహంకాళిగూడేనికి చెందిన బనావత్ లక్ష్మయ్య ద్విచక్రవాహనంపై సారా తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమలో ఎకై ్సజ్ ఎస్ఐ దివ్య, సిబ్బంది నాగరాజు రమణ, డ్రైవర్ నరేష్ పాల్గొన్నారు. పశువులు తరలిస్తున్న వాహనం పట్టివేతచౌటుప్పల్ : అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. కర్నాటక రాష్ట్రం, బల్లారి జిల్లా, సిరుగుప్ప తాలూకాకు చెందిన రోడూరు బాబురావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని సంతలో 29 పశువులను (8ఆవులు, 21ఎద్దులు) కొనుగోలు చేశాడు. వాటిని మరో ఇద్దరు కూలీలు మారుతి, సీరం శ్రీనుతో కలిసి హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ స్టేజీ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు పశువుల వాహనాన్ని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, పశువులను గోశాలకు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతిమునగాల: మండలంలోని ముకుందాపురం బస్స్టేజీ శివారులో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ... మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు ఎలమంద ద్విచక్ర వాహనంపై తన కుమారుడు లింగయ్యతో కలిసి సూర్యాపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో స్వగ్రామం వస్తుండగా మార్గమధ్యంలో ముకుందాపురం బస్స్టేజి శివారులో గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌరారపు లింగయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా ఎలమందకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఎలమంద పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్ కళాశాల బస్సుల తనిఖీభువనగిరి: మండల పరిధిలోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సులను గురువారం జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. సుమారు 1000 మంది విద్యార్థులను నిత్యం హైదారాబాద్ నుంచి 20 బస్సుల్లో కళాశాలకు చేరవేస్తుంటారు. దీంతో ఆయా బస్సులు రంగారెడ్డి జిల్లాలో టాక్స్ చెల్లిస్తున్నప్పటికీ యాదాద్రి భువనగిరిలో చెల్లించకపోవడంతో అధికారులు బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంతర్ జిల్లా పర్మిషన్ పత్రాలు సరిగా లేకపోవడంతో 20 బస్సులపై కేసు నమోదు చేసినట్లు డీటీవో నరేష్ తెలిపారు. -
పోలీస్స్టేషన్లపై నిఘా నేత్రం
మిర్యాలగూడ అర్బన్: ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు నిఘా నీడలోకి వెళ్లనున్నాయి. పోలీసులు, కింది స్థాయి సిబ్బంది, ఫిర్యాదుదారులు, పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొనే వారి వ్యవహార శైలిని పరిశీలించేందుకు ప్రతి పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. వీటిని డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు సైతం పూర్తయింది. వీడియోతోపాటు ఆడియో రికార్డునల్లగొండ జిల్లాలో 40, సూర్యాపేటలో 28, యాదాద్రి భువనగిరి జిల్లాలో 19.. మొత్తం 87 పోలీస్స్టేషన్లు ఉండగా వాటి పరిధిని బట్టి ఒక్కో పోలీస్స్టేషన్కు 11 నుంచి 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్లలోని ప్రతి మూలను కవర్చేసే విధంగా సీసీ కెమెరాలను అమర్చారు. ఇవి వీడియోతోపాటు, ఆడియోను కూడా రికార్డు చేస్తాయి. కెమెరాలను రాష్ట్ర స్థాయిలో డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేస్తుండటంతో నిరంతరం పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండనుంది. ఉమ్మడి జిల్లాలోని 87 స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేయడంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణసిబ్బందిలో బాధ్యత పెరుగుతుంది పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో స్టేషన్లకు వచ్చే బాధితులకు సేవలు పారదర్శకంగా అందే అవకాశం ఉంది. సిబ్బంది తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పోలీసు సిబ్బంది వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది. – రవి, ఇన్చార్జి డీఎస్పీ, మిర్యాలగూడ -
మృత్యుపాశమైన విద్యుత్ తీగలు
మఠంపల్లి: విద్యుత్ తీగలే మృత్యుపాశమయ్యాయి. పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగల ఫొటో తీసేందుకుగాను ఓ విద్యార్థి చేయి చాపడంతో విద్యుత్షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మఠంపల్లి మండలంలోని రామచంద్రాపురంతండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురంతండాకు చెందిన మాలోతు మణికంఠ (19) ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కొద్దికాలం క్రితమే విద్యార్థి తండ్రి కేవ్లానాయక్ మృతి చెందడంతో తల్లి సంరక్షణలో ఉంటున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ పనులు జరుగుతుండటంతో పొలం వద్దకు వచ్చి తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం పొలం పనులు చేస్తుండగా.. పొలాల్లో కిందికి వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలను ఫొటో తీసి అధికారులకు పంపించి ఫిర్యాదు చేద్దామని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మణికంఠకు చెప్పాడు. అతడి కోరిక మేరకు మణికంఠ అక్కడే ఉన్న ట్రాక్టర్ ఇంజిన్ పైకి ఎక్కి, చేతిని విద్యుత్ తీగలకు దగ్గరగా పెట్టాడు. షార్ట్సర్క్యూట్ కావడంతో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్రిక్తత.. పోలీసుల జోక్యంరైతులు గమనించి కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. ఫొటో తీయమని మణికంఠను ప్రేరేపించిన వ్యక్తిపై దాడికి దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో మఠంపల్లి, పాలకీడు ఎస్ఐలు ప్రవీణ్కుమార్, కోటేష్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగల ఫొటో తీసేందుకు ట్రాక్టర్ ఇంజిన్ ఎక్కిన విద్యార్థి తీగలకు చేయి తాకడంతో విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతి -
జడ్జి శైలజ బాధ్యతల స్వీకరణ
చౌటుప్పల్ : చౌటుప్పల్లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన జడ్జిగా శైలజ గురువారం బాధ్యతలు సీకరించారు. కోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. కోర్టు పరిపాలన, న్యాయ సేవల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. కక్షిదారులకు వేగవంతమైన, పారదర్శకమైన, నిష్పక్షపాతమైన సేవలను అందిస్తామని ఆమో తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరి పరమేష్, మాజీ అధ్యక్షుడు ఎలమోని శ్రీనివాస్, ఊడుగు శ్రీనివాస్, బాల్యం వెంకటాచలపతి, న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, పడమటి మహిపాల్రెడ్డి, మక్తాల నర్సింహ, పిట్టల భిక్షమయ్య, రాపోలు వేణు, రాధాకిషన్రావు, జెల్ల రమేష్, రిక్కల సుధాకర్రెడ్డి, జక్కర్తి శేఖర్, ఖయ్యూంపాష, పిట్టల భరత్ పాల్గొన్నారు. రెండో వారంలో ‘వైటీడీ’ సమావేశం! యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి రెండో సమావేశాన్ని రెండో వారం(ఈ నెల 13 లేదా 14వ తేదీన) నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. శ్రావణ మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు 13వ తేదీన, మరుసటి రోజు 14వ తేదీన సీఎం రేవంత్రెడ్డి తుర్కపల్లి మండలం వాసాలమర్రికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వీలు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తోంది. కొండపై డార్మిటరీ హాల్, కల్యాణ మండపం, రాయగిరి సమీపంలో ఆర్చి నిర్మాణం, కొండపైకి ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటు వంటి అంశాలతో పాటు మరో 10కి పైగా అంశాలను ఎజెండాలో చేర్చి సీఎం సమక్షంలో పాలక మండలి సభ్యులు చర్చించి, ఆమోదం తెలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రావణ మాసంలో పలు అభివృద్ధి పనులకు పాలక మండలి శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే గురువారం ఈఓ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పట్టుపురుగుల పెంపకంతో స్థిరమైన ఆదాయంభువనగిరిటౌన్ : రైతులు పట్టుపురుగుల పెంపకంతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివిధ శాఖల జిల్లా అధికారులు పిలుపునిచ్చారు. భువనగిరిలో సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆధ్వర్యంలో గురువారం మేరా రేషమ్ మేరా అభిమాన్ 2.0 వాటాదారుల సమావేశం నిర్వహించారు. ఇందులో డీఏఓ వెంకట రమణారెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారిణి హేమలత, జిల్లా పశువైద్యాధికారి జానయ్య పాల్గొని మాట్లాడారు.సదస్సులో సైంటిస్ట్లు డాక్టర్రవి వర్మ , తిరుపమ్ రెడ్డి, శ్రీనాథ్, రాఘవేందర్, యాదాద్రి ఏడీఎస్ నవీన్పాల్ రెడ్డితో పాటు సెరీకల్చర్ రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. -
మైనార్టీ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలి
రామగిరి(నల్లగొండ) : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మైనార్టీ డిక్లరేషన్ హామీని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని జమియత్ ఉలెమా రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ రషాదీ డిమాండ్ చేశారు. మైనార్టీల రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపై గురువారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీల కోసం వెంటనే సబ్–ప్లాన్ను అమలు చేయాలన్నారు. ప్రకటించిన రూ.4,000 కోట్ల వార్షిక బడ్జెట్ను పూర్తిగా కేటాయించి, పారదర్శకంగా ఖర్చు చేయాలని కోరారు. ఇమామ్లు, ముఅజ్జిన్లకు గౌరవ వేతనాలు పెంచుతామన్న హామీని నెరవేర్చాలన్నారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉర్దూ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను తొలగించి, సమగ్ర సర్వే ద్వారా డిజిటల్ రికార్డులను రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, బోర్డులు, అథారిటీలు, సలహా కమిటీలలో మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒక సమర్థుడైన ముస్లిం ప్రతినిధిని నామినేట్ చేయాలన్నారు. మైనార్టీల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రకటించిన పథకాలన్నింటినీ ఆలస్యం లేకుండా అమలు చేయాలని కోరారు.హామీల అమలులో ప్రభుత్వం విఫలమైతే జమియత్ ఉలెమా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో జమియత్ ఉలేమా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా మఖ్దూమ్, గ్రంథాల సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి హఫీజ్ పుర్కాన్, ముఫ్తీ రియాజ్, మౌలానా జుబేర్, మౌలానా హుస్సేన్, మౌలానా అక్బర్ఖాన్, మౌలానా సమీ, ముఫ్తీ ఉమర్, హాషిజ్ హబీబ్, మౌలానా ఫిరాసతుల్లా, ఫైసల్, ముఫ్తీ గయాస్, హాఫిజ్ షంషుద్దీన్, ముఫ్తీ కలీమ్, మౌలానా అతా ఉర్ రహ్మాన్, మౌలానా షారూఖ్, జానీ, బాబా పాల్గొన్నారు. జమియత్ ఉలెమా రాష్ట్ర అధ్యక్షుడు ఎహసానుద్దీన్ ఖాస్మీ రషాదీ -
పుష్కరకాల నిరీక్షణకు తెర
దండుమల్కాపూర్లో రాష్ట్రంలోనే తొలి ఆటోమేటెడ్ వెహికిల్ ఫిట్నెస్ సెంటర్ సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలోనే మొదటి ఆటోమేటెడ్ వెహికిల్ ఫిట్నెస్ సెంటర్ (ఏటీసీ) యాదాద్రి భువనగిరి జిల్లాలో అందుబాటులోకి వస్తోంది. ఇకపై వాహనాల ఫిట్నెస్ను అంచనా వేసే మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి, డిజిటల్ పరికరాలతో కచ్చితత్వంతో పరీక్షించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన ఈ ప్రాజెక్టు సుమారు పుష్కరకాలం నిరీక్షణ తర్వాత చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లో సాకారం అవుతోంది. ఈనెల 17 నుంచి ఈ కేంద్రం పూర్తిస్థాయిలో సేవలు అందించనుంది. 12 ఏళ్ల నిరీక్షణకు తెర వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2014లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అనేక పరిపాలనాపరమైన జాప్యాల కారణంగా ఏళ్ల తరబడి ముందుకు సాగలేదు. ఎట్టకేలకు 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ వద్ద ప్రభుత్వం కేటాయించిన ఎనిమిదిన్నర ఎకరాల స్థలంలో రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడుస్తుంది. జర్మనీ నుంచి యంత్రాలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహా అత్యాధునిక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ (వైజాగ్), కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఇటువంటి అత్యాధునిక వసతి కలిగిన మొదటి కేంద్రం ఇదే. వాణిజ్య వాహనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. కమర్షియల్ వాహనాలకే ఫిట్నెస్ జిల్లాలోని సుమారు 40 వేల వాణిజ్య వాహనాలకు ఇక్కడ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో లారీలు, టిప్పర్లు, గూడ్స్ క్యారియర్లు, స్కూల్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు, ఆటోలు, తుఫాన్ వాహనాలు, ఎల్లో ప్లేట్ నంబర్ బోర్డు కలిగిన వాహనాలు ఉంటాయి. ద్విచక్ర వాహనాలు, సొంత కార్లు వంటి వ్యక్తిగత వాహనాలకు ఈ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇప్పటివరకు అధికారులు స్వయంగా మాన్యువల్ విధానంలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేవారు. ఇకపై ప్రతి వాహనాన్ని యంత్రాల సహాయంతో పరీక్షిస్తారు. ప్రధానంగా ఐదు రకాల పరీక్షలు ఉంటాయి. హెడ్లైట్ల సామర్థ్యం: వెలుతురు, డిమ్, బ్రైట్ కండిషన్, ఇండికేటర్ల పనితీరు. ఇంజన్ సామర్థ్యం: ఇంజన్ కండిషన్ , పొగ (కాలుష్య) నిబంధనల పరీక్ష సస్పెన్షన్ టెస్ట్: వాహన సస్పెన్షన్, షాక్ అబ్జార్బర్ల స్థితిగతులు టైర్ల కండిషన్: టైర్ల అరుగుదల, గ్రిప్, రోడ్డుపై ప్రయాణించే భద్రతా ప్రమాణాలు బ్రేకింగ్ ఎఫీషియన్సీ: బ్రేకుల పనితీరు, ఆకస్మికంగా ఆపే సామర్థ్యం నిర్ధారణ ఫ రూ. 10 కోట్లతో ఏర్పాటు ఫ జర్మన్ సాంకేతికతతో అత్యాధునిక యంత్రాలు ఫ మాన్యువల్ తనిఖీలకు స్వస్తి.. డిజిటల్ విధానంలో ఐదు రకాల పరీక్షలు ఫ పాత రుసుములతోనే సేవలు ఫ 17 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వాహనదారులు రవాణా శాఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. నిర్ణీత రుసుము చెల్లించి సెంటర్కు రావాల్సి ఉంటుంది. ఫిట్నెస్ పరీక్షల రుసుములలో ఎలాంటి పెంపు లేదు, పాత పద్ధతిలోనే వసూలు చేస్తాం. రాష్ట్ర రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు, కొత్త యంత్రాలు అమర్చేలోపు వాహనదారులకు ఈ ప్రాంగణంపై అవగాహన కల్పించేందుకు తాత్కాలికంగా మ్యానువల్ తనిఖీలు ప్రారంభించాం. – సంగెం నరేష్, డీటీఓ -
మడిగెల నిర్మాణంపై మున్సిపల్ కౌన్సిల్లో రగడ
భువనగిరిటౌన్ : తీవ్ర వాదోపవాదాలు, ప్రతిపక్షాల నిరసనలు, పోలీసుల బందోబస్తు నడుమ భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం వాడివేడిగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 15 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టారు. వివాదాస్పదంగా మారిన మడిగెల నిర్మాణ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనబెట్టి, మిగిలిన అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే, కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు వచ్చి కూర్చోవడంపై ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం, మడిగెల అంశాలపై ఆందోళన జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతోనే పోలీసులు వచ్చినట్లు తెలుస్తుండగా.. అధికార పార్టీ సభ్యులు మాత్రం ప్రతి శాఖకు ఇచ్చిన ఆహ్వానంలో భాగంగానే వారు వచ్చినట్లు చెబుతున్నారు. హద్దులు తేలేవరకు నిర్మాణాలు వద్దు రామస్వామి హోటల్ సమీపంలోని మున్సిపల్ ఖాళీ స్థలంలో దుకాణ సముదాయాల నిర్మాణానికి ముందు, ఆ స్థలానికి సంబంధించిన పక్కా సరిహద్దులను సేకరించాలని కౌన్సిలర్లు పాశం అమర్నాథ్, జంగిటి వినోద్కుమార్ పట్టుబట్టారు. దీనిపై చైర్పర్సన్ స్పందిస్తూ.. తమ వార్డులోని స్థలాన్ని ఎవరూ ఆక్రమించలేదని, అనవసర ఆరోపణలు చేయవద్దన్నారు.ఈ వివాదం తీవ్రరూపం దాల్చ డంతో మున్సిపల్ కమిషనర్ కె.చంద్రప్రకాశ్ రెడ్డి జోక్యం చేసుకొని.. కౌన్సిలర్ల సమక్షంలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, హద్దులు నిర్ధారించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. బడ్జెట్ పెంపునకు ఆమోదం బాబు జగ్జీవన్ రామ్ భవన్ మౌలిక వసతుల అంచనా వ్యయాన్ని ఇంజనీర్లు మొదట రూ.7.60 లక్షలుగా నిర్ణయించి, ఆ తర్వాత రూ.6 లక్షలకు తగ్గించడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిధులను రూ.7.60 లక్షలకు పెంచుతున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. తీజ్ పండుగ నిర్వహణ నిధులను రూ.2.50 లక్షలకు పెంచాలని కాంగ్రెస్ సభ్యురాలు సుమయ్య తబస్సుం అహ్మద్ కోరగా కౌన్సిల్ ఏకగ్రీవంగా అంగీకరించింది. పక్షపాత వైఖరిపై బీఆర్ఎస్ నిరసన.. వాకౌట్ పట్టణంలో కోతులు, వీధికుక్కల బెడదను అదుపు చేయడంలో పాలకపక్షం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చెన్న స్వాతి, కౌన్సిలర్ నాకోటి నగేష్ మండిపడ్డారు. పారిశుద్ధ్య సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ప్రతిపక్ష వార్డుల్లో బోర్లు వేయకుండా పక్షపాతం చూపుతున్నారంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఫ భువనగిరి మున్సిపల్ పాలకవర్గ తీరుపై మండిపడిన ప్రతిపక్షాలు ఫ బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ -
2028 మార్చి వరకు ఎంఎంటీఎస్ పనులు
సాక్షి, యాదాద్రి: ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పనులను 2028 మార్చి 28 నాటికి పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు వెల్లడించారు. గురువారం జిల్లాలోని యాదాద్రి(రాయగిరి) రైల్వేస్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అమృత్ పథకంలో భాగంగా యాదాద్రి స్టేషన్ వద్ద కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం భువనగిరి రైల్వే స్టేషన్, రాయగిరి రైల్వే స్టేషన్లో విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ వెంట జరిగే అదనపు ట్రాక్ నిర్మాణ పనులు నెమ్మదిగా చేస్తామన్నారు. భవిష్యత్తులో కాజీపేట వరకు ఫోర్ లేన్, ట్రాక్ పనులు కూడా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట భక్తులను దృష్టిలో ఉంచుకుని రాయగిరి వద్ద అన్ని హంగులతో యాదాద్రి స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు నెలల్లో ఈ యాదాద్రి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు కల్పించేలా పనులు పూర్తి చేస్తామన్నారు. అంతకుముందు యాదాద్రి స్టేషన్లో వర్షం నీరు స్టేషన్ రూప్ పై నుంచి చుక్కలుగా పడడం చూసి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ పనుల్లో నాణ్యత లోపాలు ఉండవద్దని, పూర్తి ప్రమాణాలతో చేపట్టాలని ఆయన ఆదేశించారు.ఫ అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు -
గుండెపోటుతో తుర్కపల్లి విలేకరి మృతి
బొమ్మలరామారం : తుర్కపల్లి మండల ‘సాక్షి’ విలేకరి దుగ్యాల రవికుమార్(45) గుండెపోటుతో మృతిచెందారు. కొన్ని రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మూడురోజుల క్రితం ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరగా.. బుధవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మృతిచెందారు. స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రవికుమార్ భౌతికకాయానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య, మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చాడ భాస్కర్ రెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్న కిష్టయ్య, మండల అధ్యక్షుడు రవి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, జర్నలిస్టులు యంబ నర్సింహులు, జీ.వి శ్రీనివాస్, పోతంశెట్టి కరుణాకర్, మాటూరి వెంకటేశ్వర్లు, కళ్లెం సంపత్కుమార్, ఎడిజర్ల భూపాల్, భరత్కుమార్, మల్లారెడ్డి, బాల్కిషన్, జానకిరాం, ఉపేందర్, పాండురంగం, చంద్రశేఖర్, జమాలొద్దీన్, రమణాకర్, ఆనంద్, శ్రీనివాస్, అంజనేయులు, రవికుమార్, స్వామి, సర్పంచ్లు సోమోళ్ల వెంకటేష్, జెరిపోతుల కర్ణాకర్, బానోత్ పులి వీరన్న, సోన్నాయల రవి, పుట్ట సాయిలు, శివరాత్రి లావణ్య జహంగీర్, తునికి లక్ష్మి రాంరెడ్డి, రేణుక వెంకటేష్ యాదవ్, బొట్టా రాములు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత సంతాపం తెలిపారు. రవికుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. -
ప్రకృతి రంగులు.. అడవి మొక్కలతో చీర
సంస్థాన్ నారాయణపురం : ప్రకృతి ప్రసాదించిన రంగులు(కూరగాయల రంగులు), అడవి మొక్కలతో తయారుచేసిన సహజ వర్ణాలు.. ప్రాచీన తేలియా రుమాల్ కళతో డబుల్ ఇక్కత్తో నేసిన చీర.. పుట్టపాక గ్రామానికి చెందిన చంద్రకళకు కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డును తెచ్చిపెట్టాయి. చీర తయారీలో భాగంగా నూలు దారాలను నువ్వుల నూనె, ఆముదం పొట్టు, బూడిద, గొర్రె పేడతో కలిపి 15 రోజుల పాటు నానబెట్టి శుద్ధి చేశారు. అనంతరం మజిస్టా, అడవి పసుపు, అడవి కాచు మొక్కలతో తయారుచేసిన ప్రకతి రంగులను దారాలకు అద్దారు. రెండు కొలుకుల మెట్టు పద్ధతిలో చీరను నేశారు. ప్రాసెసింగ్తో పాటు చీర తయారీ మొత్తం ప్రక్రియకు సుమారు ఆరు నెలల సమయం పట్టగా, చీర నేయడానికి 15 రోజులు పట్టింది. చీర తయారీకి సుమారు రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. గత 36 సంవత్సరాలుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్న చంద్రకళ, పెళ్లికి ముందే ఈ రంగంలో అడుగుపెట్టారు. ఈ ప్రయాణంలో తన భర్త సహకారం ఎంతో ఉందని ఆమె తెలిపారు. -
అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య
చౌటుప్పల్ : మండలంలోని కొయ్యలగూడెం(ప్రస్తుతం ఎల్లంబావి)కి చెందిన కర్నాటి నారాయణ–పారిజాత దంపతులు గత ఐదు దశాబ్దాలుగా చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వినూత్న డిజైన్లతో కూడిన వస్త్రాలను తయారుచేస్తూ ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో నారాయణ 2021లో ప్రకృతి సహజ సిద్ధమైన రంగులతో 24మెటీస్తో డబుల్ ఇక్కత్ చీర తయారు చేయడంతో ఆయనకు కొండా లక్ష్మణ్బాపూజీ అవార్డు లభించింది. నారాయణ భార్య పారిజాత డబుల్ ఇక్కత్లో బ్లౌజ్తో కూడిన ఖాదీ కాటన్ చీరను తయారు చేసి ఈ ఏడాది కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికై ంది. అంతేకాకుండా నారాయణ కుమారుడు కర్నాటి ముఖేష్ 2024లో 100మెటీస్తో డబుల్ ఇక్కత్ చీర తయారుచేసి రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. ఎప్పటికప్పుడు నూతన డిజైన్లు రూపొందిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంటున్న ఈ కుటుంబం ఇతర నేతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
అవార్డు రావడం సంతోషంగా ఉంది
చండూరు : పట్టణానికి చెందిన కర్నాటి బొర్రయ్య తయారు చేసిన చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అవార్డు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దాదాపుగా 55 ఏళ్లుగా మగ్గం నేస్తున్న తనకు ఎప్పుడూ ఎటువంటి అవార్డు రాలేదని, ఈ సారి తాను నేసిన ఇక్కత్ ట్విల్ వీవ్ చీరకు అవార్డు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ చీర ధర రూ.80 వేలకు పైగా ఉంటుందని, 20 రోజుల్లో ఈ చీరను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అవార్డులతో పాటు చేనేత కార్మికులకు తగిన సహకారం అందిస్తే బాగుంటుందని ఆయన కోరుతున్నారు. -
చెట్ల రసాలతో ఇక్కత్ పట్టుచీర..
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్కు చెందిన వాలుగొండ దశరథ తయారుచేసిన ఇక్కత్ పట్టుచీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. దశరథ వివిధ రకాల చెట్ల రసాలను సేకరించి తన అభిరుచికి తగ్గట్టుగా ఇక్కత్ పోచంపల్లి పట్టుచీరను తయారు చేశారు. ఆర్గానిక్ రంగులు అద్దిన ఇక్కత్ పోచంపల్లి పట్టుచీర నాణ్యతగా ఉండడంతో పాటు కలర్ ఏ మాత్రం ఎలిచిపోదు. గత 25 సంవత్సరాలుగా చీరలు నేస్తున్నానని, ఇప్పుడు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. -
బీబీనగర్ ఎయిమ్స్ నుంచి ఘట్కేసర్ చేరేందుకు గంటన్నరకు పైగా సమయం
● ఎయిమ్స్ సమీపం నుంచి కొండమడుగు వద్ద ఉన్న కేపాల్ పరిసరాల వరకు వాహనాలు ఒకే వరుసలో బారులుదీరుతున్నాయి. ● ప్రైవేట్ కళాశాల దాటిన తర్వాత హెచ్పీ పెట్రోల్ బంక్ ప్రాంతం, వందన హోటల్ పరిసరాల్లో కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభిస్తోంది. ● ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్, అన్నోజిగూడ వద్ద ఘట్కేసర్ నుంచి నారపల్లి వైపు వెళ్లే మార్గంలోనూ నిత్యం ఇదే తంతు కొనసాగుతోంది. సాక్షి, యాదాద్రి : వరంగల్ – హైదరాబాద్ హైవేపై భువనగిరి నుంచి ఉప్పల్ వరకు ప్రయాణం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత రద్దీగా ఉండే ఈమార్గంలో చేపట్టిన రోడ్డువిస్తరణ పనులు, అండర్పాస్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. బీబీనగర్ ఎయిమ్స్ నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ వరకు అరగంటలో ముగియాల్సిన ప్రయాణం.. గంటన్నరకు పైగా పడుతుండడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ నిరీక్షణ ప్రధాన రహదారిపై పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ను సర్వీస్ రోడ్లకు మళ్లించారు. ఈ సర్వీస్ రోడ్లపై గరిష్టంగా 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని నిబంధన ఉన్నా, రోడ్లు అత్యంత ఇరుకుగా ఉండటంతో ఒక వాహనం వెనుక మరొక వాహనం నత్తనడకన సాగాల్సి వస్తోంది. ఒక లారీ లేదా బస్సు వస్తే వెనుక ఉన్న వాహనాలన్నీ నిలిచిపోవాల్సిందే. ఈ సమస్య శని, ఆదివారాల్లో మరింత తీవ్రమవుతోంది. ఉద్యోగుల రాకపోకలతో పాటు వరంగల్, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, ఎల్లమ్మ దేవాలయాలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే లక్షలాది వాహనాలతో ఈ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభిస్తోంది. ప్రమాదాలకు నిలయంగా మారిన మార్గం వేగ నియంత్రణకు కాంట్రాక్టర్లు వేసిన అసంపూర్తి స్పీడ్ బ్రేకర్లు, అకస్మాత్తుగా ఎదురయ్యే గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొత్తగా వచ్చే వాహనదారులు వీటిని చూసి సడన్ బ్రేక్ వేస్తుండటంతో, వెనుక వస్తున్న వాహనాలు బలంగా ఢీకొంటున్నాయి. అవుషాపూర్, ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఇలాంటి ప్రమాదాలతో కార్ల బంపర్లు ధ్వంసమై అనేక మంది గాయపడుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు శూన్యం రాత్రి వేళల్లో పనులు జరిగే ప్రాంతాల్లో కనీస భద్రతా చర్యలు లేవు. హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టర్లు ఎక్కడా సరిగా కనిపించడం లేదు. ఎయిమ్స్ సమీపంలో తవ్విన గుంతల వద్ద కనీసం రెడ్ టేప్ లేదా రక్షణ వైర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు ప్రమాదవశాత్తు పడిపోయే ముప్పు పొంచి ఉంది. ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల జంక్షన్ల వద్ద హోటళ్లు, టీ కొట్లు, మద్యం దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాల ముందు వాహనాలను రోడ్డుపైనే నిలుపుతుండటంతో రోడ్లు మరింత కుచించుకుపోతున్నాయి. ఫ రోడ్డు విస్తరణ, అండర్పాస్ నిర్మాణాలతో వాహనాలను సర్వీస్ రోడ్లకు మళ్లింపు ఫ భారీ వాహనం వస్తే వెనక ఉన్న వాహనాలు నిలిచిపోవాల్సిందే ఫ శని, ఆదివారాల్లో సమస్య మరింత తీవ్రం కొండమడుగు, ఔషపూర్ దగ్గర నిర్మిస్తున్న అండర్ ప్లస్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి. జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనాలు దూసుకురావడంతో భయంతో కింద పడిపోతున్నారు. దీంతోపాటు సర్వీస్ రోడ్డు కావడంతో దుమ్ము ధూళి సైతం కళ్లలో పడి రోడ్డు కనిపించకుండా పోతుంది. – అమీర్, భువనగిరి -
అద్దె భవనాలు.. చిన్నారులకు ఇబ్బందులు
ప్రస్తుతం నాలుగు నెలల అద్దె నిధులు రావాల్సి ఉంది. ప్రభుత్వం మంజూరు చేయగానే వెంటనే వారీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన కేంద్రాలు త్వరగా పూర్తియ్యేలా చర్యలు చేపడుతున్నాం. – శ్రీనివాస్, ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి ఫ మొత్తం 901 అంగన్వాడీ కేంద్రాలు ఫ అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి 534 ఫ కనీస వసతులు లేక చిన్నారుల అవస్థలు ఆలేరురూరల్: ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల దుస్థితి మారడం లేదు. పక్కా భవనాలు నిర్మిస్తామన్న పాలకుల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లావ్యాప్తంగా సగానికి పైగా అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలు లేక, అరకొర వసతుల మధ్య అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పాత భవనాలు శిథిలావస్థకు చేరుకోగా, కొత్త భవనాల నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. ఫలితంగా ఇరుకు గదుల్లోనే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 534 అద్దె భవనాలు జిల్లాలో ఆలేరు, భువనగిరి, మోత్కూర్, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వాటి పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 46,679 మంది చిన్నారులున్నారు. ఇందులో 367 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా 534 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలు 295 ఉన్నాయి. మిషన్ భగీరథ నీటి సౌకర్యం లేని అంగన్వాడీ కేంద్రాలు 196 ఉన్నాయి. ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నడపడం వల్ల చిన్నారులు కూర్చోవడానికి, ఆట వస్తువులు ఉంచడానికి, పౌష్టికాహారాన్ని నిల్వ చేయడానికి స్థలం చాలక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గాలి, వెలుతురు రాక చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం, ఒకవేళ ఉన్నా నిర్వహణ లేకపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో కేంద్రాల్లో తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలంటే అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలలుగా అందని అద్దె సొంత భవనాలు లేని చోట అద్దె కేంద్రాల్లో కొనసాగుతున్న సిబ్బందికి కష్టాలు తప్పడం లేదు. గడిచిన నాలుగు నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం నుంచి అద్దె చెల్లించలేదు. దీంతో భవన యజమానులు అద్దె కోసం ఒత్తిడి తెస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానుల ఒత్తిడి తట్టుకోలేక కొందరు టీచర్లు తమ వేతనాల్లోంచి అద్దెలు చెల్లిస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు లేనివారు యజమానులను బతిమాలుకుంటూ నెట్టుకొస్తున్నారు. ముందుకురాని కాంట్రాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు నెలకు రూ.1,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,000 నుంచి రూ.4,000 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈ తక్కువ అద్దెకు ఇళ్లు ఇచ్చేందుకు యజమానులు ముందుకు రాకపోవడంతో ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నడుపుతున్నారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలకు 2018లో ప్రభుత్వం ఒక్కో భవనానికి రూ.8 లక్షల చొప్పున మంజూరు చేసింది. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. ఉపాధిహామీ తదితర నిధులతో నాలుగైదేళ్ల కిందట ప్రారంభమైన పనులు ఇంకా పూర్తి కాలేదు. -
జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే చీర
భూదాన్పోచంపల్లి : పోచంపల్లికి చెందిన సీత సుధాకర్ ఎంబీఏ చదివి చేనేత వృత్తి రాణిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా మడ్తాస్ ఇక్కత్ చీరను రూపొందించి ఉత్తమ డిజైనర్గా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. 3 ప్లే వార్పు, 7 ప్లే వెప్ట్ మల్చరీ సిల్క్ దారం, 240 కొయ్యలు, వైట్ బేస్లో చీరలో జీవరాసులను సృష్టించారు. చీరపై నెమలి, ఏనుగు, జింక, హంస, కుందేలు, కింగ్ఫిషర్, కొంగ, రామచిలుక, బాతు, సీతాకోకచిలుకలతో పాటు కొంగు(పల్లు)లో ఏనుగు, ఆవు, నెమలి, హంస, సింహం, జింకను రూపొందించారు. తాను చీరపై సృష్టించాలనుకొన్న జీవరాసులను ముందుగా గ్రాఫ్పై గీసి అందుకనుగుణంగా మూడు ఆసులపై చిటికి కట్టి, జంతువులు, పక్షులు స్పష్టంగా కన్పించేలా ఎరుపు, ఆనంద, గుమ్మడి, ఆకుపచ్చ రంగులద్దారు.చీర తయారీ కోసం మూడు నెలల పాటు శ్రమించినట్లు ఆయన తెలిపారు. ప్రకృతిని కాపాడితే జీవరాసులు తమ మనుగడను కొనసాగిస్తాయనే ఇతివృత్తంతో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చీరను రూపొందించినట్లు సీత సుధాకర్ తెలిపారు. తన నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ లలిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు, రెండు జీరాక్స్ సెట్లతో హాజరుకావాలని తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ మహిళలకు చేయూత భువనగిరిటౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న చిన్న తరహా వ్యాపారాలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘తెలంగాణ సెర్ప్ ఇంక్యుబేటర్’ కార్యక్రమం దోహదపడుతుందని అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (డే–ఎన్ఆర్ఎల్ఎమ్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఓరియంటేషన్ అండ్ ప్లానింగ్ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే నడుస్తున్న వ్యక్తిగత వ్యాపారాల్లో రూ.12 లక్షల టర్నోవర్, గ్రూప్ వ్యాపారాల్లో రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు టర్నోవర్ కలిగిన ఎంటర్ప్రైజెస్ను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం మండల స్థాయిలో గ్రామ సంఘాల ప్రతినిధులు, విఓఏలకు ఒక రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ జంగారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి పల్లవి, కోశాధికారి కే. అలివేలు, డీపీఎం రవీందర్, ఏపీఎం కే. సైదులు, టి–శాట్ ప్రతినిధి మణికంఠ పాల్గొన్నారు. రిజర్వేషన్తో మహిళలకు సమాన అవకాశాలుఆలేరు : మహిళలకు రాజకీయ, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలంటే 33శాతం రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సృజన డిమాండ్ చేశారు. బుధవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన జిల్లా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహాసభలో ఆమె మాట్లాడారు. మహిళల రక్షణకు సంబంధించిన సమగ్ర చట్టాలను పార్లమెంట్లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి మహిళకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, సామాజిక భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అంతకుముందు మహిళలు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, చెడి చంద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, రాజు, కనకయ్య పాల్గొన్నారు. జిల్లా నూతన కమిటీ ఎన్నిక సమావేశంలో సమాఖ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షురాలుగా గుర్రం రాజమణి, అధ్యక్షురాలుగా సోమన సబిత, ప్రధాన కార్యదర్శిగా బండి జంగమ్మ, ఉపాధ్యక్షురాలుగా మంచాల రాజమ్మ, మాటూరు జానమ్మ, సహాయ కార్యదర్శిగా కునుకుంట్ల నర్సమ్మ ఎన్నియ్యారు. నేడు భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు 35 వార్డుల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్ మిషన్ల మరమ్మతులకు నిధులు కేటాయించనున్నారు. 17 నుంచి వాహనాల ఫిట్నెస్ పరీక్షలు భువనగిరి: చౌటుప్పల్లోని మల్కాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫిట్నెస్ స్టేషన్ వద్ద ఈ నెల 17 నుంచి జిల్లాలోని అన్ని రకాల వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి నరేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాల సామర్థ్య పరీక్షలకు వాహనదారులు సహకరించాలని కోరారు. -
నటుడు ప్రదీప్ రావత్కు పోచంపల్లితో అనుబంధం
భూదాన్పోచంపల్లి : పలు విజయవంతమైన చిత్రాలలో విలన్గా నటించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మంగళవారం ముంబైలోని తన ఇంట్లో గుండెపోటుతో మృతిచెందారు. ప్రదీప్ రావత్ షూటింగ్ల సందర్భంగా గతంలో పోచంపల్లికి రెండుసార్లు వచ్చారు. 2017 జనవరిలో హీరో పవన్కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా షూటింగ్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామంలో జరగగా.. అందులో నటించిన ప్రదీప్ రావత్పై ఇక్కడ పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అదే సంవత్సరం మార్చిలో హీరో దగ్గుబాటి రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ సందర్భంగా ప్రదీప్ రావత్ పోచంపల్లికి వచ్చారు. స్థానిక టూరిజం పార్కు వద్ద చిత్రీకరించిన పలు సన్నివేశాలలో ప్రదీప్ రావత్ పాల్గొన్నారు. -
పౌరాణిక మూలాంశాలే ప్రేరణగా..
సంస్థాన్ నారాయణపురం : నారాయణపురం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు గుర్రం బాలరాజు పౌరాణిక మూలాశాలతో, విష్ణు అవతారం ప్రేరణతో, చేపల బొమ్మలతో తయారుచేసిన బోన్ సింగిల్ ఇక్కత్ పట్టు చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వరించింది. బోన్ సింగిల్ ఇక్కత్ చీరలో సన్నదారం వేయడంతో పాటు నిలువు పోగులు అధికంగా ఉండటం ప్రత్యేకత. సాధారణ చీరలో 72 పోగులు ఉంటే, ఈ ప్రత్యేక చీరలో 96 పోగులు ఉంటాయి. సాధారణ చీర సుమారు 550 గ్రాముల బరువు ఉండగా, బోన్ చీర 650 గ్రాముల వరకు బరువు ఉండటం విశేషం. సాధారణంగా రెండు పాపడా చెక్కలతో చీర నేస్తారు. అయితే బాలరాజు బోన్ సింగిల్ ఇక్కత్ చీరను నాలుగు పాపడా చెక్కలతో కాలు మారుస్తూ నేశారు. ఈ చీరను నేయడానికి సుమారు వారం రోజుల సమయం పడుతుందని, ఒక్కో చీర విలువ దాదాపు రూ.14 వేల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన గత 50 ఏళ్లుగా చేనేత కళనే నమ్ముకున్నారు. చేనేత సహకార సంఘంలో మేనేజర్గా, డైరెక్టర్గా కూడా సేవలందించి ఆయన పదవీ విరమణ అనంతరం కొత్త నమూనాల చీరలను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. తాను రూపొందించిన చీరకు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని బాలరాజు తెలిపారు. -
జాతీయ అవార్డే లక్ష్యం..
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన చేనేత కళాకారుడు రెబ్బ యాదగిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆరు నెలల పాటు శ్రమించి ప్రకృతి సహజ సిద్ధమైన రంగులతో మామిడి కొమ్మలు, పూర్ణకుంభం, కలశం డిజైన్లో పోచంపల్లి ఇక్కత్ చీరను రూపొందించారు. 30 ఏళ్ల నుంచి చేనేత వృత్తిలో ఉన్న ఆయన విభిన్నమైన రంగులు, డిజైన్లతో కూడిన ముడి సరుకులు తయారు చేయించి పది మగ్గాల ద్వారా సొంతంగా చీరలను నేయిస్తూ తనతో పాటు మరో ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాతీయ స్థాయి పురస్కారానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎంపిక కాలేదు. వచ్చే ఏడాది ఎలాగైనా జాతీయ స్థాయి పురస్కారాన్ని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా చీరను తయారు చేస్తున్నానని యాదగిరి తెలిపారు. తనకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భువనగిరిటౌన్ : సైబర్ నేరాలపై అపమ్రత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సురక్షిత డిజిటల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. సురక్షా తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం భువనగిరిలోని ఫంక్షన్హాల్లో విద్యార్థులు, పట్టణ ప్రజలకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సైబర్, ఫోరెన్సిక్ నిపుణులు, సైటెక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సందీప్ ముదల్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారో వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు లక్ష్మీనారాయణ, వినోద్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, డీఎస్పీ రవీందర్, శ్రీనివాస్నాయడు, మధుసూదన్రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ ఎస్పీ అక్షాంశ్ యాదవ్ -
గర్భంలోనే అంతం!
భువనగిరి: పుట్టకముందే ఆడబిడ్డగా ముద్రపడి ఈ లోకాన్ని చూడకుండానే కన్నుమూస్తున్న పసికూనలెందరో.. అమ్మ ఒడిలోకి చేరి ఆడుతూ పాడాల్సిన పసిపాపలు గర్భంలోనే అంతమైపోతున్నారు. జిల్లాలో గత నాలుగేళ్లుగా ఆడ, మగ పిల్లల జననాల మధ్య పెరుగుతున్న వ్యత్యాసమే ఈ దుస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది. జిల్లాలో బాలికల జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ సేకరించిన గణాంకాలు పరిశీలిస్తే ఆడమగ జననాల మధ్య అంతరం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వారి సంఖ్య పెంచేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, మెప్మా, విద్యాశాఖకు చెందిన అధికారులు ఆడపిల్లలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలు, పథకాలు, వారి సంరక్షణ, ఆడపిల్లలను కనడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా శాఖల అధికారులు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పురావడంలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కానింగ్ సెంటర్లను తూతూ మంత్రంగా తనిఖీ చేయడం తప్ప నిరంతరం నిఘా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు, భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. డబ్బులకు ఆశపడి.. పలు స్కానింగ్ సెంటర్లు డబ్బులకు ఆశపడి.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలకు కమీషన్లు ముట్టజెప్పి వారి ద్వారా లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయడానికి రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.15వేల నుంచి రూ. 20వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఆడపిల్ల అని తేలితే గర్భంలోనే తుంచేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేసి సీజ్ చేసినప్పటికీ రాజకీయ పలుకుబడితో తిరిగి అనుమతులు తెచ్చుకుంటూ మళ్లీ నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు జిల్లా కేంద్రంతో పాటు తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆత్మకూర్, మోత్కూర్, చౌటుప్పల్, రాజాపేట, నారాయణపురం మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెడతాం. పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ట్రైబల్ ఏరియాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో చాలా వరకు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు తగ్గిపోయాయి. ఇంకా ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం అందితే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. – మనోహర్, డీఎంహెచ్ఓనాలుగేళ్లుగా తగ్గుతున్న ఆడపిల్లల జననాలు ఫ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్లు ఫ ఆడపిల్ల అని తేలితే గర్భంలోనే చిదిమేస్తున్న వైనం గత నాలుగేళ్లుగా బాలికల జనన నిష్పత్తి వివరాలు.. (ప్రతి వేయి మంది మగ పిల్లలకు) సంవత్సరం ఆడపిల్లల సంఖ్య 2022 978 2023 880 2024 870 2025 866 2026 జూలై వరకు 856 -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
సాక్షి,యాదాద్రి : ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షలను ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాలు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు సాధించేందుకు ఆగస్టు 15 నాటికి మౌలిక వసతులు, పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాల నమోదులో ప్రతిభ కనబరిచిన వలిగొండ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి సూర్యశ్రీ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పర్యవేక్షకులు విజయసారధి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు రాజాపేట : విద్యార్థుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. గుడ్లు, చికెన్ క్రమంతప్పకుండా అందించడం లేదని తెలుసుకుని కాంట్రాక్టర్తో మాట్లాడి మెనూ ప్రకారం అందేలా చూడాలని ప్రిన్సిపాల్ సుధాకర్కు సూచించారు. అన్ని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ ఇచ్చేందుకుగాను ఉపాధ్యాయుడు రాజును నియమిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట సర్పంచ్ కోయ మధు, పీఆర్ ఎస్ఈ విష్ణువర్ధన్, డీఈ శ్రీరామ్, తహసీల్దార్ రవికిరణ్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
ఇక్కత్ పోచంపల్లి ప్రత్యేకత
చండూరు : ఇక్కత్లో పోచంపల్లి స్టైల్ చీరలు తయారు చేయడం చండూరు పట్టణానికి చెందిన వర్కాల సత్యనారాయణ ప్రత్యేకత. ఈ చీర నేయడానికి 20 రోజులకు పైగా పడుతుందని, ఈ చీర ధర మార్కెట్లో రూ.50 వేలకు పైగా పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. 43 ఏళ్లుగా ఈ వృత్తిలోనే ఉన్నానన,ఇ గతంలో ఒకే రకం చీరలు తయారు చేసేవాళ్లమని, ఇప్పుడు పోచంపల్లి చీరలు, ఇక్కత్ రకాలకు బాగా డిమాండ్ ఉండడంతో అవి తయారు చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
నకిరేకల్ : సెల్ఫోన్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నకిరేకల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సీఐ హరిబాబు వెల్లడించారు. శాలిగౌరారం మండలం మాదారంకలాన్ గ్రామానికి చెందిన గర్రె లక్ష్మయ్య గత నెల 17న తన సెల్ఫోన్ పోయిందని నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మంగళవారం ఉదయం నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సెల్ఫోన్లు చోరీ చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. వారు హైదరాబాద్ నుంచి కారులో వచ్చి సెల్ఫోన్లు చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వారి నుంచి రూ.3.50లక్షల విలువ చేసే 21 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన బేతంపల్లి ప్రభు, సిద్దిపేట జిల్లా రంగదంపల్లి గ్రామానికి చెందిన ఆవుల విజయ్, ఏపీలో నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన ఎరుకల శివశంకర్ ఉన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల యజమానులను గుర్తించి వారికి అందజేస్తామని సీఐ తెలిపారు. 21 సెల్ఫోన్లు, కారు స్వాధీనం -
మద్యం అనుకుని.. కాళ్ల నొప్పుల తైలం తాగి వృద్ధుడి మృతి
గుర్రంపోడు : మద్యం అనుకుని పొరపాటున కాళ్ల నొప్పులకు వాడే తైలం తాగి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం తేనపల్లి గ్రామంలో జరిగింది. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. తేనపల్లి గ్రామానికి చెందిన కాసర్ల బక్కయ్య(75) నివాసముంటున్న ఇంటి పక్కన ఆదివారం దశదిన కర్మ జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ ఇంటి పరిసరాలు శుభ్రం చేయడానికి బక్కయ్య కూలీగా వెళ్లాడు. శుభ్రం చేసే క్రమంలో అక్కడ కనిపించిన కాళ్ల నొప్పులకు వాడే కేసరి తైలం సీసాను మద్యం సీసా అనుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం బక్కయ్య తన ఇంట్లో భోజనం చేసిన తర్వాత మద్యం అనుకొని సెల్ఫ్లో ఉన్న కేసరి తైలం తాగాడు. కొద్దిసేపటి తర్వాత కడుపులో మంటగా ఉండి వాంతులు చేసుకోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు సీసాను పరిశీలించి అది కాళ్ల నొప్పులకు వాడే తైలంగా గుర్తించి వెంటనే అతడిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి కుమారుడు కాసర్ల వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా
● ఐదుగురు మహిళలకు గాయాలునడిగూడెం : ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఐదుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన నడిగూడెం మండలం రత్నవరం గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన రమేష్ తన ఆటోలో అదే గ్రామానికి చెందిన 11 మంది మహిళా కూలీలను రత్నవరం గ్రామంలో వరి నాట్లు వేసేందుకు తీసుకెళ్తున్నాడు. రత్నవరం నుంచి తెల్లబల్లికి వెళ్లే రహదారిలో గుంతలను గమనించకుండా ఆటోను నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మందుల త్రివేణి, నేలమర్రి నాగమణి, చిన బుజ్జి, పులి ఉమ, మందుల అరుణ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగింత సంస్థాన్ నారాయణపురం : మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాల నుంచి గోడ దూకి పారిపోయిన ఇద్దరు విద్యార్థులను తిరుపతి రైల్వే స్టేషన్లో గుర్తించిన పోలీసులు మంగళవారం ఉదయం పాఠశాలకు తీసుకొచ్చారు. చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ పాండు విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డికి అప్పగించారు. ప్రిన్సిపాల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను వారికి అప్పగించారు. హాస్టల్లో ఉండలేకే పాఠశాల నుంచి వెళ్లిపోయామని విద్యార్థులు తెలిపినట్లు సమాచారం. -
వానైనా.. ఎండైనా.. వాకింగ్ తప్పను
ఫ చిరుజల్లుల్లో తలకు హెల్మెట్తో వాకింగ్ అర్వపల్లి : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బందెల వెంకన్న ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్కు వెళ్తుంటారు. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా, ఏ ఇతర సమస్యలు ఎదురైనా గ్రామం నుంచి అర్వపల్లికి వాకింగ్ చేసుకుంటూ వచ్చి తిరిగి వెళ్తారు. ఆయన గత 25 ఏళ్లుగా ఇలానే వాకింగ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం వర్షం వస్తున్నా హెల్మెట్ ధరించి వాకింగ్ చేశారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఆయన సైకిల్పై, మోపెడ్పై తిరిగేటప్పుడు కూడా హెల్మెట్ ధరించేవారు. ప్రతిరోజు రెండు పూటలా వాకింగ్ చేయడం, బయటకు వెళ్తే హెల్మెట్ ధరించడం తనకు అలవాటుగా మారిందని వెంకన్న తెలిపారు.వర్షంలో హెల్మెట్ ధరించి వాకింగ్ చేస్తున్న వెంకన్న -
‘వరి’లో కాలిబాటలతో అధిక ప్రయోజనాలు
నడిగూడెం : ప్రస్తుతం వానాకాలం సీజన్లో బావులు, బోర్లు, చెరువుల కింద వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరి పొలంలో కాలిబాటలు తీయిస్తే పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ చెబుతున్నారు. వరి పొలంలో కాలిబాటలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, పైరుపై చీడపీడల సమస్య కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. వరి పొలంలో కాలిబాటలపై ఆయన సలహాలు, సూచనలు ఇవీ.. పాటించాల్సిన విధానం..కాలిబాటలు తీసుకునే సమయంలో రైతులు పొడవైన ప్లాస్టిక్ తాడును గట్టుకు ఒకవైపు నుంచి రెండో వైపునకు సాగదీసి కట్టాలి. తాడు వెంబడి 12 సెం.మీ. వెడల్పున వరి నాట్లు తొలగించి పక్కనే పలుచగా ఉన్నచోట నాటుకోవాలి. చేను గట్టు పక్క నుంచి అడుగు దూరంలో కాలిబాట వేసి అక్కడి నుంచి ప్రతి రెండు మీటర్ల దూరంలో ఒక కాలిబాట తీయాలి. కొందరు రైతులు ప్రతి 6 నుంచి 7 మీటర్లకు ఒక కాలిబాట తీస్తుంటారు. దీని వల్ల ప్రయోజనం ఉండదు. ముందు నాట్లు వేసిన తర్వాత రైతులు గట్లకు ఇరువైపులా తాడు కట్టి మార్క్ చేసిన చోట ఉన్న మొక్కలను తీసివేసి కాలిబాట తీస్తుంటారు. వెదజల్లే పద్ధతిలో పైరు ఎదుగుతున్న సమయంలో 15 నుండి 20 రోజుల వ్యవధిలో 20 సెం.మీ. వెడల్పులో వరి నాట్లు తొలగించి కాలిబాట వేసుకోవచ్చు. ఇవీ ప్రయోజనాలు..కాలిబాటతో పైరు మొదళ్ల వరకకు వెలుతురు, గాలి తగులుతుంది. దీంతో పైరు ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది. చీడపీడల బెడద కొంతవరకు తగ్గుతుంది. కాలిబాట మార్గంలో వెళ్లి కలుపు మొక్కలు తొలగించడానికి, మందులు చల్లుకోవడానికి వీలవుతుంది. తెగుళ్లు గుర్తించి సస్యరక్షణ చర్యలు తీసుకోవడానికి, ఎలుకల నివారణకు కాలిబాటలు ఉపయోగపడతాయి. తుఫానులు, భారీ వర్షాలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు పంట చేలలో కిరణజన్య సంయోగక్రియ సమర్ధవంతంగా జరిగి దిగుబడి పెరుగుతుంది. పైరులో చీడపీడల ఉధృతిని అతి సమీపం నుంచి గమనించి, దానికి అనుగుణంగా సకాలంలో సస్యరక్షణ తీసుకునే వీలు ఉంటుంది.ఫ నడిగూడెం మండల వ్యవసాయాధికారి మల్సూర్ సూచనలు -
గవర్నర్ను కలిసిన ఎంజీయూ వైస్ చాన్స్లర్
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్లో నిర్వహించిన యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ల సమావేశం సందర్భంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. యూనివర్సిటీ పురోగతి, సామాజిక సేవా కార్యక్రమాలను గవర్నర్కు వీసీ వివరించారు. బీఈడీ పరీక్షలు ప్రారంభం నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ రెగ్యులర్, 1, 3 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎంజీయూ పరిధిలోని 13 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించినట్లు ఎంజీయూ సీఓఈ జి. ఉపేందర్రెడ్డి తెలిపారు. నల్లగొండలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్షలను పకర్బందీగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.గంజాయి సేవిస్తున్న నలుగురి అరెస్టు ● మరొకరు పరారీ మేళ్లచెరువు : గంజాయి సేవిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు చింతలపాలెం ఎస్ఐ పరమేష్ మంగళవారం తెలిపారు. చింతలపాలెం మండలం దొండపాడు గ్రామ శ్మశానవాటిక వద్ద ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అదే గ్రామానికి చెందిన కేతారపు సాయి, చిన్నపంగు అభిలాష్, సాకి వెంకటేశ్వర్లు, దేశాల నితీష్ ఉన్నారు. తిరుమలగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి పారిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. వారి నుంచి 50 గ్రాముల గంజాయి, సిగరెట్ పెట్టె, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో చోరీ హాలియా : పట్టణంలోని సాగర్ ఎడమ కాల్వ సమీపంలో గల పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీని అపహరించారు. ఆ హుండీని సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వెనుక భాగంలో పగులగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. ఆలయ చైర్మన్ చెరుపల్లి ముత్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రాఘవరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుత్ తీగ యమపాశమైంది
● వ్యవసాయం పొలం వద్ద విద్యుదాఘాతంతో యువకుడు మృతిమఠంపల్లి : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన మఠంపల్లి మండలం బక్కమంతలగూడెంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బక్కమంతలగూడేనికి చెందిన నిమ్మల నరేష్ (30) మంగళవారం ఉదయం పనుల నిమిత్తం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పొలం వద్ద విద్యుత్ వైరు తెగి పక్కనే ఉన్న ఫెన్సింగ్పై పడింది. ఇది గమనించని నరేష్ ఫెన్సింగ్పై చేయి పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
టీఎంయూను గెలిపించండి
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, బకాయిపడ్డ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో తమ యూనియన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన నల్లగొండ రీజియన్ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆరేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ నీతి నిజాయితీ గల తమ సంఘంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. యాజమాన్యం కార్మికుల శ్రమను దారుణంగా దోచుకుంటోందని, కొన్ని డిపోల్లో మహిళా ఉద్యోగులు రాత్రివేళల్లో డ్యూటీలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సమ్మె సమయంలో జేఏసీ నాయకులు 10 శాతం ఫిట్మెంట్కు ఒప్పుకోగా, తాము మాత్రం దాన్ని వ్యతిరేకించడంతో 11 శాతానికి పెంచిందన్నారు. రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో సీఐటీయూ మద్దతు తమకే ఉందన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే ఏకై క నాయకుడు అశ్వత్థామరెడ్డి అని కొనియాడారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆలస్యం కావడానికి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులే ప్రధాన కారణమని విమర్శించారు. తమ సంఘం సుదీర్ఘంగా చేసిన పోరాటాల ఫలితంగానే ఉద్యోగులకు 44 శాతం జీతాలు పెరిగాయని, అలాగే 17 వేల మంది ఉద్యోగుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ అయ్యాయని స్పష్టం చేశారు. కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి తమ ప్యానెల్కు అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నిరంజన్, నాగశేషు, యాదయ్య, శ్రీదేవి, మీలా ప్రభాకర్, శ్రీనివాస్, రీజియన్ సెక్రెటరీ గోపనబోయిన శ్రీనివాస్, అధ్యక్షుడు తయబ్, అన్ని డిపోల సెక్రటరీలు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి నల్లగొండలో ఆర్టీసీ రీజియన్ సర్వసభ్య సమావేశం -
రూ.48 కోట్ల ధాన్యం పక్కదారి
భానుపురి (సూర్యాపేట), మేళ్లచెరువు : మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్లో రీజినల్ ఎన్ఫోర్స్మెంట్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో దాదాపు రూ.48 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రబీ 2022–23, రబీ 2023–24, ఖరీఫ్ 2024–25, రబీ 2024–25 సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించగా ఆన్లైన్ రికార్డులు, స్టాక్ వివరాలు, మిల్లులో భౌతికంగా ఉన్న నిల్వల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక పరిశీలనలో యాక్షన్ ధాన్యాన్ని మినహాయించి సుమారు 19,843.429 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయమైందని గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.48 కోట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా, రబీ 2022–23 సీజన్కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ.5.66 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉన్నట్లు కూడా గుర్తించారు. అన్ని సీజన్లలో కలిపి ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం విలువ, బకాయిలను కలిపి సుమారు రూ.53.66 కోట్ల మేర నష్టం సంభవించినట్లు అధికారుల బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం తుది నివేదికను సంబంధిత ప్రభుత్వానికి సమర్పించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో రీజినల్ విజిలెన్స్ అధికారి ప్రతాప్, సభ్యులు సీఐ గౌస్, డీటీసీఎస్లు రాజశేఖర్, గిరిప్రసాద్, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేళ్లచెరువులోని రైస్ ఇండస్ట్రీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు మరో రూ.5.66 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తింపు -
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలి
మునుగోడు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆ పార్టీ నాయకులకు సూచించారు. మంగళవారం మునుగోడులోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ దేశంలోని పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 6న జీపు జాతా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ జీపు జాతాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుర్జ రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నర్సింహ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తిరిపారి వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మాదగోని సత్తమ్మ, ఈదులకంటి కై లాస్ గౌడ్, ఉప్పునూతల రమేష్ యాదవ్, బండమీది యాదయ్య, గోసుకొండ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
నేరాలకు దూరంగా ఉండాలి
మిర్యాలగూడ టౌన్ : ప్రతిఒక్కరూ నేరాలకు దూరంగా ఉండాలని మిర్యాలగూడ ఇన్చార్జి డీఎస్పీ రవి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం మిర్యాలగూడలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో రౌడీ షీటర్లకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల ప్రశాంతతకు ఎలాంటి భంగం కల్గించొద్దన్నారు. బెదిరించడం, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లతో పాటు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. నేరాలకు పాల్పడితే నిర్భంద చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, వన్ టౌన్, టూ టౌన్ సీఐలు నాగభూషణం, సోమ నర్సయ్య, రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య, వేములపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, మాడుగులపల్లి ఎస్ఐ సురేష్, అడవిదేవులపల్లి ఎస్ఐ శేఖర్, వన్ టౌన్, టూటౌన్ ఎస్ఐలు ఆంజనేయులు, రమేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ ఇన్చార్జి డీఎస్పీ రవి -
30 రోజుల్లోనే కుల, నివాస ధ్రువపత్రాలు
గడువులోగా సేవలు అందిస్తాంప్రజలకు నిర్ణీత గడువులోగా రెవెన్యూ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కులం, నివాస ధ్రువపత్రాల దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి 30 రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుల పురోగతి ఆన్లైన్లో ప్రత్యక్షంగా నమోదు కావడం వల్ల సేవల్లో పారదర్శకత పెరుగుతుంది. – రాములు, తహసీల్దార్ గట్టుప్పల్ : రెవెన్యూ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులం, నివాస ధ్రువపత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రజా సేవల హక్కు (రైట్ టు పబ్లిక్ సర్వీసెస్) చట్టం కింద పేపర్ లెస్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే పత్రాలను గరిష్టంగా 30 రోజుల్లోగా జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం వారం రోజుల్లోనే అందించనున్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా సేవలు అందకపోతే బాధ్యులపై ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే హక్కును కూడా పౌరులకు కల్పించారు. ఆన్లైన్ పర్యవేక్షణతో జాప్యానికి చెక్ ప్రతి ఏటా విద్య, ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, బ్యాంకింగ్, సంక్షేమ పథకాల కోసం వేలాది మంది ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే సిబ్బంది కొరత, క్షేత్రస్థాయి విచారణలో ఆలస్యం, ఫైళ్లు పెండింగ్లో పడటంతో పత్రాల జారీ తీవ్ర జాప్యమవుతోంది. ఫలితంగా విద్యార్థులు అడ్మిషన్లు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు, రైతులు సబ్సిడీలు కోల్పోతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం కాలపరిమితి నిబంధన తెచ్చింది. మీసేవలో దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ప్రతి దశను ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనివల్ల ఫైలు ఏ దశలో ఉందో, ఆలస్యానికి కారణమైన సిబ్బంది ఎవరో సులభంగా గుర్తించవచ్చు. దరఖాస్తుల ప్రాసెస్.. అప్పీల్ విధానం దరఖాస్తు విధానం మీసేవలో ప్రారంభమై ఆపై గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) పరిశీలనకు వెళ్తుంది. విచారణ అనంతరం జీపీఓ వివరాలను రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) లాగిన్కు పంపుతారు. ఆర్ఐ పరిశీలన పూర్తయ్యాక తహసీల్దార్ లాగిన్కు చేరుతుంది. తహసీల్దార్ ఆమోదం పొందిన తర్వాత ధ్రువపత్రం నేరుగా మీసేవ కేంద్రానికి చేరుతుంది. దరఖాస్తు నిర్ణీత గడువులోగా రాకపోయినా లేదా తగిన కారణం లేకుండా తిరస్కరించినా బాధితులు ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ ఆధారంగా అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారు. ఆదాయ ధ్రువీకరణ ప్రతం జారీకి వారం రోజులే గడువు ప్రజా సేవల హక్కు చట్టంలోకి రెవెన్యూ సేవలు -
నేటి నుంచి వంగపల్లి రైల్వే గేట్ మూసివేత
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట–వంగపల్లి ప్రధాన రహదారిలో వంగపల్లి గ్రామం వద్ద ఉన్న రైల్వే గేట్ను బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ సాయంత్రం వరకు మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలి పారు. భువనగిరి–వంగపల్లి గ్రామాల మధ్య గల లెవల్ క్రాసింగ్ 33 టీ ఓవర్ పోలింగ్ మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ రైల్వే గేట్ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారులు రాయగిరి, కందుకూరు గ్రామాల మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంసంస్థాన్ నారాయణపురం: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ అక్షాంశ్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, జనరల్ డైరీ (జీడీ), రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందనతో పాటు ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, స్టేషన్ ఎస్హెచ్ఓ పాండు ఉన్నారు. సైబర్ నేరాల నివారణపై నేడు అవగాహన సదస్సుభువనగిరిటౌన్ : సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు భువనగిరిలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి వ్యాపారులు, ప్రజలు హాజరుకావాలని పోలీసులు కోరారు. ఒటీపీ, పిన్, పాస్వర్డ్ వివరాలను ఎవరికీ చెప్పవద్దని పోలీసులు సూచించారు. బ్యాంక్ వివరాలు, అనుమానాస్పద లింక్లు, నకిలీ కైవెసీ కాల్స్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, లోన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు సరిచూసుకోవాలని, సోషల్ మీడియా ఖాతాలకు రెండంచెల భద్రత (టూ–ఫ్యాక్టర్ అథెంటికేషన్) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రై మ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అత్యవసర సహాయానికి డయల్ 112 ని సంప్రదించవచ్చని కోరారు. క్షేత్రపాలకుడికి ఆకుపూజయాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. ప్రధానాలయాన్ని తెరచి సుప్రభాతం చేపట్టారు. బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలు జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన చేశారు. ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను నిర్వహించారు. -
వారం రోజుల్లో ఆస్పత్రులపై నివేదిక ఇవ్వాలి
చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులపై వారం రోజుల్లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లోని తన చాంబర్లో మునుగోడు నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రులు, వాటి అభివృద్ధిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో కలిసి మంత్రి సమీక్షించారు. సబ్సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులను ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలను ఎమ్మెల్యే రాజ గోపాల్రెడ్డి వివరించారు. చౌటుప్పల్లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, మునుగోడు, నాంపల్లి ఆస్పత్రులను 30పడకలకు, మర్రిగూడ ఆస్పత్రిని 50పడకలకు, చండూరులో 100పడకలకు పెంచాలని, గట్టుప్పల్ ఆస్పత్రికి సిబ్బందిని మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఆస్పత్రుల బడ్జెట్ పెంచాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చౌటుప్పల్లో ప్రస్తుతం నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి సెప్టెంబర్ మాసంలో ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్తోపాటు ట్రామాకేర్ సెంటర్ను సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్నాయక్, నల్లగొండ, యాదాద్రి జిల్లాల వైద్యాధికారులు డాక్టర్ రాహుల్, మనోహర్, డీసీహెచ్లు సూర్యశ్రీ, మాతృనాయక్ పాల్గొన్నారు. ఫ చౌటుప్పల్లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ఫ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫ మునుగోడు నియోజకవర్గంలోని ఆస్పత్రులపై ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డితో కలిసి సమీక్ష -
కాంప్లెక్స్ ఎరువులూ యాప్ ద్వారానే..
భువనగిరి: జిల్లాలోని రైతులు ఇకపై యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఆన్లైన్ యాప్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎరువుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ, రైతులకు వారి సాగు విస్తీర్ణం మేరకు అవసరమైన ఎరువులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఫెర్టిలైజర్ యాప్ విధానం తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అమలవుతున్న ఈ పద్ధతిని మూడో విడత కింద ఈ నెల రెండో వారం నుంచి భువనగిరి జిల్లాలోనూ ప్రారంభం కానుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అంటే.. ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) అనేది ఎరువుల విక్రయాలు, నిల్వలు, డిమాండ్, సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ. రాయితీ ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించి, అవసరానికి అనుగుణంగా నిర్ణయించిన మోతాదులో అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ విధానంలో రైతు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం ఆధారంగా ఎకరానికి నిర్దేశించిన పరిమితిలోనే రాయితీ ఎరువులను అందజేస్తారు. బుకింగ్ విధానం ఫ ముందుగా రైతులు తమ స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ ఇందులో తెలుగు భాషను ఎంచుకునే అవకాశం ఉంది. ఫ యాప్లో రైతులు తమ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలి. ఫ ఒకవేళ ఆన్లైన్లో భూమి వివరాలు కనిపించకుంటే, వాటిని స్వయంగా యాప్లో నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. ఫ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత, అవసరమైన ఎరువు రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఫ ఏ డీలర్ వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారో యాప్లోనే ఎంచుకుని బుకింగ్ పూర్తి చేయాలి. ఫ రైతులు బుక్ చేసిన వివరాలన్నీ నేరుగా ఆ డీలర్ వద్ద ఉన్న పీవోఎస్ యంత్రంలో కనిపిస్తాయి. వాటి ఆధారంగా డీలర్ రైతులకు రాయితీ ఎరువులు అందజేస్తారు. సహకరించాల్సిన బాధ్యత డీలర్లదే.. కొత్త విధానం కాబట్టి ప్రారంభ దశలో స్మార్ట్ఫోన్ వినియోగం తెలియని రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి డీలర్ ఇద్దరు వలంటీర్లను ఏర్పాటు చేయాలి. వాస్తవానికి మండల స్థాయిలో ప్రత్యేకంగా ఒక యూనిట్ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అది ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల తరఫున బుకింగ్ ప్రక్రియలో డీలర్లే పూర్తి సహకారం అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు యాప్ ద్వారా యూరియా మాత్రమే కొనుగోలు చేసేవారు. ఇక నుంచి అన్ని ఎరువుల విక్రయాలు యాప్ ద్వారానే జరుగుతాయి. ఈ విధానంలో రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. పూర్తి వివరాల కోసం సమీపంలోని వ్యవసాయ అధికారిని, మీ–సేవ కేంద్రాన్ని లేదా పీఏసీఎస్ ను సంప్రదించవచ్చు. – పీవీ రమణారెడ్డి, డీఏఓఫ రైతుల సాగు విస్తీర్ణం, పంట ఆధారంగా ఎరువుల కోటా ఫ రెండో వారం నుంచి అమలు కానున్న ఎఫ్ఎఫ్ఎస్ ఫ ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే డీలర్ల వద్ద సబ్సిడీ ఎరువుల అందజేత -
పేసే్కల్.. ఉద్యమబాట
రామన్నపేట: పేస్కేల్ అమలు, సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్ వేతనాల విడుదలే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. జూలై 27 నుంచి చేపట్టిన పెన్డౌన్ నిరసన తో జిల్లాలో ఉపాధి పనులకు ఆటంకం కలుగుతోంది. రెండు దశాబ్దాలుగా ఒకే హోదా.. ఒకే వేతనం జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ (వీబీ జీ రామ్ జీ) లో అదనపు ప్రోగ్రాం ఆఫీసర్లు 15 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు 66 మంది, ఈసీలు 14మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 32మంది, జిల్లా కార్యాలయంలో 25మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2006లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులైన ఈ ఉద్యోగులు 20 ఏళ్లుగా గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించిన కార్యక్రమాల అమలులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలగా ఒకే పోస్టులో, ఒకే వేతనంతో కొనసాగుతున్నారు. స్తంభించిన అభివృద్ధి పథకాలు తెలంగాణ జలసిరిలో భాగంగా ఎల్నినో ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి గ్రామానికి ఒక ఫామ్పాండ్, కమ్యూనల్ ఇంకుడు గుంత నిర్మించాలనే లక్ష్యానికి సమ్మె వల్ల బ్రేక్ పడింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మస్టర్లు జనరేట్ కాకపోవడంతో లబ్ధిదారుల హాజరు నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. వన మహోత్సవానికి సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాలు, సంరక్షణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఫ స్తంభించిన గ్రామీణాభివృద్ధి పనులు ఫ జూలై 27 నుంచి పెన్డౌన్ చేపట్టిన ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఫ జలసిరి, వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఆటంకం ఫ 15లోగా పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ పేస్కేలు ప్రకటించి, ఆగస్టు 15వ తేదీలోగా అమలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలి. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలి. పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలి. అర్హత కలిగిన సిబ్బందికి పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలి. -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు చేశారు. భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిరాజాపేట : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందని పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్ పేర్కొన్నారు. రాజాపేట మండలం బొందుగుల ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పరమేష్, మండల అధ్యక్షుడు సంపతి సుబ్బరాజు, కార్యదర్శి బాలరాజు, మహిళా ఉపాధ్యక్షురాలు భారతి, జిల్లా బాధ్యుడు రవీందర్ పాల్గొన్నారు. సకాలంలో అనుమతులు ఇవ్వాలిభువనగిరిటౌన్ : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. డీఐపీసీలో భాగంగా ఏడుగురు ఎస్టీ లబ్ధిదారులకు రూ.17.50లక్షల రాయితీ, నాలుగు పరిశ్రమలకు సంబంధించి రా మెటీరియల్ మంజూరుకు ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్, ట్రాన్స్పోర్ట్ అధికారి నరేష్ పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు భూదాన్పోచంపల్లి: జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని డీఈఓ భిక్షపతి వెల్లడించారు. సోమవారం భూదాన్పోచంపల్లి జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. టీచర్లు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. పిల్లల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులను ఎక్కువ ఉన్న చోటు నుంచి అవసరం ఉన్న స్కూల్కు సర్దుబాటుచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, శ్రీదేవి, పుష్పలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అతడికి రెండు రోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. కారు ఢీకొని వ్యక్తికి గాయాలుహుజూర్నగర్ : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన గండు సతీష్ సోమవారం ద్విచక్ర వాహనంపై హుజూర్నగర్ నుంచి నేరేడుచర్ల వైపు వెళ్తుండగా.. గోపాలపురం వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ తలకు గాయాలయ్యాయి. స్ధానికులు అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు. సతీష్ ఎస్బీఐ లైఫ్ ఇన్యూరెన్స్లో పనిచేస్తున్నాడు. -
కొత్త పింఛన్లపై ఆశలు
భువనగిరి: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు, వృద్ధులు, వికలాంగుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం తాజాగా ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వాస్తవానికి జూన్ 2నవీటిని ఇస్తారని భావించినా మంజూరు కాలేదు. ఈసారైనా తమ ఆశ నెరవేరుతుందని భావిస్తున్నారు. నాలుగేళ్లుగా నిరీక్షణ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుదారులు దాదాపు నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్టోబర్ 2022లో మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే చివరిసారిగా కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించినప్పటికీ.. దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయలేదు. రెండేళ్లుగా కేవలం హామీలకే పరిమితం కావడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం 96,425 మంది లబ్ధిదారులు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 96,425 మంది లబ్ధిదారులు చేయూత పథకం కింద పింఛన్ పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.24.50 కోట్లను పంపిణీ చేస్తోంది. ఇందులో వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా బాధితులు, కల్లుగీత కార్మికులు, వికలాంగులు ఉన్నారు. వీరంతా జీవించే ఉన్నారా? లేదా? అన్న విషయమై అధికారుల గత నెలలో లైఫ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. అయితే కొందరు స్థానికంగా లేకపోవడం, మరికొందరు మృతి చెందినట్లు గుర్తించారు. పెండింగ్లో 28వేలకు పైగా దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ‘ప్రజాపాలన’ సభల ద్వారా పింఛన్ల కోసం జిల్లాలో సుమారు 28,652 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆన్లైన్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరికీ మంజూరు చేయలేదు. ఇవి కాకుండా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణితో పాటు, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలకు సైతం వెళ్లి నేరుగా దరఖాస్తులు అందజేశారు. అయితే ఆగస్టు 15 నుంచి పింఛన్లు ఇస్తామన్న ప్రకటన సంతోషం కలిగిస్తున్నా.. ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ఇప్పటికే ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తుదారులకే మంజూరు చేస్తారా? లేక కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తారా? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ కొత్త వారికి అవకాశం ఇస్తే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.ఫ 15 నుంచి మంజూరు చేస్తామన్న ప్రభుత్వం ఫ జిల్లాలో 28,652కు పైగా పెండింగ్ దరఖాస్తులు -
న్యాయం చేయాలని సబ్ స్టేషన్ ఎదుట ధర్నా
గరిడేపల్లి : విద్యుదాఘాతానికి గురై వికలాంగుడైన ప్రైవేట్ విద్యుత్ కార్మికుడికి న్యాయం చేయాలని అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గరిడేపల్లి సబ్స్టేషన్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఇటీవల విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టిన ట్టారు. ఆ పనులు చేపట్టిన విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న నేరేడుచర్ల మండలంకు దిర్శించర్ల పంగా సురేష్ విద్యుత్ స్తంభం పైకి పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గురై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, అతడి చేయి, కాలును తొలగించాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో సర్జరీ చేసి చేయి, కాలు తొలగించారు. అయితే ఈ ఘటనకు లైన్మెన్ కారింగుల అంజయ్య, విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, ఎల్సీ తీసుకోకుండానే సురేష్ను విద్యుత్ స్తంభం ఎక్కించారని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం గరిడేపల్లి విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ తన సిబ్బందితో సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని వారితో చర్చించి ఆందోళన విరమింపజేశారు. -
ధాన్యం నిల్వకు గోదాములు నిర్మిస్తాం
గుండాల : రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మిస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం పీఏసీఎస్ పాలక వర్గం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం మొదట జిల్లాకు 104 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. గుండాల పీఏసీఎస్కు 906 సర్వే నంబర్లో 4 ఎకరాలలో గోదాములు నిర్మిస్తామన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించేందుకు పీఏసీఎస్ సిబ్బంది కృషి చేయాలన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను ఆగస్టు 15 నాటికి కేటాయిస్తామని చెప్పారు. మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ అండెం సంజీవరెడ్డి, సర్పంచ్లు మచ్చ నాగిరెడ్డి, దేవనబోయిన అయిలయ్య, వల్లాల రమేష్, డైరెక్టర్లు అన్నెపర్తి యాదగిరి, సంగి శ్రీనివాస్, దూదిగామ నాగరాజు, పొన్నగాని నారాయణ, చిప్పలపల్లి సోమన్న, నూనెముంతల యాదయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్, మండల అధ్యక్షులు ఇమ్మడి దశరథ గుప్తా పాల్గొన్నారు. -
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్ అనురాగ్ జయంతిఅధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డిలతో కలిసి బాధితుల నుంచి 113 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 65, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు 15, మున్సిపాలిటీకి 7, సర్వే,ల్యాండ్ రికార్డ్స్ 4, సంక్షేమ శాఖ 3, వైద్య ఆరోగ్య శాఖ 3, ఇరిగేషన్ 2, డీసీఓ 2, డీపీఓ సంబంధించినవి 2 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. వ్యవసాయం, విద్య, మైన్స్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్ అండ్ బీ, మార్కెటింగ్, హౌసింగ్, సివిల్ సప్లయ్, ఇండస్ట్రీస్ జీఎం, పశుసంవర్ధక శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, డిప్యూటీ కలెక్టర్ కృతిక, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ అలివేలు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మపాలే అమృతం
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతల ఇళ్లకు అంగన్వాడీ టీచర్, ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి తల్లిపాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక సదస్సులు నిర్వహించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిస్థాయిలో వివరిస్తున్నాం. – కృష్ణవేణి, మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ ●ఆలేరు రూరల్, మిర్యాలగూడ టౌన్, భానుపురి: చిన్న పిల్లలకు తల్లిపాలు అమృతంతో సమానం. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించాలంటే తల్లిపాలను పట్టించాల్సిందే. మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య పోకడలు, అవగాహన లేమి కారణంగా బిడ్డకు అమృతతుల్యమైన తల్లిపాలు దూరమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో తల్లిపాలపై ఉన్న అపోహలు తొలగించి, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసేందుకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు తల్లిపాలపై బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. శిశువులకు కలిగే ప్రయోజనాలుపుట్టిన గంట నుంచి మూడు రోజుల పాటు లభించే ముర్రుపాలతో పాటు, ఆరు నెలల పాటు కేవలం తల్లి పాలు మాత్రమే తాగిన పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగి ఎంతో చురుగ్గా ఉంటారు. ప్రతిరోజు ఎనిమిది నుంచి పది సార్లు తల్లిపాలను శిశువులకు పట్టించవచ్చు. తల్లిపాలు చిన్నారులకు తేలికగా ఆరగడంతో పాటు డయేరియా, శ్వాసకోశ వ్యాధులు, పచ్చకామెర్లు, ఇతర అంటువ్యాధుల నుంచి శిశువును కాపాడతాయి. వీటిలో విటమిన్–ఏ, విటమిన్–కే పుష్కలంగా ఉంటాయి. పోషక విలువలుప్రతి వంద మిల్లీలీటర్ల తల్లిపాలలో ప్రోటీన్లు 1.1 గ్రాములు. కొవ్వు 4.2 గ్రాములు, లాక్టోస్ 7 గ్రాములు ఉంటాయి. వీటితో పాటు సోడియం, క్యాల్షియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు తగిన మోతాదులో ఉంటాయి. తల్లులకు కలిగే ప్రయోజనాలుబిడ్డకు పాలిచ్చే తల్లుల్లో కాన్పు అనంతరం గర్భాశయం వేగంగా సాధారణ స్థితికి రావడంతో పాటు రక్తస్రావం తగ్గుతుంది. అండాశయం, రొమ్ము సంబంధిత క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి స్థూలకాయం రాకుండా ఉంటుంది.ఉమ్మడి జిల్లాలో బాలింతలు, గర్భిణుల వివరాలు ఇవీ.. నల్లగొండ భువనగిరి సూర్యాపేటఐసీడీఎస్ ప్రాజెక్టులు 09 04 05 అంగన్వాడీ కేంద్రాలు 2,093 901 1,209 6 నెలల నుంచి 6 ఏళ్ల పిల్లలు 72,474 46,679 28,479 గర్భిణులు 8,538 4,994 7,200 బాలింతలు 6,593 3,232 5,595 7 వరకు అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్ సిబ్బంది -
20 మంది హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
నకిరేకల్ : ప్రైవేట్ పాఠశాల హాస్టల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం పాఠశాల హాస్టల్లో 220 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 20 మంది విద్యార్థులకు సోమవారం తీవ్ర విరేచనాలు కావడంతో హాస్టల్ నిర్వాహకులు వెంటనే స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారు కోలుకున్న తర్వాత తిరిగి హాస్టల్కు తీసుకొచ్చారు. ఆదివారం విద్యార్థులకు ఎగ్ బిర్యాని పెట్టామని.. అది తిన్న విద్యార్థుల్లో 20 మందికి జీర్ణంకాక విరేచనాలు అయ్యాయని హాస్టల్ నిర్వాహకుడు కందాల శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు. హాస్టల్ను సందర్శించిన అధికారులు.. నల్లగొండ జిల్లా కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి స్థానిక తహసీల్దార్ యశ్వంత్రాజ్, మండల విద్యాధికారి మేక నాగయ్య ఏవీఎం పాఠశాల హాస్టల్ను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహకులు ఆహరం అందించే విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. వారి వెంట ఏవీఎం విద్యాసంస్థల అదినేత కందాల పాపిరెడ్డి, ప్రిన్సిపాల్ కందాల స్వప్నశ్రీకాంత్రెడ్డి ఉన్నారు. -
‘మనూ’లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
నల్లగొండ టూటౌన్ : రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు మనూ స్టడీ సెంటర్ నల్లగొండ సమన్వయకర్త ఎస్.కె.ఆర్. అన్సారీ తెలిపారు. ప్రవేశాలు, కోర్సులకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) విభాగంలో బీఏ హాఆనర్స్, బీకాం, బీఎస్సీ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) విభాగంలో అరబిక్, ఉర్దూ, చరిత్ర, ఇంగ్లిష్, హిందీ, ఇస్లామిక్ స్టడీస్లో ఎంఏ కోర్సులకు ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. జర్నలిజం, ఇంగ్లిష్ బోధన, బాల్య సంరక్షణ–విద్య, పాఠశాల నాయకత్వం, ఉపాధి నైపుణ్యాలు, ఉర్దూ డిప్లొమా కోర్సులు, ఉర్దూ మాధ్యమం ద్వారా ఇంగ్లిష్ ప్రావీణ్య ధ్రువపత్ర కోర్సులు కూడా అందిస్తున్నట్లు వివరించారు. ప్రవేశాల ప్రక్రియ, కోర్సుల ప్రత్యేకతలు, విద్యార్థులకు లభించే అవకాశాలపై విశ్వవిద్యాలయ ప్రాంతీయ సంచాలకులు మజహర్ ఖాద్రీ, క్యూ డైరెక్టర్ సమీ సిద్ధిఖీ, సహాయ సంచాలకులు అమాన్ అబేద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9848514312 నంబర్ను సంప్రదించాలన్నారు. -
యాచకుడి మృతి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వైకుంఠద్వారం వద్ద స్పృహతప్పి పడిపోయిన యాచకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట వైకుంఠద్వారం వద్ద సిద్దులూరి జగదీష్, సిద్దులూరి శ్రీనివాస్(65)లు కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ ఆదివారం రాత్రి స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. తోటి యాచకుడు సిద్దులూరి జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే యాదగిరిగుట్ట ఎస్ఐ ఇంద్రారెడ్డిని సంప్రదించాలని సీఐ సూచించారు. సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ హుజూర్నగర్ : ద్విచక్ర వాహనంపై సారా తరలిస్తున్న వ్యక్తిని హుజూర్నగర్ ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ ఎకై ్సజ్ ఎస్ఐ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనఖీలు చేస్తుండగా.. మఠంపల్లి మండలం బాడవతండాకు చెందిన బానోత్ రంగా తన ద్విచక్ర వాహనంపై సారా తరలిస్తూ పట్టుబడ్డాడు. అతడి నుంచి 8 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బైక్ను ఢీకొట్టిన ఆవు.. దంపతులకు గాయాలు మర్రిగూడ : మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన దంపతులు సోమవారం ద్విచక్ర వాహనంపై మాల్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలోని కాటన్ మిల్లు వద్దకు రాగానే పక్కనే పొలాల్లో నుంచి రోడ్డు పైకి అకస్మాత్తుగా వచ్చిన ఆవు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో దంపతులిద్దరు బైక్పై నుంచి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని వెంటనే మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్కు జైలుశిక్ష వరంగల్ లీగల్ : అజాగ్రత్తగా, అతివేగంతో లారీ నడిపి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇరువురి మృతికి కారణమైన లారీ డ్రైవర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్డు జడ్జి బి. అనూష సోమవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని లష్కర్సింగారం ప్రాంతానికి చెందిన మునిగాల విజయ్కుమార్ తన సోదరి శ్వేతతో కలిసి 2016 అక్టోబర్ 16న ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి దేశాయిపేటకు వెళ్తుండగా.. మార్గమధ్యలో ములుగు రోడ్డు జంక్షన్ వద్ద వరంగల్ వైపు నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో విజయ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. శ్వేత చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సిలార్మియాగూడేనికి చెందిన లారీ డ్రైవర్ టి. వెంకన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో లారీ డ్రైవర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జడ్జి అనూష తీర్పు వెలువరించారు. జూదరుల అరెస్ట్ నేరేడుచర్ల : మండలంలోని కల్లూరు గ్రామ శివారులో సోమవారం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో నేరేడుచర్ల పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,500 నగదు, 3 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చళ్లమళ్ల గోపాల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
భువనగిరిటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) జిల్లా అధ్యక్షురాలు ఇంజ హేమలత, ప్రధాన కార్యదర్శి జిట్టా రాములు ఆరోపించారు. డీహెచ్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళితులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద దళిత కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ధర్నాకు ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డీ. ఇమ్రాన్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డీహెచ్పీఎస్ నాయకులు పిట్టల శంకర్, పోతూ ప్రవీణ్, మామిడికాయల నరసింహ, చెడె సుందరయ్య, గుండెపు వెంకటయ్య, వాసం గాలయ్య, వెంకన్న, ధనమ్మ, స్వామి, ముత్యాలు, జంగయ్య, శ్యాగ జానూ, మనోహర, శ్రీను, రాములు, అండాలు, వసంత పాల్గొన్నారు. -
ముగిసిన బోనాల ఉత్సవాలు
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలోని శ్రీఆంథోల్ మైసమ్మ దేవాలయంలో వార్షిక బోనాల వేడుకలు సోమవారం ముగిశాయి. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం పూర్ణాహుతి నిర్వహించి ముగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కంచర్ల అశ్విన్రెడ్డి, ఈఓ ఎస్. మోహన్బాబు, బాబు, నర్సింహ, ఆనందరెడ్డి, శివ, శ్రీకాంత్, యువరాజ్, మహేందర్రెడ్డి, రాజేష్, రాజేష్, రాజీవ, రమేష్, దాసు పాల్గొన్నారు. ఆంథోల్ మైసమ్మ ఆలయంలో పూర్ణాహుతి నిర్వహిస్తున్న భక్తులు -
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
కోదాడ రూరల్ : ఒరిస్సా నుంచి గంజాయి, ఖమ్మం నుంచి మత్తు కల్గించే దగ్గు సిరప్లను(టాస్సెక్స్) తీసుకొచ్చి కోదాడ పరిసరాల్లో విక్రయిస్తున్న ముఠాను పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. ఈ కేసు వివరాలను సోమవారం సీఐ కె. శివశంకర్తో కలిసి కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం అల్వాలపురానికి చెందిన మద్దే రవితేజ ఒరిస్సాలోని మల్కన్గిరి ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కోదాడకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని డేగబాబు ఫంక్షన్ హాల్ సమీపంలోని చెట్ల వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో సీఐ శివశంకర్ నేతృత్వంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్దే రవితేజతో పాటు కోదాడ పట్టణంలోని గణేష్నగర్కు చెందిన అవిడి రాఘవ, గాంధీనగర్కు చెందిన పంది వినోద్, చిన్నమసీదు బజారుకు చెందిన షేక్ మగ్దూమ్, తమ్మరబండపాలేనికి చెందిన షేక్ ఇర్షాద్తో పాటు మరో ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. నట్టే అనుదీప్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి 6 కేజీల గంజాయి, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి మత్తు సిరప్లు.. అంతేకాకుండా వారి నుంచి 38 మత్తు కలిగించే దగ్గు సిరప్(టాస్సెక్స్) బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిరప్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించగా.. ఖమ్మంలోని వైరా రోడ్లో గల ఏఐ మెడినోవా మెడికల్ స్టోర్లో పనిచేసే షేక్ సుభాని వద్ద నుంచి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రూ.279.69 ఉన్న టాస్సెక్స్ సిరప్లను రూ.350కు కొనుగోలు చేసి కోదాడలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు వారు అంగీకరించారు. దీంతో మెడికల్ షాపులో పనిచేసే షేక్ సుభానీని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర నిందితుల ప్రమేయంపై మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ అజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తొమ్మిది మంది రిమాండ్.. ఒకరు పరారీ అరెస్టయిన వారిలో ముగ్గురు మైనర్లు 6 కేజీల గంజాయి, 38 దగ్గు సిరప్ బాటిళ్లు, బైక్, ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..!
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ బైపాస్ రోడ్డుపై మృత్యుఘంటికలు మోగుతున్నాయి. నార్కట్పల్లి–అద్దంకి రహదారి గుండా వెళ్లే భారీ వాహనాలు మిర్యాలగూడ పట్టణంలోకి రాకుండా 2001లో పట్టణ శివారు నుంచి బైపాస్ నిర్మించారు. నిబంధనల ప్రకారం బైపాస్ నిర్మాణ సమయంలోనే సర్వీస్ రోడ్డు వేయాల్సి ఉన్నప్పటికీ, అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా సమీప గ్రామాల ప్రజలు, వాహనదారులు బైపాస్ రోడ్డు గుండానే ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మృత్యు నిలయాలుగా బ్లాక్ స్పాట్లుఒకప్పుడు మిర్యాలగూడ పట్టణ శివారులో ఉన్నట్లుగా కనిపించిన బైపాస్ రోడ్డు.. ఇప్పుడు వ్యాపార పరంగా పట్టణం విస్తరించడంతో టౌన్ మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ బైపాస్పై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రామచంద్రగూడెం, నందిపాడు రోడ్డు, చిల్లాపురం రోడ్డు, చింతపల్లి రోడ్డు, ఈదులగూడ ప్రాంతాలను పోలీసులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని భావించి నాలుగు చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, ఆ ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోవడం లేదు. 90 మందికి పైగా క్షతగాత్రులుగడిచిన 19 నెలల కాలంలోనే ఈ ఐదు బ్లాక్ స్పాట్లలో సుమారు 70కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రమాదాల్లో 24 మందికి పైగా మృత్యువాత పడగా, 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని ఘోర ప్రమాదాలు● ఆదివారం ఉదయం స్కూటీపై వెళ్తున్న దంపతులు చిల్లాపురం క్రాస్ రోడ్డు వద్ద బైపాస్ను దాటుతుండగా.. కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త స్వల్ప గాయాలయ్యాయి. ● గత నెల 21న నందిపాడు వద్ద స్కూటీపై వెళ్తున్న వ్యక్తి బైపాస్ దాటుతుండగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. అంతేకాకుండా ఆటోను, రోడ్డు పక్కన ఉన్న రెండు డీసీఎం వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తి మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ● ఇటీవల నందిపాడు వద్ద ద్విచక్ర వాహనంపై బైపాస్ దాటుతున్న దంపతులను కంటైనర్ ఢీకొనడంతో భార్య మృతిచెందగా, భర్త తీవ్రగాయాలతో జీవచ్ఛవంలా మారాడు. ● ఇటీవల చింతపల్లి వద్ద ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొనడంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ● గతేడాది ఈదులగూడ చౌరస్తాలో గ్రానైట్ లోడుతో వెళ్తున్న వాహనాన్ని ట్యాంకర్ ఢీకొట్టడంతో గ్రానైట్ బండల మధ్య నలిగిపోయి ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు.ధర్నా చేస్తున్న మిర్యాలగూడ బైపాస్ సమీప గ్రామాల ప్రజలుఫ నార్కట్పల్లి–అద్దంకి బైపాస్పై మిర్యాలగూడ పట్టణంలో ఐదు బ్లాక్స్పాట్లు ఫ 19 నెలల్లో 70కి పైగా ప్రమాదాలు ఫ 24 మందికి పైగా మృతి ఫ ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరుతున్నా పట్టించుకోని పాలకులునల్లగొండ : నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై మిర్యాలగూడ బైపాస్ వద్ద అండర్పాస్, ఫ్లైఓవర్ నిర్మించాలని సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట బైపాస్ రోడ్డు సమీప గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
నల్లబెల్లం, పటిక పట్టివేత
● ఇద్దరిపై కేసు నమోదుకొండమల్లేపల్లి : మండల పరిధిలోని ఆంగోతుతండాకు వెళ్లే మార్గంలో దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుంచి అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తున్న నల్లబెల్లం, పటికను పట్టుకున్నారు. కొండమల్లేపల్లి మండలం మేఘ్యతండాకు చెందిన ఆంగోతు తరుణ్, దేవరకొండ మండలం పడమటి తండాకు చెందిన పాత్లావత్ లాలు 2,250 కేజీల నల్లబెల్లం, 250 కేజీల పటిక తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి నల్లబెల్లం, పటికతో పాటు 5 లీటర్ల నాటుసారా, 3 మొబైల్ ఫోన్లు, వాహనాన్ని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వారిద్దరిని దేవరకొండ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి కోర్టుకు సరండర్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీరిపై గతంలో కూడా నల్లబెల్లం, నాటుసారా తరలించిన కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. -
తహసీల్దార్ పోస్టింగ్కు పైరవీల జోరు
సాక్షి, యాదాద్రి : రెవెన్యూ శాఖలో ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ పైరవీలు ఎక్కువయ్యాయి. ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం తహసీల్దార్ పోస్టు ఖాళీ కాగా.. ఆ పోస్టు కోసం పలువురు ఉద్యోగులు రాజకీయ నాయకులను, శాఖలోని ఉన్నతాధికారులను ఆశ్రయించి పైరవీలు చేస్తున్నారు. ఆత్మకూర్ (ఎం) తహసీల్దార్ వి.లావణ్యను బొమ్మలరామారం తహసీల్దార్గా బదిలీ చేయడానికి జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్కు లేఖ రాయడం వివాదానికి తెరలేపింది. ఒకచోట తహసీల్దార్గా ఉన్న అఽధికారిని అదే నియోజకవర్గంలోని మరో మండలానికి బదిలీకి సిఫార్సులు చేయడాన్ని తోటి అధికారులు తప్పుబడుతున్నారు. కలెక్టరేట్లో పలువురు తహసీల్దార్ క్యాడర్ అధికారులు సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న తమను కాదని ఒక చోట తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న అఽధికారిని మరో చోటుకు బదిలీ చేస్తున్నారని పేర్కొంటున్నారు. తహసీల్దార్ పదవీ విరమణతో ఖాళీ బొమ్మలరామారంలో తహసీల్దార్గా, నోటిఫైడ్ ఏఈఆర్ఓ(అసిస్టెంట్ ఎలక్టోరల్ రిటర్నింగ్ ఆఫీసర్)గా పనిచేస్తున్న పానుగంటి శ్రీనివాసరావు గతనెల 31న పదవీ విరమణ పొందారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఆ స్థానాన్ని ఒక్కరోజు కూడా ఖాళీగా ఉంచకూడదు. కాబట్టి, వెంటనే స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సునీల్కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ఈ ఖాళీ స్థానంలో కలెక్టరేట్ పరిధిలోని సూపరింటెండెంట్ క్యాడర్ అధికారుల్లో ఒకరిని నేరుగా నియమించవచ్చు.కానీ ఇక్కడ ఇప్పటికే ఆత్మకూర్ తహసీల్దార్గా పనిచేస్తూ ఏఈఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ను బొమ్మలరామారం బదిలీ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ముందస్తు అనుమతి కోరుతూ జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు వివాదానికి కారణమయ్యాయి. ఆత్మకూర్ నుంచి బొమ్మలరామారానికి బదిలీ చేస్తే మళ్లీ ఆత్మకూర్లో మరొకరిని తహసీల్దార్గా వెంటనే నియమించాలి. ఈ సాంకేతిక ప్రక్రియ, ఉత్తర్వుల కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాయాల్సి రావడం వల్లనే నియామకంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. తెరపైకి ఆత్మకూర్ తహసీల్దార్ పేరు బొమ్మలరామారం తహసీల్దార్ పోస్టు కోసం రాజకీయ ఒత్తిళ్లు, నాయకుల సిఫార్సులు నడిచినట్లు సమాచారం. దీని కోసం కలెక్టరేట్లో ఇద్దరు సూపరింటెండెంట్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. స్థానిక నేతలు, నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి సిఫార్సులేఖలతో కలెక్టరేట్లో వీరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర మంత్రి సిఫార్సుతో ఆత్మకూర్ తహసీల్దార్ పేరు తెరపైకి వచ్చింది. ఉన్నత స్థాయి ఒత్తిడి రావడంతో, స్థానిక ప్రజాప్రతినిఽధి సైతం తమ మద్దతుదారుల పేర్లను పక్కనబెట్టి ‘నేనే స్వయంగా ప్రతిపాదించాను’ అని సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బొమ్మలరామారం మండలం హైదరాబాద్కు శివారునే ఉంది. ఇక్కడ భూముల ధరలు దాదాపు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల మాదిరిగానే ఉన్నాయి. ఇక్కడ పోస్టింగ్ కోసం రాష్ట్ర స్థాయి అఽధికారులు, మంత్రుల నుంచి సిఫార్సులు ఉంటాయి. ఇక్కడ భూవివాదాలు కూడా అతి తక్కువే. ఫ జూలై 31న పదవీ విరమణ చేసిన బొమ్మలరామారం తహసీల్దార్ ఫ ఖాళీ అయిన పోస్టు కోసం తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఫ ఆత్మకూరు(ఎం) తహసీల్దార్ను బొమ్మలరామారం బదిలీకి అనుమతి కోరుతూ ఈసీకి లేఖ ఫ అనూహ్యంగా రాష్ట్ర మంత్రి సిఫార్సు ఫ ఒకే నియోజకవర్గంలో బదిలీపై తోటి అధికారుల విమర్శలు -
సామాజిక సేవలు అభినందనీయం
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని వీవర్స్ సర్వీస్సెంటర్ రీజినల్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ అరుణ్కుమార్ అన్నారు. సోమవారం భూదాన్పోచంపల్లి పట్టణంలో పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసి మాట్లాడారు. పెహచాన్ కార్డులున్న కార్మికులకు కేంద్రం వర్క్షెడ్, ఉచిత మగ్గాలు, ఆసుయంత్రాలను పంపిణీ చేస్తుందరు. అర్హులు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కంపనీ సీఈఓ తడక రమేశ్, తడక రజని, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, వెంకటరమణ సిల్క్సొసైటీ అధ్యక్షుడు చింతకింది రమేశ్, మాజీ కౌన్సిలర్ భోగ విష్ణు, టీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు వలందాస్ ప్రవీణ్, చేనేత నాయకులు బొమ్మ హరిశంకర్, బిట్ల గణేశ్, గుండు రాజేశ్వరీ, కటకం శ్యామ్సుందర్ పాల్గొన్నారు. -
తొమ్మిది మంది ప్రత్యేకాధికారులకు నోటీసులు
సాక్షి, యాదాద్రి: సంక్షేమ వసతి గృహాలు విజిట్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన తొమ్మిది మంది ప్రత్యేకాధికారులకు షోకాజ్నోటీస్లు ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్జయంతి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 71 హాస్టళ్లను అధికారులు సందర్శించి ఇచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నామన్నారు. అయితే కొందరి బాధ్యతా రాహిత్యం పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 30 రోజుల సమయం ఇచ్చినప్పటికీ ప్రత్యేకాధికారులు హాస్టళ్లలను విజిట్ చేయకపోవడం, నివేదికలు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో పరిస్థితుల్లో మార్పు లేకపోతే, సదరు అధికారులు రెండో శనివారం, ఆదివారం హాస్టళ్లలోనే గడపాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. దరఖాస్తుల పరిష్కారంపై అసంతృప్తిసీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు సంబంధించి అర్జీదారులకు కచ్చితంగా సమాధానం ఇవ్వాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే శాఖల వివరాలను బోర్డుపై ప్రదర్శించాల్సి వస్తుందన్నారు. 15 నాటికి ఫేషియల్ అటెండెన్స్ ఈనెల 15వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా ఆన్న్లైన్యాప్ ద్వారా ఫేషియల్ హాజరు ప్లాట్ఫామ్లోకి రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫీల్డ్లో పర్యటించే అధికారులు తమ ఉద్యోగుల పని స్వభావాన్ని బట్టి ఒక నిర్దిష్ట భవనం, మండలం, డివిజన్ లేదా జిల్లా మొత్తాన్ని హాజరు పరిధిగా నిర్ణయించుకోవచ్చని సూచించారు. 12 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్రావు, కె. వెంకారెడ్డి, డీఆర్ఓ జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్
ఆలేరురూరల్: ఆలేరును త్వరలో రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం ఆలేరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. రెవెన్యూ డివిజన్ అంశంపై అఖిలపక్షాలు కలిసి ధర్నా నిర్వహించడం ప్రజాస్వామ్యంలో వారి హక్కేనని పేర్కొన్నారు. 2016లో జిల్లాల పునరుద్ధరణ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తే మరి ఆలేరును ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఆలేరు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.గత ప్రభుత్వం పదేళ్లలో ఆలేరు ప్రాంతానికి రూ.10 కోట్లు నిధులు తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.70 కోట్లు తెచ్చిందని గుర్తు చేశారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ మాజీ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మున్సిపల్ చైర్పర్సన్ బీజనీ బాలమణిభాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్య, కౌన్సిలర్ ఎం.ఏ ఎజాజ్ పాల్గొన్నారు. -
అత్యవసర వైద్యం అంతంతే!
సాక్షి, యాదాద్రి: భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. ఏరియా ఆస్పత్రి స్థాయి నుంచి 220 పడకల జనరల్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ కావడంతో పాటు మెడికల్ కళాశాలకు అనుబంధంగా మారడంతో ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చారు. కానీ అత్యవసర వైద్యం, స్కానింగ్ల కోసం వచ్చే వారిని ప్రైవేట్కు లేదా హైదరాబాద్లోని ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మౌలిక వసతులు, యంత్రాల నిర్వహణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించినా వాటిని ఖర్చు చేయకుండా మూలనపడేస్తున్నారు. ఓవైపు కీలక విభాగాల్లో వైద్యులు, సాంకేతిక సిబ్బంది కొరత వేధిస్తుండగా.. మరోవైపు విధులు నిర్వహించాల్సిన కొందరు వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షలన్నీ ప్రైవేట్కే.. భువనగిరి జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ చేయించుకోవాలంటే పైరవీ చేయాల్సిందే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఏడాది క్రితం రూ.లక్షలు వెచ్చించి తెచ్చిన సీటీ స్కాన్ యంత్రాన్ని టీహబ్ కొత్త బిల్డింగ్లో ఉంచారు. ఆర్ఏంఓతో పైరవీ చేస్తే తప్ప రోగికి స్కానింగ్ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రిలో వైద్య పరికరాలు, రీ ఏజెంట్ల కొనుగోలుకు రూ. 2.61 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. అయినా పాడైన ఎక్స్రే యంత్రానికి మరమ్మతులు చేయించకుండా ఆ గదికి తాళం వేశారు. అవసరం ఉన్న రోగులను తమకు అనుకూలమైన ప్రైవేట్ సెంటర్లకు పంపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రొఫెసర్లు ఉన్నా.. భువనగిరిలోని ఏరియా ఆస్పత్రి స్థాయిని పెంచి 220 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రిలో మెడికల్ ప్రొఫెసర్లు ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఇక్కడే చికిత్స అందించకుండా.. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. వీరితో పాటు ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మౌలిక వసతుల లేమితో అవస్థలు ఆస్పత్రిలో నిత్యం ఓపీకి 450 నుంచి 500 వరకు రోగులు వస్తుంటారు. సోమవారం ఈ సంఖ్య 550 నుంచి 700 వరకు చేరుకుంటుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఓపీ విభాగం పనిచేస్తుండటంతో కౌంటర్ల వద్ద రద్దీ నెలకొంటోంది.అదనంగా ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. క్యాజువాలిటీలో బెడ్ల కొరత ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలో కేవలం రెండు, మూడు బెడ్లు మాత్రమే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి సంఖ్యను పెంచాలని ఎంతో కాలంగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు పోస్ట్మార్టం గదిలో ఒకటే ఫ్రీజర్ ఉండటంతో, ఒకటి కంటే ఎక్కువ మృతదేహాలు వచ్చినప్పుడు భద్రపర్చడం సవాలుగా మారుతోంది. ఇక రోగులతో వచ్చే సహాయకులకు వెయిటింగ్ షెడ్ లేకపోవడంతో వరండాలోనే కూర్చొని భోజనాలు చేయాల్సి వస్తోంది. తాళం వేసి ఉన్న ఎక్స్రే గది ఆస్పత్రిలో సీటీస్కాన్ మిషన్ భువనగిరి జనరల్ ఆస్పత్రిలో రోగుల ఇక్కట్లు ఫ జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లో డాక్టర్ల కొరత ఫ రూ.2.61 కోట్లున్నా యంత్రాల నిర్వహణగాలికి ఫ పైరవీ చేస్తేనే సీటీ స్కాన్.. ఎక్స్రే గదికి తాళంరెండేళ్ల క్రితం మంజూరైన క్రిటికల్ కేర్ యూనిట్ పనులను కాంట్రాక్టర్ అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం వల్లే పనులు నిలిచిపోయినట్లు సమాచారం. -
వైభవంగా ఆంథోల్ మైసమ్మ బోనాలు
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం లోని శ్రీ ఆంథోల్ మైసమ్మ దేవాలయ 21వ బోనాలోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ కె.భాస్కర్రావు అఖండ దీపారాధన చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయ చైర్మన్ కంచర్ల అశ్విన్రెడ్డి, కార్యనిర్వహణాధికారి సాల్వేది మోహన్బాబు,ధర్మకర్తల మండలి, భక్తులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పుట్టమట్టిని సేకరించారు. ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. దాతలు కొమిరిశెట్టి విజయ్కుమార్–శిరీష దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఈడ్దుల బాబు, బేతాల నర్సింహ, సిదిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్,బొంతల యువరాజు, మన్నె మహేందర్రెడ్డి, దేప రాజీవ, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టంపల్లి సబిత, వల్లూరి శవప్రసాద్శర్మ పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో వసతులు లేక రోగుల ఇబ్బందులు
భువనగిరి: భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెగ్యులర్ సూపరింటెండెంట్ను నియమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య కోరారు. శనివారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి మాట్లాడారు. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని , ఖాళీగా ఉన్న వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో నర్సింగ్ స్టాఫ్కు రెస్ట్ రూమ్ లేక ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఓపీ కౌంటర్ అదనంగా లేకపోవడం వల్ల టోకెన్ కోసం రోగులు బారులుదీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. వార్డులో మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో దుర్వాసన వస్తోందన్నారు. సీటీస్కాన్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా అనుమతులు ఇవ్వలేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులు ఒప్పందం చేసుకున్నట్లు అనుమానంగా ఉందన్నారు. టీ హబ్కు వచ్చే శాంపిల్స్ను పరీక్షించి సకాలంలో రిపోర్టులు పంపడం లేదన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రులతో వైద్యులు కుమ్మకై ్క రోగులను ప్రైవేటుకు పంపిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నర్సింహ, నాయకులు ముత్యాలు, రాజు, అనిల్, మాతయ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. -
తగ్గుతున్న పీఎం కిసాన్ లబ్ధిదారులు
సాక్షి, యాదాద్రి: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) లబ్ధిదారులు ఏటేటా తగ్గుతున్నారు. పథకం ప్రారంభించినప్పుడు జిల్లాలో 1,30,286 మంది రైతులు లబ్ధిపొందగా ప్రస్తుతం వారి సంఖ్య 85,214కి పడిపోయింది. ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. తొలి విడతలో రూ.26.05 కోట్లు రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో కేంద్రం 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ.6,000 చొప్పున అందిస్తున్నారు. ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పథకం ప్రారంభమైన తొలి విడతలో జిల్లాలోని 1,30,286 మంది రైతులకు రూ.26.05 కోట్ల ఆర్థిక సాయం అందింది. ఇప్పటివరకు మొత్తం 23 విడతల్లో కలిపి జిల్లా రైతులకు రూ.500 కోట్ల వరకు ఆర్థిక సాయం పంపిణీ చేశారు. 45వేలకు పైగా తగ్గిన లబ్ధిదారులు కాలక్రమేణా జిల్లాలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 22వ విడత నాటికి జిల్లాలో రైతుల సంఖ్య 85,214కి పడిపోయింది. ఈ విడతలో ప్రభుత్వం రూ.17.04 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. తొలి విడతతో పోలిస్తే దాదాపు 45 వేలకు పైగా లబ్ధిదారులు తగ్గిపోవడం గమనార్హం. తగ్గడానికి కారణాలివే.. లబ్ధిదారుల సంఖ్య తగ్గడానికి ప్రధానంగా కేంద్రం విధించిన కఠిన నిబంధనలే కారణమని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్/ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేయడం. భూమి వివరాలను ఆధార్తో సీడింగ్ చేయడం, సరైన పత్రాలు లేని వారిని తొలగించడం. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను పథకం నుంచి మినహాయించడం. మరణించిన రైతుల పేర్లను రికార్డుల నుంచి తొలగించడం వంటి కారణాల వల్ల కూడా లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.ఫ తొలి విడతలో 1.30 లక్షలకు పైగా రైతులు.. ఫ 22వ విడత నాటికి 85,214 మందికే పరిమితం ఫ కఠిన నిబంధనలే కారణం -
తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు : అదనపు కలెక్టర్
మోత్కూరు : తాగునీటి సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్రావు సూచించారు. మోత్కూరు పట్టణంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం సంబంధిత అధికారులతో సమీక్షించి మాట్లాడారు.మోత్కూరు పెద్ద చెరువు కట్ట మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ పైపు లైన్ స్వల్పంగా దెబ్బతిన్న నేపథ్యంలో మరమ్మతులు పూర్తి చేయించడంతో ప్రస్తుతం నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ బాలాజీ, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించాలి కస్తూర్బా విద్యాలయాల్లో చదివే విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్రావు సూచించారు. శనివారం మోత్కూరు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూమ్, భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థినులు నిద్రించే గదిలో గోడ ఫ్యాన్లు అందజేస్తానని, పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ఒకేచోట కలిసి భోజనం చేసేందుకు రేకుల షెడ్డు నిర్మిస్తారని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, ఎంపీడీఓ బాలాజీ, మిషన్ భగీరథ ఏఈ నితిన్రెడ్డి, ఎస్ఓ యాదమ్మ ఉన్నారు. -
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. 7న చేనేత చైతన్య మహాసభరామన్నపేట : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరీంనగర్లో రాష్ట్రస్థాయి చేనేత చైతన్య మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెండెం లక్ష్మీనారాయణ, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బూరుగు వెంకటేశం తెలిపారు. ఈ మేరకు శనివారం రామన్నపేటలో మహాసభ వాల్పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. పద్మశాలీ ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక్షులు, వృత్తిదారులు మహాసభకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాపోలు రాజశేఖర్, రాపోలు షణ్ముఖం, రచ్చ యాదగిరి, జెల్ల వెంకటేశం, అప్పం లక్ష్మీనర్సు, పున్న వెంకటేశం, బడుగు రమేష్, మహేశ్వరం అశోక్, కై రంకొండ నందు, కొంగరి నర్సింహ, గంజి అశోక్, చిందం ఉమాకాంతం పాల్గొన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలిమోత్కూరు : చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూరులోని కేఆర్ భవన్లో దొండ రాములు అధ్యక్షతన నిర్వహించిన బీసీ హక్కుల సాధన సమితి మండల మహాసభలో ఆయన మాట్లాడారు. సంఘం మండల కమిటీ అధ్యక్షుడిగా పోచం కన్నయ్య, ఉపాధ్యక్షుడిగా దొండ రాములు, ప్రధాన కార్యదర్శిగా పెండెం వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శిగా అంబటి సోమయ్య, కోశాధికారిగా తాడూరి లక్ష్మీనర్సయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అన్నెపు వెంకట్, చాపల అంజయ్య, దొండ ఎల్లయ్య, బి.నర్సయ్య, భువనగిరి ముత్యాలు, బోయిని వెంకన్న, తొట్ల యాదగిరి, కొల్లు లక్ష్మయ్య, ఎలుగు భిక్షం పాల్గొన్నారు. -
నిజమైన సే్నహితులు కరువయ్యారా..!
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా.. ఇద్దరు యువకులు బైక్పై దైవ దర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దోస్త్.. మేరా దోస్త్ఐదుగురి అరెస్టు చైన్ స్నాచింగ్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నాగార్జునసాగర్ సీఐ తెలిపారు. ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026- 9లో- 8లోసాక్షి నెట్వర్క్: రక్తసంబంధం కాకపోయినా.. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే ఆత్మబంధువే స్నేహితుడు. నిస్వార్థమైన స్నేహానికి హద్దులుండవు. అవసరమైనప్పుడు ముందుడి నడిపించడమే కాకుండా వెనకుండి వెన్నుతట్టి నడిపించేవాడే స్నేహితుడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ హితుడు తప్పకుండా ఉంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితుడి పాత్ర వెలకట్టలేనిది. అలాంటి స్నేహితుడి ప్రాధ్యాతను గుర్తిస్తూ.. ఆ బంధాన్ని గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఐదు ముఖ్యపట్టణాల్లో వివిధ వయస్సులున్న 200 మంది అభిప్రాయాన్ని ‘సాక్షి’ సేకరించింది. దీనిలో పలు ఆసక్తికలిగిన అంశాలు వెలుగు చూశాయి. స్నేహితుల దినోత్సవ సాక్షిగా నేడు నిజమైన స్నేహితులు కువయ్యారనే అభిప్రాయం కాస్తా ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల ఎంపికలో డబ్బుకు, చదువుకన్నా వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం గమనించదగ్గవ విషయం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో స్నేహితులతో గడిపే సమయం తక్కువైందని సాయంత్రం కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకొనే స్నేహితులు కనుమరగయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 1. నేటి రోజుల్లో నిజమైన స్నేహితులున్నారని మీరు భావిస్తున్నారా? 2. స్నేహితుల ఎంపికలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు..? 61 వ్యక్తిత్వానికిలేరుఅవును 903. స్నేహితుల దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారా? 49ఫ స్నేహితుల ఎంపికలో వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఫ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కలుసుకోవడం తక్కువే.. ఫ ‘సాక్షి’ సర్వేలో వెల్లడి చదువుకుడబ్బుకు -
రక్తశుద్ధికి యాతన
అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేని డయాలసిస్ పడకలునల్లగొండ టౌన్ : మారుతున్న జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధిన బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డయాలసిస్ కోసం రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం డయాలసిస్ రోగుల సంఖ్య పెరగడంతో అవి సరిపోవడం లేదు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద డయాలసిస్ చేస్తున్నా.. కొందరు వెయిటింగ్లోనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 11 డయాలసిస్ కేంద్రాలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 డయాలసిస్ కేంద్రాలను ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశారు. 726 మంది రోగులకు నాలుగు షిఫ్టుల ద్వారా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. కొందరికి ప్రతి రోజూ, మరికొందరికి రెండు మూడు రోజులకు, ఇంకొందరికి వారంలో రెండు సార్లు, వారానికి ఒక సారి చొప్పున డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది రోగులు డయాలసిస్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఆ కేంద్రంలో ప్రస్తుతం డయాలసిస్ పొందే రోగి చనిపోతేనే వెయిటింగ్లో ఉన్న వారికి డయాలసిస్ చేసే పరిస్థితి ఉంది. వెయిటింగ్ లేకుండా డయాలసిస్ చేయాలంటే ఆయా కేంద్రాల్లో పడకల స్థాయిని, మిషన్లను పెంచాల్సిందే. ఆర్థికంగా భారం మూత్రపిండాలు చెడిపోయిన వారికి తప్పని సరిగా డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ది చేయాల్సి ఉంటుంది. కానీ డిమాండ్ మేరకు పడకలు లేని కారణంగా డయాలసిస్ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి చేయించుకుంటున్నారు. దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం రోగుల డిమాండ్కు తగ్గట్టుగా డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.డయాలసిస్ కేంద్రాల సేవలు ఇలా.. ఆస్పత్రి పడకలు రోగులు వెయిటింగ్ జీజీహెచ్ 15 135 0 దేవరకొండ 5 50 10 మిర్యాలగూడ 10 92 0 నాగార్జునసాగర్ 5 40 0 మర్రిగూడ 5 30 0 సూర్యాపేట 7 60 0 హుజూర్నగర్ 9 80 0 కోదాడ 5 52 10 చౌటుప్పల్ 5 50 0 భువనగిరి 8 90 0 రామన్నపేట 5 47 0 ఫ పెరుగుతున్న రోగుల సంఖ్య ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ద్వారా డయాలసిస్ ఉమ్మడి జిల్లాలో ఉన్న డయాలసిస్ కేంద్రాల ద్వారా 24 గంటలు పనిచేస్తూ రోగులకు మెరుగైన సేవలను అందిస్తున్నాం. ఎక్కడా రోగులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని సేవలను అందజేస్తున్నాం. – మహ్మద్ అఖిల్, డయాలసిస్ కేంద్రాల ఉమ్మడి జిల్లా మేనేజర్ -
‘రెవెన్యూ డివిజన్’ ఉద్యమం ఆగదు
ఆలేరు : ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమం ఆగదని అఖిల పక్ష నాయకులు అన్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో రాష్ట్రప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం అఖిలపక్ష కమిటీ బంద్ చేపట్టింది. నాయకులు మొదట పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ఆర్టీసీ బస్టాండ్ మార్గంలో ప్లకార్డులతో రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంలో వాహనాల రాకపోకలను పోలీసులు దారిమళ్లించారు. అనంతరం నాయకులు అంబేడ్కర్ విగ్రహాం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలవురు నాయకులు మాట్లాడుతూ పేరుకే నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు అన్ని రంగాల్లో వెనుకబడిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని ప్రకటించి తర్వాత విస్మరించారని దుయ్యబట్టారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని, అమలులో మాత్రం ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అఖిలపక్షం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కోకన్వీనర్లు పుట్ట మల్లేష్, మొరిగాడి చంద్రశేఖర్, నాయకులు రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మొరిగాడి రమేష్, వడ్డెమాన్ నరేందర్, భేతి కృష్ణహరి, తుంగ కుమార్, చిలుకూరు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ అఖిలపక్ష కమిటీ బంద్కు మద్ధతుగా శుక్రవారం ఆలేరు పట్టణంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్.జనార్దన్, ఇక్కిరి సహదేవ్, కల్లెపు అడివయ్య, ఆర్.సీత, పద్మ సుదర్శన్, చిరబోయిన రాజయ్య పాల్గొన్నారు. ఫ వందరోజుల హామీని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ ఆలేరు ధర్నాలో అఖిల పక్ష నాయకులు -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
భువనగిరి : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగోర్ల మోదీ రాందేవ్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో నంబర్ 9ను ఆర్ఆర్ యాక్ట్ కింద రద్దు చేయాలన్నారు. పాత పద్ధతిలోనే బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగానలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పల్లపు దుర్గయ్య, సాయిలు, వేముల అనిల్, చిల్లర యశ్వంత్, జశ్వంత్, అరుణ్, ప్రవీణ్, శివ, లింగస్వామి, శ్రీకాంత్, లోకేష్, మానస, సంతోష, శైలజ, మౌనిక, సాత్విక, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
అండర్ పాస్ కష్టాలు
అండర్పాస్ నిర్మాణంలో జంక్షన్లు మూసివేయడంతో ద్విచక్రవాహనాలు కూడా పోయేందుకు దారి లేదు. బైక్పై రోజూ మూడు సార్లకుపైగా కిలోమీటర్ల కొద్ది వెళ్లి యూటర్న్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. దీంతో బైక్ను పక్కన పెట్టి సైకిల్ కొనుగోలు చేసి డ్యూటీకి వెళ్తున్నాను. పనులు పూర్తయ్యే వరకు ఏదో ఓ చోట జంక్షన్ తెరిచి ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించేలా చూడాలి. – బద్దం భరత్కుమార్, మున్సిపాలిటీ చిరు ఉద్యోగి, చౌటుప్పల్ చౌటుప్పల్ : చౌటుప్పల్ లోని జాతీయ రహదారిపై జరుగుతున్న అండర్పాస్ నిర్మాణ పనులు పట్టణ వాసులకు శాపంగా మారాయి. ముందస్తు ప్రణాళిక, సమాచారం ఇవ్వకుండా తంగడపల్లి, బస్టాండ్ చౌరస్తాల్లో ఉన్న జంక్షన్లను పూర్తిగా మూసివేసి పనులు కొనసాగిస్తున్నారు. దీంతో కిలోమీటర్ల దూరం వెళ్లి రోడ్డు క్రాస్ చేయాల్సి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వివిధ వాహనదారులు తమ వాహనాలను తీసుకెళ్లే మార్గం లేక నడిచి వెళ్తున్నారు. కొందరైతే ఏకంగా బైక్లను పక్కన పెట్టి సైకిళ్లపై రాకపోకలు సాగిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజల అవస్థలు పట్టించుకోని అధికారులు అభివృద్ధి పనులు చేపడితే ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వడంతోపాటు అసౌకర్యం కలగకుండా చూడాలి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే పనులు నిర్వహించాలి. కానీ, ప్రధాన జంక్షన్లను మూసివేసి కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తుండడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్పాస్ పనుల వల్ల జంక్షన్లు మూసివేతతో దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లి యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వాహనదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల గురించి ఆలోచించాల్సిన అధికారులు కాంట్రాక్టర్కు వత్తాసుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా తమకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఫ చౌటుప్పల్లో కొనసాగుతున్న అండర్ పాస్ నిర్మాణ పనులు ఫ ప్రధాన జంక్షన్ల మూసివేత ఫ రోడ్డు క్రాసింగ్కు వాహనదారుల ఇక్కట్లు ఫ ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలంటున్న పట్టణ వాసులు -
యాదాద్రి జిల్లాకు కానిస్టేబుల్ పోస్టుల్లేవ్..
సాక్షి, యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. తాజా నోటీఫికేషన్లలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జోన్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊసేలేదు. కేవలం తొమ్మిది బ్యాక్లాగ్ పోస్టులతోపాటు వివిధ విభాగాల్లో 33 పోస్టులు భర్తీకి ఉన్నాయి. ఇక, హైదరాబాద్ పరిధిలోని నూతన కమిషనరేట్లకు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు కేటాయించలేదు. అసలు నూతన కమిషనరేట్ల పరిధిలో ఖాళీ పోస్టులు లేవా లేక చట్టపరమైన చిక్కులు ఉన్నాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. కమిషనరేట్ల పునర్విభజనతోనే చిక్కులు గతంలో ఉన్న రాచకొండ కమిషనరేట్ పరిధిని ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం విభజించింది. ఫ్యూచర్ సిటీ, మల్కాజ్గిరి కమిషనరేట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాగా విభజించారు. అయితే ఈ ప్రక్రియ ఇంకా రాష్ట్ర సచివాలయం, హోమ్శాఖ స్థాయిలో నిర్మాణంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఆయా కమిషనరేట్ల భౌగోళికంగా సరిహద్దులు మారినప్పటికీ, ఉద్యోగుల సర్వీసుల పంపిణీకి ఇంకా కొలిక్కిరాలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు రాష్ట్రపతి ఆమోదముద్రతో నూతన ఉత్తర్వులు అమల్లోకి రాకుండా పాత విధానంలో ఖాళీలను భర్తీ చేస్తే భవిష్యత్తులో చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జోన్ల విభజన ప్రకటనల అమలుకు రాష్ట్రపతి అధికారిక ముద్రపడలేదు. దీంతో ఆయా ప్రాంతాల వారు రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. రాచకొండ పరిధిలో పాత కేడర్ విధానమేనా! ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు పోస్టులు కేటాయించినప్పటికీ యాదాద్రి భువనగిరి జోన్ను ఇంకా రాచకొండ కమిషనరేట్ పరిధిగానే భావిస్తున్నారు. దీంతో పోలీస్ అధికారులు, సిబ్బంది భర్తీకి ప్రత్యేక కేటాయింపు జరగలేదని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఫలితంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పాత కేడర్ విధానమేనా అమలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ సిబ్బంది కొరత ఉన్నా.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో పోలీస్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి చట్టపరమైన ఆటంకాలు తొలిగే వరకు వీటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. జిల్లాతోపాటు హైదరాబాద్ మెట్రో రీజియన్ పరిధిలోని అభ్యర్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి నూతన పరిపాలనా జోన్ల ఆమోదం లభించిన వెంటనే, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూస్తారు. యాదాద్రి భువనగిరి, ఉమ్మడి హైదరాబాద్ కమిషనరేట్ల పరిధికి సంబంధించి అదనపు ఖాళీలతో సరికొత్త కేటాయింపుల జాబితా విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. పోలీస్ శాఖలో ప్రస్తుతం భర్తీ చేసే ఉద్యోగాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి తక్కువగా ఉన్నాయి. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా పోలీస్ పోస్టుల కేటాయింపు లేదు. ప్రధానంగా సివిల్, ఏఆర్ కానిస్టేబల్ పోస్టుల కేటాయింపే లేదు. ఇకపోతే ఎస్పీఎఫ్లో 8 బ్యాక్లాగ్ పోస్టులు, ఫైర్ డిపార్ట్మెంట్లో బీసీ–సీ సామాజిక వర్గానికి చెందిన బ్యాక్లాగ్ పోస్ట్ మాత్రమే ఉంది. పోలీస్ అనుబంధ విభాగాల్లో 31, జైలు వార్డర్ మెయిల్ 2 పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేస్తారు. యాదాద్రి జోన్ (యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల) పరిధిలో 22 ఎస్ఐ పోస్టులు, ఫైర్ డిపార్ట్మెంట్లో 2, టీజీఎస్పీ–1, డిప్యూటీ జైలర్ మెయిల్ 1, ఎస్పీఎఫ్ 44 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫ కేవలం 9 బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఫ అనుబంధ విభాగాల్లో 33 పోస్టులే.. ఫ జోన్ పరిధిలో మాత్రం 22 ఎస్ఐలు, 44 ఎస్పీఎఫ్లు, 4 ఇతర పోస్టులు ఫ తాజాగా వెలువడిన నోటిఫికేషన్లలో పోస్టులు అంతంతే.. ఫ మరిన్ని పోస్టులకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడేదాకా ఆగాల్సిందేనా! -
క్రీడా పోటీలకు పేర్లు నమోదు చేసుకోవాలి
భువనగిరి : భారత ప్రభుత్వ క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడాపోటీల్లో పాల్గొనదలిచిన వారు మై భారత్ పోర్టల్లో పేర్లు, జట్ల వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి శ్యాంసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన జిల్లాలోని యువత, విద్యార్థులు, క్రీడాకారులు ఆగస్టు నుంచి 15 వరకు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్ 9848666536 సంప్రదించాలని కోరారు. సీడబ్ల్యూఎస్ స్కాలర్షిప్నకు ఎంపికభూదాన్పోచంపల్లి : దేశ్ముఖిలోని ఎస్సీ గురుకుల ఆర్మీ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్సీసీ క్యాడెట్లు పాతులోతు సోని, వేముల బిందు, ఆర్.రవళి ప్రతిష్టాత్మకమైన క్యాడెట్ వెల్ఫేర్ సొసైటీ (సీడబ్ల్యూఎస్) స్కాలర్షిప్లకు ఎంపికయ్యారని కళాశాల డైరెక్టర్ కల్నల్ రాజాదత్తా, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత తెలిపారు. ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోని ఎన్సీసీ డైరెక్టరేట్ పరిధిలో మొత్తం 12 మంది క్యాడెట్లు ఎంపిక కాగా అందులో వీరు ముగ్గురు ఉన్నారన్నారు. ఏటా వీరికి రూ.6వేల స్కాలర్షిప్ లభిస్తుందని తెలిపారు. శుక్రవారం వారికి కళాశాలలో స్కాలర్షిప్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ప్రిన్సిపల్ కృష్ణవేణి, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ రూప, ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ రేవతి ప్రభాకర్ ఉన్నారు. చిన్నకొండూర్ చెరువులో ‘డెవిల్ ఫిష్’చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామంలోని దేపోనిచెరువులో శుక్రవారం చేపల వేటకు వెళ్లిన యువకులకు డెవిల్ ఫిష్లు లభ్యమయ్యాయి. ఇవి వింత ఆకారంలో ఉండడంతో గ్రామస్తులు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. వీటిన దయ్యం చేపలుగా పిలుస్తారని, చెరువుల్లోని చిన్న చేపపిల్లలను ఆహారంగా తీసుకుంటాయని స్థానిక మత్స్యకారులు పేర్కొంటున్నారు. పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చనభువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాలసేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం జరిపారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. -
డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
సాక్షి, యాదాద్రి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శుక్రవారం భువనగిరిలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతామని, ప్రతి కేంద్రంలో 1,200 మందికి మించకుండా, ఒక కుటుంబ ఓటర్లంతా ఒకే కేంద్రం పరిధిలోకి వచ్చేలా చూస్తున్నామన్నారు. ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ‘ప్రత్యామ్నాయ’పై అవగాహన కల్పించాలి రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నీటిని పొదుపుగా వాడుతూ జొన్నలు, పెసలు, మినుములు, కంది, ఆముదం, కూరగాయలు, పూల తోటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అధిక నికర ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగుకు రైతులను సన్నద్ధం చేయాలన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
‘ఇక్కత్’పై ఫ్యాషన్ విద్యార్థుల అధ్యయనం
భూదాన్పోచంపల్లి: ఇక్కత్ వస్త్రాల తయారీపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్లోని యూఆర్ఎక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి చెందిన 30 మంది డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినులు శుక్రవారం పోచంపల్లిని సందర్శించారు. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, రూరల్ టూరిజం పార్కులో రంగులద్దకం, నూలు వడకడం, చిటికి కట్టడం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారికి లభిస్తున్న ఉపాధి, మార్కెటింగ్, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ అర్వింద్, డైరెక్టర్ ఊర్వశీసోని మాట్లాడుతూ.. స్టడీ టూర్లో భాగంగా ఇక్కత్కు అంతర్జాతీయంగా పేర్గాంచిన పోచంపల్లికి క్షేత్ర పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. సంప్రదాయ చేనేత కళ, కళాకారుల నైపుణ్యాలు, వస్త్రాల తయారీ పద్ధతులు విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడిందని పేర్కొన్నారు. -
చేతికందని చేయూత!
నెలాఖరొచ్చినా పింఛన్ రాలే.. నగదు కొరతతో పంపిణీలో జాప్యంఫ తెరుచుకోని పోస్టాఫీసులు ఫ చౌటుప్పల్, నారాయణపురంలో నిల్ ఫ జిల్లా వ్యాప్తంగా ఇంకా రూ. 10 కోట్ల బకాయిలు సాక్షి, యాదాద్రి: చేయూత పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.బ్యాంకుల్లో అవసరమైనంత నగదు అందుబాటులో లేకపోవడంతో నెలాఖరు గడుస్తున్నా పింఛన్లు పూర్తిస్థాయిలో అందలేదు. బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు సమయానికి సొమ్ము చేరకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమవుతోంది. గురువారం సాయంత్రం వరకు పలు మండలాల్లో ఒక్కరికి కూడా పింఛన్ అందకపోగా, మరికొన్ని చోట్ల నగదు లేదనే సాకుతో పోస్టాఫీసుల గేట్ల తాళాలు తీయకపోవడం గమనార్హం. చౌటుప్పల్, నారాయణపురంలో పంపిణీ సున్నా నెలాఖరొచ్చినా చౌటుప్పల్ మున్సిపాలిటీ, చౌటుప్పల్ మండలం, నారాయణపురం మండలాల్లో గురువారం సాయంత్రం వరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా పింఛన్ సొమ్ము పంపిణీ కాలేదు. నల్లగొండ జిల్లా నుంచి రావాల్సిన నగదు నిల్వలు సర్దుబాటు కాకపోవడమే ఇందుకు కారణం. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ గ్రామీణ ప్రాంతంలో 5,184 మంది లబ్ధిదారులకు రూ.1,31,86,432, చౌటుప్పల్ టౌన్లో 2,643 మందికి రూ.66,91,120, నారాయణపురం మండలంలో 5,822 మందికి రూ.1,49,87,296 మేర పింఛన్లను ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇక భువనగిరి బీచ్ మహల్లా పోస్టాఫీస్ పరిధిలోని 1,200 మంది పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కొలనుపాకలోని 1,200 మంది పింఛన్దారుల్లో కేవలం 300 మందికే నగదు అందగా, మిగిలిన వారికి సర్దుబాటయ్యాక ఇస్తామని అధికారులు చెబుతున్నారు. భువనగిరి ప్రధాన పోస్టాఫీసులో ఇతర ఖాతాదారులు డిపాజిట్ చేస్తున్న నగదుతో రోజుకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల చొప్పున మాత్రమే సర్దుబాటు చేస్తున్నారు. రూ.10 కోట్లకు పైగా బకాయిలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 95,296 మంది చేయూత పింఛన్దారులు ఉన్నారు. వీరికి నెలకు రూ. 24,26,77,840 మేర పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే బుధవారం సాయంత్రం నాటికి 56,449 మందికి రూ.13,90,68,624 మాత్రమే అందజేశారు. ఇంకా 38,847 మందికి సంబంధించి రూ. 10,36,09,216 పింఛన్ సొమ్ము బకాయి పడింది.భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్కు చెందిన యాదలక్ష్మికి చేయూత పింఛనే ఆధారం. ప్రతి నెలా 22వ తేదీ కల్లా వచ్చే పింఛన్ డబ్బులతోనే తనకు అవసరమైన మందులు కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు నెల ముగుస్తున్నా పింఛన్ రాక ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పింఛన్ ఆలస్యంకావడంతో మందులు వేసుకోవడం కూడా వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె వాపోయింది. ఆత్మకూరు ఎం మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన చెరుకు యాదమ్మ గత నెల హైదరాబాద్కు పోవడంతో పింఛన్ తీసుకోలేదు. ఈనెల తీసుకుందామని రెండుసార్లు పోస్టాఫీస్కు వెళ్లింది.డబ్బులు లేవని చెప్పడంతో వెనుదిరిగింది. ఆమెకు మొత్తం రెండు నెలల పింఛన్ రావాల్సి ఉంది. పింఛన్ సకాలంలో రాక ఇబ్బందులు పడుతోంది. -
పాత కమిటీలే కొనసాగుతాయి
పాఠశాలల్లో బోధనను పటిష్టం చేసి విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం. విద్యాశాఖ నిర్ణయం ప్రకారం గతేడాది పనిచేసిన ప్యానెల్ తనిఖీ బృందాలనే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాం. – భిక్షపతి, జిల్లా విద్యాశాఖాధికారి ప్యానెల్ తనిఖీ సభ్యులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించాం. వారి పరిశీలన ఆధారంగా ఏయే పాఠశాలల్లో విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, దానికి తగినట్లుగా ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు అందిస్తారు. – జానీ అఫ్గన్, అకడమిక్ మానిటరింగ్ అధికారి -
చదువుల ప్రగతికి ‘టీమ్’ వర్క్!
ఆలేరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, బోధనా పద్ధతులను మరింత పటిష్టం చేసేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఉపాధ్యాయులతో ప్రత్యేక ప్యానెల్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా ఈ బృందాలను నియమించారు. గత విద్యా సంవత్సరంలో పనిచేసిన కమిటీలనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని, ఖాళీలు ఉంటే నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. నాలుస్థాయిల్లో బృందాలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 54 మంది సభ్యులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక స్థాయి: ప్రతి 100 పాఠశాలలకు ఒక ప్యానెల్ బృందం పనిచేస్తుంది. ఇందులో ఒక ప్రధానోపాధ్యాయుడు, భాషా పండితుడు, గణిత ఉపాధ్యాయుడు ఉంటారు. మొత్తం 4 టీమ్లు పనిచేస్తాయి. ప్రాథమికోన్నత స్థాయి: ప్రతి 100 పాఠశాలలకు ఒక బృందం ఉంటుంది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు, భాషా పండితుడు, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఉంటారు. ఒక టీమ్ పనిచేస్తుంది. ఉన్నత పాఠశాలల స్థాయి: ప్రతి 50 బడులకు ఒక ప్యానెల్ బృందాన్ని నియమిస్తారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు, ఆరుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులు, పీఈటీతో కలిపి మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 3 టీమ్లు పనిచేస్తాయి. తనిఖీ బృందాల విధులు బృందాలు క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి విద్యా ప్రగతిని అంచనా వేస్తాయి. ప్రతి సందర్శనలో కనీసం రెండు సబ్జెక్టుల బోధనను నిశితంగా పరిశీలిస్తాయి. వివరాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అప్లికేషన్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అమలును పరిశీలిస్తూ, బేస్లైన్ అసెస్మెంట్ ఆధారంగా ఉపాధ్యాయులకు తగిన బోధనా పద్ధతులను సూచిస్తాయి. సైన్స్ ల్యాబ్ల వినియోగం, ఉపాధ్యాయులు–విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, తాగునీరు వంటి వసతులను పరిశీలిస్తాయి. బృందాలు ప్రతి 3 నెలలకొకసారి తమ పరిధిలోని బడులను తనిఖీ చేయాలి. ప్రతి నెలా 5వ తేదీన డీఈఓకు నివేదిక సమర్పించాలి.ఫ అకడమిక్ పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ బృందాలు ఫ వెనుకబడిన విద్యార్థులే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ ఫ 2026–27 విద్యా సంవత్సరంలో అమలుకు విద్యాశాఖ ఆదేశాలుజిల్లాలో తనిఖీ బృందాలు ఇలా.. పాఠశాల సంఖ్య విద్యార్థులు టీమ్లు ప్రాథమిక 425 15,449 04 ప్రాథమికోన్నత 67 3,280 01 ఉన్నత 158 17,807 03 -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
భువనగిరిటౌన్ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.. డీజీపీ సీవీ ఆనంద్తో కలిసి గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లో ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కృతిక, స్వాతిక్ పాల్గొన్నారు. పకడ్బందీగా అమలు చేయాలి అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. గురువారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి బాలల సంక్షేమ ప్రాజెక్టు అధికారులు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్, బాలల సంక్షేమ ప్రాజెక్టు అధికారులు శైలజ, వెంకటరమణ, స్వరాజ్యం, నాజీ, అనంతలక్ష్మి పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వహించొద్దు
యాదగిరిగుట్ట: శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వహించొద్దని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ సూచించారు. గురువారం యాదగిరిగుట్ట రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేసి మొక్కలు నాటారు. కార్యాలయ నిర్వాహణ, పరిపాలన విధానాలు, నేరాల నమోదు, దర్యాప్తు పురోగతి, వివిధ రిజిస్టర్లు, అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూర్, గుండాల పోలీస్ స్టేషన్లలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, బీట్ వ్యవస్థ, రాత్రి గస్తీ, కమ్యూనిటీ పోలీసింగ్, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, రూరల్ సీఐ శంకర్గౌడ్, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పాల్గొన్నారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం భూదాన్పోచంపల్లి: విద్యార్థులకు మెనూ పాటిస్తూ నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. గురువారం భూదాన్పోచంపల్లి మండలంలోని జలాల్పురంలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఈ విద్యా సంవత్సరం ఎంత మంది విద్యార్థినులు కొత్తగా నమోదయ్యారని ప్రత్యేకాధికారిణి ఇందిరను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, సరిపోను వసతులు, యూనిఫామ్స్ వచ్చాయా అని ఆరా తీశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఎంపీడీఓ విజయ, ఎంఈఓ ప్రభాకర్, ఎస్ఓ ఇందిర పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగే మేలుభువనగిరి : ప్రత్యామ్నాయ పంటల సాగే మేలని జిల్లా వ్యవసాయ అధికారి పీవీ రమణారెడ్డి అన్నారు. గురువారం భువనగరి మండలం వడపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మానస అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఓ మల్లేష్, ఏఈఓ కృష్ణకుమారి, ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి మంజుల, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో రాష్ట్ర మహా సభలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో సెప్టెంబర్ 8, 9, 10వ తేదీల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు తెలిపారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆయన గురువారం యాదగిరిగుట్టలో ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, పార్టీ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాఘవపురం వినయ్, కంబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రాస్తారోకో
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో గల యాదవ కాలనీకి చెందిన మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. మోత్కూరు–తిరుమలగిరి ప్రధాన రహదారిపై సుమారు అరగంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ చెరువు కట్ట మరమ్మతుల కారణంగా నీటి సరఫరాను నిలిపి వేశారని, అయితే ఆ పనులు పూర్తయి 15 రోజులైనా నీళ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. నెల రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్ట పనుల సమయంలో నీటి సరఫరా పైపులు దెబ్బ తిన్నాయని, వాటి మరమ్మతుల విషయంలో మిషన్ భగీరథ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయలోపంతో కాల యాపన చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ అధికారులు రోజుకూ రెండు నుంచి మూడు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ అది ఏమాత్రం సరి పోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తొట్ల రుక్కమ్మ, ఎం.డి.కాజమ్మ, పురుగుల మల్లమ్మ, పురుగుల లింగమ్మ, జటంగి రేణుక, షబానా, పవిత్ర, లలిత, సారమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి
ఆలేరు : విద్యా రికార్డులు కచ్చితంగా నమోదయ్యేందుకు ప్రతి విద్యార్థికి ఆధార్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్ పేర్కొన్నారు. గురువారం ఆలేరులో ఏర్పాటు చేసిన యూ–డైస్ వర్క్షాప్తోపాటు ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న ప్రతి విద్యార్థి ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆధార్ లేని విద్యార్థులు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటికే ఆధార్ ఉన్న విద్యార్థులు బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలని స్పష్టం చేశారు. యూ–డైస్ పోర్టల్లో విద్యార్థుల వివరాలు కచ్చితంగా నమోదు కావాలంటే ఆధార్ అనుసంధానం ఎంతో కీలకమన్నారు. ఆయన వెంట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ చైతన్య,ఎల్డీఏ రాధిక, సీఆర్పీలు తిరుపతి, శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. -
ప్రవేశాలు అంతంతే..
ఫ జిల్లాలో టార్గెట్ 50 వేలు.. నమోదైంది 45,591 మంది ఫ జనగణన విధులు, ఉపాధ్యాయులపై అదనపు భారంతో బడిబాటకు విఘాతం ఫ పదిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా పెరగని అడ్మిషన్లు భువనగిరి: సర్కారు బడుల్లో ప్రవేశాల ప్రక్రియ తీవ్ర నిరాశ పరుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2026–27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల సంఖ్యను 50 వేల మార్కు దాటించాలన్న విద్యాశాఖ లక్ష్యం నీరుగారిపోయింది. ఆగస్టు నెలాఖరు వరకు గడువున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. గతేడాదితో పోలిస్తే ఇప్పటివరకు కేవలం 295 మంది విద్యార్థులు మాత్రమే కొత్తగా నమోదు కావడం గమనార్హం. లక్ష్యం ఒకలా.. నమోదు మరోలా.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి గాను యూడైస్లో నమోదైన ప్రకారం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మొత్తం 45,296 మంది విద్యార్థులు ఉన్నారు. 2026–27 సంవత్సరానికి గాను, గత ఏడాది ఉన్న విద్యార్థుల సంఖ్యకు అదనంగా 10 శాతం మేరకు నమోదు పెరగాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 5 వేల మంది విద్యార్థులను అదనంగా బడిలో చేర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 50 వేలకు పైగా దాటాలి. కానీ, ఇప్పటి వరకు యూడైస్లో నమోదైన సంఖ్య 45,591 మాత్రమే. అంటే గత ఏడాదితో పోలిస్తే కేవలం 295 మంది మాత్రమే అదనంగా నమోదయ్యారు. దీంతో ప్రస్తుత అడ్మిషన్లు లక్ష్యానికి చాలా దూరంగా నిలిచాయి. ఉపాధ్యాయులపై అదనపు భారం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచేందుకు, ఏప్రిల్ నుంచి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 16 నుంచి జూన్ 19 వరకు మరోసారి బడిబాట చేపట్టారు. అయితే, ఇదే సమయంలో మే 13 నుంచి జూన్ 9 వరకు ఉపాధ్యాయులకు జనగణనలో భాగంగా గృహాల లెక్కింపు విధులను అప్పగించారు. ఒకవైపు గృహాల సర్వే, మరోవైపు బడిబాట కార్యక్రమం నిర్వహించడం ఉపాధ్యాయులకు తీవ్ర భారంగా మారింది. పాఠశాలలు ప్రారంభమైన అనంతరం ఉదయం, సాయంత్రం వేళల్లో బడిబాట నిర్వహించినప్పటికీ అది అంతగా ప్రభావం చూపలేకపోయింది. రెండు సంవత్సరాలుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఉత్తీర్ణత నమోదు చేస్తున్నారు. దీనికి తోడు, కొన్ని గ్రామాల్లో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకూడదని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు సైతం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలపై ఉపాధ్యాయులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో విద్యాశాఖ వెనుకబడింది. యూడైస్ లెక్కల ప్రకారం విద్యార్థుల వివరాలు సంవత్సరం విద్యార్థుల నమోదు 2023–24 47,4562024–25 47,0262025–26 45,2962026–27 45,591 -
విద్యార్థులపై కక్షసాధింపు తగదు
భువనగిరి: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. బుధవారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నీట్ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జి చేయడం అమానుషం అని అన్నారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించే అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.డి. ఇమ్రాన్, కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చంద్రయ్య, రాష్ట్ర సమితిసభ్యులు గోద శ్రీరాములు, శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, జంగమ్మ , గాలయ్య, వెంకటేష్, శేఖర్రెడ్డి, హరిశ్చంద్ర, ఏశాల అశోక్, మహేందర్, మాణిక్యం పాల్గొన్నారు. -
రోగి ఆరోగ్య సమాచారమంతా డిజిటల్
సాక్షి, యాదాద్రి: ప్రతి రోగికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఏబీడీఎం డైరెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ జిల్లా వర్క్షాప్ను కలెక్టరేట్లో బుధవారం ఆమె కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడైనా రోగి వైద్య చరిత్రను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అంతే ముఖ్యమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సంస్థలు ఏబీడీఎంను విజయవంతంగా అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ, హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ నమోదును పూర్తి చేసిందన్నారు. రాబోయే మూడు నెలల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఏబీహెచ్ఏ( ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ఐడీ అందిస్తామన్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ప్లాట్ఫామ్లో నమోదు చేయడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నేషనల్ హెల్త్ అథారిటీ డైరక్టర్ డాక్టర్ పంకజ్ కుమార్ అరోరా వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఏబీడీఎం అమలులో భాగంగా రోగుల నమోదు, డిజిటల్ ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, డిశ్చార్జ్ సమ్మరీలు, డిజిటల్ ఆరోగ్య రికార్డుల అనుసంధానంపై ఆరోగ్య సిబ్బందికి నిరంతర శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిష్తీ, భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశం పాల్గొన్నారు. ఫ మూడు నెలల్లో ఏబీహెచ్ఏ ఐడీ కార్డులు ఇస్తాం ఫ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ -
విద్యార్థులకు ఆర్థిక భరోసా ‘ఎన్ఎంఎంఎస్’
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడనుంది. ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ను కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా పేద పిల్లలు విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఉపకార వేతనం ఇవ్వనుంది. ఎనిమిదో తరగతి విద్యార్థులు అర్హులు.. ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 7వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 7వ తరగతిలో 50శాతం మార్కులు, ఇతర విద్యార్థులు 55శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,50,000 లోపు ఉండాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్రధానోపాధ్యాయుడి సంతకంతో దరఖాస్తు ఫాంలను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. నాలుగేళ్లు రూ.12వేల స్కాలర్షిప్..ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్, గురుకుల పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. అనంతరం ఉన్నత విద్యలో కూడా పలు కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంటుంది. ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12వేల చొప్పున ఉపకార వేతనంఆగస్టు 14 వరకు గడువు ఈ పరీక్షకు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 పరీక్ష రుసుం ఆన్లైన్లో చెల్లించి బీఎస్ఈ.తెలంగాణ.జీవోవి.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 14వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్ 1న పరీక్షను రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్షను తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో రాయవచ్చు. -
పండ్ల తోటల్లో సూక్ష్మపోషకాల లోపం.. నివారణ చర్యలు
గుర్రంపోడు : పండ్ల తోటల్లో మంచి దిగుబడులు, నాణ్యమైన ఫలాలు పొందాలంటే ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలను కూడా అందించాల్సి ఉంటుంది. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్లను రసాయన ఎరువుల రూపంలో అందిస్తున్నా.. సూక్ష్మపోషకాలైన జింక్, బోరాన్, ఐరన్, మాంగనీస్, కాపర్, మాలిబ్డినమ్లు మొక్కలకు అందక ఆకులు పసుపురంగులోకి మారడం, పూత, కాయ తగ్గడం, పండ్ల నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. రైతుల పరిభాషలో పల్లాకు తెగులుగా చెప్పబడే ఈ లక్షణాలు అన్ని ప్రధాన పండ్ల తోటల్లో సమస్యగా మారింది. బత్తాయి, నిమ్మ తోటల్లో సూక్ష్మధాతు లోపాల నివారణపై హాలియా ప్రాంతీయ ఉద్యానవన అధికారి కె. మురళి అందిస్తున్న సలహాలు, సూచనలు ఇవీ.. 1. జింక్ లోపం : కొత్త ఆకులు చిన్నవిగా మారుతాయి. ఆకుల మధ్య భాగం పసుపు రంగులోకి మారడం, కొమ్మల ఎదుగుల తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ : లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున ఆకులపై పిచికారీ చేయాలి. లేదా భూమిలో తగిన మోతాదులో జింక్ సల్పేట్ను వేయాలి. 2. బోరాన్ : బోరాన్ లోపం వల్ల పూత, కాయధారణ తగ్గుతుంది. పండ్లు పగిలిపోవడం లేదా ఆకారంలో మార్పు రావడం జరుగుతుంది. పూత దశలోనే బోరాన్ లోపాన్ని నివారిస్తే మంచి దిగుబడులు వస్తాయి. నివారణ : లీటరు నీటికి రెండు గ్రాముల బోరాక్స్ను కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ లోపాన్ని నివారించుకోవచ్చు. 3. ఐరన్ : ఐరన్ లోపం వల్ల కొత్త ఆకులు పసుపు రంగులోకి మారి ఈనెలు మాత్రమే ఆకుపచ్చగా కనిపిస్తాయి. నివారణ : ఐరన్ లోపం ఉన్నప్పుడు చిలేటెడ్ ఐరన్ రెండు గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. 4. మాంగనీస్ సల్ఫేట్ : ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ నిలిచిపోయి కొమ్మలు గిడసబారుతాయి. నివారణ : మాంగనీస్ సల్ఫేట్ 0.5 శాతం ద్రావణంను ఆకులపై పిచికారీ చేయాలి. పై మందులు విడిగా పిచికారీ చేయడంలో ఇబ్బందులు ఉంటే అన్నిరకాల సూక్ష్మపోషక లోపాల నివారణకు మార్కెట్లో లభించే ఫార్ములా–4 మరియు ఫార్ములా–6 మందులను పిచికారీ చేయడం ద్వారా సూక్ష్మపోషక లోపాలను నివారించుకోవచ్చు . సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్ట్లను వినియోగించడం ద్వారా నేలలో పోషకాల లభ్యత పెరిగి సూక్ష్మపోషక లోపాలు నివారించబడతాయి. నేలలో పీహెచ్ అధికంగా ఉంటే ఐరన్, జింక్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. పండ్ల తోటల్లో అధిక తేమ ఉంటే పోషకాల శోషణ తగ్గిపోతుంది. సరైన తేమ ఉండేలా నీటి యాజమాన్యం పాటించాలి. సమతుల్య ఎరువుల నిర్వహణ, సేంద్రియ ఎరువుల వినియోగం, సకాలంలో ఆకులపై పిచికారీ చేపడితే పండ్ల తోటల్లో సూక్ష్మపోషకాలను నివారించుకోవచ్చు. -
ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి
హుజూర్నగర్ : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ కె. చంద్రశేఖర్, కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సంధ్యారాణి సూచించారు. బుధవారం హుజూర్నగర్ మండలంలోని పలు గ్రామాలలో పొలాలను, వరి నారుమడులను వారు సందర్శించారు. ఈ సందర్భంగా నారుమళ్లలో పోషక లోపాలపై రైతులకు పలు సూచనలు చేశారు. గడ్డి, తుంగ జాతి కలుపు అధికంగా పెరిగిన నారుమడుల్లో సరైన కలుపు మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. పెసర పంటలో చీడపీడలను నివారించేందుకు తీసుకోవాల్సి న జాగ్రత్తలను వివరించారు. మెట్ట నారుమడుల్లో పోషక లోపాలను అధిగమించేందుకు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని ఆకులపై పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ స్వర్ణ, ఈఓ ప్రియాంక, రైతులు పాల్గొన్నారు. -
పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
మిర్యాలగూడ : బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులు దృష్టి పెట్టాలని బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ అతిథి గృహంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన రూ.5 భోజన పథకం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బీసీల సంక్షేమానికి సంబందించిన వివిధ పథకాల అమలుపై సమగ్ర వివరాలు అడిగారు. మహిళా శక్తి క్యాంటిన్లలో ఎంతమంది బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు. అంతకుముందు ఆయనకు ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి వినోద్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్శర్మ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ్, సహాయ అధికారి ఇస్తేరా తదితరులు ఘన స్వాగతం పలికారు. బీసీ కమిషన్ సభ్యుడు సురేందర్


