breaking news
Yadadri District Latest News
-
సరికొత్తగా సెలబ్రేషన్స్
మూడు రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు చిన్నాపెద్దా సిద్ధమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లోని యువకులు గ్రూపులుగా ఏర్పడి విందు, మందు, వినోదం ఉండేలా వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 31వ తేదీ రాత్రి కేక్ కట్ చేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఫ ఇయర్ ఎండ్ వేడుకలకు సిద్ధమవుతున్న యువత ఫ పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ ఫ ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేసేందుకు కొందరి ఆసక్తి ఫ ఫామ్హౌస్లలో విందు, వినోదాలకు ప్రణాళిక ఫ ‘మ్యూజికల్ నైట్స్’ నిర్వహిస్తున్న కొన్ని హోటళ్లు భువనగిరిటౌన్, సూర్యాపేట టౌన్, రామగిరి(నల్లగొండ) : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికే సమయం దగ్గర పడింది. ఆట పాటలతో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు జరిపేందుకు యువత ప్రణాళికలు వేసుకుంటోంది. అందుకు అనుగుణంగా ఆయా వ్యాపార సంస్థలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలో యువకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే యోచనలో ఉన్నారు. కొందరు యువకులు గోవా, వైజాగ్, అరకుతోపాటు ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొందరు హైదరాబాద్ శివారులోని ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్, పబ్లలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు, వైద్యులు, వ్యాపారులు తమ కుటుంబంతో కలిసి రిసార్ట్స్లో వేడుకలు జరుపుకునేందుకు ఈ నెల 31న ఉదయమే హైదరాబాద్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువకులు పల్లె వాతావరణాన్ని ఆస్వాదించేందుకు మొగ్గుచూపుతున్నారు. పట్టణాలు, గ్రామాల సమీపంలోని తోటల్లో న్యూఇయర్ వేడుకలకు జరుపుకునేందుకు యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా.. ఇప్పుడు ట్రెండ్ మార్చుకుని స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వంటకాలు చేసుకుని పల్లె పదాలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ముఖ్యంగా తాటి కల్లు తీసుకుని.. కుండ చికెన్, వివిధ మాసాంహార వంటలు, రొట్టెలు స్వయంగా తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఏడాది 31 రోజు వినియోగదారులను ఆకర్షించేందుకు పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు పెడుతుంటారు. హోటళ్ల ఎదుట పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకుంటే కిలో కేక్.. కిలో కేక్ తీసుకుంటే లీటరు కూల్ డ్రింక్ ఇలా ఆఫర్లు పెడుతూ బేకరీలు, హోటళ్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. యువత అభిరుచికి అనుగుణంగా పలు ప్రాంతాల్లో మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నారు. 31వ తేదీన నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఇక, నల్లగొండ పట్టణం సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో న్యూ ఇయర్ నైట్ పార్టీకి ఏర్పాట్లు చేశారు. పార్టీకి హాజరయ్యే సింగిల్, జంటలకు ఎంట్రీ ఫీజు వసూలు చేయనున్నారు. -
జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్ : జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం కొత్తగా జారీచేసిన 252 జీఓలోని నిబంధనలను సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే (హెచ్–143), డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తెచ్చిన 252 జీఓ వల్ల జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. రెండు కార్డుల విధానాన్ని తీసుకొచ్చి జర్నలిస్టులను వేరు చేసే ఆలోచన సరికాదన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా 252 జీఓను సవరించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు. కార్యక్రమంలో యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి, శివకుమార్, మట్టయ్య, దుర్గాప్రసాద్, జనార్దన్రెడ్డి, నాగేశ్వర్రావు, వరుణమ్మ, పగడాల సురేష్, వెంకట్రెడ్డి, గాదె రమేష్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, సాయి, శ్రీనివాస్, నరేష్, జాకీర్అలీ, కత్తుల గిరిబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మాడుగులపల్లి : మాడుగులపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లికి చెందిన కొండ నాగరాజు(35), మిర్యాలగూడకు చెందిన నరేందర్ తమ ద్విచక్ర వాహనాలపై మాడుగులపల్లి మండల కేంద్రంలో యూటర్న్ తీసుకుంటుండడగా.. వెనుక నుంచి వచ్చిన అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ద్విచక్ర వాహనం నరేందర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు, నరేందర్కు తీవ్ర గాయాలు కాగా.. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నాగరాజు మృతిచెందాడు. నరేందర్ నల్లగొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య కొండ రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కళాత్మకంగా ఇక్కత్ వస్త్రాలు● నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెంబర్ జస్టిస్ పుష్పసత్యనారాయణ భూదాన్పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెంబర్ జస్టిస్ పుష్పసత్యనారాయణ అన్నారు. శనివారం ఆమె పోచంపల్లిని సందర్శించారు. స్థానిక చేనేత సహకార సంఘంలో ఇక్కత్ చేనేత వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని ఇక్కడి కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం ఆమె చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. యాదగిరీశుడి సేవలో ప్రముఖులుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తమిళనాడు హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం. దండపాణి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ మెంబర్ జస్టిస్ పుష్ప సత్యనారాయణ, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, కుటుంబ సభ్యులు శనివారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కనగల్ : పొలంలో వరి నాట్ల పనులను పరిశీలిస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ వైరు తగిలి విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన కనగల్ మండలం ఏమిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేపవారిగూడెం గ్రామంలో శనివారం జరిగింది. ఎస్ఐ రాజీవ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేపవారిగూడేనికి చెందిన దేప వనమ్మ(58) తన వ్యవసాయ భూమిలో వరి నాట్ల పనులను పరిశీలించడానికి పొలానికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు పొలంలో ఉన్న కరెంట్ తీగ ఆమెకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. అక్కడే ఉన్న ఆమె కొడుకు మహేందర్రెడ్డి వెంటనే తల్లి వద్దకు పరుగు తీసి కర్ర సాయంతో వైరును తొలగించి ఆమెను పొలం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే వనమ్మ మృతిచెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్కూటీ అదుపుతప్పి.. మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం అవంతీపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన సట్టు మనోజ్ (26) తన స్నేహితులు రమావత్ రాకేష్, భూక్య సాయిశివ, గుడిసె సురేష్ కలిపి శుక్రవారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి–నార్కట్పల్లి రహదారి వెంట ఉన్న కృష్ణపట్నం హోటల్లో భోజనం చేసి తిరిగి నేరేడుచర్లకు ప్రయాణమయ్యారు. గుడిసె సురేష్, సట్లు మనోజ్ స్కూటీపై వేగంగా వెళ్తుండగా.. అవంతీపురం వద్ద జడ్జర్ల–కోదాడ జాతీయ రహదారిపై స్కూటీ అదుపుతప్పడంతో మనోజ్ కిందపడిపోయాడు. అతడి తల, చేతులకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మూడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
దేవరకొండ : రాబోయే మూడేళ్లలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్లను స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ అధ్యక్షతన శనివారం దేవరకొండలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రజలందరి సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నక్కలగండి ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చి తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాశ్నేత మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్పంచులు పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. రాష్ట్రంలోనే దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా 180 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారని గుర్తుచేశారు. రాబోయే మూడేళ్లల్లో ఎస్ఎల్బీసీ పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అనంతరం కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునమాధవరెడ్డి, శ్రీలతారెడ్డి, దొంతం సంజీవరెడ్డి, వేణుధర్రెడ్డి, వెంకటయ్యగౌడ్, జాల నర్సింహారెడ్డి, ఆలంపల్లి నర్సింహ, ఏవీరెడ్డి, రాజేష్రెడ్డి, శ్రీధర్రెడ్డి, రేఖారెడ్డి, వేమన్రెడ్డి, పార్వతి, గుంజ రేణుక, ప్రతాప్రెడ్డి, కిన్నెర హరికృష్ణ, కొర్ర రాంసింగ్, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు. నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి -
కృష్ణపట్టెలో మొసళ్ల భయం
అడవిదేవులపల్లి : కృష్ణపట్టెలో మొసళ్లు, కొండచిలువలు, పాములు సంచరిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. రెండేళ్ల వ్యవధిలో పదుల సంఖ్యలో మొసళ్లు జనావాసాల్లో పట్టుబడ్డాయి. పదుల సంఖ్యల్లో కొండచిలువలు, పాములు గ్రామస్తుల చేతిలో హతమయ్యాయి. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి అడవిదేవులపల్లిలోని టెయిల్పాండ్ వరకు 21 కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుంది. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి టెయిల్పాండ్ వరకు కూడా నీరు నిల్వ ఉంటుండడంతో మొసళ్లకు ఆవాసంగా మారింది. దీంతో ఆహారం కోసం కృష్ణపట్టెలోని సమీప గ్రామాల్లోకి రాత్రివేళ మొసళ్లు వస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటి వేళ సైతం ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్నారు. అడవిదేవులపల్లి మండలంలోని నడిగడ్డ, చిట్యాల గ్రామాల్లో ఈ మొసళ్ల సమస్య అధికంగా ఉంది. ఇటీవల కాలంలో నడిగడ్డ గ్రామంలోకి మొసళ్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా చిట్యాల గ్రామంలో నది వద్ద నీరు తాగుతున్న మేకపోతును మొసలి తినేసింది. కాగా నది తీరంలో మనుషులు, పశువులు, మూగజీవాలు నీరు తాగే ప్రాంతాల్లోనే మొసళ్లు మాటు వేస్తున్నాయి. కృష్ణాతీరంలోని అడవిదేవులపల్లి, నడిగడ్డ, చిట్యాల, ముదిమాణిక్యం, ఇర్కిగూడెంతో పాటు వాడపల్లి, మఠంపల్లి పుణ్యక్షేత్రాల వద్ద నదిలోకి దిగి స్నానాలు చేసేటప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లోకి వస్తున్న జలచరాలు, పాములు రాత్రివేళ బయటకు వెళ్లాలంటనే జంకుతున్న ప్రజలు అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని వేడుకోలుమొసళ్ల బారి నుంచి కాపాడాలిగ్రామాల్లోకి నిత్యంమొసళ్లు, పాములు వస్తున్నాయి. టెయిల్పాండ్ బ్యాక్ వాటర్ వలన గ్రామానికి ఇరువైపులా నీరు రావడంతో విషపు పురుగుల బెడద ఎక్కువైంది. అధికారులు స్పందించి మొసళ్ల బారి నుంచి కాపాడాలి. గ్రామం చుట్టూ రక్షణ కవచంలా కంచె ఏర్పాటు చేయాలి. – రామానుంజనేయులు, చిట్యాల గ్రామం, అడవిదేవులపల్లి -
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
యాదగిరిగుట్ట: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరిగుట్ట క్షేత్రంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఈఓ వెంకట్రావ్తో కలిసి డీసీపీ అక్షాంశ్యాదవ్ పరిశీలించారు. క్యూలైన్లు, దర్శనం, భద్రత తదితర అంశాలపై చర్చించారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ, ఈఓ తెలిపారు. అదే విధంగా భక్తులను, భక్తుల బ్యాగులను తనిఖీ చేయడానికి ఏర్పాటు చేసిన బ్యాగేజీ స్కానర్ను ట్రయల్రన్ చేసి పరిశీలించారు. కార్య క్రమంలో ఏసీపీ శ్రీనివాసనాయుడు, డిప్యూటీ ఈఓ భాస్కరశర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దయాకర్రెడ్డి, సీఐ భాస్కర్, ఆర్ఐ శేషగిరిరావు పాల్గొన్నారు. -
రైల్వే లెవల్ క్రాసింగ్ల తనిఖీ
భువనగిరి : బీబీనగర్–మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సెక్షన్లో గేట్ నంబర్ 17, 20–ఈ వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీ వాస్తవ శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.గేట్ బూమ్, రికార్డులు, భద్రతా పరికరాల పనితీరును పరిశీలించారు. గేట్మన్లతో మాట్లాడి క్రాసింగ్ల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. అలాగే ట్రాక్మన్లతో మాట్లాడి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. రైళ్లు సురక్షింతంగా రాకపోకలు సాగించడంలో ట్రాక్మన్లు, గేట్మన్ల పాత్ర కీలకమని, అప్రమత్తంగా వ్యవహరించాలని వారికి సూచించారు. రైళ్లు వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తున్న పలువురు గేట్మన్లు, పెంట్రోలింగ్ మన్లను అభినందించి, వారికి నగుదు బహుమతి ప్రకటించారు. ఆయన వెంట సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపాల్ కృష్ణన్, ఇతర అధికారులు ఉన్నారు. -
శ్రీశైలానికి ఐదో ట్రిప్పు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) నిర్వహిస్తున్న లాంచీ సేవలు కొనసాగుతున్నాయి. నవంబర్ 28న సాగర్–శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని టూరిజం శాఖ ప్రారంభించింది. శనివారం ఐదో ట్రిప్పులో 120 మందితో లాంచీ శ్రీశైలానికి బయల్దేరింది. ఈ ప్రయాణానికి పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఐదో ట్రిప్పులో సీనియర్ జర్నలిస్టు, సాక్షి దినపత్రిక మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు. సాగర్ ప్రాజెక్టులోని నీటిమట్టం ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో లాంచీ ట్రిప్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు టూరిజం అధికారులు వెల్లడించారు. -
మూగజీవాలకు షుగర్ పరీక్షలు
కోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో సూర్యాపేట జిల్లాలోనే మొదటగా జంతువులకు షుగర్ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నారు స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య. శనివారం కుక్కలు, పలు పశువులకు షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను రాసిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల చిలుకూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన పెంపుడు కుక్క షుగర్ వ్యాధి లక్షణాలతో మృతిచెందిదని అన్నారు. జంవుతులకు షుగర్ పరీక్షలు చేసే పరికరాలు ఖమ్మం, హైదరాబాద్తో పాటు ఏపీలోని గన్నవరంలోనే ఉన్నాయని, దీంతో పశుపోషకులు దూరప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి స్థానిక పశువైద్యశాలలోనే షుగర్ పరీక్ష కిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఓ వెటర్నరీ ఫార్మా కంపెనీ సహాయంతో షుగర్ పరీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్, హరికృష్ణ ఉన్నారు. కోదాడ పశువైద్యశాలలో ప్రారంభం -
మున్సిపోల్స్కు రెడీ..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని భావించినా వా టిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆయా మున్సిపాలిటీల వారీ గా ఇప్పటివరకు ఉన్న ఓటరు జాబితాలను తీసుకుంది. ఎప్పుడు షెడ్యూలు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చింది. పదవీ కాలం ముగిసి 11 నెలలు.. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 11 నెలలు దాటింది. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 25వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాటి పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో మున్సిపాలిటీల్లో నిధుల సమస్య తప్పడం లేదు. మున్సిపాలిటీలకు 40:30:30 నిష్పత్తిలో ‘అమృత్ 2.0’ వంటి పథకాల కింద రావాల్సిన గ్రాంటు, ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణంగా పాలక వర్గాలు ఉంటే వారు ప్రభుత్వాన్ని సంప్రదించి కావాల్సిన నిధులను తెచ్చుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వారి నిధులను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఆ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పునర్విభజన లేకపోతే జనవరిలోనే షెడ్యూల్ ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభభజన చేసి 2020 జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన చేస్తుందా? లేదా? అన్న తేలాల్సి ఉంది. ఒకవేళ వార్డుల పునర్విభజన చేయకపోతే జనవరి రెండో వారం లేదంటే మూడో వారంలో షెడ్యూలు జారీచేసే అవకాశం ఉంది. పునర్విభజన చేస్తే కనుక ఫిబ్రవరిలో షెడ్యూలును జారీ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈలోగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార పార్టీ.. ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవచ్చని కూడా భావిస్తోంది. ఫ మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ఫ ముందుగా మున్సిపాలిటీ.. ఆ తరువాతే పరిషత్ ఎన్నికలు! ఫ కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి ఫ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉమ్మడి జల్లాలోని 19 మున్సిపాలిటీల పరిధిలో గతంలో జరిగిన ఎన్నికల ప్రకారం 6,57,901 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో నల్లగొండ జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 3,11,120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 1,52,290 మంది ఉండగా, పురుషులు 1,58,827 మంది, ట్రాన్స్జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 2,14,490 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,04,075 మంది, మహిళలు 1,10,414 మంది, ట్రాన్స్జెండర్లు ఒకరు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,30,578 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 63,187 మంది ఉండగా, మహిళలు 67,373 మంది, ట్రాన్స్జెండర్లు 18 మంది ఉన్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదు, సవరణ ద్వారా వారి సంఖ్య భారీగా పెరుగుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తంఆలేరు 6,624 6,902 0 13,526 భువనగిరి 28,560 24,836 1 53,397 చౌటుప్పల్ 6,689 13,593 0 20,282 మోత్కూర్ 7,740 7,300 0 15,040 పోచంపల్లి 6,943 7,923 0 14,866 యాదగిరిగుట్ట 6,631 6,819 17 13,467 -
పత్తి ముంచింది
పత్తికి ఆదిలోనే ఇబ్బందులు ఎన్నో ఆశలతో వానాకాలం సేద్యాన్ని ప్రారంభించిన రైతులకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలకరి వానలకు విత్తిన పత్తి విత్తనాలు.. వరుణుడు ముఖం చాటేయడంతో భూమిలోనే మాడిపోయాయి. దీంతో ఒకటి, రెండుసార్లు విత్తాల్సి వచ్చింది. తీరా పంట చేతికి వచ్చాక కురిసిన భారీ వర్షాలు రైతులు పూర్తిగా నష్టపోయాడు. ఇక వరి సాగు గత ఏడాదితో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ మెరుగైన దిగుబడులతో రైతన్న గట్టెక్కాడు. వడ్ల అమ్మకాలకు అవస్థలు ఎప్పటిమాదిరిగానే ఈసారి వానాకాలం ధాన్యం అమ్మకాలకు రైతులు అవస్థలు పడ్డారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వల్ల తక్కువ ధరకు ప్రైవేట్కు అమ్ముకున్నారు. 2,98,885 ఎకరాల్లో వరి సాగైంది. 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. 3.14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అధికంగా దొడ్డు రకం వరి సాగు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ రైతులు ఆసక్తి చూపలేదు. మూసీ నీరు సన్నాల సాగుకు అనుకూలం కాకపోవడం, వర్షాలు కురిస్తే నూక ఎక్కువగా వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు దొడ్డు రకాల సాగుకు మొగ్గు చూపారు. 2,98,885 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో దొడ్డురకం 2.75 లక్షలు, సన్నాలు 23 వేల ఎకరాల్లో సాగు చేశారు. 4.50 లక్షల మెట్రిక్న్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. అందులో దొడ్డురకం 3.15 లక్షల మెట్రిక్ టన్నులు, 9,267 మెట్రిక్ టన్నులు సన్నరకం వడ్లు కొనుగోలు చేశారు. 48,099 మంది రైతుల నుంచి వడ్లు కొనుగోలుచేశారు. అందుబాటులోకి కొత్త వంగడాలు మూసీ కాలుష్య జలాలు, నదీ పరీవాహకంలోని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ప్రభుత్వం ఈ వానాకాలం నుంచి కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సంప్రదాయ రకాలకు బదులుగా హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి. ఇవి చీడపీడలను తట్టుకొని, గింజ బరువు కలిగి అధిక దిగుబడిని ఇచ్చాయి. ఎకరాకు గరిష్టంగా 35 నుంచి 40 క్వింటాళ్ల (83 నుంచి 100 బస్తాలు) దిగుబడి వచ్చింది. యూరియా కొరతయూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారు. రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాలకు తిరి గారు. కాంప్లెక్స్ ఎరువుల కొరత ఏర్పడింది. యాప్పై అవగాహన లేమిసీజన్ ప్రారంభంలో అనావృష్టి, పంట చేతికొచ్చి న సమయంలో అతివృష్టి కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయాడు. అధిక వర్షాల వల్ల పూత, పింజ రాలిపోవడంతో పాటు, చివరి సమయంలో మెంథా తుపాను మరింత దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా 68,670 మంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అరకొరగా చేతికొచ్చిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. సీసీఐ కొత్తగా తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్పై రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో దళారులకు అమ్ముకున్నారు. కొందరు రైతులు నేరుగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని వెళ్లగా.. కొర్రీలు పెట్టి మద్దతు ధర ఇవ్వలేదు.పెట్టుబడి ఖర్చులు వెళ్లలేదు ఆరు ఎకరాలు పత్తి సాగు చేశా. రూ.2.50 లక్షలు ఖర్చు వచ్చింది. వర్షాలు కురిసిన సమయంలో కూలీలు రాలేదు. చాలా వరకు పత్తి నేలపాలైంది. కేవలం 34 కింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.6300కి విక్రయించాను. మద్దతు ధర రూ.10వేలు ఉంటే మేలు జరిగేది. – తండ జంగయ్య, జనగాం, సంస్థాన్నారాయణపురం మండలం2025 సంవత్సరంలో వ్యవసాయం ఒడిదుడుకులతో సాగింది. వరి పర్వాలేదనిపించగా, పత్తి నిండా ముంచింది. పంట చేతికొచ్చిన సమయంలో వరుస వర్షాలు, మెంథా తుపాను పత్తి రైతును కోలుకోకుండా చేసింది. పెట్టుబడి కూడా వెళ్లక అప్పుల పాలయ్యారు. వరి మెరుగైన దిగుబడి రావడం అన్నదాతకు కాస్త ఊరటనిచ్చింది. – సాక్షి,యాదాద్రి -
నేడు వలిగొండకు మంత్రి వెంకట్రెడ్డి రాక
వలిగొండ : రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం వలిగొండకు రానున్నారు. వలిగొండ నుంచి కాటేపల్లి వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించనున్నారు. అదే విధంగా నూతన సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పాల్గొంటారని, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. తల్లిదండ్రులను విస్మరించొద్దుచౌటుప్పల్ : ఆస్తులను పంచుకోవడమే కాదు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బాగోగులను పట్టించుకోవాలని వయోవృద్ధుల పోషణ, సంరక్షణ ట్రిబ్యునల్ చైర్మన్ వెల్మ శేఖర్రెడ్డి సూచించారు. ట్రిబ్యునల్లో బాధితులు అందజేసిన పిటిషన్లపై శనివారం ఇరువర్గాలను పిలిచి విచారణ చేశారు. ఆస్తులను పంచుకొని, చరమాంకంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించడం బాధాకరమన్నారు. కన్నబిడ్డలపై తల్లిదండ్రులు ట్రిబ్యునల్ను ఆశ్రయించే పరిస్థితి పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ మెంబర్, సీనియర్ న్యాయవాది ముత్యాల సత్తిరెడ్డి, సెక్షన్ అధికారి కవిత తదితరులు పాల్గొన్నారు. యాదగిరీశుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజా మున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం పాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర వేడుకలను నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండిజోడు సేవను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. పాతగుట్ట ఆలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి, పారాయణికులు పాశురాలు పఠించారు. -
పట్టుదలకు ప్రతీక..
నకిరేకల్ : తాటి గీతకు చిన్నప్పటి నుంచి నటన అంటే ప్రాణం. ఇంటర్ పూర్తికాగానే తల్లిదండ్రులు గీతకు పెళ్లి చేశారు. ఆమెకు ఒక బాబు ఉన్నాడు. భర్త సైదులు దివ్యాంగుడు. పేద కుటుంబం కావడంతో భర్త సహాయంతో నకిరేకల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా తోపుడు బండిపై నిత్యం ఇడ్లీలు, టీ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలోనే గీత ఓపెన్లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. కళలు, నటన అంటే ఎంతో ఇష్టం ఉన్న గీత ఎన్నోసార్లు జిల్లాస్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతులు సాధించింది. అంతేకాకుండా ఇళ్లలో వాడి పడేసిన నిరుపయోగ వస్తువులతో అందమైన కళాకృతులను చేయడం హాబీగా మార్చుకుంది. టీవీ సీరియల్స్, సినిమాల్లో కూడా.. గత ఆరేళ్లుగా ఎంతో కష్టపడిన గీత ఈ టీవీలో ప్రసారమయ్యే అభిరుచి కార్యక్రమంలో, మరొక టీవీ నిర్వహించిన బీ ఏ స్టార్ కార్యక్రమంలో తొలిసారి బుల్లితెరపై కనిపించారు. అంతేకాకుండా ఈ టీవీలో ప్రసారమయ్యే మనసు మమత సీరియల్లో డాక్టర్గా, నాలుగు స్తంభాలాట సీరియల్లో గృహిణిగా, బమ్చిక్ బమ్లో అత్త పాత్రలో, మా టీవీలో వచ్చే గుప్పెడంత మనసు సీరియల్లో కళాశాల ప్రిన్సిపాల్గా, గృహప్రవేశం సీరియల్లో ధనవంతురాలైన గృహిణి పాత్రలో, జీ టీవీలో వచ్చే నిన్నే పెళ్లాడుతా సీరియల్లోనూ నటించింది. గీత నటి ంచిన నేతన్న పాటను యూట్యూబ్లో లక్షల మంది వీక్షించారు. చదువెందుకు అబ్బినది, కేసీఆర్ కథాగానం, నందనం, శిఖరం, శానాబాగుంది వంటి యూట్యూబ్ పాటల్లోనూ గీత నటించారు. అదేవిధంగా తమాసోమా జ్యోతిర్గమయ సినిమాలో, వరుణ్ సందేశ్ నటించిన యాద్బావం తద్బవతి సినిమాలో తల్లి పాత్రలో నటించింది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్ పక్కన ఓ క్యారెక్టర్లో నటించింది. గాడ్, లగ్గం, ప్రేమ విమానం, గేమ్ ఛేంజర్, మహర్షి, భగవంత్ కేసరి, ఘాటీ, భీమదేవరపల్లి బ్రాంచి, ట్రెండింగ్ లవ్, పైలం పిల్లగా, అట్లాస్ సైకిల్, కాటి తదితర సినిమాలతో పాటు 5 యూట్యూబ్ సాంగ్స్, 20 షార్ట్ ఫిల్మ్స్, 10 డెమో ఫిల్మ్స్, 4 ఫీచర్ ఫిల్మ్స్, 3 ఇండిపెండెంట్ సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది.నా ప్రత్యేకత ఏంటో చూపిస్తున్నా తోపుడు బండిపై ఇడ్లీలు అమ్ముకునే నన్ను చాలామంది చుల కనగా చిన్నచూపుతో చూశారు. దాంతో నాలో పట్టుదల పెరిగింది. నటనపై ఉన్న ఆసక్తితో ఎలాగైనా సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకోవాలని 12ఏళ్ల నుంచి కృషి చేస్తున్నాను. ఇప్పడు నా ప్రత్యేకత ఎంటో చూపిస్తున్నా. మహిళలను చిన్నచూపు చూడకుండా, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే సత్తా చాటుతారని చాటి చెప్పడమే నా లక్ష్యం. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే ధ్యేయంతో కృషిచేస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగల్గుతారు. – తాటి గీతసినిమా అనే రంగుల ప్రపంచం చాలా మందిని ఆకర్షిస్తుంది. ఎంతో మంది తమను తాము వెండితెరపై చూసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొందరికే సక్సెస్ లభిస్తుంది. సినిమాల్లో రాణించాలంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన తాటి గీత కూడా కుటుంబ పోషణ కోసం ఇడ్లీ బండి నడుపుతూనే.. వెండితెరపై నటించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్లో ఆమె కనిపించింది. బుల్లితెర, వెండితెరపై రాణిస్తున్న నకిరేకల్కు చెందిన మహిళ కుటుంబ పోషణ కోసం ఇడ్లీ బండి నడిపిస్తూ.. పలు సినిమాలు, సీరియల్స్లో నటించడంతో మంచి గుర్తింపు -
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్తో ఫోన్ ఇన్
చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.తేది. 29.12.2025 సోమవారంసమయం : ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 9848047492 -
30 ఏళ్ల ఆదాయం
వక్కసారి నాటితే..గుర్రంపోడు : వ్యవసాయ రంగంలో కొంతమంది రైతులు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ సుస్థిర ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లా నేలలు వక్కసాగుకు అనుకూలం కావడంతో రైతులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ముప్పై ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడులు ఇచ్చే వక్కసాగుతో యేటా ఎకరాకు కనీసం రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. గుర్రంపోడు మండలంలోని మొసంగి, కాచారం, పిట్టలగూడెం గ్రామాలతోపాటు పెద్దవూరు మండలంలోనూ వక్క సాగు చేస్తున్నారు. కేరళ, తమిళనాడుల్లో సాగవుతున్న వక్క తోటలతోపాటు, అనంతపురం, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో సాగవుతున్న వక్క తోటలను సందర్శించి కొంతమంది ఈ ప్రాంతంలో వక్కసాగు చేస్తున్నారు. అక్కడి రైతుల అనుభవాలను బట్టి ఏటా ఎకరాకు రూ.ఐదు లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నా.. ఖాయంగా రూ.రెండు లక్షలకు తగ్గదన్న భరోసాతో సాగు చేపడుతున్నారు. అంతరపంటగా.. 40 ఫీట్ల ఎత్తు వరకు పెరిగే వక్క మొక్కలను ఆయిల్పామ్, కొబ్బరి, ఎర్రచందనం తదితర పంటల్లో అంతరపంటగా ఈ మొక్కలు సాగు చేస్తున్నారు. వక్క కాయలతోపాటు వక్క మట్టలు కూడా ఇస్తార్లుగా ఆదాయం సమకూర్చుతాయి. ఎకరాకు 8 ఫీట్ల దూరంతో 400 మొక్కల వరకు సాగుచేసుకోవచ్చు. వక్కకు మార్కెటింగ్ సమస్య కూడా లేదు. నేరుగా పతంజలి లాంటి కంపెనీలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తాయి. నాటిన నాలుగేళ్ల నుంచి కాపు మొదలై ఏడేళ్లలో పూర్తి స్థాయిలో దిగుబడులు వస్తాయి. ఎకరాకు రెండు టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. కేజీ కాయలు రూ.ఐదు వందల వరకు ధర ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. వినూత్న పంటల సాగుపై రైతుల ఆసక్తి వక్క తోటతో ఏటా ఎకరాకు కనీసం రూ.2లక్షల వరకు ఆదాయం ఇక్కడి నేలలు అనుకూలం కావడంతో అంతర పంటగా సాగు చేస్తున్న రైతులు -
పట్టణాలకు హంగులు
సాక్షి, యాదాద్రి : పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం (యూఐడీఎస్) కింద మున్సిపాలిటీలకు ఇటీవల మంజూరైన నిధులతో మరిన్ని వసతులు కల్పించేలా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో భాగంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు రెండు నెలల క్రితం తెలంగాణ రైజింగ్ విజన్–2027 పథకంలో భాగంగా రూ.90 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో 2026 మార్చినాటికి మున్సిపాలిటీల్లోని ప్రజలకు మెరుగైన వసతులు కల్పించనున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఆయా పనులకు శంకుస్థాపన చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి పథకం ఇప్పటికే రూ.90 కోట్లు విడుదల అయ్యాయి. ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు వచ్చాయి. అయితే మున్సిపాలిటీల్లో చేపట్టే పనుల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్ తయారులో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు.. మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశమై ప్రతి పనికి డీపీఆర్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే.. రానున్న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే పనులకు శంకుస్థాపన చేసే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. అభివృద్ధి పనులు ప్రారంభించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రెండు నెలల క్రితం మంజూరైన నిధులకు సంబంధించిన చేపట్టాల్సిన పనులపై డీపీఆర్లు పూర్తి కాలేదు. వెంటనే డీపీఆర్లు పూర్తిచేసి సాంకేతిక అనుమతి కోసం ఈఎన్సీకి పంపిస్తారు. అక్కడినుంచి అనుమతి రాగానే మున్సిపాలిటీల వారీగా టెండర్ల ప్రక్రియపూర్తి చేస్తారు. అనంతరం శంకుస్థాపన చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. మున్సిపాలిటీల అభివృద్ధి, డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతాల్లో మౌలిక వసతులు, పార్కులు, ఓపెన్ జిమ్ల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు ఖర్చు చేస్తారు. మున్సిపాలిటీల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశం ఫ ఎన్నికలకు ముందే అభివృద్ధి పనులశంకుస్థాపనలకు ప్లాన్ ఫ రెండు నెలల క్రితమే యూఐడీఎస్ పథకం కింద నిధులు ఫ తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా రూ.90 కోట్లు విడుదల ఫ డీపీఆర్ల పూర్తికి అధికారుల కసరత్తు భువనగిరి మున్సిపాలిటీకి విడుదలైన రూ.15 కోట్లలో రోడ్ల నిర్మాణాలకు రూ.59.6 లక్షలు, సీసీ డ్రెయినేజీలకు రూ.46.4 లక్షలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణానికి రూ.45లక్షలు, పార్కుల అభివృద్ధికి రూ.4 లక్షలు, ప్రధాన రహదారులపై బాక్స్ కల్వర్టుల నిర్మాణాలకు రూ.కోటి, రహదారుల జంక్షన్ల అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఆలేరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులతో హైస్కూల్ ఆవరణలో ఓపెన్ జిమ్, వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, స్ట్రాం వాటర్ డ్రెయినేజీలు, ఒక పార్కు, విలీన గ్రామమైన బహుద్దూర్పేటలో కొన్ని పనులకు డీపీఆర్ రూపొందిస్తున్నారు. భూదాన్పోచంపల్లిలో రూ.15 కోట్ల నిధులలో రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, రూ.5 కోట్లతో డ్రెయినేజీలు, పార్కు నిర్మాణం, నారాయణగిరి వద్ద కల్వర్టు నిర్మాణం, విలీన గ్రామాలైన ముక్తాపూర్, రేవణవల్లిలోని శ్మశానవాటికల అభివృద్ధి పనులు చేస్తారు. మోత్కూర్ మున్సిపాలిటికి రూ.15కోట్లుతో బీటీ, సీసీ రోడ్ల, డ్రెయినేజీ నిర్మాణాలు, విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురంలో మౌలిక వసతులు కల్పిస్తారు. చౌటుప్పల్ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.15 కోట్లతో డ్రెయినేజీల నిర్మాణం, సీసీ రోడ్లు, ప్రధాన పనులకు ఖర్చు చేస్తారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో రూ.15కోట్లతో వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఖర్చుచేయడానికి డీపీఆర్లు సిద్ధం చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపిక
మోత్కూరు : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 జూడో పోటీలు శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ పోటీలకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. బాలికల విభాగంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన ఎస్.శ్రీజ, కె.సిరిచందన, కె.సిరి, డి.సహస్ర, సీహెచ్.అస్మిత, పి.మేఘన, టి.రుచిత, వి.హాసిని ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే బాలుర విభాగంలో డి.అభిషేక్, మనిసాత్విక్, కె.సాయిరాం, ఉపేందర్, కె.విజ్ఞాన్ ప్రథమ స్థానం సాధించారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో బి.వైష్ణవి, కె.భానుశ్రీ, ఆర్.హారిక, అంజలి ద్వితీయ స్థానం సాధించారని జూడో కోచ్ అన్నెపు వెంకట్ తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచిన 13 మంది విద్యార్థులు ఈ నెల 28, 29, 30 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సభ్యుడు ప్రసాద్, ఎంఈఓ టి.గోపాల్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జూడో సీనియర్ ఇన్స్ట్రక్టర్ పి.బాలరాజు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవిశెట్టి అవిలుమల్లు, బీసీ, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పోచం సోమయ్య, మెంట నగేష్, పీఈటీలు జి.జ్ఞానసుందరి, పి.శ్వేత, ఇన్స్ట్రక్టర్ కనుకు రాజు, చొల్లేటి నరేష్, పోచం మచ్చేందర్, పుల్కరం నిఖిల్, ఊర మత్స్యగిరి పాల్గొన్నారు. -
వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ప్రధాన ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం వంటి పూజలు నిర్వహించారు. రేపు పుల్లెలంలో హనుమంతు అంత్యక్రియలుచండూరు : ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అంత్యక్రియలు స్వగ్రామమైన చండూరు మండలంలోని పుల్లెంలలో ఆదివారం జరుగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రానికి ఒడిశా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి పుల్లెంలకు హనుమంతు పార్థివదేహాన్ని తీసుకొస్తారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు పుల్లెంలలోని పాత ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. అంత్యక్రియల ఏర్పాట్లను హనుమంతు బావ మల్లిక్ పరిశీలించి గ్రామంలోని ముఖ్యులతో సమావేశమై చర్చించారు. వయోవృద్ధులను గౌరవించాలిచౌటుప్పల్ : వయోవృద్ధులను ప్రతిఒక్కరూ గౌరవించాలని చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి అన్నారు. సీనియర్ సిటిజన్స్ మండల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం ఆయన చౌటుప్పల్ పట్టణంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ మన్మథకుమార్, సంఘం మండల అధ్యక్షుడు కానుగుల వెంకటయ్య, ప్రదానకార్యదర్శి గోశిక లక్ష్మయ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు భీమిడి మోహన్రెడ్డి, ప్రతినిధులు డాకోజి లక్ష్మీనారాయణ, బొమ్మిడి సత్తిరెడ్డి, తొర్పునూరి కృష్ణ, బొల్లారం లక్ష్మీనారాయణ, వడ్త్యా బిక్కు తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధవనంలో మద్రాస్ హైకోర్టు జడ్జి
నాగార్జునసాగర్ : సాగర్ ప్రాజెక్టు, బుద్ధవనం, నాగార్జునకొండ తదితర ప్రాంతాలను శుక్రవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దండపాణి కుటుంబ సమేతంగా సాగర్కు రాగా వారికి రెవెన్యూ ప్రొటోకాల్ అధికారి దంగ శ్రీనివాసరెడ్డి, సాగర్ ఎస్ఐ ముత్తయ్య, నిడమనూరు కోర్టు ప్రొటోకాల్సిబ్బంది మహేందర్రెడ్డి, ఖాలిక్లు స్వాగతం పలికారు. వారు సాగర్డ్యాంతో పాటు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి శిల్పకల, ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాధించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే కోర్టు న్యాయమూర్తి రమాదేవి, నల్లగొండ జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్కుమార్లు కుటుంబ సమేతంగా బుద్ధవనాన్ని సందర్శించారు.వీరికి స్థానిక గైడ్ సత్యనారాయణ సాగర్ చరిత్రతో పాటు బుద్ధవనం విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు అతిథులను కండువాలు కప్పి, బ్రోచర్లు అందించి సత్కరించారు. ధ్యానమందిరంలో బుద్ధజ్యోతిని వెలిగించారు. సమావేశ మందిరంలో బుద్ధవనంపై రూపొందించిన లఘు చిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం సందర్శనకు వచ్చిన ప్రముఖులు తమకు ఆధ్యాత్మిక శాంతిని, మధురానుభూతిని కలిగించిందని అభిప్రాయపడ్డారు. -
మిడతనపల్లిలో విషాద ఛాయలు
ఆత్మకూర్ (ఎస్), గుంటూరు రూరల్ : తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన ఆత్మకూర్(ఎస్) మండలం మిడతనపల్లి గ్రామానికి చెందిన దంపతులు తిరుగు ప్రయాణంలో గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కంచనపల్లి వెంకయ్య(70), సుశీల (64) దంపతులు. వీరి కుమారుడు మధు హైదరాబాద్లో కొంతకాలంగా పెయింటర్గా పనిచేస్తున్నాడు. సుశీలకు అనా రోగ్యంగా ఉండడంతో వారిద్దరూ కుమారుడి వద్దే ఉంటున్నారు. సుశీల ఆరోగ్యం మెరుగుపడాలని తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో ఈ నెల 23న వారి కుమారుడు మధు, కోడలు మనీషా, మనవళ్లు జ్ఞానేశ్వర, చరణ్, వర్షిత్లతో కలిసి తమ సమీప బంధువు మద్దిరాల మండలం మావిళ్లమడవ గ్రామానికి చెందిన మహేష్తో వెళ్లారు. దర్శనం అనంతరం గురువారం సాయంత్రం తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం హైవేలో కారును కాసేపు ఆపారు. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వీరి కారును వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సుశీల, వెంకయ్య, మహేష్ అక్కడికక్కడే మృతిచెందారు. మధు, మనీష, చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి, మృతదేహాలకు గుంటూరు ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మిడతనపల్లికి తరలించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి తిరుపతికి వెళ్లి వస్తుండగా ఘటన -
నాలుగు ఎకరాల్లో సాగు
ప్రయోగాత్మకంగా మొదటగా నాలుగు ఎకరాల్లో వక్కసాగు చేస్తున్నా. అంతరపంటగా అల్లనేరేడు, మధ్యలో వక్క మొక్కలు నాటాను. ప్రస్తుతం నాలుగో ఏడాది కావడంతో ఈసారి వక్క మొక్కలు దిగుబడి ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు క్షేత్ర పర్యటనల ద్వారా వక్క సాగు లాభదాయకమని తెలుసుకుని సాగు చేస్తున్నా. – మద్ది మాధవరెడ్డి, కాచారంరైతులకు మొక్కలు సరఫరా చేస్తున్నా వక్క మొక్కలు సాగు చేయడంతోపాటు కేరళ నుంచి వక్క మొక్కలు తెప్పించి రైతులకు సరఫరా చేస్తున్నా. ఇప్పటి వరకు 22వేల మొక్కలు సరఫరా చేశా. తమిళనాడులోని శివమొగ్గ ప్రాంతంతోపాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సాగు చేస్తున్న వక్క తోటలను పరిశీలించి అధ్యయనం చేశా. పండ్లతోటల్లో దీర్ఘకాలిక పంటలైన శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేసిన అనుభవాలతో వక్క సాగు కూడా లాభదాయకమేనని గ్రహించి సాగు చేస్తున్నా. – పాల్వాయి జలంధర్రెడ్డి, పిట్టలగూడెం -
కారును ఢీకొన్న లారీ
యాదగిరిగుట్ట రూరల్: లారీకి హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో కారును వెనక నుంచి ఢీ కొంది. ఈ సంఘటన యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ సమీపంలో హైదరాబాద్– వరంగల్ ప్రధాన జాతీయ రహదారి ఎన్హెచ్–163లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ, వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ సమీపానికి రాగానే రోడ్డు పక్కన టీ తాగుదామని లారీని ఆపి హ్యాండ్ బ్రేక్ వేయకుండానే డ్రైవర్ టీ షాప్కు వెళ్లిపోయాడు. అదే సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. లారీ వెనకాల నిలిపాడు. అందులోని వ్యక్తి టీ తాగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లారీ వెనుకకు కదిలి కారును నెట్టుకుంటూ రోడ్డు పక్కకు వెళ్లింది. లారీ కారు మీదుగా ఒరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ● వాహనంలో ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం -
నో సిగ్నల్!
రామగిరి(నల్లగొండ): రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తోంది. వీటిని ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) ఆధారిత వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈక్రమంలో సిగ్నల్స్ రాక పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోంది. మండలంలోని తొరగల్లు గ్రామంలో పింఛన్ చెల్లించేందుకు సిగ్నల్ లేక లబ్ధిదారులు, పోస్టల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్క ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలో 246 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. తొరగల్లు, చిన మాదారం, ఇరిగంటిపలి గ్రామాలకు ఒక పోస్ట్మాన్ ఉన్నాడు. వారం రోజుల్లో ఈ మూడు గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేస్తాడు. గతంలో పీఓటీడీ డివైస్ బయోమెట్రిక్ ద్వారా చెల్లించేవారు. 2025 జులై నుంచి ఫేస్ రికగ్నిషన్ ద్వారా చెల్లిస్తున్నారు. అయితే తొరగల్లు గ్రామంలో ఏ నెట్వర్క్ సరిగ్గా రావడం లేదు. దీంతో ఒక్కొక్కరికి 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతోంది. దీంతో పింఛన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ప్రతి నెల గ్రామంలో 150 మందికి మాత్రమే పింఛన్ చెల్లించడానికి వీలవుతుంది. ఇక్కడి తీసుకోని వారు పక్క గ్రామమైన చిన మాదారం, ఇరుగంటిపల్లికి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పింఛన్ కోసం తప్పని పాట్లు సిగ్నల్ సరిగ్గా రాక తీసుకోని ఫేస్ రికగ్నిషన్ ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులుగంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది పింఛన్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సెల్ సిగ్నల్ సరిగ్గా రాకపోవడం యాప్లో స్వీకరించడం లేదు. పక్క ఊరికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వస్తోంది. ఆరోగ్య సరిగ్గా సహకరించడం లేదు. ప్రతి నెలా వేరే ఊరికి వెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది. – చింత ముత్తమ్మ -
రాజేష్ మృతిపై సమగ్ర విచారణ చేయాలి
కోదాడ: రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ అనుమానాస్పద మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. శుక్రవారం కోదాడలోని గాంధీనగర్లో ఉన్న కర్ల రాజేష్ ఇంటికి వెళ్లి అతని తల్లి లలితమ్మను పరామర్శించారు. రాజేష్ మృతికి సంబంధించిన వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4,12,000 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు శంకర్, జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ వాజీద్ అలీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరిరాజు, కోటేష్, సుందర్బాబు పాల్గొన్నారు. దళిత వర్గాలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందిమునగాల: దళిత వర్గాలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మునగాల మండలం నారాయణగూడెంలోని మాలపల్లి కాలనీలో ఇటీవల అగ్రవర్గాల వారు దాడి చేసిన ఘటనలో విచారించేందుకు శుక్రవారం ఆయన గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈనెల 30న గ్రామంలో సామూహిక విందు భోజనాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ జిల్లా అధికారిణి దయానందరాణిని కోరారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి
మునగాల : కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతికి కారకుడైన చిలుకూరు ఎస్ఐ సురేశ్రెడ్డిని సస్పెండ్ చేసే వరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన కొనసాగుతూనే ఉంటాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. శుక్రవారం మునగాల మండలం ఆకుపాముల శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ను ఆయన సందర్శించారు. కర్ల రాజేశ్ ఇదే బంక్లో పనిచేయడంతో ఆయన బంక్లో పని చేస్తున్న సిబ్బందిని కలిసి విచారించారు. అనంతరం మాట్లాడుతూ కోదాడ రూరల్ సీఐ, ఇతర పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడం వల్లే రాజేశ్ మృతిచెందాడని పేర్కొన్నారు. దళిత వర్గాలపై పోలీసుల వేధింపులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిఽధి ఏపూరి రాజుమాదిగ, కర్ల రాజేశ్ సోదరుడు కమల్, నాయకులు ఉన్నారు. -
గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా
మోత్కూరు : గ్రామాల సమగ్రాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భువనగిరి ఎంపీ చామల కిరన్కుమార్రెడ్డి నూతన సర్పంచ్లకు హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని అంబర్పేటలోని తన కార్యాలయంలో మోత్కూరు మండలానికి చెందిన ముశిపట్ల సర్పంచ్ పైళ్ల నర్సిరెడ్డి, సదర్శాపురం సర్పంచ్ మునుకుంట్ల నీలకంఠం, పొడిచేడు సర్పంచ్ జిట్ట సైదులు, దత్తప్పగూడెం సర్పంచ్ గుండు యాదగిరిలు ఎంపీని మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో కొత్త సర్పంచ్లను ఎంపీ శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులతో సమన్వయంగా ఉంటూ ప్రజల మన్ననలు పొందేలా ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరిరెడ్డి, నాయకులు తీగల నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి.సమీరుద్దిన్, కారుపోతుల వెంకన్న, ప్రశాంత్రెడ్డి, అడ్వకేట్ పర్రెపాటి యుగేంధర్, అవిశెట్టి కిరణ్, మహేష్, యాదగిరి, సాజిద్, బండ లింగయ్య, బండ సోమయ్య, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు. ఫ కొత్త సర్పంచ్లకు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి హామీ -
బొల్లేపల్లి సర్పంచ్ ఇంటిపై దాడి
భువనగిరి : మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ గోద రమాదేవి, శ్రీనివాస్గౌడ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి దాడి చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తాము భారీ మెజార్టీతో గెలుపొందడంతో జీర్ణించుకోలేక గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని వారు తెలిపారు. దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారని, తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. -
గురుకుల విద్యార్థుల ప్రతిభ
నార్కట్పల్లి : నార్కట్పల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే మూసీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తుర్కపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో పాల్గొని ప్రతిభ చూపారు. కబడ్డీలో ఎస్.వినయ్, వాలీబాల్లో జి.మధు, ఎస్.ఈశ్వర్, జె.లవకుమార్లు ప్రతిభ చూపారు. హైజంప్లో ఎస్.వినయ్ ప్రతిభ కనబరిచి ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ మీట్కు ఎంపికయ్యాడని గురువారం కళాశాల ప్రిన్సిపాల్ అసానబాద విద్యాసాగర్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఏటీపీ వి.శివశంకర్, డిప్యూటీ వార్డెన్ భార్గవి, పీడీ వెంకట్, కళాశాల సిబ్బంది అభినందించారు. -
స్వర్ణగిరికి పోటెత్తిన భక్తులు
భువనగిరి : భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి సుమారు గంటన్నరకు పైగా సమయం పట్టినట్లు భక్తులు పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణం జరిపించారు. అదేవిధంగా సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులతో పాటు భక్తులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీల సేవలు వెలకట్టలేనివి
నల్లగొండ టౌన్ : గ్రామీణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణ పరిధిలోని అద్దంకి బైపాస్లో గల సుశృత గ్రామీణ వైద్యుల (ఫస్ట్ ఎయిడ్) సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్ఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్లు అందజేసి ప్రభుత్వం చేసే ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వాములను చేఽశారని గుర్తుచేశారు. ఆర్ఎంపీల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. అనంతరం మంత్రి వెంకట్రెడ్డిని సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు గ్రామీణ వైద్యులు పట్టణంలోని ప్రకాశం బజార్ నుంచి బైపాస్లోని సంఘం కార్యాలయంలో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు, కోశాధికారి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎ. కృష్ణారెడ్డి, రాజశేఖర్రావు, వెంకన్నగౌడ్, దశరథ, వనం యాదగిరి, ప్రశాంత్, లక్ష్మణాచారి, మునీర్, హుసేన్, లక్ష్మయ్యగౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
భువనగిరి : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన పడిగెల మైసయ్య, మంజుల దంపతుల పెద్ద కుమారుడు శివ(26) స్థానికంగా ఓ ప్రైవేట్ చిట్ఫండ్లో పనిచేస్తూ ఆర్మీ ఉద్యోగం సాధించేందుకు సన్నద్ధమవుతున్నాడు. గురువారం సాయంత్రం పట్టణ శివారులోని పెద్ద చెరువులోకి శామీర్పేట నుంచి నీరు వచ్చే రాచకాల్వ వద్ద సికింద్రాబాద్–కాజీపేట రైల్వే మార్గంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన సెల్ఫోన్లోని స్టేటస్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు పెట్టుకున్నాడని.. ఆర్థిక ఇబ్బందులతోనే అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరే ఇతర కారణాలతోనైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
మానవాళిపై దేవుడి ప్రేమకు తార్కాణమే క్రిస్మస్
మఠంపల్లి : మానవాళి పట్ల దేవుని అపారమైన ప్రేమకు తార్కాణమే క్రిస్మస్ అని ఎన్ఆర్ఐ, రిటైర్డ్ రెవరెండ్ ఫాదర్ అల్లం మర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మఠంపల్లిలోని శుభవార్త చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని దివ్యబలిపూజ నిర్వహించి క్రైస్తవులకు సందేశం ఇచ్చారు. ఏసుక్రీస్తు జననం ఎంతో అద్భుతమని అన్నారు. జనులను రక్షించేందుకు ఏసుక్రీస్తు ఎన్నో కష్టాలు అనుభవించాడని, ప్రజలంతా ఏసు మార్గంలో నడవాలని కోరారు. అనంతరం క్రైస్తవులకు దివ్య ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా భక్త బృందం ఆలపించిన క్రైస్తవ గేయాలు ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం చర్చిలో కొవ్వొత్తుల సమర్పణగావించారు. సాయంత్రం తేరుపై బాలయేసు, మేరీమాత ప్రతిమలతో పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు రాజారెడ్డి, అశోక్, చర్చికమిటీ పెద్దలు ఆదూరి కిషోర్రెడ్డి, లూర్దుమారెడ్డి, ఆంథోనిరెడ్డి, బాలరెడ్డి, జయభారత్రెడ్డి, టీఆర్ బాలశౌరెడ్డి, థామస్రెడ్డి, ఇన్నారెడ్డి, జార్జిరెడ్డి, శౌరెడ్డి, మధుసూదన్రెడ్డి, లూర్దురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోటారుకు మరమ్మతులు చేస్తూ..
పెద్దవూర : వ్యవసాయ బావిలో బోరు మోటారుకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దవూర మండలం జయరాంతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయరాంతండాకు చెందిన రమావత్ దీప్లా(42) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం అదే తండాకు చెందిన రమావత్ మంగ్తా వ్యవసాయబావి వద్ద బోరు మోటారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేయడానికి దీప్లా వెళ్లాడు. దీప్లా వ్యవసాయ బావిలోకి దిగి బోరు మోటారుకు మరమ్మతులు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై బావిలో పడిపోయాడు. బావి పైన ఉన్న మంగ్తా తండావాసులకు సమాచారం అందించాడు. చీకటి పడటంతో బావిలోకి దిగడానికి ఎవరూ సాహసించలేదు. గురువారం తండావాసులు బావిలో నుంచి దీప్లా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సైది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
సీట్ల కోసం భక్తుల పాట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు గురువారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని సాయంత్రం వివిధ ప్రాంతాలకు తిరుగు ప్రయాణంలో ఆధ్యాత్మిక వాడలోని బస్టాండ్, పట్టణంలోని బస్టాండ్, కొండపైన బస్టాండ్లో భక్తులు బస్సుల కోసం వేచి ఉన్నారు. బస్టాండ్లోకి బస్సులు ఒక్కొక్కటిగా రావడంతో సీట్ల కోసం భక్తులు పోటీ పడ్డారు. సాయంత్రం వేళ చలి పెడుతున్న సమయంలో భక్తులు చాలా మంది బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు విమర్శించారు. -
గురుకుల విద్యార్థుల ప్రతిభ
నార్కట్పల్లి : నార్కట్పల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే మూసీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తుర్కపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో పాల్గొని ప్రతిభ చూపారు. కబడ్డీలో ఎస్.వినయ్, వాలీబాల్లో జి.మధు, ఎస్.ఈశ్వర్, జె.లవకుమార్లు ప్రతిభ చూపారు. హైజంప్లో ఎస్.వినయ్ ప్రతిభ కనబరిచి ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ మీట్కు ఎంపికయ్యాడని గురువారం కళాశాల ప్రిన్సిపాల్ అసానబాద విద్యాసాగర్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఏటీపీ వి.శివశంకర్, డిప్యూటీ వార్డెన్ భార్గవి, పీడీ వెంకట్, కళాశాల సిబ్బంది అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
నార్కట్పల్లి : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రైతు లారీ ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్పల్లి మండల పరిధిలోని వివేరా హోటల్ సమీపంలో గురువారం జరిగింది. స్థానిక ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మున్సిపల్ కేంద్రానికి చెందిన ఏశబోయిన గంగులు(70) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వరి నారు కొనేందుకు గురువారం ద్విచక్ర వాహనంపై చిట్యాల నుంచి నార్కట్పల్లి మండలంలోని గోపలాయపల్లి గ్రామానికి వచ్చాడు. పని చూసుకుని తిరిగి చిట్యాలకు వెళ్తుండగా.. విజయవాడ–హైదారబాద్ జాతీయ రహదారిపై గల వివేరా హోటల్ సమీపంలో గంగులు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో గంగులు రోడ్డుపై పడిపోగా.. అతడి శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీని డ్రైవర్ కొద్దిదూరంలో ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కేసీఆర్ను విమర్శించే స్థాయి సీఎంకు లేదు
సూర్యాపేటటౌన్ : సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విమర్శించే స్థాయి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి విలేకరులతో మాట్లాడారు. రేవంత్రెడ్డి గల్లీ స్థాయి నాయకుడే అని మళ్లీ రుజువైందన్నారు. కేసీఆర్ అడిగినదానికి సమాధానం చెప్పలేకనే విషం కక్కుతున్నాడని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పక్షాన నిలబడి అద్భుతమైన ఫలితాలు అందించారన్నారు. మంచి పనులు చేసి మంచి మాటలతో ప్రజా హృదయాలను గెలవాలని, సీఎం మాటలు విని కాంగ్రెస్ పార్టీ సర్పంచులే సిగ్గుపడుతున్నారని అన్నారు. కేసీఆర్ సభలు పెడితే కాంగ్రెస్ అరాచకాలు ఎక్కడ బయటపడతాయో అని సీఎం భయపడుతున్నాడని, సాధారణ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రేవంత్రెడ్డిని రాజకీయంగా ప్రజలే బండరాళ్లకు కట్టి మూసీలో పడేస్తారని విమర్శించారు. కేసిఆర్ ఏం మాట్లాడిండో కోట్లాది మంది ప్రజలు చూశారని, ప్రభుత్వం తోలు తీస్తా అన్నాడు తప్ప.. స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలు దోపిడీకి గురవుతున్నాయని చెప్పినా సీఎం పట్టించుకోలేదన్నారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు మోదీ ద్రోహం చేస్తున్నారన్నా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మౌనంగా కూర్చోలేమని, ప్రజల పక్షాన కొట్లాడే బాధ్యత కేసీఆర్ పైన ఉందన్నారు. తెలంగాణ తెచ్చిన వాళ్లముగా.. ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత అని, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పినా తమ పైనే ఎదురుదాడికి దిగితున్నారన్నారు. ఇట్లనే ఉంటే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ ప్రజలకు నీటి సమస్యలు తలెత్తుతాయని, వీటిపై కాంగ్రెస్ మంత్రులకు కూడా సరైన అవగాహన లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ప్రజా ఉద్యమం తప్పక మొదలుపెడతామన్నారు. ఫ ముఖ్యమంత్రి హోదాను మరింత దిగజార్చుతున్నావ్.. ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి -
షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో సామగ్రి దగ్ధం
శాలిగౌరారం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఆకారంలో గురువారం జరిగింది. ఆకారం గ్రామానికి చెందిన ఇంద్రకంటి యాదగిరి వ్యవసాయం చేస్తుండగా.. అతడి భార్య శ్రీకన్య ఐకేపీలో విలేజ్ బుక్ కీపర్గా పనిచేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా గురువారం ప్రార్ధన చేసేందుకు యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక చర్చికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే తలుపులు తీసి చూడగా.. ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్ బోర్డు కాలిపోయి పక్కనే ఉన్న కూలర్, ప్లాస్టిక్ టేబుల్తో పాటు టేబుల్పై ఉన్న సమభావనా సంఘాలకు సంబంధించిన రికార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. వెంటనే నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ప్రమాద స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. -
దాడి ఘటనపై విచారణ జరిపించాలి
ఫ నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్కి గొడకొండ్ల గ్రామ సర్పంచ్ వినతి నల్లగొండ: తాను సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో కొందరు వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ సర్పంచ్ కాశగోని వెంకటయ్య గురువారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తాను 22న ప్రమాణ స్వీకారం తర్వాత చింతపల్లి ఎస్ఐ అనుమతితో ర్యాలీ చేస్తుండగా.. కొంతమంది దుండగులు మద్యం తాగి బీరు సీసాలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆయన ఎస్పీకి వివరించారు. అర్ధగంట తర్వాత చింతపల్లి ఎస్ఐ తన సిబ్బందితో వచ్చి లాఠీచార్జి చేసి మహిళలును, పురుషులు, యువకులను విచక్షణారహితంగా కొట్టారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని, ఎస్ఐ కక్షపూరితంగా వ్యవహరించి చదువుకునే విద్యార్థులపై కేసులు నమోదు చేశారని ఎస్పీకి వివరించారు. ఈ ఘటనపై విచారణ చేసి దాడి చేసిన దుండగులను శిక్షించడంతో పాటు ఎస్ఐ లాఠీచార్జిపై విచారించి కూడా విచారించాలని కోరారు. ఎఫ్ఐఆర్లో 50 మంది విద్యార్థులతో పాటు వృద్ధుల పేర్లు చేర్చినట్లు తెలిసిందన్నారు. పార్వతీదేవి వేషధారణలో ఆర్ఏఎఫ్ జవాన్గరిడేపల్లి : గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్ బత్తిని సుధాకర్ కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రంలో విధులు నిర్వహిస్తూ పార్వతీదేవి వేషధారణలో కనిపించారు. అయ్యప్ప మాలధారణతో శబరిమలకు వచ్చే భక్తుల మధ్య అయ్యప్ప స్వామి తల్లి పార్వతీదేవి వేషంలో సుధాకర్ దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుధాకర్ భద్రతా విధులు నిర్వహిస్తూనే తన భక్తి భావాన్ని చాటుకున్నారు. సూర్యాపేట వాసి నిర్మించిన చిత్రానికి మంచి స్పందన ఫ సందేశాత్మక చిత్రం తీశారని మెచ్చుకున్న ప్రేక్షకులుసూర్యాపేట : సూర్యాపేట జిల్లాకు చెందిన ఇమ్మడి సోమనర్సయ్య నిర్మాతగా రూపొందించిన ‘బ్యాడ్ గర్ల్స్’ చిత్రం గురువారం సూర్యాపేట పట్టణంలోని తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శితమైంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరికి కనువిప్పు కలిగేలా బ్యాడ్ గర్ల్స్ చిత్రాన్ని నిర్మించారని పలువురు మహిళా ప్రేక్షకులు కితాబు ఇచ్చారు. సినిమాలో చూపించినట్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మహిళల ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. -
విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతి
చివ్వెంల(సూర్యాపేట) : కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లకు వాటర్ ట్యాంకర్లో మోటారు వేసి నీళ్లు కొడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై తండ్రి మృతిచెందాడు. గమనించిన కుమారుడు తండ్రిని కాపాడేందుకు వెళ్లి ట్యాంకర్ను తాకడంతో అతడు కూడా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన మాదాసు బుచ్చయ్య (48) సూర్యాపేటలో వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో ఇంటి వద్ద ఉన్న ఆయన కొత్త ఇంటి పిల్లర్లకు నీటిని కొట్టేందుకు ట్యాంకర్ను కిరాయికి తీసుకొచ్చి, అందులో నీరు నింపి అందులో మోటారు వేసి నీరు కొడుతున్నాడు. ట్యాంకర్తో పాటు అందులో ఉన్న మోటారుకు విద్యుత్ సరఫరా జరగడంతో బుచ్చయ్య ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతడి చిన్న కుమారురుడు మాదాసు లోకేష్(22) తండ్రి కిందపడి ఉన్న విషయాన్ని గమనించాడు. అతడి దగ్గరకు వెళ్లే క్రమంలో ట్యాంకర్కు విద్యుత్ సరఫరా జరుగుతున్న విషయాన్ని గమనించకుండా దానిని పట్టుకున్నాడు. దీంతో అతడు కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి తండ్రి, కుమారుడిని సూర్యాపేటలోనిజనరల్ హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే వారిద్దరు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.ఫ కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా ఘటన -
రైల్లో నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
భువనగిరి : రైల్లో నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ–నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. గురువారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం వలిగొండ–నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు వచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారి పడి ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 38 ఏళ్లు ఉంటాయని, 5.5 అడుగుల ఎత్తు, ఆర్ఆర్ఆర్ బిర్యానీ హౌస్ పేరు గల టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడి వద్ద సికింద్రాబాద్ టు భువనేవ్వర్ వెళ్లే రైలు టిక్కెట్ ఉన్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 98482 22169 నంబర్ను సంప్రదించాలని భువనగిరి రైల్వే పోలీస్ ఇన్చార్జి జే. కృష్ణరావు తెలిపారు. చికిత్స పొందుతూ.. చిలుకూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన దేశబోయిన శ్రీను(55) ఈ నెల 22న బేతవోలు నుంచి జెర్రిపోతులగూడెం రోడ్డులో బైక్పై వెళ్తుండగా.. తన ముందు ఉన్న బైక్ను అకస్మాత్తుగా ఆపడంతో శ్రీను బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. చిక్సిత నిమిత్తం అతడిని ఖమ్మంకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. పామాయిల్ తోట దగ్ధంరామగిరి(నల్లగొండ) : షార్ట్ సర్క్యూట్తో పామాయిల్ తోట దగ్ధమైంది. ఈ ఘటన నల్లగొండ పెద్ద సూరారం గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పెద్ద సూరారం గ్రామానికి చెందిన రైతు కోట్ల విష్ణువర్ధన్రెడ్డి ఐదేళ్ల క్రితం మూడెకరాల భూమిలో 180 పామాయిల్ చెట్లను నాటాడు. పామాయిల్ తోట మీదుగా 11కేవీ హై టెన్షన్ విద్యుత్ లైన్ వెళ్తోంది. బుధవారం మధ్యాహ్నం విద్యుత్ వైర్లపై పక్షి వాలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి పక్షి కాలిపోయి తోటలో పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల 150 చెట్లు, డ్రిప్ పైపులు మంటల్లో కాలిపోయాయి. రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు పేర్కొన్నాడు. విద్యుత్ వైర్లు లూజ్ ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు రైతు ఆరోపిస్తున్నాడు. -
42 ఏళ్లకు నిర్జీవిగా..
నల్లగొండ, చండూరు : ఒడిషాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పాక హనుమంతు 1983లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదు. ఆయన ఎక్కడ ఉన్నది కూడా కుటుంబ సభ్యులకు తెలియదు. 42 ఏళ్ల తరువాత ఎన్కౌంటర్లో హనుమంతు మరణించారన్న వార్తతో ఆయన స్వగ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. హనుమంతు మృతదేహాన్ని ఊరికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక చంద్రయ్య, పాపమ్మకు ఆరుగురు సంతానం. వారిలో పెద్ద పాక హనుమంతు. ఆయన తర్వాత పాక అశోక్, యాదమ్మ, లింగమ్మ, సత్తయ్య, పద్మ జన్మించారు. కుటుబంలో పెద్దవాడైన హనుమంతు 1960లో జన్మించారు. ఆయన స్వగ్రామంలో 7వ తరగతి వరకు, చండూరులో పదో తరగతి చదివి తరువాత నల్లగొండ పట్టణానికి చేరుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తరువాత ఎన్జీ కాలేజీలో డిగ్రీ చేస్తుండగానే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులై పార్టీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంటికి వచ్చింది కూడా లేదు. కుటుంబ నేపథ్యం ఇదీ.. మనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లిపోయాక, తండ్రి చంద్రయ్యకు ఉన్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో 2 ఎకరాలు అమ్మేసి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. ఆ తరువాత ఇద్దరు కుమారుల వివాహం చేశారు. ఉన్న రెండెకరాల్లో వారికి చెరొక ఎకరం ఇచ్చారు. మొదట్లో కుటుంబం గడవకపోవడంతో అశోక్ ఊరిలోనే కొన్నాళ్లు జీతం ఉన్నాడు. ఆ తరువాత ఆయనతోపాటు కొంతవరకు చదవుకున్న రెండో తమ్ముడు సత్తయ్య నల్ల గొండకు వచ్చి స్థిరపడ్డారు. పెద్ద తమ్ముడు పాక అశోక్ బట్టషాపుల్లో పనిచేస్తుండగా, చిన్నతమ్ముడు పాల వ్యాపారం చేస్తున్నారు. 2016లో వారి తండ్రి చంద్రయ్య, 2021లో తల్లి పాపమ్మ మరణించే వరకు పుల్లెంలలోనే నివసించారు. హనుమంతు తల్లిదండ్రులను కలిసిన అప్పటి ఎస్పీ దుగ్గల్ పాక హనుమంతు మావోయిస్టు ఉద్యమంలో రాష్ట్ర, కేంద్రస్థాయి నాయకుడిగా మూడు రాష్ట్రాల ఇంచార్జిగా ఎదిగారు. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా ఐదు సార్లు హనుమంతు ఎన్కౌంటర్లలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. తనని లొంగిపోవాలని చెప్పాలని గతంలో నల్లగొండ ఎస్పీగా పనిచేసిన విక్రమ్జిత్ దుగ్గల్ పుల్లెంలకు వచ్చి హన్మంతు తల్లిదండ్రుల ద్వారా చెప్పించారు. వారికి దుస్తులు, నిత్యావసరాలు ఇచ్చి పరామర్శించారు. చదువులో, ఆటల్లో మేటి హనుమంతు చిన్నప్పుడు చదువులో ఆటల్లో మేటిగా ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఎక్కువగా కబడ్డీ ఆడేవాడని, చదువులో కూడా ఫస్ట్ క్లాస్ విద్యార్థిగా ఉండేవాడని, నిత్యం ఆటపాటలతో ఊరంతా కలియ తిరిగేవారమని చెబుతున్నారు. హనుమంతు 10 తరగతి చదువు కునేంత వరకు విప్లవ భావజాలం అతనిలో కనిపించలేదని, నల్లగొండకు వెళ్లిన తర్వాత ఇక తాము కలవతేదని పలువురు మిత్రులు తెలిపారు. హనుమంతు అంత్యక్రియలు స్వగ్రా మం పుల్లెంలలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు శుక్రవారం ఉదయం వారు ఒడిషాకు వెళ్తున్నారు. హనుమంతు తోబుట్టువులంతా గ్రామానికి చేరుకోనున్నారు. చిన్నప్పుడు హనుమంతు గ్రామంలో ఉన్నంత వరకు బాగా ఆడుకునేవాళ్లం. తన చేతిరాత చాలా బాగా ఉండేది. కాలేజీకి నల్లగొండకు వచ్చాక ఆయన నక్సలిజం భావాలకు మళ్లాడు. ఆర్ఎస్యులో కళాశాల సాంస్కతిక కార్యదర్శిగా పనిచేశాడు. అప్పుడు నేను ఏబీవీపీలో ఉన్నాను. ఏచూరి శ్రీను హత్య కేసులో హనుమంతు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. – బొబ్బల మురళిమనోహర్రెడ్డి, పుల్లెంల ఫ విద్యార్థి దశలో ఊరు విడిచి వెళ్లిన పాక హనుమంతు ఫ మావోయిస్టు ఉద్యమంలో అంచలంచెలుగా ఎదిగిన పుల్లెంల వాసి ఫ ఎన్కౌంటర్లో మృతితో గ్రామంలో విషాద ఛాయలు ఫ కుటుంబ సభ్యుల కడసారి చూపునకు స్వగ్రామానికి చేరుకోనున్న మృతదేహం -
రేషన్ డీలర్ల నియామకమేదీ?
ఆత్మకూరు(ఎం): జిల్లాలో రేషన్ డీలర్ పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచడం లేదు. పక్క గ్రామాలకు డీలర్లకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో సకాలంలో షాపులు తీయలేకపోతున్నారు. దీంతో సరుకుల కోసం కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాఓని 428 గ్రామ పంచాయతీల్లో 515 రేషన్ షాప్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 2,48, 596 రేషన్ కార్డులకు 7,82,458 యూనిట్లు ఉన్నాయి. 4.957 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటారు. ప్రస్తుతం 94 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి 2023 మే11న నోటిఫికేషన్ వేశారు. కానీ, నేటికీ భర్తీ చేయలేదు. 94 రేషన్ షాపుల బాధ్యతలను పక్క గ్రామాల డీలర్లు చూస్తున్నారు. ప్రతి నెలా 1నుంచి 18వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తుంటారు. అయితే ఇంచార్జి డీలర్లు తమకు వీలున్నప్పుడు మాత్రమే గ్రామానికి వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారని, దీంతో రేషన్ షాపులకు తిరిగివెళాల్సిన పరిస్థితి ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 94 పోస్టులు ఖాళీ ఫ పక్క గ్రామాల డీలర్లకు బాధ్యతలు ఫ వీలున్నప్పుడే దుకాణాలు ఓపెన్ ఫ సకాలంలో బియ్యం అందక లబ్ధిదారుల ఇబ్బందులు -
వాజ్పేయి సేవలు చిరస్మరణీయం
భువనగిరి : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహరీ వాజ్పేయి జయంతిని గురువారం భువనగిరిలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్, మాజీ జిల్లా అధ్య క్షుడు పాశం భాస్కర్, నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. వాజ్పేయి అడుగుజాడల్లో నడవాలన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, పడాల శ్రీనివాస్, నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్రావు, పట్నం శ్రీనివాస్, శ్యాంసుందర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి,అచ్చయ్య, మాదురి, మల్లారెడ్డి, వైజయంతి, కోటేష్, రత్నపురం బలరాం,మాయ దశరథ, డీఎల్ఎన్ గౌడ్, జనగాం నర్సింహాచారి, నల్లమాస వెంకటేశ్వర్లు, భిక్షపతి, మహమూద్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. శ్రీస్వామి, అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కైంకర్యాలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. వెండిజోడు సేవలను ఆలయంలో భక్తుల మధ్య ఊరే గించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
చిల్లింగ్సెంటర్కు తాళం, ధర్నా
భువనగిరిటౌన్ : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు గురువారం భువనగిరిలోని పాల శీతలీకరణ కేంద్రం గేట్కు తాళం వేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నార్ముల్ డైరెక్టర్ కస్తూరి పాండు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పాడి సంపదను పోషించుకునేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భువనగిరి పరిధిలో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయన్నారు. బస్వాపురం పాడి రైతులకు రూ.50 లక్షలు, గంగసానిపల్లి రూ.5లక్షలు, దాతర్పల్లి రూ.35లక్షలు, ముత్తిరెడ్డిగూడెం రూ.5 లక్షలు, హుస్నాబాద్ రైతులకు రూ. 30 లక్షలు బకాయిలు ఉన్నాయన్నారు. 48 గంటల్లో చెల్లించాలని, అప్పటి వరకు పాలశీతలీకరణ కేంద్రం వద్దనే టెంట్లు వేసుకొని ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించనిపక్షంలో ఈనెల 27న కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం : ఎమ్యెల్యే అనిల్కుమార్రెడ్డి పాడి రైతుల ధర్నా శిబిరాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. జిల్లా ఎమ్మెల్యేలం కలిసి చర్చించి సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ధర్నాలో బస్వాపురం, గంగసానిపల్లి, దత్తాయిపల్లి, ముత్తిరెడ్డిగూడెం, హుస్నాబాద్, కాటేపల్లి పాడి రైతులు ఉడుత శ్రీశైలం, బొల్లారం లింగం, దొమ్మాటి శంకరయ్య, దాయి మహేష్, బోయిని పాపయ్య, భీమగాని కుమార్, ఉడుత లక్ష్మి, చిక్కుల శంకరయ్య, ఉడుత విష్ణు, రాసాల దయాకర్, రాసాల నరేష్, దేవేందర్, ఉడుత బాలయ్య, మచ్చ ఎల్లేష్, ఉడుత కార్తీక్, రాసాల బాల మల్లయ్య, ఎనబోయిన విజయ్కుమార్, ఉడుత వెంకటేష్, రాంపల్లి గణేష్, బాలస్వామి, నరసింహ, శ్రీశైలం, రైతుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సమగ్ర శిక్షా ఉద్యోగులకు ‘ఎఫ్ఆర్ఎస్’
భువనగిరి : సమగ్ర శిక్షా ఉద్యోగుల సమయ పాలన, పనిలో పారదర్శకత పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ మరో నిర్ణయం తీసుకుంది. బోధన, బోధనేతర సిబ్బందికి జనవరి 1నుంచి ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయనున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ పరిధి లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను ఈనెల 28 లోపు పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాప్ట్ కాపీ, హార్డ్కాపీల రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని సూచించింది. ఇప్పటికే పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తుండగా, తాజాగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు సైతం ఫేస్ రికగ్నేషన్ కిందికి తెస్తున్నారు. ఉద్యోగులు ఇలా.. డీఈఓ కార్యాలయంతో పాటు ఎంఈఓ కార్యాలయాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంఈఓల కార్యాలయాల్లో 50, డీఈఓ కార్యాలయంలో 35 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఎఫ్ఆర్ఎస్ కిందికి రానున్నారు. 31న అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలు భువనగిరిటౌన్ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈనెల 31న మద్యం అమ్మకాల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఎకై ్సజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న జిల్లాలోని అన్ని మద్యం షాపులను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బార్లు, క్లబ్బులు, టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, ప్రత్యేకంగా అనుమతి పొందిన ఈవెంట్ నిర్వాహకులకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు, సరఫరా చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. సీతా రామచంద్ర స్వామి ఆలయ సందర్శన మోత్కూరు : మోత్కూరు మండలం దాచారంలోని శ్రీసీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని గురువారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ విల్లిపుత్తూర్ స్వామి మామూనుల సన్నిధి 24వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప ముని రామానుజజీయర్ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యం గురించి పూజారిని అడిగి తెలుసుకున్నారు. కోనేరు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్నె జ్యోతివీరేశం తదితరులు పాల్గొన్నారు. పెరిగిన చలితీవ్రత భువనగిరిటౌన్ : జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. శీతల గాలుల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం రాజాపేట, బీబీనగర్, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, మోత్కూరు, రామన్నపేట మండలాల్లో 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో శీతల, అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తం ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురుకులాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు రాజాపేట : రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల రాష్ట్ర కన్వీనర్, సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. 5,6,7,8,9 ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు జనవరి 21 వరకు ఉందని, రూ.100 ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థుల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే అంగీకరిస్తామన్నారు. దరఖాస్తు ఫారంపై ఒకరి ఫొటో బదులు మరొకరిది పెట్టి అప్లోడ్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. అడ్మిషన్ల ఎంపికలో ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రుణాలు మాఫీ చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
భూదాన్పోచంపల్లి: చేనేత రుణాలు మాఫీ చేయకపోతే వారం రోజుల్లో సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో బుధవారం సాయంత్రం పోచంపల్లికి చేరుకున్నారు. స్థానిక ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవరణలో పద్మశాలీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కళాపునర్వీ హ్యండ్లూమ్ యూనిట్ను సందర్శించారు. ఆమె వెంట పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, భూషన్, హరిశంకర్, హేమలత తదితరులున్నారు. -
రేపు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని గంజ్, కన్యకా పరమేశ్వర గుడి పక్కన ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార పరిరక్షణ విభాగం అధికారి స్వాతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల ఆహార వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలని పేర్కొన్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, మాంసం, చేపల విక్రయ కేంద్రాలు, పాలు – పాల ఉత్పత్తి వ్యాపారులు, ఫుడ్ స్టాల్స్, వీధి ఆహార విక్రేతలు మేళాకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. శాస్త్రోక్తంగా ధనుర్మాస ఉత్సవాలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం 9వ రోజు గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు. యాదగిరీశుడికి విశేష ఆరాధనలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష ఆరాధనలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలిభువనగిరిటౌన్ : రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 2024 నుంచి నేటి వరకు రిటైర్డ్ అయిన వారికి ప్రభుత్వ బకాయిలు చెల్లించడంతో జాప్యం చేస్తోందన్నారు. జిల్లా లో అన్ని విభాగాల నుంచి సుమారు 300 మందికి పైగా ఉద్యోగ విరమణ చేశారని, వారికి ఇప్పటివరకు బెనిఫిట్స్ రాలేదన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాల్గొన్నారు. పోలీస్ క్రికెట్ టోర్నీలో నల్లగొండ జట్టు విజయంరామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి బెటాలియన్లో బుధవారం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీ పరిధిలో మూడు, ఏఆర్, డీపీఓ జట్లు మొత్తం ఐదు జట్లకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నల్లగొండ జట్టు విన్నర్, ఏఆర్ జట్టు రన్నర్గా నిలిచాయి. అనంతరం విన్నర్ జట్టుకు ఏఎస్పీ జి.రమేష్ టోర్నీ కప్ అందజేశారు. -
ఉల్లంఘిస్తే ఊరుకోం!
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు. రాంగ్ రూట్ ప్రయాణాలు ప్రాణాలకే ముప్పు. రూల్స్ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. – కృష్ణ, ట్రాఫిక్ సీఐ, యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట రూరల్: రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రయత్నిస్తూనే, రూల్స్ ఉల్లంఘించి, ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపిన వారిపై చలానాలు విధిస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణ పరిధితో పాటుగా, హైదరాబాద్– వరంగల్ జాతీయ ప్రధాన రహదారి ఎన్హెచ్ 163లో నిరంతరం స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ ఇస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఏడాదిలో రూ.143,50,200 జరిమానాలు యాదగిరిగుట్ట, తుర్కపల్లి రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, గుండాల మండలాల పరిధిలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను పోలీసులు ఈ ఏడాదిలో 84,200 కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1,43,50,200 జరిమానాలు విధించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి రూ.44,33,300, సీట్ బెల్టు ధరించని వారికి రూ. 30,21,300, ట్రిపుల్ రైడింగ్లో వెళ్లిన వారికి రూ,12,49,200, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారికి రూ.8,21,000, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి రూ.7,38,500, వాహనాలకు నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వారికి రూ. 9,27,600, లైసెన్స్లు క్యారీ చేయని వారికి రూ. 2,50,200, యూనిఫామ్ ధరించని ఆటోవాలాలకు రూ,4,46,000, రాంగ్ పార్కింగ్లో వాహనాలు నిలిపిన వారికి రూ.4,95,700, ప్రమాదకరంగా వాహనాలు నడిపిన వారికి రూ.1,98,000, సౌండ్ పొల్యూషన్ వాహనాలకు రూ.1,67,000, వాహనాలకు బ్లాక్ ఫిలిమ్ ఏర్పాటు చేసినందుకు రూ.3,92,700 విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నా, తనిఖీలు చేస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఏడాదిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 847 మంది పట్టుబడ్డారు. వీరందరిని ఫస్ట్ క్లాస్ కోర్డులో హాజరుపరచగా, రూ.16,94,000 జరిమానాలు విధించింది. ఫ రోడ్డు నిబంధనలు పాటించని వారిపై ట్రాఫిక్ పోలీసుల కొరడా ఫ యాదగిరిగుట్ట పరిధిలోని ఆరు మండలాల్లో ఏడాదిలో 84,200 కేసులు నమోదు ఫ రూ.1,43,50,200 జరిమానాలు -
మహిళా సౌరభం
మోత్కూరు: తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వినియోగంలో లేని ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, బంజరు భూములతో లీజు ఒప్పందం చేసుకొని పరస్పర అంగీకారంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో దేవాదాయ భూములను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరించారు. ఈ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) డి. వీరారెడ్డి, ఆర్డీఓ ఎం. కృష్ణారెడ్డి, డీఆర్డీఓ కె. నాగిరెడ్డితో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ నెల 19న శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే బుజిలాపురం సోలార్ పవర్ ప్లాంట్ మొదటిదని అధికారులు చెబుతున్నారు. బుజిలాపురంలోని 8 ఎకరాల దేవాదాయ భూమిలో రూ.6 కోట్లతో రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వామన సోలార్ ఈపీసీ కంపెనీ ద్వారా ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒక్కో ఎకరాకు రూ.15వేల చొప్పున డీఆర్డీఏ ద్వారా చెల్లించడానికి మహిళా సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ డబ్బులు దేవాదాయ శాఖ ఖాతాలో జమవుతాయి. జిల్లా మహిళా సమాఖ్య, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల మహిళా సమాఖ్యలు కలిసి రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక మెగావాట్కు రూ.3 కోట్ల చొప్పున 2 మెగావాట్లకు కలిపి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 10 శాతం అనగా రూ.60 లక్షలు, మహిళా సంఘాల వాటా 1 మెగావాట్ యూనిట్కు రూ.కోటి ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల యూనిట్లకు గాను రూ.2కోట్ల రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల ద్వారా సంవత్సరానికి రూ.16.60 లక్షల విలువైన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1 యూనిట్ విద్యుత్కు రూ.3.13 చెల్లించి తెలంగాణ రెడ్కో కొనుగోలు చేస్తుంది. దీంతో ప్రతి సంవత్సరం రూ.52 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో మహిళా సంఘాలు బ్యాంకు రుణం, వాయిదాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సోలార్ పవర్ ప్లాంట్ జీవిత కాలం 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అన్ని ఏర్పాట్లు చేశాం బుజిలాపురంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. రెవెన్యూ అధికారుల సహకారంతో 8 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని లీజుకు తీసుకున్నాం. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా వాటా ధనం చెల్లించాం. అన్నిరకాల ఒప్పందాలను కంపెనీతో కుదుర్చుకున్నాం. సోలార్ పవర్ ప్లాంట్తో మహిళా సంఘాలకు పెద్దఎత్తున ఆదాయం చేకూరనుంది. – టి. నాగిరెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా జీవనోపాధి పొందుతాం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో జీవనోపాధి పొందుతాం. మహిళల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నాం. దీంతో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పడం సంతోషంగా ఉంది. – మిడిదొడ్డి శైలజ, మోత్కూరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలుఅదృష్టంగా భావిస్తున్నాం యాదాద్రి జిల్లా మహిళా సమాఖ్యకు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బుజిలాపురంలోనే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో జిల్లా కలెక్టర్, డీఆర్డీఓ అధికారుల కృషి ఎంతో ఉంది. జిల్లా అధికారులకు మహిళా సంఘాల పట్ల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. – కందుకూరి రేణుక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, యాదాద్రి భువనగిరి ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం రాష్ట్రంలోనే ప్రథమంగా మోత్కూరు మండలం బుజిలాపురంలో శంకుస్థాపన -
వినియోగదారుల హక్కులు తెలుసుకోవాలి
భువనగిరిటౌన్ : నాణ్యమైన వస్తువులు, పరిమాణం, వస్తువుల ధరల గురించి తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంటుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. రక్షణ, కల్తీ వస్తువులను అధిగమించడానికి చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన వస్తువు సేవలను పొందడం ప్రాథమిక హక్కు అని తెలిపారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉండే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా వినియోగదారుల హక్కుల సంఘాలు వారికి అండగా నిలబడి సేవలందించాలని కోరారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామాల్లో సర్పంచ్లకు అవగాహన కల్పించి ఫర్టిలైజర్స్, తదితర షాపులను తనిఖీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో జిల్లా యంత్రాంగం విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నారని తెలిపారు. వచ్చే నెలలో సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వినియోగదారులకు అందుబాటులో ఉన్న సేవల గురించి అదనపు కలెక్టర్ వీరారెడ్డి వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారి హరికృష్ణ, ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, జిల్లా మెట్రాలిజీ అధికారి వెంకటేశ్వర్లు, వినియోగదారు ల ఫోరం సభ్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్ అందజేత
యాదగిరిగుట్ట : భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పన్నాల సుభాషిని, వెంకట్రాంరెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పన్నాల జగన్మోహన్రెడ్డి జ్ఞాపకార్థం రూ.7.50లక్షలు విలువ చేసే బ్యాటరీ వాహనాన్ని యాదగిరిగుట్ట ఆలయ అధికారులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాటరీ వాహనానికి ఆలయాధికారులు, దాతలు సుభాషిని, వెంకట్రాంరెడ్డి, కుటుంబ సభ్యుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ బ్యాటరీ వాహనాన్ని వినియోగించాలని దాత ఆలయాధికారులను కోరారు. అనంతరం వారు యాదగిరీశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వెండి ఆరాధన పాత్రలు బహూకరణ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం సికింద్రాబాద్లోని వారాసిగూడకు చెందిన బూస కృష్ణ, కుటుంబ సభ్యులు వెండి ఆరాధన పాత్రలను బహూకరించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం రూ.2.50లక్షలు (2 కిలోల 106 గ్రాములు) విలువ చేసే 5 పాత్రలతో పాటు ఒక ప్లేట్ను ఆలయ అర్చకులు, అధికారులకు అందజేశారు. అంతకుముందు బూస కృష్ణ, కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. మద్యం మత్తులో ఏఎన్ఎంపై సీహెచ్ఓ దాడి ఫ సీహెచ్ఓను సస్పెండ్ చేసిన డీఎంహెచ్ఓ చివ్వెంల(సూర్యాపేట) : మద్యం మత్తులో ఏఎన్ఎంపై సీహెచ్ఓ దాడి చేశాడు. ఈ ఘటన చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చివ్వెంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న ఆవుల వెంకటేశ్వర్లు జి.తిర్మలగిరి గ్రామంలోని సబ్ సెంటర్లో పనిచేస్తున్న ఏఎన్ఎం పట్ల మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడు. కొంతమంది స్థానికులు గమనించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో మండల వైద్యాధికారి జి. భవాని జిల్లా వైద్యాధికారికి సమాచారం అందించారు. దీంతో సీహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యాధికారి పెండెం వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ తెలిపారు. -
అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక
కనగల్ : కనగల్ మండలం దర్వేశిపురంలో బుధవారం అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన అర్చక సంఘం అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఫ అర్చక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గాద ఉమామహేశ్వరశర్మ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచార్యులు, మహంకాళి కిరణ్శర్మ, లహరి నరసింహాచార్యులు, బ్రాహ్మణపల్లి రవీందర్శర్మ, ప్రధాన కార్యదర్శిగా జీడికంటి అనంతాచార్యులు, సంయుక్త కార్యదర్శిగా కంభంపాటి రమణ, కోశాధికారిగా కారంపూడి మోహన్, సహాయ కార్యదర్శులుగా ఫణికుమారాచార్యులు, వలివేలు, విద్యాధరశర్మ, హరీష్శర్మ, ముడుంబై దామోదరచార్యులు, అత్తాంశ గోపాలచార్యులతో పాటు ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఫ ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడిగా జినుకుంట్ల చంద్రయ్య, గౌరవ సలహాదారులుగా రాజ్యలక్ష్మి, అధ్యక్షుడిగా అలుగుబెల్లి సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్రెడ్డి, కోశాధికారిగా కె. ఉపేందర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్. అంజనేయులు, కొండారెడ్డి, డి. శ్రీనివాస్, సమన్వయ సభ్యులుగా ఎన్. రమణ, గోవిందరెడ్డి, వీరయ్య, ప్రచార కార్యదర్శిగా ఎస్బీవీ యోగానందంతో పాటు 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, అర్చక సంఘం జేఏసీ అధ్యక్షుడు పరాశరం రవీంద్రాచార్యులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు కృష్ణమాచారి, జేఏసీ కన్వీనర్ డీవీకే శర్మ, ఉద్యోగుల వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శ్రవణ్కుమారాచార్యులు, జక్కాపురం నారాయణస్వామి, దిండిగల్ ఆనంద్శర్మ, అర్చక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహన్శర్మ, బండారు శ్రీనివాస్, అనిల్కుమార్, ట్రిపుల జై శర్మ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి రిమాండ్
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో మూడు రోజుల క్రితం మేనమామను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్న యలగందుల వెంకన్న(50) తన కుమారుడు రాకేష్తో కలిసి స్థానికంగా మిల్క్ సెంటర్ నడుపుకుంటున్న తన మేనల్లుడు గట్టు శ్రీకాంత్ వద్దకు ఈ నెల 21న రాత్రి వెళ్లారు. వెంకన్న కూమారుడు రాకేష్ శ్రీకాంత్ వద్ద పాల వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ షాపులోనే అతడి స్నేహితుడైన చీమలగడ్డకు చెందిన పుట్ట కిరణ్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. వెంకన్న తన కుమారుడు రాకేష్కు రావాల్సిన జీతం డబ్బుల గురించి శ్రీకాంత్ను ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ అసభ్య పదజాలంతో వెంకన్నను దూషిస్తూ డబ్బులు ఇవ్వనని బెదిరించాడు. దీంతో వెంకన్న తన మేనల్లుడు శ్రీకాంత్పై చేయి ఎత్తడానికి ప్రయత్నించగా.. రాకేష్ అడ్డుగా వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. మరింత ఆగ్రహానికి గురైన శ్రీకాంత్ పక్కనే ఉన్న పాల ట్రేతో రాకేష్పై దాడి చేయబోగా.. వెంకన్న అడ్డురావడంతో అతడి తలపై పాల ట్రేతో కొట్టి గాయపర్చాడు. అంతేకాకుండా సిమెంట్ ఇటుకతో వెంకన్న ముఖంపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత వెంకన్న కుమారుడు రాకేష్, పుట్ట కిరణ్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టపక్కల వారు వచ్చి వెంకన్నను అంబులెన్స్లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకన్న కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గట్టు శ్రీకాంత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు కొండల్రెడ్డి, వెంకటేశం, ఎస్ఐ వీరబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
నేను తెలంగాణ ప్రజల బాణాన్ని
ఫ బీజేపీకి సీఎం రేవంత్రెడ్డికి అంతర్గత సంబంధాలు ఫ బీఆర్ఎస్ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదు ఫ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితసాక్షి, యాదాద్రి : శ్రీనేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు.. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదుశ్రీ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. 2029లో ఎన్నికలు వస్తాయని భావిస్తున్నా. అప్పుడు బరిలో ఉంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో కారణం చెప్పలేదని, నాకు ఇప్పటికీ తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన నోటీసులు ఊహాజనితమే. దానిపై నేను మాట్లాడలేన్నారు. రేవంత్రెడ్డి అంటేనే ఆర్ఎస్ఎస్ సీఎం అని, అంతర్గతంగా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందిపడిన ప్రజలకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో జరిగిన తప్పులకు ఆ పార్టీలో ఉన్నప్పుడు తాను కూడా భాగస్వామినేని ఆమె అన్నారు. తనను నిజామాబాద్ వరకే పరిమితం చేశారని దీంతో రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన విషయం కూడా తన దృష్టికి రాలేదన్నారు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కోసం ఆందోళన చేస్తామని, హైదరాబాద్లో జనవరి 8న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. భువనగిరి ఖిలా పరిశీలన భువనగిరి: జాగృతి జనం బాటలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భువనగిరి ఖిలాను సందర్శించి ఖిలా ప్రాముఖ్యత, అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని స్వర్ణకారుల వీధిలో పర్యటించారు. బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామంలో క్రషర్ల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. -
విద్యుత్ బిల్లుల చెల్లింపునకు క్యూఆర్ కోడ్
ఆలేరు: మీటర్ రీడింగ్, బిల్లు జనరేట్కే పరిమితమైన స్పాట్ బిల్లింగ్ మిషన్ (ఎస్బీఎం)లో విద్యుత్ శాఖ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మీటర్ రీడింగ్ సమయంలోనే బిల్లు చెల్లించే వెసులుబాటు కల్పించింది. గతంలో ఇలా.. విద్యుత్ సిబ్బంది ప్రతి నెల ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీస్తారు. బిల్లు జనరేట్ అయిన తర్వాత వినియోగదారుడికి అందజేసేవారు. తర్వాత వినియోగదారులు తమ సెల్ఫోన్ ద్వారా గూగుల్ పే, ఫోన్పే ద్వారానో.. లేక విద్యుత్ కార్యాలయానికి వెళ్లి విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. గూగుల్, ఫోన్పే ద్వారా చెల్లింపులపై చాలా మందికి అవగాహన లేదు. పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం కొంత ప్రయోజనం ఉన్నా పల్లెల్లో వినియోగదారులు ఇందుకు ఆసక్తిని కనబరచడం లేదు. దీంతో గ్రామానికి వచ్చే సిబ్బందికి వినియోగదారులు మాన్యువల్గా బిల్లు డబ్బులు చెల్లించేవారు. ఈ విషయంలో వినియోగదారులు, సిబ్బందికి మధ్య బిల్లు వివాదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. పారదర్శకంగా లావాదేవీలు స్పాట్ బిల్లింగ్ మిషన్(ఎస్బీఎం)లో మీటర్ రీడింగ్, బిల్లు అమౌంట్ వివరాలు మాత్రమే వచ్చేవి. ఇందులో కొత్త సాఫ్ట్వేర్తో క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. గడిచిన రెండు నెలలుగా జిల్లాలో అధికారులు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ క్యూర్ కోడ్ ద్వారా బిల్లల చెల్లింపు వల్ల లావాదేవీలు పారదర్శకంగా జరగనున్నాయి. మీటర్ రీడింగ్ సమయంలోనే ఎస్బీఎంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి స్పాట్లోనే బిల్లు చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు కలగనుంది. ఫ అందుబాటులోకి తెచ్చిన విద్యుత్ శాఖ ఫ మీటర్ రీడింగ్ సమయంలోనే బిల్లు చెల్లించే వెసులుబాటుకొత్తగా క్యూఆర్ కోడ్ అమల్లోకి రావడం వల్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులో వినియోగదారులకు సమయం ఆదా అవుతుంది. వినియోగదారుడు, సిబ్బందికి మధ్య బిల్లు వివాదాలకు ఆస్కారం ఉండదు. మాన్యువల్గా వసూలు చేసి బిల్లుల డబ్బులను సిబ్బంది శాఖ రెవెన్యూ విభాగంలో జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత వారు బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. ఈక్యూఆర్ కోడ్ వల్ల బిల్లులు నేరుగా సంస్థ ఖాతాలో జమ అవుతాయి. సిబ్బందిపై కూడా పనిభారం తగ్గుతుంది. – వెంకటేశ్, విద్యుత్ ఏఈ, ఆలేరు -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
భువనగిరి : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండల పరిధిలోని మాదారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదారం గ్రామానికి చెందిన శ్రీరాం కుమార్ మూడో కుమారుడు రామకృష్ణ(22) బుధవారం ఉదయం తెల్లవారుజామున తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ గేదెలకు పాలు పితికి ఇంటికి వెళ్లి పాలు పెట్టిన తర్వాత మళ్లీ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి వద్ద పశువులను మేత కోసం వదిలి వాటి వెనుక నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు కిందపడి ఉండటాన్ని సోదరుడు గమనించాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు. -
అమృత్ పనుల్లో వేగం
సాక్షి, యాదాద్రి: మున్సిపాలిటీల్లో ప్రజలకు మంచినీటి వసతి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అమృత్ 2.0 పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2026 మార్చి వరకు గడువు ఉండగా ఆ దిశగా పనులు పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించింది. గతేడాది అమృత్ 2.0 పథకానికి ఆరు మున్సిపాలిటీలకు రూ. 121.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో అదనంగా అంతర్గత పైప్లైన్లు, ట్యాంకులు నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఇలా.. ఫ భువనగిరి మున్సిపాలిటీలో రూ.21.80 కోట్ల నిధులతో అమృత్ 2.0 పనులు ప్రారంభించారు. 19 కిలోమీటర్ల మేర మంచినీటి పైపులైన్లు వేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేయగా.. 10 కిలోమీటర్లు మేర పనులు పూర్తి చేశారు. ఇక రాయిగిరి, డబుల్బెడ్రూం వద్ద, ప్రగతినగర్లో 15లక్షల కిలోలీటర్లు సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ప్రగతి నగర్లో ఉన్న ట్యాంకు పనులు స్లాబ్ దశకు చేరుకున్నాయి. రాయిగిరిలో 3లక్షల కిలోలీటర్లు ట్యాంకు భీమ్ దశలో ఉన్నాయి. ఫ ఆలేరు మున్సిపాలిటీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 1000కేఎల్, పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద 700 కేఎల్ సామర్థ్యంతో రెండు ట్యాంకులు నిర్మిస్తున్నారు. 4 కిలోమీటర్ల పొడవు ప్రధాన పైప్లైన్, 9 అంతర్గత పైప్లైన్ల పనులు జరుగుతున్నాయి. ఫ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 24 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంకులు చౌటుప్పల్లో రెండు, తంగడపల్లిలో ఒకటి, లక్కారంలో ఒకటి నిర్మిస్తున్నారు. తంగడిపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో నిర్మిస్తున్న ట్యాంక్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ట్యాంకులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న నాలుగు ట్యాంకుల పరిధిలో 29 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ వేయాల్సి ఉంది. కొన్ని కాలనీల్లో సు మారు నాలుగు, ఐదు కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేశారు. ఫ భూదానపోచంపల్లి మున్సిపాలిటీలో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు మూడవ బ్రెస్ బీమ్ పనులు నడుస్తున్నాయి. 42 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేయాల్సి ఉండగా వెంకటరమణ కాలనీ, రాంనగర్ కాలనీ, పద్మానగర్, జెవీ కాలనీలలో 12 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేశారు. ఫ యాదగిరిగుట్ట పట్టణంలో అంగడి బజార్, కొత్త గుండ్లపల్లిలో 500 కేఎల్, గణేష్ నగర్లో 1200 కేఎల్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. అంగడి బజార్, కొత్త గుండ్లపల్లిలో 80శాలానికి పైగా అంటే నాల్గవ అంతస్తులో ట్యాంక్ స్లాబ్ పనులు జరుగుతున్నాయి. గణేష్ నగర్లో రెండవ దశ పనులు చేస్తున్నారు. స్థల సేకరణలో ఇబ్బందులు ఉండటంతో గణేష్ నగర్లో పనులు ఆలస్యం జరిగింది. పైప్లైన్లు 15 కిలోమీటర్ల మేర వేశారు. 60 కిలోమీటర్లు వేయాల్సి ఉంది. ఫ మోత్కూర్ మున్సిపాలిటీలోని జూనియర్ కళాశాలలో చేపట్టిన ట్యాంక్ నిర్మాణ పనులు థర్డ్ లెవెల్లో ఉన్నాయి. జెడ్పీ పాఠశాలలో ఫస్ట్ లెవెల్ ట్యాంక్ పనులు జరుగుతున్నాయి. నాలుగున్నర కిలోమీటర్ల మెయిన్ పైప్ లైనన్కు 3 కిలోమీటర్లు పైపులైన్ పూర్తయింది. ఐదున్నర కిలోమీటర్ల ఇంటర్నల్ పైప్లైన్ పనులకు కిలోమీటరు మేర పూర్తయ్యాయి. సుమారు 700 నల్లా కనెక్షన్ల పనులు చేయాల్సి ఉంది. . అమృత్ 2.0 పథకంలో చేపట్టిన పనులు మార్చిలోగా పూర్తవుతాయి. గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చాం. వచ్చే నెలలో కొన్ని ట్యాంకులు పూర్తి కానున్నాయి. పైప్లైన్ పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించాం. – భాస్కర్రావు, అదనపు కలెక్టర్ ఫ ముమ్మరంగా సాగుతున్న ట్యాంకుల నిర్మాణం, పైప్లైన్ పనులు ఫ మున్సిపాలిటీల్లో గతేడాది మంజూరైన రూ. 121.3 కోట్ల నిధులు ఫ గడువులోగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన అధికారులు -
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
● టీచర్లు దండించే ప్రయత్నం చేయగా గేటు దూకి పారిపోయిన చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన విద్యార్థి ● మేడ్చల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన చిట్యాల : హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నిర్మలకు ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్మల తన పెద్ద కుమారుడు కార్తీక్ని గతేడాది మేడ్చల్లోని జాన్సన్ అకాడమీలో చేర్పించింది. కార్తీక్ స్కూల్ ఆవరణలోని హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న కార్తీక్ తరగతులకు హాజరుకాకపోవడంతో నిర్మలకు పాఠశాల ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి చెప్పింది. నిర్మల అదే రోజు పాఠశాలకు వెళ్లగా.. కార్తీక్ కన్పించకుండా పోయాడని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడని నిర్మల ఉపాధ్యాయులను నిలదీయగా.. క్రమశిక్షణతో లేని కారణంగా కార్తీక్తో పాటు మరో ముగ్గురు విద్యార్థులకు దండించే ప్రయత్నం చేశామని, ఈ క్రమంలో కార్తీక్ పాఠశాల గేటు దూకి పారిపోయాడని వివరించారు. దీంతో నిర్మల మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తన కుమారుడు కార్తీక్ను పాఠశాలలోని వంట గదిలో ఉపాధ్యాయులు దండించినట్లు పలువురు విద్యార్థులు తనకు చెప్పారని నిర్మల పేర్కొంది. పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలిఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి నాగార్జునసాగర్ : రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాగార్జునసాగర్లో నూతనంగా నిర్మించిన రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 30, 40 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించి తాము దాచుకున్న డబ్బులను అవసరాల మేరకు వెంటనే విడుదల చేయాలని కోరారు. పెన్షన్ అనేది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సేవకు పొందే లబ్ధి హక్కు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గానోతుల వెంకట్రెడ్డి, శ్రీశైలం, నారాయణరెడ్డి, పల్రెడ్డి నర్సింహారెడ్డి, గోవర్థన్రెడ్డి, సాంబశివరావు పాల్గొన్నారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణంకోదాడరూరల్ : బైక్పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని దోరకుంటకు చెందిన జక్కుల శివ(45) పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై కోదాడ బస్టాండ్ వద్దకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా. ఖమ్మం క్రాస్రోడ్ వద్ద మేళ్లచెర్వు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తమ్ముడు కొండలు ఫిర్యాదు మేరకు సీఐ కె. శివశంకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిట్యాలలో పత్తి రైతుల ఆందోళన చిట్యాల : పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాలని చిట్యాల పట్టణ శివారులో సీసీఐ ఏర్పాటు చేసిన క్రిష్ణ కాటన్ మిల్లు వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. కాటన్ మిల్లు వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర పత్తి లోడు ట్రాక్టర్లు ఉండడంతో చిట్యాల నుంచి మునుగోడు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇదే సమయంలో పత్తి కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు చిట్యాల–ఉరుమడ్ల రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు సీసీఐ కేంద్రం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఐదు క్వింటాళ్ల పత్తికి స్లాట్ బుక్ చేసుకుని అదనంగా పత్తిని రైతులు తీసుకురావడంతో కొనుగోళ్లలో ఆలస్యమై ట్రాక్టర్లు బారులదీరినట్లు తెలుస్తోంది. పోలీసులు కాటన్ మిల్లు వద్దకు చేరుకుని రైతుల ఆందోళనను విరమింపజేశారు. సీసీఐ కేంద్రం అధికారి కోటేశ్వరరావు, కాటన్ మిల్లు నిర్వాహకులు రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పడంతో శాంతించారు. సాంకేతిక సమస్యలతో అదనంగా స్లాట్ బుక్ అయినట్లు సీసీఐ కేంద్రం అధికారి పేర్కొన్నారు. -
సూర్యాపేట ఎస్పీని బదిలీ చేయాలి
సూర్యాపేట : కర్ల రాజేష్ మృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహను వెంటనే బదిలీ చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థపాక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ల రాజేష్ మృతికి కారకులైన ప్రతి ఒక్క అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. చిలుకూరు ఎస్ఐ సురేశ్రెడ్డిపై చర్యలు తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యేనే కాపాడుతున్నారంటూ ఆరోపించారు. ఎస్ఐని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో బీసీ వర్గానికి చెందిన కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ఎస్ఐ బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టే వదిలేశారని ధ్వజమెత్తారు. కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఎస్పీ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో ఎస్పీ స్వతంత్రుడిగా లేడన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, చిలుకూరు ఎస్ఐ సురేశ్రెడ్డిని సస్పెండ్ చేయలేదని ఆరోపించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో లక్ష్మీకాంత్రెడ్డితోనే ఎందుకు పోస్టుమార్టం చేయించారని, కోదాడ నుంచి హైదరాబాద్ వరకు పోలీసుల వాహనంలో రామకృష్ణారెడ్డినే వీడియోగ్రాఫర్గా తీసుకెళ్లి ఎందుకు వీడియోలు తీయించారని ప్రశ్నించారు. నవంబర్ 10న కోదాడ కోర్టులో సమర్పించిన రిమాండ్ డైరీ.. డిసెంబర్ 1న హైకోర్టులో సమర్పించిన రిమాండ్ డైరీ ఎలా మారుతుందన్నారు. కోర్టు ముందు ఐకాన్ ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ ఎలా చేస్తారన్నారు. ఈ అవకతవకలకు చిలుకూరి ఎస్ఐ మూలకారకుడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంజేఎఫ్ సీనియర్ అడ్వకేట్ డప్పు మల్లయ్య, బచ్చలకూరి వెంకటేశ్వర్లు, చింతలపాటి చిన్న శ్రీరాములు, యాతాకుల రాజన్న, చింత వినయ్బాబు, ఎర్ర వీరస్వామి, ములకలపల్లి రవి, తళ్లమళ్ల హుస్సేన్, కోట గోపి, బొల్లెద్దు వినయ్, కనుకుంట్ల వెంకన్న, గ్యార కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
రామగిరి(నల్లగొండ): క్రీడలు విద్యార్థుల జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని నల్లగొండ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎండీ అక్బర్ అలీ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో 2025–26 జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆటలు ఆడడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహరావు మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఐలయ్య, సత్తయ్య, పీడీ ప్రసాద్, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్రీమాధురి, అంజయ్య, జ్యోతి, సిబ్బంది విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా కొనసాగిన పోటీలు.. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా అథ్లెటిక్స్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్ తదితరల పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, తిరుమలగిరి, యాదాద్రి భువనగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కోదాడలోని అనురాగ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. బుధవారంతో ఈ స్పోర్ట్స్ మీట్ ముగియనుంచి. మొదటి స్థానంలో నిలిచిన జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఫ నల్లగొండ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ ఫ మేకల అభినవ్ స్టేడియంలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం -
ఫ పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎంపిక ఫ కేంద్ర హోం శాఖలోని ఓఆర్జీఐకి డిజిటల్ నివేదిక అందజేత
ముందస్తు జన గణనను రాష్ట్ర సెన్సెన్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆన్లైన్లోనే కేంద్ర హోంశాఖలోని ఓఆర్జీఐకి నివేదిక పంపించారు. దీని ఆధారంగానే 2027లో జన గణనను డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో ఆ సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు పూర్తిస్థాయి జన గణన చేపట్టనున్నారు. నల్లగొండ : 2027లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జన గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మూడు భిన్నమైన మండలాలను ఎంపిక చేసి ముందస్తు జన గణన నిర్వహించింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలాల్లో ఎన్యుమరేటర్లు ఆన్లైన్ యాప్లో జన గణన వివరాలు నమోదు చేశారు. దీనికి తోడు ఇళ్లను జియో ట్యాగింగ్ ద్వారా గూగుల్కు అనుసంధానం చేశారు. కేంద్ర హోం శాఖలోని ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఓఆర్జీఐ) ముందస్తు జన గణన నిర్వహించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఇండ్లూరు, మామిడాల, తిప్పర్తి, జంగారెడ్డిగూడెం, సర్వారం గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ముందస్తు జన గణన నిర్వహించేందుకు గాను 40 మంది ఎన్యుమరేటర్లు, ఏడుగురు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. మొదట సూపర్వైజర్లు ఆయా మండలాల్లో గ్రామాలకు వెళ్లి ఇళ్లను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించారు. హౌజ్ లిస్టింగ్ బ్లాక్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ను గూగుల్కు అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు ముందస్తు జన గణన పూర్తిచేశారు. మొట్టమొదటిసారి పెన్ను, పేపర్ లేకుండా డిజిటల్ విధానంలో ముందస్తు జన గణన నిర్వహించారు. ఇళ్లను జియో ట్యాగింగ్తో గుర్తించడంతో పాటు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబాలతో పాటు మిగతా వివరాలను కూడా అందులో పొందుపర్చారు. రేడియో వింటారా, ఎలాంటి భోజనం చేస్తారు, బాత్రూమ్ ఉందా, ఇంట్లో ఎన్ని గదులున్నాయి, పైళ్లెన జంటలు ఎన్ని, ఇంటికి కరెంట్ సరఫరా ఉందా, గ్యాస్, టీవీ, కంప్యూటర్, స్మార్ట్ఫోన్ వాడుతున్నారా, సైకిల్, బైక్, కారు తదితర వివరాలను సేకరించారు. ఐదు గ్రామాల్లో ఒక్క ఇంటిని కూడా వదలకుండా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 2027 జనాభా లెక్కల కోసం నిర్వహించిన ముందస్తు జన గణన విజయవంతంగా పూర్తయ్యింది. ఇందులో భాగంగా మొదట ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన తిప్పర్తి మండలంలోని ఐదు గ్రామాల్లో డిజిటల్ యాప్లో జనాభా లెక్కలు సేకరించారు. రాబోయే ప్రధాన జన గణన ప్రక్రియను మెరుగుపర్చడానికి ఈ ముందస్తు జన గణన ఎంతో ఉపయోగపడనుంది. -
సన్మాన సభలో దొంగల చేతివాటం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనరసింహ గార్డెన్లో మంగళవారం జరిగిన సర్పంచ్ల సన్మానోత్సవం, ఆత్మీయ సభలో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రసంగం ముగిసిన తర్వాత సర్పంచ్లను సన్మానించారు. ఆ సమయంలో వేదిక పైకి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో పాటు వారి వెంట వచ్చిన నాయకులు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ఈ క్రమంలో రాజాపేట, తుర్కపల్లి, ఆలేరు, గుండాల, యాదగిరిగుట్ట మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన నాయకుల జేబుల్లో నుంచి డబ్బులను దొంగలు కొట్టేశారు. సుమారు రూ.1.50లక్ష నుంచి రూ.2లక్షల వరకు నాయకుల జేబుల్లో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు నొక్కేశారు. సన్మానాలు ముగిసిన తర్వాత జేబులను చూసుకున్న నాయకులు డబ్బులు పోయిన సంగతి తెలుసుకొని పోలీసులకు తెలిపారు. యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.10కోట్లుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను కొండ దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఈఓ వెంకట్రావ్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది మంగళవారం లెక్కించారు. హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు రూ.2,10,04,942 వచ్చినట్లు ఈఓ తెలిపారు. మిశ్రమ బంగారం 75 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 600గ్రాములు వచ్చాయని వెల్లడించారు. అంతేకాకుండా వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ సైతం వచ్చిందని, ఈ ఆదాయం 29 రోజులదని ఈఓ తెలిపారు. -
సరైన భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ
చౌటుప్పల్ : సరైన భద్రతా చర్యలతో ప్రమాదాలను నివారించవచ్చని పరిశ్రమల శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామంలోని దివీస్ పరిశ్రమ ఆధ్వర్యంలో మంగళవారం లింగోజిగూడెంలోని ఓ ఫంక్షన్హాల్లో భద్రతపై ఒకరోజు శిక్షణ, అవగాహన సెమినార్ నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న పలు పరిశ్రమల నుంచి సేఫ్టీ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమల్లో భద్రతపై ఏమాత్రం రాజీపడొద్దన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతుందని తెలిపారు. సెమినార్ నిర్వహించిన దివీస్ పరిశ్రమను అభినందించారు. ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ యాదాద్రి జిల్లా ఇన్స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ సేఫ్టీ విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సాంబశివరావు, సేఫ్టీ జనరల్ మేనేజర్ జి. బాలకిషోర్, బి. కిషోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ పరిశ్రమల శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి -
మంత్రులే లేఖలు రాయడం బాధాకరం
యాదగిరిగుట్ట : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే విధంగా కాంగ్రెస్ మంత్రులే 40 టీఎంసీలు చాలు అని లేఖలు రాయడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం కొండపైన హరిత టూరిజం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీటి ప్రాజెక్టులు తీసుకువస్తే.. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తగ్గించి, రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసిందన్నారు. యాదగిరి దేవస్థానం నుంచి ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు పెట్టవద్దని నోటీసులు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ఇష్టానుసారంగా జెండాలు, ఫ్లెక్సీలు పెట్టి నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ప్లెక్సీలు ఏర్పాటును వ్యతిరేకించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్కు అక్రమంగా తీసుకెళ్లారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ప్రేమ పెరిగిందని, అందుకే సర్పంచ్లుగా అధిక సీట్లు గెలిపించారన్నారు. కేసీఆర్ అద్భుతమైన పాలనతో పరిపాలన చేశారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ -
ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరు మృతి
ఫ ఇద్దరికి గాయాలుచందంపేట : ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. అతడి భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ ఘటన చందంపేట మండలంలోని గాగిళ్లాపురం వద్ద మంగళవారం జరిగింది. బుడ్డోనితండాకు చెందిన లింగాల లక్ష్మయ్య(42) తన కుమార్తె సంధ్య, భార్య శోభతో కలిసి ద్విచక్ర వాహనంపై దేవరకొండ నుంచి బుడ్డోనితండాకు వెళ్తుండగా.. గాగిళ్లాపురం వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి. లక్ష్మయ్య కుమార్తె సంధ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు, భార్య శోభను దేవరకొండకు తరలించారు. లక్ష్మయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ఫ మరొకరికి గాయాలు డిండి : బైక్ అదుపుతప్పి కిందపడడంతో యువకుడు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మన్మెమోని విజయ్(25) అదే గ్రామానికి చెందిన చింతకుంట్ల కృష్ణయ్యతో కలిసి సోమవారం ఎర్రగుంటపల్లిలో బంధువుల ఫంక్షన్కు హాజరై అర్ధరాత్రి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో వావిల్కొల్ గ్రామ శివారులోకి రాగానే బైక్కు అడవి పంది తగలడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెనుక సీట్లో కూర్చున్న కృష్ణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కృష్ణయ్యను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి నారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. పత్తి దగ్ధం.. ఇద్దరిపై కేసు నమోదుఅడ్డగూడూరు : మండల పరిధిలోని కోటమర్తిలో సోమవారం సర్పంచ్ పాశం విష్ణువర్ధన్రావు ప్రమాణ స్వీకార ర్యాలీలో అదే గ్రామానికి చెందిన మనిపెద్ది సురేందర్, మనిపెద్ది మత్స్యగిరి టపాకాయలు కాల్చగా.. నిప్పు రవ్వలు ఎగిరిపడి గూడ సోమయ్య ఇంట్లో నిల్వ చేసిన సుమారు 4 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు సురేందర్, మత్స్యగిరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మంగళవారం ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. అట్టహాసంగా రైతు దినోత్సవంనకిరేకల్ : గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నకిరేకల్లో మంగళవారం నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవం అట్టహాసంగా సాగింది. రైతు ఆత్మగౌరవం – సుస్థిర వ్యవసాయం– పర్యవరణ పరిరక్షణ– ప్రాణ కోటి సుస్థిర ఆరోగ్యంపై రాష్ట్ర స్థాయిలో మహాత్మాగాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళాను కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి హాజరై రైతుల సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రాణించిన వారికి కిసాన్ సేవారత్న అవార్డులను ప్రదానం చేశారు. సభా వేదికపై విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. ఒక అడుగు ఎత్తుగల 1156 గాంధీ విగ్రహలు, 156 చరకాల ప్రదర్శన, ఆకట్టుకుంది. -
పందిరి సాగుతో స్థిరమైన ఆదాయం
ఈ ఫొటోలోని రైతు నిడమనూరు మండలం వేంపాడు శివారులోని కుమ్మరిగూడేనికి చెందిన మల్లికంటి కోటయ్య. ఆయన తనకున్న 8 ఎకరాల్లో 6 ఎకరాలకు పైగా భూమిలో బత్తాయి, మిగతా భూమిలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. ఎకరానికి రూ.3.5 లక్షలతో రాతి స్తంభాలతో పందిరి ఏర్పాటు చేసుకుని బీర, దొండ, కాకర వంటి తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నాడు. వారానికి ఒకసారి మిర్యాలగూడ, నల్లగొండ మార్కెట్కు కూరగాయలు తరలిస్తున్నారు. నిడమనూరు : ఇతర పంటలతో పోలిస్తే రైతులకు పందిరి సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. మార్కెట్కు అనుగుణంగా గ్రామీణ యువత పందిరి సాగుపై దృష్టి సారిస్తున్నారు. నిడమనూరు మండలంలోని నాన్ ఆయకట్టు గ్రామాల్లో ఒకప్పుడు బత్తాయి, కంది, పెసర, మినుము వంటి సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. బత్తాయి సాగులో ఎరువులు, రసాయనిక పురుగు మందుల వాడకంతో ఫలసాయం కంటే తోట పోషణ రైతుకు ఆర్థిక భారంగా మారింది. దీంతో కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించి, వాటిపై వచ్చిన ఆదాయాన్ని బత్తాయి తోటకు పెట్టుబడిగా పెడుతున్నారు. బత్తాయిపై వచ్చిన ఆదాయాన్ని రైతు స్థిరమైన వార్షిక ఆదాయంగా చెప్పకుంటున్నారు. తీగ జాతి కూరగాయల సాగుతో రైతులు వారానికి మార్కెట్, రవాణా ఖర్చులు పోను సగటున రూ.25వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. తీగ జాతి పంటల సస్యరక్షణ చర్యలకు ఎరువులు, పురుగు మందల వాడానికి నెలకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అంతేగాకుండా బీర, కాకర తీగ పంటకాలం ముగిసేలోపు టమాట కూడా అంతరంగా ముందుగానే వేస్తున్నారు. దీంతో సగటున రైతులు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ఫ 20 గుంటల్లో కాకర సాగు చేస్తూ.. వారానికి 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడితో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం రైతు కోటయ్య చెబుతున్నాడు. ఫ అదేవిధంగా అర ఎకరంలో దొండ సాగుతో వారానికి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని, వారానికి రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ 10 గుంటల భూమిలోనే (5 నుంచి 8 వరుసలు) బీర సాగు చేశానని, వారానికి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని, క్వింటాల్కు రూ.3 వేల వరకు లభిస్తోందని కోటయ్య చెబుతున్నారు. -
కేసీఆర్ బయటకొచ్చారు
పార్టీ కనుమరుగవుతుందనే..యాదగిరిగుట్ట : బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందనే.. కేసీఆర్ రెండేళ్ళ తరువాత బయటకు వచ్చాడని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. సింహం, పులి లేచిందని కేటీఆర్, హరీష్రావు మాట్లాడుతున్నారని, కానీ పార్టీని బతికించుకునేందుకు కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు యాదగిరిగుట్ట పట్ణంలో మంగళవారం సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న అనంతరం మంత్రి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల చర్చను చట్ట సభలో చర్చించేందుకు రానీ కేసీఆర్ ఇప్పుడు తన పార్టీని బతికించుకునేందుకు వచ్చాడని విమర్శించారు. ప్రజా పాలనలో రేవంత్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తూ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అంతే కాకుండా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ను అధిక స్థానాల్లో గెలిపించారన్నారు. గత పది సంవత్సరాల్లో పంచాయతీలకు నిధులు కేటాయించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీతో మాకు పోటీ కాదని, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్కే పోటీ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిపించుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్లంతా అభివృద్ధిలో ముందుకెళ్తు ప్రజలను అందరిని సమానంగా చూడాలన్నారు. కక్ష పూరిత రాజకీయాలు చేస్తే నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యతను ఇస్తు ప్రజలకు ప్రజాపాలన పథకాలను అందజేయాలన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా బీఆర్ఎస్ హయంలో సర్పంచ్లకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన సర్పంచ్లకు గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చిలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, అర్హులైన వారందరికి ఇచ్చే బాధ్యత సర్పంచ్లదేనని అన్నారు. అంతకుముందు పట్టణంలోని వైకుంఠద్వారం నుంచి గుండ్లపల్లిలోని లక్ష్మీనరసింహ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్గౌడ్, కార్యదర్శి ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. యాదగిరీశుడి సేవలో మంత్రి అడ్లూరి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం దర్శించుకున్నారు. మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంకట్రావ్ మంత్రికి లడ్డూ ప్రసాదం, స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. ఫ బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు ఫ ప్రజాపాలనలో సర్పంచ్లకు అంతా మంచే జరుగుతుంది ఫ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
నోటాకు 1,309 ఓట్లు
భూదాన్పోచంపల్లి: తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో ఒకటి అంతకంటే రెండు, మూడు ఓట్ల తక్కువ మెజారిటీతో సర్పంచ్, వార్డుసభ్యుల పదవులు చేజారిపోయాయి. మరికొన్ని చోట్ల అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో టాస్ పద్ధతిలో పదవులు వరించాయి. ఈ సారి ఎన్నికల సంఘం నోటాను కూడా ప్రవేశపెట్టడంతో ఓటర్లు తమకు నచ్చని అభ్యర్థులకు బదులు నోటాకు ఓటు వేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సర్పంచ్లుగా ఇష్టం లేదంటూ జిల్లా వ్యాప్తంగా 1309 మంది నోటాకే ఓటు వేశారు. ఎక్కువగా బీబీనగర్ మండలంలో 151 ఓట్లు, వలిగొండలో 125, రాజాపేట 109 వచ్చాయి. అతితక్కువగా మోత్కూర్ మండలంలో 21, ఆలేరులో 43 ఓట్లు వచ్చాయి. ఓటు వేసే విధానంపై కొందరికి అవగాహన కొరవడి సర్పంచ్లకు సంబంధించి 5698 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొదటిసారి నోటా ఎన్నికల కమిషన్ మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించి.. అందులో నోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపెట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఆ ఓటరు ఎవరు నచ్చలేదంటూ తమ అభిప్రాయం తెలియజేసేలా నోటా గుర్తును సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పేపర్పై ముద్రించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 1309 మంది ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి బ్యాలెట్పై నోటాకు ఓటు వేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మూడు విడతల్లో ఎన్నికలు జిల్లాలో మూడు విడతల్లో (ఈనెల 11, 14, 17 తేదీల్లో )ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 5,32,240 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 1,44,483 మంది ఓటర్లు, రెండో విడతలో 1,5,937 మంది, మూడో విడతలో 1,47,432 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 4,77,852 మంది పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. చెల్లని ఓట్లు 5,698 ఫ పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా ఫ అత్యధికంగా బీబీనగర్ మండలంలో నోటాకు పోలైన 151 ఓట్లు నోటాతో పాటు చెల్లని ఓట్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. అధికారులు ఓటర్లకు సరైన అవగాహన కల్పించకపోవడంతో వృద్ధులైన ఓటర్లు ఓటు వేసేటప్పుడు తికమకపడి ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులకు ఓటు వేయడం, లేదా సరైన స్థానంలో స్వస్తిక్ గుర్తు వేయకపోవడంతో చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. యాదాద్రి జిల్లాలోనే 5698 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఎక్కువగా వలిగొండ మండలంలో 606, రామన్నపేటలో 496, రాజాపేటలో 440 చెల్లని ఓట్లు వచ్చాయి. తక్కువగా మోత్కూర్ మండలంలో 144, ఆలేరులో 252 ఓట్లు వచ్చాయి. ఈలెక్కన యాదాద్రి భువనగిరి జిల్లాలో నోటా, చెల్లని ఓట్లు కలుపుకొని మొత్తం 7,007 ఓట్లు ఉన్నాయి. -
ఫ్లెక్సీల వార్..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల లొల్లి నెలకొంది. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వైకుంఠద్వారం రింగ్ రోడ్డు వద్ద ఎలాంటి రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని ఇటీవల ఆలయాధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో మంగళవారం యాదగిరిగుట్టలో సర్పంచ్ల సన్మానోత్సవానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ వస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డిల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను సోమవారం రాత్రి వైకుంఠద్వారం ఎదుట సర్కిల్ వద్ద ఏర్పాటు చేశారు. గమనించిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యూత్ నాయకులు ఆవుల సాయి ఆధ్వర్యంలో సోమవారం అర్థరాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రదేశంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడుకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులతో బీఆర్ఎస్ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో పోలీసులు కర్రె వెంకటయ్య, ఆవుల సాయి యాదవ్లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించి, అనంతరం విడిచిపెట్టారు. యాదగిరి కొండపై ఆందోళన గతంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించిన ఆలయ అధికారులు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీవి ఎందుకు తొలగించలేదని యాదగిరి కొండపైన గల పరిపాలన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. అదేవిధంగా వైకుంఠద్వారం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆలయ ఈఓ వెంకట్రావ్కు వినతిపత్రం అందజేశారు. ఫ వైకుంఠద్వారం సర్కిల్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు ఫ బీఆర్ఎస్ నాయకులు వాటిని చించి వేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం -
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
భువనగిరి, భువనగిరిటౌన్ : రీజినల్రింగ్ రోడ్డు నిర్వాసితులకు ఇచ్చిన మాట మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భువనగిరికి ప్రియాంక గాంధీని తీసుకువచ్చి ఆమెతో.. అలైన్మెంట్ను మారుస్తామని హామీ ఇప్పించారని గుర్తుచేశారు. గుంట భూమి కూడా పోనివ్వమని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నిలుబెట్టుకుంటారా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితులతో కవిత సమావేశమయ్యారు. అదేవిధంగా బస్వాపురం, బండసోమారం గ్రామాల్లో పర్యటించారు. ఆమె వెంట జాగృతి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సుజిత్రావు, జిల్లా అధికార ప్రతినిధి తుంగతుర్తి సంతోష్రావు, తంగళ్లపల్లి శ్రీకాంత్, ఆకుల నరేష్, చిన్నం ప్రభాకర్, చక్రవర్తి, సంతోష్ ఉన్నారు. ఎయిమ్స్లో మెరుగైన సేవలందించాలి బీబీనగర్లోని ఎయిమ్స్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యరంగానికి బడ్జెట్ పెంచాలి ఆలేరు: వైద్యరంగానికి బడ్జెట్ పెంచాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆమె సందర్శించారు. అదేవిధంగా ఆలేరులో హజ్రత్ సయ్యద్ ఇస్మాయిల్ షా ఖాద్రీ ఆర్ఏ ఉర్సులో భాగంగా నిర్వహించిన గంధం ఊరేగింపులో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆలేరు పర్యటనలో భాగంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులతో కలిసి పలు కళాశాలల విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్ స్కాలర్షిప్ల కోసం వారు ఆమెకు వినతి పత్రం అందజేశారు. సామాజిక తెలంగాణ కోసం పోరాటం మోటకొండూర్: సామాజిక తెలంగాణ కోసం జాగృతి పోరాటం చేస్తుందని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం మోటకొండూర్లో ఆమె మాట్లాడారు. మండల కేంద్రంలో 950 సర్వే ప్రభుత్వ భూమిలో 30–40 సంవత్సరాలుగా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న 500 కుటుంబాలకు పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ నరేష్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివారెడ్డి ఉన్నారు. ఫ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
సహకార సేవలు విస్తృతం
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 22 పీఏసీఎస్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు నల్లగొండ అగ్రికల్చర్ : సహకార సంఘాల సేవల విస్తరణకు సహకార శాఖ పూనుకుంది. కొత్త సహకార సంఘాలను (పీఏసీఎస్)ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు ఉన్న సంఘాల నుంచి కొన్ని గ్రామాలను వేరు చేసి.. కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 కొత్త పీఏసీఎస్ల ఏర్పాటకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఆమోదిస్తే కొత్త సంఘాలు ఏర్పాటై రైతులకు సేవలు విస్తృతం కానున్నాయి. రైతులకు సేవలు విస్తరించేలా.. 2013 తరువాత కొత్త సంఘాలు ఏర్పాటు కాలేదు. రెండు గ్రామాలకు ఒక సంఘం ఉండగా.. మరికొన్ని సంఘాల్లో మూడు నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఇక, కొన్ని సంఘాల్లో 500 మంది రైతులు సభ్యులుగా ఉంటే మరికొన్ని చోట్ల.. మూడు నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు. దీంతో రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర సేవలను అందిండంలో ఆయా సంఘాలు రైతులకు సరైన న్యాయం చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంఘాల సేవలను విస్తరించడం కోసం రెండు సంవత్సరాలుగా కొత్త సంఘాల ఏర్పాటు కోసం రైతులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. 132కు చేరనున్న సంఘాలు కొత్త సంఘాల కోసం ప్రతిసాదనలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం కోరింది. దీంతో కొత్త సంఘాల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలో సంఘాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 110 సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా 22 సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే మొత్తం సంఘాల సంఖ్య 132కే చేనుంది. నల్లగొండ జిల్లాలో మాడుగులపల్లి, గట్టుప్పల్, గుడిపల్లి, తిరుమలగిరి సాగర్, అడవిదేవులపల్లి. సూర్యాపేట జిల్లాలో వెలిదండ, దిర్శించర్ల, త్రిపురవరం, రామాపురం, గుడిబండ, తొగర్రాయ్, గనపవరం . యాదాద్రి భువనగిరి జిల్లాలో కంచనపల్లి, ఎస్.లింగోటం, యల్లంకి, మునిపంపుల, మోటకొండూరు, కూరెళ్ల, వర్కట్పల్లి, జబ్లక్పల్లి, బట్టుగూడెం. ఫ ప్రభుత్వం ఆమోదిస్తే 132కు చేరనున్న సంఘాల సంఖ్య ఫ తీరనున్న రైతుల ఇబ్బందులు ప్రస్తుతం పీఏసీఎస్ ఇలా జిల్లా పీఏసీఎస్లు నల్లగొండ 42సూర్యాపేట 47యాదాద్రి 21 మొత్తం 110 -
గృహ ప్రవేశాలు త్వరగా చేపట్టాలి
యాదగిరిగుట్ట రూరల్: ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని దాతర్పల్లి, రాళ్లజనగాం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టి ఎన్ని రోజులవుతుంది, మెటీరియల్ ఏ రేటుకు తీసుకున్నారు, పూర్తయిన పనులకు బిల్లులు వచ్చాయా అనే వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఉన్నారు. గ్రామాల అభివృద్ధికి కష్టపడి పనిచేయాలిచౌటుప్పల్ : నూతనంగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామాల అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం నల్లగొండకు వెళ్తున్న ఆయన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు ఆయనను కలిసి మాట్లాడారు. వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, మల్కాపురం సర్పంచ్ గిర్కటి నిరంజన్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులున్నారు. మంత్రి ఉత్తమ్కు వినతిఅడ్డగూడూరు: అడ్డగూడూరు పరిధిలోని ధర్మారం గ్రామం బిక్కేరు వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని ఎమ్మెల్యే మందుల సామేలు మంగళవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమకుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ 64.23శాతం పూర్తి భువనగిరిటౌన్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం 64.23 శాతం పూర్తయినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి మంగళవారం తెలిపారు. బూత్ స్థాయి అధికారులు 2025 ఓటరు జాబితాలోని 40 సంవత్సరాల వయస్సు గల ఓటర్లను, 2002 ఓటరు జాబితా తో గుర్తించి బీఎల్ఓ యాప్లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అత్యధిక ఓటర్ల గుర్తింపు కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు. పోచంపల్లి కళాశాలకు ఎక్స్లెన్స్ అవార్డు భూదాన్పోచంపల్లి: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన భూదాన్పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎక్స్లెన్స్ అవార్డు వచ్చింది. మంగళవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, హైబీజ్ టీవీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జెడీ లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యూనివర్సిటీ చైర్పర్సన్ ప్రీతిరెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ సురేశ్రెడ్డి, జిల్లా ఇంటర్బోర్డు అధికారిణి రమణి అవార్డు అందుకున్నారు. -
ఎయిమ్స్లో ఎలక్ట్రిక్ ఆటోలు
భువనగిరిటౌన్ : బీబీనగర్ ఎయిమ్స్లో వైద్య సేవలు పొందేందుకు వచ్చే రోగులను స్థానిక బస్టాండ్ నుంచి ఆస్పత్రికి వరకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి నిర్వాహకులు రెండు ఎలక్ట్రిక్ ఆటోలు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు ఆరుగురు ప్రయాణించేందుకు వీలుగా ఉంది. వృద్ధులు, గర్భిణులు, నడవలేని వారు ఈ ఆటోల్లో ఉచితంగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇంటికి వెళ్లే రోగులను తిరిగి బస్టాండ్ వద్ద దింపుతున్నారు. సుమారు. రూ.3.5లక్షల విలువ చేసే ఈ ఆటోలు మరో నాలుగు రానున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. -
కనుల పండువగా ధనుర్మాసోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారంతో ఈ ఉత్సవాలు ఏడో రోజుకు చేరాయి. అమ్మవారి అలంకరణంగా విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు గోదాదేవి, శ్రీరంగనాథుడిని కొలుస్తూ, ఏడో పాశు రం పఠించి భక్తులకు వినిపించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి నీరాజనం పట్టారు. శివుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి అనుబంధంగా యాదగిరి కొండపై ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలను అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు శాస్త్రోక్తంగా జరిపించారు.వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు..గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ సహస్ర నామార్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రా కార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమంగజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర వేడుకలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
వలిగొండ : విద్యార్థులు శాసీ్త్రయదృక్పథం అలవర్చుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ హనుమంతరావు, డీఈఓ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. శాసీ్త్రయ, సాంకేతిక రంగాల్లో విద్యార్థుల ప్రతిభ ప్రతిబింబించే విధంగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉండాలన్నారు. పరిశోధనాత్మక దృక్పథంతో ఆవిష్కరణలు ఉండాలి : కలెక్టర్ రైతులతో పాటు వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగేలా పరిశోధన దృక్పథంతో ఆవిష్కరణలు ఉండాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులకు సహకారం అందిస్తామన్నారు. పదో తరగతి విద్యార్థులు గత ఏడాది మాదిరిగానే, ఈ విద్యా సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులను ఆవిష్కరించిన ఎగ్జిబిట్లను పరిశీలించి అభినందించారు. అదే విధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల సంస్కాృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వరంగల్ ఎన్ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.హరిప్రసాద్, విద్యాశాఖ ఏడీ ప్రశాంత్రెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్లు, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి -
జీతం విషయంలో గొడవ
నకిరేకల్ : జీతం విషయంలో జరిగిన ఘర్షణలో మేనమామను మేనల్లుడు హతమార్చాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలో నివాసముంటున్న యలగందుల వెంకన్న(50) కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె పెళ్లి కాగా.. కుమారుడు రాకేష్కు 2023లో గుజరాత్ రాష్ట్రం సూరత్కు చెందిన దివ్యతో వివాహం జరిగింది. ప్రస్తుతం రాకేష్ భార్య సూరత్లోనే ఉంటోంది. వెంకన్న భార్య మూడేళ్ల క్రితం క్యాన్సర్తో మృతిచెందింది. వెంకన్న మేనల్లుడు గట్టు శ్రీకాంత్ నకిరేకల్లో మిల్క్ సెంటర్ నడిస్తున్నాడు. వెంకన్న తన కుమారుడు రాకేష్ను మేనల్లుడు శ్రీకాంత్ వద్ద పాల వాహనంపై డ్రైవర్గా నెలకు రూ.16 వేల వేతనానికి పని కుదిర్చాడు. గత ఏడు నెలలుగా రాకేష్ పాల వాహనం డైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వెంకన్న తన మేనల్లుడు శ్రీకాంత్ నిర్వహిస్తున్న మిల్క్ సెంటర్ వద్దకు వచ్చాడు. అక్కడే రాకేష్, శ్రీకాంత్ మిత్రుడు నకిరేల్కు చెందిన పుట్ట కిరణ్ ఉన్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో వెంకన్న తన కుమారుడు రాకేష్కు ఇచ్చే జీతం విషయమై మేనల్లుడు శ్రీకాంత్తో గొడవపడ్డాడు. దీంతో వెంకన్న, శ్రీకాంత్ మద్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో రాకేష్ అడ్డుపడగా అతడిని శ్రీకాంత్ పాల ట్రేతో కొట్టబోయాడు. రాకేష్ తండ్రి వెంకన్న అడ్డురాగా పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో అతడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తల పగిలి వెంకన్న స్పృహ కోల్పోయాడు. గాయపడని వెంకన్న, రాకేష్ను 108 వాహనంలో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వెంకన్న మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాకేష్ను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత శ్రీకాంత్ పరారయ్యాడు. రాకేష్ సోమవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ వీరబాబు తెలిపారు. శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఫ మేనమామను కడతేర్చిన మేనల్లుడు ఫ మృతుడి కుమారుడికి గాయాలు ఫ నకిరేకల్ పట్టణంలో ఘటన -
ఉప సర్పంచ్ ఎన్నికను వ్యతిరేకిస్తూ..
రాజాపేట : మండలంలోని బొందుగుల ఉప సర్పంచ్ను మెజార్టీ వార్డు సభ్యులకు వ్యతిరేకంగా నియమించారని ఆరోపిస్తూ సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని పలువురు వార్డు సభ్యులు బహిష్కరించారు. ప్రత్యేకాధి కారి నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తుండగా.. ఉప సర్పంచ్తో చేయించొద్దని 9 మంది వార్డు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీ సులు వారిని నిలువరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్ అనితను వివరణ కోరగా.. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు మరో ఇద్దరు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించినట్లు తెలిపారు. 9మంది వార్డు సభ్యులు ప్రమాణస్వీకారానికి అంగీకరించలేదన్నారు. -
సమస్యలతో స్వాగతం
గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు సోమవారం అట్టహాసంగా జరిగాయి. అయితే కొన్ని గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేక పాఠశాలల ఆవరణలో, మరో చోట పశువుల ఆస్పత్రిలో నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నిడమనూరు : నిడమనూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పదేళ్లుగా పూర్తికాకపోవడంతో పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో సోమవారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో టెంట్ వేసి నిడమనూరు సర్పంచ్గా శేషరాజు సంధ్య ప్రమాణ స్వీకారం చేశారు. నిడమనూరు గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులను 2016లో ఉపాధి హామీ నిధులు రూ.12లక్షలతో మొదలు పెట్టారు. నిధులు సకాలంలో విడుదలకాకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో పక్కనే ఉన్న పశువుల ఆస్పత్రికి ల్యాబ్ కోసం నిర్మించిన రెండు గదులను పంచాయతీ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల ఎస్డీఎఫ్(రాష్ట్ర అభివృద్ధి నిధులతో) రూ.5లక్షలతో అసంపూర్తి పనులు చేపట్టారు. పనులు తుది దశకు చేరాయి. ప్లంబింగ్, విద్యుత్, టాయిలెట్, డ్రెయినేజీ పనులు మిగిలి ఉన్నాయి. వారం, పది రోజుల్లో పనులు పూర్తిచేసి, భవనాన్ని అందజేయనున్నట్లు పంచాయతీరాజ్ ఏఈ తెలిపారు. టెంట్ కింద బాధ్యతల స్వీకరణరాజాపేట : మండలంలోని కొత్త జాల గ్రామంలో పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డు ఎదుట టెంట్ కింద సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. 2018లో కొత్త జాల నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడగా.. గత సర్పంచ్ పాలకవర్గ సమావేశాల కోసం తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ బిల్లులు సరిగా రాక భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో నూతన సర్పంచ్ ఠాకూర్ లావణ్య, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తాత్కాలిక షెడ్డు ఎదుట టెంట్ కింద ప్రమాణ స్వీకారం చేశారు. మేళ్లచెరువు : మండలంలోని జగ్గుతండాలో గ్రామ పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామంలో టెంట్ కింద ఏర్పాటు చేసిన స్టేజీ పైన ప్రమాణ స్వీకారం చేశారు. టెంట్ కింద ప్రమాణ స్వీకారం చేస్తున్న జగ్గుతండా నూతన పాలకవర్గం -
ప్రమాణ స్వీకారం చేయకుండానే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా
గుండాల : ప్రమాణ స్వీకారం చేయకుండానే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేసిన ఘటన గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలో 10 వార్డులు ఉండగా.. సర్పంచ్ గద్వాల ఉపేందర్తో పాటు 9 మంది వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. 10వ వార్డు సభ్యుడైన రస్తాపురం చంద్రును శనివారం అధికారుల సమక్షంలో వార్డు సభ్యులంతా కలిసి ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. కానీ ప్రమాణ స్వీకారానికి చంద్రు హాజరుకాలేదు. అయితే చంద్రు వ్యక్తిగత కారణాలతో ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీఓ చండీరాణికి రాజీనామా పత్రం అందజేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. -
మద్యానికి దూరంగా ఐదేళ్లు
ఫ సర్పంచ్గా తొలి ప్రమాణం చేసిన గుర్జవానికుంటతండా సర్పంచ్ తుర్కపల్లి: తుర్కపల్లి మండలం గుర్జవానికుంటతండా నూతన సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన గుగులోతు దూప్సింగ్నాయక్ మద్యంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను సర్పంచ్గా ఉన్న ఐదేళ్ల కాలంలో మద్యం సేవించబోనని, మద్యం తాగే వారిని ప్రోత్సహించబోనని తొలి ప్రమాణం చేశారు. గ్రామ సర్పంచ్గా తన ప్రయాణాన్ని మద్యం విరమణతో శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. యువత మద్యానికి బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి గ్రామ ప్రజలు సహకరించాలని, మద్యపాన నిషేధం చేస్తామని గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. భార్య ఉప సర్పంచ్.. భర్త వార్డు సభ్యుడిగా..మర్రిగూడ : మండలంలోని రాజాపేటతండాలో 8 వార్డులు ఉండగా.. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి కొర్ర సునీత, 3వ వార్డు నుంచి ఆమె భర్త కొర్ర శంకర్ విజయం సాధించారు. మిగతా వార్డు సభ్యుల మద్దతుతో కొర్ర సునీత ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. సోమవారం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ కొడాల వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ కొర్ర సునీత, వార్డు సభ్యులుగా సునీత భర్త కొర్ర శంకర్తో పాటు మిగతా వారు ప్రమాణ స్వీకారం చేశారు. వార్డు సభ్యులుగా దంపతుల ప్రమాణ స్వీకారంఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా భార్యాభర్తలు మూడావత్ తనీష్, మూడావత్ స్రవంతి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులుగా 8వ వార్డు నుంచి మూడావత్ తనీష్, 9వ వార్డు నుంచి ఆయన భార్య మూడావత్ స్రవంతి పోటీ చేసి గెలుపొందారు. కాగా తనీష్ ఆటో డ్రైవర్గా, ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. స్రవంతి మెడికల్ నడుపుతూ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతోంది. నా వేతనాన్ని గ్రామ అవసరాలకు వినియోగిస్తాచౌటుప్పల్ : ప్రతి నెల తనకు వచ్చే వేతనాన్ని ఐదేళ్ల పాటు గ్రామ అవసరాలకు వినియోగిస్తానని చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామ నూతన సర్పంచ్ సమిరెడ్డి భారతమ్మ తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమెను గ్రామస్తులు అభినందించారు. పాలకవర్గాలు నిస్వార్థంగా పనిచేయాలి చిట్యాల : గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికై న పాలకవర్గ సభ్యులు నిస్వార్థంగా పనిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఓటర్లలో చేయి చాపుడు.. నోరు తెరుచుడు ఉండొద్దని అప్పుడే నిజాయతీ గల ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారని అన్నారు. రాజకీయాలు, ఎన్నికలు డబ్బుమయంగా మారాయని ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా కోట్లాది రూపాయలను పోటాపోటీగా అభ్యర్థులు ఖర్చు చేశారని చెప్పారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలని ఎన్నికల అనంతరం గ్రామాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ మనోహర్, పంచాయతీ కార్యదర్శి అరుణ్కుమార్, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుత్తా వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సేవే పరమావధిగా..
గ్రామ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా. గ్రామంలోని నా సొంత స్థలంలో నా సతీమణి గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం ఫంక్షన్హాల్ నిర్మిస్తా. లైబ్రరీ, పాఠశాలకు అదనపు తరగతి గదులను నిర్మించేలా కృషిచేస్తా. డ్రెయినేజీ వ్యవస్థను సరిచేసి, గ్రామంలో స్వచ్ఛత, పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తా. – గుంటకండ్ల రామచంద్రారెడ్డి తిరుమలగిరి (తుంగతుర్తి) : ఆ ఊళ్లో ఎవరికై నా కష్టమొస్తే నేనున్నానంటూ ముందుకొస్తారు. రైతుగా, ఉద్యోగిగా సేవలు అందించిన ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మరిన్ని సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ఆయనే 95 ఏళ్ల వయస్సులో నాగారం సర్పంచ్గా ఎన్నికై న గుంటకండ్ల రామచంద్రారెడ్డి. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. సమస్యల పరిష్కారానికి కృషి.. గుంటకండ్ల లచ్చిరెడ్డి–రామక్క దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమారుడు పిచ్చిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు, అదే గ్రామానికి సర్పంచ్గా 20 ఏళ్లు సేవలందించారు. రెండో కుమారుడైన రామచంద్రారెడ్డి 1930లో జన్మించారు. రామచంద్రారెడ్డి ఉపాధ్యాయుడిగా.. ఆ తర్వాత పట్వారీగా పనిచేశారు. గ్రామంలో ఉంటూ రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ వచ్చారు. ఎస్సీలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. బీసీలు ఇళ్లు నిర్మించుకోవడానికి కొంత ఆర్థికసాయం చేశారు. గ్రామస్తుల సహకారంతో పీహెచ్సీ కోసం భూమి కొనుగోలు చేసి ఇచ్చారు. విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించారు. బ్యాంకు ఏర్పాటుకు సైతం కృషి చేశారు. పెద్దాయనగా, బాపుగా పిలుచుకునే ఆయన ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికై మరిన్ని సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ఫ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఫ 95 ఏళ్ల వయస్సులో నాగారం సర్పంచ్గా బాధ్యతల స్వీకరణ -
‘ఒక్క ఓటుతో ఓడినా.. సర్పంచ్ నేనే’
ఫ చిన్ననారాయణపురంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి నార్కట్పల్లి: మండల పరిధిలోని చిన్ననారాయణపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ రోజు కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మెరుగు అనితకు, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనితకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనిత గెలుపొందినట్లు ప్రకటించారు. కాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి రీకౌంటింగ్ నిర్వహించగా.. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెరుగు అనిత ఒక ఓటుతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిపై గెలిచినట్లు ధ్రువీకరణ చేశారు. అయితే సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో ఒక్క ఓటుతో ఓడిపోయినా.. సర్పంచ్ నేనే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఉమేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను తొలగించారు. కాగా గ్రామ పంచాయతీలో 8 వార్డులకు గాను ఐదు వార్డులు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. ముగ్గురు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉప సర్పంచ్, బీఆర్ఎస్ బలపర్చిన వార్డు సభ్యులు హాజరు కాలేదు. దీంతో కేవలం సర్పంచ్తోపాటు ముగ్గురు కాంగ్రెస్ వార్డు సభ్యులతో మాత్రమే ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. -
పల్లె పాలన పగ్గాలు
సర్పంచ్ల చేతుల్లోకిసాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలకవర్గాలతో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం జరిగిన మొదటి సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్లు.. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల్లో పండుగ వాతావరణం నెలకొంది. పాలకవర్గాలను సత్కరించిన ప్రజాప్రతినిధులు భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు పంచాయతీల్లో పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సైదాపురంతో పాటు నియోజకవర్గంలో తన మద్దతుదారులు గెలిచిన వివిధ గ్రామాల్లో ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. సర్పంచ్లను సీట్లలో కూర్చోబెట్టి శాలువాలతో సన్మానించారు. భువనగిరి నియోజకవర్గంలో వలిగొండ, భూదాన్పోచంపల్లి, బీబీనగర్, భువనగిరి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంస్థాన్నారాయణపురం పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి వలిగొండ మండలం నెమలికాల్వతో పాటు పలు గ్రామాల్లో పాల్గొనగా, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆత్మకూర్(ఎం) పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పల్లెల్లో కోలాహలం నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పండుగ వాతావరణంలో బాధ్యతలు స్వీకరించారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కొందరు సర్పంచ్లు భోజనాలు ఏర్పాటు చేశారు. మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. పాలకవర్గ సభ్యులను ఆయా పార్టీల నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సన్మానించడంతో పల్లెల్లో కోలాహలం నెలకొంది.పంచాయతీల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు ఫ పండుగ వాతావరణంలో సర్పంచ్లు, వార్డుసభ్యుల ప్రమాణస్వీకారం ఫ హాజరైన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రశాంతంగా ప్రమాణస్వీకారోత్సవం జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల ప్రమాణస్వీకారోత్సవం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మూడు గ్రామాల్లో ఒక్కో వార్డుకు ఎన్నికలు జరగలేదు. గుండాల మండలం బండకొత్తపల్లి ఉపసర్పంచ్ తన పదవికి రాజీనామా చేస్తూ లిఖితపూర్వకంగా ఎంపీడీఓకు అందజేశారు. రాజీనామా విషయం కలెక్టర్ పరిశీలనలో ఉంది. ఒకసారి ఎన్నుకున్న ఉప సర్పంచ్ను వార్డు సభ్యులు వద్దనుకుంటే మార్చలేం. నిబంధన ప్రకారం రెండేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టి మార్చవచ్చు. –విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి -
హెచ్పీవీతో క్యాన్సర్కు చెక్
భువనగిరి : మహిళలను ఎక్కువగా వేధిస్తున్న గర్భాశయ క్యాన్సర్కు ఆదిలోనే చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 9 నుంచి 14 ఏళ్ల వయసున్న హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమ వైరస్) టీకా ఇచ్చేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.చాలామంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందుతున్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. చిన్నతనంలోనే హెచ్పీవీ టీకా వేయడం వల్ల ప్రాణాంతక వ్యాధిని ప్రారంభంలోనే అదుపు చేయవచ్చని వైద్యాధికారులు అంటున్నారు. నేడు తొలి విడత శిక్షణ హెచ్పీవీ టీకా కార్యక్రమం కోసం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వైద్యులు, ఫార్మసిస్టులు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ఉంటారు. మంగళవారం (నేడు) డాక్టర్లు, ఫార్మసిస్టులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఉంటుంది. అదే విధంగా హెచ్పీవీ టీకాపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ముగిసిన అనంతరం కిశోర బాలికలను గుర్తించడానికి సర్వే చేపట్టనున్నారు. ప్రస్తుతం జిల్లాలో గర్భాశయ క్యాన్సర్ బాధితులు 151 మంది ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.ఫ 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకా ఫ ప్రణాళిక సిద్ధం చేసిన వైద్యారోగ్య శాఖ ఫ నేడు వైద్యులు, ఫార్మసిస్టులకు శిక్షణ ఫ తల్లిదండ్రులకు అవగాహన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హెచ్పీవీ టీకా ధర రూ.200లుగా నిర్ణయించారు. ఇప్పటికే సర్వైకల్ వ్యాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. దీంతో వ్యాక్సిన్ను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు ఒకేసారి క్యాచ్ ఆఫ్ టీకా ఇవ్వనున్నారు. టీకా ఇచ్చిన రోజు పాఠశాలకు రాని బాలికలకు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూళ్లలోని బాలికలకు టీకా ఇవ్వనున్నారు. అర్హులైన బాలికలను గుర్తించేందుకు త్వరలో సర్వే చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందు కోసం పాఠశాలలనే వేదికగా చేసుకోనున్నారు. గుర్తించిన బాలికలకు ఏఎన్ఎంలు టీకా ఇవ్వనున్నారు. -
యఖలాస్ఖాన్పేట తండాలో..
నడిగూడెం : మండలంలోని యఖలాస్ఖాన్పేట తండా రెండేళ్ల కిందట నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ధరావత్ వరలక్ష్మి ఎన్నికయ్యారు. సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారులు అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో టెంట్ కింద నిర్వహించారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేయగా.. పనులు చేపట్టారు. సంబంధిత అధికారులు స్పందించి పంచాయతీ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం రైల్వే సిబ్బంది గుర్తించారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి చేతిపై శ్రీఐ లవ్ యూ రాజ్, వెంకటేష్, లోకేష్శ్రీ అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని, రెండు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని పేర్కొన్నారు. తెలుపు, నీలి రంగు నిలువు గీతల షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 70189, 87126 70151 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. -
శారదాదేవి జీవితం ఆదర్శం
ఆలేరు: పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయంలో సోమవారం శ్రీశారదాదేవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈవేడుకలకు హైదరాబాద్ శ్రీరామకృష్ణ మఠం పూజ్య స్వామి తత్పదానందజీ మహరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కుటుంబ విలువలకు, ఆదర్శ గృహిణికి శారదాదేవి జీవితమే ఆదర్శమన్నారు. ఈకార్యక్రమంలో విద్యాలయం కరస్పాండెంట్ బండి రాజుల శంకర్, రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ కో–ఆర్డినేటర్ సూర్యప్రకాష్,పాఠశాల ఆచార్యులు పాల్గొన్నారు. మొర ఆలకించి.. అర్జీలు స్వీకరించి భువనగిరిటౌన్ : సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ గ్రామాల నుంచి ప్రజలు సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. ప్రజావాణిలో అధికారులకు వినతులు అందజేసి పరిష్కారానికి వేడుకున్నారు. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు అర్జీలను స్వీకరించారు. 38 అర్జీలు రాగా అందులో రెవెన్యూకు సంబంధించివి 29 ఉన్నాయి. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్లు ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లారీలు పంపకపోతే కేసులు నమోదు : కలెక్టర్ వలిగొండ : కొనుగోలు కేంద్రాలకు సమయానుకూలంగా, సరిపడా లారీలు పంపకపోతే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం ఆయన వలిగొండలోని వ్యవసాయ మార్కెట్, సంగెం, సుంకిశాలలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఇప్పటి వరకు సేకరించింది, కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ అయిందా, లేదా ఆరా తీశారు. లారీలు సమయానుకూలంగా రావడం లేదని కేంద్రాల నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే కాంట్రాక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. జాప్యం చేయకుండా సరిపడా లారీలు పంపాలని, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమ అయ్యేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. నేడు భువనగిరికి కవిత.. భువనగిరి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం భువనగిరికి రానున్నారు. మొదటి రోజు ఉదయం బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శిస్తారు. ఉదయం 11.30 గంటలకు రాయగిరిలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం బస్వాపురం రిజర్వాయర్, ఆలేరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సందర్శిస్తారు. అనంతరం ఆలేరు బ్రిడ్జిని పరిశీలించి, మోటకొండూరు మండలంలో ఇళ్ల పట్టాలు రాని బాధితులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 7గంటలకు ఆఫ్రికాలో ఉగ్రవాద చెరలో ఉన్న భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్ల మాస ప్రవీణ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. వెంకటస్వామికి నివాళి భువనగిరిటౌన్ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రటపటానికి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ విజయ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఓటరు మ్యాపింగ్పై సమీక్ష భువనగిరిటౌన్ : ఓటర్ల మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధి కారి సుదర్శన్రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఈఆర్ఓలు, చారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈఆర్ఓలు పూర్తి బాధ్యతను తీసుకొని ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. -
గుట్టలో.. తిరుమల తరహాలో
● సూర్యప్రభ వాహన సేవను ప్రతి ఆదివారం రథ సప్తమి రోజున ఉదయం 7 గంటల నుంచి 7.30 వరకు నిర్వహిస్తారు. భక్తులు రూ.1000 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సేవలో పాల్గొనే భక్తులకు ఒక శెల్లా, ఒక కణుమ అందజేస్తారు. ● చంద్రప్రభ వాహన సేవను ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం వేళ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే దంపతులు రూ.1000 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీరికి ఒక శెల్లా, ఒక కణుమ ఇస్తారు. సూర్యప్రభ వాహనం ఫ వైధిక కమిటీ, దేవస్థానం ఆధ్వర్యంలో సన్నాహాలు యాదగిరిగుట్ట : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి తరహాలో నూతన సేవలు అందుబాటులోకి రానున్నాయి. 30వ తేదీన వైకుంఠ ఏకాదశి రోజునుంచి సహస్ర దీపాలంకరణ, తులాభారం, తోమాల సేవ.. ఫిబ్రవరి 1నుంచి సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను ప్రారంభించేందుకు దేవస్థానం ఈఓ వెంకట్రావ్ ఆధ్వర్యంలో వైదిక కమిటీ, దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నూతన సేవల వేళలు.. సహస్ర దీపాలంకార సేవను ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు, ఏకాదశి రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే భక్తులకు రూ.500 టికెట్ నిర్ణయించారు. ఈ టిక్కెట్పై దంపతులకు ప్రవేశంతో పాటు రెండు 100 గ్రాముల (ఒక్కొకరికి ఒక్కటి చొప్పున) లడ్డూలు అందజేస్తారు. తోమాల సేవ ప్రతి బుధవారం చేపడుతారు. రూ.500 టికెట్ కొనుగోలు చేసిన దంపతులకు అనుమతి ఉంటుంది. ఉదయం 6.15 నుంచి 6.45 గంటల వరకు తోమాల సేవ నిర్వహిస్తారు. తిరుమల తిరుపతిలో భక్తులు తమ బరువును బ ట్టి ఇచ్చే తులాభారం సేవను ప్రతి రోజూ దర్శన సమయాల్లో నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. తులాభారం సేవలో పాల్గొనే భక్తులకు తూకం కొలిచేందుకు నాణేలు, బెల్లం దేవస్థానమే అందుబాటులో ఉంచుతుంది. తూకానికి సమానమైన విలువను చెల్లించడంతో పాటు తమకు ఇష్టమైన వస్తువులను కూడా తీసుకువచ్చేందుకు వీలుకల్పించారు. తులభారం సేవలో పాల్గొనే భక్తులకు ఒక శెల్లా, ఒక కణుమ అందజేస్తారు. -
మొదటి రోజే హామీల అమలుకు శ్రీకారం..
రామన్నపేట : బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునే ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది.. రామన్నపేట మండలంలోని సిరిపురం సర్పంచ్ అంబటి ఉపేంద్రమ్మ. గ్రామంలోని వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా రెండు రోజు లకు ఒకసారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఉచితంగా ఫ్యూరిఫైడ్ నీళ్లు అందజేస్తానని ఉపేంద్రమ్మ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ మేరకు సోమవారం సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంచినీటిని పట్టుకునేందుకు క్యాన్లు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ ప్లాంట్ ద్వారా ఉచితంగా నీరందించేలా త్వరలో కార్యాచరణ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడుదుడ్ల అనూష, బీజేపీ రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ఏళ్ల సంజీవరెడ్డి, పున్న వెంకటేశం, కూనూరు ముత్తయ్య, బండ శ్రీనివాస్రెడ్డి, కట్ట అంజిరెడ్డి, సతీష్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థులు తైక్వాండో పోటీల్లో రాణించాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు తైక్వాండో పోటీల్లో రాణించాలని నల్లగొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎండీ. అక్బర్ అలీ అన్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విన్నర్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో నిర్వహించిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని ప్ర భుత్వ పాఠశాలల్లో తైక్వాండో లాంటి గుర్తింపు పొందిన క్రీడలను నేర్పించడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. మునుగోడు గురుకుల బాలికల స్కూల్కు చెందిన 30 మంది విద్యార్థులు కలర్ బెల్ట్లు పొందారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ చీఫ్ ఎగ్జామినర్ ఎండీ. యూనుస్ కమాల్, మాస్టర్ అంబటి ప్రణీత్, నసీరుద్దీన్, సరయు, రణధీర్ పాల్గొన్నారు. చెర్వుగట్టు గర్భగుడికి టేకు తలుపులు బహూకరణనార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయ గర్భగుడికి స్థానిక వ్యాపారి రంగా సీతయ్య, ధనమ్మ దంపతులు రూ.2 లక్షలతో టేకు తలుపులు చేయించారు. సోమవారం సీతయ్య దంపతులతో పాటు వారి కుమారులు, కోడళ్లు రామలింగయ్య, శోభ, రమేష్, శైలజ, వెంకటేశ్వర్లు, కవిత, కుమార్తె, అల్లుడు గట్టు రాధిక, గంగాధర్, మనుమలు, మనుమరాండ్లు టేకు తలుపులకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానానికి అందజేశారు. వారికి ప్రధాన పూజారి పోతులపాటి రామలింగేశ్వశర్మ స్వాగతం పలికి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో మామిళ్లపల్లి సురేష్, శ్రీకాంత్శర్మ, ఉప్పల సతీష్శర్మ, నాగయ్యశర్మ, ఆలయ ఉద్యోగులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్ అంటే ప్రజలకు ఒక భరోసా
యాదగిరిగుట్ట: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటకు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో.. అదే విధంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో టీటీడీ లోకల్ అడ్వైజరీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పేద మహిళలకు 1,000 చీరలు, మున్సిపల్ సిబ్బందికి దుప్పట్లు, విద్యార్థులకు నోట్ బుక్స్, పేదలకు 10 మందికి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాబోయేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి పేరుతో చంద్రబాబు నాయుడు అరాచక పాలన చేస్తున్నారని ఆరోపించారు. జన సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముందుకు సాగారన్నారు. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చాలా మార్పులు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ అభిమానులు వెంకట్రెడ్డి, రాజారెడ్డి, నందనం రాము, జీవన్గౌడ్, రాజాశేఖర్రెడ్డి, చింతకింది కృష్ణ, వడ్లోజు ఉమేష్, వడ్లోజు శ్రీధర్, కల్వకొలను సతీష్ రాజ్, ఎంఎం కృష్ణ, చుక్కల ఉపేందర్, పల్లెర్ల గోపి, పద్మనాభ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల యాదగిరిగుట్టలో ఘనంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు -
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
ఆలేరు: ఆలేరు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 72వ పురుషుల జిల్లా కబడ్డీ సెలక్షన్స్ పూర్తయ్యాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి క్రీడాకారుల పాల్గొన్నారు. వివిధ రౌండ్లలో ప్రతిభను కనబరిచిన 14 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంటుందని కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య తె లిపారు. క్రీడాకారులకు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర మహేందర్ యాదవ్ జెర్సీలు అందజేశారు. మాజీ క్రికెటర్ ఖాదర్భాషా, గాయకుడు సిమ్మి సిద్ధులు,రెఫరీ మరాఠీ లింగస్వామి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ పూల చంద్రకుమార్,ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
కొత్త సర్పంచ్లకు సవాళ్లు!
సాక్షి, యాదాద్రి : పల్లెల్లో నెలకొన్న సమస్యలు కొత్త పాలకవర్గాలకు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. దీంతో పంచాయతీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త సర్పంచ్లు వాటిని ఎలా పరిష్కరిస్తారోనని సర్వత్రా చర్చ సాగుతోంది. జిల్లాలో 427 పంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న పాలక వర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులొస్తేనే..నూతన పాలక వర్గాల ఆశలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఉన్నాయి. పంచాయతీలకు రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, అంతర్గత డెయినేజీలు తదితర పనులు అటకెక్కాయి. వీటిని పూర్తి చేయడంతో పాటు సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, పల్లె ప్రకృతి వనాలు, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, బోర్ల నిర్వహణ, మోటార్ల మరమ్మతుల ఖర్చులు.. ఇప్పుడు కొత్త సర్పంచ్లకు భారంగా మారనున్నాయి. రూ.120 కోట్లకు పైగా నిలిచిన గ్రాంట్స్ 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2024 జనవరితో పాలకమండళ్ల పదవీకాలం ముగిసింది. దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. రెండేళ్ల లోపు పాలకవర్గాల ఎన్నికల జరగకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు రావు. దీంతో జనవరిలోపే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసింది. 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ, నాలుగు రూపాయల గ్రాంట్ వంటి నిధులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.120 కోట్లకుపైగా రెండేళ్లుగా నిధులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో 15 నెలలు, ఈ ప్రభుత్వం 20 నెలలుగా నిధులు లేవు. కేవలం ప్రజల నుంచి పన్నుల వసూలుపైనే ఆధారపడి ఇంతకాల నడిచాయి. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ డ్రైవర్, స్వీపర్, వాటర్మన్లు ఉంటారు. గ్రామ జనాభాను బట్టి నలుగురు నుంచి 8 మంది వరకు సిబ్బంది ఉంటారు. సిబ్బందికి రూ.6 వేల నుంచి రూ.8.500 వరకు వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ పెండింగ్లోనే పడ్డాయి. పూర్తి చేసిన పనులకు బిల్లులు పెండింగ్పంచాయతీల్లో కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. పాత సర్పంచ్లు చేసిన పనులకు సంబంధించి కొందరికి రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో పాటు పూర్తయిన పనులకు రూ.90 కోట్లకు చెక్లు సిద్ధంగా ఉన్నాయి. నిధులు నిలిచిపోవడంతో ఒక్కో కార్యదర్శికి రూ.2 లక్షల వరకు ప్రభుత్వం బాకీ పడి ఉంది. చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు పలు చోట్ల మరమ్మతులు లేక, డీజిల్కు డబ్బులు లేక మూలన పడ్డాయి. వీటి మరమ్మతులు ఇప్పుడు నూతన పాలకవర్గాల ముందున్న ప్రధాన బాధ్యతగా కనిపిస్తోంది. పంచాయతీ భవనాలు రెడీగ్రామ పంచాయతీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త సర్పంచ్లు తమ సొంత ఖర్చుతో గ్రామ పంచాయతీ భవనాలను అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కూర్చునేలా ప్రత్యేక ఫర్నిచర్ తెప్పిస్తున్నారు. గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారం సోమవారం జరుగుతుంది. ప్రతేక అధికారులు, సర్పంచ్లు, వార్డు సభ్యుల చేత తొలి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా రిజిస్టర్లో సంతకం చేయడం ద్వారా బాధ్యతలు స్వీకరించినట్లు అవుతుంది. – దేప విష్ణువర్ధన్రెడ్డి, డీపీఓపాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రంగులు వేసి ముస్తాబు చేసిన చీకటిమామిడి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం పంచాయతీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే రెండేళ్లుగా నిలిచిన నిధులు అభివృద్ధికి నోచని పల్లెలు నేడు కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు ఆర్థిక సంఘం నిధులపైనే సర్పంచ్ల ఆశలు -
కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ
రాజాపేట : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కరాటే శిక్షణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలం.. మూడు నెలలుజిల్లాలో పీఎంశ్రీ కింద 26 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 3,900 వరకు మంది ఉన్నారు. కరాటేలో శిక్షణ ఇవ్వడానికి ఆయా పాఠశాలలకు ఏడాదికి రూ.30 వేల చొప్పున చెల్లించేవారు. మూడు నెలల కాలంలో 72 తరగతులు నిర్వహించి కరాటేలో ప్రత్యేక శిక్షణ పొందిన కోచ్లతో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్లో మెళకువలు నేర్పించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో పాఠశాలకు రూ.15వేలు చెల్లించారు. మూడు నెలల కాలంలో 36 తరగతులు నిర్వహించి శిక్షణ ఇవాల్సి ఉంటుంది. కరాటే నేర్చుకోవడంతో ధైర్యం పెరిగింది కరాటే నేర్చుకోవడం వల్ల ధైర్యం పెరిగింది. ఎవరైనా మాపై దాడిచేస్తే ఎలా ప్రతిఘటించాలో మెళకువలు నేర్పిస్తున్నారు. ఆత్మరక్షణకు కరాటే, సెల్ఫ్డిఫెన్స్ విద్యతలు ఎంతో ఉపయోగపడుతాయని భావిస్తున్నాం. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. – కొన్నె రిషిత, పదో తరగతి, రాజాపేట తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అవసరం విద్యార్థుల చదువుతో పాటు కరాటేలో శిక్షణ పొందేలా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో బాలికలపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అకస్మాత్తుగా ఎదురయ్యూ ఘటనలను ఎదుర్కొనేందుకు కరాటే దోహదపడుతుంది. – దార్శనం క్రాంతి, కరాటే శిక్షకుడు పతకాలు కైవసం కరాటేలో శిక్షణ పొందిన బాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీనగర్ స్టేడియంలో కరాటేతో పాటు కుంఫూ, తైక్వాండో జాతీయస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున యాదాద్రి జిల్లా నుంచి రాజాపేట, చల్లూరు, దూదివెంకటాపురం ప్రభుత్వ ఉన్నత, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. ● చల్లూరు పాఠశాలకు చెందిన ముగ్గురు, దూదివెంకటాపురం ఐదుగురు, రాజాపేట మాంటిసోరి పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రౌన్ పథకాలను కై వసం చేసుకున్నారు. ● హైదరాబాద్లోని రాణిరుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, తైక్వాండో పోటీల్లో రాజాపేట బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు 6నుంచి 10 వ తరగతి విద్యార్థినులకు శిక్షణ ప్రత్యేకంగా కోచ్ల నియామకం రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనరుస్తున్న రాజాపేట విద్యార్థినులు -
గాంధీ పేరంటే ఎందుకంత వణుకు
భువనగిరిటౌన్ : గాంధీ పేరు వింటేనే బీజేపీ నేతలకు వణుకు పుడుతుందని డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఐలయ్య అన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం పేరు తొలగించడాన్ని నిరిసిస్తూ ఆదివారం భువనగిరిలోని గాంధీపార్కు ఎదుట చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ పేర్లను ఎక్కడా వినిపించకుండా, కనిపించకుండా బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తుందని, అందులో భాగంగా ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పథకాల్లో గాంధీ పేరును తొలగిస్తారేమోగానీ, ప్రజల హృదయాల్లో మహాత్మాగాంధీ ఎప్పుడూ ఉంటారని పేర్కొన్నారు. నాటి యూపీ సర్కార్ మహాత్మీగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం తేగా.. మోదీ సర్కార్ పథకానికి తూట్లు పొడుస్తుందన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్జీగా మార్చడం దారుణమన్నారు. బండ్రు శోభారాణి మాట్లాడుతూ.. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు గాంధీ విగ్రాహానికి పూలమలలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బుడిగే పెంటయ్య, బెండె లాల్రాజు, బట్టు రామచంద్రయ్య, షరీఫ్, రాచమల్ల రమేష్, కృష్ణారెడ్డి, బెండె శ్రీకాంత్, లయీఖ్అహ్మద్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే పేర్ల మార్పు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
రాజీమార్గంతోనే ప్రశాంత జీవనం
పరిష్కారమైన కేసుల్లో కొన్ని.. ● జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగులో ఉన్న క్రిమినల్ కేసును రాజీ చేసుకున్న ఉభయ కక్షిదారులను జిల్లా ప్రధాన జడ్జి అభినందించి వారికి అవార్డు కాపీలు అందజేశారు. ● ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగ్లో ఉన్న దంపతుల విడాకుల కేసును రాజీద్వారా పరిష్కరించారు. దంపతుల మధ్య సయోధ్య కుదిరించి ఇరువురితో పూలదండలు మార్పించారు. వారికి మిఠాయిలు పంపిణీ చేసి అభినందించారు. ● భువనగిరి మండలంలోని ఓ గ్రామంలో ఒకే ఘటనలో 15 మందికిపై కేసు నమోదు కాగా, ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు.భువనగిరిటౌన్ : క్షణికావేశంతో నేరాలకు పాల్పడి కేసుల పాలైన వారు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనం గడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి జయరాజు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను ప్రారంభించి మాట్లాడారు. చిన్నచిన్న కారణాలతో దారితీసిన వివాదాలను పట్టింపు లేకుండా పరిష్కరించుకోవాలన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి ముక్తిదా, పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి మిలింద్కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత మాట్లాడుతూ క్రిమినల్ కేసుల్లో న్యాయవాదులను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికస్థోమత లేని కక్షిదారులకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థ సహకారం అందజేస్తుందన్నారు. 2,655 కేసులు పరిష్కారంలోక్ ఆదాలత్లో 2,655 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించబడ్డాయి. ఇందులో సివిల్ 11, క్రిమినల్ 2,578, పీఎల్సీ 44 కేసులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జ్ ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ జి.స్వాతి, భువనగిరి న్యాయవాదుల సంఘం కార్యదర్శి బొల్లేపల్లి కుమార్, పీపీ పైల లింగారెడ్డి, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ భూపాల్రెడ్డి, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశం, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజశేఖర్, నాగరాజు, సాయి శ్రీనివాస్, సరిత, న్యాయవాదు లు పాల్గొన్నారు ప్రధాన న్యాయమూర్తి జయరాజు -
జోగుళాంబ అమ్మవారికి పోచంపల్లి వస్త్రాలు
భూదాన్పోచంపల్లి : అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారికి, శ్రీ బాల బ్రహ్మేశ్వరస్వామి దేవతామూర్తులకు శ్రీ పుండరీక భక్తసేవా సమాజం ఆధ్వర్యంలో పోచంపల్లి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. వారం రోజుల పాటు నియమ నిష్టలతో మగ్గంపై తయారు చేసిన పట్టు వస్త్రాలు, సారేతో ఆదివారం శ్రీ పుండరీక భక్త సేవ సమాజం ధర్మకర్తలు ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో శ్రీ పుండరీక భక్త సేవా సమాజం అధ్యక్షుడు చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు బిట్ల చంద్రశేఖర్, సభ్యులు ఆడెపు ఎల్లమ్మ, ఇంజమూరి జానకిరాములు, గర్థాస్ నర్సింహ, రచ్చ అంజయ్య, పాండాల మహేశ్వర్, యాదగిరి, సత్యనారాయణ, మధు, నర్సింహ, వనజ, సిద్దమ్మ, భాగ్యలక్ష్మి, లలిత, సువర్ణ, జ్యోతి, గీత, వసంత, అన్నపూర్ణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సల్లోనిగూడెం, వంకమామిడిలో విషాదఛాయలు
భూదాన్పోచంపల్లి : మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట సమీపంలో ఔటర్ రింగ్రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భూదాన్పోచంపల్లి మండలం సల్లోనిగూడెం, వంకమామిడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. సల్లోనిగూడేనికి చెందిన సామ లింగారెడ్డి బోరు బండిపై అదే గ్రామానికి చెందిన అంతటి శ్రీనివాస్గౌడ్(50), వంకమామిడి గ్రామానికి చెందిన మచ్చ సురేశ్(36) డ్రైవర్ కమ్ డ్రిల్లర్గా పనిచేస్తున్నారు. శనివారం బోరు బండిపై కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. శామీర్పేట సమీపంలో ఔటర్ రింగ్రోడ్డు పైన కొద్ది దూరం రాగానే బోరు బండి కింద శబ్దం వస్తుండగా బండిని రోడ్డు పక్కన ఆపారు. కిందికి దిగి టార్చిలైట్ వేసుకొని చెక్ చేస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బోరు బండిని ఢీకొట్టడంతో మచ్చ సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంతటి శ్రీని వాస్గౌడ్ రెండు కాళ్లు విరిగిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వారిద్దరి మృతదేహాలను మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు అంతటి శ్రీనివాస్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చిన తర్వాత మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. వంకమామిడి గ్రామానికి చెందిన మృతుడు మచ్చ సురేశ్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి సురేశ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బోరు బండి యజమాని సామ లింగారెడ్డి మృతుల కుటుంబాలకు రూ.18లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు పెద్దమనుషుల సమక్షంలో అంగీకారం తెలిపాడు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయా గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి -
బాల్య వివాహాలను అడ్డుకోవాలి
భువనగిరిటౌన్ : బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. జయ రాజు అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో వంద రోజుల బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి అందుకు చట్టపరంగా తీసుకునే చర్యల గురించి చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, పోఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ,, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్, ప్రధాన జూని యర్ సివిల్ జడ్జి జి. స్వాతి, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశం, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజశేఖర్, నాగరాజు సాయి శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలి
● జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీరామగిరి(నల్లగొండ) : కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమియత్ ఉలేమాయే హింద్ కోరిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన హామీని నెరవేర్చాలన్నారు. భారతదేశంలో ముస్లింలపై వివక్ష, మైనారిటీలను ప్రజల నుంచి వేరుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో జమియత్ ఉలేమాయే హింద్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ. హఫీజ్ఖాన్, జనరల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్, మౌలానా యాసిర్, అబ్దుల్ రెహమాన్, జియాఉద్దీన్, హఫీజ్ ఫుర్ఖాన్, సమీ, హఫీజ్ శంషుద్దీన్, హఫీజ్ అయూబ్ పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రొటోకాల్ దర్శనాలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రొటోకాల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. దాతలకు, ఆర్మీ అధికారులకు కల్పిస్తున్న ప్రొటోకాల్ దర్శన సదుపాయాలు, దర్శనం సమయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దర్శనాల్లో సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అసౌకర్యం కలగకూడదని ఆదేశించారు. ప్రొటోకాల్ విభాగం సిబ్బంది పూర్తిస్థాయి బాధ్యతతో, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అన్ని దర్శనాలు నిబంధనల ప్రకారం ఉండాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా క్రమశిక్షణతో పని చేయాలన్నారు. అనంతరం వైదిక కమిటీ, వివిధ విభాగాల అధికారుల సమీక్షలో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే వైకుంఠద్వారం స్థలం వద్ద నృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానానికి సంబంధించిన అద్దెలు, లీజులు తదితర ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దేవస్థానం ప్రాంగణంలో ఎలక్ట్రికల్ వాహన చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ దోర్బాల భాస్కర్శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రచార్యులు, అధికారులు దయాకర్రెడ్డి, జి. రఘు, రాజన్బాబు, ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
పెన్షనర్లపై నిర్లక్ష్య వైఖరి సరికాదు
మిర్యాలగూడ అర్బన్: పెన్షనర్లపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ నల్లగొండ జిల్లా తృతీయ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాజ్యాగం ప్రకారం పాలకులు నడుచుకోవడం లేదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైతిక విలువలు పాటించడం లేదని, దీంతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. విద్యారంగాన్ని సంస్కరించి ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. ఉచిత పథకాల వలన ప్రయోజనం లేదని వాటి స్థానంలో ఉత్పాదక శక్తిని పెంచే పథకాలను ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్యను తీర్చాలని కోరారు. పెన్షనర్లకు 5 డీఏలు పెండింగ్లో పెట్టి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, రెండో పీఆర్సీని ప్రకటించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలపై పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతుల నారాయణరెడ్డి, పాలకుర్తి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు పాదూరి విద్యాసాగర్రెడ్డి, వి. బంగారయ్య, నూకల జగదీష్చంద్ర, అనుముల మధుసూదన్రెడ్డి, ఎం. జనార్దన్రెడ్డి, కడారి ప్రేమ్చంద్, వెంకటేశం, రాఫెల్, శ్యాంసుందర్, వాడపల్లి రమేష్, కృష్ణారెడ్డి, సత్తిరెడ్డి, ప్రకాశరావు, రామావతారం, శంకర్రెడ్డి, శ్రీనిసరెడ్డి, అంజిరెడ్డి, పులి కృష్ణమూర్తి, రమణారెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐలో నార్కట్పల్లివాసికి అంతర్జాతీయ గుర్తింపు
యాదాద్రి: నార్కట్పల్లి మండలం మాధవ యడవెల్లి గ్రామానికి చెందిన కందగట్ల జయచందర్రెడ్డి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జయచందర్రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన ఏఐ రంగలో చేస్తున్న కృషికి గాను 4 ప్రతిష్టాత్మక మార్కమ్ గోల్డ్ అవార్డులు, డావీ సిల్వర్ అవార్డులు పొందారు.గ్రామీణ ప్రజలు ఇంగ్లిష్ వైద్య నివేదికలు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన హెల్త్ నీమ్ అనే ఏఐ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ ప్లాట్ఫామ్ సంక్షిప్త వైద్య సమాచారాన్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. అంతేకాకుండా.. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, నాసా వ్యోమగాములు సభ్యులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈహెచ్కెఎన్ హారన్ సొసైటీలో జయచందర్రెడ్డికి సభ్యత్వం లభించడం విశేషం. తనకు వచ్చిన అవార్డులు, గుర్తింపును తన తల్లిదండ్రులు యాదవరెడ్డి-రజితలకు, సొంతూరికి అంకితమిస్తున్నట్లు జయచందర్రెడ్డి తెలిపారు. -
సరికొత్తగా సాగు.. దిగుబడులు బాగు
నడిగూడెం : గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో సాగు నీటి లభ్యత ఎక్కువగా పెరగడంతో ఎక్కువ శాతం రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. అయితే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. దీంతో నారుమడి అవసరం లేకుండా పంట కాలాన్ని తగ్గించడానికి వెదజల్లే పద్ధతిలో, డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నారు పోయడం, నీరు పెట్టడం, నాట్లు వేయించడం.. ఇవన్నీ పాత తరం వరి సాగు పద్ధతులు. రైతులు ఆధునిక వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు సాగుపై చేసే ఖర్చు పెరగడం, మరో వైపు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రమ్సీడర్ పద్ధతిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులకు తక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో నడిగూడెం మండల వ్యాప్తంగా దాదాపు 18,500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 శాతం డ్రమ్సీడర్, 70 శాతం వెదజల్లే పద్ధతిలోనే పంట సాగు చేపట్టారు. డ్రమ్సీడర్ను రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. డ్రమ్సీడర్తో విత్తనాలు వెదజల్లడంతో నిర్ధిష్టమైన అంతరంలో సాళ్లు వస్తాయి. డ్రమ్సీడర్ విధానంతో 20 రోజుల ముందే పంట చేతికి వస్తుంది. 3 నుంచి 4 బస్తాల దిగుబడి అదనంగా వస్తుంది. గతంలో వరి పంట సాగు చేయాలంటే కూలీల కొరతతో ఇబ్బందులు ఉండేవి. పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. దీంతో గత నాలుగైదు సంవత్సరాలుగా నాకున్న వ్యవసాయ భూమిలో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నాను. దీంతో పెట్టబడులు తగ్గడంతో పాటు దిగుబడి కూడా పెరుగుతోంది. – మొక్క శ్రీను, రైతు, సిరిపురం డ్రమ్సీడర్, వెదజల్లే పద్ధతులతో రైతులకు సాగు సులువు అవుతుంది. రైతులకు ఈ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. ఎకరానికి దాదాపు రూ.10 వేల వరకు ఖర్చు తగ్గుతుంది. దిగుబడి కూడా ఆశాజనకంగా వస్తుంది. ప్రతి రైతు కూడా డ్రమ్సీడర్, వెదజల్లే పద్దతుల్లో వరి సాగు చేపట్టాలి. – గోలి మల్సూర్, వ్యవసాయాధికారి, నడిగూడెం డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతులపై రైతుల్లో పెరుగుతున్న అవగాహన -
జాతీయ కథల పోటీల్లో శ్రీవర్ధన్ ప్రతిభ
రామగిరి(నల్లగొండ): హైదరాబాద్కు చెందిన బాల చెలిమి సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి బాలల కథల పోటీలో నల్లగొండకు చెందిన సాగర్ల శ్రీవర్ధన్ ఉత్తమ కథా పురస్కారం అందుకున్నాడు. ఈ కథల పోటీకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారి నుంచి 750 కథలు రాగా.. 16 కథలను ఉత్తమ కథలుగా ఎంపిక చేశారు. అందులో శ్రీవర్ధన్ రాసిన కథ ఎంపికై ంది. రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్, బాల చెలిమి సంస్థ అధ్యక్షుడు వేద కుమార్, బ్రెడ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ రావి శారద, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. రఘు తదితరుల చేతుల మీదుగా శ్రీవర్ధన్ ఉత్తమ కథా పురస్కారం అందుకున్నాడు. శ్రీవర్ధన్ను సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్, శ్రీవర్ధన్ తల్లిదండ్రులు డాక్టర్ సాగర్ల సత్తయ్య, ధనలక్ష్మి తదితరులు అభినందించారు. -
బాపట్ల టు లక్ష్మాపురం
● పొట్టకూటి కోసం కూలీల రాకరామన్నపేట : వలసలకు మారు పేరుగా నిలిచిన తెలంగాణ ప్రాంతం ప్రస్తుతం అనేక ప్రాంతాలకు చెందిన కూలీల ఉపాధికి కేంద్రబిందువుగా మారింది. భవన నిర్మాణం, హమాలీ వంటి అనేక రంగాలలో పని చేసేందుకు దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉపాధి నిమిత్తం తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారు. వ్యవసాయ పనుల సమయంలోనూ అనేక రాష్ట్రాలకు చెందిన వారు మన రాష్ట్రానికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఆదివారం ఏపీలోని బాపట్ల నుంచి కూలీలు రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి డీసీఎంలో వెళ్తూ మండలకేంద్రంలో అల్పాహారం నిమిత్తం ఆగడం సాక్షి కెమెరాకు చిక్కడం జరిగింది. -
56 ఏళ్ల అ‘పూర్వ’ సమ్మేళనం
హుజూర్నగర్ : హుజూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1969లో ఎస్ఎస్సీ మొదటి బ్యాచ్ చదివిన విద్యార్థులు 56 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయుడైన అర్వపల్లి రంగారావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముడుంబ జగన్నాథచార్యులు, వర్ర వెంకట్రెడ్డి, మూసం సత్యనారాయణ, కోట హరిప్రసాద్, కె. నాగేశ్వరరావు, వీర్లపల్లి రామారావు, ఓరుగంటి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలకు స్మార్ట్ టీవీలు అందజేత
యాదగిరిగుట్ట: టీటీఏ (తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండలంలోని 27 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు శుక్రవారం స్మార్ట్ టీవీలు అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీఏ చైర్మన్ మయూర్ బండారు మాట్లాడుతూ..గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో సేవా డేస్లో భాగంగా తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. అంతకుముందు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీఏ సేవా డేస్ కమిటీ అధ్యక్షుడు మలిపెద్ది నవీన్రెడ్డి, కో ఆర్డినేటర్ కంది విశ్వ, బీరం మధుకర్రెడ్డి, అడ్వయిజర్లు ద్వారాకాంతరెడ్డి, వెంకన్న, సురేష్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గణేష్ మాధవ్ వీరమనేని, ఇంటర్నేషనల్ సర్వీస్ డైరెక్టర్ దూదిపాల జ్యోతిరెడ్డి, విజయపాల్రెడ్డి, మెహన్రెడ్డి పట్వాడా, భరత్రెడ్డి, డీఎల్ఎన్రెడ్డి, ఎంఈఓ శరత్యామిని, తహసీల్దార్ గణేష్, ఎంపీడీవో నవీన్కుమార్, నాయకులు బీర్ల శంకర్, చీర శ్రీశైలం, ఎరుకల హేమేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యథావిధిగా ప్రజావాణి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఈనెల 22 నుంచి యథా విధిగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. 17న కోడ్ ముగిసినందున ప్రజావాణిని పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి, తమ సమస్యలపై కలెక్టరేట్ కు వచ్చి వినతిపత్రాలు అందజేయవచ్చన్నారు. సీఎంను కలిసిన ప్రభుత్వ విప్ యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలిశారు. శాలువాతో సీఎంను సత్కరించి, శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించినట్లు ఐలయ్య తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో 80శాతానికి పైగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంపై సీఎం అభినందించారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సీఎం సూచించారని ఐలయ్య తెలిపారు. అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. శ్రీస్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. 22న మాక్ ఎక్సర్సైజ్ భువనగిరిటౌన్ : వరదలు, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ఈనెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికారి సంస్థ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు శుక్రవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ హనుమంతరావు వారికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్ఓ జయమ్మ, ఆర్డీఓ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలు.. సృజనకు వేదికలువలిగొండ : విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడుతాయని డీఈఓ సత్యనారాయణ అన్నారు. వలిగొండలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 22,23 తేదీల్లో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధానోపాధ్యాయలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ వివిధ చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే ఈసారి గ్రామీణ ప్రాంతమైన వలిగొండలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ప్రదర్శనకు హాజరయ్యే చూడాలన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణ బాధ్యతలు చూడటానికి 14 కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశాంత్రెడ్డి, అధికారులు పాండు, రఘురాంరెడ్డి, ఎంఈఓలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
తమ నేతకు ఉప సర్పంచ్ పదవి రాలేదని..
నార్కట్పల్లి: నార్కట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. తన అభిమాన నేతకు ఉప సర్పంచ్ పదవి దక్కకపోవడంతో నిరాశకు గురైన యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నార్కట్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నిక శుక్రవారం నిర్వహించగా.. రాజకీయ సమీకరణాలు మారి కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యుడు మట్టిపల్లి శ్రీనుకు ఉప సర్పంచ్ పదవి దక్కలేదు. దీంతో శ్రీను అభిమాని మట్టిపల్లి రాజు తీవ్ర నిరాశకు గురై గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమీపంలో ఉన్న పోలీసులు గమనించి రాజును అడ్డుకున్నారు. ఫ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం -
అటవీ వ్యవసాయం
గిరిజన రైతులకు వరం.. బొమ్మలరామారం : అటవీ వ్యవసాయం విస్తరించేందుకు గాను వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుడుగు వేస్తున్నారు. అడవిలోని చెట్లను నరకకుండా నేల సంరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పంటలు పండిస్తూ, పశుపోషణ చేస్తూ ఆదాయం పెంచుకోవడానికి అటవీ వ్యవసాయ పథకం దోహదం చేస్తుంది. ఈ పథకం 2022లో ప్రారంభం కాగా.. రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు గ్రామాలను ఎంపిక చేసి రైతులను అటవీ వ్యవసాయం వైపు మళ్లేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తారు. ఇందులో భాగంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి–రాజేంద్రనగర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను బొమ్మలరామారం మండలంలోని యావపూర్ తండాతో పాటు జనగామ జిల్లాలో మరో గ్రామంలో ఈ అటవీ వ్యవసాయ పథకాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా టీ ఎస్టీ సబ్ప్లాన్, ఎస్సీ సబ్ప్లాన్ కింద ఆయా గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను అందజేస్తూ అటవీ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. 2026 సంవత్సరానికి గాను బొమ్మలరామారం మండలంలోని సోమాజిపల్లి, భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామాలు ఈ పథకానికి ఎంపికకానున్నట్లు సమాచారం. యావపూర్ రైతులకు జరిగిన లబ్ధి.. యావపూర్ తండా గిరిజనులకు అటవీ వ్యవసాయంపై కల్పించిన అవగాహన మంచి ఫలితాన్నిచ్చింది. గ్రామంలోని ఎక్కువ మంది రైతులు సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా సాగు వైపు మళ్లారు. అటవీ వ్యవసాయంలో రైతులు లాభాలు పొందడానికి గాను ఎస్టీ సబ్ప్లాన్లో భాగంగా 15 మంది రైతులకు పూర్తి సబ్సిడీతో రూ.2.50లక్షల విలువైన బ్యాటరీ స్ప్రేయర్లు, కొమ్మలను కత్తిరించే సెకేచర్లు, టార్పాలిన్లు శ్రీగంధం, మామిడి, మలబారు, వేప, కుంకుడు, నీలగిరి, మహాగోని, అల్లనేరేడు, వెదురు, సీతాఫలం తదితర మొక్కలను అందజేశారు. మరో 21 మంది రైతులకు ఒకొక్కరికి 25 చొప్పున నాటుకోడి పిల్లలను అందించారు. సేంద్రియ వ్యవసాయం వలన కలిగే ప్రయోజనాలు, పురుగు మందుల వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఇందిర గిరిజల వికాసం పథకం ద్వారా సబ్సిడీపై సోలార్ పంపులు, సోలార్ ప్యానల్స్ అందజేస్తుంది. పీఎం కుసుమ్ పథకం ద్వారా 60 శాతం సబ్సిడీతో సోలార్ పంపులు అందజేస్తుంది. పశుగ్రాసం పెంచడానికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుంది. 80 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు దోహదం చేస్తుంది. ౖరెతులు సద్వినియోగం చేసుకోవాలి – రామాంజనేయులు, ప్రధాన శాస్త్రవేత్త, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గిరిజనుల ఆర్థిక స్వావలంబన, సమతుల్య వాతావరణం సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. యావపూర్లో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాం. 36 మంది రైతులకు పూర్తి సబ్సిడీతో బ్యాటరీ స్ప్రేయర్లు, కొమ్మలను కత్తిరించే సెకేచర్లు, టార్పాలిన్లు, 25 చొప్పున నాటుకోడి పిల్లలు, వివిధ రకాల మొక్కలు అందజేశాం. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఫ రైతులకు ఉచితంగా వ్యవసాయ పరికరాలు, మొక్కలు, నాటుకోడి పిల్లలు పంపిణీ ఫ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన -
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు భేష్..
భూదాన్పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ దీప్తి ఉమాశంకర్ అన్నారు. శుక్రవారం ఆమె భూదాన్పోచంపల్లిని సందర్శించి టూరిజం పార్కులో మగ్గాలను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల తయారీ విధానాలను తిలకించారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతయంగా ఉన్న గుర్తింపు తెలుసుకొని చేనేత కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం చేనేత సహకార సంఘాన్ని సందర్శించి ఇక్కత్ వస్త్రాలు, డిజైన్లను పరిశీలించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. గతంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పోచంపల్లిని సందర్శించారని తెలుసుకొని ఈ ప్రాంత చరిత్రక, వృతికళాకారుల గొప్పదనాన్ని అభినందించారు. పోచంపల్లిలో పీఎస్సీ చైర్మన్ల కుటుంబ సభ్యులు ఇక్కత్ వస్త్రాల తయారీ తీరుతెన్నులను ప్రత్యక్షంగా చూసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ సెక్రటరీ సరిత ఆధ్వర్యంలో 15 రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) చైర్మన్ల కుటుంబ సభ్యులు 25 మంది శుక్రవారం పోచంపల్లిని సందర్శించారు. స్థానిక టూరిజం పార్కు, చేనేత గృహాలు, చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. అక్కడ మగ్గాలు, చిటికి కట్టడం, మగ్గం నేయడం, రంగులద్దకం, ఆసుపోయడం తదితర విధానాలను పరిశీలించారు. చేనేత గృహాలను సందర్శించి మగ్గం నేస్తే ఎంత కూలీ వస్తుందని, తయారు చేసిన వస్త్రాలను ఎక్కడ విక్రయిస్తారని అడిగి తెలుసుకున్నారు. చేనేత సహకార సంఘంలో చేనేత వస్త్రాలు, డిజైన్లలను పరిశీలించి వస్త్రాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోచంపల్లిని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందనన్నారు. వీరికి జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్రావు, పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, పోచంపల్లి ప్రొప్రైటర్ కంపెనీ చైర్మన్ తడక రమేశ్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్ పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ వెంకట్రెడ్డి, చేనేత జౌళిశాఖ డీఓ మోహన్రెడ్డి, చేనేత నాయకులు ముస్కూరి నర్సింహ, గంజి అంజయ్య, మేనేజర్ రుద్ర అంజనేయులు పాల్గొన్నారు.ఫ రాష్ట్రపతి సెక్రటరీ దీప్తి ఉమాశంకర్ -
మల్యాల, చీకటిమామిడిలో విషాదఛాయలు
బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన విద్యార్థిని, ఆమె సమీప బంధువైన చీకటిమామిడి గ్రామానికి చెందిన వ్యక్తి గురువారం స్కూటీపై వస్తుండగా.. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కీసర సమీపంలో ఔటర్ రింగ్రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటనతో ఆ రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన పురాణి జోత్స్న(16) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం కళాశాల విద్యార్థులతో కలిసి హైదరాబాద్లోని వండర్లాకు విహారయాత్రకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో చీకటి కావడంతో కళాశాల నుంచి తనను మల్యాలకు తీసుకురావడానికి వరసకు బాబాయ్ అయ్యే చీకటిమామిడి గ్రామానికి చెందిన పసుపుల కృష్ణ(40)కు ఫోన్ చేసింది. కృష్ణ, జోత్స్న స్కూటీపై బొమ్మలరామారం వైపు వస్తుండగా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం ఔటర్ రింగ్రోడ్డు సమీపంలో వీరి స్కూటీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. జోత్స్న తండ్రి రాజు 13 ఏళ్ల క్రితం కెమికల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. జోత్స్న తల్లి మంజుల అదే ఫ్యాక్టరీలో స్వీపర్గా పనిచేస్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. జోత్స్న మృతితో మంజుల గుండెలవిసేలా రోదించింది. జోత్స్న సమీప బంధువు పపసుపుల కృష్ణ మేసీ్త్ర పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృష్ణకు భార్య మీనా, ఇద్దరు కుమార్తెలు(కవలలు), ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కృష్ణ కుటుంబం రోడ్డున పడింది. అదుపుతప్పి కుంటలోకి దూసుకెళ్లిన ఆటోఫ ఒకరికి గాయాలు డిండి : ఆటో అదుపుతప్పి నీటి కుంటలోకి దుసుకెళ్లిన ఘటన శుక్రవారం డిండి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం ప్రతాప్నగర్ గ్రామానికి చెందిన జర్పుల అనిల్ తన ఆటోలో చెర్కుపల్లి గ్రామ స్టేజీ వద్ద ఉన్న రైస్మిల్లు నుంచి బియ్యం లోడుతో బొగ్గులదొన గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆటో అదుపుతప్పి ఏనకుంటలోకి దూసుకెళ్లింది. దీంతో ఆటో నడుపుతున్న ప్రవీణ్ తలకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రవీణ్ను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫ కీసర ఓఆర్ఆర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయా గ్రామాలకు చెందిన బంధువులు మృతి -
యాసంగి పనులు ముమ్మరం
సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాం. అధిక దిగుబడుల కోసం రైతులు ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. సేంద్రియ ఎరువులు వాడితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచన మేరకు యాజమాన్య పద్ధతులు పాటించాలి. –వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రామన్నపేట : యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొందరు రైతులు వరి నాట్లు వేస్తుండగా, మరికొందరు పొలాలను సిద్ధం చేస్తున్నారు. భూగర్భ జలమట్టం పెరగడంతో రైతులు ఆరుతడి పంటకు బదులు వరి సాగువైపై మొగ్గు చూపుతున్నారు. అయితే నాటు వేసేందుకు స్థానికంగా కూలీ లు కొరత ఉంది. దీంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. పెరగనున్న వరి సాగు గత యాసంగితో పోలిస్తే ప్రస్తుత సీజన్లో వరిసాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు పెరిగాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. గత సీజన్లో 2,86,252 ఎకరాల్లో వరి వేయగా.. ఈసారి 3,12,500 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి కూలీల రాక.. స్థానికంగా కూలీల కొరత ఏర్పడడంతో రైతులు బయటి ప్రాంతాల వారిని రప్పించి వరి నాట్లు వేయిస్తున్నారు. హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు చెందిన కూలీలు వస్తున్నారు. రామన్నపేట మండలంలోని పలు గ్రామాలకు ఉత్తరప్రదేశ్లోని సహజ్పూర్ నుంచి 165 మంది పురుషులు వచ్చి నాట్లు వేస్తున్నారు. ఇందుకు గాను ఎకరాకు రూ.5వేల నుంచి రూ.5,500 వరకు తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ట్రాక్టర్లకు ఫుల్ డిమాండ్ సాగు పనులు ఊపందుకోవడంతో ట్రాక్టర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఫుల్వీల్స్ ట్రాక్టర్కు గంటకు రూ.1,600, హాఫ్వీల్స్కు రూ.1,200 చొప్పున చార్జ్ తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు. వానాకాలం వరి కోతల సమయంలో వర్షాలు కురువడం వల్ల పొలాలు సరిగా ఆరలేదు. వరికొయ్యలు నేలలో కలిసి ఎరువుగా మారడానికి రైతులు ఫుల్వీల్స్తో దున్నించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో దున్నకం ఖర్చులు పెరిగాయి. ఫ ఊపందుకున్న వరి నాట్లు ఫ స్థానికంగా కూలీల కొరత ఫ ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్న రైతులు యాసంగి సాగు విస్తీర్ణం.. ఎకరాల్లో 2023 2,80,000 2024 2,98,0002025 3,12,500 (అంచనా) -
గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు
కేతేపల్లి : కేతేపల్లి మండలం చీకటిగూడెం శివారులో మూసీ కుడి కాల్వలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం శుక్రవారం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీకటిగూడెం గ్రామానికి చెందిన రైతు వడ్డె రవి బుధవారం గ్రామ శివారులో మూసీ కుడి కాల్వ పక్కన ఉన్న తన పొలం వద్దకు బయల్దేరాడు. తన పొలం వద్దకు వెళ్లాలంటే మూసీ కాల్వను దాటాల్సి ఉంది. రాత్రయినా రవి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం పొలం వద్దకు వెళ్లగా.. అతడి బైక్, చెప్పులు అక్కడే ఉన్నాయి. రవి మూసీ కాల్వను దాటే క్రమంలో నీటి ఉధృతికి కొట్టుకుపోయాడనే అనుమానంతో పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు మూసీ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి కాల్వకు నీటిని విడుదలను నిలిపి వేయించారు. కాల్వ వెంట, కాల్వ నీరు వెళ్లే తుంగతుర్తి, చెర్కుపల్లి చెరువుల్లో గాలించినా గురువారం రాత్రి వరకు రవి ఆచూకీ లభించలేదు. శుక్రవారం నకిరేకల్ ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి చీకటిగూడెం శివారు నుంచి చెర్కుపల్లి, తుంగతుర్తి గ్రామాల చెరువుల వరకు ప్రధాన కాల్వలో గాలించాయి. పడవల సహాయంతో ఆయా గ్రామాల చెరువుల్లో ముమ్మరంగా గాలించారు. అయినా శుక్రవారం రాత్రి వరకు కూడా రవి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే చెర్కుపల్లి శివారులో మూసీ కాల్వపై నేల మోరీ(అండర్ టన్నెల్) నిర్మాణం కోసం వేసిన ఇరుకై న సిమెంట్ గూనలో రవి మృతదేహం ఇరికి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాల్వలో నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిన తర్వాతనే గూనలోకి వెళ్లి వెతికేందుకు వీలవుతుంది. రెండు రోజులవుతున్నా రవి ఆచూకీ లభ్యం కాకపోవటంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
నిరీక్షణ ఉండదు..
రైతులు సాగు చేసిన పంట ఆధారంగా యూరియా కేటాయిస్తారు. వరికి ఎకరానికి రెండున్నర బస్తాలు ఇస్తారు. చెరకు కు 5 బస్తాలు, మిర్చికి 5 బస్తాలు, మొక్కజొన్నకు 5 బస్తాలు, పత్తికి నాలుగు బస్తాల యూరియా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాప్లో పొందుపరిచింది. యాసంగి సీజన్లో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయని, అందులో అత్యధికంగా 3.20 లక్షల ఎకరాల్లో వరి వేయనున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు గాను 24 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా.. ప్రస్తుతం 10 వేల టన్నుల యూరియా ఉంది. డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరాకు వ్యవసాయశాఖ అంచనాలను సిద్ధం చేసింది. సాక్షి, యాదాద్రి : రైతులకు ఇకనుంచి సులువుగా యూరియా దొరకనుంది. గంటల తరబడి లైన్లలో నిల్చోవాల్సిన బాధలు తప్పనున్నాయి. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఫెర్టిలైజర్ యాప్ రూపొందించింది. రైతులు ఎక్కడినుంచైనా ఆన్లైన్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చు. నూతన విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. ఆన్లైన్ బుకింగ్పై రెండు రోజులుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 6.18 లక్షల ఎకరాల సాగు భూమి, 2.25 లక్షల మంది రైతులు ఉన్నారు. బుక్ చేసే విధానం ఇలా.. ● రైతులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా సులువుగా యూరియా బుక్ చేసుకోవచ్చు. ఫెర్టిలైజర్ యాప్ ఓపెన్ చేసి పాస్ బుక్ నంబర్ నమోదు చేయాలి. ● సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే పాస్బుక్ ప్రకారం రైతుకు ఉన్న భూమి వివరాలు వస్తాయి. ● రైతు సాగు చేసిన పంట వివరాల ఆధారంగా ఎంత యూరియా అవసరం, యూరియా తీసుకునే డీలర్ సమాచారం ఎంట్రీ చేయాలి. వెంటనే సదరు బుక్ చేసుకున్న డీలర్, మనగ్రోమోర్, పీఏసీఎస్ వద్దకు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ● బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోగా యూరియా తీసుకోవాలి. మరింత యూరియా కావాలంటే 15 రోజులు ఆగాలి. అవగాహన కల్పించేందుకు వలంటీర్లు.. ఫర్టిలైజర్ యాప్పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. ఫోన్ ద్వారా యూరియా బుక్ చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.అంతేకాకుండా పీఏసీఎస్, ప్రైవేట్ డీలర్లు, మన గ్రోమోర్ సెంటర్ల వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 250 చోట్ల యూరియా విక్రయ సెంటర్లు ఉన్నాయి. అన్ని చోట్ల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట యూరియా చీకటి బజారుకు తరలిపోకుండా అడ్డుకట్టవేసేలా ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానం తెచ్చింది. ప్రధానంగా ఎక్స్ప్లోజీవ్స్తో పాటు పలు పరిశ్రమల్లో యూరియా వాడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. వానాకాలం సీజన్లో యూరియా కొరత సమయంలో టాస్క్ఫోర్స్ జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.ఆన్లైన్లో యూరియా బుకింగ్ ఫ ఫర్టిలైజర్ యాప్ రూపొందించిన వ్యవసాయ శాఖ ఫ 22వ తేదీ నుంచి అమల్లోకి ఫ నూతన విధానంపై రైతులకు అవగాహన ఫ తప్పనున్న లైన్ల బాధలు జిల్లాలో ఈనెల 22 నుంచి యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చు. నూతన విధానం ద్వారా యూరియా పంపిణీలో పారదర్శకత ఉంటుంది. యూరియా ఎంత స్టాక్ ఉంది, ఎంత అవసరమనేది ఎప్పటికప్పుడు తెలుస్తుంది. అంతేకాకుండా రైతులు గంటల తరబడి లైన్లలో నిలబడే పరిస్థితి లేకుండా ఇంటి నుంచే బెక్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా యూరియా బుకింగ్పై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. –వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
లెక్కల సమర్పణ ఆన్లైన్లో..
భువనగిరిటౌన్ : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చు వివరాలను సమర్పించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. కాగితం రూపంలో ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ–పోల్ వెబ్ పోర్టల్లో లెక్కలు అప్లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది. గడువులోపు సమర్పించకపోతే వేటే.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కలను అప్పచెప్పకుంటే వారిపై అనర్హత వేటు తప్పదంటున్నారు అధికారులు. ఎన్నికల నిబంధన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు.. వారికి గుర్తులు కేటాయించిన రోజునుంచి ఫలితాలు వెలువడే వరకు ఖర్చు చేసిన లెక్కలు ఎంపీడీఓలకు అప్పగించి రశీదు తీసుకోవాలి. 45 రోజుల్లోగా లెక్కల వివరాలు సమర్పించకపోతే పంచాయతీరాజ్ చట్టం –2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోవడంతో పాటు మరో మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడిన అభ్యర్థులు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. లెక్కలు నమోదు చేసేందుకు అభ్యర్థులకు ఇప్పటికే బుక్లెట్లను అందజేశారు.గ్రామ పంచాయతీ ఎన్నిల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల సందర్భంగా ప్రచా ర సాధనాలు, భోజనాలు తదితర వాటికి ఖర్చుచేసిన లెక్కలను తప్పనిసరిగా సమర్పించారు. ఖర్చు వివరాలను బుక్లెట్లో రాసి అప్పగించాలి. లేనట్లయితే వారిపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అనర్హత వేటు పడుతుంది. ప్రతి అభ్యర్థి తమ లెక్కలను నిర్దిష్ట గడువులోపు మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులకు సమర్పించాలి. –ఆవుల కిషన్, ఎంపీఓ, రాజాపేట అభ్యర్థుల ఎన్నికల వ్యయం నమోదుకు ‘టీఈ–పోల్’ ఫ నూతన విధానం తీసుకువచ్చినరాష్ట్ర ఎన్నికల సంఘం ఫ గడువులోపు పంపాలని అభ్యర్థులకు ఆదేశాలు ఫ లెక్క చెప్పకపోతే మూడేళ్లు అనర్హత వేటు -
పర్యాటక ప్రదేశాలను వెలుగులోకి తీసుకురండి
భువనగిరి : జిల్లాలో వెలుగుచూడని పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హ నుమంతరావు తెలిపారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించారు. ఎవరికి తెలియన పర్యాటక ప్రాంతం స్పష్టంగా కనిపించేలా ఫొటోలు, వీడియో, ప్రత్యేకతను వివరిస్తూ ఎంట్రీలను పంపాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి కావాలి రామన్నపేట : రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగుమతి చేసినంత వరకు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. -
యాదగిరి క్షేత్రంలో నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనల్లో భాగంగా ఆండాళ్దేవికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలోని ప్రత్యేక వేదికపై అమ్మవారిని అధిష్టింపజేసి ఆగమశాస్త్రం ప్రకారం ఊంజల్ సేవ నిర్వహించారు. అంతకుముందు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తుల చెంత అభిషేకం, సహస్రనామార్చన జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు నిర్వహించారు. -
నాడు దేశ సేవలో.. నేడు ప్రజా సేవలో
డిండి: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డిండి మండల పరిధిలోని గోనబోయనపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వర్కాల బాలనారాయణ ఆ గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. సైన్యంలో 30 ఏళ్ల పాటు పనిచేసి ఎన్ఎస్జీ కమాండోగా పదవీ విరమణ పొందిన ఆయన తన సొంతూరికి సేవ చేసి అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా బరిలోకి దిగి 425 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పడు సైనికుడు.. ఇప్పుడు పాలకుడు ఆలేరురూరల్ : ఆలేరు మండలం పటేల్గూడెం గ్రామానికి చెందిన గ్యార కుమారస్వామి 1992లో భారత సరిహద్దు దళం(బీఎస్ఎఫ్)లో సైనికుడిగా చేరి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. సైన్యంలో 21 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2013లో ఉద్యోగ విరమణ పొందాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పటేల్గూడెం సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో కుమారస్వామి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా విజయం సాధించారు. డీసీఎం, కారు ఢీ.. యువకుడు మృతినకిరేకల్ : డీసీఎం, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన 565వ నంబర్ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన శ్యామల మణికంఠ(24) కారులో పని నిమిత్తం నకిరేకల్కు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ శివారులోకి రాగానే నల్లగొండ నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మణికంఠ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు నుజ్జునుజ్జయ్యింది. మృతుడి తల్లి శివలీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశం తెలిపారు. కౌంటింగ్ కేంద్రంపై దాడి.. 18మంది బైండోవర్గరిడేపల్లి : గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రంపై దాడి చేసిన ఘటనలో 18మందిని శుక్రవారం బైండోవర్ చేసినట్లు ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. ఈ నెల 17న కౌంటింగ్ సమయంలో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు, మరికొందరు కలిసి కౌంటింగ్ హాల్పై దాడి చేశారు. ఈ దాడిలో కౌంటింగ్ ఏజెంట్గా ఉన్న ఎడవెల్లి చంద్రారెడ్డి గాయపడ్డాడు. చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు 10మందిపై కేసు నమోదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన మరికొంత మందిని మొత్తం 18 మందిని శుక్రవారం హుజూర్నగర్ ఆర్డీఓ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
త్వరలో సహకార ఎన్నికలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీసీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాదిన్నర కిందటే వాటి పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. అయితే ప్రభుత్వం ఆరు నెలలకోసారి ఆయా పాలకవర్గాల గడువును పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుత పాలవర్గాల గడువును ఈసారి గడువును పొడగించకుండా ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ఆయా పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీల పర్సన్ ఇన్చార్జిలుగా కలెక్టర్లు, సొసైటీలకు సహకార ఆఫీసర్లను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొసైటీ ఎన్నికలు నిర్వహించేంత వరకు వీరి ఆధ్వర్యంలో డీసీసీబీ, సహకార సంఘాలు పని చేస్తాయి. గతేడాది కాంగ్రెస్ చేతికి వచ్చిన డీసీసీబీ జిల్లాలో 2020 ఫిబ్రవరిలో డీసీసీబీ, సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలోనే పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. బీఆర్ఎస్ పాలనలో డీసీసీబీ చైర్మన్గా గొంగిడి మహేందర్రెడ్డి వ్యవహరించారు. అయితే ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డీసీసీబీలోని కొందరు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపారు. దీంతో చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లతో పాటు బీఆర్ఎస్కు చెందిన డైరెక్టర్లు కూడా మద్దతు పలికారు. 20 మంది డైరెక్టర్ల సహకారంతో కుంభం శ్రీనివాస్రెడ్డి డీసీసీబీ చైర్మన్గా గతేడాది జూలై 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏడాదిన్నర పాటు చైర్మన్గా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండోసారి ఆగస్టు 14వ తేదీన గడువు పొడిగించింది. రాష్ట్రంలోనే రెండో స్థానంలో మన డీసీసీబీ నల్లగొండ డీసీసీబీ దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. పంట రుణాలు, కొత్త బ్రాంచీలు ఏర్పాటు, బ్రాంచీల్లో అధునాతన సౌకర్యాలు, డీసీసీబీ ఆధునీకరణ, విదేశీ రుణాలు, గోల్డ్ లోన్స్ ఇవ్వడంలో అగ్రస్థానం సాధించింది. రుణాల రికవరీలోనూ ముందంజలో ఉంది.ఫ డీసీసీబీ, పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఫ పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జిలుగా సంఘం సీఈఓలు ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠికి నల్లగొండ డీసీసీబీ బాధ్యతలు జిల్లాల వారీగా పీఏసీఎస్లు ఇలా.. సూర్యాపేట 47 నల్లగొండ 42యాదాద్రి 21 మొత్తం 110 -
ఫ్లైవుడ్ కంపెనీలో అగ్నిప్రమాదం
భూదాన్పోచంపల్లి : పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ అగ్రి ఫ్లైవుడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మిషనరీ, ఫ్లైవుడ్ కాలిబూడిదయ్యాయి. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కంపెనీ లోపలి నుంచి మంటలు వస్తుండటంతో అక్కడే నివాసముంటున్న కూలీలు గమనించి యజమానికి విషయం చెప్పారు. అతను వెంటనే భువనగిరి ఫైర్స్టేషన్కు ఫోన్ చేసి సమచారం ఇవ్వగా.. భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూర్, చౌటుప్పల్ నుంచి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి 2గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలార్పారు. ఈ ప్రమాదంలో మిషనరీ, ఫ్లైవుడ్, మెటీరియల్ అగ్రికి ఆహుతయ్యాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్ మధుసూదన్రావు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా కంపెనీలో అగ్నిప్రమాదాల నివారణకు ఉపయోగించే సేఫ్టీ సిలిండర్లు, పరికరాలు ఏమీ లేవు. అంతేకాకుండా అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి నష్టం వివరాలను చెప్పడానికి కంపెనీ యజమాని నిరాకరించాడు. -
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
సాక్షి,యాదాద్రి : జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. ఎన్నికల ప్రక్రియకు సహకరించిన ఆయా శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యయనోత్సవాల ప్రచార పోస్టర్లు ఆవిష్కరణయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 30న నిర్వహించే ముక్కోటి ఏకాదశి, అధ్యయనోత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి గురువారం ఆవిష్కరించారు. పోస్టర్లను గర్భాలయంలో, ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తుల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ మాట్లాడుతూ... ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులందరిని ఆహ్వానించేందుకు ప్రచార పోస్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిస్తున్నామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్థిష్ట తేదీల్లో శ్రీస్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయాధికారులు రఘు, రాజన్బాబు, ఆర్ఐ శేషగిరిరావు, ప్రధానార్చకులు–2 సురేంద్రచార్యులు, అర్చకులు లక్ష్మణాచార్యులు తదితరులున్నారు. రేపు అవగాహన సదస్సు భువనగిరిటౌన్ : ‘మీ డబ్బు మీ హక్కు’పై శనివారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు తమ గుర్తింపు పత్రాలు, ఖాతా వివరాలతో హాజరు కావాలని కోరారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేకు సహకరించాలిభువనగిరి : కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేకు సహకరించాలని కుష్ఠు వ్యాధి నిర్మూలన జిల్లా అధికారి డాక్టర్ వంశీకృష్ణ కోరారు. గురువారం భువనగిరి పట్టణంలోని హన్మాన్వాడలో నిర్వహించిన సర్వేలో ఆయన మాట్లాడారు. ఈ సర్వే ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నిరోష, వినిత్రెడ్డి, డీపీఎంవోస్ రాములు, మాధవి, అనిత, రమేష్ నాయక్ పాల్గొన్నారు. 21న పురుషుల జిల్లా కబడ్డీ సెలక్షన్స్ ఆలేరు : ఈ నెల 21న ఆలేరు మైదానంలో పురుషుల 72వ జిల్లా కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించనున్నట్టు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 85 కిలోల లోపు బరువు ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డుతో ఉదయం 10గంటత లోపు సెలక్షన్స్కు హాజరుకావాలని పేర్కొన్నారు. సెలక్షన్స్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు యాదాద్రిభువనగిరి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత నల్లగొండ టూటౌన్ : రోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఈనెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా కన్హా హార్ట్ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక సమతుల్యత వస్తుందని, నిత్య సాధనతో ఉత్సాహంగా పని చేయవచ్చన్నారు. ధ్యాన దినోత్సవం ప్రధాన లక్ష్యం శాంతి కరుణ, ఐక్యత అని పేర్కొన్నారు. ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జోగారెడ్డి, వెంకటాచారి పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు గోరి కడతాం
సాక్షి, యాదాద్రి : రానున్న జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు గోరి కడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు గురువారం భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. కేసీఆర్ అనుమతితో జనవరి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. పార్టీ సభ్యత్వ సేకరణ, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో భువనగిరి జిల్లాపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాకు చెందిన మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 30 మంది సర్పంచ్లను అక్రమంగా ఓడించారని, కోర్టుకు వెళ్లి న్యాయం పొందుతామన్నారు. సీఐలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎస్ఐలు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ చెక్కు చెదరలేదని పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. అధికార పార్టీ ఎన్ని రకాల కుట్రలు పన్నినా క్యాడర్ వెన్ను చూపకుండా విజయం సాధించారన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. ఆలేరు ఎమ్మెల్యే ఎన్ని భయబ్రాంతులకు గురిచేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, మాజీ ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, క్యామా మల్లేష్, చింతల వెంకటేశ్వర్రెడ్డి, గొంగిడి మహేందర్రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, దూదిమెట్ల బాల్రాజ్యాదవ్, కొలుపుల అమరేందర్, ఎడ్లసత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగరాలి ఫ వచ్చే నెల నుంచి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ఫ నూతన సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
మెరుగైన వైద్యసేవలందించాలి
భువనగిరి: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎన్సీయూ, పీడియాట్రిక్, పోస్ట్ డెలివరీ, డెలివరీ విభాగాల సిబ్బంది పనితీరును పరిశీలించారు. డెలివరీ అయిన మహిళలతో మాట్లాడి టీకాలు వేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో కాంట్రాక్టర్పై, ఆస్పత్రిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, వైద్యులు ఉన్నారు 82 మందికి షోకాజ్ నోటీసులు కలెక్టర్ హనుమంతరావు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పలు విభాగాలు పరిశీలించారు. సమయపాలన పాటించని 63 మంది, విధులకు గైర్హాజరైన 19 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
హ్యాండ్లూమ్ పార్క్కు నిధులు ఇవ్వండి
సాక్షి, యాదాద్రి : పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు రూ.14 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రితో పాటు కేంద్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్ ఎం. బీనాను కలిసి వినతిపత్రం అందజేశారు. పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ అభివృద్ధి పథకం కింద నిధులు అవసరమని కోరారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల బకాయిల కారణంగా హ్యాండ్లూమ్ పార్క్ నిర్వీర్యమై వేలానికి వెళ్లిందని, తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్ను కొనుగోలు చేసి, సంప్రదాయ నేత వృత్తి దారుల జీవనోపాధిని కాపాడుతూ హ్యాండ్లూమ్ కార్యకలాపాలను పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉందని వివరించారు. ఫ కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి -
ఎలక్ట్రికల్ క్లీనింగ్ వాహనాలు ఏర్పాటు చేయాలి
యాదగిరిగుట్ట: యాదగిరి కొండకు దిగువన ఆధ్యాత్మికవాడలో నూతనంగా ప్రారంభించిన శాంత రుశ్య శృంగ అన్నప్రసాద కేంద్రంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రతగా ఉండే విధంగా ఎలక్ట్రికల్ క్లీనింగ్ వాహనాలు ఏర్పాటు చేసి, వినియోగంలోకి తేవాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. గురువారం అన్న ప్రసాద కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అన్న ప్రసాదం అందిస్తున్న తీరును పరిశీలించి, భక్తుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం క్యూలైన్ నిర్వహణ, భక్తులు వేచి ఉండే హాల్లో భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదం రుచి, నాణ్యత, పరిశుభ్రత అంశాలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రద్దీని బట్టి క్యూలైన్ వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. అనంతరం తాగునీటి శుద్ధి వ్యవస్థను పరిశీలించి, జల ప్రసాద నీటి స్వచ్ఛతను నిర్ధారించారు. ఆయన వెంట సంబంధిత అధికారులున్నారు. -
బీజేపీ అరాచకాలను సహించేది లేదు
భువనగిరిటౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తూ, పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు తెలియజేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో మోదీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్, నాయకులు పాల్గొన్నారు. దోషులుగా చిత్రీకరించేందుకు అక్రమ కేసులు..యాదగిరిగుట్ట: గాంధీ కుటుంబాన్ని నేషనల్ హెరాల్డ్ కేసులో దోషులుగా చిత్రీకరించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చాక మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. దేశమంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని, అక్రమ కేసులతో ఎవరూ భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, రాష్ట్ర నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ తదితరులున్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
రేషన్కార్డులకు ఇ– కేవైసీ తప్పనిసరి
భువనగిరి: నకిలీ రేషన్కార్డులను ఏరివేసేందుకుగాను కార్డుదారులతో ఇ– కేవైసీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి రెండేళ్ల కిత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొందరు ఈకేవైసీ చేయించుకున్నా.. ఇంకా కొంత మంది చేయించుకోవాల్సి ఉంది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గురువారం అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి కలెక్టరేట్ నుంచి భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కేవైసీ పూర్తి చేయించడంపై సూచనలు చేశారు. కొత్త సభ్యులు కూడా.. జిల్లాలో సుమారు 15వేల వరకు కొత్త రేషన్కార్డులు వచ్చాయి. వీటిలో సుమారు 25 వేలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. పాత కార్డుల్లో పేరు తొలగించుకుని వీటిలో చేరిన వారు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. నకిలీ కార్డులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా.. ఈ కేవైసీ చేయించని వారికి గతంలో ప్రభుత్వం బియ్యం నిలిపివేస్తామని పలుమార్లు హెచ్చరించింది. అయినా ఇంకా కొంతమంది ఆలస్యం చేస్తున్నారు. ఇందుకు కారణం ఽఆధార్కు ఈకేవైసీ యంత్రానికి అనుసంధానం చేయడం వల్ల బినామి పేర్ల మీద బియ్యం తీసుకోకుండా అడ్డకట్ట వేయడం సులభం కానుంది.దీనితో రేషన్షాపులో బియ్యం పంపిణి మరిత సమర్థవంతంగా అమలు కానుంది. జిల్లాలో 74 శాతం పూర్తి: జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 515 రేషన్ దుకాణాలు ఉండగా వీటి పరిధిలో 2,48,596 రేషన్కార్డులు ఉన్నాయి. వీటిలో 7,82,458 యూనిట్లు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 4.957 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తారు. మొత్తం యూనిట్లలో ఇప్పటివరకు 5,82,005 యూనిట్లకు చెందిన వారు ఈకేవైసీ పూర్తి చేయించుకోగా 74.38 శాతం ఈకేవైసీ పూర్తయింది. ఈ నెల 31 నాటికి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటివరకు 74 శాతం మాత్రమే ఈకేవీఐసీ పూర్తయింది. మిగతా కార్డుదారులు తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉంది. – రోజా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఫ ఇప్పటివరకు జిల్లాలో 74 శాతం పూర్తి ఫ ఈ నెలాఖరు వరకు అందరికీ పూర్తి చేయించాలని ఆదేశాలు ఫ తహసీల్దార్ కార్యాలయాల్లో రేషన్డీలర్లకు అవగాహన కార్యక్రమాలు -
యాదగిరీశుడి సన్నిధిలో నిత్యకల్యాణ వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్యకల్యాణ వేడుక నిర్వహించారు. వేకువజామున శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలైన శ్రీస్వామి వారికి, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఒక్క ఓటుతో వరించిన విజయం
పాలకవీడు : మండలంలోని మహంకాళిగూడెం గ్రామ సర్పంచ్ జనరల్కు రిజర్వ్ కాగా సర్పంచ్గా నలుగురు బరిలో నిలిచారు. బుధవారం జరిగిన పోలింగ్లో మొత్తం 600 ఓట్లకు గాను 558 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పిడమర్తి దాసుకు 187 ఓట్లు పోలవ్వగా.. స్వతంత్ర అభ్యర్థి చిట్టిప్రోలు వెంకటనారాయణకు 186 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో పిడమర్తి దాసు సర్పంచ్గా విజయం సాధించారు. అప్పుడు ఎంపీపీలు.. ఇప్పుడు సర్పంచులుచందంపేట : గతంలో ఉమ్మడి చందంపేట ఎంపీపీ పనిచేసిన కేతావత్ సవిత మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో యల్మలమంద గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది. అదేవిధంగా చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల రమాదేవి గతంలో చందంపేట ఎంపీపీగా పనిచేయగా.. తాజాగా కంబాలపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా విజయం సాధించారు. తాత.. తండ్రి.. తనయుడు..చౌటుప్పల్ : మండల పరిధిలోని ఎస్.లింగోటం గ్రామ సర్పంచ్గా భీమిడి ప్రదీప్జి గెలుపొందారు. అయితే ప్రదీప్జి తండ్రి భీమిడి శంకరాజి 2001–06 వరకు అదే సర్పంచ్గా పనిచేశారు. అంతేకాకుండా ప్రదీప్జి తాత భీమిడి మల్లాజి ఎస్.లింగోటం గ్రామానికి మొదటి సర్పంచ్గా పనిచేశారు. ప్రదీప్జి కుటుంబంలో మూడు తరాల వారు సర్పంచ్గా ఎన్నికవ్వడం విశేషం. కారోబార్ నుంచి సర్పంచ్గా గెలిచి..చౌటుప్పల్ : మండల పరిధిలోని ధర్మోజిగూడేనికి జువ్వి నర్సింహ 2019 వరకు అదే గ్రామంలో కారోబార్గా పనిచేసి మానేశాడు. ఈసారి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వ్ కాగా.. బీజేపీ, సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించాడు. గతంలో సర్పంచ్ల ఆదేశాలు పాటించిన నర్సింహ ఇప్పుడు సర్పంచ్ హోదాలో సిబ్బందికి ఆదేశాలు ఇవ్వనున్నాడు. భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్హుజూర్నగర్ : హుజూర్నగర్ మండలం అమరవరం గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కర్నాటి శిరీష సర్పంచ్గా గెలుపొందింది. ఆమె భర్త కర్నాటి వీరనాగిరెడ్డి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా.. 9 వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. దీంతో సర్పంచ్ శిరీష భర్త, 7 వార్డు సభ్యుడైన వీరనాగిరెడ్డిని ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. -
మహబూబ్పేటలో గుజరాత్ బృందం
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట గ్రామంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ) విభాగం, గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఉపాధి హామీ పథకం అడిషనల్ ప్రోగ్రాం అధికారులు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కోఆర్డినేటర్ సతీష్తో పాటు 30 మంది బృందం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో ఏయే పనులు చేయించారో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్యాటిల్ షెడ్, ఆయిల్పామ్ తోటలు, నీటి తొట్టెలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కూలీలకు ఇచ్చే జాబ్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ సిస్టమ్ చాలా బాగుందని ప్రశంసించారు. వారి వెంట ఎంపీడీఓ నవీన్కుమార్, ఏపీఓ నర్సయ్య, ఈసీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఏపీఎం వెంకటేష్, టీఏ వెంకటేష్, నూతన సర్పంచ్ ఆరె రమేష్, ఉప సర్పంచ్ సోకం అనిత, వార్డు సభ్యులు ఉన్నారు. ఫ అభివృద్ధి పనుల పరిశీలన -
స్పీకర్ నిర్ణయం ఆక్షేపణీయం
సాక్షి, యాదాద్రి : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం ఆక్షేపణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఫిరాయింపుల నిరోధక బిల్లు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ.. దాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని అతిక్రమించిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను రామచందర్రావు గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం.. గ్రామీణాభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ప్రతిబింబమన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు అనుగుణంగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పార్టీ విస్తరణకు ఈ విజయాలు పునాది ఏర్పాటు చేస్తాయన్నారు. గ్రామస్థాయి నుంచే బీజేపీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందన్నారు. పట్టణాలకే పరిమితమైన పార్టీ పల్లెల్లో కూడా విస్తరిస్తుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయలేకపోయినా, పోటీ చేసిన చోట్ల బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకుల నుంచి బెదిరింపులు, ఒత్తిడులు ఎదురైనా, ప్రజలు ధైర్యంగా బీజేపీకి మద్దతుగా నిలిచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది సర్పంచులు, 1200 మంది ఉప సర్పంచులు, 10,000 మందికి పైగా వార్డు మెంబర్లు బీజేపీ తరఫున గెలిచారన్నారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8వేల సర్పంచులు ఉండగా నేడు ఆ పార్టీ నుంచి సర్పంచ్ల సంఖ్య 2 వేల వరకు పడిపోయిందని, ఆ పార్టీ గ్రాఫ్ మరింత దిగజారిందనడానికి నిదర్శనమన్నారు. ఉచిత బియ్యం, ధాన్యం కొనుగోలుతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోందని ఆయన వివరించారు. బీజేపీ భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఉపాధ్యక్షులు డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, పడాల శ్రీనివాస్, పీఎస్ రవీందర్, దాసరి మల్లేశ, చందా మహేందర్గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఫ రాజ్యాంగాన్ని అతిక్రమించడమే ఫ రాష్ట్రాభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఫ సర్పంచ్ల గెలుపుతో పల్లెల్లో బీజేపీ పాగా ఫ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
గుమాస్తా నుంచి సర్పంచ్గా..
నేరేడుచర్ల : ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి సర్పంచ్గా గెలుపొందారు. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల మేజర్ గ్రామ పంచాయతీ బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా బుర్రి శ్రీను బరిలోకి దిగి 459 ఓట్ల భారీ మోజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 12 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 2 వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. దిర్శించర్లలో 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందడం గమనార్హం. -
వీరారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్కు రాష్ట్రస్థాయి గుర్తింపు
తుర్కపల్లి : దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పరిశుభ్రత ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ విద్యాలయ స్టార్ రేటింగ్ విధానం తెలంగాణలో ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 8 పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా.. అందులో వీరారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ కూడా ఉంది. ఆయా పాఠశాలల్లో తాగునీటి వసతి, బాలురు, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, వాటి నిర్వహణ, వ్యర్ధాల నిర్వహణ, పరిశుభ్రతపై విద్యార్థులకు కల్పిస్తున్న అవగాహన, పాఠశాల పరిసరాల శుభ్రత వంటి 60 అంశాలపై ప్రత్యేక ఉపాధ్యాయ బృందం అధ్యయనం చేసి వీరారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలిచిన పాఠశాలలను జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయికి ఎంపికై తే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రూ.లక్ష నజరానా, అవార్డు అందజేస్తారని ప్రధానోపాధ్యాయుడు బంగారు సత్యం, ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతోనే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.ఫ స్వచ్ఛ విద్యాలయ స్టార్ రేటింగ్లో స్టేట్ లెవల్కు ఎంపిక -
వరి నాట్లలో మెళకువలు
త్రిపురారం, నడిగూడెం : ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతులు ఇప్పటికే నీటి సౌకర్యం ఉన్న చోట ముమ్మరంగా వరి నాట్లు వేసుకుంటున్నారు. వరి నాట్లు వేయడంలో సరైన మెళకువలు పాటించాలని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కంపాసాగర్ సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్, నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ సూచిస్తున్నారు. పొలం తయారీ విధానం నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించాలి. 2–3 దఫాలుగా మురగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో లేదా అడ్డతో చదును చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తిచేసి, ఆ తర్వాతనే నాట్లు వేస్తే మంచిది. నాట్లు వేసే విధానం నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉంటేనే నాటు త్వరగా కుదురుకుంటుంది. నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. దీర్ఘ, మద్యకాలిక నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ప్రస్తుత యాసంగి సీజన్లో చదరపు మీటరుకు 44 కుదుళ్లు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలి బాటలు తీయాలి. దీంతో పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయడానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించడానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి. వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ల సంఖ్యను నిర్ధారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నాటినప్పుడు కుదుళ్ల సంఖ్యను పెంచి, కుదురుకు 4–5 మొక్కల చొప్పున నాటు వేయాలి. ఇలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే 25 శాతం పెంచి రెండు దఫాలుగా అంటే 70 శాతం దమ్ములో, మిగతా 30 శాతం అంకురం దశలోనూ వాడాలి. ఎరువుల యాజమాన్యం ● నత్రజని మూడు సమభాగాలుగా వేసి నాటుకు ముందు దమ్ములో, అంకుర దశలో, బురద పదునులో సమానంగా చల్లుకోవాలి. ఎరువులు చల్లిన 30గంటల తర్వాత నీరు పెట్టడం ఉత్తమం. ● నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో లేదా యూరియా రూపంలో లేదా నానో యూరియా రూపంలో అందించవచ్చు. శాస్త్రవేత్తల సూచనల మేరకు యూరియాను తక్కువగా వినియోగించుకోవాలి. ● 40కిలోల యూరియా 10కిలోల వేప పిండి, లేదా 250కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. ● మట్టి పరీక్షల ఆధారంగా మొత్తం భాస్వరం ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి. ● పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేసుకోవాలి. చెల్క నేలల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగితా సగ భాగాన్ని వేసుకోవాలి. ● కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలోగాని అంకురం ఏర్పడే దశలోగాని వేయకూడదు. పూర్తిగా దమ్ములో వేసుకోవాలి. నిడమనూరు : నిడమనూరు మండలంలో కోతుల బెడద తీవ్రమైంది. మండల కేంద్రం శివారులో వరి నారుమడులను సైతం ధ్వంసం చేస్తున్నాయి. వరి నారు పెరుగుతున్న క్రమంలో కోతులు తొక్కి, ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వరి నారు నాటుకు పనికిరాకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో సైతం పలువురు అభ్యర్థులు కోతుల బెడద నివాస్తామని హామీ ఇచ్చారు. పై నుంచి 3 లేదా 4 ఆకుల మధ్య ఈనె పాలి పోతుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురు ఆకు చివర్లో, మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా, పెళుసుగా ఉండి వంచగానే శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు దమ్ములో వేసినప్పటికి పైరు పచ్చబడదు. సవరణ : ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి, రెండు పంటలు పండించేట్లయితే ప్రతి రబీ సీజన్లో, ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కన్పించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి. గమనిక : భాస్వరం ఎరువుతో జింకు సల్ఫేట్ను కలిపి వేయరాదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. కలిపి వేస్తే రసాయనిక చర్యవల్ల ఫలితం ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు, తెగుళ్ళ మందులను కలుపరాదు. -
పంచాయతీ ముంగిట.. తీరొక్క ముచ్చట
పల్లె సంగ్రామం ముగింది. మూడు విడతల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చాలా గ్రామాల్లో ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. కొన్ని చోట్ల ఒకటి, రెండు ఓట్లతో సర్పంచులుగా గెలుపొందారు. కొందరు తమ బంధువులు, కుటుంబ సభ్యుల పైనే పోటీ చేసి గెలుపొందగా.. ఆటో డ్రైవర్, సుతారి మేస్త్రీగా పనిచేసే వారు సైతం సర్పంచ్ బరిలో నిలిచి విజయం సాధించారు. పోలైన ఓట్లు 318.. ఒక్క అభ్యర్థికే 312మఠంపల్లి : మండలంలోని జామ్లాతండా గ్రామ పంచాయతీలో మొత్తం 371 ఓట్లు ఉండగా.. 318 ఓట్లు పోలయ్యాయి. సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా.. అనూహ్యంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి బానోతు భాస్కర్నాయక్కు 312ఓట్లు వచ్చాయి. టీడీపీ బలపర్చిన నాగేశ్వరరావునాయక్కు 2 ఓట్లు, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి బాలాజీనాయక్కు 2 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అనితకు ఒక ఓటు రాగా.. మరొక ఓటు నోటాకు పడింది. దీంతో భాస్కర్నాయక్ మెజార్టీపై మండలంలో ప్రత్యేకంగా చర్చించుకున్నారు. -
పరదాల చాటున పోలింగ్
సంస్థాన్ నారాయణపురం : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం డాకుతండా పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు పరదాలు కట్టి పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కిచెన్ రూంలో మరో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాధనగర్తండా పాఠశాల వరండాలో గ్రీన్ మ్యాట్ చాటున 2 పోలింగ్ బూత్లు, మరో రెండు పాఠశాల్లో వరండాలోనే బహిరంగంగా రెండు బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం ఎదుటే బురద సంస్థాన్ నారాయణపురం : మండలంలోని కొత్తగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం ఎదుటే బురద గుంత ఉంది. అధికారులు కనీసం బురద గుంతలో మట్టి కూడా పోయలేదు. బురద గుంతను ఓటర్లు అతికష్టం మీద దాటుతూ వచ్చి ఓటేశారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్ అయినా బురద గుంత లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హోమంతలపల్లి, చింతపల్లిలో స్వల్ప ఉద్రిక్తత
మర్రిగూడ(చింతపల్లి) : చింతపల్లి మండల కేంద్రంతో పాటు హోమంతలపల్లిలో బుధవారం సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవం కావడంతో ఆ గ్రామానికి చెందిన కొందరు పక్కనే ఉన్న హోమంతలపల్లికి వచ్చి ఓ పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తుండడంతో గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మల్లారెడ్డిపల్లి గ్రామస్తులను అక్కడి నుంచి పంపించేశారు. అదేవిధంగా చింతపల్లి మండల కేంద్రంలో ఓ వ్యక్తి పోలీస్ సిబ్బందితో దురుసుగా మాట్లాడడంతో ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసు వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. సదరు వ్యక్తిని పోలీసులు గ్రామ శివారులోకి తీసుకెళ్లి పోలింగ్కు ఎలాంటి ఆటంకాలు కల్గించొద్దని సర్ది చెప్పినట్లు సమాచారం. -
రామానుజ కూటంలో ప్రసాద తయారీకి స్వస్తి
ఫ సరైన సిబ్బంది, మిషనరీ లేక ప్రసాద విభాగంలో తయారు చేయిస్తున్న యాదగిరిగుట్ట ఆలయ అధికారులు యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని భక్తులు దర్శించుకొని బయటకు వెళ్లే సమయంలో పశ్చిమ రాజగోపుర ద్వారం చెంత వారికి ఉచితంగా పులిహోర ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది అందజేస్తున్నారు. ఈ ప్రసాదాన్ని రామానుజ కూటంలో ఎంతో పవిత్రంగా తయారుచేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో పులిహోర ప్రసాదాన్ని ప్రసాద విభాగంలో తయారు చేయిస్తున్నారు. ఈ ప్రసాదాన్ని ఆలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బందితో పశ్చిమ ద్వారం వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదాన్ని ఔట్సోర్సింగ్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తీసుకొస్తుండడంతో అపవిత్రం అవుతుందని భక్తులు అంటున్నారు. వెంటనే రామానుజ కూటంలో ప్రసాదాన్ని తయారు చేసి, అక్కడి నుంచి నేరుగా పశ్చిమ ద్వారం వద్దకు తీసుకెళ్లి పంపిణీ చేస్తే బాగుంటుదని పలువురు భక్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఈఓ వెంకట్రావ్ను వివరణ కోరగా.. భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు ఉచిత ప్రసాదం పంపిణీ చేసేందుకు గాను రామానుజ కూటంలో సరైన సిబ్బంది, మిషనరీ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. దీంతో గత నెల నుంచి ప్రసాద తయారీ విభాగంలో పులిహోర ప్రసాదాన్ని తయారు చేయించి అక్కడి నుంచి దేవస్థానానికి సంబంధించిన సిబ్బందితో పశ్చిమ ద్వారం వద్దకు తీసుకెళ్తున్నామని వివరించారు. -
మేనమామపై గెలుపు
ఫ ఒక్క ఓటు తేడాతో దక్కిన విజయం నేరేడుచర్ల : నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెం గ్రామంలో బుధవారం జరి గిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేనమామపై మేనల్లుడు విజయం సాధించాడు. గ్రామానికి చెందిన కందుకూరి సత్యనారాయణరెడ్డి, ఆయన మేనల్లుడు ఉట్కూరి మాధవరెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ అభ్యర్థులుగానే సర్పంచ్ బరిలో నిలబడ్డారు. వీరిలో పార్టీ ఎవరినీ అభ్యర్థిగా బలపర్చనప్పటికీ మాధవరెడ్డికి 397 ఓట్లు రాగా.. కందుకూరి సత్యనారాయణరెడ్డికి 396 ఓట్లు వచ్చాయి. మాధవరెడ్డి ఒక్క ఓటు తేడాతో మేనమామపై విజ యం సాధించాడు. సత్యనారాయణరెడ్డి సర్పంచ్గా పోటీ చేయడం ఇది మూడోసారి కాగా.. మూడుసార్లు ఓడిపోవడం గమనార్హం. రెండు ఓట్లతో దక్కిన విజయంకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ బలచర్చిన అభ్యర్థి ఆదిరాల సుమలత రెండు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిపై జిట్ట సంధ్యారాణిపై గెలుపొందింది. మొదట 3 ఓట్ల తేడా ఉండగా.. రీ కౌంటింగ్లో 2 ఓట్ల తేడాతో నెగ్గింది. అప్పుడు ఎంపీటీసీ.. ఇప్పుడు సర్పంచ్నేరేడుచర్ల : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి చలసాని మంజుల 890 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. మంజుల 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ గ్రామ ఎంపీటీసీగా గెలుపొందింది. నాడు భర్త.. నేడు భార్యనేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడిద అపర్ణ 396 ఓట్ల మెజార్టీతో అదే పార్టీకి చెందిన రెబెల్ అభ్యర్థిపై గెలుపొందింది. కాగా గత ఎన్నికల్లో అపర్ణ భర్త మనోజ్కుమార్ ఆ గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. -
సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా..
పెన్పహాడ్ : ఇంట్లో సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెపుకుంట తండాకు చెందిన భూక్య హరిలాల్(28) ఇంట్లో సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మురళీధర్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంతో తండావాసుల ధర్నా కొన్నిరోజులుగా తండాలోని ఇళ్లలో కరెంట్ ఎర్త్ వస్తుందని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తండావాసులు ఆరోపించారు. ఈ క్రమంలో పెన్పహాడ్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై హరిలాల్ మృతదేహంతో ధర్నా చేపట్టారు. విద్యుత్ ఏఈ శ్రీనివాసు, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ అక్కడకు చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఫ విద్యుదాఘాతంతో యువకుడు మృతి -
పల్లె పాలనపై పాఠ్యాంశం
ఆలేరు: పంచాయతీ పాలనపై విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘గ్రామ పంచాయతీలు’ శీర్షికతో పాఠ్యంశాన్ని పొందుపర్చింది. పంచాయతీ పాలన, విధులు, విధానాలపై పాఠ్యాంశంలో వివరించింది. ఈ అంశాలపై అవగాహన ● ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పల్లెల పురోగతికి సర్పంచ్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఎలా కృషి చేస్తారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు ఏయే పన్నుల ద్వారా ఆదాయాన్ని పంచాయతీలు ఎలా సమకూర్చుకుంటాయి. ● పంచాయతీల నిర్వహణ, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలతోపాటు అధికారాలు, గ్రామసభలు, సమావేశాల్లో తీర్మానాలు, నిర్ణయాలు ఎలా జరుగుతాయి. ● ప్రజల పాత్ర, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీ ఆస్తుల పరిరక్షణపై పాఠంలో చేర్చారు. పాఠ్యాంశం ద్వారా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, సర్పంచ్, ఉ ప సర్పంచ్లను ఎన్నుకునే పద్థతి గురించి అవగాహన కల్గింది. కార్యదర్శి అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్ల బాధ్యతల గురించి పాఠ్యాంశంలో వివరంగా చెప్పడం వల్ల అవగాహన పెరిగింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉంటారని తెలిసింది. –బి.భవానీ, 6వ తరగతి, ఆలేరు అభివృద్ధి పనులను గుర్తించి గ్రా మ సభలు,సమావేశాల ద్వారా ఎలా తీర్మానాలు చేస్తారో తెలి సింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చతాయని తెలి సింది. పన్నుల గురించి అవగాహన ఏర్పడింది. –పి.రిశిక్, 6 తరగతి, ఆలేరుఫ 6వ తరగతి సాంఘికశాస్త్రంలో పొందుపర్చిన విద్యాశాఖ ఫ పంచాయతీ నిర్వహణపై విద్యార్థి స్థాయినుంచే అవగాహన -
పంచాయతీ హస్తగతం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులకే అత్యధిక సర్పంచ్ స్థానాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి 63.90 శాతం స్థానాలు లభించగా, బీఆర్ఎస్కు 26.71 శాతం స్థానాలు, బీజేపీకి 1.23 శాతం స్థానాలు వచ్చాయి. సీపీఐ/సీపీఎం/ఇతరులకు 8.15 శాతం స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం బుధవారంతో ముగిసింది. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. ఈ నెల 11, 14వ తేదీల్లో ఒకటి, రెండు విడతల ఎన్నికలు జరగ్గా, మూడో విడత ఎన్నికలు బుధవారం ముగిశాయి. 1779 పంచాయతీల్లో ఎన్నికలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడతల్లో 1782 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అయితే, నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం పేరూరు, మాడుగులపల్లి మండలం అభంగాపురంలో సర్పంచి అభ్యర్థుల్లేక సర్పంచ్ స్థానాలకు, అదే మండలంలోని ఇందుగులలో న్యాయ వివాదంతో సర్పంచ్తో సహా వార్డుల సభ్యుల స్థానాల ఎన్నికలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1779 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు, 1781 గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో రాత్రి 11:30 గంటల వరకు కూడా లెక్కింపు పూర్తి కాలేదు. వివిధ పార్టీల మద్దతుదారులకు ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు వితల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కాయి. సర్పంచి ఎన్నికలు జరిగిన 1779 స్థానాల్లో (జనగాం మినహా) కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు 1136 స్థానాలు దక్కాయి. బీఆర్ఎస్ మద్దతుదారులకు 475 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 22 స్థానాలు రాగా, సీపీఐ/సీపీఎం/ఇతరులకు 145 స్థానాలు లభించాయి. అందులో స్వతంత్ర అభ్యర్థులే అత్యధికంగా ఉండటం గమనార్హం. యాదాద్రి జిల్లాలో మూడో విడతలో సత్తా చాటిన కాంగ్రెస్ మద్దతుదారులు తుది దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను చేజిక్కించుకుంది. 124 పంచాయతీలకు గాను 69 స్థానాలను (8 చోట్ల ఏకగ్రీవం) కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. బీఆర్ఎస్ 36 స్థానాలను (ఒకటి ఏకగ్రీవం) గెలుచుకోగా, బీజేపీ 7, సీపీఐ 2, సీపీఎం, ఇండిపెండెంట్లు 9 చోట్ల (ఒకరు ఏకగ్రీవం) గెలుపొందారు. ఆలేరు నియోజకవర్గంలోని మోటకొండూరు మేజర్ పంచాయతీతో పాటు 14 చోట్ల కాంగ్రెస్ గెలుపొందగా, బీఆర్ఎస్ ఐదు సీట్లకే పరిమితం అయ్యింది. గుండాల మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పదేసి స్థానాల్లో విజయం సాఽధించాయి. కాగా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుంది. 32 స్థానాలు కాంగ్రెస్ గెలువగా, బీఆర్ఎస్ మద్దతుదారులు 10 మంది గెలిచారు. ఈ విడతలో బీజేపీ పుంజుకుని 7 చోట్ల విజయం సాధించింది. మేజర్ గ్రామ పంచాయతీలు సంస్థాన్నారాయణపురం, పుట్టపాకలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 17 చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ 8 సీట్లు కై వసం చేసుకుంది. ఇండిపెండెంట్లు తొమ్మిది స్థానాల్లో విజయం సాఽధించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన 427 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 228 స్థానాలను గెలుచుకుని ఆధిక్యతను ప్రదర్శించింది. బీఆర్ఎస్ 150, బీజేపీ 11 స్థానాల్లో గెలుపొందాయి. సీపీఐ, సీపీఎం, ఇతరులు 38 చోట్ల విజయం సాధించారు. ఇందులో కాంగ్రెస్ రెబల్స్ కూడా ఉన్నారు. -
తుది విడతలోనూ ఓటెత్తారు
సాక్షి, యాదాద్రి : పంచాయతీ మూడవ విడత ఎన్నికల్లోనూ పల్లె ఓటెత్తింది. బుధవారం ఆరు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి, మలి విడత మాదిరిగానే ఆఖరి దశలోనూ రికార్డు స్థాయిలో 92.56 శాతం ఓటింగ్ నమోదైంది. మందకొడిగా మొదలైన పోలింగ్.. 11 గంటల తరువాత పుంజుకుని, చివరి గంటలో గణనీయంగా పెరిగింది. మేజర్ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు.అభ్యర్థులు పోటీపడి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించారు. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో.. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 94.26 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా మోత్కూరు మండలంలో 90.11 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుండాల మండలంలో 92.83 శాతం, సంస్థాన్నారాయణపురంలో 92.44 శాతం, మోటకొండూరు 92.28 శాతం, అడ్డగూడూరు మండలంలో 91.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆరు మండలాల్లో 1,59,289 మంది ఓటర్లు ఉండగా 1,47,432 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 73,640 మంది, మహిళా ఓటర్లు 73,792 ఉన్నారు. 114 సర్పంచ్లు, 998 వార్డులకు ఎన్నికలు మూడో విడతలో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 10 పంచాయతీలు, 93 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోను 114 గ్రామ పంచాయతీలు, 998 వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. సర్పంచ్లకు 338 మంది, వార్డుసభ్యులుగా 2,395 మంది పోటీపడ్డారు. ముగిసిన సంగ్రామం మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు సజావుగా ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.92.56 శాతం పోలింగ్ ఫ 114 పంచాయతీల్లో ఎన్నికలు ఫ 1,47,432 మంది ఓటు హక్కు వినియోగం ఫ ప్రశాంతంగా ముగిసిన పల్లెపోరు -
22న సర్పంచ్ల ప్రమాణస్వీకారం
427 పంచాయతీల్లో కొలువుదీరనున్న పాలక వర్గాలు యాదగిరిగుట్ట రూరల్, రాజాపేట : జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ భవనాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 22న నూతన పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలకు రంగులు వేసి, నూతన ఫర్నిచర్తో సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను భవనాల గోడలపై రాస్తున్నారు. భువనగిరిటౌన్ : జిల్లాలో నూతనంగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 22న కొత్త సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయించాలని నిర్ణయించగా, ముహూర్తం బాగాలేదని సర్పంచ్ల విజ్ఞప్తుల మేరకు తేదీలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు విడతల్లో ఎన్నికై న సర్పంచ్లు, వార్డు సభ్యులంతా ఒకే రోజు 22వ తేదీన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రోజు నుంచి ఐదేళ్ల కాలపరిమితతో నూతన పాలకవర్గాలు కొనసాగనున్నాయి. పంచాయతీలు, వార్డులు ఇలా.. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి మొదటి వారంలో ముగిసింది. అప్పటినుంచి ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు. -
కాంగ్రెస్
బీఆర్ఎస్బీజేపీనూతన సర్పంచ్లకు నేడు కేటీఆర్ సత్కారంసాక్షి, యాదాద్రి : తమ పార్టీల తరఫున కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులను అభినందించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు గురువారం భువనగిరికి రానున్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అధ్యక్షతన అభినందన సత్కార కార్యక్రమం జరగనుంది. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో.. రాయగిరిలోని లింగబసవ గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్ అధ్యక్షతన బీజేపీ తరఫున గెలుపొందిన సర్పంచ్లను సత్కరించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు చేతులమీదుగా సత్కారం ఉంటుందన్నారు. గుట్ట క్షేత్రానికి అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనం యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి హైదరా బాద్లోని మెడికోవర్ ఆస్పత్రి బహూకరించిన అంబులెన్స్ను ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి బుధవారం ప్రారంభించారు. అంబులెన్స్తో పాటు పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, ఆలయాధికారి రఘు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామున శ్రీస్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. మొదటి విడతఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో వివిధ పార్టీల మద్దతుదారులకు లభించిన స్థానాలు


