breaking news
Yadadri District Latest News
-
స్నేహితుడి మరణం.. సమాజ సేవకు ప్రేరణ
సూర్యాపేటటౌన్ : ఎక్కడ జనసందోహం ఉన్నా.. ఎక్కడ పెద్ద జాతరలు, వారసంతలు ఉన్నా నల్లటి దుస్తులు ధరించి మెడలో పుర్రెల దండ వేసుకొని నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ ఫ్లెక్సీని పట్టుకొని అక్కడ కనిపిస్తారు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సమాజంలో కనీసం ఒక్కరినో.. ఇద్దరినో మత్తు పదార్థాల బారి నుంచి విముక్తి కల్పించడమే తన కర్తవ్యంగా భావించి పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా సమాజాన్ని చైతన్యపరిచేందుకు యాత్ర ప్రారంభించారు సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన రెండేళ్లుగా మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచారకర్తగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. మూడేళ్ల క్రితం మద్యానికి బానిసైన తన ప్రాణ స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందడం ప్రభాకర్ను తీవ్రంగా కలిచివేసింది. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆయనను ఆలోచింపజేశాయి. సమాజంలో అవగాహన పెంచాలని సంకల్పించిన ఆయన అప్పటి నుంచి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభాకర్ ప్రత్యేక వేషధారణను ఎంచుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి, మెడలో పుర్రెల బొమ్మలతో చేసిన దండ వేసుకుని నో డ్రగ్స్..సేవ్ లైఫ్ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సంప్రదాయ పండగలు, హిందూ, ముస్లిం, క్రైస్తవుల పండుగల సమయంలో ఆయా మతస్తుల వేషధారణతో మత్తు జోలికి వెళ్లొదని వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయన వేషధారణ చూసిన వారంతా ఆసక్తిగా దగ్గరకు రావడంతో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సెలవు దొరికిన ప్రతిసారి ప్రభాకర్ ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాలను ఎంచుకుంటారు. వారసంతలు, జాతరలు, సభలు, ప్రత్యేక కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో తన వినూత్న ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. యువతతోపాటు పెద్దలకు కూడా మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ చైతన్యం తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బైక్ యాత్రతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన చేస్తున్న ఈ సేవకు ప్రజలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ పుర్రె దండతో మత్తుపై యుద్ధం ఫ నల్లటి దుస్తుల్లో మత్తు వ్యతిరేక సందేశం ఫ నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ చైతన్య యాత్ర ఫ మత్తు రహిత సమాజానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కృషినేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏడాది జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభాకర్ చేస్తున్న సేవ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే తన లక్ష్యమని, మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. -
బడికి మళ్లీ జీవం
విద్యార్థులను మూతబడిన పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం. మూతబడిన స్కూళ్లులో 10 నుంచి 15 మంది విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ అదర్శ కమిటీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే కొన్ని పాఠశాలలను తెరిపించాం. మరిన్ని స్కూళ్లను తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – భిక్షపతి, డీఈఓ భువనగిరి: విద్యార్థులు లేక (జీరో ఎన్రోల్మెంట్తో) మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ జీవం పోసుకున్నాయి. విద్యాశాఖ అధికారుల ప్రత్యేక చొరవ, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమష్టి కృషితో పల్లెల్లోని సర్కారు బడులు తిరిగి తెరుచుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మిగిలిన బడులను కూడా ఈ విద్యా సంవత్సరంలో తెరిపించే దిశగా అధికార యంత్రాంగం బడిబాట ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. విద్యాశాఖ ప్రత్యేక దృష్టి విద్యాశాఖ అధికారులు తయారు చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో 66 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్గా ఉండటంతో గతంలో దశల వారీగా మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి మూతబడిన పాఠశాలలు తెరిపించాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అందరు కూడా కృషిచేస్తున్నారు. బడిబాటతో.. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫాం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక అభ్యసన దీపికల వంటి విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు కాకుండా స్థానికంగా ప్రభుత్వ బడులకే పంపాలని గ్రామపంచాయతీల్లో తీర్మానాలు సైతం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మూతబడిన పాఠశాలల్లో నాలుగు స్కూళ్లు తెరుచుకున్నాయి. ఆయా పాఠశాలల్లో 10 నుంచి 15 మంది విద్యార్థులు చేరారు. ఫ జీరో ఎన్రోల్మెంట్తో మూతపడిన స్కూళ్లు 66 ఫ వీటిలో ఇప్పటివరకు నాలుగు పాఠశాలలు పునః ప్రారంభం ఫ సత్ఫలితాలిస్తున్న బడిబాట ఫ ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమష్టి కృషి జిల్లాలో ఇప్పటి వరకు తెరుచుకున్న ప్రాథమిక పాఠశాలలు మండలం గ్రామం విద్యార్థుల సంఖ్య బీబీనగర్ కొత్తతండా 10 నారాయణపురం కడపగండి 9 యాదగిరిగుట్ట తాళ్లగూడెం 8 మోటకొండూర్ తేర్యాల 14 -
‘ఆయిల్పామ్’లో కొమ్ము పురుగు నివారణ ఇలా..
నడిగూడెం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయిల్పామ్ సాగు క్రమేణా పెరుగుతోంది. రెండు నుంచి మూడేళ్ల లోపు ఆయిల్పామ్ తోటలకు కొమ్ము పురుగు వ్యాపించి రైతులకు నష్టం మిగిల్చే అవకాశం ఉందని కోదాడ ఉద్యానవనశాఖ అధికారి పూసపాటి అనిత చెబుతున్నారు. కొమ్ము పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే.. ఈ కొమ్ము పురుగు (రైనోసిస్ బీటిల్) 30–50 మి.మీ. పొడవుతో ముదురు గోధుమ నుంచి నలుపు రంగులో ఉంటుంది. పురుగు 100 నుంచి 150 వరకు తెలుపు గుడ్లను 5–10 సెం.మీ. లోతులో పశువుల పెండ కుప్పలో లేదా చనిపోయిన చెట్ల మొదళ్లలో సముదాయాలుగా పెరుగుతుంది. ఈ గుడ్లు 2–3 వారాల్లో పొదుగుతాయి. పూర్తిగా ఎదిగిన లార్వాలు 30 సెం.మీ. లోతులో ఉండ కోశస్థ దశలుగా వృద్ధి చెంది 3–4 వారాల తర్వాత రెక్కల పురుగు(బీటిల్స్)గా మారుతాయి. తల్లి రెక్కల పురుగు 200 రోజులు బతికి ఉంటూ సంవత్సరానికి ఒకేసారి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఈ బీటిల్స్ ఎక్కువగా మొక్క మొదలు దగ్గర అప్పుడే ఏర్పడుతున్న మొవ్వు, ఆకులను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల చివరన యు ఆకారపు ఖాళీలు ఏర్పరుస్తాయి. మొవ్వు భాగం గాని ఆకులను కురసగా మెలికలు తిరిగినట్టుగా అవుతాయి. లేత మొవ్వ భాగంలో ఆశించి లోపలికి చొచ్చుకొపోయి రంధ్రాలు చేసి మొవ్వు కుళ్లిపోయేటట్లు చేయడం వల్ల మొక్కలు చనిపోతాయి. నివారణ చర్యలు :u తోటల్లో చనిపోయిన ఆయిల్పామ్ చెట్లను తొలగించాలి. ఆయిల్పామ్ తోటల్లో కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో పశువుల పేడ(ఎరువు) నిల్వ ఉంచకూడదు. u పశువుల ఎరువు టన్నుకు కిలో కార్బోప్యూరాన్ 3 శాతం గుళికలు లేదా 2 కిలోల మలాథియాన్ పొడిని కలుపుకొని మొదలు దగ్గర చల్లాలి. u మొవ్వులో రంధ్రాలు గుర్తించిన వెంటనే కిలో మట్టికి 30 గ్రాముల మ్యాంకోజెబ్, 100 గ్రాముల క్లోరోఫైరిఫాస్ పొడి మందును కలిపి రంద్రాలు పూడ్చాలి. u సోలార్ దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. u థైనోల్యూర్ కలిగిన లింగాకర్షక బుట్టలు (బకెట్ ఫిర్మోన్ ట్రాప్స్) ఎకరానికి 1–2 ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవాలి. u బీటిల్స్ ఎక్కువగా ఆకిర్షించడానికి చెరకు రసం, ఫైన్ యాపిల్ రసం, ఈస్టును బాగా పులియబెట్టి ఎకరం తోటలో 5–6 చోట్ల అమర్చుకోవాలి. u మెటారైజియం అనైసోప్లియా అనే జీవ సంబంధిత శిలీంధ్రనాశిని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి మొవ్వు తడిచేలా పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది.u పురుగు నివారణకు తొలి దశలో వేప మందు 10,000 పీపీఎం 1 మి.లీ. ల్యామ్డా సైహాలోత్రిన్, 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. u పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంట్రిన్ప్రోల్ 0.3 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా టెట్రాటింనిప్రోల్ 1 మి.లీ. నీటిలో కలిపి మొక్క సుడిలో పోసుకోవాలి. u లేత తోటల్లో 10–20 గ్రాములు 3జీ కార్బోప్యూరాన్ గుళికలు లేదా 10 గ్రాముల క్లొరాంట్రిన్ఫోల్ గుళికలు గుళికలు కవర్లలో ఉంచి ఒక చెట్టుకు 4 కవర్లు మొవ్వు భాగంలో కడితే పురుగును నివారించవచ్చు. -
ముగిసిన ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు గురువారం ఉదయం గవ్యాంత పూజలు, 108 కలశములతో అష్టోత్తర శతఘటాభిషేకం, నిత్యోపాసన, బలిహరణ త్రిశూల స్నానం, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజలు జరిపించారు. సాయంత్రం దర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. రాత్రి ఏకాంత సేవ, నీరాజన మంత్రపుష్పాములతో జాతర ముగిసిందని ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి తెలిపారు. ఆయా పూజా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ రాయల శేఖర్, కార్యదర్శి దేవిరెడ్డి పద్మ, మాజీ చైర్మన్ కంచరకుంట్ల గోపాల్రెడ్డి, ధర్మకర్తలు కె. శంకర్ రెడ్డి, ఎం. గణేష్ మోహన్, కె. పరమేష్, ఎన్. యాదగిరి, యూ. మహేష్, జి. సైదులు, పి. సత్యనారాయణ, కే. శ్రీను, ఎం. రమణ, ఎన్. వెంకన్న, ఎన్. తిరుపతయ్య, ఎన్. వెంకటేశ్వర్లు, సీహెచ్. రమేష్, అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రావణ్కుమారాచార్యులు, గాదె దామోదర్రావు, జి.ఉమామహేశ్వరరావు, శ్రీనివాస్చారి, అవ్యయ్ కుమార్, నాగరాజు, ఆలయ సిబ్బంది చంద్రయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్రెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, రాజయ్య, శ్రీకర్, రవి తదితరులు పాల్గొన్నారు.త్రిశూల స్నానం ఊరేగింపు నిర్వహిస్తున్న పూజారి మల్లాచారి బోనాలు సమర్పించిన భక్తులు -
పెళ్లి ఇంట్లో చోరీ
● బంగారు ఆభరణాలు, నగదు అపహరణ చిట్యాల : పెళ్లి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన శిరస్సు ముత్యాలు కుమార్తె వివాహం గురువారం రామన్నపేటలోని ఓ ఫంక్షన్హాల్లో జరగగా.. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఇంటికి తాళం వేసి ఫంక్షన్హాల్కు వెళ్లారు. పెళ్లి అనంతరం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దాచి ఉంచిన రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో ముత్యాలు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ను ఢీకొట్టిన లారీ.. యువకుడి దుర్మరణం● మృతుడు నల్లగొండ జిల్లా వాసి భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్ర సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్కు చెందిన అఖిల్ (20) తన స్నేహితుడైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్నగర్కు చెందిన ఓంకార్తో కలిసి ఆదిలాబాద్కు బైక్పై వెళ్తున్నారు. భిక్కనూరు పట్టణ శివారులోకి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అఖిల్ మృతిచెందాడని ఎస్ఐ తెలిపారు. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. డీసీఎం బీభత్సం● మద్యం మత్తులో లారీ, కారు, మహిళను ఢీకొట్టిన డ్రైవర్ ● పట్టుకున్న పోలీసులుగరిడేపల్లి : మండల కేంద్రంలో గురువారం డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న డీసీఎం గరిడేపల్లి మండల కేంద్రంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో అదే వేగంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ కారును వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో డీసీఎం ధ్వంసమైంది. అయినప్పటికీ ఆపకుండా పారిపోతుండగా.. గరిడేపల్లిలోని తుమ్మాయిగడ్డ వద్ద రమణమ్మ అనే మహిళకు డీసీఎం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు నేరేడుచర్ల ఎస్ఐ సైదిరెడ్డికి సమాచారం అందించారు. ఎస్ఐ వెంటనే పోలీస్ సిబ్బంది సహాయంతో నేరేడుచర్ల పట్టణ శివారులో బారికేడ్లు అడ్డుట్టి డీసీఎంను నిలువరించారు. డీసీఎంను గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
కల్వర్టు పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
● 70 మంది ప్రయాణికులు సురక్షితం రామగిరి (నల్లగొండ) : బైక్ను తప్పించబోయిన ఆర్టీసీ బస్సు కల్వ ర్టు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన గురువారం నల్లగొండ మండల పరిధిలోని గొల్లగూడెం–మోటుబాయిగూడెం గ్రామాల మధ్య జరిగింది. వివరాలు.. నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 70 మందికి పైగా ప్రయాణికులతో చౌటుప్పల్ నుంచి నల్లగొండకు వస్తుంది. నల్లగొండ మండలంలోని గొల్లగూడెం–మోటుబాయిగూడెం మధ్య గల కల్వర్టు వద్దకు బస్సు చేరుకోగానే ఎదురుగా బైక్ వేగంగా వచ్చింది. బైక్ను ఢీకొట్టకుండా తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పాడు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి నేరుగా పక్కనే ఉన్న కల్వర్టు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సుకు గాని అందులోని ప్రయాణికులకు గాని ఎలాంటి ప్రమాదం జరగలేదని నల్లగొండ డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
చిన్నారులకు ‘పోలియో’ రక్ష
భువనగిరి: ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల నుంచి జిల్లాకు వలస వచ్చిన వారిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిర్దేశించిన రోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు సిబ్బంది ఈనెల 29,30 తేదీల్లో ఇళ్లకు వెళ్లి వేయనున్నారు. దీని కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 625 కేంద్రాలు జిల్లాలోని 17 మండలాల పరిధిలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రి, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 427 గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 625 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 22 హై రిస్క్ కేంద్రాలు, 20 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు 57,842 మంది ఉన్నట్లు గుర్తించారు. ఫ 28న పల్స్ పోలియో ఫ 625 కేంద్రాలు ఏర్పాటు ఫ 57,842 మంది ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కలే లక్ష్యం ఫ అందుబాటులో 62 వేల డోసులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొబైల్ బృందాల ద్వారా బస్టాండ్లు తదితర ప్రాంతాలలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం 22 రూట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 64 మంది సూపర్వైజర్లను నియమించారు. జిల్లాలో 62వేల డోసులు అందుబాటులో ఉండగా 2,500 మంది సిబ్బంది విధులు నిర్వహంచున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ సూచించారు. -
‘బ్యూటీ’ శిక్షణతో ఉపాధి బాట
● విజయవంతంగా ముగిసిన ‘సాక్షి’ మైత్రి మహిళ బ్యూటీషియన్ కోర్సు ● నెల రోజుల పాటు థియరీ, ప్రాక్టికల్ విధానంలో శిక్షణ ● శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానంరామగిరి (నల్లగొండ) : మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ‘సాక్షి’ మైత్రి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత బ్యూటీషియన్ శిక్షణా కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. నల్లగొండ పట్టణంలోని తిరుమలనగర్ కాలనీలో గల తన్విక బ్యూటీపార్లర్ సౌజన్యంతో మే 25 నుంచి జూన్ 24 వరకు నెల రోజుల పాటు ఈ శిక్షణను నిర్వహించారు. ఈ శిక్షణలో మహిళలకు బ్యూటీషియన్ రంగంలో అవసరమైన అంశాలపై ప్రాక్టికల్ మరియు థియరీ విధానంలో నిపుణులు పూర్తి అవగాహన కల్పించారు. ఈ శిక్షణకు హాజరైన మహిళలు బ్యూటీ పార్లర్ నిర్వహణకు సంబంధించిన ఐబ్రోస్, మేనిక్యూర్, పెడిక్యూర్, వ్యాక్సింగ్. బ్లీచింగ్, స్కిన్ కేర్, ఫేస్ ప్యాక్స్, హెయిర్ మసాజ్, హెన్నా ప్రిపరేషన్, వివిధ రకాల హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, సారీ డ్రేపింగ్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, రకరకాల మేకప్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్ నేర్చుకున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. మహిళలు ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలతో సొంతంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. కోర్సు పూర్తి చేసిన మహిళలకు సాక్షి బ్రాంచ్ మేనేజర్ రుక్మాధర్ ముఖ్యఅతిథిగా హాజరై సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ప్రసాద్, తుమ్మనగోటి వెంకట్, శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.సొంతంగా బ్యూటీపార్లర్ పెడతా బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ బయట ఫీజు చాలా ఎక్కువగా ఉంది. ‘సాక్షి’ మైత్రి మహిళా విభాగం వారు ఉచితంగా, ఎంతో ఓపిగ్గా అన్ని అంశాలు నేర్పించారు. ముఖ్యంగా బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైల్స్ బాగా అర్థమయ్యాయి. త్వరలోనే సొంతంగా చిన్న బ్యూటీపార్లర్ పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకుంటాను. – పర్వీన్, సూర్యాపేట ప్రాక్టికల్స్తో సులువుగా అర్థమైంది థియరీ మాత్రమే కాకుండా ప్రతిఒక్కరితో ప్రాక్టికల్స్ చేయించడం వల్ల భయం పోయింది. ఐబ్రోస్ త్రెడ్డింగ్, వ్యాక్సింగ్ చేయడం చాలా ఈజీగా నేర్పించారు. శారీ డ్రేపింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ కూడా మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఈ శిక్షణ మాకు ఎంతో ఉపయోగపడింది. – మానస, చిట్యాలస్వయం ఉపాధికి గొప్ప అవకాశం స్వయం ఉపాధి పొందడానికి ఈ కోర్సు నాకు బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ కేర్, పింపుల్ ట్రీట్మెంట్, ఫేస్ ప్యాక్స్ వంటి ముఖ్యమైన విషయాలపై మంచి అవగాహన వచ్చింది. మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన సాక్షి బృందానికి ధన్యవాదాలు. – కవిత, కనగల్ ఉపాధి అవకాశాలు పొందాలి ప్రస్తుత రోజుల్లో బ్యూటీ రంగానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మహిళలు ఇంటి వద్దే ఉంటూ సొంతంగా బ్యూటీ పార్లర్ నిర్వహించుకుంటూ మంచి ఆదాయాన్ని గడించవచ్చు. శిక్షణకు హాజరైన మహిళలకు కేవలం థియరీ మాత్రమే కాకుండా స్వయంగా వారే మేకప్, హెయిర్ స్టైల్స్ వేసేలా ప్రాక్టికల్ విధానంలో శిక్షణ ఇచ్చాం. మహిళలు ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని భవిష్యత్తులో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడాలి. – సావిత్రి, బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు -
స్వర్ణగిరీశుడికి నవకలశ పంచామృతాభిషేకం
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి నవకలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, తిరుప్పావడ సేవ, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం తిరువీది ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. నీటి విడుదలతో నిలిచిన లైనింగ్ పనులునిడమనూరు : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో లైనింగ్ పనులు నిలిచిపోయాయి. కాల్వ 38వ కిలోమీటరు వద్ద (బొక్కముంతలపహాడ్–ముకుందాపురం), ముదిమాణిక్యం, నారేళ్ల మేజర్ల వద్ద నెల రోజులుగా జరుగుతున్న లైనింగ్ పనుల్లో ఆధునిక యంత్రాలు వాడకపోవడంతో నత్తనడకన పనులు సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ముకుందాపురం వద్ద కిలోమీటరుకు పైగా లైనింగ్ చేయాల్సి ఉండగా.. నెల రోజుల్లో కేవలం 200 మీటర్ల పనే జరిగింది. అజాక్స్ మిషన్తో సిమెంటు, ఇసుక, కంకర కలపడమే తప్ప పనుల్లో వేగం లేక తీవ్ర జాప్యం జరుగుతోంది. వారం తర్వాత నీటి విడుదల ఆపితే తిరిగి మరమ్మతులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆధునిక యంత్రాలు ఉపయోగించి వానకాలం సాగునీటి విడుదల నాటికి నాణ్యతగా, సకాలంలో పనులు పూర్తయ్యేలా ఎన్ఎస్పీ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుదాఘాతంతో ఆవు మృతిమోత్కూరు : మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన రైతు ఎలుగు కోటిలింగానికి చెందిన ఆవు విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందింది. వివరాలు.. పాలడుగు శివారులో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆవు మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఆవుకు ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తగిన నష్ట పరిహారం అందించాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
వీరత్వానికి ప్రతీక.. సర్వాయి పాపన్న
తుంగతుర్తి : మొగలుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ వీరత్వానికి ప్రతీక అని బీసీ కమిషన్ సభ్యురాలు బాలలత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కోతి కిషోర్, జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు రామారావు అన్నారు. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గౌర సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గురువారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలకల మంజులవెంకన్న, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు కోతి యాకన్న, విగ్రహ దాత తాళ్లపల్లి యాదగిరి, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు అంజిబాబు, గుండగాని రాములు గౌడ్, పాలకుర్తి రాజయ్య గౌడ్, కోతి ఆలియా, బహుజన ఉద్యమ నేత మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, పాలకుర్తి శ్రీకాంత్, కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు నరసయ్య, ప్రధాన కార్యదర్శి చిర్ర నరేష్, విగ్రహ కమిటీ సభ్యులు బొమ్మగాని వెంకన్న, ముత్యం యాకయ్య, ముత్యం అనిల్, మల్లయ్య, గౌడ, వివిధ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ సభ్యురాలు బాలలత -
న్యాయం చేయాలని ఆందోళన
ఆత్మకూరు(ఎం) : వివాహేతర సంబంధం కారణంగా ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతదేహాన్ని గ్రామస్తులు ప్రియుడి ఇంటి ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన శిగ లక్ష్మణ్, స్వరూప(36) దంపతులు జనరల్ స్టోర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వరూప అదే గ్రామానికి చెందిన నాగం మల్లారెడ్డితో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం మల్లారెడ్డి, స్వరూప కలిసి ఊరు నుంచి వెళ్లిపోయారు. దీంతో స్వరూప కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మల్లారెడ్డి తిరిగి స్వరూపను తీసుకొచ్చిఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాడు. ఆ తర్వాత మళ్లీ మల్లారెడ్డి, స్వరూప కలిసి హైదరాబాద్కు వెళ్లి అక్కడే ఉంటుండగా.. ఈ నెల 18న స్వరూప కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వెళ్లి ఆమెకు నచ్చజెప్పి గుండాల మండలం అంబాల గ్రామంలో ఉంటున్న వారి బంధువుల ఇంటికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి స్వరూప భర్త లక్ష్మణ్ అంబాల గ్రామానికి వెళ్లి భార్యతో మాట్లాడి తిరిగి ఆత్మకూరు(ఎం)కు వచ్చాడు. మరుసటిరోజు తెల్లవారుజామున స్వరూపను తీసుకురావడానికి లక్ష్మణ్ మరోసారి అంబాల గ్రామానికి వెళ్లగా.. స్వరూప ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందింది. గురువారం పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్లో స్వరూప మృతదేహాన్ని ఆత్మకూరు(ఎం)కు తీసుకొచ్చారు. అంబులెన్స్ను అడ్డుకున్న గ్రామస్తులు..స్వరూప కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు నాగం మల్లారెడ్డి ఇంటి ముందు ఆమె మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేసేందుకు యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్వరూప మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ను ఆత్మకూరు(ఎం)కు కిలోమీటరు దూరంలో నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు అంబులెన్స్కు అడ్డుగా నిలబడి నాగం మల్లారెడ్డిని ఎక్కడున్నా పట్టుకొని రావాలంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. అనంతరం నాగం మల్లారెడ్డి ఇంటి మందు మృతదేహాన్ని ఉంచి సుమారు మూడు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వివాహేతర సంబంధం కారణంగా ఉరేసుకుని మహిళ ఆత్మహత్య ప్రియుడి ఇంటి ముందు మృతదేహం ఉంచి గ్రామస్తుల ధర్నా -
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 74 శాతం ఉత్తీర్ణత
భువనగిరి: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ–2026 పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో 74.05శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 5 నుంచి 12 వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. మొత్తం 158 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 117 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 53మంది, బాలురు 64 మంది ఉన్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు భువనగిరి: ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో మేలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. గురువారం భువనగిరి పట్టణ శివారులోని టీచర్స్కాలనీలో న్యూ హోప్ అసోసియేషన్ జిల్లా డీ అడిక్షన్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెడు అలవాట్లను విడిచి పెట్టి పునరావాస అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై పునరావాసం పొందుతున్న వారు క్రీడలు,వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, విద్య, ఉపాధి అవకాశాల పై దృష్టిపెట్టాలన్నారు. క్రమ శిక్షణ, సానుకూల ఆలోచనలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. అంతకు ముందు పునరావాస కేంద్రంలో చికిత్సపొందుతున్న వ్యక్తులతో ఎస్పీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ, రూరల్ సీఐలు రమేష్, చంద్రబాబు, రూరల్ ఎస్హెచ్ఓ అనిల్కుమార్, పోలిస్ సిబ్బంది ఉన్నారు. పారదర్శక ఓటరు జాబితా కోసమే ఎస్ఐఆర్ఆలేరురూరల్: పారదర్శక ఓటరు జాబితా కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని పోలింగ్ కేంద్రం నంబర్ 171లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ విధానాన్ని పరిశీలించి మాట్లాడారు. సందేహాల నివృత్తి కోసం తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్డెస్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని విధిగా తీసుకొని వివరాలు నమోదు చేసి తిరిగి అందజేయాలన్నారు. 2002 ఓటరు జాబితాలో పేర్లు కలిగిన ప్రతి ఓటరు తమ వివరాలను ధ్రువీకరించుకొని బీఎల్ఓలకు అందజేయాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, అధికారులు తదితరులు ఉన్నారు. -
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తూ సూచించారు. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కోసం నూతనంగా చేపట్టిన భవననిర్మాణ పనులతో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రిని గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. మెడికల్, నర్సింగ్ కళాశాల్లో విద్యార్థులకు అందించాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంతకు ముందు మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నవజాత శిశు సంరక్షణ, క్రిటికల్ కేర్ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు. అనంతరం టీ హబ్ను పరిశీలించారు. టీ హబ్లో ఎంతమంది టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, ఒకవేళ సిబ్బంది లేకపోతే వైద్య పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారని, సకాలంలో రోగులకు ఎలా రిపోర్టులు అందిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేందర్కుమార్, టీజీఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజనీర్ శశిధర్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఇన్చార్జి సూపరింటెండెంట్ అరుణకుమారి, ప్రిన్సిపల్ లక్ష్మణ్రావు, డీఎంహెచ్ఓ మనోహర్, డీసీహెచ్ఎస్ సూర్యశ్రీరావు తదితరులు ఉన్నారు. ముత్తిరెడ్డిగూడెంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలభవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న క్రిస్టినాభువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బాలింతతో మాట్లాడుతున్న క్రిస్టినాఫ రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తూ -
ఎల్నినో ప్రభావం.. ఉంది ప్రత్యామ్నాయం
త్రిపురారం : ఎల్నినో ప్రభావంతో వానాకాలం సీజన్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తోంది. దీంతో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు సాంప్రదాయ పంటల సాగుకు పరిమితం కాకుండా పంట మార్పిడి వైపు అడుగులు వేయాలని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. వానాకాలం సీజన్లో పంటల సాగుపై ఆయన సలహాలు, సూచనలు ఇవీ.. వరిపై ఆధారపడటం తగ్గించుకోవాలి అధిక నీరు అవసరమయ్యే వరి సాగును రైతులు తగ్గించడం ఉత్తమం. ఎకరా వరి సాగుకు కావల్సిన నీటితో రెండు నుంచి మూడు ఎకరాల పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు చేపట్టవచ్చు. మినుములు, పెసర్లు, కందులు, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ నీరు, పెట్టుబడితో సాగు చేసే ఈ పంటల వల్ల నేలను పరిరక్షించుకోవచ్చు. వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామాల్లో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. భూసార పరీక్షలు చేయించాలి రైతులు పంట మార్పిడి చేపట్టడానికి ముందు భూసార పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. వానాకాలం పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు చేయించుకొని పంటలకు అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను వేయాలి. వరి సాగు తగ్గిస్తేనే రైతులకు ప్రయోజనం కంపాసాగర్ కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలుఈ సీజన్లో అనుకూలమైన పంటలు ఇవే..జిల్లాలో ఎర్ర నేలలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కంది, పెసర, మినుము, ఆముదం, సజ్జ, రాగి, జొన్న పంటలు సాగు చేయడం ఉత్తమం. అంతేకాకుండా బెండ, వంకాయ, టమాట, మిర్చి, దొండ, కాకర వంటి కూరగాయ పంటలను సాగు చేయడం వలన ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో కొన్ని మండలాల్లో వర్షాధార భూములు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా వరి సాగు కంటే పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు చేపట్టడం నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అందుబాటులో ఉన్న బోర్లు, బావుల్లోని నీటిని వినియోగించుకుని డ్రిప్లు, స్ప్రింక్లర్లు ఉపయోగిస్తూ నీటిని పొదుపుగా వాడుకోవచ్చు. -
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
నిడమనూరు : ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన నల్లబోతు సోమయ్య(65) ద్విచక్ర వాహనంపై ముకుందాపురం పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ వద్ద రోడ్డు దాటుతుండగా మిర్యాలగూడ నుంచి వస్తున్న టిప్పర్ అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని వైద్యం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి సోదరుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడమనూరు ఎస్ఐ డి. విజయ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని దుర్మరణం కోదాడ రూరల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్ వద్ద బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాపురం జంక్షన్ వద్ద రోడ్డు వెంట నిలబడి ఉన్న వ్యక్తిని విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కోదాడ పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుడు నీలం రంగు చొక్కా, ఖాకీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు వివరించారు. మృతుడి వివరాలు లేదా అతడికి సంబంధించిన సమాచారం తెలిస్తే కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. -
దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టురట్టు
పాలకుర్తిటౌన్(దేవరుప్పుల) : అక్రమ సంపాదన కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 24న దేవరుప్పుల గ్రామంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సృజన్కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన చింత సుదర్శన్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్య దొంగనోట్లు తయారు చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి దొంగ నోట్లు, ప్రింటర్, కారు, రూ.8500 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఆ నలుగురిని బుధవారం జనగామ జైలుకు తరలించారు. కారు, ప్రింటర్, ఇతర సామగ్రి స్వాధీనం -
సెంచరీ దాటిన అడ్మిషన్లు
మోత్కూరు : మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాటికి విద్యార్థుల నూతన ప్రవేశాలు 105కు చేరాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు అరవిందరాయుడు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధ్యాయుల కృషి ఫలితంగా పదో తరగతిలో వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించామన్నారు. దీంతో తల్లిదండ్రుల్లో పాఠశాల పట్ల నమ్మకం పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య ఇంకా పెంచడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న, ఉపాధ్యాయులు రాంప్రసాద్, రామకృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించాలిభువనగిరి: మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో సంకల్ప్ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందస్తుగా గర్భిణులను గుర్తించి వారికి సమవర్థంగా సేవలు అందించాలన్నారు. క్యాన్సర్రోగులకు సంబంధించిన వివరాలను పోర్టల్లో సకాలంలో నమోదు చేయాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ కోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ సూర్యశ్రీరావు, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, ఎస్ఎన్సీయూ ఇన్చార్జి కరుణాకర్ పాల్గొన్నారు. -
దారికాస్తున్న మృతు్యవు
పెద్దవూర : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్కు నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దీంతో నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి ప్రతిరోజు వందలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని పోతునూరు టోల్గేట్ నుంచి నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని కృష్ణా నదిపై నిర్మించిన వంతెన వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ రహదారిపై గతంలోనూ, ఇటీవల ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలకు కారణాలు.. ● నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారితో పాటు కొండమల్లేపల్లి నుంచి పెద్దవూర వరకు 26 కిలోమీటర్ల మేర జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారి కలిసి ఉన్నాయి. దీంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ● ముఖ్యంగా పొట్టిచెల్మ నుంచి నాగార్జునసాగర్ పైలాన్కాలనీ వరకు నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి, నకిరేకల్–అద్దంకి జాతీయ రహదారులు కలిసి ఉంటాయి. ఇక్కడ ప్రమాదకరమైన యూ ఆకారపు మూలమలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మూడు ప్రదేశాలలో ఘాట్ రోడ్డు ఉంది. దయ్యాలగండి, శివం హోటల్ వద్ద ఘాట్ రోడ్లు ఉన్నాయి. విజయ్ విహార్ నుంచి పైలాన్ కాలనీ శ్మశానవాటిక వరకు నాలుగు కిలోమీటర్ల మేర పూర్తిగా డౌన్లో ఉంటుంది. ● ముత్యాలమ్మ గుడి వద్ద ప్రమాదకరమైన యూ ఆకారంలో రోడ్డు ఉంది. ఈ ప్రదేశంలో వాహనాలు వేగాన్ని నియంత్రించుకోలేక అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ● రోడ్డు మధ్యలో డివైడర్ లేకపోవడం, మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, రహదారి చాలా ప్రదేశాల్లో ఎగుడుదిగుడు(అప్ అండ్ డౌన్)గా ఉండటం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫ హైదరాబాద్–సాగర్ రహదారిపై ప్రమాదకరంగా ఆ 35 కిలోమీటర్లు ఫ మూలమలుపుల వద్ద వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాలు -
మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు
సాక్షి, యాదాద్రి : ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో బీబీనగర్ ఎయిమ్స్ ప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, బీబీనగర్ ఎయిమ్స్ బీబీనగర్ మధ్య రెఫరల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఎయిమ్స్ కు రెఫర్ చేయబడే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లైజన్ అధికారిని నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎయిమ్స్ తరఫున జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో కూడా ఒక లైజన్ అధికారి అందుబాటులో ఉండి, రోగులకు తగిన సమన్వయం, వైద్య సహాయం అందించేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ మొబైల్ ప్లే స్టోర్ నుంచి స్వస్త్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, ఎయిమ్స్ ఆసుపత్రికి 500 మీటర్ల పరిధిలోకి రాగానే ఈ యాప్ ద్వారా ఓపీ టోకెన్ ను ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కొండల్ రెడ్డి, డీసీహెచ్ఎస్ సూర్యశ్రీ రావు, ఎయిమ్స్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
మదర్ డెయిరీని లాభాల బాట పట్టిస్తున్నాం
సాక్షి, యాదాద్రి : సీఎం రేవంత్రెడ్డి సహకారంతో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో ఒప్పందం చేసుకుని మదర్ డెయిరీని లాభాల బాట పట్టిస్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం భువనగిరిలోని మిల్క్ చిల్లింగ్ సెంటర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన మదర్ డెయిరీని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేయడం ప్రారంభించిందన్నారు. మదర్ డెయిరీని ఎన్డీడీబీ టేకోవర్ చేసిన వెంటనే పెండింగ్లో ఉన్న రూ.10 కోట్ల బిల్లులను పాడి రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఇటీవల మరో రూ.3 కోట్లు విడుదల చేశారన్నారు. అంతేకాకుండా లీటరు పాల ధర రూ.3 వరకు పెంచిందన్నారు. ఏ పాల సెంటర్ నుంచి అయితే రోజుకు 1000 లీటర్ల పాలు సేకరిస్తారో ఆ సెంటర్కు అదనంగా లీటరుకు రూ.1 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఏ పాడి రైతు అయితే ప్రతి రోజు 100 లీటర్ల కన్నా ఎక్కువ పాలు పోస్తారో వారికి లీటరుకు అదనంగా రూ.1 చొప్పున బోనస్ను ఇచ్చే విధానం అమలు చేస్తున్నామన్నారు. పాడి రైతులు మదర్ డెయిరీని మాత్రమే నమ్మాలని కోరారు. మూతపడిన భువనగిరి ఫీడ్ మిక్సింగ్ కర్మాగారాన్ని పునరుద్ధరించి, రైతులకు సబ్సిడీపై దాణా అందించాలని నిర్ణయించామన్నారు. రెండోసారి ధర పెంపు.. గేదె పాల(5 ఫ్యాట్) సేకరణ ధర గతంలో లీటరుకు రూ.40 ఉండేదని, ఎన్డీడీబీ మదర్ డెయిరీని టేకోవర్ చేసిన మొదటి నెలలోనే ఈ ధరను రూ.41.50 చేశారన్నారు. అంతేకాకుండా మంగళవారం నుంచి మరో రూపాయి పెంచడంతో ప్రస్తుతం లీటరు పాల సేకరణ ధర రూ.42.50కి చేరిందన్నారు. ఆవు పాల(3 ఫ్యాట్) సేకరణ ధర గతంలో లీటరుకు రూ.34.50 ఉండేదన్నారు. రెండుసార్లు ధర పెంచిన తర్వాత ప్రస్తుతం లీటరు పాల సేకరణ ధర రూ.36.46కి చేరిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్లు కస్తూరి పాండు, శ్రీశైలం, నరేందర్రెడ్డి, నర్సింహులు, రాంరెడ్డి, భాస్కర్గౌడ్, డెయిరీ సీఈఓ కాటిపల్లి లింగారెడ్డి, చైర్మన్లు వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫ మరోసారి పాల సేకరణ ధర పెంపు -
ఉపాధ్యాయుల సర్దుబాటు
భువనగిరి: ఉపాధ్యాయుల సర్దుబాటుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా స్కూళ్లలో ఏ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఎక్కడైనా ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయి, లాంగ్లీవ్లో వెళ్లగా ఏర్పడిన ఖాళీలు ఎన్ని ఉన్నాయో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల వారీగా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల అవసరాలను గుర్తిస్తున్నారు. ఈ లెక్కలు తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మిగులు ఉపాధ్యాయుల పోస్టుల సర్దుబాటు ఉత్తర్వులు 2024 అనుసరించి ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. జిల్లాలో715 ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో ప్రస్తుతం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2,457 మంది ఉపాధ్యాయులుండగా వీరిలో ఉన్నత పాఠశాలల్లో 1412 మంది, ప్రాథమిక పాఠశాలల్లో 1,045 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. డిప్యుటేషన్పై వెళ్లిన చోట అవసరముంటే.. డిప్యుటేషన్పై వెళ్లినచోట సదరు సబ్జెక్ట్ ఉపాధ్యాయుని అవసరం ఇంకా ఉంటే అతను అక్కడే కొనసాగాల్సి ఉంటుంది. కాగా సర్దుబాటు ప్రక్రియ ముందుగా జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అనంతరం ప్రాథమిక పాఠశాలల్లో చేయనున్నారు. జీఓ నంబర్ 25లోని మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. రిలీవింగ్ పై ఆంక్షలు విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల వారీగా సబ్జెక్టుల వారీగా అవసరాలను గుర్తించి జిల్లా పరిధిలోని మిగులు ఉపాధ్యాయులను అవసమున్న పాఠశాలల్లో సర్దుబాటు చేయడానికి గతంలో కలెక్టర్కు అధికార ఉత్తర్వులు ఇచ్చారు. దీనిప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో ఈ సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేశారు. అలాగే వర్క్ అడ్జెస్ట్మెంట్ ప్రాతిపదికన మిగులు పాఠశాలల నుంచి అవసరమున్న పాఠశాలలకు పంపించిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయవద్దని 2026 ఏప్రిల్ 22న స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయమై తగిన సూచనలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులను సైతం ఆదేశాలు ఇచ్చారు. వివరాలు సేకరిస్తున్నాం – డీఈఓ జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి ఖాళీలు వివరాలు సేకరిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఫ సబ్జెక్టుల వారీగా ఖాళీ పోస్టులపై అధికారుల ఆరా ఫ 20వతేదీ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగానే టీచర్ల కేటాయింపు -
ఓట్లు, సీట్లు చోరీ చేస్తున్న మోదీ
యాదగిరిగుట్ట: దేశంలో మతాలు, కులాలను అడ్డుపెట్టుకొని ప్రధాని మోదీ ఓట్లు, సీట్లు చోరీ చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో రైతులు, యువత, విద్యార్థులు, ప్రజలను ప్రధాని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పన్నెండు ఏళ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తున్న ప్రధానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా నీట్ను రద్దు చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రధానినీట్ను రద్దు చేసి వారి పాలిట శాపంగా మారారన్నారు. ఓట్లను రద్దు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఓటు హక్కుపై బూత్ లెవల్ ఎజెంట్లు అవగాహన కల్పించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నెల 26న యాదగిరిగుట్ట పట్టణంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో కలిసి 5వేల మందితో విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఛాత్ర్కి గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, ముక్కెర్ల మల్లేష్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రమ్య పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
రెండు రోజుల వ్యవధిలోనే..
● ఈ నెల 19న అర్థరాత్రి పెద్దవూర మండలంలోని రామన్నగూడెం గ్రామ స్టేజీ సమీపంలో రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. ● ఈ నెల 17న పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ స్టేజీ సమీపంలో టోల్గేట్ వద్ద బైక్ను కారు ఢీకొట్టడంతో బైక్ను నడుపుతున్న దేవరకొండ పట్టణానికి చెందిన గొడుగు సతీష్ మృతి చెందాడు. ● మార్చి 17వ తేదీన పెద్దవూర మండల కేంద్రంలోని పత్తి మిల్లులో పనిచేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన రామ్రేఎంబర్రం రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ● పొట్టిచెల్మ సమీపంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలోని దయ్యాలగండి వద్ద మూలమలుపుతో పాటు ఘాట్ రోడ్డు ఉండటంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతంలో మూడేళ్ల క్రితం గడ్డి ట్రాక్టర్ రోడ్డుపై అడ్డంగా బోల్తా పడటంతో ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. లారీ అదుపుతప్పి ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో పలువురు మృత్యువాత పడ్డారు. ● గతంలో ఓ ప్రైవేట్ బస్సు సైతం అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు మృతిచెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. -
డీసీఎం బోల్తా.. డ్రైవర్ మృతి
మహబూబాబాద్ రూరల్ : డీసీఎం బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని సాలార్ తండా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాత ఇనుప సామాను దుకాణం నుంచి సామగ్రిని డీసీఎంలో హైదరాబాద్ తరలిస్తున్నారు. వాహనం జిల్లా కేంద్రం శివారులోని సాలార్ తండా మీదుగా వెళ్తున్న క్రమంలో ఆటో ఎదురుగా వచ్చింది. దీంతో ఆటోను తప్పించబోయి డీసీఎం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎల్లగొండ లాలయ్య (35)గా గుర్తించారు. ఘటనాస్థలిని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.ఫ మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా వాసి -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
భువనగిరిటౌన్ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు. అడ్డగూడూరు మండలం డి. రేపాక గ్రామంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి భూములు కోల్పోతున్న రైతుల్లో ప్రస్తుతం పది మందికి సంబంధించి 16 ఎకరాల 30 గుంటల భూమికి నష్టపరిహారంగా రూ. 2,10,46,786 విలువైన చెక్కులను బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీఓ కృష్ణారెడ్డిలతో కలిసి రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సామేల్ మాట్లాడుతూ డి. రేపాకలోని సర్వే నంబర్ 165 పరిధిలో గల భూములను ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దఫా కింద మొత్తం 15 మంది రైతుల నుంచి 28 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే, ప్రస్తుతానికి పది మంది రైతులకు చెక్కులు అందజేశామన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో రాబోయే రోజుల్లో మోత్కూరు, అడ్డగూడూరు ప్రాంతాలు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.త్వరలోనే మోత్కూరులో కోర్టు ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కృష్ణా రెడ్డి, తహసీల్దార్ ఎ. శేషగిరి రావు, డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు, ఆర్ఐ నగేష్ కుమార్, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, మార్కెట్ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, జీపీఓ మాధవి పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే మందుల సామేల్ -
చైన్ స్నాచింగ్కు పాల్పడిన నిందితుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్నగర్లో ఈ నెల 17న చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు నిందితులను మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం గోపసముద్రం తండాకు చెందిన అజ్మీరా శశిధర్నాయక్, బంగారుగడ్డకు చెందిన ధనావత్ కార్తీక్ హైదరాబాద్లో ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరిద్దరు హైదరాబాద్లో పార్కింగ్ చేసిన స్కూటీని చోరీ చేశారు. ఈ నెల 17న తెల్ల వారుజామున మిర్యాలగూడ పట్టణంలోని అశోక్నగర్లో మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చైన్స్నాచింగ్ చేసింది తామేనని ఒప్పుకున్నారు. చోరీ చేసిన బంగారు గొలుసును మిర్యాలగూడలోని మణప్పురం ఫైనాన్స్లో తనఖా పెట్టి రూ.1.22లక్షలు రుణం తీసుకుని జల్సాలకు ఖర్చు చేసినట్లు సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రెండు స్కూటీలు, రెండు సెల్ఫోన్లు, తనఖా పెట్టిన బంగారు గొలుసుకు సంబంధించిన రశీదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో మూడో విడత అడ్మిషన్లు
భూదాన్పోచంపల్లి : భూదాన్పోచంపల్లి మండలంలోని దేశ్ముఖిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు ఈ నెల 27, 29, 30వ తేదీల్లో ఏదో ఒక రోజు ఉదయం 6 గంటల వరకు కళాశాలలో నేరుగా తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆమె సూచించారు. ఫిజికల్, మెడికల్ టెస్ట్లతో పాటు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. శారీరక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా ట్రాక్ సూట్, షూస్ ధరించి రావాలని అన్నారు. విద్యార్థుల కనీస ఎత్తు 152 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని, కంటి దోషాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదని తెలిపారు. మరిన్ని వివరాలకు 79950 10687 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఖాతాల్లో సొమ్ము.. తీసుకోనివ్వరు
మోత్కూరు : అకౌంట్లలో డబ్బులున్నా డ్రా చేసుకోలేని పరిస్థితి.. మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన 254 దళిత కుటుంబాలది. రెండేళ్లుగా ఖాతాలు ఫ్రీజింగ్ అయి ఉన్నాయి. ఈ విషయంలో అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత ప్రభుత్వం 2023 నవంబర్లో దళితబంధు రెండో విడత కింద మోత్కూరు, అడ్డగూడూరు మండలాల నుంచి 254 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. వివిధ రకాల వ్యాపారాలు, వాహనాల యూనిట్ల కోసం ఒక్కొక్కరి వ్యక్తిగత ఖాతాలో రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.7.62 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో కలెక్టర్ల ఆదేశాల మేరకు ఈ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఎన్నికలు ముగిసి, ప్రభుత్వం మారి రెండేళ్లు కావస్తున్నా నేటికీఫ్రీజింగ్ను ఎత్తివేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. స్పందించని యంత్రాంగం దళితబంధు నిధులను మంజూరు చేయాలని గతేడాది జనవరి 28న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా స్థానిక యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం. తమ సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్కు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగకు, స్థానిక తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి దళితబంధు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.ఫ రెండేళ్లుగా 254 మంది దళిత కుటుంబాల ఖాతాలు ఫ్రీజింగ్ ఫ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల దళితబంధు లబ్ధిదారుల ఎదురుచూపు -
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
భువనగిరి: కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు జెడ్పీ సీఈఓ శోభారాణి పేర్కొన్నారు. బుధవారం భువనగిరి మండలంలోని తాజ్పూర్ ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోషశ్రీనివాస్ రూ. 16లక్షల సొంత ఖర్చులో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, ఎల్ఈడీ డిజిటల్ క్లాస్ స్క్రీన్, వైఫై, సీసీకెమెరాలు, మూత్రశాలలు, ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్ట ర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ గ్రామసర్పంచ్ సొంత ఖర్చులతో పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. సర్పంచ్ ర్యాకల సంతోషశ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలన్నారు. అంతకుముందు కళాకారులు పాడిన పాటలు, విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, ఎంఈఓ రంగరాజ్, సామాజిక వేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ, వార్డు సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కనుల పండువగా ఎల్లమ్మ కల్యాణం
కనగల్ : మండలంలోని దర్వేశిపురం(పర్వతగిరి) రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. రేణుకా ఎల్లమ్మ తల్లి, జమదగ్ని మహాముని ఉత్సవ విగ్రహలను పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకురాగా.. బ్రహ్మశ్రీ డేరం భాస్కరశర్మ, ఆలయ అర్చకులు, వేద పండితుల బృందం కల్యాణం నిర్వహించారు. భక్తులు ఒడిబియ్యం, కట్న కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి..అమ్మవారికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వం తరఫున ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబాటి నాగిరెడ్డితో కలిసి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కల్యాణం అనంతరం మంత్రికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జన సంద్రంగా ఆలయ పరిసరాలు..కల్యాణాన్ని తిలకించేందుకు నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, లలితా సహస్రనామార్చన, బాలభోగ నివేదన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణోత్సవం తర్వాత భక్తులకు అన్నదానం చేశారు. సీఐ రాము ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, సర్పంచులు రాయల శేఖర్, నేలగొందరాశి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మెహన్రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, గోలి జగాల్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, కూసుకుంట్ల రాజిరెడ్డి, గోలి నర్సిరెడ్డి, కంచరకుంట్ల గోపాల్రెడ్డి, ఆలయ సిబ్బంది శ్రీనివాసచారి, ఫణి, అజయ్కుమార్, నాగరాజు, నాగేశ్వర్రావు, కూసం ఉపేందర్రెడ్డి, అంజనేయులు, రాజయ్య, శ్రీకర్, నాగరాజు, రవి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.నేడు బోనాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 4గంటలకు బోనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు ఏకాంత సేవ తదితర కార్యక్రమాల అనంతరం ఉత్సవాలు ముగుస్తాయి.ఫ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు
పెద్దవూర : కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దవూర మండలం ఊరబావితండా వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు ఊరబావితండా సమీపంలోని ఏఎమ్మార్పీ వరద కాలువ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమై టైరు ఊడిపోయింది. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు.ఉపాధ్యాయురాలి ఆత్మహత్యరామగిరి(నల్లగొండ) : నల్లగొండ మండల పరిధిలోని జీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన నందిత మోండాల్, ప్రోలై మోండాల్ దంపతులు 2020–21 విద్యా సంవత్సరం నుంచి నల్లగొండ మండల పరిధిలోని జీ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప ఉంది. ఆమె కూడా ఇదే పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. వీరు పాఠశాలలోని స్టాఫ్ క్వార్టర్స్లో నివసిస్తున్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం నందిత మోండాల్ భోజనం చేసేందుకు పాఠశాల నుంచి క్వార్టర్స్కి వెళ్లింది. చాలాసేపటి వరకు నందిత మోండాల్ తిరిగి రాకపోవడంతో భర్త ప్రోలై మోండాల్ వెళ్లి చూడగా ఆమె ఉరేసుకుని కనిపించింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నల్లగొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలం పశ్చిమబెంగాల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మహిళ మృతిగుండాల : కుటుంబ కలహాలతో ఉరేసుకున్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన సిగ స్వరూప(36) కుటుంబ కలహాల కారణంగా కొద్దిరోజుల క్రితం గుండాల మండలం అంబాల గ్రామంలో ఉంటున్న తన చిన్న మ్మ బీసు సత్తమ్మ ఇంటికి వచ్చింది. మనస్తాపానికి గురైన స్వరూప ఈ నెల 19న తన చిన్నమ్మ ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలి తండ్రి గునుగుండ్ల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం. శోభన్బాబు తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
4వ తరగతి.. రూ.55వేలు
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల బాదుడు అమలుకాని చట్టం ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త ముసాయిదా చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం.. పాఠశాలల ప్రాంగణాల్లో యూనిఫాం, పుస్తకాలు, బెల్టులు, టైలు విక్రయించకూడదు. కానీ ప్రైవేట్ స్కూళ్లు క్యాంపస్లోనే సొంతంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. లేదా తాము చెప్పిన ప్రైవేట్ దుకాణాల్లోనే కొనాలని నిబంధనలు పెట్టి మార్కెట్ రేటు కంటే రెట్టింపు ధరకు అమ్ముతున్నాయి. అలాగే, ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుతున్నాయి. ఈ ముసాయిదా నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఉండాలంటే.. జిల్లా విద్యాశాఖ తక్షణమే ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలి. విద్యా సంవత్సరం (జూన్) ప్రారంభం నుంచే ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ప్రైవేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే సామాన్య విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.ఫ డిజిటల్ క్లాసులు, ఏఐ బోధన పేరిట ఏటా 10 నుంచి 30 శాతం పెంపు ఫ కొరవడిన విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఫ యాజమాన్యాల ఇష్టారాజ్యంసాక్షి యాదాద్రి: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. ఎల్కేజీకే రూ.30 వేలకు పైగా వసూలు చేయడంతో పాటు.. పుస్తకాలు, యూనిఫాం తాము చెప్పిన దుకా ణాల్లోనే కొనాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితం కావడం, అధికారుల పర్యవేక్షణ కరువవడంతో జిల్లాలో విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. జిల్లాలో 56,066 మంది విద్యార్థులు జిల్లాలో 160 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో 56,066 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రైవేట్ ఎయిడెడ్–3, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 152, సీబీఎస్ఈ 5 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 31,071, బాలికలు 24,995 మంది చదువుకుంటున్నారు.భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, మోత్కూరు, బీబీనగర్, వంటి ప్రధాన కేంద్రాల్లోని ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అక్షరాలా రూ.30వేలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నాణ్యమైన చదువు, డిజిటల్ క్లాసులు, ఏఐ విద్యాబోధన పేర్లతో ఏటా 10 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతూ యాజమాన్యాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. వ్యాపారం ఇలా.. ప్రైవేట్పాఠశాలలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంతోనే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్లను తాము సూచించిన చోటనే కొనుగోలు చేయాలన్న నిబంధన పెట్టాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఒక్కో ప్రైవేట్ పాఠశాల ఒక్కో బుక్స్టోర్ను ఎంపిక చేసుకున్నాయి. అక్కడే కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. ఏఐ బేసిక్స్, ఐఐటీ కోచింగ్, ఫౌండేషన్, ఒలింపియాడ్, వర్క్షీట్లు, నోట్బుక్స్, అసైన్మెంట్ బుక్స్, యాక్టివిటీ బుక్స్, వర్క్బుక్స్ ఇలా పలురకాలుగా అంటగట్టి డబ్బులు దండుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మెటీరియల్ అమ్ముతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సోషల్మీడియాలో వైరల్ అయిన 4వతరగతి స్కూల్ ఫీజుల పట్టిక ట్యూషన్ ఫీజు రూ.34,000పుస్తకాలు రూ.6,500స్కూల్ బస్సు ఫీజు రూ.10,000 అడ్మిషన్ ఫీజు రూ. 3,000 యూనిఫాం (జతకు):రూ.1,500 -
‘ప్రగతి ప్రణాళిక ’ సమస్యలు పరిష్కరించాలి
సాక్షి, యాదాద్రి : జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్కా సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. జిల్లాలో ఫైళ్ల క్లియరెన్స్, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్య సేవలు, అరైవ్ అలైవ్, వ్యవసాయం, విద్యా, సంక్షేమం, మహిళా వారోత్సవాలు, యువజన, క్రీడలు, పశు సంవర్ధక , అటవీ, మత్స్య శాఖల కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా బెనహర్ మహేష్ దత్ ఎక్కా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను పరిశీలించేందుకు వెంటనే కార్యాచరణ ప్రారంభించాలన్నారు. ప్రమాదాల నివారణకు, డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెలా ఇలా సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి , సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్కా ఫ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష -
తడి చెత్త నుంచి ఎరువు తయారు చేద్దాం
ఫ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి రవికుమార్ భువనగిరి టౌన్ : తడి చెత్త నుంచి ఎరువును తయారు చేసేలా క్షేత్రస్థాయి సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కల్పించాలని భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ సూచించారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని మున్సిపల్ రిసోర్స్ పార్క్ (డంపింగ్ యార్డ్)లో ఆన్సైట్ కంపోస్టింగ్పై నిర్వహించిన శిక్షణకు ఆమె హాజరయ్యారు. భువనగిరి మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత పాల్గొని క్షేత్రస్థాయి బృందాలకు సాంకేతిక మార్గదర్శకత్వం చేశారు. చైర్పర్సన్ శ్రీవాణి మాట్లాడుతూ ఆన్సైట్ కంపోస్టింగ్ విధానాన్ని సమర్థంగా అమలు చేయడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ శిక్షణలో భువనగిరితో పాటు మోత్కూరు, చౌటుప్పల్, ఆలేరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, స్టేషన్ ఘన్పూర్, జనగామ మున్సిపాలిటీలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కమిషనర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనల్లోనే షాపింగ్ కాంప్లెక్స్
ఆలేరు: ఆలేరు పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన మున్సిపల్ స్థలం ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో ఆక్రమణల ముప్పు పొంచి ఉంది. ఇక్కడ ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలన్న మున్సిపల్ పాలకవర్గం ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాంప్లెక్స్ నిర్మిస్తే అటు మున్సిపాలిటీకి లక్షల్లో ఆదాయంతో పాటు, ఇటు స్థానిక యువతకు ఉపాధి లభించే అవకాశం ఉన్నా.. బీఓటీ విధానానికి స్పందన కరువవడం, అధికారుల జాప్యంతో ఆ విలువైన స్థలం నిరుపయోగంగా మారింది. కొత్త నిర్మాణాలు చేపట్టక.. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్–వరంగల్ హైవే పక్కన రైల్వేస్టేషన్ ఎదురుగా మున్సిపాలిటీకి చెందిన సుమారు 600 చదరపు గజాల విలువైన స్థలం ఉంది. మున్సిపాలిటీ ఏర్పడక ముందు నుంచే ఈ స్థలంలో ఆరు వాణిజ్య మడిగెలు ఉండేవి. వాటిని అద్దెకు ఇచ్చి గ్రామపంచాయతీ, అనంతరం మున్సిపాలిటీ ఆదాయాన్ని పొందాయి. అయితే కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఆ మడిగెలను గత పాలకమండలి హయాంలో కూల్చివేసినప్పటికీ, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టలేదు. ఫలితంగా అద్దె రూపంలో వచ్చే ఆదాయానికి బ్రేక్ పడింది. కౌన్సిల్లో తీర్మానం చైర్పర్సన్గా బీజన బాలమణి నేతృత్వంలోని ప్రస్తుత పాలకవర్గం బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్(బీఓటీ) విధానంలో షాపింగ్ కంప్లెక్స్(మడిగెలు) నిర్మించాలని నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది మార్చిలో జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో తీర్మానం కూడా చేసింది. అయితే మూడు నెలలు గడిచినా కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. ఆక్రమణల భయం.. పట్టణంలో ప్రధాన ప్రాంతంలోని మున్సిపల్ స్థలం చుట్టూ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.2కోట్ల వరకు ఉంటుందని స్థానికుల అంచనా. ఇలాంటి విలువైన స్థలాన్ని ఏళ్ల తరబడి ఖాళీగా వదిలేయడం వల్ల భవిష్యత్తులో ఆక్రమణల ముప్పు పొంచి ఉందనే భయాందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మున్సిపల్ నిధుల నుంచి.. రూ.15కోట్ల టీయూఎఫ్డీసీ ,మరో రూ.15కోట్ల నగరాభివృద్ధి నిధులతోపాటు అదనంగా జనరల్ ఫండ్ కూడా మున్సిపల్ ఖజానాలో ఉంది. బీఓటీ విధానంలో ఎవరూ ముందుకు రాకపోతే మున్సిపాలిటీలోని నిధుల్లోంచి కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టే అంశాన్ని పాలకమండలి ,అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.ఫ ఆలేరులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఫ మూడునెలలైనా బీఓటీ విధానానికి స్పందన కరువు ఫ రూ.2కోట్ల విలువైన స్థలానికి ఆక్రమణల ముప్పు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే యోచనతో గత కౌన్సిల్లో పాలకమండలి తీర్మానం చేసింది. బీఓటీ విధానంలో నిర్మించాలని భావించినప్పటికీ ఆశించిన స్పందన రావడం లేదు. దాంతో అర్బన్ చాలెంజింగ్ ఫండ్(యూసీఎఫ్) కింద మున్సిపాలిటీనే నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వానికి ఇటీవల ప్రతి పాదన చేశాం.ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్,ఆలేరు -
దారి లేదు.. దిక్కూలేదు!
చౌటుప్పల్ : చౌటుప్పల్లో అండర్పాస్ విస్తరణ పనులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా ముందస్తు సమాచారం లేకుండా దారులను మూసేస్తుండటంతో ట్రాఫిక్ కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న వాహనాలతో పట్టణం దాటాలంటేనే జనం జంకుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువై, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. జాతీయ రహదారిని మూసి.. చౌటుప్పల్లో అండర్పాస్ విస్తరణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభించారు. ముందుగా ఇరువైపులా సర్వీస్రోడ్ల వెంట డ్రెయినేజీలు నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. నవోదయ టాకీస్ వద్ద నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు 2.37కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. అందులో భాగంగా నవోదయ టాకీస్ ప్రాంతంలో పనులు ప్రారంభించారు. అక్కడి నుంచి తంగడపల్లి చౌరస్తా వరకు మొదలుపెట్టారు. కానీ పని మాత్రం బస్టాండ్ ఎదురుగానే ఎక్కువగా చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ ముందు, తంగడపల్లి చౌరస్తా సమీపంలో అప్పుడప్పుడు పనులు సాగుతున్నాయి. మంగళవారం చిన్నకొండూర్ రోడ్డు నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వరకు జాతీయ రహదారిని మూసేసి వాహనాలను సర్వీస్రోడ్డు మీదుగా మళ్లించారు. దాంతో ప్రజలు, వాహనదారులు నరకం చూస్తున్నారు. దారి మళ్లింపుతో మరిన్ని కష్టాలు అండర్పాస్ నిర్మాణం చేపట్టడంతో ముందుగా హైదరాబాద్ మార్గంలో తంగడపల్లి చౌరస్తా నుంచి పైలాన్పార్క్ వరకు, ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లే దారి నుంచి బస్టాండ్ వరకు వాహనాలను హైవే మీది నుంచి సర్వీస్రోడ్డు వైపునకు దారి మళ్లించారు. కొద్ది రోజుల తర్వాత బస్టాండ్ వద్ద వాహనాలను నిలిపివేసి సర్వీస్రోడ్డు మీదుగా చిన్నకొండూర్ వరకు మళ్లించారు. తాజాగా చిన్నకొండూర్ రోడ్డు నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వరకు హైవే రోడ్డును పూర్తిగా మూసేశారు. వాహనాలు హైవేపైకి రాకపోకలు సాగింగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జేసీబీతో కాలువ(ట్రెంచ్) తవ్వారు. అయితే ఇప్పటి వరకు మూడు నెలలు దాటినప్పటికీ ప్రారంభించిన ప్రాంతంలో నామమాత్రంగానే పని జరగగా ఇప్పుడు అదనంగా మరో కిలోమీటరు దూరాన్ని మూసేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నకొండూర్ చౌరస్తా వద్ద హైవేపైకి వెళ్లకుండా అడ్డంగా కాలువ తవ్వించిన కాంట్రాక్టర్విజయవాడ మార్గంలో సర్వీస్రోడ్డు మీదుగా బారులుదీరిన వాహనాలు చౌటుప్పల్ పట్ణణంలో అండర్పాస్ విస్తరణ కష్టాలు ఫ ఇష్టానుసారంగా రోడ్లు మూసేస్తున్న కాంట్రాక్టర్ ఫ ట్రాఫిక్ చక్ర బంధంలో ప్రజలు, వాహనదారులుపట్టణంలో నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై పనులు చేస్తూ సాధారణ రోడ్డు మాదిరిగా వ్యవహరిస్తూ స్థానిక ప్రజలు, వాహనదారులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రి నిర్ణయాలు తీసుకొని ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నారు. ఇదేమని ఎవరైనా గట్టిగా అడిగితే తాము అందరికీ సమాచారం ఇచ్చామంటున్నారు. ఎవరికి ఇచ్చారని నిలదీస్తే పోలీసు శాఖ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. చిన్నకొండూరు జంక్షన్ మూసివేసి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద వాహనాలు హైవేపైకి వెళ్లేలా చేసిన కాంట్రాక్టర్, వలిగొండరోడ్డు నుంచి చౌటుప్పల్ పాత ఊర్లోకి ఏ రోడ్డు గుండా వెళ్లాలో ప్రత్యామ్నాయ మార్గాలను చూపించలేదు. కొంత మంది తప్పనిసరి పరిస్థితుల్లో విజయవాడ మార్గంలో ప్రమాదకరంగా ఎదురుగానే వెళ్తున్నారు. ఇప్పటికై నా వివిధ శాఖల అధికారులు చొరవ తీసుకొని ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని పలువురు కోరుతున్నారు. -
ప్రతి విద్యార్థినిపై పర్యవేక్షణ ఉండాలి
ఆత్మకూరు(ఎం): రపతి విద్యార్థినిపై పర్యవేక్షణ ఉంచి, నాణ్యతమైన విద్యను అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో పరిసరాలు, స్టోర్ రూమ్లు, కిచెన్ గదిని, వంటను పరిశీలించారు. విద్యార్థినుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మోనూ ప్రకారం వంటచేయాలని సూచించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు అందిస్తున్న పోషకారం పరిశీలించారు. ఆయన వెంట డీఈఓ బి. భిక్షపతి, తహసీల్దార్ వి. లావణ్య, ఎంఈఓ కొత్త మహదేవరెడ్డి, ఎస్ఓ ఎం. పద్మ ఉన్నారు. గుట్ట దేవస్థానం ఉద్యోగుల తాత్కాలిక సంఘం ఏర్పాటుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉద్యోగుల తాత్కాలిక సంఘాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా ఏఈఓ జి.రఘు, ప్రధాన కార్యదర్శిగా సూపరింటెండెంట్ వి.వెంకటప్రసాద్, కోశాధికారిగా డి.నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉప ప్రధానార్చకుడు శ్రీధర్ శర్మ, కార్యవర్గ సభ్యులుగా ఉప ప్రధానార్చకుడు మాధవాచార్యులు, సీనియర్ అసిస్టెంట్లు రత్న దీప, ఎన్.నగేష్, రికార్డు అసిస్టెంట్ డి.శ్రవణ్కుమార్, ఎం.రాం తిరుపాలు, బండ సత్యనారాయణ, బి.పాండు, యాదగిరి, నాగులు తదితరులను నియమించారు. అనంతరం రఘు, వెంకటప్రసాద్లు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే సాధారణ సమావేశం ఏర్పాటు చేసి, శాశ్వత కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలు చేశారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో పూజలు నిర్వహించారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన చేశారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర భువనగిరిటౌన్ : అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు ఆరోపించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ నూతనంగా తీసుకొస్తున్న ప్రీ–ప్రైమరీ స్కూళ్ల బాధ్యతలను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించాలన్నారు. ప్రీ–ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు, ఆయాలను నియమించడం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న వారి ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మాయకృష్ణ, తెలంగాణ అంగన్న్వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు. -
రెండెకరాలు దాటేనా..
భువనగిరి: రైతు భరోసా పథకం కింద ఈ నెల 30 నుంచి తొమ్మిది రోజుల పాటు పంటల సాగు పెట్టుబడికి ఆర్థిక సహాయం విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంపై జిలా్ల్ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యాసంగి సీజన్లో ఈ పథకం కింద సాయం కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని రైతులకు ఎవరికి ఎంత భూమి ఉన్నా ఎకరాకు రూ. 6వేల చొప్పున రెండు ఎకరాల వరకు మాత్రమే రెండు విడుతల్లో ఆర్థిక సాయం అందించారు. రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు సంతోషించినా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారికి గతంలో మాదిరిగా ఆర్థిక సహాయం అందక నిరాశకుగురయ్యారు. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో పథకాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 5వేల చొప్పున అందించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంవత్సరం యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 2024 వానాకాలం సీజన్లో రైతు బంధు కింద ఆర్థిక సహాయం చేయలేదు. అనంతరం రైతు భరోసా పథకంగా పేరు మార్చి 2024–25లో యాసంగిలో ఎకరానికి రూ. 6వేల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి శ్రీకారం చుట్టింది. ఈ సీజన్లో జిల్లాలోని 1,88,526 మంది రైతులకు రూ. 174.11 కోట్లు ఆర్థిక సహాయం అందించింది. ఆ తర్వాత 2025లో వానాకాలం సీజన్లో 2,33,418 మంది రైతులకు రూ. 36.47.కోట్ల ఆర్థిక సహాయం కింద రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది.2025–26 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 6వేల చొప్పున కేవలం రెండు ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అందించింది. దీనిప్రకారం జిల్లాలో 211285మంది రైతులకు రూ. 192.60కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. ఇంకా చాలా మంది రైతులకు రెండు ఎకరాల పైబడిన వారికి అందలేదు. ఈసారి వానాకాలం సీజన్లో అందరికీ మొత్తం విస్తీర్ణణానికి ఆర్థిక సహాయం అందిస్తారా లేక మళ్లీ రెండు ఎకరాల మేరకే అందిస్తారా అనే సందేహం రైతుల్లో కలుగుతోంది. ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో జరిగే రైతు సమ్మేళనంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలోఆ రోజు నుంచి రైతుల ఖాతాలో పెట్టుబడి సహాయం జమకానుంది. ఫ 30 నుంచి రైతు భరోసా విడుదల చేస్తామన్న సీఎం ఫ రైతుల ఎదురుచూపు -
రైతు కళ్లుగప్పి నగదు చోరీ
● స్కూటీ డిక్కీలో పెట్టిన డబ్బులు అపహరించిన దుండగులురామన్నపేట : ఎరువుల దుకాణం ముందు రైతు పార్కింగ్ చేసిన స్కూటీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.60వేల నగదు అపహరించాడు. ఈ ఘటన సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన చిరబోయిన నర్సింహ సోమవారం రామన్నపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో గోల్డ్లోన్ తీసుకున్నాడు. లోన్ డబ్బు మొత్తం ఒకేసారి డ్రా చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో రూ.50వేలు డ్రా చేశాడు. వాటితో పాటు తన వద్ద ఉన్న మరో రూ.10వేలు కలిపి కవర్లో వేసి తన ఎలక్ట్రిక్ స్కూటీ డిక్కీలో పెట్టి గ్రోమోర్ సెంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని యూరియా తీసుకునేందుకు ఫర్టిలైజర్ షాపు వద్దకు వెళ్లాడు. స్కూటీని షాపు ముందు పార్కింగ్ చేసి లోపలికి వెళ్లాడు. బ్యాంకు వద్ద నుంచి అతడిని అనుసరించి వచ్చిన నలుగురు వ్యక్తుల్లో ఒకరు నర్సింహకు స్కూటీ కనబడకుండా అడ్డుగా నిలబడగా.. మరో వ్యక్తి స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి కవర్ను తీశాడు. హెల్మెట్ ధరించి బైక్పై వచ్చిన మరో వ్యక్తి అతడిని ఎక్కించుకొని వెళ్లాడు. షాపు వద్ద అమర్చిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కవర్లో నగదుతో పాటు భూమి పాసుపుస్తకం, బ్యాంకు పాసుపుస్తకం, పాన్కార్డు, ఆధార్కార్డులు ఉన్నాయని బాధితుడు తెలిపాడు. డబ్బు అపహరించిన వ్యక్తుల్లో ఒకరు బ్యాంకులో నర్సింహ లోన్కు సంబంధించిన ఓచర్ రాసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారు బ్యాంకు నుంచే నర్సింహను అనుసరించినట్లు గ్రోమోర్ సెంటర్, ఫర్టిలైజర్ షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. సమాచారం తెలుసుకున్న రామన్నపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. పిడుగు పడి గొర్రెల కాపరి మృతిచిట్యాల : పిడుగుపడి గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలి పిన వివరాల ప్రకారం.. వట్టిమర్తి గ్రామానికి చెందిన సంగబుడ్డి నాగరాజు(32) గొర్రెలు కాసేందుకు గ్రామ శివారులోకి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో కురిసిన భారీ వర్షానికి నాగరాజు సమీపంలో పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తిరుమలగిరి (సాగర్) : గేదెలు మేపేందుకు వెళ్లిన వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి(సాగర్) మండలంలోని బోయగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయగూడెం గ్రామానికి చెందిన పుట్టపాక మల్లయ్య (45) రోజుమాదిరిగా సోమవారం కూడా గేదెలను మేపడానికి గ్రామ శివారులోకి వెళ్లగా.. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య పదేళ్ల క్రితమే మరణించగా.. ఇద్దరు కుమారులు హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జునసాగర్లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడిమిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని అశోక్నగర్లో పేకాట స్థావరంపై సోమవారం టూటౌన్ పోలీసులు దాడి చేసి జూదరులను అరెస్ట్ చేశారు. టూటౌన్ సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్నగర్లోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు చేశామని సీఐ తెలిపారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి రూ.6,500 నగదు, ఎనిమిది సెల్ఫోన్లు, నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
కుటుంబ సమస్యలతో బలవన్మరణం
నిడమనూరు : కుటుంబ సమస్యలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కమ్మంపాటి శ్రీనివాస్(38) కుటుంబంలో గొడవల కారణంగా కొంతకాలంగా అతడి భార్య లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో యువకుడు మృతి మర్రిగూడ : మండలంలోని అజ్జలాపురం గ్రామానికి చెందిన యువకుడు విద్యుత్ స్తంభాలు నాటేందుకు కూలీకి వెళ్లిన ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. అజ్జలాపురం గ్రామానికి చెందిన విజయ, లచ్చిరాం దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు నేనావత్ గణేష్(20) జీవనోపాధి కోసం విద్యుత్ స్తంభాలు నాటే పనికి వెళ్తుండేవాడు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కందుకూరు గ్రామంలో విద్యుత్ స్తంభాలు నాటుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు గణేష్ అంత్యక్రియలు నిర్వహించారు. మట్టపల్లిలో దొంగల బీభత్సం ఫ సిమెంట్ పరిశ్రమ ఉద్యోగుల క్వార్టర్స్లో చోరీ ఫ బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణ మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి వద్ద గల నాగార్జున సిమెంట్స్ పరిశ్రమ కాలనీలో తాళం వేసిన ఉద్యోగుల క్వార్టర్స్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున సిమెంట్స్ పరిశ్రమ కాలనీలోని ఏడుగురు ఉద్యోగులు తమ క్వార్టర్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఊళ్లకు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి క్వార్టర్ల తాళాలు, తలుపులు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. సోమవారం బాధిత ఉద్యోగి మోదాల గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను పిలిపించి ఆధారాలు సేకరించినటులపేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, హుజూర్నగర్ సీఐ చరమంద రాజు పరిశీలించి బాధిత ఉద్యోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణంమునుగోడు : బైక్పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మునుగోడు మండలం గూడపూర్ గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండల కేంద్రానికి చెందిన బండారు రఘు(56) బట్టల వ్యాపారి. కోర్టు పని నిమిత్తం సోమవారం ఉదయం నల్లగొండకు వెళ్లిన ఆయన తిరిగి మధ్యాహ్నం బైక్పై మునుగోడుకు వస్తుండగా.. మార్గమధ్యలో వర్షం కురవడంతో బైక్ వేగం కాస్త పెంచాడు. అంతేకాకుండా బైక్ పెట్రోల్ ట్యాంకుపై బట్టల బ్యాగు పెట్టుకొని వస్తుండగా.. గూడపూర్ గ్రామ శివారులోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. దీంతో అతడి తల, ముఖంపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ ● భర్త మృతి.. భార్యకు గాయాలురామన్నపేట : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో భర్త మృతిచెందాడు. భార్యకు గాయాలయ్యాయి. ఈ ఘటన రామన్నపేట మండలం నీర్నెముల గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నీర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య(40) కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం తన భార్య పూజతో కలిసి ద్విచక్ర వాహనంపై రామన్నపేట వైపు వెళ్తుండగా.. నీర్నెముల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అతడి భార్య పూజ చెయ్యి విరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వరి నారుమడుల్లో జాగ్రత్తలివీ..!
పెద్దవూర : ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రైతులు వరి నారుమడులు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రకాలను(140–150 రోజులు) జూన్ 25వ తేదీ వరకు, మధ్యకాలిక రకాలను(135 రోజులు) జూలై 10 వరకు, స్వల్పకాలిక రకాలను(125 రోజులు) జూలై 31 వరకు నార్లు పోసుకునేందుకు అనుకూలమని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఎన్. సత్యనారాయణ సూచిస్తున్నారు. . ఆగస్టు 15వరకు అన్నిరకాల వరినాట్లు పూర్తి చేయాలని ఆయన పేర్కొంటున్నారు. ● పొలంలో నీరు ఆగకుండా ఉండే, చౌడు లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వరి నారు పోసుకోవాలి. ● నారు పోసుకునే పొలాన్ని 15–20 రోజుల ముందే 2 నుంచి 3 సార్లు దున్నుకోవాలి. ● నారు పోసుకునే పొలంలో ఎకరా నారుమడి ప్రాంతానికి 200 కిలోల కుళ్లిన పశువుల ఎరువును వేసుకోవాలి. ● కిలో విత్తనానికి 1 గ్రాము కార్భండిజమ్ లేదా 2.5 గ్రాముల థైథినియం యం–45 మందును కలుపుకోవాలి. ● విత్తనాన్ని 1–24 గంటలు నానబెట్టి, 24–36 గంటలు మండె కట్టి తర్వాత మొలక విత్తనాన్ని పొలంలో చల్లుకోవాలి. ● ఎకరా నారుమడికి 2.2 కిలోల యూరియా, 6.25 కిలోల సూఫర్, 1.25 కిలోల పొటాష్(ఎంపీఓ) మొదటలో చల్లుకోవాలి. ● ఎకరాకు 15–20 కిలోలు మొలక వచ్చిన గింజలను రకాలను బట్టి చల్లుకోవాలి. ● పొలంలో మొలక విత్తనాన్ని సమానంగా చల్లుకుని పలుచగా నీళ్లు పెట్టి తర్వాత రోజు ఉదయాన్నే నీరు తీసివేయాలి. ● పొలంలో అడపాదడపా నీళ్లు పెడుతూ నారు మొలక ఆకుల దశ వచ్చిన తర్వాత 2–3 సెంటీమీటర్ల మందంలో నీరు ఉంచాలి. ● కలుపును బట్టి నారు మడుల్లో 12–15 రోజుల మధ్యలో లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్ల బిన్ఫైరిబాక్ సోడియం మందును, 15–20 రోజులకు 1.5 మిల్లీలీటర్లు సైహలోఫాస్ బ్యూటైల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ● నారు పీకే 5–7 రోజుల ముందు 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరా నారుమడిలో వేయడం వలన ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ● నారులో జింక్ లోపం కనబడితే లీటరు నీటిలో 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుపై పిచికారీ చేసుకోవాలి. -
డీసీఎం మీదపడి మృతి
ఫ గొర్రెల మందకు కాపలాగా ఇంటి ముందు మంచంపై నిద్రించిన మృతుడు ఫ అదుపుతప్పి దూసుకొచ్చిన డీసీఎంవేములపల్లి : గొర్రెల మందకు కాపలాగా ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తిపై డీసీఎం పడిపోవడంతో మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వేములపల్లి మండల పరిధిలోని బుగ్గబావిగూడెంలో జరిగింది. స్థానికులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గబావిగూడేనికి చెందిన పోలెబోయిన వెంకన్న(49) గ్రామంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి తమ గొర్రెల మందకు కాపలాగా ఇంటి ముందు మంచంపై నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున నల్లగొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న డీసీఎం బుగ్గబావిగూడెం గ్రామ పరిధిలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొని మంచంపై నిద్రిస్తున్న పోలెబోయిన వెంకన్నపై పడిపోయింది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో డీసీఎంను పక్కకు తప్పించి వెంకన్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
కష్టపడే నాయకులకు సముచిత స్థానం
భువనగిరిటౌన్ : కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు రాబోయే రోజుల్లో పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. సోమవారం ఆమె, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్ కలిసి వరంగల్ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డులోని న్యూవివేరా హోటల్ వద్ద ఆగారు. వారికి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్ స్థాయి ప్రతినిధులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేలా బూత్ స్థాయి ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, బర్రె జహంగీర్, దర్గాయి హరిప్రసాద్, ఎనగండ్ల సుధాకర్, గుమిడెల్లి రమేష్ ఉన్నారు.ఫ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ -
దేవాలయంలో చోరీ
● హుండీలోని నగదు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులుదేవరకొండ : పట్టణంలోని మినీ బస్టాండ్ సమీపంలో గల విజయ వినాయకస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం గేటుకు వేసిన తాళం పగులగొట్టి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు దొంగిలించారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీ జరిగినట్లు గమనించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మహిళపై కత్తితో దాడి చేసిన యువకుడు మఠంపల్లి : ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై యువకుడు కత్తితో దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన పుట్టపాకుల కోటమ్మ తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన షేక్ బడేమియా అలియాస్ రఫీక్ ఒక్కసారిగా ప్రహరీ దూకి వచ్చి కోటమ్మ గొంతుపై కత్తితో పొడిచాడు. దీంతో కోటమ్మ భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి బడేమియా కత్తిని అక్కడే వదిలేసి గోడ దూకి పారిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం కొండమల్లేపల్లి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు, ఇంట్లోని సామాగ్రి దగ్ధమయ్యాయి. కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాకు చెందిన రమావత్ నాను ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని ధాన్యం, దుస్తులు, రూ.45వేల నగదు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. -
మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
భువనగిరిటౌన్ : ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్,వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాయ కృష్ణ, రామచందర్, ఎల్లయ్య, రవి, కొండయ్య, బిక్షపతి, లక్ష్మమ్మ, లింగమ్మ, శోభ, రోజా, శ్యామల, యాదమ్మ, వరమ్మ పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి 94 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 63, జిల్లా గ్రామీణాభివృద్ధి 8, మున్సిపాలిటీ 6, సర్వే ల్యాండ్ 6, జిల్లా పరిషత్ 2, ఈఈ ఆర్ అండ్ బీ 2, విద్య 2, ఏడీమైన్స్ , సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్, ఎక్సజ్సైజ్, ప్రణాళికా శాఖలకు ఒక్కటి చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కల్పనా, జెడ్పీ సీఈఓ శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూతురును ప్రభుత్వ బడిలో చేర్పించిన టీచర్మోత్కూరు : మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎర్ర శంకర్ సోమవారం తన కుమార్తె ఎర్ర వర్షిణిని తాను పనిచేసే పాఠశాలలోనే 6వ తరగతిలో చేర్పించారు. విద్యార్థినికి ప్రధానోపాధ్యాయుడు అరవిందరాయుడు అడ్మిషన్ ఇచ్చారు. ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వల్ల ప్రజలకు పాఠశాలపై విశ్వాసం కలుగుతుందని ప్రధానోపాధ్యాయుడు అన్నారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లురామగిరి(నల్లగొండ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బి.సంధ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాశాలల్లో బైపీసీలో మిగిలిన నాలుగు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెన్త్లో కనీసం 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన బాలురు ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు మిర్యాలగూడ రోడ్డులోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో నెల 24, 25 తేదీల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. లక్కీ డ్రా ద్వారా ‘బెస్ట్ అవైలబుల్’ సీట్ల భర్తీభువనగిరిటౌన్ : జిల్లాలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థుల కోసం 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఒకటో తరగతి (డే స్కాలర్ – ఇంగ్లిష్ మీడియం)లో సీట్ల భర్తీ ప్రక్రియ సోమవారం పూర్తయింది. జిల్లాకు కేటాయించిన 15 శాతం ఎస్సీ కోటా కింద మొత్తం 60 సీట్లకు గాను 69 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నూతన చట్టం ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అనుసరిస్తూ ఈ అడ్మిషన్లు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రూప్–1 కేటగిరీలో 1 శాతం, గ్రూప్–2 కేటగిరీలో 9 శాతం, గ్రూప్–3 కేటగిరీలో 5 శాతం చొప్పున అడ్మిషన్లు కల్పించాలి. అయితే, గ్రూప్–2 లోని 9 శాతం కోటా కింద ఉన్న సీట్ల కోసం అత్యధికంగా 61 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రా ద్వారా గ్రూప్–2 కింద 36 మంది విద్యార్థులను సీట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న వారు ఎవరైనా చేరని పక్షంలో, ఆ సీట్లను భర్తీ చేయడానికి అదనంగా మరో నలుగురు విద్యార్థులతో వెయిటింగ్ లిస్ట్కు కూడా డ్రా తీశారు.ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జి.సురేష్, భువనగిరి సహాయ అధికారి సుమంత్, కార్యాలయ సూపరింటెండెంట్ యం.జ్యోతిర్మయి ఉన్నారు. -
అక్టోబర్ నాటికి ఖిలాపై రోప్వే
భువనగిరి: రోప్ వే పనులను అక్టోబర్నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. భువనగిరి ఖిలాపై ప్రస్తుతం రూ.65కోట్లతో కొనసాగుతున్న రోప్వే నిర్మాణ పనులను ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డిలతో కలిసి సోమవారం జూపల్లి పరిశీలించారు. దీనిపై అధికారులతో సమీక్షించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోప్ వే పనుల నిర్వహణలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యాటక శాఖ ఎం.డీ. గౌతమి పూజారి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ పాల్గొన్నారు. స్మార్ట్ టెంపుల్గా సోమేశ్వరాలయం ఆలేరురూరల్: కొలనుపాకలోని సోమేశ్వరాలయాన్ని స్మార్ట్ టెంపుల్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. సోమవారం ఆలేరు మండలం కొలనుపాకలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అడిషన కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్మార్ట్ టెంపుల్గా చేసే విషయంలో త్వరలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఈ ఆలయానికి త్వరలో రూ.5కోట్లు మంజూరు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పాత దేవాలయాలను తొలగించి వాటిని అన్ని హంగులతో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఆలయం వెనకాల పిన్న చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చి బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాత్రూమ్ల సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరో సారి సోమేశ్వరాలయానికి వస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, ఆర్కియాలజీ డైరెక్టర్ అర్జున్రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్య, గందమల్ల అశోక్, ఉపసర్పంచ్ గొట్ట జితేందర్రెడ్డి పాల్గొన్నారు. ఫ రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫ భువనగిరి ఖిలాపై రోప్వే పనుల పరిశీలన ఫ అధికారులతో సమీక్ష ఫ పనుల జాప్యంపై ఆగ్రహం -
కొలనుపాకకు పర్యాటక హంగులు కల్పించాలి
ఆలేరురూరల్: కళ్యాణ చాళుక్యుల కాలంనాటి అద్భుతమైన శైవ క్షేత్రం, చరిత్ర కలిగిన కొనుపాకకు పర్యాటక హంగులు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డి కోరారు. సోమవారం ఆలేరు మండలం కొలనుపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొలనుపాకలో సోమేశ్వర, జైన మందిర్ వంటి చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. చాళుక్యుల కాలంలో నిర్మితమైన సోమేశ్వరాలయం రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కొలనుపాక ఆలయ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారని, మ్యూజియం ఏర్పాటు, దేవాలయం పరిసర అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. పిన్న చెరువు కట్ట విస్తరణ, రెయిలింగ్, సుందరీకరణ పనులు చేపట్టాలని కోరారు. యాదాద్రి పర్యాటక సర్క్యూట్లో భాగంగా చేర్చి ప్రత్యేక నిధులు కేటాయిస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈసమావేశంలో మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ, మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ఛప్రసాద్రెడ్డి, జంగ స్వామి, మాజీ ఎంపీపీ అనసూయ, సీఎచ్.సురేందర్రెడ్డి, నంద మహేందర్, కుమ్మరిండ్ల ఆంజనేయులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటల సాగే మేలు
సాక్షి, యాదాద్రి, భువనగిరి: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడమే మేలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. సోమవారం భువనగిరి పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. రసాయన ఎరువులు విరివిగా ఉపయోగించి పంటలు పండిస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. పాత కాలపు పద్ధతిలో వ్యవసాయం చేయాలని కోరారు. రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో కిసాన్మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, దాసరి మల్లేశం, పాశం భాస్కర్, ధనుంజయ్య, పీఎస్ రవీందర్, తుమ్మల మురళీధర్రెడ్డి, మాయ దశరథ, మహేందర్ గుప్తా, శ్రీనివాస్, కోటేష్, వైజయంతి, శ్రీనివాస్, మల్లారెడ్డి, బలరాం పాల్గొన్నారు.ఫ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి -
వరి వద్దు.. కంది ముద్దు
ఫ ఎల్నినో ప్రభావంతో ప్రధానంగా కంది సాగుపై వ్యవసాయశాఖ దృష్టి ఫ 50 వేల ఎకరాల సాగే లక్ష్యం ఫ నేటి నుంచి విత్తన మేళాలు సాక్షి, యాదాద్రి, భువనగిరి: ఎల్నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాభావ పరిస్థితులు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, పత్తికి బదులుగా.. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో మెరుగైన దిగుబడినిచ్చే కంది, ఇతర ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ సీజన్లో ఏకంగా 50 వేల ఎకరాల్లో కంది సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం రైతులను సన్నద్ధం చేసేందుకు మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా రైతువేదికల్లో ప్రత్యేక విత్తన మేళాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తక్కవ వర్షపాతం ఉన్నా నిలదొక్కుకుంటుందని.. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 50 వేల ఎకరాల్లో కంది సాగు చేసేలా కలెక్టర్ అనురాగ్ జయంతి లక్ష్యంనిర్ణయించారు. 2026 వానాకాల వ్యవసాయ ప్రణాళికలో తొలుత కేవలం 5 వేల ఎకరాల్లో మాత్రమే కంది సాగు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంది సాగు టార్గెట్ను పదింతలు పెంచారు. తక్కువ వర్షపాతం ఉన్నా కంది పంట నిలదొక్కుకునే సామర్థ్యం ఉండటంతో రైతులకు ఇది భరోసానిచ్చే పంటగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని 36 రైతువేదికల్లో విత్తనమేళా నిర్వహించనున్నారు. ఇందులో ప్రభుత్వం సాగుకు సూచించిన ఏడు రకాల సన్న రకాల వరి విత్తనాలతో పాటు కంది, పెసర, మినుములు, కూరగాయలు ఇతర ఆరుతడి పంటల విత్తనాలను డీలర్లు రైతులకు అందుబాటులో ఉంచుతారు. నానో యూరియా, డీఏపీ ఎరువులు కూడా అందుబాటులో ఉంటాయి. ఏడు రకాల సన్న వరి విత్తనాలు ఇవే.. తెలంగాణ సోన(ఆర్ఎన్ఆర్–15048).. ఈ పంట కాలం 120 నుంచి 125 రోజులు, సాంబ మసూరి(బీపీటీ–5204).. ఈ పంట కాలపరిమితి 145 నుంచి 150 రోజులు. కేఎన్ఎం(1638) రకం.. ఈ పంట కాలం 125 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. వ్యాధులను తట్టుకుంటుంది. హెచ్ఎంటీ సోన వరి రకం కాలపరిమితి135 నుంచి 145 రోజులు. దీనికి మంచి రుచి, అధిక ధర వస్తుంది. జై శ్రీరాం పంట కాలపరిమితి 125 నుంచి 135 రోజులు. ఇది అధిక దిగుబడి వస్తుంది. వానాకాలం, యాసంగి సీజన్లలో సాగుకు అనుకూలం. వీజీఎల్–44.. పంటకాలం 130 నుంచి 145 రోజులు. ఈ విత్తనం అన్ని నేలలకు అనుకూలం. కేఎన్ఎం(7715) రకం వరి విత్తనం కాల పరిమితి 125 నుంచి 130 రోజులు. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. విత్తన మేళాలో భాగంగా ఈ ఏడు రకాల వరి విత్తనాలపై విస్తృతంగా ప్రచారం చేసి వీటికే బోనస్ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. కంది పంట విత్తిన తర్వాత సుమారు 100 రోజుల వరకు తేమ కొరతను తట్టుకునే గుణం కలిగి ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురిసినా పంట కోలుకుని దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి, నిర్వహణ ఖర్చులతో పాటు శ్రమ కూడా తక్కువగా అవసరమవుతుంది. అనుకూల పరిస్థితులు లేక పూత రాలిపోయినా మళ్లీ పూత వచ్చే స్వభావం ఉండటం రైతులకు అదనపు ప్రయోజనంగా మారనుంది. విత్తన రకాలను బట్టి ఎకరానికి 4 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దీంతో వర్షాభావ పరిస్థితుల్లో కంది పంట రైతులకు సురక్షిత ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆరుతడి పంటలకు సంబంధించిన కంది విత్తనాలు తగినన్ని అందుబాటులో ఉంచాలి. విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. –పీవీ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి -
1200 కేజీల నల్లబెల్లం, పటిక పట్టివేత
కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని టోల్ప్లాజా వద్ద ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నల్లబెల్లం, పటిక లభ్యమైంది. ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ తెలిపిన ప్రకారం.. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేపట్టగా హైదరాబాద్–ఆమనగల్లు మార్గంలో ప్రయాణిస్తున్న ఓ బొలెరో వాహనంలో 1,200 కేజీల నల్లబెల్లం, 50 కిలోల పటిక లభ్యమైంది. వాహనంతో పాటు పట్టుబడిన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కోల్ముంతల్పహాడ్ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్కు చెందిన పిట్ల రాజును విచారించగా.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన మున్నాకు సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. ఈ కేసులో మున్నాతో పాటు బాపూజీనగర్కు చెందిన అలకుంట దుర్గయ్య, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం లక్ష్మీపురానికి చెందిన ఓర్సు శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాహనాన్ని, సెల్ఫోన్ను సీజ్ చేశారు. -
పిడుగు పడి ఇల్లు ధ్వంసం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన ముసిగంపల వెంకన్న ఇంటి సమీపంలో శనివారం రాత్రి పిడుగుపడి అతడి ఇంటి స్లాబ్ ధ్వంసమైంది. ఇంట్లోని విద్యుత్ మీటర్ వైర్లు కాలిపోయాయి. ఇంట్లో నిద్రిస్తున్న వెంకన్నతో పాటు అతడి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా వినూత్నంగా అవగాహనసూర్యాపేటటౌన్ : ఫాదర్స్ డేను పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ‘పితృవేదన’ పేరుతో డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా వినూత్నంగా అవగాహన కల్పించారు. ఫ్లెక్సీ, కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మైక్ సెట్ ద్వారా సందేశాలను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో మాదకద్రవ్యాలు, గంజాయి, ఆనన్లైన్ బెట్టింగ్కు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారని అన్నారు. యువత చెడు వ్యవసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలు సీజ్భువనగిరి : పట్టణంలోని భువనగిరి–నల్లగొండ రోడ్డు మార్గంలో ఆదివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా ఓవర్లోడ్తో వెళ్తున్న 7 వాహనాలను సీజ్ చేసినట్లు డీటీఓ నరేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత రెండురోజులుగా ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైవేపై వాహనాల బారులుచౌటుప్పల్: హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. ఓ వైపు జాతీయ రహదారి విస్తరణ, మరమ్మతు పనులు జరుగుతుండటం మరోవైపు వీకెండ్ కూడా తోడవ్వడంతో రద్దీ పెరిగింది. చౌటుప్పల్, ధర్మోజిగూడెం, తూప్రాన్పేట వద్ద హైవేకు ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు బారులుదీరాయి. బెల్లం పానకం ధ్వంసంతుంగతుర్తి : మండలంలోని రాజన్నతండా, అన్నారంతో పాటు జాజిరెడ్డిగూడెం మండలంలోని మేడిబాయితండా, మర్రిబాయితండా, కొమ్మాల గ్రామాల్లో ఆదివాంర సారా తయారుచేస్తున్న గృహాలపై దాడులు నిర్వహించి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఎస్ఐ మూర్తి తెలిపారు. అదేవిధంగా 650 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐలు స్వర్ణలత, శోభారాణి, సిబ్బంది పాల్గొన్నారు. -
తాళ్లవెల్లెంలలో బెల్ట్ షాపులకు చెక్
చిట్యాల : మండలంలోని తాళ్లవెల్లెంలలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. దీంతో ఆ గ్రామ యువత మద్యానికి అలవాటు పడి పనిపాట లేకుండా తిరుగుతూ వివాహాలు కాకుండా మిగిలిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మద్యానికి బానిసలై కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో గ్రామంలో బెల్ట్ షాపులను నివారించేందుకు గాను గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు తాళ్లవెల్లెంలలో బెల్ట్ షాపులు నిషేధించాలని పంచాయతీ పాలకవర్గం ఈనెల 10న తీర్మానం చేశారు. ఇతర గ్రామాల నుంచి రాకతో.. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిషేధంతో పాటు వైన్స్లలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక సమయపాలనను పాటిస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న తాళ్లవెల్లెంలలోని బెల్ట్ షాపులకు మునుగోడు నియోజవర్గంలోని ఐదారు గ్రామాల ప్రజలు నిత్యం మద్యం కోసం వస్తున్నారు. దీంతో ఇక్కడ బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండటంతో పాటు అప్పుడప్పుడు శాంతిభద్రతల సమస్య సైతం వస్తుంది. దీంతో గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామ సర్పంచ్ జోగు సురేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి శనివారం గ్రామంలో గ్రామస్తులు, మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నుంచి బెల్ట్ షాపులు నిర్వహించొద్దని గ్రామంలో డప్పు చాటింపు సైతం వేయించారు. బెల్ట్ షాపులు నిర్వహించొద్దని గ్రామ పంచాయతీలో తీర్మానం ఆదివారం నుంచే అమలులోకి.. -
జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా
చౌటుప్పల్ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని ఖైతాపురం శివారులో ఆదివారం తెల్లవారుజామున భారీ కంటైనర్ లారీ బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాజధాని చైన్నె నుంచి సోలార్ పవర్కు సంబంధించిన ప్యానెల్స్ లోడుతో కంటైనర్ లారీ హైదరాబాద్కు వెళ్తోంది. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ దాటిన తర్వాత ఎడమ వైపు నుంచి ఏదో వాహనం ఓవర్టేక్ చేస్తుండగా.. కంటైనర్ లారీ డ్రైవర్ ముందు జాగ్రత్తగా స్టీరింగ్ను కుడి వైపుకు తిప్పాడు. దీంతో వాహనం వేగంగా ఉండడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు మధ్యన డివైడర్ ఎక్కి హైదరాబాద్కు వెళ్లే మార్గంలో అడ్డంగా బోల్తా పడింది. బోల్తా పడిన కంటైనర్ లారీ పక్క నుంచే వెళ్లేందుకు యత్నించిన ఓ లారీ కంటైనర్కు తగిలి ఇరుక్కుపోయింది. దీంతో రోడ్డు పూర్తిగా బ్లాక్ అయ్యింది. దీంతో హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్ జాం అయ్యింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. రెండు క్రేన్లు, జేసీబీల సహాయంతో కంటైనర్ లారీని రోడ్డు పక్కకు తొలగించారు. ట్రాఫిక్ జాంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిలిచిపోయిన వాహనాలు -
‘కవి భూషణ’గా పాండాల మహేశ్వర్
భూదాన్పోచంపల్లి : హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం తెలుగు భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహతీ సాహితీ కవి సంగమం వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కవితలు, రచనల ద్వారా తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న భూదాన్పోచంపల్లి మండలం గౌస్కొండ గ్రామానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు పాండాల మహేశ్వర్ కవి భూషణ బిరుదుతో సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహతీ సాహితీ కవి సంగమం అధ్యక్షుడు అడిగొప్పుల సదయ్య, ముక్కా సత్యనారాయణ, డీఎస్వీ మహాలక్ష్మి, నర్సింహశర్మ తదితరులు పాల్గొన్నారు. పిడుగుపాటుతో గేదె మృతిమద్దిరాల : పిడుగుపాటుకు గురై గేదె మృతిచెందింది. ఈ ఘటన మద్దిరాల మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన భూతం వీరయ్య తన పాడి గేదెను శనివారం సాయంత్రం తన వ్యవసాయ భూమిలోని పశువుల కొట్టం వద్ద కట్టేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో కురవగా.. పశువుల కొట్టం సమీపంలో పిడుగు పడడంతో గేదె మృతిచెందింది. మృతిచెందిన గేదె విలువ రూ.60వేలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్టుమద్దిరాల : హత్యాయత్నం కేసులో 8 మందిని మద్దిరాల పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం చిన్ననెమిలా గ్రామానికి చెందిన నర్సయ్య భార్యతో అదే గ్రామానికి చెందిన కలంచర్ల మహేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం నర్సయ్యకు తెలియడంతో భార్యను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో నర్సయ్యపై కోపం పెంచుకున్న మహేష్ తన స్నేహితుడైన సూర్యాపేట రూరల్ పరిధి బాలెంల గ్రామానికి చెందిన గాలి వికాస్ సహాయంతో నర్సయ్యను హత్య చేయడానికి పథకం రచించాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న గొర్రెలు మేపేందుకు వెళ్లిన నర్సయ్య తిరిగి ఇంటికి వెళ్తుండగా.. చిన్ననెమిలా గ్రామ శివారులో రామాలయం వద్ద అతడిని వికాస్తో పాటు అతడి స్నేహితులైన కాసరాబాద్ గ్రామానికి చెందిన రాచకొండ శివ, సూర్యాపేట పట్టణంలోని అన్నదురై నగర్కు చెందిన వేర్పుల అఖిల్కుమార్, పెద్ది లింగస్వామి అడ్డగించారు. మహేష్ పక్కనే చెట్ల మాటున దాక్కున్నాడు. వికాస్, అతడి స్నేహితులు బీరు సీసాలతో నర్సయ్య తలపై కొట్టి అక్కడి నుంచి అందరూ కలిసి కారులో పారిపోయారు. ఈ కేసు తమ మీదకు రాకుండా ఖమ్మంపాటి గోపిచంద్, కొత్త అరవింద్, కమటం సాయి అనే వ్యక్తులకు వికాస్ రూ.10వేల చొప్పున ఇవ్వగా వారు నేరం తమ మీద వేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మద్దిరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆదివారం చిన్ననెమిలా క్రాస్ రోడ్డు వద్ద ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.39వేల నగదు, 6 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
డీసీఎం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
మాడుగులపల్లి : డీసీఎం ఢీకొనిద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. ఈ ఘటన మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన విరవాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన ప్రజ్ఞాపురం భిక్షపతి(49) స్కూటీపై మిర్యాలగూడ నుంచి నార్కట్పల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామానికి చేరుకోగానే డీసీఎం డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భిక్షపతి కిందపడిపోగా అతడి తలపై నుంచి డీసీఎం వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ మహ్మద్ యాసిన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామస్తుల ఆందోళన.. కుక్కడం గ్రామంలో అద్దంకి–నార్కట్పల్లి రహదారి ఇరుకుగా ఉండటంతోనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని కుక్కడం గ్రామస్తులు నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై సుమారు అర్ధగంట పాటు ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణయ్య అక్కడికి చేరుకోని రోడ్డు వెడల్పు చేసేలా అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
గ్రామస్థాయి నుంచి సీపీఐని బలోపేతం చేయాలి
సంస్థాన్ నారాయణపురం : సీపీఐని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంకు వచ్చిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుడాలన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతు, కార్మిక సమస్యలపై పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు సీపీఐ జిల్లా నాయకులు పల్లె సరళ, శేఖర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పల్లె సరళ తండ్రి, శేఖర్రెడ్డి మామ చిట్యాల సత్తిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగొని గాలయ్య, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, జిల్లా సమితి సభ్యుడు కలకొండ సంజీవ, కొండూరు విప్లవ్, శనిగల నరేష్, బద్దుల సుధాకర్, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి బద్దుల పెంటయ్య, పల్లె సత్తిరెడ్డి, పల్లె గోపాల్ రెడ్డి తదితరలున్నారు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఉదయం 6గంటల నుంచి వర్షం కారణంగా బ్రేక్ దర్శనం సమయం వరకు భక్తులు సాధారణంగానే కనిపించినప్పటికీ.. ఉదయం 11గంటల తర్వాత భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ పరిసరాలు, మాడ వీధులు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, బస్టాండ్, ప్రసాద విక్రయశాల, శివాలయం వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. స్వామివారిని 50వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిత్యాదాయం రూ.56,59,882 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. 50వేల మందికి పైగానే దర్శించుకున్న భక్తులు -
తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలి
కోదాడ : విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి నిరంతర కృషి చేయాలని, అబ్దుల్ కలాంను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ కత్రం శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఫీజులు కట్టేందుకు ఇబ్బందులు పడొద్దనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని 39 మంది విద్యార్థులకు రూ.4.20 లక్షల ఉపకార వేతనాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, ముత్తవరపు రామారావు, పబ్లిక్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కత్రం సీతరాంరెడ్డి, పోటు రంగారావు, బడుగుల సైదులు, జితేందర్రెడ్డి, నాగార్జున, కత్రం కిరణ్, ముడియాల సత్యనారాయణరెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ -
సెల్టవర్ ఎక్కి యువకుడి హల్చల్
భూదాన్పోచంపల్లి : భార్య కాపురానికి రావడంలేదని మద్యం మత్తులో సెల్టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. ఈ ఘటన ఆదివారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాలస్వామి ఆరేళ్ల క్రితం పెద్దగూడెంకు చెందిన ఒంటెద్దు బాలమణిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. జేసీబీ డ్రైవర్గా పనిచేసే బాలస్వామి నిత్యం మద్యం సేవించి భార్యను కొడుతుండేవాడు. ఇదిలా ఉండగా భార్య కూడా ఇతరులతో తరచూ ఫోన్లో మాట్లాతుండటం వల్ల ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడగా.. బాలమణి రాయితో బాలస్వామిని కొట్టడంతో తలకు గాయమైంది. అనంతరం పిల్లలను తీసుకొని బాలమణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం బాలస్వామి మద్యం సేవించి తన భార్యను కాపురానికి తీసుకురావాలని పోచంపల్లి పట్టణంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఉన్న సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐలు భాస్కర్రెడ్డి, లైలా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలస్వామి భార్యాపిల్లలను పిలిపించారు. కిందకు దిగిరావాలని ప్రాఽథేయపడగా.. కిందకి దిగుతున్నట్లు చేసి తిరిగి పైకి ఎక్కుతుండగా బిహార్కు చెందిన ఇద్దరు యువకులు చాకచక్యంగా టవర్ ఎక్కి అతడిని పట్టుకొని కిందికి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్కు తరలించి భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా 11వ వార్డులో ఉన్న సెల్టవర్ కూడా బాలస్వామి ఎక్కగా.. టవర్ పైన కోతులు ఉండటంతో భయంతో కిందికి దిగివచ్చాడని స్థానికులు తెలిపారు. -
నాన్న త్యాగమే.. నా విజయం
తండ్రి వెంకటసుబ్బారెడ్డి, తల్లి సావిత్రితో శ్రీకాంత్రెడ్డి నల్లగొండ : మాది ఏపీలోని కడప జిల్లా చెన్నూరు. నాన్న వెంకటసుబ్బారెడ్డి, అమ్మ సావిత్రి. మాది సాధారణ కుటుంబం. నన్ను, చెల్లిని చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. మాకు ఆస్తిపాస్తులేమీ లేవు. నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. నాన్నకు అమ్మ తోడుగా నిలిచారు. మా నాన్న కుటుంబంలో పెద్దగా చదువుకున్నవారు లేరు. అందుకే మేమైనా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరాలని నాన్న ఎప్పుడూ కోరుకునేవారు. చిన్నప్పటి నుంచే చదువుపై దృష్టి పెట్టాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని ప్రోత్సహించేవారు. పదో తరగతి వరకు కడపలో ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ నెల్లూరులో పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా మధ్యప్రదేశ్లోని ఐఐటీ ఇండోర్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. తర్వాత బెంగళూరులో రెండేళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు సిద్ధమయ్యాను. రెండు ప్రయత్నాల్లో ఇంటర్వ్యూ దశకు కూడా చేరుకోలేకపోయినా నిరాశ చెందలేదు. త్యాగాల ఫలితమే ఈ విజయం.. తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ, తల్లి అవసరమైన సందర్భాల్లో చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపారు. వారిద్దరూ ఎన్నో కష్టాలు పడినా మా చదువులో మాత్రం ఎలాంటి లోటు రానీయలేదు. నాన్న చెప్పిన ‘మాకు చదువు లేదు.. మీరు గొప్పగా చదివి ఉన్నత స్థాయికి రావాలి’ అనే మాటలే నన్ను ముందుకు నడిపించాయి. మా చెల్లి శ్రీలత బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో ప్రయత్నంలో విజయం సివిల్స్ సాధించాలన్న నా కలను నాన్న ఎప్పుడూ ప్రోత్సహించారు. మూడోసారి పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. ఆ సమయంలో కుటుంబం నుంచి, ముఖ్యంగా నాన్న నుంచి ఎంతో మద్దతు లభించింది. వారి ప్రోత్సాహమే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఫలితంగా సివిల్స్లో మూడో ప్రయత్నంలో 151వ ర్యాంకు సాధించగలిగాను. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ)గా విధులు నిర్వహిస్తున్న నేను ఐఏఎస్ సాధించడంతో అమ్మానాన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ నాన్న ఒకటే చెబుతుంటారు.. ‘ప్రజలకు నిజాయితీగా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి’ అని. ఆ మాటలే నాకు మార్గదర్శకం. మంచి పేరు తెచ్చుకోవాలని నాన్న కోరిక.. ఫ చిన్నచిన్న వ్యాపారాలు చేసి మమ్మల్ని చదివించారు ఫ ఆయన ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించాను ఫ నిజాయితీగా సేవలందించాలనే సూచన తప్పక పాటిస్తా నల్లగొండ అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) నెలటూరు శ్రీకాంత్రెడ్డి -
మరో పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి
భువనగిరి: భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితారెడ్డి మరో పర్వతాన్ని అధి రోహించారు. ఉత్తర అమెరికాలోని సుమారు 6,190 మీటర్ల ఎత్తయిన డెనాలి పర్వతాన్ని శుక్రవారం అధిరోహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆమె సెవెన్ సమిట్స్ ఛాలెంజ్లో భాగంగా ఈ పర్వతాన్ని అధిరోహించడంతో 6వ మైలు రాయిని దాటారు. ఎలైట్ జాబితాలో చేరేందుకు మరో అడుగు దూరంలో ఉన్నారు. 7వ తేదీన పర్వాతరోహణ చేయడం ప్రారంభించిన ఆమె అర్జెంటినాకు చెందిన పర్వతారోహకురాలు రేనాటతో కలిసి పర్వతాన్ని అధిరోహించారు. -
నాన్నే నా బలం
ప్రస్తుతం నేను సైనిక్పురిలోని భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండియర్ చదువుతున్నా. చదువుతో పాటు క్రికెట్లో రాణించడానికి మా నాన్నగారి పూర్తి సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో రంజీ ట్రోఫీలో రాణించడంతో పాటు, జూలైలో జరిగే శ్రీలంక పర్యటనలో లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో కీలక ప్లేయర్గా ఎదగడమే నా లక్ష్యం. – యశ్వీర్ గౌడ్ రాజాపేట : తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లో రాణిస్తున్నాడు రాజాపేటకు చెందిన యువకుడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నా భవిష్యత్ కోసం తాపత్రయపడ్డారని, ఎంతో సహకారం అందించారని ఇండియా అండర్–19 జట్టుకు ఎంపికైన యశ్వీర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆయన మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. మా స్వగ్రామం రాజాపేట. మా నాన్న రాజ్కుమార్ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నా చిన్నతనం నుంచే మా బాబాయ్ దీపక్ కుమార్ ఆడే క్రికెట్ను చూసి దానిపై మక్కువ పెరిగింది. రోజూ బాబాయ్తో గల్లీలో ఆడుతూ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నా. నా ఆసక్తిని గమనించిన బాబాయ్ మా నాన్నను ఒప్పించి 8 ఏళ్ల వయసున్నప్పుడే హైదరాబాద్ అంబర్పేట్లోని విద్యానగర్ డానియల్ అకాడమీలో చేర్పించారు. కోచ్ కమలేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందాను. ఫీజు చెల్లించే స్థోమత లేకపోయినా.. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో కొత్త క్యాంప్లో చేరాను. అక్కడ కృష్ణమోహన్, రవికుమార్ల ప్రోత్సాహంతో హైదరాబాద్ క్రికెట్ లీగ్లోకి అడుగుపెట్టాను. మా నాన్న ఉద్యోగం చేస్తూనే.. కెరీర్ కోసం ఉదయం, సాయంత్రం గ్రౌండ్స్ దగ్గరకు వచ్చి స్వయంగా పికప్ చేసుకునేవారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నా శ్రేయస్సు కోసమే తాపత్రయపడ్డారు. ఒకానొక సందర్భంలో లీగ్ మ్యాచ్ ఆడేందుకు ఫీజు చెల్లించే స్థోమత లేక ఇబ్బంది పడగా, మా నాన్న, బాబాయ్ ఇద్దరూ కలిసి కోచ్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించారు. ఆల్రౌండర్గా.. లీగ్ మ్యాచ్ల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ద్వారా వరుసగా అండర్–16, అండర్–19 వన్డే ట్రోఫీలకు హైదరాబాద్ జట్టు తరఫున ఎంపికయ్యాను. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా, టాప్ స్పిన్నర్గా నిలిచాను. జట్టు విజయంలో కీలకమైన ఆల్రౌండర్గా నైపుణ్యాన్ని ప్రదర్శించా. ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన ఆల్రౌండర్ల ప్రత్యేక క్యాంప్లో పాల్గొన్నా. ప్రస్తుతం ఇండియా అండర్–19 జట్టు నుంచి పిలుపు లభించింది.ఫ చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ పెరిగింది ఫ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నాన్న వెన్నంటే ఉండి ప్రోత్సహించారు ఫ భారత సీనియర్ జట్టులో కీలక ప్లేయర్గా ఎదగడమే నా లక్ష్యం ఫ ఇండియా అండర్–19 జట్టుకు ఎంపికై న యశ్వీర్ గౌడ్ -
రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదు
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్: దేశానికి వెన్నెముకగా నిలిచిన తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని, రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. శనివారం నకిరేకల్లోని సువర్ణగార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో, రైతు బంధు, బీమా పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి గతంలో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కేంద్రం కోటా మేరకే కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందాలను చేసుకుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటను చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డి మహిందర్రెడ్డి, తాటికల్ సర్పంచ్ బంటు రవి, నాయకులు గుండగోని జంగయ్యగౌడ్, రావిరాల మల్లయ్య, రాచకొండ వెంకన్నగౌడ్, పల్లె విజయ్, దైద పరమేశం, అమీర్పాషా తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధవనంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లో శనివారం తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, పర్యాటక శాఖ చీఫ్ సెక్రెటరీ వాణీప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని సోమశిల, కాకతీయ, భద్రాచలం, నాగార్జునసాగర్లోని విజయవిహార్, బుద్ధవనంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో హుజూర్నగర్కు చెందిన మహిళా డప్పు కళాకారులు తమ ప్రదర్శనలతో సందడి చేశారు. తెలంగాణ జానపద కళారూపాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
లారీల కోసం స్పెషల్ డ్రైవ్
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని రైస్మిల్లులు, ఇతర గోదాములకు ఎగుమతి చేసేందుకు అవవసరమైన లారీల కోసం అధికారులు శని వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పంతంగి టోల్ప్లాజా వద్ద రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల అధికారులు సంయుక్తంగా డ్రైవ్ చేపట్టారు. ఎనిమిది లారీలను స్వాధీనం చేసుకొని పలు గ్రామాలకు పంపించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీరా భాయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గుత్త వెంకట్రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ప్రణీత్రెడ్డి పాల్గొన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
ఆలేరురూరల్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆలేరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం, జెండర్ రిసోర్స్ సెంటర్, మండల మహిళా సమాఖ్య భవనాన్ని.. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామెల్, నోముల వీరేశం ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, రాష్ట్ర మహిళాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి శనివారం ఆమె ప్రారభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి మహాలక్ష్మి పథకం అమలు చేసి ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు.మహిళ సంఘాలకు రూ.1250 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశామన్నారు. జిల్లాలోని 621 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 58,58,25,000 రుణాల చెక్కును అందించామని చెప్పారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అన్ని పథకాలను మహిళల పేరున అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బీజనీ బాలమణి, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, నీలం పద్మ, ఐనాల చైతన్య, కౌన్సిలర్లు, జూకంటి సంపత్, మల్లెల సరితశ్రీకాంత్, ఆంజనేయులు, నాయకులు అశోక్, కె.సాగర్రెడ్డి, నవీన్, సురేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి యాదగిరిగుట్ట: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వద్దిగళ్ల రాము నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని, పాత గుండ్లపల్లిలో మహిళా సమాఖ్య గ్రూప్ సహకారంతో ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన తరగతి గదిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కలలను ఇందిరమ్మ పథకం పేరుతో సీఎం నిజం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మహిళా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్, వైస్ చైర్పర్సన్ రమ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, పట్టణ అధ్యక్షుడు ముక్కెర్ల మల్లేష్యాదవ్ పాల్గొన్నారు. ఫ పంచాయతీరాజ్శాఖ సీతక్క -
చౌటుప్పల్కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
చౌటుప్పల్ : చౌటుప్పల్కు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయశాఖ సెక్రటరీ బి.పాపిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు న్యాయస్థానం కోసం కొంతకాలంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటం ఫలించడంతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్ మాట్లాడుతూ అదనపు కోర్టు ఏర్పాటుతో కక్షిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈమేరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి పడమటి మహిపాల్రెడ్డి, సహాయ కార్యదర్శి మక్కా నర్సింహ, లైబ్రరీ సెక్రటరీ దేశగోని శ్రీశైలం, సభ్యులు నకిరేకంటి జ్యోతి, ఎండి.ఖయ్యూం, మాజీ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్గౌడ్, బాల్యం వెంకటాచలపతి, న్యాయవాదులు భిక్షపతి, బడుగు శ్రీకాంత్, జక్కర్తి శేఖర్, పిట్టల భరత్చంద్ర, చామట్ల జంగయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలియాదగిరిగుట్ట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.భిక్షపతి సూచించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎంఆర్సీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, బుక్స్ పంపిణీ వివరాలను మండల విద్యాశాఖ అధికారిణి శరత్ యామినిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయాలన్నారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రతి రోజూ పూర్తి చేయాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్రం నిర్దేశించిన కోటాకు అనుగుణంగానే వరి, మొక్కజొన్న, జొన్నలు, పెసర్లు వంటి పంటలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర కేబినెట్లో తీర్మానించడాన్ని తప్పుబట్టారు. వరి ధాన్యం కొనుగోలుపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్బీఆర్ఎస్ నాయకులు మొగుళ్ల శ్రీనివాస్, సుబ్బురు బీరుమల్లయ్య, జనగాం పాండు, ఏవీ కిరణ్కుమార్, కేశవపట్నం రమేష్, గాదే కవితానరేందర్రెడ్డి, చెన్న మహేష్, శెట్టిబాలయ్య యాదవ్లు ఉన్నారు. -
రైతులకు ఎరువుల కొరత రానివ్వం
నల్లగొండ : ఈ వానాకాలం సీజన్లో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత రానివ్వకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండలోని ఇందిర భవన్లో కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి మంత్రి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల నిల్వలు, సరఫరా పరిస్థితి వంటి సమగ్ర సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా యూరియా అవసరమున్న రైతులు యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలన్నారు. పట్టాదారు పాస్పుస్తకం, పంట వివరాలను నమోదు చేసిన రైతుల పేరుపై ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియా అందజేస్తామన్నారు. ఎకరం భూమి కలిగిన రైతులకు ఒకేసారి, ఒకటి నుంచి ఐదు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు విడతల వారీగా యూరియా పంపిణీ చేస్తామని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సహకార సంఘాలు, డీసీఎంఎస్ కేంద్రాలు సహా 650కుపైగా విక్రయ కేంద్రాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల మరమ్మతులకు, అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అలాగే ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపయోగించనున్న ప్రత్యేక టీషర్టులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.వినోద్ కుమార్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నల్లగొండలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ప్రారంభం -
సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి
చిట్యాల: జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయడంతో పాటుగా సొంత గ్రామమైన ఉరుమడ్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రం, గ్రంథాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. సొంత ఊరికి సేవ చేస్తే కన్నతల్లికి సేవ చేసిన తృప్తి కలుగుతుందన్నారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి, చిట్యాల మండల స్పెషల్ ఆఫీసర్ వినోద్కుమార్, ఎంపీడీఓ మనోహార్, సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్గౌడ్, ఏఎంసీ చైర్మన్ నర్రా వినోదమోహన్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ, వెంకటేశ్వర్లు, గుత్తా వెంకట్రాంరెడ్డి, పల్లపు బుద్దుడు తదితరులు పాల్గొన్నారు.ఫ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
లోక్ అదాలత్లో 17,344 కేసుల పరిష్కారం
భువనగిరిటౌన్ : జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో 17,344 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు వెల్లడించారు. శనివారం భువనగిరి కోర్టు ఆవరణలో లోక్అదాలత్ నిర్వహించారు. ఇందులో జూమ్ మీటింగ్ ద్వారా జడ్జి మాట్లాడారు. పరిష్కారమైన వాటిలో రెండు సివిల్ కేసులు, 2,064 క్రిమినల్ కేసులు, 15,278 ట్రాఫిక్ చలాన్ కేసులు, 42 ప్రీ–లిటిగేషన్ కేసులు ఉన్నట్లు వివరించారు. రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారం కావడానికి కృషి చేసిన జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, జిల్లా పోలీసు యంత్రాంగం, కోర్టు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ లోక్ అదాలత్లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవీ లత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆరిఫ్, రెండవ తరగతి మెజిస్ట్రేట్ జ్యోతిరావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్.విద్యా సాగర్, కార్యదర్శి యాదగిరి, బాబురావు, ఎం. రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కె. కిషన్, జి. గోపాల్ రెడ్డి, జె. శివకిరణ్, జె. భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
నేడు మహిళా శిశు వికాస కేంద్రం ప్రారంభం
ఆలేరురూరల్ : ఆలేరు మండల కేంద్రానికి మంత్రి సీతక్క శనివారం రానున్నారు. ఆలేరు పట్టణంలో రూ.50 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని (మహిళా ప్రాంగణం) ఆమె ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలేరు ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు యాదగిరి క్షేత్రానికి మంత్రి సీతక్క రాక యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం రానున్నారు. యాదగిరీశుడిని మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణం, మండలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని మున్సిపల్ చైర్పర్సన్ వాణిభరత్గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. అమృత్ పనుల పరిశీలనయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్లను నాణ్యతతో నిర్మించాలని పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని అంగడీ బజార్లో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ను శుక్రవారం డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజనీర్ బి.మనోహర, మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్గౌడ్తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట సహా యక కార్యనిర్వాహక ఇంజనీర్ పి.లోకేష్, కమిషనర్ బి.శ్రీనివాస్ ఉన్నారు. నేడు రెండో జాతీయ లోక్ అదాలత్భువనగిరిటౌన్ : జిల్లావ్యాప్తంగా శనివారం రెండో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు, సంస్థ కార్యదర్శి వి.మాధవిలత సంయుక్త ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో ఈ లోక్ అదాలత్ జరుగుతుందని వెల్లడించారు. ఉభయ పక్షాలు రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, ఎకై ్సజ్ కేసులు, బ్యాంకు బకాయిలు, టెలిఫోన్ బకాయిలు, ట్రాఫిక్ చలానా కేసులు, ఫైనాన్స్ కంపెనీల లావాదేవీలకు సంబంధించిన పెండింగ్, ప్రి లిటిగేషన్ (కోర్టుకు రాకముందు ఉన్న) కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ బకాయిలకు.. చౌటుప్పల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, దేవరకొండ, నల్లగొండ కోర్టుల పరిధిలో గల వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు చెల్లించాల్సిన బకాయి సమస్యలను శనివారం జరిగే లోక్అదాలత్లో పరిష్కరించుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు అకౌంట్స్ ఆఫీసర్ పి.ప్రసాద్ 9494443696, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కరుణానాయక్ 9492868180, నాగరాజు 9441000163 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ‘సర్’ ను పకడ్బందీగానిర్వహించండిసాక్షి,యాదాద్రి : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణ, పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ వీసీలో భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు కృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
బొమ్మలరామారం : కస్తూరిబా గాంధీ విద్యాలయంలో జరుగుతున్న సివిల్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి ఆదేశించారు. బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామంలో కస్తూరిబా గాంధీ విద్యాలయంతోపాటు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ను శుక్రవారం తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. కేజీబీవీలో జరుగుతున్న నాబార్డ్ అభివృద్ధి పనులను పరిశీలించి ఎస్ఓకు పలు సూచనలు చేశారు. అనంతరం కేజీబీవీలోని స్టోర్ రూమ్ను సందర్శించి కిచెన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సరుకులను జాగ్రత్తగా స్టోర్ చేయాలని సూచించారు. ఆయనవెంట ఎస్ఓ సాయిలక్ష్మి, ఉపాధ్యాయులు ఉన్నారు. -
పక్షి ప్రేమ.. నిరంతర సేవ
ఫ 15 ఏళ్లుగా పక్షులను సంరక్షిస్తున్న మహమ్మద్ గఫార్ ఫ ఇంటిపై ప్రత్యేకంగా ఆహారం, నీటి తొట్లు ఏర్పాటురామగిరి(నల్లగొండ): పక్షులకు గూడు దొరకడమే కష్టంగా మారిన ప్రస్తుత తరుణంలో నల్లగొండ పట్టణానికి చెందిన మహమ్మద్ గఫార్ ఖాన్ వాటి పట్ల అపారమైన మానవత్వం చాటుకుంటున్నారు. తన ఇంటిపై పక్షుల కోసం ప్రత్యేకంగా ఆహారపు తొట్లు ఏర్పాటు చేసి 15 సంవత్సరాలుగా వాటికి ఆశ్రయం కల్పిస్తూ పక్షుల ఆకలి తీరుస్తున్నారు. వాటి దాహం తీర్చేందుకు నీటి తొట్టెలను కూడా పెట్టించాడు. పక్షుల కిలకిల రాగాలు.. గఫార్ ఏర్పాటు చేసిన ఆహారం తొట్ల వల్ల ప్రతిరోజూ ఉదయం పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తుంటాయి. పింఛ్ బర్డ్స్, పావురాలు, ఇతర రకాల పక్షులు వందల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటాయి. పక్షుల సంరక్షణకు సంవత్సరానికి సుమారు రూ. 36,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక భారమైనప్పటికీ, పక్షుల ఆకలి తీర్చడంలో వచ్చే తృప్తి ముందు ఈ ఖర్చు చాలా చిన్నదని ఆయన భావిస్తున్నారు. పక్షులను కాపాడుకోవడం మన బాధ్యత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పక్షులకు సరైన ఆవాసం ఆహారం లేక మృత్యువాత పడుతున్నాయి. ఇంటిపైన ఆహారపు, నీటి తొట్లను ఏర్పాటు చేస్తే పక్షులను సంరక్షించిన వారమవుతాం. – మహమ్మద్ గఫార్ ఖాన్ -
విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడో!
మునుగోడు: వారం రోజుల క్రితం పెద్దఎత్తున వచ్చిన గాలివానతో మునుగోడు మండలం పలివెల గ్రామ శివారులోని చీకటిమామిడి రోడ్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ స్తంభం విరిగిపడింది. స్తంభానికి నేటికీ మరమ్మతులు చేయకపోవడంతో ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపొయింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ ద్వారా నడిచే దాదాపు 20 మంది రైతుల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కావడం లేదు. వ్యవసాయ బావుల వద్ద ఉండే మూగ జీవాలకు అవసరమైన నీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఇప్పటికై యినా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని విరిగి పడినా విద్యుత్ స్తంభాని సరిచేసి ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ చేయాలని కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
పెద్దవూర: మండలంలోని రామన్నగూడెం స్టేజీ సమీపంలో నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని శుక్రవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, ప్రమాద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు, ప్రమాదంలో చిక్కుకున్న వాహనల స్థితిగతులను, రహదారి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనకు సంబందించిన అన్ని వివరాలను సేకరించి, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. అతివేగం, సీటు బెల్టు లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితులు పాటించాలని, వాహనాలను ఓవర్టేక్ చేయడంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర, నాగార్జునసాగర్ ఎస్ఐలు గోపాల్రావు, సతీష్ తదితరులున్నారు. -
డిజిటల్ విధానంలో ఎన్యుమరేషన్
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవడానికి, ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి ఎన్నికల కమిషన్ ఈసారి ఆన్లైన్ ద్వారా సులువైన అవకాశాన్ని కల్పించింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే లోపే, ఓటర్లు స్వయంగా డిజిటల్ విధానంలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను సమర్పిస్తే చాలు. 25 నుంచే ఆన్లైన్లో .. ఎన్యుమరేషన్ ఫారాలు, ఇంగ్లిష్తోపాటు తెలుగులో కూడా ముద్రించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్లైన్లో సైతం ఈ తేదీల్లోనే సైట్ అందుబాటులో ఉంటుంది. సర్ప్రక్రియలో భాగంగా భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలోని 566 పోలింగ్ బూత్లలో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర ఓటరు నమోదు చేయనున్నారు. ఆన్లైన్లో ఫాం సమర్పించడం ఇలా.. మొదటి దశ : మొదటగా https://voters.eci. gov.in వెబ్పోర్టల్, ఈసీఐనెట్ మొబైల్ యాప్లో వివరాలు సమర్పించి రిజిస్టర్ చేసుకోవాలి. ఇంతకు ముందే రిజిస్టర్ ఉంటే ఆ వివరాలతో లాగిన్కావాలి. ● రెండో దశ : యూజర్ డ్యాష్ బోర్డులో ఉండే ‘ఫిల్ ఎన్యుమరేషన్ ఫాం’అనే బటన్పై మొదట క్లిక్ చేయాలి. తర్వాత డ్రాప్ డౌన్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం ఎంపిక చేసుకుని వివరాలను సమర్పించాలి. ● మూడో దశ : ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్ను (ఎపిక్ నంబర్) నమోదు చేసిన తర్వాత సెర్చ్ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు, వివరాలతో కూడిన ఎన్యుమరేషన్ ఫాం స్క్రీన్పై కనిపిస్తుంది. ● నాలుగో దశ : ‘సెండ్ ఓటీపీ’పై క్లిక్ చేస్తే మీ ఓటరు ఐడీతో లింకై న మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే ఎన్యుమరేషన్ ఫాంలోని మిగతా భాగాలు అన్నీ అన్లాక్ అవుతాయి. ● ఐదవ దశ : 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితాతో మీ పేరు మ్యాపింగ్ చేసుకోవడానికి మొత్తం మూడు కేటగిరీలు ఉంటాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. 2002 నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటే దాన్ని మ్యాపింగ్ చేయాలి. మీ పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాన్నమ్మల పేర్లు ఉంటే వారి పేర్లతో మ్యాపింగ్ చేసుకోవాలి. మీ వద్ద 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితా వివరాలు అందుబాటులో లేకపోతే ఓటర్ పోర్టల్ డ్యాష్బోర్డులోకి వెళ్లి ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్లాస్ట్ సర్’ టూల్ని ఉపయోగించి వెతకవచ్చు. ● ఆరోదశ : 5వ దశలో ఎంపిక చేసుకున్న కేటగిరీ ఆధారంగా ఎన్యుమరేషన్న్ఫాంలో నిర్ధేశిత వివరాలు నింపాలి. 2002వ సంవత్సరం నాటి ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయినా మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల పేర్లు ఉంటే ఆ వివరాలు, వారితో సంబంధం ఏంటి? అనేది దీనిలో నమోదు చేయాలి. ఒకవేళ నియోజకవర్గం మారితే పాత నియోజకవర్గం లేదా పార్ట్ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఓటరు పుట్టిన తేదీని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. తాజా పాస్పోర్ట్ సైజు కలర్ ఫొటోను కూడా అప్లోడ్ చేయాలి. ● ఏడో దశ : ఎన్యుమరేషన్న్ఫాం మొత్తం నింపేసిన తర్వాత తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ప్రివ్యూ బటన్పై క్లిక్ చేయాలి. అన్నీ సరిగా ఉంటే డిక్లరేషన్ చెక్బాక్స్ను క్లిక్ చేసి చివరిగా సబ్మిట్ చేయాలి. అనంతరం ఈ పోర్టల్ నుంచి ఆధార్ ఈసైన్ గేట్వేకు వెళుతుంది. అక్కడ మీ ఆధార్ నంబరు నమోదు చేసిన తర్వాత ఆధార్తో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబరును ఓటీపీతో ధ్రువీకరించుకోవాలి. ఇక్కడితో డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తవుతుంది. ఎపిక్ ఐడీ, మొబైల్ నంబర్తో లింక్ తప్పనిసరి ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫాం సమర్పించేందుకు ఓటరు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఎపిక్ (ఓటరు గుర్తింపు) ఐడీతో లింకై ఉండాలి. ఓటరు ఐడీ, ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో పూర్తిగా సరిపోవాలి. పేరులో స్పెల్లింగ్ తేడాలు ఉంటే డిజిటల్ ఈ–సైన్స్ ప్రక్రియ విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఫ తెలుగులోనూ ఎన్యుమరేషన్ ఫారాలు ఫ వివరాలు, ఫొటో అప్లోడ్కు అవకాశం ఫ జిల్లాలో ఈ నెల 25నుంచి ఇంటింటి గణనసర్లో బీఎల్ఓలు చేసిన ఓటరు మ్యాపింగ్ వివరాలు.. నియోజకవర్గం మొత్తం మ్యాపింగ్ మ్యాపింగ్ ఓటర్లు అయిన ఓట్లు, కాని ఓట్లు భువనగిరి 2,21,903 1,89,598 32,305 ఆలేరు 2,38040 21,2338 25702 భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 4,59,943 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 4,01,936 (87.39 శాతం) మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి అయ్యింది. ఇంకా భువనగరి, ఆలేరు నియోజకర్గాల్లో 100237 మంది ఓట్లు తప్పులతడకగా ఉన్నాయి. తాజా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 25నుంచి ఓటర్ల ఎన్యుమరేషన్తో నూతన ఫొటో ఓటరు జాబితాలను తయారు చేస్తారు. -
పంట రుణం ఇక సులువు
● రైతులు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించడం వలన వారి సిబిల్ స్కోరు మెరుగుపడుతుంది. పెద్ద రుణాలు పొందవచ్చు. ● భవిష్యత్లో పంట రుణాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి వ్యవసాయ పరికరాల కొనుగోలుకు కూడా ఈ యాప్ ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. పెద్దవూర: నూతనంగా పంట రుణాలు పొందాలనుకునే రైతులు ఇకనుంచి బ్యాంకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ నుంచే నేరుగా పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తీసుకువచ్చింది. ఇప్పటివరకు సాగు సమయం వచ్చిందంటే చాలు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పంట రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు రేపు, మాపు అంటూ తిప్పించుకునేవారు. ఇక నుంచి పంట రుణాలు కావాలనుకునేవారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం మొబైల్ యాప్ ద్వారా నేరుగా పంట రుణాల కసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘కృషికా’ అనే నూతన యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లిష్లో ఉండగా, త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని అధికారులు వెల్లడించారు. యాప్ పనిచేసే విధానం.. ● అన్నదాతలు ముందుగా తమ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ నుంచి కృషికా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తమ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. ● ఆధార్ నంబర్, రైతు పూర్తి పేరు, ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నంబర్ నమోదు చేయాలి. దీంతో పాన్కార్డు, పట్టాదారు పాస్బుక్ వివరాలు కనిపిస్తాయి. ● బ్యాంకు వివరాలను నమోదు చేసి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమాచారం సంబంధిత బ్యాంకు బ్రాంచ్కి చేరుతుంది. బ్యాంకు అధికారులు వివరాలను పరిశీలించి రైతుకు రుణం మంజూరు చేస్తారు. ప్రయోజనాలు ఇవే.. ● రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో రైతులకు సమయం, ఖర్చులు ఆదా అవుతాయి. ● తమ దరఖాస్తు ఏ దశలో ఉందో కృషికా యాప్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. అవినీతికి ఆస్కారం ఉండదు. ● పంటల సాగు ప్రారంభ సమయంలోనే రుణం లభించడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ● రుణం పేరిట దళారుల బారినపడకుండా ఈ యాప్ నిరోధిస్తుంది. ఫ అన్నదాతలకు అండగా ‘కృషికా’ యాప్ ఫ బ్యాంకులకు వెళ్లకుండా రుణం పొందే అవకాశం -
ఉపాధికి వచ్చి విగతజీవిగా..
నిడమనూరు : ఉపాధి కోసమని సిమెంటు ఇటుకుల తయారీ, రెడిమేడ్ వాల్ బ్లాక్లను బిగించేందుకు వచ్చిన కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కనగల్ మండలం సల్మాన్నగర్కు చెందిన అలకుంట్ల రాము (17) గురువారం సాయంత్రం నిడమనూరు మండలంలోని రాజన్నగూడెంలోని కంచనపల్లి సోమమ్మ ఇంటి ప్రహరీకి వాల్ బ్రిక్స్ను బిగిస్తున్నాడు. బ్లాక్ కొంత పెద్దదిగా ఉండటంతో కట్టర్ సాయంతో కట్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైయ్యారు. రామును 108 అంబులెన్స్లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిడమనూరు ఎస్సై విజయ్కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరిహారం కోసం కుటుంబ సభ్యుల ఆందోళన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతుడు రాము కుటుంబ సభ్యులు శుక్రవారం బ్రిక్స్ యాజమాని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఆ పనిని తాను చేయలేదని, కాంట్రాక్టర్కు అప్పగించానని వాల్ బ్రిక్స్ తయారీ యజమాని గిరి తెలపడంతో ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరింది. పరిహారం విషయంలో వాల్బ్రిక్స్ తయారీదారుడు, కాంట్రాక్టర్ కలసి చెల్లించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బ్రిక్స్ బిగించే పనికి తనకు సంబంధం లేదని బ్రిక్స్ తయారీదారుడు చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు వారిని సద్దుమణిగించారు. ఫ విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి ఫ ప్రహరీకి ప్రీకాస్ట్ బ్రిక్స్ బిగిస్తుండగా ప్రమాదం -
బక్కచిక్కిపోతున్న బాల్యం
భువనగిరిటౌన్ : బాల్యం బక్కచిక్కిపోతోంది. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి పోషకాహారమే కీలకమైనప్పటికీ, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీలో జరుగుతున్న అలసత్వం వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తాజాగా జిల్లాలో నిర్వహించిన గ్రోత్ మానిటరింగ్ (పెరుగుదల పర్యవేక్షణ) పరీక్షల్లో వేలాది మంది చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేరని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో ఆశించిన ఫలితాలు కనిపించడంలేదు. 901 కేంద్రాలు.. జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 3,814 మంది బాలింతలు, 4,999 మంది గర్భిణులు, 11,800 మంది (3 నుంచి 6 ఏళ్లలోపు) పిల్లలకు పోషకాహార పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా ఈ కేంద్రాల్లో తప్పనిసరిగా నిర్వహించే గ్రోత్ మానిటరింగ్ (పెరుగుదల పర్యవేక్షణ) పరీక్షల్లో చిన్నారుల శారీరక ఎదుగుదలలో లోపాలు విస్తుగొలుపుతున్నాయి. చాలా మంది చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేక కొట్టుమిట్టాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పోషకాహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, లోపాలతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. ఫ 2వేల మందికి పైగా చిన్నారుల్లో శారీరక ఎదుగుదల లోపం ఫ గ్రోత్ మానిటరింగ్ పరీక్షల్లో విస్తుగొలిపే నిజాలు ఫ అంగన్వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణ లోపం.. ఫ సత్ఫలితాలివ్వని ఆరోగ్యలక్ష్మి పథకం గ్రోత్ మానిటరింగ్ పరీక్షల ప్రకారం లోపాల తీవ్రత ఇలా.. పోషకాహార లోపం కలిగిన పిల్లలు: 2,288 మంది తీవ్ర పోషకాహార లోపం: 340 మంది ఎత్తుకు తగిన బరువు లేకపోవడం: 2,288 మంది తక్కువ బరువు: 614 మంది వయసుకు తగిన ఎత్తు లేకపోవడం: 6,658 మంది ఎత్తు లోపం: 1,560 మంది -
చికిత్స పొందుతూ గుర్తుతెలియని యువకుడు మృతి
మిర్యాలగూడ అర్బన్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన గుర్తు తెలియని యువకుడు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 5న మిర్యాలగూడలో డెమో ట్రైన్ ఎక్కిన యువకుడు బీబీనగర్ ఘట్కేసర్ సమీపంలోకి చేరుకున్న సమయంలో రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో గుర్తించి రైల్వే పోలీసులు క్షతగాత్రుడిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన సదరు యువకుడికి చికిత్స అందింస్తున్నారు. అతడి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో బుధవారం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, సదరు యువకుడిని గుర్తించిన 9848222169, 9182234467 నంబర్లను సంప్రదించాలని వైద్యులు తెలిపారు. సదరు యువకుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని, అతడి ఎడమ చేతిపై రోజా, ఎడమ చాతిపై సిద్ధు, కుడి చేతిపై ఆయుషు అని రాసి ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి.. చిట్యాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన చెరబహదూర్(47) చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ పరిధిలోని శ్రీ పైప్స్ ఇన్ఫ్రా కంపెనీలో గత కొంతకాలంగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న కూరగాయలు కొనుగోలు చేసేందుకుగాను బైక్పై వెలిమినేడు గ్రామానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో రాత్రి పిట్టంపల్లి శివారులో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు అంబహదూర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
విడాకులు కోరిన దంపతులు లోక్అదాలత్లో ఒక్కటయ్యారు
హుజూర్నగర్ : విడాకులు కోరిన దంపతులు హుజూర్నగర్ కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో ఒక్కటయ్యారు. మఠంపల్లి మండలం బోజ్యతండాకు చెందిన భూక్య కవితకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురానికి చెందిన భూక్య లక్ష్మీనరసింహతో 2019లో వివాహమైంది. వీరికి శరణ్య, శ్రీకర్ ఇద్దరు సంతానం. ఆ తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ లక్ష్మీనరసింహ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కవితపై విడాకుల కేసు దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో ఉండగా శుక్రవారం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శివరామ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి నక్కా శ్యాంసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్లు ఈ కేసులో చొరవ తీసుకొని దంపతులు ఇరువురితో ముఖాముఖిగా మాట్లాడారు. భవిష్యత్లో జరుగబోయే దానిపై ఇద్దరికి నచ్చజెప్పారు. దీంతో వారు ఇరువురు తిరిగి కలిసి సంసారం కొనసాగించడానికి అంగీకరించారు. న్యాయమూర్తులు వారితో పూలదండలు మార్పించి శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి మధ్య రాజీకి న్యాయవాదులు బానోతు సురేష్ కుమార్, కొణతం శ్రీనివాస రెడ్డి సహకరించారు. అక్రమంగా మట్టి తవ్విన వారిపై కేసుహుజూర్నగర్ : పొలంలోకి అక్రమంగా ప్రవేశించి మట్టిని తవ్విన వారిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. హుజూర్నగర్ మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన యరసాని నాగిరెడ్డి భార్య సుగుణమ్మ పేరిట సర్వే నంబర్ 126లో 1.09 ఎకరాల పొలం ఉంది. పొలం యజమానులు లేని సమయంలో కొందరు జేసీబీలను తీసుకొచ్చి గుంతలు తీసి మట్టి కుప్పగా పోశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. గడ్డివాము దగ్ధంమునుగోడు: విద్యుత్ వైర్లు తెగి గడ్డివాముపై పడటంతో మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. మునుగోడు మండలంలోని చొల్లేడు గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వీరమళ్ల యాదయ్య తన వ్యవసాయ బావి వద్ద పశువుల గ్రాసం కోసం 500 మోపుల గడ్డివాము వేశాడు. పెద్ద ఎత్తున గాలితో పాటు వర్షం కురవడంతో గాలికి విద్యుత్ తీగలు తెగి గడ్డివాముపై పడి మంటలు లేచాయి. గమనించిన స్థానిక రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. గడ్డివాము పూర్తిగా దగ్ధం కావడంతో దాదాపు రూ.60వేలకు పైగా నష్టం వాటిట్టిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. ప్రభుత్వ బడికి సర్పంచ్, ఉప సర్పంచ్ కుమార్తెలు కేతేపల్లి : మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామ సర్పంచ్ ఏర్పుల నాగరాజు, కాసనగోడు ఉప సర్పంచ్ వెంకటేష్ శుక్రవారం తమ కుమార్తెలను ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. సర్పంచ్ నాగరాజు కుమార్తె రియా స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతిలో అడ్మిషన్ తీసుకోగా, ఉప సర్పంచ్ వెంకటేష్ కూతురు దుర్గశ్రీని ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంపై ఎంఈఓ కె.భిక్షమయ్య హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. -
పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి
మిర్యాలగూడ టౌన్ : పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది. తండావాసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం జేత్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్యతండాకు చెందిన గొర్రెల కాపరి మాలోతు కోటయ్య(39) తన వద్ద ఉన్న గొర్రెలను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లాడు. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులు రావడంతో పాటు కురిసిన భారీ వర్షం పడుతుండడంతో కోటయ్య ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అక్కడే ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెలు ఇంటి చేరుకుని, కోటయ్య రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పొలాల వద్దకు వెళ్లారు. అక్కడ కోటయ్య మృతి చెంది ఉండడంతో కటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. నాగారంబంగ్లాలో ఇద్దరికి గాయాలు నాగారం : పిడుగుపాటుతో ఇద్దరికి గాయాలైన సంఘటన నాగారం మండలంలోని నాగారంబంగ్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంబంగ్లా గ్రామానికి చెందిన కన్నెబోయిన కుమార్, వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆవుల రమేష్లు తమ పనుల నిమిత్తం శుక్రవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వస్తుండగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో వారిద్దరూ తాటి చెట్టు కిందకు వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రమేష్ సూర్యాపేటలో, కుమార్ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి ఇక్కత్ శాలువా
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్కు అంతర్జాతీయస్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సంప్రదాయ కళలు, హస్తకళల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనతో పాటు పోచంపల్లి ఇక్కత్ పట్టు శాలువా తీసుకెళ్లారు. దానిని శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ సతీమణి బ్రిగెట్టి మాక్రాన్కు కానుకగా అందించారు. ఈ పట్టు శాలువాను భూదాన్పోచంపల్లికి చెందిన చేనేత కార్మికులు టై అండ్ డై పద్ధతిలో మగ్గంపై నేశారు. జ్యామితీయ పూల డిజైన్లు కల్గిన ఈ శాలువా ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ చేనేత కళకు గౌరవం దక్కడం పట్ల స్థానిక చేనేత కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. 2023లో కూడా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి ఇక్కత్ పట్టుచీరను బహుమతిగా అందించారు. తాజాగా రెండోసారి పోచంపల్లి పట్టు శాలువా ఇవ్వడం పోచంపల్లి ఇక్కత్ ఖ్యాతి మరింత పెరిగింది. గత నెలలో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో నిర్వహించిన 79వ కేన్స్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రెడ్కార్పెట్పై నడిచి ఇక్కత్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. -
విత్తు మొలకెత్తాలని..
గుండాల : మండల కేంద్రానికి చెందిన రైతు మాదరబోయిన రాజు సుమారు 4 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. వర్షాలు లేకపోవడంతో స్ప్రింక్లర్లు అమర్చి రోజుకు 30 గుంటల చొప్పున తడుపుతూ పత్తి విత్తనాలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వన మహోత్సవానికి శ్రీకారంభువనగిరి : పచ్చదనాన్ని పెంపొందించడమే ధ్యేయంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో హరిత సంకల్పానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది వన మహోత్సవం లో భాగంగా జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 16.72 లక్షల మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 18న చౌటుప్పల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో ఈ బృహత్తర యజ్ఞాన్ని అధికారులు ప్రారంభించారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు గ్రామానికి మండల స్థాయి, మండలానికి జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలను అప్పగించారు. వివిధ శాఖలకు కేటాయింపు జిల్లాలోని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఉపాధి నిధులతో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 10వేల మొక్కలు పెంచుతున్నారు. అటవీశాఖ ద్వారా ప్రత్యేక నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి వివిధ శాఖల ఆధ్వర్యంలో 16.72 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ భూముల్లో ఖాళీ ప్రదేశాలు, చెరువు కట్టలు, ప్రాజెక్టులు, అటవీ భూములు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. ప్రతి ఇంటికి పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేయనున్నారు. అందుబాటులో ఉన్న మొక్కలు వన మహోత్సవంలో భాగంగా నీడ, ఫలసాయం అందించే మొక్కలను నాటనున్నారు. నర్సరీల్లో టేకు, సుబాబుల్, కానుగ, చింత, మామిడి, నిమ్మ, జామ, దానిమ్మ, మునగ, అల్లనేరేడు, బొప్పాయి, బాదం, ఊసిరి, ఈత, మందార గులాబీ, అడవి తంగేడు, నిద్రగన్నేరు, వేప మొక్కలను అందుబాటులో ఉంచారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలను నాటనున్నారు. సంరక్షణ చర్యలు చేపడితేనే.. గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహరం పేరుతో తొమ్మిది విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. కానీ చాలాచోట్ల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. ప్రస్తుతం వన మహోత్సవంలో నాటే మొక్కలకు సంరక్షణ చర్యలు తీసుకుంటే ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. -
ఏసీబీకి పట్టుబడ్డ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్
నల్లగొండ: భూ సర్వే నివేదిక జారీ చేయడానికిగాను లంచం తీసుకుంటుండగా ససర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్గా పవన్ కుమార్ పనిచేస్తున్నారు. ఓ ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు సంబంధించిన భూముల సర్వే నివేదిక జారీ చేయడానికి పవన్ కుమార్ రూ.35 వేలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా గతంలోనే రూ.20 వేల అడ్వాన్స్గా తీసుకున్నాడు. మిగిలిన రూ.15 వేలు శుక్రవారం కలెక్టరేట్ సమీపంలో స్వీకరిస్తుండగా ఏసీబీ నల్లగొండ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పవన్కుమార్ను అరెస్టు చేసి నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. వ్యక్తి అదృశ్యంమిర్యాలగూడ టౌన్ : వ్యక్తి అదృశ్యమైన సంఘటన మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఖానాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ మాజీద్ అనే వ్యక్తి పశువైద్య శాలలో సబార్డినేట్గా పని చేస్తున్నాడు. తన అత్త ఊరు అయిన మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి 20 రోజుల క్రితం వచ్చాడు. ఈ నెల 16న మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మాజీద్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఆయన భార్య కరీష్మా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిస్తే 87126 70189కు సమాచారం అందించాలని కోరారు. 200 కోళ్లు మృతిహుజూర్నగర్ : మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన ఎస్కే అబ్దుల్లా పెంచుతున్న దాదాపు 200 కోళ్లు, కోడి పిల్లలు శుక్రవారం మృతి చెందాయి. ఈవిషయమై అబ్దుల్లా పోలీసులకు, పశువైద్యాధికారులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి పంచనామా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. కోళ్ల కళేబరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు పశువైద్యాధికారి మమత తెలిపారు. -
వచ్చేస్తోంది ఆభా
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ విధానం అమలు భువనగిరి: ఇక నుంచి ఆస్పత్రికి వెళ్తే పాత ప్రిస్క్రిప్షన్లు, మెడికల్ రిపోర్టులు తీసుకెళ్లాల్సిన పనిలేదు. రోగికి సంబంధించిన పూర్తి ఆరోగ్య చిట్టా, గతంలో జరిగిన సర్జరీలు, ఇతర పరీక్షల వివరాలన్నీ ఒక్క క్లిక్తో డాక్టర్కు ఆన్లైన్లో కనిపించనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఆభా) విధానానికి యాదాద్రి భువనగిరి జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ డిజిటల్ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ప్రత్యేక కమిటీల ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా 327 ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రభుత్వ జిల్లా జనరల్ ఆస్పత్రి ఒకటి, సీహెచ్సీలు 3, పీహెచ్సీలు 21, సబ్ సెంటర్లు 71, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు 105 ఉన్నాయి. వీటన్నింటిలో ఆభా అమలుకు ప్రత్యేకంగా కమిటీలు వేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లగానే మొదట ఔట్ పెషెంట్ విభాగంలో రోగుల ఆధార్ కార్డుతో ఆభాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రోగి ఆరోగ్య వివరాలన్నీ నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. వైద్య సేవలు, నిర్ధారణ పరీక్షలు, బ్లడ్ గ్రూప్తో పాటు ఆపరేషన్ వివరాలు రోగి ఆరోగ్య రికార్డులోనమోదుకానున్నాయి. ఆభాలో రిజిస్ట్రేషన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్కో రోగికి రూ. 20 చొప్పున ఆస్పత్రికి చెల్లించనుంది. మూడు విధాలుగా.. ఆభా కార్యక్రమం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని మూడు విధాలుగా కొనసాగిస్తున్నారు. ఇందులో మొదటగా ఆస్పత్రులు, రెండో దశలో వైద్యులు, నర్సులు, మూడో విడతలో డ్రగ్గిస్ట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఆభా సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ రంగంలో 201కిగాను 177 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ(హెచ్ఎఫ్ఆర్)లో నమోదు చేసుకోగా ఇంకా 24 పెండింగ్లో ఉన్నాయి. హెల్త్ ప్రొఫెషనర్ రిజిస్ట్రీ(హెచ్పీఆర్)లో 222 మంది వైద్యులకు 198 మంది నమోదు చేసుకోగా 24 మందివి పెండింగ్లో ఉన్నాయి. 180 స్టాఫ్ నర్సుల్లో 157 మంది నమోదు చేసుకోగా ఇంకా 23 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 28 ఫార్మసిస్టుల్లో 14 మంది నమోదు చేసుకోగా ఇంకా 14 మంది చేసుకోవాల్సి ఉంది. అలాగే 219 ఏఎన్ఎంలకు 213 మంది నమోదు చేసుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబొరేటరీలు కలిపి మొత్తం 327 ఉన్నాయి. ఇందులో 168 హెచ్ఎఫ్ఆర్లో నమోదు కాగా 169 చేసుకోవాల్సి ఉంది. 713 మెడికల్ షాపులకుగాను హెచ్ఎఫ్ఆర్లో 214 నమోదుఅయ్యాయి.289 మంది వైద్యులకుగాను 9 మంది, 9,415 మంది స్టాఫ్ నర్సులకు ముగ్గురు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఫ పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక ఫ రోగుల ఆరోగ్య వివరాలన్నీ ఆన్లైన్లోనే ఫ ఒక్క క్లిక్తో అందుబాటులోకి ఫ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నూతన పద్ధతి -
వికాస కేంద్రం ప్రారంభానికి ముహూర్తం ఖరారు
ఫ 20న ఆలేరులో ప్రారంభించనున్న మంత్రి సీతక్క ఆలేరు:ఽ ఆలేరు పట్టణంలో రూ.50లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 20న ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రానున్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు ఈ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై శాఖల వారీగా బాధ్యతలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీఓ పాల్గొన్నారు.ఆయిల్పామ్ సాగుతో స్థిరమైన ఆదాయంసాక్షి యాదాద్రి : ఆయిల్పామ్ సాగుతో 30 ఏళ్లపాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఉద్యాన శాఖకు సంబంధించిన పథకాలు, 2026–27 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆయిల్పామ్ మొక్కలు నాటిన తర్వాత నాలుగవ ఏడాది నుంచి కాపు మొదలైతుందన్నారు. ఎకరానికి సుమారు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని త ద్వారా సంవత్సరానికి ఎకరానికి సుమారు రూ. 1,20,000నుంచి రూ. 1,50,000 వరకు నికర ఆదాయం పొందవచ్చని వివరించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి కె. హేమలత, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. పంట మార్పిడి చేయాలిసాక్షి యాదాద్రి : ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు.జిల్లాలో 47,000 ఎకరాల్లో కంది సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరి లో సన్న రకాలనే సాగు చేయాలని కోరారు. ఎకరాకు 2 బస్తాల యూరియా పంపిణీ కోసం రూపొందించిన యూరియా యాప్ పై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకట్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రమణా రెడ్డి, ఉద్యాన అధికారిణి హేమలత పాల్గొన్నారు. 25 మందికి ఉద్యోగ నియామక పత్రాలు భువనగిరి: భువనగిరి పట్టణంలోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 5 ప్రైవేట్ కంపెనీలుపాల్గొన్న ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రాంకు 53 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 25 మంది ఎంపిక కాగా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధికల్పానాధికారి ఎన్.పద్మ, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల రామగిరి(నల్గొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్ రెడ్డి, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మునిస్వామి ఈ ఫలితాలను విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ రెగ్యులర్ సెమిస్టర్లతో పాటు 1వ, 3వ, 5వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఫలితాలను కూడా వెల్లడించారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులు కలిపి మొత్తం 68శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, అకడమిక్ కోఆర్డినేటర్లు నాగరాజు, శ్రీనివాసరెడ్డి, ఎగ్జామ్ బ్రాంచ్ మెంబర్ కోటయ్య పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
వలిగొండ : వలిగొండ మండలంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారును వలిగొండ మండలం ముద్దాపురం సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న యాకుబ్, భార్గవ్కు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా భూదాన్పోచంపల్లి మండలం వంకమామిడికి చెందిన మచ్చ ముత్యాలు, మచ్చ సత్తమ్మ, మచ్చ రామచంద్రు, మచ్చ కోటమ్మ ఆటోలో వలిగొండ మండలం సుంకిశాలలో శుభాకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండగా.. టేకులసోమారం సమీపంలో ఎదురుగా వచ్చిన మరో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేతతుర్కపల్లి : అక్రమంగా 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న డీసీఎంను గురువారం తుర్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఆలేరు మండలం కందిగడ్డతండాకు చెందిన కేతావత్ ప్రభాస్, బానోత్ శివఆలేరు పరిసర ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి గజ్వేల్, సిద్దిపేట వైపు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. డీసీఎంతో పాటు పట్టుబడిన బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తఖియొద్దీన్ తెలిపారు. -
మీసేవ.. డిజిటల్ తోవ
కొత్త నిబంధనల ప్రకారం.. జిల్లాలోని మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తుదారుల నుంచి కచ్చితమైన, యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. జూన్ 19 నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు)రసీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించి పాత పద్ధతిలోనే కాగితపు రశీదులు జారీ చేస్తే జిల్లాలోని సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని ఐటీ, ఈఎస్డీ కమిషనర్ ఉత్తర్వులుల్లో హెచ్చరించారు. అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెక్ట్ మొబైల్ నంబర్ను మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. భువనగిరిటౌన్: మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది. పేపర్ లెస్ పాలనలో భాగంగా జిల్లాలోని 70 మీసేవ కేంద్రాల్లో శుక్రవారం నుంచి డిజిటల్ రసీదుల విధానం అమల్లోకి రానుంది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (మీసేవ) కమిషనర్ ఆదేశాల మేరకు.. ఇకపై కాగితపు ప్రింట్లకు బదులుగా దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ హైపర్లింక్ పంపనున్నారు. పాత పద్ధతిలో ప్రింట్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మొబైల్కే రశీదు లింక్.. కొత్త విధానం ప్రకారం.. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే, దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్లింక్ ఉంటుంది. పౌరులు ఆ లింక్పై క్లిక్ చేసి తమ అక్నాలెడ్జ్మెంట్ రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు ఈ ఎస్ఎంఎస్ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు. అందుబాటులో రీ సెండ్ ఆప్షన్.. మొబైల్కు వచ్చిన ఎస్ఎంఎస్ పొరపాటున డిలిట్ అయినా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీసేవ అప్లికేషన్లో సదరు ఎస్ఎంఎస్ను తిరిగి పంపించే సౌకర్యాన్ని కల్పించారు. దరఖాస్తుదారులు కోరితే ఆపరేటర్లు మళ్లీ మెసేజ్ పంపేలా సహాయం అందిస్తారు. కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధానం అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీ సేవ కేంద్రాల్లో పేపర్ రసీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం. – సాయికుమార్, మీ సేవ జిల్లా మేనేజర్ఫ మీసేవ కేంద్రాల్లో నేటి నుంచి డిజిటల్ రసీదుల విధానం ఫ కాగితపు రశీదులకు ఇక చెల్లు ఫ దరఖాస్తుదారుడి మొబైల్కే అక్నాలెడ్జ్మెంట్ హైపర్లింక్ ఫ పొరపాటున డిలిట్ అయితే తిరిగి పంపించే వెసులుబాటు -
ఆటోలో బ్యాగు మర్చిపోయిన ప్రయాణికురాలు
ఫ పోలీసులకు అప్పగించిన డ్రైవర్ కోదాడరూరల్ : ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఆటో డ్రైవర్. వివరాలు.. చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన షేక్ లాల్సాహెబ్ కోదాడ పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం తన ఆటోలో ఎక్కిన ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయి దిగింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటోలో బ్యాగును గుర్తించిన లాల్సాహెబ్ ఆ బ్యాగును తీసుకొచ్చి కోదాడ పట్టణ పోలీసులు అప్పగించారు. పోలీసులు బ్యాగులో లభించిన వివరాల ఆధారంగా ప్రయాణికురాలిని గుర్తించి వారికి బ్యాగును అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ లాల్సాహెబ్ను పోలీసులు అభినందించారు. భువనగిరి ఖిలాను సందర్శించిన కెనడా దేశస్తులుభువనగిరి : హైదారాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో భాగస్వామ్యం ఉన్న కెనడా దేశానికి చెందిన 8 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు గురువారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఈ సందర్భంగా ఖిలాపై రాజాప్రసాదం, నీటి కొలనులు, ఏనుగు, గుర్రపు శాలలను తిలకించారు. ఖిలా పైకి వెళ్లే ప్రవేశ ద్వారాలను ఫొటోల్లో బంధించారు. ఏకశిలపై కోట నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణఆలేరురూరల్ : మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. ఈ ఘటన ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో గురువారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు గ్రామానికి చెందిన అంబాల జయమ్మ గురువారం ఉదయం తన ఇంటి బయట ఊడుస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని ముడున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. -
పచ్చికతో పొంచి ఉన్న ముప్పు
చిటుక రోగం (ఈటీ) : దీనిని గడ్డి రోగం, ముచ్చువ్యాధి, పాటు రోగం, మెడ సరంగా పేర్కొంటారు. ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా గొర్రెలు, మేకలలో వేగంగా వ్యాపించి మరణాలను కలిగిస్తుంది. గొర్రెలు, మేకలు ఎక్కువగా పచ్చిగడ్డి లేదా ధాన్యం మేసినప్పుడు ేజీర్ణక్రియలో మార్పులు వస్తాయి. వర్షం కురిసిన తర్వాత మొలిచిన మొలకలను అతిగా మేయడం వలన శరీరంలో ఎస్పిలాన్ అనే విష పదార్థం విడుదలై వ్యాధి వ్యాప్తికి కారణమవుతుంది. ఈ విషం రక్తంలో కలవడం వలన జీవం నిమిషాల్లో చనిపోతుంది. వ్యాధి లక్షణాలు : ఈ వ్యాధి సోకిన రాత్రికిరాత్రే అకస్మాత్తుగా చనిపోతాయి. జ్వరం, పళ్లు కొరకడం, వనకడం, బిగుసుకుపోవడం, కాళ్లతో పొట్టను తన్నుకోవడం, తలను చెట్లకు గట్టిగా ఆనించి ఉండడం, కాళ్లు బిగిసి నడవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం లక్షణాలు కనపడతాయి. ఎలాంటి రోగ లక్షణాలు కనిపించకుండా ఒకేసారి గాలిలోకి ఎగిరి కిందపడి మరణిస్తాయి. వ్యాధి తీవ్రమైతే విరోచనాలు, కడుపునొప్పి, మేత తినకపోవడం కనిపిస్తుంది. చికిత్స : ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పెన్సిలిన్ లేదా ఆక్సిటెట్రాసైక్లిన్ వంటి ఇంజెక్షన్లు వేయించాలి. విరోచనాలు తగ్గడానికి నెబ్లాట్ 10–15 గ్రాముల యాంటిబయోటిక్ తాగించాలి. డైక్ల్రోజ్ సైలెన్ రక్త కణాల్లోకి ఎక్కించాలి. మే, జూన్ నెలల్లో టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరుగా ఉంచాలి. పశువుల పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. పశువుల మేతను ఒక్కసారిగా మార్చకూడదు. ఎండిన గడ్డి నుంచి పచ్చగడ్డికి కొద్దికొద్దిగా అలవాటు చేయాలి. పెద్దవూర : తొలకరి వర్షాలతో భూమిపై మొలిచే పచ్చికను మేయడం, గుంతల్లో నిలిచిన నీటిని తాగడం వలన పశువులకు గొంతువాపు, జబ్బవాపు, చిటుక రోగం సంక్రమించే అవకాశం ఉంది. పశువుల కాపరులు జీవాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, వాటిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యం అందించాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి నులక నాగార్జున్రెడ్డి సూచిస్తున్నారు. కలుషిత నీటితో జాగ్రత్త ● గుంతల్లో నిలిచిన నీటిలో పరాన్న జీవులు, అంతరపరాన్న జీవులు, సూక్ష్మజీవులు చేరుతాయి. ఆ నీటిని తాగి జీవాలు రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. వీలున్నంత వరకు బోరు, బావుల నీటినే తాగించాలి. ● వర్షపు జల్లులు, చలిగాలుల వలన పశువులు చలి జ్వరానికి లోనై మేత తినకపోవడం, నీరసించడం, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అస్వస్థతకు గురైన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ● చిత్తడి ఉన్న ప్రదేశంలో పశువులను ఎక్కువకాలం కట్టేయడం, మేతకు తిప్పడం వలన కాలి గిట్టలు మెత్తబడి పుండ్లు ఏర్పడతాయి. వీలైనంత వరకు మెరక, పొడి ప్రదేశాల్లో పశువులను ఉంచాలి. పశవుల పాకలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ● తడిసిన గడ్డి బూజుపట్టే అవకాశం ఉంటుంది. బూజు పట్టిన గడ్డి మేపడం వలన పశువులు అస్వస్థతకు గురవుతాయి. తడిసిన గడ్డి ఎండబెట్టి తగు మోతాదులో సోడియం బైకార్బోనేట్ కలిపి పశువులకు అందించాలి. జబ్బవాపు వ్యాధి(బీ.క్యూ) : దీనిని సప్పవాపు వ్యాధి అని కూడా అంటారు. క్లాస్టీడియం చోవై అనే బ్యాక్టీరియా ద్వారా పశువులకు సోకే అంటువ్యాధి ఇది. ఆరు మాసాల యుక్త వయసులో ఉన్న పెయ్యలకు ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. ఇది వర్షం కురిసినప్పుడు ఎక్కువగా సోకుతుంది. వ్యాధి లక్షణాలు : ఈ వ్యాధి సోకిన జీవాల్లో 106–108 డిగ్రీల జ్వరం ఉంటుంది. నీరసం, నెమరు వేయకపోవడం, శ్వాస కష్టంగా తీసుకోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. సూక్ష్మజీవులు, తొడ, భుజం ప్రాంతంలోని కండరాలకు ఆశించి మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. తద్వారా పశువులు వాపుతో కుంటుతాయి. వాపు వద్ద కరకరమనే శబ్దం వస్తుంది. వాపు ప్రారంభంలో ఎర్రగా, నొప్పిగా ఉండి రాసురాను నొప్పిలేకుండా పోతుంది. రక్తంలో విష పదార్ధాల ప్రభావం వలన పశువులు 12 నుంచి 48 గంటల్లో మృత్యువాత పడతాయి. చికిత్స : వ్యాధి ప్రారంభంలో పెన్సిలిన్ ఆక్సీ వంటి యాంటిబయోటిక్ ఇవ్వాలి. ఆంటీ పైరెటిక్స్, ఆంటీ ఇప్టామిన్స్ వాడాలి. కార్డీ జోన్స్, డ్రైక్ట్రోజ్ నార్మన్ సెలిన్ ఇవ్వాలి. ఫ పశువుల్లో గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు ప్రబలే అవకాశం ఫ పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్రెడ్డి సూచనలు గొంతువాపు వ్యాధి(హెచ్.ఎస్) : వర్షాకాలంలో గేదెలు, ఆవులకు సోకే వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి ప్రమాకరమైంది. దీనినే గురక వ్యాధి అని కూడా అంటారు. తొలకరి వర్షాలు కురిసే సమయాల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధి పాస్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాధారణంగా పశువుల శ్వాసకోశంలో ఉండే ఈ బ్యాక్టీరియా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు లేదా పశువుల రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు చురుగ్గా మారి వ్యాధిని కలిగిస్తుంది. గాలికుంటు వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో గొంతువాపు వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కలుషితమైన నీటి ద్వారా మేకలు, గొర్రెలకు సోకుతుంది. జీవాలు చాలా ఎక్కువ దూరం ప్రయాణించడం వలన కూడా ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి లక్షణాలు : పశువుల శరీర ఉష్ణోగ్రత 104–106 ఫారన్హీట్తో తీవ్రమైన జ్వరం వస్తుంది. దవడ కింద, గొంతు, రొమ్ముభాగంలో కింద భాగాన గట్టిగా, నొప్పిగా ఉండే వాపు కనబడుతుంది. పశువు నోరు తెరిచి నాలుక బయటపెట్టి కష్టంగా శ్వాస తీసుకుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గరగర లేదా గుర్రుగుర్రు అనే శబ్దం వస్తుంది. నోటి నుంచి సొంగ, ముక్కు నుంచి చీమిడి కారుతుంది. కళ్లు ఎర్రబడతాయి. పశువు మేత మేయడం, నీరు తాగడం పూర్తిగా బంద్ చేస్తుంది. చికిత్స అందకపోతే 12 నుంచి 48 గంటల్లో మృత్యువాత పడుతుంది. చికిత్స : ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే పశువైద్యుడిని సంప్రదించాలి. బ్యాక్టీరియాను చంపడానికి సల్ఫాడ్రగ్స్, ఆక్సిటెట్రాసైక్లిన్, లేదా ఎన్రోప్లోక్సాసిన్ వంటి యాంటిబయోటిక్ ఇంజెక్షన్లు వైద్యుని సలహా మేరకు ఇవ్వాలి. వాపు, జ్వరం తగ్గడానికి మెలోక్షికామ్ లేదా ఫ్లునిక్షిన్ మెగ్లుమైన్ మందులను ఇవ్వాలి. గొంతువాపు వ్యాధి రాకుండా ముందస్తు వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గం. -
సేంద్రియ సాగు చేపట్టాలి
త్రిపురారం : వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం వైపు మాల్లాల్సిన అవసరం ఉందని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనారాయణ అన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, భూసారాన్ని కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు కేంద్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ తోడ్పాటు అందిస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పెట్టుబడి ఖర్చులు, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం, ప్రకృతి వ్యవసాయంలో చేపట్టాల్సిన పద్ధతులు, యాంత్రీకరణ, వర్మీ కంపోస్టు, జీవన ఎరువుల వినియోగంపై కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, అనిల్కుమార్, ఉద్యానవన శాస్త్రవేత్త హిమహిందు, గోలి మధుసూదన్, కంకణాల నివేదితారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, శ్రీధర్రెడ్డి, దేవర శ్రీనివాస్, అశోక్రెడ్డి, గండం వెంకట్రెడ్డి, త్రిపురారం మండల బీజేపీ అధ్యక్షుడు రెమడాల రమేష్, రైతులు పాల్గొన్నారు.ఫ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిక్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన పూజలు చేశారు. ప్రథమ ప్రా కార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. -
అక్షర బాటలో..
దరఖాస్తు గడువు 22వరకు పొడిగింపుభువనగిరి: భువనగిరి పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్స్(బైపీసీ,ఎంపీసీ)లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 22వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంవత్సరానికి రూ,7,800, జనరల్, ఓబీసీ విద్యార్థులకు రూ. 12,600 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఖాళీల భర్తీలో మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, ఆ తర్వాత ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపార వేత్తల పిల్లలకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. -
ఓట్లను తొలగించడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్ర
యాదగిరిగుట్ట రూరల్: కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ఓట్లను తొలగించడానికి కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ స్థాయి సర్ సర్వే బూత్ ఏజెంట్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్లకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ సర్వేను నిర్వహిస్తారన్నారు. ఈ క్రమంలో బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో బీఆర్ఎస్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఓల వెంటనే ఉండి, ఓట్లను తొలగించకుండా చూసుకోవాలన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలిగించే హక్కు ఏ అధికారికీ లేదన్నారు. గతంలో 2002 లో ఈ సర్వే జరిగిందని, అప్పుడు చాలా మందికి ఓట్లు లేవని, ఇప్పుడు ఉన్నాయని, ఆ సాకుతో ఓట్లను తొలగిస్తారన్నారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన మూర్ఖుడి చేతిలో ఉందని, దుర్మార్గమైన పాలన నడుస్తోందని, ప్రతీ స్కీమ్లో స్కామే ఉందని విమర్శిచారు. చంద్రబాబు, నరేంద్ర మోదీల హైబ్రిడ్ సీఎం.. తెలంగాణ సీఎం అని ఎద్దేవా చేశారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అని, పార్టీ శ్రేణులు నిక్కచ్చిగా పనిచేయాలని తెలియజేశారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాజ్య సభమాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, క్యామ మల్లేష్, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి -
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జిల్లా సరికొత్త రికార్డు
మొత్తం కొనుగోలు కేంద్రాలు 358కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలు 200ఇంకా మిగిలి ఉన్న కేంద్రాలు 158కొనుగోలు చేసిన ధాన్యం 4.71 లక్షల మెట్రిక్ టన్నులు చెల్లించిన ధాన్యం డబ్బులు రూ. 870 కోట్లు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం 25 వేల మెట్రిక్ టన్నులు సాక్షి, యాదాద్రి: యాసంగి ధాన్యం సేకరణలో యాదాద్రి జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. అంచనా 4.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటికే 4.71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. రవాణా, నిల్వ సమస్యలను అధిగమించి సుమారు 45వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో ఏకంగా రూ. 870 కోట్లు జమ చేశారు. ముగింపు దశకు.. ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. రెండు మూడు రోజుల్లో సేకరణ ప్రక్రియ పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 358 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 200కు పైగా కేంద్రాలను మూసివేశారు. మిగిలిన 158 కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు చాలా వరకు ముగింపు దశకు వచ్చాయి. వాటిలో కేవలం 2 నుంచి 3 లారీల ధాన్యం మాత్రమే మిగిలి ఉన్న కేంద్రాలు దాదాపు 100 వరకు ఉన్నాయి. 5 నుంచి 10 లారీల ధాన్యం మిగిలి ఉన్న కేంద్రాలు 30 నుంచి 40 వరకు ఉన్నాయి. 2022 రికార్డు బ్రేక్ చేసి.. నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ యాసంగి సీజన్లోనే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించారు. అంచనాలకు మించి దిగుబడులు రావడంతో ఇప్పటివరకు 4.71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2022 యాసంగిలో గరిష్టంగా 4.15 లక్షల నుంచి 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈసారి ఆ రికార్డులు బ్రేక్అయ్యాయి. ఈయాసంగిలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈ సారి దిగుబడులు పెరగడంతోపాటు, ప్రైవేట్ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు మిల్లులకు సీఎంఆర్కు కేంద్రం ఆలస్యంగా అనుమతి ఇవ్వడం కూడా కలిసి వచ్చింది. రెండు మూడు రోజుల్లో మరో 20 నుంచి 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం సేకరణ 4.95 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు రూ. 870 కోట్ల చెల్లింపు జిల్లాలో ఇప్పటి వరకు 45,215 మంది రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించారు. వీరికి సుమారు రూ.870 కోట్లు చెల్లించారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే నగదు జమ కానుంది.ఫ లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు.. కొనుగోలు చేసింది 4.71 లక్షల మెట్రిక్ టన్నులు ఫ ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు ఫ రైతుల ఖాతాల్లో రూ.870 కోట్లు జమ పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్, బీబీనగర్, నారాయణపురం మండలాల్లో మరో 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఈ కొనుగోలు చేసే ధాన్యం నిల్వ చేయడానికి గోదాములను సిద్ధం చేశాం. – కె. వెంకారెడ్డి,రెవెన్యూ అదనపు కలెక్టర్ -
పింఛన్ ఇప్పించండి సారూ..
సేంద్రియ వ్యవసాయం చేపట్టాలి రైతులు సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.- 8లోఫ ఐదేళ్లుగా అధికారుల చుట్టూ అంధుడి ప్రదక్షిణలు ఫ ఆసరా కోసం ఎదురుచూస్తున్న రాజాపేట వాసి చెన్నయ్య రాజాపేట: ఆయన కంటిచూపు కోల్పోయి ఐదేళ్లయింది.. ఆపన్నహస్తం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఓ వైపు అంధత్వం, మరోవైపు పేదరికం వెంటాడుతుండటంతో ఆ వృద్ధుడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రాజాపేటకు చెందిన పిట్టల చెన్నయ్య (56)కు భార్య పోచమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. అయితే, వీరి పెద్ద కుమారుడు వివాహమయ్యాక బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లాడు. చిన్న కుమారుడు కొన్నేళ్ల క్రితం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు కూడా చేశారు. ఐదేళ్ల క్రితం చెన్నయ్య అకస్మాత్తుగా కంటిచూపు కోల్పోయాడు. దీంతో భార్య పోచమ్మ ఇళ్లల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. వీరికి చిన్న ఇల్లు తప్ప ఎలాంటి భూమి, ఆస్తులు లేవు. ప్రభుత్వం నుంచి వికలాంగుల పింఛన్ వస్తే తమ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉంటుందని చెన్నయ్య ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. దరఖాస్తులు ఇస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి పింఛన్ ఇప్పించాలని చెన్నయ్య కోరుతున్నాడు. -
గ్రామీణ యువత వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి
నల్లగొండ టూటౌన్ : గ్రామీణ ప్రాంతాల్లోని యువత వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం నల్లగొండలోని ఎంజీయూలో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం, తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ ట్రైనింగ్ టీ–శాట్ ఆధ్వద్వర్యంలో ఆన్లైన్ తరగతులు, సర్టిఫికెట్ కోర్సుల ప్రారంభానికి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అందిస్తున్న విద్యా అవకాశాలు మరింత ఉపయోగకరంగా, విస్తృతంగా విద్యార్థులకు అందుతాయన్నారు. భవిష్యత్తులో కోర్సుల పరిధి మరింత పెంచి ఇతర విభాగాలు కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీ–శాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, సాధిక్, లింగారెడ్డి, అలవాల రవి, ఆకుల రవి పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
పెళ్లింట్లో తీవ్ర విషాదం
చిలుకూరు : తెల్లారితే కుమారుడి పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇంట్లో ఫ్రిజ్ డోర్ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి మృతిచెందింది. ఈ ఘటన చిలుకూరు మండలం దూదియాతండా గ్రామంలో గురువారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దూదియాతండాకు చెందిన చెందిన బాణోతు చిన్నానాయక్, లింగమ్మ(51) దంపతుల పెద్ద కుమారుడు సాయికిరణ్ పెళ్లి శనివారం ఉదయం జరగాల్సి ఉంది. శుక్రవారం సాయికిరణ్ను పెళ్లి కొడుకును చేసేందుకు ఇంట్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం లింగమ్మ వంట గదిలో ఫ్రిజ్ డోర్ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఆమె భర్త చిన్నానాయక్ గమనించి లింగమ్మ చేతిని పట్టుకొని లాగే ప్రయత్నం చేయగా.. అతడు కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే చిన్నానాయక్ తన చేతి వెనక్కి లాక్కోని విద్యుత్ మెయిన్ను ఆపేశాడు. దీంతో లింగమ్మ కిందపడిపోయింది. చికిత్స నిమిత్తం ఆమెను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి సీపీఆర్ చేసినప్పటికీ మృతిచెందింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హనుమాన్నాయక్ తెలిపారు. ఈ ఘటనతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. లింగమ్మ ఆశ వర్కర్గా పనిచేస్తుంది. ఫ తెల్లారితే కుమారుడి వివాహంఫ ఇంట్లో ఫ్రిజ్ డోర్ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి మృతి ఫ చిలుకూరు మండలం దూదియాతండాలో ఘటన -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
సాక్షి, యాదాద్రి : ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ టీకా దినోత్సవం (పల్స్ పోలియో) కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల సుమారు 57,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 647 పోలియో బూత్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 29, 30 తేదీల్లో కూడా ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. జిల్లాను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రాబోయే 15 రోజుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులు, క్లినిక్లు, వైద్య సిబ్బంది వివరాలను వంద శాతం ఆన్లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్టాప్ డయేరియా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు పాల్గొన్నారు. శ్రీమత్స్యగిరి ఆలయ ఈఓగా వెంకటయ్యవలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన కార్యనిర్వహణ అధికారి(ఈఓ)గా కొత్తపెల్లి వెంకటయ్య మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిత్య కై ంకర్యాలు నిర్వహిస్తూ భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతతకుముందు ఆయనకు ఆలయ సిబ్బంది, అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయిల్ పామ్ సాగుతో ఆదాయంమోత్కూరు : ఆయిల్ పామ్ తోటల సాగు చేసిన నాలుగేళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు పంట దిగుబడితో ఆదాయం పొందవచ్చని ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్రెడ్డి అన్నారు. మోత్కూరు మండలం రాగిబావి గ్రామంలో రైతు ఎన్నం మధుసూదన్రెడ్డి ఆయిల్ పామ్ తోటలో మంగళవారం గెలల తొలి కోతను జిల్లా మేనేజర్ ప్రారంభించి రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఎన్నం మధుసూదన్రెడ్డి 2023 ఏప్రిల్లో నాటిన 9 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో ప్రస్తుతం తొలి కోతను ప్రారంభించామని తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఫీల్డ్ ఆఫీసర్ మమత మాట్లాడుతూ ఆయిల్ పామ్ నాలుగేళ్ల కృషికి నేడు ఫలితం లభించిందన్నారు. ప్రస్తుతం టన్ను ధర రూ.23,852 ఉందన్నారు. సాగుకు సంబంధించిన పూర్తి వివరాలకు సెల్ :7093585983 సంప్రదించాలని కోరారు. ఎరువుల ధరలు తగ్గించాలి భువనగిరిటౌన్ : ఎరువుల ధరలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పేరబోయిన బంగారి అధ్యక్షతన రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను విపరీతంగా పెంచి రైతాంగంపై అదనపు భారం మోపిందన్నారు. పంటలకు నామమాత్రంగా గిట్టుబాటు ధరలు కల్పిస్తోందని విమర్శించారు. మదర్ డెయిరీ పాల రైతులకు పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. జిల్లాలో నిలిచిపోయిన రైతుబంధు, రుణమాఫీని అందరికీ వర్తింపజేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక రైతు సమస్యలపై ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు రాజయ్య, సీపీఐ, రైతు సంఘం నాయకులు చేడె చంద్రయ్య, ఏశాల అశోక్, చెక్క వెంకటేష్, పేరబోయిన మహేందర్, దయాకర్ రెడ్డి, అంజయ్య, కొమరయ్య, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రామగిరి(నల్లగొండ ): ఆర్టీసీ సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉమ్మడి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం నల్లగొండలోని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ 2013 పీఆర్సీ ప్రకారం యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ను వెంటనే పీఎఫ్ కమిషనర్ ఆఫీసుకు పంపించాలన్నారు. 2017 పీఆర్సీ బకాయిలను 9 సంవత్సరాలుగా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ లగ్జరీ సర్వీసుల్లో తమ కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణం కల్పించాలని, హైదరాబాద్లోని తార్నాక ఆస్పత్రిలో పాత పద్ధతిలోనే ఒకేసారి రెండు నెలలకు సరిపడా మెడిసిన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ భోనగిరి శంకరయ్య, రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల యాదగిరి, పల్రెడ్డి యాదగిరిరెడ్డి, బొమ్మ మల్లయ్య, శ్రీను, వీఎస్పీ.రావు, వీవీ.రెడ్డి, వీఏ.రెడ్డి, రవీందర్, ఎస్ఆర్రెడ్డి, ఎండీ.గౌస్ పాల్గొన్నారు. -
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం
గుండాల : మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలో ఎన్ఆర్ఎల్ఎం రూ.49 లక్షలతో ఏర్పాటు చేసిన పప్పు ప్రాసెసింగ్ ఆహార ధాన్యం నిల్వల గోదాముకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రజా ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు, పెట్రోల్ బంక్లలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు జాతీయ ఆహార భద్రత పథకం ఆధ్వర్యంలో కందుల సంచులు అందించారు. మరిపడిగకు చెందిన బండారు యాదలక్ష్మికి కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ చేశారు. అనంతరం బూర్జుబావి గ్రామంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు వల్లాల వాసవి, రమేష్ ఇంటిని ప్రారంభించారు. గ్రామంలో మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, సర్పంచ్లు దేవనబోయిన అయిలయ్య, వల్లాల రమేష్, లింగాల అనిల్కుమార్, కాలి మంజూల, మద్దెపురం కొండమ్మ, తహసీల్దార్ ఎస్.హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, ఏఓ సూరజ్కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇమ్మడి దశరథ గుప్తా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ఎయిమ్స్లో మెరుగైన సేవలందించాలి
సాక్షి, యాదాద్రి : ఎయిమ్స్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని భువనగిరి ఎంపీ చామలకిరణ్కుమార్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎయిమ్స్ ఆవరణలో మౌలిక వసతుల కల్పన, నూతన ప్రాజెక్టుల పురోగతిపై స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీతోపాటు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఫేజ్–1లో చేపట్టిన ఎయిమ్స్ భవన సముదాయం పనులు త్వరగా పూర్తిచేయాలని కోరారు. గుర్తింపు పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఎయిమ్స్లో ప్రత్యేకంగా సదుపాయలు కల్పించాలని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ప్రారంభించే నూతన బ్లాక్లో జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సదుపాయం కల్పిస్తానని డైరెక్టర్ అమితా అగర్వాల్ హామీ ఇచ్చినట్లు ఎంపీ చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సహాయకులుగా వచ్చే వారికోసం విశ్రామ్ సదన్ నిర్మాణం అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ సమావేశంలో స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ డా. శైలేంద్ర హండు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, ప్రొఫెసర్ డాక్టర్ తీర్థంకర్ దేబ్, ప్రత్యేక ఆహ్వానితులుగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రాజనీష్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శశికుమార్ పాల్గొన్నారు. ఫ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ చామల -
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి
భువనగిరి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి భారీగా నిధులిస్తోందన్నారు. ఇప్పటి వరకు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల రూపంలో ఇచ్చిందన్నారు. ఇందులో ఎయిమ్స్ నిర్వహణకు ఏడాదికి రూ.500 కోట్లు, రోడ్లకు రూ.36వేల కోట్లు, చర్లపల్లి నుంచి యాదాద్రి వరకు వేసే ఎంఎంటీఎస్కు రూ.600 కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల మురళీధర్రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, నాయకులు దాసరి మల్లేశం, పోతంశెట్టి రవీందర్, పన్నాల చంద్రశేఖర్రెడ్డి, పట్నం శ్రీనివాస్, చందా మహేందర్ గుప్తా, మాధురి, బలరాం, రాచకొండ కృష్ణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ -
ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయి రూ.కోటిపైనే
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీలో వ్యాపార లైసెన్స్ ఫీజు వసూళ్లు పడకేశాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో వ్యాపారుల లైసెన్స్ ఫీజు చెల్లించడం లేదు. పట్టణ పరిధిలో వ్యాపార సంస్థలు నడుపుతూ మున్సిపాలిటీ నుంచి అన్నిరకాల మౌలిక వసతులు పొందుతున్న కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి ఫీజు చెల్లించకున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రూ.కోటికిపైనే బకాయిలు పేరుకుపోయి మున్సిపల్ ఖజానాకు భారీగా గండిపడుతోంది. రికార్డుల్లో 1,853 ట్రేడ్ లైసెన్స్లు మున్సిపల్ రికార్డుల ప్రకారం భువనగిరి పట్టణంలో గతంలో 1,853 ట్రేడ్ లైసెన్సులు జారీ అయ్యాయి. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో దాదాపు 300కుపైగా దుకాణాలు మూతపడినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మిగిలిన దుకాణాల నుంచి నిబంధనల ప్రకారం ఏటా వ్యాపార ఫీజు వసూలు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అయితే గడిచిన 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణంలో రూ.1.40 కోట్ల వ్యాపార ఫీజు వసూలు కావాల్సి ఉండగా దాదాపు రూ.1.05 కోట్లకుపైగా బకాయిలు నిలిచిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా గతేడాది డిమాండే ఉండగా ఇప్పటి వరకు రూ.6 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. నోటీసులు అందించని యంత్రాంగం పట్టణంలోని వ్యాపార సంస్థల ముందు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రెయినేజీలు, వీధిదీపాల ఏర్పాటుతో పాటు రోజూ దుకాణాల నుంచి మున్సిపల్ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. పట్టణంలోని సుమారు 15కు పైగా ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు, పలు పెట్రోల్ బంకుల నిర్వాహకులు, వస్త్ర దుకాణాల యజమానులు తాము వ్యాపార లైసెన్స్ ఫీజు చెల్లించేది లేదని మున్సిపల్ అధికారులు, సిబ్బందితో తెగేసి చెబుతున్నట్లు సమాచారం. ఎగవేతదారులు ఎక్కువవుతున్నా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి, దుకాణాలు సీజ్ చేయడానికి వెనుకడుగు వేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతోందని, ఫలితంగా పట్టణ అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి వ్యాపార లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని, బకాయిలు చెల్లించని వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశాం. బకాయిలు కూడా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున్న బకాయి ఉన్న వారిని గుర్తించి నోటీసులు అందజేస్తాం. – చంద్రప్రకాశ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి ఫ భువనగిరి మున్సిపాలిటీలో వసూలు అంతంతే.. ఫ అధికారుల ఉదాసీనతతో రెండేళ్లుగా మందగించిన ప్రక్రియ ఫ సౌకర్యాలు పొందుతూ ఫీజు చెల్లించని వ్యాపారులు ఫ ఆసుపత్రులు, పెట్రోల్ బంకుల నిర్వాహకులు కూడా.. ఫ మున్సిపల్ ఖజానాకు భారీగా గండి ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు ఇలా.. ఆర్థిక సంవత్సరం వసూలు కావాల్సింది అయ్యింది 2025–2026 రూ.1.40 కోట్లు రూ.34.74 లక్షలు 2026–2027 రూ.1.40 కోట్లు రూ.6 లక్షలు -
బాండ్ దొరకక టెన్షన్
మోత్కూరు : మోత్కూరులో స్టాంప్ పేపర్ల (బాండ్ పేపర్ల) కొరత నెలకొంది. రెండు నెలలుగా రూ.50, రూ.100 బాండ్ పేపర్లు దొరకడంలేదు. దీంతో భూ, ఇళ్ల క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాలు ఉంటాయి. స్టాంప్ పేపర్లు అమ్మేందుకు మోత్కూరులో నలుగురు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో ఒక్కరు చొప్పున స్టాంప్ వెండర్లు ఉన్నారు. మోత్కూరులో నెలకు ఒక్కో వెండర్ కనీసం 300పైగా బాండ్లు విక్రయిస్తారు. పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ వందల్లో వీటి విక్రయాలుంటాయి. ప్రస్తుతం కార్యాలయంలో కేవలం రూ.20 విలువైన బాండ్ పేపర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.50, రూ.100 బాండ్ పేపర్ల కోసం 50కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి, రామన్నపేట, జనగామ, నల్లగొండ పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని రియల్టర్లు, స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి డిమాండ్కు తగ్గ స్టాంప్ పేపర్లు సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. మోత్కూరులో రూ.50, రూ.100 స్టాంప్ పేపర్ల కొరత ఫ కావాలంటే 50 కిలోమీటర్లు వెళ్లాల్సిందే ఫ ఆస్తుల క్రయవిక్రయదారుల అవస్థలు రిజిస్ట్రేషన్ల సమయంలో స్టాంప్ పేపర్లు లభించక ఇబ్బందులు పడుతున్నాం. రూ.50, రూ.100 స్టాంప్ పేపర్ల కోసం భువనగిరికి వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకుంటున్నాం. అవసరమైన స్టాంప్ పేపర్లు సరఫరా చేయాలి. – చొల్లేటి నరేష్, రియల్టర్, మోత్కూరు స్టాంప్ పేపర్లకు కొరత వాస్తవమే. రూ.50, రూ.100 విలువైన స్టాంప్ పేపర్ల సరఫరా లేదు. మా కార్యాలయంలో రూ.20 విలువైన స్టాంప్ పత్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే సరఫరా చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. – వి.వరప్రసాద్, సబ్ రిజిస్ట్రార్, మోత్కూరు -
విత్తనమైతే వేశాం..
సాక్షి, యాదాద్రి: వానాకాలం సీజన్ ఆరంభంలోనే పత్తి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. వరుణుడు ముఖం చాటేయడం, భానుడి ప్రతాపంతో భూమి లో నాటిన పత్తి గింజలు తేమలేక మొలకెత్తకుండానే మాడిపోతున్నాయి. తొలకరి జల్లుల నమ్మకంతో ముందస్తుగా విత్తనాలు వేసిన రైతులు వర్షం కురువక నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 50వేల ఎకరాల్లో పత్తి సాగు ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సుమారు 1,30,000 నుంచి 1.35,000 ఎకరాలలో పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాలు సకాలంలో పడకపోవడంతో లక్ష్యానికి అనుగుణంగా సాగు సాగలేదు. జిల్లాలోని ఆలేరు, మోత్కూరు, రాజాపేట, మోటకొండూరు,ఆత్మకూర్ఎం, గుండాల, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట, అడ్డగూడురు, భువనగిరి ఇలా పలు మండలాల్లో పత్తి సాగు చేశారు. సుమారు 50 వేల ఎకరాల్లో పత్తి గింజలు నాటారు. ఏడు మండలాల్లో పడిపోయిన వర్షపాతం ప్రస్తుతం వానాకాలంలో జిల్లాలో వర్షపాతం తీవ్రంగా పడిపోయింది. ఈనెల 1నుంచి 17వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 60.9 మి.మీ.కు గాను కేవలం 36.6 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం వలిగొండ, నారాయణపూర్, చౌటుప్పల్, బొమ్మల రామారం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక మరో ఏడు మండలాలైన రాజాపేట, ఆలేరు, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట, అడ్డగూడూరులలో వర్షపాతం పడిపోయింది. మరో ఆరు మండలాలుతుర్కపల్లి, మోటకొండూర్, యాదగిరిగుట్ట, ఆత్మకూర్, మోత్కూర్, గుండాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. సరిపడా వర్షం కోసం ఎదురు చూపులు పత్తి రైతులు సరిపడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. మృగశిర కార్తె వచ్చి పది రోజులు దాటుతున్నా జిల్లాలో ఇప్పటి వరకు సరైన వర్షం కురువలేదు. కొన్ని చోట్ల చిరుజల్లులు పడితే పత్తి విత్తనాలు మొలకెత్తాయి. ఆ తర్వాత వర్షం లేక అవి ఎండిపోతున్నాయి. దీంతో ఒక్కో ఎకరానికి రైతులు రూ.5వేల నుంచి రూ.8 వేల వరకు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రెండోసారి విత్తనాలు నాటుకోవడానికి సైతం రైతులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఈనెల 1నుంచి 17 వరకు వర్షపాతం(మి.మీలలో) సాధారణం 60.9 నమోదైంది 36.6 ఫ తొలకరికి పత్తి గింజలు విత్తుకున్న రైతులు ఫ వానలు లేక మొలకెత్తని దైన్యం ఫ జిల్లాలో సాధారణం కంటే 40శాతం తక్కువ వర్షపాతం నమోదు ఫ వరుణుడి కోసం ఆకాశంవైపు చూస్తున్న రైతన్నఈ ఫొటోలో వ్యక్తి పేరు గూడెపు అబ్బయ్య. సొంతూరు అడ్డగూడూరు. ఈ రైతులకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా మరో 10 ఎకరాలు కౌలుకుతీసుకున్నాడు. కానీ ఈనెల 5న 10 ఎకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాడు. సకాలంలో వర్షాలు కురువక విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రూ. 30 వేల వరకు నష్టం వచ్చింది. వర్షం పడితే మరోసారి విత్తనాలు వేసుకుంటానని చెబుతున్నాడు. రుతుపవనాల కదలికలు మందగించాయి. పొడినేలల్లో పత్తి విత్తనాలు వేసి నష్టపోవద్దు. భూమిలో కనీసం రెండు, మూడు ఇంచుల వరకు తేమ ఉంటేనే విత్తనం మొలకెత్తుతుంది. మంచి వర్షాలు కురిసే వరకు వేచి చూస్తే మంచిది. విత్తనాలు కూడా లైసెన్స్డ్ డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. – పీవీ వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
మూడు మండలాల్లో ఫర్టిలైజర్ యాప్ ప్రారంభం
ఫ నేడు బీబీనగర్, రాజాపేట మినహా అన్ని మండలాల్లో అందుబాటులో యాప్ భువనగిరి: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో బుధవారం ఫర్టిలైజర్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ముందుగా భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూర్ మండలాల్లో అందుబాటులోకి రాగా గురువారం బీబీనగర్, రాజాపేట మండలాలు మినహా అన్ని మండలాలలో అందుబాటులోకి రానుంది. జిల్లాలో వానాకాలం సీజన్కు 5.50 లక్షల బస్తాల యూరియా అవసరం ఉండగా ప్రస్తుతం 2.50 లక్షల బస్తాలు అందుబాటులో ఉన్నట్లు డీఏఓ పీవీ రమణారెడ్డి తెలిపారు. లోక్ అదాలత్ను విజయవంతం చేయాలిభువనగిరిటౌన్ : ఈనెల 20న నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. మాధవీ లత కోరారు. బుధవారం భువనగిరి పట్టణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో అన్ని కోర్టుల కానిస్టేబుల్స్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్తో లోక్అదాలత్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మారుమూల ప్రాంత ప్రజలకు తెలిసేలా లోక్ అదాలత్పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రాజీ పడదగిన కేసులను గరిష్ట సంఖ్యలో పరిష్కరించాలన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా, సమయం, డబ్బు ఆదా చేసుకోవడానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమని, కక్షిదారులు తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. మరింత సమర్థంగా కమ్యూనిటీ పోలీసింగ్బొమ్మలరామారం: కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు మరింత సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశించారు. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి మాట్లాడారు. విధి నిర్వహణలో, ఫిర్యాదుల స్వీకరణలో ప్రజలతో మర్యాద పూర్వక వైఖరి అవలంబిస్తూ పారదర్శకతతో వేగంగా కేసులను దర్యాప్తు చేయాలన్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షించడానికి రాత్రి సమయాలలో గస్తీముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఐ బుగ్గ శ్రీశైలం, సిబ్బంది ఉన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లురాజాపేట : అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హౌసింగ్ పీడీ లక్క అలివేలు హామీ ఇచ్చారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాజాపేట మండలం నెమిల గ్రామంలో గుడిసెలు, పేదల ఇళ్లను బుధవారం హౌసింగ్ పీడీ పరిశీలించారు. ఈ సందర్భంగా వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రాజు, ఉప సర్పంచ్ మార్క శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిలివేరు బాలరాజు గౌడ్, హౌసింగ్ ఏఈ వేముల వివేక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండీ జలీల్, నాయకుడు మాయకోటి రాజు పాల్గొన్నారు. -
అవయవ దానంతో నలుగురికి పునర్జన్మ
పాలకవీడు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి మరో నలుగురికి పునర్జర్మ కల్పించారు. వివరాలు.. పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామానికి చెందిన మంద చైతన్య(35) ఈ నెల 12న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం చైతన్య బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల కౌన్సెలింగ్తో చైతన్య అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో వైద్యులు చైతన్య నుంచి గుండె, కాలేయం, రెండు కిడ్నీలను సేకరించి మరో నలుగురికి అమర్చారు. మంగళవారం గ్రామంలో చైతన్య అంత్యక్రియలు నిర్వహించారు. -
నేను సైతం..
కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు యాదాద్రి భువనగిరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆస్పత్రికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న వారు దేశంలో ఎక్కడైనా, ఏ ఆస్పత్రికి వెళ్లినా.. కేవలం మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే వారి ఆరోగ్య వివరాలు వైద్యులకు డిజిటల్గా అందుబాటులోకి వస్తాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా కేంద్ర ఆస్పత్రిని బుధవారం సందర్శించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, నేను సైతం అంటూ స్వయంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీ రిజిస్టర్ చేసుకునే విధానాన్ని పరిశీలించారు. -
అదుపుతప్పి కారు బోల్తా.. యువకుడు మృతి
మోత్కూరు : అదుపుతప్పి కారు బోల్తా పడడంతో యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పిట్టంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఎలుగు పార్వతమ్మ, యాదయ్య దంపతుల కుమారుడు ఎలుగు సందీప్ (22) హైదరాబాద్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం సందీప్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. మార్గమధ్యలో చిట్యాల మండలం పిట్టంపల్లి ఎక్స్ రోడ్డు వద్దకు రాగానే కారు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అందులోనే చిక్కుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని బయటకు తీశారు. వెనక సీటులో కూర్చున్న సందీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు యువకులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అప్పడు కుమార్తె.. ఇప్పుడు కుమారుడు పార్వతమ్మ, యాదయ్య దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం కాగా.. సుమారు ఐదేళ్ల క్రితం కుమార్తె మృతిచెందింది. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారుడు సందీప్ కూడా మృతిచెందడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో దత్తప్పగూడెం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఫ మరో ఇద్దరికి గాయాలు -
మిరప సాగుకు అనువైన సమయం ఇదే..
పెద్దవూర: గతేడాది మిరపకు అధిక రేటు రావడంతో ఈసారి కూడా మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మిరప సాగు, యాజమాన్య పద్ధతుల గురించి పెద్దవూర క్లస్టర్ ఉద్యానవన శాఖ అధికారి మురళి వివరించారు. అనువైన నేలలు.. మిరప సాగుకు ఉదజని సూచిక(పీహెచ్) 6 నుంచి 6.5 ఉన్న నేలలు అత్యంత అనుకూలం. వర్షాధారపు పంటకు నల్ల రేగడి నేలలు అనుకూలం. నీటి ఆధారపు పంటకు నల్ల నేలలు, చల్క నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రనేలలు అనుకూలం. వాతావరణం, విత్తే సమయం.. మిరప పంట అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. అయితే 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరప పంటను వానాకాలం సీజన్లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరప పంటను సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. మిరప పంటను ఖరీఫ్ సీజన్లో జూలై, ఆగస్టు నెలల్లో, యాసంగిలో అక్టోబర్, నవంబర్ నెలలో సాగు చేసుకోవచ్చు. నేల తయారీ.. పొలాన్ని వేసవిలో లోతుగా దున్ని, ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల వేపపిండి, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేయాలి. అలాగే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2కిలోల ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని కలిపి 10–15 రోజులు నీడలో ఉంచి శిలీంధ్రం వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేస్తే తెగుళ్ల నుంచి కాపాడవచ్చు. భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి పంట వేసే ముందు పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకుని భూమిలో కలియదున్నాలి. 10–15 రోజుల తర్వాత కల్టివేటర్తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 1–3 సార్లు దున్నుకోవాలి. విత్తన మోతాదు మిరపను రెండు రకాల పద్ధతుల ద్వారా సాగు చేయవచ్చు. మిరప విత్తనాలను నేరుగా ప్రధాన పొలంలో విత్తడానికి అయితే ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నారు పెంచుటకు విత్తన మోతాదు సూటి రకాలకు 650 గ్రాములు, హైబ్రిడ్ రకాలైతే 75 నుంచి 100 గ్రాముల విత్తనం సరిపోతుంది. నారు పెంచే విధానం ● ఎత్తైన నారుమడి తయారీ : మిరప నారుమడికి సారవంతమైన ఒండ్రునేలలు, నీటి వసతి, ఒక మోస్తారు నీడ కలిగిన ప్రదేశాలు చాలా అనుకూలం. ఒక మీటరు వెడల్పు, 40 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుగల మడిలో ఒక ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచుకోవచ్చు. నారు పెంచటానికి నేలకు కొంచెం ఎత్తులో మట్టిని బెడ్డుగా చేసుకోవాలి. నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమళ్లలో విత్తనాలను 5 నుంచి 8 సెం.మీ. మధ్యదూరం, 1.5 సెం,మీ లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన 9వ రోజు, 13వ రోజున లీటర్ నీటిలో 3 గ్రా. కాఫర్ ఆక్సీక్లోరైడ్ను కలిపిన ద్రావణంలో నారుమళ్లను తడపాలి. ● ప్రో ట్రేలలో నారు పెంచే విధానం : ఈ పద్ధతిలో ప్రతి విత్తనం సమానంగా, ఆరోగ్యంగా పెరిగి మొక్కలు సమానంగా ఉండి పంట ఒకేసారి కాపునకు వస్తుంది. దీనితో పాటు నారు ధృడంగా పెరగడంతో పాటు నారుకుళ్లు, వైరస్ తెగుళ్లను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక ఎకరా ప్రధాన పొలంలో నాటుటకు కావాల్సిన వారు 98 సెల్స్ కలిగిన 120 ట్రేలు సరిపోతాయి. ఒక్కో ప్రోట్రేసు నింపుటకు సుమారు 1.2 కిలోల కోకోపీట్ మిశ్రమం అవసరం. ఒక్కొక్క సెల్లో ఒక్క విత్తనం నాటుకుని తిరిగి కోకోపిట్తో కప్పుకోవాలి. 6 రోజుల తర్వాత మొక్క మొలకెత్తడం ప్రారంభమయ్యాక వీటిని ఎత్తైన బెడ్లలోకి మార్చుకోవాలి. ● మొక్కలను నాటుకునే విధానం.. ● మొక్కలను నీటి వసతి నేలల్లో నాటుకునేప్పుడు 24–24 అంగుళాలు(ఇంచులు) లేదా 26–26 లేదా 28–28 అంగుళాల దూరంలో నేల స్వభావాన్ని బట్టి నాటుకోవాలి. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాలలో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా జాగ్రత్తగా నాటుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నాటుకునేటప్పడు మొక్కల మధ్య దూరం 30–45 అంగుళాలు అనువైనది. కలుపు నివారణకు మొక్కలు నాటిన 20–25 రోజుల తర్వాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15–20 రోజులకు ఒక్కసారి దున్నాలి. ఎలా మొక్క నేల మోత్తాన్ని కప్పివేసేవరకు 4–5 సార్లు దున్నాలి. మొక్కలను నాటుకునే 1–2 రోజుల ముందు లీటర్ నీటిలో 1.5మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పంటలో కలుపు మొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత ఎకరానికి 400–500 మిల్లీలీటర్ల కై ్వజాలోఫాస్ ఇథైల్ను మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. మిరప విత్తనాలను మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. వైరస్ తెగుళ్ల నివారణకు కిలో మిరప విత్తనానికి గాను 150 గ్రాముల ట్రై సోడియం ఆర్థోఫాస్పేట్ను ఒక లీటరు నీటిలో కరిగించి దీనిలో 15 నుంచి 20 నిమిషాల పాటు విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీటిని తీసివేసి మంచి నీటితో శుభ్రంగా కడిగి విత్తనాలను నీడలో ఆరబెట్టుకోవాలి. రసం పీల్చు పురుగుల నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను పట్టించాలి. దీనివలన విత్తిన 20–25 రోజుల వరకు రసం పీల్చు పురుగుల ఉధృతి ఉండదు. బ్యాక్టీరియా, బూజు తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్ లేదా కాప్టాన్ మందును పట్టించాలి. చివరిగా అదే విత్తనాన్ని ట్రై కోడెర్మా విరిడి అనే శిలీంధ్రం పొడిని 5–10 గ్రాముల విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి. -
సన్నగా పెరుగుతున్నాయ్
సన్నబియ్యం ధరలు ఇలా.. (క్వింటాకు రూపాయల్లో..) బియ్యం రకం పాత ధర కొత్త ధర జేఎస్ఆర్ కొత్తవి 5,000 5,500జేఎస్ఆర్ పాతవి 6,400 7,000బీపీటీ కొత్తవి 4,200 5,200పాత బీపీటీ 5,000 6,000సంస్థాన్ నారాయణపురం : బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ కొనుగోళ్లు, బోనస్ ఎఫెక్ట్తో స్థానిక మార్కెట్లలో సన్న ధాన్యం దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇతర జిల్లాల నుంచి ధాన్యం తెప్పించి మర పట్టిస్తుండటంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సన్న రకాలపై వారం రోజుల వ్యవధిలోనే క్వింటాకు కనీసం రూ.800 నుంచి రూ.1000 వరకు పెరగడంతో సామాన్యులు బియ్యం కొనేందుకే జంకుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం దిగుమతి స్థానికంగా సన్నధాన్యం లభ్యత తగ్గిపోవడంతో జిల్లాలోని ఆయకట్టు ప్రాంతాలతో పాటు మిర్యాలగూడ, హాలియా, నాగార్జునసాగర్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి స్థానిక మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. స్థానిక మార్కెట్లో ధాన్యం కొరత తీవ్రంగా ఉండడంతో ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోందని మిల్లర్లు చెబుతున్నారు. బియ్యం వ్యాపారం ఎలా ఉందంటే.. జిల్లాలో సుమారు 70 రైస్మిల్లులు ఉండగా దాదాపు 600 బియ్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు అనేక కిరాణ దుకాణాల్లో కూడా బియ్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లో ధరలు పెరగడంతో రిటైల్ మార్కెట్లోనూ సన్నబియ్యం ధరలు పెరిగాయి. దీంతో మధ్యతరగతి, సామాన్య కుటుంబాలు అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరింత పెరిగే అవకాశం.. మార్కెట్లో సన్నధాన్యం నిల్వలు తక్కువగా ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం దిగుమతులపై ఆధారపడాల్సి రావడంతో సన్నబియ్యం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రైతులకు మాత్రం సన్నధాన్యానికి మద్దతు ధర లభిస్తుండడంతో ఈ పరిస్థితి వారికి లాభదాయకంగా మారింది. వారం రోజుల్లోనే క్వింటా బియ్యంపై రూ.800 పెరుగుదల ఫ మార్కెట్లో లభించని సన్న రకాల ధాన్యం ఫ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి ఫ గత వానాకాలంలో ప్రభుత్వం సన్నాలు కొనడమే కారణం నెల రోజుల క్రితం పాత బీపీటీ బియ్యం క్వింటా రూ.5,200 చొప్పున కొనుగోలు చేశాను. వారం రోజుల క్రితం అవే బియ్యం ధర రూ.6వేలకు చేరింది. రూ.1,500 ఇచ్చి 25 కేజీలు కొనుగోలు చేశాను. నెలలోనే బియ్యం ధర రూ.800 పెరగడం మధ్యతరగతి ప్రజలు భారంగా మారింది. – శనిగల జంగయ్య, జనగాం -
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
భువనగిరి: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ అనురాగ్జయంతి ఆదేశించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అంతకు ముందు ఆస్పత్రిలో బ్లడ్బ్యాంక్, శానిటేషన్, నవజాతశిశువు ప్రత్యేక రక్షణ, బాలింతలకు అందుతున్న సేవలు, టీ హబ్ సేవలు, ఆస్పత్రి ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్పేషెంట్, ఔట్పేషెంట్ వివరాలు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాను మోడల్ జిల్లాకు ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్హెల్త్ అకౌంట్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డాక్టర్ ఎ. జయలక్ష్మి, డీఎంహెచ్ఓ మనోహర్ ఉన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. విద్యుత్ తీగలు తగిలి నాలుగు గేదెలు మృతిహుజూర్నగర్ : పొలంలో తెగి పడ్డ విద్యుత్ తీగలు తగిలి నాలుగు గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన హుజూర్నగర్ మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన పి. నరసింహారావు, ఎన్. ఏసుపాదం, ఏ. శ్రీదేవి, ఎస్. అనురాధకు చెందిన నాలుగు గేదెలు మేత కోసం గ్రామ సమీపంలోని పొలంలోకి వెళ్లాయి. ఈదురు గాలులకు పొలంలో తెగి పడ్డ విద్యుత్ తీగలు తగిలి నాలుగు గేదెలు మృతిచెందాయి. ఒక్కో గేదె విలువ రూ.70 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతినకిరేకల్ : భార్యాభర్తల పంచాయితీ పరిష్కరించే క్రమంలో పెద్ద మనుషులు చేయి చేసుకోవడంతో అస్వస్థతకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన గుండగోని కృష్ణయ్య(46)కు అతడి భార్య పార్వతి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు గాను మే 17న గ్రామ పెద్దమనుషుల దగ్గర పంచాయితీ పెట్టారు. పంచాయితీ పరిష్కరించే క్రమంలో కృష్ణయ్య తన భార్యతో కలిసి ఉండాలనే విషయంలో అతడిపై పెద్ద మనుషులు చేయి చేసుకుని ఘర్ణణ పడ్డారు. దీంతో కృష్టయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. నెల రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నకిరేకల్ సీఐ హరిబాబు తెలిపారు. పోలీసు సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ హాలియా : విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని హాలియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరయ్యనగర్(వీబీ నగర్) నుంచి బుధవారం గృహ హింస ఫిర్యాదు అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసు సిబ్బందిపై మద్యం మత్తులో ఉన్న తురక రాంబాబు అనే వ్యక్తి దాడి చేసి విధులకు ఆటంకం కల్గించాడు. ఈ దాడిలో ఓ హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. హోంగార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేసిన రాంబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు హాలియా ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు. -
భూసేకరణ పూర్తయి మూడేళ్లు
తుర్కపల్లి : తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రతిపాదించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు మూడేళ్లుగా ముందుకు కదలడం లేదు. పరిశ్రమల విస్తరణతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న స్థానికుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడంతో స్థానికుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. పూర్తయిన భూసేకరణ.. గత ప్రభుత్వ హయాంలో తుర్కపల్లి శివారులో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనికోసం మొత్తం 100 ఎకరాల స్థలాన్ని నిర్ధారించారు. ఇందులో 76 మంది రైతుల నుంచి సుమారు 93 ఎకరాల భూమిని సేకరించారు. దీనికి అదనంగా మరో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. సుమారు 82 ఎకరాలకు గాను రూ.16.5 కోట్ల పరిహారం చెల్లించగా, మరో 11 ఎకరాలకు సంబంధించిన పరిహారం ఇంకా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. భూసేకరణ పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా.. ప్రాజెక్టు స్థలంలో కనీస అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు. ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రధానంగా కావాల్సిన రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వంటి కనీస వసతుల కల్పనకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రాజెక్టు భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులోకి వస్తే.. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి వస్తే తుర్కపల్లితోపాటు రాజాపేట, బొమ్మలరామారం, జగదేవపూర్, ఆలేరు మండలాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడటం ద్వారా ప్రాంతీయంగా ఆర్థికాభివృద్ధికి ఊతం కలగడమేగాక, వ్యాపార, రవాణా రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. కాగితాలకే పరిమితమా..? భూసేకరణ పూర్తయి వంద ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కుతుందా లేదా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిలిచిపోయిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను ప్రారంభించాలని కోరుతున్నారు.కలగానే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఫ నేటికీ ప్రారంభంకాని పనులు ఫ ఆశతో ఎదురుచూస్తున్న యువత ఫ ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి ఇండస్ట్రియల్ పార్క్ పూర్తయితే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పనులు నిలిచిపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ పనులు ప్రారంభించాలని కోరుతున్నాం. – ఎలుగుల భాను, తుర్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూ సేకరణ పూర్తికావడంతో త్వరలోనే పరిశ్రమలు వస్తాయని అశించాం. మూడేళ్లయినా పనులు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. – కందుకూరి వేణు -
మంటలంటుకుని కారు దగ్ధం
చివ్వెంల(సూర్యాపేట) : మంటలంటుకుని రహదారిపై కారు దగ్ధమైంది. ఈ ఘటన చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్బిలేడు గ్రామానికి చెందిన బత్తుల వెంకటనారాయణ తన కారులో సూర్యాపేటకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. మార్గమధ్యలో వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులోకి రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన ఆయన కారు దిగి దూరంగా వెళ్లాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సాంకేతిక లోపం వల్లే కారులో మంటలు వచ్చి ఉంటాయని పోలిసులు పేర్కొంటున్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం
ఫ యువకుడు మృతిచందంపేట : ఇంట్లో దండెంపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం పెద్దమూలలో మంగళవారం రాత్రి జరిగింది. పెద్దమూల గ్రామానికి చెందిన చేపూరి అరుణ్(30) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పని ముగించుకుని ఇంటికి వచ్చిన అరుణ్ రాత్రి బట్టలు ఉతికి దండెంపై ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం అతడిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. -
ఎండలతో మత్స్యకారులకు కష్టాలు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయ తీరంలో జీవించే వేలాది మంది మత్స్యకార కుటుంబాల జీవనోపాధిపై ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చేపలు నీటి అడుగు భాగంలోనే ఉంటుండటంతో వలలకు చిక్కడం లేదు. ఎప్పుడూ చేపల వేటతో సందడిగా ఉండే జలాశయ తీరం ప్రస్తుతం వెలవెలబోతుంది. సుదూర ప్రాంతాలకు మర పడవల్లో వెళ్లి గంటల తరబడి వేట సాగించినా చేపలు చిక్కక పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10గంటలు దాటితే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో మత్స్యకారులు పుట్టీల కింద కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10వేల మత్స్యకార కుటుంబాలు సాగర్ జలాశయంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. డ్యాం నిర్మాణ సమయంలో ఏపీలోని విశాఖపట్నం నుంచి వలస వచ్చిన కుటుంబాలతో పాటు స్థానిక గ్రామాలు, తండాలకు చెందిన అనేక మంది చేపల వేట పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం చేపల వేట దాదాపుగా నిలిచిపోవడంతో రోజువారి ఆదాయం పూర్తిగా పడిపోయిందని, పిల్లల చదువులు, కుటుంబ పోషణ కష్టంగా మారిందని మత్స్యకారులు చెబుతున్నారు. మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. రేషన్ కార్డుల మీద ఇచ్చే బియ్యంతో పాటు అదనంగా బియ్యం ఇవ్వాలి. జీవన వ్యయం కోసం జూలై మాసం వరకు ప్రతి మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.5వేలు ఆర్థికసాయం అందించాలి. – కోదండం, మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు ఫ సాగర్ జలాశయంలో వలలకు చిక్కని చేపలు ఫ కష్టంగా కుటుంబ పోషణ ఫ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ఆత్మకూరు(ఎం) : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గజరాజు కాశీనాథ్, నాయకులు బండారు సత్యనారాయణ, లోడి వెంకటయ్య, సూర్య, వపన్ సాయి పాల్గొన్నారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలిబొమ్మలరామారం : వైద్య శిబిరాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఈగల సంతోష బాల్రాజ్ అన్నారు. మండలంలోని పెద్దపర్వతాపూర్లో సోమవారం ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ ఏయిమ్స్ సౌజన్యంతో సోమవారం ప్రత్యేక చాతి ఎక్స్రే శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సుమలత, సూపర్వైజర్ జనార్దన్, పంచాయితీ కార్యదర్శి వెంకటేష్, ఉప సర్పంచ్ జింక నరేందర్, గంగల దివ్య పాల్గొన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్రంతుర్కపల్లి : కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సెంట్రింగ్ యూనియన్ మండల కన్వీనర్ తూటి వెంకటేశం అన్నారు. మండల కేంద్రంలో బీసీడబ్ల్యూసీ, సీఐటీ యూ పలుగుల మైసమ్మ తల్లి సెంట్రింగ్ యూనియన్ మండల కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో గందమల్ల అనంద్,జంగంపల్లి బాలరాజు,వెంకటేష్, రాజు, శ్రీశైలం, జడల లింగం, రాగుల శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు. విత్తనాలు, ఎరువుల దుకాణాలు తనిఖీగుండాల : మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో సోమవారం ఏవో సూరజ్కుమార్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్లో జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జీలుగ 30 కిలోలు రూ.2482.50 పైసలు, జనుము రూ.3150 చెల్లించి రైతులు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ కళాశాలలకు పది మంది ఎంపికమోత్కూరు : పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద, గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వం డీఆర్డీఏ పథకం ద్వారా కల్పిస్తున్న ఉచిత విద్య అవకాశాన్ని మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పది మంది విద్యార్థులు వివిధ ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరవిందరాయుడు సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థిని కొక్కుల ఉషశ్రీ ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ బాసరలో ప్రవేశం పొందిందన్నారు. గౌడ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా గోవర్దన్ గౌడ్మోత్కూరు : తెలంగాణ గౌడ యువజన విభాగం మోత్కూరు మండల అధ్యక్షుడి గా బుజిలాపురం గ్రామానికి చెందిన మొల్కపురి గోవర్దన్ గౌడ్ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.సంక్షిప్త సమాచారం -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
ఆత్మకూరు(ఎం): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. పెంచిన ధరలను తగ్గించని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మండలంలోని రహీంఖాన్పేట వద్ద బస్సులు ఆపాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు, మండల కార్యదర్శి మారుపాక వెంకటేశం, మండల సహాయ కార్యదర్శులు ఎండి నయీం. బత్తిని నరేష్, చేనేత సంఘం రాష్ట్ర నాయకులు పాశికంటి లక్ష్మినర్సయ్య, నాయకులు జల్థి రాములు, కల్వల నర్సయ్య, సోలిపురం లింగారెడ్డి, మారుపాక అంజయ్య, కూరెల్ల మత్స్యగిరి, గుర్రం రాజమణి పాల్గొన్నారు. -
మూతబడిన స్కూళ్లను తెరిపిస్తాం
ఫ కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ బడులు ఫ బడిబాట ద్వారా 800మందిని చేర్పించాం డీఈఓ భిక్షపతి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. మంచి నీరు, మరుగుదొడ్లు, విశాలమైన మైదానాలు ఉన్నాయి. ఇంకా ఏయే పాఠశాలల్లో సౌకర్యాలు అవసరమో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా తెలుకున్నాం. వాటి కల్పనకు చర్యలు తీసుకుంటాం. భువనగిరి: జిల్లాను విద్యాభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అందుకు అనుగుణంగా కృషి చేస్తామని డీఈఓ బోల్లారం భిక్షపతి అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి తీసుకునే చర్యలను సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజు పాఠ్యపుస్తకాలతో పాటు నోటు బుక్స్ అందజేశాం. విద్యార్థులకు సరిపడా పుస్తకాలు వచ్చాయి. జిల్లాలో విద్యార్థులు లేక 62 పాఠశాలలు మూతబడ్డాయి. 2026–27 విద్యా సంవత్సరానికి మూతబడిన స్కూళ్లను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్థానికంగా ఉన్న ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల చైర్మన్లు, ప్రజాప్రతినిధుల సహకారంతీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడుతాం. ప్రతి పాఠశాలలో కనీసం 10 నుంచి 15 మంది విద్యార్థులుండేలా చూస్తాం. ఇందుకోసం 5 ఏళ్ల వయస్సు పైబడిన వారు, బడికి దూరంగా ఉన్న వారిని గుర్తిస్తాం. బడిలో చేర్పించి సరిపడా ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతాం. బడిబాట కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. గత సంవత్సరం జిల్లాలో 701 ప్రభుత్వ పాఠశాలల్లో 35,594 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 10 శాతం నమోదు పెంపుతో 8వేల మందిని బడిలో చేర్పించాలని పాఠశాల విద్యాశాఖ ల క్ష్యాన్ని నిర్దేశించింది. దీనికోసం గత ఫిబ్రవరి, మార్చి నుంచే బడిబాట నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 800 మంది విద్యార్థులను చేర్పించాం. ఈ విద్యా సంవత్సరానికి యూనిఫాం కలర్ మారింది. గతంలో రెడ్ , యాష్కలర్ ఉండగా ఈసారి నెవీ బ్లూ కలర్తో కూడిన యూనిఫాం అందజేస్తాంరు. వస్త్రం రాగానే యూనిఫాం కుట్టే వారికి అందజేసి వూర్తి కాగానే విద్యార్థులకు ఇస్తాం. ఇప్పటికే విద్యార్థుల వద్ద కొలతలు తీసుకున్నారు. పదో తరగతి ఫలితాల్లో 2024–25లో రాష్ట్రంలో జిల్లా 8వ స్థానంలో ఉండగా 2025–26లో 12వ స్థానం వచ్చింది. 2026–27లో రాష్ట్రంలో 10వ స్థానం లోపు ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. మొదటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతాం. సబ్జెక్టు అర్థమయ్యేలా టీచర్లు బోధించేలా చూస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో నాణ్యమైన భోజనంతో పాటు పోషకాహారం అందిస్తాం. వారానికి మూడు రోజుల పాటు రాగి జావ ఇస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాలలను విజిట్ చేస్తా. మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, నాణ్యమైన బోధనపై తనిఖీలు నిర్వహిస్తా. ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో, మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఈ విద్యాసంవత్సరానికి 62 ప్రీప్రైమరీ పాఠశాలలు మంజూయ్యాయి. ఆయా పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బోధకులు, ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. -
పాఠశాలలను శుభ్రంగా ఉంచాలి : డీఈఓ
భువనగిరి : పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఈవో భిక్షపతి అన్నారు. సోమవారం మండలంలోని అనంతారం, బీబీనగర్ మండలం గూడూరు గ్రామాల్లోని పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రంగరాజన్, ఉపాధ్యాయులు ఉన్నారు. బోనంతో ‘బడిబాట’ ప్రచారం యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సోమవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. మాజీ సర్పంచ్ భీమగాని రాములు, మాధవి గౌడ్ ఆధ్వర్యంలో ‘బోనంతో బడి బా ట’ నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరుతూ మాజీ సర్పంచ్ రాములు స్వయంగా నెత్తిన బోనం ఎత్తుకుని ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే, భీమగాని తేజస్విని ఫౌండేషన్ తరఫున ఒక్కో విద్యార్థికి రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి శశాంక్ను సత్కరించారు. అనంతరం ఆ విద్యార్థికి రూ. 5వేల నగదు అందజేశారు. రాయిపల్లిలో అమ్మమాట.. అంగన్వాడీ బాట ఆత్మకూరు(ఎం) : మండలంలోని రాయిపల్లిలో ఐసీడీఎస్ మోత్కూరు ప్రాజెక్టు ఆధ్వర్యంలో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ వాణిశ్రీ , సర్పంచ్ ఇంద్రాల అంజయ్య, అంగన్వాడీ టీచర్ ప్రేమలత, సంఘ బంధం అధ్యక్షుడు పంజాల జ్యోతి, ఇందిరమ్మ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సంతకాల సేకరణ మోత్కూరు : తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికుల పోస్టులను పర్మినెంట్ చేయాలని, రెండవ పీఆర్సీలో నెలకు కనీసం రూ.26 వేలుగా నిర్ణయించాలన్నారు. వేతనాలలో ఎలాంటి తగ్గింపు లేకుండా సిబ్బందికి కేటగిరిల వారీగా అమలు చేయాలని, ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మెంట ఎల్లయ్య, యూనియన్ మండల అధ్యక్షులు డి.లింగమ్మ, ఎన్.అండాలు, కె.లక్ష్మి, అరవింద్, అవినాష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి
భువనగిరిటౌన్ : నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందాడి మణిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు పట్టణంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నాయకులు అంతకుముందు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంపల విజయ్ కుమార్, నాయకులు ఉపేందర్, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. యువతకు శాపంగా సీఎం రేవంత్రెడ్డి పాలనయాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన రాష్ట్రంలోని యువతకు శాపంగా మారిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి కందాడి మణిపాల్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని వైకుంఠద్వారం నుంచి గుండ్లపల్లి వరకు పలు దుకాణాల వద్ద వారు భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో విజయ్, ఉపేందర్, శ్రీనివాస్, రాజు, భాగ్యలక్ష్మి, సందీప్, మమత, మౌనిక, రాజలక్ష్మి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తిచేయాలి
భువనగిరిటౌన్ : ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తిచేయాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అన్నారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో సింగన్న గూడెం గల డబుల్ బెడ్ రూమ్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు తో కలసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల అమలు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగన్నగూడెం లోని డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ అలివేలు, భువనగిరి మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్రెడ్డి, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన భువనగిరి : మండలంలోని అనంతారం గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ ఎండీ ఎండీ గౌతమ్, కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి యాజమానులతో మాట్లాడి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వారివెంట ఎంపీడీఓ దినకర్, సర్పంచ్ పల్లెపాటి నాగరాణి తదితరులు పాల్గొన్నారు. -
వయోవృద్ధులకు ఉచిత న్యాయ సేవలు
భువనగిరి : వయోవృద్ధులకు ఉచితంగా న్యాయ సే వలను అందించనున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికా ర సంస్థ కార్యదర్శి మాధవిలత అన్నారు. ప్రపంచ వృద్ధుల వేదింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని పురష్కరించుని సోమవారం రాయగిరిలోని సహృదయ వృద్ధాశ్రమాన్ని ఆమె సందర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వృద్ధులకు న్యాయ సేవలు అందించేలా చర్య తీసుకుంటామన్నారు. ఆమెవెంట ఆశ్రమ ఇన్చార్జ్ రఫీ తదితరులు పాల్గొన్నారు. పాలకమండలిని నియమించాలిరామన్నపేట : నాయీబ్రాహ్మణ ఫెడరేషన్కు పాలకమండలిని నియమించాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల భిక్షం కోరారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయీబ్రాహ్మణ వృత్తిదారులకు అధునాతమైన పరికరాలను అందజేయాలన్నారు. వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న బార్బర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు రాపరి గణేష్, ఉపాధ్యక్షుడు దడిపెల్లి గణేష్, కోశాధికారి వావిళ ్లసంతోష్, వేముల అశోక్, రాసమల్ల శ్రీకాంత్, జంపాల మురళీ, వేముల దశరథ, డి.నాగరాజు, జంపాల నరేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సులు మా ఊరికి రావొద్దు
వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.పండుగ వాతావరణంలో పాఠశాలలు పునఃప్రారంభం - 8లోమంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026మండలస్థాయి అధికారులతో సమీక్షించడానికి ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్స్ వ్యవస్థప్రజావాణి వినతుల ఆన్లైన్ ప్రక్రియకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ భువనగిరిటౌన్ : ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యానికి చెక్ పెడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణికి వచ్చే అర్జీలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, దరఖాస్తుదారుల ముందే ‘వీడియో కాన్ఫరెన్స్’ ద్వారా క్షేత్రస్థాయి అధికారుతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. దీనికి తోడు అర్జీ ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ కౌంటర్లు, ప్రత్యేక ట్రాకింగ్ నంబర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకతను పెంచారు. క్షేత్రస్థాయి అధికారులకు వివరించి.. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన వెంటనే క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడేందుకు వీలుగా కలెక్టరేట్లో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనుమతితో ప్రజావాణి సమయం ముగిసే వరకు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందరూ విధిగా వీడియో కాన్ఫరెన్స్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన వెంటనే, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. బాధితుల ముందే సమస్యకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయి అధికారులకు వివరించి, వాటిని తక్షణమే పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లాలో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి,యాదాద్రి: బడి గంట మోగింది. పండుగ వాతావరణంలో పాఠశాలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. మామిడితోరణాలు, అరటి ఆకులతో స్కూళ్లను ముస్తాబు చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కానీ పుస్తకాల సంచి పట్టుకుని రావాల్సిన విద్యార్థులే కరువయ్యారు. జిల్లాలో ప్రారంభమైన నూతన విద్యాసంవత్సరానికి అమావాస్య సెంటిమెంట్ ఎఫెక్ట్ కన్పించింది. తొలిరోజు అంతంమాత్రమే హాజరు నమోదైంది. వచ్చిన విద్యార్థులకు చాక్లెట్లు, ఉచిత పుస్తకాలు ఇచ్చారు. అక్కడక్కడా పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఈ విద్యాసంవత్సరం ప్రణాళికపై చర్చించారు. హాస్టళ్లలోనూ.. వేసవి సెలవుల తర్వాత రెండు రోజులు పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. శనివారం నాడే ప్రారంభకావాల్సిన పాఠశాలు ఎండ వేడిమి తగ్గకపోవవడంతో సోమవారం వరకుపొడిగించారు. అయితే తెరుచుకున్న పాఠశాలలకు తొలిరోజున విద్యార్థులు చాల స్వల్పంగా హాజరయ్యారు. కొన్ని చోట్ల ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకుహాజరు కాలేదు. మొత్తంగా జిల్లాలో 10 శాతం విద్యార్థులు వచ్చారు. మంగళవారం నుంచి విద్యార్థుల హాజరు సంఖ్య పెరగవచ్చని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. కాగా వివిధ శాఖల వసతి గృహాల విద్యార్థులు ఇంకా ఇళ్లనుంచి రాలేదు. వసతి గృహాల్లో 2 శాతం మించి విద్యార్థులు హాజరుకాలేదు. మూతబడిన స్కూళ్లు తెరుచుకునేనా.. జిల్లాలో గతంలో వివిధ కారణాలతో మూతపడిన 62 పాఠశాలలు తెరుచుకోలేదు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు చేరలేదు. 10 నుంచి 15 మంది విద్యార్థులు నమోదు అయితే బడులను తెరవడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పేరెంట్స్ కమిటీ సమావేశాలు తొలిరోజున పలు పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను ఉపాధ్యాయులు వివరించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను భోధించాలని ఉపాధ్యాయులను కోరారు.ప్రజావాణిలో వచ్చే అర్జీలను ఆయా శాఖలకు వేగంగా చేరవేసేందుకు వీలుగా కలెక్టరేట్లో రెండు ప్రత్యేక ఆన్లైన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తులను స్వీకరించిన వెంటనే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు. అనంతరం సదరు అర్జీకి ఒక ప్రత్యేక ట్రాకింగ్ నంబర్ కేటాయించి బాధితులకు అందిస్తున్నారు. దీనివల్ల దరఖాస్తు ఏ దశలో ఉందో ప్రజలు సులభంగా తెలుసుకునే వీలుంటుంది. ఈ నూతన విధానం ద్వారా సమస్యల పరిష్కారంలో జాప్యం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని జిల్లా యంత్రాంగం తెలిపింది.కొండాపూర్లో పోషమ్మతో మాట్లాడుతున్న గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, చిత్రంలో కలెక్టర్ఫ పొడిచేడులో ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు ఫ అర్జీలు అందిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష ఫ ఆన్లైన్ ట్రాకింగ్తో పారదర్శకత ఫ ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు ఫ ప్రజావాణిలో నయా ట్రెండ్ ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవ ఫ అమావాస్య సెంటిమెంట్ ఎఫెక్ట్ .. తొలిరోజు హాజరు 10శాతమే ఫ విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ఫ మొదటిరోజే పాఠ్య పుస్తకాల పంపిణీ -
పండుగలా పాఠశాలలు పునః ప్రారంభం
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం పాఠశాలలు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు పచ్చని తోరణాలతో బడులను ముస్తాబు చేసి విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు. బడులు తెరిచిన తొలి రోజు ‘అమావాస్య’ కావడంతో విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. – సాక్షి నెట్వర్క్గుండాల : జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పూలతో స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు యాదగిరిగుట్ట : బాలికల ఉన్నత పాఠశాలలో ప్రార్థనకు హాజరైన విద్యార్థులు -
నా బడిని కాపాడుకుంటా
ఫ రాఘవాపురం సర్పంచ్ వినూత్న ప్రచారం ఆత్మకూరు(ఎం): ‘నా ఊరి బడిని నేను కాపాడుకుంటా’ అంటూ ఆత్మకూరు(ఎం) మండలం రాఘవాపురం గ్రామ సర్పంచ్ ఎర్కల యతీశ్వర్ గౌడ్ రూపొందించిన పోస్టర్ సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతోంది. మన గ్రామంలోని బడిలో పిల్లల్ని చేర్పిస్తే మంచి విద్యను అందించే బాధ్యత తీసుకుంటానని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే అయ్యే ఖర్చు, ప్రభుత్వ పాఠశాలకు పంపించిస్తే కలుగే ఆదా గురించి అందులో వివరించారు. ప్రతి 15 రోజులకు ఒక సారి తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతులను అందులో పేర్కొన్నారు. -
రైతుల గోడు పట్టించుకోని పాలకులు
రామన్నపేట : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ.. రైతుల గోడు పట్టించుకోవడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం రామన్నపేట మండలంలోని పల్లివాడ, దుబ్బాక గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసి మూడు నెలలు కావొస్తున్నా కొనుగోళ్లు జరుగక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుకుందని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించిందని, రైతుబంధు, నాణ్యమైన కరెంట్ అందించిందని వివరించారు. వానాకాలం సీజన్ ప్రారంభమై నాట్లు వేసే సమయం వస్తున్నా ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రేవంత్రెడ్డి పాలన పట్ల అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, కేసీఆర్ పాలనను తిరిగి కోరుకుంటున్నారని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, సర్పంచులు శ్రీనివాసులు, గర్దాసు విక్రం, రాములు, సుధీర్బాబు, గాదె పారిజాత, వెంకటేశం ఉన్నారు. -
అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి
సాక్షి,యాదాద్రి : అర్హుడైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా బూత్స్థాయి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చూడాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సూచించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో భువనగిరి నియోజకవర్గ బూత్ స్థాయి ప్రతినిధులకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై నిర్వహించిన శిక్షణలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని సచిన్ సావంత్ మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఐలయ్య, అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రతి కుటుంబానికి సమాచారం చేరవేయాలని కోరారు. ఫ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ -
పట్టణ ప్రగతికి టెండర్ల బ్రేక్!
నగరాభివృద్ధి పనుల టెండర్లు కొన్ని సాంకేతిక కారణాలతో రద్దు అయ్యాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసి పట్టణంలో అభివృద్ధి పనులను మొదలు పెట్టేలా చూస్తాం. – శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఆలేరు ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో కోట్లాది నిధుల నగరాభివృద్ధి టెండర్ల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. వరుసగా రెండు సార్లు టెండర్లు రద్దు కావడం సాంకేతిక లోపమా? లేక రాజకీయ జోక్యమా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పట్టణాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంజూరు చేసిన రూ.15కోట్ల నగరాభివృద్ధి నిధులకు గ్రహణం వీడటం లేదు. ఈ నిధులు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నా అభివృద్ధి పనులు టెండర్ల దశ దాటకపోవడం గమనార్హం. అధికారుల అలసత్వం కారణంగా కోట్లాది రూపాయల పట్టణ ప్రగతికి బ్రేకులు పడుతున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న రోడ్లు, వరద కాల్వలు తదితర సమస్యలు తీరుతాయనే పట్టణ వాసుల ఆశలు టెండర్ల జాప్యంతో నీరుగారుతున్నాయి. చేపట్టాల్సిన పనులు రూ.9కోట్లతో పట్టణంలోని వివిధ వార్డుల్లో వరద కాల్వలు, రూ.4కోట్లతో సీసీ రోడ్లు, బృందావన్కాలనీలో రూ.కోటితో పార్కు, రూ.75లక్షలతో పర్రె కాల్వ వద్ద కల్వర్టు, రూ.25లక్షలతో ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఓపెన్ జిమ్ పనులు చేపట్టాల్సి ఉంది. రద్దుకు కారణాలు.. ఈ ఏడాది జనవరి 13వ తేదీన ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా అదే నెల 21న అధికారులు రద్దు చేశారు. తర్వాత అదే ఏడాది ఏప్రిల్ 10న అధికారులు రెండోసారి టెండర్ల ప్రక్రియను ప్రారంభించి, ఈనెల1న రద్దు చేశారు. తెలుగు దినపత్రికల్లో మాత్రమే టెండర్ నోటిఫికేషన్ ప్రకటన ఇచ్చారని, ఆంగ్ల పత్రికలో ప్రచురించలేదనే సాంకేతిక కారణంతో టెండర్లను మళ్లీ రద్దు చేశారు. ఈక్రమంలో ఈనెల 6న మూడోసారి టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈసారైనా టెండర్లను విజయవంతంగా పూర్తి చేసి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారా లేక కొత్త కారణం తెరపైకి తెచ్చి మళ్లీ రద్దు చేస్తారా అని చర్చనీయాంశంగా మారింది. తెర వెనుక మంత్రాంగం.. టెండర్లు రద్దు కావడం యాదృచ్ఛికమా? లేక పక్కా ప్రణాళికతో జరుగుతోందా? అనే అనుమానాలను కలిగిస్తోంది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల పనులు దక్కేలా తెర వెనుక మంత్రాంగం నడుపుతుండడంతో ఏదో ఒక సాకుతో రెండుసార్లు టెండర్ల రద్దుకు కారణమని ప్రచారం జరుగుతోంది. ఫ సీఎం నిధులు మంజూరై ఆరు నెలలైనా మారని మున్సిపాలిటీ రూపురేఖలు ఫ రెండుసార్లు రద్దయిన ఆలేరు నగరాభివృద్ధి టెండర్లు ఫ మూడోసారైనా అభివృద్ధి పనులకు మోక్షం కలిగేనా.. -
రెడ్క్రాస్ సేవలు అభినందనీయం
మోత్కూరు : ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని రాజభవన్లో రెడ్ క్రాస్ రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రక్త దాన శిబిరాల్లో రక్తదాతలను ప్రోత్సహించడంలో, రక్త దాన శిబిరాలు నిర్వహించడంలో ముందు నిలిచిన డాక్టర్ చెల్లా జయశ్రీ, పోలీసు సంస్థ ఆధ్వర్యంలో అత్యధిక రక్త దాన శిబిరాలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ బి.వినోద్కుమార్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అవార్డులు అందజేశారు. రక్త దానాలను ప్రోత్సహించి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నందుకు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సేవలను గవర్నర్ అభినందించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్, పోలీస్ ఉన్నతాధికారి మహేష్ భగవత్, జనరల్ సెక్రెటరీ శ్రీరాములు, ట్రెజరర్ శ్రీనివాస్రెడ్డి, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ లక్ష్మినర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావుల మహేందర్రెడ్డి, డివిజన్ చైర్మన్ సద్ది వెంకటరెడ్డి, జిల్లా డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి శిస్తు తెస్తే కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవుభూదాన్పోచంపల్లి : రాష్ట్రంలో మళ్లీ భూమి శిస్తు తెస్తే కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. ఆదివారం భూదాన్పోచంపల్లిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమికి రకం వసూలు చేస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మం పర్యటనలో ప్రకటించారని, తెలంగాణలో మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని విరమించుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మాజీ డివిజన్ కార్యదర్శి గూడురు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యుడు మంచాల మధు, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్ తదితరులు పాల్గొన్నారు. దుకాణ సముదాయాలకు బహిరంగ వేలంవలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో దుకాణ సముదాయాలకు 2026 – 27 సంవత్సరానికిగాను అమ్ముకునేందుకు ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు షీల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ బాబు ఆదివారం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆలయ కార్యాలయంలో సకాలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. సీఎం కనగల్ పర్యటన వాయిదాకనగల్ : సీఎం రేవంత్రెడ్డి కనగల్ మండల పర్యటన వాయిదా పడిందని నల్లగొండ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన కనగల్ వద్ద సభా స్థలాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 17న జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశారని.. త్వరలో మరో తేదీ ఖరారవుతుందని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తుండడంతో బహిరంగ సభ స్థలంలో నల్లరేగడి భూమి చిత్తడిగా మారిందన్నారు. పెద్ద టెంట్లు నిలబడడం లేదని, వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేని కారణంగానే వాయిదా వేశామని తెలిపారు. త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారు చేస్తామన్నారు. -
సమాచార బోర్డులేవీ?
భువనగిరిటౌన్ : సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం వెలుపల ప్రజలకు స్పష్టంగా కనిపించేలా సమాచార అధికారుల వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలి. పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అధికారి వివరాలను, వారి ఫోన్ నంబర్లతో సహా బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలి. కానీ జిల్లా కేంద్రంలోని పలు శాఖల కార్యాలయాల్లో ఈ బోర్డులు కనిపించడం లేదు. కొన్ని కార్యాలయాల ఎదుట బోర్డులు ఉన్నా అవి లోపల మూలల్లో, దుమ్ముపట్టి దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని శాఖల్లో బోర్డులపై పాత అధికారుల పేర్లే ఉన్నాయి. సమాచారం అడిగితే సెక్షన్లలోని సిబ్బంది ఒకరిపైకి ఒకరు నెట్టేస్తూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..? సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయం తమ శాఖకు సంబంధించిన పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అధికారి వివరాలను, వారి ఫోన్ నంబర్లతో సహా బోర్డులపై ప్రదర్శించాలి. ఆయా అధికారులు బదిలీ అయినప్పుడు కొత్త వారి వివరాలను తక్షణమే అప్డేట్ చేయాలి. ఇది తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు. అయినప్పటికీ ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కనిపించని ఆర్టీఐ వివరాలు ఫ అప్పిలేట్ అధికారి ఎవరో తెలియని పరిస్థితి ఫ సమాచారం తెలుసుకునేందుకు సామాన్యుల అగచాట్లు -
యాదగిరీశుడి దర్శనానికి వచ్చి వెళ్తుండగా..
యాదగిరిగుట్ట : కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి వెళ్తుండగా టాటా ఏస్ వాహనం బోల్తా పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన తప్పాటి నరసింహ (30) జీహెచ్ఎంసీకి చెందిన టాటా ఏస్ వాహనంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండకు దిగువన పార్కింగ్ ఏరియాలో టాటా ఏస్ వాహనాన్ని పార్కింగ్ చేసి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి కిందకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో భాగంగా యాదగిరిగుట్ట రింగ్ రోడ్డులోకి రాగానే టాటా ఏస్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పెంటి కృష్ణమూర్తి, హరికంటి ధనుష్, రామాంజనేయులు, హరికంటి దర్శిత, పెంటి మధుకృష్ణ, హరికంటి రామాంజనేయులు, డ్రైవర్తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నరసింహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి సమయానికి రాకపోవడంతోనే నరసింహ మృతిచెందినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.ఫ టాటా ఏస్ వాహనం బోల్తా పడి యువకుడు మృతి ఫ మరికొందరికి గాయాలు -
దొంగ ఓట్లను తొలగించేందుకే ‘సర్’
సాక్షి యాదాద్రి : దొంగ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) చేపట్టిందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మల యాస్మిన్ నగేష్ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ‘సర్’ పై మజ్లిస్ లాంటి పార్టీలు ప్రజల్లో అనవసరమైన అపోహలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలను పరిశీలిస్తే పాతబస్తీలో కొన్ని ఇళ్లల్లో వ్యక్తులు లేకపోయినప్పటికీ వంద నుంచి 120మంది పేర్లతో దొంగ ఓట్లు నమోదై ఉన్నాయన్నారు. ఇలాంటి ఓట్లను ‘సర్’ ద్వారా ప్రక్షాళన చేస్తారని స్పష్టం చేశారు. దీంతో విదేశీ వ్యక్తులు, ఉగ్రవాద మూలాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే బయటపడే అవకాశం ఉందన్నారు. కొన్ని హింసాత్మక శక్తులు రాజకీయ అండ చూసుకుని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అనవసరంగా అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ‘సర్’పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతోందని, ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావడానికి దొంగ ఓట్ల తొలగింపు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్, నాయకులు పోతంశెట్టి రవీందర్, నర్లనర్సింగరావు, మాయ దశరథ, చందా మహేందర్గుప్తా, రత్నపురం బలరాం, ఉడుత భాస్కర్ పాల్గొన్నారు.ఫ హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ -
అక్షరాల బాటకు పయనం
భువనగిరి: వేసవి సెలవులు ముగిసాయి. 45 రోజుల తర్వాత తిరిగి పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు వాటికి స్వప్తి చెప్పి బడిబాట పట్టనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులను అకర్షించేలా రంగురంగుల కాగితాలు, మామిడి తోరణాలతో పాఠశాలలను ముస్తాబు చేశారు. తొలిరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను అందజేయనున్నారు. వేసవి సెలవుల్లో జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను స్థానిక దివ్య బాల విద్యాయంలోని గౌడాన్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి మండల ఎంఆర్సీ కేంద్రాలకు సరఫరా చేసి అక్కడి నుంచి పాఠశాలలకు చేర్చారు. మొదటి రోజు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలల ప్రగతి, బడిబాట ద్వారా విద్యార్థులు బడిలో చేర్చటం వంటి అంశాల మీద చర్చించనన్నారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను సన్మానించనున్నారు. మూతబడిన పాఠశాలలను తెరిపించేందుకు జిల్లాలో మూతబడిన 66 పాఠశాలలను తిరిగి తెరిపించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఎంఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మూతబడిన పాఠశాలలో కనీసం 10 నుంచి 15 మంది విద్యార్థులను చేర్పించేలా ప్రణాళికను రూపొందించారు. ఫ ముగిసిన వేసవి సెలవులు ఫ నేటి నుంచి పునఃప్రారంభం కానున్న పాఠశాలలు ఫ తొలిరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ పాఠశాలలు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు 31 4,725 ప్రాథమిక, జెడ్పీహెచ్ఎస్ 630 34,475 కేజీబీవీ 11 2,856 యూఆర్ఎస్ 01 49 టీఎస్ఎంఎస్ 07 3,947 టీఎస్ఆర్ఈఐఎస్ 4 2,227 టీఎస్ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 7 3,885 టీఎస్ టీడబ్ల్యూఆర్ఐఈఎస్ 1 319 ఎంజేపీటీబీ 5 2,356 టీఎంఆర్ఐఈఎస్ 3 968 -
లోక్ అదాలత్తోనే సత్వర న్యాయం
చివ్వెంల (సూర్యాపేట) : న్యాయస్థానాల పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీ కుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కారం చూపుతారు. బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, సత్వర న్యాయం కోసం న్యాయశాఖ లోక్ అదాలత్ నిర్వహిస్తోంది. లోక్ అదాలత్ అంటే.. కోర్టుల్లో నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాటికి సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు. లోక్ అదాలత్ అనేది లీగల్ సెల్ అథారిటీస్ యాక్టు–1987 ప్రకారం చట్టబద్ధమైన సంస్థ. ఇది దేశంలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంగా రూపొందించబడింది. ఎలాంటి ఫీజు ఉండదు.. పెండింగ్లో ఉన్న కేసులు లేదా న్యాయ స్థానాల్లో ప్రీలిటిగేషన్ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వేదిక లోక్ అదాలత్. ఈ చట్టం ప్రకారం లోక్ అదాలత్లు ఇచ్చే అవార్డు(నిర్ణయం) సివిల్ కోర్టు కేసుగా పరిగణించబడుతుంది. రాజీకి అవకాశం ఉన్న కేసులు మాత్రమే లోక్ అదాలత్ల ద్వారా సత్వరంగా పరిష్కరించుకోవచ్చు. ఆ సంస్థ ఇచ్చే తీర్పు అంతిమం. కేసులు పరిష్కారమైనప్పుడు అవార్డుకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందు అప్పీల్ చేయడానికి అవకాశం ఉండదు. లోక్ అదాలత్ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. అదే కోర్టులో కేసు వేస్తే పరిష్కారానికి సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. లోక్ అదాలత్ కేసులకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇరువర్గాల వారు రాజీ పడవచ్చు. పరిష్కారమయ్యే కేసులు ఇవీ.. సివిల్, క్రిమినల్, మోటార్ వెహికల్ యాక్టులు, ఎకై ్సజ్ కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ ఘర్షణలు, యాక్సిడెంట్ తదితర కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఫ పై కోర్టుల్లో అప్పీల్ లేకుండానే కేసుల పరిష్కారం ఫ రాజీ మార్గంతో డబ్బు, సమయం ఆదా ఫ 20న జాతీయ మెగా లోక్ అదాలత్ -
యాదగిరి క్షేత్రంలో సుదర్శన నారసింహ హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆలయ అర్చకులు ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. -
ప్రభుత్వ బడులను బాగు చేయాలి
కోదాడ : తెలంగాణలో కొత్త బడులు అవసరం లేదని.. ఉన్న ప్రభుత్వ బడులనే బాగు చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలో జరిగిన టీఎస్ యూటీఎఫ్ డివిజన్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని అన్నారు. నాణ్యమైన వసతులు లేకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు హక్కులను, విధులను తమ రెండు కళ్లుగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్. రాములు, సోమయ్య, అనిల్కుమార్, యాకయ్య, శ్రీనివాసరెడ్డి, అరుణభారతి, వెంకటయ్య, సలీం షరీఫ్, తల్లాడ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, చందా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలి
కోదాడ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేసే బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త తన పరిధిలోని యువత, మహిళ, రైతులను పార్టీకి అనుసంధానం చేయడానికి పాటుపడాలన్నారు. గ్రామ బూత్స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రజల తరఫున పోరాడాలని కోరారు. సర్ కార్యక్రమంపై కార్యకర్తలు అవగాహన పెంచుకోవాలన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సుంకర అజయ్కుమార్, సత్యబాబు, ఎస్.కె. నయీం, చింతా కవిత, బట్టు శివాజీ, మామిడి రామారావు, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ -
‘ఎల్నినో’పై అప్రమత్తత అవసరం
తిరుమలగిరి(సాగర్) : వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీని ఫలితంగా భూగర్భజలాల లభ్యత తగ్గడంతో పాటు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. దీంతో వర్షాధార పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రైతులందరూ అప్రమత్తంగా ఉండి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని తిరుమలగిరి(సాగర్) ఏఓ గంట హర్షిత సూచిస్తున్నారు. వానాకాలం పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే.. వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రైతులు దీర్ఘకాలిక వరి రకాల సాగును తగ్గించి స్వల్పకాలిక మరియు సన్న రకాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వల్ల పంటను 20–30 రోజుల ముందుగానే కోయవచ్చు. నీటి వినియోగం తగ్గి వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కంది, పెసర, మినుము, సజ్జలు, జొన్నలు, నువ్వులు మరియు ఆముదం సాగు చేయాలి. కరువు పరిస్థితులను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నేల తేమ సంరక్షణ..చెరువు మట్టిని పొలంలో తోలడం, పశువుల ఎరువును వేయడం, పొలంలో కలుపు మొక్కలను తొలగించడం, మల్చింగ్ పద్ధతుల ద్వారా నేలలో తేమను నిల్వ ఉండేలా చూడాలి. అంతేకాకుండా వర్షపు నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను వినియోగించడం ద్వారా నీటి పొదుపు మరియు నీటిని వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. ఆరుతడి పంటలు మేలు.. బోర్లు, బావుల కింద వరి సాగు చేసే రైతులు సగానికి పైగా వరి విస్తీర్ణాన్ని తగ్గించి ఆరుతడి పంటలైన పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు మరియు నూనెగింజల పంటల విస్తీర్ణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేల సారం, నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచే చర్యలు.. ● రైతులు తమ పొలాల్లో పశువుల ఎరువు మరియు చెరువుల మట్టిని తోలడం ద్వారా నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. ● పచ్చిరొట్ట ఎరువుల పంటలైన జనుము, జీలుగ పంటలను సాగు చేసి పుష్పించే దశలో భూమిలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ పదార్ధం పెరుగుతుంది. ● దీని వల్ల వర్షపు నీరు భూమిలోకి సులభంగా ఇంకి భూగర్భజలాల పెరుగుదలకు దోహదపడతాయి. ● నేలలో నీటి నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం పెరిగి పంటలకు ఎక్కువకాలం తేమ అందుబాటులో ఉంటుంది. ● నేల భౌతిక పరిస్థితి మెరుగుపడంతో పాటు నేల సారం పెరిగి పంటల దిగుబడి మెరుగుపతాయి. ● నీటి వినియోగ సామర్ధ్యం, నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం పెరుగుతుంది.ఎల్నినో పరిస్థితుల ప్రభావ నివారణకు సూచనలు.. వర్షాధార పంటలు సాగు చేసుకునే రైతులు నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన అనంతరం మొత్తం 60–75 మి.మీ. వర్షాపాతం నమోదైన తర్వాతే విత్తనాలు విత్తుకోవాలి. తక్కువ నీటి అవసరం కలిగిన పంటల సాగును ప్రోత్సహించాలి. పంటలు ఎదిగే దశలో అవసరమైన మేరకు కచ్చితమైన నీళ్లు అందించాలి. సిఫారసు చేయబడిన మోతాదులో ఎరువులను వినియోగిస్తూ సమీకృత పోషక నిర్వహణ పద్ధతులను అనుసరించాలి. కీటక నాశకాల విచక్షణరహిత వినియోగాన్ని నివారించి పర్యావరణ హిత సమగ్ర కీటక నిర్వహణ విధానాలను అమలు చేయాలి. సాధ్యమైన చోట్ల సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలి. వానాకాలం సాగుపై తిరుమలగిరి (సాగర్) ఏఓ హర్షిత సూచనలు -
భగవద్గీత.. మానవాళికి దివ్య సందేశం
నకిరేకల్ : భగవద్గీత మానవాళికి మార్గదర్శకంగా నిలిచే దివ్య సందేశమని శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. అన్నమాచార్య కళాసమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్లోని శ్రీసాయి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ భగవద్గీత పారాయణం ద్వారా మనస్సుకు ప్రశాంతత ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయన్నారు. త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్స్వామి మాట్లాడుతూ.. భగవద్గీతలోని ప్రతి శ్లోకం మానవ జీవిత సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతుందన్నారు.భగవద్గీత పారాయణం ద్వారా శ్రీకష్ణ భగవానుని దివ్య సందేశాన్ని గ్రహించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సూచించారు. అన్నమాచార్య కళా సమితి ఫౌండేషన్ ప్రెసిడెంట్ గండేపల్లి సుమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్, డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ మాధవి వెల్లంకి, స్థానిక సాయి ఆలయ ట్రస్ట్ చైర్మన్ తొనుపూనూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్రెడ్డి, కోశాధికారి బాణాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి -
పారదర్శక పాలనే మోదీ సర్కారు లక్ష్యం
ఆలేరు: అభివృద్ధి, పారదర్శక పాలనే ప్రధాని మోదీ సర్కారు లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్ అన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ 12ఏళ్ల ప్రగతీశీల పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ఆదివారం ఆలేరులో శ్రీఛాయ్పే చర్చశ్రీలో భాగంగా టిఫిన్ సెంటర్లు, టీ కొట్లను బీజేపీ నాయకులు సందర్శించారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, మౌలిక వసతుల కల్పనలో సాధించిన పురోగతిని వివరించారు. కామిటికారి కృష్ణ, తునికి దశరథ, బైరి మహేందర్, కల్లెం రాజు, చుక్క రాజు, సముద్రాల శ్రీను, పాశికంటి సోమయ్య, గుర్రం నర్సింహులు, శాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిసార్ట్లో యువకుడి అనుమానాస్పద మృతి
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ శివారులోని ఓ రిసార్ట్లో శనివారం అర్ధరాత్రి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నర్సాపూర్ మండలంలోని శ్రీరామ్పూర్ గ్రామానికి చెందిన గాండ్ల రాము(27) హైదరాబాద్లోని ఉప్పల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూకట్పల్లిలో నివాసముంటున్నాడు. వీకెండ్ కావడంతో రాము పనిచేస్తున్న కంపెనీకి చెందిన 20 మంది స్నేహితులు కలిసి పార్టీ చేసుకునేందుకు గాను చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ పరిధిలోని ఓ రిసార్ట్ను బుక్ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న స్నేహితులు.. రాముతో పాటు అతడి స్నేహితులంతా శనివారం సాయంత్రం రిసార్ట్కు చేరుకున్నారు. ఆనందంగా కలిసిమెలిసి పార్టీ మొదలుపెట్టారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. కొంతసేపటి తర్వాత అంతా సద్దుమణిగింది. అనంతరం స్నేహితులంతా ఎవరి పనిమీద వారు నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పార్టీకి వచ్చిన నలుగురు స్నేహితులు కలిసి రిసార్ట్లోని స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో స్విమ్మింగ్ ఫూల్లో నడుచుకుంటూ మిగతావారిని అనుసరించసాగాడు. ఈ క్రమంలో ఆ ఈతరాని యువకుడి కాళ్లకు నీటి అడుగున ఏదో తగిలింది. ఈ విషయాన్ని మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పడంతో వారంతా కలిసి స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్లి చూడగా.. రాము కనిపించాడు. వెంటనే అతడిని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. రిసార్ట్ లోపల ఉన్న మిగతా స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారంతా బయటకు వచ్చి రాముకు సీపీఆర్ చేశారు. వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రాము మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్, ఎస్ఐ యాదగిరిలు ఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. అయితే తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతడిని స్నేహితులే కొట్టి హత్య చేశారని రాము తండ్రి అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేశారని మృతుడి తండ్రి ఫిర్యాదు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు చౌటుప్పల్ మండలం ఎల్లంబావి శివారులో ఘటన -
మూడు పోస్టులకు 23 మంది హాజరు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని దేవాదా యశాఖ కమిషనర్ కార్యాలయంలో స్థానాచార్యులు, పురోహిత్, అథర్వ వేద పండిట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించినట్లు ఈఓ భవానీ శంకర్ వెల్లడించారు. ఈ మూడు పోస్టులకు గాను 23 మంది అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు మౌఖిక, రాత పరీక్షలు దేవాదాయశాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు తెలిపారు. ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని ఈఓ పేర్కొన్నారు. శత ప్రశ్న శర సంధానం గ్రంథావిష్కరణ భువనగిరి : మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలో గల శివశక్తి సాయి అనుగ్రహ మహా పీఠంలో సిద్ధగురు రమణానంద మహర్షి రచించిన శత ప్రశ్న శర సంధానం గ్రంథాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణానంద మహర్షి మాట్లాడుతూ.. శత ప్రశ్న శర సంధానం గ్రంథంలో సాయిబాబా గురించి పూర్తిగా వివరించినట్లు తెలిపారు. 11 భాషలలో రచించిన ఈ గ్రంథాన్ని చదవితే సాయిబాబాపై సంపూర్ణ అవగాహన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షిర్డీ క్షేత్ర సీఈఓ చంద్రబాగ మహాదేవ్, ఆత్మానందా మహరాజ్, శివప్రసాద్, ధనుంజయ్, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాలు చెప్పినట్లు పనిచేస్తున్న ఎన్నికల సంఘం
భువనగిరి: ప్రస్తుతం కాలంలో ప్రభుత్వాలు చెప్పినట్లుగానే ఎన్నికల సంఘం పనిచేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లకు సర్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల సుమారు 91 లక్షల ఓట్లను తొలగించడాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మీనాక్షి నజరాజన్ వంటి వారి నామినేషన్ తొలగించారని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విషయంలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అర్హులైన వారి ఓట్లను తొలగించకుండా చూడటంలో పార్టీ ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. అనంతరం విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు ఇస్తోందన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. మళ్లీ కేసీర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో అవీనీతిపెరిగిపోయి శాంతిభద్రతలు లేకుండా పోతుందన్నారు. హత్యలు, తత్యాచారాలతో పాటు గత 10 ఏళ్లలో లేని దోంగతనాలు ఎక్కువగా కావడం పోలీసుల పనితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం కావడంతోపాటు స్కామ్లు పెరిగిపోయినట్లు చెప్పారు. డబ్బులు సంపాదన లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు అదే పనిగా ఉంటున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సర్ జిల్లా ఇన్చార్జి క్యామ మల్లేష్, పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ కన్వీనర్ కొల్పుల అమరేందర్, మాజీ జెడ్పీటీసీ మల్లయ్య, మొగుళ్ల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
బత్తాయి సాగులో ఆదర్శంగా నిలుపుతాం
నల్లగొండ టౌన్ : రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ఎలిమినేటి మాధవరెడ్డి పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నల్లగొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకొస్తుందని, జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల బత్తాయి సాగు కాగా, కాలక్రమేనా వివిధ కారణాల వల్ల అది 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడు వరి పైనే ఆధారపడకుండా బత్తాయి లాంటి పంటలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలన్నారు. పంట మార్పిడిపై తప్పనిసరిగా దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు సాగుచేసే రైతులకు సహకారం అందిస్తున్నదని, ముఖ్యంగా వరి పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, రూ.500 బోనస్ ఇచ్చి సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే హైదరాబాద్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి సిట్రస్ను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్తు అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ ఎగుమతులు తదితర విషయాలపై ఆలోచిస్తామన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి మాట్లాడుతూ.. బత్తాయిలో అనేక కొత్త రకం వంగడాలు వచ్చాయని, రైతులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డి. రాజిరెడ్డి, రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి, చెవిటి వెంకన్న, పావనిరెడ్డి, ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి


