breaking news
Yadadri District Latest News
-
12వేల మంది దరఖాస్తు
భువనగిరిటౌన్ : అన్నదాత కుటుంబానికి భరోసాగా నిలుస్తున్న రైతుబీమా పథకానికి జిల్లాలో కొత్తగా 12వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో గతంలో ఒక లక్ష 36 వేల మంది నమోదై ఉండగా.. 588 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున బాధిత కుటుంబాల ఖాతాల్లో రూ.29.40 కోట్లు జమ అయ్యాయి. గతంలో నమోదైన రైతులందరికీ బీమా రెన్యువల్ చేశారు. కొత్తగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా ఈనెల 13న దరఖాస్తు గడువు ముగిసింది. 10 రోజుల్లోనే బీమా డబ్బులురైతు కుటుంబాలకు ఆర్థికభద్రత కల్పించడం రైతుబీమా ప్రధాన ఉద్దేశం. రైతు ఏకారణంతో చనిపోయినా నామినీ ఖాతాలో ఎల్ఐసీ నుంచి 10 రోజుల్లో బీమా డబ్బు జమ చేస్తారు. నమోదైన రైతులకు ప్రభుత్వమే రూ.2,271 ప్రీమి యంగా చెల్లించి రూ.5 లక్షల బీమా అందిస్తుంది. జూన్ 5వ తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. హైవేపై వాహనాల రద్దీచౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వర్షాల నేపథ్యంలో బుధ, గురువారం విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం, శని వారం శ్రీకృష్ణాష్టమికి తోడుగా పెళ్లిళ్లు, బోనాల పండుగలు ఉండటం, ఆదివారం రావడంతో హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజానీకం స్వస్థలాలకు వెళ్లారు. వారంతా తిరుగుపయనం కావడంతో అర్ధరాత్రి వరకు కొనసాగింది. వాహనాల రద్దీతో చౌటుప్పల్ పట్టణంలో, జంక్షన్ల వద్ద పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల భారీ వర్షం సాక్షి యాదాద్రి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి 11.30 వరకు కురిసిన వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ప్రాణాలతో చలగాటం
జిల్లాలో చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, బీబీనగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా వ్యర్థాలను నిర్వీర్యం చేయాలన్న నిబంధనలు ఉండగా ఏ ఒక్క కంపెనీ పాటించడం లేదు. వ్యర్థ రసాయనాలను రాత్రి సమయంలో డీసీఎంలలో తీసుకువచ్చి జాతీయ రహదారులు, సాగునీటి కాలువలు, సాగు భూముల్లో పడేస్తున్నారు. అయితే ఇటీవల కెమికల్ మాఫియా అడ్డా మార్చాయి. చౌటుప్పల్ ప్రాంతంలోని పరిశ్రమలు గతంలో హై దరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వెంట రసాయన వ్యర్థాలను పారబోసేవి. కానీ, అక్కడ పోలీస్ పెట్రోలింగ్, హైవే అధికారుల నిఘా పెరగడంతో అడ్డా మార్చినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న గౌరెల్లి – భద్రాద్రి కొత్తగూడెం హైవేను ఎంచుకున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ వెలుగుచూడలేదని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. -
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా ని ర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొ లుపులో భాగంగా అర్చకులు సుప్రఽభాత సేవ, ఆరా ధన చేశారు. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతి ష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనా మార్చనతో కొలిశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఇక ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
పాల వెల్లువే..!
ఒప్పందం కుదిరితేసాక్షి, యాదాద్రి: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన మదర్ డెయిరీని గట్టెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. సంస్థ పాలకవర్గం ఈనెల 12న గుజరాత్కు వెళ్లి ఎన్డీడీబీని (జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ)ను ఆశ్రయించింది. ఎన్డీడీబీ చైర్మన్తో ప్రత్యేకంగా సమావేశమైంది. సంస్థను తీసుకుని లాభాల పట్టించాలని కోరగా అందుకు సానుకూల స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఎన్డీడీబీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్థిక సంక్షోభంలో సంస్థఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న మదర్ డెయిరీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రకరకాల కారణాలతో డెయిరీ అప్పులు పెరిగిపోయాయి. సంస్థను గట్టెక్కించేందుకు పాలకవర్గం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు, పాఠశాలలు, హాస్టళ్లకు మదర్ డెయిరీ నుంచి నెయ్యి, పాలు సరఫరా చేసేవారు. దీని ద్వారా మదర్ డెయిరీకి భారీ ఆదాయం సమకూరేది. కానీ, ఆ బాధ్యతలను ప్రభుత్వం విజయ డెయిరీకి అప్పగించింది. దీనికి తోడు మార్కెటింగ్ లోపాల వల్ల ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు బ్యాంకుల నుంచి రూ.35 కోట్ల రుణాలు తీసుకోగా, తిరిగి చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా 50 వేల మంది పాడి రైతులకు రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక సుమారు 600 మంది ఉద్యోగులు ఉన్నారు. నెలకు రూ.1.20 కోట్ల భారం పడుతుండటంతో వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో మదర్ డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థిరాస్తులు అమ్మితే కానీ బయటపడే పరిస్థితి లేదు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యా వద్ద సంస్థకు చెందిన సుమారు 30 ఎకరాల భూమి విక్రయించాలని నిర్ణయించగా.. వాటిపై కోర్టు స్టే విధించింది.చివరి ప్రయత్నంగా..చివరి ప్రయత్నంగా మదర్ డెయిరీ పాలకవర్గం ఈనెల 12వ తేదీన గుజరాత్లోని ఆనందనగర్లో గల ఎన్డీడీబీని ఆశ్రయించింది. నాలుగు రోజుల పాటు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. 14న సంస్థ చైర్మన్తో ప్రత్యేకంగా సమావేశమై సంస్థను తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. డెయిరీ ఆస్తులు, అప్పులు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ప్రస్తుతం వస్తున్న పాలు, విక్రయిస్తున్న ఉత్పత్తులు, రవాణా చార్జీలు తదితర అంశాలపై ఆయనతో చర్చించారు.మదర్ డెయిరీతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఎన్డీడీబీ అంగీకారం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్వోసీ ఇస్తేనే ఒప్పందం కుదురుతుంది. త్వరలోనే పాలకవర్గం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి విన్నవించనుంది. అంతా సవ్యంగా సాగితే మదర్ డెయిరీ లాభాల బాట పట్టే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.మదర్ డెయిరీని నష్టాల నుంచి గట్టెక్కించే యత్నం ఎన్డీడీబీకి ఆశ్రయించిన పాలకవర్గం డెయిరీ ఆస్తులు, అప్పులు, ఇతర అంశాలపై చర్చలు సంస్థను అభివృద్ధి చేయడానికి ఎన్డీడీబీ సానుకూలం ప్రభుత్వం అంగీకరిస్తే కొలిక్కి వచ్చే అవకాశం త్వరలో సీఎం రేవంత్రెడ్డిని కలవనున్న నార్ముల్ డైరెక్టర్లుమదర్ డెయిరీ అభివృద్ధికి ఎన్డీడీబీ సహకారం తీసుకోవాలని నిర్ణయించాం. నాతో పాటు 14మంది మదర్ డైయిరీ డైరక్టర్ల తీర్మానం మేరకు అందరం కలిసి గజరాత్ వెళ్లాం.ఎన్డీడీబీ చైర్మన్ను కలిసి చర్చించగా మదర్ డైయిరీని అభివృద్ధి చేయడానికి ఆయన అంగీకరించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలసి త్వరలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ ఇప్పించాలని కోరుతాం. ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్డీడీబీతో ఎంఓయూ కుదుర్చుకుని డెయిరీని కాపాడుకుంటాం. – గుడిపాటి మధుసూదన్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ -
మిస్టరీగా మారిన ఈశ్వర్ మృతి
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడు ఈశ్వర్ మృతి మిస్టరీగా మారింది. శనివారం రాత్రి కాలనీ శివారులో అనుమానాస్పదంగా మృతిచెందిన యువకుడిని ప్రేమ వ్యవహారంలో హతమర్చారా..? లేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు మాదగోని ఈశ్వర్(19) ఈ ఏడాది ఇంటర్ పూర్తిచేసి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తన స్నేహితుల ద్వారా తెలిసింది. అయితే మృతుడు నడుపుతున్న బైక్ మృతదేహానికి వంద అడుగుల దూరంలోని పొలంలో పడి ఉండడం.. గొంతుపై కత్తితో కోసినట్లుగా గాయం ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే.. మృతదేహం తల, ఇతర భాగాలపై గయాలు కనిపించాలి కానీ అలాంటి ఆనవాలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశ్వర్ మృతిచెందిన విషయం అతడు ప్రేమించిన యువతికి తెలియడంతోపాటు మృతదేహం ఫొటోలు ఆమె ఫోన్కు వీడియోలు పంపడం వెనుక హత్యకుట్ర దాగి ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కులాంతర ప్రేమను విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలిమిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద కాలనీ వాసులు, బంధువులు చేరుకుని తమకు న్యాయం చేయలని ఆందోళన వ్యక్తం చేశారు. వన్టౌన్ పోలీస స్టేషన్కు వెళ్లి ఈశ్వర్ మృతికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో వన్టౌన్ సీఐ మోతీరాం మాట్లాడుతూ ఈశ్వర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని..త్వరలోనే నింధితులను గుర్తించి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వర్ తిరిగిన ప్రాంతాలను సీసీ ఫుటేజిల ద్వారా పరిశీలిస్తున్నామని, మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అతడి కాల్ డేటాను సేకరిస్తున్నామని చెప్పారు. సీఐ హామీతో మృతుడి బంధువులు ఆందోళన విరమించుకున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈశ్వర్ తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ పేర్కొన్నారు. న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన -
పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్గా శ్రీకాంత్గౌడ్
నాగారం : బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నాగారం మండలం మామిడిపల్లికి చెందిన గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్గౌడ్ను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కన్వీనర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఐదుగురిపై కేసు నమోదు నార్కట్పల్లి: మండల కేంద్రంలో ఓ హోటల్పై దాడి చేసిన ఘర్షణలో ఐదుగురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీదేవి ప్రసాద్ హోటల్కు శనివారం రాత్రి కొందరు యువకులు వచ్చి క్యాషియర్తో గొడవ పడి హోటల్లోని సామగ్రి, ఫర్నిచర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. హోటల్ యజమాని శెట్టి ప్రవీణ్కుమార్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణ పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజ మాని ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన బోడ నవీన్, మేడి స్వామితో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
కబడ్డీ పోటీల్లో జిల్లాకు మంచిపేరు తేవాలి
హుజూర్నగర్ : కబడ్డీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం హుజూర్నగర్లో యువ ప్రో కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ఎంపికై న జిల్లా క్రీడాకారుల జట్టును మంత్రి క్యాంప్ కార్యాయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులకు తమ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటందన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ను అధ్యక్ష కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామ నరసింహరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, తన్నీరు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో శ్రీస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 45 వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. భక్తులు అధికంగా రావడంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.58,05,696 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి సన్నిధిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పూజలుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. సంప్రదాయ దుస్తుల్లో విదేశీయులు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ప్రాన్స్ దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీస్వామి వారి ఆలయ నిర్మాణ శైలిని ప్రాన్స్ దేశస్తులకు వివరించారు. హైదరాబాద్కు వచ్చిన క్రమంలో యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చినట్లు వారు వెల్లడించారు. -
పోలీస్ జాగిలం పింకీకి అంతిమ వీడ్కోలు
నల్లగొండ: పన్నెండేళ్ల పాటు విశేష సేవలంందించిన పోలీస్ జాగిలం పింకీ (ట్రాకర్) అనారోగ్యంతో ఆదివారం తుది శ్వాస విడిచింది. అనేక కేసుల్లో నేరస్తులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు పట్టించిన పింకీ విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. పింకీ అంత్యక్రియలను ఆదివారం పోలీసులు అధికార లాంఛనాలతో జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పలు కేసుల దర్యాప్తులో కీలకంగా..ఉమ్మడి జిల్లాలో విధినిర్వహణలో భాగంగా పింకీ పలు కేసులో దర్యాప్తులో కీలకంగా వ్యవహరించింది. నల్లగొండ వన్టౌన్ పరిధిలోని బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలుగా నరికి కాళ్లు, చేతులు, మొండేన్ని వేర్వేరు చోట్ల పెట్టిన కేసు పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. నల్లగొండలో జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరి గిన రూ.1.40 కోట్ల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితు ల జాడను తె లిపింది. గుండాల మండలం వంగాలలో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం తర్వాత నిందితుల ఇళ్లలోకి వెళ్లి పసిగట్టింది. ఇలా ఎన్నో కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పింకీ మృతిపట్ల ఎస్పీ శరత్చంద్ర పవార్ సంతాపం తెలిపారు. -
ఆర్ఎంపీపై సుమోటోగా కేసు నమోదు
తుంగతుర్తి : ఆర్ఎంపీ చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సదరు డాక్టర్పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు. వైద్యం వికటించి మహిళ మృతి అనే వార్త వివిధ పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆదివారం తుంగతుర్తిలోని సాయి బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించి విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తిలో ఆర్ఎంపీ శ్రీనివాస్ కొన్నేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా సాయి బాలాజీ ఆస్పత్రి నిర్వహించడంతోపాటు గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయిస్తున్నారని స్థానికులు తెలిపారన్నారు. ఆయన వెంట డాక్టర్ విష్ణు తదితరులు ఉన్నారు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో అర్హత లేని వైద్యులు ఆస్పత్రులు నిర్వహిస్తూ వైద్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి కేసుపై కలెక్టర్ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ వెంటనే తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ కొరివిల్ల శ్రీనివాస్ అబార్షన్ చేయడం వల్లే విజేత అనే గర్భిణి మృతిచెందిందని డీఎంహెచ్ఓ తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి చివ్వెంల : బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన నత్త భానుప్రకాశ్ (22), అతని స్నేహితులు మణిదీప్, పవన్ ముగ్గురు బైక్పై విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. గుంజలూరు స్టేజీ వద్దకు రాగానే వారి బైక్ అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న భానుప్రకాశ్ తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కూడా సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ట్రాక్టర్ ఢీకొనడంతో మరొకరు..గుండాల : మద్యం మత్తులో అతివేగంతో ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామంలో బోనాల పండుగను పురస్కరించుకొని గ్రామానికి చెందిన సంగు శ్రీను ట్రాక్టర్ను గ్రామ దేవతల చుట్టూ అతివేగంతో తిప్పుతుండడంతో అదుపు తప్పి గ్రామానికి చెందిన రామగిరి శ్రీరాములు (55) ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. పోతుగంటి లింగన్న, బుర్ర శేఖర్కు గాయాలైనట్లు పేర్కొన్నారు. గాయాల పాలైన వారిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో లింగన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇంకొకరు..డిండి: ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం డిండి మండలం పెద్దతండా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ముడి రాములు(58), ముడి శ్రీను తమ అవసరాల నిమిత్తం మండలంలోని బొల్లనపల్లి గ్రామానికి వెళ్లి బైక్పై స్వగ్రామానికి తిరుగి వస్తున్నారు. ఈ క్రమంలో దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డిండి నుంచి చెర్కుపల్లి స్టేజీ మీదుగా దేవరకొండకు వెళ్తోంది. ఈ సమయంలో పెద్దతండా సమీపంలోకి రాగానే ముడి శ్రీను నడుపుతున్న బైక్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో బైక్ వెనుక కూర్చున్న ముడి రాములు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన శ్రీనును దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రాములు మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. మృతుడి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.లారీని ఢీకొన్న కోళ్ల వ్యాన్ ఒకరి మృత్యువాతచందంపేట: ఆగి ఉన్న లారీని కోళ్ల వ్యాను వెనుకనుంచి ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వేకువజామున చందంపేట మండలంపోలేపల్లి గేటు సమీ పంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిండి నుంచి వడ్ల లోడ్తో దేవరకొండకు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది. కోళ్ల వ్యానులో ఉన్న గుర్రంపోడు మండలం జిన్నాయిచింత గ్రామానికి చెందిన భూతం లింగయ్య(45)కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాను డ్రైవర్ కుంటిగొర్ల సైదులు, మరో వ్యక్తి వడ్లమల్ల రాఘవేందర్కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూతం లింగయ్య మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు భార్య ఇందిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఏడుగురు వ్యక్తులకు గాయాలు చివ్వెంల, గుండాల, చందంపేట, డిండి మండలాల పరిధిలో ఘటనలుఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంజలూరు స్టేజీ వద్ద ఒకరు, గుండాల మండలం బండ కొత్తపల్లి వద్ద, డిండి మండలం పెద్దతండాలో, చందంపేట మండలం పోలేపల్లి గేటు సమీపంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగు వ్యక్తులు మృత్యు వాతపడ్డారు. -
కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు : ఎంజీయూ వీసీ
నల్లగొండ: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితేనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు ఉజ్వల భవిష్యత్ అందుకోగలుగుతారని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఆదివారం నల్లగొండలో వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నీట్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మెడికల్ కౌన్సిలింగ్ నిపుణులు హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఏ ఖాన్, షరీఫ్, మొయిజ్, మహమూద్, ఏంఏ పర్వేజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేతి ఉత్పత్తులపై పన్ను మినహాయించాలిసంస్థాన్ నారాయణపురం: చేతివృత్తుల ఉత్పత్తులపై ప్రభుత్వం పన్ను మినహాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. చేనేత జాతీయ యువత విభాగంలో అవార్డు గ్రహీత గూడ పవన్ను ఆదివారం సంస్థాన్ నారాయణపురంలో శ్రీనివాస్గౌడ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ యువతకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలుతో పాటు స్వయం ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం ఆధ్యక్షుడు వీరమళ్ల కార్తిక్, మండల అధ్యక్షుడు బొల్లేపల్లి లక్ష్మణ్, దూసరి వెంకటేశం, కొత్త భాను, ఉప్పరగోని రాజు, జోకు స్వామి, లక్ష్మణ్, చిరంజీవి, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న యువకుడు మృతి మోటకొండూర్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనికునూరి పవన్ కుమార్(22) బోడుప్పల్లోని అభయ ఆస్పత్రిలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 15న డ్యూటీకి వెళ్తున్నాని తేర్యాలలో తన ఇంటి నుంచి బయలుదేరి మండలంలోని ఆరెగూడెం శివారులోని వెంచర్లో పురుగు మందు తాగాడు. అనంతరం తన స్నేహితులు, బంధువులకు పురుగుల మందు తాగినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే పవన్ వద్దకు వెళ్లిన బంధువులు అతడిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తదిశ్వాస విడిచాడు. మృతుడి బంధువు మత్స్యగిరి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతి గల కారణాలు తెలియరాలేదు. బైక్ అపహరణఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో మజ్జిగ రాంబాబుకు చెందిన టూవీలర్ బైక్( టీఎస్ 30–హెచ్8353)ను శ్రీకనకదుర్గ దేవాలయ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. రాంబాబు కుమారుడు వ్యవసాయ భావి నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్టు అడగడంతో బైక్ను ఆపాడు. దీంతో అతని చేతిలో నుంచి బైక్ను లాక్కెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
కొడుకు ప్రేమ వివాహం.. కూతుర్ల పేర ఆస్తి రాసిన తండ్రి
భువనగిరిటౌన్ : కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అతడి తండ్రి తన ఆస్తిని కూతర్లు పేరిట వీలునామా రాశాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు జ్ఞానేశ్వర్ తన స్నేహితురాలైన గుండాల మండలం సుద్దాలకు చెందిన సౌమ్యతో ఇరు కుటుంబాల అంగీకారంతో మే 22న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న జ్ఞానేశ్వర్ తండ్రి ఈ నెల 16న తన ఆస్తిని తన ఇద్దరు కూతుర్ల పేరిట వీలునామా రాశారు. అదే రోజు సాయంత్రం తనను తన భార్యను ఇంటి నుంచి వెళ్లిపోవాలని గెట్టివేసినట్లు జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ తన భార్యతో కలిసి తన తండ్రి నిర్వహించే దుకాణం ఎదుట ధర్నాకు దిగాడు. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరడంతో పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. జ్ఞానేశ్వర్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ట్రోలింగ్గా మారింది. దుకాణం ఎదుట బైఠాయించిన నవ దంపతులు పోలీసుల జోక్యంతో సర్దుమణిగిన పంచాయితీ -
గొప్ప నేత వాజ్పేయి
పేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప నేత అటల్ బియారీ వాజ్పేయ్ అని బీజేపీ నాయకులు కొనియాడారు.7యాదాద్రి భువనగిరిఅర్హులందరికీ రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పేర్కొన్నారు.చౌటుప్పల్లోని మార్కండేశ్వర స్వామి ఆలయంలో ఉట్టి కొడుతున్న యువకుడుఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025- 9లో -
ప్రమాదాలు జరుగుతున్నాయి
జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులలో పాటు గల్లీ రోడ్లన్నీ పాడయ్యాయి. మరమ్మతులు చేయిస్తామని అసెంబ్లీ ఎన్నికల కు ముందు నాయకులు హామీలు ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. వర్షాలు కురిసినప్పుడు గుంతలు నీటితో నిండి వాహనదారులకు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాల కు గురవుతున్నారు. వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. రాత్రి సమయంలో రోడ్లపై వెళ్లలేం. ఇ ప్పటికైనా చొరవ చూపి శాశ్వత మరమ్మతులు చేయాలి. –ఆమెర్, భువనగిరి -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: పంచ నారసింహుడు కొలువైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామి వారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, ఆరాధన చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యానం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను మాడవీధుల్లో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. అలరించిన నృత్య ప్రదర్శనభువనగిరి: భువనగిరి పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో శనివారం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు అకట్టుకున్నాయి. రమేష్రాజ్ డాన్స్ అకాడమీ కళాకారులు కూచిపూడి నృత్యం చేసి అలరించారు. వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో మినీ శిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించారు. చెరువులో బోటు పై షికారు చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు బాలికలు సింధుప్రియ, భావనరెడ్డి, వందనరెడ్డి, పావని, సింధు, బింధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ మౌనం వీడాలిరామన్నపేట: భారత్పై అమెరికా ఆధిపత్యాన్ని నిలువరించడంతో ప్రధామంత్రి మోదీ విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు. సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి జయంతిని పురస్కరించుకుని శనివారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వం భారత్పై అనేక ఆంక్షలు, వాణిజ్య సుంకాలు విధిస్తున్నా మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్న అమెరికా వైఖరిపై భారత్ మౌనం వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, నాయకులు జెల్లెల పెటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, అవ్వారి గోవర్దన్, కూరెళ్ల నర్సింహాచారి, కందుల హన్మంత్, గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, గన్నెబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, గొరిగె సోములు, లెనిన్ శ్రీకృష్ణ, సత్యం, నరేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
బాలికలు, వృద్ధులకు ప్రత్యేక సంఘాలు
నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఈ నెల 12నుంచి కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలు, సంఘాల్లో లేని వృద్ధులు, దివ్యాంగులను గుర్తిస్తున్నారు. డీపీఎం, సీపీలు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సంఘాలు ఏర్పాటు చేసి సభ్యులతో బ్యాంక్ ఖాతాలు తెరిపించనున్నారు. అనంతరం సెర్ప్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 14,8450 మహిళా సంఘాలు ఉండగా, వాటిలో 1,65,258 మంది సభ్యులున్నారు. భువనగిరి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) మరింత విస్త్రతం కానున్నాయి. రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల నెట్వర్క్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ –2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా 15నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న బాలికలతో పాటు 60 ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయటానికి సెర్ఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన 15–18 ఏళ్ల వయస్సున్న కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసే డబ్బు పొదుపు చేయడంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేదింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం కిశోర బాలికలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో బాలికలను చేర్పించేందుకు సెర్ప్ అధికారులు, సిబ్బంది ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు మళ్లీ అవకాశం ప్రస్తుతం ఉన్న స్వయం సహాయక సంఘాల్లో 60 సంవత్సరాలు నిండిని వారిని తొలగిస్తున్నారు. వీరితో మళ్లీ సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ ఆసరా లేని మహిళలు ఉంటే వృద్ధాప్యంలో చిరు వ్యాపారాలు చేసుకుని బతికేందుకు సాయం చేయడం, నలుగురితో సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన మహిళలతోనూ సంఘాలు ఏర్పాటు చేస్తోంది. దివ్యాంగులంతా ఒకే గొడుకు కిందికి.. దివ్యాంగులందరినీ ఒకే గొడుకు కిందికి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన మాదిరిగానే దివ్యాంగులకు కూడా వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. ప్రతి సంఘంలో 7 నుంచి 10 మంది ఉంటారు. ఫ 15–18 ఏళ్ల వయసున్న బాలికలు, 60 ఏళ్లు నిండిన మహిళలతోప్రత్యేక గ్రూప్లు ఫ దివ్యాంగులతో సైతం.. ఫ స్వయం సహాయక సంఘాల మాదిరిగా బ్యాంక్ లింకేజీ రుణాలు ఫ కొనసాగుతున్న అర్హుల గుర్తింపు ఫ నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు, సభ్యులకు బ్యాంక్ ఖాతాలుఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను గుర్తిస్తున్నాం. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. . –నాగిరెడ్డి, డీఆర్డీఓమండలాలు 17మొత్తం సంఘాలు 14,850సభ్యులు 1,65,258మండల సమాఖ్యలు 17జిల్లా సమాఖ్య 01 -
కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పెండింగ్లో ఉన్న కాంట్రాక్టుల కోసమే రాజీనామా డ్రామా అడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విమర్శించారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చాడని ఆరోపించారు. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధిపై లేదన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూసుకుంట్ల మాట్లాడారు. ‘ప్రభుత్వం సహకరిస్త లేదని అంటున్నావు.. మీ అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఒక్కసారైనా మునుగోడు నియోజకవర్గానికి తీసుకొచ్చావా’ అన్ని ప్రశ్నించారు. మునుగోడుకు నేనే మంత్రి.. నేనే రాజుగా రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్నాడని, మంత్రులను, ఎంపీని రానివ్వడం లేదన్నారు. ‘ఎల్బీనగర్ నుంచి పోటీచేస్తే మంత్రి పదవి వచ్చేదని అంటున్నావు.. మునుగోడుపై ప్రేమ ఉంటే మంత్రి పదవి ఎందుకు. మంత్రి పదవి స్టేజీల మీద మాట్లాడితే రాదు.. అధిష్టానంతో మాట్లాడితే వస్తుంది’ అని కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి వల్ల మునుగోడు నాశనం అవుతుందన్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తావో.. ఇంకేం చేస్తావో కానీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. సుశీలమ్మ ఫౌండేషన్కు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, తాను ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేపట్టానని అన్నారు. నిఝెజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలే కనిపిస్తున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన వెంట నారాయణపురం మండల బీఆర్ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడు నర్రి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఫ రాజగోపాల్రెడ్డికి మంత్రిపై ఉన్న ధ్యాస.. అభివృద్ధిపై లేదు ఫ మునుగోడుకు మంత్రులను, ఎంపీని రానివ్వడం లేదు ఫ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి -
ఆలేరు అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దే
యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని, కేసీఆర్ దీవెనలతో అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించానని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గొంగిడి యూత్ ఐకాన్ ర్యాలీలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ క్యామ మల్లేష్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లాలని యువ జన, విద్యార్థి విభాగం, బీఆర్ ఎస్ కార్యకర్తలను కోరారు. ఆలేరు ప్రజలు తనపై నమ్మకం ఉంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారని, తుది శ్వాసవరకు వారికి అండగా నిలుస్తానన్నారు. ప్రజలు దీవిస్తే మరోసారి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలి పారు. రాష్ట్ర ప్రజలంతా మరో మారు కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ కార్యదర్శి జనరల్ పాపట్ల నరహరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేష్, నాయకులు బీసు కృష్ణంరాజు, బైరోజు వెంకటచారి, మారెడ్డి కొండల్రెడ్డి, వస్పరి శంకరయ్య, పల్లా వెంకట్రెడ్డి, తోటకూరి బీరయ్య, జి.బాబురావు, శిఖ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఫ ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత -
మూసీకి పెరిగిన వరద ఉధృతి
భూదాన్పోచంపల్లి, వలిగొండ : మూసీకి వరద ఉధృతి పెరిగింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఉస్మాన్సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా మూసీలోకి చేరుతోంది. దాంతో భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రవెల్లి, వలిగొండ మండలం సంగెం వద్ద లో లెవల్ వంతెనల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇరు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. భువనగిరి – చౌటుప్పల్ మధ్య సుమారు 15 కిలో మీటర్లు, బీబీనగర్ – పోచంపల్లి మధ్య 30 కిలో మీటర్ల మేరకు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఈ మార్గాల్లో వారం రోజుల్లో ఐదు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. అసంపూర్తిగా ఉన్న వంతెనలను పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫ జూలూరు, సంగెం వద్ద వంతెనలపై నుంచి వరద ప్రవాహం ఫ రాకపోకలు నిలిపివేసిన అధికారులు -
రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి
ఫ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహరాజ్ సంస్థాన్ నారాయణపురం: రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యమించాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ పిలుపునిచ్చారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని కంకణాలగూడెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్తో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాలు గొప్పవిని, వాటిని యువత ఆచరణలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి యాదయ్య, నర్రి నర్సింహ, బైరి శేఖర్, రవీందర్, రమేష్, గాలయ్య, కిరణ్, స్వామి, యాదగిరి, శంకర్, రాజేష్, మధు, భరత్, అర్జున్ తదితరలు పాల్గొన్నారు. -
అడిగితే.. అదిగో ఇదిగో!
బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులందరికీ అందని పరిహారం బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితుల్లో కొందరికి పరిహారం పెండింగ్ ఉంది. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి పెండింగ్ పరిహారం విడుదల చేయాలని కోరడం జరిగింది. మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే చెల్లిస్తాం. ఆ తరువాత రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపుతాం. –అనిల్కుమార్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే బస్వాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తమకు ఏళ్లు గడిచినా పరిహారం అందలేదు. ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు. మేము ఎక్కడికి పోవాలి. పరిహారం చెల్లిస్తే పునరావాస గ్రామంలో ఇల్లు నిర్మించుకుని వెళ్లిపోతాం. పరిహారం ఇచ్చి ఖాళీ చేయించాలి. –నందు, బీఎన్ తిమ్మాపూర్ బీఎన్తిమ్మాపురంలో నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించలేదు. 200 మంది వరకు ఇచ్చారు. ఇంకా 350 మందికి పెండింగ్ ఉంది. అందరికీ పరి హారం డబ్బులు ఇస్తే పునరావాస గ్రామంలో ఇళ్లు నిర్మించుకుంటారు. పనులు మొదలై ఏళ్లు గడుస్తుంది. డబ్బుల కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. –ఎడ్ల సత్తిరెడ్డి, బీఎన్ తిమ్మాపురంసాక్షి, యాదాద్రి: నృసింహసాగర్ రిజర్వాయర్ పనులు మొదలై ఏడేళ్లు పూర్తి కావస్తోంది. కానీ, ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు మాత్రం పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అధికారులను అడిగితే అదిగో,ఇదిగో అంటున్నారే తప్ప.. స్పష్టత ఇవ్వడంలేదని నిర్వాసితులు వాపో తున్నారు. రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయాలంటే బీఎన్ తిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేయించాలి. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తే తప్ప ఊరిని ఖాళీ చేయించే పరిస్థితి లేదు. రూ.79 కోట్లు పెండింగ్.. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భువనగిరి మండలం బస్వాపురం వద్ద నృసింహసాగర్ సాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు.11.39 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు గ్రామకంఠం కింద రూ.109 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. అందులో పది నెలల క్రితం కేవలం రూ.30 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.79 కోట్లు పెండింగ్లో ఉంది. గ్రామంలో 550 మంది వరకు నిర్వాసితులు ఉండగా 200 మందికి పరిహారం వచ్చింది. మరో 350 మందికి పెండింగ్ ఉంది. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తే ప్రస్తుతం 1.5 టీఎంసీల నీటిని రిజర్వాయర్లో నిల్వ చేయవచ్చు. కానీ, పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల రిజర్వాయర్లోకి నీటి విడుదలపై స్పష్టత ఉండటం లేదు. ఫ 350 మందికి రూ.79 కోట్లు పెండింగ్ ఫ అందరికీ చెల్లిస్తేనే గ్రామాన్ని ఖాళీచేయించడానికి అవకాశం ఫ నృసింహసాగర్ రిజర్వాయర్లోకి నీటి విడుదలకు మరికొంత సమయం -
సమన్వయంతోనే ప్రగతిపథం : కలెక్టర్
సాక్షి యాదాద్రి : కలెక్టరేట్లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పథకాల అమలులో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వాలు ఏ స్ఫూర్తితో పథకాలు తెస్తున్నాయో, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అమలుచేసి, ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందేలా కృషి చేయాలని కోరారు. సమన్వయంతో జిల్లాను ప్రగతిపథంలో తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో.. యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈఓ వెంకట్రావ్ జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ, దేవస్థానం అధికారులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏఎన్ఎం, అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు
భువనగిరి : జిల్లాలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం సంబంధిత కోర్సులో శిక్షణ పూర్తి చేయడంతో పాటు ఇంటర్ విద్యార్హత, అకౌంటెంట్ పోస్టుకు బీకాం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండలన్నారు. దరఖాస్తులను ఈ నెల 22లోపు అందజేయాలన్నారు. వివరాలకు 9441189894ను సంప్రదించాలని కోరారు. అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్లో.. చందేపల్లి పరిధిలోని అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాశాఖ ఏడీ ప్రశాంత్రెడ్డి తెలిపారు. అటెండర్, డే, నైట్ వాచ్మన్లు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తులను ఈనెల 22వ తేదీ లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9441189894 నంబర్ను సంప్రదించాలన్నారు. బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికభువనగిరి: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి నియామక పత్రాలు అందజేసి సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా వేముల నరేష్, జైనపల్లి శ్యాంసుందర్రెడ్డి, పట్నం శ్రీనివాస్, గూడూరు నరోత్తంరెడ్డి, పన్నాల చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, కాదూరి అచ్చయ్య, కార్యదర్శులుగా వైజయంతి, కృష్ణ, మల్లారెడ్డి, మేడి కోటేష్, లక్ష్మీనారాయణ, కోశాధికారులుగా సోమ నరసయ్య, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా మంగు నర్సింగ్రావు, జిల్లా ఐటీ ఇన్చార్జి వెంకటేష్, మీడియా ఇన్చార్జి రామకృష్ణ,సోషల్ మీడియా కో కన్వీనర్గా సుధ, ఉదయ్కిరణ్ నియమితులయ్యారు. నూతన కార్యవార్గన్ని జిల్లా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకులు జగన్మోహన్రెడ్డి తదితరులు అభినందించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు భువనగిరిటౌన్ : ప్రజా సమస్యలపై వారం రోజుల పాటు సీసీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. శుక్రవారం భువనగిరిలోని సీపీఎం కార్యాలయంలో కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగిన సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచడం లేదన్నారు. మూసీ పునరుజ్జీవం, బస్వాపురం గంధమల్ల, దేవాదుల ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈనెల 22 23 24 25 తేదీల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసనలు, 28 29 30 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరు బాలరాజు, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. పల్లెకవిత–విద్యాభవిత పుస్తకావిష్కరణ ఆలేరు: పట్టణంలోని సిల్క్నగర్కు చెందిన కవి ఎస్కే జానిమియా రచించిన ‘పల్లె కవిత–విద్యా భవిత’ పుస్తకాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో టీసీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి తదితరులు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం హాజరుశాతం ఎక్కువ ఉన్న విద్యార్థులు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఎన్సీసీ కేడెట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం మంజుల, ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, సైదులు,మల్లేష్, మేఘరాజు పాల్గొన్నారు. -
అహరి్నశలు శ్రమిద్దాం.. అగ్రగామిగా నిలుపుదాం
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు నీరు అందించడమే లక్ష్యం. గంధమల్ల రిజర్వాయర్ భూ సేకరణ దాదాపు పూర్తయ్యింది. మూసీ కాలువల ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. –గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనమండలి చైర్మన్ సాక్షి, యాదాద్రి: ‘ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.. సమన్వయంతో సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదాం. అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం’ అని శాసనమండలి గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రగతి కార్యక్రమాలను వివరించారు. ప్రసంగంలోని ప్రధానాంశాలు ● జిల్లాకు 9,398 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,542 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.47 కోట్లు జమ చేశాం. ● కొత్తగా 23,367 రేషన్కార్డులు మంజూరు చేశాం. వీటి ద్వారా 71,530 మందికి లబ్ధి చేకూరుతుంది. ● రుణమాఫీ పథకం కింద 2,33,418 మంది రైతులకు రూ.306.47 కోట్లు మాఫీ జరిగింది. 2024–25 యాసంగి సీజన్లో 375 కొనుగోలు కేంద్రాల ద్వారా 43,128 మంది రైతుల నుంచి 3,74, 728 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రూ.865 కోట్లు చెల్లించాం. ● 23,921 ఎకరాల్లో ఉద్యాన, మల్బరీ తోటలు సాగవుతున్నాయి. గత మూడేళ్లలో 4,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు సాగైంది. ఈ ఏడాది 3,500 ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించాం. ● రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 1,200 సమస్యలను పరిష్కరించాలి. ● ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను మంజూరు చేసింది. ● జాతీయ కుటుంబ సంక్షేమ పథకం ద్వారా 1,084 మందికి రూ.2.16 కోట్ల ఆర్థిక సాయం అందించాం ● 2025–26 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహా యక సంఘాలకు రూ.611.17 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించాం. ఇప్పటి వరకు రూ.189.52 కోట్లు మంజూరు చేశాం. ● 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు గాను ‘నేతన్నకు పొదుపు’ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 10,790 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు నమో దు కాగా రూ. 2.17 కోట్లు విడుదల చేశాం. ● తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన ఇద్దరు, వైకల్యం పొందిన నలుగురు గీత కార్మికులకు రూ.10.40 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేశాం. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అనంతారం జెడ్పీహెచ్ఎస్, భువనగిరిలోని కృష్ణవేణి హైస్కూల్, బాలికల హైస్కూల్, విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అదే విధంగా ఉత్తమ సేవలందించి 162 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. 2,379 స్వయం సహాయక సంఘాలకు రూ.210 కోట్ల బ్యాంకు రుణాలకు సంబంధించి చెక్కులు అందజేశారు. స్టాళ్ల ప్రదర్శన ఉద్యానవన, రోడ్లు భవనాలు, మహిళాశిశు సంక్షేమం, ఎస్సీ, మైనార్టీ సంక్షేమం, నీటిపారుదల, సహకార, మత్స్యశాఖ, పశుసంవర్ధక, వైద్యారోగ్య, గ్రామీణా భివృద్ధి, మెప్మా, విద్య తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, శకటాలు ఆకట్టుకున్నాయి. అదే విధంగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్యాదవ్, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి శాసనమండలి చైర్మన్కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, భువనగిరి ఏఎస్పీ రాహుల్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు . నృత్యం చేస్తున్న విద్యార్థినులురాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. అందులో భాగంగా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న గంధమల్ల రిజర్వాయర్ పనులను సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన చేశారు. 1.41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించను న్నారు.ఇందుకోసం ప్రభుత్వం రూ.358.16 కోట్ల మంజూరు చేసింది. ఆలేరు నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. దీంతో పాటు బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశాం. పనులు పురోగతిలో ఉన్నాయి. నేరాల నియంత్రణ, కేసుల చేదనలో రాచకొండ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచారు. నేరాల నియంత్రణలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సాంఘిక దురాచారాలపై కళాకారులతో సాంస్కతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫ అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఫ రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఫ స్వాతంత్య్ర వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గత విద్యా సంవత్సరం మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 159 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 97.8 ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో జిల్లా 7వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 5,800 మంది పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం గొప్ప విషయం. -
గంజాయి నిందితుల అరెస్టు
హాలియా : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. శుక్రవారం హాలియా పోలీస్ స్టేషనల్లో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామానికి చెందిన వజ్రాల రాజశేఖర్, నల్లగొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంటతండాకు చెందిన కుందాల వేణు, తిరుమలగిరి(సాగర్) మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన గురజాల మహేందర్ గంజాయికి అలవాటు పడి ముఠాగా ఏర్పడ్డారు. ఆంధ్రాకు చెందిన గడిగంటి అచ్చయ్య, తిరుమలకొండ యేసుబాబు వద్ద గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో అనుముల మండలంలోని పంగవానికుంటతండా శివారులోని అల్వాల ఎక్స్రోడ్డు వద్ద శుక్రవారం గంజాయిని విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. హాలియా పోలీసులు అల్వాల ఎక్స్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా 1.650 కేజీల గంజాయి లభ్యమైంది. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోగా, వారిని అరెస్టు చేశారు. గంజాయి సరఫరాకు సంబంధించిన గడిగంటి అచ్చయ్య, తిరుమలకొండ యేసుబాబు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద 1.650 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్లను డీఎస్పీ అభినందించారు. 1.650 కేజీల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖరరాజు -
త్రివర్ణ పతాక అలంకరణలో సాయినాథుడు
చింతపల్లి: మండల కేంద్రంలోని షిర్డీ సాయినాథుడి దేవాలయంలో శుక్రవారం లక్ష గాజుల పూజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి సామూహిక కుంకుమార్చనలు లక్ష గాజుల పూజా కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు వేరే సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రేణుక రాజేశ్వరి పీఠాధిపతి మేలురి నవీన్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే త్రివర్ణ పతాకంతో సాయినాథుడికి ప్రత్యేక అలంకరణ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచిగంటి ధనంజయ, ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకటయ్య, కోశాధికారి ఊరే కృష్ణయ్య, కుంభం పుల్లారెడ్డి, క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బుద్ధవనం సిబ్బందికి ప్రశంసా పత్రాలునాగార్జునసాగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం బుద్ధవనం సిబ్బందికి ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు బుద్ధవనంలోని మహాస్థూపం వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. 20ఏళ్లుగా బుద్ధవనంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించే విధంగా ప్రశంసా పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, మేనేజర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, డీఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ నాజీష్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య
తిప్పర్తి: అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిప్పర్తి మండలంలోని తిప్పర్తి– రాయినిగూడం రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన బండారు మహేష్ (37) ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. అప్పులు ఎక్కువ కావడం, వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ రైల్వేస్టేషన్ మాస్టర్ అభినవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారునేరేడుచర్ల : కారు అదుపుతప్పి సాగర్ ఎడమ కాలువలో పడింది. పెన్పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన నారాయణ నరేష్రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సూర్యాపేటలో నూతన ఇంటి నిర్మాణం కోసం సామగ్రిని కారులో తీసుకువచ్చాడు. ఇంటి వద్ద సామగ్రిని పెట్టి తన అత్తగారి ఊరైన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు బయలుదేరాడు. సూర్యాపేట మీదుగా మిర్యాలగూడకు వెళ్లేందుకు నేరేడుచర్ల మండలం కల్లూరు అడ్డ రోడ్డు వద్దకు వచ్చాడు. మిర్యాగూడ రోడ్డు వైపు వెళ్లకుండా పొరపాటున సాగర్ ఎడమ కాలువ వైపు తిప్పాడు. దీంతో కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. నరేష్రెడ్డి కారు నుంచి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల సహకారంతో కారు బయటకు తీశారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
భువనగిరిటౌన్ : ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలోని బహర్పేటలో చోటుచేసుకుంది. భువనగిరిలో గురువారం జరిగిన బోనాల పండగలో శుభాకాంక్షలు తెలిపేందుకు ఫ్లెక్సీలను కడుతుండగా కమ్మ ఉదయ్ కిరణ్ (24) విద్యుత్షాక్కు గురయ్యాడు. గాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం మృతుడి తండ్రి కమ్మ వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన కట్టెకోల ప్రభాకర్(55), చిన్నం నర్సయ్యతో కలిసి టీవీఎస్ ఎక్సెల్పై ఆత్మకూరు(ఎం) నుంచి కొరటికల్కు వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సుంచు మహేష్ అతని భార్యతో కలిసి కొరటికల్ నుంచి ఆత్మకూరు(ఎం)కు బైక్పై వస్తున్నాడు. కేజీబీవీ పాఠశాల సమీపంలో టీవీఎస్ ఎక్సెల్, బైక్ ఢీకొన్నాయి. దీంతో ప్రభాకర్తో పాటు సుంచు మహేష్కు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ప్రభాకర్ను భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య రేణుక శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ హనుమంతు తెలిపారు. -
ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకల్లో కోదాడ విద్యార్థులు
కోదాడరూరల్ : ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో గల తేజ విద్యాలయానికి చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా భారత రక్షణశాఖ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో 2లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 200మంది విద్యార్థులకు ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యేందుకు అవకాశం దక్కింది. వారిలో కోదాడ తేజ విద్యాలయం విద్యార్థులు 15 మంది ఉన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. గోల్కొండ కోటలో మోగిన సతీష్ డప్పు దరువుగరిడేపల్లి: గోల్కొండ కోటలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ మ్యూజిక్ అకాడమీ డప్పు కళా బృందం, మహిళా డప్పు కళాకారులు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర డైరెక్టర్ మామిడి హరికృష్ణ సహకారం, అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ సౌజన్యంతో గోల్కొండ కోటలో డప్పుల దరువు ప్రదర్శనలో పాల్గొన్నట్లు మాస్టర్ అమరవరపు సతీష్ తెలిపారు. వేడుకల్లో కల్పన, స్వరూప, భువన, అపర్ణ, నాగమణి, వీరబాబు, శోభన్, గంగ, వెంకటమ్మ, కుమారి, సంజయ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
ఒకే మాట.. ఒకటే బాట
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామాల్లో మద్యం అమ్మకాల నిషేధం కఠినంగా అమలవుతోంది. అల్లందేవిచెర్వు గ్రామం నుంచి ప్రారంభం.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరేళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో.. బెల్టుషాపులు మూసివేసి మద్యం అమ్మకాలను నిషేధించిన గ్రామాల అభివృద్ధి కోసం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట రూ.5లక్షలు ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామస్తులు సమావేశమై తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగా గ్రామంలో బెల్టుషాపులను మూసివేసి, మద్యం అమ్మకాలను నిషేధించారు. ఆ తర్వాత చిమిర్యాల గ్రామస్తులు కూడా ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ రెండు గ్రామాల స్ఫూర్తితో గ్రామాగ్రామాన బెల్టుషాపుల మూసివేత పోరాటం కొనసాగింది. మద్యం అమ్మకాలు నిషేధించిన అల్లందేవిచెర్వు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఐదేళ్ల కిందట రూ.5లక్షలు ప్రోత్సాహకం అందజేశారు. ఆ నిధులతో గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో అమలు చేశా ఎమ్మెల్యే ప్రకటనతో గ్రామస్తుల సహకారంతో మద్యం అమ్మకాలను నిషేధాన్ని కఠినంగా అమలు చేశాం. దీంతో మా గ్రామానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.6లక్షలు నిధులు ఇవ్వడంతో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించుకున్నాం. – సుర్వి యాదయ్య, మాజీ సర్పంచ్ -
నాణ్యమైన వైద్యం అందడం లేదు
చాలామందికి సరైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందడం లేదు. అందుకే ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి అమలు చేయాలి. ఫార్మా, బయోటెక్నాలజీలో దేశం ముందంజలో ఉన్నా, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో లేదు. రోబోటిక్ టెక్నాలజీని వినియోగించాలి. –నవీన్, బయో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్వాతంత్రం వచ్చి 79 సంవ త్సరాలు గడుస్తున్నా మహిళలపై దాడులు జరుగుతుండటం బాధాకరం. నిర్భయ లాంటి చట్టాలను తీసుకొచ్చిన దాడులు ఆగడంలేదు. మహిళలకు పూర్తిగా రక్షణ కల్పించాలి. సెక్యులర్ ఇండియా కంటే సెక్యూర్ ఉమెన్తోనే దేశం పురోగతి సాధిస్తుందన్న నమ్మకం ఉంది. –విశాల, ఈసీఈ దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు. సాంకేతిక పరిజ్ఞానం పల్లెలకు కూడా విస్తరించాలి. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటే ప్రపంచం, దేశంలో ఎపుడు, ఏమి జరుగుతుందని తెలుసుకొని ప్రజలు చైతన్యవంతులవుతారు. పరిశుభ్రత, ఆరోగ్యంపై గ్రామీణ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. –రామలక్ష్మి, ఏఐఎంఎల్ -
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
77 ఏళ్లుగా మువ్వన్నెల రెపరెపలురాజాపేట: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం రైతాంగ సాయుధ పోరాటం తర్వాత 1948 సెప్టెబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి లభించడంతో రాజాపేట మండలం బేగంపేట గ్రామం నడిబొడ్డున అదే గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 77 ఏళ్లుగా బేగంపేట గ్రామం నడిబొడ్డున మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. తమ పెద్దలు చూపిన మార్గాన్ని ఇప్పటికీ గ్రామస్తులు అనుసరిస్తూ నిరంతరాయంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులంతా కలిసి ఆ జెండా ఎగురవేసే ప్రదేశంలో 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. యువతతో పాటు భావిభారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15వ తేదీ, దసరా పండుగ రోజున పాత జెండాను మార్చి నూతన జెండాను ఎగురవేస్తూ జాతీయ నాయకులను స్మరించుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశ వ్యాప్తంగా 79 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలోనూ స్వేచ్ఛ సమానత్వం లేకుండాపోయిందని నేటి యువతరం వాపోతోంది. సమాజంలో అవినీతి, పేదరికం ఇంకా ప్రధాన సమస్యగానే ఉన్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. ప్రజలు, ముఖ్యంగా యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, స్వేచ్చ, సమానత్వం అందుతున్న తీరు, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే ఏం చేయాలన్న అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. 90 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాం. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా సమాజంలో ఇప్పటికీ స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయిందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అవినీతి పేదరికం కొనసాగుతోందని, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పనిచేయాలని, చట్టసభలు సమర్థవంతంగా వ్యవహరించాలని, న్యాయ వ్యవస్థ మరింత మెరుగైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో మీడియా పాత్ర ప్రధానమేనని వివరించారు. బేగంపేట గ్రామంలో నిరంతరాయంగా ఎగురుతున్న జాతీయ పతాకంమీడియాకులవివక్ష6చట్టసభలు అధికార యంత్రాంగం21 న్యాయ వ్యవస్థ3924కొద్దిగాలేదుఅవును78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత.. 1. మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ? ఫ అవినీతి, పేదరికమే ఆసలు సమస్య ఫ అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతోనే మేలు ఫ నాణ్యమైన విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే ‘సాక్షి’ సర్వేలో యువత మనోగతం 3. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏదీ? -
అగ్రదేశాల సరసన చేరుతాం
నూతన ఆవిష్కరణలను స్వాగతిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. పది మంది చేసే పనిని ఏఐ టెక్నాలజీతో ఒక్కరే చేయవచ్చు. ఏఐ టెక్నాలజీని పనిని సులభతరం చేయడానికి వినియోగించాలి తప్ప.. ఉద్యోగులను తొలగించొద్దు. –లక్ష్మణ్రెడ్డి, ఏఐఎంల్ మోదీ విజన్ వల్ల ప్రపంచంలో ఇండియా మూడో ఆర్థిక దేశంగా ఎదిగింది. వచ్చే 20 ఏళ్లలో వందశాతం పేదరిక నిర్మూలన జరగాలి. రిజర్వేషన్లను తొలగించి స్కిల్కు ప్రాధాన్యత కల్పించాలి. టాలెంట్, ఉపాధికి పెద్దపీఠ వేయాలి. ప్రభుత్వాలు సాంకేతిక విద్యను ప్రోత్సహిస్తే స్కిల్ ఇండియా రూపొందుతుంది. –ఉజ్వల్, సీఎస్ఈభూదాన్పోచంపల్లి: ‘మారుతున్న కాలాగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ వివిధ రంగాల్లో రాణిస్తోంది యువత. స్కిల్ ఇండియాగా అవతరించి అగ్రదేశాల సరసన నిలిచే సామర్థ్యం మనకు ఉంది. అందుకు యువత మరింత కష్టపడాలి. వీటితో పాటు పరిశుభ్రత, ఆరోగ్యంపై గ్రామీణ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది’ అని భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘వందేళ్ల భారతం ఎలా ఉండబోతుంది.. అందుకు మీ పాత్ర ఏమిటి’ అనే అంశంపై నిర్వహించిన సాక్షి టాక్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆటోమొబైల్లో రంగంలో ప్రంపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఆటోమొబైల్ రంగం నుంచే 7శాతం జీడీపీ వస్తుంది. విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. –శశి, డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఫ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అవకాశాలకు మరింత ప్రాధాన్యమివ్వాలి ఫ పల్లెలకూ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తే ఎంతో ప్రయోజనం ఫ ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ తప్పనిసరి ఫ కఠిన చట్టాలున్నా మహిళలపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి ‘సాక్షి’టాక్ షోలో ఇంజనీరింగ్ విద్యార్థుల మనోగతం -
మునుగోడులో ‘ప్లాస్టిక్’పై చైతన్యం
మునుగోడు: పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ కవర్లు మునుగోడు మండలంలో కనుమరుగయ్యాయి. మూడు నెలల క్రితం వరకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వినియోగించేవారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మండల, గ్రామ స్థాయి అధికారులంతా రంగంలోకి దిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చారు. దీంతో మండలంలో దశలవారీగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మానిపించారు. ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి చెక్ పెట్టారు. చాటుమాటుగా వినియోగిస్తున్న దాదాపు 30మందికిపైగా దుకాణాదారులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు జరిమానాలు విధించారు. దీంతో ప్రస్తుతం మండల వ్యాప్తంగా వివిధ దుకాణాల్లో చూద్దామన్నా ప్లాస్టిక్ కవర్లు కన్పించడం లేదు. -
సేంద్రియ సాగులో రాణిస్తున్న పట్టభద్రుడు
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిల్లపాటి గోవర్ధన్రెడ్డి ఉన్నత చదువులు చదివి వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తున్నారు. అర్ధశాస్త్రంలో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తిచేసిన గోవర్ధన్రెడ్డి గత నాలుగేళ్లుగా గోఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతరించిపోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణాన్ని, భూమి, నీరు పరిరక్షించుకోవడం, తగ్గుతున్న భూసారాన్ని కాపాడాలనే లక్ష్యంతో సేద్యం చేస్తున్నారు. రసాయన మందులు లేని ఆహారాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కోసం కృషిచేస్తున్నారు. గోవుల పెంపకంతో వాటి మలమూత్రంతో జీవామృతం, ఘన జీవామృతం, గో కృపామృతం, కషాయాలు ఉపయోగించి దేశవాళి పంటలను పండిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు వరిలో దేశవాళి రకాలైన నవార, రత్నచోళి, మైసూర్, మల్లిక, మట్ట రైస్, కులాకర్, కృష్ణప్రియ, బహురూపి పండిస్తున్నారు. సేంద్రియ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఆశించిన లాభాలు వస్తున్నాయని ఆయన పేర్కొంటున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుడమి పుత్ర పురస్కారాన్ని గతేడాది డిసెంబర్లో యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో గోవర్ధన్రెడ్డి అందుకున్నారు. సేంద్రియ వ్యవసాయంపై తాను అవగాహన పెంచుకుంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నానని ఆయన చెబుతున్నారు. -
పంద్రాగస్టు వేడులకు ముఖ్య అతిథిగా గుత్తా
సాక్షి, యాదాద్రి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర, జిల్లా ప్రగతిపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 9.55 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10.15కు ప్రభుత్వ శాఖల శకటాలు ప్రదర్శన, 10.25 గంటలకు ప్రశంస పత్రాల పంపిణీ ఉంటుంది. అనంతరం శాసనమండలి చైర్మన్తో పాటు ఎమ్మెల్యేలు, అధికా రులు, ఇతర ప్రముఖులు స్టాళ్లను సందర్శిస్తారు. కలెక్టరేట్లో.. కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 8.30 గంటలకు కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతా కాన్ని ఆవిష్కరిస్తారు.అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. రూ.5లక్షల విరాళం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు అన్న ప్రసాదా నికి హైదరాబాద్కు చెందిన పుస్తె సత్యనారా యణ–సరళాదేవి దంపతులు రూ.5లక్షల వి రాళం అందజేశారు. గురువారం శ్రీస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మకు చెక్కు అందజేశారు. దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి: చందేపల్లి పరిధిలోని అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. అటెండర్, డే, నైట్ వాచ్మన్లు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. దరఖా స్తులను ఈనెల 22వ తేదీ లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9441189894 నంబర్ను సంప్రదించాలన్నారు. అలాగే కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో 4 అకౌంటెంట్, 2 ఏఎన్ఎం పోస్టులకు అర్హులైన మహిళలు ఈనెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం సెల్ నంబర్ 9441189894ను సంప్రదించాలన్నారు. పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సు ఆత్మకూరు(ఎం): శ్రావణమాసం సందర్భంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు తొర్రూరు డిపో నుంచి స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు. ఈ నెల 21వ తేదీ రాత్రి బయలుదేరి అన్నవరం, సింహాచలం, ఆర్కే బీచ్, సామర్లకోట, పిఠాపురం, 12వ శక్తిపీఠం, విజయవాడ, ఉండవల్లి గుహలు, శ్రీపరిటాల హనుమాన్ ఆలయం, పెనుగ్రంచిప్రోలులోని ఆలయాలను దర్శించుకుని 24న తొర్రూరుకు చేరుకుంటుందన్నారు. చార్జి పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,300 నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 7032182456, 8074474894లను సంప్రదించాలని కోరారు. -
మాదకద్రవ్యాలను అరికడదాం
భువనగిరిటౌన్: సమష్టి కృషితో మాదకద్రవ్యాలకు అడ్డుకట్టవేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో మహిళాశిశు, వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
మోసం చేసిన సీఎం
రాష్ట్రంలో 50లక్షల మంది పింఛన్దారులను సీఎం రేవంత్రెడ్డి మోసం చేశాడని మందకృష్ణ మాదిగ విమర్శించారు. - 8లోఅప్రమత్తంగా ఉండాలి భూదాన్పోచంపల్లి, వలిగొండ: రెడ్ అలెర్ట్ జోన్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని లో తట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాచకొండ సీపీ సుధీర్బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు, వలిగొండ మండలంలోని సంగెం వద్ద మూసీలో వరద ఉధృతిని పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. పశువులు, గొర్రెల కాపరులు వాగులు, మూసీని దాటే ప్రయత్నంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే శిథిల భవనాల్లో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా సంగెం వద్ద లో లెవల్ వంతెనపై పేరుకుపోయిన గుర్రపుడెక్కను అధికారులు జేసీబీతో తొలగించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ మధుసూధన్రెడ్డి, ఎంపీడీఓ జలందర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ట్రాఫిక్ సీఐ జయమోహన్, తహసీల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ భాస్కర్రెడ్డి, ఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి, పోలీసు అధికారులు ఉన్నారు. -
రైతు సంక్షేమంపై రాజీపడం
ఫ ప్రభుత్వ విప్ ఐలయ్య, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి రాజాపేట: రైతు సక్షేమంపై రాజీపడబోమ ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీని వాస్రెడ్డి అన్నారు. రాజాపేట మండలం రేణికుంట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం, గోదాంలను బుధవారం వారు ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ చింతలపురి భాస్కర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రూ.లక్ష ఓట్లు ఖర్చు చేసిందన్నారు. పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసిందన్నారు. ఎరువులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ శోభారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్రెడ్డి, డైరెక్టర్లు సిలివేరు బాలరాజు గౌడ్, విఠల్ నాయక్, తహసిల్దార్ అనిత, ఎంపీడీఓ నాగవేణి, పీఏసీఎస్ డైరెక్టర్లు, సీఈఓ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో వంటకు తంటా..
జీఓ 17ను నిరసిస్తూ కేటరింగ్ కాంట్రాక్టర్ల సమ్మెబాట ఫ వంట సిబ్బంది సైతం విధులకు గైర్హాజరు ఫ విద్యార్థులకు సమయానికి అందని అల్పాహారం, భోజనం ఫ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాక్షి,యాదాద్రి: విద్యార్థులే వంట మనుషులుగా మారారు. స్వయంగా వంటలు చేసి వారే వడ్డించుకున్నారు. అల్పాహారం, గురుకులాల్లో వంట కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఓ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో భోజనం వండి వడ్డించే కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్లారు. దీంతో బుధవారం విద్యార్థులకు సమయానికి అల్పాహారం, భోజనం అందలేదు. కొత్త టెండర్ విధానం.. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన టెండర్ విధానం అమల్లోకి తెచ్చింది. కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లు రూ.లక్షల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జీఓ 17 జారీ చేసింది. ఇప్పటికే బిల్లులు సకాలంలో అందక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. అప్పులు చేసి వస్తువులు సరఫరా చేస్తుసన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ కాంట్రాక్టర్లకు ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. పాత నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి దిగారు. విధులకు రాని వంట సిబ్బంది కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి దిగడంతో వంట సిబ్బంది విధులకు హాజరు కాలేదు. భువనగిరి, రాజాపేట, ఆలేరు, బీబీనగర్ సోషల్ వెల్ఫేర్, ఆలేరు, మోటకొండూరు, బీబీనగర్, దేశ్ముఖి బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో సిబ్బంది హాజరు తగ్గింది. హాజరైన ఒకరిద్దరికి తోడుగా బయటినుంచి మహిళలను కూలికి రప్పించి వంటలు చేయించారు. కొన్ని చోట్ల వాచ్మన్లు, అటెండర్లు, స్కావెంజర్లతో, మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులే వంటలు చేసి స్వయంగా భోజనం వడ్డించుకున్నారు. చాలా చోట్ల ఉదయం అల్పాహారం చేయలేదు. జావాకాచి పోశారు. విద్యార్థుల భోజనానికి ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేయడంతో తాత్కాలికంగా కొంతమంది వర్కర్లను తీసుకుంటున్నారు. నిలిచిపోనున్న సరుకులు! ప్రస్తుతం గురుకులాల్లో కిరాణ సరుకులు సరిపడా ఉన్నాయి. అయితే విద్యార్థులకు వారంలో రెండు దఫాలు చికెన్, మటన్తో భోజనం పెట్టాలి. తాజా పరిస్థితులు చూస్తుంటే సరుకులు నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది. -
వాగులకు వరద
ఉధృతంగా ప్రవహిస్తున్న బిక్కేరు, మూసీగురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఆలేరు,మోత్కూరు,యాదగిరిగుట్ట, అడ్డగూడూరు: భారీ వర్షానికి జిల్లాలో మూసీతో పాటు పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మూసీ లోలెవల్ వంతెనలు, బిక్కేరు వాగు, నక్కల వాగు వద్ద రాకపోకలు నిలిపివేశారు. రాచకొండ సీపీ సుధీర్బాబు ఇతర అధికారులు బుధవారం రుద్రవెల్లి– జూలూరు, సంగెం వద్ద మూసీలో వరదను పరిశీలించారు. జిల్లాలో 1,152 చెరువులు ఉండగా మూసీ పరీ వాహకంలోని 80 చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. గుండాల మండలంలో రెండు ఇళ్లు కూలి పోయాయి. రానున్న మూడు రోజులు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎటవంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. ఆలేరులో.. పట్టణంలో 26.8 మి. మీ వర్షపాతం నమోదైంది. ఆలేరు పెద్దవాగు ,రత్నాల వాగులో వరదనీరు పారుతోంది. బైరవకుంట, ఎంకుంటలో నీరు చేరుతోంది. పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో, బ్రహ్మంగారి గుడి వద్ద, వడ్లబురాన్ ఇంటి వద్ద వరద కాల్వల్లో పూడికతీయకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఉదయం ప్రగతి స్కూల్, పాత మున్సిప ల్ కార్యాలయం, కొలనుపాకకు వెళ్లే దారిలోని వంతెన వద్ద వరద నీటిని తహసీల్దార్ పరిశీలించారు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలు కురిస్తే ముంపు పొంచి ఉన్న రంగనాయకుల వీధి, పాత మున్సిపల్ కార్యాలయం, సిల్క్నగర్ తదితర లోతట్టు ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించారు. ఎస్డీఆర్ఎస్, అగ్నిమాపక సిబ్బంది రెడీ.. వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అగ్నిమాపక, ఎస్డీఆర్ఎస్ సిబ్బంది సిద్ధమైంది. అత్యవసర పరిస్థితులకు ఎదుర్కొనేందుకు 20 మంది ఎస్డీఆర్ఎస్, 14మంది అగ్నిమాపక సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రెస్క్యూ బోట్లు, లైఫ్బాయ్స్, రోప్స్, లైఫ్ జాకెట్స్, విక్టిమ్ లొకేటింగ్ కెమెరా, కట్టర్స్ తదితర సామగ్రిని అందుబాటులో ఉంచారు. పెరుగుతున్న భూగర్భ జలాలు మోత్కూరు మండలం పొడిచేడు, నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు మధ్య మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదికి ఇరు వైపులా గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతు న్నాయి. బోర్లు కూడా రీచార్జ్ అవుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వాగుల వద్ద కాపాలా.. అడ్డగూడూరు మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వాగుల్లో వరద ప్రవాహం పెరిగింది. అడ్డగూడూరు– గోవిదాపురం మధ్య నక్కల వాగు, వెల్వేవి–చౌల్లగూడెం, అజీంపేట గ్రామాల వద్ద లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ శంకరయ్య, పొలీసులు ఆయా ప్రాంతాలను పర్యవేక్షించారు. వాగులనుంచి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.13ఎన్ఎల్సీ18,19 : న్యూస్రీల్ఫ లో లెవల్ వంతెనల వద్ద రాకపోకలు బంద్ ఫ మూసీ పరీవాహకంలో అలుగుపోస్తున్న 80 చెరువులు ఫ మిగతా చెరువులు, కుంటలకూ జలకళ ఫ రుద్రవెల్లి– జూలూరు, సంగెం వద్ద మూసీని పరిశీలించిన సీపీ సుధీర్బాబు -
కనులపండువగా నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం కనువ పండువగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, అనంతరం ఆరాధన, గర్భాలయంలోని స్వయంభూలను అభిషేకం, సహస్రనామర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంపై గల ఉత్తరదిశ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఆ తరువాత గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, వెండి జోడు సేవోత్సవం వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిపించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు.వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలివలిగొండ : సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. వలిగొండ మండలంలోని వెల్వర్తి ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు. గవర్నర్ను కలిసిన ఎంజీయూ వీసీనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ బుధవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. యూనివర్సిటీలోని పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాభివృద్ధి, కోర్సులు తదిరత అంశాలను గవర్నర్కు వివరించారు. సెప్టెంబర్ నెలలో యూనివర్సిటీలో నిర్వహించనున్న కాన్వకేషన్కు గవర్నర్ను ఆహ్వానించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ అలువాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్రెడ్డి ఉన్నారు. సంక్షోభంలో విద్యారంగం భువనగిరి: రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంతో ఉందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. భువనగిరిలోని సాయికృత డిగ్రీ కళాశాలలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగుతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. పెండింగ్లో ఉన్న రూ. 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎప్ఎస్ఐ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం, జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు నేహల్, ఉదయ్, జగన్, కార్తీక్, భవానీ, శంకర్, గాయత్రి, రాణి, ప్రకాష్, నరేందర్, మహేష్, సతీష్ పాల్గొన్నారు. -
రైతులు నష్టపోకుండా డబ్ల్యూడీఆర్ఏ
మోత్కూరు: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని, దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వేర్హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్ఏ) ఏర్పాటు చేసిందని.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ (ఐసీఎం)ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్కుమార్ తెలిపారు. మోత్కూరు మండల కేంద్రంలోని ఎఫ్ఎస్సీఎస్ డబ్ల్యూడీఆర్ఏపై బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర దక్కకపోవడం, నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండటం లేదన్నారు. పంట పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చడానికి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నివారించి అధిక ధర వచ్చినప్పుడు పంటను అమ్ముకునే సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఎక్కడికక్కడ వేర్హౌజింగ్ గోదాములను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఈ గోదాముల్లో నామమాత్రపు రుసుముతో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవచ్చని సూచించారు. నిల్వ చేసిన పంటపై 80 శాతం వరకు బ్యాంకులు తక్షణ రుణ సదుపాయం కల్పిస్తాయన్నారు. అనంతరం రైతులకు శిక్షణ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామనర్సయ్య, గోదాం మేనేజర్ వీరబాబు, సింగిల్విండో చైర్మన్ పి.వెంకటేశ్వర్లు, సీఈఓ వరలక్ష్మి, వైస్ చైర్మన్ బండ పద్మ, డైరెక్టర్లు స్వామి, లక్ష్మయ్య, ముత్తయ్య, రాములు, మల్లయ్య, సుజాత, రైతులు పాల్గొన్నారు. ఫ ఐసీఎం ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్కుమార్ -
అత్యాచారం కేసులో 26 ఏళ్ల జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 26 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రొసిక్యూషన్ కథనం ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన గ్యారాల శివకుకుమార్ బీటీఎస్ ప్రాంతానికి చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ ఆమె కుమార్తైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2023 మే 8న నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో యాదమ్మ, శివకుమార్పై కేసు నమోదు చేసి వారిద్దరిని కోర్టులో హాజరుపర్చారు. మంగళవారం కోర్టు విచారణలో యాదమ్మ హాజరుకాగా 22 ఏళ్ల జైలు శిక్ష రూ.5వేల జరిమాన విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించింది. శివకుమార్ పారిపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నల్లగొండ టూటౌన్ పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. జడ్జి విచారణ జరిపి శివకుమార్కు 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.40వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలు వినిపించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతినార్కట్పల్లి: విద్యుదాఘాతంతో పానీపూరి బండి నిర్వాహకుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన రమావంత్ రమేష్(39) కొన్నేళ్లుగా స్థానిక బస్టాండ్ ఎదురుగా పానీపూరి బండి నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం రాత్రి వర్షం కురుస్తుండగా.. పానీపూరి బండికి ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ వెలగకపోవడంతో దానిని సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ.. తుంగతుర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన బుర్ర పద్మయ్య(62) తన టీవీఎస్ ఎక్సెల్పై సోమవారం తుంగతుర్తికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. అన్నారం ఎక్స్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. అతడి తలకు తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. తుంగతుర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. పోస్టుమాస్టర్ అరెస్ట్ అడ్డగూడూరు: ఖాతాదారుల డబ్బులు వాడుకుని మోసం చేసిన పోస్టుమాస్టర్ను అడ్డగూడూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన మాలోతు దుర్గాప్రపాద్ అడ్డగూడూరు మండలం డి. రేపాక గ్రామ పోస్టుమాస్టర్గా 2022 నుంచి 2023 వరకు పనిచేశాడు. ఆ సమయంలో ఐదుగురు ఖాతాదారులు డిపాజిట్ చేసిన రూ.53వేల నగదను దుర్గాప్రసాద్ తన సొంతానికి వాడుకున్నాడు. 2025 మే నెలలో ఖాతాదారులు తమ ఖాతాల్లో డబ్బులు లేవని గుర్తించి దుర్గాప్రసాద్పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. -
నూతన పద్ధతులపై అవగాహన కల్పించాలి
త్రిపురారం: వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని దక్షిణ తెలంగాణ మండలి(ఏడీఆర్) సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ రాంప్రకాష్ సూచించారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకేలో వరి, కంది విత్తనోత్పత్తి ప్రదర్శనలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి పంట, కూరగాయల సాగు, గొర్రెల పెంపకం షెడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కేవీకే కంపాసాగర్ ఆధ్వర్యంలో రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోర్డినేటర్ రాజ్కుమార్, సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఫ దక్షిణ తెలంగాణ మండలి సహ పరిశోధన సంచాలకుడు రాంప్రకాష్ -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఇంటర్వ్యూ
పెన్పహాడ్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకున్న పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ బయోలజీ టీచర్ మారం పవిత్ర బుధవారం నేషనల్ జ్యూరీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనున్నారు. ఇందు కోసం రాష్ట్రం వ్యాప్తంగా 107మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆన్లైన్ ద్వారా 21 ప్రశ్నావళి ఇచ్చి సరైన సమాధానాలు ఇచ్చిన 77మందిని స్టేట్ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో నుంచి ఎంపిక చేసిన 15మందిని ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ జ్యూరీ సభ్యురాలు ఇంటర్వ్యూ చేసి ఆరుగురిని ఎంపిక చేశారు. ఈ ఆరుగురి మారం పవిత్ర ఉండగా.. వీరు బుధవారం హైదరాబాద్లోని విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఆరుగురిలో నుంచి ఇద్దరు లేదా ముగ్గురిని జాతీయ అవార్డుకు ఎంపిక చేస్తారని ఆమె చెప్పారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్రను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్, ఆర్జేడీ విజయలక్ష్మి అభినందించారు. ఫ హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో హాజరైన పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్ బయోలజీ టీచర్ -
మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి ఆత్మహత్య
గుర్రంపోడు: తల్లి సంవత్సరీకం రోజున మద్యం తాగొద్దన్నందుకు మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం గుర్రంపోడు మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలకేంద్రానికి చెందిన మోపూరి లింగారెడ్డి(58) మంగళవారం రాత్రి తన తల్లి సంవత్సరీకం సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇంట్లో మద్యం తాగుతున్నాడు. మద్యం ఎక్కువగా తాగుతున్నావు, లేచి అన్నం తిను అని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిరంతరం అప్రమత్తతతో విద్యుత్ సేవలు
నేరేడుచర్ల: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నిరంతరం అప్రమత్తతతో విద్యుత్ శాఖ సేవలను అందిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ శివాజీ అన్నారు. బుధవారం నేరేడుచర్లలోని ట్రాన్స్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్, ఎమర్జెన్సీ మినహా విద్యుత్ ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్యూజ్ ఆఫ్ కాల్ నుంచి ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, విద్యుత్ లైన్ల మరమ్మతులు, తదితర అవసరాల నిమిత్తం 1912 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచామన్నారు. ఓపెనింగ్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఎక్కడైనా విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే తెలిసిపోతుందన్నారు. వెంటనే విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలు విద్యుత్ మరమ్మతులు సొంతంగా చేపట్టవద్దన్నారు. ఈ సమావేశంలో హుజూర్నగర్ విద్యుత్ డీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ టెక్నికల్ డీఈ కృష్ణారావు, ఏడీ నాగిరెడ్డి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల ఏఈలు రవివర్మ, శ్రీనివాస్ తదితరులున్నారు. ఫ టీజీఎస్పీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ శివాజీ -
ఢిల్లీలో స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం
సూర్యాపేట: ఢిల్లీలోని ఎరక్రోటలో ఆగస్టు 15న జరగబోయే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు నాగేశ్వర్రావుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా నాగేశ్వర్రావుకు బుధవారం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి, ఉపాధ్యక్షురాలు వందనపు శ్రీదేవి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన రెండవ ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్లో తెలంగాణ తరఫున నాగేశ్వర్రావు పాల్గొని పతకాలు సాధించించడంతో ఆయన ప్రత్యేక ఆహ్వానం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి గూడూరు నాగేశ్వరరావు ఒక్కరికే ఈ అవకాశం రావడం గర్వకారణమన్నారు. బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు పరారీ ఫ ఆరు గంటల్లోనే హైదరాబాద్లో పట్టుకున్న పోలీసులునల్లగొండ: నల్లగొండ పట్టణంలోని బాలసదన్ నుంచి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు బాలికలు పారిపోయారు. బాలసదన్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించి వారిద్దరు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. ఆరు గంటల్లోనే బాలికలను పట్టుకుని సంరక్షణ అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. తక్కువ సమయంలో బాలికల ఆచూకీ కనిపెట్టిన టూటౌన్ ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బంది రాజు, బాలకోటిని డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు. వరదలో కొట్టుకుపోయిన బైక్మేళ్లచెరువు: చింతలపాలెం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం సాయంత్రం పులిచింతల ప్రాజెక్టు నుంచి వజినేపల్లి వెళ్లే రోడ్డులో వాగు ఉదృతంగా ప్రవహించింది. ఈ దారిలో బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు వాగు దాటుతుండగా.. బైక్ వరదలో కొట్టుకుపోయింది. మరో వ్యక్తి సైతం బైక్పై వాగు దాటుతుండగా.. కొంతదూరం వరదకు కొట్టుకుపోయి ఒడ్డుకు చేరుకున్నాడు. -
పింఛన్దారులను మోసం చేసిన సీఎం
ఆలేరు: రాష్ట్రంలో 50లక్షల మంది పింఛన్దారులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కును కోల్పోయారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన చేయూత పింఛన్దారుల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు పింఛన్లను పెంచుతానని హామీలతో ఓట్లడిగిన రేవంత్రెడ్డి.. పేద వర్గాలను నమ్మించి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ సర్కారు మోసాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్.. గడీలో పడుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రతిపక్ష నేతగా ప్రశ్నించాల్సిన బాధ్యత కేసీఆర్ లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలన చాలని ప్రతిపక్షలో కూర్చొబెట్టినా, అక్కడా ఆయన విఫలమయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నా ప్రజల్లోకి రాకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష నేత మౌనంగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. బంగ్లాలో, గడీలో పుట్టిన భూస్వాములు రేవంత్రెడ్డి, కేసీఆర్లకు పూరిగుడిసెలో ఉండే పేదల కష్టాలు అర్థంకావని మండిపడ్డారు. సెప్టెంబర్ 3లోపు కొత్త పింఛన్ల మంజూరుతోపాటు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచకపోతే సీఎం రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వచ్చే నెల 3న తలపెట్టిన మహాగర్జన సభకు పింఛన్దారులు అధికసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) నాయకుడు జాలపు సిద్ధారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీహెచ్పీఎస్ నాయకుడు ధనుంజయ్యగౌడ్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ నాయకులు, పింఛన్దారుల సంఘం ప్రతినిధులు అశోక్, జహంగీర్, ఉస్మాన్, సత్తయ్య మహేందర్మాదిగ, చంద్రస్వామి మాదిగ రామకృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు. ఫ రాజీనామా చేసి ఇంటికెళ్లేందుకు రేవంత్రెడ్డి సిద్ధంగా ఉండాలి ఫ కాంగ్రెస్ మోసాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత.. గడీలో పడుకుండు ఫఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు
కేతేపల్లి: రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయటంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామంలో జాగృతి కార్యకర్త కూతురు జన్మదిన వేడుకకు హాజరైన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడు మళ్లీ మొదలయిందన్నారు. కేసీఆర్ హయాంలో సీజన్కు ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా నిల్వలను తెప్పించి రైతులకు సకాలంలో సరఫరా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలను కేంద్రం నుంచి తీసుక రావటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కేంద్రంపై కొట్లాడి రైతులకు సరిపడా యూరియాను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు వెంటనే అమలు చేయాలన్నారు. ఫ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ -
షార్ట్సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): షార్ట్సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధమైన ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగి ంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సూర్యాపేట గ్రామానికి చెందిన ఎడవెల్లి మల్లయ్య మంగళవారం రాత్రి తాను నివాసముంటున్న పూరి గుడిసెలో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అర్ధరాత్రి షార్ట్సర్క్యూట్ కారణంగా గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన మల్లయ్య కటుంబ సభ్యులు కేకలు వేస్తూ బయటకు పరుగు తీశారు. గుడిసెతో పాటు అందులోని వస్తువులు, నిత్యావసర సరుకులు కాలిబూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్రావు తహసీల్దార్ అమీన్సింగ్తో కలిసి గ్రామానికి చేరుకుని కాలిపోయిన పూరి గుడిసెను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. -
104 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
సూర్యాపేట: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని వాసవీ యూత్ క్లబ్ అధ్యక్షుడు వెంపటి రవితేజ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి తిరంగా జెండా ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. త్రివర్ణ పతాకం ఇళ్లపై ఎగురవేయడం ద్వారా ప్రతిఒక్కరిలో జాతీయభావం పెంపొందుతుందన్నారు. అనంతరం కొత్త బస్టాండ్, శంకర్ విలాస్ సెంటర్, కల్నల్ సంతోష్బాబు విగ్రహం వరకు 104 అడుగుల భారీ జాతీయ జెండాతో జయ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్, వాసవీ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
అధిక వర్షాలకు పంటల రక్షణ ఇలా..
పెద్దవూర: గత మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పత్తి, మిరప, పప్పుదినుసుల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ పంటలు నీటిలో మునగడంతో వాటికి చీడపీడల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సకాలంలో పంటల రక్షణ చర్యలు చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. రైతులు పాటించాల్సిన జాగ్రత్తలను పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్ వివరించారు. పత్తి పంట: ● సాధ్యమైనంత వరకు చేనులో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఎప్పటికప్పుడు కాల్వలను ఏర్పాటు చేసుకుని నీటిని తొలగించాలి. ● వర్షాలు తగ్గిన వెంటనే వీలైనంత త్వరగా భూమిలో తేమను తగ్గించేందుకు అంతర సేద్యం చేయాలి. ● అంతర సేద్యం చాలారోజుల వరకు వీలుకాకపోతే, కలుపు సమస్య ఎక్కువగా ఉంటే విత్తిన 45–60 రోజుల పైరులో ఎకరాకు 400 మి.లీ., క్విజల్ ఫాస్ ఇథైల్+ఫైరిథయోబాక్ సోడియం 250 మి.లీ. కలిపి పిచికారీ చేసి కలుపును నివారించుకోవాలి. ● వర్షాలు తగ్గాక వెంటనే బురద పదునులో ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరట్ ఆఫ్ పొటాష్ను పైపాటుగా వేయాలి. లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్, 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ● విత్తిన సమయంలో భాస్వరం ఎరువును వేయని రైతులు ఎకరాకు 50 కిలోల డీఏపీ ఎరువు వేసుకోవచ్చు. ● ఆకుపచ్చ తెగుళ్ల తీవ్రత పెరగడానికి అవకాశం ఉన్నందున వర్షాలు తగ్గాక సాఫ్ లేదా కంపానియన్ అనే శిలీంధ్రనాశిని మందు 2 గ్రాముల చొప్పున, అలాగే ఫ్లాంటోమైసిన్ లేదా స్ట్రిప్టోసైక్టిన్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పత్తిలో వర్షాలు తెరిపి ఇచ్చిన తర్వాత పిండినల్లి ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీని నివారణకు గాను లీటరు నీటికి 1 మి.లీ. డైక్లోరోఫాస్తో పాటు 2మి.లీ. ఫ్రొఫినోఫాస్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. ● వర్షాలు తగ్గిన మూడు, నాలుగు రోజులకు వరుసల మధ్య భాగాన్ని గుంటుకలతో దున్నాలి. ● అధిక వర్షాలకు వేరుకుళ్లు తెగులు ఆశిస్తే లీటరు నీటికి 3గ్రాముల కాఫర్ ఆక్సీక్లోరైడ్ లేదా ఒక గ్రామ్ కార్భండిజమ్ కలిపి మొక్క మొదళ్లలో తడపాలి. పెసర, మినుము: ● పెసర, మినుము పంటల్లో పేనుబంక, లద్దెపురుగు ఆశించే అవకాశం ఉంది. లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ కలిపి పిచికారీ చేయాలి. ● 20 నుంచి 25 రోజుల దశలో ఉన్న పంటలో కలుపు ఎక్కువగా ఉంటే అంతరసేద్యం సాధ్యంకానప్పుడు పెసర, మినుము పంటలలో ఎకరాకు 200 మి.లీ. ఇమిజిథాపిర్ను 200 మి.లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు వాడినప్పుడు పంట పెరుగుదల తాత్కాలికంగా వారం రోజులు ఆగుతుంది. తర్వాత తేరుకుని మామూలుగా ఉంటుంది. ● వర్షాలకు ఆకుపచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి. మిరప: ● మిరప నారుమళ్లలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ● నారుకుళ్లు తెగులు నారుమళ్లను ఆశిస్తే లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రాముల రిడోమిల్ కలిపి వారంలో రెండు, మూడుసార్లు నారుమళ్లను తడపాలి. ● నాటిన మిరప చేలలో నీరు నిల్వ లేకుండా చూడాలి. కంది: ● పొలంలో నిల్వ ఉన్న నీటిని త్వరగా బయటకు పంపాలి. ● ఎకరాకు 15 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరట్ ఆఫ్ పొటాష్లను పైపాటుగా వేయాలి. ● ఇనుపధాతు లోపం వచ్చే అవకాశం ఉన్నందున లీటరు నీటికి అన్నభేది 5–10 గ్రాములు,+ 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు, లేదా మూడు సార్లు పిచికారీ చేయాలి. ● అధిక తేమ వల్ల ఎండుతెగులు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో మొక్కలు వాడుబడుతున్నట్లు కనిపిస్తే లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్భండిజమ్ కలిపి మొక్కల మొదళ్ల దగ్గర తడపాలి. మొక్కజొన్న: ముందుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ను పైపాటుగా వేయాలి. కాండం తొలిచే పురుగు, ఆకు ఎండు తెగులు తీవ్రత ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. దీని నివారణకు గాను ఎకరానికి 400 మి.లీ ఫ్రొఫినోఫాస్, 200 మి.లీల ఫ్రొఫికొనజోల్ను 200 లీటర్ల నీటిలో కలిపి చేను బాగా తడిసే విధంగా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత వరుసలలో గుంటుకతో దున్నాలి. -
ఆలేరును ఎడారిగా మార్చిన బీఆర్ఎస్
ఆలేరురూరల్: గత ప్రభుత్వం పాలనలో ఆలేరు ప్రాంతాన్ని ఎడారిగా మార్చారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రోడ్డు పనులకు మంగళవారం శుంకుస్థాపన చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇల్లును ప్రారంభించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గోదావరి జలాల ద్వారా మరోసారి చెరువులను నింపుతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఘన విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మాజీ వైఎస్ ఎంపీపీ గాజుల లావణ్యవెంకటేష్, పారునంది భాస్కర్, నీలం పద్మ, వెంకటేశ్వరరాజు, చిలుకు కృష్ణ, జాలపు వనజారెడ్డి, దీపిక, నీలం వెంకటస్వామి, పిల్లలమర్రి శంకరయ్య, దశరథ, శ్రీపాల్రెడ్డి, ఆరె ప్రశాంత్, కర్రె అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే..
భూదాన్పోచంపల్లి: ప్రభుత్వాలు మారినా మూసీ నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాలు పూర్తికావడం లేదు. ప్రభుత్వం లోలెవల్ బ్రిడ్జిలను హైలెవల్ బ్రిడ్జిగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినా చేసిన పనులకు బిల్లులు వస్తలేవని సదరు కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఫలితంగా వర్షాకాలంలో భూదాన్పోచంపల్లి మండలం నుంచి బీబీనగర్, భువనగిరి మండలాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లర్ల దశలోనే.. భూదాన్పోచంపల్లి మండలం జూలూరు– రుద్రవెల్లి గ్రామాల మధ్యన నిర్మించిన లోలెవల్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు నాబార్డు నుంచి రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2016 జూన్లో పనులు ప్రారంభించారు. కానీ భూసేకరణలో అధికారుల జాప్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వెరసి నాబార్డు ఇచ్చిన గడువు 2021 మార్చి 31తో ముగియడంతో ఆ నిధులు ల్యాప్స్ అయ్యాయి. అనంతరం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.10.50 కోట్లు మంజూరు కావడంతో ఏడాది క్రితం 8 పిల్లర్లను అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. మూసీ పొంగితే స్కూల్ డుమ్మా.. పోచంపల్లి, బీబీనగర్ రెండు మండలాల ప్రజలు రాకపోకలు సాగించడానికి జూలూరు–రుద్రవెల్లి గ్రామాల మధ్యన ఉన్న మూసీ బ్రిడ్జే ప్రధానమైనది. ఈ మార్గం గుండానే పోచంపల్లి మండల ప్రజలు బీబీనగర్, భువనగిరి, ఘట్కేసర్కు వెళ్తుంటారు. దీంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. అంతేకాక బీబీనగర్ మండల పారిశ్రమల్లో పనిచేసేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి యువకులు వెళ్తుంటారు. అదేవిధంగా బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు పోచంపల్లి మండలం జూలూరు జెడ్పీ హైస్కూల్కు వస్తుంటారు. వర్షాకాలంలో లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ పొంగి ప్రవహిస్తుంటుండంతో ఈ మార్గంలో రాకపోకలు ఒక్కోసారి 15 నుంచి 20 రోజుల వరకు స్తంభిస్తుంటాయి. దీంతో మూసీ పొంగిన ప్రతిసారి రుద్రవెల్లి గ్రామ విద్యార్థులకు స్కూల్ బంద్ అవుతుంది. రెండుసార్లు గడువు పొడిగించినా సాగని పనులు శివారెడ్డిగూడెం–రెడ్డిబావి(దంతూర్) గ్రామాల మధ్యన చిన్నేరుపై నిర్మించిన లోలెవల్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ.6.22 కోట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2022 జనవరిలో పనులు ప్రారంభించారు. అగ్రిమెంట్ ప్రకారం ఏడాదిన్నర లోపు అంటే సెప్టెంబర్ 2023లోపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. కాని బిల్లులు రావడం లేదన్న కారణంతో పిల్లర్ల దశలోనే పనులు నిలిచిపోయాయి. గడువుతీరినా ప్రభుత్వం మరోసారి ఈ సంవత్సరం మార్చి 31 వరకు పొడిగించింది. కానీ పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేదు. రెండోసారి ఇచ్చిన గడువు కూడా ముగిసింది. తప్పని తిప్పలు ధర్మారెడ్డిపల్లి, వంకమామిడి, రెడ్డిబావి తదితర గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి రావడానికి, ఇంద్రియాల, శివారెడ్డిగూడెం, పెద్దరావులపల్లి గ్రామాల ప్రజలు చౌటుప్పల్కు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. రైతులు కూడా తమ పంట పొలాల వద్దకు ఈ మార్గం గుండా వెళ్తుంటారు. వర్షాకాలంలో లోలెవల్ బ్రిడ్జి పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయి ఆ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వేతోనే సరి.. ఇంద్రియాల, జంపల్లి గ్రామాల మధ్య మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.2.15 కోట్లు, శివారెడ్డిగూడెం, సూరెపల్లి గ్రామాల మధ్యన మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.25 కోట్లు మంజూరు చేసింది. గత సంవత్సరం ఆగస్టులో కేవీఆర్ కన్సల్టెంట్ సంస్థ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. వర్షాకాలంలో ఇబ్బంది అవుతోంది మా ఊర్లో 5వ తరగతి వరకే ఉంది. గ్రామం నుంచి 20 మంది విద్యార్థులం జూలూరు హైస్కూల్కు ఆటోలు, బస్సుల్లో వెళ్తున్నాం. రుద్రవెల్లి, జూలూరు మధ్యన బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో స్కూల్కు వెళ్లలేదు. వర్షాకాలంలోనైతే బిక్కుమంటూ వచ్చిపోతుంటాం. మూసీ పొంగినప్పుడల్లా స్కూల్కు వెళ్లలేకపోతున్నాం. – దర్శనం తులసి, 7వ తరగతి, రుద్రవెల్లి గ్రామం, బీబీనగర్ మండలం బ్రిడ్జిని పట్టించుకోవడం లేదు జూలూరు–రుద్రవెల్లి బ్రిడ్జిని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు. ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. వర్షాకాలంలో లోలెవల్బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపో తున్నాయి. భువనగిరికి వెళ్లాలంటే పెద్దరావులపల్లి మీదుగా చుట్టూ 22 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది. – వట్టిపల్లి శ్రీశైలం, రైతు, జూలూరు గ్రామం, భూదాన్పోచంపల్లి ఫ తొమ్మిదేళ్లుగా సాగుతున్న జూలూరు– రుద్రవెల్లి బ్రిడ్జి పనులు ఫ మూడున్నర ఏళ్లు దాటినా ముందుకు పడని శివారెడ్డిగూడెం బ్రిడ్జి ఫ వర్షాకాలంలో స్తంభిస్తున్న రాకపోకలు -
మారుతి కోటెక్స్లో జాతీయ జెండాల తయారీ
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని మారుతి కోటెక్స్ పరిశ్రమలో జాతీయ జెండాల తయారీ ముమ్మరంగా జరుగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జెండాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ లభించడంతో ఇటీవల ఉత్పత్తిని మొదలుపెట్టారు. త్రివర్ణ పతాకాల కోసం కాంట్రాక్టర్ ఈ కంపెనీకి 5లక్షల మీటర్ల సాదా వస్త్రాన్ని సరఫరా చేశారు. అక్కడి నుంచి అందిన వస్త్రాన్ని మారుతి కోటెక్స్ పరిశ్రమలో 8లక్షల జాతీయ జెండాలు తయారు చేసి ఇవ్వాల్సి ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక వాహనాల ద్వారా సగానికిపైగా జెండాలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు. ఇంకా మిగిలిన సగం జెండాలు సైతం ఈ నెల 13లోపు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయ పతాకాల ఆర్డర్ వచ్చింది. ఇప్పటికే సగానికిపైగా ఎగుమతి చేశాము. మిగిలినవి కూడా గడువులోగా పంపిస్తాము. పరిశ్రమలో రకరకాల వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంటాము. 2021–2023 వరకు మూడు పర్యాయాలు బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేశాము. నిత్యం 150మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది. – వనం రాజు, మారుతీ కోటెక్స్ పరిశ్రమ మేనేజర్ -
కార్మికుల ప్రాణాలు.. గాలిలో దీపాలు!
సాక్షి, యాదాద్రి : పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కనీస భద్రతాప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ ఏడాది పెద్ద కందుకూరు, కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీల్లో నాలుగు సార్లు ప్రమాదాలు జరగగా.. ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. హైరిస్క్ ఉన్న ఈ పరిశ్రమల్లో అధికారుల తనిఖీలు రికార్డులకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీలకు మీనమేషాలు..పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధిక రిస్క్ ఉన్న ఫ్యాక్టరీలు, పరిశ్రమలను తక్షణమే తనిఖీ చేయాలని ప్రభుత్వం జీవో 331 జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 6న కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా తనిఖీల కమిటీలను ఏర్పాటు చేశారు. అయినా ఇంత వరకు జిల్లాలో ఉన్న హైరిస్క్ పరిశ్రమల్లో తనిఖీలు ప్రారంభించలేదు. దీంతో జిల్లాలోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలు, రసాయన, ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల పరిశ్రమల్లో జరిగిన ప్రమాద ఘటనల వివరాలు ● 2024లో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలి కార్మికుడు చనిపోయాడు. అదేవిధంగా భువనగిరిలోని ఇండస్ట్రియల్ పార్కులో రియాక్టర్ పేలి కార్మికులు గాయపడ్డారు. అదే సంవత్సరం బీబీనగర్ గ్రామ శివారులోని శ్రీయా కంపెనీలో అణు రియాక్టర్ పేలింది. గతంలోనే బీబీనగర్ మండలం నెమరగోముల వద్ద గల కంపెనీలో రియాక్టర్లు పేలి ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు. ఈ ఘటన అనంతరం ఆ కంపెనీ మూతపడింది. ● ఈ ఏడాది జనవరి 4న పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో ప్రొడక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్లో ఫైర్ డివైసెస్ ఫిల్లింగ్, ప్రెస్సింగ్ బ్లాక్లో కెమికల్ పెల్లెట్స్ను తూకం వేసే సెక్షన్లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయాడు. మరికొందరు గాయపడ్డారు. ఇదే కంపెనీలో 2012, 2019, 2020లో జరిగిన ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ● ఏప్రిల్ 29న మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. ● జూలై 7న ప్రీమియర్ పరిశ్రమలో పీఆర్డీసీ బ్లాక్– 2లో కెమికల్ను తూకం వేస్తున్న క్రమంలో కెమికల్ మధ్య రాపిడి ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ● మంగళవారం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో స్టీమ్ పైప్ ఓపెన్ చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో సదానందం అనే కార్మికుడు మృతి చెందాడు. ఎక్స్ప్లోజివ్, ఫార్మా కంపెనీలకు అడ్డా.. భువనగిరి, రాయిగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడలోని రాయిగిరి, నెమరగోముల, కొండమడుగు, బీబీనగర్, యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరు, మోటకొండూరు మండలం కాటేపల్లి, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, దండు మల్కాపురం, దేవలమ్మ నాగారం, ఎల్లంబావి, తంగడపల్లి, చౌటుప్పల్, ధర్మోజిగూడెం, లింగోజి గూడెం, ఆరెగూడెం, పంతంగి, ఎస్,లింగోటం మందోళ్ల గూడెం, చిన్న కొండూరు, జైకేసారం, పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, ఆలేరు మండలం టంగుటూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పేలుడు పదార్థాల పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆలేరులో విషాదం ఆలేరు: ఉన్న ఊరిని కన్న వారిని వదిలి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కార్మికుడి మృతి బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపింది. గోదావరిఖని ప్రాంతానికి చెందిన సదానందం(48) ఉద్యోగం రీత్యా భార్య అఖిల, ఇద్దరు కుమారులతో ఆలేరుకు వచ్చి స్థిరపడ్డాడు. మైత్రి కాలనీలో నివాసం ఉంటున్నారు. పెద్దకుమారుడు శ్రీరామ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. చిన్నకుమారుడు శ్రీనాథ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సదానందం దాదాపు 25ఏళ్లుగా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కార్మిక యూనియన్లోనూ చురుకుగా వ్యవహరించే సదానందం మంగళవారం కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందడంతో మైత్రి కాలనీలోని ఆయన ఇంటి వద్ద విషాదం అలుముకుంది. ఆలేరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్యూటీ షిఫ్ట్ ఛేంజ్? సదానందం మంగళవారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా, ఉదయం షిఫ్ట్కి మార్చుకున్నట్లు తెలిసింది. అయితే యూనియన్ సమావేశానికి హాజరుకావాలనే ఆలోచనతో ఉదయం షిఫ్ట్కు హాజరైనట్లు సమాచారం. ఫ పరిశ్రమల్లో తరచూ సంభవిస్తున్న ప్రమాదాలు ఫ కనీస భద్రతాప్రమాణాలు పాటించని యాజమాన్యాలు ఫ తనిఖీలు నిర్వహించని సంబంధిత అధికారులు ఫ ఈ ఏడాది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో నాలుగు సార్లు ప్రమాదాలు జరగగా.. ఆరుగురు కార్మికులు మృతి -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈనెల 13 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు 08685293312 నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు వివరించాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోలీస్, రెవెన్యూ, వైద్య, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిల భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రావద్దన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, వివిధ శాఖ ల అధికారులు పాల్గొన్నారు. భువనగిరి జోన్ డీసీపీ అక్షాంశ్యాదవ్తో సమావేశమై వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఫ భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు ఫ అత్యవసర పరిస్థితుల్లో 08685293312 నంబర్కు ఫోన్ చేయాలని సూచన -
గురుకుల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
కట్టంగూర్: రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించి మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీరు, గదులకు కిటీకీలు, టాయిలెట్స్కు తలుపులు, భోజన సదుపాయాలు సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో సీట్ల కోసం పోటీ ఉండేదని, నేడు గురుకుల విద్య అంటేనే భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మెనూ విస్తరించిందని గొప్పలు చెప్పుకుంటున్నా గురుకులాల్లో అమలుకావడం లేదనన్నారు. భోజనంలో నాణ్యత లేక అనేక మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, పెద్ది బాలనర్సింహ, దాసరి సంజయ్, రెడ్డిపల్లి మనోహర్, పోతరాజు నాగేష్ ఉన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
బాలికపై అత్యాచారం.. తల్లికి 22ఏళ్ల జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): కన్న కూతురిపై అత్యాచారం జరగడానికి కారణమైన తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన గ్యారాల శివకుమార్ బీటీఎస్కు చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నంచగా తిరస్కరించింది. బలవంతంగా బాలిక దుస్తులు విప్పి వీడియోలు తీసి, శారీరకంగా అనుభవించాడు. శివకుమార్కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాధిత బాలిక 2023 మే 8న నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లి యాదమ్మ, శివకుమార్పై ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ.. ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఏ1గా ఉన్న గ్యారాల శివకుమార్ ఉదయం కోర్టుకు వచ్చినట్లే వచ్చి పారిపోయాడు. అతడు కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. తదుపరి కోర్టు ముందు హాజరుపర్చిన రోజు శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. ఏ2 యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలు వినిపించారు. పదేళ్లు జైలు శిక్ష.. రామగిరి(నల్లగొండ), మర్రిగూడ: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన పోలె నరేష్ 2016 ఆగస్టు 22న అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ కె. బలరాం పోలె నరేష్పై పోక్సో కేసు నమోదు చేయగా.. అప్పటి నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా జడ్జి రోజారమణి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కారు డ్రైవర్కు..కట్టంగూర్: ప్రమాదంలో కారుతో మహిళను ఢీకొని ఆమె మృతికి కారణమైన డ్రైవర్కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమనా విధిస్తూ నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 మార్చి 18న శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన బట్టా సుమన్ తన బంధువైన మందుల పరిమళను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామం నుంచి అయిటిపాములలో శుభకార్యానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చెర్వుఅన్నారం క్రాస్రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా.. ఖమ్మం జిల్లా వేపకుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ అంగోతు కిశోర్కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో అజాగ్రత్తగా, అతివేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మందుల పరిమళ తలకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమన్ తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ విజయ్ప్రకాశ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్ఐ తెలిపారు. అత్యాచారం కేసులో 20 ఏళ్లు.. రామగిరి(నల్లగొండ): మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన వీరంశెట్టి సాంబశివ 2017 ఏప్రిల్ 15న అదే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన బాలికను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రోజారమణి నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరించడంలో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులుగా జె. రవీందర్, ఏ. రమేష్బాబు, జె. శివకుమార్ వ్యవహరించారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
నకిరేకల్: పట్టపగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీకు పాల్పడుతున్న యువకుడు, బాలికను నకిరేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను మంగళవారం సాయంత్రం నకిరేకల్ పోలీస్ స్టేషన్లో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 3వ తేదీన నకిరేకల్ పట్టణంలోని చీమలగడ్డలో పరడ సుమలత ఇంటి తాళం పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. స్కూటీపై ఓ యువకుడు, బాలిక తిప్పర్తి నుంచి నకిరేకల్ వైపు వస్తుండగా పోలీసులు వారిని ఆపి విచారించారు. యువకుడు కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన వల్లమల్ల ప్రదీప్కుమార్ అలియాస్ బంటిగా పోలీసులు గుర్తించారు. బాలిక ఏపీకి చెందినదిగా గుర్తించారు. ప్రదీప్ నార్కట్పల్లి మండలం కేంద్రంలో తన అమ్మమ్మ వద్ద ఉంటూ బాలికతో కలిసి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రదీప్కుమార్ గతంలో నకిరేకల్, శాలిగౌరారం, కట్టంగూర్, నల్లగొండ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 దొంగతనాలకు పాల్పడి ఎనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. జైలు నుంచి వచ్చాక ఏపీకి చెందిన బాలికతో పరిచయం పెంచుకుని, చెడు వ్యసనాలకు బానిసై మళ్లీ చోరీలు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ క్రమంలోనే వారిద్దరు కలిసి నకిరేకల్, కట్టంగూర్, చిట్యాల, నార్కట్పల్లి, నల్లగొండలో పట్టపగలు తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని చోరీలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.7.84లక్షల విలువైన ఐదు తులాల బంగారం, 119 తులాల వెండి ఆభరణాలు, రూ.45 వేల నగదు, స్కూటీ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను పట్టుకున్న నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు లచ్చిరెడ్డి, క్రిష్ణాచారి, పోలీస్ సిబ్బంది మధుకర్, వెంకటేశ్వర్లు, జనార్దన్, శ్రీకాంత్, శ్రీను, సురేష్, సుధాకర్, నాగర్జున, శ్రీనివాస్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించి రివార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో శాలిగౌరారం సీఐ కొడల్రెడ్డి, నకిరేకల్ ఎస్ఐలు లచ్చిరెడ్డి, క్రిష్ణాచారి పాల్గొన్నారు. ఫ చోరీలకు పాల్పడుతున్న యువకుడు, బాలిక ఫ ఇద్దరిని అరెస్ట్ చేసిన నకిరేకల్ పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
21న వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్: కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గుజరాత్లో జరిగే వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ క్యాంపునకు వెళ్లేందుకు గాను మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో అర్హులైన వలంటీర్లను ఈ నెల 21న ఎంపిక చేయనున్నట్లు ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పసుపుల మద్దిలేటి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని ఎన్ఎస్ఎస్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు. అదుపుతప్పిన స్కూల్ బస్సుమోత్కూరు: స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి జారింది. ఈ ఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం రహదారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మోత్కూరు మండల కేంద్రంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలకు చెందిన బస్సు సుమారు 35 మంది విద్యార్థులతో ఆరెగూడెం మీదుగా పాలడుగుకు వెళ్తుండగా.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి జారింది. భయాందోళనకు గురైన విద్యార్థులు ఎమర్జెన్సీ ద్వారం ద్వారా బస్సులో నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
నాలుగు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి: హైదరాబాద్ నగరంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు మూసీ ప్రాజెక్టుకు 9,692 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. అధికారులు నాలుగు క్రస్టు గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి 12,805 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 643.50 వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరదనీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.0 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. -
విద్యార్థులను పర్యావరణ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలి
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులను పర్యావరణ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం ఎంజీయూలో పర్యావరణ పరిరక్షణ, ఘన వ్యర్థాలు, పర్యావరణ పునరుద్ధరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కు చెందిన టీడీ స్వచ్ఛంద సంస్థతో ఎంజీయూ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. యువత పర్యావరణ పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలన్నారు. యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ సోషల్ వర్క్, బయో కెమిస్ట్రీ కామర్స్, ఎకనామిక్స్ విద్యార్థులు తమ పరిశోధనలో పర్యావరణ అవసరాలను ఎంచుకోవాలన్నారు. అనంతరం టీడీ సంస్థ డైరెక్టర్ ఉత్సవ్ ప్రధాన్ తమ సంస్థ ద్వారా విద్యార్థులతో చేపట్టనున్న కార్యక్రమాల ప్రణాళికను వివరించారు. నల్లగొండ జిల్లా హాలియా మండలం కొత్తపల్లిలో తమ సంస్థ చేపట్టిన పరిశోధన వివరాలతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో ప్లాస్టిక్ రహిత పట్టణాల కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ ఇండస్ట్రీ అకడమిక్ సెల్ డైరెక్టర్ సురేష్రెడ్డి, మిర్యాల రమేష్, ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్, అధ్యాపకులు తిరుమల, రామచందర్గౌడ్, శివరాం, సమ్రిన్ కాజ్మి, మురళి పాల్గొన్నారు.గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణంకోదాడరూరల్: టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలో మంగళవారం జరిగింది. చిలుకూరు మండలం సీత్లాతండాకు చెందిన ఇస్లావత్ హీరు(45) పని నిమిత్తం మంగళవారం టీవీఎస్ ఎక్సెల్పై కోదాడకు వస్తున్నాడు. హైదరాబాద్–విజయవాడ హైవేపై కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్లో ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లో కట్టకమ్ముగూడెం క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేందుకు వెళ్లాడు. అక్కడ క్రాసింగ్ను మూసివేయడంతో అదే మార్గంలో రాంగ్రూట్లో ఫైఓవర్ వైపు వస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.బైక్ చక్రంలో చీరకొంగు చిక్కుకొని..కిందపడిన తల్లి, కుమారుడుచికిత్స పొందుతూ తల్లి మృతిచౌటుప్పల్: బైక్ చక్రంలో చీరకొంగు చిక్కుకొని తల్లి, కుమారుడు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తల్లి మృతిచెందింది. మంగళవారం చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన బోయ సాయమ్మ(70), ఆమె కుమారుడు భిక్షం ఆదివారం చిన్నకొండూర్లో బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్లారు. అంత్యక్రియలు ముగిశాక ఇద్దరు కలిసి స్వగ్రామానికి బయల్దేరారు. చౌటుప్పల్ శివారులోని శ్రీని ఫార్మా కంపెనీ సమీపంలోకి రాగానే సాయమ్మ చీరకొంగు బైక్ వెనుక చక్రంలో చిక్కుకుంది. దీంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో సాయమ్మ, భిక్షం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వారిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయమ్మ సోమవారం రాత్రి మృతిచెందింది. భిక్షం చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కోడలు బోయ అరుణ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
రైతులు నష్టపోకుండా డబ్ల్యూడీఆర్ఏ ఏర్పాటు
అడ్డగూడూరు: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను తక్కువ ధరకు అమ్మి నష్టపోతూన్నారని, దీని నివారణకు భారత ప్రభుత్వం వేర్హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ(డబ్ల్యూడీఆర్ఏ) ఏర్పాటు చేసిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్(ఐసీఎం) ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్కుమార్ తెలిపారు. అడ్డగూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో డబ్ల్యూడీఆర్ఏపై సోమవారం రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర లేక, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేక చేసిన అప్పులు తీర్చడానికి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారన్నారు. ఈ పరిస్థితిని నివారించి అధిక ధర వచ్చినప్పుడు పంటను అమ్ముకునే సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఎక్కడికక్కడ వేర్హౌసింగ్ గోదాములను ఏర్పాటు చేసిందన్నారు. అడ్డగూడూరు మండలంలో చౌల్లరామరం గ్రామంలో గోదాములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తాము పండిచిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఈ గోదాముల్లో నామమాత్ర రుసుముతో పంట నిల్వ చేసుకోవచ్చని సూచించారు. నిల్వ చేసిన పంటపై 80శాతం వరకు బ్యాంకులు తక్షణ రుణ సదుపాయం కల్పిస్తాయని తెలిపారు. అనంతరం చౌల్ల రామారంలోని గోదాముల వద్దకు రైతులను తీసుకెళ్లి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా రైతులకు శిక్షణ కిట్లు, మెటీరియల్, రూ.300 చొప్పున స్టైఫండ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఎం డైరెక్టర్ గణేషన్, యాదాద్రి భువనగిరి డీసీఓ శ్రీధర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామనర్సయ్య, సీనియర్ ఇన్స్పెక్టర్ శ్యామ్కుమార్, సీఈఓ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య, మాజీ చైర్మన్(డైరెక్టర్) పొన్నాల వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు అశోక్రెడ్డి, పోగుల నర్సిరెడ్డి, వీరస్వామి, వేముల భిక్షం తదిరతులు పాల్గొన్నారు. ఐసీఎం ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్కుమార్ -
కృష్ణా జలాలు వృథాగా వదిలేస్తున్నారు
● నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నల్లగొండ: కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో వదిలేస్తున్నారు తప్ప జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించడంలో లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం రైతులతో నల్ల గొండకు వచ్చిన ఆయన కలెక్టర్ను కలిసి భూములకు సాగునీరు అందించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాగర్ నుంచి పులిచింతల మీదుగా కృష్ణా జలాలను వృథాగా వదిలేస్తున్నారని.. నకిరేకల్, శాలిగౌరారం మండలాల్లోని పొలాలకు నీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీలో 4 మోటార్లు ఉంటే 3 మోటార్లు నడుస్తున్నాయని, మిగతా మోటారు ఎందుకు నడవడం లేదన్నారు. బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి.. ప్రాజెక్టుకు ఒక రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. జిల్లాలో నీటిపారుదల మంత్రి ఉన్నా.. తాగు, సాగు నీరు సక్రమంగా అందకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికై నా ఎస్ఎల్బీసీ 4వ మోటారు నడిపి జిల్లాలోని చెరవులు, కుంటలు నింపాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుపోవడంపైనే దృష్టి పెట్టారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఆయన వెంట కొండూరు శంకర్గౌడ్, ప్రదీప్రెడ్డి, వడ్డె సైదిరెడ్డి, బైరెడ్డి కరుణాకర్రెడ్డి, యానాల అశోక్రెడ్డి, శ్రీధర్రెడ్డి ఉన్నారు. -
సమస్యలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్తా
చౌటుప్పల్ : ట్రిపుల్ఆర్ బాధితుల సమస్యలను కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రాంచందర్రావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులు సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. బాధితులు మాట్లాడుతూ చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొక్కి ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చిందన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నడుమ 40కిలోమీటర్ల దూరం ఉండాల్సి ఉన్నప్పటికీ కేవలం 28కిలోమీటర్లకే పరిమితం చేశారని వాపోయారు. కొంతమంది వ్యక్తులు, సంస్థల ప్రయోజనం కోసం ముందుగా రూపొందించిన అలైన్మెంట్ను మార్చారని ఆరోపించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై మూడేళ్లుగా పోరాడుతున్నామని గుర్తుచేశారు. తమకు అధికారం వస్తే అలైన్మెంట్ను మారుస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ హామీ ఇచ్చారని తెలిపారు. ఆ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ సైతం హామీ ఇచ్చనట్లు గుర్తు చేశారు. అధికారం వచ్చాక తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మరింత అన్యాయం చేస్తున్నారని వారు ధ్వజజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు మాట్లాడుతూ రైతులు, నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. ఉత్తర భాగంలోని సమస్యను మరోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జాల వెంకటేష్యాదవ్, నాగవెల్లి దశరథగౌడ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హైదరాబాద్లో వినతిపత్రం అందజేసిన ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులు -
మేకలు, గొర్రెలు అపహరించేందుకు యత్నం
హుజూర్నగర్: గుర్తుతెలియని వ్యక్తులు మేకలు, గొర్రెలు అపహరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామంలోని బూరుగడ్డ రోడ్డులో షేక్ నాగులమీరాకు చెందిన మేకలు, గొర్రెలను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో తరలించేందుకు యత్నించారు. ఈ క్రమంలో అలికిడి విని నాగుల్మీరా కుటుంబ సభ్యులు లేచి కేకలు వేయడంతో దొంగలు జీవాలను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. గ్రామంలో గతంలో ఓ బైక్ కూడా చోరీకి గురైందని గ్రామస్తులు తెలిపారు. రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్ఐ బలరామిరెడ్డి తెలిపారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో సోమవారం భువనగిరి పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించి నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా భువనగిరి పట్టణంలోని రామ్నగర్లో నివాసముంటున్న చిన్నం శ్రీశైలం ఇంట్లో భారీ ఎత్తున నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారి సమాచారం పోలీసులకు ఇస్తే.. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు లక్ష్మీనారాయణ, లక్ష్మీనరసయ్య, నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశయం లేనివాడే పేదవాడు
ఆలేరు: డబ్బులేని వాడు కాదు.. జీవితంలో ఆశయం లేనివాడే పేదవాడు అని స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకుసాగాలని హైదరాబాద్లోని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానందజీ మహరాజ్ అన్నారు. సోమవారం ఆలేరు పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరి పైన ఆధారపడకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దేందుకు యువత అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థి దశలోనే క్రమశిక్షణను అలవర్చుకోవడంతో జీవితం విలువ తెలుస్తుందన్నారు. సామాజిక స్పృహ, సేవాగుణం పెంపొందించుకోవడం వల్ల నాయకత్వ లక్షణాలు అబ్బుతాయన్నారు. స్వామి వివేకానంద, బుద్ధుడు, అబ్దుల్ కలాం లాంటి మహానీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాలక్షేపం, విలాస జీవితం, మత్తు పదార్థాలమయంగా సమాజం మారిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెడు ఆలోచనలు, అలవాట్లను ఆదిలోనే తుంచివేయాలని విద్యార్థులకు సూచించారు. శ్రీరామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్య బండిరాజుల శంకర్ మాట్లాడుతూ.. భారత సంస్కృ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిన చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. అనంతరం బోధమయానందజీని బండిరాజుల శంకర్ ఘనంగా సన్మానించారు. క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు స్వామిజీ బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్వావలంబి భారత్ అభియాన్ కన్వీనర్ జి. రమేష్, పాఠశాల కార్యదర్శి తిరుపతమ్మ, ఆలేరు ఉన్నత పాఠశాల ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శ సజన్కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోధమయానందజీ మహరాజ్ -
కోదాడ పట్టణంలో ట్రాఫిక్ జామ్
కోదాడరూరల్: కోదాడ పట్టణ పరిధిలోని హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఉదయం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పరిధిలోని కొమరబండ వైజంక్షన్, కట్టకమ్ముగూడెం వద్ద రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ఆ రెండు చోట్ల ఉన్న క్రాసింగ్లను పూర్తిగా మూసివేశారు. రెండు దారులను మూసివేయడంతో ఇటు కోదాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు, హైదరాబాద్ నుంచి కోదాడ పట్టణంలోకి వచ్చే వాహనాలు, ఖమ్మం వైపు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్లే వాహనాలు అటువైపు నుంచి విజయవాడ ,హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద గల బ్రిడ్జినే ఏకై క మార్గం. దీంతో పాటు ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు కోదాడ పరిసర ప్రాంతాల నుంచి పట్టణంలోకి వచ్చేవారు, విద్యాసంస్థల వాహనాలన్నీ వచ్చిపోతుంటాయి. దీంతో హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద కోదాడ వైపుతో పాటు హుజూర్నగర్, హైదరాబాద్ వైపు గల సర్వీస్ రోడ్లో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పట్టణ, ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని దాదాపుగా గంటకు పైగా శ్రమించి వాహనాలను నెమ్మదిగా కదిలిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు ఇబ్బందులు పడిన వాహనదారులు -
విద్యార్థుల ప్రతిభకు ఉపకారం
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్(ఎన్ఎంఎంఎస్)ను అమలు చేస్తోంది. 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఈ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. చురుకుదనం, తెలివితేటలు, చదువుపై పట్టు ఉన్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కారాదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. గతంలో ఈ స్కీమ్కు ఎంపికై న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.6వేల చొప్పున 9, 10, ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి రూ.24 వేలను అందించేవారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని రెండింతలు చేసింది. ప్రతి సంవత్సరం కేటాయించే మొత్తాన్ని రూ.12వేలకు పెంచింది. అంటే 4 సంవత్సరాలకు కలిపి విద్యార్థులు రూ.48 వేలు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు నవంబర్లో అర్హత పరీక్ష నిర్వహిస్తారు. నిబంధనలు ఇవీ.. ఈ మెరిట్ స్కాలర్షిప్ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులవుతారు. 7వ తరగతిలో ఓసీ, బీసీలు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు పొంది తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు కలిగి ఉన్న వారు అర్హులు. పాస్పోర్టు సైజు ఫొటోలతో పాటు ఆధార్, ఆదాయం, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 డీడీ బ్యాంకులో తీసి డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. 31 వరకు ఎన్ఎంఎంఎస్ దరఖాస్తునకు గడువు -
నీరా కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలి
భువనగిరిటౌన్ : గీత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో నిర్మించిన నీరా కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలో నిర్వహించిన కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న గీతకార్మికుల ఎక్స్గ్రేషియా డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. తమ వృత్తిలో భాగంగా మృతిచెందిన, గాయపడిన 710 మంది కల్లుగీత కార్మికులకు మంజూరైన రూ.12.60కోట్ల ఎక్స్గ్రేషియా డబ్బులను సంవత్సరం గడిచినా చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గీత కార్మికుల సంక్షేమానికి అనేక హామీలను ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఇప్పటివరకు వాటిని అమలు చేయడంలేదన్నారు. గీత కార్మికులను ఎలక్షన్ల సమయంలో కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గీత కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. గీత కార్మికులకు పెన్షన్ రూ.4000 ఇవ్వాలని, మెడికల్ బోర్డు నిబంధనను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నెమిలె మహేందర్, మద్దెల రాజయ్య, ధూపాటి వెంకటేష్, అంతటి అశోక్, బత్తిని భిక్షం, జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల భిక్షపతి, కోరుకొప్పుల కిష్టయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, మారగోని అశోక్, మారగోని శ్రీరామ్ మూర్తి, గడ్డమీది దశరథ, ఎర్ర రవీందర్, చెరుకు మల్లేశం, కొండం రఘురాములు, పాండవుల లక్ష్మణ్ ఉన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ -
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
చింతపల్లి: మద్యానికి బానిసై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చింతపల్లి మండలం మదనాపురం గ్రామ సమీపంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం పాలెంతండా గ్రామానికి చెందిన సపావత్ రమేష్(40) మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉంటాడని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తండాకు వచ్చే దారిలో మదనాపురం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన మృతిచెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరం డీ హైడ్రేషన్కు గురై మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి అదృశ్యందేవరకొండ: దేవరకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో నివాసముంటున్న వల్లపు శ్రీనయ్య ఈ నెల 5వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీనయ్య కుమారులు సోమవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. శ్రీనయ్య ఇంటి నుంచి వెళ్లినప్పుడు నలుపు రంగు షర్ట్, తెల్ల లుంగి ధరించినట్లు తెలి పారు. ఆచూకీ తెలిసిన వారు 8712670154ను సంప్రదించాలని సూచించారు.గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంమిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరామ ఫైనాన్స్ సమీపంలో గల ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు బూడిద రంగు ఆఫ్ షర్ట్, పెద్ద గల్లు గల లుంగీ ధరించి ఉన్నాడని, సుమారు 40 నుంచి 45 ఏళళ్ల వయస్సు కల్గి ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతుడు కొంతకాలంగా గ్రామంలో భిక్షాటన చేస్తున్నాడని స్థానికులు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712670189, 8712670151 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతినాగారం: సూర్యాపేట– జనగామ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన గొలుసుల నరేష్(27), గొలుసుల ప్రశాంత్ (23) వరుసకు అన్నదమ్ముళ్లు. ఇద్దరు కలిసి ఆదివారం రాత్రి పని నిమిత్తం స్వగ్రామం నుంచి బైక్పై సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో నాగారం మండల పరిఽధిలోని ఫణిగిరి గ్రామ శివారులో సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రశాంత్కు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతులిద్దరు అవివా హితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఎం. ఐలయ్య తెలిపారు. -
వెంబడించి.. దొంగలను పట్టుకొని..
మద్దిరాల: మహిళ మెడలో పుస్తెలతాడు అపహరించి పారిపోతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను సోమవారం మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామ శివారులో యువకులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మద్దిరాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్కుమార్, శుభంకుమార్ కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మాటేడు గ్రామానికి చెందిన ముత్యం ప్రేమలీల మెడలో సోమవారం పుస్తెలతాడును అపహరించి బైక్పై దంతాలపల్లి మీదుగా సూర్యాపేట జిల్లా మద్దిరాల వైపు రాగా.. దంతాలపల్లి పోలీసుల సమాచారం మేరకు మద్దిరాల పోలీసులు మద్దిరాల మండల కేంద్రంలోని కనకదుర్గ హోటల్ వద్ద వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దొంగలు బైక్ను రోడ్డు పైనే వదిలేసి చెల్కలల్ల మీదుగా పోలుమల్ల వైపు వెళ్తుండగా.. పోలీసుల సమాచారం మేరకు రెండు గ్రామాల యువకులు దొంగలను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగలు ఉపయోగించిన బైక్ కూడా ఖమ్మంలో అపహరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దొంగలను తొర్రూర్ పోలీసులకు అప్పజెప్పినట్లు మద్దిరాల ఎస్ఐ ఎం. వీరన్న తెలిపారు. యువకులను అభినందించిన ఎస్ఐ దొంగలను పట్టుకున్న మద్దిరాల, పోలుమల్ల గ్రామాల యువకులను ఎస్ఐ ఎం. వీరన్న పోలీస్ స్టేషన్లో అభినందించారు. పోలీసులకు అప్పగించిన యువకులు -
సకాలంలో ఇంటి బిల్లు!
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. వివిధ దశల్లో పూర్తయిన నిర్మాణాలకు బిల్లులు అందడం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్ర పర్యటనకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. జూలై 31న హౌసింగ్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతం జిల్లా పర్యటనలోనూ లబ్ధిదారులు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇంటి పునాది, గోడలు, లెంటల్, స్లాబ్ వరకు ప్రతి పని వివరాలను లబ్ధిదారు పేరున ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో పాటు ఏ అధికారి పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం జరుగుతుందనే సమాచారాన్ని సైతం ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. తద్వారా బిల్లు ఎందుకు పెండింగ్ ఉంది, అందుకు కారణాలను తన మొబైల్లో సంబంధిత యాప్లో తెలుసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పించింది. దీంతో సమస్యను గుర్తించి వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఏర్పడింది. ఆధార్ లింక్ కలిగిన ఖాతాకు జమ బిల్లు మంజూరులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆధార్ అనుసంధానం కలిగిన బ్యాంక్ ఖాతాలో బిల్లు జమ చేస్తోంది. ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో తీసిన లబ్ధిదారుల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేసిన వివరాల ఆధారంగా బిల్లు మంజూరయ్యేది. కానీ బ్యాంకులు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల జాప్యం అవుతోంది. దీన్ని నివారించడానికి అధార్ పేమెంట్ బిల్ విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుకు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నా తాజాగా లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాలోనే బిల్లు జమకానుంది. వెబ్సైట్లో మార్పులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేసింది. అదే విధంగా వెబ్సెట్లో పలుమార్పులు తీసుకువచ్చి ఇళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంది. దీంతో లబ్ధిదారులు బిల్లు కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎక్కడినుంచైనా తమ సెల్ఫోన్ ద్వారా ఇంటి ప్రగతిని తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. లబ్ధిదారు రేషన్, ఆధార్కార్డు, సెల్ఫోన్.. వీటిలో ఏ నంబర్తో అయినా indirammaindlu telangana.gov.in వెబ్సైట్లో లాగిన్ కావచ్చు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఇంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి చెక్ ఫ ఏరోజుకారోజు ఆన్లైన్లో పనుల వివరాలు నమోదు ఫ ఆలస్యానికి కారణాలు నేరుగా తెలుసుకునే అవకాశం ఫ సమస్యలను సరిదిద్దుకునేందుకు లబ్ధిదారులకు వెసులుబాటు తొలి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన గృహాలు 9,398పనులు మొదలుకానివి 1857మార్కింగ్ ఇచ్చినవి 7,541బేస్మెంట్ లెవల్ 3,669రూప్ లెవల్ 346స్లాబ్ దశలో.. 145 పూర్తయిన గృహాలు 04 ఆధార్ ప్రకారం చెల్లింపులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆధార్ బేస్డ్ ఆధారంగా 1,071 మందికి బిల్లులు మంజూరు చేశాం.శ్లాబ్, లెంటల్, రూప్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులందరి ఖాతాల్లో బిల్లులు జమయ్యాయి. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆధార్ బేస్డ్ చెల్లింపులు చేస్తున్నాం. –విజయ్సింగ్, హౌసింగ్ పీడీ -
భూ సమస్యలపైనే అధికం..
భువనగిరిటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజవాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 45 మంది అర్జీలు అందజేశారు. అందులో భూ సమస్యలకు సంబంధించినవి 30 అర్జీలు ఉన్నాయి. కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి వినతిపత్రాలు స్వీకరించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ● బీబీనగర్లోని ఐదెకరాల గ్రామకంఠం భూమిని పంచాయతీ వారు స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోజనాలకు వినియోగించాలని గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్కు విన్నవించారు. ● ఆత్మకూర్(ఎం) మండలం పారుపల్లిలోని జమ్మికుంటను కొందరు అక్రమించారని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. కుంట ఆక్రమణకు ముందు నీరు నిల్వ ఉండడం వల్ల పశువులు, గొర్రెలకు ఎంతో ఉపయోగంగా ఉండేదన్నారు. కుంటను కాపాడాలని మల్లేష్, నర్సయ్య, యాదగిరి, భిక్షపతి, సత్తిరెడ్డి కోరారు. ● కుక్కల దాడిలో 72 గొర్రెలు మృతి చెంది సుమారు రూ.8లక్షల నష్టపోయానని.. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన సంపత్ వినతిపత్రం అందజేశాడు. ఆయన వెంట జల్లి నర్సంహులు, బైల సాయిమల్లయ్య, ఎగ్గడి శ్రీశైలం, జూకంటి సాయిమల్లయ్య, కావడి బక్కయ్య, వెంకటయ్య, బాల్నర్సయ్య ఉన్నారు. ఫ ప్రజావాణికి 45 అర్జీలు ఫ సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ -
మదర్ డెయిరీ నిర్వీర్యానికి కుట్ర
యాదగిరిగుట్ట: కాంగ్రెస్ ప్రభుత్వం మదర్ డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆరు బిల్లులు పెండింగ్ పెట్టడంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే రూ.30 కోట్ల గ్రాంట్, రైతులకు ప్రోత్సాహక డబ్బులు విడుదల చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పాడి రైతులను నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు మోసం చేశారని విమర్శించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయి సంస్థ మునిగిపోయే స్థితిలో ఉందని.. అందుకు చైర్మన్ మధుసూదన్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కారణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి విజయ డెయిరీకి రూ.100 కోట్ల గ్రాంటు ఇచ్చారని, మదర్ డెయిరీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ రైతు సంక్షేమానికి, పాల ఉత్పత్తిదారులకు పెద్ద పీఠ వేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందన్నారు. సంస్థ ఆస్తులను అమ్మడం కాదు.. లాభాల్లోకి తీసుకురావాలన్నారు. రేవంత్రెడ్డి మెడలు వంచైనా, కాళ్లు పట్టుకోనైనా పెండింగ్ బిల్లులు, బోనస్ తీసుకురావాల్సిన బాధ్యత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యదేనన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు పెండింగ్ పాల బిల్లులు ఇవ్వకుంటే రైతులతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మదర్ డెయిరీ డైరెక్టర్లు కస్తూరి పాండు, కందాల అలివేలు రంగారెడ్డి, మాజీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, ఒగ్గు భిక్షపతి, పాల సంఘం చైర్మన్లు సందిళ్ల భాస్కర్గౌడ్, మారెడ్డి కొండల్రెడ్డి, పుప్పాల సిద్ధులు, దడిగే మధు, సతీష్రెడ్డి, వెంకట్రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు. ఫ పెండింగ్ బిల్లులు, బోనస్ చెల్లించకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తాం ఫ బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి -
పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు
భువనగిరి: పదో తరగతి వార్షిక పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మాదిరిగానే రాత పరీక్ష 80 మార్కులు, ఇంటర్నల్ మార్కులు 20 చొప్పున ఉంటాయి. ఈ విధానం 2014–15 నుంచి అమల్లో ఉంది. కాగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక శాతం విద్యార్థులకు 20కి 20 ఇంటర్నల్ మార్కులు వేస్తున్నాయని, దీంతో విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని 100 మార్కులతోనే వార్షిక పరీక్షలు ఉంటాయని గత ఏడాది అక్టోబర్ 28 ప్రభుత్వం ప్రకటించింది. టెన్త్ విద్యార్థులు 8,652 మంది జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యా యి. మూడు నెలలు కావస్తున్నా వార్షిక పరీక్షలు 100 మార్కులతో నిర్వహించాలనే దానిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల్లో సందిగ్ధం నెలకొంది. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన కోసం ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పాత పద్ధతిలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలో 8,652 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఫ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాలవిద్యాశాఖ డైరెక్టర్ ఫ ఉపాధ్యాయ వర్గాల్లో వీడిన ఉత్కంఠ ఫ రాత పరీక్షకు 80, ఇంటర్నల్కు 20 మార్కులు -
డీసీసీబీ.. నంబర్ వన్!
రాష్ట్రంలోనే ఉత్తమ సహకార బ్యాంక్ అవార్డు సొంతం ఈ ఆర్థిక సంవత్సరం రూ.3,500 కోట్లకు పెంచడం లక్ష్యం ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యాపార లక్ష్యం రూ.3,500 కోట్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా రూ.70 కోట్ల లాభాలను సాధించేలా చర్యలు చేపడుతోంది. సహకార వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే మిగతా డీసీసీబీల కంటే నల్లగొండ డీసీసీబీ రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంది. దీంతో నాబార్డు ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ బ్యాంకు అవార్డుకు ఈసారి నల్లగొండ బ్యాంకును ఎంపిక చేసింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, ఇతర డైరెక్టర్లు, అధికారులకు అందజేసింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ డీసీసీబీ రాష్ట్రంలోనే ఉత్తమ బ్యాంకుగా నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఆర్థికంగా చేయూతను అందించి ముందంజలో నిలువడమే కాకుండా డిపాజిట్ల పెంపుతో వ్యాపార వృద్ధిని సాధించింది. మొండిబకాయి(ఎన్పీఏ)లను తగ్గించుకోవడంతోపాటు రూ.42 కోట్ల లాభాలను ఆర్జించి, రైతులు, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను నాబార్డు నల్లగొండ డీసీసీబీకి బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంకు అవార్డును అందజేసింది. లాభాల బాటలో.. నల్లగొండ డీసీసీబీ గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాన్ని రూ.2342.13 కోట్ల నుంచి రూ.2940.13 కోట్లకు పెంచింది. తద్వారా ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.598.16 కోట్లు వృద్ధిని సాధించింది. రాష్ట్రంలో ఏ ఇతర డీసీసీబీలు ఇంతగా వృద్ధి రేటును సాధించలేదు. ఇక లాభాల విషయంలోనూ రూ.22 కోట్ల నుంచి రూ. 42 కోట్లకు పెంచగలిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు రెట్టింపు లాభాలను గడించి ఉత్తమ బ్యాంకుగా నిలిచింది. గతంలో 1.85 శాతం ఉన్న మొండిబకాయి(ఎన్పీఏ)లను 1.38 శాతానికి తగ్గించుకొని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పంట రుణాల బడ్జెట్ పెంపు రైతులకు పంట రుణాల విషయంలోనూ ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు నాబార్డు గుర్తించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.110 కోట్లు రైతులకు రుణాలుగా అందించి వారి సంక్షేమం, అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క వానాకాలం సీజన్లోనే రైతులకు రూ.50 కోట్ల పంట రుణాలను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అవసరమైతే మరో రూ.50 కోట్లు రైతులకు పంట రుణాలుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచింది. అనుబంధ రంగాలకు ప్రాధాన్యం వ్యవసాయ అనుబంధ రంగాలైన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద రెతులకు కోళ్లు, కోళ్ల ఫారాలు, పాడి పరిశ్రమకు రుణాలు ఇస్తోంది. సొసైటీల ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడేలా గోదాముల నిర్మాణానికి రుణాలు, సహకార సంఘాలకు నాబార్డు రీఫైనాన్స్ ద్వారా కిసాన్ డ్రోన్లు ఇచ్చి బలోపేతానికి కృషి చేస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు కూడా ఇచ్చేలా చర్యలు చేపట్టింది.ఫ గత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.598.16 కోట్ల వృద్ధి ఫ మిగతా బ్యాంకులతో పోలిస్తే నల్లగొండ డీసీసీబీకి రెట్టింపు లాభాలు ఫ మొండి బకాయిలు తగ్గుదల ఫ రైతులకు చేయూత అందించడంలోనూ ముందంజ అందుబాటులోకి మరిన్ని సేవలు బ్యాంకు సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది రైతుల అభివృద్ధికి తోడ్పాటు అందించేలా చూస్తున్నాం. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో ఆరు కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. రైతులు, ఖాతాదారులకు ఉత్తమ సేవలను అందించడం ద్వారా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా పాలకవర్గం కృషి చేస్తోంది. – కుంభం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ -
గంజాయి రహిత జిల్లాగా మార్చుదాం
సాక్షి,యాదాద్రి : గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్లో పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్, ఎకై ్సజ్, డ్రగ్స్, వైద్య, విద్య, అటవీ, ఆర్టీసీ, సంబంధిత శాఖలు సమన్వయంతో గంజా యి రవాణాను అరికట్టాలని కోరారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూ చించారు. కళాకారుల ద్వారా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలని, విద్యాసంస్థలున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. డీసీపీ అక్షాంశ్యాదవ్ మాట్లడుతూ డ్రగ్స్ను అరికట్టే విషయంలో పోలీసు శాఖ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ల వద్ద పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీఎస్పీ లక్ష్మీనా రాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.ప్రారంభంలోనే ‘నులి’పేద్దాం భువనగిరి: నులి పురుగుల నిర్మూలనతోనే బాలారోగ్యం సాధ్యమని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం భువనగిరి పరిధిలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా రెండు దఫాలు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్బెంజడోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం మిగిలిపోయిన వారికి ఈనెల 18న మాత్రల పంపిణీ ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీఎంహెచ్ఓ మనోహర్, డీఈఓ సత్యనారాయణ, ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, ప్రదానోపాధ్యాయురాలు అండాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ఇన్చార్జ్ ఏఈ బాధ్యతల తొలగింపు!
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో రెగ్యులర్ అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నియామకం మాట దెవుడెరుగు..ఉన్న ఇన్చార్జ్ ఏఈని ఉన్నతాధికారులు తొలగించారు. దాంతో ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ, అభివృద్ధి పనుల పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలకు ఏఈగా సురేష్ కొంతకాలంగా కొనసాగుతున్న విషయం తెలసిందే. తాజాగా ఆయనకు మోత్కూరు మున్సిపాలిటీ బాధ్యతలు కూడా అధికారులు అప్పగించారు. నాలుగు మున్సిపాలిటీల్లో బాధ్యతలు నిర్వర్తించడం వీలుకాదనే కారణంతో ఆలేరు బాధ్యతల నుంచి సురేష్ను తప్పించినట్టు తెలిసింది. కొత్తగా ఎవరినీ నియమించలేదు. కొత్తగా ఎవరినైనా నియమిస్తారా? ఎలాగో అలా నెట్టుకొస్తారా.. అనేది వేచి చూడాల్సిందే మరి. శివుడికి రుద్రాభిషేకంయాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖ మండపంలో స్ప టికలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఈఓ వెంకట్రావ్, భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, అర్చన, ప్రాకారమండపంలో సుద ర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు చేశారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి భువనగిరి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని భువనగిరి పట్టణ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రత్నపురం శ్రీశైలం పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, మండపాల ఏర్పాటుకు ఇబ్బందులు కలగకుండా సహకరించేలా అధికారులతో చర్చిస్తామని చెప్పారు. భువనగిరి పట్టణంలోని అన్ని గణేష్ యూత్ అసోసియేషన్లతో నెల 19న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు, నిర్వాహకులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో ఉత్సవ సమితి గౌరవ సలహాదారులు సుర్వి శ్రీనివాస్గౌడ్, దేవరకొండ నర్సింహాచారి, ప్రధాన బెల్లంకొండ చందు, ఉపాధ్యక్షుడు రాజు, రాజ్కుమార్, సురేష్, తాడూరి కిష్టయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు మాతం ప్రదర్శన భువనగిరిటౌన్ : షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ప్రవక్త మహమ్మద్ (స.అ) మనువడు ఇమాం హుస్సేన్ (అ.స) ఆయన అనుచరులు 72 మంది బలిదానాన్ని స్మరిస్తూ (40 రోజులు, వారాలు) అర్బయీన్ పురస్కరించుకుని మంగళవారం భువనగిరిలో మాతం ప్రదర్శన నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రజా హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు ఖిలా పీర్ల చావడినుంచి జంప్ఖానగూడెంలోని హజ్రత్ ఆబ్బాస్ పీర్లకొట్టం మీదుగా, ఖాజీమోహల్లా బీబీకా అలావా పీర్ల చావడి వరకు మాతం ప్రదర్శన ఉంటుందన్నారు. యువత కత్తులతో ఎదను బాదుకుంటూ విషాద గీతాలు నోహా, మర్సియా పఠిస్తారని వెల్లడించారు. షియా మౌల్వి ముహమ్మద్ ఆలి ధార్మిక ప్రసంగం చేస్తారని పేర్కొన్నారు. -
గుర్తుతెలియని యాచకురాలు మృతి
కొండమల్లేపల్లి: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన గుర్తుతెలియని వృద్ధ యాచుకురాలు చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపిన ప్రకారం.. కొండమల్లేపల్లి చౌరస్తా వద్ద అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ యాచకురాలిని ఆదివారం స్థానికులు గుర్తించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది సదరు యాచకురాలిని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. మృతురాలి వయస్సు 60 నుంచి 65 ఏళ్లు ఉంటుందని, ఆకుపచ్చ పువ్వులు గల చీర ధరించి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712670226, 8712670158 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. విద్యుదాఘాతంతో.. భువనగిరి: భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి–నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 60 ఏళ్లు) రైలు పట్టాల పక్కన నచుకుంటూ వెళ్తూ రైల్వే కేబుల్ బాక్సుల వద్ద విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు గులాబీ రంగు చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి మార్చరీకి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన 98482 22169 నంబర్ను సంప్రదించాలని భువనగిరి రైల్వే పోలీస్ ఇన్చార్జి కృష్ణారావు సూచించారు.గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడు..చింతపల్లి: చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు యాదగిరి(59) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మన్నెగూడలో తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం యాదగిరి నిద్రిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యాదగిరి మృతి వార్త తెలుసుకున్న వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈఓ అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయులు కోట్ల యాదగిరి, ముసుగు ఆనంద్బాబు, ఒడుగు ప్రకాష్ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. యాదగిరి గత 10సంవత్సరాలుగా చింతపల్లి మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వైద్య కళాశాలకు వృద్ధుడి పార్థివదేహం అప్పగింతసూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్లో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరు కోటయ్య వయోభారంతో ఆదివారం మృతిచెందారు. కోటయ్య భౌతికకాయానికి స్పందన అవయవ దాన సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గుండా రమేష్, మిట్టకోల కోటయ్య, కోశాధికారి హనుమాన్ల పిచ్చిరెడ్డి, సభ్యుడు శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటయ్య పార్థివదేహాన్ని కుటుంబ సభ్యుల అనుమతితో వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని దిండిగల్లో గల అరుంధతి వైద్య కళాశాలకు అప్పగించారు. -
యువతిని మోసం చేసిన వ్యక్తికి రిమాండ్
చౌటుప్పల్: తల్లిదండ్రులపై కోపంతో హైదరాబాద్కు వచ్చిన యువతికి ఉపాధి చూపించి, ఆమెను నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తిని చౌటుప్పల్ పోలీసులు ఆదివారం రిమాండ్కు తరలించారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన యువతి 2024లో తల్లిదండ్రులతో గొడవపడి ఆవేశంలో ఎవరికీ చెప్పకుండా బస్సు ఎక్కి హైదరాబాద్కు వచ్చింది. అక్కడ ఇమ్లీబన్ బస్స్టేషన్లో బస్సు దిగింది. ఈ క్రమంలో బస్స్టేషన్లోనే కొంతమంది వ్యక్తులను ఏదైనా పని ఉంటే చెప్పండని అడిగింది. ఓ వ్యక్తి సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన పంది పరమేశ్వర్ అలియాస్ ఈశ్వర్ పేరు చెప్పి అతడి సెల్ నంబర్ను యువతికి ఇచ్చాడు. అతడిని సంప్రదిస్తే పని చూపిస్తాడని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఉపాధి చూపించి యువతికి దగ్గరై.. సెల్ నంబర్ తీసుకున్న ఆ యువతి వెంటనే పరమేశ్వర్కు ఫోన్ చేసి ఉపాధి కల్పించాలని కోరింది. దీంతో ఆమెను తాను మార్కెటింగ్ ఏజెంట్గా పనిచేస్తున్న హైదరాబాధ్లోని కొత్తపేటలో గల రియల్ఎస్టేట్ ఆఫీస్ వద్దకు రమ్మన్నాడు. చెప్పినట్లుగానే ఆ యువతికి తాను పనిచేసే కార్యాలయంలోనే పరమేశ్వర్ ఉద్యోగం ఇప్పించాడు. కొంతకాలం తర్వాత హైదరాబాద్లోని నాగోల్లో గల వృద్ధాశ్రమంలో పనికి పెట్టించాడు. అలా యువతిని బాగా నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. దీంతో సదరు యువతి నుంచి పరమేశ్వర్పై ఒత్తిడి పెరిగిపోయింది. అప్పటికే పైళ్లె భార్యాపిల్లలు కల్గి ఉన్న పరమేశ్వర్కు ఏమి చేయాలో తెలియక యువతిని హైదరాబాద్లోని చైతన్యపురిలో హాస్టల్లో చేర్పించి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడికి సదరు యువతి ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అక్కడి పోలీసులు కేసును చౌటుప్పల్కు బదిలీ చేశారు. సీఐ మన్మథకుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు పరమేశ్వర్ను అదుపులోకి తీసుకుని ఆదివారం చౌటుప్పల్లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్డు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అనంతరం నిందితుడిని నల్లగొండలోని జైలులో రిమాండ్ చేశారు. -
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో పాటు శ్రావణమాసం కలిసి రావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధుల్లో భక్తులు ఎక్కువగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 30 నిమిషాల సమయం పట్టింది. స్వామిని 30వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.37,49,950 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
పాలకవీడు: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాలకవీడు మండలం రావిపహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ ఆర్. కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ గ్రామానికి చెందిన బట్ట పవన్, కళాశ్రీ(20) భార్యాభర్తలు, వీరికి 6 నెలల కుమార్తె ఉంది. కొద్దిరోజులుగా పవన్, కళాశ్రీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన కళాశ్రీ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కళాశ్రీ కుమార్తె ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు గమనించి కళాశ్రీని కిందకు దించారు. కళాశ్రీ ఒంటిపై గాయాలతో పాటు దుస్తులు చిరిగిపోయి ఉన్నాయని, ఆమె భర్త పవన్, అత్త ఉమ, మామ హనుమంతు, ఆడపడుచు ప్రియ అందరూ కలిసి తమ కుమార్తె కొట్టి చంపినట్లు కళాశ్రీ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. అనారోగ్యంతో డిప్యూటీ తహసీల్దార్ మృతిభువనగిరిటౌన్ : యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఎస్డీసీ డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న శివగణేష్కుమార్ అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఆయనకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివగణేష్కుమార్ మృతి పట్ల యాదాద్రి కలెక్టరేట్ ఉద్యోగులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన గతంలో రాజాపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా విధులు నిర్వహించారు. -
సాహిత్య సమ్మేళనానికి హాజరైన వెల్దండి శ్రీధర్
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) తెలుగు విభాగం అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్ ఈ నెల 8, 9, 10 తేదీల్లో బెంగళూరులో జరిగిన బుక్ బ్రహ్మ దక్షిణ భారత సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యం–తెలంగాణ ప్రత్యేకతలు అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు కె. శ్రీనివాస్, సాహిత్య చరిత్రకారులు డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సీ్త్రవాద రచయిత్రి షాజహానతో కలిసి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ భాష, సంస్కృతి, మధ్యతరగతి ప్రజల జీవితాలను సురవరం ప్రతాపరెడ్డి, ధరణికోట శ్రీనివాసులు, నందగిరి వెంకటరావు వంటి వారు తమ కథల్లో అద్భుతంగా వివరించారని పేర్కొన్నారు. తర్వాత కాలంలో పెద్దింటి అశోక్కుమార్, బీఎస్ రాములు, కాలువ మల్లయ్య, బెజ్జరపు రవీందర్ లాంటి వాళ్లు మధ్యతరగతి జీవితాలను కథలుగా మలిచారని అన్నారు. 1980ల తర్వాత అనేక మంది బహుజన రచయితలు కథా రచనలోకి వచ్చి ఎన్నో మధ్యతరగతి కథలు రాశారని వివరించారు. ఈ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్న వెల్దండి శ్రీధర్ను ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, ఆర్ట్స్ వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి బత్తిని నాగరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, అధ్యాపకులు అభినందించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలం
సూర్యాపేటటౌన్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డికి పాలన చేతకాకనే కాలం వెళ్లబుచ్చుతున్నాడన్నారు. రెండేళ్లు కావొస్తున్నా రేవంత్ బూతు పురాణాలు మానడం లేదన్నారు. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లే మాట్లాడుతున్నాడని, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిపించేందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏ ఒక్క రంగంలో కూడా అడుగు ముందుకేసిన దాఖలాలు లేవని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా కుంటుపట్టిస్తున్నారన్నారు. కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. ఉన్న ఇళ్లే కూలగొట్టే పని చేపట్టారని, కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు.. ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలను ఎండబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ సహకారంతోనే కేసీఆర్పై కుట్రలు చేస్తోందని, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఇద్దరికీ కేసీఆరే ప్రధాన శత్రువు అన్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని వాళ్లకు అర్థమైందన్నారు. స్ట్రీట్ ఫెలో స్టేట్ లీడర్ అయ్యాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియని అజ్ఞాన కాంగ్రెస్ మంత్రులతో ఏం అభివృద్ధి సాధిస్తారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి..
● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి నకిరేకల్: తమ్ముడికి రాఖీ కట్టేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ ఘటన నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ శివారులోని ఆర్లగడ్డగూడెంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన నర్సింగ్ అంజమ్మ(70) తన తమ్ముడు ఎల్లయ్యకు రాఖీ కట్టేందుకు శనివారం నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడేనికి వచ్చింది. తమ్ముడికి రాఖీ కట్టాక ఊర్లో పెళ్లి ఊరేగింపు జరుగుతుండడంతో అంజమ్మ రోడ్డు పైకి వచ్చింది. ఈ క్రమంలో అంజమ్మ రోడ్డు దాటుతుండగా.. నల్లగొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. నిషేధిత పాన్ మసాలాలు, సిగరెట్లు స్వాధీనం చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పోలీసులు ఆదివారం పలు కిరాణా దుకాణాల్లో, పాన్ షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పాన్ మసాలాలు, సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన సిగరెట్లు, గుట్కాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మన్మథకుమార్ హెచ్చరించారు. మాంసం విక్రయ దుకాణాల్లో తనిఖీలు కోదాడరూరల్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలోని మాంసం విక్రయ దుకాణాల్లో ఆదివారం మున్సిపల్ సిబ్బందితో కలిసి కోదాడ పశువైద్యాధికారి పెంటయ్య తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో 35 చోట్ల మటన్, 9 చోట్ల పశుమాంసం, ఐదు చోట్ల పంది, మరో 9 చోట్ల చేపలను విక్రయిస్తున్నారని వారు గుర్తించారు. నిబంధనల ప్రకారం మాంసం విక్రయదారులు ఆయా జంతువులను పశువైద్యాధికారులు పరీక్షించి ఆరోగ్యంగా ఉందని సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాతే వధించి మాంసం విక్రయించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది రాజయ్య, బాబురావు, ఆనందరావు ఉన్నారు. రిటైర్డ్ పోలీస్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంకనగల్: 1979లో పోలీస్ ఉద్యోగంలో చేరి వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీస్ ఉద్యోగులు ఆదివారం కనగల్ మండల శివారులోని పాశం పుల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగం చేసినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరస్వామిగౌడ్, చెన్నారెడ్డి, నజీర్, నిజాం, వీరారెడ్డి, చంద్రారెడ్డి, జనార్దన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, అంతయ్య, సంజీవరెడ్డి, జబ్బార్, నజీముద్దీన్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణంనాగారం: సూర్యాపేట–జనగామ రహదారిపై నాగారం మండలం ఫణిగిరి శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన గొలుసుల నరేష్(27) తిరుమలగిరి నుంచి బైక్పై తన స్నేహితుడు ప్రశాంత్తో కలిసి సూర్యాపేటకు పని నిమిత్తం వెళ్తుండగా.. ఫణిగిరి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రశాంత్ను చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఎం. ఐలయ్య తెలిపారు. -
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
తిప్పర్తి: తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఆది వారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తలించారు. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి పరుశురాములు, నల్ల గొండ పట్టణంలోని బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఎండీ షఫీ గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఆదివారం తిప్పర్తి ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో కలిసి అనిశెట్టి దుప్పలపల్లి గ్రామ శివారులో సోదాలు నిర్వహించగా మేడిశెట్టి పరుశురాములు పట్టుబడ్డాడు. షఫీ పరారయ్యాడు. పరుశురాములు వద్ద రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులు హైదరాబాద్లోని ధూల్పేట నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో మార్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి పరుశురాములును రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. షఫీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరొకరు పరారీ రెండు కేజీల గంజాయి స్వాధీనం -
ఉపేంద్రచారికి స్వర కిరీటి జాతీయ ప్రతిభా పురస్కారం
సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న గుండెపురి ఉపేంద్రచారికి స్వర కిరీటి జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఏపీలోని ఏలూరులో ఆదివారం శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సింగర్స్ ఫెస్ట్–2025లో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్కుమార్ చేతులమీదుగా ఉపేంద్రచారి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. గానం, కళా రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్న ఉపేంద్రచారికి స్వర కిరీటి జాతీయ ప్రతిభా పురస్కారం అందజేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక నిర్వాహకులు ఈశ్వరి భూషణం, లలిత, టి. పార్ధసారథి, శ్రీహరి కోటి తదితరులు పాల్గొన్నారు. ఉపేంద్రచారికి సూర్యాపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు, బంధువులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
దొడ్డా పద్మ ఆశయాలు సాధించాలి
చిలుకూరు: హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ ఆశయాలను సాధించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం చిలుకూరులో దొడ్డా పద్మ సంతాప సభలో ఆయన పొల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో తన భర్త దొడ్డా నర్సయ్యతో కలిసి నల్లమల్ల అడవుల్లో మూడేళ్లు పాటు అజ్ఞాతవాసం చేసిన మహోన్నత మహిళ దొడ్డా పద్మ అన్నారు. ఆమె మరణం సీపీఐకి తీరనిలోటని అన్నారు. అంతకుముందు చిలుకూరు సీపీఐ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య విగ్రహానికి నివాళులర్పించారు. అదేవిధంగా స్వాంతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో అందె సత్యం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు వక్కంతుల కోటేశ్వరరావు, సీపీఐ ఏపీ రాష్ట్ర నాయకులు చలసాని రాఘవేంద్రరావు, చలసాని రామారావు, కాట్రగడ్డ స్వరూపరాణి, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలీ, జిల్లా, మండల నాయకులు మేకల శ్రీనివాసరావు, పోకల వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, దేవరం మల్లేశ్వరీ, చేపూరి కొండలు, చిలువేరు అంజనేయులు, సుల్తాన్ వెంకటేశ్వర్లు, నంధ్యాల రామిరెడ్డి, సిరాపురపు శ్రీనివాస్రావు, బాలేబోయిన రాంబాబు, అనంతుల రాము, కస్తూరి సైదులు, కొండలు, లక్ష్మయ్య , వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
కీలక పోస్టులన్నీ ఖాళీ!
ఆలేరు: మున్సిపాలిటీని సిబ్బంది కొరత వేధిస్తోంది.కీలకపోస్టులు ఖాళీగా ఉండడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి.ఉన్న కొద్దిమందికి సైతం మరో చోట కూడా బాధ్యతలు అప్పగిస్తుండటంతో ఎక్కడా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. దీంతో నెలల తరబడి పనులు పెండింగ్లో ఉండడంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు.అభివృద్ధి పనులు సైతం ఆశించిన మేర సాగడం లేదని వాపోతున్నారు. వివిధ విభాగాల్లో ఖాళీలు ఇలా..● శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో జూనియర్ అసిస్టెంట్కు బాధ్యతలు అప్పగించారు. దాంతో చెత్త తొలగింపు, సేకరణ, డ్రెయినేజీలను శుభ్రం చేయడం తదితద పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ సక్రమంగా జరగటం లేదనే వాదనలు ఉన్నాయి. ● టౌన్ప్లానింగ్ ఆఫీసర్(టీపీఓ) పోస్టు ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. కొత్త ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్, అనుమతుల మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా? పరిశీలించే రెగ్యులర్ టీపీఓ లేరు. నర్సంపేట, జనగాం మున్సిపాలిటీలకు టీపీఓగా కొనసాగుతున్న వీరస్వామి ఆలేరుకూ ఇంచార్జ్గా ఉన్నారు. ఆయన వారంలో రెండు రోజులు వచ్చిపోతుంటారు. అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతున్నా అడిగే వారు లేరు. ● అసిస్టెంట్ ఇంజనీర్ లేక వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదు. రూ.15 కోట్ల నిధులున్నా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీలకు ఏఈగా ఉన్న సురేష్ ఆలేరుకు ఇంచార్జ్గా ఉన్నారు. ● హెల్త్ అసిస్టెంట్ లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యతా ప్రమాణాలు, ఆహార పదార్థాల శుచి, శుభ్రత పరిశీలన గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. వ్యాధులు వ్యాప్తి చెందకుండా సూచనలు,జాగ్రత్తలు ఇచ్చే వారు కరవయ్యారు. ● పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఎన్వి రాన్మెంట్ ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆలేరు మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత ఉన్న కొద్ది మందికి వేరే చోట బాధ్యతలు నిలిచిపోతున్న పనులు, ఇబందిపడుతున్న ప్రజలుఉన్నతాధికారులకు నివేదించాం మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, డిప్యూటేషన్ల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్న సిబ్బందికి అదనపు బాధ్యతలు కేటాయించి పనులు చేస్తున్నాం. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమిస్తే అభివృద్ధి పనులను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. – శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఆలేరు -
పంచ జ్యోతిర్లింగాలకు 16న టూరిస్ట్ ట్రైన్
రామన్నపేట: పంచ జ్యోతిర్లింగ దర్శనయాత్ర నిమిత్తం ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్ర యంబకేశ్వర్, భీమశంకర్, గ్రిషనేశ్వర్ల దర్శనంకోసం రైల్వే శాఖ ట్రైన్ ఏర్పాటు చేసిందన్నారు. స్లీపర్ కోచ్ ఒకరికి రూ.14,700, త్రీ ఏసీ రూ.22,900 చొప్పున చార్జీలు చెల్లించాలని, భక్తులకు భోజన వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాల కోసం 9701360701, 9281030711 నంబర్లను సంప్రదించాలని అసిస్టెంట్ మేనేజర్ కోరారు. 19 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు భువనగిరిటౌన్ : సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల 19నుంచి 22వ తేదీ వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని మహా రాజ గార్డెన్స్లో జరుగుతున్నాయని, ఎంపికై న ప్రతినిధులందరూ హాజరై విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మహాసభలకు సంబంధించి పోస్టర్ను జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాల నిలబడేది ఎర్రజెండా పార్టీ మాత్రమేనన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పేదల పక్షాన నిరంతర పోరాటాలు చేసిన ఘనత సీపీఐకే దక్కుతుందన్నారు. సీపీఐ వంద వసంతాల పండుగను డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలోసీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కొల్లూరి రాజయ్య, కురిమిద్ద శ్రీనివాస్, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్, ఏశాల అశోక్, చిగుర్ల లింగం, మండల కార్యదర్శులు గాదేగాని మాణిక్యం, అన్నేమైన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో హాజరుకావాలిభువనగిరి: హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ఒక టో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఈనెల 12న కలెక్టరేట్లో డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు గిరిజన శాఖ జిల్లా అభివృద్ధి అధికారి నాగిరెడ్డి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సకాలంలో హాజరు కావాలని కోరారు. -
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
సాక్షి,యాదాద్రి : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆదేశించారు. బీబీనగర్, భూదాన్పోచంపల్లి మండలాల పరిధిలోని రుద్రవెల్లి–జూలూరు మధ్య మూసీని ఆదివారం ఆయన పరిశీలించారు. పలు ప్రాంతాల్లో మూసీ, వాగులు, వంకలు వంతెనలపై నుంచి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేసినట్లు చెప్పారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులను కాపలా ఉంచినట్లు వెల్లడించారు. రుద్రవెల్లి –జూలూరు వద్ద బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతంగా పారుతుందని, ఎగువనుంచి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు గుర్రపుడెక్క కొట్టుకువచ్చి తూముల వద్ద పేరుకుపోయిందన్నారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో పంచాయతీ సిబ్బందితో తొలగించినట్లు చెప్పారు. శిథిల భవనాలు, మట్టి మిద్దెలు, గోడలు వర్షాలకు నాని కూలిపోయే అవకాశం ఉందని, వాటిని గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఫ భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి -
చెల్లింపులే ఆగాయి!
భూసేకరణ పూర్తి..గౌరెల్లి – కొత్తగూడెం భూ నిర్వాసితులకు పరిహారం పెండింగ్సాక్షి, యాదాద్రి: గౌరెల్లి–కొత్తగూడెం జాతీయ రహదారి (930 పీ) నిర్మాణానికి సేకరించిన భూములకు వలిగొండ సెక్షన్లో పరిహారం నిలిచిపోయింది. ఈ సెక్షన్లో వలిగొండ, భూదాన్పోచంపల్లి మండలాల్లో ప్రతిపాదించిన రహదారి నిర్మాణం కోసం 411 ఎకరాల భూములు సేకరించారు. ఇందుకు గాను నష్టపరిహారంగా రైతులకు రూ.122.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, నిధుల లేమితో జాప్యం జరుగుతోంది. నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే తప్ప.. పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రోడ్డు స్వరూపం ఇదీ..రంగారెడ్డి జిల్లా గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు జాతీయ రహదారి 930 పీ నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తొలిదశలో రూ.675.45 కోట్లు విడుదల చేసింది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో భూదాన్పోచంపల్లి, వలిగొండ, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల మీదుగా గౌరెల్లి –కొత్తగూడెం జాతీయ రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. 42 కిలో మీటర్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పుతో రహదారి నిర్మిస్తున్నారు. ఇందుకోసం చేపట్టిన భూ సేకరణ పూర్తయ్యింది. మోత్కూరు, అడ్డగూడూరు మండలాల పరిధిలో పనులు వేగంగా జరుగుతుండగా వలిగొండ సెక్షన్లో ఇంకా మొదలు కాలేదు. ఇక్కడ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న తొర్రూరు రోడ్డునే విస్తరణవలిగొండ నుంచి మోత్కూరు, అడ్డగూడూరు మీదుగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వరకు ప్రస్తుతం ఉన్న తొర్రూరు రోడ్డును నేషనల్ హైవేగా విస్తరిస్తున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు పరిధిలో రోడ్డు నిర్మాణం పూర్తికాగా.. కొన్నిచోట్ల కల్వర్టులు, వంతెనల నిర్మాణం జరుగుతోంది. భూదాన్పోచంపల్లి, వలిగొండ మండలాల్లో పనులు ప్రారంభం కావాల్సి ఉంది.వలిగొండ సెక్షన్లో సేకరించిన భూములుగ్రామం ఎకరాలుభీమనపల్లి 23. 07 దంతూరు 25.05 ధర్మారెడ్డిపల్లి 16.14 జగత్పల్లి 10.065 జూలూరు 15.395 కనుముక్కుల 26.015 మొహర్నగర్ 8.075 పిలాయిపల్లి 30.02 పోచంపల్లి 53.19 వంకమామిడి 20.26 లోతుకుంట 4.285 మల్లేపల్లి 32.165 పొద్దటూరు 42.335 రెడ్లరేపాక 54.18 సంగెం 42.265 వలిగొండ 4.31సేకరించిన భూములు ఇలా.. వలిగొండ సెక్షన్లో భాగంగా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూదాన్పోచంపల్లి, వలిగొండ మండలాల్లో జాతీయ రహదారి నిర్మాణం కోసం 411 ఎకరాలకు అవార్డ్ పాస్ చేశారు. పరిహారం చెల్లింపు పెండింగ్లో ఉంది. రెవెన్యూ అధికారులు రైతులతో పలుదఫాలు చర్చలు జరిపి పరిహారం ఖరారు చేశారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటుతో మొత్తం రూ.122.68కోట్లు పరిహారం ఫైనల్ చేశారు. వలిగొండ సెక్షన్లో 411 ఎకరాల సేకరణ, రూ.122.68 కోట్లు బకాయి నిధుల లేమితో ఆలస్యం నష్టపరిహారం చెల్లిస్తేనే సహకరిస్తామంటున్న రైతులు -
చద్దన్నం.. చక్కటి ఆరోగ్యం
భువనగిరి: ప్రస్తుతం చద్దన్నం తినడం ట్రెండ్గా మారింది. ఉదయం ఇడ్లి, దోశ, వడ, పూరి, బోండాలకు బదులుగా చద్దన్నం తినడం అలవాటుగా మార్చుకుంటున్నారు. పట్టణాల్లో చద్దన్నం విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చందుపట్లకు చెందిన దోసపాటి నాగరాజు భువనగిరిలో చద్దన్నం కేంద్రం ఏర్పాటు చేశాడు. ఇలా తయారు చేస్తారుముందు రోజు సాయంత్రం అన్నం వండుతారు. అనంతరం మట్టిపాత్రలో వేసి పాలుపోసి తోడు వేస్తారు. ఉల్లి, పచ్చి మిర్చి, జీలకర వేస్తారు.మరుసటి రోజు ఉదయం మట్టిపాత్రలో ఉన్నది చద్దన్నంగా మారుతుంది. సాధారణ బియ్యం, అరికెలు, జొన్నలతో తయారు చేస్తారు. ప్లేట్ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు.జొన్నల చద్దన్నంప్రయోజనాలు.. చద్దన్నంలో ప్రోబయోటిక్స్ బాక్టీరియా వృద్ధి చెందడంతో జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఎర్రరక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడే బీ12 విటమిన్ ఉత్పత్తి అవుతుంది. ఎముకలు దృడంగా ఉండటానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆదరణ పెరుగుతోంది పాతకాలంలో చద్దన్నం ఎక్కువగా తినేవారు. అందుకే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేవారు. తిరిగి అలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రస్తుతం జనం ఇష్టపడుతున్నారు. ఈ ఆలోచనతోనే భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తాలో ‘మన చద్దన్నం’ పేరుతో విక్రయకేంద్రం ఏర్పాటు చేశాను. నాతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్న. రోజురోజుకూ ఆదరణ పెరుగుతుంది. – దోసపాటి నాగరాజుగౌడ్, చద్దన్నం కేంద్రం నిర్వాహకుడు, భువనగిరిఫ బ్రేక్ఫాస్ట్లో చద్దన్నానికి ప్రాధాన్యంఫ రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ ఫ పట్టణాల్లో విక్రయ కేంద్రాలు, యువతకు ఉపాధిమార్గం -
డిమాండ్ల సాధనకు 11నుంచి పాదయాత్ర
రామన్నపేట : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మైనార్టీసెల్ రాష్ట్రకన్వీనర్ ఎస్కే చాంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రామన్నపేటలో నిర్వహించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల డిమాండ్ల సాధనకు ఈనెల 11వ తేదీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజ యవంతం చేయాలని కోరారు. ఉద్యమకారులకు ఇంటి స్థలంతోపాటు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గంగాపురం యాదయ్య, కూనూరు శ్రీనివాస్, నర్ర అండాలు, నోముల శంకర్, బెడిద లింగస్వామి, పెండెం రవి, ఎండీ లతీఫ్, అరిగె బాలయ్య, ఎండీ జానీ, నర్ర రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
రైతుబీమాకు దరఖాస్తుల ఆహ్వానం
యాదగిరిగుట్ట రూరల్: రైతుబీమా పథకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు యాదగిరిగుట్ట డివిజన్ ఏడీఏ శాంతినిర్మల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1966 ఆగస్టు 14, 2007 ఆగస్టు 14 మధ్య జన్మించి, 2025 జూన్ 5వ తేదీ నాటికి కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు అర్హులన్నారు. ఈనెల 13న చివరి తేదీ అని.. రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు, నామినీ ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులను దరఖాస్తు ఫారానికి జతచేసి సంబంధిత మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నేరుగా అందజేయాలని పేర్కొన్నారు. వివరాల కోసం మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. యాదగిరి క్షేత్రంలోనిత్యారాధనలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శనివారం వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు చేశారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయంలో ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. నిండుకుండ.. నాగార్జునసాగర్ నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. నాగార్జునసాగర్ గరిష్టస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం సాగర్ జలాశ యం నీటిమట్టం 589.70 అడుగులు (311.1486 టీఎంసీలు)గా ఉంది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 65,530 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా కృష్ణా నదిలోకి 29,313 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, వరద, ఏఎమ్మార్పీ కాలువల ద్వారా మరో 15,577 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడం.. ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఆదివారం ఉదయం క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూసీకి వరద ఉధృతికేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 5,082 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 9,598 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. నీటిమట్టాన్ని 643.50 వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరద మొత్తం దిగువకు వదులుతున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 286 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.0 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. -
వరంగల్ హైవేపై మరో ఫ్లైఓవర్
బీబీనగర్: హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై నూతనంగా మరో ఫ్లై ఓవర్ రానుంది. బీబీనగర్ మండల పరిధిలో కొండమడుగుమెట్టు నుంచి ఎయిమ్స్ వైద్యకళాశాల వరకు మూడు కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జాతీయ రహదారిపై కొండమడుగుమెట్టు వద్ద క్రాసింగ్ అవుతున్న క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురై ఎంతో మంది మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఎయిమ్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, సూచికలు లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణంతో వాహనదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఫ కొండమడుగుమెట్టు నుంచి ఎయిమ్స్ వరకు నిర్మాణం ఫ మొదలైన పనులు -
విషజ్వరాలతో విలవిల!
సాక్షి, యాదాద్రి : విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, చెత్తాచెదారం, మురుగు నీరు.. దీనికి దోమలు తోడై ప్రాణాంతక వ్యాధులను మోసుకొస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సీహెచ్సీలు, పీహెచ్సీలు, ప్రైవేట్ వైద్యశాలలు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పది రోజులుగా 600 వరకు ఓపీ నమోదవుతుండగా అందులో జ్వరంతో వచ్చే వారి సంఖ్య సగానికి పైనే ఉంటుంది. ఉదయం నుంచే కిక్కిరిసిపోతున్న ఓపీ విభాగం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉదయం 9గంటల నుంచే ఓపీ విభాగం కిక్కిరిసిపోతోంది. డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో వచ్చిన రోగులు ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. జ్వర నమూనా పరీక్షల కోసం ల్యాబ్కు క్యూ కడుతున్నారు. అయితే వ్యాధి నిర్ధారణ కోసం రెండు, మూడు రోజులు నిరీక్షించాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్ సౌకర్యం ఉన్నా సాయంత్రం వేళలో, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో సిబ్బంది ఉండటం లేదని వాపోతున్నారు. గత్యంతరం లేక ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. డెంగీ జ్వరానికి సకాలంలో వైద్యం చేయించుకుంటే ప్రమాదం వుండదు. ఇది సోకితే రోగి శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం సహజం. రక్తకణాల లెక్కింపునకు రోజూ పరీక్షలు చేయించుకోక తప్పని పరిస్థితి. ఇక ఎండోస్కోపిక్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు వెళ్తున్నారు. వేల రూపాయలు ఖర్చు అవుతుండడంతో పేదలతో పాటు మధ్య తరగతి రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్లోనూ ఫుల్ ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగీబారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. వారి వివరాలు వైద్యారోగ్య శాఖకు చేరడం లేదు. వీరితో పాటు వైరల్ ఫివర్ బాధితులు పెద్ద ఎత్తున ఉంటున్నారు. కొందరు హైదరాబాద్లోని ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రోజూ 550 వరకు ఓపీ.. భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 350 నుంచి 400 వరకు ఓపీ ఉంటుంది. కానీ, పది రోజులుగా 550 వరకు ఓపీ పెరిగింది. జనవరి నుంచి జ్వరపీడితులు ఇలా.. సాధారణ జ్వరం 18,493, డెంగీ 15, చికున్గున్యా 2, టైఫాయిడ్ కేసులు 3 నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ, వీరి సంఖ్య అనధికారికంగా వేలల్లో ఉంటుంది. విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు ఫ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిట ఫ ఓపీలో సగానికి పైగా జ్వరపీడితులే.. ఫ 15 డెంగీ కేసులు నమోదు ఫ వైద్యారోగ్య శాఖ గణాంకాల్లో చేరనవి మరెన్నో.. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. డ్రెయినేజీల నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమల బెదడ పెరిగింది. అనారో గ్యంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నా అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా పట్ట ణాల్లో ఖాళీ స్థలాలు, ఇళ్ల మధ్యనే మురుగు నీరు ప్రవహిస్తోంది. -
ఎకరానికి ఒక్కటే బస్తా..
అంచనా మేరకు వినియోగం జరగలేదు సీజన్ ప్రారంభంలో వ్యవసాయ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం యూరియా కోటా కేటాయించలేదు. వచ్చిన యూరియాలో కూడా జూన్, జూలై మాసాల్లో అంచనా మేరకు వినియోగం జరగలేదు. జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా.. 52 శాతానికి మించలేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు విస్తీర్ణం పడిపోయి యూరి యా వినియోగంపై ప్రభావం పడిందని అధికారులు భావిస్తున్నారు. పరిమితంగా పంపిణీ చేయడంతో రైతుల ముందస్తు నిల్వ లకు బ్రేక్ పడి యూరియా కొరత రాకపోవడానికి కారణమని చెబుతున్నారు. ఆలేరు: యూరియా కొరత తలెత్తకుండా వ్యవసాయ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అందుబాటులో ఉన్న నిల్వలను పరిమితంగా పంపిణీ చేస్తున్నారు. పట్టాదారు పాస్పుస్తకం ఆధారంగా ఎకరానికి ఒక బస్తా, అది పూర్తిగా వాడితేనే మరొక బస్తా ఇస్తున్నారు. ప్రస్తుతం 4,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా.. వర్షాలు కురుస్తుండటంతో మరో 1,500 మెట్రిక్ టన్నులకు ఇండెంట్ పెట్టారు. ముందస్తు జాగ్రత్తగా.. ఇతర జిల్లాల్లో యూరియా కొరత తలెత్తడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్య రాకుండా జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించారు. గతంలో ఎకరాలతో నిమిత్తం లేకుండా రైతులు అడిగినంత యూరియా పంపిణీ చేసేవారు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పరిమితంగా యూరియా పంపిణీ చేయాలని నిర్ణయించారు. సాగు విస్తీర్ణం ప్రకారం ఫర్టిలైజర్ దుకాణాలు, పీఏసీఎస్, డీసీఎంఎస్, అగ్రో రైతుసేవా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా ఇస్తున్నారు. అది కూడా రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉందని పట్టాదార్ పుస్తకం పరిశీలించి యూరియా పంపిణీ చేస్తున్నారు. అవసరం లేకపోయినా రైతులు ముందస్తుగా ఎక్కువ యూరియా తీసుకెళ్లి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నందున, పాస్పుస్తకంలో నమోదైన ఎకరాల ప్రకారం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా కొరతకు చెక్పెట్టారు. సగం కోటానే వచ్చినా కొరత లేకుండా.. వానాకాలం సీజన్కు మొత్తం 32,830 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇందులో ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు నెలలు పంటల సాగుకు కీలకం. ఈ మూడు నెలలకే 27,900 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాధికారుల అంచనా. ఇప్పటి వరకు 15,500మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే జిల్లాకు వచ్చింది. అందులో 11వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 4,100 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 12 బస్తాలు ఇచ్చారు 12ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి రెండు చొప్పున 24 బస్తాల యూరియా అవసరం ఉంది. ఇప్పటి వరకు 12 బస్తాలే ఇచ్చారు. తీసుకున్న యూరియా పూర్తిగా వాడిన తరువాత మళ్లీ ఇస్తామంటున్నారు. గతంలో ఎంతంటే అంత ఇచ్చేవారు. ఇప్పుడు పరిమితంగా యూరియా పంపిణీ చేస్తున్నారు. –ఎడపల్లి కనకరాజు, రైతు, తుర్కపల్లి పరిమితంగా యూరియా పంపిణీ ఫ పాస్బుక్ ఆధారంగా ఇస్తున్న డీలర్లు ఫ పూర్తిగా వాడితేనే మరొక బస్తా.. ఫ కొరత ఏర్పడకుండా కార్యాచరణ ఫ అందుబాటులో 15,500 మెట్రిక్ టన్నుల యూరియా ఫ ప్రణాళిక ప్రకారం పంపిణీయూరియా కొరత లేదు జిల్లాలో యూరియా కొరత లేదు. 234 ఫర్టిలైజర్ డీలర్లు, 35 పీఏసీఎస్, 8 రైతు సేవా కేంద్రాలు, 2డీసీఎంఎస్ కేంద్రాల్లో ప్రస్తుతం 4,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నాం. అవసరం మేరకు రైతులు మళ్లీ కావాలంటే ఇస్తున్నాం. ఇందుకోసం 1,500 మెట్రిక్టన్నుల యూరియా కోసం కలెక్టర్ ద్వారా ప్రతిపాదన చేశాం. ఈనెల మధ్య వరకు వరినాట్లు వేసుకునే అవకాశం ఉన్నందున సాగు విస్తీర్ణం మరికొంత పెరుగుతుంది. –పీవీ.రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
రహదారులపై వాహనాల బారులు
చౌటుప్పల్, భువనగిరి టౌన్ : రాఖీ పండుగ సందర్భంగా రోడ్లన్నీ రద్దీగా మారాయి. జాతీయ రహదారులు, పల్లె రూట్లు.. ఎటు చూ సినా వాహనాలతో నిండిపోయాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం మొదలైన రద్దీ శనివారం రెండింతలు పెరిగింది. చౌటుప్పల్ పట్టణంలో హైవేపై రెండు కిలో మీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. దీంతో వాహనదారులు సర్వీస్ రోడ్ల గుండా వెళ్లడంతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ఉదయం 11గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి సర్వీస్ రోడ్లపైకి వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్, తంగడపల్లి, వలిగొండ రోడ్లు, తంగడపల్లి చౌరస్తా జంక్షన్ను శుక్రవారం రోజునే మూసేశారు. వాహనదారులు, స్థానికులు వలిగొండ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించారు. అర్ధరాత్రి వరకు రద్దీ జనాలతో చౌటుప్పల్, భువనగిరి బస్టాండ్లు కిటకిటలాడాయి. చాలా మంది సాయంత్రం తిరుగుపయనం కావడంతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. ఏ బస్సు చూసినా సామర్థ్యానికి మించి ప్రయాణికులతో కనిపించాయి. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరి: గిరిజనుల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు సూచించారు. శనివారం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భువనగిరి మండలం పగిడిపల్లి పరిధిలో గల గిరిజన బాలికల అశ్రమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. గిరిజన సమాజం, సంస్కృతి సంప్రదాయలను తెలియజేసేందుకు ఏటా ఆగస్టు 9వ తేదీన ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు మొక్కలు నాటి, సంత్సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, నాయకులు శంకర్నాయక్, గణేష్ నాయక్, మోహన్బాబు, రాజేష్, చిరంజీవి, సురేష్, భాస్కర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలు కనండి.. దారి చూపండి
చౌటుప్పల్ రూరల్: మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చౌటుప్పల్ మండలం నేలపట్ల – వర్కట్పల్లి గ్రామాల మధ్య ఈదుల వాగుపై కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శనివారం సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ నేతృత్వంలో పార్టీ బృందం కల్వర్టు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఈదుల వాగుపై కల్వర్టు గతంలోనే దెబ్బతిందని.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిందన్నారు. వానాకాలానికి ముందే మరమ్మతులు చేసి ఉంటే కారు కొట్టుకుపోయేది కాదన్నారు. మునుగోడు, భువనగిరి నియోజకవర్గాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, కుంభం అనిల్కుమార్రెడ్డి తక్షణమే స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాగీరు కిష్టయ్య, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు తడకమోహన్, యనమల సంజీవ, దబ్బటి బక్కయ్య, మాజీ ఎంపీటీసీ బత్తుల శంకర్, బుట్టి కృష్ణ, గుర్రం కృష్ణ, డీవైఎఫ్ఐ నాయకులు బత్తుల వేణు, ఇట్టగోని మల్లేశం, దబ్బటి భాను, యనమల్ల నవీన్ పాల్గొన్నారు. ఫ ఈదుల వాగుపై కొట్టుకుపోయిన రోడ్డు ఫ రాకపోకలు బంద్ ఫ పరిశీలించిన సీపీఎం బృందం -
లాభాల పూ‘బంతి’
పెద్దవూర: బంతి సాగును జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో సాగు చేసేవారు. కానీ గత కొన్నేళ్లుగా రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. జూన్, జూలై నెలల్లో సాగు చేసిన బంతి సాగు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ, అక్టోబర్, నవంబర్ నెలలో సాగు చేసిన బంతిపూలు డిసెంబర్, జనవరితో పాటు ఫిబ్రవరిలో వచ్చే పండుగలు, పెళ్లిళ్లు, జాతరలు, ఫంక్షన్లకు దిగుబడి వస్తుండటంతో మంచి గిరాకీ వస్తుంది. రైతులు నీటి వసతిని బట్టి బంతిని సాగు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని హార్టికల్చర్ అధికారి మురళి తెలిపారు. యాజమాన్యం రెండు రకాలు.. ఆఫ్రికన్ మేరీగోల్డ్ : ఈ జాతి ఎత్తుగా పెరిగి అతి పెద్ద సైజు పూలు పూస్తాయి. ఇందులో ఆఫ్రికన్ జెయింట్, ఆరెంజ్ డబుల్, ఆఫ్రికన్ ఎల్లోజెయింట్ డబుల్, క్రాక్ జాక్, గోల్డెన్ ఏజ్ రకాలు అనువైనవి. ఫ్రెంచ్ మేరీగోల్డ్ : ఈ జాతి పూలకుండీల్లో పెంచుకునే పొట్టి రకాలు. దీనిలో రెడ్ బ్రోక్డ్, రెస్పిన్ రెడ్, బట్టర్ స్కాచ్, వాలెన్నియా రకాలు అనువైనవి. నేలలు: నీరు త్వరగా ఇంకిపోయే తేలిక పాటి సారవంతమైన నేలలు, ఇసుక నేలలు, నీటి తేమ తక్కువగా ఉండే నేలలు బంతి సాగుకు అనుకూలం. బంతిని మిరప, పత్తి పంటల్లో రక్షక పంటగా కూడా సాళ్లలో సాగు చేసుకోవచ్చు. వాతావరణం: మన వాతావరణ పరిస్థితులు బంతిసాగుకు అనుకూలం. జూలై మధ్య కాలం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటితే మార్కెట్కు పూల సరఫరా సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు చేయొచ్చు. నారుమళ్లు: ఎకరానికి సరిపడ నారు పెంచడానికి 800–1000 గ్రాముల విత్తనం అవసరం. మళ్లు తయారు చేసుకునే సమయంలో ఒక చదరపు మీటరుకి 8–10 కిలోలు బాగా చిలికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదలు వంటి ఇతర క్రీముల నుంచి రక్షణ పొందవచ్చు. ఎత్తు నారుమళ్లు చేసుకుని విత్తనాన్ని సాళ్లలో నాటుకుంటే మొక్కల మధ్యదూరం సమంగా ఉండి నారు మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దీనివలన కలుపు మొక్కలు, చీడపీడల నివారణ కూడా వీలవుతుంది. విత్తిన 5–7 రోజుల్లో మొలకలు వస్తాయి. నాటే విధానం: 15–20 రోజుల వయసు లేదా 3–4 ఆకులు వచ్చిన మొక్కలను 45్ఙశ్రీ25 సెంటీమీటర్ల దూరంలో నాటితే మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండి పూల దిగుబడి పెరుగుతుంది. నారుని సాయంకాలం నాటుకుంటే బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్ మొక్కల్ని 40్ఙశ్రీ30 సెంటీమీటర్లు దూరంలోనూ, ఫ్రెంచ్ బంతి మొక్కల్ని 20్ఙశ్రీ20 సెంటీమీటర్ల దూరంలో నాటితే పూల దిగుబడి బాగా ఉంటుంది. నాటిన తర్వాత పల్చగా నీరు పెట్టుకోవాలి. ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితోపాటు 20–40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 35 కిలోల పోటాష్ను ఇచ్చే ఎరువులను వేయాలి. మొక్కలు నాటిన 60 రోజుల వరకు శాఖీయంగా పెరిగే దశలో ఉంటాయి. ఈ సమయంలో తగినంత తేమ ఉండేలా చూడాలి. నేల స్వభావాన్ని బట్టి 5–8 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి. కత్తిరింపులు: వాణిజ్యపరంగా పెంచే ఆఫ్రికన్ బంతి రకాలు ఎత్తుగా పెరిగి చాలా తక్కువగా పూలు వస్తాయి. కనుక మొక్కలు 30–40 సెంటీమీటర్ల ఎత్తులో లేదా నాటిన 30–35 రోజులకు తలభాగం కత్తిరిస్తే మొక్క కింది భాగం నుంచి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి పూల దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా మొక్కలకు వచ్చిన పూలన్నీ ఒకే పరిమాణంలో ఉండి మంచి రంగు సంతరించుకోవడంతో గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది. సస్యరక్షణ: నారుకుళ్లు తెగులు: నేలలో తడి ఎక్కువగా ఉండి వెచ్చని వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. మొలకెత్తిన నారు మొక్కల కాండం కుళ్లి చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 1.5 గ్రాముల కార్భండిజమ్ కలిపిన మందు ద్రావణంతో నారు మడిని తడిపి నివారించవచ్చును. మొగ్గ తొలిచే పురుగు: లార్వాలు పూమొగ్గలను తొలుస్తాయి. పూ మొగ్గలు విచ్చుకోవు. పూల దిగుబడి బాగా తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కార్బిరిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పేను: పెద్ద, పిల్ల పురుగులు మొగ్గల్ని ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు మలాథియాన్ లేదా 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. తామర పురుగులు: పిల్ల, తల్లి పురుగులు ఆకులు, పూల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఆకుల మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆశించిన మొగ్గలు గోధుమరంగుకు మారి ఎండిపోతాయి. నివారణకు లీటరు నీటికి 2 మిల్లీ లీటర్లు డైమిథోయేట్ ను కలిపి పిచికారీ చేయాలి. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం మిరప, పత్తి పంటల్లో రక్షణ పంటగా బంతి పూల సాగు -
గంజాయి నిందితుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖరరాజు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన భూక్యా హనుమా నాయక్, సంగాల కాటంరాజు, నర్సారావుపేట జిల్లా కారంపుడికి చెందిన మద్దూరి చంటి గంజాయికి అలవాటు పడి ముఠాగా ఏర్పడ్డారు. బలిమెల, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆనంద్గురు వద్ద గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీరికి మిర్యాలగూడకు చెందిన కొందరు వ్యక్తులు పరిచయం కావడంతో వారి ద్వారా ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఈక్రమంలో గురువారం భూక్యా హనుమానాయక్, సంగాల కాటంరాజు, మద్దూరి చంటి రెండు గ్రూపులుగా విడిపోయి చంటి బైక్పై మిర్యాలగూడ పట్టణానికి వచ్చి ఐదున్నర కిలోల గంజాయిని విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. మద్దూరి చంటి, మిర్యాలగూడకు చెందిన షేక్ రియాజ్, మహమ్మద్ హర్షత్ అయూబ్, మహ్మద్ సలీం అక్బర్, మహమ్మద్ జునైద్ అలీ, షేక్ అప్రోజ్, కుర్ర సందీప్ ఖానాపురం శరత్లను అరెస్టు చేశామని.. భూక్యా హనుమానాయక్, సంగాల కాటంరాజు, ఆనంద్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల వద్ద 7.4 కిలోల గంజాయి, కారు, మూడు ద్విచక్ర వాహనాలు, పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో టూ టౌన్ సీఐ సోమనర్సయ్య, రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య, టూటౌన్ ఎస్ఐ రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ ఎస్.యాదగిరిరెడ్డి, కానిస్టేబుళ్లు ఎల్.సూర్య, పి.బాలకృష్ణ, ఎండీ అక్బర్ పాష, జి.లక్ష్మయ్య, రాజశేఖర్, సమాద్, వెంకన్న, మహేష్, సైదులు, నాగరాజు, రాములునాయక్, సైదానాయక్ తదితరులున్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖరరాజు -
కూలిన రైస్ మిల్లు గోడ
బొమ్మలరామారం : ట్రాక్టర్కు ఆఫ్ వీల్స్ బిగిస్తుండగా పక్కనే ఉన్న రైస్ మిల్లు గోడ కూలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడి నుంచి పక్కకు జరగగా.. ట్రాక్టర్ నుజ్జునుజ్జు అయింది. బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామానికి చెందిన ఎడిజర్ల బాలకృష్ణ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి గంగరబోయిన కృష్ణ పొలాన్ని శుక్రవారం దున్నడానికి వెళ్లాడు. గంగరబోయిన కృష్ణ పొలం పక్కనే రైస్మిల్ ఉంది. ట్రాక్టర్ దుక్కి దున్నడానికి ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ, కృష్ణ కొడుకు ఉపేందర్లు ఆఫ్ వీల్స్ బిగిస్తుండగా.. చేస్తుండగా రైస్ మిల్లు గోడ కూలింది. క్షణాల్లో తేరుకున్న ఇద్దరు యువకులు అక్కడి నుంచి పక్కకు జరగడంతో ప్రాణాపాయం తప్పింది. గోడ కూలడంతో ట్రాక్టర్ ధ్వంసమైంది. నెల రోజుల క్రితమే తెచ్చుకున్న కొత్త ట్రాక్టర్ గోడకూలి ధ్వంసం కావడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ● ధ్వంసమైన ట్రాక్టర్ ● తృటిలో తప్పించుకున్న ఇద్దరు యువకులు -
పీహెచ్సీ భవన నిర్మాణ పనుల పరిశీలన
బీబీనగర్: స్థానిక నూతన పీహెచ్సీ భవనంలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని త్వరలో భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకుముందు రహీంఖాన్గూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అలాగే మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో మూసీ నది గుండా ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు. వంతెలనపై నుంచి వరద నీరు ప్రవహిస్తే రాకపోకలను స్తంభింపజేసేలా చర్యలు తీసుకోవాలని పలు వాగుల వద్ద నీటి ఉధృతి ఉంటే ప్రజలు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఎర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్సుందర్రెడ్డి, ఏంపీడీఓ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. తహసీల్దార్ కార్యాలయం సందర్శన భూదాన్పోచంపల్లి : పోచంపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై సమీక్షా నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డిని అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన వాటిని త్వరగా పరిష్కరించాలని అన్నారు. పోచంపల్లిలో భూభారతిలో చాలా వరకు ప్రభుత్వ, భూదాన్, వక్త్ఫ్, పెద్దచెరువులో మునిగిన భూములకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఎంఆర్ఐ వెంకట్రెడ్డి ఉన్నారు. -
లారీని ఢీకొట్టిన కారు..
● నలుగురికి స్వల్పగాయాలు మునగాల: మండల కేంద్రం శివారులో శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అతివేగంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో కారులో ఉన్న ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కారును పోలీస్స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లింగ నిర్ధారణ కేసులో ఆర్ఎంపీ అరెస్టు
సూర్యాపేటటౌన్ : వైద్యం వికటించి గర్భిణి మృతి చెందిన కేసులో ఆమెకు లింగ నిర్ధారణ పరీక్ష చేసిన ఆర్ఎంపీని పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. మే 24న మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన బయ్య అనూష అనే గర్భిణి నకిరేకల్లోని ఆర్ఎంపీ వైద్యుడు బాత్క యాదగిరి వద్ద లింగనిర్ధారణ పరీక్ష చేయించుకుంది. ఆడపిల్ల అని తేలడంతో ఆమె భర్త నగేష్ మరో ఆర్ఎంపీ జానయ్య, వారి బంధువు సందీప్ కలిసి ఆమెను సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు అర్హత లేని వైద్యులతో అబార్షన్ చేయించారు. అధిక రక్తస్రావం కావడంతో ఆమెను ఖమ్మంలోని మరో ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి చెందింది. ఈవిషయమై డీఎంహెచ్ఓ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు ఆర్ఎంపీ బాత్క యాదగిరిని నకిరేకల్లోని తన నివాసంలో పట్టణ పోలీసులు అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. మొత్తం 10 మందిపై కేసు కాగా కొంత మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మరికొంత మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుడు యాదగిరి వద్ద ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్, సెల్ఫోన్ స్వాధీనం -
వన మహోత్సవం ఉద్యమంలా నిర్వహిద్దాం
నల్లగొండ టూటౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (ఎన్ఎస్పీసీ) 2025 హరిత్ ద వే ఆఫ్ లైఫ్ పోస్టర్ను శుక్రవారం ఎంజీ యూనివర్సిటీలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యా శాఖ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ పర్యావరణ విద్యా విధానంలో భాగంగా సామాజిక ఉద్యమం మాదిరిగా వన మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది విద్యార్థుల చేత మొక్కలు నాటించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ఆకుల రవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జి. ఉపేందర్రెడ్డి, అధ్యాపకులు హైమావతి, డాక్టర్ శ్రీనివాస్, కిరణ్కుమార్ పాల్గొన్నారు. జాతీయ కాన్ఫరెన్స్ కరపత్రాల ఆవిష్కరణ నల్లగొండ టూటౌన్: గణితశాస్త్రం దాని అనువర్తనాలపై వచ్చే నెల 3, 4 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ కాన్ఫరెన్స్ కరపత్రాలను శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సెమినార్లు, సదస్సులు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన పెరుగుతుందన్నారు. రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడుతూ జాతీయ సెమినార్కు కావాల్సిన ఏర్పాట్లలో యూనివర్సిటీ తరపున అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ గణిత విభాగ అధిపతి, మద్దిలేటి పసుపుల, బోర్డాఫ్ స్టడీస్ చైర్ పర్సన్ డాక్టర్ జి. ఉపేందర్రెడ్డి, అధ్యాపకురాలు హైమావతి, శ్రీనివాస్, కిరణ్కుమార్ పాల్గొన్నారు. ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
నులిపురుగుల నివారణతో ఆరోగ్యం
భువనగిరి: ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 11వ తేదీన 1 నుంచి 19 ఏళ్ల వయస్సులోపు వారికి మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,43,789 మందిని గుర్తించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేస్తారు. 1.75 లక్ష ఆల్బెండజోల్ మాత్రలు అందుబాటులో ఉంచారు. మొదటిరోజు మిగిలిపోయిన వారికి 18న పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఎంపీహెచ్ఏలు 246, ఆశ వర్కర్లు 690, అంగన్వాడీ టీచర్లు 843, ర్యాపిడ్ టీంలు 24 ఏర్పాటు చేశారు. 1,2 ఏళ్ల వయస్సున్న పిల్లలకు సగం టాబ్లెట్ వేయనున్నారు. వైద్యారోగ్య శాఖ గుర్తించిన ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని డీఎంహెచ్ఓ మనోహర్ తెలిపారు. వ్యాధి వ్యాప్తి ఇలా.. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, అపరిశుభ్ర వాతావరణం, మట్టిలో ఆటలు, చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడం వల్ల నులిపురుగుల బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టులో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తారు. ఫ 11న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ఫ 1,43,789 మంది గుర్తింపు -
42 శాతం రిజర్వేషన్లపై సీపీఎం దీక్ష.. భగ్నం
భువనగిరిటౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తాలో చేపట్టిన పార్టీ నాయకులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టెంట్ను తొలగించడంతో పాటు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్ తరలించారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు. అక్కడి నుంచి వచ్చి సీపీఎం కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధత పొందాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించి చట్టరూపంలోకి తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీదేనని, తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకపక్షంగా వెళ్లకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. పోలీసుల తీరును వారు ఖండించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, కొండమడుగు నరసింహ, నాయకులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, సిర్పంగి స్వామి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, బొల్లు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరి బస్టాండ్ను ఆధునీకరించాలి
గంజాయి నిందితుల అరెస్ట్ గంజాయి తరలిస్తున్న ఏడుగురు యువకులను మిర్యాలగూడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యమంలా వన మహోత్సవం.. ఉద్యమం మాదిరిగా వన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు.- 8లోసాక్షి, యాదాద్రి: భువనగిరి బస్టాండ్ను ఆధునీకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కోరారు. శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. భువనగిరి బస్టాండ్ నుంచి నిత్యం వేలాది మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగి స్తుంటారని, సరైన వసతులు, సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా డీలక్స్, లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో చాలా వరకు బస్టాండ్కు రాకుండా నేరుగా బైపాస్ నుంచి వెళ్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల జన గామ, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం రాత్రి పొద్దుపోయే వరకు బస్టాండ్లో నిరీక్షించాల్సి వస్తుందన్నారు. అన్ని రకాల సర్వీస్లు బస్టాండ్కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. భువనగిరి నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. బీఎన్ తిమ్మాపురం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని వినతిబస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామం బీఎన్ తిమ్మాపురం నిర్వాసితులకు రూ.80 కోట్లు పరిహారం పెండింగ్ ఉందని, త్వరగా చెల్లించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి విన్నవించారు. అదే విధంగా నియోజకవర్గంలో లో ఓల్టేజీ సమస్య పరిష్కరించడానికి వలిగొండకు 132/11 కేవీ సబ్స్టేషన్, తొ మ్మిది 11 కేవీ సబ్స్టేషన్లను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సబ్స్టేషన్ల శంకుస్థాపనకు రావాలని డిప్యూటీ సీఎంను ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీరితో పాటు మరికొందరు మంత్రులను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వాలని విన్నవించారు.ఫ మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి వినతి -
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
భూదాన్పోచంపల్లి: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మూసీ పరివాహక మండలాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రవెల్లి గ్రామాల మధ్య మూసీని పరిశీలించారు.లోలెవల్ బ్రిడ్జిపై పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈ సీజన్లోనే గురువారం భారీ వర్షం కురిసిందని, ఆత్మకూర్(ఎం)లో 152 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందన్నారు. గడిచిన రెండు రోజుల్లో కురిసిన వర్షాలతో లోటు నుంచి 32 శాతం అధికంలోకి వచ్చామన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున మూసీ పరిహకంలోని పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల అధికారులను అలర్ట్ చేశామని, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు సాగించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. సీజనల్ వ్యాధులపట్ల జాగ్రత్త సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలు కాచి వడగట్టిన నీటిని తాగాలని కలెక్టర్ సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా నీరునిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్బాల్స్ వేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో విద్యార్థులను కూర్చొబెట్టవద్దని, అవసరమైతే స్కూల్కు ఒక రోజు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. మట్టి గోడలున్న ఇళ్లలో నివసించవద్దని, వర్షాలు తగ్గేవరకు పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాల్లో తాత్కాలికంగా ఆవాసం ఉండాలని సూచించారు. ఆయన వెంట డిటీ నాగేశ్వర్ రావు, ఎంఆర్ఐ వెంకట్రెడ్డి ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
రెండు గంటలు ఏకధాటిగా..
గురువారం రాత్రి ముంచెత్తిన వాన ఫ జిల్లాలో సగటున 11.21 సెంటీ మీటర్ల వర్షం ఫ పొంగిపొర్లిన వాగులు, వంకలు ఫ మూసీకి పోటెత్తిన వరద, లో లెవల్ వంతెనల పైనుంచి ప్రవాహం ఫ రాకపోకలు నిలిపివేసిన అధికారులు ఫ చెరువుల్లోకి చేరుతున్న నీరు సాక్షి,యాదాద్రి: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసీకి వరద పోటెత్తింది. చెరువుల్లోకి నీరు చేరుతోంది. అత్యధికంగా ఆత్మకూర్ (ఎం) 159.5 మి.మీ, అడ్డగూడూరు 132.5 మి.మీ, వలిగొండ 108.7 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 11.21 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. జూన్, జూలై మాసాల్లో సరైన వర్షాలు లేక భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అన్ని పంటలు కలిపి 52 శాతానికి మించి సాగు కాలేదు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షం పంటలకు జీవం పోసింది. ప్రమాదకరస్థాయిలో మూసీ జిల్లాతో పాటు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి, హిమాయత్సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. బీబీనగర్ –భూదాన్పోచంపల్లి మధ్య రుద్రవెల్లి వద్ద, వలిగొండ మండలం బొల్లేపలి – సంగెం మధ్యన లోలెవల్ వంతెనల పైనుంచి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. ఎగువనుంచి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థ్యాలు పెద్ద ఎత్తున కొట్టుకువచ్చి లోలెవల్ బ్రిడ్జిల వద్ద తూములకు అడ్డంకిగా మారాయి. అదే విధంగా మోటకొండూరు మండలం కొండాపురం–కాల్వపల్లి వద్ద బిక్కేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రైతులు, గీతకార్మికులు ప్రమాదకరంగా వాగును దాటుతున్నారు. మోత్కూరు పరిధిలో బిక్కేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చౌటుప్పల్ మండలం నేలపట్ల–వర్కట్పల్లి మధ్య ఈదుల వాగుకు వరద ఉధృతి పెరగడంతో వాగుదాటుతున్న క్రమంలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అప్రమత్తమై సురక్షితంగా బయట పడ్డారు. స్థానికులు తాళ్ల సహాయంతో కారును బయటకు తీశారు. సాధారణం కంటే అధిక వర్షం ఈ సీజన్లోనే అధిక వర్షం కురిసింది. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 268 మి.మీ కాగా.. 353.7 మీ.మీ వర్షపాతం నమోదైంది. రెండు రోజుల్లోనే సాధారణం కంటే 32 మీ.మీ అధిక వర్షం కురిసింది. జిల్లాలో 17 మండలాలకు గాను 2 మండలాల్లో అత్యధికంగా, 7 మండలాల్లో అధికంగా, 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అన్నదాతకు ఊరట భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతకు ఊరటనిస్తున్నాయి. ప్రధానంగా వాగుల వెంట బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో రైతులు దుక్కులు దున్నడం, నాట్లు వేస్తున్నారు. అదే విధంగా వర్షాలు పత్తి, ఇతర మెట్ట పంటలకు ప్రాణం పోశాయి. 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. వర్షాభావ పరిస్థితుల కారణంగా 80 వేల ఎకరాలకే పరిమితమైంది. వర్షాలు లేక చేలు ఎదగడం లేదు. నష్టాలు తప్పవని భావిస్తున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వర్షపాతం (మి.మీ) మండలం వర్షం ఆత్మకూర్ (ఎం) 159.5 అడ్డగూడూరు 132.5 వలిగొండ 108.7 గుండాల 86.0 చౌటుప్పల్ 77.6 రామన్నపేట 69.9 మోత్కూరు 67.1 మోటకొండూరు 60.3 నారాయణపురం 55.3 భువనగిరి 51.2 అలేరు 47.1 రాజాపేట 40.9 పోచంపల్లి 39.5 బి.రామారం 39.3 బీబీనగర్ 32.8 తుర్కపల్లి 29.5 యాదగిరిగుట్ట 23.8 -
ఒక్క జత యూనిఫాంతోనే బడికి
భువనగిరి: విద్యార్థులకు ఒక జత యూనిఫాం అందజేసిన సర్కారు.. రెండోది పంపిణీ చేయడంలో జాప్యం చేస్తోంది. విద్యా సంవత్సరం పునఃప్రారంభం రోజునే రెండు జతల యూనిఫాం, పుస్తకాలు అందజేయాల్సి ఉంది. కానీ, విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఒక రోజు యూనిఫాం వేసుకొస్తే మరుసటి రోజు సివిల్ డ్రెస్తో పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వస్త్రం ఆలస్యంతోనే.. ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాం విద్యార్థులకు పంపిణీ చేస్తుంది. మే నెలలోనే రెండు జతల యూనిఫాంకు వస్త్రం సరఫరా చేయాలి. కానీ, పూర్తిస్థాయిలో వస్త్రం రాకపోవడంతో పాఠశాలల పునఃప్రారంభం రోజున ఒకే జత అందజేశారు. రెండో జతకు సైతం వస్త్రం అలస్యంగా రాగా.. అది కూడా సగమే సరఫరా చేశారు. ఈ నెలాఖరు నాటికి రెండో జత యూనిఫాం అందజేస్తామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం మహిళా సంఘాల ద్వారా యూనిఫాం కుట్టే ప్రక్రియ కొనసాగుతోంది. 43,188 మంది విద్యార్థులు జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 715 ఉన్నాయి. వీటిలో 43,188 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా 55 రోజులుగా ఒకే జత యూనిఫాంతో పాఠశాలకు హాజరవుతున్నారు. పంద్రాగస్టుకు పాత యూనిఫాంతో హాజరుకావాల్సి వస్తుంది.ఫ రెండో జత పంపిణీలో జాప్యం ఫ మూడు నెలలుగా విద్యార్థుల ఎదురుచూపులు ఫ పంద్రాగస్టుకు పాత యూనిఫాంతోనే పాఠశాలకు.. ఈ నెలాఖరులో పంపిణీ చేస్తాం మొదటి జత యూనిఫాం పాఠశాలల పునఃప్రారంభం రోజునే ఇచ్చాం. రెండో జత కూడా ఈ నెలాఖరులో పంపిణీ చేస్తాం. వస్త్రం సగం వచ్చి మిగతా సగం అలస్యంగా రావడంతో రెండో జత పంపిణీలో జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో యూనిఫాం కుట్టే ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి కాగానే వెంటనే విద్యార్థులకు పంపిణీ చేస్తాం. –సత్యనారాయణ, డీఈఓ -
వర్షాలతో అన్ని రకాల పంటలకు మేలు
భువనగిరి : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి, కందితో పాటు మిగతా అన్ని రకాల పంటలకు మేలు చేకూరుతుందని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైందన్నారు. వివిధ దశల్లో ఉన్న పంటలకు ఈ వర్షాలు ఎంతో దోహదపడుతాయన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత ఎరువులు పెట్టాలని రైతులకు సూచించారు. భూగర్భ జలాలు వృద్ధి చెంది వరి సాగుకు అనుకూలత ఏర్పడనుందన్నారు. డబ్బులు రికవరీ, కేసు నమోదు మోత్కూరు : తప్పుడు పత్రాలతో కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందిన వ్యక్తుల నుంచి డబ్బులు రికవరీ చేయడంతో పాటు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన వల్లపు సోమలక్ష్మి–స్వామి దంపతుల కుమార్తె రాధికను 2011లో వలిగొండ మండలం మొగిలిపాకకు చెందిన మర్ల మహేష్కు ఇచ్చి వివాహం చేశారు. ఆ తరువాత వివాహం జరిగినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రూ.1,00,116 లబ్ధి పొందారు. విచారణలో వాస్తవమని తేలడంతో తహసీల్దార్ జ్యోతి ఫిర్యాదు మేరకు నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వారి నుంచి నగదు రికవరీ చేసినట్లు తహసీల్దార్ వెల్లడించారు. నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్దేవికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. నూతన డ్రెయినేజీలు నిర్మిస్తాం యాదగిరిగుట్ట: పట్టణంలో డ్రెయినేజీ సమస్యపై ‘మురుగుతో అవస్థలు’ శీర్షికతో ఈనెల 7న సాక్షిలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కమిషనర్ లింగస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ దండు కిరణ్బాబు శుక్రవారం అధ్వానంగా మారిన డ్రెయినేజీలు, కూలిపోయిన డ్రెయినేజీలను పరిశీలించారు. చెత్తాచెదారం తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లించారు. దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వదిలారు. కూలిపోయిన డ్రెయినేజీలతో స్థానంలో, అవసరమైన చోట టీయూఎఫ్ఐడీసీ నిధులతో నూతన డ్రెయినేజీలు నిర్మిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీ పరిధిలోని పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను అధికారులు తనిఖీ చేశారు. యూనివర్సిటీలో పరీక్ష కేంద్రాలను వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ జి.ఉపేందర్రెడ్డి పర్యవేక్షించారు. -
15లోగా పెండింగ్ కేసుల పరిష్కారం
సాక్షి,యాదాద్రి : సమాచార హక్కు చట్టం కింద పెండింగ్లో ఉన్న పిటిషన్లు ఈ నెల 15లోగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన గురువారం భువనగిరి వివేరా హోటల్లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పిటిషన్లు 18,000 పెండింగ్లో ఉండగా, వీటిలో ఇప్పటివరకు 2300 పిటిషన్లను పరిష్కరించామన్నారు. మొత్తం 29 డిపార్ట్మెంట్లలో పెండింగ్లో ఉన్న పిటిషన్లలో 15 శాఖల్లో క్లియర్ చేశామని చెప్పారు. మిగిలిన 14 శాఖల్లో దరఖాస్తులను పరిష్కరించేందుకు ముమ్మర చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా మున్సిపల్ రెవెన్యూ శాఖలో ఉన్న 50 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ఆయాశాఖలకు ఆదేశాలిచ్చామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్లు విధిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన వెంట సహ కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, నెర్ల వైష్ణవి మొహిసిన్ పర్వీన్ ఉన్నారు. ఫ సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి -
ఆర్ఐ, పాలడుగు కార్యదర్శి సస్పెన్షన్
సాక్షి,యాదాద్రి : మోత్కూర్ మండలం పాలడుగు పంచాయతీ కార్యదర్శి శోభన్, ఆర్ఐ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హులకు కల్యాణలక్ష్మి చెక్కు మంజూరు చేయడంలో కారణం కావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్రమైన విచారణ చేయాలని భువనగిరి ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. దాచారం కార్యదర్శి సస్పెన్షన్ ఎత్తివేతమోత్కూరు : మండలంలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యదర్శి బొడ్డు యాదగిరి సస్పెన్షన్ ఎత్తివేస్తూ కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డెయిలీ శానిటేషన్ రిపోర్ట్ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఫేక్ పంపారని ఇటీవల యాదగిరిని సస్పెండ్ చేశారు. ఈయనతో పాటు జిల్లాలో మరో 8 మందిని కూడా సస్పెండ్ చేశారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శికి 2, 3 గ్రామాలు అదనపు బాధ్యతలు విధులు నిర్వహిస్తున్నామని తమపై భారం మోపి సస్పెన్షన్ చేస్తే ఎలా అని కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శులు ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తిరిగి కొనసాగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీఓ బాలాజీ తెలిపారు. పునఃప్రారంభమైన ఆర్జిత సేవలు యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు విశేష పర్వాలు జరిగిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన అనంతరం ఆలయ అధికారులు గురువారం ఉదయం ఆర్జిత సేవలను పునఃప్రారంభించారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షం భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉండడంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూర్ మండలంలో 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. అడ్డగూడూరు మండలంలో 122, వలిగొండ 105, చౌటుప్పల్ 100, గుండాల 81, ఆలేరు 77, నారాయణపురం 76, రామన్నపేట 76, మోత్కూర్ 60, మోటకొండూరు 50, భువనగిరి 49, రాజాపేట 45, బొమ్మలరామారం 38, బీబీనగర్ 36, పోచంపల్లి 27, తుర్కపల్లి 15, యాదగిరిగుట్ట 12, చౌటుప్పల్లో 87 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. -
కాంగ్రెస్ది ఓటు బ్యాంకు రాజకీయం
సాక్షి, యాదాద్రి, భువనగిరి : బీసీ రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత గురువారం తొలిసారిగా ఆయన జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా భువనగిరిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడారు. ముస్లిం ఓటుబ్యాంకుతో రాహుల్గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందే తప్ప కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయడం చేతకావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది బీసీ బిల్లు కాదని అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి భారీగా సీట్లు వస్తాయనే సంకేతాలున్నాయన్నారు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మూసీ ప్రక్షాళన చేస్తా అనే మాటలు కార్యరూపం దాల్చలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండు ఒక్కటేనని, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదన్నారు. భువనగిరి నుంచి ధర్మయుద్ధం ప్రారంభించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు అధికారం ఇచ్చిన ప్రజలు ఒకసారి బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. అనంతరం బీజేపీ శ్రేణులు రాంచందర్రావును ఘనంగా సత్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రమేందర్రెడ్డి, జిల్లా ప్రభారి చాడ శ్రీనివాస్రెడ్డి, సంస్థాగత జిల్లా స్థానిక ఎన్నికల ప్రభారి పాశం భాస్కర్,బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు తాడూరి శ్రీనివాస్, పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, పోతంశెట్టి రవీందర్, దాసిర మల్లేష్, నర్ల నర్సింగ్రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, జాతీయ దళిత మోర్చా కార్యవర్గసభ్యులు వేమలు అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, పట్టణ, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. భారీ బైకు ర్యాలీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు ఆ పార్టీ నేతలు స్థానిక పాత బస్టాండ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి వినాయక, ప్రిన్స్ చైరస్తా మీదగా ఆజాద్ రోడ్డు మార్గంలో సమ్మద్ చౌరస్తా మీదుగా ఎంఎన్ఆర్ గార్డెన్కు చేరుకున్నారు. ఫ కామారెడ్డి డిక్లరేషన్ అమలు ఎక్కడ ఫ కార్యరూపం దాల్చని మూసీ ప్రక్షాళన ఫ భువనగిరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
కాలానికి అనుగుణంగా డిజైన్లు రూపొందించాలి
భువనగిరిటౌన్ : మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత డిజైన్లు రూపొందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాయగిరి క్రాస్ రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు చేపట్టిన ర్యాలీని, కలెక్టర్ హనుమంత రావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, ఏడీ హ్యాండ్లూమ్ శ్రీనివాస్ ప్రారంభించారు. చేనేత కళను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కత్ వస్త్రాలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయన్నారు. ఫ్యాషన్కు తగ్గట్టుగా వస్త్రాలు తయారు చేస్తే మార్కెటింగ్ బాగా పెరుగుతుందని తెలిపారు చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవిధంగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నేతన్నకు చేయూత, నేతన్న బీమా చెక్కులను అందజేశారు. చేనేత రంగంలో విశేష కృషి చేసిన నేతన్నలను సన్మానించి, మెమొంటో అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్ జల్ది రాములు, కార్మిక సంఘ నాయకుడు లక్ష్మీనరసయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు సుధాకర్, చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్ సుధాకర్ సుదర్శన్, డెవలప్మెంట్ ఆఫీసర్ రాజేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
నృసింహుడి ఆలయ భద్రతపై ఆందోళన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఆలయంలో చింతపండు దొంగతనం, ఆలయ పరిసరాల్లోని గిరి ప్రదక్షిణ, పాతగోశాలలోని డార్మింటరీ హాల్లో వైర్ల చోరీలు జరిగాయి. అయినా ఆలయ పోలీసులు, అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రస్తుతం ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలను చోరీ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు రంపంతో కోసారు. గతేడాది బిగించినప్పటికీ.. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సుమారు రూ.20లక్షల వ్యయంతో ఈసీఐఎల్ కంపెనీతో సుమారు 100 విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలను బిగించారు. గతేడాది ఇవి బిగించినప్పటికీ వీటి పర్యవేక్షణపై ఎస్పీఎఫ్ పోలీస్, స్థానిక పోలీసులు సరైనా నిఘా పెట్టడం లేదు. దీంతో గిరి ప్రదక్షిణ మార్గంలో బిగించిన విద్యుత్ స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 10 నుంచి 15 చోట్లా రంపంతో కట్ చేశారు. గుర్తించిన విద్యుత్ సిబ్బంది ఆ స్తంభాలను ఆలయ మీటర్ యార్డు గదిలో భద్రపరిచారు. మరికొన్ని చోట్ల అలాగే వదిలేశారు. వాటిని సైతం రాత్రి సమయంలో దుండగులు దొంగిలించేందుకు యత్నిస్తున్నారు. గతంలో సైతం.. ఆలయ సన్నిధిలోని పాత గోశాలలో గతంలో భద్రపరిచిన విద్యుత్ వైర్ను దొంగిలించుకుపోయారు. ఇటీవల సుమారు 120 మీటర్లకు పైగా వైర్ను సైతం దుండగులు అపహరించుకుపోయారు. గత మూడు నెలల క్రితం ఆలయ ప్రసాద విభాగంలో సైతం చింతపండును దొంగిలిస్తూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది పట్టుబడ్డారు. ఇందంతా సరైన పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతోనే జరుగుతుందనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈసీఐఎల్ కంపెనీకి బిల్లులు ఇవ్వకపోవడంతో.. ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఈసీఐఎల్ కంపెనీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాల పనులకు అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు వీటి నిర్వహణను ఆలయ అధికారులకు అప్పగించలేదని సమాచారం. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగినా, ఎవరైనా దొంగిలించినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈసీఐఎల్ కంపెనీకి దేవస్థానం బిల్లులు చెల్లిస్తే, వీటి నిర్వహణ ఆలయ అధికారులు చూసుకునే అవకాశం ఉంది. ఫ గతంలో ఆలయ ప్రసాద విభాగంలో చింతపండు, పాతగోశాల డార్మింటరీ హాల్లో వైర్ల చోరీ ఫ ఇటీవల గిరి ప్రదక్షిణ మార్గంలో విద్యుత్ స్తంభాలు అపహరించేందుకు యత్నం ఫ పర్యవేక్షణ లోపించడంతోనే దొంగతనాలకు పాల్పడుతున్నారని భక్తుల ఆరోపణ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం గిరి ప్రదక్షిణ మార్గంలో ఈఓతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఈ మార్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదనే నెపంతో ఈసీఐఎల్ కంపెనీ పూర్తి స్థాయిలో నిర్వహణ చేయలేకపోతోంది. రాత్రి సమయాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందితో గిరి ప్రదక్షిణ మార్గంలో నిఘా ఏర్పాటు చేస్తాం. రంపంతో కోసి పక్కన పెట్టిన విద్యుత్ స్తంభాలను మీటర్ యార్డు గదిలో భద్రపరిచాం. – రామారావు, ఈఈ విద్యుత్ విభాగం -
‘వరలక్ష్మి’ సెల్ఫీలకు ఆహ్వానం
ఇసుక దందాను అరికట్టేందుకే.. ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకే సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా అన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం జరుపుకునే మహిళలూ.. మీ ఫొటోలను ‘సాక్షి’ పత్రికలో చూసుకోవాలను కుంటున్నారా.. మీరు పూజలో కూర్చున్న ఫొటో సెల్ఫీ తీసి ఈ కింద నంబర్కు వాట్సప్ చేయండి. శనివారం సంచికలో ప్రచురిస్తాం. లేటెస్ట్ సెల్ఫీ ఫొటోతో పాటు మీ పేరు, చిరునామా కూడా పంపాలి. - 8లో- 9లో80962 93702సెల్ఫీ పంపాల్సిన వాట్సప్ నంబర్ -
బ్లాక్స్పాట్లపై నజర్
యాదగిరిగుట్ట రూరల్: హైదరాబాద్– వరంగల్ ప్రధాన జాతీయ రహదారి – 163 యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పరిధి నుంచి ఆలేరు ప్రాంతం వరకు విస్తరించి ఉంటుంది. ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. యేడాది కాలంలో 110 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, 13 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 8 బ్లాక్స్పాట్ల గుర్తింపు యాదగిరిగుట్ట మండల పరిధిలో 8 బ్లాక్ స్పాట్ (ప్రమాదాలు జరిగే ప్రాంతం)లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వంగపల్లి గ్రామం లోపలికి వచ్చే రహదారి, వంగపల్లి బైపాస్, రామాజీపేట గ్రామం, తాళ్లగూడెం బస్స్టాప్, బాహుపేట స్టేజీ, చిన్నకందుకూరు స్టేజీ, పెద్దకందుకూరు గ్రామం, ఆలేరు ఎగ్జిట్ ప్రదేశం ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రదేశాల్లో బ్లాక్అండ్ ఎల్లో హాజార్డ్, డెలిరేషన్ బోర్డులు, మీడియన్ స్టార్టింగ్ బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, ప్లాస్టిక్ స్టాపర్లు, పవర్ బ్లింకర్లు, గో స్లో, ఆక్సిడెంట్ ఇండికేషన్లు, వంటి బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అతివేగంతో వచ్చి ప్రమాదాల బారిన..ఆలేరురూరల్: ఆలేరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో సాయిబాబ గుడి సమీపంలో, కందిగడ్డ తండా సమీపంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడగా.. 14 మంది త్రీవంగా గాయపడ్డారు. స్పీడ్ బ్రేకర్లు వేసిన చోట్ల రేడియంతో గుర్తులు లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు అతివేగంతో వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. వీటి నివారణకు హైవే, పోలీస్ శాఖ దృష్టి సారించింది. అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బోలోర్స్, రేడియం స్టిక్కర్లు, సూచికలు తదితర ఏర్పాట్లు, స్పీడ్ గన్లు ఏర్పాటు చేయనున్నారు.స్పీడ్గన్లు ఏర్పాటు చేస్తాం వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిలో ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కంటే ప్రమాదాల సంఖ్య తగ్గించాం. ప్రమాదాలు జరిగే చోట బ్లాక్ స్పాట్లను గుర్తించి, ఇండికేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. వాహనాలు 80 స్పీడ్ దాటితే జరిమానాలు పడేలా, స్పీడ్ గన్లను కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా రాచకొండ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్లను గుర్తించాం. ఇప్పటికే కొన్ని ఇండికేషన్ బోలోర్స్ కూడా పెట్టాం. – యెలగొండ కృష్ణ, ట్రాఫిక్ సీఐ, యాదగిరిగుట్ట సర్కిల్ ఫ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు ఫ నివారణపై దృష్టి సారించిన హైవే, పోలీస్ శాఖ ఫ ఆయా ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు, సూచిక బోర్డుల ఏర్పాటుకు సన్నాహాలు -
ఎంజీయూలో అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
నల్లగొండ టూటౌన్: 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఎంజీయూ పరిధిలోని కళాశాలల విద్యార్థులకు 20 అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్ యూనివర్సిటీ సూచన ప్రకారం విద్యార్థుల జాబితా సిద్ధం చేసి ఈ నెల 15 లోగా usbmguict 2025@gmail.com మెయిల్ కు పంపాలని సూచించారు.వాగులో పడి మహిళ మృతిఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): వాగులో పడి మహిళ మృతిచెందిన ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరులో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన పచ్చిపాల నాగమ్మ(45) మూడ్రోజుల క్రితం మోతె మండలం సర్వారంలో బంధువుల దశదినకర్మకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తూ.. ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామ పరిధిలోని వాగులో కాలకృత్యాలు తీర్చుకునేందుకు దిగి కాలు జారి వాగులో పడింది. గురువారం ఉదయం స్థానికులు వాగు వద్దకు వెళ్లగా మహిళ మృతదేహం నీటిపై తేలుతుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జాతీయ అవార్డులు అందుకున్న చేనేత కళాకారులు
భూదాన్పోచంపల్లి: చేనేత సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసినందుకు గాను హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్కుమార్ స్కీమాటిక్ ఇంప్లిమెంటేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్సింగ్, సహాయ మంత్రి పబిత్ర మార్గరేటా తదితరుల చేతులమీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. పుట్టపాక కళాకారులు.. సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ యువ చేనేత విభాగంలో, జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో గజం నర్మద కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. వారికి ప్రశంసాపత్రం పత్రం, మెమొంటోతో పాటు నగదు పురస్కారం అందజేశారు. -
న్యాక్ ఏ గ్రేడ్ కోసం ప్రణాళిక రూపొందించాలి
● మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ న్యాక్ గ్రేడింగ్లో ఏ గ్రేడ్ సాధించేలా అధ్యాపకులు, వివిధ విభాగాల అధిపతులు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం యూనివర్సిటీలో వివిధ విభాగాల ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాక్కు అందించే సెల్ఫ్ స్టడీ నివేదికలోని అంశాలపై అధ్యాపకులు అవగాహన కల్గి ఉండాలన్నారు. ప్రతి విభాగం వారు విధిగా వర్క్షాపులు, సెమినార్ల నిర్వహణతో పాటు పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. పీహెచ్డీ విద్యార్థులు తమ పరిశోధనా కాలంలో కనీసం 2 పరిశోధనా పత్రాలు పరిశీలించాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విభాగాల వారీగా ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ అధ్యాపకులను ఎంపిక చేస్తామన్నారు. అధ్యాపకులు సమయపాలన పాటించాలన్నారు.ఽ సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రేమ్సాగర్, డాక్టర్ కె. అరుణప్రియ, సీహెచ్. సుధారాణి, శ్రీదేవి, రేఖ, అంజిరెడ్డి, ఆకుల రవి, హరీష్కుమార్, డాక్టర్ వై. ప్రశాంతి, మిర్యాల రమేష్, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల నియామకం నల్లగొండ టూటౌన్: ఎంజీయూలో వివిధ విభాగాల్లో సిలబస్ కూర్పు, పాఠ్యాంశాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ విధానం, వివిధ విద్యాంశాల ప్రణాళిక రూపకల్పనకు గాను బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లను నియమిస్తూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బిజినెస్ మేనేజిమెంట్ విభాగం చైర్మన్గా మారం వెంకటరమణారెడ్డి, సోషల్ వర్క్ చైర్మన్గా డాక్టర్ శ్రీధర్(ఓయూ), హిస్టరీ అండ్ టూరిజం విభాగం చైర్మన్గా కె. విజయ్బాబు(కాకతీయ యూనివర్సిటీ), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్గా ఏవీఎన్.రెడ్డి(అంబేద్కర్ యూనివర్సిటీ)ని నియమించారు. -
చేనేతకు ప్రభుత్వాలన్నీ అన్యాయం చేశాయి
భూదాన్పోచంపల్లి: గత ప్రభుత్వాలన్నీ చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాయని మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్ టి.చిరంజీవులు అన్నారు. గత పదేళ్ల కాలంలో రూ.18లక్షల 12వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు ఖర్చు చేసింది కేవలం రూ.229 కోట్లు మాత్రమేనని అన్నారు. అలాగే ఈ సంవత్సరం 50లక్షల 512 వేల కోట్ల కేంద్ర బడ్జెట్లో దేశవ్యాప్తంగా చేనేతకు రూ.2400 కోట్లు కేటాయించడం దయనీయ పరిస్థితికి అద్దంపడుతోందని అన్నారు. గురువారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవులు పాల్గొని మాట్లాడుతూ.. చేనేత కార్మికుల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వాలకు చేతులు రావడం లేదన్నారు. అదే గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం బడాపారిశ్రామిక వేత్తలకు రూ.16లక్షల 24వేల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. 1950 నుంచి ఇప్పటి వరకు 23 మంది మాత్రమే పద్మశాలీలు ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. వాస్తవానికి 69 మంది ఎమ్మెల్యే కావాలన్నారు. అందరూ ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పద్మశాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో 30 మంది చేనేత కార్మికులను సన్మానించారు. కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, చేనేత నాయకులు భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, సీత శ్రీరాములు, భోగ భానుమతి, కర్నాటి అంజమ్మ, మెరుగు శశికళ, కార్మిక సంఘం నాయకులు హరిశంకర్, భూషణ్, బిట్ల గణేశ్, రుద్ర సూర్యప్రకాశ్, వేణుకుమార్, శ్యామ్సుందర్, కూరపాటి భాస్కర్, శివరాజు, రాజేశ్వరీ, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్ చిరంజీవులు -
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కోదాడరూరల్: కుటుంబ కలహాలతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోదాడ పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం కోదాడ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణ పరిధిలోని చేపల మార్కెట్ వెనుక కట్టబజార్కు చెందిన ఉప్పతల శ్రీను, లక్ష్మి(40) దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. శ్రీను మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మిని శ్రీను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. మూడు రోజుల నుంచి భార్యాభర్తలు మాట్లాడుకోవడం లేదు. బుధవారం రాత్రి వారి కుమార్తె హాసిని, బంధువుల పాప కలిసి ఓ గదిలో నిద్రించగా.. మరో గదిలో నిద్రించిన లక్ష్మి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుమార్తె హాసిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. శ్రీను మరో మహిళతో వివాహేత సంబంధం పెట్టుకొని లక్ష్మిని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. పెళ్లి కుదరడం లేదని బలవన్మరణండిండి: పెళ్లి కుదరడం లేదని మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం డిండి మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల కేంద్రంలోని డీఎన్టీ కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మయ్య, జంగమ్మ దంపతుల కుమార్తె రూప(26) డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ కుట్టుమిషన్ నడుపుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు రూపకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ కుదరడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రూప బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం పోలీసులు ఘుటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిచారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు
రామన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. బీసీలను మభ్యపెట్టడానికే రేవంత్రెడ్డి 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని, మేధావులను, ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఆర్డినెన్స్ను రూపొందించారని ఆరోపించారు. రేవంత్రెడ్డిపై నమ్మకం లేకనే ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలులో విఫలమైన సీఎం రేవంత్రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 42శాతం నామినేటెడ్ పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణలో పాలన సాగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, నాయకులు బద్దుల రమేష్, సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్బాబు తదితరులు ఉన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
యాదగిరిగుట్ట: చేనేత కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకొని, అనంతరం పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం విదేశీ మోజులో చేనేత దుస్తులను ఎవరూ ధరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు చేనేత కార్మికులు వెళ్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముద్ర పథకం కింద కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణాలు అందించి ఆదుకుంటుందన్నారు. చేనేత వస్త్రాలను విదేశాలకు పంపించే అవకాశం ప్రధాని నరేంద్ర మోదీ కల్పించారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. చేనేత వస్త్రాలు ధరించాలనే సంకల్పం ప్రతి వ్యక్తిలో రావాలన్నారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైన పథకాలు అమలు చేయడంలేదన్నారు. పవర్లూమ్స్ కార్మికుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. మొదటిసారి యాదగిరిగుట్టకు ఆయనకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, దాసరి మల్లేశం, వట్టిపల్లి శ్రీనివాస్గౌడ్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, చేనేత విభాగం మాజీ కన్వీనర్ కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివకుమార్, మచ్చ సుధాకర్, రచ్చ శ్రీనివాస్, గంజి బసవలింగం, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
ఇసుక దందాను అరికట్టేందుకే ‘సాండ్ బజార్’
మిర్యాలగూడ: ఇసుక అక్రమ దందాను అరికట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఇసుక అందించడానికే సాండ్ బజార్ను ఏర్పాటు చేసినట్లు అన్నారు. రాష్ట్ర మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఎక్స్రోడ్డు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో రాష్ట్ర మైనింగ్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ను నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాండ్ బజార్లో టన్ను ఇసుక రూ.1250కు అందుబాటులో ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంకా తక్కువ ధరకే ఇసుకను అందించేందుకు సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తక్కువ ధరకు ఇసుకతో పాటు స్థానిక సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాలతో మాట్లాడి సిమెంట్ బస్తాకు రూ.50 చొప్పున తగ్గింపు ధరలో అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇటుకలు కూడా మార్కెట్ ధర కంటే ఒక రూపాయి తక్కువకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఏడీ జాకోబ్, తహసీల్దార్ సురేష్కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా -
నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలి
భూదాన్పోచంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములుతో కలిసి భూదాన్పోచంపల్లిని ఆయన సందర్శించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చేనేత కార్మికులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత సహకార సంఘం, చేనేత గృహాలను సందర్శించారు. చేనేత వస్త్రాలు, మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నది చేనేత పరిశ్రమనే అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అందరూ తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించాలనే నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే చేనేత కార్మికుల వస్త్రోత్పత్తులకు మార్కెటింగ్ పెరుగుతుందన్నారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలని, సబ్సిడీపై నూలు, ముడిసరుకును అందించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి పోచంపల్లికి మెగా చేనేత క్లస్టర్ మంజూరుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించారని వివరించారు. చేనేత సహకార సంఘాలకు ఆద్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. చేనేత పరిశ్రమలో 70శాతం మహిళలు పనిచేడం గొప్పవిషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని కోరారు. దేశంలో తెలంగాణ నుంచే రూ.3లక్షల కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయంటే మన చేనేత వస్త్రాలకు ఉన్న డిమాండ్ అర్థమవుతుందని అన్నారు. అనంతరం పలువురు చేనేత నాయకులు, కార్మికులు బండారు దత్తాత్రేయను సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో చేనేత రాష్ట్ర నాయకులు కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివకుమార్, భారత లవకుమార్, సతీష్, నోముల గణేశ్, భారత వాసుదేవ్, చిక్క కృష్ణ, అంకం పాండు, సీత శ్రీరాములు, సీత సత్యనారాయణ, కర్నాటి బాలరాజు, రుద్ర అంజనేయులు, మెరుగు శశికళ, కర్నాటి అంజమ్మ, గంజి బస్వలింగం, ఏలే శ్రీనివాస్, కేసారం కృష్ణారెడ్డి, బడుగు శ్రీకాంత్, కడవేరు శేఖర్, ఇంజమూరి యాదగిరి, భారత అంజనేయులు పాల్గొన్నారు. ఫ హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ -
విద్యార్థిగా కలెక్టర్..
బీబీనగర్: కలెక్టర్ హనుమంతరావు విద్యార్థిగా మారారు. తరగతి గదిలో కాసేపు విద్యార్థులతో కలిసి కూర్చొని ఉపాధ్యాయుడు బోధిస్తుండగా పాఠం విన్నారు. బీబీనగర్ మండలం గూడూరులోని జిల్లా పరిషత్ పాఠశాల, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ను బుధవారం ఆయన సందర్శించారు. 10వ తరగతికి వెళ్లి విద్యార్థులతో కలిసి జూవాలజీ పాఠం విన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులువైన రీతిలో బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సైకిళ్లు బహుమతిగా అందజేస్తానని కలెక్టర్ తెలిపారు. -
100 రోజులు పని కల్పించాలి
రాజాపేట: ప్రతి కూలీకి 100 రోజు పనిదినాలు కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేష్ సూచించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాజాపేట మండలంలో నిర్వహించిన ఉపాధిహామీ పనులపై బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని స్పష్టం చేశారు. పనుల కొలతల్లో వ్యత్యాసం ఉండటంతో టెక్నికల్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి ఉపేందర్రెడ్డి, మేనేజర్ ఆదిత్యవర్థన్, ఎంపీడీఓ నాగవేణి, ఈసీ కర్ణాకర్ పాల్గొన్నారు. -
ఫ తరగతి గదుల్లోకి వర్షపు నీరు
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ డంపింగ్మోత్కూరు : మోత్కూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో కొంత మంది ట్రాక్టర్ల యజమానులు ఇసుకను అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. పాటిమట్ల గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల కోసం సదర్శాపురం బిక్కేరు నుంచి ఇసుకను తీసుకువచ్చేందుకు తహసీల్దార్ అనుమతులు పొంది వాటికి అదనంగా తరలిస్తూ రహస్య ప్రాంతాల్లో అక్రమంగా డంపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇసుకను రాత్రి వేళల్లో లారీల ద్వారా తరలించేందుకు పాటిమట్ల కొత్త కాలనీ వద్ద ఇసుక డంపింగ్ చేశారని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాటిమట్ల, సదర్శాపూర్ గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలుచౌటుప్పల్ : మండల పరిఽధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో బుధవారం బస్సు ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండుమల్కాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఏపీకి చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. వ్యక్తి అదృశ్యంచౌటుప్పల్ : చౌటుప్పల్లో బుధవారం వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన పాశం వంశీ(40) అనారోగ్యానికి గురవడంతో చికిత్స నిమిత్తం సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందిన మరుసటి రోజు మంగళవారం చౌటుప్పల్లోని తన అత్తగారి ఇంటికి వెళ్లాడు. అదే రోజు తెల్లవారుజామున బాత్రూమ్ కోసమని వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో అతడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. టాస్క్ఫోర్స్ టీం దాడులుభువనగిరిటౌన్ : భువనగిరి టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనన్ టీం బుధవారం భువనగిరి పట్టణంలోని చేపట్టిన దాడుల్లో 70 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిని సమాచారం మేరకు భువనగిరి పట్టణంలోని బ్రహ్మణవాడ నివాసం ఉంటున్న కాసీం షేఖ్ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఖాసీం షేఖ్ గంజాయిని వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకువచ్చిన భువనగిరిలో విక్రయించే వాడని పోలీసులు గుర్తించారు. అతడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ రాధాకృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు శ్రీనివాస్, టీం బృందం నర్సిరెడ్డి, దుర్గయ్య, లింగస్వామి, నిహారిక, సురేష్ తనిఖీల్లో తదితరులు పాల్గొన్నారు. -
గొల్లభామ చీరల కాపీ
గొల్లభామ చీరలకు సిద్ధ్దిపేట ప్రసిద్ధి. ఇక్కడ కాటన్, పట్టు గొల్లభామ చీరలను కొన్ని దశాబ్దాలుగా చేనేత కార్మికులు నేస్తున్నారు. కానీ ఇటీవల పవర్ లూమ్ సంస్థలు గొల్లభామ చీరలను కాపీ చేస్తున్నాయి. తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఒక్క చీర నేయడానికి రూ. 1000 నుంచి రూ. 1500 కూలి ఇస్తున్నాం. అలాంటిది కాపీ చీరలను మార్కెట్ లో తక్కువ కు అమ్ముతున్నారు. ఇది మార్కెట్ మీద ప్రభావం పడుతోంది. –తుమ్మ ప్రవీణ్, సిద్ధిపేట, గొల్లభామ చీరల వ్యాపారి -
ఊరంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు
నడిగూడెం: కాలానుగుణంగా వ్యవసాయంలో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడంతో పాటు కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విత్తనాలు వేసే దగ్గర నుంచి ఎరువుల వాడకం, కలుపు తీయడం, పంట కోసే వరకు ఒక్కో రైతు ఒక్కో విధంగా వ్యవసాయం చేస్తున్నారు. కానీ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపుంర గ్రామ రైతులు మాత్రం అందుకు భిన్నం. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రామాపురం రైతులు వరి సాగు భిన్నంగా చేపట్టారు. దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా చల్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఊళ్లోని రైతులంతా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. రామాపురంలో బోర్లు, బావులు, సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా కొమరబండ మేజర్ కాల్వ, ఆర్–9 ఎత్తిపోతల పధకం ద్వారా సాగునీటి సౌకర్యం ఉంది. ఉన్న నీటి వనరులతో ఏకంగా ఆ ఊరంతా దాదాపు 3500 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. ఈ విధానంలో వారం రోజుల ముందుగానే పంట కోతకు వస్తుందని, నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు కాబట్టి సాగు ఖర్చు రూ.2500 నుంచి రూ.3500 వరకు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. ఈ విధానంలో ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పద్ధతిలో కాండం ధృడంగా పెరుగుతుందని, రైతుకు ఇష్టమైన ఏ రకమైనా సాగు చేసుకోవచ్చని, నీటి యాజమాన్యం కూడా చాలా సులువు అని వ్యవసాయాధికారులు అంటున్నారు. మూడెకరాల్లోనూ వెదజల్లే పద్ధతిలో.. మూడెకరాల్లో వరి సాగు చేపట్టాను. అది కూడా వెదజల్లే పద్ధతిలో నేరుగా వరి విత్తనాలు చల్లాను. దీంతో విత్తన మోతాదు, నారు పెంచే ఖర్చులు, నాట్లు వేసే ఖర్చులు తగ్గాయి. దాదాపు రూ.3000 వరకు ఆదా అయ్యాయి. కూలీల సమస్య కూడా లేదు. – మారిశెట్టి నర్సింహారావు, రైతు, రామాపురం వెదజల్లే పద్ధతి చాలా సులువు రోజురోజుకూ వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ముందుకు వెళ్లాఇ. దమ్ము చేసిన తర్వాత నేరుగా పొలంలో విత్తనాలు వెదజల్లడం వలన మొక్క ధృడంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కూలీల సమస్యను కూడా అధిగమించవచ్చు. – రాయపు దేవప్రసాద్, మండల వ్యవసాయాధికారి, నడిగూడెం ఫ భిన్నంగా ఆలోచించిన నడిగూడెం మండలం రామాపురం గ్రామ రైతులు ఫ పెట్టుబడి ఖర్చులు తగ్గి కూలీల కొరత లేదంటున్న అన్నదాతలు -
నారుమడిపై కలుపు మందు పిచికారీ
నడిగూడెం : మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన గుండు సుభద్ర వ్యవసాయ క్షేత్రంలోని వరి నారుమడిపై గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేశారు. దీంతో ఆమె బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్.చంద్రశేఖర్, డాక్టర్ సంధ్యారాణిలను పిలిపించి, నారుమడిని పరిశీలించి, పొలంలోని నారు, మట్టి నమూనాలు సేకరించినట్లు ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి రాయపు దేవప్రసాద్, ఏఈఓ ఉప్పయ్య ఉన్నారు. ఆర్ఎంపీ వైద్యుడిపై కేసు నమోదుమునగాల: మునగాల మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చంద్రమౌళి చేసిన చికిత్స వికటించడంతోనే బరాఖత్గూడెం గ్రామానికి చెందిన గోవింద వెంకటేశ్వర్లు(35) మృతిచెందాడని ఆయన సోదరుడు వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్ బుధవారం తెలిపారు. వెంకటేశ్వర్లు గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా అతడి భార్య శిరీష మంగళవారం మండల కేంద్రంలోని ఆర్ఎంపీ వైద్యుడు చంద్రమౌళి క్లినిక్కు చికిత్స నిమిత్తం తీసుకువచ్చింది. చికిత్స పొందుతుండగా వెంకటేశ్వర్లు పరిస్థితి విషమించడంతో ఆయన సోదరుడు వీరబాబు సాయంతో కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కోదాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మునగాలతో పాటు మృతుడి స్వగ్రామమైన బరాఖత్గూడెంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచింతపల్లి: అప్పుల బాధతో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం చింతపల్లి మండల పరిధిలోని వింజమూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వింజమూర్ గ్రామానికి చెందిన భీనమోని మహేందర్ (35)గ్రామంలో వ్యవసాయ పనులతో పాటు డ్రైవర్ గా చేస్తూ జీవనం సాగించేవాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేసి, వాటిని తీర్చే మార్గం లేక మానసికంగా కుంగిపోయాడు. దిక్కుతోచని స్థితిలో గత నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. బంధువులు గమనించి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నవీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. -
కృష్ణా తీరాన శైవ క్షేత్రం
000పెద్దమునిగల్లోని కృష్ణా తీరంలో ఏర్పాటు చేసిన మహాశివుడి విగ్రహంఫ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పెద్దమునిగల్లోని కృష్ణా తీరం ఫ నాలుగేళ్లుగా గంగా హారతి చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ కృష్ణా తీరంలో మహా శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామస్తులు విరాళాల రూపంలో రూ.50లక్షలు సేకరించి శివాలయాన్ని నిర్మించి, మహాశివుడి ప్రతిమ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఇక్కడ గంగా హారతి నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక వైపు కృష్ణా హారతి.. మరో వైపు మహా శివునికి ప్రత్యేక పూజలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కృష్ణా తీరంలోని వైజాగ్ కాలనీ అందాలు వీక్షించేందుకు వెళ్లే పర్యాటకులు పెద్దమునిగల్ కృష్ణా తీరాన గల మహాశివుని దేవాలయాన్ని సైతం దర్శించుకుంటుండడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. గంగా హారతి ఇక్కడి ప్రత్యేకత కార్తీక మాసంలో ప్రతి ఏడాది ఇక్కడ శివుడికి నిర్వహించే గంగా హారతి ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుంది. గ్రామస్తులందరం కలిసి సుమారు రూ.50లక్షలు విరాళాలు సేకరించి, మహాశివుడి దేవాలయాన్ని నిర్మించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. – కోతి యుగేంధర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ -
చేనేతకు కొత్త బ్రాండ్
సృజనాత్మకతకు పెద్దపీట ఫ కాలానుగుణంగా నూతన డిజైన్ల రూపకల్పన ఫ దేశ, విదేశాల్లో చేనేతకు ఆదరణ ఫ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు నేడు జాతీయ చేనేత దినోత్సవంప్రింటెడ్ బెడద ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జియోగ్రాఫికల్ ఐడెంటిటీ(పేటెంట్ హక్కులు) ఉన్న పోచంపల్లి ఇక్కత్ , సిద్ధిపేట గొల భామ, గద్వాల చీరలకు ప్రింటెండ్ బెడదతప్పడంలేదు. చేనేత వస్త్రాలైన పట్టు చీరలు, రుమాలు, కార్పెట్, బెడ్షీట్స్, మ్యాట్లను పవర్లూమ్పై తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. గొల్లభామ కొచ్చి, ఆంధ్రప్రదేశ్, పోచంపల్లి చేనేతలకు బెంగళూరు, సూరత్, తమిళనాడు, గద్వాల చీరలను తమిళనాడు,కర్ణాటకలో పవర్ లూమ్లపై డూప్లికేట్ తయారు చేస్తున్నారు. దీని వల్ల చేనేత బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు 2003లో, గద్వాల చీరలకు 2009లో కేంద్ర ప్రభుత్వం జీయోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ(పేటెంట్) హక్కులను ఇచ్చింది. పోచంపల్లి చేనేత 11 డిజైన్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈచేనేతలను ఎవరైనా డూప్లీకేట్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన ఈపూరి భాస్కర్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కరోనా లాక్డౌన్లో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఐదు మగ్గాలు నిర్వహిస్తూ నూతన డిజైన్లతో పోచంపల్లి చేనేత చీరలు నేస్తున్నాడు. తనతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలోని మైక్రోబయాలజీ విభాగంలో తిరిగి ఉద్యోగంలో చేరాడు. చేనేత వృత్తిని వీడలేక ఉద్యోం చేస్తూనే కొనసాగిస్తున్నానని, కొత్తదనానికి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని భాస్కర్ అంటున్నాడు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రాజాపేట : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాజాపేట మండలంలోని దూదివెంకటాపురంలో పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.తాగునీరు, రవాణా సౌకర్యం, విద్య, వైద్యం, ఉపాధిహామీ పనులు, మహిళా సంఘాలకు రుణాలు, రేషన్కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, రెవెన్యూ, విద్యుత్ తదితర పథకాలు అమలుతీరుపై చర్చించారు. కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ త్వరిగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ కల్లా విద్యుత్ సబ్ స్టేషన్, హెల్త్ సబ్సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలీవరీలు చేయించుకోవాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎదురయ్యే ఇబ్బందులను గ్రామస్తులకు తెలియజేశారు. అనంతరం గ్రామంలోనే బస చేశారు. గురువారం ఉదయం గ్రామంలో తిరిగి సమస్యలు తెలుసుకుంటానని, వనోమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని, ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు ఫ దూదివెంకటాపురంలో పల్లెనిద్ర -
సంప్రదాయ డిజైన్లకు ఫ్యాషన్ జోడించాలి
చేనేత రంగంలోకి వచ్చే యువతను ప్రోత్సహించాలి. ముఖ్యంగా నిఫ్ట్ ద్వారా నూతన డిజైన్లపై శిక్షణ ఇప్పించాలి. ఇక్కత్లో సంప్రదాయ డిజైన్లలో ఫ్యాషన్లను జోడించి వినూత్నంగా తయారు చేస్తే మార్కెటింగ్ అవకాశాలకు కొదవ ఉండదు. పోచంపల్లి ఇక్కత్ కు అంతర్జాతీయంగా పేరుంది. కానీ అందుకనుగుణంగా పబ్లిసిటీ లేదు. అందుకే ఎయిర్ హోస్టేస్ తప్పని సరిగా చేనేత వస్త్రాలు ధరించేలా చూడాలి. దేశంలోని ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రధాన నగరాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసి హ్యాండ్లూమ్ను ప్రమోట్ చేయాలి. కల్యాణలక్ష్మి ఆర్థిక సహాయంతో పాటు పట్టు చీరను ప్రభుత్వం ఇవ్వాలి. –సాయిని భరత్, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, పోచంపల్లి -
పోచంపల్లి చీరలకు మంచి డిమాండ్
పోచంపల్లి ఇక్కత్ చీరల డిజైన్లు, కలర్స్ చాలా బెస్ట్గా ఉంటాయి. కుటీర పరిశ్రమలా ఇక్కడే చీరలను తయారు చేస్తారు. క్వాలిటీ, కలర్స్,డిజైన్లు మనసును హత్తుకునేలా ఉన్నాయి. ఇక్కడ కొత్తదనం ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. నేసే వారి దగ్గర చీరలు కొనుగోలుచేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. –ప్రవళిక, ఆన్లైన్ చీరల వ్యాపారి, మెహదీపట్నం, హైదరాబాద్ -
పొంగిన వాగులు
రెండు గంటల పాటు భారీ వర్షం ఫ అత్యధికంగా పోచంపల్లిలో 99 మి.మీ ఫ వాగులకు పోటెత్తిన వరద ఫ ముక్తాపూర్లో పాఠశాల తరగతి గదుల్లోకి వెళ్లిన నీరు ఫ నేడు, రేపూ వర్షాలు ఫ పలు మండలాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలుభువనగిరిటౌన్ : జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. పలు చోట్ల లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అత్యధికంగా భూదాన్పోచంపల్లిలో 99.3 మి.మీ, మోటకొండూరు 63మి.మీ, చౌటప్పుల్ 49మి.మీ, భువనగిరి 47మి.మీ, బీబీనగర్ 20మి.మీ, వలిగొండ 14 మి.మీ, బొమ్మలరామారం 10 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 3.39 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని, ఈ సీజన్లో ఇదే అధిక వర్షపాతం. రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశ ఉండటంతో పలు మండలాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భూదాన్పోచంపల్లి: మండల వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. సుమారు రెండుగంటల పాటు వర్షం కురిసింది. దాంతో చిన్నేరకు వరద ఉధృతి పెరిగి మెహర్నగర్–జలాల్పురం మధ్య ఉన్న లోలెవల్బ్రిడ్జి పైనుంచి ప్రవహించింది. వరదనీటితో భారీగా గుర్రపుడెక్కాకు కొట్టుకొచ్చి బ్రిడ్జి పై చేరింది. ఫలితంగా రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం మెహర్నగర్ గ్రామస్తులు జేసీబీతో బ్రిడ్జిపైన చేరిన గుర్రపుడెక్కను తొలగించారు. పంటపొలాలకు వచ్చే కాలువకు వరద ఉధృతి పెరిగి ముక్తాపూర్ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోకి నీరు చేరింది. పోచంపల్లి జెడ్పీస్కూల్ ఆవరణలో భారీగా వర్షపునీరు నిలిచి మడుగును తలపించింది. అలాగే కిచెన్ గార్డెన్ను వరదనీరు ముంచెత్తింది. మోటకొండూర్: వర్షానికి మోటకొండూర్ మండల కేంద్రంలోని పెద్దవాగు, కాటేపల్లి, చాడ, కొండాపూర్ గ్రామాల పరిధిలో బిక్కేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో మోటకొండూర్ – సికింద్రనగర్, కాటేపల్లి–సికింద్రనగర్, చందేపల్లి–చాడ, కొండాపురం–కాల్వపల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు చుట్టూ తిరిగి గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఆత్మకూరు(ఎం): మండల పరిధిలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొరిపిరాల, కొరటికల్, పోతిరెడ్డిపల్లి, టి. రేపాక కాజ్వేల పైనుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.చెక్డ్యాంలు పూర్తిగా నిండి అలుగుపోస్తున్నాయి. ఎంపీడీఓ రాములునాయక్, సూపరింటెండెంట్ లోకేశ్వర్రెడ్డి, ఎంపీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శి శేఖర్లు సందర్శించి ప్రజలకు సూచనలు చేశారు. -
నేడు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
భువనగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు గురువారం జిల్లాకు రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 7.10 గంటలకు బీబీనగర్కు చేరుకుంటారు. 7.30 గంటలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం గుట్టలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ నివాసానికి వెళ్లనున్నారు. ఆ తరువాత చేనేత దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్టలో చేనేత సహకార సంఘంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. 11.45 గంటలకు భువనగిరికి వస్తారు. పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో జరిగే జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవతంం చేయాలని కోరారు. యాదగిరి క్షేత్రంలో సీసీ కెమెరాల పరిశీలన యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుధవారం యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్నాయుడు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అంతకుముందు ఆలయ ఈఓ వెంకట్రావును కలిసి భక్తులు, ఆలయ భద్రతపై చర్చించారు. ఆయన వెంట పట్టణ సీఐ భాస్కర్, ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. నేడు పోచంపల్లికి దత్తాత్రేయ రాకభూదాన్పోచంపల్లి: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం భూదాన్పోచంపల్లికి రానున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత సహకార సంఘం భవనంలో చేనేత కార్మికులతో ముఖా ముఖి సమావేశం నిర్వహించనున్నారు. అదే విధంగా కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నట్లు పో చంపల్లి చేనేత సంఘం నాయకులు తెలిపారు. గుట్టలో ఫుడ్ ఫెస్టివల్ యాదగిరిగుట్ట: వంద రోజుల ప్రణాళికలో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక అంగడిబజార్లో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మహిళా సంఘాలు, మెప్మా సిబ్బంది, వీధి వ్యాపారులు ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు హాజరై వంటకాలను రుచి చూశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, అధికారులు ఉన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధవారం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ముగిశాయి. ఈ నెల 4వ తేదీన ఆలయంలో శ్రీస్వామి వారి పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. రెండ్రోజుల పాటు ఆలయంలో వివిధ పూజలు నిర్వహించిన అర్చకులు, బుధవారం ఉదయం ప్రాకార మండపంలోని యజ్ఞశాలలో హోమాధి పూజలు జరిపించి, మహా పూర్ణాహుతి చేపట్టారు. ఉదయం 8.30గంటల నుంచి ద్వార తోరణ, ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర, పరివార శాంతి, ప్రాయశ్చిత హోమం, శాలాబలి నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను, పవిత్రమాలలను ఊరేగింపుగా ప్రధానాలయానికి తీసుకెళ్లారు. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులు, సువర్ణ పుష్పార్చన ఉత్సవమూర్తులు, ఆళ్వారులకు పవిత్ర మాలలను ధరింపజేసి, ప్రత్యేక పూజలు చేపట్టారు. వేడుకల్లో ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అర్చకులు, పారాయణీకులు, పండితులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో సైతం పవిత్రోత్సవాలను వైభవంగా ముగించారు. నేటి నుంచి నిత్యపూజలు పునఃప్రారంభం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరిగిన పవిత్రోత్సవాల సందర్భంగా మంగళ, బుధ వారాల్లో శాశ్వత, నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను ఆలయ అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన నేపథ్యంలో గురువారం నుంచి ఈ పుజలను పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.