Yadadri District Latest News
-
నిర్దేశిత గడువులోగా పనులు
సాక్షి, యాదాద్రి : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్ 2026 అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ముఖ్యకార్యనిర్వహణాధికారి శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి , డీఆర్ఓ జయమ్మ, డీపీఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ , వివిధ మండలాల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన భువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామ పంచాయతీ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అదనపు కలెక్టర్ భాస్కర్రావు మంగళవారం పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సౌకర్యాలు కల్పించాలని అధికారులను అదేశించారు. మౌలిక వసతుల పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ కార్పొరేషన్ పీడీ అలివేలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ రవికిరణ్, రాకేష్కుమార్, ఏఈ గీత, తహసీల్దార్, ఎంపీడీఓలు శ్రీనివాస్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
నర్సింగ్ కళాశాలకు శాశ్వత భవనం
భువనగిరి: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి అడుగు పడింది. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో రూ. 26 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి బుధవారం మంత్రులు భూమిపూజ చేయనున్నారు. ఏడాది కాలంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. అద్దెభవనంలో.. ప్రభుత్వం 2024లో జిల్లాకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల మంజూరు అయిన ఏడాదిలోనే కళాశాలలో అడ్మిషన్లుసైతం జరిగాయి. దీంతో అప్పటికప్పుడు పట్టణంలో అద్దె భవనంలో కళాశాలను నిర్వహించారు. ఇప్పటివరకు కళాశాలకు రెండు బ్యాచ్ల విద్యార్థులు వచ్చారు. బ్యాచ్కు 60 మంది చొప్పున అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రస్తుతం కళాశాలలో 120మంది విద్యార్థులు ఉండటంతో అద్దె భవనంలో ఇబ్బందులు ఎదురుకావడంతో మరో అద్దె భవనంలోకి మారారు. జీప్లస్ 3 విధానంలో.. ప్రస్తుతం అద్దెభవనంలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు అద్దె చెల్లింపువిషయాన్ని దృష్టిలో పెట్టుకుని కళాశాల ప్రిన్సిపల్ పలుమార్లు శాశ్వత భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞిప్తిచేశారు. ఉన్నత అధికారుల సహకారంతో చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం జిల్లాకు చెందిన నర్సింగ్ కళాశాల నూతన భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతోపాటు రూ. 26కోట్లు మంజూరు చేసింది. దీంతో భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో 5 ఎకరాల స్థలాన్ని పరిశీలించి భవన నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించి అక్కడే కళాశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా టీజీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో ఈ భవనాన్ని జీప్లస్ 3 విధానంలో నిర్మించనున్నారు. సంవత్సరం వరకు భవన నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు 240 మంది విద్యార్థులు ఉండేలా భవన నిర్మాణాలు జరగనున్నాయి. ఏ బ్లాక్లో బోధన గదులు, బీ బ్లాక్లో హాస్టల్ వసతి గల భవనాలను నిర్మించనున్నారు. ఫ ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో 5 ఎకరాల స్థలం కేటాయింపు ఫ భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు ఫ నేడు మంత్రుల చేతులమీదుగా శంకు స్థాపన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణాకి బుధవారం శంకు స్థాపన చేయనున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి హాజరు కానున్నారు. -
క్రీడల్లోనూ రాణించాలి
భువనగిరి: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, నల్లగొండ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో సమయాన్ని వృథా చేయకుండా క్రీడల్లో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ టి. శ్రీవాణి, నిర్వాహకులు అమీనుద్దీన్, అబోతుల కేతన్, సతీష్, ఇబ్రహీం పాల్గొన్నారు. సేవలకు ప్రతిరూపం నర్సులుభువనగిరి: సేవలకు ప్రతిరూపం నర్సులు అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు నర్సులు అందించే సేవలు వెలకట్టలేనిదన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నర్సింగ్ అధికారులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్లు వీణ, రామకృష్ణ, డిప్యూటీ డెమో పద్మసత్యవతి, సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో గజవాహన సేవ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గజవాహన సేవను వైభవంగా జరిపించారు. మంగళవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా పాలతో నిజాభిషేకం జరిపించి, సహస్ర నామార్చన , అష్టోత్తరం వంటి పూజలను చేపట్టారు. ఇక ప్రఽథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవాన్ని భక్తుల మధ్య జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. శ్రీస్వామి వారికి నివేదన జరిగిన తరువాత పవళింపు సేవను నిర్వహించి, ద్వార బంధనం చేశారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి కారణజన్ములుచౌటుప్పల్ : శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కారణజన్ములని శ్రీజగద్గురు శ్రీకాంతేంద్రస్వామీజీ తెలిపారు. చౌటుప్పల్లో నూతనంగా నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శ్రీగోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు మంగళవారం రెండవరోజు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా వేడుకల్లో పాల్గొన్న శ్రీజగద్గురు శ్రీకాంతేంద్రస్వామీజీ.. పోతులూరి బాషణం చేశారు. చిన్నపాటి బ్యాక్టీరీయా నుంచి మానవ రూపం వరకు ఎన్నో కోట్ల జన్మలు పొందిన గొప్ప భగవత్ స్వరూపులని తెలిపారు. ఈ వేడుకల్లో మనుమయ సంఘం అధ్యక్షుడు పంతంగి మదనాచారి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కందుకూరి కిషోర్కుమార్చారి, దేవాలయ కమిటీ అధ్యక్షుడు పోలోజు శ్రీనివాసచారి, భక్తులు పాల్గొన్నారు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దు
సాక్షి, యాదాద్రి : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సీఎం రేవంత్రెడ్డి ..ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కాంటా వేయాలన్నారు.తూకం పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద, మిల్లుల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా కాంట్రాక్టర్లతో మాట్లాడి అదనపు లారీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని వారు రోజూ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ హరికృష్ణ, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రోజా రాణి, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి మురళి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
ఉపాధి హామీ పథకంతో నీటి సంరక్షణ
భువనగిరి: ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు నీటి సంరక్షణకు ఎంతో దోహదపడుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ మోనా యాస్మిన్ అన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని హన్మాపురం, తాజ్పూర్ గ్రామాలలో ఉపాధి హామీ పనులను వాటి నాణ్యతను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనుల అమలులో నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. అంతకు ముందు ఇంకుడు గుంతలు, ఏరియా ఆఫీసర్ యాప్ లో నమోదు చేసిన ఫొటోలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ జంగారెడ్డి, ఏపీడీ నవీన్, ఆయా గ్రామాల సర్పంచ్లు ర్యాకల సంతోషశ్రీనివాస్, నాయిని సువర్ణకృష్ణ, ఎంపీఓ దినకర్ సిబ్బంది ఉన్నారు. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి భూదాన్పోచంపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ మోనా యాసిన్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆమె పోచంపల్లి మండలంలోని గౌస్కొండ, శివారెడ్డిగూడెం గ్రామాలను సందర్శించారు. గౌస్కొండలో మహిళ సంఘాలకు సబ్సిడీపై అందజేసిన ప్యాడీ క్లీనర్లను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద శివారెడ్డిగూడెం, దంతూర్ గ్రామాల మధ్యన చిన్నేటిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎన్ని గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని, పనుల్లో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ బొక్క మల్లారెడ్డి ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, భాస్కర్, అడిషనల్ డీఆర్డీఓ సురేశ్, కోట జంగారెడ్డి, డీఈ ప్రసాద్, ఏపీఎం తౌర్యానాయక్, ఏపీఓ కృష్ణమూర్తి, పీఆర్ ఏఈ జగపతిబాబు, ఉపసర్పంచ్ వాకిటి బాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు హరిత, రజిత, సీసీ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.ఫ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మోనా యాస్మిన్ -
లక్ష తమలపాకులతో సహస్ర నామార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అర్చకులు మంగళవారం విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని ఆంజనేయస్వామికి అర్చకులు అంతరంగింకంగా సంప్రదాయ పూజలు జరిపించారు. అనంతరం కొండపై విష్ణు పుష్కరిణి వద్ద, అనుబంధ పాతగుట్ట ఆలయాల్లో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అష్టోత్తర శతమన్యుసూక్త పారాయణాలతో అభిషేకం చేశారు. శ్రీస్వామి వారికి సింధూరంతో విశేషంగా అలంకరించి, లక్ష తమలపాకులతో నాగవళ్లీ (తమలపాకుల)లతో సహస్ర నామార్చన నిర్వహించారు. తరువాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేపట్టి, వేద పఠనం చేశారు. శ్రీస్వామి వేడుకల్లో ఈఓ భవానీ శంకర్, భక్తులు పాల్గొన్నారు. -
పది ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ఆలేరు: పదో తరగతి ఫెయిలైన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆలేరు పట్టణంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫెయిలైన విద్యార్థుల కోసం శిక్షణ తరగతులను డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. ఒకట్రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్టు, ఇందు కోసం జిల్లాలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రెగ్యులర్గా తరగతులకు పంపించాలని కోరారు. సమ్మర్ క్రీడా శిబిరాల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు చేరవచ్చన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావానికి గురికాకుండా సమ్మర్ క్యాంప్లను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు.అనంతరం పర్యావరణ పరిరక్షణ అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం, డ్యాన్స్, నాటిక తదితర పోటీల్లో గెలిచిన విద్యార్థులకు డీఈఓ సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల ఆవరణలో ఆయన మొక్కను నాటారు. ఎంఈఓ ఎర్ర లక్ష్మి,జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, హెచ్ఎం దాసరి మంజుల, ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, మేఘరాజు, తిరుపతి, పీడీ పూల నాగయ్య, పీఈటీ కవిత పాల్గొన్నారు.ఫ డీఈఓ సత్యనారాయణ -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి..
నిడమనూరు : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన గోవిందు అలియాస్ గణేష్ (29)ముకుందాపురంలోని ఫంక్షన్హాల్లో వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా.. గ్రామశివారులోని మూలమలుపు వద్ద అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోవిందు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేష్ తెలిపారు. కాగా బుధవారం గోవిందు మొదటి వివాహ వార్షికోత్సవం అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చౌటుప్పల్ : మండలంలోని తూప్రాన్పేట గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్పేట గ్రామానికి చెందిన బక్కతట్ల జంగయ్య(57) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం మంగళవారం ద్విచక్ర వాహనంపై హైదరాబాద్కు బయల్దేరాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని భాస్కర్ ఆగ్రో కెమికల్ పరిశ్రమ వద్దకు వెళ్లగానే గుర్తుతెలియని బిచ్చగాడు అకస్మాత్తుగా వచ్చి బైక్ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న జంగయ్య ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. బిచ్చగాడికి సైతం గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ..చౌటుప్పల్ : బాత్రూంలో కాలుజారి కిందపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని రత్నానగర్కాలనీకి చెందిన కొత్తూరు నరేందర్(62) కూలీ పనులు చేస్తుంటాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని బాత్రూంలో ఆయన కాలుజారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు నాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఎయిమ్స్లో రక్తదాన శిబిరం భువనగిరి(బీబీనగర్) : అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బీబీనగర్ ఎయిమ్స్లో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతకుముందు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ డాక్టర్ లత, మెడికల్ సూపరింటెండెంట్ కుల్దీప్ జీబీ, డిప్యూటీ డైరెక్టర్ రజనీస్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితా అగర్వాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలోనూ గురుతర బాధ్యత
నడిగూడెం : గత పదేళ్లుగా క్రీడాకారులకు వివిధ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నడిగూడెం మండల కేంద్రానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లపు నాగేశ్వరరావు. ప్రస్తుతం ఆయన మోతె మండలం తుమ్మగూడెం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్యచౌదరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత పదేళ్లుగా వేసవిలో ప్రత్యేక క్రీడా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో నడిగూడెంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన బృందావనపురం, వేణుగోపాలపురం, చాకిరాల, చెన్నకేశవాపురంతో పాటు మునగాల మండలంలోని కృష్ణానగర్, నారాయణగూడెం గ్రామాలకు చెందిన విద్యార్థులకు పాల్గొంటున్నారు. పోలీసుల ఉద్యోగాలకు సన్నద్దమయ్యే అభ్యర్దులకు సైతం ఆయన ఉచితంగా శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పిస్తున్నారు. ఆయన ద్వారా శిక్షణ పొందిన పలువురు పోలీసు ఉద్యోగాలు సైతం సాధించారు. వేసవి వచ్చిందంటే చాలు నడిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నాగేశ్వరరావు పేరు గుర్తుకు రావాల్సిందే. ప్రస్తుత వేసవిలో కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం క్రీడాకారులతో క్రీడా ప్రాంగణం కళకళలాడుతోంది. ఫ పదేళ్లుగా క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు ఫ పోలీసు ఉద్యోగార్థులకు సైతం మెళకువలు -
అట్రాసిటి కేసులో ఇద్దరికి జైలుశిక్ష
రామగిరి(నల్లగొండ): అట్రాసిటి కేసులో ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎన్. రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. చందంపేట మండలం గన్నెపల్లి గ్రామానికి చెందిన నక్క పర్వతాలు డిండి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నారు. తనను వివాహం చేసుకోవాలని యువతి కోరగా.. పెళ్లికి నిరాకరించడంతో పాటు పర్వతాలు, అతడి అత్త నీలం సత్తమ్మ కలిసి యువతిని కులం పేరుతో దూషించారు. దీంతో సదరు యువతి 2013లో డిండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ వాదనలతో ఏకీభవించిన జడ్జి ఎన్. రోజారమణి.. నిందితులు నక్క పర్వతాలుకు పలు సెక్షన్ల కింద 11 ఏళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమానా, నీలం సత్తమ్మకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. చెక్డ్యాంలో పడి ఎద్దు మృతిఅడ్డగూడూరు : మండల పరిధిలోని చిన్నపడిశాల గ్రామంలో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాం నీళ్లలో పడి ఎద్దు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. వివరాలు.. అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామనికి చెందిన గోడిశాల సోమయ్య ఎద్దు చెక్డ్యాంలో నీళ్లు తాగడానికి వెళ్లి ప్రమాదవాశాత్తు నీట మునిగి మృతిచెందింది. ఎద్దు విలువ సూమారు రూ.80వేలు ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. వ్యక్తి అదృశ్యంకొండమల్లేపల్లి : భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలు.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గండూరి రఘుకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తన భార్యతో గొడవ పడి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత వెతికినా రఘుకుమార్ ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య శైలజ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూదరుల అరెస్ట్ చిలుకూరు : మండలంలోని ఆర్లెగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచి పోలీసులు దాడి చేపి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పోలీసులను చూసి పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.6500 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ చోరీ నాగారం : ఎరువుల దుకాణం ముందు పార్కింగ్ చేసిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన నాగారం మండలం నాగారం బంగ్లాలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)గా పనిచేస్తున్న ఎన్. సాయిరాజ్ సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని పోలీస్ స్టేషన్కు సమీపంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణం ముందు తన బైక్ను పార్కింగ్ చేసి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
చిట్యాల : చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, పంచలోహా విగ్రహాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి తెలిపారు. చిట్యాల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. జైలులో పరిచయంతో.. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య(26) బీకాం కంప్యూటర్స్ పూర్తిచేసి లాజిస్టిక్స్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. జల్సాలకు అలవాటుపడి చోరీ కేసులో జైలుకు వెళ్లటంతో ఉద్యోగం కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన బత్తిని నరేష్ అలియాస్ లవ్లీ నరేష్(29) వాహనాల చోరీ కేసులో జైలుకు వెళ్లాడు. వీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత వారిద్దరు హైదరాబాద్లో రూం అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు కలిసి హైదరాబాద్, మేడ్చల్, దుండిగల్, అమీన్పూర్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లా చిట్యాలలో బైక్లు, స్కూటర్లు చోరీ చేశారు. అంతేకాకుండా మెదక్ జిల్లా తూప్రాన్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీకి పాల్పడి విలువైన పంచలోహా విగ్రహాన్ని, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చిట్యాలలో పట్టుబడిన దొంగలు.. నరేష్, నీలయ్య స్కూటర్పై మంగళవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా.. నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డు వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆరు ద్విచక్ర వాహనాలు, పంచలోహ దుర్గాదేవి విగ్రహం, టీవీ, ల్యాప్టాప్, ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. చోరీ చేసిన సొత్తును వారు హైదరాబాద్లో అద్దెకు ఉంటున్న రూంలో ఉంచినట్లు తెలపడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10లక్షలకు పైగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవటంలో చురుకుగా వ్యవహరించిన చిట్యాల ఎస్ఐ రవికుమార్ను డీఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. ఫ రూ.10లక్షలకు పైగా సొత్తు స్వాధీనం -
పనికి వెళ్లమని మందలించినందుకు..
బొమ్మలరామారం : పనికి వెళ్లమని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బొమ్మలరామారం మండలంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన ఎండీ. నజీర్(21) ప్లంబర్ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కాగా.. కొంతకాలంగా నజీర్ పనికి వెళ్లకుండా గ్రామంలో ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో పనికి వెళ్లమని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన నజీర్ మంగళవారం బొమ్మలరామారం మండలం పక్కీరుగూడెం శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు. నజీర్ తండ్రి గతేడాది వాగులో చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య -
ధాన్యం విక్రయించిన నగదు అపహరణ
ఫ బ్యాంకు నుంచి డ్రా చేసి ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టిన రైతు ఫ దారిలో ముంజలు కొంటుండగా.. చోరీ చేసిన గుర్తుతెలియని వ్యక్తి హుజూర్నగర్ : ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టిన నగదును అపహరించిన ఘటన మంగళవారం హుజూర్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం అంజలీపురం గ్రామానికి చెందిన రైతు కార్లపూడి కాంతారావు ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు అతడి యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమయ్యాయి. మంగళవారం రూ.80 వేలు డ్రా చేసుకుని తన ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టాడు. కానీ డిక్కీకి తాళం లేదు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో ద్విచక్ర వాహనం దిగి తాటిముంజలు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. తీరా ఇంటికి వెళ్లి చూసేసరికి డిక్కీలో ఉండాల్సిన రూ.80 వేల నగదు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్ అధికారులను సంప్రదించి పట్టణంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. తాటిముంజలు కొనే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి డిక్కీలోని డబ్బులు దొంగించినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాములునాయక్ తెలిపారు. మూగజీవాలను తరలిస్తున్న డీసీఎం పట్టివేత చౌటుప్పల్ : అక్రమంగా మూగజీవాలను తరలిస్తున్న డీసీఎంను చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ తన డీసీఎంలో ఏపీలోని జగ్గంపేట సంత నుంచి మూగ జీవాలను హైదరాబాద్కు తీసుకెళ్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు డీసీఎంను ఆపగా.. అందులో ఆవులు 10, లేగ దూడలు 5, ఎద్దులు 4, కోడె దూడలు 4 ఉన్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు -
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో మామిడి పండ్లు విక్రయిస్తున్న బండ్లు, వాహనాలను మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా మామిడి పండ్లు మగ్గుబెట్టేందుకు వ్యాపారులు గోల్డ్ రైప్, ఎన్ రైప్ వంటి ఇథిలీన్ గ్యాస్ విడుదల చేసే సాచెట్లను వినియోగిస్తున్నట్లు గుర్తించామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివశంకర్రెడ్డి తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఇథిలీన్ వినియోగం అనుమతించబడిన విధానమని తెలిపారు. రెండు మామిడి పండ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు వివరించారు. -
డెస్టినేషన్ వెడ్డింగ్కు కేంద్రంగా సాగర్
నాగార్జునసాగర్ : సాగర్ను దేశంలోనే మొదటి డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా, బుద్ధవనాన్ని మరో తిరుపతిలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజులుగా నాగార్జునసాగర్లో పర్యటిస్తున్న ఆయన మంగళవారం లాంచీలో నాగార్జునకొండకు చేరుకుని పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం నాగార్జునకొండపై పునర్నిర్మితమైన అశ్వమేధ యజ్ఞశాల, మహాస్థూపం, సింహళ విహారాలను పరిశీలించి వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ దర్శన్ పథకం కింద బుద్ధవనం పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.500కోట్లతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. నాగార్జునకొండ పక్కనే గల చాకలి గట్టును అభివృద్ధి చేయడంతో పాటు హౌస్ బోట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. 20 నుంచి 30మంది పర్యాటకులు ప్రయాణించేలా ఆధునిక సౌకర్యాలతో బోట్లను త్వరలో అందుబాటులోకి తీసుకరానున్నట్లు పేర్కొన్నారు. వారికి టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్, నాగార్జున కొండ మ్యూజియం చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డీఈ శ్రీనివాసరెడ్డి, బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, హరిత విజయవిహార్ మేనేజర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి -
మోదీ ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలి
చౌటుప్పల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని విదేశీ వ్యవహారాలను చక్కదిద్దాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హితవు పలికారు. చౌటుప్పల్లో మంగళవారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్త్రతస్థాయి సమావేశానికి ఆయన హాజరై అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విదేశీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు యుద్ధం కారణమైనప్పటికీ ఇందులో ప్రధానమంత్రి వైఫల్యం కూడా ఉందన్నారు. గతంలో చట్టసభల్లో చర్చలు జరుగుతున్నాయంటే ప్రజలకు ఎంతో మేలు జరిగేదని, ప్రస్తుతం చట్టసభలు ఏర్పాటు చేసి ప్రజలు సాధించుకున్న హక్కులను హరించేందుకు చట్ట సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని 29చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లను అమలు చేస్తున్నారని, తద్వారా ప్రజల హక్కులపై దాడి జరిగిందన్నారు. డీలిమిటేషన్ పేరిట తమకు అనుకూలమైన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పెంచుకునేందుకు మహిళా బిల్లును బూచిగా పెట్టిందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు మినహా ఇతర హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య మాట్లాడుతూ ఇరాన్ దేశంపై ఇజ్రాయిల్, అమెరికా దేశాలు దాడులు చేస్తుంటే కనీసం ఖండించలేని దుస్థితిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని తెలిపారు. అమెరికాతో ఉన్న అంబానీ, అదానీల వ్యాపారాలను కొనసాగించేందుకే ట్రంప్కు దాసోహం అయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, ఎం.డి.పాష పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
ఇందిరమ్మ ఇంట.. బిల్లుల తంటా
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిధులను అనుసంధానం చేసింది.అయితే వీటి విడుదలలోనూ జాప్యం జరుగుతోంది.ఉపాధి హామీ 90 రోజుల పనికి సంబంధించి రూ. 27 వేలు రావాల్సి ఉండగా, నెలల తరబడి ఫొటోలు దిగుతున్నా పూర్తిస్థాయి డబ్బులు జమ కావడం లేదు.ఆవాస్ యోజన కింద రావాల్సిన రూ. 21 వేలు ఆలస్యం అవుతున్నాయి.స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ. 12 వేల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి యాదాద్రి: సొంతింటి కలను నిజం చేసుకునేందుకు అప్పోసొప్పో చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న నిరుపేదలకు ఇప్పుడు బిల్లుల కష్టాలు మొదలయ్యాయి. ఇంటి నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన తుది విడత నిధులు అందకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు పూర్తయినా, బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో అరువు తెచ్చిన సామగ్రికి డబ్బులు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిల్లుల కుదింపు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలను వందశాతం సబ్బిడీతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం తొలుత నాలుగు దశల్లో బిల్లులు ఇస్తామని ప్రకటించింది. వీటిలో పునాది స్థాయిలో రూ. 1 లక్ష, పిల్లర్ల నిర్మాణం తర్వాత రూ. 2 లక్షలు, స్లాబ్ వేసిన తర్వాత ఇచ్చే మూడో బిల్లును రూ. 2 లక్షల నుంచి రూ. 1.40 లక్షలకు కుదించింది. నాలుగో దశలో రూ.60వేలను వివిధ పథకాలకింద ఇస్తారు. 9,618 ఇళ్లు మంజూరు జిల్లాలోని ఆలేరు, భువనగిరి, తుంగుతుర్తి, మునగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో గత సంవత్సరం తొలివిడత 9618 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 2087 ఇళ్లు పూర్తి అయ్యాయి. ఆలేరు నియోజకవర్గం ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో ప్రథమ స్థానం, భువనగిరి ద్వితీయస్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇళ్ల నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా తుది బిల్లులు రావడంలేదు. దీంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం ఎదురు చూపులు ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు తెలిసిన వారి వద్ద అప్పులు చేయడం, సామగ్రిని అరువు కూడా తెచ్చుకున్నారు. నిర్మాణం పూర్తయితే బిల్లులు వస్తాయని, ఆ డబ్బుతో అప్పులు తీర్చవచ్చని ఆశించారు. కానీ, జిల్లాలో ఇప్పటికే 2,087 ఇళ్లు పూర్తయినా తుది బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో అధికారులను నిత్యం వాకబు చేస్తున్నారు. ప్రారంభించని ఇళ్లు రద్దు నిర్మాణాలు ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 1142 ఇళ్లు రకరకాల కారణాలతో ప్రారంభం కాలేదు. వీటిని అధికారులు రద్దు చేస్తున్నారు. ఫ ఇల్లు పూర్తయినా అందని తుది బిల్లు ఫ ఇప్పటివరకు పూర్తయినవి 2087 ఫ అప్పుల ఊబిలో లబ్ధిదారులు ఫ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు -
పేదలందరికీ సంక్షేమ ఫలాలు
యాదగిరిగుట్ట: ప్రజా ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గూడులేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి గృహం ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి, వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య, కౌన్సిలర్లు కాటబత్తిని స్వప్న, ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
విద్యుదాఘాతంతో రైతు మృతి
హుజూర్నగర్ : వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన హుజూర్నగర్ మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన మేకపోతుల వీరస్వామి(48) పొలం వద్దకు వెళ్లి చాలాసేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుమారుడు వినయ్ పొలానికి వెళ్లి చూడగా బోరు మోటారు వద్ద వీరస్వామి విద్యుదాఘాతానికి గురై పడిపోయి కనిపించాడు. గ్రామస్తుల సహకారంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయించి వీరస్వామిని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దేవుడి వరం.. అందుకే ఏడుస్తాం మనం
విజ్ఞానం.. వినోదం ఫ వేసవి సెలవుల్లో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్న విద్యార్థులుభువనగిరి : సాధారణంగా వేసవి సెలవుల్లో విద్యార్థులంతా ఆటలు ఆడుతూ.. అమ్మమ్మ ఊరికి వెళ్లి సరదాగా గడుపుతుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి అని భావించిన కొందరు విద్యార్థులు కంప్యూటర్, టైపింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో 6 నుంచి 14 ఏళ్ల లోపు విద్యార్థులు ఎక్కువగా ఈ శిక్షణ కేంద్రాల్లో చేరుతున్నారు. టైపింగ్ నేర్చుకోవడం వల్ల కంప్యూటర్ కీబోర్డుపై పట్టు వస్తుందని భావించి ముందుగా టైపింగ్ ఎంచుకుంటున్నారు. పిల్లల వయస్సు, వారి జ్ఞానానికి అనుగుణంగా శిక్షణ సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. కంప్యూటర్, టైపింగ్ శిక్షణ కేంద్రాలు బిజీబిజీగా ఉంటున్నాయి.టైపింగ్ నేర్చుకుంటున్నా.. వేసవి సెలవులు వృథా చేయకూదడని నిర్ణయించుకున్నాను. ఏదో ఒక కోర్సు నేర్చుకోవాలని కంప్యూటర్, టైపింగ్ నేర్చుకుంటున్నా. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నా. – మెర్లిన్, 6వ తరగతి, భువనగిరి కంప్యూటర్ శిక్షణ బాగుంది ఉదయం స్నేహితులతో ఆడుకుంటూ నే.. సాయంత్రం రెండు గంటల పాటు కంప్యూటర్ నేర్చు కోవడం కోసం సమయం కేటాయిస్తున్నా. కోచింగ్ సెంటర్లో కంప్యూటర్ నేర్చుకోవడం బాగుంది. – అమ్జ, 5వ తరగతి, భువనగిరి స్పోకెన్ ఇంగ్లిష్పై పట్టు..చిట్యాల : పట్టణానికి చెందిన లెక్చరర్ కందుల గణేష్ ప్రతి వేసవిలో నామమాత్రపు ఫీజు తీసుకుని స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో ఆయన వద్దకు ప్రతిరోజు సుమారు 30మందికి పైగా విద్యార్థులు హాజరవుతూ ఇంగ్లిష్ మాట్లాడే నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇంగ్లిష్లో రోజువారి సంభాషణలు, ఉచ్ఛారణ, వాక్య నిర్మాణం, ఇంటర్వ్యూ వంటి అంశాలపై లెక్చరర్ గణేష్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. -
ధాన్యం కాంటా వేయడంలో అధికారుల నిర్లక్ష్యం
ఫ ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి ఫ రైతు సంఘం నేతల డిమాండ్చౌటుప్పల్ : కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులుకాస్తున్నా అధికారులు మాత్రం కాంటాలు వేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడి వేగంగా తూకాలు వేయాలని, అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతూకాలు వేసిన ధాన్యం బస్తాలను సకాలంలో ఎగుమతి కూడా చేయడంలేదన్నారు. మిల్లుల వద్ద దిగుమతి చేసుకునే సమయంలో తరుగు పేరిట అధనంగా రైతులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు చీరిక అలివేలు, ఎండి.పాష, గోశిక కరుణాకర్, బండారు నర్సింహ, ఆకుల ధర్మయ్య, పర్నె ధర్మారెడ్డి, బొడ్డు అంజిరెడ్డి, పొట్ట శ్రీను, బొజ్జ బాలయ్య, జక్కిడి గోపాల్రెడ్డి, అంజిరెడ్డి, చీరిక సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి, లింగయ్య, కృష్ణ, శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ని పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ.. బాలికను వేధించి అత్యాచారానికి పాల్పడినందున సంజయ్ని ప్రధాని మోదీ తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లేనిపక్షంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మంత్రి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. లైగింక వేధింపులకు గురైన బాలిక ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే తీసుకోకుండా 8గంటల పాటు నిరీక్షింప చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోక్సోచట్టం కింద కేసు నమోదైతే అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వ్యహరిస్తుంటే ప్రభుత్వం చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలుచేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బాలిక వద్ద నుంచి సిట్టింగ్ జడ్జి చేత వాంగ్మూలం నమోదు చేయించిన తర్వాతనే విచారణ జరిపించాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, జనగాం పాండు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జక్కా రాఘవేందర్రెడ్డి, నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, ర్యాకల శ్రీనివాస్, జెడ్పీ మాజీ సభ్యుడు బీరు మల్లయ్య, మున్సిపల్మాజీ చైర్మన్ పెంట నర్సింహ, కౌన్సిలర్ నగేష్, చెన్న మహేష్, ఎక్బాల్ చౌదరి, జహంగీర్, భిక్షపతి సుభాష్, అజీమొద్దీన్ పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి -
ఇళ్ల గణన ప్రారంభం
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి గృహ గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు సరైన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గృహ గణన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ .. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 30, 31 వార్డుల్లో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న గృహగణన ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. హెచ్ఎల్బీ సరిహద్దుల నిర్ధారణ, ఇంటింటి సమాచార సేకరణ, మ్యాపుల ఆధారంగా ఫీల్డ్ వెరిఫికేషన్ తదితర అంశాలపై అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సూచనలు చేశారు. జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గృహగణన ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితత్వంతో పూర్తిచేయడం ద్వారా భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలు కూడా జనగణన సిబ్బందికి సహకరించి సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. భువనగిరిటౌన్ : జనగణన–2027 మొదటి దశ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి గృహ గణనకు శ్రీకారం చుట్టారు. జూన్ 9 వరకు నెల రోజుల పాటు సాగే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లు జిల్లాలోని ప్రతి గడపను తట్టనున్నారు. గృహ గణనతో పాటు నివాస వసతులు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, గణన తీరును పరిశీలించారు. పకడ్బందీగా యంత్రాంగం ఏర్పాట్లు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఇళ్ల గణన సజావుగా సాగేందుకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాను మొత్తం 1,748 బ్లాకులుగా విభజించి, ప్రతి బ్లాకుకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున మొత్తం 1,461 మందిని నియమించింది. వీరి పనితీరు పర్యవేక్షణకు 257 మంది సూపర్వైజర్లను కేటాయించారు. ఎన్యుమరేటర్లు తొలి మూడు రోజులు తమకు కేటాయించిన పరిధిలోని ఇంటి నంబర్లను సరిచూసుకోవడం, సరిహద్దులను గుర్తించడం వంటి పనులు పూర్తి చేస్తారు. నాలుగో రోజు నుంచి మొబైల్ యాప్ ద్వారా అసలైన డేటా సేకరణ ప్రారంభమవుతుంది. ముగిసిన స్వీయ గణన ఈసారి జనగణనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియ ఆదివారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 6,259 మంది పౌరులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్న వారు ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తమ రిఫరెన్స్ ఐడీని చూపిస్తే సరిపోతుంది. వలసలు.. ఇతర ప్రాంతాల్లో నమోదుపై స్పష్టత జిల్లాలో నివసిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల వివరాల నమోదుపై అధికారులు కీలక వివరణ ఇచ్చారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నమోదు చేసుకున్నా, తుది గణాంకాల ప్రకారం వారి వివరాలు సొంత జిల్లాల ఖాతాలోకే చేరుతాయి. అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన వారు ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉండి అక్కడ వివరాలు నమోదు చేసినా, అవి జిల్లా జనాభా లెక్కల్లోకే వస్తాయని అధికారులు తెలిపారు.గడపగడప లెక్క ఫ రంగంలోకి 1,461 మంది ఎన్యుమరేటర్లు, 257 మంది సూపర్వైజర్లు ఫ ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ ఫ జూన్ 9వ తేదీ వరకు సర్వే ఫ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన కలెక్టర్ అనురాగ్ జయంతి -
అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తో కలిసి 75 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని, కొన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు అందజేయలేదన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. ట్యాబ్ ఎంట్రీలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
రసాయన జలాల శుద్ధి
రామన్నపేట: చేనేత వస్త్రాల అద్దకంలో వెలువడే రసాయన జలాల కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రామన్నపేట మండలం సిరిపురం గ్రామం వేదికగా సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. రసాయన, మురుగునీటిని శాసీ్త్రయ పద్ధతిలో శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక నీటిశుద్ధి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు ప్రస్తుతం విజయవంతంగా ట్రయల్ రన్ జరుపుకుంటోంది. 2024లో శంకుస్థాపన సిరిపురం చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. చేనేత వస్త్రాల తయారీలో వివిధ డిజైన్లకోసం సహజసిద్ధమైన వాటితో పాటు రసాయన రంగులను ఉపయోగిస్తుంటారు. అలా ఉపయోగించిన కాలుష్య కారకమైన నీరు మురుగు కాలువల గుండా ప్రవహించి సమీపంలోని కుంటలోకి చేరుతుంది. దీని కారణంగా కుంటలోని నీటితోపాటు భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గ్రామంలో హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ వారి రూ 2 కోట్ల ఆర్థిక సహకారంతో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. 2024 మార్చి 10వ తేదీన ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అప్పటి కలెక్టర్ జండగే హనుమంత్ దీని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చేనేత వస్త్రాల తయారీ కోసం రంగుల అద్దకంలో వాడిన రసాయన నీటిని శుద్ధిచేసి తిరిగి వాడుకోవడం, జల కాలుష్యంను తగ్గించాలనే లక్ష్యంతో ఐఐసీటీ వారు దేశంలోనే మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేశారు.ఫ సిరిపురంలో ఐఐసీటీ ఆధ్వర్యంలో రూ.2కోట్లతో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు ఫ దేశంలోనే తొలి రసాయన నీటి శుద్ధి ప్లాంట్ఫ ప్రారంభానికి సిద్ధంప్రస్తుతం ట్రయల్ రన్ దశలో.. గ్రామంలోని మెయిన్రోడ్డు వెంట అండర్గ్రౌండ్ డ్రెయిన్ను నిర్మించారు. గ్రామంలో రంగుల అద్దకంలో వాడే రసాయననీటితో పాటు, మురుగునీరు అండర్గ్రౌండ్ డ్రెయిన్లో కలిసే విధంగా ఏర్పాటు చేశారు. నీరంతా ఊరకుంట వద్ద ఏర్పాటు చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దకు చేరుతుంది. ప్రారంభంలో డ్రెయిన్గుండా వచ్చిన నీటిలోని వ్యర్థాలు, చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, ఆకులను మొదటి బ్లాక్లో శుద్ధి అయిన తరువాత సంప్లోకి చేరుతుంది. నీటిలోని కాలుష్య కారక పదార్థాలు, రసాయనాలను వివిధ దశల్లో బ్యాక్టీరియా సహకారంతో శుద్ధి చేస్తారు. చివరి దశలో నీటిని పరీక్షించి శాసీ్త్రయ ప్రమాణాలకు అనుగుణంగా నీరు శుద్ధి అయితే బయటకు పంపుతారు. లేకుంటే తిరిగి రీ ట్రీట్ చేస్తారు. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. త్వరలో అధికారికంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ప్లాంట్ విజయవంతం అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ విధమైన ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
భువనగిరి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 11 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ 3, ప్రైవేట్ కళాశాలల్లో 3 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణపై సిబ్బందితో పాటు పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు సూచనలు చేశారు. పరీక్షలకు హాజరు కానున్న 5627 మందివిద్యార్థులు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగన్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 5,627 మంది హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 3,417 మంది, ఒకేషనల్ విద్యార్థులు 519 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,342 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,342 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 17 మంది సీఎస్, డీఓలను నియమించారు. వీరితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఒకటి,రెండు సిట్టింగ్ బృందాలు ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఇద్దరిని కస్టోడియన్లుగా నియమించారు.అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ సురేష్రెడ్డి తెలిపారు.విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కావాలని కోరారు.పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు.ఫ 21తేదీ వరకు పరీక్షల నిర్వహణ ఫ 17 కేంద్రాలు ఏర్పాటు ఫ హాజరు కానున్న 5,627 మంది విద్యార్థులు -
హైవేపై డీజిల్ ట్యాంకర్, కారు బోల్తా
చిట్యాల : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో సోమవారం డీజిల్ ట్యాంకర్, కారు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్టేక్ చేయబోయి ఢీకొని అదుపుతప్పి హైవే పక్కన గల డివైడర్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్, కారు హైవేపై అడ్డంగా బోల్తా పడ్డాయి. కారులో ఏపీలోని నెల్లూరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని హైవేపై అడ్డంగా పడిపోయిన వాహనాలను క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించారు.ఫ ఇద్దరికి స్వల్ప గాయాలు -
ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు.. ఐదుగురికి గాయాలు
దేవరకొండ : ట్రాక్టర్ను కారు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులో సోమవారం జరిగింది. సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం తూర్పుపల్లి నుంచి కొండభీమనపల్లి ఽకొనుగోలు కేంద్రానికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ను కొండభీమనపల్లి శివారులో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వెంకన్న, శివ, అర్జున్, వేణు, ఆనంద్కు గాయాలయ్యాయి. వీరు డిండి మండలం కందుకూర్లో పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ తెలిపారు. సాగర్ బ్యాక్ వాటర్లో మునిగి యువకుడి మృతి చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీ వద్ద సాగర్ బ్యాక్ వాటర్లో మునిగి యువకుడు మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వంగపల్లి గిరిబాబు (28) ఆదివారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీకి వచ్చాడు. ఈ క్రమంలో సాగర్ బ్యాక్ వాటర్లో స్నానం చేస్తుండగా గిరిబాబు కాలు జారి నీటి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. చెరువులో మునిగి.. పెన్పహాడ్ : చెరువులో మునిగి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం లింగాలలో సోమవారం జరిగింది. లింగాల గ్రామానికి చెందిన గార్లపాటి సత్యనారాయణరెడ్డి(75) పాడి గేదెలు వారం క్రితం తప్పిపోయాయి. వాటిని వెతికే క్రమంలో గ్రామ శివారులోని ఎర్ర చెరువు వద్దకు వెళ్లిన అతడు చెరువు నీటిలోకి దిగి అప్పటికే అందులో ఉన్న గేదెలను బయటకు వెళ్లగొడుతుండగా.. ప్రమాదవశాత్తు నీట మునిగాడు. అక్కడే చెరువు కట్టపై ఉన్న తన మనుమడు మిర్యాల అరవింద్ చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు వచ్చి సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. మృతుడి కుమారుడు గార్లపాటి లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేటకు తరలించినట్లు ఏఎస్ఐ రాములు తెలిపారు. -
పదో తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం
గరిడేపల్లి : టీజీ పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష మే 13న జరగనుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వ్యవసాయ మరియు ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ చేరవచ్చని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త నరేష్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మరియు ఉద్యాన విశ్వవిద్యాలయాల కింద రెండు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. హార్టికల్చర్ పాలిటెక్నిక్.. గడ్డిపల్లిలోని ఘంటా గోపాల్రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ పరిధిలో ఉంది. ఈ కాలేజీలో రెండేళ్ల డిప్లొమా కోర్సు అందిస్తున్నారు. ఉద్యాన డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ● ప్రభుత్వ శాఖల్లో ఉద్యాన విస్తరణ అధికారి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. ● ఆయిల్ పామ్ కంపెనీల్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా, విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందుల కంపెనీల్లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేయవచ్చు. ● సొంతగా నర్సరీల స్థాపన, పురుగు మందుల దుకాణాలు, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ● ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ● పరిశోధన మరియు ఉన్నత విద్య (బీఎస్సీ హార్టికల్చర్) కొనసాగించేందుకు హార్టిసెట్ ద్వారా అగ్రశ్రేణి ఉద్యాన విశ్వవిద్యాలయాలు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. లేదా డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే లేటరల్ ఎంట్రీ ద్వారా చేరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. వ్యవసాయ పాలిటెక్నిక్..కంపాసాగర్లోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది. ఇందులోనూ రెండేళ్ల డిప్లొమా కోర్సు అందిస్తున్నారు. వ్యవసాయ డిప్లొమా కోర్సు ద్వారా విద్యార్థులు వ్యవసాయ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాల్లో శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని పొంది ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. వ్యవసాయ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు స్వయంగా వ్యవసాయ పరిశ్రమలు, నర్సరీలు ప్రారంభించవచ్చు. సీడ్ కంపెనీలలో టెక్నికల్ అసిస్టెంట్, వ్యవసాయ పరికరాల కంపెనీలలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయవచ్చు. ప్రభుత్వ నియమించే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈఓ) చేరవచ్చు. అదేవిధంగా డిప్లొమా పూర్తయిన తర్వాత విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్(అగ్రిసెట్) విద్యను కొనసాగించవచ్చు. లేదా డిగ్రీ కోర్సులకు లేటరల్ ఎంట్రీ ద్వారా చేరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. పాలీసెట్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం -
మహిళా కమిషన్ సభ్యురాలిగా కాసోజు శంకరమ్మ
మోత్కూరు : మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మితో పాటు ఏడుగురు సభ్యులను నియమించారు. ఏడుగురు సభ్యులలో కాసోజు శంకరమ్మ ఒకరు. రేపు పాలిసెట్ యాదగిరిగుట్ట: ఈ నెల 13వ తేదీన పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.రామానాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 4 కేంద్రాలు భువనగిరిలో, 2 కేంద్రాలు యాదగిరిగుట్టలో సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ ఆరు కేంద్రాల్లో 1,692 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలి పారు. పాలిసెట్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కోఆర్డినేటర్ రామానాయుడు తెలిపారు. నేడు హనుమాన్ జయంతి వేడుకలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి వారి ఆలయంలో, అనుబంధ పాతగుట్ట ఆలయాల్లో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఉదయం 9గంటలకు అష్టోత్తర శతమన్యుసూక్త పారాయణాలు, అభిషేకం, లక్ష తమలపాకులతో నాగవళ్లీ అర్చన, మహా నివేదన వంటి పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ భవానీ శంకర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ప్రధానాలయంలోని ఆంజనేయస్వామికి అంతరంగికంగా హనుమాన్ జయంతి పూజలు జరిపిస్తామని తెలిపారు. విష్ణు పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించే లక్ష తమలపాకుల అర్చనలో పాల్గొనే భక్త దంపతులకు రూ.516 టిక్కెట్ రుసుము ఉంటుందని పేర్కొన్నారు. పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంభువనగిరిటౌన్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ (రామంతాపూర్, బేగంపేట)లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందేందుకు జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి ఇన్చార్జ్ అధికారి జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ 2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు భువనగిరిలోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి మే 22న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక ఉంటుందని మరిన్ని వివరాలకు 9985956225 లేదా 9849704132 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. యువతకు ఉచితంగా ఉపాధి శిక్షణ భువనగిరిటౌన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, టీం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి పి.సాహితి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 12రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి, 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. నవజాత శిశువుల మనుగడకే ఎన్ఎన్ఎస్భువనగిరి(బీబీనగర్): బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో సోమవారం జాతీయ ఎన్ఆర్పీ వేడుకల్లో భాగంగా ప్రాథమిక నవజాత శిశు పునరుజ్జీవన వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిలకు చెందిన సుమారు 55 మంది నర్సులు హాజరయ్యారు. డాక్టర్ ఎస్కె మొహనసుందరి,ఎరా దీపిక దయాళ్ నర్సులకు ప్రసవానికి సన్నద్ధత, నవజాత శిశువు సంరక్షణ, పునరుజ్జీవ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ తనిగైనాధన్,డాక్టర్ గుర్రార్ష్ సింగ్ పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి
చౌటుప్పల్ : రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట శివారులో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన గురిజాల రాజశేఖర్(36) హైదరాబాద్లోని బాలానగర్లో ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాజశేఖర్ బంధువు చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన శుభకార్యానికి అతడు వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో తూప్రాన్పేట శివారులో ద్విచక్ర వాహనం నిలిపి.. విజయవాడ మార్గంలో ఉన్న చాచా దాబా వద్దకు వెళ్లి టీ తాగి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వచ్చి రాజశేఖర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ద్విచక్ర వాహనం అపహరణవలిగొండ : ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి చెందిన బతిని శెట్టయ్యగౌడ్ తన ద్విచక్ర వాహనాన్ని ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీఫ రూ.1.60లక్షల నగదు అపహరణ మోత్కూరు : తాళం వేసిన ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు అపహరించారు. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుజిలాపురం గ్రామానికి చెందిన దొంతి మత్స్యగిరి శనివారం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వలిగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో బొడ్రాయి పండుగకు బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు మత్స్యగిరి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచిన రూ.1,60,000 నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం మత్స్యగిరి ఇంటి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. -
పకడ్బందీగా ఇళ్ల గణన ప్రక్రియ
భువనగిరిటౌన్ : పకడ్బందీగా ఇళ్ల గణన ప్రక్రియ చేపట్టనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలన్నారు. ఏ ఒక్క కుటుంబం లేదా గృహ గణనలో వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న మూగజీవాల పట్టివేత
చిట్యాల : నిబంధనలకు విరుద్ధంగా ఆవులను తరలిస్తున్న లారీని సోమవారం చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైద్రాబాద్ వైపు లారీలో సుమారు 52 ఆవులను తరలిస్తుండగా.. చిట్యాలలోని రైల్వేస్టేషన్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని కబేళాకు ఆవులను తరలిస్తున్నట్లు తేలడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆవులను చింతపల్లిలోని గోశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఐదు ఆవుదూడలు.. హుజూర్నగర్ : ఆవుదూడలను తరలిస్తున్న వాహనాన్ని సోమవారం హుజూర్నగర్లో పోలీసులు పట్టుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ రాములునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున హుజూర్నగర్లో పోలీసులు వాహనాలు తనఖీ చేస్తుండగా.. ట్రాలీ వాహనంలో ఐదు ఆవుదూడలను హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకుని కారు, ట్రాలీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆవుదూడలను గోశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. రెండు ఎద్దులు.. ఒక ఆవు.. కోదాడరూరల్ : ఏపీ నుంచి అక్రమంగా హైదరాబాద్ తరలిస్తున్న మూడు పశువులను సోమవారం కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా కోసూరు నుంచి రెండు ఎద్దులు, ఒక ఆవును బొలేరో వాహనంలో హైదరాబాద్కు తరలిస్తుండగా కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్లో పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించి వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
స్నేహితుడి వివాహానికి వెళ్లొస్తూ..
నకిరేకల్ : వివాహానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన అన్నెం ఆర్య(20) శనివారం శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో తన స్నేహితుడి పెళ్లికి హాజరయ్యాడు. అర్ధరాత్రి తిరిగి తన స్వగ్రామానికి బైక్పై వస్తుండగా.. మార్గమధ్యలో నకిరేకల్–తాటికల్ మధ్యలో 565వ నంబర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆర్య ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తిచేసినట్లు సమాచారం. ఆదివారం మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం -
పంట మార్పిడితో అధిక దిగుబడులు
పెద్దవూర, త్రిపురారం : రైతులు పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతుంది. పంట మార్పిడి వల్ల కలిగే లాభాలపై కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కంపాసాగర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, పెద్దవూర మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ సలహాలు, సూచనలు వారి మాటల్లోనే.. భూసారం పెరుగుతుంది..నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. చీడపీడలు దూరమవుతాయి. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల వృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. పాటించాల్సిన మెళకువలుపంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటల్ని ఎంపిక చేసుకోవాలి. శనగ, బొబ్బెర, పెసర, మినుము పంటలను వేసుకోవడం వలన నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వలన కలుపు మొక్కలను నివారించవచ్చు. వరి తర్వాత మినుము, పెసర, వేరుశనగ, చెరకు వేయడం వలన సుడిదోమ, తుంగ్రో వైరస్ను నివారించవచ్చు. పత్తి సాగు చేసిన నేలలో మినుము, పెసర వేయడం వలన తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలి. దీని వలన వేరుశనగను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చును. పసుపు తర్వాత వరి, జొన్న సాగు చేసుకోవాలి. దీనివలన నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. నులిపురుగుల సమస్య అధికంగా ఉంటే వేరుశనగ, మిరప, పొగాకు, వంగ పంటలను కొంతకాలం ఆపాలి. రైతులు పాటించాల్సినవిభూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర, ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసే ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. ఇలా చేసుకోవచ్చు..యాసంగిలో వేరుశనగ సాగు చేసిన రైతులు తర్వాత వానాకాలంలో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని లభిస్తుంది. దీంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. కంది, శనగ పంటలను వరుసగా వేస్తే కాయతొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. అందుకే ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి వంటి పంటలతో మార్పిడి చేసుకోవాలి. వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరుశనగ పంటకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. వరుసగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేసేవారు కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాల పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి ఆపరాల పంటలను లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. వంగ తోట వేసిన రైతులు క్యాలీఫ్లవర్తో పంట మార్పిడి చేసుకుంటే వంగకు ఎండు తెగులు సోకదు. టమాట, ఆవాలు, బంతి ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేస్తే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. ధాన్యం పంటలతో..దోస, కాకర, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ వంటి కూరగాయల పంటలను వరి పైరుతో, ఉల్లి సాగు చేసే రైతులు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఒకసారి పసుపు సాగు చేసిన వారు రెండేళ్ల పాటు భూమిలో పసుపు సాగు చేయకూడదు. ఒకవేళ చేస్తే దిగుబడి తగ్గుతుంది. చీడపీడల బెడద పెరుగుతుంది. వరి, చెరుకు, అరటి, తమలపాకు, కూరగాయల పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. మిరప, వేరుశనగ, క్యాబేజీ పంటలను ఆశించే లద్దె పురుగుల తాకిడి అరికట్టాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. ఇలా చేయొద్దు..పంట మార్పిడికి అనుకూలమైన పంటనే ఎంచుకోవాలి. లేదంటే చీడపీడలు పెరుగుతాయి. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొలాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరప, టమాటా, క్యాబేజీ, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేసుకోకూడదు. ఆకుముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సోయాచిక్కుడు వేయకూడదు.ఎంపికలో జాగ్రత్తలుపంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థలు నేల పొరల నుంచి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్నకు బదులుగా అపరాల పంటలతో పంట మార్పిడి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకుంటాయి. ఆకుల్ని రాల్చి భూమికి సేంద్రీయ పదార్థాన్ని అందిస్తాయి. అపరాల పంటల మీద ఉండే బుడిపెలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. సూక్ష్మజీవుల చర్య వల్ల ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. నల్లరేగడి నేలల్లో సోయాచిక్కుడు వేసుకుంటే పంట కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రీయ పదార్థం లభిస్తుంది. -
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, గణ పురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
సాధం విజయలక్ష్మికి ఉమెన్ ఐకాన్ అవార్డు
మేళ్లచెరువు : మండలంలోని రేవూరు గ్రామానికి చెందిన సాధం విజయలక్ష్మి ఉమెన్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైకాలజీ అవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఆమెను గ్రామ సర్పంచ్ జూనెబోయిన గురవయ్యయాదవ్, మాజీ సర్పంచ్ సాధం గంగయ్య యాదవ్ అభినందించారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్కు చెందిన కూచిపూడి నాట్య గురువులు గిరీష్, దేవిల శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. సందర్శకులను కూచిపూడి నృత్యం ఎంతగానే ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాకారిణులు లోహిత, లీనా, సహస్ర, సాహితి, కమలిక, స్నేహిక తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, టిక్కెట్ కౌంటర్, శివాలయం వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామిని 45వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.51,80,379 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శివాలయంలో ఆర్జిత సేవలకు శ్రీకారం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో నూతన ఆర్జిత సేవలను ఆలయ ఈవో భవానీ శంకర్ ఆదివారం ప్రారంభించారు. ప్రతి అష్టమి రోజున ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు పర్వతవర్ధిని అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన పూజా కార్యక్రమం ఉంటుందన్నారు. టిక్కెట్ ధర రూ.500 నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పూజలకు ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న 45వేల మందికి పైగా భక్తులు -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
యాదగిరిగుట్ట : ఆటోలో భక్తురాలు మరిచిపోయిన బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. వివరాలు.. హైదరాబాద్కు చెందిన ఓ భక్తురాలు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చింది. కొండ పైకి ఆటోలో ప్రయాణం చేస్తున్న సమయంలో సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు తెగి ఆటోలో పడిపోయింది. అది గమనించకుండా ఆమె ఆటో దిగి వెళ్లిపోయింది. బంగారు పుస్తెలతాడును గమనించిన ఆటో డ్రైవర్ మాటూరి హరిబాబు ఆ భక్తురాలిని గుర్తించి ఈఓ భవాని శంకర్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో ఆమెకు పుస్తెలతాడు అప్పగించాడు. ఆటో డ్రైవర్ మాటురి హరిబాబును అధికారులు అభినందించారు. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభి షేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లలను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేశారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ బి.జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
కందాల లక్ష్మికి కన్నీటి వీడ్కోలు
నకిరేకల్ : నకిరేకల్లోని ఏవీఎం విద్యాసంస్థల అధినేత, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి సతీమణి లక్ష్మి అనారోగ్యంతో శనివారం రాత్రి మృతిచెందగా.. ఆదివారం అంత్యక్రియలు ముగిశాయి. నకిరేకల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో గల పాపిరెడ్డి నివాసం నుంచి లక్ష్మి భౌతికకాయానికి అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం వారి స్వగ్రామమైన శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు నిర్వహించారు. లక్ష్మి భౌతికకాయానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్, కాంగ్రెస్ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్గౌడ్, చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్ తదితరులు నివాళులర్పించారు. -
దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం
అమ్మమ్మ చెప్పిన నీతి కథనాకు మా అమ్మమ్మ చెప్పిన నీతి కథల్లో ఈ తోడేలు, కుక్క కథ బాగా నచ్చింది. ఆ కథను మీతో పంచుకుంటున్నాను.నార్కట్పల్లి : అడవిలో ఉండే తోడేలు దారి తప్పి ఊళ్లోకి వచ్చింది. అది తోవ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క దానికి ఎదురొచ్చింది. తోడేలు ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ.. ‘నీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ల ఏమిటి?’ అని ప్రశ్నించింది. ఓహ్ అదా.. ‘నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకెళ్లి కాల్చివేయకుండా ఉండడానికి ఈ బిళ్లను నా మెడలో కట్టాడు’ అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే అంది తోడేలు. ‘నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజూ వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి ప్లేటు, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు నిద్రించడానికి మెత్తటి పరుపు కూడా ఉంది’ అని చెప్పింది కుక్క. అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతి వైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం’ అని చెప్పింది. మిత్రమా.. ఈరోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను కూడా మీ ఇంటికి తీసుకెళ్లు అంది తోడేలు. సరేనంటూ కుక్క ఆ తోడేలును తన ఇంటికి తీసుకెళ్లింది. యజమాని చూస్తే కొడతాడని తోడేలును పెరట్లో చెట్టు చాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలను చూసి సంతోషించాల్సింది పోయి.. ‘నేను అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా’ అని అసూయ చెందింది తోడేలు. ‘నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్లిపో’ అంది తోడేలుతో కుక్క. మిత్రమా నిన్ను వదిలి వెళ్లాలని లేదు ఇంకొక్క రోజు ఉండి వెళ్తాను అంది తోడేలు. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో తోడేలు.. అక్కడ ఉన్న పిల్లులను చంపి తిని ఎముకలు పడేసి వెళ్లిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసిందని అనుకున్నాడు యజమాని. దీంతో ఆ కుక్కను చితకబాది ఇంటి నుంచి తరిమేశాడు. నీతి : దుర్మార్గులతో స్నేహం చేస్తే చివరికి మనకు ప్రాణాపాయం లేదా పెద్ద నష్టం కలుగుతుంది. అందుకే ఎప్పుడూ మంచివారితోనే స్నేహం చేయాలి. -
వాలీబాల్ నేర్చుకుందాం రండి..!
కోదాడ : వేసవి సెలవుల్లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయస్థాయిలో వాలీబాల్ ఆడిన పలువురు క్రీడాకారులు, పీఈటీల ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. క్రీడాకారులకు కావల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, సీనియర్స్ కూడా ఇక్కడకు రోజూ వస్తారు. వారి అనుభవాలతో మంచి వాలీబాల్ క్రీడాకారుడిగా ఎదగడానికి మంచి అవకాశం ఉంది. -
‘కేన్స్’లో మెరవనున్న పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు
భూదాన్పోచంపల్లి : ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఈ నెల 17 నుంచి 21 వరకు 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రెడ్ కార్పెట్ వాక్ చేయనుంది. అదేవిధంగా ప్రీ ఈవెంట్ పార్టిసిపేషన్, ర్యాంప్ అండ్ స్టైలింగ్ చేయనున్నారు. హౌజ్ ఆఫ్ వెండోమ్ ప్యారిస్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు మన దేశం నుంచి తెలంగాణకు చెందిన రష్మీ ఠాకూర్ను ఎంపిక చేశారు. ఫ్యాషన్ షోకు అవసరమైన ఇక్కత్ వస్త్రాలను పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ తడక రమేశ్ ఆదివారం రష్మీ ఠాకూర్కు పంపించారు. ఈ సందర్భంగా తడక రమేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వీవర్స్ సర్వీస్ సెంటర్ ద్వారా తమకు ఇక్కత్ వస్త్రాలను అందించేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆదివారం రూ.లక్ష విలువైన ఎంపిక చేసిన ఇక్కత్ వస్త్రాలను అందజేశామని పేర్కొన్నారు. అంతేకాక తనకు కూడా ర్యాంప్ వాక్లో చేనేత కళాకారుడిగా పాల్గొనే అవకాశం కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు రష్మీఠాకూర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాషన్ షోకు ఎంపిక చేసిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఇవే.. ఫ ఫిల్మ్ ఫెస్టివల్లో ధరించనున్న బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ -
సబర్బన్ సాకారమయ్యేనా..
భూదాన్పోచంపల్లి : చేనేతకు ప్రసిద్ధి చెంది ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు తెచ్చుకున్న భూదాన్ పోచంపల్లికి సబర్బన్ బస్సు సర్వీస్లు నడపాలని చాలాకాలంగా స్థానిక ప్రజలు కోరుతున్నా ఆ కల నెరవేరడం లేదు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీగా మారి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్కు చేరువలో ఉండడంతో చీరలు కొనుగోలు చేయడానికి నిత్యం ప్రజలు పోచంపల్లికి వచ్చిపోతుంటారు. అంతేకాక పోచంపల్లి ఇక్కత్, చేనేత వస్త్ర తయారీ తీరుతెన్నులు, భూదానోద్యమ చరిత్రపై అధ్యయనం చేయడానికి విద్యార్థులతోపాటు దేశ, విదేశాల నుంచి పర్యాటకులువస్తుంటారు. ఇక్కడి గ్రామీణ వాతావరణంతో నిత్యం సినిమా, సీరియల్ షూటింగ్లు జరుగుతుంటాయి. ఇలా పోచంపల్లికి ఎన్నో ప్రత్యేకతలు ఉండి పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా సబర్బన్ బస్సు సర్వీస్లు మాత్రం నడపడం లేదు. 30 కిలోమీటర్లకు సబర్బన్ విస్తరణ హైదరాబాద్ చుట్టూ హెచ్ఎండీఏ పరిధిలోని మండలాల్లో 30 కిలోమీటర్ల వరకు సబర్బన్ పరిధిగా గుర్తించి ఆర్టీసీ అధికారులు సబర్బన్ బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి పోచంపల్లి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరం అంటే జలాల్పురం గ్రామం వరకు సబర్బన్ పరిధిలోకి వస్తుంది. కానీ, ప్రస్తుతం సబర్బన్ బస్సులు మండల శివారులోని రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం వరకే వస్తున్నాయి. మరోవైపు దిల్సుఖ్నగర్ నుంచి వయా దేశ్ముఖి మీదుగా పిలాయిపల్లికి వరకు సబర్బన్ బస్సులు నడుస్తున్నాయి. అదేమాదిరిగా మరో 5 కిలోమీటర్ల దూరాన్ని విస్తరిస్తే పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లికి సబర్బన్ బస్సులు నడిపించే అవకాశాలు ఉన్నాయి. రోజుకు 4 వేల మంది ప్రయాణం హైదరాబాద్కు సమీపంలో ఉన్న పోచంపల్లికి దిల్సుఖ్నగర్, ఉప్పల్ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తుంటాయి. ప్రతిరోజూ పోచంపల్లి నుంచి సుమారు 4 వేల మందికిపైగా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు వస్త్ర, పాలు, పండు, పూల వ్యాపారులు, ఉద్యోగులు హైదరాబాద్కు వెళ్తుంటారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ డిపోనకు చెందిన 9 బస్ సర్వీసులు రోజుకు 3 నుంచి 4 ట్రిప్పుల చొప్పున వచ్చిపోతున్నాయి. ఫ పోచంపల్లి సబర్బన్ పరిధిలో ఉన్నా నడవని బస్సులు ఫ 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు పరిధిని పెంచి నడపాలంటున్న గ్రామస్తులు ఫ రోజూ 4వేల మందికిపైగా రాకపోకలుహెచ్ఎండీఏ పరిధిలోని శివారు మండలాల్లో ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేయాలని గతంలో ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. దీంతో రాజధానికి చేరువలో ఉన్న పోచంపల్లికి కూడా డిపో మంజూరైంది. కానీ, మెయిన్ రోడ్డుకు సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం లభించక డిపో వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పోచంపల్లి పట్టణం వరకు సబర్బన్ బస్సులు నడిపితే రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
భువనగిరిటౌన్ : జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జిల్లాలో అత్యధికంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నారాయణపూర్ మండలంలో 12.0 మి.మీ, వలిగొండ మండలం వర్కట్పల్లిలో 8.8 మి.మీ, ఆలేరు మండలం శరాజ్పేటలో 7.3 మి.మీ వర్షం కురిసింది. అదేవిధంగా వలిగొండలో 5.8 మి.మీ, మోటకొండూర్లో 4.3 మి.మీ, ఆలేరు మండలం గొల్లంకొండలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చౌటుప్పల్లో మోస్తరు వర్షం కురవగా.. మిగిలిన మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. టెర్మినల్ ప్రారంభోత్సవం.. వీక్షించిన ఉద్యోగులుచౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో రూ.611 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐవోసీఎల్ టెర్మినల్ను ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాపురంలోని టెర్మినల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వేడుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్పై వీక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీజీఎం టీకే ఎలమరన్, సీజీఎం ఆపరేషన్ సూరజ్కుమార్ పట్నాయక్, వివిధ విభాగాలకు చెందిన జీఎంలు అందె గణేశ్చక్రవర్తి, శ్రీహరినాథ్, హేమంతబైష్య, పాపిని కిరణ్కుమార్, శ్రీకాంత్, రాజశేఖర్, మల్కాపురం సర్పంచ్ గిర్కటి నిరంజన్, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు, ధాన్యం దిగుమతిపై దృష్టిసారించాం చౌటుప్పల్ : కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకునే అంశంపై ప్రధానంగా దృష్టి సారించామని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు జిల్లాలో 358 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని అదనపు కలెక్టర్కు రైతులు విన్నవించారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.40 ఉండగా చౌటుప్పల్ మార్కెట్లో రూ.42 వసూలు చేస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన అదనపు కలెక్టర్.. హమాలీ చార్జీలు అదనంగా తీసుకోవద్దని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెల్మ శేఖర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సి పల్ చైర్పర్సన్ మొగుదాల పావని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్కుమార్, తహసీల్దార్ వీరాబాయి, ఏవో నాగరాజు పాల్గొన్నారు. -
గూడున్నా.. రోడ్డుపైనే గోస!
భువనగిరిటౌన్ : అధికారుల అలసత్వం వల్ల భువనగిరి పట్టణంలో నిరాశ్రయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిరుపేదల నీడ కోసం నిర్మించిన ఆశ్రమం కేవలం ప్రారంభానికే పరిమితమైంది. నిర్వహణను గాలికొదిలేయడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఉండడానికి చోటు లేక వృద్ధులు, దివ్యాంగులు ఫుట్పాత్లను ఆశ్రయిస్తున్నారు. నిర్వహణ లోపం.. నిరాశ్రయులకు శాపం భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద రహదారి బంగ్లా ఆవరణలో నిరాశ్రయుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వసతి గృహాన్ని నిర్మించింది. అయితే, భవన నిర్మాణం పూర్తయినా నిర్వహణ బాధ్యతలను ఎవరూ పట్టించుకోకపోవడంతో అది భూత్ బంగ్లాను తలపిస్తోంది. తలుపులు బార్లా తెరిచి ఉండడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరాశ్రయులు లోపలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ భవనం నేడు నిరుపయోగంగా మారింది. వినాయక చౌరస్తాలో దయనీయం.. వినాయక చౌరస్తాతోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లోని ఫుట్పాత్లే నిరాశ్రయులకు ఆవాసాలుగా మారాయి. పగలు మండుతున్న ఎండకు ఎండుతూ, రాత్రి వేళల్లో చలికి వణుకుతూ వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వానొస్తే తలదాచుకోవడానికి చెట్ల కిందికో, దుకాణాల అరుగుల మీదకో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆకలి తీర్చుకోవడానికి ఆధారం లేక, ఉండడానికి నీడ లేక వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న కష్టాలను చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. ప్రజాధనం వృథా ! లక్షల రూపాయలు ఖర్చు చేసి భవనాలు నిర్మించి, వాటిని వదిలేయడంపై భువనగిరి పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల నిరాశ్రయులకు అందాల్సిన సాయం అందకుండా పోతోంది. ఇకనైనా జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు స్పందించి హైదరాబాద్ చౌరస్తా వద్ద ఉన్న వసతి గృహాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని, నిరాశ్రయులను అక్కడికి తరలించి వారికి కనీస వసతులు కల్పించాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఫ నిరుపయోగంగా నిరాశ్రయుల వసతి గృహం ఫ లక్షల రూపాయలు పోసి కట్టారు.. గాలికి వదిలేశారు ఫ చౌరస్తాల్లోనే అభాగ్యుల అగచాట్లు ఫ పట్టించుకోని పాలకులు -
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో రైస్ మిల్లు యజమానులు, రైతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, తూకాలు, చెల్లింపుల్లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. కొనుగోళ్లలో ఎలాంటి అవక తవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నదాతల సమస్యలు వెంటనే పరిష్కరించేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వలిగొండ తహసీల్దార్ దశరథ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమానాయక్, పాశం సత్తిరెడ్డి, గరిషె రవి, సతీష్, చిలుగురి సత్తిరెడ్డి, అశోక్, పాలకూర్ల వెంకన్న, కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను భక్తులతో చేయించారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను అర్చకులు ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వారా బంధనం చేశారు. -
నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు
భువనగిరి : నైపుణ్యాలను పెంపొందించుకుంటే నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో కుంభం ఫౌండేషన్, 1ఎం1బీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మెగా జాబ్మేళా ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరిలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన శిక్షణ అందించేవిధంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని 1బీఎంను కోరారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డి, 1బీఎం అసోసియేట్ డైరెక్టర్ ప్రసన్న నౌరి, డైరెక్టర్స్ అభిరామ్, వెంకటేష్, దీపిక తదితరులు పాల్గొన్నారు. 1500 మంది ఎంపిక ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన మెగా జాబ్మేళా ఆదివారం ముగిసింది. రెండు రోజులపాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు వేల మంది అభ్యర్థులకు ప్రీ స్క్రీనింగ్ నిర్వహించి ఇంటర్వ్యూల కోసం 1800 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 27 కంపెనీల్లో 3500 ఖాళీల భర్తీ కోసం ఆదివారం అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యులు నిర్వహించారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1500 మంది అభ్యర్థులను వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. డిప్లొమా పూర్తి చేశా. రెండు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలు సుకుని దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూలో రాణించడంతో ఉద్యో గం కోసం ఎంపిక చేశారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఎంపిక కావడం సంతోషంగా ఉంది. –కొండపురం పూజ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా. భువనగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వెంటనే జాబ్కోసం దరఖాస్తు చేసుకున్నా. ఉద్యోగానికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగాఉంది. నిరుద్యోగుల కోసం ఇలాంటి జాబ్ మేళా పెట్టివారికి, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్న వారికి నిరుద్యోగులు రుణపడి ఉంటారు. – శ్రీవాణి ఫ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య -
క్రిప్టో యాప్ పేరుతో ఘరానా మోసం !
త్రిపురారం : కష్టపడకుండానే కాసులు కురుస్తాయని ఆశపడ్డారు.. ఆన్లైన్ యాప్లో అధిక లాభాలు ఆర్జించవచ్చు అని మోసగాళ్లు చెప్పిన మాయమాటలు నమ్మారు. చివరకు కష్టపడి కూడబెట్టిన సొమ్మును కేటుగాళ్ల పాలుచేసి లబోదిబోమంటున్నారు. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పేరుతో సాగుతున్న ఓ భారీ స్కామ్ ఇప్పుడు నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో కలకలం రేపుతోంది. డబుల్ ధమాకా ఆఫర్లతో సామాన్యులను ఆకర్షించి, వారి నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రిప్టో యాప్ మోసం వెనుక త్రిపురారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 30 రోజుల్లో డబ్బు రెట్టింపు ఈ దందాలో నిందితులు అనుసరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. ముందుగా రూ.50 వేలు పెట్టుబడిగా పెట్టించి ఒక ఐడీ కేటాయిస్తారు. అనంతరం వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి, ప్రతిరోజూ ఒక గజిబిజి కోడ్ను పంపిస్తారు. ఆ కోడ్ను యాప్లో వారు పంపిన లింక్ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తే చాలు..డాలర్లు వచ్చినట్లు కనబడతాయి. చైన్ సిస్టమ్ తరహాలో మరికొందరిని చేర్పిస్తే అదనపు కమీషన్లంటూ ఆశ చూపారు. దీంతో మధ్యతరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు సైతం తమ వద్ద ఉన్న సొమ్మును ఈ యాప్లో కుమ్మరించి మోసపోయారు. 30 రోజుల్లో డబ్బులు రెట్టింపు అంటూ పలువురితో ఈ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టించినట్లు తెలిసింది. క్రిప్టో యాప్ పెట్టుబడుల్లో కొంత మందికి లాభాలు రావడంతో మరి కొందరు మంది ఈ యాప్లో పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఒకరు యాప్లో పెట్టుబడి పెట్టి క్రిప్టో యాప్కు మరొకరిని పరిచయం చేస్తే సుమారు 500 నుంచి 650 వరకు డాలర్లు వస్తున్నట్లు ప్రచారం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు పలువురు వ్యవసాయదారులు ప్రజాప్రతినిధులను సైతం ఇందులో చేర్పించినట్లు తెలిసింది. క్రిప్టో యాప్లో మోసపోయినవారు బయటకు వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒక్కొక్కరు రెండు మూడు ఐడీలు.. ఈ యాప్లో పెట్టుబడి పెట్టినవారు ఒక్కొక్కరు రెండు మూడు ఐడీలు తీసుకుని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ యాప్ ద్వారా వచ్చిన డాలర్లను ప్రత్యేకమైన వ్యక్తి కొనుగోలు చేయాల్సి ఉండడం గమనార్హం. ఆ వ్యక్తి మొదట కొందరికి మొదట లాభాలు కూడా అందజేసినట్లు తెలిసింది. కొందరికి ఈ యాప్ ద్వారా లాభాలు రావడంతో మండలంలోని చాలా గ్రామాల ప్రజలు యాప్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. త్రిపురారం మండలంలో ఈ యాప్లో దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు సమాచారం. ఫ మొదట రూ.50 వేలతో ప్రారంభం ఫ కోట్ల రూపాయల్లో పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం ఫ మోసపోయిన ప్రజలు ఫ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని బాధితులు త్రిపురారం మండలంలో క్రిప్టో యాప్ ద్వారా మోసపోయినట్లు మా దృష్టికి రాలేదు. బాధితులు ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రజలు అనధికార యాప్లను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు. యాప్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. –గైకూరి నరేష్, ఎస్ఐ, త్రిపురారం -
నృత్య వినోదం
చౌటుప్పల్ : పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. సెలవుల్లో తమకు తోచిన ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే నేటి డిజిటల్ యుగంలో పిల్లలు సెల్ఫోన్, టీవీలకు అతుక్కుపోయి ఆటలకు దూరం అవుతున్నారు. ఈ ధోరణిని మారుస్తూ చౌటుప్పల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఇండోర్, అవుట్డోర్ ఆటలు నేర్పిస్తున్నారు. నృత్యం, స్విమ్మింగ్, కంప్యూటర్లో శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణకు పంపిస్తున్నారు. నృత్య శిక్షణపై చిన్నారుల ఆసక్తి వేసవి సెలవుల్లో ఆటపాటలతోపాటు విద్యార్థులు నృత్యం నేర్చుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించిన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వారాహి డ్యాన్స్ స్టూడియో వారు విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైన నాటి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక్కో బ్యాచ్కు గంట సమయం చొప్పున తరగతులు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు వయస్సు కలిగిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నృత్య శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ వెస్టర్న్, కూచిపూడి, ఫోక్, దాండియా, గర్భా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే విద్యార్థులు అన్ని రకాల నృత్యాలపై శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షకులు ఎడ్ల హిమబిందురెడ్డి, సామినేని దీపిక విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ అందిస్తున్నారు. శారీరక వ్యాయామంతోపాటు ఏకాగ్రత.. నృత్యం నేర్చుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రధానంగా శారీరక వ్యాయామం అవుతుంది. దీంతో మంచి ఫిట్నెస్ లభిస్తుంది. ప్రతిక్షణం మనిషిలో ఉత్సాహం ఉండే విధంగా దోహదం చేస్తుంది. లక్ష్యంపై దృష్టి పెట్టేందుకు ఏకాగ్రతను పెరుగుతుంది. శిక్షణ శిబిరంలో నృత్యం నేర్చుకున్న విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత గంటల తరబడి సాధన చేస్తూ సెలవులను అర్థవంతంగా గడుపుతున్నారు. ఫ వేసవి సెలవుల్లో నృత్య శిక్షణకు వెళ్తున్న విద్యార్థులు ఫ ఏకాగ్రతతోపాటు లక్ష్యంపై గురిపెట్టేందుకు దోహదం ఫ చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తల్లిదండ్రులు -
ఏడు బిళ్లలాట
హుజూర్నగర్ : పాఠశాలలకు వెళ్లినన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు.. వేసవి సెలవులు రావడంతో మైదానాల్లో, వీధుల్లో ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. హుజూర్నగర్ పట్టణంలోని 5వ వార్డులో చిన్నారులు ఏడు బిళ్లలాట ఆడుతూ ఉత్సాహంగా కనిపించారు. చిన్నారుల చేపల వేట హుజూర్నగర్ : వేసవి సెలవుల్లో కొందరు చిన్నారులు ఆటపాటల్లో మునిగి తేలుతుండగా.. మరికొందరు చెరువులు, వాగుల్లో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. హుజూర్నగర్ పరిధిలోని గోవిందపురం పక్కనే చెరువు అలుగు ఉండడంతో చిన్నారులు ఆ అలుగులో చేపల వేట కొనసాగిస్తూ కనిపించారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటనలు చివ్వెంల మండల పరిధిలోని వాల్యతండా, కోమటికుంట గ్రామాల్లో గురువారం జరిగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని వాల్యతండా గ్రామానికి చెందిన ధరావతు అనూష (25) ఇంట్లో ఉతికిన దుస్తులు అరవేస్తుండగా, దండెంకు విద్యుత్ సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త రాంచంద్రు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు. పెళ్లింట్లో విషాదం.. తెల్లవారితే పెళ్లి.. ఇంట్లో విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పెళ్లి కుమార్తె తమ్ముడు మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని కోమటి కుంట గ్రామానికి చెందిన పిట్టల దినేష్ (19) తన సోదరి పెళ్లి శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో ఇంట్లో విద్యుత్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి సృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి తండ్రి పిట్టల సైదులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన పిట్టల దినేష్ మృతురాలు అనూష (ఫైల్) ఫ దుస్తులు ఆరేస్తూ ఒకరు.. ఫ పెళ్లి పనులు చేస్తుండగా మరొకరు.. -
నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
కోదాడ రూరల్ : కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదుట ఉన్న టీస్టాల్ వద్ద బుధవారం రాత్రి భార్య శిరీషను భర్త మణిదీప్ హత్య చేసిన ప్రదేశాన్ని గురువారం ఎస్పీ నరసింహ పరిశీలించారు. హత్య జరిగిన తీరును అక్కడ ఉన్న దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రిమాండ్కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. దర్యాప్తు వేగవంతం చేసి సాక్షులను, బాధిత కుటుంబ సభ్యులను విచారించి నేరాభియోగ పత్రాలను కోర్టుకు సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలు, ఏదైనా పంచాయితీలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, క్షణికావేశంలో నేరాలు, ఘర్షణలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేసుల్లో సాంకేతిక నైపుణ్యంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్, సిబ్బంది ఉన్నారు. బంధువులకు మృతదేహం అప్పగింత బుధవారం రాత్రి హత్యకు గురైన శిరీష మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. మృతురాలికి మూడేళ్ల వయస్సు ఉన్న కుమారుడు ఉండడంతో అతడికి న్యాయం చేయాలని బంధువులు గురువారం డిమాండ్ చేశారు. దీంతో పెద్దమనుషులు నిందితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. వారు కోదాడలో అంత్యక్రియలు నిర్వహించారు. ఫ శిరీష హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ -
గంజాయి ముఠా అరెస్ట్.. నిందితుల రిమాండ్
సూర్యాపేటటౌన్ : గంజాయి సేవించడంతోపాటు సరఫరా చేసే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6న సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలునాయక్ తన సిబ్బందితో సూర్యాపేట–దోసపహాడ్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా వెళ్తుండగా పట్టుకుని విచా రించారు. సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంకు చెందిన దేశగాని గణేశ్ అలియాస్ తీట శివ, పెన్పహాడ్ మండలం చీదేళ్ల గ్రామానికి చెందిన పశుల రాంచరణ్, పెన్పహాడ్ మండలంలోని మోర్సకుంట తండాకు చెందిన పోతరాజు బన్నిలుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న సంచిలో కిలో గంజాయి లభ్యమైంది. ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరుకు వెళ్లి అక్కడ గంజాయిని కిలో రూ.2000 చొప్పున కొనుగోలు చేసిన కొంత అమ్మి, కొంత తాగాలని నిర్ణయించుకున్నారు. వాటిని 10 గ్రాముల ప్యాకెట్లుగా చేసి ఒక ప్యాకెట్కు రూ.1000 చొప్పున అమ్మాలనుకున్నారు. పల్సర్ బైక్పై సూర్యాపేట బస్టాండ్, చుట్టుపక్కల అమ్మేందుకు వెళ్లగా ఎవరూ కొనలేదు. దీంతో తిరిగి కుసుమవారిగూడెం వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద కిలో 160 గ్రాముల గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. -
భూసార పరీక్షలకు అనువైన సమయమిదే..
ఫ పొలంలో పోషకాల స్థాయి తెలుస్తుంది. ఫ ఆ పొలంలో ఏయే పంటలు పండించవచ్చో తెలుస్తుంది. ఫ ఎరువులు ఎంత మోతాదులో, ఎప్పుడు వేయాలో తెలుస్తుంది. ఫ నేలల సమస్యలు తెలుస్తాయి. దాని ప్రకారం ఎరువులను ఉపయోగించవచ్చు. ఫ ఎరువుల అనవసరపు ఖర్చు తగ్గించవచ్చు. సరైన సమయంలో భూసార పరీక్షలు చేయిస్తే సేంద్రియ ఎరువులను కూడా ఉపయోగించి నాణ్యమైన పంటలను పండించవచ్చు. నడిగూడెం : ప్రస్తుతం యాసంగి సీజన్ పూర్తయింది. వరి, ఇతర ఏ పంటలు కూడా సాగులో లేవు. ఈ పంటలు లేని సమయంలోనే మట్టి నమూనాలు తీసి, వాటిని పరీక్ష చేయించాలి. వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను ఉపయోగించాలి. భూసార పరీక్షలకు అనువైన సమయమిదేనని గడ్డిపల్లి కేవీకే మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఎ.కిరణ్ చెబుతున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. భూసార పరీక్ష అంటే.. పొలం నుంచి సేకరించిన మట్టిని వివిధ భౌతిక, రసాయన పద్ధతుల ద్వారా విశ్లేషించి, దాని ఫలితాల ఆధారంగా ఎంత మోతాదులో ఎరువులను వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్ష. మట్టి నమూనాలు తీసే సమయం.. ఫ పంట కోత తర్వాత తీయవచ్చు. ఫ వేసవిలో పంటలు లేని సమయంలో తీయవచ్చు. మట్టి నమూనాలు తీయకూడని ప్రదేశాలు–సమయాలు.. ఫ ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు సమూనా తీయరాదు. ఫ నీరు పెట్టిన తరువాత తీయరాదు ఫ నీడపడే ప్రదేశాలు, నీటి ముంపు ప్రాంతాలు, పెంటకుప్పల దగ్గర, గట్లు, చెట్లు, రోడ్ల దగ్గర తీయరాదు. మట్టి నమూనాలు తీయాల్సిన విస్తీర్ణం ఒక రకం పొలానికి ఒక నమూనా తీయాలి. పొలం మరీ పెద్దయితే ప్రతి ఐదు ఎకరాల్లో నమూనా తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు, పారుదల సౌకర్యం, నేల వాలు, చౌడు, క్షార, గుణాలు, పంటల సరళి విషయాల్లో ఏవేనా తేడా కనిపిస్తే అన్ని నమూనాలు ఆ పొలం నుంచి తీయాల్సి ఉంటుంది. నమూనాలు సేకరించాల్సిన లోతు ఫ పైరు పంటలకు 6 అంగుళాలు ఫ పండ్ల తోటల్లో 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా ఫ కారి, చౌడు, ఆమ్ల నేలలకు–అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమూనా తీయాలి. నమూనాలు ఎలా సేకరించాలి.. ఫ నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు తీసివేయాలి. ఫ గొయ్యి అంచుల నుంచి పారతో గానీ, తాపీతో గానీ మట్టిని సేకరించాలి. ఫ పొలంలో 8 నుంచి 10 స్థలాల్లో ఈ పద్ధతిలో మట్టిని సేకరించాలి. ఫ సేకరించిన మట్టినంతటిని కలిపి నేలపై పరిచి దానిని 4 భాగాలు చేయాలి. మూలలకు ఎదురెదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకుని మిగిలిన మట్టిని పారవేయాలి ఈ విధంగా 500 గ్రాముల నమూనాలను సేకరించాలి. ఫ ఈ అరకేజీ మట్టిని గుడ్డ సంచిలో గానీ, పాలిథిన్ సంచిలో గానీ వేసి, రైతు పేరు, చిరునామా, సర్వే నంబరు, పొలం విస్తీర్ణం, మెట్ట, పల్లం, ఆరుతడి పంటలు, గత 3 సంవత్సరాలుగా వాడుతున్న ఎరువులు, రాబోయే సీజన్లో వేయాల్సిన పంటలు, సేకరించిన తేదీ వివరాలను జతచేయాలి. సమాచార పత్రంతో కూడిన మట్టి నమూనాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు లేదా భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. లేదా గడ్డిపల్లి కేవీకేకు పంపించినా పరీక్షలు చేసి, సాయిల్ హెల్త్కార్డు పంపిణీ చేస్తారు. -
మేల్కోకపోతే అట్టడుగుకే..!
భువనగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీస్వచ్ఛ సర్వేక్షణ్–2026శ్రీ ర్యాంకింగ్ సాధనలో మున్సిపాలిటీలు వెనుకబడుతున్నాయి. సర్వే ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడుస్తున్నా.. ప్రజల్లో అవగాహన కల్పించడంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అత్యంత కీలకమైన సిటిజన్ ఫీడ్బ్యాక్కు కేటాయించిన 1000 మార్కులను సాధించడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. గడువు సమీపిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, స్వచ్ఛ ర్యాంకింగ్లో భువనగిరి, ఆలేరు సహా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు అట్టడుగున నిలిచే ప్రమాదం నెలకొంది. కానరాని ప్రచారం పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇందులో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గత నెల 25వ తేదీనే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. దీనిపై మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలకు కనీస అవగాహన కల్పించ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేసిన లింక్ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలోని ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో దీనిపై ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. ఆ 1000 మార్కులు చేజారేనా? ఈ సర్వేలో పౌరుల అభిప్రాయం (సిటిజన్ ఫీడ్బ్యాక్) అత్యంత కీలకం. మున్సిపాలిటీల పనితీరుపై పౌరులు ఇచ్చే సమాధానాలకు మొత్తం 1,000 మార్కులు కేటాయించారు. ఇందుకోసం రూపొందించిన 13 ప్రశ్నలకు ప్రజలు స్పందించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొంటే ఆ పట్టణానికి అంత మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, అధికారుల ఉదాసీనత వల్ల ప్రజలకు ఈ విషయమే తెలియడం లేదు. ఫలితంగా జిల్లాలోని పట్టణాల ర్యాంకులు భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. సర్వేలో ప్రాధాన్యతా అంశాలివే.. స్వచ్ఛ సర్వేక్షణ్–2026లో భాగంగా భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో స్వచ్ఛ పోటీ మొదలైంది. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛభారత్ అర్బన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల శుభ్రత, తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డులు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలను పరిశీలిస్తూ మొత్తం 12,500 మార్కులను కేటాయించారు. ఇందులో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సర్టిఫికెట్, క్షేత్రస్థాయి పరిశీలన, సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్ వంటి విభాగాలకు ప్రాధాన్యతనిచ్చారు.ఫ స్వచ్ఛ సర్వేక్షణ్పై కదలని మున్సిపల్ యంత్రాంగం ఫ ప్రచారం లేక ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రజల అనాసక్తి ఫ ర్యాంకింగ్లో వెనుకబడుతున్న మున్సిపాలిటీలు ఫ 25వ తేదీతో ముగియనున్న గడువునిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీల పరిధిలో కనీసం 20 శాతం జనాభా నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో ఇప్పటివరకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆ 1,000 మార్కులు చేజారిపోయేలా ఉన్నాయి. ఈ నెల 25వ తేదీతో అభిప్రాయ సేకరణ గడువు ముగియనుంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో, అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రచారం వేగవంతం చేయకపోతే స్వచ్ఛ ర్యాంకింగ్లో మన పట్టణాలు వెనుకబడటం ఖాయం. -
ప్రైవేట్ కళాశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ విద్యా పథకం కింద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అర్హత గల ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఇన్చార్జ్ అధికారి పి.సాహితి తెలిపారు. హాస్టల్ వసతి, ఉత్తమ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్న కళాశాలలు ఈ నెల 11వ తేదీలోపు ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.గత ఐదేళ్ల అకడమిక్ ప్రొఫైల్తో కొత్త రిజిస్ట్రేషన్లు లేదా రెన్యువల్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల హార్డ్ కాపీలను ధ్రువపత్రాలతో జతచేసి రాయగిరిలోని కలెక్టరేట్లో రూమ్ నంబర్ ఎస్ –17లో సమర్పించాలని, గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. కేవీలో అడ్మిషన్లురామగిరి (నల్లగొండ): నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సంర ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 20 సీట్లు, 3వ తరగతి 1 సీటు ఖాళీ ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివి రామగిరి (నల్లగొండ) : తెలంగాణ కవి డాక్టర్ బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివని ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో బోయ జంగయ్య వర్ధంతి సభను నిర్వహించారు. జంగయ్య చిత్రపటానికి కవులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి మాట్లాడుతూ బోయ జంగయ్య రచయితగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. కార్యక్రమంలో సినీ విమర్శకుడు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య, పున్న అంజయ్య,రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, జీవకవి మునాసు వెంకట్, డాక్టర్ హసేన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అర్వపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లారీల కొరతతో ధాన్యం ఎగుమతులు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మిల్లర్లు తాలు పేరుతో ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. -
మెగా జాబ్ మేళాను వినియోగించుకోవాలి
భువనగిరి: ఈ నెల 8,9,10 తేదీల్లో భువనగిరిలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం స్థానిక న్యూడైమెన్షన్ హైస్కూల్లో చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. సుమారు 20 కంపెనీలకుపైగా పాల్గొని 3500 ఖాళీలను భర్తీ చేసుకునేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట కుంభం ఫౌండేషన్ చైర్మన్ కీర్తిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, వైస్ చైర్పర్సన్ మంజుల, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, కూర వెంకటేశం, మంగ ప్రవీణ్, సాయి, సన్నీ ఉన్నారు. -
తరుగు పేరుతో దోపిడీ
భువనగిరిటౌన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాలలో తరుగుపేరిట ధాన్యంలో కోత విధించడాన్ని నిరసిస్తూ గురువారం భువనగిరి పట్టణ శివారులోని తుక్కాపూర్ ఎక్స్రోడ్డు వద్ద నల్లగొండ– భువనగిరి రహదారిపై ధాన్యం బస్తాలు పెట్టి రైతులు ధర్నా చేశారు. దీంతో కిలోమీటర్మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కష్టపడి వస్తే మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క తాలు పేరుతో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం సాకుతో క్వింటాకు భారీగా నష్టం కలిగిస్తున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు కూడా రాకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల వద్దే నిద్రపోవాల్సి వస్తోందని వాపోయారు. తుక్కాపూర్ గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో నిర్వహించారు. ధర్నా వద్దకు భువనగిరి తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ వద్దకు వచ్చి రైతులకు సర్ది చెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, పుట్ట వీరేష్ యాదవ్, రాసాల మల్లేష్, సత్యనారాయణ గౌడ్, లింగస్వామి యాదవ్, సుధాకర్ రెడ్డి, రాజమోహన్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఫ రైతుల ఆగ్రహం ఫ భువనగిరి శివారులో రోడ్డుపై ధాన్యం బస్తాలు పెట్టి ధర్నా -
పూడికతీత ముసుగులో మట్టి దందా
లారీల్లో మట్టి నింపుతున్న ఈ ఫొటో మోటకొండూరు మండలం వర్టూరు చెరువుది. అభివృద్ధి కమిటీ పేరుతో తీర్మానం చేసి, దానిని అడ్డంపెట్టుకొని మట్టి దందా కొనసాగిస్తున్నారు. అధికారికంగా 2 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపునకు మాత్రమే అనుమతి ఉండగా, దాదాపు 12 ఎకరాల మేర చెరువును తవ్వేస్తున్నారు. మీటరు లోతు తవ్వాల్సి ఉండగా 12 మీటర్ల లోతు తవ్వుతున్నారు. ఆరు టిప్పర్లకు అనుమతి తీసుకొని వందకు పైగా భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. హైదరాబాద్ చుట్టపక్కల, ఘట్కేసర్, చౌటుప్పల్, తిరుమలగిరి, చీకటి మామిడి, కాటపల్లి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెరువుల పూడిక పేరుతో తీస్తున్న మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు ఐలయ్య, అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులుసాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతాల్లో సుమారు 40 వేల పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు, స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ సమావేశ మందిరంలో మంత్రి పొంగులేటి అధ్యక్షతన ఉమ్మడి నల్లగొండ జిల్లా రెవెన్యూ, గృహనిర్మాణ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఐలయ్య, అనిల్కుమార్రెడ్డిలు తమ నియోజకవర్గాల్లోని దీర్ఘకాలిక సమస్యలను మంత్రి దష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా జిల్లాలోని యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో నమోదైన సుమారు 40 వేల పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు, స్థలాలను ఆ జాబితా నుంచి తొలగించాలని కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో గతంలో నిర్మించిన ఇళ్లను అటవీ భూములుగా గుర్తించడం వల్ల నిలిచిన కొత్త నిర్మాణాల అనుమతులపై చర్చించగా, వాటిని అటవీ జాబితా నుంచి తొలగించాలని మంత్రి సూచించారు. యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కొత్త భవనం మంజూరుకు, తుర్కపల్లి మండలానికి అదనంగా మరో 50 ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు మంత్రి హామీ ఇచ్చారు. పెరిగిన ఆహార భద్రత కార్డుల సంఖ్యకు అనుగుణంగా కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా వాహనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఫ అడ్డూఅదుపులేని మాఫియా ఫ మీటరులోతుకు అనుమతి.. 12 మీటర్లు తవ్వకం ఫ పొలాల పేరుతో ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు ఫ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
భువనగిరి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక కౌన్సిల్ హాలులో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో నలుగురు సభ్యులను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కేటగిరీలో పల్లెర్ల యాదగిరి, బడుగు విజయ, అల్ప సంఖ్యాక వర్గాల కేటగిరీలో సుజాయత్ అలి కౌసర్, బట్టు వరలక్ష్మిలను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే ఓటు హక్కుతో కలిపి మొత్తం 26 మంది సభ్యులు చేతులెత్తి ఈ ఎన్నికకు మద్దతు తెలిపారు. కొత్తగా ఎన్నికై న సభ్యులతో కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించగా, ఎమ్మెల్యే, చైర్పర్సన్ వారికి డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో భువనగిరి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మౌలిక వసతుల పనులను ఈ నెలాఖరు లోపు పూర్తి చేసి, లబ్ధిదారులకు వెంటనే గృహప్రవేశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉదయం కోరం లేక సమావేశం వాయిదా .. అంతకుముందు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం కోరం లేక మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం జరిగిన సమావేశానికి కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 27 మంది హాజరుకాగా, బీజేపీ నలుగురు, బీఆర్ఎస్ నలుగురు, స్వతంత్ర అభ్యర్ధి 1 కౌన్సిలర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్ బస్సులపై కేసు
భువనగిరి : విద్యార్థుల కోసం కేటాయించిన స్కూల్ బస్సులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న యాజమాన్యాలపై జిల్లా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్కూల్ బస్సులను పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అద్దెకు పంపిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ ఆదేశాల మేరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మక్తానంతారం వద్ద నిర్వహించిన తనిఖీల్లో బీబీనగర్కు చెందిన మహర్షి హైస్కూల్, చౌటుప్పల్కు చెందిన త్రినిటి స్కూల్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నట్లు గుర్తించి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐలు శ్రీహర్షారెడ్డి, ప్రణీత్రెడ్డి మాట్లాడుతూ స్కూల్ బస్సులను కేవలం విద్యార్థుల రవాణాకే వాడాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. కాగా ట్రావెల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకట్ జంగారెడ్డి ఆధ్వర్యంలో డీటీఓకు ఫిర్యాదు చేయడంతో దాడులు నిర్వహించారు. ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా కార్యదర్శి అంబటి సుధాకర్, పన్నాల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
దేవరకొండ : సమ్మర్ క్యాంపులను విద్యార్థులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉచిత కరాటే శిక్షణను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరాటే నేర్చుకోవడం ద్వారా సెల్ఫ్ డిఫెన్స్తో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు చేయూత అందిస్తున్న స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమామహేష్, పంతులాల్, ఐడీ ప్రసన్న, వైఎస్ కరుణాకర్, ఆంజనేయులు, వెంకటేష్, యాదగిరి, గోపి తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు -
రూ. 100 కోట్లేవి స్వామీ..!
సాక్షి, యాదాద్రి : అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధుల కొరత గుదిబండగా మారింది. ముఖ్యమంత్రి ఇచ్చిన రూ.100 కోట్ల హామీ ఏడాదైనా అమలుకు నోచుకోకపోవడంతో దుకాణాల సముదాయం, గండి చెరువు సుందరీకరణ, బస్టాండ్ వంటి కీలక పనులన్నీ పెండింగ్లోనే పడిపోయాయి. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన సైతం కార్యరూపం దాల్చ లేదు. దీంతో అధికారుల పాలనలో పర్యవేక్షణ కొరవడి అవకతవకలు చోటుచేసుకుంటూ దేవస్థానం ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి. పెండింగ్లోనే పనులు యాదగిరీశుడి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆధ్యాత్మిక వాడలో నిర్మాణం చేపట్టిన దుకాణాల సముదాయం ఇంకా పూర్తి కాలేదు. శ్రీస్వామి వారి ప్రత్యేక ఉత్సవాల్లో తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు, భక్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకు గండి చెరువు సుందరీకరణకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సరిపడా నిధులు లేకపోవడంతో ఆ పనులు పూర్తి కాలేదు. యాదగిరి కొండకు దిగువన ఉన్న కల్యాణ కట్ట సమీపంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దేవస్థానం బస్టాండ్ అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఇక మొదటి ఘాట్ రోడ్డులోని ఆర్యవైశ్య సత్రం నుంచి జీయర్ కుటీర్ వరకు నిర్మాణం చేస్తున్న ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. ఇటీవల లండన్ నుంచి తీసుకువచ్చిన బ్రిడ్జిని అనుసంధానం చేసే పనులు పూర్తి చేశారు. టెంపుల్ సిటీపై విల్లాల నిర్మాణం ఇప్పటి వరకు చేపట్టలేదు. దాతల సహకారంతో అక్కడ విల్లాలు నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం యోచించింది. ఇదిలా ఉండగా ఏడాది క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదగిరిగుట్టకువచ్చారు. ఆ సందర్భంగా దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు నిధులు కేటాయించలేదు. దీంతో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. వేముల వాడ, భద్రాచలం, బాసర ఆలయాల మాదిరిగా నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ది చేయాలని భక్తులు కోరుతున్నారు. ఫ ఏడాదైనా అందని నిధులు ఫ యాదగిరిగుట్ట ఆలయంలో ఎక్కడి పనులు అక్కడే ఫ పాలకమండలి ఊసే లేదు యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అటకెక్కింది. ఏడాది క్రితం తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టకు పాలక మండలిని నియమిస్తామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన నూతన చట్టం ప్రకారం 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటు కావాలి. ఇందులో ప్రభుత్వం తొమ్మిది మందిని నామినేట్ చేయనుంది. ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారు. అధికారులు ఈ పాలక మండలిలో ఉంటారు. కానీ ఇంతవరకు పాలక మండలి ఏర్పాటు కాలేదు. దీంతో యాదగిరిగుట్ట క్షేత్రంలో అధికారుల పాలన భక్తులకు అవస్థలను మిగిల్చుతోంది. అఽధికారుల పాలనలో దేవస్థానంలో పలు అవకతవకలు జరుగుతున్నాయి. చింతపండు దొంగతనం, బంగారు డాలర్ల మాయం,గోదాం నుంచి ప్రసాదాల తయారీలో వాడే విలువైన పదార్థాల చోరీలు, ఇలా పలు సంఘటలు దేవస్థానానికి మచ్చ తెచ్చే విధంగా చోటు చేసుకుంటున్నాయి. పాలకవర్గం లేకపోవడం, అధికార యంత్రాంగం సరైన దృష్టి సారించడంలేదన్న ఆరోపణలుఉన్నాయి. -
దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
భువనగిరిటౌన్ : రాష్ట్రంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వికలాంగుల సంస్థ, భారత ప్రభుత్వరంగ చమురు సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం దివ్యాంగులకు విడతల వారీగా పరికరాలను పంపిణీ చేస్తోందని, రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని స్పష్టం చేశారు. దివ్యాంగుల రక్షకుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల కోసం పెద్ద ఎత్తున సహాయక పరికరాలు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి అని కొనియాడారు. ఉద్యోగాల్లో నాలుగు శాతం, ఉన్నత విద్యలో ఐదు శాతం, ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం, యువ వికాస పథకంలో ఐదు శాతం కేటాయింపులు చేసి దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా దివ్యాంగులకు పరికరాలు అందించడం మంచి పరిణామమని అన్నారు. జిల్లాలో మొత్తం 600 మందికి పైగా లబ్ధిదారులకు ఈ పరికరాలను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, శిశు అభివృద్ధి పథక అధికారులు వెంకట రమణ, శైలజ, స్వరాజ్యం, నాజీ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
ఉపాధికి ఫొటో కష్టాలు
రామన్నపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)పేరును వీబీజీ రామ్జీగా మార్పు చేసి అమలులో పారదర్శకత పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పనుల్లో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ముఖ ఆధారిత హాజరు(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) కూలీలతో పాటు, క్షేత్ర సహాయకులకు శాపంగా మారింది. సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు నమోదు పెద్ద తలనొప్పిగా మారింది. పలుమార్లు ఫొటో తీసినా అప్లోడ్ కాకపోవడంతో గంటల తరబడి ఎండలో నిరీక్షించాల్సి వస్తోంది. రోజుకూ రెండు సార్లు హాజరు ఉపాధిహామీ ఫథకం (వీబీజీ రామ్జీ)పనులకు వచ్చే కూలీల హాజరును రోజుకూ రెండు సార్లు నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉదయం పనికి వచ్చిన వెంటనే కూలీల ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. పని ముగిసిన తరువాత మళ్లీ రెండవసారి తీసి అప్లోడ్ చేయాలి. రెండు హాజర్ల మధ్య కాల వ్యవధి కనీసం నాలుగు గంటలు ఉండాలి. ఎండాకాలంలో త్వరగా పని ముగించుకొని వెళ్లాలనుకుంటే కుదరదు. నాలుగు గంటల వ్యవధిలోపల ముఖ చిత్రం తీసుకోదు. అంత వరకు ఎండలో వేచి ఉండాల్సిందే. ఏ మాత్రం తేడా ఉన్నా అంతే.. మూడేళ్ల క్రితం వరకు కూలీల హాజరును మస్టర్లలో నమోదు చేసే వారు. పని ప్రారంభించిన కొద్దిసేపటి తరువాత మేట్లు కూలీలతో మస్టర్లలో సంతకాలు చేసే వారు. రెండేళ్ల క్రితం హాజరు విధానాన్ని మార్చారు పనికి హాజరైన కూలీల గ్రూప్ ఫొటోను తీస్తే సరిపోయేది. ఇటీవల ప్రతీ కూలీ ఫొటోను ప్రారంభం, ముగింపు సమయాల్లో తీయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకు వచ్చింది. కూలీల ఆధార్ను అనుసంధానం చేసి కేవైసీ పూర్తి చేశారు. కూలీల ఫొటో, కనుపాపలను స్కాన్ చేశారు. హాజరు నమోదు సమయంలో ఫొటోలో ఏ చిన్నమార్పు ఉన్నా మిస్ మ్యాచ్ అంటూ తిరస్కరణకు గురి అవుతుంది. వెలుతురు సరిగా లేకపోయినా, ఇంటర్నెట్ రాకున్నా, ఫీల్డ్ అసిస్టెంట్ల మొబైల్ క్లారిటీ లేకున్నా హాజరు నమోదు కావడం లేదు. గతంలో ఫొటో తీసిన సమయంలో గడ్డంతో ఉండి ప్రస్తుతం లేక పోయినా, అప్పట్లో గడ్డం లేకుండా ఉండి ఇప్పుడు గడ్డం ఉన్నా ఫొటో తీసుకోవడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. కొందరు కూలీలు సబ్బుతో ముఖం కడిగి పౌడర్ వేస్తే తప్ప ఫొటో తీసుకోవడం లేదు. ప్రతీ పనిప్రదేశంలో ఒకరిద్దరు కూలీల ఫొటో నమోదు కోసమైనా గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, లేకుంటే ఆ రోజు హాజరు పడక వేతనం కోల్పోవాల్సి వస్తుందనే ఆవేదన కూలీల్లో వ్యక్తమవుతోంది.ఫ నెట్ రాక.. ఫొటో దిగక.. ఫ గంటల కొద్దీ ఎండలోనే నిరీక్షణ ఫ పని చేసినా పడని హాజరు -
అధికారం పోయినా అహంకారం తగ్గలే
నకిరేకల్ : మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్లోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్ధేశించి కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయనకు ఒంటి నిండా ఎంత అహంకారం ఉందో అర్థమవుతుందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. పాలనకు పనికిరారని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదన్నారు. వరంగల్లో శృతిని ఎన్కౌంటర్ చేయించింది మీరు కాదా.. వరి వేస్తే ఉరి అని చెప్పింది మీరు కాదా.. రుణమాఫీ చేస్తామని రైతుల్ని మోసం చేసంది మీరా కాదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం దొర అహంకారాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడూ క్షమించదన్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన ప్రతి నల్ల చట్టం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, చౌగోని శ్రీనివాస్, నంద్యాల వెంకట్రెడ్డి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం -
ధాన్యం గ్రేడింగ్లో మాయ
కేంద్రంలో ‘ఏ’ గ్రేడ్గా నిర్ధారిస్తే మిల్లర్ వద్దకు వచ్చేసరికి ‘బి’ గ్రేడ్గా మార్పుబొమ్మలరామారం: ధాన్యం కొనుగోళ్ల పక్రియ పారదర్శకంగా వేగవంతగా నిర్వహిస్తున్నామంటున్న అధికారులు క్షేత్ర స్దాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. కొనుగోలు కేంద్రాలలో ఏఈఓల రైతుల ధాన్యాన్ని పరిశీలించి ఏ గ్రేడ్గా ధృవీకరిస్తున్నారు. కానీ ఏఈఓ ధ్రువీకరణ మిల్లర్ ఆధిపత్యం ముందు ఓడిపోతోంది. బొమ్మలరామారం మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి పలు మిల్లర్ల వద్దకు ధాన్యం లోడింగ్ లారీలు వెళ్లగా వారు నానా కొర్రీలు పెడుతున్నారు. బి గ్రేడ్ ధాన్యంగా నమోదు చేస్తేనే అన్లోడ్ చేసుకుంటామని, లేదంటే కొనుగోలు కేంద్రాలకు తిరిగి పంపుతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో చేసేది లేక బి గ్రేడ్ ధాన్యం లోడ్లుగా రికార్డు చేసుకొని అన్లోడ్ చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక.. మిల్లర్ల ఆధిపత్యం కొనసాగుతున్నా ఏ అధికారి వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఏ గ్రేడ్ను బి గ్రేడ్గా మారుస్తున్నా, లారీల కొరత వేధిస్తున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 16వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి, ఫక్కీరు గూడెం, హాజీపూర్, మైలారం, మేడిపల్లి, రామలింగంపల్లి, పిల్లి గుండ్ల తండా, తిమ్మాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం నాటికి 10,198 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో బొమ్మలరామారం, నాగినేనిపల్లి, మర్యాల, చౌదర్పల్లి, జలాల్పూర్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 6 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. వీటిలో నాగినేనిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 740 ధాన్యం బస్తాలు మాత్రమే ఏ గ్రేడ్, మిగిలిన ధాన్యం మొత్తం బి గ్రేడ్గానే పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 16 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం బి గ్రేడ్గానే మిల్లర్లు పరిగణనలోకి తీసుకొని నమోదు చేసుకున్నట్లు తెలిసింది. వేధిస్తున్న లారీల కొరత బొమ్మలరామారం మండలంలోని కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు లారీల కొరత వేధిస్తోంది. తూకం వేసిన ధాన్యం రోజులతరబడి కేంద్రాల్లోనే మూలుగుతోంది. కాంటా అయిన ధాన్యం లోడింగ్ అయ్యే వరకు బస్తాలు తడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదేనని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కాపలాదారులుగా మారారు. -
యాదగిరీశుడి సేవలో వేం నరేందర్రెడ్డి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను వేం నరేందర్రెడ్డి, కుటుంబ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవానీ శంకర్ స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, స్థానిక నాయకులున్నారు. -
అమూల్యమైనదే..
ప్రేమతో ఇచ్చేది ఏదైనావేసవి సెలవుల్లో మా అమ్మమ్మ వద్దకు వెళ్లినప్పడు ఆమె నాకు చాలా నీతి కథలు చెప్పేది. అందులో ఈ ఉడుత దూరదృష్టి కథ చాలా బాగా నచ్చింది. చిలుకూరు : అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. ఆ జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటున్నాయి. ఓ రోజు అడవికి రాజైన సింహం తన పుట్టినరోజుకు రావాలని మిగిలిన జంతువులకు ఆహ్వానం పంపింది. అడవికి సింహాం రాజు కావడంతో పుట్టినరోజుకు జంతువులన్నీ తప్పనిసరిగా వెళ్లాలని అనుకున్నాయి. ఈ క్రమంలో తమ తమ స్థాయిని బట్టి ఏదో ఒక బహుమతిని ఇవ్వాలని వేటికి అవే అనుకున్నాయి. దీంతో ఒక్కో జంతువు ఒక్కోరకంగా పూల గుత్తి, మిఠాయిలు, బంగారు కిరీటాలు, వెండి కడియాలు తదితర విలువైన బహుమతులు తీసుకెళ్లాయి. అయితే బహుమతి తీసుకెళ్లేంత స్థామత లేని ఉడుత ఏ బహుమతి తీసుకెళ్లాలో అర్ధంకాక బాధపడుతూ ఉంది. సింహం స్థాయికి తగిన బహుమతి ఇవ్వకపోతే ఏమైతుందో అని దీర్ఘాలోచనలో పడింది. ఈ క్రమంలో ఉడుతకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఆ ఉడుత అడవిలో తిరుగుతూ ఎండిన చెట్ల గింజలను ఏరుకొని వచ్చి ఆ గింజలను వెదురు బొంగులో పోసి దానిని ఆకర్షణీయంగా తయారు చేసి సింహాంకు అందజేసింది. పుట్టినరోజు వేడుకల అనంతరం మిత్రులు తెచ్చిన బహుమతులను సింహం పరిశీలిస్తుండగా అన్నీ చాలా విలువైనవి కనిపించాయి. ఈ క్రమంలో ఉడుత ఇచ్చిన వెదురు బొంగు బహుమతి విచిత్రంగా కనిపించింది. దీంతో మిగతా జంతువులు నవ్వాయి. అయితే మిగతా జంతువులు ఇచ్చిన బహుమతులు తాత్కాలిక ఆనందాన్ని, ప్రయోజనాన్ని కలిగించేవి కాగా.. ఉడుత ఇచ్చిన బహుమతితో దీర్ఘకాలిక ప్రయోజనం ఉందని సింహం, మిగతా జంతువులు గ్రహించాయి. అదేమిటంటే వెదరు బొంగులోని విత్తనాలన్నీ నాటితే వృక్ష సంపద పెరిగి పండ్లు, ఫలాలు అందుతాయని, అంతేకాకుండా తమ మనుగడకు భవిష్యత్లో దట్టమైన అడవిని అందించగలవని గ్రహించాయి. వెంటనే జంతువులన్నీ కలిసి గింజలను భూమిలో నాటాయి. ఉడుత దీర్ఘ దృష్టిని మిగతా జంతువులు మెచ్చుకున్నాయి. మరి మీరు కూడా ఎండిన విత్తనాలను సేకరించి రాబోయే వర్షాకాలంలో భూమిలో నాటి మంచి వన సంపదను పెంపొందించాలని నేను ఆశిస్తున్నాను. నీతి : బహుమతి విలువ దాని ధరలో ఉండదు. అది ఇచ్చే వారి ప్రేమపై ఆధారపడి ఉంటుంది. చిన్నదైనా సరే ప్రేమతో ఇచ్చేది ఎంతో అమూల్యమైనది.అమ్మమ్మ చెప్పిన నీతి కథ -
కొత్తగూడెం వద్ద ట్రాఫిక్ జామ్
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండల శివారులోని కొత్తగూడెం సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మామిడికాయల లోడ్లతో లారీలు, ట్రక్కులు, ఆటోలు, మినీవాహనాలు కొత్తగూడెం వద్ద ఉన్న పండ్ల మార్కెట్కు వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు వెంట అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తుండటంతో పోచంపల్లికి నుంచి వచ్చే పోయే వాహనాలు, బస్సులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి గంటల తరబడి నిలిచిపోవడంతో హైదరాబాద్కు వెళ్తున్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను బుధవారం మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ యువజన నాయకుడు గుత్తి బాలశంకర్.. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ వెంటనే స్పందిస్తూ వనస్థలిపురం ట్రాఫిక్ ఏసీపీ నవీన్కుమార్తో ఫోన్లో మాట్లాడి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. మైదానంలో వాహనాలను పార్కింగ్ చేయించి టోకెన్లు ఇచ్చి వాహనాలను ఒక్కొక్కటిగా పంపించాలని సూచించారు. ఎంపీ ఆదేశాల మేరకు ఏసీపీ వెంటనే ఘటన స్థలాన్ని సందర్శించారు. ట్రాఫిక్ సమస్యను గురువారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. -
నిధులు రాకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే
మోత్కూరు: దళిత బంధు నిధులు విడుదల కాకుండా ఎమ్మెల్యే మందుల సామేల్ అడ్డుకుంటున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ఈవిషయంలో మోతూరులో ఎమ్మెల్యేతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా విలేకరులో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని మొదటి విడత విజయవంతంగా అమలు చేసిందని , 2023లో రెండో విడతలో భాగంగా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన 254 మంది లబ్ధిదారుల అకౌంట్లలో రూ.3 లక్షల చొప్పన జమ చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చి కోడ్ అమల్లోకి రావడంతో రూ.3 లక్షలు జమ చేసిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిందన్నారు. అంతటితో పథకం ఆగిపోయిందని కానీ యూనిట్లు మంజూరైన వారికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని 2025లో ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలుకు చర్యలు తీసుకున్నారుకానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అడ్డగూడూరు, మోత్కూరు మండలాలకు చెందిన 254 మంది కుటుంబాల లబ్ధిదారులకు మాత్రం నిధులు విడుదల కాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండి దళితుల పొట్ట కొడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని గ్రౌండింగ్ పూర్తి చేసి నిధులు విడుదలయ్యేలా చూడాలని లేకుంటే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు కూరెళ్ల రమేష్, బండి వెంకటేష్, దాసరి నరేష్, బుషిపాక శ్రీకాంత్, ఆనంద్, నాగరాజు, ఆనందం తదితరులు పాల్గొన్నారు. ఫ దళిత బంధు లబ్ధిదారుల ఆరోపణ ఫ ఎమ్మెల్యే సామేల్తో వాగ్వాదం -
ఆవు నిజాయితీ గొప్పది
మేము మోత్కూరులో ఉంటాము. వేసవి సెలవులు కావడంతో ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేటలో ఉంటున్న మా నానమ్మ ఇంటికి వచ్చాను. మా తాత చెప్పిన పులి, ఆవు కథ నాకు బాగా నచ్చింది.ఆత్మకూరు(ఎం) : ఓ ఆవు ఒక లేగ దూడను ఇంటి వద్ద వదిలి మిగిలన మందతో కలసి మేతకు పోతుంది. అక్కడ పులి ఎదురవుతుంది. ఎంతో ఆకలితో ఉన్న ఆ పులి ఆవును తినాలని చూస్తుంది. అప్పుడు ఆ ఆవు ఇంటి వద్ద చిన్నలేగ దూడ ఉంది. దానికి కడుపు నిండా పాలు ఇచ్చి వచ్చి నీకు ఆహారమై ఆకలి తీర్చుతానని చెబుతుంది. పులి ఆవు మాటలను నమ్మలేదు. ఆవు బతిమిలాడడంతో చివరకు పులి సమ్మతించి ఆవును వెళ్లమంది. దీంతో ఆవు పరుగు పరుగున ఇంటికి చేరి లేగ దూడను అక్కున చేర్చుకుంది. కడుపు నిండా పాలు ఇచ్చింది. కంట కన్నీరు కార్చుకుంటూ తిరిగి ఆవు అడవికి పయనమైంది. ఇచ్చిన మాట ప్రకారం పులికు ఆహారం అయ్యేందుకు దాని ఎదురుగా నిల్చుంది. కానీ పులి ఆవును తినకుండా.. మాటకు కట్టుబడి నిజాయితీగా తిరిగి వచ్చిన ఆవును మెచ్చుకుంటుంది. ఇంటికి వెళ్లి లేగ దూడతో సంతోషంగా ఉండు అంటూ పులి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. -
వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడి అరెస్టు
నార్కట్పల్లి : రెండేళ్ల క్రితం వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలకు చెందిన రెబ్బ జానకమ్మ(72) ఇంట్లో ఉండగా 2024 ఆగస్టు 2న అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొలను కార్తీక్ ఇంట్లోకి ప్రవేశించి జానకమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని వెళ్లిపోయాడు. మృతురాలి కుమారుడు యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసు సిబ్బంది విచారణ చేపట్టారు. బుధవారం నిందితుడు కార్తీక్ను నార్కట్పల్లి శివారులోని మునుగోడు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. జానకమ్మ వద్ద తాను రూ.1.18లక్షలు అప్పు తీసుకున్నానని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని జానకమ్మ ఒత్తిడి చేస్తుండటంతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. కార్తీక్ విజయవాడలోని ఓ హోటల్లో సప్లయర్గా పనిచేస్తున్నాడని, అతడు దొంగిలించిన ఆభరణాలను రూ.3.50లక్షలకు సికింద్రాబాద్లో ఓ వ్యక్తికి అమ్మి, ఆ డబ్బును జల్సాలకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. -
యాదగిరి క్షేత్రంలో స్థానిక బదిలీలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈఓ భవానీ శంకర్ పలు విభాగాలకు సంబంధించిన అధికారులను స్థానికంగా బదిలీలు చేశారు. సుమారు 25 మందిని బదిలీ చేశారు. వీరిలో ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిసెంట్లు, రికార్డు అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా వెంటనే తమకు కేటాయించిన విభాగాల్లో చేరాలని ఈఓ ఆదేశించారు. యాదగిరిగుట్టలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరా ధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. 8న మత్స్యకారులకు అవగాహన సదస్సు భువనగిరిటౌన్ : రైతు వారంలో భాగంగా ఈ నెల 8న మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి రాజారాం ఒక ప్రకటనలో తెలిపారు. భూవనగిరి జిల్లా కలెక్టరేట్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని, మత్స్య శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపల వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. జిల్లాలోని మత్స్యకార సంఘాల సభ్యులు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలిభువనగిరి: ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. భువనగిరి పట్టణంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ. 7 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని వస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ, నాయకులు పట్నం శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, నరసింహారావు, కృష్ణచారి, ఉడుత భాస్కర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. -
శ్రీనృసింహుడి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆదివారం వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజను సంప్రదాయంగా జరిపించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. -
వేగంగా అర్జీల పరిష్కారం
నేటి నుంచి డివిజన్ స్థాయిలోనూ ప్రజావాణిప్రభుత్వం ఆదేశాల మే రకు ఇక నుంచి ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజా వాణి కార్యక్రమం జరుగుతుంది. ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషిచేస్తారు. ప్రతి వినతిని తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసి యూనిక్ రిఫరెన్స్ నంబర్తో కూడిన రశీదు పత్రం ఇస్తాం. – అనురాగ్ జయంతి, కలెక్టర్ సాక్షి, యాదాద్రి : ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమంలో మార్పులు చేస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీలను గరిష్టంగా 30 రోజుల్లోగా పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ప్రభుత్వ శాఖలో ప్రత్యేకంగా ప్రజావాణి విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో ఇకనుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్తోపాటు భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా.. ఇకనుంచి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ కార్యాలయాల్లో జరిగే ఈ కార్యక్రమనికి డీఎల్పీఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్, డిస్కం డీఈ, ఆర్ అండ్ బీ డీఈఈ, సీడీపీఓ తదితర అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి కృషిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రజలకు ప్రయాణ భారం తగ్గి, తమ నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉన్నతాధికారులను కలిసే అవకాశం కలుగుతుంది. ఎప్పటిలాగానే జిల్లాస్థాయి ప్రజావాణికి కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా, అదనపు కలెక్టర్ అదనపు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల విజ్ఞప్తులను స్వీకరించాల్సి ఉంటుంది. డిజిటల్ పర్యవేక్షణకు సీజీజీ పోర్టల్ ప్రజావాణి ప్రక్రియలో పారదర్శకతను పెంచేలా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని తప్పనిసరి చేసింది. ప్రజల నుంచి వచ్చిన ప్రతి పిటిషన్ను వెంటనే ‘సీజీజీ’ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ప్రజావాణి పోర్టల్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. ప్రతి వినతికి ఒక ప్రత్యేక ఐడీ (యూనిక్ రిఫరెన్స్ నంబర్)తో కూడిన రిసిఫ్ట్ను దరఖాస్తుదారుడికి అందజేస్తారు. దీనిద్వారా ప్రజలు తమ విన్నపం ఏ స్థితిలో ఉందో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. గడువులోగా పరిష్కారం చూపకపోతే.. స్వీకరించిన ఫిర్యాదులను గరిష్టంగా 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలను కూడా పోర్టల్లో ఉంచాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా పరి ష్కారం చూపకపోతే, ఆ కేసులు ఆటోమేటిక్గా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోకి వాటికవే వెళ్తాయి. ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు వసతులు డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కోసం ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కుర్చీలు, వఅత్యవసర వైద్యసేవలు వంటి వసతులు కల్పిస్తారు. కాగా భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాలను ప్రజావాణి కోసం సిద్ధం చేశారు. ఫ కలెక్టరేట్తోపాటు భువనగిరి, చౌటుప్పల్లో నిర్వహణ ఫ గరిష్టంగా 30 రోజుల్లో పరిష్కరించేలా కార్యాచరణ ఫ సీజీజీ పోర్టల్ ద్వారా పర్యవేక్షణ ఫ మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం -
‘పది’ తప్పిన వారికి స్పెషల్ క్లాస్లు
భువనగిరి : పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను గట్టెక్కించేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పటికే పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు 152 మంది గత మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఆయా పరీక్షలకు మొత్తం 8,918 మంది విద్యార్థులు హాజరు కాగా 8,766 మంది ఉత్తీర్ణులయ్యారు. 152 మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 105 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు పాస్ అయ్యేలా రూపొందించిన కార్యాచరణను అమలు చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఆ తర్వాత గణితంలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలుగులో తడబడ్డారు. పరీక్షలకు తక్కువ వ్యవధి జూన్ 5 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అడ్వాన్స్డ్ సఫ్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. తక్కువ వ్యవధి ఉండటంతో విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థికి ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తున్నారు. వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయులు ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు జనగణన ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో సుమారు 80 శాతం వరకు ఉపాధ్యాయులకు ఈ విధులు నిర్వహించేందుకు కేటాయించారు. ఇప్పటికే వీరికి జనగణన పై శిక్షణఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సంబంధిత సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులుంటే వారి పరిస్థితి ఎలా అన్ని సందేహాలు ఉన్నాయి. మండలాల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయుడు వారిని దత్తత తీసుకోవాలి. విద్యార్థులకు నేరుగా గానీ లేదా వీలును బట్టి వాట్సప్ ద్వారా ముఖ్యమైన అంశాలను వివరించడంతో పాటు చదువుకునేందుకు ముఖ్యమైన అంశాలు ఇవ్వాలి. ఎక్కువ మంది ఫెయిలైన విద్యార్థులకు నేరుగా పాఠశాలకు రప్పించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఫ ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ కార్యాచరణ ఫ ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 105 మంది ఫ జూన్ 5వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో సుమారు 70 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇందులో ఒక్కో సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే సమావేశం నిర్వహించి ప్రధానోధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. జనగణన నిర్వహించే వారు విధుల అనంతరం ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సందేహాలు నివృతి చేయనున్నారు. – సత్యనారాయణ, డీఈఓ -
సమాజ సేవకు ముందుకు రండి
మోత్కూరు : సమాజ సేవ చేయాలనుకునే వారు రెడ్క్రాస్లో సభ్యులుగా చేరాలని రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మోత్కూరులో రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 31 వరకు జిల్లాలో రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ కొనసాగనుందన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఐఆర్సీఎస్ రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రాయగిరి రోడ్డు పాత వివేరా హోటల్ పక్కన ఉన్న రెడ్క్రాస్ భవనంలో సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డుతో పాటు రూ.1,160తో కార్యాలయంలో ఇవ్వాలని, పరిశీలించిన అనంతరం శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 8985960689, 99599 97750 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బీసు మత్స్యగిరి, మోత్కూరు మండల ఉపాధ్యక్షుడు ముప్ప వెంకట్రెడ్డి, ముప్ప తిరుమల్రెడ్డి, అవిరేని శోభన్బాబు, శ్రీనివాసరావు, అశోక్రెడ్డి పాల్గొన్నారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడుదిగుమతి చేసుకోవాలిభువనగిరి : లారీల్లో తెచ్చిన ధాన్యాన్ని రైస్మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఆదివారం భువనగిరిలోని శివ రైస్ మిల్లును ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం లోడుతో ఉన్న లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం దిగుమతి కోసం సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం దిగుమతిలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది, మిల్లు యజమానులు ఉన్నారు. జాబ్మేళా విజయవంతంనల్లగొండ : నల్లగొండలో నిర్వహించిన మెగా జాబ్మేళా విజయవంతం అయ్యిందని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలకు ఈ నెల 2న 125 కంపెనీలు, 2000 మంది నిరుద్యోగులు హాజరు కాగా, 3న 23 కంపెనీలు, 150 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ జాబ్మేళా ద్వారా అనేక మందికి ఉద్యోగాలు లభిచాయని తెలిపారు. సామాజిక ఉద్యమంలా ‘రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు’ నల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27 నుంచి నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, అన్నదాతల అవగాహన కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్వహిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ అందాస్ జానయ్య తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో యూనివర్సిటీ సైంటిస్టులు, వివిధ పరిశోధన కేంద్రాలకు చెందిన సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ఎరువుల వాడకం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారం పరిరక్షణ, పంటల మార్పిడి విధానంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే కంపాసాగర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.లింగయ్య, శాస్త్రవేత్తలు డాక్టర్ జి.శివప్రసాద్, కె.సంధ్యారాణి, జి.స్వాతి, ఎ.రాములమ్మ, హిమబింధు, సాయిప్రియ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
నాలాల సర్వే ఎటుపోయింది!
ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీలో ప్రధాన నాలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేకుండా పోయింది. ఆక్రమణలను గుర్తించడంలో మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆక్రమణల గుర్తింపునకు సంయుక్త సర్వే చేపట్టనున్నట్టు రెండు శాఖల అధికారులు ప్రకటించి నెలలు గడుస్తున్నా పురోగతి శూన్యం. నాలాల కబ్జాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సూచించినా అధికారులు కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముంపు సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం ప్రకటనలు చేసి వదిలేయడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాల ఆక్రమణలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చేపట్టలేదు. దాంతో వచ్చే వానా కాలంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకోస్తుందోనని ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ సమస్య.. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, ప్రగతి స్కూల్, పాత పంచాయతీ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి నుంచి ఈదమ్మ గుడి వరకు ప్రతి సంవత్సరం వానా కాలంలో వరదలు ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు మూడు వేల ఇళ్లు, ఆరు వేల జనాభా ఉంది. వర్షాలు కురిస్తే ఇళ్లలోకి నీరు చేరి సరుకులు, సామగ్రి పూర్తిగా తడిసి పోతాయి. ప్రజలు కూడా రాత్రంతా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి నెలకొంటుంది. గత ఏడాది.. గత ఏడాది సెప్టెంబర్లో భారీ వర్షాలతో ఆయా కాలనీలు జలయమం అయ్యాయి. ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆర్డీఓ కృష్ణారెడ్డి ఇతర అధికారులు సందర్శించారు. ఈ సమయంలో నాలాల కబ్జాల వల్లే వరదలు ముంచెత్తి కాలనీలను అతలాకుతలం చేస్తున్నాయని ముంపు బాధితులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే వరదలకు కారణమైన నాలాల ఆక్రమణల ను తొలగించి, ముంపు సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారుల పరిశీలనలో.. కొందరు రియల్టర్లు లేఅవుట్లు చేయడం, మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా గృహనిర్మాణాలు చేపట్టడం వల్ల నాలాలు ఆక్రమణలకు గురైనట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. ఆక్రమణలతో నాలాలు కుంచించుకుపోయి వరద నీరు ముందుకు పోలేక ఇళ్లను ముంచెత్తుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దాంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు నాలాల ఆక్రమణల గుర్తింపునకు సంయుక్తంగా సర్వే చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసి, సదరు యజమానుల నుంచి వివరణ తీసుకుంటామని ప్రకటించి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిచ్చిమొక్కలు, మట్టి దిబ్బలతో ఆనవాళ్లు కోల్పోయిన ఆలేరు పట్టణంలోని నాలా బృందావన్ కాలనీ సమీపంలో ఆక్రమణలతో కుంచించుకు పోయిన నాలాపట్టణ శివారులోని బైరవకుంట, పర్రెకాల్వ నుంచి శ్రీరామకృష్ణ విద్యాలయం వరకు దాదాపు 9 కిలోమీటర్ల పొడవుతో ఐదు ప్రధాన వరద నాలాలు ఉన్నాయి. ఎగువన ఉన్న రెండు కుంటలు నిండితే 10,11,12 వార్డుల పరిధిలోని కల్వర్టులు, నాలాల మీదుగా వరదనీరు వెళ్లి, బైపాస్ సమీపంలోని పెద్దవాగులో కలుస్తాయి. కానీ నాలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, మట్టి దిబ్బలు అడ్డుగా ఉండటంతో ప్రతి వర్షాకాలంలో వరద నీరు సాఫీగా ముందుకు వెళ్లక కాలనీలను ముంచెత్తుతోంది. రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, ప్రగతి స్కూల్, పాత పంచాయతీ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి నుంచి ఈదమ్మ టెంపుల్ వరకు ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలతో గత ఏడాది ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వరద తీవ్రత ఎక్కువై ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫ ఆలేరు మున్సిపాలిటీలో ఆక్రమణల గుర్తింపులో జాప్యం ఫ రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపం ఫ ఇష్టానుసారంగా నిర్మాణాలు ఫ ప్రభుత్వ విప్ చెప్పినా కదలని యంత్రాంగం ఫ ముంపు గుప్పిట్లో కాలనీలు -
నేటి నుంచి రైతు వారం
భువనగిరి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు రైతు వారం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నాయి. పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, సేంద్రియ వ్యవసాయం వంటి తదితర అంశాలపై సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు. కార్యాచరణ ఇలా.. ● మొదటి రోజు : నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం–ప్రకృతి, పౌరసరఫరాల శాఖ వినయోగదారులు కోరుకునే సన్నవరి రకాల సాగుపై అవగాహన కల్పించి భూసార పరీక్ష ఫలితాల కార్డులు అందజేస్తారు. ● రెండో రోజు : నియోజకవర్గ స్థాయిలో ఉద్వాన పంటల సాగు–ఆయిల్ పామ్ సాగువిస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను వివరిస్తారు. ● మూడో రోజు : రైతు వేదికల్లో బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్పీఓల ద్వారా రైతులకు అందించే సేవలను తెలియజేస్తారు. ● నాలుగో రోజు : నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్ వినియోగంపై వివరిస్తారు. ● ఐదో రోజు : పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ–పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు–వేసవి పశుసంరక్షణ కార్యక్రమం, మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులలో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నివారణ, అధికోత్పత్తికి చర్యలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సమర్థ నీటి విడుదల, గేట్ల నిర్వహణ, కాల్వల్లో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. ● ఆరో రోజు : గ్రామస్థాయిలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రతపై తెలియజేస్తారు. రైతు వారం కార్యక్రమాన్ని ఆరు రోజులపాటు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి రైతులు హాజరై వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులు అందించే సమాచారాన్ని తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి. – రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఫ సాగు పద్ధతులు, పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం ఫ వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో సదస్సులు ఫ తొలిరోజు భూసార పరీక్షఫలితాల కార్డులు అందజేత -
122 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత
టెన్త్ ఫలితాల్లో జిల్లాలో అత్యధికంగా తెలుగులోనే ఫెయిల్ అయ్యారు. గత మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,918 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,766 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో మొత్తం 152 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా తెలుగులో 75మంది, హిందీలో ముగ్గురు, ఇంగ్లిష్లో 39, గణితంలో 36, సైన్స్లో 29, సాంఘిక శాస్త్రంలో ఐదుగురు అనుత్తీర్ణులయ్యారు. భువనగిరి: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మోడల్, కేజీబీవీలు, టీఎస్ఆర్ఈఐఎస్,ఎస్టీ గురుకుల పాఠశాలలు కలిపి మొత్తం 176 ఉండగా 122 స్కూళ్ల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టడం, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారు కనీసం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయడంలో సఫలమయ్యారు. కొన్ని స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణతసాధించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారి పై పర్యవేక్షణ చేయడం, ప్రభుత్వం పెట్టిన పరీక్షలు కాకుండా అదనంగా ఎగ్జామ్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాలతో సక్సెస్ కాగలిగారు. ఈ సారి పరీక్షకు మరో పరీక్షకు మధ్య సుమారు నాలుగు రోజులు వ్యవధి ఇవ్వడం ఉపాధ్యాయులు, విద్యార్థులకు కలిసివచ్చింది. మూడు మండలాల్లోనూ.. జిల్లాలోని మూడు మండలాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాజాపేట మండలంలో 12 జెడ్పీహెచ్ఎస్లుండగా 431 మంది , గుండాల మండలంలో 6 జెడ్పీహెచ్ఎస్లుండగా 251మంది, నారాయణపురం మండలంలో 6 జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుండగా ఇందులో 402 మంది ఉన్నారు. వీరంతా ఉత్తీర్ణత సాధించారు. -
భువనగిరి మున్సిపల్ కమిషనర్గా చంద్రప్రకాష్ రెడ్డి
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ కొత్త కమిషనర్గా చంద్రప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు నాచారం మున్సిపాలిటీలో సేవలు అందించిన ఆయనను భువనగిరికి బదిలీ చేస్తూ సీడీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి కమిషనర్ రామలింగం 15రోజుల క్రితం జీహెచ్ఎంసీకి బదిలీ కాగా డీఈ కొండలరావు ఇన్చార్జి కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రప్రకాష్రెడ్డి శుక్రవారం లేదా సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి సాక్షి, యాదాద్రి : కొనుగోళ్లు ముమ్మరమవుతున్న నేపథ్యంలో రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని, ఇందుకోసం హమాలీల సంఖ్యను పెంచుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లోధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ప్రక్రియ నిరంతరం కొనసాగేలా షిఫ్టుల వారీగా పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు, డీసీఎస్ఓ, డీఎంసీఎస్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. నేటి నుంచి యాదగిరి క్షేత్రంలో నిత్య గిరి ప్రదక్షిణయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 5.30గంటలకు నిత్య గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి కొండకు దిగువన ఉన్న వైకుంఠద్వారం వద్ద రాతి పాదాలను ఏర్పాటు చేశారు. ఈ పాదాల చెంత భక్తులు మొక్కుకొని యాదగిరి కొండ చుట్టూ తిరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈఓ భవాని శంకర్ వెల్లడించారు. స్వాతి నక్షత్రం రోజునే కాకుండా ప్రతి రోజు భక్తులు గిరి ప్రదక్షిణ చేసే విధంగా అధికారులు ఈ నిత్య గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5న సామూహిక నిరాహార దీక్షతిరుమలగిరి(తుంగతుర్తి) : తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 5న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద జరిగే సామూహిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోరారు. గురువారం తిరుమలగిరి పెన్షనర్స్ భవన్లో రిటైర్డ్ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండవ పీఆర్సీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల విధి విధానాలు రూపొందించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంకెపల్లి విఠల్రెడ్డి, బి.రాంబాబు, డి.శ్యామ్సుందర్రెడ్డి, ఎం.పద్మారెడ్డి, ఎస్.నర్సయ్య, కె.వెంకట్రెడ్డి, నర్సయ్య, డి.నారాయణ, కె.యాదయ్య, భిక్షం, సోమనారాయణ పాల్గొన్నారు. -
యాదగిరీశుడి ఆలయంలో 108 మందితో వీణా వాయిద్యం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీనృసింహస్వామి వారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి 108 మంది వీణా వాయిద్యం కళాకారులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. శ్రీఅన్నమాచార్యులు ద్వాదశ తరము శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల శిష్య బృందం అన్నమయ్య సంకీర్తన సాహిత్య ప్రచార వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పెందుకు యాదగిరి క్షేత్రంలో 108 మంది కళాకారులు వీణా వాయిద్యం చేశారు. మీనాక్షి శ్రీనివాసు నిర్వహణలో తెలుగు రాష్ట్రంలోని కల్యాణి హేమలత, ఉమాదేవి, ప్రశాంతి శిష్య బృందాలు ఈ వేడుకలో పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో 108 మంది కళాకారులు వీణా వాయిద్యం ప్రదర్శించడం ఇదే మొదటి సారి. -
రైతులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోరా
యాదగిరిగుట్ట (తుర్కపల్లి): కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి విమర్శించారు. తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంపై ఆగ్రామంలోని రహదారిపై రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, రైతులతో కలిసి రాసారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనకపోవడంపై మండిపడ్డారు. శుక్రవారం వరకు కొనుగోళ్లు ప్రారంభించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతకు ముందు ముల్క లపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించిన సునిత, రామచంద్రారెడ్డిలతో పోలీసులు మాట్లాడారు. కలెక్టర్ వచ్చే వరకు రాస్తారోకో చేస్తామని చెప్పడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ రాస్తారోకోలో మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సాగర్ల పరమేష్, ఎంపీటీసీమాజీ సభ్యుడు గిద్ద కరుణాకర్, భిక్షపతి, ఇమ్మడి మల్లప్ప, రాజేష్నాయక్, బుక్యా రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, మేకల బాలకృష్ణ, గుంటి శ్రీశైలం, గుగులోతు మోతీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఫ ధాన్యం కొనుగోలులో జాప్యంపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత ఆగ్రహం ఫ ముల్కలపల్లిలో రైతులతో కలిసి రాస్తారోకో -
రెండో సారి వంద శాతం ఉత్తీర్ణత
వరుసగా మా పాఠశాలలో రెండవ సారి వంద శాతం ఉత్తీర్ణత సాధించారం. గత సంవత్సరం 86 మంది విద్యార్థులుండగా ఈ సారి 98 మంది విద్యార్థులున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులను ఏబీసీ గ్రూపులుగా విభజించి ప్రతి ఉపాధ్యాయుడికి ఆరుగురు చొప్పున విద్యార్థులను దత్తత ఇచ్చాం. ఆ విద్యార్థులపై ఆయా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి సులభంగా అర్థమయ్యేరీతిలో బోధన చేయడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. – వి మాలతి, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్, తుర్కపల్లి మండలం -
వనరుల వినియోగంలో సమన్వయం అవసరం
సాక్షి, యాదాద్రి : అభివృద్ధి పనులకు అవసరమైన వనరుల వినియోగంలో అన్ని శాఖల సమన్వయం అవసరమని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) నిధుల వినియోగంపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సీఎస్ఆర్ నిధులను సమర్థంగా వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను సేకరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్ పాల్గొన్నారు. మొబైల్ యాప్లో ఎంట్రీ చేయాలిమండల స్పెషల్ అధికారులు హాస్టల్స్ పర్యవేక్షణ సమయంలో గుర్తించిన సమస్యలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మండల స్పెషల్ అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో వివిధ చమురు సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
విద్యార్థులను దత్తత తీసుకొని..
మా పాఠశాలలో 61 మంది టెన్త్ విద్యార్థులున్నారు. పరీక్షలు బాగా రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు డిసెంబర్ వరకే సిలబస్ పూర్తి చేయించాం. ప్రతి ఉపాధ్యాయుడు నలుగురు చొప్పున విద్యార్థులను దత్తత తీసుకున్నాం. ఆ నలుగురు విద్యార్థులు బడికి రెగ్యులర్గా వచ్చేలా చూడడం.. పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పించడం. సందేహాలు ఉంటే నివృత్తి చేయడం వంటి చర్యలు తీసుకున్నాం. దీంతో జిల్లాలో టాప్మార్కులు సాధించిన పంది మందిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. –కె.మనోజ్కుమార్, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ రఘునాథపురం, రాజాపేట మండలం -
వాతావరణం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఎండ అధికంగా ఉంటుంది.- 8లోచిలుకు స్వామికి శ్రమ శక్తి అవార్డుఆలేరురూరల్: ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన డాక్టర్ చిలుకు స్వామి శ్రమ శక్తి అవార్డుకు ఎంపికయ్యారు. 14 సంవత్సరాలుగా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ పలు సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. సికింద్రాబాద్ డివిజినల్ అసిస్టెంట్ (ఎస్సీఆర్ఈసీసీఎస్) ప్రెసిడెంట్గా 42 వేల మంది రైల్వే కార్మికులకు సేవలు అందిస్తున్నారు. కార్మికుల దినోత్సవం మేడేను పురష్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ ల చేతుల మీదుగా శ్రమ శక్తి అవార్డును హైదరాబాద్ రవీంద్రా భారతిలో అందుకోనున్నారు. గ్రామ ప్రజలు కంతి మహేందర్, రచ్చ రామ్నర్సయ్య, వెంకటేష్, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. -
కాలువ తవ్వింది లేదు.. నీరు పారిందిలేదు!
కలగానే.. కాళేశ్వరం ప్యాకేజీ–15 కాలువ నిర్మాణం అధికారులు సేకరించిన భూమి, ఇవ్వాల్సిన పరిహారం గ్రామం అవార్డు పాసైనభూమి పరిహారం (ఎకరాల్లో) (రూ.లలో) చల్లూరు 56.29 3,56,71,026 బేగంపేట 71.34 5, 16,83,651 జాల 13.36 14,04,231 బొందుగుల 32.32 1,72,22,869 నర్సాపూర్ 55.13 3,45, 69,481 రఘునాథ్పూర్ 24.32 1,67,65,079 కుర్రారం 46.295 2,97,72,974 ఫ 298.06 ఎకరాల భూ సేకరణ ఫ 60 మంది రైతులకు అందని పరిహారం ఫ పదమూడేళ్లుగా నిరీక్షణ సాక్షి, యాదాద్రి : కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–15 కింద కాలువ నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. రాజాపేట మండలంలో సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వకానికి అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించిన అధికారులు భూ భారతి పోర్టల్లో నమోదు చేసి కొన్నిచోట్ల పనులు ప్రారంభించి వదిలేశారు. మరికొన్ని గ్రామాల్లో అసలు పనులే మొదలు పెట్టలేదు. గంధమల్ల రిజర్వాయర్ను పెండింగ్లో పెట్టడం.. నిధులలేమి కారణంగా ఈ కాలువ నిర్మాణం కలగానే మిగిలింది. అటు సాగునీరు అందక, ఇటు భూమి పరిహారం రాక రైతుల బతుకు భారంగా మారింది అందని రూ.19.70కోట్ల పరిహారం రాజాపేట మండల పరిధిలోని రైతులకు గోదావరి జలాలు అందించి బీడుభూములను సాగులోకి తేవాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–15 కింద గంధమల్ల రిజర్వాయర్కు అనుబంధంగా కాలువ నిర్మాణ పనులు చేపట్టాలనుకున్నారు. దీనికోసం 13 ఏళ్ల క్రితం గంధమల్ల నుంచి రఘునాథపురం గ్రామం వరకు దాదాపు ఏడు గ్రామాల్లో మొత్తం 308.24 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో 60 మంది రైతుల నుంచి ఇప్పటి వరకు 298.06 ఎకరాల భూమిని మాత్రమే సేకరించింది. అయితే ఆ భూములకు సంబంధించిన రైతులకు రూ.19.70 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ భూములు నిషేధిత జాబితాలోకి.. అధికారికంగా భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసిన యంత్రాంగం ఆయా భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో రైతులు భూమి మీద హక్కులు కోల్పోయారు. ఆ భూములకు గత ప్రభుత్వంలో రైతుబంధు, ప్రస్తుత ప్రభుత్వంలో రైతు భరోసా దక్కడంలేదు. తమ పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అత్యవసరం కోసం అమ్ముకుందామంటే వీలులేకుండా పోయిందని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములను ఆధీనంలోకి తీసుకున్నా.. కాళేశ్వరం కాలువ నిర్మాణం కోసం రైతుల భూముల ను తమ ఆధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం పనులు మాత్రం ఇంత వరకు ప్రారంభించలేదు. బీడు భూములకు గోదావరి జలాలు వస్తాయని ధీమా కూ డా లేకుండా పోయింది. కాలువ నిర్మాణం పూర్తయితే దానిద్వారా వచ్చే నీటితో భూములను సాగులోకి తెచ్చుకుంటామని ఎదురుచూస్తున్న తమ ఆశలు అడియాసలుగా మారాయని రైతులు పేర్కొంటున్నారు. కాళేశ్వరం ప్యాకేజీ–15 కింద కాలువ నిర్మాణానికి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల నుంచి భూములను తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తోంది. పదేళ్లుగా రైతులకు రైతు బంధు రావడంలేదు. న్యాయం చేయాలి. – వంచ వీరారెడ్డి, మాజీ సర్పంచ్, చల్లూరు సేకరించాల్సిన భూమి 308.24 ఎకరాలు సేకరించింది 298.06 ఎకరాలు బాధిత రైతులు సుమారు 60 మంది చెల్లించాల్సిన పరిహారం: రూ. 19.70 కోట్లు నాకున్న ఎకరన్నర భూమిలో అరెకరం భూమి కాలువ కిందపోయింది. పరిహారం మాత్రం రాలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదు. కొడుకు పెళ్లి కోసం భూమిని అమ్ముదామంటే అవకాశం లేకుండాపోయింది. పరిహారం ఇప్పించాలి. – వర్కాల చంద్రయ్య, చల్లూరు రైతు -
హైవేపై వాహనాల బారులు
చౌటుప్పల్ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణంలో బుధవారం వాహనాలు బారులుదీరాయి. వివాహాలు, ఇతర శుభకార్యాలు అఽధికంగా ఉండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించడంతో రద్దీ పెరిగింది. అదేవిధంగా పట్టణంలో అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. ఈ క్రమంలో జాతీయ రహదారితో పాటు సర్వీస్ రోడ్లపై ఇరువైపులా రద్దీ నెలకొంది. ప్రధానంగా వలిగొండ జంక్షన్ నుంచి తంగడపల్లి చౌరస్తా మీదుగా పైలాన్పార్క్ వరకు హైదరాబాద్ మార్గంలో ఎప్పుడు చూసినా వాహనాలు బారులుదీరే కనిపిస్తున్నాయి. తంగడపల్లి చౌరస్తా వద్ద రోడ్డు దాటేందుకు వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
ఒత్తిడితో పీఏసీఎస్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
కనగల్ : రైస్ మిల్లర్ల కొర్రీలు, అధికారుల నిర్లక్ష్యం, రైతుల ఒత్తిడితో పీఏసీఎస్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి సెల్ఫీ వీడియో తీసి తన బాధను చెప్పకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కనగల్ మండలం జి. యడవల్లి పీఏసీఎస్ కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కొప్పుల సైదులు కొద్దిరోజులుగా బచ్చన్నగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. కొనుగోలు కేంద్రంలో ఽరైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు పంపిస్తే రెండు మూడు రోజులైనా దిగుమతి చేసుకోవడంలేదని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వీడియోలో వాపోయాడు. కొనుగోలు కేంద్రంలో బస్తా 42 కేజీలు కాంటా వేసి పంపించినా మిల్లర్లు ధాన్యాన్ని బీ–గ్రేడ్ అని దిగుమతి చేసుకోకుండా ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతులను మిల్లర్లు ఇబ్బందులను గురిచేస్తున్నారని, రైతుల నుంచి సేకరించిన ధాన్యం కూడా కొనుగోలు కేంద్రంలో నిలిచిపోతుందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఏమి చేయాలో అర్ధం కావడంలేదని, తప్పని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానని జి.యడవల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కేంద్రాల్లో పనిచేస్తున్న ఇన్చార్జిల మీద చాలా ఒత్తిడి ఉందని, అధికారులు స్పందించి తన ఆత్మహత్యతోనైనా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేటట్లు చూడాలని సైదులు వీడియో పేర్కొన్నాడు. ప్రస్తుతం సైదులు పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. సైదులును పరామర్శించిన కంచర్ల భూపాల్రెడ్డి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైదులును నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. సైదులుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులున్నారు. సైదులును మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, ప్రస్తుతానికి అతడి పరిస్థితి విషమంగానే ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. భారీగా చేరుకున్న గ్రామస్తులు.. సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో గ్రామస్తులు, బంధువులు, రైతులు ఆస్పత్రికి భారీగా చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిల్లా నాయకుడు పిల్లి రామరాజు సైతం సైదులును పరామర్శించారు. ఫ సెల్ఫీ వీడియోలో బాధను వెల్లడించిన సైదులు -
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం : కలెక్టర్
సాక్షి, యాదాద్రి : రోడ్డు ప్రమాదాలను నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, హైవే అధికారులు, ఇంజనీరింగ్, రవాణా అధికారుల సమీక్షతోపాటు అనంతరం నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వాహనాల వేగ నియంత్రణకు రోడ్లపై రుంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, స్పీడ్ లిమిట్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కళాశాలల్లో అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నిల్వలు, సరఫరాపై ఆబ్కారీ శాఖ తనిఖీలు నిర్వహించాలన్నారు. సమావేశాల్లో డీఈఓ సత్యనారాయణ, డీపీఓ శ్రీనివాస్రెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సాయికృష్ణ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆర్ అండ్ బీ అధికారి సరిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఫ్రాంక్ పేమెంట్ యాప్ పేరుతో మోసం
చిట్యాల : ‘ఫ్రాంక్ పేమెంట్ యాప్’ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఒకరిని చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నార్కట్పల్లి సీఐ కె. నాగరాజు బుధవారం వెల్లడించారు. ఏపీలోని అనకాపల్లికి చెందిన బుద్ద హేమసాయి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నాడు. అతడు తన స్నేహితులైన హరి, సురేష్, బాలుతో కలిసి జల్సాలకు అలవాటుపడి కొంతకాలంగా ‘ఫ్రాంక్ పేమెంట్ యాప్’ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. వీరు ఈ నెల 25న ఏపీలోని విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తామని నగదును చేతికి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఫ్రాంక్ పేమెంట్ యాప్ ద్వారా పేమెంట్ చేసినట్లు నకిలీ మెసేజ్ను చూపించి అతడి వద్ద రూ.13,000 తీసుకున్నారు. అనంతరం వీరు నలుగురు కలిసి కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు కారును ఆపేందుకు యత్నించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వారి నుంచి తప్పించుకునే క్రమంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్రూట్లో వెళ్లి స్థానికంగా వేణుగోపాలస్వామి వెంచర్లోకి వెళ్లి కారును పార్కింగ్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా బుధవారం చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ చిట్యాల బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. నిందితుల్లో ఒకరైన బుద్ద హేమసాయి పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి రూ.13,000 నగదు సాధ్వీనం చేసుకుని రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి నలుగురిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో సైబర్ మోసాల కేసులతో పాటు ఇతర కేసులున్నట్లు సీఐ తెలిపారు. ఫ ఒకరి అరెస్ట్ ఫ మరో ముగ్గురు పరారీ -
మిర్యాలగూడలో కారు బీభత్సం
మిర్యాలగూడ అర్బన్ : కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్ మంగ్తా (45) మిర్యాలగూడ పట్టణంలోని ఐసీసీఐ బ్యాంకు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం అతడు ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి–నార్కట్పల్లి రహదారి దాటుతుండగా.. గుంటూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. అంతేకాకుండా కారు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో రెండు బైక్లను, ట్రాక్టర్ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మంగ్తా అక్కడికక్కడే మృతిచెందగా.. కురియా తండాకు చెందిన ధనావత్ భాస్కర్, కారు సర్వీసింగ్ సెంటర్లో పనిచేసే సన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారులో ప్రయాణిస్తున్న వారు కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. క్షతగాత్రులను స్థానికులు మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగ్తా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సోమనర్సయ్య పేర్కొన్నారు. మృతుడికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. న్యాయం చేయాలని రాస్తారోకో.. మంగ్తా కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, మైసమ్మకుంట తండా గ్రామస్తులు ఘటనా స్థలంలో అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై బైఠాయించారు. మూడున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ పట్టణం గుండా దారి మళ్లించి కొంతవరకు ట్రాఫిక్ను నియంత్రించారు. ఆర్డీఓ హామీతో ఆందోళన విరమణ.. మిర్యాలగూడ ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.ఫ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి ఫ మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఫ న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యుల రాస్తారోకో -
కారు రిపేర్ కోసం చైన్ స్నాచింగ్
మిర్యాలగూడ అర్బన్: అద్దెకు తీసుకున్న కారు రోడ్డు ప్రమాదంలో దెబ్బతినడంతో దానిని రిపేర్ చేయించేందుకు డబ్బుల్లేక చైన్ స్నాచింగ్కు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం డీఎస్పీ రాజశేఖర రాజు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన జాజం నర్సింహారావు కుమారుడు జాజం గోపిచంద్ కొద్దినెలలుగా మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీనగర్లో ఉంటూ స్థానికంగా వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. వాటర్ ప్లాంట్ ఆటో నడుపుతూ చెడు వ్యసనాలకు అలవాటుపడిన గోపిచంద్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకోగా.. రోడ్డు ప్రమాదం జరిగి కారు దెబ్బతింది. కారును బాగుచేయించాలని అద్దెకు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తన వద్ద డబ్బుల్లేక దొంగతనం చేయాలని గోపిచంద్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 27న మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో గల సాంప్రదాయ హోటల్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గౌరు వజ్రమ్మ మెడలోని బంగారు గొలుసును గోపిచంద్ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ నాగభూషణరావు ఎస్ సైదిరెడ్డి నేతృత్వంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందుతుడిని గుర్తించారు. బుధవారం చోరీ చేసిన బంగారు గొలుసును విక్రయించడానికి మిర్యాలగూడకు వచ్చిన గోపిచంద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు, సెల్ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఫ నిందితుడిని పట్టుకున్న మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు ఫ రూ.4లక్షల విలువైన బంగారు గొలుసు, సెల్ఫోన్, బైక్ స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర రాజు -
శ్రీరాముడి అలంకారంలో నృసింహుడు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంత్యోత్సవాలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంఆ ఉదయం అర్చకులు నిత్యారాధనలు చేపట్టారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని అలంకరించి తిరు, మాడ వీధుల్లో ఊరేగించి ఉత్తర మాడ వీధిలోని యాగశాలలోకి తీసుకెళ్లి అధిష్ఠించారు. ఆ తర్వాత యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తికుంభ ఆరాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన గరుడ మూలమంత్ర హోమం, నిత్య పూర్ణాహుతి చేపట్టారు. ఆయా వేడుకల్లో ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బి. సురేంద్రాచార్యులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీరామ అలంకారంలో.. సాయంత్రం నిత్యారాధనలు, సాయమారాధన, ద్వారతోరణపూజ, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన గరుడ మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి చేపట్టారు. అంతకుముందు నృసింహస్వామిని శ్రీరాముడిగా అలంకరించి ఊరేగించారు. సేవకు ముందు అర్చకులు, పారాయణీకులు వేద పారాయణం పఠించారు. పాతగుట్టలో.. యాదగిరీశుడి ఆలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం ప్రాతరాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన చేపట్టారు. సాయంత్రం సాయమారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. మల్లాపురం గ్రామానికి చెందిన శ్రీరామ భజన మండలి, యాదగిరిగుట్టకు చెందిన శ్రీగాయత్రి మహిళ భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. సాయంత్రం దేవులపల్లి నాగ శ్రీదేవి భక్తి సంగీతం, హైదరాబాద్కు చెందిన శాంకరి నాట్యస్థల్, మయూరి నాట్య కళాక్షేత్రం కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. నేటితో ముగింపు.. నృసింహ జయంతి ఉత్సవాలు గురువారం రాత్రి ముగియనున్నాయి. ఫ నేటితో ముగియనున్న జయంత్యోత్సవాలు -
అనుమానంతో భార్యను హత్య చేసి భర్త
మీర్పేట, మర్రిగూడ: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమైపె గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంకు చెందిన నల్లబోతు నర్సింహ, వసంత(52) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వలస వచ్చి గత ఇరవై ఏళ్లుగా బీఎన్రెడ్డినగర్ టీచర్స్ కాలనీలో నివాసముంటున్నారు. నర్సింహ కూలీ, వసంత ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సింహ తన భార్య వసంతను తరచూ అనుమానిస్తుండేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న వసంతపై గొడ్డలితో నర్సింహ విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. బుధవారం సాయంత్రం స్వగ్రామం శివన్నగూడెంలో వసంత అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫ హైదరాబాద్లోని మీర్పేటలో ఘటన ఫ మృతురాలి స్వస్థలం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం -
లారీలు రాకుంటే ఫోన్ చేయరా..
ఆత్మకూరు (ఎం) : ధాన్యం తరలింపులో మిల్లర్లు జాప్యం చేస్తుంటే.. లారీలు రాకుంటే నాకు ఫోన్ చేయరా అని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆత్మకూరు (ఎం) : మండలం పల్లెపహాడ్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. తక్షణమే మూడు లారీలను పంపించే ఏర్పాట్లు చేస్తానని కాంటా వేసి ఎగుమతి చేయడానికి హమాలీలు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షానికి నానిన తూకం వేసిన బస్తాలను కూడా పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్డీఓ వెంట తహసీల్థార్ వి.లావణ్య, ఏడీఏ ఎస్.శ్రీనువాస్, ఏఓ శ్రీనువాస్, ఆర్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ సుంకరి మంజులపరుశరాములు, ఏఈఓ వేణు, మహిళా సంఘం అధ్యక్షురాలు ఉమారాణి తదితరులు ఉన్నారు. -
నకిలీ విత్తనాలపై దృష్టిసారించాలి
సాక్షి, యాదాద్రి : రానున్న వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాల తరలింపు, ఎరువుల లభ్యత, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా, మండల స్థాయి కార్యదళ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సరఫరా చేసే యూరియా, విత్తనాలపై నిశిత పరిశీలన ఉండాలన్నారు. ఇందుకోసం జిల్లా, మండల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయాన్ని నిర్మూలించాలన్నారు. రాయితీపై అందజేసే యూరియా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఏఓ, రెవెన్యూ, పోలీస్, పరిశ్రమల శాఖ, పౌర సరఫరాలు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. నేడు హన్మాపురానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాకభువనగిరి : భువనగిరి మండలం హన్మాపురం గ్రామానికి గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు రానున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చీర్క సురేష్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉదయం 9.30 గంటలకు సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు హాజరు కావాలని కోరారు. -
పది ఫలితాల్లో ‘జయ’ ప్రభంజనం
సూర్యాపేటటౌన్ : పదో తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. పాఠశాలకు చెందిన డి. రిత్విక 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి స్టేట్ రెండో ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా బోడ ప్రసన్న 595, కట్ట దేవిప్రియ 594, పోతుగంటి శ్రీశ్వాస 594, బుడిగ సాన్విక 593, తిప్పన శ్రీజరెడ్డి 593, కై రోజు హేమంత్ సాయి 592, భూరెడ్డి హర్షిత 591, కక్కిరేణి ప్రజ్వల 591, నిమ్మల వైశాలి 591, తోవిటి సహస్ర 591 సాధించినట్లు తెలిపారు. 61 మంది విద్యార్థులు 580 ఆ పైన, 143 మంది విద్యార్థులు 570 ఆ పైన, 238 మంది విద్యార్థులు 560 పైన, 330 మంది విద్యార్థులు 550 పైన, 586 మంది విద్యార్థులు 500 ఆ పైన మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. ఫ 596 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన రిత్విక -
విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడు మృతి
మిర్యాలగూడ: బోరు మోటారు బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై గ్రామ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం దామరచర్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన ముడుసు సైదులు(45) గ్రామ పంచాయతీలో ఎంపీడబ్ల్యూ వర్కర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం గ్రామంలోని సాయిదుర్గానగర్లో బోరు మోటారు బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. గోడ కూలి మహిళ మృతిగుర్రంపోడు: ఈదురుగాలులకు గోడ కూలి మీద పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన గుర్రంపోడు మండలం పార్లపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. పార్లపల్లికి చెందిన పోతురాజు సురేందర్ మంగళవారం రాత్రి ఇంటి ముందు వరండాలో మంచంపై నిద్రించగా.. పక్కనే నేలపై ప్రేమలత (25) నిద్రించింది. రాత్రి ఈదురుగాలులు వీచడంతో ఇంటి ముందున్న గోడ కూలి ప్రేమలత మీదపడటంతో మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతురాలి భర్త సురేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. -
రైతులపై ఎరువుల భారం
ఎరువుల ధరల వివరాలు ఎరువుల రకం పాత ధర కొత్త ధర (50 కిలోలు) (రూ.లో) (రూ .లో) 20–20–013 1500 1800 16–20–013 1400 1750 14–35–14 2150 2350 15–15–15–09 1650 1950 10–23–26 1950 2025 సింగిల్ సూపర్ పాస్పేట్ 615 775 పొటాష్ 1850 1975 16–16–16 1675 2050 24–24–0 2000 2300 భువనగిరి: యాసంగి సీజన్ ముగింపు దశకు వస్తోంది. వానాకాలం సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎరువుల కంపెనీలు మాత్రం అదును చూసి ఎరువుల ధరలను పెంచాయి. ఈ మేరకు డీలర్లకు ఆయా కంపెనీల ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లాలోని రైతులపై ఆర్థిక భారం పడనుంది. ఎరువుల రకాలను బట్టి రూ. 75 నుంచి రూ. 350 వరకు ధరలు పెరగడం గమనార్హం. పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఎరువుల తయారీకి వాడే ముడిసరకుల ధరలు పెరిగాయి. సరకును రవాణ చేసే నౌకలకు బీమా సంస్థలు విధించే ప్రీమియం ఇతర పనులు ఎక్కువ కావడంతో ఎరువుల ధరలు పెంచామని కంపెనీ సంస్థలు చెబుతున్నాయి. రూ.300లకు.. యాసంగిలోనే రైతులకు సకాలంలోనే యూరియా దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎరువులను అధికంగా వాడుతున్నారని యాప్ను తీసుకురావడంతో ఇప్పటికీ ఇబ్బందులు తొలగలేదు. బస్తా డీఏపీ వాస్తవ ధర రూ. 1,350 ఉంటే గిట్టుబాటు కావడం లేదని గతేడాది డీలర్లు విక్రయించేందుకు ఆసక్తి చూపలేదు. బస్తా యూరియా నిర్ణీత ధర రూ. 265లు ఉండగా ఇప్పటికీ రూ. 300లకు విక్రయిస్తారు. రెండు సీజన్లకు 4.80లక్షల టన్నుల ఎరువులు గ్రామాలలో పశు సంపద తగ్గిపోవడం సేంద్రియ ఎరువులు లేకపోవడంతో పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు 4.75 లక్షల ఎకరాలు ఉండగా సుమారు 2 లక్షల వరకు రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, కంది, పెసర, జొన్న వంటి పంటలను సాగుచేస్తున్నారు. రెండు సీజన్లకు గాను 4. 80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఉపయోగించనున్నారు. దీని ప్రకారం జిల్లా రైతుల పై సుమారు రూ. 10కోట్ల వరకు భారం పడనుంది. ఫ వానాకాలం సాగు వేళ పెరిగిన ఎరువుల ధరలు ఫ బెంబేలెత్తుతున్న రైతాంగం ఫ జిల్లా రైతుపై రూ.10కోట్ల భారం -
నేతన్న భరోసా నిధులు జమ
భూదాన్పోచంపల్లి: నేతన్న భరోసా పథకం కింద మొదటి మూడు నెలలకు గాను జిల్లాలోని 10,752 మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ. 3,29,16,000లను జమ చేయనున్నట్లు జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం పోచంపల్లి మండలానికి నేతన్న భరోసా కింద మంజూరైన చెక్కులను కెనరాబ్యాంకు, ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్లకు అందజేసి మాట్లాడారు. పోచంపల్లి మండలంలో 3059 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు కలిపి రూ.94,30,500లను వారి ఖాతాలో జమ చేశామని చెప్పారు. ఇందులో మగ్గం నేసే కార్మికుడికి రూ.4500, అనుబంధ కార్మికుడికి రూ.1500 చొప్పున ఖాతాలో జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, ఏడీఓ అఖిల్రెడ్డి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, చేనేత సహకార సంఘం డైరెక్టర్ గంజి అంజయ్య, మేనేజర్ రుద్ర అంజనేయులు, ఏలే శ్రీనివాస్, ఆటిపాముల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలిరాజాపేట : రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టిపెట్టాలని, లేకుంటే రానున్న రోజుల్లో మానవ మనుగడ కష్టంగా మారుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేటలోని రైతువేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సేంద్రియ పద్ధతిలో మునగ సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. ఆసక్తిగల రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో సేంద్రియ సాగుచేస్తున్న రైతు ఠాకూర్ స్వరణ్పాల్ సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని డీఏఓ సందర్శించారు. సాగు విధానాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి పద్మావతి, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు ఉన్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దుయాదగిరిగుట్ట(తుర్కపల్లి): రైతులు.. దళారులకు ధాన్యం అమ్ముకోవద్దని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సూచించారు.మంగళవారం తుర్కపల్లి మండలం గంధమల్లలో విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థానన, వీరారెడ్డిపల్లి, తిరుమలాపూర్, తుర్కపల్లి, ముల్కపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.అనంతరం దయ్యంబండ తండాలో నిర్వహించిన గ్రామదేవతల పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్యరెడ్డి, వ్యవసాయాధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆర్టీఎం నియామకానికి దరఖాస్తులునల్లగొండ : నల్లగొండలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ (ఆర్టీఎం) తాత్కాలిక ప్రాతిపదికన (ఒక సంవత్సరం) నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆర్డీఓ, పీడీ, డీఆర్డీఓ, డీడీ కేడర్లలో సేవలందించి పదవి విరమణ పొందిన, జిల్లాలో స్థిర నివాసం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 29, 30 తేదీల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. -
ఇంధనం.. ఇక్కట్లు
సాక్షి, యాదాద్రి : ఇంధన సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 153 పెట్రోల్ బంకుల్లో మెజారిటీ చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల మేర బారులుదీరాల్సి వస్తోంది. మరోవైపు, ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం రవాణా వ్యవస్థను స్తంభింపజేయడమే కాకుండా, వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ప్రాతిపదికన సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం డీడీలు చెల్లించిన వారికి మాత్రమే సరఫరా చేస్తున్నారు. భారీ వాహనాల నుంచి సకాలంలో బకాయిలు వసూలు కాకపోవడంతో కొత్త డీడీలు చెల్లించడానికి నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ డీడీలు చెల్లించినా సకాలంలో ట్యాంకర్లు రావడంలేదని బంకుల యజమానులు చెబుతున్నారు. బంకుల వద్ద పరిస్థితిపై మంగళవారం సాక్షి విజిట్ నిర్వహించింది. ● చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మండలంలో ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బంకులు మూసివేశారు. సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. స్టాక్ వచ్చిన బంకుల్లో పెట్రోల్ డీజిల్ కోసం వాహనాలు బారులు దీరాయి. ● భువనగిరి పట్టణంలో బంకుల వద్ద వాహనాలు బారులు దీరాయి. పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. క్యూలైన్లతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. ● భూదాన్ పోచంపల్లి మండలంలో రెండు బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టారు. మిగిలిన బంకుల వద్ద ఇంధనం కోసం వాహనాలు బారులుదీరారు. అడ్డగూడూర్ మండలంలోని బంకులో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో లోపలికి ఎవరూ రాకుండా రాళ్లుపెట్టి తాడు కట్టారు. వ్యవసాయ పనుల సీజన్ కావడంతో డోజర్లు, ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్ దొరకక ఇబ్బందులు పడ్డారు. ● యాదగిరిగుట్ట పట్టణంలో నాలుగు పెట్రోల్ బంకులు ఉండగా ఇందులో మూడు బంకుల్లో డీజిల్, పెట్రోలు లేదంటూ బోర్డులు పెట్టారు. అలాగే బంకు లోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చిన భక్తులు స్థానిక బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ● ఆత్మకూరు(ఎం)లోని బంకులో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో లోపలికి ఎవరూ వెళ్లకుండా తాడు కట్టారు. దీంతో వాహనదారులు మోత్కూర్, చాడ, ఖప్రాయపల్లి, రాజన్నగూడెంలోని పెట్రోల్ బంకుల వద్దకు వెళ్తున్నారు. ● రాజాపేటలో మూడు పెట్రోల్ బంకులు ఉండగా.. రెండింటిలో డీజిల్ కొరత ఉంది. మూడింటిలో పెట్రోల్ ఉండగా వాటివద్ద వాహనదారులు బారులుదీరారు. డీజిల్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డు ఏర్పాటు చేస్తే పెట్రోల్ కూడా లేదు అనుకుంటారని బోర్డులు మాత్రం పెట్టలేదు. ఆలేరులో ఉన్న రెండు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డు పెట్టారు. గుండాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఫ పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారుల బారులు ఫ చాలాచోట్ల నోస్టాక్ బోర్డులు దర్శనం ఫ వ్యవసాయ పనులు, రవాణా వ్యవస్థపై ప్రభావం డీజిల్ కోసం గంటసేపు క్యూలో నిలబడ్డ. నాదగ్గరకు వచ్చేసరికి డీజిల్ అయిపోయింది. మరో లోడు వస్తుంది ఆగమంటే ఇక్కడే నిలబడ్డా. నేను ఆటో నడుపుకుంటూ కుటుంభాన్ని పోషించుకుంటాను. ఈ రోజు డీజిల్ దొరక్కపోతే రేపు ఆటో ఇంటి వద్దనే ఉంటుంది. – శ్రీనివాస్ , ఆటో డ్రైవర్, భువనగిరి నేను నా వాహనంలో రూ.300 పెట్రోల్ పోయించుకునే వాడిని.కానీ ఇప్పుడు పెట్రోల్ కొరత అంటున్నారని రూ.800 పెట్రోల్ పోయించుకున్నా. పెట్రోల్ కోసం అరగంట సేపు లైన్లో నిలబడ్డా. పెట్రోల్ కొరత ఎందుకు వస్తుందో తెలియడంలేదు. వెంటనే సమస్యను పరిష్కరించాలి. – జయచంద్ర, వాహనదారుడు, చౌటుప్పల్ -
పెట్రోల్, డీజిల్ కొరత లేదు
సాక్షి, యాదాద్రి : పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో పెట్రోలియం సంస్థల సేల్స్ అధికారులు, పెట్రోల్ బంకుల నిర్వాహకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు.డీడీ కట్టిన బంకు యజమానులకు వెంటనే ఆయిల్ సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో రైతులు, రవాణా వాహనాలు, హార్వెస్టర్లకు ఇంధన కొరత లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవ వాహనాలు, నిత్యావసర సరుకుల రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగినంత నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి -
చేనేత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్
భూదాన్పోచంపల్లి: వైద్య శిబిరాల ద్వారా చేనేత కార్మికుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం పోచంపల్లిలోని చేనేత డై హౌస్లో చేనేత కార్మికులకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. వారికి అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకొనేందుకు హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుందన్నారు. దానికి అనుగుణంగా భవిష్యత్తులో వైద్యం అందించే అవకాశం ఉంటుందన్నారు. మోబైల్ ఎక్స్రే ఏర్పాటు చేసుకొని ఎముకల పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కాగా చేనేత కార్మికులకు గతంలో లాంబార్డ్ హెల్త్కార్డులు ఉండేవని తిరిగి హెల్త్కార్డులను పునరుద్ధరించాలని చేనేత కార్మికులు కోరారు. అదేవిధంగా మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టర్ పీహెచ్సీని తనిఖీ చేశారు. రోజూవారీ ఓపీ, రోగులకు అందిస్తున్నసేవలు, అందుబాటులో ఉన్న మందులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనం పై కప్పు పెచ్చులూడుతున్నందున మరమ్మతులకు ఎస్టిమేషన్ వేయాలని పీఆర్ ఏఈ జగపతిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోదా, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, హెల్త్క్యాంప్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుమన్ కల్యాణ్, వైద్యాధికారిణి శ్రీవాణి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు పాండు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
ఇళ్ల గణనలో పొరపాట్లకు తావివ్వొద్దు
మోత్కూరు: ఇళ్ల గణనలో పొరపాట్లకు తావివ్వొద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్రావు సూచించారు. మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీయ గణనపై మంగళవారం నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు.ఇళ్ల గణనను సరైన విధంగా పూర్తి చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రణాళికలు రూపు దిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జన గణన కీలక పాత్ర ఉంటుందన్నారు. మే 11 నుంచి ప్రారంభమయ్యే తదుపరి దశ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్నట్లయితే అవగాహన కల్పించి ప్రభుత్వ బడిలో చేర్పించే బాధ్యతలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ డి.బాలాజీ, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్కుమార్, మాస్టర్ ట్రైనర్లు పసునూరి సుధాకర్, మల్లేషం, ఉపాధ్యాయులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. హాజరు రిజిష్టర్ పరిశీలించగా జూనియర్ అసిస్టెంట్ షకీల్ సెలవు పెట్టకుండా ఆసుపత్రికి రాక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. ఇద్దరు ఉద్యోగులు సెలవు పెట్టినప్పటికీ రిజిష్టర్లలో సీఎల్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ వీణ, ఎంపీడీఓ బాలాజీ, ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్, సిబ్బంది మధు, పరమేశ్వరి పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
ఆధునిక సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడి
భువనగిరి: ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా పంటలు సాగు చేయడం వల్ల అధిక దిగుబడి వస్తుందని తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన కేంద్రం జిల్లా ప్రధాన శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీలత పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను ఉపయోగించాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సమతుల్యత విధానాన్ని పాటించాలన్నారు. పంటల మార్పిడి విధానం ద్వారా దిగుబడి పెరిగి రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. అనంతరం నీటి సంరక్షణ, వినియోగం, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాముఖ్యత, సమగ్ర పురుగుల నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మల్లేష్, ఏఈఓ వెంకట్రావు, ఉద్యాన అధికారి మంజుల, కౌన్సిలర్ శ్రీవాణిగణేష్, ప్రసన్నకుమార్, ఆదర్శ రైతులు మల్లయ్య, నరసింహారెడ్డి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. -
1950 నాటి ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలి
భువనగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 1950 నాటి రాష్ట్రపతి ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని, తద్వారా దళిత క్రైస్తవుల హక్కులను కాపాడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామకు వెళ్తూ మార్గమధ్యలో వివేరా హోటల్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు నల్ల చంద్రస్వామి మాదిగ, రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవేందర్ మాదిగ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దవుతాయని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడారు. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్రై స్తవ మతంలో ఉన్న దళితులతో జిల్లా మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో కూడా భారీ ఎత్తున జిల్లా మహాసభను ఏర్పాటు చేసి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని మందకష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
ఫ ముగ్గురి అరెస్ట్ కట్టంగూర్ : నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిని కట్టంగూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సీఐ కొండల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన కన్యబోయిన మంజుల కట్టంగూర్ పీహెచ్సీలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. తనకు పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని సికింద్రాబాద్కు చెందిన బత్తుల ఉదయ్చందర్రెడ్డి, శాలిగౌరారం మండలానికి చెందిన కోనమ్ రామకుమారి, నకిరేకల్కు చెందిన గుండ్లపల్లి సుప్రియ, ఏపీలోని విజయవాడకు చెందిన గౌతమ్రెడ్డి, జగిత్యాల జిల్లాకు చెందిన పగడాల మమత డబ్బులు తీసుకుని మోసం చేశారని మంజుల కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదుగురు వ్యక్తులు కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి దాదాపు రూ.12లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు బత్తుల ఉదయ్చందర్రెడ్డి, కోనమ్ రామకుమారి, గుండ్లపల్లి సుప్రియను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. గౌతమ్రెడ్డి, పగడాల మమత పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
దళారుల అవతారం ఎత్తి దోచుకుంటున్నారు
కట్టంగూర్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ నాయకులు దళారుల అవతారం ఎత్తి రైతులను దోచుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలు, రైతులతో కలసి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను అధికారులు కాకుండా కాంగ్రెస్ నాయకులు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో క్వింటాల్కు ఆరు నుంచి ఏడు కిలోల ధాన్యం కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇరవై రోజుల క్రితం రైతులు ధాన్యం తీసుకొస్తే ఇప్పటికీ కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కాంగ్రెస్ నేతల దోపిడీని అరికట్టడంతో పాటు కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ తరాల బలరాం, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, నాయకులు వడ్డె సైదిరెడ్డి, నల్లమల్ల సైదులు తదితరులు ఉన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
బీసీ కుల గణనపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు
రామగిరి(నల్లగొండ) : బీసీ కుల గణనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జన గణనలో భాగంగా బీసీ కుల గణన కూడా చేపట్టాలని లేదంటే మే 10న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలేదన్నారు. బీసీ సబ్ కోటా పెడితేనే మహిళా బిల్లును అంగీకరిస్తామని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల కేటాయింపులో సామాజిక న్యాయం లేదన్నారు. ప్రధాని మోదీ బీసీలకు ఏం చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ మహిళా హక్కుల గురించి మాట్లాడాలని అన్నారు. బీసీ సమాజం బీజేపీని క్షమించదని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్లో బీసీ గణన చేపడతామని కేంద్ర కేబినెట్ నిర్ణయించి మాట తప్పారన్నారు. కానీ 9 శాతం ఉన్న అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారన్నారు. బీసీ కుల గణన చేపట్టిన తర్వాతే మోదీ తెలంగాణకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకరి మల్లేష్గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వాడపల్లి సాయిబాబ, జిల్లా సెక్రటరీ జెల్లా ఆదినారాయణ, బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్, నళ్ల మధుయాదవ్, హరిగౌడ్, గూడూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటాం ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి
గరిడేపల్లి : నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే రైతులు ఎరువులు వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుకుమార్, శ్రీనివాస్రెడ్డి సూచించారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వారు పాల్గొని రైతులకు సాగు పద్ధతుల గురించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్లో అధిక దిగుబడి ఇచ్చే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన సన్న రకం వరి వంగడాలను సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు ఒకే రకమైన పంటను వేయకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు సాగు చేయాలని అన్నారు. పచ్చిరొట్ట సాగు ద్వారా నేల సారాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు. సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రీతమ్కుమార్, విస్తరణాధికారులు హిమబిందు, త్రివేణి, శారద, రైతులు చంద్రారెడ్డి, కాకునూరి వెంకట్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అఖిల్, కృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
అనంతగిరి : రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం గ్రామానికి చెందిన కనగాల రామకోటమ్మ(72) మంగళవారం ఉదయం ఇంటి నుంచి బజారుకు వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన పల్లపు నాగరాజు ఇసుక ట్రాక్టర్ను రివర్స్ చేస్తూ రామకోటమ్మను ఢీకొట్టాడు. దీంతో రామకోటమ్మ కిందపడిపోగా ఆమె తల పైనుంచి ట్రాక్టర్ టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలి కుమారుడు శేషయ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పల్లపు నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సీహెచ్. లింగారెడ్డి తెలిపారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేతమర్రిగూడ(చింతపల్లి) : అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం చింతపల్లి మండలం కేంద్రంలోని విరాట్నగర్ కాలనీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. విరాట్నగర్ కాలనీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగిళ్ల శ్రీకాంత్ 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గూడ్స్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీకాంత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పరవాసుదేవ అలంకారంలో ఊరేగుతూ..
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహుడి జయంతి ఉత్సవాలలో వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మూడో రోజు స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపించారు. అనంతరం లక్ష్మీనృసింహస్వామిని విశేషంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగిస్తూ ఉత్తర మాడ వీధిలోని యాగశాలకు తీసుకెళ్లారు. యాగశాలలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠించి ద్వారతోరణ పూజ నిర్వహించారు. పంచకుండాల్లో మూర్తికుంభారాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమం, నిత్య పూర్ణాహుతి చేపట్టారు. యాగశాలలో చతుస్థానములలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అధిష్టాన స్వరూపులైన దేవతలను షోడశోపచారములతో ఆరాధన చేసి, నైవేద్యం సమర్పించారు. గరుడ వాహనంపై ఊరేగింపు.. సాయంత్రం ఆలయంలో అర్చకులు నిత్యరాధనలు జరిపించారు. అనంతరం నృసింహస్వామిని గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం సాయమారాధన, ద్వారతోరణపూజ, చతుఃస్థానార్చన, లక్ష్మీనరసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హవనం చేసి నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రచార్యులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు, పారాయణీకులు, ఆలయ అఽధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో.. పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం జయంత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం యాగశాలలో ద్వార తోరణ పూజ, మూర్తి కుంభారాధన, లక్ష్మీనృసింహ సుదర్శన గరుడ మూలమంత్ర హోమం, నిత్య పూర్ణాహుతి, లక్ష కుంకుమార్చన పూజలు జరిపించారు. సాయంత్రం సాయమారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతిని నిర్వహించారు. భజన, కూచిపూడి నృత్య ప్రదర్శన.. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళ భజన మండలి, భాగ్యలక్ష్మీ మహిళా భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. సాయంత్రం వనజా ఉదయ్ బృందం, చింతా రవి బాలకృష్ణ బృందం కూచిపూడి, యక్షగానం ప్రదర్శన ఇచ్చారు. ఫ భక్తులకు దర్శనమిచ్చిన నృసింహుడు ఫ యాదగిరిగుట్టలో కొనసాగుతున్న జయంత్యోత్సవాలు -
లారీ, టిప్పర్ ఢీ.. డ్రైవర్లకు గాయాలు
మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున టిప్పర్, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ నుంచి అడ్డగూడూరు వైపు వెళ్తున్న టిప్పర్, భద్రాచలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీ మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ జాల లింగస్వామి, టిప్పర్ డ్రైవర్ బి. మల్లేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయా వాహనాల్లో ఇరుక్కున్న డ్రైవర్లను స్థానికులు ఎంతో శ్రమించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు,సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. -
గేదెలను బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
చిలుకూరు : బైక్పై వెళ్తున్న వ్యక్తి గేదెలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చిలుకూరు మండలం బేతవోలు రోడ్డులో కరక్కాయలగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. కొండాపురం గ్రామానికి శ్రీరాం ప్రదీప్ బైక్పై చిలుకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో బేతవోలు రోడ్డులో గేదెలను ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్ మునగాల మండలం మండల పరిషత్ కార్యాయలంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి తిరుమలగిరి(సాగర్): స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు కృష్ణా నదిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి(సాగర్) మండలం నాయకునితండా సమీపంలో మంగళవారం జరిగింది. బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయకునితండాకు చెందిన మేరావత్ బాలసైదా, సాల దంపతులకు కుమారుడు శోభన్(10), కుమార్తె సంతానం. శోభన్ ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి తండా సమీపంలోని కృష్ణా నది వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు నదిలోకి దిగగా.. ఈత రాక నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కేకలు వేయగా సమీపంలో చేపలు పడుతున్న మత్స్యకారులు వచ్చి శోభన్ను నదిలో నుంచి బయటకు తీయగా.. అప్పటికే మృతిచెందాడు. తాటిచెట్టుపై పడిన పిడుగుపెద్దవూర : మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో జల్లులు కురిశాయి. ముసలమ్మచెట్టు గ్రామ స్టేజీ వద్ద కత్తి గోవిందరెడ్డి ఇంటి పక్కన తాటిచెట్టుపై పిడుగు పడింది. దీంతో తాటిచెట్టు కాలిపోయి గోవిందరెడ్డి ఇంట్లోని గొర్రెల దొడ్డిపై పడి మంటలు లేచాయి. ఆ సమయంలో గొర్రెలు మేతకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్రామస్తులు బిందెలతో నీటిని పోసి మంటలను ఆర్పివేశారు. -
ఫార్మర్ రిజిస్ట్రీకి నాలుగు రోజులే
సాక్షి యాదాద్రి : రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి పథకాలు అందాలన్నా.. భవిష్యత్తులో ఎరువులు, విత్తనాలు పొందాలన్నా ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఈ నెల 30వ తేదీనే ఆఖరి గడువుగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 64శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో, జిల్లాలోని సుమారు 97 వేల మందికి పైగా రైతులు ఆందోళనలో ఉన్నారు. గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ లేకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మండలాల వారీగా ఇలా: జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా పరిస్థితిని పరిశీలిస్తే.. వలిగొండ మండలంలో 25,091 మంది రైతులకు గాను 19,026 మంది నమోదు పూర్తి చేసుకుని 75.83 శాతంతో జిల్లాలోనే ముందు వరుసలో నిలిచింది. నారాయణపూర్ మండలంలో 17,958 మందికి 12,859 (71.61శాతం), మోత్కూర్ మండలంలో 9,517 మందికి 6,680 (70.19శాతం), బి. పోచంపల్లి మండలంలో 15,695 మందికి 10,961 (69.84శాతం), మోటకొండూరు మండలంలో 11,701 మందికి 7,913 (67.63శాతం), అడ్డగూడూరు మండలంలో 11,537 మందికి 7,718 (66.90శాతం) మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రామన్నపేట మండలంలో 17,431 మందికి 11,274 (64.68శాతం), గుండాల మండలంలో 14,906 మందికి 9,585 (64.30శాతం), రాజాపేట మండలంలో 16,802 మందికి 10,733 (63.88శాతం), భువనగిరి మండలంలో 21,490 మందికి 13,602 (63.29శాతం), ఆత్మకూరు (ఎం) మండలంలో 14,661 మందికి 9,253 (63.11శాతం), బీబీనగర్ మండలంలో 13,468 మందికి 8,177 (60.71శాతం) మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మరికొన్ని మండలాల్లో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. తుర్కపల్లి మండలంలో 18,485 మందికి 11,043 (59.74శాతం), ఆలేరు మండలంలో 14,427 మందికి 8,576 (59.44శాతం), చౌటుప్పల్ మండలంలో 19,070 మందికి 11,308 (59.30శాతం), బొమ్మలరామారం మండలంలో 16,222 మందికి 9,306 (57.37శాతం) మాత్రమే పూర్తయ్యాయి. ఇక యాదగిరిగుట్ట మండలంలో 13,333 మందికి గాను కేవలం 6,532 (48.99శాతం) మంది మాత్రమే నమోదు చేసుకుని జిల్లాలోనే అత్యల్ప శాతంతో వెనుకబడి ఉంది. జిల్లా మొత్తం మీద ఇప్పటివరకు 1,74,546 మంది (64.21శాతం) నమోదు పూర్తి చేయగా, ఇంకా 97,248 మంది రైతులు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఫ 30తో ముగియనున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు ఫ ఇప్పటి వరకు నమోదు చేసుకున్నది 64శాతం మంది రైతులే ఫ నమోదు చేసుకోకపోతే పీఎం కిసాన్, రైతు భరోసా బంద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమగ్ర వివరాల సేకరణ కోసం ఉద్దేశించిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ 2025 మే 6వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ బాధ్యతను చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. భవిష్యత్తులో పీఎం కిసాన్, పంట బీమా వంటి పథకాల లబ్ధి నేరుగా రైతులకే అందేలా చూడటం, వ్యవసాయ రంగానికి సంబంధించిన గణాంకాలను డిజిటలైజ్ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓలు) తమ పరిధిలోని రైతుల పట్టాదారు పాస్బుక్, ఆధార్, మొబైల్ నంబర్ వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
300 మూగజీవాలు మృత్యువాత
ఏడాది కాలంలో ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, బీబీనగర్, సంస్థాన్నారాయణపురం, మోత్కూరు మండలాల్లో కుక్కలదాడిలో 300 మూగజీవాలు మృత్యువాత పడగా 17 గాయాలపాలయ్యాయి. సాక్షి, యాదాద్రి : వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవైపు పసిపిల్లలు, పాదచారులపై దాడులు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతుండగా, మరోవైపు మందల్లోని గొర్రెలను వేటాడుతూ కాపరుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో ఏడాదికాలంలో వందలాది మందిపై దాడి చేసి గాయపరిచాయి. అధికారులు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చర్యలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భయంకరంగానే ఉంది. మార్చిలోనే 708 మందిపై.. జిల్లా వ్యాప్తంగా 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 30వేల కుక్కలు ఉన్నట్లు అంచనా. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క మార్చినెలలోనే జిల్లాలో 708మంది కుక్కకాటు బాధితులు వాక్సిన్ తీసుకున్నారు. అత్యధికంగా చౌటుప్పల్ సీహెచ్సీ పరిధిలో 108, బొమ్మలరామారంలో 110, భువనగిరిలో 54, యాదగిరిగుట్టలో 49, రామన్నపేటలో 40,బీబీనగర్లో 31 మంది టీకాలు తీసుకున్నారు. మున్సిపాలిటీల్లోనూ.. ● యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 580 కుక్కలు ఉన్నాయి. సుమారు 263 కుక్కలకు భువనగిరిలో సంతాన నిరోధక ఆపరేషన్లు చేయించారు. ఈ ఏడాది 210 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ● ఆలేరు మున్సిపాలిటీలో సుమారు 600 వరకు వీధి కుక్కలు ఉన్నాయి. ఏడాది కాలంగా 59 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఇటీవలనే మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో వీధి కుక్కలను పట్టుకొని భువనగిరిలో సంతాన నిరోధక ఆపరేషన్లు చేయించారు. ● చౌటుప్పల్ మున్సిపాలిటీలో పరిధిలో ఎక్కడ చూసినా శునకాలు గుంపులుగా సంచరిస్తున్నాయి. చిన్న పిల్లలతో పాటు మేకలు, కోళ్లపై దాడి చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం చౌటుప్పల్లో కుక్కలను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు. చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో 260 వరకు కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయి. ● మోత్కూర్ మున్సిపాలిటీలో సుమారు 400 వరకు కుక్కలు ఉన్నాయి. ఈ ఏడాది478 కుక్క కాటు కేసులు నమోదు అయ్యాయి. భువనగిరి మున్సిపాలిటీలో సుమారు 3 వేల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేయగా, ఇప్పటివరకు వీటిలో 2,000కు పైగా కుక్కలను పట్టుకొని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలకు తరలించారు. మున్సిపాలిటీలో సుమారు 450కి పైగా పెంపుడు కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ● భూదాన్ పోచంపల్లిలో రాత్రి వేళలో రోడ్డు వెంట వెళ్లే ద్విచక్ర వాహనదారులను వెంటబడుతుండటంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి ఇటీవల ఒకరిద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో సుమారు 500 వరకు కుక్కలు ఉండొచ్చని అంచనా. పోచంపల్లి మున్సిపల్ పాలకవర్గం కౌన్సిల్ మొదటి సమావేశంలో కుక్కల నివారణపై తీర్మానం చేసింది. వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో 2,500 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాం. భువనగిరిలోని హన్మాపురం, నల్లగొండలో జిల్లాలో గల కుక్కలకు నిరంతరం యానిమల్ బర్త్ కంట్రోల్ చేస్తున్నాం. నిబంధనల మేరకు ఊరకుక్కలకు ఆపరేషన్ చేసి నాలుగు రోజుల తర్వాత గాయం మానగానే వాటి స్వస్థలాల్లో వదిలేస్తున్నాం. – భాస్కర్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భువనగిరి పట్టణంలో వీధి కుక్క కాటుకు నాలుగేళ్ల బాలుడు కన్ను కోల్పోయాడు. సందెల శ్రావణి, రాహుల్ దంపతుల కుమారుడు ప్రియాంష్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేయడంతో చెంప, కన్ను కోల్పోయాడు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ కన్ను అమర్చడానికి వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
బెయిల్ మంజూరుపై ప్రత్యేక దృష్టి అవసరం
భువనగిరిటౌన్ : బెయిల్ మంజూరు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచించారు. శనివారం భువనగిరి పట్టణంలోని జిల్లా కోర్డులో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.వివిధ క్రిమినల్ కేసుల్లో ఉన్న ఖైదీలకు సంబంధించిన కేసులు, వారు జైలులో ఎంత కాలం నుంచి ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయం అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి యం. ఉషశ్రీ, అదనపు జిల్లా కలెక్టర్ ఎ. భాస్కర్ రావు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, భువనగిరి సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రూ, డీఎస్పీలు రవీందర్, పి. శ్రీనివాస్ నా యుడు, యం. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మలేరియా నిర్మూలన ధ్యేయంభువనగిరి: మలేరియా నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండునాయక్, ఆర్ఎంవో డాక్టర్ కిరణ్కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎన్. వంశీకృష్ణ, రామకృష్ణ, వీణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ నిరోషా, విద్యార్థినులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దుగుండాల : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించవద్దని, వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం గుండాల మండలం సుద్దాల గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ ఎస్.హరికృష్ణ, ఏఈఓ పవన్, సెంటర్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. ఆలేరులో నిలిచిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆలేరు: వరంగల్ వైపు వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆలేరులో శనివారం రాత్రి కొద్దిసేపు ఆగింది. రైలు ఎస్–5 బోగి వీల్లో రాపిడి వల్ల నిప్పు రవ్వలు రావడంతో రాత్రి 9.15 గంటల నుంచి 20 నిమిషాలపాటు నిలిపివేశారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్తో పొగలను ఆర్పివేసిన అనంతరం పంపించారు. -
కార్మికుల సంక్షేమంపై ప్రజా ప్రభుత్వం దృష్టి
యాదగిరిగుట్ట: ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు చర్చలు సఫలమైన సందర్భంగా శనివారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం చాలా సంతోషకరమైన అంశమన్నారు. కార్మికులు ప్రభుత్వం ముందు పెట్టిన 31 డిమాండ్లను నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ భద్రత, వేతనాల సవరణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని, కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం మూడు రోజుల్లోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలోనే ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందన్నారు. అనంతరం డిపోలో నుంచి బస్సును నడుపుకుంటూ బస్టాండ్లోకి తీసుకువచ్చారు. అక్కడ కలిసిన ప్రయాణికులతో సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మురళీకృష్ణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బందారపు భిక్షపతి, కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్గౌడ్, ఎరుకల హేమేందర్గౌడ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి స్వీయ గణన
సాక్షి, యాదాద్రి : జనగణన–2027 ప్రక్రియలో భాగంగా ఆదివారం నుంచి స్వీయ గణనకు అవకాశం కల్పించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో విలేకరులో మాట్లాడారు. దేశ భవిష్యత్తు ప్రణాళికలకు, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన ప్రాతిపదిక అని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు విడతలుగా గణన ప్రక్రియ జనగణన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా రెండు విడతల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి గృహగణన చేస్తారని రెండవ విడత జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను చేపడతారని తెలిపారు. డిజిటల్ సాంకేతికతను జోడించి, తప్పులకు తావులేకుండా నాణ్యమైన గణాంకాలను సేకరించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమం జనాభా లెక్కల ఆధారంగానే రూపొందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వీయ గణన ఇలా.. ఆదివారం నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు తమంతట తాము వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రజలు httpr://sc.census.gov.in పోర్టల్లోకి వెళ్లి వివరాలు సమర్పించవచ్చని సూచించారు. ఆన్లైన్లో నమోదు పూర్తయ్యాక ఒక ప్రత్యేక ఐడీ జనరేట్ అవుతుందన్నారు. తర్వాత అధికారులు ఇంటికి వచ్చినప్పుడు, వారికి ఈ ఐడీని చూపిస్తే సరిపోతుందన్నారు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా గోప్యత కూడా ఉంటుందన్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, యువత, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఫ ఆన్లైన్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఫ మే 11 నుంచి క్షేత్రస్థాయిలో మొదటి విడత ఇళ్ల గణన ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ విఫలమైంది
భానుపురి (సూర్యాపేట) : అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. లబ్ధిదారులు తీవ్ర నిరాశలో ఉన్నారని, కేసీఆర్ ఇచ్చిన రూ.లక్ష తప్ప తులం బంగారం ఎప్పుడిస్తారని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సమ్మెకు పోయిందంటే అది కాంగ్రెస్ పాపమేనని, కార్మికుల ఆత్మహత్యలకు ఆ పార్టీ బాధ్యత వహించాలన్నారు. వడ్లు, మొక్కజొన్నల కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అకాల వర్షాలు పడకముందే ధాన్యం కొనుగోల్లు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కంటే ముందున్న రోజులే మళ్లీ దాపురించాయని, మంచినీళ్ల విషయంలోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయని, ఇకనైనా మేలుకొని హామీల అమలుపై, అభివృద్ధిపై కాంగ్రెస్ పాలకులు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, శ్రీనివాస్గౌడ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
రైతు వేషధారణలో అవగాహన
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతు వేషధారణలో నో డ్రగ్స్–సేవ్ లైఫ్ కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రభాకర్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలు,గంజాయికి దూరంగా ఉండి తమను తాము రక్షించుకోవాలని అన్నారు. రైతులు పంట పొలాల్లో రసాయన మందులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణంఫ పలువురికి గాయాలు మద్దిరాల : చెట్టును ఢీకొని టాటా ఏస్ వాహనం బోల్తా పడడంతో ఇద్దరు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మద్ది రాల మండలం చిన్ననెమిల గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలి పిన వివరాల ప్రకారం.. చిన్ననెమిల గ్రామానికి చెందిన సూరారపు శంకర్ జీవనోపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వలస వెళ్లాడు. ఈ నెల 28న స్వగ్రామంలో ఎల్లమ్మ పండుగ చేసేందుకు గాను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హైదరాబాద్ నుంచి టాటా ఏస్ వాహనంలో వస్తుండగా.. శనివారం తెల్లవారుజామున చిన్ననెమిల గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శంకర్ బంధువైన తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన కొమ్ము బాబు(18) అక్కడికక్కడే మృతిచెందాడు. శంకర్ భార్య రాధ(30) తీవ్రంగా గాయపడడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మరో ముగ్గురు నందిని, పవన్, పాపయ్యకు గాయాలయ్యాయి. సూరారపు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం. వీరన్న తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్ప ప్రసన్నకుమార్ పరిశీలించారు. మిషన్లో చేతులు పడి వ్యక్తి మృతిమోత్కూరు : పరుపు తయారు చేసేందుకు పత్తి ఒడుకుతుండగా.. ప్రమాదవశాత్తు చేతులు మిషన్లో పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణానికి చెందిన ఎండీ ఇస్మాయిల్ (55) షరీఫ్ స్థానికంగా బెడ్ వర్క్స్, ఫర్నీచర్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం పరుపు తయారు చేసేందుకు పత్తిని ఒడికే సమయంలో అతడి చేతులు మిషన్లో ఇరుక్కుని తెగిపోయాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఇస్మాయిల్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య జాన్బీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పేద కుటుంబానికి రూ.4,05,081 ఆర్థికసాయం
గరిడేపల్లి : ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి గ్రామస్తులంతా కలిసి అండగా నిలిచారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన షేక్ యూసుఫ్ ఇటీవల మృతిచెందాడు. ఆయన ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడి భవిష్యత్తు అంధకారం కాకూడదని గ్రామస్తులంతా కలిసి రూ.4,05,081 విరాళాలు సేకరించి ఆ మొత్తాన్ని శనివారం చిన్నారుల పేరిట పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబానికి గ్రామస్తులు అందించిన సాయం స్ఫూర్తిదాయకం. ఏటీఎం దొంగలు.. కారు వదిలి పరార్ఫ ఆంధ్రప్రదేశ్లో చోరీకి పాల్పడిన ముఠా చిట్యాల : ఏటీఎంలలో నగదు చోరీ చేసిన దొంగలు కారులో హైదరాబాద్కు వెళ్తూ పోలీసులను చూసి కారును వెంచర్లో వదిలి డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటన చిట్యాల పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏటీఎంలలో నగదు చోరీ చేసిన ముఠా సభ్యులు శనివారం కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా.. చిట్యాల పట్టణంలో రైల్వేస్టేషన్కు వెళ్లే దారిలో విజయవాడ–హైదరాబాద్ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించిన ముఠా సభ్యులు కారును పక్కనే ఉన్న వేణుగోపాలస్వామి వెంచర్లోకి మళ్లించి అక్కడే ఓ ఇంటి ముందు నిలిపి డబ్బుతో పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు చిట్యాల ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో వెళ్లి కారును తనిఖీ చేయగా అందులో కొన్ని దుస్తులు తప్ప ఏమీ లభించలేదు. నలుగురు దొంగలు పరారు కాగా.. వారి వద్ద ఏటీఎంలలో చోరీ చేసిన డబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. పరారైన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యంభువనగిరి(బీబీనగర్) : బీబీనగర్ పెద్ద చెరువులో శనివారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్కు చెందిన సతి గంగాధర్రెడ్డి(33) శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం మధ్యాహ్నం బీబీనగర్ చెరువు కట్ట వద్ద గంగాధర్రెడ్డి బైక్ ఉన్నట్లు సమాచారం రావడంతో అతడి భార్య అక్కడికి వెళ్లి చూసి.. ఆ బైక్ తన భర్తదే అని గుర్తించింది. చెరువులోకి చూడగా నీటిలో గంగాధర్రెడ్డి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
మేరీమాత పుణ్యక్షేత్రంగా శుభవార్త చర్చి
మఠంపల్లి : మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం రెండోరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్చీ బిషప్ ఉడుముల బాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవ మేత్రాసన పీఠాధిపతులు(బిషప్లు) ఉత్సవాలకు హాజరై శుభవార్త చర్చికి మేరీమాత పుణ్యక్షేత్రంగా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఉడుముల బాలతో కలిసి నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి ధ్రువకుమార్ ఆవిష్కరించారు. అదేవిధంగా వరంగల్, ఏపీలోని విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ఒంగోలు జిల్లాలకు చెందిన మేత్రాసన పీఠాధిపతులు ధ్రువకుమార్, గోవిందు జోజి, పొలిమేర జయరావు, చిన్నాబత్తిని భాగ్యయ్య, సగిలి ప్రకాష్, పిల్లి ఆంథోని దాస్, మైపన్ పాల్, వరంగల్ మేత్రాసన కార్యనిర్వహణ అధికారి విజయ్పాల్ పాల్గొని సమష్టి దివ్యబలిపూజ నిర్వహించారు. మహాపునీత తల్లి మేరీమాత.. ఈ సందర్భంగా ఉడుముల బాల క్రైస్తవులకు సందేశమిచ్చారు. ఏసుక్రీస్తును లోకానికి అందించిన మహాపునీత మేరీమాత తల్లి పేరును శుభవార్త చర్చికి పెట్టడం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవులంతా ఏసుక్రీస్తు బోధనలను అనుసరించాలని ఆకాంక్షించారు. అంతకుముందు పీఠాధిపతులకు స్థానిక క్రైస్తవ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. చర్చి కమిటీ ఆధ్వర్యంలో పీఠాధిపతులను సన్మానించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో సిస్టర్స్, బ్రదర్స్ హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి ఆవరణలో అన్నదానం చేశారు. సాయంత్రం మేరీమాత పుణ్యక్షేత్రం ఆరంభ రథోత్సవాన్ని(తేరు) నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి ధ్రువకుమార్ ప్రారంభించారు. ఈ రథోత్సవంలో క్రైస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విచారణ గురువులు రాజారెడ్డి పోగుల, అశోక్, బాలరెడ్డి, బ్రదర్ వినోద్రెడ్డి, సిస్టర్లు సబీనా, రూబీ, ఏఎంపీ వైస్ చైర్మన్ స్రవంతీకిషోర్రెడ్డి, సర్పంచ్ వీరలక్ష్మిపాపయ్య, ఉప సర్పంచ్ శౌరీ, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు జయభారత్రెడ్డి, టీఆర్ బాలశౌరిరెడ్డి, కాకుమాను జోసెఫ్, గాలి చిన్నపురెడ్డి, ఆంథోనిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫ నామకరణం చేసిన క్రైస్తవ మేత్రాసన పీఠాధిపతులు ఫ కొనసాగుతున్న చర్చి వార్షికోత్సవాలు ఫ వైభవంగా సమష్టి దివ్యబలిపూజ -
జాతీయ పోటీలకు ఎంపిక
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు బేతాల దేవిభవాని, బేతాల వైష్ణవి జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బి.నర్సింహ శనివారం తెలిపారు. తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరులోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో జనవరి 18న నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన దేవిభవాని, వైష్ణవి 5వ జాతీయస్థాయి సౌత్ జోన్ షూటింగ్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ నెల 26,27 తేదీల్లో ఏపీలోని అనంతపురంలో జరగనున్న పోటీల్లో వారు పాల్గొననున్నారని తెలిపారు. -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
చివ్వెంల(సూర్యాపేట) : కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంపుల గ్రామానికి చెందిన పిట్ట సత్తిరెడ్డి (55) బైక్పై వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. గ్రామ శివారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్తిరెడ్డికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాజశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. వడదెబ్బతో కూలీ..అర్వపల్లి : వడదెబ్బతో అస్వస్థతకు గురై కూలీ మృతిచెందాడు. అర్వపల్లికి చెందిన మామిడి నర్సింహ(45) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సుతారి పనికి వెళ్లిన నర్సింహ వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురై శనివారం మృతిచెందాడు. మృతుడు నిరుపేద కావడంతో స్థానికులు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేశారు. అనుమానాస్పద స్థితిలో బాలుడు.. హుజూర్నగర్: పట్టణా నికి చెందిన బాలుడు ఇంట్లో అనుమానాస్పద స్థితి లో మృతిచెందాడు. బంధువులు, స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. హుజూర్నర్కు చెందిన లింగం పెదకాశయ్య కుమార్తె విజయను ఏపీలోని విజయవాడ సమీపంలో గల ఇబ్రహీంపట్నంకు చెందిన కన్నెబోయిన కోటేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. కుటుంబ కలహాల కారణంగా పదేళ్ల క్రితమే విజయ తన కుమారుడు కార్తీక్(13)తో వచ్చి హుజూర్నగర్లోనే ఉంటోంది. ఇటీవల కోటేశ్వరరావు హుజూర్నగర్ వచ్చి భార్యాపిల్లలతో కలిసి ఉంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విజయ కూడా కూలీ పనికి వెళ్తోంది. కాగా శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కార్తీక్ ఉరేసుకున్నాడని కోటేశ్వరరావు భార్యకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కార్తీక్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి మేనమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్బాబు తెలిపారు. -
నేటి నుంచి ఎద్దుల పందేలు
మేరీమాత పుణ్యక్షేత్రం వార్షికోత్సవాలను పురస్కరించుకుని మఠంపల్లిలోని మాంట్ఫోర్డు ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం నుంచి మూడురోజుల పాటు ఉమ్మ డి రాష్ట్రస్థాయి ఎద్దుల పందేలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కోర్టును, ప్లడ్లైట్లను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా శుభోదయ యుజన సంఘం అద్యక్షుడు గాదె జయభారత్రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు, సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించి విజేతలకు అదేరోజు రాత్రి బహుమతి, షీల్డులు అందజేస్తామన్నారు. -
ఎర్రవరం పీఏసీఎస్లో ఎరువులు మాయం
కోదాడరూరల్ : కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగి సీఈఓ, ఇతర సిబ్బందికి తెలియకుండా రూ.7.30లక్షల విలువైన ఎరువులను విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీఈఓ, సిబ్బంది ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వడంతో ఎరువులు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎర్రవరం పీఏసీఎస్ కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పాముల వెంకటేశ్వర్లు ఎరువుల విక్రయ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. అయితే సంఘానికి వచ్చే రూ.7.30లక్షల విలువైన యూరియా, 20–20–013, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులను వెంకటేశ్వర్లు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకొని ఆ డబ్బులును తన సొంతానికి వాడుకున్నాడు. మార్చి నెలలో సీఈఓ మౌలాలి, సిబ్బంది అంతా కలిసి ఎరువుల స్టాక్, రికార్డులను పరిశీలిస్తుండగా మొదట రూ.2,99,166 విలువైన ఎరువుల డబ్బులు జమ కానట్లు గుర్తించారు. ఎరువులు ఎవరికి విక్రయించావు, డబ్బులు ఎందుకు జమ చేయలేదని వెంకటేశ్వర్లును ప్రశ్నించగా పొంతన లేని సమాధాలు చెప్పాడు. దీంతో సీఈఓ ఈ విషయాన్ని సంఘం స్పెషల్ ఆఫీసర్ పద్మజకు తెలియజేశారు. ఆమె వెంకటేశ్వర్లుకు అందాల్సిన మార్చి నెల వేతనాన్ని నిలిపివేసి ఈ నెల 16న విచారణ చేపట్టారు. ఈ విచారణలో తానే ఎరువులను విక్రయించానని వెంకటేశ్వర్లు ఒప్పుకొని, ఆ నగదును తిరిగి సంఘానికి చెల్లించాడు. రికార్డుల పరిశీలనలో అనుమానం వచ్చి.. అయితే వెంకటేశ్వర్లుపై అనుమానం వచ్చిన సిబ్బంది పాత ఎరువుల స్టాక్, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిచారు. వాటిలో పలు చోట్ల కొట్టివేతలు ఉండటం, కొందరికి ఎక్కువ మొత్తంలో ఎరువులు విక్రయించినట్లు ఉండటంతో రెండు రోజుల కిందట పీఏపీఎస్, వ్యవసాయాధికారులు కలిసి పాత రికార్డులను కూడా తీసి లెక్కలు చూశారు. ఆ లెక్కల్లో రికార్డులను ట్యాంపరింగ్ చేసి రూ.2,99,166 విలువైన ఎరువులే కాకుండా మరో రూ.4.30లక్షల విలువైన ఎరువులను కూడా అతడు విక్రయించి డబ్బులు సంఘంలో జమ చేయలేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంకటేశ్వర్లును ప్రశ్నించగా.. తన తప్పును ఒప్పుకొని శుక్రవారం రూ.2.50లక్షల నగదను సంఘానికి కట్టాడు. ఆ తర్వాత సిబ్బంది ఈ విషయాన్ని డీసీఓకు తెలియజేయడంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. సస్పెండ్ చేశాం.. ఎరువులు విక్రయించి నగదును సంఘంలో జమ చేయని స్టాఫ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును డీసీఓ విధుల నుంచి సస్పెండ్ చేశారని పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. అతడు వాడుకున్న నగదులో కొంతమేర రికవరీ చేశామని, మిగిలిన వాటి కోసం నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ ఇంకా జరగుతుందని, సోమవారం నాటికి విచారణ పూర్తిచేసి పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. వెంకటేశ్వర్లు గతంలోనూ రైతు రుణమాఫీ విషయంలో ఆరు నెలల పాటు సస్పెండ్ అయ్యాడు. పీఏసీఎస్లలో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వం పంపమన్నప్పుడు అతడు అర్హులైన 66మంది రైతుల పేర్లను పంపించలేదు. దీంతో వారికి రుణమాఫీ కాకపోవడంతో రైతులు సంఘం కార్యాలయం ఎదుట ఆందోళనలు, ధర్నాలు చేశారు. ఆ సమయంలో విచారణ చేసిన అధికారులు రైతుల పేర్లు పంపించడంలో నిర్లక్ష్యం చేసిన కారణంగానే రుణమాఫీ కాలేదని గుర్తించి వెంకటేశ్వర్లును విధుల నుంచి సస్పెండ్ చేశారు.ఫ రూ.7.30లక్షల విలువైన ఎరువులను విక్రయించి నగదును వాడుకున్న ఉద్యోగి ఫ మార్చిలో విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన సీఈఓ, సిబ్బంది ఫ రూ.5,49,166 రికవరీ చేసిన అధికారులు ఫ సదరు ఉద్యోగిని విధుల్లో నుంచి సస్పెండ్ చేసిన డీసీఓ -
ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు
నల్లగొండ : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు పట్టింపులకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. శుక్రవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుత్తా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుడు శంకరయ్యగౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆత్మహత్యల వల్ల కుటుంబాలు నష్టపోతాయని చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని ఈసారి తాలు సమస్య ప్రధానంగా ఉందన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు, మిల్లర్లు, రైతులతో కలిసి తాలు విషయంలో ఒప్పందానికి వచ్చినట్లు తెలిసిందన్నారు. రైతు బోనస్, రైతుబంధు ప్రభుత్వానికి ఆర్థికంగా భారమనే విషయం వాస్తవమేనని ఈ విషయంలో రైతుబంధు, సన్నాలకు బోనస్ ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం ఆలోచన చేసి ఏదో ఒక పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రానికి విన్నవించినా అక్కడ నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. ధాన్యం కొనుగోలు, ఆర్టీసీ సమ్మె విషయంలో వాస్తవాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనాలను పొందాలని చూస్తున్నాయన్నారు. కాలేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ విషయంలో ఎవరికీ హైకోర్టు క్లీన్ చీట్ ఇవ్వలేదని, సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వలేదు కాబట్టే హరీష్రావు, కేసీఆర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపిందన్నారు. ఫ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
డిపో దాటని బస్సులు
యాదగిరిగుట్ట : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజు కు చేరింది. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్మికులు నల్ల బ్యాడ్జీలు, నోటికి నల్ల రిబ్బెన్లు ధరించి, మృతి చెందిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఫ్లెక్సీతో మౌన ర్యాలీ నిర్వహించారు. మూడవ రోజు సైతం ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుటే ఉంటూ బస్సులను బయటకు రాకుండా ఆందోళన చేశారు.తమ హక్కులను సాధించుకునేంత వరకు, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు సమ్మెను విరమించేది లేదని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఎవరూ ఆత్మహత్య యత్నాలకు పాల్పడవద్దని, బతికి ఉండే హక్కులను సాధించుకుంద్దామని ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపో గేట్ దాటి బయటకు రాలేదు. రోడ్డెక్కిన 29 ప్రైవేట్ బస్సులు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు 29 అద్దె బస్సులను వివిధ రూట్లలో నడిపించారు. తాత్కాలింగా ఆరుగురుకండక్టర్లు, 10 మంది డ్రైవర్లను విధుల్లోకి తీసుకున్నామని డిపో అధికారులు వెల్లడించారు. ప్రైవేట్ వాహనాలే దిక్కు.. సమ్మె కారణంగా బస్సులు నడకపోవడంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తుల రాక తగ్గింది. కొందరు శ్రీస్వామిని దర్శించుకునేందుకు వచ్చినా తిరుగు ప్రయాణంలో ప్రైవవేట్ వాహనాల్లో వెళ్తున్నారు. ఇదిలా ఉండగా కొండపైకి పలు స్కూల్స్కు చెందిన బస్సులను ఆలయాధికారులు నడిపిస్తున్నారు. ఫ మూడో రోజూ కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫ అద్దె బస్సులను నడిపించిన అధికారులు -
సహకార ఎన్నికలకు స్వస్తి!
కోదాడ: సహకార సంఘాల్లో చైర్మన్లు, వైస్చైర్మన్లు, డైరెక్టర్లు కావాలనుకుంటున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని, నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సహకార సంఘాల ఎన్నికలకు స్వస్తి పలికినట్లు అయింది. ప్రతి సహకార సంఘంలో ఇద్దరిని ప్రభుత్వం నామినేటెడ్ చేస్తుందని, వీరికి సహకారం అందించడానికి ప్రతి సంఘంలో ఒక సీఈఓ ఉంటాడని, ఈ ముగ్గురితోనే సంఘ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని సమాచారం. నామినేటెడ్ పదవుల ఎంపికలో ఎమ్మెల్యేల నిర్ణయమే కీలకం కావడంతో పలువురు ఆశావహులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 107 సహకార సంఘాలు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 107 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 2020లో ఎన్నికలు నిర్వహించి నూతనపాలక వర్గాలు ఏర్పాటు చేశారు. ప్రతి సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండేవారు. వీరిని ఆ సంఘంలో సభ్యత్వం ఉన్న రైతులు ఎన్నుకునేవారు. ఈ డైరెక్టర్లు చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకునేవారు. వీటి కాలపరిమితి గతేడాది ఫిబ్రవరి 15న ముగిసింది. అయితే వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం పాలకవర్గాల పదవీ కాలాన్ని మొదట ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు ఆగస్టు 2025తో ముగుస్తుందనగా మరో ఆరునెలలు ఫిబ్రవరి 2026 వరకు పొడిగించింది. కానీ డిసెంబర్లోనే పాలకవర్గాలను రద్దు చేసి ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఆశావహులు ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం గురువారం ఆకస్మికంగా ఎన్నికలు లేదని, నామినేటెడ్ విధానం ద్వారానే నియమాకాలు చేపడతామని ప్రకటించడంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సంఘానికి ఇద్దరా, నలుగురా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా ఇద్దరు సభ్యులను నామినేటెడ్ చేసి ఒక అధికారిని నియమించి ముగ్గురుతోనే సంఘాలను నడుపుతుంది. ఈ విధానాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇక్కడ కూడా అదే విధానం అమలు చేస్తే బావుంటుందని ప్రభుత్వానికి నివేదించడంతో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలను రద్దు చేస్తూ నామినేటెడ్ విధానంలో పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి సంఘంలో ఇద్దరిని నామినేటెడ్ చేయాలా? లేక నలుగురిని నామినేటెడ్ చేయాలా? అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వీరికి సాయంగా ప్రతి సంఘంలో ఒక అధికారిని నియమించనున్నారు. దీనిపై స్పష్టత రాగానే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అగమ్యగోచరంగా విలీన సంఘాల పరిస్థితి గతంలో ప్రతి మండలంలో ఒకటికన్నా ఎక్కువ సహకార సంఘాలుండేవి. వీటి పనితీరు బాగాలేక అనేక సంఘాలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ క్రమంలో నాలుగైదు సంఘాలను సమీపంలో ఉన్న ఒక సంఘంలో కలిపారు. ప్రస్తుతం నామినేటెడ్ విధానంలో పాలకవర్గాలను ఏర్పాటు చేస్తున్నందున తమ సంఘాలను పునరుద్ధరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఫ నీరుగారిపోయిన ఆశలు ఫ నామినేటెడ్ విధానంలోనే నియామకాలు ఫ ఉమ్మడి జిల్లాలో 107 సహకార సంఘాలు ఫ ఇక ప్రతిసంఘంలో ఇద్దరికే అవకాశం ఫ ఇద్దరు నాయకులు, ఒక అఽధికారికి నిర్వహణ బాధ్యతలు గతంలో ఇతర సంఘాల్లో విలీనం చేసిన సంఘాలను మళ్లీ పునరుద్ధరించాలి. దీంతో పాటు ప్రతి సంఘంలో ఇద్దరు కాకుండా నలుగురిని నామినేటెడ్ చేయాలి. గతంలో ఒక్క కోదాడ సంఘంలో 8 సహకార సంఘాలను విలీనం చేశారు. జిల్లాలో ఇలా విలీనం చేసిన వాటిని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, కోదాడ పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు -
నేల సారం.. పంటకు లాభం
గోమయం, పంచగవ్వ, జీవామృతం వంటి జీవ ఎరువులను వినియోగించి భూసారం కాపాడుకోవచ్చు. పంటలకు పోషకాలు అందించి మట్టిని ఆరోగ్యంగా ఉండే విధంగా చూస్తాయి. పంటలు ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడతాయి. మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచి పైర్ల గాలితో పాటు నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుతాయి. పంటలకు నెమ్మదిగా నిరంతర పోషకాలను అందిస్తాయి. సహజ సిద్ధమైనవి కాబట్టి పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. త్రిపురారం : చీడపీడల నివారణకు రసాయన ఎరువులు విపరీతంగా వినియోగిస్తున్నారు. దీంతో నేల నిస్సారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు ముంగిటల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో కేవీకే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వరి పరిశోధన శాస్త్రవేత్తలు రైతులతో సమావేశాలు నిర్వహించి రసాయని ఎరువుల వాడకాన్ని తగ్గించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. నేలలను సారవంతంగా మార్చుకోవడానికి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రైతులకు పలు సూచనలు చేశారు. గొర్రెల మందలతో అధిక ప్రయోజనాలు పొలాల్లోని నేలలను సారవంతంగా చేసుకోవడానికి గొర్రెల ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పంట కోతలు ముగిసి పొలాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇతర ప్రాంతాల నుంచి గొర్రెలు మేత కోసం ఇక్కడి వస్తుంటాయి. ఒక్కో గొర్రెల మందలో సుమారు 150 నుంచి 500 గొర్రెల వరకు ఉంటాయి. ఈ గొర్రెల మందలను రాత్రి సమయంలో పొలంలో ఉండే విధంగా చూసుకోవాలి. అలా గొర్రెల పెంటికలను నేలలో కలియ దున్ని దమ్ము చేసుకుంటే నేల సారవంతంగా మారుతుంది. వర్మికంపోస్టుతో నేల సారవంతం వర్మికంపోస్టు నిస్సారమైన భూమిని సారవంతంగా మారుస్తుంది. రసాయన ఎరువుల ద్వారా భూమిలో ఇంకిపోయిన భాస్వరం, పొటాషియం, నత్రజని తిరిగి పంటలకు ఉపయోగపడేలా చేస్తుంది. పంటలకు కావాల్సిన హర్మోన్లు విటమిన్లు, సూక్షపోషకాలు, మద్య పోషకాలు, జింక్ పూర్తి స్థాయిలో లభిస్తుంది. పైర్లకు చీడపీడలను తట్టుకునే శక్తిని ఇస్తుంది. వర్మికంపోస్టు ద్వారా పండించిన పంట ఆరోగ్యకరంగా నాణ్యతగా ఉంటుంది. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ ఎరువులో తేమ శాతం ఎక్కుంగా ఉండడం వల్ల నీటి వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఎకరానికి 500 కేజీల వర్మికంపోస్టు వేసుకోవడం ఉత్తమం. తయారీ విధానం వర్మికంపోస్టు తయారీకి అవసరమైన తొట్టెలను నిర్మించుకోవాలి. వీటిలో వరి గడ్డి ఒక లేయర్గా వేసుకోవాలి. దీనిపై ఆరబెట్టిన పేడను ఓ మేరగా వేసుకొని దానిపై తడిచెత్తను వేసుకోవాలి. మూడు రోజులు మగ్గిన తరువాత వానపాముల సీడ్ను వేయాలి. అనంతరం జీవామృతం పోసుకొని స్ప్రేయర్ ద్వారా నీళ్లు చల్లుతూ ఉండాలి. 20 నుంచి 30 రోజుల్లో వానపాములు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవ్వడం ద్వారా ఒక మిశ్రమంలా మారుతుంది. పై భాగంలో ఉన్న మిశ్రమాన్ని జల్లించి ఆరబెట్టడం ద్వారా వర్మికంపోస్టు తయారవుతుంది. పై భాగంలో మిశ్రమాన్ని తీసిన ప్రతి సారి జీవామృతం పోస్తూ మగ్గపెట్టుకోవాలి. ఇలా తొట్టెల్లోని మిశ్రమాన్ని పూర్తిగా ఉపయోగించిన తరువాత తిరిగి తయారీ ప్రారంభించుకోవాలి. పచ్చిరొట్టతో ఉపయోగాలు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, అలసందను ప్రధాన పంట సాగుకు ముందు సాగు చేసి కలియ దున్నుకోవాలి. సూక్ష్మ జీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమి గుల్లబారి నీటి నిలువ శాతం పెరిగి సులభంగా నీరు, గాలి వేర్లకు అందుతుంది. పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి మొక్కలకు పోషక పదార్థాలు అందుతాయి. ఫ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి ఫ పంటల సాగులో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు -
చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
చౌటుప్పల్ : దేశంలో వ్యవసాయం తర్వాత అతి ముఖ్యమైన రంగంగా ఉన్న చేనేత పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని శాసన మండలి సభ్యుడు ఎల్.రమణ ఆరోపించారు. శుక్రవారం చౌటుప్పల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా చేనేత హక్కుల సాధన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10.40లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, మరమగ్గాలను చూసుకుంటే మరో లక్ష అదనంగా ఉంటారన్నారు. చేనేత సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను యథావిధిగా అమలు చేయాలన్నారు. టెస్కో ద్వారానే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేతన్నకు బీమాను కొనసాగించాలని కోరారు. చేనేత సమస్యలపై సీఎం, మంత్రులను కలుస్తామని తెలిపారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఇరావత్రి అనిల్కుమార్ మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా చేనేతలంతా ఒక్కటవ్వాలన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు రాజ్యాధికారం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. చేనేత సమస్యల పరిష్కారానికి చేనేత హక్కుల సాధన వేదిక ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం, స్థానిక మున్సిపల్ వైస్చైర్మన్ గోశిక వినయ్కుమార్, నాయకులు ఎర్రమాద వెంకన్న, చిరందాసు ధనుంజయ్య, కర్నాటి వెంకటేశం, చిక్క నర్సింహ, కందగట్ల భిక్షపతి, పిల్లలమర్రి మదుసూధన్, రాపోలు వీరమోహన్, తడక నర్సింహ, నర్సింహ పాల్గొన్నారు. ఫ శాసన మండలి సభ్యుడు ఎల్.రమణ -
ప్రధాన శాఖల్లో ఇన్చార్జ్ల పాలన
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ప్రధాన శాఖలన్నీ ఇన్చార్జ్ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఏ శాఖలోనూ పూర్తిస్థాయి అధికారులు లేరు. పదవీ విరమణ చేసిన, బదిలీ అయిన పోస్ట్లను భర్తీ చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా ప్రధాన కార్యాలయాల్లో అధికారుల సీట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అయితే ఒకే అఽధికారికి మూడు నాలుగు శాఖల బాధ్యతలు అప్పగించడంతో వారిపై పనిభారం పడడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఏ అధికారి ఏ శాఖలో విధులను నిర్వహిస్తున్నారో జనానికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతంగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని శాఖలకు పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. నియామకాలపై సందిగ్ధం! జిల్లాలోని చాలా శాఖల్లో ఇన్చార్జి అధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటున్నా ప్రజల సమస్యలు తీరడం లేదు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక, జనగణన, సంక్షేమ వారోత్సవాలు, బెల్టు షాపులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారుల కొరత నెలకొంది. దీనికితోడు అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పనులు కుంటుపడుతున్నాయి. త్వరలో జరగనున్న బదిలీల్లోనైనా పూర్తిస్థాయి అధికారులను ప్రభుత్వం నియమిస్తుందా లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. డీపీఓ, జెడ్పీ సీఈఓలూ ఇన్చార్జ్లే.. డీపీఓ సునంద గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు బదిలీ అయ్యారు ఆమె స్థానంలో డిప్యూటీ సీఈఓగా ఉన్న విష్ణువర్ధన్రెడ్డికి అదనపు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఇటీవల అయన సూర్యాపేట జెడ్పీ సీఈఓగా బదిలీపై వెళ్లారు. దీంతో డీఎల్పీఓకు ఇన్చార్జి డీపీఓగా నియమించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారాంను నల్లగొండ జిల్లా మత్స్య శాఖఅధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. భూగర్భ జలవన రుల శాఖకు ఆశాఖలో హైదరాబాద్లో డెప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతికుమార్కు ఇక్కడ అదనపు బాధ్యలు ఇచ్చారు. ఉద్యాన వన శాఖ అధికారి సుభాషిణి బదిలీపై వెళ్లడంతో ఏ మాధవికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పౌరసరఫరాల శాఖ అధికారి బదిలీపై వెళ్లగా ఏఎస్ఓగా విధులను నిర్వహిస్తున్న రోజారాణికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. డీఐఈఓ సీహెచ్.రమణి మహబూబ్నగర్కు బదిలీ కాగా బొందుగుల సురేష్కు ఆ బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ జిల్లాపుడ్ ఇన్స్పెక్టర్గా నూతనంగా నియమితులైన శివశంకర్రెడ్డి జిల్లా ఇన్చార్జిగా ఉన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్న అశ్విన్కుమార్ హైదరాబాద్కు బదిలీ కాగా ఆయన స్థానంలో జనగామ డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణకు జిల్లాలో అదనపు బాధ్యతలుఅప్పగించారు. తాజాఆయన స్థానంలో నెల రోజుల కోసం హైదరాబాద్నుంచి రబియాను డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఇన్చార్జిగా నియమించారు. కార్మిక శాఖకు అధికారే లేరు! జిల్లా కార్మిక శాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నా ఇంతవరకు ఎవరిని నియమించలేదు. నల్లగొండ నుంచే ఆ శాఖను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆ శాఖకు జిల్లా అధికారి లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. త్వరలో ఉద్యోగుల బదిలీలు జరుగనుండడంతో ఆయా శాఖలకు అధికారులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులు బదిలీ అయ్యే అవకాాశం ఉంది. ఇప్పటికే బదిలీ అయిన స్థానాలు, కొత్తగా బదిలీ అయ్యే స్థానాల్లో అధికారులను భర్తీ చేయనుండడంతో ఇన్చార్జ్లుగా వ్యవహరించే అధికారులపై కాస్త పనిభారం తగ్గనుంది. దీంతో వారు బదిలీలపైనే కొంత ఆశలు పెట్టుకున్నారు. గృహనిర్మాణ శాఖ మేనేజర్ దేవ్సింగ్ పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో డీఈఈ శ్రీరాములుకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన జనగణన పర్యవేక్షించాల్సిన సీపీఓ వెంకటరమణ పదవీ విరమణ పొందగా జనగామ జిల్లా సీపీఓకు యాదాద్రి జిల్లా అఽధికారిగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా పదవీ విరమణ చేసిన సైదులు స్థానంలో ఏఈఎస్ విష్ణుమూర్తికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జిల్లా సహకారి అధికారిగా పదవీ విరమణ పొందిన శ్రీధర్ స్థానంలో జనగామ జిల్లా సహకార అఽధికారి మురళీరమణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారిగా ఉన్న పరాంకుశం సాహితి, జనగామ జిల్లా ఉపాధికల్పనాధికారిగా అదనపు బాధ్యతలతోపాటు జిల్లా సంక్షేమ శాఖలు అప్పగించారు. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. డీఆర్ఓ జయమ్మకు మైనార్టీ సంక్షేమ శాఖ, డీఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డికి గిరిజన సంక్షేమ శాఖల బాధ్యతలను అప్పగించారు. మైనింగ్ ఏడీ రాఘవరెడ్డిని కరీంనగర్ ఏడీ డిప్యుటేషన్పై పంపించిన అధికారులు సహాయ జియాలజిస్టుగా ఉన్న రవికుమార్ జిల్లా మైనింగ్ శాఖలో అదనపు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఫ ఎకై ్సజ్, హౌసింగ్, పంచాయతీ రాజ్ శాఖలకు జిల్లా అధికారులు కరువు ఫ మరికొన్ని శాఖల్లోనూ కొందరికి అదనపు బాధ్యతలు ఫ జనగణన బాధ్యతలు చూసే సీపీఓ పోస్ట్ ఖాళీగానే.. -
వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయబద్ధంగా ఊరేగించి ఆలయ ముఖ మండపంపై ఉత్తర దిశలో ఉన్న మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ప్రతి రంగంలోనూ నైపుణ్యం అవసరం
భువనగిరి : విద్యార్థి దశలోనే ప్రతి రంగంలోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరమని అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకారెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లో ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో విద్యార్థులు టైలరింగ్ డ్యూటీస్ కంప్యూటర్ కోర్సుల్లో రాణించి ఉపాధి అవకాశాలు పెంచుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి ఉపాధి కల్పన జిల్లా అధికారి సాహితీ జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజయ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఆలేరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, శివరామకృష్ణ అంజిరెడ్డి, కిషోర్ విద్యార్థులు పాల్గొన్నారు జనగణన విధులు బాధ్యతగా నిర్వహించాలి భువనగిరిటౌన్ : జనగణన విధులు పారదర్శకంగా, బాధ్యతగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జనగణన రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. శిక్షణలో భాగంగా ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే అంశాలను జాగ్రత్తగా గమనించి, విధుల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. అధికారులంతా సమన్వయంతో జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకారెడ్డి -
ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం
సాక్షి, యాదాద్రి : జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం, శుక్రవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భువనగిరి మండలం హన్మాపురంలో 6.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే తుర్కపల్లి (ఎం) మండలం మన్నేవారి తుర్కపల్లిలో 1.5 మి.మీ, భువనగిరి కలెక్టరేట్ ప్రాంతంలో 1.3 మి.మీ వర్షం కురిసింది. భువనగిరి పట్టణంలో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై సుమారు 30 నిమిషాల పాటు తేలికపాటి వర్షం కురిసింది. భువనగిరి పట్టణంలోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడం వల్ల పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యాదగిరిగుట్టలో 1.3 మి.మీ, నారాయణపూర్ మండలం జంగంలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన ఈ వర్షం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. ఈ వర్షంతో ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగినా మున్ముందు వేడి తాపాన్ని మరింత పెంచుతాయని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. -
ధాన్యం నిల్వలో జాగ్రత్తలు పాటించాలి
గరిడేపల్లి: రైతులు ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ మరియాదాస్ తెలిపారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్, నెగోషియబుల్ వేర్ హౌస్లపై రైతులు, వ్యాపారులు, పప్పు మిల్లు యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వ సమయంలో ఉపయోగించే హెల్మెట్రిక్ బ్యాగుల ఉపయోగాలపై రైతులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. సరైన జాగ్రత్తలు పాటించకుంటే 30 శాతం వరకు ధాన్యం నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. ధాన్యం నిల్వపై రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. కేవీకే సస్యరక్షణ శాస్త్ర వేత్త ఆదర్శ్ మాట్లాడుతూ.. ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకోవడమే కాకుండా నిల్వ చేసిన ధాన్యానికి రుణ సదుపాయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఈ రిసిప్ట్ ద్వారా ఆన్లైన్లో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఆదర్శ్, కిరణ్, అక్షిత సాయి, సుగంధి, రైతులు పాల్గొన్నారు. -
ఆలయ స్థలంలో షెడ్డు నిర్మాణం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన వైకుంఠద్వారం ముందున్న ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు అధికారులు శుక్రవారం తొలగించారు. పట్టణంలోని వైకుంఠద్వారం ముందు ప్రధాన రహదారికి ఆనుకొని సుమారు రూ.60 లక్షల విలవు చేసే 60 గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో చలివేంద్రం ఏర్పాటు చేయాలని మొదట మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. విషయం తెలిసిన దేవస్థానం అధికారులు తమ అనుమతి లేకుండా చలివేంద్రం ఏర్పాటు చేయొద్దని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ గుర్తుతెలియని వ్యక్తులు రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకుల ఫిర్యాదుతో తొలగింపు ఈ నెల 23న సాయంత్రం సదరు ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు షెడ్డు ఏర్పాటు చేశారు. దీంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, తమ నాయకులతో కలిసి శుక్రవారం షెడ్డు వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. దేవస్థానం అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో దేవస్థానం డిప్యూటీ ఈఓ నవీన్కుమార్ తన సిబ్బందితో అక్కడికి వచ్చి అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్డును తమ సిబ్బందితో తొలగింపజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ స్థలాన్ని అధికార పార్టీ అండతో ఆక్రమించేందుకే కొందరు షెడ్డు వేశారని, సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈఓకు విన్నవించారు. ఇదే విషయమై యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి వివరణ కోరగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఖాళీ స్థలంలో తాము ఎలాంటి షెడ్డు ఏర్పాటు చేయలేదని తెలిపారు. దీనిపై మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేందర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేశామని పేర్కొనడం గమనార్హం. చలువ పందిళ్లతో చలివేంద్రం ఏర్పాటు చేస్తారు కానీ ఏకంగా రేకులతో షెడ్డు ఏర్పాటు చేయడమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. దేవస్థానం స్థలంలో వేసిన షెడ్డును తొలగిస్తున్న ఆలయ సిబ్బందిదేవస్థానం డిప్యూటీ ఈఓ నవీన్కుమార్తో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఫ బీజేపీ నాయకుల ఆందోళనతో తొలగించిన అధికారులు ఫ తమకు సంబంధం లేదన్న మున్సిపల్ కమిషనర్ ఫ చలివేంద్రం కోసం వేశామన్న శానిటరీ ఇన్స్పెక్టర్ -
మాజీ స్పీకర్ అరెస్టు..
ఆలేరు : మండలి ప్రతిపక్ష నేత, శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఆలేరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మృతి చెందిన డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం హైదరాబాద్ నుంచి నర్సంపేటకు మధుసూదనాచారి కారులో బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న ఆలేరు పోలీసులు స్థానిక బైపాస్లో ఆయన కారును ఆపి ముందస్తు జాగ్రత్తలో భాగంగా అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పోలీసు బందోబస్తు మధ్య భువనగిరిలోని ఎస్పీ కార్యాలయానికి తరలించినట్టు ఎస్ఐ వినయ్ పేర్కొన్నారు. -
వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ
హుజూర్నగర్ : మండలంలోని కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన కీత శ్రీనివాసరావు థాయిలాండ్లోని శ్రీరచ నగరంలో ఈ నెల 17నుంచి 21 వరకు నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ పోటీల్లో ఇండియా తరపున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. రన్నింగ్, స్విమ్మింగ్, యోగా విభాగాల పోటీల్లో మూడు స్వర్ణం, ఒక కాంస్య పతకం సాధించారు. ఈ పోటీల్లో మొత్తం 49 దేశాలు పాల్గొన్నాయి. 5,000 మీటర్ల స్పీడ్ వాకింగ్ ఈవెంట్లో 31.45 సెకన్ల టైమింగ్తో స్వర్ణ పతకం సాధించారు. 100 మీటర్ల స్ప్రింట్ పోటీలో 12.5 సెకన్ల టైమింగ్తో మూడవ స్థానం (బ్రాంజ్ మెడల్) పొందారు. స్విమ్మింగ్లో 200 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో 1 నిమిషం 53 సెకన్ల టైమింగ్తో మరో స్వర్ణ పతకం సాధించారు. ట్రెడిషనల్ యోగా విభాగంలో అద్భుత ప్రదర్శన కనబర్చి మొదటి స్థానంతో స్వర్ణ పతకం అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రన్నింగ్, స్విమ్మింగ్, యోగా మూడు విభిన్న ఈవెంట్స్లో ఒకేసారి మూడు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పథకం సాధించడం అత్యంత అరుదైన ఘనత అని తెలిపారు. ఈ అద్భుత విజయం భారతదేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా, వరల్డ్ రికార్డ్గా నిలిచే స్థాయిలో ప్రత్యేక విజయంగా గుర్తించబడిందని ఆయన పేర్కొన్నారు. దేశం తరుపున ఆడి మూడు స్వర్ణ, ఒక కాంస్య పథకం సాధించడం పట్ల పలువురు ఆయనను అభినందించారు. దాడికి పాల్పడ్డ వారిపై కేసు మోతె: పర్యావరణవేత్త, జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణపై దాడికి పాల్పడ్డ గొర్రెల కాపరుల కుటుంబసభ్యులపై శుక్రవారం మోతె పోలీసులు కేసు నమోదు చేశారు. మోతె మండల పరిధిలో రాఘవాపురంలో దుశ్చర్ల సత్యనారాయణకు ఉన్న 70 ఎకరాల అటవీ భూమిలో బయ్య లింగయ్య, మేకల కృష్ణయ్యలు అక్రమంగా గొర్రెలను మేపడంతోపాటు, వారి కుటుంబసభ్యులతో కలిసి దాడి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బయ్య రోషయ్య, మేకల కృష్ణయ్య, బయ్య గంగయ్య, బయ్య మల్లయ్య, బయ్య జస్వంత్, బయ్య సుమలత, బయ్య అనూష, బయ్య కల్పన, బయ్య ఉప్పమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్సై అజయ్కుమార్ తెలిపారు.ఫ మూడు స్వర్ణం, ఒక కాంస్య పతకం సాధించిన కీత శ్రీనివాసరావు -
ఇస్రో శాస్త్రవేత్తగా కోదాడ యువకుడు
కోదాడ: కోదాడకు చెందిన అందె వసంత్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా ఆరుగురిని ఎంపిక చేయగా వారిలో వసంత్ ఉన్నారు. అయితే వసంత్ కుటుంబం గరిడేపల్లి మండలం బొత్తలపాలేనికి చెందిన వారు కాగా.. కోదాడలో స్థిరపడ్డారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల పలువురు ప్రత్యేకంగా అభినందించారు. జూదరుల అరెస్ట్రాజాపేట : పేకాట స్థావరంపై దాడిచేసి 11 మందిని అరెస్టుచేసి వారి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని మల్లన్నగుట్ట సమీపంలో ఆంజనేయస్వామి దేవాలయంవద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ లింగారెడ్డి, సిబ్బందితో కలిసి దాడిచేశారు. 11 మందిని అరెస్టు చేయగా ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.68,800 నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇల్లు దగ్ధం హుజూర్నగర్ : విద్యుత్ షార్ట్సర్క్యూట్తో రేకుల ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన హుజూర్నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. హుజూర్నగర్లోని గోవిందపురంలో గల గంగిరెద్దుల కాలనీలో ఆవుదొడ్డి వెంకన్న ఇల్లుకు మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. ఇంట్లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, మంచాలు, దుస్తులు కాలిపోయాయి. దీంతో సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి గాయాలుకనగల్: మండలంలోని లచ్చుగూడెం గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. గుర్రంపోడు మండలం తుర్కోనిబావి గ్రామానికి చెందిన పెరిక అంజయ్య బస్సు కోసం లచ్చుగూడెం స్టేజీ వద్ద వేచి ఉన్నాడు. ఈక్రమంలో నల్లగొండకు వస్తున్న దేవరకొండ డిపోకు చెందిన బస్సు అంజయ్యను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం 108 అంబులెన్స్లో నల్లగొండకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి నృసింహుడి జయంత్యుత్సవాలు
ఫ 30న ముగియనున్న వేడుకలు యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానుండగా ఈ నెల 30న ముగియనున్నాయి. ఇక పాతగుట్ట దేవాలయంలో 27 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలను నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాలు ఇలా.. 26న ఉదయం 8గంటలకు విష్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్విక్ వరుణం, ఆస్థాన మండపంలో కుంకుమార్చన, యాగ ప్రవేశం, మృత్సంగ్రహణం, అంకురారోపణం, మండప ద్వార తోరణ పూజ, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభ ఆరాధన, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనములు నిర్వహించనున్నారు. 11.30గంటలకు నిత్య పూర్ణాహుతి జరిపించనున్నారు. సాయంత్రం ఆలయంలో తిరు వేంకటపతి అలంకార సేవను ఊరేగించి, సాయమారాధన, నిత్య హవనం, లక్ష్మీనృసింహ సుదర్శన, మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి నిర్వహిస్తారు. 27న ఉదయం లక్ష పుష్పార్చన, యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుఃస్థానార్చన, నృసింహ లక్ష్మీ సుదర్శన, శతకం, గరుఢ మూల మంత్ర హోమం, నిత్యా పూర్ణాహుతి, సాయంత్రం వేళ కాళీయ మర్థన అలంకారణ సేవ నిర్వహించనున్నారు. అదేవిధంగా 28న సాయంత్రం గరుఢ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ, 29న శ్రీరామావతార అలంకార సేవ, 30న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అలంకార సేవతోపాటు, 10గంటలకు ద్వార తోరణ మహాబలి, మహా పూర్ణాహుతి, ఏకోత్తర సహస్ర కలశాభిషేకం, సహస్ర ఘటాభిషేకం జరిపించనున్నారు. సాయంత్రం వేద అర్చన, వేద స్వస్తి, నృసింహ ఆవిర్భావం, రుత్విక్ సన్మానం, మహా నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించి ఉత్సవాలను ముగించనున్నారు. ఐదు రోజుల పాటు నిత్య కై ంకర్యాలు రద్దు శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా 26 నుంచి 30వ తేదీ వరకు యాదగిరీశుడి ఆలయంలో నిర్వహించే శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీస్వామి వారి నిత్య, శాశ్వత కల్యాణం, 30న ఉదయం నిజాభిషేకం, సహస్రనార్చన వంటి పూజలు రద్దు చేసినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.


