breaking news
Yadadri District Latest News
-
చిన్నారి ఊపిరి తీసిన బాటిల్ మూత
భూదాన్పోచంపల్లి: థమ్సప్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన భూదాన్పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రియాల గ్రామానికి చెందిన బందారపు శ్రీకాంత్గౌడ్, నాగరాణి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె భవ్యశ్రీ(18 నెలలు) ఉన్నారు. శ్రీకాంత్గౌడ్ గుజరాత్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. నాగరాణి తన అత్తతో కలిసి ఇంద్రియాలలో ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం నాగరాణి తన కుమార్తె భవ్యశ్రీకి ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చి బయట దుస్తులు ఉతుకుతోంది. భవ్యశ్రీ ఆడుకుంటూ కిందపడి ఉన్న థమ్సప్ మూతను నోట్లో పెట్టుకోగా.. గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందింది. బట్టలు ఉతికిన తర్వాత నాగరాణి ఇంట్లోకి వచ్చి చూడగా కుమార్తె భవ్యశ్రీ ఉలుకు పలుకు లేకుండా ఉండటం చూసి ఆందోళన చెంది వెంటనే బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు నిర్ధారించారు. కళ్ల ముందే ఆడుకుంటున్న భవ్యశ్రీ మృతిచెందడంతో తల్లి నాగరాణి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫ గొంతులో ఇరుక్కొని మృతి -
పెద్దదేవులపల్లి వద్ద పుల్లయ్య మృతదేహం లభ్యం
త్రిపురారం : నిడమనూరు మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య మృతదేహం మంగళవారం పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో లభ్యమైంది. రెండు రోజుల క్రితమే పోలీసులు కారును కాల్వలో నుంచి బయటకు తీయగా.. అందులో పుల్లయ్య భార్య పద్మ మృతదేహం మాత్రమే లభ్యమైంది. పుల్లయ్య ఆచూకీ లభించలేదు. దీంతో నిడమనూరు పోలీసులు ప్రత్యేక బోటులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఎడమ కాల్వతో పాటు పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టగా.. పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో పులయ్య మృతదేహన్ని గుర్తించి బయటకు తీశారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం బంధువులు గ్రామంలో పుల్లయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఎన్జీ కళాశాల అధ్యాపకుడికి అరుదైన గౌరవం
రామగిరి(నల్లగొండ), నకిరేకల్: అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ, తెలుగు పద సంపద సంయుక్తంగా అంతర్జాతీయ తెలుగు భాష సభ నిర్వహించారు. ఈ సభలో నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామ వాసి, నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల తెలుగు అధ్యాపకుడు టంగుటూరి సైదులు పాల్గొని తెలుగు పద్య వైభవం–జీవన పరమార్ధం అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. సమాజంలో అంతరించిపోతున్న మానవ విలువలు, నేటి తరానికి తెలుగు సాహిత్య అవకశ్యకత గురించి సైదులు సభలో ప్రసంగించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకరశర్మ, తెలుగు పద సంపద అధ్యక్షుడు మూర్తి రేమిళ్ల, తెలుగు విశ్వ విద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీశంకర్ ఆయనకు మెమొంటో, ధ్రువపత్రం అందజేశారు. టంగుటూరి సైదులును ఎన్జీ కళాశాల తెలుగు ఇన్చార్జి వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు అభినందించారు. ఫ అంతర్జాతీయ తెలుగు భాష సభలో పాల్గొని పత్ర సమర్పణ చేసిన టంగుటూరి సైదులు -
ఓటు వేసేందుకు వస్తూ వ్యక్తి మృతి
హుజూర్నగర్ : ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒంగోలు నుంచి వస్తూ వ్యక్తి మృతి చెందినదిన ఘటన ఏపీలోని ఒంగోలు జిల్లా చీరాల వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని యర్రగుట్టకు చెందిన గునగంటి నాగేశ్వరరావు (40) బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు వెళ్లాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సోమవారం ఒంగోలు నుంచి రైలులో బయలు దేరాడు. రాత్రి చీరాల వద్ద శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.4.03కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు అధికారులు తెలి పారు. స్వామి వారి హుండీల్లో 49 రోజులలో భక్తులు వేసిన నగదు, నగలను మంగళవారం కొండకు దిగువన సత్యనారా యణస్వామి వ్రత మండపంలో ఈఓ భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి సమక్షంలో అధికారులు, సి బ్బంది లెక్కించారు. లెక్కింపులో నగదు రూ.4,03, 02,821, మిశ్రమ బంగారం 136 గ్రాములు, మిశ్రమ వెండి 3.600 కిలోలు వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ, డాలర్లు కూడా వచ్చినట్లు తెలిపారు. -
చిల్లేపల్లి రేషన్ డీలర్పై కేసు నమోదు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బియ్యం నిల్వల్లో తేడాలు రావడంతో రేషన్ డీలర్ రవిగుప్తాపై కేసు నమోదు చేశారు. ఈ సంద్భంగా విజిలెన్ప్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నల్లగొండ విభాగం సీఐ దశరథ, సివిల్ సప్లయ్ రెవెన్యూ అధికారి ప్రమోద్ మాట్లాడుతూ.. చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ షాపులో 46.96 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉండాల్సి ఉండగా.. 36.67 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు రేషన్ డీలర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా నేరేడుచర్ల మండలంలోని బొడలదిన్నె, సోమారం గ్రామాల్లోని రేషన్ దుకాణాలను కూడా తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. -
తెలంగాణలోకి చేరుకున్న దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : కర్ణాటక రాష్ట్రంలోని కలబురగలో ఈ నెల 1న ప్రారంభమైన దమ్మ పాదయాత్ర సోమవారం తెలంగాణలోని మడిగి ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి మంగళవారం బుచ్చినెల్లికి చేరుకుంది. నాగార్జునసాగర్లోని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈ పాదయాత్రలో పాల్గొనే వారు ఈ నెల 18న హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో బుద్ధవిగ్రహాన్ని సందర్శించి అనంతరం మహాబోధి బుద్ధ విహార్కు చేరుకొని 19న అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. మార్చి 1న నాగార్జునసాగర్కు చేరుకొని రెండో తేదీన నాగార్జునసాగర్ మ్యూజియాన్ని సందర్శించి, 3న బుద్ధవనంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వివరించారు. ఈ పాదయాత్రలో యాత్ర సంఘా ప్రాజెక్ట్ డైరెక్టర్ సొంగషాక్ కోవిడో, థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు, గగన్మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్, కేకే రాజా, మూర్తి, సిద్ధోజి, బుద్ధవనం ఆర్ట్స్ ప్రమోషన్ మేనేజర్ శ్యాంసుందర్రావు, కిషోర్ ఉన్నారు. -
నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
గుర్రంపోడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లినవె దంపతులను ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది.. క్షతగాత్రుల వద్ద లభించిన రూ.లక్షన్నర నగదును వారి బంధువులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు.. హైదరాబాద్లోని ఉప్పల్లో నివాసముంటున్న ఓర్సు రాంబాబు, నాగమణి దంపతులు సోమవారం కారులో పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేటలో బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి తిరిగి వారి స్వగ్రామమైన కనగల్ మండలం కురంపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుర్రంపోడు మండలం జూనూతల గ్రామ స్టేజీ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాంబాబు, నాగమణి దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 ఈఎంటీ వెలుగు సత్యనారాయణ, పైలెట్ మారేపల్లి వెంకటేశ్వర్లు క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా క్షతగాత్రుల వద్ద ఉన్న రూ.లక్షన్నర నగదును మంగళవారం రాంబాబు బంధువైన అంజికి ఆస్పత్రిలో అందించి నిజాయితీ చాటుకున్నారు. -
ఎంజీయూ ప్రాజెక్ట్కు రాష్ట్రస్థాయి బహుమతి
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్(సీఎస్ఈ) విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా గుర్తింపు లభించించిందని సీఎస్ఈ విభాగం అధిపతి ఎం.జయంతి తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన అన్వేషణ 2026 రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల ప్రదర్శనలో ఎంజీయూ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ ఫేస్ రికగ్నైజేషన్ను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా ఎంపికై నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్ట్ను రూపొందించి ప్రదర్శించిన విద్యార్థులు రాహుల్, సౌమ్యన్ను యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం అభినందించారు. -
ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డులకు నేడే పోలింగ్
తెలంగాణలోకి దమ్మపాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలోని కలబురగలో ప్రారంభమైన దమ్మ పాదయాత్ర తెలంగాణలోని బుచ్చినెల్లికి చేరుకుంది. హుండీ ఆదాయం రూ.4.03కోట్లు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు అధికారులు తెలిపారు. బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026- IIలోసాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో గల 104 వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా 102 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,32,711 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో మంగళవారం సాయంత్రానికి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్కు పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది 424 మంది, 20 శాతం రిజర్వును కలుపుకొని 1,020 మందిని నియమించారు. 212 బ్యాలెట్ బాక్సులను కేటాయించగా.. మరో 237 బాక్సులను రిజర్వులో ఉంచారు. పోటీలో 353 మంది భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో 353 మంది పోటీలో ఉన్నారు. యాదగిరిగుట్ట పదవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అవుల మమత, ఇండిపెండెంట్ అభ్యర్థి స్వప్నలు పోటీ నుంచి ఉపసంహరించుకోగా కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్లో 17 వ వార్డులో చింతల సాయిలు ఏకగ్రీవం అయ్యారు. భువనగిరిలో అత్యధికంగా 128 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 99 మంది అభ్యర్థులు, బీజేపీ 91, బీఆర్ఎస్ 90 మంది, ఇతరులు 73 మంది పోటీలో ఉన్నారు. ఊహకందని విధంగా అభ్యర్థుల ఖర్చు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించేందుకు అన్ని రకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్న వారు తమ ఖర్చుతోపాటు పార్టీ అభ్యర్థుల ఖర్చులు భరిస్తున్నారు. దీంతో వారి ఖర్చు రూ.కోటిపైనే దాటుతోంది. ఒక్కో వార్డులో 1000 నుంచి 1400 వరకు ఓట్లు ఉన్నాయి. 90 శాతం మంది ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. అంతేకాకుండా చీరలు, వెండి భరిణేలు, నాణాలు, ప్రెషర్ కుక్కర్లు వంటి కానుకలు పంపిణీ చేశారు. ఓటర్లు కూడా అభ్యర్థులు ఇచ్చే తాయిలాలు అడిగి మరీ తీసుకుంటున్నారు. భువనగిరిలో ఓ ప్రఽతిపక్ష పార్టీ అభ్యర్థులు ఓటర్లకు చీర సారె అందజేస్తున్నారు. ఓటర్ల ఇంటికి వారిని పీటలపై కూర్చోపెట్టి బొట్టుపెట్టి కాళ్లు మొక్కుతున్నారు. మహిళలకు చీరలు, పురుషులకు మద్యం బాటిల్తో పాటు నగదు అందజేసి ఓటు అభ్యర్థిస్తున్నారు. రూ.20వేలు పలుకుతున్న ఓటు ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లోని గట్టి పోటీ ఉన్న వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.20వేలు ఇస్తున్నట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ సీటుపై కన్నేసిన వారి వార్డుల్లో డబ్బు పంపిణీ తారాస్థాయికి చేరింది. చౌటుప్పల్లో ఓ అభ్యర్థి ఇచ్చిన డబ్బుల కంటే అధికంగా ఇస్తామని ప్రత్యర్థిగా ఉన్న మరో అభ్యర్థి చెబుతున్నారు. అయితే పలు వార్డుల్లో డబ్బులు ఇంకా పంచడంలేదని కొందరు ఓటర్లు అభ్యర్థులకు ఫోన్లు సైతం చేస్తుండడం గమనార్హం. క్రాస్ ఓటింగ్ భయం కాంగ్రెస్ పార్టీని క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. జిల్లాలోని అతి పెద్ద మున్సిపాలిటీ అయిన భువనగిరిలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓట్లు క్రాస్ అయ్యే అవకాశం ఉంది. తాము గెలువలేని చోట అధికార కాంగ్రెస్ను ఓడించేందుకు పరస్పరం ఓట్లు బదిలీ చేసుకునే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ల మధ్యన లోపాయకారి అవగాహన ఉన్నట్లు చర్చ జరుగుతోంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులను ఓడించేందుకు సొంత పార్టీల్లోనే వెన్నుపోట్లు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. టెన్షన్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. ఓటర్ల నాడి దొరకడం లేదని ఓ అభ్యర్థి వాపోయాడు. పార్టీలకతీతంగా అభ్యర్థులు ఇస్తున్న డబ్బులు తీసుకుంటున్న ఓటరు తీర్పు ఏవిధంగా ఉంటుందో నన్న భయం వారిని వెంటాడుతోంది. ఫ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఫ 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఫ భువనగిరిలో అత్యధికంగా 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీ ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,32,711 మంది ఓటర్లు మున్సిపాలిటీలు వార్డులు పీఎస్లు ఓటర్లు బ్యాలెట్ బాక్సులు ఆలేరు 12 24 13632 58 భువనగిరి 35 72 47831 140 చౌటుప్పల్ 20 40 27216 98 మోత్కూర్ 12 26 14383 64 పోచంపల్లి 13 26 15827 31 యాదగిరిగుట్ట 12 24 13822 58 మొత్తం 104 212 1,32,711 449 -
సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయం
ఫ ప్రభుత్వ విప్బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట: సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచే స్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంటుందని పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలంతా ఆగమయ్యారని, ప్రజా పాలనలో ప్రజలంతా సంతోషంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ప్రజా పాలనపై ప్రజలకు ఉన్న గెలుపే నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలను అందజేయడంతో పాటు ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. ప్రభుత్వాన్ని అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదుఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతయాదగిరిగుట్ట: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆలేరు మాజీ ఎమ్మె ల్యే గొంగిడి సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సి పాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలువనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోమని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన ఒక స్వర్ణ యుగం లాంటిదని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలంటే.. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ సైనికులుగా బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు దొంగ హామీలను ఇస్తున్నారని, ప్రజలెవరూ వాటిని నమ్మొద్దని తెలిపారు. ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిని విస్మరించిందని పేర్కొన్నారు. ఓటర్లు అంతా ఆలోచించి, ప్రజలను మభ్యపెడుతూ, ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
బీబీనగర్లో వాకథాన్
భువనగిరి(బీబీనగర్): ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా మంగళవారం బీబీనగర్లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీకేవైసీ సురక్షిత బ్యాంకింగ్కు మీ మొదటి అడుగుశ్రీ అనే అంశంపై వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవైసీ ప్రాముఖ్యతతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్బీఎం ఏజీఎం లక్ష్మీశ్రావ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జకిరోద్దిన్, డీఆర్డీఓ సెర్ప్ డీపీఎం వెంకటేశం, ఏపీఎం మీనా, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
యాదగిరిగుట్ట: మత్తు పదార్థాలకు బానిస కావొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత అన్నారు. మాదక ద్రవ్య నిషేధ చట్టాలు, చెడు ప్రభావం అంశాలపై యాదగిరిగుట్ట పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, యాదాద్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్తుపదార్థాల నిషేధ చట్టం పగడ్బందీగా అమలు అవుతుందన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వాడకం చాప కింద నీరులా ఎక్కువ అవుతుందని, వాటి బారిన పడడానికి వ్యాపారులు అనేక రకాలుగా మభ్యపెడుతున్నారన్నారు. ఎవరైనా నేరం చేస్తే తీవ్రమైన శిక్షలే కాకుండా, ఫైన్ కూడా అధిక మొత్తంలో ఉంటుందని తెలిపారు. న్యాయవిజ్ఞాన సదస్సులో యాదాద్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శ్రీహరి, పెంట రమేష్, మీడియేషన్ న్యాయవాది రాజిరెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బొమ్మ వెంకటేష్, న్యాయ సహాయ న్యాయవాది సాయి శ్రీనివాస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాధాకృష్ణ, దీపిక, వేణుకుమార్, కళాశాల ఎన్ఎస్ఎస్ ఇన్చార్జ్ ఉపేందర్, లెక్చరర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవిలత -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ఆలేరు: ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆలేరు బాలుర ఉన్నత పాఠశాలలోని 7, 12 వార్డులకు చెందిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్ పోలింగ్కు పకడ్బందీ పోలీసు బందోబస్తు చేశామన్నారు. ఆరు మున్సిపాలిటీల్లో 36 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఆర్మ్డ్ బలగాలను నియమించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఎస్పీ వెంట ఏసీపీ శ్రీనివాస్నాయుడు, సీఐ యాలాద్రి, ఎస్ఐ వినయ్ ఉన్నారు. సెల్ఫోన్లు అనుమతించొద్దుమోత్కూరు : మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్లు అనుమతించొద్దని అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్రావు అన్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్కుమార్, తహసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో బాలాజీనాయక్, ఎంపీవో పైళ్ల జనార్దన్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, పంచాయతీరాజ్ డెప్యూటీ ఈఈ మంగులాల్ ఉన్నారు. ఆర్థిక అక్షరాస్యత వాల్పోస్టర్ ఆవిష్కరణ భువనగిరిటౌన్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల – 2026 వాల్పోస్టర్లను కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామ కృష్ణ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు యూరియా కోసం రైతుల నిరసనవలిగొండ : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని వివిధ దుకాణాల్లో యూరియా నిల్వలు ఉన్నాయని రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, వలిగొండతోపాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈలోపే యూరియా నిల్వలు లేవని తెలియడంతో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ పెట్టి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు. స్వరగిరీశుడికి సూర్యప్రభ వాహనసేవభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అళ్వార్ తిరునగరి ఎంమేరు మనార్ జీయర్ మఠం శ్రీరంగరామానుజ జీయర్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆయనకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు స్వాగతం పలికారు. -
నిష్పక్షపాతంగా పనిచేయాలి
ఫ కలెక్టర్ హనుమంతరావు భూదాన్పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో అధికారులంతా సజావుగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్రిసైడింగ్ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. స్వస్తిక్ గుర్తు, సీల్ వేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలన్నారు. ఓటర్లందరూ ఓటరు స్లిప్తో పాటు ఏదేని గుర్తింపుకార్డు తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. కలెక్టర్ వెంట ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, ఎంఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి పాల్గొన్నారు. లక్కారంలో ఎన్నికల సామగ్రి పంపిణీ పరిశీలన చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ సాల్వేరు సూరజ్కుమార్, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్రెడ్డి ఉన్నారు. -
ఉద్యోగ విరమణ సాయం ఇంకెప్పుడు?
అడ్డగూడూరు : అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన వారికి సర్కారు నుంచి వచ్చే బెనిఫిట్స్ అందక నిరుత్సాహానికి గురువుతున్నారు. వృద్ధాప్యంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కొందరికి ఈ సాయం ఉపయోగడుతుందని ఆశించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు మార్లు వినతిపత్రాలు ఇచ్చినా , ధర్నాలు చేస్తున్నా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ జారీ చేసినా అమలుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయం పెంచుతూ జీఓ జారీ చేసినా.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకం. గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ పొందిన టీచర్కు లక్ష రూపాయలు, ఆయాలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందే విధానాన్ని 2024 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీచర్కు రూ.2 లక్షలు, ఆయాకు రూ . లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించి గతేడాది మే నెలలో జీఓ జారీ చేసింది. 65 ఏళ్లలోపు స్వచ్ఛందంగా విరమణ చేస్తే వారికీ ఇది వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. కుటుంబాలు గడవక.. జిల్లాలో 2024 ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు నిండిన వారి వివరాలు అందించాలని ప్రభుత్వం కోరడంతో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు పంపించారు. ఇప్పటివరకు జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన 20మంది టీచర్లు, 109 మంది ఆయాలు ఉన్నారు. వీరిలో కొందరు అనారోగ్యంతో సమతమవుతున్నారు. అటు ఉద్యోగం లేక ఇటు బెనిఫిట్స్ అందక, పింఛన్లేక కొందరు కుటుంబం గడవక ఆర్థికభారంతో ఇతరులపై ఆధారపడుతున్నారు. నేను 42 ఏళ్లపాటు అంగన్వాడీ టీచర్గా పనిచేశాను. 2024 జూలైలో రిటైర్మెంట్ పొందాను. రూ.2లక్షలు వసాయని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. వృద్ధాప్యంలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి. – పుష్పమ్మ, అంగన్వాడీ రిటైర్డ్ టీచర్, ఆజీంపేట ఫ రెండేళ్లు కావొస్తున్నా అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫ 20 మంది రిటైర్డ్ అంగన్వాడీ టీచర్లు, 109 మంది ఆయాలకు నిరీక్షణ ఫ వృద్ధాప్యంలో ఆర్థికభారంతో సతమతం -
వార్డు సమస్యలను గుర్తించాలి
సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలివ్వాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక నాయకులు కోరారు. వేదిక రూపొందించిన కరపత్రాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట వారు ఆవిష్కరించారు. అవినీతి, అక్రమాలను రూపుమాపడానికి, సమాజ మార్పు కోసం పాటుపడాలని సూచించారు. ప్రజలు ఈ కరపత్రాన్ని వార్డు నుంచి పోటీ చేసే వారికి అందించి అందుకు సంబంధించిన హామీలు పొందాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్.భద్రయ్య, కరీం, సుభాని, ఆవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లలకు వరాల జల్లు
చిట్యాల : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులోని పోటీచేస్తున్న కౌన్సిలర్ ఆభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్లలకు పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటించారు. 9వ వార్డులో ఆడపిల్ల పెళ్లి చేస్తే రూ.10,116, ఆడపిల్ల పుడితే రూ.5,116 అందిస్తానని ఆ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆగు అశోక్ తరఫున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రకటించారు. 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్ల పుడితే రూ.11,116, ఆడపిల్ల పెళ్లికి రూ.15,116 అందజేస్తామని హామీ ఇచ్చారు. అదే వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిర్రబోయిన సమతా శ్రీకాంత్ తన వార్డులో ఆడపిల్లపు పుట్టిన, ఆడపిల్ల పెళ్లి చేసినా రూ.10,116 అందిస్తానని హామీనిచ్చారు. 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మనగోటి శ్రీను వార్డు ప్రజలు శుభకార్యాలు జరుపుకొంటే ఫంక్షన్హాల్ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అదే వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిలివేరు శేఖర్ తరఫున ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు వార్డులో అడపిల్ల పెళ్లికి రూ.10వేలు అందిస్తామని హామీ ఇచ్చాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 7వ వార్డు కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన కూరెళ్ల లింగస్వామి తన వార్డులో ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో అదే వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లింగస్వామి భార్య జ్యోతి ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 నజరానా ఇస్తామని ప్రకటించారు.ఫ మున్సిపల్ అభ్యర్థుల హామీలు -
సెల్ఫోన్కు అనుమతి లేదు
భువనగిరిటౌన్ : ఓటు వేసేందుకు వెళ్లే వారు సెల్ఫోన్ను బయట ఉన్న అధికారికి ఇచ్చి వెళ్లాలి. ఒక వేళ సెల్ఫోన్ తీసుకెళ్లి ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే నేరంగా పరిగణిస్తారు. ఓటు వేస్తూ సెల్ఫీ తీసినట్లు గుర్తిస్తే అధికారులు వెంటనే అతడిని బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17– ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో సదరు వ్యక్తి వేసిన ఓటు పరిగణలోకి తీసుకోరు. రూల్ నంబర్ 49– ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు ఓటు వేయ డానికి 18 ఏళ్లుకు పైగా ఉన్న సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. అతడి ఓటును బహిరంగ పర్చనని సహాయకుడు నిబంధన–10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది. -
అచ్చం వైఎస్సార్ లాగే..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐనాల శ్రీనివాస్ సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేషధారణతో జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఆయన అచ్చం వైఎస్సార్ హావ భావాలు ప్రదర్శిస్తుండడంతో జూనియర్ వైఎస్సార్గా పేరుపొందాడు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్లు, సభలు జరిగినా ఆయన పాల్గొంటూ ఉంటాడు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలలో సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ వైఎస్సార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. -
ఇద్దరు దొంగల రిమాండ్
భువనగిరి: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సోమవారం భువనగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను భువనగిరి డీఎస్పీ రవీందర్ విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన బోదాసు యాదగిరి, కొమిరె శ్రీను భువనగిరి పరసర ప్రాంతాల్లోని ఆలయాల్లో కొంతకాలంగా రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్నారు. సుమారు 5 ఆలయాల్లో చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి సోమవారం వారిద్దరిని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.1.50లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితులిద్దరిపై సిద్దిపేట జిల్లాలో పలు చోరీ కేసులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. గతంలో వారు జైలుకు కూడా వెళ్లి వచ్చారని వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ చంద్రబాబు, ఎస్ఐ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
సాగర్ కాల్వలో కొనసాగుతున్న గాలింపు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో గల్లంతైన తల్లం పుల్లయ్య ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతడి ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు, నిడమనూరు పోలీసులు, పుల్లయ్య కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించారు. ప్రత్యేక బోటులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన జరిగిన స్థలం నుంచి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు ఎడమ కాల్వ తూముల వద్ద వెతుకుతున్నారు. గాలింపు చర్యలను నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ ఉప్పు సురేష్, ముకుందాపురం సర్పంచ్ సలికంటి పద్మాసత్యం పర్యవేక్షించారు. లభ్యంకాని పుల్లయ్య ఆచూకీ -
వైద్యం చేస్తానని.. పుస్తెలతాడు అపహరణ
భూదాన్పోచంపల్లి: సంతానం లేని వారికి వైద్యం చేస్తానని నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తి మహిళ నుంచి 4 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించాడు. ఈ ఘటన సోమవారం ఉదయం భూదాన్పోచంపల్లి పట్టణంలోని గాంధీనగర్లో జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన వంగూరి ప్రణీత, రాజ్కుమార్ దంపతులకు వివాహమై ఐదేళ్లవుతున్నా సంతానం కలగకపోవడంతో వైద్యులతో చికిత్స తీసుకుంటున్నారు. బైక్పై హెల్మెట్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి సోమవారం రాజ్కుమార్ ఇంటి వద్దకు వచ్చి సంతానం లేని వారికి కేరళ ఆయుర్వేద వైద్యం చేస్తామని నమ్మించాడు. ఇందుకు రూ.12వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఇది నమ్మిన రాజ్కుమార్ దంపతులు రూ.6వేలు ఇస్తామని చెప్పారు. ఈ మేరక సదరు వ్యక్తి మొదట రాజ్కుమార్ ఒంటికి నూనె లాంటి పదార్థాన్ని పూసి అతడిని స్నానం చేసి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత ప్రణీతకు కూడా మెడ భాగంలో నూనె పూస్తూ పుస్తెలతాడును తీయమని చెప్పడంతో ఆమె తీసి మంచం పైన పెట్టింది. అనంతరం ఆమెను కూడా స్నానం చేసి రమ్మని చెప్పాడు. ప్రణీత స్నానానికి వెళ్లగానే మంచంపై ఉంచిన పుస్తెలతాడు సదరు వ్యక్తి తీసుకొని అక్కడ నుంచి ఉడాయించాడు. ప్రణీత స్నానం చేసి వచ్చి చూడగా ఆ వ్యక్తి లేడు, పుస్తెలతాడు కన్పించలేదు. వెంటనే తేరుకొని భర్త రాజ్కుమార్ ఆమె చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భాస్కర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగుడు అంతకుముందు వైద్యం చేస్తామని చెప్పి ఇదే కాలనీకి చెందిన మరో వ్యక్తితో మాట్లాడిన మొబైల్ నంబర్ను పరిశీలించగా ట్రూ కాలర్లో అతడి పేరు వెంకటేశ్వర్రావు అని, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాగా వస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉంటే సంతానం లేనివారికి వైద్యం చేస్తామంటూ ఇటీవల పోచంపల్లిలో పలువురి వద్ద వేల రూపాయలు వసూలు చేసి ఉడాయించినట్లు తెలిసింది. -
మున్సిపల్ బరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి
మిర్యాలగూడ: రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత మల్లు స్వరాజ్యం మనవరాలు మల్లు మధులత మిర్యాలగూడ మున్సిపాలిటీలో 17వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మల్లు స్వరాజ్యం కుమారుడు మల్లు గౌతమ్రెడ్డి కోడలు అయిన మధులత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలిపెట్టి ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలబడ్డారు. తన అమ్మమ్మ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలు సైతం యువతకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని, తనను గెలిపిస్తే 17వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆమె చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
భూదాన్పోచంపల్లి : బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి భూదాన్ పోచంపల్లి మండల కేంద్రం శివారులో జరిగింది. ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొంగరి శేఖర్(38) కొంతకాలంగా హైదరాబాద్లో నివాసముంటూ సమీప గ్రామాల్లో మార్బుల్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మార్బుల్ పని మీద పోచంపల్లికి వచ్చిన అతడు పని ముగించుకొని రాత్రి బైక్పై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పోచంపల్లి మండల కేంద్రం శివారులో పోచంపల్లి–కొత్తగూడెం రహదారిలో శ్రీమిత్ర వెంచర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. శేఖర్ బైక్ పైనుంచి కిందపడటంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాలు
భూదాన్పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజే గడువు ఉండటంతో అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. పోచంపల్లి మున్సి పాలిటీలోని జడ్పీహెచ్ఎస్, సీతావానిగూడెం, నారాయణగిరి, ముక్తాపూర్, రేవనపల్లి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే గదులను శుభ్రం చేస్తున్నారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్లోని గుర్తులు స్పష్టంగా కన్పించేలా అన్ని పోలింగ్ కేంద్రాలలోని కంపార్ట్మెంట్ పైన లైట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
సాక్షి, యాదాద్రి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు వార్షిక పరీక్షలకు 28 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ, భువనగిరి ఆర్డీఓ కృష్ణా రెడ్డి,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి , జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, జిల్లా అసిస్టెంట్ ట్రెజరీ అధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
11న సెలవు
యాదగిరిగుట్ట: ఈనెల 11న పోలింగ్ రోజు స్థానిక సెలవు గా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బ్యాలెట్ బాక్సులను పరిశీలించి మాట్లాడారు. ఆ రోజు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు సాధారణ సెలవు, షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల భవనాలకు ఈనెల 10వ తేదీన పోలింగ్కు ముందు రోజు, 11వ తేదీన పోలింగ్ రోజు సెలవులు ప్రకటించినట్లు వివరించారు. 13న ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కోసం వినియోగించే స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. -
అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఓటు వేయండి
యాదగిరిగుట్ట: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సినీ హీరో సుమన్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పెలిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ కు మద్దతుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఆయన ప్రచారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సుమన్ మాట్లాడారు. గత పదిహేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మరో మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. యాదగిరిగుట్ట పట్టణం, వార్డులు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెలిమెల్లి లావణ్య భర్త పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ తనకు వీర అభిమాని అని, 30 ఏళ్లుగా శ్రీధర్ యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నో సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పెలిమెల్లి లావణ్యకు ప్రజలు మద్దతుగా నిలిచి , ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో ప్రొడ్యూసర్ జైహింద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు భిక్షపతి గౌడ్, గుడ్ల వరలక్ష్మి, గుండు జ్యోతి పాల్గొన్నారు. ఫ సినీ నటుడు సుమన్ -
ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి
భువనగిరిటౌన్ : ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరచిన పోలింగ్ మెటీరియల్ను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయనున్న బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, మేనేజర్ నరేశ్రెడ్డి, డీఈ కొండల్రావు, సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యతగా కౌంటింగ్ నిర్వహించాలి సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి సిబ్బంది ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణా రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణ,మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. భువనగిరి మండలంలో దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. యాప్లో యూరియా బుక్ చేసుకోవాలిగుండాల: రైతులు ఫర్టిలైజర్ యాప్లో యూరియా బుక్ చేసి కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి కోరారు. సోమవారం గుండాలలో ఎరువుల దుకాణాలను తనిఖీచేశారు. స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న రైతులందరికీ సరిపడా యూరియా ఉందని, ఎవరూ ఆందోళన చెంద వద్దన్నారు. యూరియా అమ్మకాలలో ఎటువంటి ఇబ్బందులు కలిగించ కూడదని డీలర్లు, సొసైటీ నిర్వాహకులను ఆదేశించారు. యాప్లో యూరియా బుక్ చేసుకోలేని రైతులకు ఏఈఓలు అందుబాటులో చేయించాలని సూచించారు. ఆయన వెంట ఆలేరు ఏడీఏ శ్రీని వాస్, మండల వ్యవసాయ అధికారి సూరజ్కుమార్, ఏఈఓ క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలిరామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఏఎస్సీడీఓ ఆర్.భిక్షం కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి చదివే ఎస్సీ బాలురకు ప్రభుత్వం సంవత్సరానికి రూ. 1000, బాలికలకు రూ .1500 చొప్పున ఉపకార వేతనం అందిస్తుందని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే బాలబాలికలకు రాజీవ్ విద్యాదీవెన కింద ఏడాదికి రూ .3500 చొప్పున చెల్లిస్తుందని వివరించారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రేరణ ఉత్సవ్భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని కేంద్రీయ విద్యాలయంలో సోమవారం ప్రేరణ ఉత్సవ్–26 సందర్భంగా జిల్లా స్థాయి పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు వివిధ అంశాలలో నిర్వహించిన కవితలు, పాటలు, చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి మాట్లాడారు. ప్రేరణ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు కోరారు. మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. ఆయన వెంట ఎన్నికల ప్రత్యేక అధికారి గుర్రం సురేష్, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్కుమార్, తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ బాలాజీనాయక్, ఎంపీఓ పైళ్ల జనార్దన్రెడ్డి, పీఆర్ ఈఈ మంగులాల్, కమిషనర్ కె.సతీష్కుమార్, మేనేజర్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి భువనగిరిటౌన్ : ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంత రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. వెబ్కాస్టింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు ఆలేరు: పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీని సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ సత్యాంజనేయప్రసాద్, వెంకటేష్, తిరుపతిరెడ్డి, జగన్మోహన్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
రాజకీయాలను శాసించే రోజు వస్తుంది
చౌటుప్పల్ : భవిష్యత్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి మునుగోడు నుంచే ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. తాను మొండోడినని, ఎవరికీ విననని చెప్పారు. తనను చూస్తే మంచిమంచోళ్లే భయడుతున్నారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఇంకా వందమార్లు పోటీ చేసినా గెలవడన్నారు. కూసుకుంట్ల అప్పటి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు గజగజ వణికేవాడన్నారు. అదే తాను ఒక్క ఫోన్ చేస్తే సీఎం వెంటనే లైన్లోకి వస్తాడన్నారు. తాము దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రియ శిష్యులమని ప్రజలకు మాట ఇస్తే తప్పబోమని, మడమ తిప్పబోమని స్పష్టం చేశారు. బతికినంతకాలం వైఎస్సార్ మాదిరిగా బతుకుతానని తెలిపారు. సమావేశంలో పీసీసీ ఽఅధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, ప్రధానకార్యదర్శి కసుబ శ్రీనివాస్రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కై లాష్, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, పబ్బు రాజుగౌడ్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ప్రజలను కోరారు.చౌటుప్పల్ పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
వాడవాడకు.. గడప గడపకు..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సామగ్రి పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలేరు పట్టణంలోని ఎన్నికల సామగ్రిని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు అందజేయనున్నారు. భువగిరి మున్సిపాలిటీకి సంబంధించిన సామగ్రి పంపిణీని భువనగిరిలోని దివ్యబాల విద్యాలయం, ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో ఏర్పాటు చేయగా, చౌటుప్పల్ మున్సిపాలిటీలో, సాన్ జాన్ విద్యానికేతన్ లక్కారం, మోత్కూర్లో వైజే గార్డెన్స్లో, పోచంపల్లి మున్సిపాలిటీలో బాలాజీ గార్డెన్స్లో, యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని అందజేయనున్నారు.సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచార మైకులు మూగబోయాయి. చివరి రోజు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ తమకే ఓటు వేయాలని కోరారు. ప్రధాన పార్టీల నేతలు, రోడ్షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు తెరలేపారు. ఈ నెల 11న భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ప్రముఖుల ప్రచారం యాదగిరిగుట్టలో సినీహీరో సుమన్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, చౌటుప్పల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు సోమవారం ప్రచా రాన్ని హోరెత్తించారు. తమ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రలోభాల ఎర ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీని ప్రారంభించారు. కాంగ్రెస్. బీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రలోభాల ఎర వేస్తున్నాయి. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు సగటున ఒక్క ఓటుకు రూ. 6వేల నుంచి రూ. 15 వేల వరకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మద్యం, డబ్బులు, చీరలు, వెండి కుంకుమ బరిణెలు, బియ్యం, చికెన్, మటన్, మద్యం పంపిణీని ప్రారంభించారు. ఓటర్లుకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ● భువనగిరి మున్సిపాలిటీలో బొమ్మాయిపల్లి వార్డులో ఓ అభ్యర్థి ఇంటింటికీ జర్మన్ సిల్వర్ కుంకుమ కాయలు పంచుతున్నాడు. అన్ని వార్డుల్లో మద్యంబాటిళ్లు పంచుతున్నారు. రూ. 3 వేలనుంచి రూ. 5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. భువనగిరిలోని ఓ వార్డులో చీరల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్యాంకు నుంచి తెచ్చిన కొత్త 10, 20, 50 రూపాయల నోట్లను కార్యకర్తలకు ఇచ్చారు. వాటిని తీసుకుని క్లాత్ షోరూంకు వెళితే చీరలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ● ఆలేరులో జనరల్, రిజర్వుడ్ వార్డుల్లో అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ. 4వేల నుంచి రూ. 5 వేల వరకు పంచుతున్నారు. చైర్మన్ సీటుపై కన్నేసిన వార్డులో నేటి వరకు ఓటు రికార్డు ధర పలుకనుంది. అయితే ఒకరు పంచిన డబ్బుల కంటే మరొ కరు అదనంగా పంచేందుకు ప్లాన్చేశారు. మద్యం, చీరలు, బియ్యం, ప్రెషర్ కుక్కర్లు అదనం. ● చౌటుప్పల్లో ఇప్పటికే మద్యం పంపిణీ పూర్తి అయ్యింది. 2,3, 19 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ఓటకు రూ. 5 వేలు పంచుతున్నారు. వీరికంటే అదనంగా పంచే యోచనలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఉన్నాయి. మహిళా ఓటర్లకు చీరలు,కూల్ డ్రింక్స్ పంచుతున్నారు. ● పోచంపల్లిలో చైర్మన్ అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులో రూ. 5 వేల నగదు, చీరలు, మద్యం, కూల్ డ్రింక్స్ పంచేందుకు సిద్ధమయ్యారు. మున్సిపాలిటీలు 6 వార్డులు 102 పోలింగ్ కేంద్రాలు 208 బ్యాలెట్ బ్యాక్స్లు 449 ఓటర్లు 1,32,711 పురుషులు 64,926 మహిళలు 67,767 ఇతరులు 18 బరిలో ఉన్న అభ్యర్ధులు 353 ఏకగ్రీవం 2 వార్డులుఫ వారం రోజులుగా హోరెత్తిన ప్రచారం ఫ సోమవారంతో సమాప్తం ఫ నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ ఫ ఏర్పాట్లు చేసిన అధికారులు -
వెయ్యి మందితో నిఘా
ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదు. సెల్ఫోన్లో కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దు. నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కోల్పోతారు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్డేస్గా పరిగణించాలి. ఈ సమయంలో ఓటర్లు కానివారు, స్థానికేతరులు వార్డుల్లో సంచరించకూడదు. ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు. సాక్షి, యాదాద్రి : ‘జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీలకు ఈ నెల 11న నిర్వహించే ఎన్నికలకు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. పోలింగ్, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గట్టి నిఘా ఉంచాం. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి పటిష్ట చర్యలు తీసుకున్నాం’ అని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను సోమవారం ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఆరు మున్సిపాలిటీల్లోని 102 వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నాం. పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశాం. అదనపు ఎస్పీ, డీస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఫోర్స్ అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తుంది. మున్సిపాలిటీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. 102 వార్డుల్లోని 208 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా 51 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. డీఎస్పీ స్థాయి అధికారి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారిగా ఉంటారు. ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తుంది. ప్రతి మున్సిపాలిటీలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తుంది. ప్రతి మున్సిపాలిటీలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్స్ ఉంటాయి. ప్రతి మున్సిపాలిటీకి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం ఉంది. ఎన్నికలను జిల్లా ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. బందోబస్తు నిర్వహణ మొదలుకుని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని జిల్లా పోలీస్ కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశాం. వీటి ద్వారా నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 73 మందిని ముందస్తుగా బైండోవర్ చేశాం. ఎవరైనా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని హామీ పూచీకత్తు నగదు రూ.5 లక్షల వరకు జరిమానాగా విధిస్తాం. లైసెన్స్ కలిగిన 5 ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాం. 29 కేసుల్లో రూ.2.57 లక్షల విలువైన 357 లీటర్ల మద్యం సీజ్ చేశాం. భువనగిరిటౌన్, పోచంపల్లిలో రూ.5.90 లక్షల నగదును సీజ్ చేశాం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో ఒక కేసు నమోదు చేశాం ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధనల ప్రకారం ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికల సామగ్రికి పటిష్ట భద్రత కల్పిస్తాం. భువనగిరి దివ్యబాల పాఠశాలలో పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్ర పరుస్తాం. ఆర్ముడ్ పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నాం. అలాగే ఎన్నికల సామగ్రి తరలింపులో ఎన్నికల నిర్వహణ అధికారులతోపాటు రూట్ మొబైల్ సిబ్బంది భద్రతగా ఉంటారు. ఫ ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ఫ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి ఫ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి ఫ ఎస్పీ అక్షాంశ్యాదవ్కేటాయించిన సిబ్బంది అదనపు ఎస్పీలు 01 డీఎస్పీలు 04 ఇన్స్పెక్టర్లు 11 సబ్ ఇన్స్పెక్టర్లు 37 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 06 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 06 ఏఆర్ ఫోర్స్ 213 ఇతర సిబ్బంది 600 -
ఇంటర్నల్ తనిఖీలు
భువనగిరి: టెన్త్ విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సబ్జెక్టుకు 100 మార్కుల్లో 20 మార్కులు ఇంటర్నల్ కింద కేటాయిస్తారు. ఈ మార్కుల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలు పాఠశాలలను సందర్శించి పరిశీలించనున్నారు. 21 బృందాలు ఏర్పాటు పదో తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీలన కోసం జిల్లాలో మొత్తం 21 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఉంటారు. వీరిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడితో పాటు లాంగ్వేజ్ ఉపాధ్యాయుడు, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. వీరికి కేటాయించిన పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు సక్రమంగా వేశారా లేదా అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనే విషయాలను పరిశీలిస్తారు. జిల్లాలో 8891 మంది విద్యార్థులు జిల్లాలో పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 265 వరకు ఉన్నాయి. ఇందులో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8891 మంది ఉన్నారు. వీరిలో 163 ప్రభుత్వ పాఠశాలల్లో 5063, వివిధ రకాల 31 గురుకులాల్లో 1187, 71 ప్రైవేట్ పాఠశాలల్లో 2641 మంది విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి మార్కులను పరిశీలించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలు కుమ్మకై 20 ఇంటర్నర్ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో ఈసారి పరిశీలన పక్కాగా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఫ టెన్త్ ఇంటర్నల్ మార్కుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఫ 12 నుంచి 17 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఫ ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున నియామకంపదో తరగతి ఇంటర్నర్ మార్కుల పరిశీలన పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్కులు సక్రమంగా వేశారా లేదా అనేది ప్రత్యేక బృందాలు పరిశీలిస్తారు. ఇష్టానుసారంగా మార్కులు వేసినట్లు పరిశీలనలో తేలితే చర్యలు తప్పవు. మార్కుల పరిశీలన అనంతరం వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలి. – సత్యనారాయణ, డీఈఓ -
ఇసుక దందాను అరికట్టాలి
ఆలేరురూరల్ : ఆలేరు మండలం సాయిగూడెం పరిధిలోని వాగులో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయని, వేసవిలో సాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక దందాను అడ్డుకున్న గ్రామానికి చెందిన పుట్ట పవన్పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. పోలీసులను వివరణ కోరగా.. పుట్ట పవన్ వ్యవసాయ బావి వద్ద నుంచి ట్రాక్టర్లో బొడ్డు మల్లేష్ ఇసుక తరలిస్తుండగా పవన్ అడ్డుకున్నాడని.. వాగ్వాదం చోటుచేసుకుందనేది వాస్తవమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. -
ఫ గిరిప్రదక్షిణ
నేటి సమాజానికి రచయితలు అవసరం రామగిరి(నల్లగొండ) : నేటి సమాజానికి రచయితలు అవసరమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. నల్లగొండ పట్టణంలోని టీఎస్యూటీఎఫ్ భవనంలో ఆదివారం నిర్వహించిన భూతం విమల స్మారక జాతీయ పురస్కార అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రచయిత్రి స్వర్ణ కిలారికి రూ.5116, జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గురుతరమైన బాధ్యత రచయితలదని, కవులు రచయితలు నిరంతరం సామాజిక సమస్యలపై స్పందిస్తూ తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. రచయిత భూతం ముత్యాలు సతీమణి విమల స్మారకార్థం పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక రచయితకు పురస్కారాన్ని ప్రధానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సభ అధ్యక్షుడు తండు కృష్ణకౌండిన్య, అవార్డు కమిటీ చైర్మన్ భూతం ముత్యాలు, ఆచార్య బన్న ఐలయ్య, డాక్టర్ జివి రత్నాకర్, మునాసు వెంకట్, మేరెడ్డి యాదగిరిరెడ్డి, పగడాల నాగేందర్, సిద్ధాంతి యాదగిరి, నిమ్మ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ దొంగ హామీలను నమ్మొద్దు
ఫ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క భువనగిరిటౌన్ : కేసీఆర్ పదేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు మంచి నీరు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన బీఆర్ఎస్ నాయకులు, మళ్లీ దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజా సంక్షేమం కోసం హామీలు ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి తన శాఖ నుంచి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు దొంగ హామీలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలి మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేయని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, పట్టణాల్లో కూడా కాంగ్రెస్కు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే కుంభంఅనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హెచ్ఎండీఏ నిధులు సీఎం రేవంత్రెడ్డి కేటాయింపు చేసినట్లు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ, చౌరస్తాల అభివృద్ధితో పాటు, సీసీ రోడ్లు వేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, కుంభం కీర్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, చల్లగురుగుల కృష్ణవేణి రఘుబాబు, బెండె స్వరూపలాల్రాజ్, గుర్రాల సంతోష శ్రీనివాస్, తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, పోలిశెట్టి అనిల్కుమార్, సూదగాని సరితరాజు, నాయకులు పాల్గొన్నారు. -
ఎవరి వ్యూహం వారిదే..
సాక్షి, యాదాద్రి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుంది. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండడంతో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముఖ్యనాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చైర్ పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ● మోత్కూర్ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ ఇతర పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. శనివారం రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మందుల సామేల్ తమ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థులు, కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కడెం రామచంద్రయ్య ప్రచారం చేస్తున్నారు. ● చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీలు సొంతంగానే పోటీ చేస్తుండగా బీఆర్ఎస్, సీపీఎంలు పొత్తుపెట్టుకున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ అభ్యర్థుల తరపున ప్రచార చేశారు. బీఆర్ఎస్, సీపీఎం తరఫున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరఫున ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డిలు ప్రచారం చేస్తున్నారు. ● భువనగిరి మున్సిపాలిటీలో 35 స్థానాలకు ముక్కోణపు పోటీ నడుస్తోంది. కొన్ని వార్డులో కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్నట్లు ఉంది. మరికొన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుండగా. బీఆర్ఎస్ సీపీఎం, సీపీఐల పొత్తుతో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు చైర్మన్ అభ్యర్థిగా ఎవరి పేరు ఇంకా ప్రకటించలేదు. మెజార్టీ స్థానాలు గెలిచిన తర్వాత చైర్మన్ను ఎన్నుకుంటామని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. మంత్రిసీతక్క, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డిలు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ మిత్ర పక్షాల తరపున మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్, పాశం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డి, సమన్వయ కర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ● ఆలేరు మున్సిపాలిటీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. చైర్పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకుంటామని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి వారే ధీమాతో ఉన్నాయి. మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థుల తరపున పడాల శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు. ఫ కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ ఫ భువనగిరిలో ముక్కోణపు పోటీ ఫ నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం ఫ పోచంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 13 వార్డుల్లో పోటీపడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీలకు చెందిన చైర్మన్ అభ్యర్థులైన తడక వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నుంచి గుండు మధు 12వ వార్డ్ నుంచి బరిలోకి దిగారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు మున్సిపల్ కౌన్సిలర్ సీట్లను ఒకటి, రెండు అటు, ఇటుగా పంచుకోనున్నాయి. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి పదవ వార్డులో ఏక గ్రీవమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏడు ఎనిమిది వార్డుల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇటీవల మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుట్ట పట్టణంలోని అన్ని వార్డులలో పర్యటించి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా తమ అభ్యర్థులను గెలిపించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యులు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. -
మున్సిపాలిటీల్లో నేటి నుంచి డ్రైడే
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో డ్రై డే ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం తెలిపారు. 9వ తేదీ(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ప్రక్రియ మూసే వరకు, తిరిగి 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు మున్సి పాలిటీల పరిధిలో డ్రై డే గా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గల మద్యం దుకా ణాలు, రిటైల్ షాప్స్, బార్లు, కల్లు దుకాణాలు అన్ని మూసి ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటుమోత్కూరు : ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి కోసం మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కె.సతీష్కుమార్ ఆదివారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఓటరు జాబితా, గుర్తింపు పత్రాలు, విధి నిర్వహణ పత్రాలను జత పరుస్తూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ డి.బాలాజీ, రాజకీయ ప్రతినిధులు వనం శాంతికుమార్, బి.యాదగిరి తదితరులున్నారు. యాదగిరీశుడికి బంగారు వాహనాలు బహూకరణయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల అశోక్, కుటుంబ సభ్యులు రాగిపై బంగారు తాపడం చేసిన వాహన సేవలను ఆలయ ఈఓ భవానీ శంకర్కు అందజేశారు. ఆదివారం ఉప్పల అశోక్, కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ మండపంలో రాగిపై బంగారు తాపడం చేసిన హనుమంత, గజ వాహనాలను అందజేశారు. అదేవిధంగా ఆండాళ్ అమ్మవారికి మకర తోరణం బహుకరించారు. వీటి విలువ సుమారు రూ.15,00,000 ఉంటుందని వెల్లడించారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మున్సిపాలిటీలోని 4, 6, 8వ వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని అన్ని వార్డుల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. 12 వార్డుల్లో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజా పాలనలో ప్రతి నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇప్పటికే యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 10వ వార్డు ఏకగ్రీవమైందని, మిగిలిన 10 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో సీపీఐ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేక ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ట్రాక్టర్ పైనుంచి పడి చిన్నారి మృతి
తిప్పర్తి : ట్రాక్టర్పై తండ్రి ఇంటి నుంచి వెళ్తుండగా.. తాను వస్తానని రెండేళ్ల కుమార్తె మారం చేసింది. దీంతో ఆమెను తండ్రి ట్రాక్టర్పై ఎక్కించుకుని కొద్దిదూరం తిప్పేందుకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ చిన్నారి ట్రాక్టర్ పైనుంచి కిందపడి మృతిచెందింది. ఈ ఘటన తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన కొల్లు సైదులు, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. శనివారం సైదులు తన ట్రాక్టర్పై యూరియా బస్తాలు వేసుకురావడానికి వెళ్తుండగా.. తానూ వస్తానని పెద్ద కుమార్తె మనస్విని(2) మారం చేయడంతో ఆమెను కూడా ట్రాక్టర్పై ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్ను ముందుకు కదిలించడంతో మనస్విని ట్రాక్టర్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగే చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిమర్రిగూడ : భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందని మనస్తాపంతో ఉరేసుకున్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వివరాలు.. మర్రిగూడ మండలం వెంకేపల్లితండాకు చెందిన జటావత్ బాలాజీ(35) భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుండడంతో మనస్తాపానికి గురైన బాలాజీ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి తమ్ముడు సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మర్రిగూడ ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
ఎన్నికలు తెచ్చిన ఉపాధి
భువనగిరి, నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికలు పేదలకు, కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా నిత్యం తమ వెంట వందల మంది జనాన్ని తిప్పుకుంటూ వార్డుల్లో బలప్రదర్శన నిర్వహిస్తున్నారు. డప్పు కళాకారులు, కోలాటం ఆడేవారు ర్యాలీల్లో ముందుంటున్నారు. దాంతో పాటు ఆటోలు, వాహనాల్లో స్పీకర్లు పెట్టి తమ కోసమే రూపొందించిన పాటలతో మరీ ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థి వెంట వందల మంది ఉంటే ఇక అతడి గెలుపు పక్కా అనే ప్రచారం జరగాలనే వ్యూహంతో కొందరు అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన పేదలను తమ వెంట తిప్పుకుంటున్నారు. రోజులో ఒక పూట వెంట తిరిగితే భోజనంతో పాటు రూ.250, రెండు పూటలు తిరిగితే భోజనంతో పాటు రూ.500 ఇస్తున్నారు. అభ్యర్థుల వెంట జనం లేకపోతే ఓడిపోతారనే ప్రచారం చేస్తారనే భయంతో అభ్యర్థులు రోజు ఐదు వందలకు పైగానే మందిని తమ వెంట తిప్పుకుంటూ కాలనీల్లో హంగామా చేస్తున్నారు ఎన్నికల సందర్బంగా కారు, ఆటోలకు సైతం గిరాకీ ఏర్పడుతోంది. బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు నాయకులు కార్యకర్తలను ఆయా వార్డుల్లో తీసుకెళ్లడానికి వాహనానలు వినియోగిస్తున్నారు. వాహనాలకు ఫ్లెక్సీలు, మైకులు ఏర్పాటు చేసి గల్లీల్లో తిప్పుతున్నారు. దాంతో ప్రైవేటు వాహనదారులకు డిమాండ్ పెరిగింది. పట్టణాల్లో మైక్ ద్వారా ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. దాంతో అభ్యర్థులు తమ పేరు, పార్టీతో ప్రత్యేకమైన పాటను రూపొందించుకొని, సింగర్తో పాడించుకొని కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పాటలు సామాజిక మాధ్యమాలతో పాటు ఆటోలకు మైక్ బిగించి కాలనీలల్లో గల్లీ, గల్లీ తిప్పుతున్నారు. ఒక్కో పాటకు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు గాయకులకు చెల్లించినట్లు తెలిసింది. దీని ద్వారా గాయకులకు ఉపాధి లభిస్తోంది. సభలు, సమావేశాలు, ప్రచారానికి వేళ్లేటప్పుడు నాయకులు, కార్యకర్తలు ఉదయం అల్పహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. దాంతో పట్టణాలలో హోటల్స్కు గిరాకీ పెరిగింది. కొందరు క్యాటరింగ్, హోటల్స్ వారికి ఆర్డర్స్ ఇస్తూ కోరిన చోటుకు పార్సిల్స్ కట్టి తీసుకెళ్తున్నారు. మరి కొందరు ఏకంగా హోటల్స్తో ముందుగానే కాంట్రాక్ట్ మాట్లాడుకొని కార్యకర్తలకు టోకెన్లు అందిస్తున్నారు. దాంతో అన్ని హోటళ్లు ఆర్డర్లతో యమ బిజీగా మారాయి. -
నవాబు నుంచి మాన్యం చెల్క
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మాన్యం చెల్క ప్రాంతం మాన్యం బావిగా రికార్డులలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి కరువు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అప్పటి భూ స్వామి ఇక్కడ బావి తవ్వించాడు. దాంతో పాటు పేదలకు కొంత భూమిని కూడా దానం చేశాడు. భూస్వామి ఇచ్చిన భూమిలో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని మాన్యం బావిగా పిలవడం మొదలు పెట్టారు. దాంతో పాటు నిజాం పాలకుల్లో ఐదవ రాజైన అఫ్జల్ ఉద్దౌలా తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. చాలా మంది వైద్యులు వైద్యం అందించినా తగ్గలేదు. దాంతో నల్లగొండ పట్టణంలోని ప్రముఖ వైద్యుడు కన్నయ్య వద్దకు వచ్చాడు. ఆయన అందించిన వైద్యంతో జబ్బు నయమైంది. దీనికి కృతజ్ఞతగా ప్రస్తుత మాన్యం చెల్క ప్రాంతాన్ని వైద్యుడికి ఇనాంగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి మాన్యం చెల్క అని పేరు వచ్చింది. -
ఓటరు వాయిస్
నిస్వార్థ సేవ చేసేవారికే నా ఓటు సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో ఈసారి నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. మొట్టమొదటి ఓటును నిస్వార్థ చేసి మా వార్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అభ్యర్థికే వేస్తాను. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడికి ఓటు వేస్తాను. – అంతటి యోగేశ్వర్, సూర్యాపేట సూర్యాపేట అర్బన్ : ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత కూడా. సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే అభివృద్ధికి సహకరించినట్లవుతుంది. నచ్చిన, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఒక్క ఓటు ద్వారానే లభిస్తుంది. ఈసారి నాకు ఓటు హక్కు రావడంతో మా కాలనీని అభివృద్ధి చేసే నాయకుడికే ఓటు వేయాలనుకుంటున్నాను. – యాతాకుల భవిత, సూర్యాపేట రామగిరి(నల్లగొండ): మున్సిపల్ ఎన్నికల్లో యు వత ఓట్లు ఎంతో కీలకంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు యువతను ఆకర్షించడానికి అనేక హామీలు ఇస్తున్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. యువత కూడా ఆలో చించి తమకు సేవ చేసే వారికే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించుకోవాలి. – ఎండీ అమాన్, విద్యార్థి, నల్లగొండ రామగిరి(నల్లగొండ): నల్లగొండ నగరం అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం. యువ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి చేసేవారికే ఓటు వేయాలి. పెద్దవాళ్లకు కూడా తమ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి యువ ఓటర్లు వివరించి నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. – ఎస్. చందన, విద్యార్థి, నల్లగొండ అభ్యర్థి వ్యక్తిత్వానికి ఓటు భువనగిరిటౌన్ : ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నమ్మకమైన, పనులు చేసే అభ్యర్థినికి ఓటు వేయాలని ఆలోచిస్తున్నా. రాజకీయ పార్టీలను చూసి కాకుండా వ్యక్తిగతంగా అభ్యర్థి మంచివాడా లేదా అని చూసి ఓటు వేస్తాను. నూతన ఓటర్లు ఎవరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దు. – లింగాల శివాణి, భువనగిరి -
నేడు గుట్టలో టెంపుల్ రన్
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పరిధిలోని టెంపుల్ సిటీ(పెద్దగుట్ట)పై ఆదివారం టెంపుల్ రన్ నిర్వహించనున్నారు. సాక్షి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అవంతిక కన్స్ట్రక్షన్స్ సౌజన్యంతో ఆదివారం ఉదయం 6గంటలకు టెంపుల్ సిటీపై ప్రారంభమవుతుందని తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమ జగన్మోహన్రెడ్డి, సాక్షి సర్క్యులేషన్ డీజీఎం సతీష్ తెలిపారు. శనివారం టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్, మల్లాపురం గ్రామానికి వెళ్లే ప్రాంతాలను వారు పరిశీలించి మాట్లాడుతూ.. ఆరోగ్యంపై ప్రజలను చైతన్యం చేసేందుకు 21.1కే, 10కే, 5కే విభాగాల్లో ఈ రన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రన్నర్స్ ఉదయం 5.30గంటలకే టెంపుల్ సిటీ పైకి చేరుకోవాలన్నారు. ఇప్పటికే 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీషర్టులు అందజేశామన్నారు. -
పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే
మోత్కూరు : గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల ఉద్యోగాలు, 4.5 లక్షల ఇళ్లు పేదలకు ఇచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి.సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో శనివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దోచుకొని దాచుకున్న సొమ్ము పంపకాలలో తేడాలతోనే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుందన్నారు. మున్సిపాలిటీలలో కాంగ్రెస్కు పట్టం కడితే అభివృద్ధి మరింత వేగంగా పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ ఎన్నికల ఇన్చార్జి బొజ్జ సంధ్యారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, మండల, పట్టణ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, రామచంద్రు గౌడ్, మహిళ అధ్యక్షులు ముద్దం జయశ్రీ పాల్గొన్నారు. ఫ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపల్ పోరులో బీఆర్ఎస్, సీపీఎం మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శనివారం పట్టణంలో నిర్వహించిన ర్యాలీ, కార్నర్ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, నాయకులను బెదిరిస్తూ భయబ్రాతులకు గురిచేస్తున్న అధికార పార్టీ నాయకులు, పోలీసులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే.. కౌన్సిలర్ టిక్కెట్లు అమ్ముకున్నారని సొంతపార్టీ వారే విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీపై తిరిగి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి నేవూరి ధర్మేంధర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకూబ్రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు బయ్యని పిచ్చయ్య, ఉప్పనబోయిన రమేష్, జంగ శ్రీను, గజ్జి మల్లేష్, కూరపాటి రమేష్, మాటూరి బాలరాజు, బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్సు, రాచకొండ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ -
కౌంటింగ్ కేంద్రంలో వసతులు కల్పించాలి
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అన్నిరకాల వతసులు కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పరిధిలోని దివ్యబాల స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని శనివారం జిల్లా ఎస్పీ అక్షాంశ్యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలన్నారు. వారి వెంట భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, అధికారులు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి రద్దుభువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున భువనగిరి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్టు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని ప్రజలు గమనించి ఎవరు కూడా కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. కలెక్టర్ హనుమంతరావు -
అక్రిడిటేషన్ కార్డులకు 9 నుంచి దరఖాస్తులు
భువనగిరిటౌన్ : జర్నలిస్టులకు 2026–28 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఈనెల 9వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితి గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన జాబితాల్లో పేర్లున్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.నేటి నుంచి యాప్ ద్వారా యూరియాభువనగిరి టౌన్ : రైతులకు అవసరమైన యూరియాను నేటి నుంచి ఫర్టిలైజర్ యాప్లో బుక్ చేసుకుని ఆన్లైన్ విధానంలో పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి రమాణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టా భూ యజమానులు, నాన్ పట్టా రైతులు, కౌలు రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్లలో ఫర్టిలైజర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమకు కేటాయించిన కోటా యూరియాను బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు తాము సాగుచేసే పంటల విస్తీర్ణం ఒకసారి నమోదు చేశాక మార్చేందుకు వీలు ఉండదని పేర్కొన్నారు. యువర్ బుకింగ్ 24 గంటల పాటు మాత్రమే ఆక్టివ్గా ఉంటుందని తెలిపారు. రైతులకు యూరియా బుకింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే స్థానిక ఏఈఓల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు. ఆకట్టుకున్న ‘కూచిపూడి’భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం హైదరాబాద్కు చెందిన నాట్య గురువు తొండపు భవాని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాకారిణులు అక్షర, ఖ్యాతి, ప్రణవి, ధరణి, శాన్వి, నందిత, శివాని తదితరులు పాల్గొన్నారు. పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలిగుండాల : పశువైద్య సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా పశు వైద్య, పశు సంవర్థక శాఖ అధికారి పి.జానయ్య సూచించారు. శనివారం ఆయన గుండాల పశు వైద్యశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇటీవల మండలంలో పులి సంచరించిన నేపథ్యంలో మూగ జీవాలపై ఏమైనా దాడి చేసిందా అని సిబ్బందిని అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయనవెంట డాక్టర్ యాకూబ్, గోపాల మిత్ర గోవిందు, సిబ్బంది ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థుల సందర్శనభూదాన్పోచంపల్లి : ఇక్కత్ పరిశ్రమ తీరుతెన్నులను తెలుసుకునేందుకు శనివారం మధ్యప్రదేశ్లోని మాధవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ గ్వాలియర్కు చెందిన 40 మంది ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కును సందర్శించి అక్కడ మగ్గాలు, మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్, చేనేత వస్త్రాల తయారీ విధానాలు, నూలు, వస్త్రోత్పత్తుల మార్కెటింగ్ విధానాలు, చేనేత డిజైన్లను పరిశీలించారు. స్టడీ టూర్లో భాగంగా చేనేతలకు అంతర్జాతీయంగా పేర్గాంచిన పోచంపల్లి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చామని ఫ్యాకల్టీ అశ్విని తెలిపారు. -
మళ్లీ కాంగ్రెస్దే అధికారం
భూదాన్పోచంపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందని, మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శని వారం రాత్రి భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని 5వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేకు సీఎం రేవంత్రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఆ చొరవతోనే సీఎం ఆదేశాలతో తాను భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగునీటి పైప్లైన్ కోసం రూ.210 కోట్ల మంజూరు చేశానని గుర్తు చేశారు. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు. అభివృద్ధిపథంలో ముందుకు పోవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తడక వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు బాత్క శంకర్యాదవ్, నల్ల నాగేశ్వర్, సూరెపల్లి రాధిక రమేశ్, కుడికాల రాంనర్సింహ, కొయ్యడ రజినిశ్రీను, గంజి జయమ్మగణేశ్, మంగళపల్లి లావణ్యరమేశ్, భోగ భానుమతి విష్ణు, దేవరాయ కుమార్, రావుల జంగయ్య, గుండ్ల నవనీత, ఎల్లస్వామి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, మండల అధ్యక్షుడు పాక మల్లేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, సామ మధుసూధన్రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, సుధారాణి, మమత, కుక్క దానయ్య తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
ప్రజా సమస్యలపై పోరాడే వారిని గెలిపించాలి
భువనగిరిటౌన్, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరు: నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, భువనగిరి, మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం భువనగిరి పట్టణంలో 6వ వార్డు సీపీఎం అభ్యర్థి కొలుపుల వివేకానంద విజయాన్ని కాక్షిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే చౌటుప్పల్లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, సీపీఎం మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని జాన్వెస్లీ.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. భూదాన్పోచంపల్లిలోని 4వ వార్డులో సీపీఎం అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి తరఫున జాన్వెస్లీ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డు సీపీఎం అభ్యర్థి భాగ్యలక్ష్మిని గెలిపించాలని ప్రచారం, కార్నర్ మీటిగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్లలో జాన్వెస్లీ మాట్లాడుతూ చౌటుప్పల్లో బీఆర్ఎస్, సీపీఎం మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలన్నారు. పోచంపల్లి, ఆలేరులో సీపీఎం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం తదితర ప్రలోభాలతో రాజకీయాలు చేసే నాయకులు ప్రజాసేవ చేయలేరని, అలాంటి వారికి ఓటెయ్యొద్దని, ప్రజల పక్షాన పోరాడే వారిని కౌన్సిలర్లుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. భువనగిరి, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు ఎండి జహంగీర్, బట్టుపల్లి అనురాధ, మాయ కృష్ణ, దాసరి పాండు, గడ్డం వెంకటేష్, లౌడియారాజ్, ఏవీ.కిరణ్, కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు, తుమ్మల పాండు, ముల్కలపల్లి సత్యనారాయణ, గంటెపాక భిక్షపతి, నీలశ్రీనివాస్, గద్దె నరసింహ, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి చింతల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, కొండమడుగు నర్సింహ, గుడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, ఇక్బాల్, మొరిగాడి రమేష్, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ భువనగిరి, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, ఆలేరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం -
‘ఇందిరమ్మ’కు ఉపాధి అనుసంధానం
ఆలేరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఇటీవల ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసింది. బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో లబ్ధిదారులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించే రూ.5లక్షల బిల్లు విషయంలో ఉపాధి హామీ పథకాన్ని భాగస్వామ్యం చేసింది. పాత నిబంధన ప్రకారం లబ్ధిదారులకు పునాది, బేస్మెట్ లెవల్ పూర్తయితే మొదటి విడతగా రూ.లక్ష, గోడలు స్లాబ్ లెవల్ వరకు అయితే రెండో దశగా మరో రూ.లక్ష, మూడో విడతలో స్లాబ్ పూర్తయితే రూ.2 లక్షలు, నాలుగో విడతగా ఇంటి నిర్మాణం పూర్తయితే రూ.లక్షతో కలిపి మొత్తం రూ.5లక్షలను లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. మారిన నిబంధనల ప్రకారం..ఇందిరమ్మ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం మారిన నిబంధనల ప్రకారం లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణం పూర్తిచేస్తే రూ.1.40 లక్షలు చెల్లించనుంది. మరో రూ.60 వేలు ఉపాధి హామీ పథకం నుంచి చెల్లిస్తారు. దీనికి పట్టణాల్లో అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై), గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రధానమంత్రి గ్రామీణ యోజన(పీఎంజీవై)ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఉపాధి హామీ కింద ఇళ్ల నిర్మాణ పనులు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఉపాధి పనులను మినహాయించి లబ్ధిదారుల ఖాతాల్లో ఇకపై నాలుగు విడతల్లో ప్రభుత్వం రూ.4.40 లక్షలను చెల్లించనుంది.రూ.60 వేల చెల్లింపు ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లో 90 పనిదినాలకు రోజుకు రూ.300 చొప్పున రూ.27 వేలతోపాటు రూ.12 వేలు వ్యక్తిగత మరుగుదొడ్లు పేరిట మొత్తం రూ.39 వేలు చెల్లించనున్నారు. మరో రూ.21 వేలు ప్రధామంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వస్తాయి. పట్టణాల్లో ఇయితే మొత్తం రూ.60 వేలు ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద చెల్లిస్తారు. జిల్లాకు 7,325 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 274 ఇందిరమ్మ ఇళ్లు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు స్లాబ్ లెవల్ పూర్తయి రూ.2లక్షల చెల్లింపులు జరిగిన ఇళ్లకు ఉపాధి హామీ పనుల భాగస్వామ్యం లేదు. ఇలాంటి వాటికి తదుపరి చెల్లించే బిల్లుల్లో మళ్లీ పనులు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మారిన నిబంధనలతో బిల్లులు ఎప్పుడు అందేది సందిగ్ధంగా మారిందని లబ్ధిదారులు వాపోతున్నారు. బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలకు గాను నేరుగా ఇచ్చేది రూ.4.40 లక్షలే.. పట్టణ, గ్రామీణ ఆవాస్ యోజన కింద రూ.60 వేలు ఈ నిధులు ఉపాధి హామీ పథకం నుంచి చెల్లించాలని నిర్ణయంజిల్లాలో ఇందిరమ్మ పథకం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం లబ్ధిదారులకు దశల వారీగా బిల్లుల చెల్లిస్తున్నాం. ఇంటి నిర్మాణాల్లో ఉపాధి హామీ పనుల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. లబ్ధిదారులందరూ ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలి. – ఎం.శ్రీరాములు, హౌసింగ్ డీఈ -
పవర్లూమ్ కార్మికులకు త్రిఫ్టు పథకాన్ని కొనసాగించాలి
రాజాపేట : పవర్లూమ్ కార్మికులకు త్రిప్టు పథకాన్ని కొనసాగించాలని కోరుతూ రాజా పేట మండలంలోని రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలీ సంఘం నాయకులు గురువారం హైదరాబాద్లో చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్కు వినతిపత్రం అందజేశారు. గత 10 నెలల క్రితం ముగిసిన త్రిఫ్టు పథకాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. చేనేత కార్మికుల మాదిరిగానే పవర్లూమ్ కార్మికులకు కూడా త్రిఫ్టు పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో మరమగ్గాలకు 750 యూనిట్ల విద్యు త్ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలంగాణ లోనూ చేనేతలకు 200 యూని ట్లు, పవర్లూమ్ పరిశ్రమకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందజేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్కుమార్, నాయకులు సామల భాస్కర్, రేగొండ వెంకటేశం, గొట్టిపాముల సిద్దిరాములు, గోలి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం
రామన్నపేట: వైద్యాధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, మందులు, డైట్, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఓపీ విభాగం, ఫార్మసీ, రిజిష్టర్లు, మెడిసిన్ స్టాకును పరిశీలించారు. అటెండెన్స్ రిజిష్టర్ను పరిశీలించి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కాన్పుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రిస్థాయిని వంద పడకలకు పెంచాలని, నూతన భవనాలు నిర్మించాలని స్థానిక నేతలు కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ చిన్నానాయక్, వైద్యులు స్వాతీబాయి, నవీన్సింగ్, మాధవాచారి, దేవేందర్, సుమంగలి, హెడ్నర్సు సువర్ణ, సోలీ, జ్యోతి ఉన్నారు.ఫ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఫ విధులకు డుమ్మాకొట్టిన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు -
నేటి నుంచి పోల్ చిట్టీల పంపిణీ
మున్సిపాలిటీలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకంభువనగిరిటౌన్ : ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే పోల్ చిట్టీలే ప్రధానం. ఓటరు జాబితాలో పేరున్నప్పటికీ పోల్ చిట్టీ అందకపోతే ఓటు వేసేందుకు కొందరు ఓటర్లు విముఖత చూపుతుంటారు. అక్షరాస్యుల నుంచి నిరక్షరాస్యుల వరకు పోల్ చిట్టీలతోనే కేంద్రాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. గతంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు పంపిణీ చేసేవారు. ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో.. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీలో బీఎల్ఓలు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పోల్ చిట్టీల పంపిణీపై భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, తహాసిల్దార్ అంజిరెడ్డి, మేనేజర్ నరేష్రెడ్డిలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 104 వార్డుల్లో జిల్లా వ్యాప్తంగా 6 మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డుల్లో ఫొటో ఓటరు ఫోల్ చిట్టీల పంపిణీకి శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. బీఎల్ఓలు, వార్డు అధికారులు, సిబ్బంది ఆయా వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వారీగా బృందాలుగా ఏర్పడి పంపిణీకి సన్నద్ధమవుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నచ్చిన అభ్యర్థిని కౌన్సిలర్గా ఎన్నుకోవచ్చు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం.. వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోల్ చిట్టీలు పంచుతూ ఓటింగ్ శాతం పెంచేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఇంకా నాలుగు రోజులే గడువు ఉండడంతో ప్రధాన పార్టీల నాయకులు తమ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ర్యాలీలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులు.. ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ ఓటు వేయాలంటూ కోరుతున్నారు. అభివృద్ధి మంత్రం.. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్, డీసీసీఅధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఆలేరు, యాదగిరిగుట్టలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను వింటున్నారు. ఆలేరులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. ఐలయ్యతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ శోభారాణి ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెస్తానని ప్రజలకు హామి ఇస్తున్నారు. భువనగిరి, పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. భువనగిరిని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. చౌట్పుల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. మోత్కూరులో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీలను అభివృద్ధి చేయకుండా విస్మరించిందని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఆలేరులో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి, మోత్కూరులో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, చౌటుప్పల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డిలు ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, తాము చేసిన అభివృద్ధిని ప్రచారంలో ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. చాపకింద నీరులా.. భువనగిరి, చౌటుప్పల్, ఆలేరుతోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ బీజేపీ చాపకింద నీరులా ప్రచా రాన్ని కొనసాగిస్తోంది. తమ పార్టీ అభ్యర్థుల తరఫున జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకుడు పడాల శ్రీనివాస్ , పార్టీ ఎన్నికల ఇన్చార్జిలు ప్రచారం ముమ్మరం చేశారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన సమన్వయం సాధించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కోఆర్డినేటర్లను నియమించింది. ఒక్కో మున్సిపాలిటీకి ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేటర్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నియమించారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్గా ఎంఆర్జీ వినోద్రెడ్డిని నియమించారు. చండూరు మున్సిపాలిటీకి పీసరి మహిపాల్రెడ్డి, హాలియాకు నాగసీతారాములు, దేవరకొండకు కొట్నాల తిరుపతి నియమితులయ్యారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి కుందూరు రఘువీర్రెడ్డి, పొట్ల నాగేశ్వర్రావు, నందికొండ మున్సిపాలిటీకి మద్ది శ్రీనివాస్రెడ్డి, హుజూర్నగర్కు నూతి శ్రీకాంత్గౌడ్, నేరేడుచర్లకు ముత్తినేని వీరయ్య, కోదాడకు ఇ.సుబ్బారావు, సూర్యాపేటకు కోటింరెడ్డి వినయ్రెడ్డి, భువనగిరికి ఎం.పరమేశ్వర్రెడ్డి, చౌటుప్పల్కు కస్బ శ్రీనివాసరావు, పోంచపల్లికి కె.శ్రీకాంత్యాదవ్, తిరుమలగిరికి కె.రవళిరెడ్డి, మోత్కూరుకు బొజ్జ సంధ్యారెడ్డి, ఆలేరుకు జి.శశికళయాదవ్రెడ్డి, యాదగిరిగుట్టకు ఎం.సత్యనారాయణగౌడ్, చిట్యా లకు గౌరిసతీష్ను నియమించారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ గుర్తులు, ఇండిపెండెంట్లు తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారం ముమ్మరం చేశారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు ప్రచారంలో ఢీ అంటే ఢీ అన్నట్లు గా దూసుకుపోతున్నారు. ఉదయం, సాయంత్రం తమ అనుచరులతో కలిసి వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇల్లిల్లు తిరుగుతూ తమ ఎన్నికల మేనిఫెస్టోను పంచుతున్నారు. సమస్యలను పరిష్కరించడానికి తమను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. కుల సంఘాలు, యువత, మహిళా సంఘాలను కలిసి తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఒక్కో ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి కలిసి ఓటు అభ్యర్థించారు. ప్రచార వాహనాలు ఏర్పాటు చేసి వార్డుల్లో తిప్పుతున్నారు. ఫ మున్సిపల్ వార్డుల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఫ ఓటు వేయాలని వినతి ఫ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫ ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ప్రచారం ఫ ఇంటింటికీ తిరిగి అందజేయనున్న బీఎల్ఓలు మున్సిపాలిటీ ఓటర్లు భువనగిరి 57,840 మోత్కూరు 14,416 ఆలేరు 13,670 యాదగిరిగుట్ట 13,817 చౌటుప్పల్ 27,216 పోచంపల్లి 15,839 మొత్తం 1,42,798 -
వరి సాగు 80 శాతం
యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు 80 శాతం మేర వరిసాగు పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో వరి నాట్లు పూర్తి కానున్నాయి. వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భువనగిరి: యాసంగి సీజన్లో వరి అంచనాకు మించి సాగుకానుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు 80 శాతం మేర వరి నాట్లు పూర్తయ్యాయి. మరో 15రోజుల్లో ఇంకా 20 శాతం సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి వర్షాలు అధికంగా కురువడంతో చెరువులు, కుంటలు జల కళను సంతరించుకున్నాయి. భూగర్భ జలం పెరగడంతో రైతులు ఆరుతడి పంటలకు బదులు వరి సాగువైపు మొగ్గుచూపుతున్నారు. కూలీల కొరత వల్ల వరి నాట్లు వేయడంలో జాప్యం అవుతోంది. దీనితోడు కొంత మంది రైతులు కొత్తగా భూ జల మట్టం అధికంగా ఉండటం వల్ల వరి సాగు చేయడం ప్రారంబించారు. 3.30లక్షల ఎకరాల వరకు సాగవుతుందని.. గత యాసంగితో పోలిస్తే ప్రస్తుతం సీజన్లో వరి సాగు గణనీయంగా పెరగనుంది. గత అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే ఇటీవల వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించడం.. రైతులకు చెల్లింపులు త్వరగా చేయడం తదితర కారణాలతో వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో రైతుల ఽవిక్రయించుకున్న ధాన్యానికి డబ్బుల చెల్లింపుల్లో కలెక్టర్, సివిల్ సప్లఈస్ , డీఎస్ఓ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత సీజన్లో 2.86 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ సారి 3.12 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 3.02 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి అయ్యాయి. ఇంకా రాజాపేట, పోచంపల్లి, ఆలేరు మండలాల పరిధిలో వరి నాట్లు కొనసాగుతున్నాయి. మరో 15 రోజుల పాటు వరి సాగు పనులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో వరి సాగు 3.25 లక్షల ఎకరాల నుంచి 3.35 లక్షల ఎకరాల వరకు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫ ఇప్పటికే 3లక్షల ఎకరాల్లో వరినాట్లు ఫ మరో 15 రోజుల్లో నాట్లు పూర్తయ్యే అవకాశం ఫ అంచనాకు మించి సాగుకానున్నట్లు భావిస్తున్న అధికారులుయాసంగి సాగు వివరాలు. (లక్షల ఎకరాల్లో..) సంవత్సరం సాగు విస్తీర్ణం 2023 2.80 2024 2.86 2025 3.02 (ఇప్పటి వరకుసాగు) -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుండాల: పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మోత్కూరు సెక్షన్ ఆఫీసర్ కె.ఎల్లేష్ సూచించారు. గురువారం గుండాల మండలం వెల్మజాల గ్రామంలో రైతులు పడకంటి నరేందర్, పడకంటి శ్రీను, జోలం పాండు వ్యవసాయ భూమిలో పులి సంచరించినట్లు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు పాద ముద్రలను పరిశీలించారు. ఇవి పులిపాదముద్రలే అని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎలేష్ మాట్లాడుతూ రైతులు ఎవరూ రాత్రి వేళల్లో ఒంటరిగా వ్యవసాయ బావుల వద్దకు వెళ్ల వద్దన్నారు. పశువులు, గొర్రెలు, మేకలను ఇళ్ల వద్దకు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట ఫారెస్ట్ అధికారి పి.శ్రీనివాస్, సర్పంచ్ కుర్మిళ్ల కవితశ్రీనివాస్, మాజీ సర్పంచ్ దాస ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పల్లెల్లో డప్పు చాటింపు ఆత్మకూరు(ఎం): చుట్టు పక్కల మండలాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆత్మకూర్(ఎం) మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్లు దండోరా వేయించారు. పోతిరెడ్డిపల్లి, పారుపల్లి, పల్లెపహాడ్, రహీంఖాన్ పేట, కొరటి కల్, టి. రేపాక, ఉప్పలపహాడ్ తదితర గ్రామాల్లో బుధవారం రాత్రి డప్పు చాటింపు చేశారు. దీంతో వ్యవసాయ బావుల వద్ద నుంచి పశువులను తోలుకెళ్లి ఇళ్లవద్దనే కట్టేశారు. గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలకు కాలినడకన, సైకిళ్లపై విద్యార్థులు వెళ్లడంలేదు. అవగాహన కల్పిస్తున్న అధికారులు ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి, పల్లెపహాడ్లో భువనగిరి అటవీ శాఖ అధికారులు గురువారం పర్యటించారు. పులి అడుగుల జాడ కోసం పలు మామిడి తోటలు, పొలాలను పరిశీలించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించారు. ఫారెస్టు అధికారులు డి. మోహన్ బాబు, కె. మల్లేష్, జి. లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లొద్దని, సాయంత్రం 5లోపు పనులు ముగించుకుని ఇంటికి రావాలని సూచించారు. మా అబ్బాయి ఎల్లబోయిన చరణ్ కొరటికల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. గ్రామం నుంచి స్కూల్ రెండు కిలో మీటర్ల దూరం ఉంటుంది. రోజూ సైకిల్పై వెళ్లేవాడు. పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో పాఠశాలకు పంపించడంలేదు. – ఎల్లబోయిన శ్రీశైలం, పోతిరెడ్డిపల్లి. ఫ ఫారెస్ట్ అధికారుల సూచన -
9, 10 తేదీల్లో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు
భువనగిరి: ఈ నెల 9,10 తేదీల్లో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9న స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, చెస్, క్యారమ్, ఇండోర్స్టేడియంలో తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. 10న అథ్లెటిక్స్ పోటీలతో పాటు ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్, కిక్బాక్సింగ్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గ స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు మాత్రమే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు. యాదగిరీశుడి సన్నిధిలో నిత్యకల్యాణంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేశారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. చిన్నమేడారం హుండీల లెక్కింపురాజాపేట : రాజాపేట మండలంలోని చిన్నమేడారం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు గురువారం చేపట్టారు. రూ.5.80 లక్షల నగదు సమకూరగా.. దర్శనాలు, తలనీలాలు, బెల్లం, వివిధ షాపులకు వేసిన వేలం పాటలో రూ.9 లక్షలు వచినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, జాతర నిర్వహణ ఖర్చులు రూ.12 లక్షలు అయినట్లు వెల్లడించారు. క్రీడలతో మానసికోల్లాసంఆలేరురూరల్ : క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని కొలనుపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు సాధన చేస్తే జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగవొచ్చని తెలిపారు. కాగా, ఈ పోటీల్లో సుమారు 650 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మి, హెచ్ఎం వేణుగోపాల్, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ, ఉప సర్పంచ్ గొట్ట జితేందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా అడ్డగింత ఆత్మకూరు(ఎం): ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని పీఏసీఎస్ నుంచి యూరియా బస్తాలను అక్రమంగా తరలిస్తుండగా రైతులు గమనించి గురువారం అడ్డుకున్నారు. గురువారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని పీఏసీఎస్కు యూరియా లోడు వచ్చింది. అంతకు ముందే సోమవారం యూరియా కావాల్సిన రైతులు 200 మంది తమ పేర్లను లిస్టులో రాయించుకున్నారు. అయితే లిస్టులో పేర్లు రాయించుకోని ముగ్గురు రైతులు 30 యూరియా బస్తాలను ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా రైతులు గమనించి నిలదీశారు. దీంతో వారు ట్రాక్టర్లోని 30 యూరియా బస్తాలను అన్లోడ్ చేసి వెళ్లిపోయారు. థంబ్ వేయకుండానే యూరియా బస్తాలను ఎందుకు ఇచ్చారని రైతులు పీఏసీఎస్ సిబ్బందిని నిలదీశారు. ఈ విషయమై సీఈఓ యాస కిరణ్రెడ్డిను వివరణ కోరగా ఆరుగురు రైతులు కలిసి ఒక ట్రాక్టర్ తెచ్చుకుని యూరియా బస్తాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. -
మిర్యాలగూడకు అధిక నిధులు ఇవ్వాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మిర్యాలగూడలో ఆసియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉందని.. ఈ ప్రాంతానికి అధిక నిధులు ఇవ్వాలని రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మహిళలకు రుణాలు అందించి కోటీశ్వరులను చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. మిర్యాలగూడ పెద్ద పట్టణమని ఇక్కడి ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని.. సోనియాగాంధీ తెలంగాణ దేవత అన్నారు. కాంగ్రెస్ మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ విజయం ఖాయం
ఆలేరు: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆలేరులో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు డబ్బుల మయమయ్యాయని తాను ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేసే ఆలోచన లేదని..భవిష్యత్లో దేవుడు,కాలం ఏం నిర్ణయిస్తుందో చెప్పలేనన్నారు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. గొంగిడిపై ప్రభుత్వ విప్ ఫైర్ అభ్యర్థులను బెదిరిస్తున్నట్టు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఖండించారు. యాదగిరిగుట్టలో ఆరుగురు, ఆలేరులో ఆరుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు తనతో టచ్లో ఉన్నట్టు, ఇంటికి వచ్చినట్టు సీసీ ఫుటేజీ ఉందన్నారు. తనకు జూబ్లీహిల్స్లో రూ.40కోట్ల ప్రాపర్టీ ఉన్నట్టు నిరూపిస్తే ఆలేరు ప్రజలకు రాసిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, బ్లాక్ అధ్యక్షుడు యాదగిరిగౌడ్, పట్టణ అధ్యక్షులు ఇజాజ్, సాగర్రెడ్డి, విజయ్కుమార్, జైనొద్దీన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ నాకు ఎమ్మెల్యేగా పోటీచేసే ఆలోచనలేదు ఫ బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు -
కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మనుషులు, ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం సాగర్ ఆయకట్టు కింద ఉందని, 90శాతం రైతులు ఇక్కడ వరి పండిస్తారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 12లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నెల్లికల్లు, వీర్లపాలెం, దున్నపోతులగండి, తోపుచర్ల, కేశవాపురం లిఫ్టులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. కృష్ణా బేసిన్ నుంచి ఎక్కువ నీళ్లు తీసుకుని రైతులకు అందిస్తున్నామన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తున్న ఎమ్మెల్యే
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దౌర్జన్యాలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి ఆరోపించారు. విప్ ఐలయ్య ఆదేశాలతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కంసాని కీర్తి ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి, భయాందోళనకు గురిచేసిన విషయం తెలుసుకున్న గొంగిడి సునిత బుధవారం ఉదయం అభ్యర్థిని కలిసి వివరాలు తెలుసుకొని, ఈ అంశంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బ్లాక్మెయిలింగ్ చేయడంతో పాటు మానసికంగా టార్చర్ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి విరమించుకునేలా చేస్తున్నారన్నారు. అర్ధరాత్రిదాటిన తరువాత అభ్యర్థి కీర్తి స్వామిల ఇంట్లోకి పోలీసులమని గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి క్షుణ్ణంగా తనిఖీ చేసి, స్వామి ఎక్కడున్నాడు ఆయన కావాలని భయబ్రాంతులకు గురి చేశారన్నారు. 11వ వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడిని ఐలయ్య బెదిరింపులకు పాల్పడి పోటీ నుంచి తప్పించారన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన సయ్యద్ బాబాను సైతం పోటీలో ఉండొద్దని, ప్రచారం చేయొద్దని ఫోన్లు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. 10వ వార్డులో బీఆర్ఎస్ తరఫున నిలిచిన ఆవుల మమత సాయి యాదవ్కు రూ.3కోట్లు ఇచ్చి, భయపెట్టి నామినేషన్ విత్డ్రా చేయించారని చర్చ జరుగుతోందన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మండల జనరల్ సెక్రటరీ కసావు శ్రీనివాస్గౌడ్, బాహుపేట సర్పంచ్ కవిడే మహేందర్, బండ సిద్దులు, లింగం యాదవ్, కంసాని స్వామి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి -
సంక్షేమానికే మీ ఓటు
మిర్యాలగూడ : కాంగ్రెస్ పాలనలో పేదలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు.. కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారాలన్నారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో లక్షలాది మందికి రేషన్కార్డులు అందించి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. మిర్యాలగూడ ప్రాంతం ఆసియా ఖండంలోనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిందని అన్నారు. ఇక్కడ అధునాతన రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సన్న వడ్లను మద్దతు ధరకు కొని.. బోనస్ రూ.500 ఇస్తున్నామన్నారు. 25.35లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నామని.. త్వరలో మరో రూ.9వేల కోట్లను విడుదల చేసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామన్నారు. రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం వైఎస్సార్ హయాంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని పదేండ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇళ్లను పేదలకు ఇచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతమని, ఈ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు కట్టించామన్నారు. 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే ఎస్ఎల్బీసీని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరు జానారెడ్డి నమ్మి భాస్కర్రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలను ఆయన మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వాపస్ తీసుకోవాలని భాస్కర్రావు బెదిరిస్తున్నారని.. ‘మా అభ్యర్థులను బెదిరిస్తే భాస్కర్రావు.. నీకు చింతపండు అవుతుంది’ అని హెచ్చరించారు. ఆయన బెదిరింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. సర్పంచ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు అందరూ మనోళ్లే ఉన్నారని.. కౌన్సిలర్లు వేరే వాళ్లు ఉంటే పనిచేయరని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఫ రూ.17,472 కోట్లతో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం ఫ సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం ఫ ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండబెట్టింది ఫ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి
– జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఎల్కేజీ నుంచి ఉన్నత స్థాయి విద్య అన్ని వర్గాల పిల్లలకు అందించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలన్నారు. -
ప్రతి అంశంపై నిశిత పరిశీలన అవసరం
సాక్షి, యాదాద్రి : ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతి అంశంపై నిశిత పరిశీలన అవసరమని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్ మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పోలింగ్కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని పోలింగ్ సామగ్రి సరిగ్గా అందిందా లేదా అన్నది పరిశీలించాలన్నారు. అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను చూసుకోవాలన్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. నిధులు వినియోగించుకోవాలి పీఎంశ్రీ నిధులను పాఠశాలలకు తప్పక వినియోగించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మినీమీటింగ్ హాల్లో పీఎం శ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంశ్రీ పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో యోగా , సైన్స్, గణిత ప్రయోగాలకు అవసరమున్న పరికరాల కొనుగోలు, విద్యార్థులకు విజ్ఞాన, పరిశ్రమల అవగాహన పర్యటనలు, కళలు–హస్తకళల వంటి సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ట్రెజరీ అధికారి మోహన్, అదనపు సాంఘిక సంక్షేమ అధికారి, మండల విద్యాధికారులు, పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
శారాజీపేటలో ఆవుపై పులి దాడి
ఫ ఆందోళన చెందుతున్న ప్రజలు ఫ అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు ఆలేరురూరల్: ఆలేరు మండలం శారాజీపేట గ్రామ శివారులోని దూడల శ్రీధర్కు చెందిన ఓ ఆవుపై మంగళవారం రాత్రి పులి దాడి చేసి చంపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా అటవీశాఖ ఫ్లయింగ్స్క్వాడ్ బాబ్జీరావు, డీఎఫ్ఓ సుధాకర్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పులి చుట్టు పక్కల పది పదిహేను కిలోమీటర్ల పరిధిలోనే సంచరిస్తోందన్నారు. పులిని పట్టుకోవడానికి రెండు యానిమల్ ట్రాకర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి జాడను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. టైగర్ మానిటరింగ్ టీం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. నాలుగు బోన్లు ఏర్పాటు పులి సంచారం నేపథ్యంలో మేకను ఎరగా పెట్టి ఇప్పటి వరకు 4 బోన్లు, 20 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. శారాజీపేటలో ఆవును చంపిన పులి అడుగు జాడలు గొలనుకొండ గ్రామం శివారు వరకు ఉన్నట్లు గుర్తించామన్నారు. థర్మల్ డ్రోన్ల సహాయంతో చుట్టపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇంకెప్పుడు పట్టుకుంటారు? మూడు వారాలకుపైగా పులి సంచరిస్తుంటే ఇంకెప్పుడు పట్టుకుంటారని శారాజీపేటలో అధికారులను స్థానికులు నిలదీశారు. బావుల వద్దకు వెళ్లడానికి జంకుతున్నామని, పనులు చేసుకోలేకపోతున్నామని, ఎక్కడ నుంచి ఎటువైపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నామని చెప్పారు.పల్లెల్లో డప్పు చాటింపురాజాపేట : పులి సంచారం నేపథ్యంలో రాజాపేట మండలంలోని రేణికుంట, రాజాపేట తదితర గ్రామాల్లో సర్పంచ్లు బుధవారం ఉదయం డప్పు చాటింపు వేయించారు. పులి సంచరిస్తుందని, ప్రజలు తెల్లవారిన తరువాతే గ్రామాలు దాటి సాయంత్రం 6 గంటలలోపే ఇంటికి చేరాలని సూచించారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు చప్పుడు చేస్తూ కర్రలు పట్టుకొని గుంపులుగా వెళ్లాలన్నారు. పొలాల చుట్టూ కరెండు తీగలు, ఉచ్చులు పెట్టొద్దని అలా పెట్టి పులి మరణానికి కారణం అయితే జైలు పాలు అవుతారని హెచ్చరించారు. -
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
భువనగిరి(బీబీనగర్): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణ తెలిపారు. బుధవారం బీబీనగర్ మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో సంఘం ముందంజలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పి. శ్రీకాంత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంబటి హరిశివకుమార్, కోశాధికారి కల్లు రమేష్రెడ్డి, గడ్డం జ్ఞానప్రకాష్రెడ్డి, కోల్పుల రమేష్, రచ్చ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలి
రామన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షితమైన సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ చిన్నానాయక్ సూచించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని వార్డులను సందర్శించారు. ఓపీ విభాగంలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో వేర్వేరుగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్లు బి.వీరన్న, రజని, స్వాతీబాయి, మాధవాచారి, నవీన్సింగ్, వీణ, సుమంగలి, హెడ్నర్సులు సువర్ణ, సోలీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయాలి యాదగిరిగుట్ట : ఎస్సీ కార్పొరేషన్కు రూ.12కోట్ల నిధులు మంజూరు చేసి, దళితులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఔటర్ రింగ్ రోడ్డుకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించి, దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మాదిగలకు సంబంధించిన అసైన్డ్ భూములను అమ్ముకునే విధంగా చట్టం చేసి, భూ భారతీ ద్వారా పట్టా పాస్ బుక్కులు మంజూరు చేయాలని కోరారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించి, రూ.5 కోట్లతో వసతి గృహాలు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను కోరారు. యాదగిరి ఆలయంలో మాదిగలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. సదస్సులో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్, మంచాల యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ఉప్పలయ్య, యువసేన రాష్ట్ర అధ్యక్షుడు కూరేళ్ల రమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, బూసి మహేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పాల బిల్లులు చెల్లించాలిభువనగిరిటౌన్ : పెండింగ్లో ఉన్న పాల బిల్లలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాల శీతలీకరణ కేంద్రం వద్ద పాల సంఘం చైర్మన్లు బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాల బిల్లులు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెంకట్రెడ్డి, భిక్షపతి, కోటేష్, నర్సింహులు, విజయ్, గౌరయ్య ఉన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు
నల్లగొండ : ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులే తెలంగాణ జాతిపితలు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదు’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్యతో పాటు ఎంతో మంది ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ అమరులే తెలంగాణ జాతిపితలు కావాలి కానీ కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడని ప్రశ్నించారు. ‘కేసీఆర్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశాడు కానీ నేను మాత్రం మంత్రి పదవికి రాజీనామా చేసిన.. సోనియాగాంధీ నాకు మంత్రి పదవి ఇస్తానన్నా కూడా తెలంగాణ వచ్చిన తర్వాతే మంత్రి పదవి తీసుకుంటాను’ అని చెప్పినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్లో ఉండి మా ప్రభుత్వం పైనే తెలంగాణ కోసం పోట్లాడినం. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ క్రెడిట్ అంతా సోనియాగాందిదే అని అన్నారు. తెలంగాణతో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని, ప్రజలకు జరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో 90 మున్సిపల్ చైర్మన్లు, కాంగ్రెస్ గెలుచుకుంటుందని, 5 కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అందులో నల్ల గొండ మేయర్ స్థానం ఉంటుందన్నారు. నల్లగొండలోని పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బొడ్రాయి చైర్మన్ కందుల నిర్మలమ్మ గౌడ్ ఇంట్లో టీ తాగుతున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డిఫ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారే జాతిపితలు ఫ తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియాదే.. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కనుమరుగు
ఫ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భువనగిరి : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని గంజ్ ఏరియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం దోచుకోవడం తప్ప పదేళ్ల కాలంలో చేసిందేమీ లేదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు పంపకాల కోసం రోడ్డు ఎక్కుతున్నారని, గతంలో దోచుకున్న సొమ్ము కోసం బీఆర్ఎస్ పార్టీలో పంచాయితీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రతిఒక్కరికి వివరించాలన్నారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులతో పరిచయవేదిక ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకులు నర్ల నర్సింగ్రావు, సుర్వి శ్రీనివాస్, పడమటి జగన్మోహన్రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వరరావు, చందా మహేందర్ గుప్తా, యాదిరెడ్డి, రత్నపురం శ్రీశైలం, రాళ్లబండి కృష్ణచారి, సత్యలక్ష్మీ, రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు -
లిఫ్ట్ అడిగి.. క్యాబ్ డ్రైవర్పై కత్తితో దాడి
చిట్యాల : క్యాబ్ డ్రైవర్ను లిఫ్ట్ అడిగిన గుర్తుతెలియని వ్యక్తి కొద్దిదూరం వెళ్లిన తర్వాత కత్తితో డ్రైవర్పై దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. నల్లగొండకు చెందిన షేక్ ఇమ్రాన్ అలీ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి నల్లగొండ నుంచి హైదరాబాద్కు బయల్దేరాడు. మార్గమధ్యలో నార్కట్పల్లి– చిట్యాల మధ్యలో ఓ హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడగడంతో అతడిని కారులో ఎక్కించుకున్నాడు. కారు చిట్యాల శివారులోకి రాగానే సదరు గుర్తుతెలియని వ్యక్తి కత్తితో ఇమ్రాన్ అలీపై దాడి చేయడంతో అతడి పొట్టలో రెండు చోట్ల కత్తిపోట్లు తగిలాయి. అనంతరం ఇమ్రాన్ అలీ వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్ను లాక్కొనేందుకు ప్రయత్నించగా.. అతడు కేకలు వేయడంతో సదరు వ్యక్తి కారులోంచి దిగి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇమ్రాన్ అలీని అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుండగుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా దాడికి గురైన ఇమ్రాన్ అలీపై గతంలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దారి దోపిడీలో భాగంగా జరిగిందా లేదా పాత కక్షలతో ఇమ్రాన్ అలీపై దాడికి తెగబడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి మౌంటెన్ బైకింగ్ చాంపియన్షిప్కు ఎంపికతుర్కపల్లి: తుర్కపల్లి మండలం చౌక్లతండా గ్రామానికి చెందిన భూక్య నిఖిల్ ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు అరుణాచల్ప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి మౌంటెన్ బైకింగ్(ఎంటీబీ) చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. నిఖిల్ కొన్ని సంవత్సరాలుగా సైక్లింగ్లో చురుకుగా పాల్గొంటూ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును నిఖిల్ కలిసి పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన సహకారం అందించాలని వినతి పత్రం అందజేశాడు. -
వీరి ఎన్నిక ఏకగ్రీవం
కోదాడలో ముగ్గురు కోదాడ : కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులు ఏకగ్రీవ మయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ 11వ వార్డు నుంచి మొత్తం 9 మంది నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా దేవరపల్లి మళ్లీశ్వరి మినహా మిగతా 8 మంది అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. 21వ వార్డు నుంచి నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కట్టెబోయిన జ్యోతి మినహా మిగిలిన ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 31వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎర్నేని కుసుమతో పాటు మరో 8 మంది నామినేషన్ దాఖలు చేశారు. కుసుమ మినహా మిగతావారు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కోదాడ మున్సిపాలిటీలో ముగ్గురు మహిళా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే మొదటి సారి. -
అన్నదమ్ముల సవాల్
భూదాన్పోచంపల్లి : పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో అన్నదమ్ములిద్దరూ ఒకే వార్డు నుంచి బరిలో నిలిచారు. 5వ వార్డు బీసీ జనరల్కు రిజర్వు అయ్యింది. దీంతో గతంలో ఇదే వార్డు నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన బాతుక లింగస్వామియాదవ్ ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. లింగస్వామికి సొంత తమ్ముడైన బాతుక శంకర్యాదవ్ను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని 5వ వార్డు నుంచే పోటీ చేయిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ పోటీ పడుతుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. -
టికెట్ వచ్చిందో రాలేదో తెలియక..
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపల్ 48వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పందిరి అనిత, మెరుగు అభిభి నామినేషన్ వేశారు. అయితే ఇద్దరికీ కాంగ్రెస్ బీ ఫాం ఇచ్చారంటూ పుకార్లు రావడంతో పందిరి అనిత మంగళవారం కొద్దిసేపు నామినేషన్ సెంటర్ వద్ద హల్చల్ చేసింది. తనకు టికెట్ వచ్చిందో రాలేదో తెలియాలని పట్టుబట్టి నిరసన వ్యక్తం చేసింది. సుమారు గంటకు పైగా నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే లిస్ట్లో తన పేరు వచ్చే వరకు తాను అక్కడే ఉంటానంటూ భిష్మించింది. చివరికి 48వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరు ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
నిందలు వేస్తే సహించేది లేదు
హయత్నగర్: మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి హయాంలో జరిగిన అవకతవకల కారణంగానే మదర్ డెయిరీకి అప్పుల భారం పెరిగిందని, అవినీతి వాళ్లు చేసి తమపై నిందలు వేస్తే సహించేది లేదని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను తప్ప ఎవరూ మదర్ డెయిరీని నడపరాదని జితేందర్రెడ్డి కుట్ర చేస్తున్నారని, ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు తెస్తానని చెప్పి రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలు నిరూపిస్తేనే సర్వసభ్య సమావేశం పెడతానని, ఎవరి సమక్షంలో విచారిస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో గేదెలు, దాణా కొనుగోలుకు ఇన్సెంటివ్లకు ఇచ్చిన సబ్సిడీల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జితేందర్రెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తానని, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వం నుంచి సహాయం కోరుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నర్సింహారెడ్డి, పాండు, రాంరెడ్డి, జంగయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల వాగ్వాదం రెండు నెలలకు పైగా జీతాలు ఇవ్వడం లేదని మదర్ డెయిరీ ఉద్యోగులు మంగళవారం చైర్మన్, డైరెక్టర్లతో వాగ్వాదానికి దిగారు. పాలు వస్తున్నాయి, పని చేస్తున్నాం, డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు జీతాలు చెల్లిస్తానని చైర్మన్ హామీ ఇచ్చినా ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. ఫ మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి
యాదగిరిగుట్ట: పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏడు రోజుల పాటు వైభవంగా కొనసాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అష్టో త్తర శతఘటాభిషేకంతో ముగి శాయి. ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరం మూలవరులకు, ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. తొలుత ఆలయ ప్రధాన మండపంలో 108 కలశాలను ఒకే చోట పెట్టి పూజించారు. అనంతరం కలశాల ఎదురుగా హోమం నిర్వహించి పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం స్వామి పంచామృతాలను భక్తులకు తీర్థంగా ఇచ్చారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఈఓ భవానీశంకర్, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అధికారులు, వేద పారాయణికులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రద్దు చేసిన నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం వంటి పూజలు బుధవారం పునఃప్రారంభం కానున్నాయి. ఫ పాతగుట్టలో నేటి నుంచి నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం తిరిగి ప్రారంభం -
ఏజ్ జస్ట్ ఎ నంబర్
ఫ మున్సిపల్ బరిలో ముగ్గురు వృద్ధులు మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ ఎన్నికల్లో యువకులకు ధీటుగా వృద్ధులూ బరిలో నిలిచారు. కొండగడప గ్రామంలోని 4వ వార్డు నుంచి దొంతరబోయిన భారతమ్మ 78 ఏళ్ల వయసులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2వ వార్డులో మర్రి మరియమ్మ(74) బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకటో వార్డులో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మోత్కూరు బ్రహ్మాచారి (68) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోటీలో 23ఏళ్ల యవతి మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన బద్దం నిశిత (23) 5వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంటర్ చదువుకున్న ఆమె ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. -
అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీకి 2020లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో 16వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి వెన్రెడ్డి రాజు గెలుపొంది మొదటి చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా.. 16వ వార్డు బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో వెన్రెడ్డి రాజు తన భార్య వెన్రెడ్డి సంధ్యను ఎన్నికల బరిలోకి దింపారు. నాడు వెన్రెడ్డి రాజు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. ఈసారి ఆయన భార్య సంధ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
గెలుపు గుర్రాలకే బీఆర్ఎస్ టికెట్లు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో గెలుపు గుర్రాలకే కౌన్సిలర్ టికెట్లు ఇచ్చామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పేందుకు పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, మహానగరాలకు దీటుగా సూర్యాపేటను తీర్చిదిద్దామన్నారు. పరిశుభ్రంగా ఉన్న సూర్యాపేట పట్టణాన్ని కాంగ్రెస్ పాలకులు రెండేళ్లలో ఆగం చేశారని, 2014కు ముందు.. తర్వాత అన్న రీతిలో సూర్యాపేటలో అభివృద్ధి జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే సూర్యాపేటను జిల్లాగా మార్చుకున్నామని, మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మహాప్రస్థానం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ట్యాంక్ బండ్, బోటింగ్, పార్కులతో ఆహ్లాదాన్ని పెంచామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, వచ్చిన నిధులను వాపస్ పంపిన దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ దేనన్నారు. భారీ మెజార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
నాటకీయ పరిణామాల మధ్య చౌటుప్పల్ 17వ వార్డు ఏకగ్రీవం
చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య ఏకగ్రీవమైంది. వార్డుకు కాంగ్రెస్ నుంచి చింతల సాయిలు భార్య ఉమామహేశ్వరి, పస్తం గంగరాములు భార్య మల్లమ్మ టికెట్ ఆశించారు. పార్టీ అధిష్టానం పస్తం మల్లమ్మను అభ్యర్థిగా ఖరారు చేసింది. దాంతో అలక బూనిన చింతల ఉమామహేశ్వరి ఒక సెట్ నామినేషన్ కాంగ్రెస్ తరఫున, మరో సెట్ బీఆర్ఎస్ తరఫున దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ మల్లమ్మను అభ్యర్థిగా ప్రకటించడంతో మూడు రోజుల క్రితం ఉమా మహేశ్వరి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరింది. ఈ వార్డు నుంచి నామినేషన్ వేసిన మిగతా వారు ఉపసంహరించుకోగా మంగళవారం నాటికి ఇద్దరే మిగిలారు. బీఫామ్ సమర్పించే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చింతల ఉమామహేశ్వరికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అందించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకే బీఫామ్ అందింది. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుల వ్యూహాన్ని బీఆర్ఎస్ నాయకులు పసిగట్టలేక పోయారు. కాంగ్రెస్ నాయకుల వ్యూహం ప్రకారం బీఫామ్ సమర్పించే సమయంలో మల్లమ్మ నేరుగా ఆర్వో వద్దకు వెళ్లి తన నామినేషన్ ఉపసంహరించుకుంది. దాంతో ఉమామహేశ్వరి ఒక్కరే మిగలడంతో అధికారులు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. విషయాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ నాయకులు ఆర్వో కార్యాలయంలోకి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం ఎదురు దాడి చేశారు. 13వ వార్డును సైతం ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన తొర్పునూరి నర్సింహగౌడ్తో నామినేషన్ ఉపసంహరింపజేశారు. మరో ఇద్దరి చేత ఉపసంహరింపజేసేందుకు యత్నించగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి వారిని తన వాహనంలో తీసుకొని వెళ్లిపోయారు. -
మళ్లీ పులి దాడి కలకలం
రాజాపేట : మళ్లీ పులి సంచారం కలకలం రేపింది. రాజాపేట మండలంలో పులి తిరిగిన ఆనవాళ్లు కన్పించడం, ఒక లేగదూడను చంపడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల17న బేగంపేట గ్రామంలో పులి అడుగులను గుర్తించిన విషయం విదితమే. తాజాగా సోమవారం రాత్రి బసంతపురంలో కట్కూరి రమేష్ వ్యవసాయ బావి వద్ద లేగదూడపై దాడి చేసి చంపింది. అక్కడి నుంచి నెమిల మధిర గ్రామం పిట్టలగూడెం శివారులో, లక్ష్మక్కపల్లి గ్రామ సర్పంచ్ ఇండ్ల రాజయ్య వ్యవసాయ పొలంలో పులి అడుగు జాడలను ప్రజలు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఫారెస్టు అధికారులు బసంతపురంలో పులి దాడిచేసి చంపిన లేగదూడను, పిట్టలగూడెం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో రైతులు గుర్తించిన పులి అడుగుల ఆనవాళ్లను యాదాద్రి, సిద్దిపేట జిల్లాల ఫారెస్టు అధికారులు సుధాకర్రెడ్డి, పద్మజ.. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. రమేష్ నాయక్, డి. శ్రీను, బీట్ ఆఫీసర్లు స్వామి, కిషోర్, శేఖర్రెడ్డి, లిఖిత, సెక్షన్ ఆఫీసర్లు మల్లేశం, జి లక్ష్మణ్లు యానిమల్ ట్రాకర్స్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. శ్రీనివాస్పురంలో పులి పాద ముద్రలు ఆలేరురూరల్: ఆలేరు మండలం శ్రీనివాస్పురంలో దడిగోని వ్యవసాయ బావి వద్ద పులి పాదముద్రలను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వచ్చి పరిశీలించి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ పులిని పట్టుకునేందుకు నాలుగైదు రోజులుగా టైగర్ మానిటరింగ్ టీమ్తో కలిసి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట అటవీశాఖ అధికారులు, ఆలేరు సీఐ యాలాద్రి, పోలీసులు ఉన్నారు. పులిని బంధించేందుకు ప్రత్యేక చర్యలు రాజాపేట : పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో బంధించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. రాజాపేట మండలం బసంతపురం గ్రామంలో పులి దాడి చేసి లేగదూడను చంపిన ప్రాంతాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఫారెస్టు అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులిని పట్టుకోవడానికి ధర్మల్ డ్రోన్ ఉపయోగించి పులి సంచరిస్తున్న ప్రదేశాలను వీడియో తీయడం, ట్రాప్ కెమెరా, బోన్ల ఏర్పాటు వంటి అంశాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల నిమిత్తం గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రి వేళలో పశువులను బయటికి వదలవద్దని పశువుల పాకలో వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానిక గ్రామ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రదీప్కుమార్, ఎంపీడీఓ నాగవేణి, ఆర్ఐ నర్సింహులు, గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ ఉన్నారు.బసంతపురంలో పులి దాడితో మృతి చెందిన లేగదూడను పరిశీలిస్తున్న అధికారులులక్ష్మక్కపల్లి గ్రామంలో పులి పాదముద్రఫ రాజాపేట మండలం బసంతపురంలో లేగదూడపై దాడి ఫ మరో మూడు గ్రామాల్లో అడుగు జాడలు -
ఇక.. సమరమే!
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్పీల నుంచి ఆశావహులు సమయం ఎక్కువ లేకపోవడంతో మొదటగా నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆయా పార్టీల వద్దకు వెళ్లి.. ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ సర్వేలతో అభ్యర్థులను గుర్తించగా.. బీఆర్ఎస్, బీజేపీలు సైతం గెలిచే అభ్యర్థుల కోసం వేచిచూశారు. ఈ క్రమంలోనే రాజకీయ సమీకరణలు, ఆర్థిక, ప్రజాబలం తదితర కోణాల్లో అభ్యర్థులను ఆయా పార్టీలు తేల్చాయి. సోమవారం అభ్యర్థులను ప్రకటించి.. మంగళవారం బీఫాంలు అందించారు. దీంతో మున్సిపల్ కార్యాలయాలు నామినేషన్లు ఉపసంహరించుకునే అభ్యర్థులతో పాటు బీఫాంలు సమర్పించే వారితో రద్దీగా మారాయి. సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. మంగళవారం సాయంత్రం వరకు నాటకీయ పరిణామాల మధ్య ఉపసంహరణలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 104 వార్డుల్లో రెండు ఏకగ్రీవం కాగా 353 మంది బరిలో నిలిచారు. అత్యధికంగా భువనగిరిలో 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీలో ఉన్నారు. అభ్యర్థులు ఎవరో తేలడంతో ఇక ప్రచారం ఊపందుకోనుంది. 104 వార్డులకు రెండు ఏకగ్రీవం జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీల్లోని 104 వార్డులకు జనవరి 29న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. మూడు రోజుల్లో ఆశావహుల నుంచి మొత్తం 841 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా పార్టీలు తమకే టికెట్ ఇస్తాయని ఆశించినా.. పలు సమీకరణలతో సాధ్యం కాలేదు. దీంతో బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి అవకాశం కావడంతో నేతల హామీలు, ప్రలోభాలు, బుజ్జగింపులు, బెదరింపులు... ఇలా అన్నిరకాల ప్రయత్నాలతో దిగివచ్చి మున్సిపల్ కార్యాలయాలకు క్యూకట్టి మధ్యాహ్నం మూడు గంటల లోగా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సాయంత్రం అధికారులు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితాలను వెల్లడించారు. చౌటుప్పల్, యాదగిరిగుట్టలో ఒక్కో వార్డు చొప్పున ఏకీగ్రీవం కాగా ఇక 102 వార్డులకు 353 మంది బరిలోనిలిచారు. వీటికి ఈనెల 11న పోలింగ్ జరగనుంది. బుజ్జగింపులు.. అలకలు.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా సోమవారం ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. అప్పటి వరకు తమకే టికెట్ రానుందని ఆశించిన వారు నిరాశకు గురై అలకబూనారు. వీరిని బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగి కొన్నిచోట్ల ఎలాంటి వివాదాలు లేకుండా సద్దుమణిగేలా మంతనాలు చేశారు. నామినేషన్న్ దాఖలు చేసిన కొందరు తగ్గేది లేదని తేల్చి చెప్పి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. యాదగిరిగుట్ట, చౌటుప్పల్లో తమ పార్టీ అభ్యర్థులను కొనుగోలు చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఊపందుకోనున్న ప్రచారం.. మున్సిపల్ బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. పార్టీల గుర్తులే అభ్యర్థులకు రానుండడంతో ఓటర్ల వద్దకు క్యూకట్టనున్నారు. రాత్రింబవళ్లు ఓటర్లను కలిసేలా అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎక్కువ సమయం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లోనూ ప్రచారం చేయనున్నారు. తమ వార్డు పరిధిలో ఉన్న ఓటర్ల జాడను తెలుసుకునే పనిలో పడ్డారు. మద్యం పార్టీలు మొదలయ్యాయి. బరిలో 353 మంది ఫ అత్యధికంగా భువనగిరిలో 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది ఫ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఫ 104 వార్డుల్లో చౌటుప్పల్, యాదగిరిగుట్టలో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవం మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు మొత్తం ఆలేరు 12 12 12 12 04 40 భువనగిరి 35 34 30 31 33 128 చౌటుప్పల్ 20 19 14 14 11 58 మోత్కూరు 12 11 11 12 15 49 పోచంపల్లి 13 13 13 11 03 40 యాదగిరిగుట్ట 12 10 10 11 07 38 మొత్తం 104 99 90 91 73 353 -
టీశాట్ పాఠం.. ఉత్తమ ఫలితాలకు ఊతం
భువనగిరి: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) టీ శాట్ ద్వారా ప్రత్యేకంగా పాఠాలను ప్రసారం చేసే కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. ఇది ఈనెల 5వ తేదీరకు కొనసాగనుంది. ఇప్పటికే జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 200 సైకిళ్లను అందజేస్తామని ఇప్పటికే కలెక్టర్ హనుమంతరావు ప్రకటించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్ర 4.30 వరకు.. టీ శాట్ ద్వారా రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ప్రత్యేక పాఠాలను విషయ నిపుణులు బోధిస్తారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భౌతిక, జీవశాస్త్రం, ఇంగ్లిష్, హిందీ, బోధన పూర్తి కాగా ఈ నెల 4వ తేదీన గణితం, తెలుగు, సాంఘిక శాస్త్రం, ఉర్దూ భాషలో గణిత, భౌతిక, జీవ శాస్త్రం, సాంఘిక శాస్త్రాల పై పాఠాలు ప్రసారం చేయనున్నారు. 180 పాఠశాలల్లో.. జిల్లా వ్యాప్తంగా 180 ప్రభుత్వ పాఠాశాలలు ఉండగా వీటిలో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 5464 మంది ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాదించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా కలెక్టర్ విద్యాశాఖ సమన్వయంతో వినూత్న కార్యక్రమాలను అమలుచేశారు. దీంతో గత సంవత్సరం పదో తరగతి ఫలితాలలో రాష్ట్రంలో జిల్లా 7వ స్థానంలో నిలిచింది. 2025–26 సంవత్సరానికి గత సంవత్సరం కంటే రాష్ట్రంలో వచ్చిన స్థానాన్ని మరింతగా మెరుగుపర్చుకునేందుకు తాజాగా జట్టు అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనికి తోడు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో టీశాట్ ద్వారా ప్రసారం చేస్తున్న పాఠాలతో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదం కానున్నాయి. జిల్లాలో గతంలో సాధించిన ఉత్తమ ఫలితాల వివరాలు సంవత్సరం శాతం రాష్ట్రంలో స్థానం 2021–22 93.61 13 2022–23 80.97 23 2023–24 90.44 25 2024–25 97.80 7 పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో టీ శాట్ ద్వారా ప్రత్యేకంగా పాఠాలు ప్రసారం చేస్తుండడం వల్ల విద్యార్థుల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – కె సత్యనారాయణ, డీఈఓ ఫ పదో తరగతి విద్యార్థులకు టీశాట్ ద్వారా పాఠాల ప్రసారం ప్రారంభం ఫ 5వ తేదీ వరకు నిర్వహణ ఫ 5,464 మంది విద్యార్థులకు ప్రయోజనం -
కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోంది
యాదగిరిగుట్ట: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తోందని, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమతకు రూ.3కోట్లు ఇచ్చి నామినేషన్ విత్ డ్రా చేయించారని బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమత నామినేషన్ ఉపసంహరించేందుకు నగదు ఇచ్చారని, ఇతర బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పట్టణమంతా తిరుగుతూ బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఐలయ్యకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్లు చేయడంతో పాటు ఆయన అనుచరులను ఇళ్లకు పంపించి నగదు ఆశ చూపుతున్నారన్నారు. 11వ వార్డు అభ్యర్థి సయ్యద్ బాబా, 12వ వార్డు అభ్యర్థి కంసానీ కీర్తి స్వామి, 5వ వార్డు అభ్యర్థి మానుపాటి పరుశరాములును బెదిరింపులకు పాల్పడ్డారని, నామినేషన్ ఉసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. 11వ వార్డు అభ్యర్థికి కాంగ్రెస్కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ ఫోన్ చేసి విత్ డ్రా చేసుకుంటే నగదు ఇప్పుడే మాట్లాడి అప్పగిస్తామని ఆఫర్ చేసినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి డబ్బులకు లొంగలేదన్నారు. యాదగిరిగుట్ట పట్టణ ఓటర్లు ఆలోచించి నిజాయితీగా అభివృద్ధి చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. కాగా.. నమ్మిన వ్యక్తులే పార్టీకి ద్రోహం చేస్తున్నారని ప్రెస్మీట్ సమయంలో గొంగిడి మహేందర్రెడ్డి కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, నాయకులు ఇమ్మడి రాంరెడ్డి, తోటకూరి బీరయ్య, గంగసాని నవీన్కుమార్, శారాజీ రాజేష్, కవిడే మహేందర్, నర్సింహగౌడ్, వెంకటేష్గౌడ్, రమేష్, దావూద్, కరుణాకర్, సతీష్రాజ్ తదితరులున్నారు. ఫ బీఆర్ఎస్ అభ్యర్థికి రూ.3కోట్లు ఇచ్చి నామినేషన్ ఉపసంహరింపజేశారు ఫ బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి ఆరోపణ -
ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం
భువనగిరి: ఎన్నికల నిర్వహణంలో అధికారుల పాత్రకీలకమైందని అదనపు కలెక్టర్ భాస్కర్రావు పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో పీవో, ఏపీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విషయంలో పీవోలు, ఏపీవోలకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి భూదాన్పోచంపల్లి: ప్రణాళికాబద్ధంగా చదువుకొని పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యామ్సుందర్ సూచించారు. మంగళవారం భూదాన్పోచంపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ను పరిశీలించి చదువులో వెనుకబడిన విద్యార్థినుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను చదువులో మరింత ప్రోత్సహించాలని సూచించారు. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకొని పౌష్టికాహారం అందించాలని కోరుతూ రూ.1000ల నగదును అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యాదగిరీశుడి సేవలో విజయేంద్ర ప్రసాద్యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ప్రముఖ రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువును దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం విజయేంద్ర ప్రసాద్కు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈఓ భవానీశంకర్ లడ్డూ ప్రసాదం అందించారు. నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలియాదగిరిగుట్ట రూరల్ : గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలని జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకర్ సూచించారు. మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మండలంలోని చొల్లేరు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకులను నెలలో మూడు సార్లు బ్లీచింగ్తో శుభ్రం చేయాలన్నారు. పైప్లైన్లకు లీకేజీలు ఉంటే సరి చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అంతకు ముందు గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఇంట్రా ఏఈఈ ప్రజ్ఞ, గ్రిడ్ ఏఈఈ గణేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, సర్పంచ్ చిన్నం మమత, సిబ్బంది ఉన్నారు. -
కౌంటింగ్కు పటిష్ట భద్రత
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు. మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ను శనివారం డీఎస్పీ రాజశేఖర్రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించక ముందే ఆ పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయి. పట్టణంలోని 14వ వార్డు బీసీ జనరల్కు రిజర్వ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు స్థానిక నాయకులు నామినేషన్ వేశారు. మాజీ వైస్చైర్మన్ కందుల కోటేశ్వర్రావు గతంలో పోటీ చేసిన 6వ వార్డు ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. దాంతో ఆయన 14వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దాంతో ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు తమ వార్డుకు చెందిన వారిలో ఎవ్వరికిచ్చినా పర్వాలేదు గానీ వేరే వార్డు వారికి టికెట్ ఇవ్వవద్దంటూ నిరసన తెలిపారు. రామినేని శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమైన నాయకులు లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సమావేశంలో నాయకులు ఈదులు కృష్ణయ్య, వెంకట్రెడ్డి, పట్టాభిరెడ్డి, జైపాల్రెడి పాల్గొన్నారు. -
వార్షిక బ్రహ్మోత్సవాల్లో పారితోషికం పెంచాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో పారాయణదారులకు పారితోషికం పెంచాలని కోరుతూ ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలకు శ్రీవైష్ణవ సమాఖ్య అధ్యక్షుడు కారంపుడి నరసింహాచార్యులు, ఉపాధ్యక్షుడు ముడుంబై గిరిధర్, ప్రధాన కార్యదర్శి వుండ్రకొండ కిరణ్కుమార్లు శనివారం వినతి పత్రం అందజేశారు. సరైన సదుపాయాలు కూడా అందించాలన్నారు. అంతే కాకుండా ప్రభాతభేరీ, భోజన సదుపాయాలపై దృష్టి పెట్టాలని కోరారు. -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శనివారం ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ మూర్తులకు నిజాభిషేకం జరిపించి, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు భక్తుల నడుమన చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ద్వార బంధనం చేశారు. -
గుట్టలో చాగంటి ‘నృసింహ వైభవం’
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు నృసింహ వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. యాదగిరీశుడిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ సాంస్కృతిక వేదికపై నృసింహస్వామి వైభవంపై ఆయన ప్రవచనం చేశారు. అంతకుముందు చాగంటి కోటేశ్వరరావుకు కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి స్వాగతం పలికారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యభువనగిరి(బీబీనగర్) : కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీబీనగర్ మండలంలోని రావిపహాడ్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావిపహాడ్ గ్రామానికి చెందిన మైలారం శంకరయ్య(35) కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శంకరయ్య చాలాసేపటి వరకు ఇంట్లోకి తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య నవనీత బయటకు వెళ్లి చూడగా ఇంటి వరండా పైకప్పుకు చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. చుట్టుపక్కల వారి సహాయంతో శంకరయ్యను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణంచౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణ కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాజా ఫయాజుద్దీన్(35) హైదరాబాద్లోని టోలిచౌకీ ప్రాంతంలో నివాసముంటున్నాడు. శనివారం బైక్పై నల్లగొండకు బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివారులో ఆరెగూడెం క్రాస్రోడ్డు వద్ద ఓ లారీని డ్రైవర్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా యూటర్న్ చేశాడు. వెనుకనే వస్తున్న ఫయాజుద్దీన్ బైక్ వెళ్లి లారీకి తగలడంతో రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు మహమ్మద్ ఖాజా ఫహీముద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. టిప్పర్ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతిభువనగిరి(బీబీనగర్) : టిప్పర్ను వెనుక నుంచి ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొనడంతో లారీలో కూర్చున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామం నుంచి బీబీనగర్ వైపు వస్తున్న టిప్పర్ను బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో కూర్చున్న బాలే(40), ఒరిస్సా రాష్ట్రానికి చెందిన హరిలాల్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం బీబీనగర్ ఎయిమ్స్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బాలేం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నలక్ష్మాపురంలో పులి అడుగు జాడ ఫ ఽద్రువీకరించిన ఫారెస్ట్ అధికారులు తుర్కపల్లి : మండలంలోని చిన్నలక్ష్మాపురం గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని దూబల ధర్మారెడ్డి బావి వద్ద పులి అడుగు జాడలను శనివారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చిన్నలక్ష్మాపురం, పొట్టిమర్రితండా, గోపాలపురం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అడవికి ఆనుకొని ఉన్న బావుల వద్దకు, పశువులను మేపేందుకు ఒంటరిగా వెళ్లవద్దని పేర్కొన్నారు. పులి కదలికపై నిరంతరం నిఘా కొనససాగిస్తున్నామని తెలిపారు. వాసాలమర్రి గ్రామ శివారులోని మర్రిచెట్టు వద్ద పెద్దపులి కనిపించినట్లు టిప్పర్ డ్రైవర్ తెలిపారు. వాసాలమర్రి పెట్రోల్ బంక్ సమీపంలోని నాగదేవత గుడి వద్ద అడవిపందిని వేటాడిన అనంతరం దయ్యంబండ వైపునకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల కిత్రం వాసాలమర్రి సమీపంలోని తిరుమలపురం అడవుల నుంచి శ్రీనివాస్పురం వైపునకు పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే అదే మార్గంలో తిరిగి వెనక్కి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు గమనించి వివిధ సమస్యల పై అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరిటౌన్ : దివ్యాంగుల ఉపకరణాల కోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె. నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు గడువును వచ్చె నెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖా స్తులు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య రక్షణకు టీకా భువనగిరి: జిల్లా వ్యాప్తంగా వైద్యులు, సిబ్బందికి ఆరోగ్య రక్షణ కోసం హెపటైటిస్బీ టీకాకు సంబంధించి మొదటి డోసు శనివారం వేశారు. హెపటైటిస్ వ్యాది ఎక్కువగా సాధారణ ప్రజలకంటే వైద్యసేవలందించే వారికే సోకే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యులు, సిబ్బందికి హెపటైటిస్ టీకా అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 21ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 143 సబ్ సెంటర్లలో పనిచేస్తున్న 642 మంది హెల్కేర్ వర్కర్స్కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో హెపటైటిస్ టీకాకు సంబందించి మొదటి డోసు ఇచ్చారు. పూర్వ విద్యార్థుల సహకారం అభినందనీయంమోటకొండూర్ : పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారం అందించడం అభినందనీయమని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. మోటకొండూర్ మండలంలోని చాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 130వ వార్షికోత్సవాన్ని స్థానిక స్కూల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో ఎలక్ట్రిక్ కేబుల్, బోర్ మోటార్, కంప్యూటర్, కళావేదిక నిర్మాణం, బెంచీలు, ప్రొజెక్టర్, పాఠశాలకు రంగులతో చిత్రాలు వేయించి కొత్త శోభను తీసుకువచ్చారు. అనంతరం ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు శాలువాలు మెమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మోర బాలగంగాధర్రెడ్డి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఎండీ టీవి చౌదరి, ఎస్ఐ అశోక్, జెక్క రోషిరెడ్డి, బేతి వెంకటేశ్వర్లు, సిగ విజయ్ గౌడ్, గ్రామసర్పంచ్ ఆకుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సమగ్ర విచారణ చేయాలని సీఎంకు లేఖయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉద్యోగులు, అధికారుల అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. ఇటీవల యాదగిరి క్షేత్రంలో జరిగిన బంగారు, వెండి డాలర్ల అపహరణపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, నాయకులు ఈశ్వర్రెడ్డి, ఉస్మాన్ షరీఫ్, సీస శ్రీనివాస్, మల్లయ్య, జానీ, శ్రీశైలం, నగేష్, అనిల్ తదితరులున్నారు. -
ఫామ్ ఎ, బి అంటే ..
భువనగిరిటౌన్ : ఎన్నికల సమయంలో ఫామ్–ఎ, బి–ఫామ్ పేర్లు వినిపిస్తుంటాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఈ ఫారం అందించాల్సి ఉంటుంది. ఎ– ఫామ్ రాజకీయ పార్టీ తన అభ్యర్థిగా ఎంపిక చేసిన వారికి బి–ఫామ్ అందిస్తారు. అయితే ఆ పార్టీ తరఫున బి–ఫామ్ అందించే వ్యక్తికి ముందుగా ఫామ్–ఎ అందిస్తారు. పార్టీ నుంచి ఫామ్–ఎ అందుకున్న వ్యక్తి మాత్రమే బి–ఫామ్ జారీ చేసేందుకు అర్హత కలిగి ఉంటాడు. అయితే సదరు వ్యక్తి పార్టీ నుంచి తనకు లభించిన ఫామ్–ఎను ఎన్నికల అధికారులకు అందించాల్సి ఉంటుంది. బి–ఫామ్ గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే అని తెలుపుతూ ఇచ్చేదే బి–ఫామ్ నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని ఇస్తేనే పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమితులైన ప్రతినిధుల ద్వారా బి–ఫామ్ని అందిస్తారు. మున్సిపల్ బరిలో మాజీ సర్పంచ్లుకోదాడ : మున్సిపాలిటీ ఎన్నికల బరిలో మాజీ సర్పంచ్లు, వారి సతీమణులు పోటీ పడుతున్నారు. కోదాడ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సర్పంచ్లుగా పని చేసిన ఎర్నేని బాబు, ఎర్నేని కుసుమతో పాటు గతంలో తమ్మర సర్పంచ్గా పనిచేసిన సామినేని ప్రమీల, కొమరబండ సర్పంచ్గా పని చేసిన సంపెట రవి ప్రస్తుతం కౌన్సిలర్లుగా నామినేషన్ దాఖలు చేశారు. దాంతో పాటు మాజీ సర్పంచ్లు పారా సీతయ్య సతీమణి సత్యవతి, వాడపల్లి వెంకటేశ్వర్లు సతీమణి రంగమ్మ కూడా నామినేషన్ వేశారు. -
పులి దాడిలో రెండు ఆవులు, లేగ దూడ చనిపోయాయి
గ్రామ శివారులో పశువులను మేపుతుండగా పులి వచ్చి పశువులపై దాడి చేసింది. లేగ దూడను చంపింది. పులిని చూసి ఊళ్లోకి పరుగెత్తాను. నాతోపాటు మా రెండు ఆవులు అటవీ పాంత్రంలోకి పరుగులు తీశాయి. వాటిని కూడా పులే చంపి తిన్నదని అధికారులు సమాచారం ఇచ్చారు. – గొట్టి శ్రీశైలం, రైతు, దత్తాయిపల్లి, తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులిని బంధించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పులి ఎక్కడెక్కడ తిరుగుతుందో అటవీ శాఖ గుర్తించి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. – సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్, దత్తాయపల్లి -
కమణీయం.. పూర్వగిరీశుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా జరిపించారు. గజవాహనంపై స్వామివారిని, ప్రత్యేక పల్లకీపై శ్రీలక్ష్మి అమ్మవారిని అధిష్ఠించి ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తూ కల్యాణ మండపానికి తీసుకొచ్చి కల్యాణ తంతు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం హనుమంత వాహనంపై... బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8గంటలకు నిత్య ప్రబంధ పారాయణములు, నిత్య హవనములు, మూల, మూర్తిమంత్ర అనుష్టానములు, హవనం పూజలు జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవారికి తిరుమంజన మహోత్సవం నిర్వహించారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని ఆలయ పుర వీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగించారు. ఆస్థాన మండపంలో హనుమంత వాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. నేడు రథోత్సవం.. ఆదివారం ఉదయం 8గంటలకు హవనం పూజలు నిర్వహిస్తారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. రాత్రి 8గంటలకు రథోత్సవం జరిపించనున్నారు. ఫ హనుమంత వాహనంపై స్వామి ఊరేగింపు ఫ నేడు దివ్య విమాన రథోత్సవం -
భయంగా ఉంది
తిరుమలపురం గ్రామ సమీపంలోని పొలాల వద్ద పులి తిరుగుతోందన్న సమాచారం గ్రామస్తుల్లో కలకలం రేపింది. గ్రామస్తులం గుంపులు గుంపులుగా తిరుగుతున్నా భయం తొలగడం లేదు. ప్రజల ప్రాణ రక్షణకు అధికారులు అన్నీ గ్రామాల్లో పహారా ఏర్పాటు చేయాలి. – డొనికెని వెంకటేష్, తిరుమలపురం మండల పరిధిలో సంచరిస్తున్న పులితో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే పులిని అడవుల్లోకి తరలించాలి. లేదంటే సురక్షితంగా పట్టుకోవాలి. పులి దొరికేంత వరకు గ్రామాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలి. – చిలుక మల్లయ్య, రైతు గోపాలపురం మా బావి దగ్గర పులి పాదముద్రలు కనిపించాయి. రైతులం ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులను బయటకు పంపాలంటేనే భయమేస్తుంది. ఏ పనికీ పోలేని పరిస్థితి నెలకొంది. ఈ పులిని ఎప్పుడు బంధిస్తారో ఏమో అర్థంకావడం లేదు. – నర్లేంగల రమేష్, రైతు ఇబ్రహీంపురం -
దేశంలో మొదటగా ‘పేట’లోనే..
సూర్యాపేట : తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరించే వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2004లో దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీ అవార్డును అందుకుంది. సూర్యాపేటలో అనుసరించిన ఈ విధానాన్ని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని మున్సి పాలిటీల్లో అమలు చేస్తున్నారు. వివిధ విభా గాల్లో ఉత్తమ పనితీరు ప్రదర్శించడంతో మరో మూడు జాతీయ అవార్డులు అందుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో వినూత్న విధానాలు అమలు చేస్తూ దేశవ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించింది. దేశంలో ఏ మున్సిపాలిటీ అమలు చేయని విధంగా తడి, పొడి చెత్త విధానాన్ని మొదటి సారిగా సూర్యాపేటలో అమలు చేశారు. దాంతో పాటు దానిని పకడ్బందీగా నిర్వహించడం, సేకరించిన చెత్తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతానికి తరలించడం వంటి చర్యల ద్వారా ఈ విధానం జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది. దాంతో పాటు సుప్రీం కోర్టు కూడా మున్సిపాలిటీ కృషిని ప్రసంసించింది. జుట్టుకొండ సత్యనారాయణ రెండు పర్యాయాలు (1995– 2000, 2000–2005 వరకు) బీజేపీ కౌన్సిలర్గా గెలిచిన టీడీపీ మద్దతుతో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా పని చేశారు. ఆయన రెండో సారి చైర్మన్గా ఎన్నికై న సమయంలో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. విదేశాల్లో జరుగుతున్న పట్టణాభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు 2వేల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో కూడిన బృందాన్ని ఽథాయిలాండ్, సింగపూర్, బ్యాంకాక్, ఇండోనేషియాకు పంపించింది. ఈ బృందం 15 రోజుల పాటు పర్యటించింది. దాంతో పాటు ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్, డ్రింకింగ్ వాటర్, పట్టణ ప్రగతిని పరిశీలించేందుకు 2002లో చైనా, హంకాంగ్, థాయిలాండ్ దేశాలకు బృందాన్ని పంపించింది. ఈ రెండుసార్లు కూడా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా ఉన్న జుట్టుకొండ సత్యనారాయణకు అవకాశం దక్కింది. వివిధ దేశాల్లో పట్టణాభివృద్ధిని పరిశీలించి వచ్చిన జుట్టుకొండ సత్యనారాయణ సూర్యాపేట మున్సిపాలిటీని పరిశుభ్రంగా మార్చేందుకు చెత్త సేకరణ చేయాలని నిర్ణయించారు. అందులోనూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వీధులను పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా అప్పట్లో రూ.50 లక్షల నిధులతో 8 ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. అప్పటికి మున్సిపాలిటీలో ఉన్న 100 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు మరో 150 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. వీతో పట్ణణంలోని ప్రతి వీధికి, ప్రతి ఇంటికీ ట్రాక్టర్లో తిరుగుతూ విజిల్ వేస్తూ మరీ తడి, పొడి చెత్తలను సేకరించారు. ఇందుకోసం ప్రతి ఇంటికి రెండు రకాల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. దాంతో పాటు పచ్చదనం, పరిశుభ్రత వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేసిన సూర్యాపేట మున్సిపాలిటీకి 2004లో జాతీయ ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు దక్కింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చేతుల మీదుగా అప్పటి కమిషనర్ ఖాదర్సాబ్ అవార్డును అందుకున్నారు. తడి, పొడి చెత్త విధానంలో సూర్యాపేట మున్సిపాలిటీ చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. సుప్రీం కోర్టు కూడా నూతన పారిశుద్ధ్య విధానం బాగుందని, సూర్యాపేట దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రసంశించింది. దేశంలోని అన్ని మున్సిపాలిటీలు ఇదే విధానాన్ని అమలు చేసి పరిశుభ్రతను పాటించేలా చూడాలని సూచించింది. దాంతో ఉమ్మడి రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మున్సిపాలిటీల బృందాలు సూర్యాపేటకు వచ్చి ఇక్కడ అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేశాయి. ఒక సంవత్సర కాలంలోనూ సుమారు 200 బృందాలు సూర్యాపేటలో పర్యటించాయి. ఫ ఆనాటి చైర్మన్ జుట్టుకొండ వినూత్న ఆలోచన ఫ 2004లో మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం ఫ సూర్యాపేటను సందర్శించిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు -
వీడని పులి భయం
తుర్కపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం పులి.. ఈ పేరు వింటేనే ప్రజలు వణికి పోతున్నారు. రెండు వారాలుగా తుర్కపల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తుందో, ఎవరి మూగజీవాలపై దాడి చేస్తుందో అంతుచిక్కని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో తుర్కపల్లి మండలంలోని ప్రభావిత గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తుర్కపల్లి: పులి సంచారం తుర్కపల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేసి చంపుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈనెల 17న తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపురం గ్రామ శివారులో పులి సంచరించినట్టు ఆనవాళ్లు గుర్తించారు. అదేరోజు గ్రామంలో మాటూరి కృష్ణకు చెందిన లేగ దూడపై దాడి చేసి చంపింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పక్కపక్క పొలాల రైతులు కలిసి కర్రలు పట్టుకొని ఉదయం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి సాయంత్రం 4గంటల లోపే ఇళ్లకు చేరుకుంటున్నారు. బావులు, రహదారుల వెంట ఏదైనా అలికిడి జరిగినట్లు సమాచారం వస్తే వెంటనే సుమారు 20 మంది యువకులు కలిసి కర్రలతో వెళ్లి చూసివస్తున్నారు. ఊరి బయట పహారా ఈనెల 20, 21 తేదీల్లో దత్తాయిపల్లి శివారులో రైతు గొట్టి శ్రీశైలానికి చెందిన లేగదూడతో పాటు రెండు ఆవులను చంపింది. పులిసంచరిస్తోంది.. బావుల వద్దకు వెళ్లవద్దని గ్రామంలో సర్పంచ్ కరుణాకర్ టాంటాం వేయించాడు. అడవులకు దగ్గరగా ఉన్న బావుల వద్దకు ఐదారుగురు రైతులు కలిసి వెళ్తున్నారు. రైతులు బావుల వద్దకు వెళ్ల కుండా సాయంత్రం 5గంటల నుంచి ఆరు గంటల వరకు గ్రామ సమీపంలోని రహదారి వెంట సర్పంచ్, యువకులు పహారా కాస్తున్నారు. అటవీ అధికారులు రోజూ వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. మధ్యాహ్నం 3గంటలైతే బయటికి రాని జనం తిరుమలపురంలో నాలుగు రోజుల క్రితం ఐనాల మహేందర్రెడ్డి బావి వద్ద పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి పులి కాలిగుర్తులే అని నిర్ధారించారు. అస్మాయికుంటు గుట్టల్లో పులి ఉండొచ్చని తిరుమలపురం, శ్రీనివాసపురం, కొండాపురంలలో అధికారులు టాంటాం వేయించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 3గంటలు అయ్యిందంటే ఎవరూ ఇళ్లనుంచి బయటి రావడంలేదు. పశువులను పొలాల నుంచి ఇళ్ల వద్దకే తీసుకొస్తున్నారు. ఫ ఇప్పటికే పులి దాడిలో రెండేసి ఆవులు, లేగదూడల మృతి ఫ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనం ఫ ఐదారుగురు కలిసి పొలాల వద్దకు వెళ్తున్న రైతులు ఫ సాయంత్రం అయ్యిందంటే గడపదాటని వైనం -
హైస్పీడ్ ఉంటుందా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలోని కీలక రైల్వే ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు వస్తాయో నేడు తేలనుంది. ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఏటా బడ్జెట్ సమయంలో జిల్లాకు కావాల్సిన రైల్వే లైన్లు, రైళ్ల విస్తరణకు ఉమ్మడి జిల్లా ఎంపీలు విజ్ఞప్తులు చేస్తున్నా కేటాయింపులు పెద్దగా ఉండటం లేదు. ఈ సారైనా ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందో అన్న అంచనాల్లో ప్రజలు ఉన్నారు. శంషాబాద్ నుంచి విశాఖపట్నం హైస్పీడ్ రైల్వే కారిడార్కు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను నిర్వహించింది. ఇది ఆచరణలోకి వస్తే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్ శంషాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విశాఖపట్నానికి దాదాపు 4 గంటల్లో చేరుతుంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేని వివిధ ప్రాంతాలకు రైల్వే సౌకర్యం ఏర్పడనుంది. ఒకలైన్ శంషాబాద్ నుంచి గట్టుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట జిలా కేంద్రం, కోదాడ, జగ్గయ్యపేట, విజయవాడ మీదుగా విశాఖపట్టణం చేరనుండగా, మరొక లైన్ విశాఖపట్టణం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూల్కు చేరేలా రైల్వే లైన్కు సర్వే చేపట్టింది. అయితే ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన పనులకు నిధులను కేటాయించస్తుందా? లేదా? నేడు తేలనుంది. హైదరాబాద్ – విజయవాడ మధ్యలో జాతీయ రహదారి వెంట రైల్ ప్రతిపాదనలకు కూడా ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. గతంలో నల్లగొండ ఎంపీగా పని చేసిన మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పలుమార్లు కేంద్రానికి, రైల్వే బోర్డుకు, దక్షిణ మధ్య రైల్వేకు దీనిపై లేఖలు రాశారు. ఆ తరువాత వచ్చిన ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి కూడా జాతీయ రహదారి వెంట రైల్ మార్గం కావాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించిన సర్వేకు ఈసారైనా చర్యలు చేపడతారా? లేదా? చూడాల్సిందే. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్–2లో 33 కిలోమీటర్ల పొడవునా విస్తరించేందుకు చర్యలు చేపట్టినా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అలాగే ఎంఎంటీఎస్ను జనగామ వరకు పొడగించాలనే డిమాండ్పై ఇప్పటికై నా స్పందిస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది. సికింద్రాబాద్ – యాదాద్రి–కాజిపేట మధ్య 3వ, 4వ లైన్లు 2026 జనవరిలో నోటిఫై అయ్యాయి. కానీ వాటికి సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. వాటికి సంబంధించిన చర్యలు చేపట్టాల్సి ఉంది.ఫ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు వచ్చేనా.. ఫ జాతీయ రహదారి వెంట రైలు కూత పెట్టేదెన్నడో ఫ కలగానే శంషాబాద్–విశాఖపట్నం హైస్పీడ్ రైల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎంటీఎస్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు వెంట రైల్కు ఏ మేరకు నిధులు ఇస్తుందో చూడాలి. 392 కిలోమీటర్ల పొడవునా యాదాద్రి భువనగిరి సహా పలు జిల్లాలను కలిపే ఈ రైల్వే లైన్ అంచనా ఖర్చు రూ.12,408 – రూ.24,000 కోట్లు. ప్రస్తుతం ఫైనల్ లొకేషన్ సర్వే, లిడార్ సర్వేలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం వెలువరించబోతుందన్నది నేడు తేలనుంది. ఇప్పటికే డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్కు పైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్ఎల్ఎస్) రైల్వే బోర్డు గతంలో ఆమోదం తెలిపింది. సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్– గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఎఫ్ఎల్ఎస్ చేపట్టేందుకు గతంలో రూ.7.40 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. తప్ప విడుదల కాలేదు. ఇక మాచర్ల – నల్లగొండకు 92 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్ను రూ.458.26 కోట్లతో చేపట్టేందుకు ఎప్పుడో ఆమోదించిన కేంద్రం 2023 బడ్జెట్లో రూ.35.35 కోట్లు కేటాయించింది. అందులో రూ.11.30 లక్షలు ఖర్చు చేసింది. ఆ తరువాత నిధులు ఇవ్వలేదు. -
ఒప్పించడం తలనొప్పే!
సాక్షి యాదాద్రి : నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బుజ్జగింపుల పర్వానికి రాజకీయ పార్టీలు తెరలేపాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీకి దిగారు. కచ్చితంగా బరిలో ఉంటామని స్పష్టం చేయడం.. పార్టీల నేతలకు సమస్యగా మారింది. బీఫాం ఎవరికి ఇవ్వాలి.. ఎవరిని పోటీ నుంచి తప్పించాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. టికెట్లు లభించని వారిని సముదాయించి పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసేలా ఒప్పించడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే అన్నిచోట్లా అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నాయి. ● చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆశావహులు మాత్రం నామినేషన్లు వేశారు. పార్టీ సమన్వయ కర్త చింతల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిలు అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలమునకలయ్యారు. కాంగ్రెస్ నుంచి అన్ని వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మూడు, నాలుగు వార్డులు మినహా మిగతా వార్డుల్లో స్పష్టత లేదు. బీజేపీ నుంచి సైతం వార్డుల్లో నామినేషన్లు వేశారు. ఈ పార్టీలోనూ మూడు, నాలుగు స్థానాలు మినహా మిగతా వార్డుల్లో స్పష్టత రావాల్సి ఉంది. ● ఆలేరు మొత్తం 12 వార్డులకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. ఏ పార్టీలోనూ రెబల్స్ బెడద లేకుండా అభ్యర్థులను ప్రకటించారు. వారందరూ నామినేషన్లు దాఖలు చేశారు. బీసీ మహిళకు రిజర్వ్ అయినందున చైర్ పర్సన్ అభ్యర్థులను ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. అయితే డమ్మీ అభ్యర్థులు వేసిన నామినేషన్లు ఉపసంహరణ కావాల్సి ఉంది. ● భూదాన్ పోచంపల్లి ´ù^èl…-ç³-ÍÏ Ð]l¬°Þ´ë-Ísîæ-ÌZ 13 ÐéÆý‡$z-ÌSMýS$ M>…{VðS-‹Ü ´ëÈt 9 ÐéÆý‡$z-ÌSMýS$ A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ A«¨M>Ç-MýS…-V> {ç³MýS-sìæ…_…¨. Ñ$VýS-™é ¯éË$VýS$ Ý릯éÌSMýS$ M>…{VðS-‹Ü ´ëÈtMìS ^ðl…¨¯]l C§ýlªÆý‡$, Ð]l¬VýS$YÆý‡$ ¯éÑ$¯ól-çÙ¯ŒS ÐólÔ>-Æý‡$.️ ½BÆŠ‡-G‹Ü ´ëÈt ¯]l$…_ A¿ýæÅ-Æý‡$¦-ÌS¯]l$ GÐ]l-ǰ MýS*yé A«¨M>Ç-MýS…-V> {ç³MýS-sìæ…^èl-MýS-´ù-Ð]l-yýl…-™ø JMöPMýSP ÐéÆý‡$z ¯]l$…_ BÔ>-çßæ$-Ë$ C§ýlªÆý‡$, Ð]l¬VýS$Y-Æó‡íÜ ¯éÑ$¯ól-çÙ¯]l$Ï §éQË$ ^ólÔ>Æý‡$. Ð]l$Ç Mö…§ýlÆý‡$ JMýSsìæ MýS…sôæ GMýS$PÐ]l ÐéÆý‡$z-ÌZÏ ¯éÑ$¯ól-çÙ¯ŒS ÐólÔ>Æý‡$. GÐðl$ÃÌôæÅ MýS$…¿ýæ… A°ÌŒæ-MýS$-Ð]l*-ÆŠ‡-Æð‡yìlz, Ð]l*i GÐðl$ÃÌôæÅ Oò³âýæÏ ÔóæQÆŠ‡-Æð‡yìlz ™èlÐ]l$ A¿ýæÅ-Æý‡$¦ÌS {ç³MýS-r¯]l-ÌZ Ð]lNÅà™èlÃ-MýS…-V> Ð]lÅÐ]l-çßæ-ÇçÜ$¢-¯é²Æý‡$. ● యాదగిరిగుట్ట మున్సిపాలిటిలో కాంగ్రెస్ , సీపీఐ పొత్తులు పెట్టుకున్నాయి. దీంతో 11 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో సీపీఐ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ 10 వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా రెండు వార్డుల్లో ప్రకటించాల్సి ఉంది. బీజేపీ 10 వార్డుల్లో నామినేషన్లు వేసినప్పటికీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలకు చెందిన అభ్యర్థులు ఎక్కడా రెబల్స్గా నామినేషన్లు వేయలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా 10వ వార్డులో పోటీ చేస్తున్న గుండ్లపల్లి వాణి భరత్గౌడ్ను ప్రకటించారు. ఇక బీఆర్ఎస్, బీజేపీలు చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఫ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఫ బరిలోనే ఉంటామంటున్న ఆశావహులు ఫ నచ్చజెప్పే పనిలో నాయకులు ఫ భవిష్యత్లో న్యాయం చేస్తామంటూ హామీలు భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 32 మంది అభ్యర్థులను ప్రకటించింది. అసమ్మతి నేతలతో కలిపి 91 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్లు వేశారు. అసమ్మతి లేకుండా చేయడానికి ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి 35 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. బీఆర్ఎస్, సీపీఎం, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రతి వార్డుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున 82 మంది నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 77 మంది నామినేషన్ వేశారు. కాగా ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థికి బీ ఫాం ఇవ్వలేదు. పోటీలో ఉన్న రెబల్స్ ను బుజ్జగించే పనిలో ఉన్నారు. రెండు నామినేషన్ల తిరస్కరణభువనగిరి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఆరు మున్సిపాలిటీల్లో 786 నామినేషన్లు దాఖలు కాగా అందులో భువనగిరిలో రెండు తిరస్కరణకు గురయ్యాయి. 545 మంది అభ్యర్థులకు చెందిన 784 నామినేషన్ల సవ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మోత్కూర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 12 వార్డులకు107 నామినేషన్లు వేశారు. చైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వివిధ పార్టీల ముఖ్యనేతలు వైస్ చైర్మన్ కోసం పోటాపోటీగా నామినేషన్లు వేశారు. చైర్మన్ అభ్యర్థిని ప్రకటించక పోయినా బీసీ, జనరల్ అభ్యర్థులు వైస్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ .. పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్లో టికెట్ దక్కని రెబల్స్ను తమపార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ ముందుగా అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా జాగ్రత్త పడుతోంది. టికెట్ రాని వారు బీఆర్ఎస్, లేదా ఇండిపెండెంట్గా రంగంలోకిదిగే అవకాశం ఉందని అధికార పార్టీ అనుమానిస్తోంది. విత్ డ్రా తర్వాత చివరి క్షణంలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి
భువనగిరిటౌన్ : వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు మరణంలోనూ తమ స్నేహబంధం వీడదీయరానిదంటూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు. ఈ ఘటన భువనగిరి పట్టణ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బాతుల రాకేష్ (20), జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాంతాపురం గ్రామానికి చెందిన గన్నె ఆనంద్ (19) ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని రామాంతాపూర్లో ఒకే రూంలో ఉంటున్నారు. రాకేష్ అమ్మమ్మ ఊరు కూడా శాంతాపురం కావడంతో వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులయ్యారు. వీరితో పాటు శాంతాపురం గ్రామానికే చెందిన మరో స్నేహితుడు సూర్యప్రసాద్ కూడా హైదరాబాద్లోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే మరొక రూంలో ఉంటున్నాడు. జనవరి 30న ఆనంద్ పుట్టినరోజు కాగా.. బర్త్డే వేడుకలను మేడారంలో జరుపుకోవాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాకేష్, ఆనంద్, సూర్యప్రసాద్ కలిసి జనవరి 29న రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి శాంతాపురం గ్రామంలో ఆనంద్ బంధువుల వద్ద కారు తీసుకుని మేడారం వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి శాంతపురం వచ్చి కారును అప్పగించి శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి బైక్పై హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో భవనగిరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఫ్లైఓవర్ పైకి బైక్ అదుపుతప్పడంతో వెనుక కూ ర్చున్న రాజేష్, ఆనంద్ బైక్ మీద నుంచి ఎగిరి ఫ్లైఓవర్పై నుంచి సర్వీసు రోడ్డుపై పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న సూర్యప్రకాష్ కొద్దిదూరం వెళ్లి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివారం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ కె. రమేష్కుమార్ తెలిపారు. ఫ మరొకరికి తీవ్ర గాయాలు ఫ మరణంలోనూ వీడని స్నేహబంధం -
కమీషన్ వాటాల కోసమే కక్కుర్తి
చౌటుప్పల్ : కమీషన్లలో వాటాల కోసమే రాష్ట్ర మంత్రులు కక్కుర్తి పడుతున్నారని, ప్రజలను పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. చౌటుప్పల్లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీకి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదని, అది పూర్తిగా కమీషన్ల ప్రభుత్వమని, అవినీతి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. 1,200 మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజభోగాలు అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి చైర్మన్ పీఠాన్ని అప్పగిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, కడారి కల్పన నాయకులు రమనగోని శంకర్, పోలోజు శ్రీధర్బాబు, ముత్యాల భూపాల్రెడ్డి, ఆలె చిరంజీవి, మసనం సంగీత, గుజ్జుల సురేందర్రెడ్డి, వనం ధనుంజయ్య, కంచర్ల గోవర్ధన్రెడ్డి, పోలేపల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ -
డాలర్ల మాయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ఫ మరో ఇద్దరికి చార్జ్ మెమో జారీ ఫ వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో భవానీ శంకర్ యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సంచలనం సృష్టించిన బంగారు, వెండి డాలర్ల మాయం విషయంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు మరో ఇద్దరికి చార్జ్ మెమోలు జారీ అయ్యాయి. కొత్తగా వచ్చిన ఆలయ ఈవో భవానీ శంకర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో కమిటీ నివేదిక ఆధారంగా తగు శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచార శాఖలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పి.రామచంద్ర శేఖర్, రికార్డు అసిస్టెంట్ టి.లక్ష్మీలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లఇడించారు. ఇక పర్యవేక్షణలో లోపం కనబర్చిన పర్యవేక్షకులు కె.నటరాజు, కె.సీతారామచార్యులుకు చార్జ్ మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత సహాయ కార్య నిర్వాహణాధికారి (ఏఈవో)కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పారు. -
నామినేషన్లు 830
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరుతో కలిపి ఆరు ముుున్సిపాలిటీల్లో మొత్తం 104 వార్డు సభ్యుల పదవులకు మూడు రోజులుగా మొత్తం 830 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ముగింపు సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి. చివరి రోజు ఉత్సాహంగా.. నామినేషన్ల చివరి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉత్సాహంగా ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఆరు మున్సిపాలిటీల్లో శుక్రవారం ఒక్కరోజే 412 మంది 536 నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి, చౌటుప్పల్లో ఐదు గంటల తర్వాత కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఐదు గంటల లోపు వచ్చిన వారిని లైన్లో నిలబెట్టి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 8గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. నేడు నామినేషన్ల పరిశీలన నామినేషన్ల పరిశీలన శనివారం చేయనున్నారు. నామినేషన్లు అన్ని ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్న వారి పేర్లను సాయంత్రం ఐదు గంటలకు అధికారులు ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఫిబ్రవరి 1న అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. 3వ తేదీ మద్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు ప్రకటన ఉంటుంది. 11న పోలింగ్, 13 ఓట్ల లెక్కిపు విజేతలను ప్రకటిస్తారు. ర్యాలీలతో కోలాహలం ● నామినేషన్ల చివరి రోజు ఆయా పార్టీల నాయకులు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అఽభ్యర్థి చింతల కిష్టయ్య నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనతోపాటు నాయకులు కొలుపుల అమరేందర్ ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో నాయకులు ఆచారీ, పాశం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డిలు ఉన్నారు. ● మోత్కూరులో బీజేపీ చేపట్టిన ర్యాలీలో సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ స్థానిక నాయకులు ర్యాలీగా వచ్చి అభ్యర్థుల నామినేష్లలో పాల్గొన్నారు. ● యాదగిరిగుట్టలో జరిగిన నామినేషన్ ర్యాలీలో ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ● భూదాన్పోచంపల్లిలో ఆయా పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతోకలిసి వెళ్లి నామినేషన్లు వేశారు. ● ఆలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ర్యాలీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి స్థానిక నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నాయకులు క్యామా మల్లేష్, పుట్ట మల్లేష్ పాల్గొన్నారు. బీజేపీ ర్యాలీలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్లు పడాల శ్రీనివాస్, దోనూరి వీరారెడ్డి పాల్గొన్నారు. ఆయా ర్యాలీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ముఖ్య నాయకులుతోపాటు ఆయా పార్టీల ఎన్నికల ఇన్చార్జ్లు ర్యాలీల్లో పాల్గొనడంతో అన్ని మున్సిపాలిటీల్లో కోలాహలం నెలకొంది. భువనగిరిలో బీజేపీ కార్యకర్త ఉత్సాహంఫ చివరి రోజు 536 నామినేషన్లు దాఖలు ఫ ర్యాలీల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు ఫ కోలాహలంగా మన్సిపాలిటీలు ఫ ముగిసిన నామినేషన్ల పర్వంపార్టీల వారీగా అభ్యర్థుల నామినేషన్ల వివరాలు కాంగ్రెస్ 271 బీఆర్ఎస్ 237 బీజేపీ 185 సీపీఎం 19 సీపీఐ 02 స్వతంత్రులు 94 గుర్తింపు 22 పొందిన పార్టీలు -
వీబీ జీ రామ్జీ పథకంపై రాజకీయం తగదు
రాజాపేట : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మార్పులు చేసిన వీబీ జీ రామ్జీ పథకంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ అన్నారు. శుక్రవారం రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో బీజేపీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు కార్మికులకు 125 రోజులకు పెంచడమే కాక కనీస వేతనం రోజుకు రూ.100ల నుంచి రూ.300కు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, పడాల శ్రీనివాస్, సర్పంచ్ కోయ మధు, మండల ఉపాధ్యక్షుడు బర్మా శ్రీశైలం, ప్రధాన కార్యాదర్శులు యర్రగొకుల వినోద్, మెండు భగవాన్ రెడ్డి, ఉప సర్పంచు మార్క శివ, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
వైభవంగా సహస్రకలశాభిషేకం
వలిగొండ : మండల కేంద్రంలోని శ్రీ హరిహర త్రిశక్తి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. మహిళలు కలశాలతో శోభాయాత్రగా వచ్చి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ గాయకురాలు విశాలాక్షి శిష్య బృందం కలశా పాదయాత్రలో పాల్గొన్నారు. మహిళలకు, భక్తులకు భారతి సిమెంట్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ చేశారు. రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ యుగంధర్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకటపాపిరెడ్డి, కుంభం విద్యాసాగర్రెడ్డి, పాశం సత్తిరెడ్డి, నూతి రమేష్, బొల్ల శ్రీనివాస్, బత్తిని సహదేవ, లింగయ్య, చిలుగురి సత్తిరెడ్డి, చెరుకు శివ్వయ్య,కంకల కిష్టయ్య, ఆలయ నిర్వాహకులు బిన్నూరు గోపలకృష్ణ శాస్త్రి, కమలాకర్ శర్మ, శ్రీనివాస్ గుప్తా, అనురాధ, మనోహరి, దత్తాత్రేయ, లక్ష్మీనారాయణ శాస్త్రి పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం భువనగిరి కలెక్టరేట్లో ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎన్నికల డ్యూటీలు వేసిన ప్రతిఒక్కరూ విధుల్లో చేరాలని ఎవరికీ కూడా మినహాయింపు ఉండదన్నారు. పోలింగ్ సామగ్రిని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి బాలెట్ పేపర్స్, పోలింగ్ బాక్సులు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నారు. ప్రధానంగా పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం, సీల్ వేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణ, మాస్టర్ ట్రైనర్ నర్సిరెడ్డి, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు. మీడియాకు సమాచారం అందించాలి మున్సిపల్ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ శ్రీమతి అరుంధతి, సిబ్బంది పాల్గొన్నారు. -
బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతం
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో ఓటింగ్ నిర్వహించారు. జిల్లాలో రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట బార్ అసోసియేషన్లలో మొత్తం 265 న్యాయవాదులు ఓటర్లుగా ఉండగా 252 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్లో 23 పోస్టులకు 203 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. భువనగిరిలో ప్రధాన జూనియన్ సివిల్ జడ్జి గేడం స్వాతి ఎన్నికలను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారిగా జిట్టా భాస్కర్రెడ్డి, సహాయకులుగా శివకిరణ్, బొడ్డు కిషన్ విధులు నిర్వహించారు. జడ్జి స్వాతి పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి రాష్ట్ర బార్ కౌన్సిల్కు పంపించారు. అలాగే చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరిగిన ఓటింగ్లో 39మంది ఓటర్లు ఉండగా 37మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా పడమటి మహిపాల్రెడ్డి వ్యవహరించగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల్యం వెంకటాచలపతి పర్యవేక్షించారు. -
అన్ని స్థానాలను కై వసం చేసుకుంటాం
యాదగిరిగుట్ట: ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం సీపీఐ రాష్ట్ర నాయకులు గోద శ్రీరాములుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ పార్టీ ఆయా మున్సిపాలిటీల్లో పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్తుందన్నారు. ఆరు మున్సిపాలిటీలో మిత్రపక్షమైన సీపీఐ, సీపీఎం సహకారంతో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. గత ఎన్నికల్లో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికంగా సీట్లు గెలిస్తే, బీఆర్ఎస్ మాత్రం ఎక్స్ అఫీషియో సభ్యులను వినియోగించుకొని చైర్మన్ సీటు తీసుకుందని, కానీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అధికంగా సీట్లు సాధించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంతో బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటే.. బీఆర్ఎస్, బీజేపీలు పైకి కొట్లాడుకొని, లోపల పొత్తులకు సహకరించుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, సీనియర్ నాయకులు ఎరుకల హేమేందర్, ఇరు పార్టీల నాయకులు ముక్కెర్ల మల్లేష్, కాటబత్తిని ఆంజనేయులు, శ్రీరాములు, పేరబోయిన పెంటయ్య, బబ్బూరి శ్రీధర్ పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ఆయా శాఖల అధికారులకు ఈఓ భవానీ శంకర్ ఆదేశించారు. ఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం యాదగిరి కొండపైన తన చాంబర్లో గురువారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. శ్రీస్వామి వారి పై భక్తితో వచ్చే భక్తులకు ఆలయంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి అనుగుణంగా సేవలు అందించాలని కోరారు. ఆలయాభివృద్ధికి అధికారులంతా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్శర్మ, ఈఈ దయాకర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
కమిటీ వేసి పూర్తిస్థాయి విచారణ చేస్తాం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరిగిన బంగారు, వెండి డాలర్ల దొంగతనంపై పూర్తి స్థాయిలో కమిటీ వేసి విచారణ చేస్తామని ఆలయ ఈఓ భవానీ శంకర్ వెల్లడించారు. యాదగిరి కొండపైన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశాలను పరిశీలిస్తామన్నారు. కమిటీ వేసి, జరిగిన తప్పుపై రిపోర్టు త్వరలోనే సమర్పించాలని ఆదేశిస్తానన్నారు. ఎవరి వద్ద, ఎలాంటి తప్పు జరిగిందనే వివరాలే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ విధంగా ఉండాలనేది కమిటీ నిర్ణయించాలని ఆదేశించనున్నట్లు తెలిపారు. కమిటీ పూర్తి రిపోర్టు ఇచ్చిన తరువాత సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలిభువనగిరి: మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ సూచించారు. గురువారం రాత్రి భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక హన్మాన్వాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల వంటగది, తరగతి గదులను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. నేడు మందనపల్లికి మీనాక్షినటరాజన్ఆలేరురూరల్: ఆలేరు మండలం మందనపల్లి గ్రామానికి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ రానున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ తెలిపారు. గురువారం మందనపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ చట్టంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మందనపల్లిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వారు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పనులపై మహిళలతో మాట్లాడుతారని చెప్పారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా రానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీపాల్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లావణ్యవెంకటేష్, దశరథ, శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు భేష్యాదగిరిగుట్ట రూరల్: వంగపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు బాగున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్ విభాగం కర్ణాటక, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధికారుల బృందం ప్రశంసించింది. ఉపాధి శిక్షణలో భాగంగా 30 మంది అధికారుల బృందం గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పర్యటించింది. పల్లె పకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, క్యాటిల్ షెడ్, రైతు వేదిక, అంగన్వాడీ భవనం, ఇందిరమ్మ ఇల్లు తదితర అభివృద్ధి పనులను పరిశీలించింది. పనులు ఎలా చేశారో విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఏపీడీ కాసం నవీన్ కుమార్, ఈసీ రాజ శేఖర్, ఏపీఓ లింగంపల్లి నర్సయ్య, ఏపీఎం వెంకటేష్, టీఏ వెంకట నారాయణ, పంచాయతీ కార్యదర్శులు లావణ్య, సర్పంచ్ ఒగ్గు రవళి, ఉప సర్పంచ్ చిన్న మల్లయ్య, కానుగు రాజీవ్, మల్లేష్ పాల్గొన్నారు. -
సజావుగా నామినేషన్లు
చౌటుప్పల్ : మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆర్ఓలు, ఏఆర్ఓలు, నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్ధులతో మాట్లాడారు. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులకు అవకాశం ఇవ్వొద్దన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వెల్మ శేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్రెడ్డి, మేనేజర్ శ్రీధర్రెడ్డి ఉన్నారు. భూదాన్పోచంపల్లి: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. పోచంపల్లి పట్టణంలోని వినోబాభావే మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. అక్కడ నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయని ప్రత్యేకాధికారి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. హెల్ప్డెస్క్ సిబ్బందితో మాట్లాడి అభ్యర్థులకు అందిస్తున్న సేవలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద అధికారులు, పోలీసులు చేసిన ఏర్పాట్లు, వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు. నామినేషన్ కేంద్రం వద్ద రాత్రివేళలో పోలీస్, మున్సిపల్ సిబ్బంది కాపలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు వస్తాయని భావిస్తున్నామని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు రాపర్తి భాస్కర్, నాగేశ్వర్రావు, మాజిద్, దామోదర్, ఎస్ఐ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
రెండో రోజు నామినేషన్ల జోరు
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. రెండో రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్ల దాఖలయ్యాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొదటి రోజు 41నామినేషన్లు రాగా గురువారం 264 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో మొత్తం 305 నామినేషన్లు వచ్చాయి. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. టికెట్ ఖరారుకానున్నా నామినేషన్ల వేయడానికి ఆశావహులు ముందుకొస్తున్నారు.సాక్షి, యాదాద్రి: నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనుండగా ఇంకా అన్ని చోట్లా అభ్యర్థులు ఖరారు కాలేదు. దీంతో తమకు టికెట్ వస్తుందా లేదా అన్న టెన్షన్ ఆశావహుల్లో నెలకొంది. పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ పలువురు గురువారం నామినేషన్లు వేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. వ్యూహాత్మకంగా.. చివరి రోజైన శుక్రవారం నామినేషన్లు వేసే సమయానికి బీఫాం రాకపోతే ఇండిపెండెంట్గా నైనా పోటీలో ఉండవచ్చని కొందరు.. బీఫాం వచ్చిన తర్వాత మరో సెట్ నామినేషన్ వేసే ఆలోచనను మరికొందరు ఆశావహులు చేస్తున్నారు. మరో వైపు పార్టీలు సైతం విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. పోటీ పెద్దగా లేని చోట అభ్యర్థులను ప్రకటించి.. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల అభ్యర్థి ప్రకటన విషయంలో ఆచితూచి కసరత్తు చేస్తున్నాయి. ఎవరో ఒకరికి టికెట్ ప్రకటిస్తే రానివారు ఇతర పార్టీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీలో ఉండే అవకాశం ఉంది. దీంతో చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించే వ్యూహాత్మక ధోరణిని ప్రధాన పార్టీలు అవలంబిస్తున్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో.. ● భూదాన్ పోచంపల్లి లో 13 వార్డులకు కాంగ్రెస్ పార్టీ గురువారం 9 మంది అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. మరో నలుగురి పేర్లు శుక్రవారం ప్రకటిస్తారు. బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల ప్రకటనపై తుది కసరత్తు చేస్తోంది. బీజేపీ సైతం అదే బాటలో ఉంది. ● చౌటుప్పల్ లో అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. మున్సిపాలిటీలో 20 వార్డులకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం.. పార్టీలు ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. ముందుగా బీఫామ్ లు ఇస్తే టికెట్ దక్కని వారు ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఓ ప్రధాన పార్టీ కోటి రూపాయలు ఉంటేనే ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తామన్న దిశగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీల నడుమ పొత్తుల చర్చలు కొలిక్కి రావడం లేదు. ● ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించాయి. బీజేపీ మాత్రం ఆరుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. శుక్రవారం మిగతావి ప్రకటించనుంది. ● యాదగిరిగుట్టలో 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానంలో సీపీఐ తో పొత్తు కుదిరింది. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరో ముగ్గురి పేర్లను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సైతం నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం అభ్యర్థులను ప్రకటించనుంది. ● మోత్కూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్ ,బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. నేడు నామినేషన్లు వేసే సమయం ముగియడానికి కొద్ది ముందు బీఫామ్స్ ఇచ్చే అవకాశాన్ని రెండు పార్టీలు పరిశీలిస్తున్నాయి. గుట్ట ఈఓగా భవానీ శంకర్ బాధ్యతలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఈఓగా భవానీ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం ప్రధాన కార్యాలయంలో ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం మధ్య బాధ్యతలు స్వీకరించారు. కాగా.. గతంలో ఇక్కడ పని చేసిన ఈఓ వెంకట్రావ్ వ్యకిగత కారణాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ నెల 1వ తేదీన తన ఈఓ బాధ్యతలకు రాజీనామా చేశారు. కాగా ఈ నెల 17వ తేదీన గవర్నర్ జాయింట్ సెక్రటరీగా విధుల్లో ఉన్న జె.భవానీ శంకర్ను ఆలయ ఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉత్తర్వులు జారీ అయిన 12 రోజులకు భవానీ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఈఓ భవానీ శంకర్కు ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మలతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లాలోనే 35 వార్డులతో అతిపెద్ద మున్సిపాలిటీగా ఉన్న భువనగిరిలో ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా సాగనుంది. ఎంపిక చేసే అభ్యర్థికి డబ్బు, కులం, పలుకుబడిని అత్యంత ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలోనే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి వరకు రెండు విడతలో 22 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించగానే బీఆర్ఎస్ అప్పటికే ఎంపిక చేసిన కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా నిలిపివేసింది. అలాంటి అభ్యర్థులను వెంటనే మార్పు చేస్తోంది. దీంతో ఆపార్టీ అభ్యర్థుల ప్రకటన జాప్యం అయ్యింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల అభ్యర్థులకు దీటుగా తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని బీజేపీ నాయకుడొకరు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు వామపక్షాల పొత్తుప్రయత్నాల్లో ఉన్నాయి. ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ ఫ నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు ఫ అన్నిచోట్ల ఖరారు కాని అభ్యర్థులు ఫ నామినేషన్ వేసి వేచిచూసే ధోరణిలో ఆశావహులుమున్సిపాలిటీ వార్డులు మొదటి రోజు రెండో రోజు మొత్తం భువనగిరి 35 5 109 114 ఆలేరు 12 10 25 35 చౌటుప్పల్ 20 6 59 65 మోత్కూరు 12 3 34 37 పోచంపల్లి 13 2 16 18 యాదగిరిగుట్ట 12 15 21 36 ఫ ఒక్క రోజే 264 నామినేషన్లు దాఖలు ఫ మొదటి రోజు 41.. రెండు రోజుల్లో మొత్తం 305నామినేషన్లు ఫ నేడు నామినేషన్లకు ఆఖరు -
మరో మూడు గ్రామాల్లో పులి సంచారం
ఫ తిరుమలపురం, శ్రీనివాసపురం, కొండాపూర్లో పులి అడుగుల గుర్తింపు ఫ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ తుర్కపల్లి: తుర్కపల్లి మండలంలోని తిరుమలపురం, శ్రీనివాసపురం, కొండాపూర్ గ్రామాల్లోనూ పులి సంచారం కలకలం రేపింది. పులి తిరిగినట్లు దాని అడుగులను గురువారం స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వచ్చి పరిశీలించి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ పులిని పట్టుకునేందుకు రెండు రోజులుగా టైగర్ మానిటరింగ్ టీంతో కలిసి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. తిరుమలపురం నుంచి కొండపూర్ శివారు వరకు పులి వెళ్లినట్లు సమాచారం రావడంతో అక్కడ పరిశీలన చేపట్టి అడుగులను గుర్తించినట్లు చెప్పారు. పులి తిరిగి దత్తాయపల్లి వైపు వస్తుందా లేక సిద్దిపేట జిల్లా జగదేవపురం మండలం పీర్లపల్లి గ్రామ శివారులోని అతిపెద్ద అటవీ ప్రాంతంల్లోకి వెళ్లిందా అన్నది స్పష్టత రావాల్సి ఉందన్నారు. గతంలో ఆవుల మృతి చెందిన స్థలంలో కళేబరాలు ఉండటంతో పులి మళ్లీ అక్కడికి వచ్చే అవకాశం ఉందని అందుకే అప్రమత్తంగా వేచి చూస్తున్నామని చెప్పారు. తుర్కపల్లి మండలంలోని తిరుమలపురం, కొండాపూర్, వీరారెడ్డిపల్లి, శ్రీనివాసపురం, వాసాలమర్రి గ్రామాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి 7 గంటల తరువాత బయటకు రావద్దని, వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువులు మేకలను ఇంటి వద్దకు తీపుకొచ్చి కట్టేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి వేళ ఒంటరిగా అడవిలోకి లేదా గ్రామం బయటకు వెళ్లవద్దన్నారు. అవసరమైతే గుంపులుగా వెళ్లాలని సూచించారు. టైగర్ మానిటరింగ్ టీం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. ఆయన వెంట సెక్షన్ ఆఫీసర శాలిని, బీట్ ఆఫీసర్లు మల్లేశం, శ్రీనివాస్, టైగర్ మానిటరింగ్ టీం సభ్యులు ఉన్నారు. -
ధ్వజారోహణం.. దేవతాహ్వానం
యాదగిరిగుట్ట: పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ధ్వజారోహణను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం జరిపించారు. గరుఢ ఆళ్వారుడిని వస్త్రంపై చిత్రించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక ఆరాధన చేశారు. ధ్వజ పటాన్ని ఆలయ ముఖ మండపం నుంచి ఊరేగింపుగా ధ్వజస్తంభం వరకు తీసుకెళ్లి, అక్కడ గరుఢ ఆళ్వారుడికి గరుఢ ముద్దలను నైవేద్యంగా సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం వేదపారాయణం గావించారు. అనంతరం భేరీపూజ, దేవతాహ్వానం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్శర్మ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి అలంకార సేవలు నృసింహుడికి ఇష్టమైన అలంకార సేవలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం హవన పూజలు జరిపించిన అనంతరం సింహ వాహనంపై తిరువీధుల్లో సేవను ఊరేగించనున్నారు. రాత్రి స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం జరిపించనున్నారు. ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఫ రెండో రోజుకు చేరిన పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫ నేటి నుంచి అలంకార సేవలు, ఎదుర్కోలు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పెద్దవూర: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం గ్రామానికి చెందిన జానపాటి బొర్రయ్య–కాశమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు కోటేష్(37) ఉన్నారు. వీరందరికి వివాహాలు అయ్యాయి. కోటేష్కు నిడమనూరు మండలం కుంటిగొర్లగూడెం గ్రామానికి చెందిన హేమలతతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కోటేష్ తల్లి ఎనిమిది సంవత్సరాల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కోటేష్ మద్యానికి బానిసై భార్య, తండ్రిని నిత్యం కొడుతుంటాడు. దీంతో భార్య హేమలత ఇద్దరు పిల్లలతో కలిసి పది నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి సైతం కుమారుడి వేధింపులను తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి కుమార్తెల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో కోటేష్ తన ఇంటిని సైతం ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టి లోన్ తెచ్చుకున్నాడు. సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో సంబంధిత బ్యాంకు వాళ్లు ఇంటికి తాళం వేసినట్లు తెలిసింది. దీంతో తన వ్యవసాయ పొలంలో రేకుల షెడ్డు వేసుకుని అక్కడే ఉంటున్నాడు. నాలుగైదు రోజుల క్రితం తన ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టిన కోటేష్ ఇంట్లోనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం కుమార్తెల వద్ద నుంచి ఇంటికి వచ్చిన తండ్రిని కోటేష్ తాగొచ్చి కొట్టడంతో మరలా కుమార్తెల వద్దకు వెళ్లాడు. గురువారం రాత్రి కోటేష్ స్నేహితుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కోటేష్ మంచంపై రక్తం మడుగులో పడి ఉండటం గమనించి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పాడు. నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర ఎస్ఐ వై. ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని చూడగా కోటేష్ గొంతుకోసి ఉన్నట్లు, పక్కనే కూరగాయలు కోసే కత్తి ఉండటం గమనించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ముందైతే వేసేద్దాం..!
చిట్యాల: మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో ఆయా ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు నామినేషన్లు వేసినప్పటికీ చాలా చోట్ల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇంకొన్ని చోట్ల బీఫాంలు ఇవ్వలేదు. అయినప్పట్టికీ ఆశావహులు అన్ని వార్డులకు నామినేషన్న్లు దాఖలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం వరకు ఏఏ పార్టీల నుంచి ఎవరు బరిలో నిలిచారని తేలనుంది. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి చైర్పర్సన్గా బరిలోకి..మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా.. కాంగ్రెస్ నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా నూకల కవితను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రకటించారు. 17వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్న ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశా రు. అయితే మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న కవిత ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమె 2014 మున్సిపల్ ఎన్నికల్లోనూ కౌన్సిలర్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమెకు రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో జాబ్లో చేరింది. మళ్లీ ఇప్పుడు కౌన్సిలర్గా, చైర్పర్సన్గా అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలబడింది. బీఆర్ఎస్లో చేరికనల్లగొండ టూటౌన్: మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వర్రావు–మమత దంపతులు గురువారం నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు. -
సాగర్లో శ్రీలంక మీడియా ప్రతినిధులు
ఐక్యరాజ్యసమితి జల సదస్సులో నల్లగొండ వాసి రామగిరి(నల్లగొండ) : సెనెగల్ దేశ రాజధాని అయిన డకార్ నగరంలో ఈనెల 26, 27లో ఐక్య రాజ్య సమితి జల సదస్సు– 2026 సన్నాహక సమావేశం నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సంస్థలు భాగస్వాములు పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా నీటి సమస్యలు, నీటి వనరుల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశానికి నల్లగొండ మండలం నర్సింగ్భట్లకు చెందిన బొమ్మరబోయిన పృథ్వీరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి పాలన, రైతుల జీవనోపాధి, ఆహార వ్యవస్థలపై చర్చ జరిగినట్లు చెప్పారు. అదేవిధంగా డకార్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. సమావేశాలు, చర్చల ఆధారంగా నీరు–వాతావరణ మార్పు, కార్బన్ మార్కెట్ల అనుసంధానంపై నివేదికను ఐక్యరాజ్యసమితి, సంబంధిత వర్గాలకు సమర్పించనున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ : పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ను గురువారం శ్రీలంక దేశానికి చెందిన మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు ప్రస్తుతం హైదరాబాద్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. తెలంగాణ దర్శన్ కార్యక్రమంలో భాగంగా వారు నాగార్జునసాగర్కు వచ్చారు. బుద్ధవనం విశేషాలను వివరించే లఘుచిత్రాన్ని వీక్షించారు. శ్రీలంక ప్రభుత్వం సాగర్లోని బుద్ధవనంలో ఏర్పాటు చేసిన బుద్ధవిగ్రహం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహాస్థూపంలోని ధ్యానమందిరంలో ధ్యానం చేశారు. అనంతరం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ పునర్నిర్మించిన సింహళ విహారాన్ని సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. వేల సంవత్సరాల క్రితమే భారతదేశం–శ్రీలంక మధ్య ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు, నాగార్జునకొండ, బుద్ధవనం విశేషాలను వారికి వివరించారు. వాహనం ఢీకొని మృతినిడమనూరు : వృద్ధురాలిని టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన కలికెనబోయిన లక్ష్మమ్మ(68) జాతీయ రహదారి–167పై నడుచుకుంటూ జెడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరకు రాగా, మిర్యాలగూడ వైపు నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ లక్ష్మమ్మను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన మహిళను మిర్యాలగూడ ఆస్పత్రికి, వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మమ్మ మృతి చెందింది. మృతురాలు లక్షమ్మ కుమారుడు సైదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజాపేట : రాజాపేట మండలం చిన్నమేడారం, చల్లూరు యాదాద్రి మేడారాల్లో సమ్మక–సారలమ్మలు గద్దెలపై కొలువుదీరారు. గురువారం ప్రధాన పూజారులు సమీపంలోని గుట్టపై మూలదేవతా విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ బరిణె రూపంలో ఉన్న సమ్మక్కను డపోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. సమ్మక్క సారలమ్మలను తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం జనంతో నిండిపోయింది. వనదేవతలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య వేర్వేరుగా దర్శింకుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు చింతల సంపత్, బొడ్డు భాస్కర్, ఉప సర్పంచులు రావి కొండల్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చామకూర గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క, సారలమ్మకు పూజలు పెన్పహాడ్: మండల పరిధిలోని గాజుమల్కాపురం గ్రామ శివారులో సమ్మక్క–సారలమ్మ జాతర రెండవ రోజు గురువారం వైభవంగా సాగింది. నాగులమ్మ గుడి వద్ద భక్తులు కుంకుమ, పసుపు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తూముల భుజంగరావు, టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి కోలాటం పోటీలు నిర్వహించారు. దేవిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బండి మధుసూధన్రెడ్డి, సర్పంచ్లు నాతాల వెంకట్రెడ్డి, ఒగ్గు రవి, బండి రామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి మధుసూదన్రెడ్డి, గుత్తికొండ రాంరెడ్డి, బచ్చలకూరి జానయ్య, భూక్య శివనాయక్ పాల్గొన్నారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం కోదాడరూరల్ : కోదాడ మండలానికి చెందిన ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. మూడురోజుల కింద రెండో తరగతి చదువుతున్న బాలికను సదరు వ్యక్తి తన ఇంటి సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక ఏడవడంతో వదిలేసి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడగడంతో విషయాన్ని చెప్పింది. గురువారం బాలిక తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సూర్యాపేటకు తరలించినట్లు ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపారు. చల్లూరు యాదాద్రి మేడారంలో పూజలు చేస్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యరాజాపేట : అమ్మవార్లకు బంగారం(బెల్లం) సమర్పించేందుకు వస్తున్న భక్తులుఫ గిత్తల జోరు ఫ సమ్మక్కను ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దైపె ప్రతిష్ఠించిన పూజారులు ఫ భారీగా తరలివచ్చిన భక్తులు -
సోషల్ మీడియా ఖాతాలపై నిఘా
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర కూడా కీలకంగా మారింది. అభ్యర్థులు తమ ప్రచారానికి వేదికగా సోషల్ మీడియాను మార్చుకున్నారు. అయితే సోషల్ మీడియాలో పార్టీలు, కులాలు, మతాల పేరుతో ఇతరులను రెచ్చగొట్టేలా, ఘర్షణకు తావిచ్చేలా ఎవరూ పోస్టులు, కామెంట్స్ పెట్టినా కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లపై ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలాంటి వాటిపై నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చినా చట్టపరంగా చర్యలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు, నామినేషన్ల దాఖలు సమయంలో ర్యాలీలు, మీటింగ్లకు స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. లేందటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లౌడ్ స్పీకర్లు, ప్రచారం కోసం వినియోగించే వాహనాలకు సైతం అనుమతి తీసుకోవాలని అన్నారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకే ప్రచారానికి అనుమతి ఉందని, దీనిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక బృందాల తనిఖీ భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది, రెవెన్యూ బృందాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ బృందాలకు అవసరమైతే ఇళ్లు, హోటళ్లలో సైతం తనిఖీలు చేసే అధికారం ఉంటుంది. దీంతో రూ.50వేల కంటే ఎక్కువ నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ఇతర సామగ్రి తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఆధారాలు చూపకపోతే ఆ నగదు, సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు అప్పగిస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సరైన ఆధారాలు చూపి నగదు, సామగ్రిని తీసుకోవాల్సి ఉంటుంది. చెక్పోస్టు ఏర్పాటు మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోత్కూరులోని రాజన్నగూడెం గ్రామ స్టేజీ వద్ద గురువారం ఎస్ఎస్ టీమ్ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. మండల పరిషత్ సూపరింటెండెంట్ దయాకర్, పోలీస్ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్ టీమ్గా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. -
దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ‘వందేమాతరం’
భువనగిరి: దేశం మొత్తాన్ని ఏకతాటి పైకి తెచ్చిన గీతం వందేమాతరం అని సామాజిక వేత్తలు ఎర్ర నర్సింగ్, మంత్రిపెగడ శ్రీధర్లు అన్నారు. బుధవారం శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నాటి దేశ భక్తులు వందేమాతరం గీతాన్ని ఆయుధంగా ఉపయోగించి దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి పోరాటం చేశారని గుర్తు చేశారు. నాటి పోరాట స్ఫూర్తితో నేటి తరం యువత, విద్యార్థులు దేశ భక్తిని పెంపొందించుకోవాలని కోరారు. భావిభారత పౌరులైన విద్యార్థులు రేపటి కోసం పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, విద్యుత్ పొదుపు చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు బాదం ప్రకాష్, ప్రముఖ వ్యాపార వేత్తలు పసునూరి నాగభూషణం, మార్త వెంకటేశం, గడ్డం చంద్రశేఖర్, తొగిడి భాప్కర్, గణేష్, నాగరాజు, సూదగాని ఆంజనేయులు, కాసం సత్యనారాయణ, మెరుగు మహేష్, పబ్బతి సురేందర్, కన్నయ్య, శ్రీధర్, మెరుగు మధు, పాండు, సుర్వి మణికంఠ, చంద్రకాంత్, భరత్, సాయి కిరణ్, సంతోష్ పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాలి
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో ఎన్నికల నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎలక్షన్ అబ్జర్వర్ గౌతమి సూచించారు. బుధవారం భువనగిరి మున్సిపాలిటీని ఆమె సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను ఆమె పరిశీలించారు. నామినేషన్ కౌంటర్లు, హెల్ప్డెస్క్లతో పాటు, భద్రతపై ఆమె మున్సిపల్ కమిషనర్ రామలింగంను అడిగి తెలుసుకొని మాట్లాడారు., ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుభువనగిరి : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో గ్రంథాలయ ఉద్యమం బస్సు యాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్సు యాత్ర నిర్వాహకుడు కస్తూరి ప్రభాకర్, ఎంఈఓ నాగవర్దన్రెడ్డి, తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు జిట్టా భాస్కర్రెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేశం, నాయకులు బట్టుపల్లి రాంచంద్రయ్య, పాఠశాల హెచ్ఎం భాస్కర్, ఉపాధ్యాయులు లక్ష్మీనరసింహరెడ్డి, వెంకన్న , సుదర్శన్రెడ్డి, అలివేలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడికి ప్రశంసా పత్రం అందజేత పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మేడి భాస్కర్ విద్యాభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ప్రశంసా పత్రం జారీ చేశారు. బుధవారం భాస్కర్కు డీఈఓ సత్యనారాయణ ప్రశంసా పత్రం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగవర్దన్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. త్రిశక్తి ఆలయంలో పూజలువలిగొండ : మండల కేంద్రంలోని శ్రీ హరిహర త్రిశక్తి ఆలయంలో 12వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చండీ పారా యణం, చండీ ఆవరణార్చన, చండీ హో మం, ఆంజనేయస్వామికి అభిషేకం, మ న్యుసూక్త సంపుటి పారాయణం, విశాలాక్షి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శివానంద లహరి, సౌందర్యలహరి, కాలభైరవ అష్టకం వంటి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిన్నూరు గోపాలకృష్ణశాస్త్రి, కమలాకర్ శర్మ, శ్రీనివాస్ గుప్తా, అనురాధ, మనోహరి, లక్ష్మీనారాయణ శాస్త్రి, దత్తాత్రేయ పాల్గొన్నారు. -
అరగంటలో కుల ధ్రువీకరణ పత్రం
ఆలేరు: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు అరగంటలో ఆన్లైన్లో కులధ్రవీకరణ పత్రాన్ని జారీ చేయనున్నట్టు భువనగిరి ఆర్డీఓ, ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.బుధవారం ఆలేరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు 5ఏళ్ల క్రితం తీసుకున్న కుల ధ్రవీకరణ పత్రం సమర్పించినా సరిపోతుందన్నారు. కుల ధ్రవీకరణపత్రం లేని అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి కోసం నామినేషన్ల కౌంటర్ వద్ద డిప్యూటీ తహసీల్దార్ను నియమించామన్నారు. కుల ధ్రువీకరణ పత్రం లేని వారు నామినేషన్ల పత్రాలపై కౌంటర్ వద్దనే సదరు అధికారితో ధ్రువీకరణ చేసుకొని సమర్పించవచ్చని స్పష్టం చేశారు.అభ్యర్థితోపాటు అతన్ని ప్రతిపాదించే సహాయకులు కూడా ఇంటి పన్ను తదితర నో డ్యూ సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించారు. జనరల్ రిజర్వ్ వార్డుకు పోటీ చేసే వారు రూ. 2500, ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు రూ. 1250 నామినేషన్ రుసుం చెల్లించాలని చెప్పారు. అభ్యర్థికి ఏ వార్డులోనైనా ఓటు ఉండొచ్చని, ప్రతిపాదించే సహాయకుడి ఓటు అభ్యర్థి పోటీ చేసే వార్డులోనే ఉండాలన్నారు. కొత్త బ్యాంక్ ఖాతా తీయాలని, వీలుకాకపోతే పోస్టాఫీస్ ఖాతా నుంచి ఎన్నికల ఖర్చుల లావాదేవీలు చేయాలని అన్నారు. 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 8 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్టు తెలిపారు. అక్కడ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 3 వార్డులకు ఒక ఆర్వో చొప్పున 12 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు నలుగురు ఆర్వోలను ఏఆర్వోలను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, మేనేజర్ జగన్మోహన్, ఆర్వో దూడల వెంకటేష్లు ఉన్నారు.ఫ నామినేషన్ల కౌంటర్ వద్ద డీటీ నియామకం ఫ ప్రతిపాదికులూ నో డ్యూ సర్టిఫికెట్ సమర్పించాల్సిందే ఫ మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కృష్ణారెడ్డి -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
యాదగిరిగుట్ట: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు సూచించారు. బుధవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని నామినేషన్ కేంద్రాన్ని, హెల్ప్ డెస్క్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 35 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 25 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. నామినేషన్ వేసే సమయంలో నియమ నిబంధనలు చదువుకోవాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నామినేషన్ పత్రాలతో పాటు నామినేషన్లకు సంబంధించిన అన్ని పత్రాలను జతపరిచి సమర్పిస్తే స్క్రూట్నీ రోజు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.అంతకు ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్తో పాటు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తున్నారనే అంశాలను పరిశీలించారు. వారి వెంట ఆర్వోలు, స్థానిక మున్సిపల్ అధికారులున్నారు. ధ్రువపత్రాలు పరిశీలించాలి ఆలేరు: అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అన్ని ధ్రువపత్రాలు సరిగా ఉన్నాయో లేదో స్పష్టంగా పరిశీలించిన తర్వాతనే స్వీకరించాలని ఆర్ఓలకు కలెక్టర్ హనుంతరావు ఆదేశించారు. బుధవారం ఆయన ఆలేరు మున్సిపాలిటీలోని నామినేషన్ కౌంటర్లు, హెల్ప్డెస్క్లను పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థుల అర్హతలను పక్కా పరిశీలించాలని సూచించారు. ఏ వార్డుకు ఎంతమంది ఎన్ని నామినేషన్ల పత్రాలను తీసుకువెళ్లారనే వివరాలను రిజిష్టర్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎన్నికల ప్రత్యేకాధికారి కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు,మేనేజర్ జగన్మోహన్లు ఉన్నారు. -
పులి సంచారంపై ఆందోళన వద్దు
తుర్కపల్లి : పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదగిరిగుట్ట డీఎస్పీ పి. శ్రీనివాస్నాయుడు అన్నారు. తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, దయ్యంబండతండా గ్రామాల్లో బుధవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పులి మహరాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవి నుంచి తప్పించుకుని గత 10 రోజులుగా తుర్కపల్లి ప్రాంతంలో సంచరిస్తోందని అన్నారు. అటవీశాఖ అధికారులు బోన్లు, డ్రోన్లు ఉపయోగించి పులిని తిరిగి రిజర్వ్ ఫారెస్ట్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పులి పశువులపై మాత్రమే దాడి చేస్తుందని.. పఽశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ బయటకు వెళ్లరాదని సూచించారు. పులి జాతీయ జంతువు కాబట్టి దానికి ఏవిధమైన హాని తలపెట్టినా నేరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎం. శంకర్, ఎస్ఐ మహ్మద్ తక్యుద్దీన్, డీఎఫ్ఆర్ఓ రమేష్నాయక్, జావీద్ హుస్సేన్, శ్రీనివాస్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఫ డీఎస్పీ శ్రీనివాస్నాయుడు -
మినీ ఎయిమ్స్పై నీలినీడలు
బొమ్మలరామారం: మినీ ఎయిమ్స్గా పిలిచే రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్(ఆర్హెచ్టీసీ) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బొమ్మలరామారంలోని ఈ ఆర్హెచ్టీసీ భూ బదలాయింపు ప్రక్రియ మూడేళ్లుగా కొలిక్కిరావడంలేదు. కేటాయించిన భూమి మార్కెట్ విలువ రూ.80లక్షలు ఉండడంతో ఈ అంశం కలెక్టర్ పరిధిలో లేక ఎటూ తేలడంలేదు. దీనికి సంబంధించిన ఫైల్ కలెక్టరేట్లోనే మూలుగుతోంది. నిర్మాణం కోసం ఇప్పటికే రెండు పర్యాయాలు వచ్చిన నిధులు వెనక్కి వెళ్లాయి. దీంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఈ సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి. నాలుగేళ్లుగా .. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు బీబీనగర్ ఎయిమ్స్.. బొమ్మలరామారం మండల కేంద్రంలోని పీహెచ్సీని దత్తత తీసుకుంది. ఇందులో రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్హెచ్టీసీ) ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా నాలుగేళ్లుగా ఎయిమ్స్ డాక్టర్లు ఈ పీహెచ్సీకి వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. పది ఎకరాలు కావాలని.. గతంలో బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న వికాస్ భాటియా బొమ్మలరామారంలో మినీ ఎయిమ్స్ ఏర్పాటుకు 10 ఎకరాల భూమి కేటాయించాలని 2021లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మల్యాలలోని 199 సర్వే నంబర్లోగల 6 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2022డిసెంబర్లో అడ్వాన్స్ పొజిషన్ జారీ చేస్తూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు అందజేశారు. భూమి బదలాయింపులో జాప్యం ఎయిమ్స్ పేరున ప్రభుత్వ భూమి బదలాయింపులో జరుగుతున్న జాప్యంతో మినీ ఎయిమ్స్ (ఆర్హెచ్టీసీ) నిర్మాణానికి ఆటంకంగాా మారింది. ప్రభుత్వం కేటాయించిన 6 ఎకరాల భూమి మార్కెట్ విలువ ప్రకారం రూ. 80 లక్షలుగా ఉంది. కానీ మార్కెట్ విలువ రూ. 50 లక్షల లోపు ఉంటేనే భూ బదలాయింపు అంశం కలెక్టర్ పరిధిలో ఉంటుంది. దీంతో దీనికి సంబంధించిన ఫైల్ ముందుకు కదలడంలేదు. మూడేళ్లుగా కలెక్టరేట్లోనే మూలుగుతోంది. భూ బదలాయింపు పక్రియ తమ పరిధిలో లేదని సీసీఎల్ఏ పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదం పొందాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. పూర్తయితే.. ఆర్హెచ్టీసీ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది. 30 పడకలకు పైగా ఉండే ఆసుపత్రి, 25 మంది వైద్య విద్యార్థులకు టీచింగ్ అండ్ లెర్నింగ్ కోసం వసతి గృహాలు, మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు కొలువుదీరే అవకాశం ఉంది. మినీ ఎయిమ్స్లో ఏమైనా క్రిటికల్ కేసులు ఉంటే అత్యవసర వైద్యం కోసం బీనగర్ ఎయిమ్స్కు అంబులెన్స్ ద్వారా తరలించే సదుపాయం అందుబాటులోకి రానున్నది.ఆర్హెచ్టీసీ భవన నిర్మాణానికి 2022, 2023లో రూ.10కోట్ల చొప్పున రెండు పర్యాయాలు నిధులు మంజూరయ్యాయి. కానీ భూ బదలాయింపు ప్రక్రియ పూర్తికాక నిధులు వెనక్కి వెళ్లినట్లు తెలిసింది. మరో పర్యాయం నిధులు మంజూరై భూ బదలాయింపు జరగకపోతే మినీ ఎయిమ్స్ మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫ బొమ్మలరామారంలో ఆర్హెచ్టీసీకి భూ బదలాయింపులో జాప్యం ఫ భూమి మార్కెట్ విలువ రూ.80లక్షలు ఉండడంతో సీసీఎల్ఏ పరిధిలోకి అంశం ఫ మూడేళ్లుగా కలెక్టరేట్లోనే మూలుగుతున్న ఫైల్ ఫ భవన నిర్మాణానికి ఇప్పటికే రెండు పర్యాయాలు వచ్చిన నిధులు వెనక్కి మినీ ఎయిమ్స్కు మల్యాల గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఆరు ఎకరాలు ముందస్తు పొజిషన్ ఇచ్చాం. భూమి మార్కెట్ విలువ రూ.80లక్షలు ఉండడంతో భూ బదలాయింపు ప్రక్రియ సీసీఎల్ఏ పరిధిలోకి వస్తుంది. – శ్రీనివాస్రావు తహసీల్దార్ -
తరలివచ్చిన భక్తజనం
పెన్పహాడ్ : మండల పరిధిలోని గాజులమల్కాపురంలో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. గ్రామం నుంచి దేవతామూర్తులను ఊరేగింపుగా గద్దెల పైకి తీసుకొచ్చారు. మహిళలు పెద్దఎత్తున బోనాలు సమర్పించారు. బంగారం(బెల్లం) మొక్కు చెల్లించారు. కొబ్బరికాయలు, గొర్రె, మేక పొట్టేళ్లను, కోళ్లను బలిచ్చారు. గ్రామమంతా భక్తులతో కిటకిటలాడింది. ఎస్ఐ గోపికృష్ణ, ఏఎస్ఐ రాములు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. నాగుల పుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తులు పూనకంతో ఊగిపోయారు. గురువారం రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి కోలాటం, డ్యాన్స్ పోటీలను ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్రెడ్డి, సర్పంచ్ నాతాల వెంకట్రెడ్డి, బండి రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ సొంటి ఆంజనేయులు, వైస్ చైర్మన్ మండాది పాపయ్య, కుందూరు వెంకట్రెడ్డి, గుత్తికొండ రాంరెడ్డి, దేవిరెడ్డి మధుసూదన్రెడ్డి, బండి అనిల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెర్వుగట్టులో అగ్నిగుండాలు
నార్కట్పల్లి : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున అగ్నిగుండాల ఘట్టాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సతీష్శర్మ, శ్రీకాంత్శర్మ, సురేష్, సిద్దుశర్మ, నాగయ్యశర్మ, జగదీష్శర్మ వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ గరుడ వాహనంపై స్వామి వారితో పాటు ఇరమూస్తి వార్ల ప్రభను అగ్నిగుండం వరకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం అగ్నిగుండాలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఓం నమః శివాయ అంటూ అగ్నిగుండంలో నడిచి మొక్కు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్రెడ్డి, ప్రత్యేక అధికారి భాస్కర్, ఈఓ మోహన్బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, గడుసు శశిదర్రెడ్డి, రేగట్టె నవీన్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనరెడ్డి, ఉప సర్పంచ్ జలేందర్రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హుండీ ఆదాయం రూ.6,22,696 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల హుండీలను బుధవారం లెక్కించారు. రూ.6,22,696 ఆదాయం సమకూరినట్లు ఈఓ మోహన్బాబు తెలిపారు. గత బ్రహ్మోత్సవాల సమయంలో రూ.1,03,365 ఆదాయం రాగా.. ఈ ఏడాది 6,22,696 వచ్చిందని గతేడాది కంటే రూ.5,19,331 ఆదాయం సమకూరిందని వివరించారు. -
రాచరికం toప్రజాస్వామ్యం
భువనగిరి పట్టణానికి ఘనమైన చరిత్రఫ ఎందరో ఉద్ధండులను అందించిన ప్రాంతం ఫ మున్సిపల్ చరిత్రలో అవిశ్వాసాలే అధికం భువనగిరి మున్సిపాలిటీకి ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు రాచరిక పాలనలో ఉన్న ప్రాంతం నేడు ప్రజాపాలనలో కొనసాగుతోంది. అతిపురాతనమైన నగరంగా దీనికి పేరుంది. శాతవాహనుల నుంచి కల్యాణ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల విక్రమాదిత్య, కాకతీయ రాజులు, కుతుబ్షాహీలు, మొఘలులు, సర్వాయిపాపన్న వంటి ఉద్ధండులు భువనగిరిని పాలించారు. అందుకు సాక్షంగా ఉన్న ఖిలా, చారిత్రక సంపద నేటికీ సందర్శకులను ఆకర్షిస్తోంది. 1952లో పురపాలక సంఘంగా ఏర్పడింది. ప్రస్తుతం 35 వార్డులతో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. – సాక్షి, యాదాద్రి క్ర.సం చైర్మన్ పేరు సంవత్సరం పార్టీ 1 ఎండీ. అబ్బాస్అలీ – – 2 అబ్దుల్రహమాన్ చిస్తీ – – 3 పట్నం వెంకటనర్సయ్య – కాంగ్రెస్ 4 పాదరాజు హన్మంతరావు – – 5 సున్నం యాదగిరి 1981 కాంగ్రెస్ 6 డాకూరి కృష్ణ 1983 కాంగ్రెస్ 7 సున్నం యాదగిరి 1985 టీడీపీ 8 ఏవీ శివనాగేందర్ 1989 టీడీపీ 9 హబీబ్ రహమాన్ చిస్తీ 1992 టీడీపీ 10 ఊట్కూరి దామోదర్గౌడ్ 1995 కాంగ్రెస్ 11 పెంట నర్సింహ 2000–05 టీడీపీ 12 దొనకొండ వనిత 2005– 08 కాంగ్రెస్ 13 కొలుపుల కమలాకర్ 2008–09 కాంగ్రెస్ 14 బర్రె జహంగీర్ 2009–10 కాంగ్రెస్ 15 సుర్వి లావణ్య 2014–18 బీజేపీ 16 నువ్వుల ప్రసన్న 2018–19 టీఆర్ఎస్ 17 ఏనబోయిన ఆంజనేయులు 2020– 23 టీఆర్ఎస్ 18 పోతంశెట్టి వెంకటేశ్వర్లు 2023– 25 కాంగ్రెస్ 2011 జనాభా లెక్కల ప్రకారం భువనగిరి మున్సిపాలిటీలో 59,844 మంది జనాభా ఉంది. ఇందులో 30,265 మంది పురుషులు కాగా 29,579 మంది మహిళలు. 2019లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం భువనగిరి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరిగింది. బొమ్మాయపల్లి, రాయిగిరి, పగిడిపల్లి గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. దాంతో గతంలో వార్డుల సంఖ్య 30 నుంచి 35కు పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. 2014లో భువనగిరి మున్సిపాలిటీలో 35, 326 మంది ఓటర్లు ఉండగా 2019లో 44,240కు పెరిగింది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 47,831గా నమోదైంది. 2005లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక వార్డులను గెలుచుకుంది. మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కాగా కాంగ్రెస్కు చెందిన దొనకొండ వనిత చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2008లో కౌన్సిలర్లు ఆమైపె అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోయారు. వైస్ చైర్మన్గా ఉన్న కొలుపుల కమలాకర్ ఇన్చార్జి చైర్మన్గా సంవత్సరం పాటు కొనసాగారు. 2009లో కాంగ్రెస్కు చెందిన బర్రె జహంగీర్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీకి చెందిన సుర్వి లావణ్య చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2018లో ఆమైపె అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోయారు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన నువ్వుల ప్రసన్న చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2020లో బీఆర్ఎస్కు చెందిన ఏనబోయిన ఆంజనేయులు చైర్మన్గా ఎన్నికవగా 2023లో అవిశ్వాసంతో ఆయన పదవి కోల్పోయారు. తర్వాత కాంగ్రెస్కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వారు వెంకటనర్సయ్యదామోదర్గౌడ్అబ్దుల్ రహమాన్దొనకొండ వనిత పెంట నర్సింహ హబీబ్ రహమాన్ శివనాగేందర్ డాకూరి కృష్ణకమలాకర్ వెంకటేశ్వర్లు ఆంజనేయలు నువ్వుల ప్రసన్న బర్రె జహంగీర్ సుర్వి లావణ్య ముఖచిత్రంభువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్యసంవత్సరం పురుషులు మహిళలు మొత్తం 2014 17612 17714 35326 2019 21635 22605 44240 2026 23037 24793 47831 -
గద్దె పైకి సారలమ్మ
రాజాపేట : మండలంలోని చిన్నమేడారం, చల్లూరు యాదాద్రి మేడారంలో గిరిజనుల ఆరాధ్యదైవం సారలమ్మను బుధవారం గద్దైపె అధిష్టింపజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూజారులు గ్రామ సమీపంలోని ఏదులగుట్టపై మూల దేవతలకు పూజలు చేశారు. అనంతరం సారలమ్మను డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సారలమ్మను వెదురు బొంగును పూజారులు గద్దైపెన ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తలనీలాలు, కొబ్బరికాయలు, నిలువెత్తు బెల్లం, కుంకుమ, పసుపు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం పులిగుట్ట నుంచి సమ్మక్క గద్దైపెకి చేరుతుందని పూజారులు తెలిపారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం. శంకర్గౌడ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుంచి చిన్నమేడారం వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ఫ చిన్నమేడారంలో భక్తుల రద్దీ -
పూర్వగిరికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధానల అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు స్వస్తీవాచనం, విష్వక్సేనారాధనలు మొదటి పూజగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు రక్షాబంధనం వేడుక జరిపించారు. స్థల, ద్రవ్య శుద్ధి కొరకు మూలవరులకు, ఆలయ పరిసర ప్రాంతంలో మంత్ర జపములను ప్రోక్షణ చేశారు. ప్రధానాలయంలో, ముఖ మండపంలో, కల్యాణ మండపం, ఆలయ పరిసరాలు, వేంచేపు మండపం, ధ్వజ స్తంభం ప్రాంతాల్లో శుద్ధ జలంతో పుణ్యాహవాచనం జరిపించారు. తొలి పూజలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కె. వినోద్రెడ్డి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ప్రధానార్చకులు, పారాణీకులు, రుత్వికులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అంకురారోపణం.. సాయంత్రం ఆలయ మండపంలో అంకురారోపణం, మృత్సంగ్రహణ వేడుకలు నిర్వహించారు. ఆలయం నుంచి పురవీధుల గుండా వేంచేపు మండపానికి చేరుకుని భూమాతను పూజించి, మృత్తికను(మట్టిని) సేకరించారు. తిరిగి ఆ మృత్తికను ప్రధానాలయంలోని ముఖ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలోని పాలికలలో నింపి, వాటిలో నవధాన్యాలు చల్లారు. ఉత్సవ సమాప్తి వరకు పాలు, శుద్ధ జలాలలో పాలికలను తడిపి నిత్యం ఆరాధనలు గావిస్తామని అర్చకులు వెల్లడించారు. ఈ వేడుకలను ప్రధాన అర్చకులు, యజ్ఞచార్యులు, అర్చక బృందం, పారాయణీకులచే నిర్వహించారు. ఉత్సవాల్లో నేడు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హవనం, వేద పారాయణం నిర్వహిస్తారు. సాయంత్రం భేరి పూజ, దేవతాహ్వానం జరిపిస్తారు. ధ్వజరోహణం జరిగే సమయంలో ఆచార్యులు ధ్వజ స్తంభం వద్దకు వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఫ స్వస్తీవాచనం, విష్వక్సేనారాధనతో ప్రారంభమైన ఉత్సవాలు ఫ నేడు ధ్వజారోహణం, భేరి పూజ, దేవతాహ్వానం -
టీఆర్పీతోనే అభివృద్ధి సాధ్యం
రామగిరి(నల్లగొండ): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టె జానయ్యయాదవ్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పడిన టీఆర్పీ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డులకు చెందిన యువకులు టీఆర్పీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజాగౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, ప్రధాన కార్యదర్శి నారాయణదాస్ కవిత, ఆత్మకూర్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, ఉమ్మడి నల్లగొండ సోషల్ మీడియా కన్వీనర్ సాయి, వినోద్, చారి, రఫీ, షఫీ పాల్గొన్నారు. వరంగల్ హైవేపై మేడారం రద్దీభువనగిరిటౌన్ : హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లే వారి వాహనాలతో బుధవారం బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. అంతేకాకుండా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున ఆశావహుల మద్దతుదారులు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. వీరికి తోడు వీఐపీల తాకిడి సైతం ఉందని టోల్ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. గురువారం, శుక్రవారం మేడారానికి తరలివెళ్లే వాహనాల రద్దీకి అనుగుణంగా ఆ మార్గంలో 8 టోల్బూత్లు ఓపెన్ చేయనున్నట్లు టోల్ నిర్వాహకులు తెలిపారు. -
వనదేవతల జాతర ప్రారంభం
రాజాపేట : రాజాపేట మండలంలోని చిన్నమేడారం, చల్లూరులోని యాదాద్రి మేడారంలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మల జాతరను మంగళవారం నిర్వాహకులు ఎల్లమ్మ దేవతకు పూజలు చేసి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బూర్గుపల్లి, కుర్రారం, చల్లూరు గ్రామాల ప్రజలు బోనాలను డప్పు వాయిద్యాలు, శివస్తుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్లి సమ్మక్క– సారమ్మ దేవాలయ ప్రాంగణంలోని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. నేడు గద్దైపెకి రానున్న సారలమ్మ సమ్మక్క సారమ్మల జారలో భాగంగా నిర్వాహకులు బుధవారం ఏదులగుట్ట నుండి సారలమ్మను డప్పు వాయిద్యాలతో గద్దైపెకి తీసుకురానున్నారు. గురువారం సమ్మక్క తల్లిని పులిగుట్ట నుంచి గద్దైపెకి తీసుకురావడంతో వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి వద్ద సమ్మక్క సారలమ్మ జాతర పెద్దవూర: పెద్దవూర మండలంలోని పొట్టిచల్మ ఎక్స్రోడ్డు వద్ద కృష్ణానది సమీపంలో కొలువై ఉన్న వనదేవతలు సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సమీప జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు పొట్టిచెల్మ ఎక్స్రోడ్డు వద్ద కొలువై ఉన్న సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పూజారులు గుంజ అంజమ్మ, నాగపురి లక్ష్మీనాగరాజు, గుంజ కృష్ణంరాజు మంగళవారం తెలిపారు. ఫ రాజాపేటలోని చిన్నమేడారంలో ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ -
చికిత్స పొందుతూ మహిళ మృతి
నల్లగొండ టౌన్: నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగొమ్ము మండలానికి చెందిన పులికంటి రమణ(40) అనే మహిళ కడుపునొప్పితో వారం క్రితం తులసి ఆస్పత్రిలో చేరగా వైద్యులు పరీక్ష చేసి శస్త్ర చికిత్స చేయాలని తెలిపారు. ఆపరేషన్ సమయంలో గర్భసంచి తొలగించే బదులు ఆమె మూత్రనాళం తొలగించారని, తిరిగి రెండోసారి ఆపరేషన్ చేసినా ఫలితం లేక రమణ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి అక్కడకు చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ తెలిపారు. కూలీల ఆటోను ఢీకొన్న కారుఫ నలుగురికి తీవ్రగాయాలు నిడమనూరు: కూలీల ఆటోను కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం నుంచి సోమోరిగూడేనికి 14 మంది కూలీలు మంగళవారం వరి నాటు కోసం వచ్చారు. సాయంత్రం తిరుగుప్రయాణంలో జంగాలవారిగూడెం దాటగానే ఎదురుగా వచ్చిన కారు, కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తాపడి కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కూలీలు గడగోజు పద్మ, నర్సింగ్ లక్ష్మమ్మ, దాసరి సరిత, మేకపోతుల కళమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 108కు సమాచారం అందించడంతో, సిబ్బంది క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫుడ్సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం ఫ కిరాణా షాపు నిర్వాహకులపై కేసు నమోదు వలిగొండ : వలిగొండలో ఫుడ్సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కిరాణా షాపు నిర్వాహకులపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వలిగొండ మెయిన్ రోడ్డుపై గల మణికంఠ ట్రేడర్స్ కిరాణా షాపులో కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్రెడ్డి తన కార్యాలయ అటెండర్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లేబుల్స్ లేని ఆహార పదార్థాలు, తప్పుడు లేబుల్స్ ఉన్న ఆహార పదార్థాలతోపాటు, కల్తీ పదార్థాలను గుర్తించారు. ఈక్రమంలో వారిపై కిరాణా షాపు యజమానులు నాగభూషణం, ఆయన కుమారుడు మణికంఠ, భార్య లలిత అక్కడకు వచ్చి అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. అసభ్య పదజాలంతో వారిని దూషించారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికగట్టుప్పల్ : మండల కేంద్రానికి చెందిన ఖమ్మం శ్రీనివాస్ కుమారుడు ఖమ్మం చరణ్ అండర్–17 జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. పోటీలు ఈ నెల 29న జార్ఘండ్ రాష్టం రాంచీలో జరుగనున్నాయి. చరణ్ కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సోషల్ వెల్ఫేర్ సైనిక్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. -
గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్
హుజూర్నగర్ : హుజూర్నగర్లో మంగళవారం గంజాయి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వీరమల్ల ఉపేందర్ తన మోటార్ సైకిల్ను రూ.20 వేలకు హైదరాబాద్లో అమ్మాడు. ఆ డబ్బులతో ఉపేందర్, జయంత్లు ఒడిశాలో 6 కేజీల గంజాయి కొనుగోలు చేశారు. దానిని పట్టణ శివారులోని రామస్వామిగట్టు వద్ద సాముల ప్రతాప్ రెడ్డి, చిల్ల వికాస్, సయ్యద్ రహమద్ బాబా, జడ లింగస్వామి అలియాస్ దగడ్ సాయికి అమ్ముతుండగా ఎస్ఐ మోహన్బాబు తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 6 కేజీల గంజాయి, బైక్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
మిర్యాలగూడెం
నాడు నేడు మిర్యాలగూడ టౌన్ : ఒకప్పటి చిన్నగూడమే నేడు మిర్యాలగూడగా మారింది. 1949 వరకు చిన్నగూడెంగా పిలిచేవారు. 1952లో మిర్యాలగూడగా పేరుమారింది. 1956లో పంచాయతీగా 1983లో పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా, 1984లో గ్రేడ్– 3 మున్సిపాలిటీగా, 1989లో గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా మారింది. 2005లో గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఏర్పడింది. మొదటగా 34 వార్డులుండగా పట్టణ సమీపంలోని గ్రామాలను విలీనం చేస్తూ జీఓ 114ను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. శివారు ప్రాంతాల అభివృద్ధితో 36 వార్డులకు చేరుకోవడంతో పట్టణ విస్తీర్ణం 21 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఆ తరువాత మిర్యాలగూడ మున్సిపాలిటీలోకి నందిపాడు గ్రామ పంచాయతీ అయిన నందిపాడు క్యాంపు, రవీందర్నగర్ కాలనీ, ఎఫ్సీఐ కాలనీ, వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయితీ పరిధిలోని 9వ వార్డు గణేష్నగర్, గుడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని హైదలాపురం(ప్రస్తుతం ఇందిరమ్మ కాలనీ) మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో 36 వార్డుల నుంచి 48 వార్డులకు చేరకున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మున్సిపాలిటీలో మొత్తం లక్షా 9వేల 891 మంది జనాభా ఉంది. ప్రస్తుతం పట్టణ విస్తీర్ణం 32.2 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. -
భక్తులు పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలి
రాజాపేట : పులి సంచారంపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి డీఎస్పీ శ్రీనివాసనాయుడు అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలోని చిన్నమేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య, పోలీస్ బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు, పోలీస్ సిబ్బంది వంటి అంశాలను పరిశీలించారు. బందోబస్తుపై పలు సూచనలు చేశారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. తుర్కపల్లి మండలంలో పులి సంచారంపై జాగ్రత్తగా ఉండాలని, తుర్కపల్లి మండలం రాజాపేట మండలానికి ఆనుకుని ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భదత్ర ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు 150 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ మాదాసు శంకర్ గౌడ్, ఎస్ఐలు తకియోద్దీన్, అశోక్, ఏఎస్ఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్తాబైన సమ్మక్క–సారలమ్మ
పెన్పహాడ్: మండల పరిధిలోని గాజుమల్కాపురంలో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం నుంచి ప్రారంభంకానుంది. 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామ పూజారి కృష్ణంరాజు ఇంట్లో ఉన్న సమ్మక్క సారలమ్మలను బుధవారం ఊరేగింపుగా గద్దెలపైకి తీసుకురానున్నారు. నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి కోలాటం, డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
గుండాల : ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యామగాని బక్కయ్య(50) రోజుమాదిరిగా తాటిచెట్టు ఎక్కుతుండగా కమ్ముకున్న మంచుతో చెట్టు నుంచి జారి పడి తీవ్ర గాయాలయ్యాయి. కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తేజమ్రెడ్డి తెలిపారు. -
మూడు వార్డులకు.. ఒక రిటర్నింగ్ అధికారి
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని బాధ్యతలను రిటర్నింగ్ అధికారులకు అప్పగిస్తుండడంతో మున్సిపల్ కమిషనర్లకు కొంతమేర భారం తగ్గనుంది. వారు వివిధ కార్యకలాపాలపై ప్రత్యేకంగా కేంద్రీకరించే అవకాశం ఉంది. ఎన్నికల్లో భాగంగా ప్రతి మూడు వార్డులకు ఒకరి చొప్పున రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. ప్రతి రిటర్నింగ్ అధికారికి ప్రత్యేకంగా కౌంటర్ కేటాయిస్తారు. మున్సిపాలిటీలో అదనంగా 20శాతం మందిని ఆర్ఓ, అసిస్టెంట్ ఆర్ఓలుగా నియమిస్తారు. పార్టీ అభ్యర్థులకు, స్వతంత్రులకు గుర్తులను కేటాయించే బాధ్యత కూడా వీరికే ఉంటుంది. ఎన్నికల ఫలితాల రోజున ఆర్ఓలు కీలకంగా ఉంటారు. అదేవిధంగా కౌన్సిలర్గా గెలుపొందిన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
చౌటుప్పల్ : అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే తమ లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ యు.బాలస్వామి తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారులతో కలిసి చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెంలో ఆయన పర్యటించారు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. గ్రామసర్పంచ్ ఎన్నేపల్లి ధనలక్ష్మి వెంకట్రెడ్డితోపాటు వినియోగదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంతంగి విద్యుత్ సబ్స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరెగూడెం, కాట్రేవు గ్రామాల 11కేవీ వ్యవసాయ ఫీడర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, స్తంభాలను త్వరలోనే మార్పిస్తామన్నారు. ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా విద్యుత్ సరఫరా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలుంటే వినియోగదారులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రత్యేక ఫీడర్ ఏర్పాటుతో రైతులు ఆనందర వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్నేపల్లి ధనలక్ష్మివెంకట్రెడ్డి, ట్రాన్స్కో డీఈ మల్లికార్జున్, ఏడీఈ పద్మ, ఏఈ రాజుల సతీష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఫ టీజీఎస్పీడీసీఎల్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి -
భువనగిరి ఖిలాను సందర్శించిన టీజీపీఎస్సీ చైర్మన్
భువనగిరి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్ బి. వెంకటేశ్వర్లు మంగళవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఈ సందర్భంగా ఖిలాపై చారిత్రక కట్టడాలను తిలకించారు. రాజప్రసాదం, నీటి కొలనులు, కోట ప్రవేశ ద్వారాలు, ప్రహరీలు, ఏనుగు, గుర్రపు శాలలను పరిశీలించారు. ఖిలా చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఖిలాపై ర్యాప్లింగ్, జీప్లైన్ నిర్వహించే విధానాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ అంజిరెడ్డితో పాటు స్నేహితులు ఉన్నారు. భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆయనకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు స్వాగతం పలికారు.స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. -
ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యల పై అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రావొద్దని కోరారు. ఏఈఓ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా గోపినాథ్మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓ) జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మోత్కూరు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి తుంగ గోపినాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకున్నట్లు గోపినాథ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా జెస్సి, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్గా జె.నరేష్, కోశాధికారిగా పి.సాయి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సైదులు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అశోక్లను ఎన్నుకున్నట్లు వివరించారు. క్షేత్రపాలకుడికి ఆకుపూజయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన శ్రీఆంజనేయస్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో ఉన్న శ్రీఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్య సూ క్త పారాయణంతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన హనుమంతుడికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూల మాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన జరిపించారు. ఈ ఆకు పూజలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలిభువనగిరిటౌన్ : ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్ కు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ – హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం యాదాద్రి కలెక్టరేట్లో ఏఓ జగన్, డీడబ్ల్యూఓ నర్సింహారావు లకు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకుడు పాండు మాట్లాడుతూ 18 నెలల క్రితం ప్రభుత్వం వయస్సు పైబడిన వారిని బలవంతంగా రాజీనామాలు చేయించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు. వెంటనే రిటైర్మెంట్ అయినవారికి బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, చిలువేరు రామాకుమారి, నాయకులు అంజమ్మ, లక్ష్మమ్మ, తులషమ్మ, వరలక్ష్మి పాల్గొన్నారు. ఎంజీయూకు లా కాలేజీ మంజూరునల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి లా కాలేజీ మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ జీఓ 3ను మంగళవారం విడుదల చేసింది. మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సును 60 మంది విద్యార్థులతో ప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎల్ఎల్ఎం 2 సంవత్సరాల కోర్సును కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
కేటీఆర్కు ఆహ్వానం
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి మండలంలోని కనుముకుల గ్రామంలో ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు జరిగే శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ బహ్మోత్సవాలకు రావాలని మంగళవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్కు ఆలయ నిర్మాణ కర్తలు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కోట పుష్పలత మల్లారెడ్డి, ఉపసర్పంచ్ పడమటి మహిపాల్రెడ్డి కలిసి ఆ హ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యుడు, ఉత్సవకమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూకల దేవి లింగస్వామి, కోట అజిత్రెడ్డి ఉన్నారు. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
భువనగిరి: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక వివేరా హోటల్ కన్వెన్షన్ హాల్లో సర్పంచ్లు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పారిశ్రామిక వేత్తలకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి యువత హెల్మెట్ ధరించకుండా అతి వేగంగా వాహనాలు నడపడంవల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంతో పాటు కార్లు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు వీధిన పడిన పరిస్థితులను అర్థం చేసుకుని వాహనాలను జాగ్రత్తగా నడపాలని కోరారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీటీఓ సాయికృష్ణ, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్నాయుడు, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, పట్టణ సీఐ రమేష్, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల్లో ఇళ్లు పూర్తి చేస్తాం భువనగిరిటౌన్ : భువనగిరిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ భాస్కర్రావు, అధికారులతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. రెండు నెలల్లో 444 మంది లబ్ధిదారులకు పూర్తి వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అందజేస్తామన్నారు. గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. మున్సిపాలిటీలో వార్డుల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం,అధికారులు, నాయకులు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
బోటు.. మరమ్మతుల్లో ఎందుకులేటు
భువనగిరి: రాయగిరి చెరువులో డీలక్స్ బోటు మరమ్మతులకు గురైంది. రెండు నెలలు గడుస్తున్నా నేటికీ అధికారులు ఆ బోటును అందుబాటులోకి తీసుకురావడం లేదు. దీంతో పర్యాటకులు నిరాశచెందుతున్నారు. భువనగిరి మండలం రాయగిరి చెరువు సమీపంలో రూ. 5 కోట్లతో మినీ శిల్పారా మం నిర్మించారు. దీనిని 2024లో ప్రారంభించారు. ఇందులో చేతి వృత్తులకు సంబంధించి వస్తువులు విక్రయించుకునేందుకు స్టాల్స్, ఉయ్యాలలు, చిన్న పిల్లల కోసం ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. శని, ఆదివారం రోజుల్లో మినీ శిల్పారామం సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆహ్లా దాన్ని పంచేందుకు చెరువులో బోట్లు ఏర్పాటు చేశారు. వారాంతంలో పర్యాటకుల సందడి మినీ శిల్పారామంలో వారాంతపు రోజులైన శని, ఆదివారం సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇందులో ప్రత్యేకంగా మినీ శిల్పారామాన్ని సందర్శించేందుకు వచ్చిన వారు కాగా.. మరికొందరు యాదగిరిగుట్టలో స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో శిల్పారామానికి వస్తుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు 500 నుంచి 650 వరకు పర్యాటకులు వస్తుండగా వారాంతపు రోజుల్లో 1,100 నుంచి 1300 మంది వరకు వస్తుంటారు. మినీ శిల్పారామంలో ఏర్పాటు చేసిన వాటిని తిలకిస్తూ ఆహ్లాదాన్ని పొందుతూ సేదతీరుతుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బోటులో విహరిస్తుంటారు.ఫ రాయగిరిలోని శిల్పారామంలో రెండు నెలల క్రితం మరమ్మతులకు గురైన డీలక్స్ బోటు ఫ నేటికీ అందుబాటులోకి రాని వైనం ఫ నిరాశ చెందుతున్న పర్యాటకులు పర్యాటకులు చెరువులో విహరిస్తూ ఆహ్లాదాన్ని పొందేందుకు మూడు బోట్లు ఏర్పాటు చేశారు. ఇందులో డీలక్స్ బోటు, స్పీడ్ బోటు, పెడల్ బోటు ఉన్నాయి. డీలక్స్ బోటులో విహరించేందుకు పెద్దలకు రూ. 50, చిన్నారులకు రూ. 30, స్పీడ్ బోటుకు నలుగురికి కలిపి రూ. 400, పెడల్ బోటుకు ఇద్దరి నుంచి నలుగురికి రూ. 200 చొప్పున రుసుము చెల్లించాలి. స్పీడ్ బోటు, పెడల్ బోట్లు మినీ శిల్పారామం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీలక్స్ బోటు రెండు నెలల క్రితం మరమ్మతులకు గురైంది. ఇప్పటి వరకు ఈ బోటును అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ బోటులో సుమారు 15 మంది విహరించే అవకాశం ఉంది. మరమ్మతులకు గురైన డీలక్స్ బోటు లేకపోవడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం మేడారం జాతర ప్రారంభం కావడంతో జాతర నుంచి తిరిగి ప్రయాణంలో మినీ శిల్పారామం సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. -
మోగిన ముని్సపల్ నగారా
సాక్షి,యాదాద్రి: పుర ఎన్నికలకు వేళయ్యింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఈనెల 11న పోలింగ్ జరగనుంది. బుధవారం నోటిఫికేషన్ రానుంది. ఇదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 132711 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 64,926 మంది పురుషులు, 67,767 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. మున్సిపాలిటీలకు చేరిన సామగ్రి ఎన్నికల నిర్వహణకు అవసరమైన మెటీరియల్ మున్సిపాలిటీలకు చేరింది. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు మున్సిపాలిటీలకు పంపిణీ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా గెజిటెడ్ అధికారులను నియమించారు. రిటర్నింగ్ అధికారులే బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఒక్కొక్కరికి మూడు వార్డుల చొప్పున క్లస్టర్లు ఏర్పాటు చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. అమలులోకి ఎన్నికల కోడ్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలలో భాగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిలిచిపోనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలో ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల చిహ్నాలను తొలగిస్తున్నారు. ఫ్లెక్సీలు, వాల్పోస్టర్లు, గోడలపై రాతలను తుడిచివేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఆరుమున్సిపాలిటీల్లో 104 వార్డుల్లో 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 800 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అధికంగా ఓటర్లు ఉన్న చోట మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించనున్నందున 449 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉంచారు. తెలుపు రంగు బ్యాలెట్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 42 మంది రిటర్నింగ్ అధికారులు, 42 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 29 మంది జోనల్ అధికారులు, ప్రతి పోలింగ్ కేంద్రానికి నలుగురు చొప్పున సిబ్బందిని నియమించారు. అన్నిపోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. మున్సిపల్ కేంద్రాల్లోనే పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి దివ్యబాల విద్యాలయంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులకు ఎన్నికలు ఫ నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఫ ఫిబ్రవరి 11న పోలింగ్ ఫ ఓటుహక్కు వినియోగించుకోనున్ను 132711మంది ఓటర్లు -
ఇదిగో పులి
ఫ ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి ఆనవాళ్లు ఫ బంధించేందుకు బోన్ల ఏర్పాటు తుర్కపల్లి: రెండు వారాలుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పులి ట్రాప్ కెమెరాకు చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. తుర్కపల్లి మండలం దత్తాయపల్లి రిజర్వు ఫారెస్ట్లో గడ్డిమేస్తున్న రైతు శ్రీశైలానికి చెందిన లేగదూడపై దాడి చేసి చంపేయగా మరో రెండు ఆవులు భయంతో పారిపోయాయి. మంగళవారం ఆ రెండు ఆవులను పులి చంపేసి తిన్న ఆనవాళ్లను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చిన యానిమల్ ట్రాకర్స్ బృందం గుర్తించింది. ఆ పులి వయస్సు సుమారు 4 ఏళ్లు ఉండగా బరువు 300 కిలోల వరకు ఉంటుందని అంచనా వేశారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
సాక్షి,యాదాద్రి : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలను సమర్థంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశ్యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్, ఎస్పీలు పాల్గొని మాట్లాడారు. మోడల్ కోడ్ను కూడా పకడ్బందీగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు శాఖ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో తగినంత సిబ్బందిని నియమిస్తామన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్టీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే..
కనుల పండువగా చెర్వుగట్టు రామలింగేశ్వరుడి కల్యాణంనార్కట్పల్లి : నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. కల్యాణం సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రధాన మండపం నుంచి వృషభ వాహనంపై ఆలయ పురవీధుల గుండా ఊరేగిస్తూ కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. కల్యాణ తంతును శైవాగమ పండితులు అల్లాపురం సుబ్రహ్మణ్య దీక్షితావధాని, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, కార్తీక్శర్మ, శ్రీకాంత్శర్మ, సురేష్శర్మ, సతీష్శర్మ అర్చక బృందం మంత్రోచ్చారణల నడుమ మాఘశుద్ధ రథసప్తమి గడియల్లో నిర్వహించారు. ఉదయం 6,15 గంటలకు జీలకర బెల్లం, 6.40 గంటలకు మాంగళ్యధారణ గావించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మవార్లకు వడి బియ్యం సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ రవి, డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో సుమారు 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పవిత్రమైన క్షేత్రం చెర్వుగట్టు : ఎమ్మెల్యే శ్రీశైలం తర్వాత అంతటి ప్రవితమైన శివక్షేత్రం చెర్వుగట్టు దేవాలయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలందరికీ మంచి జరగాలని ఆ శివయ్యను కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఈఓ మోహన్బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, గడుసు శశిధర్రెడ్డి, వడ్డె భూపాల్రెడ్డి, పున్నపురాజ యాదగిరి, రేగట్టె రాజశేఖర్రెడ్డి, రేగట్టె నవీన్రెడ్డి, నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ జలేందర్రెడ్డి, కమ్మలపల్లి మల్లేశం, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, సంపత్, శ్రీనివాస్రెడ్డి, యాదయ్య, రంగ శ్రవణ్, నరసింహ, కొమ్ము శ్రీను, గౌరుదేవి లక్ష్మయ్య, గడ్డం పశుపతి, సూర ఆంజనేయులు ఉన్నారు. ఫ మాఘశుద్ధ ఘడియల్లో ఒక్కటైన స్వామి, అమ్మవారు ఫ పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వీరేశం దంపతులు ఫ ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు -
మోసాలపై అప్రమత్తగా ఉండాలి
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు వ్యక్తులు తాము ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులమని చెప్పుకుంటూ ఆహార వ్యాపారులను బెదిరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. శ్రీకాంత్రెడ్డి, విక్రమ్నాయుడు, శ్రీనివాస్నాయక్ అనే పేర్లతో కొందరు నకిలీ వ్యక్తులు ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పుకుంటున్నారని, వారు 80747 35461, 73861 60150, 88863 97761 ఫోన్ నంబర్లు ఉపయోగిస్తున్నారని వీరి విషయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ వ్యాపారుల సమాచారం తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. మహా శివుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు విశేషంగా నిర్వహించారు. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో అభిషేక పూజలను సంప్రదాయంగా చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకోగా, పూజారులు శ్రీస్వామివారి ఆశీస్సులను భక్తులకు అందజేశారు. ఇక ప్రధానాలయ గర్భాలయంలో సుప్రభాతం, అభిషేకం, సహస్ర నామార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. -
మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం
భువనగిరిటౌన్ : మహిళా ఉద్యోగులు, సందర్శకుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని కలెక్టర్ హనుమంతరావు.. అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా ఉద్యోగులు, సందర్శకులు అనారోగ్యానికి గురైనప్పుడు విశ్రాంతి తీసుకునే వీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పథకాల పేరు కాదు.. ప్రజల జీవితాలను మార్చాలి ఆలేరు: ‘ఉపాధి హామీ పేరు మార్చి మోదీ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాసే కుట్రలు చేస్తోంది.. పథకాల పేరు మార్చడం కాదు.. ప్రజల జీవితాలను మార్చే ఆలోచన చేయాలి’ అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కేంద్రానికి హితవు పలికారు. సోమవారం ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ భవన్ వద్ద నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఈనెల 30న ఆలేరు మండలం మందనపల్లిలో కార్మికులతో నిర్వహించనున్న సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పాల్గొననున్నట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చకుండా యథావిధిగా కొనసాగించాలన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇజాజ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఎంఎస్ విజయ్కుమార్, నీలం వెంకటస్వామి, రాజశేఖరగౌడ్ పాల్గొన్నారు. దంత వైద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రమేష్రెడ్డినల్లగొండ టౌన్ : భారత దంత వైద్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లగొండకు చెందిన డాక్టర్ జూలకంటి రమేష్రెడ్డి ఎన్నికయ్యా రు. సోమవారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర దంత వైద్య సదస్సులో రమేష్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రమేష్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దంత వైద్య సంఘం ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాలు, పాఠశాలల్లో ఉచితంగా ప్రత్యేక దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు.


