పులి దాడిలో రెండు ఆవులు, లేగ దూడ చనిపోయాయి
గ్రామ శివారులో పశువులను మేపుతుండగా పులి వచ్చి పశువులపై దాడి చేసింది. లేగ దూడను చంపింది. పులిని చూసి ఊళ్లోకి పరుగెత్తాను. నాతోపాటు మా రెండు ఆవులు అటవీ పాంత్రంలోకి పరుగులు తీశాయి. వాటిని కూడా పులే చంపి తిన్నదని అధికారులు సమాచారం ఇచ్చారు.
– గొట్టి శ్రీశైలం, రైతు, దత్తాయిపల్లి,
తుర్కపల్లి మండలం
దత్తాయపల్లి గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులిని బంధించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పులి ఎక్కడెక్కడ తిరుగుతుందో అటవీ శాఖ గుర్తించి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి.
– సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్, దత్తాయపల్లి
పులి దాడిలో రెండు ఆవులు, లేగ దూడ చనిపోయాయి


