యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.4.03కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వచ్చినట్లు అధికారులు తెలి పారు. స్వామి వారి హుండీల్లో 49 రోజులలో భక్తులు వేసిన నగదు, నగలను మంగళవారం కొండకు దిగువన సత్యనారా యణస్వామి వ్రత మండపంలో ఈఓ భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి సమక్షంలో అధికారులు, సి బ్బంది లెక్కించారు. లెక్కింపులో నగదు రూ.4,03, 02,821, మిశ్రమ బంగారం 136 గ్రాములు, మిశ్రమ వెండి 3.600 కిలోలు వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ, డాలర్లు కూడా వచ్చినట్లు తెలిపారు.


