ఏజ్ జస్ట్ ఎ నంబర్
ఫ మున్సిపల్ బరిలో ముగ్గురు వృద్ధులు
మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ ఎన్నికల్లో యువకులకు ధీటుగా వృద్ధులూ బరిలో నిలిచారు. కొండగడప గ్రామంలోని 4వ వార్డు నుంచి దొంతరబోయిన భారతమ్మ 78 ఏళ్ల వయసులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2వ వార్డులో మర్రి మరియమ్మ(74) బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకటో వార్డులో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మోత్కూరు బ్రహ్మాచారి (68) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
పోటీలో 23ఏళ్ల యవతి
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన బద్దం నిశిత (23) 5వ వార్డు
నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంటర్ చదువుకున్న ఆమె ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు.


