అన్నదమ్ముల సవాల్
భూదాన్పోచంపల్లి : పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల బరిలో అన్నదమ్ములిద్దరూ ఒకే వార్డు నుంచి బరిలో నిలిచారు. 5వ వార్డు బీసీ జనరల్కు రిజర్వు అయ్యింది. దీంతో గతంలో ఇదే వార్డు నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన బాతుక లింగస్వామియాదవ్ ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. లింగస్వామికి సొంత తమ్ముడైన బాతుక శంకర్యాదవ్ను ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని 5వ వార్డు నుంచే పోటీ చేయిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ పోటీ పడుతుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.
అన్నదమ్ముల సవాల్


