అలరించిన సంగీత మహాసభలు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైన ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. మల్లాపురంకు చెందిన శ్రీరామభక్త భజన మండలి, రాయగిరికి చెందిన శ్రీలలిత భక్త భజన మండలి, కాచిగూడకు చెందిన భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి. యాదగిరిగుట్టకు చెందిన పరమేశ్వరి నృత్య బృందం, గౌరిభట్ట సాత్విక ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. హైదరాబాద్కు చెందిన ఫణిబాల వయోలిన్, పసుమర్తి శేషుబాబు కూచిపూడి నృత్య ప్రదర్శన, మంజుల రామస్వామిచే యాదవ నారాయణం భరతనాట్యం, మృధురవళి, దర్బ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, శివచంద్రలహరి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.


