నాలుగు దశాబ్దాల అ‘పూర్వ’ సమ్మేళనం
మఠంపల్లి : మండల కేంద్రంలోని వీవీ హైస్కూల్లో 1985–86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం బక్కమంతులగూడెం వద్ద మామిడి తోటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఒకేచోట కలుసుకున్నారు. నలభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులుకిష్టపాటి వెంకట్రెడ్డి తాటికొండ సత్యనారాయణరెడ్డి, సామేల్, రాజు, జ్వానిస్, రవికుమార్, సుధాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, కరుణాకర్రెడ్డి, అప్పిరెడ్డి, లక్ష్మీనారాయణ, మీరాసాబ్, అంజయ్య, రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, నగేష్, శంభయ్య, బేత కోటమ్మ, ప్రతాపరెడ్డి, ఇన్నాశమ్మ, విజయమేరి, టేక్లారాణి, సోములమ్మ, వాణిశ్రీ, మంగమ్మ, చంద్రకళ, ఫాతిమా, మేరీ, సుజన, థెరీసా, విజయ, రమణ, పద్మ, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.


