ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి
దేవరకొండ: పట్టణంలోని సంజయ్కాలనీలో గల పీర్ల బావిని రేచర్ల వెలమ రాజుల కాలంలో నిర్మించారు. ఒకప్పుడు పట్టణంలోని చాలా కాలనీల ప్రజలు ఈ బావి నీటినే తాగేవారు. బావిలోకి దిగేందుకు బండరాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి నుంచి దేవరకొండ ఖిలాకు సొరంగ మార్గం ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. బావిలోకి చెలిమె ద్వారా వచ్చే నీటికి ఎంతో రుచి ఉండేదని, దీంతో చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఈ నీటిని తీసుకెళ్లేవారు. ప్రస్తుతం ఈ బావి నీటి వాడకం తగ్గింది. కానీ ఇప్పటికీ కొందరు తమ ఇంటి అవసరాలకు మోటార్ల ద్వారా ఈ బావి నీటిని వినియోగిస్తున్నారు. ఈ బావి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ బావిని పునరుద్ధరించి గత వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజల దాహార్తిని తీర్చిన పీర్ల బావి


