ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
భువనగిరి(బీబీనగర్) : బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ నందిగారి బస్వయ్య, ఈఓ నరేందర్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మ కసిరెడ్డినారాయణరెడ్డి, దేవాదయ శాఖ సూపరింటెండెంట్ భాస్కర్, ధర్మకర్తలు ఆలేటి బలరాం, అల్వా గోపాల్రెడ్డి, వెంకటేష్, వాకిటి సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ బొమ్మగాని బస్వయ్యగౌడ్, శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, రామకృష్ణారెడ్డి, రాంకొండల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


