breaking news
Parvathipuram manyam District Latest News
-
బెదిరింపు ప్రకటనలు సరికాదు
● జిందాల్ భూములను రైతులకు అప్పగించాలి ● సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణవిజయనగరం గంటస్తంభం: 2006లో జిందాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను చట్టప్రకారం పరిశ్రమ పెట్టనందున రైతులకు తిరిగి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు బెదిరింపు ప్రకటనలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విజయనగరంలోని ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు తీసుకుని 17 సంవత్సరాలైనా నేటివరకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, స్థానిక ప్రజలకు ఉపాధి చూపలేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి తీసుకున్న భూములను ఐదేళ్లలో పరిశ్రమ కట్టకపోతే తిరిగి రైతులకు అప్పజెప్పాలని చట్టంలో ఉన్న విషయం అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. 2006 భూ సేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఎందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ నిర్వహించారని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సేకరణ చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఆ రోజు పరిశ్రమను వ్యతిరేకించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. పరిశ్రమ పెట్టకపోతే భూములు వెనక్కి ఇవ్వకుండా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు పెడతామని, అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బెదిరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు ఈ భూములు అప్పగించాలన్న కుట్ర తప్ప మరొకటి కాదన్నారు. ఒక వేళ కొత్త పరిశ్రమ కోసం భూమి కావాలంటే పబ్లిక్ హియరింగ్ పెట్టి మళ్లీ భూ సేకరణ చేపట్టి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలి తప్ప బెదిరించి తీసుకుంటామని అనడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, టీవీ.రమణ పాల్గొన్నారు. -
కూటమి పెద్దలకి పరమాన్నం, పేదలకి గంజి నీళ్లు
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావువిజయనగరం గంటస్తంభం: కాంగ్రెస్, తెలుగుదేశం, నేటి కూటమి ప్రభుత్వాలు గత 20 ఏళ్లుగా కాగ్నిజెంట్, టీసీఎస్, జిందాల్ లాంటి కంపెనీలకు కారుచౌకగా భూములను కట్టబెడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయం డీఎన్ఆర్ అమర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..కోనేటి రంగారావు భూకమిటీ సిఫార్సులను అనుసరించి నాటి నుంచి నేటి వరకు ఎక్కడా ఎకరా భూమి కూడా పేద రైతులకు, పేదలకు 3 సెంట్లు ఇంటి స్ధలం ఇచ్చిన ధాఖలాలు లేవని మండిపడ్డారు. భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను, నివాసం ఉంటున్న పేదల ఇళ్లను తొలగించడమే కానీ పేదలకు భూమి ఇవ్వడానికి చేతులు రాని ప్రభుత్వాలు కార్బొరేట్లకు మాత్రం వేలాది ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెడుతున్నాయని విమర్మించారు. విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజవర్గం బౌడార ప్రాంతంలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1100 ఎకరాల్లో 900 ఎకరాలు ప్రభుత్వ భూమిని జిందాల్ కంపెనీకి ఇవ్వడానికి తలపెట్టి బాకై ్సట్ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆనాటి జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ రావు నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందన్నారు. ప్రస్తుత ఉన్న కలెక్టర్ ఇటీవల కాలంలో మీడియాలో ఏ ప్రభుత్వం భూ సేకరణ జరపలేదని మాట్లాడారు. భూ సేకరణ చేయకుంటే ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరిగిందో నేడున్న కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిందాల్ భూముల విషయంలో ఆందోళనకారులపై దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియచేశారు. పేదలకు అందాల్సిన పరిహారంలో అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలు వచ్చాయని దీనిపై తగు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, అలమండ ఆనందరావు పాల్గొన్నారు. -
సీపీఓ సేవలు అభినందనీయం
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై వీరరాజు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీరరాజు మంచి సేవాతత్పరతతో వృత్తిని నిర్వహించారని ప్రశంసించారు. అంకితభావంతో సేవలు అందించడం వల్ల మన్ననలు పొందగలరని పేర్కొన్నారు సీనియర్ల సేవలను జూనియర్లు గుర్తించి వారిని మార్గదర్శకంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. రిటైర్ అయిన సీపీఓ పి.వీరరాజు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వృత్తిలో సంతృప్తి పొందానని పేర్కొన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు సహకరించిన కలెక్టర్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్ఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
పార్వతీపురంటౌన్: మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు మందులు కుటుంబాలను, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయన్నారు. వాటిపై అవగాహన అత్యావశ్యమన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, దానిని కాపాడుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. యోగా వంటి ఆరోగ్య అంశాల పట్ల ఆసక్తి కలిగి ప్రతిరోజూ సాధన చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని హితవు పలికారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందులు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా ఆర్థికంగా, మానసికంగా కుటుంబాలను నాశనం చేస్తాయన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు పునఃప్రారంభమయ్యాయని వాటి చుట్టు పక్కల ఎటువంటి విక్రయాలు, కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. అటవీ, మారుమూల ప్రాంతంలో సారా తయారీ వంటి అంశాలను గమనించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల విక్రయాలు వివిధ రూపాల్లో ఉండే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, మత్తు మందుల ఉత్పాదకత, సరఫరా, రవాణా, విక్రయాలు, వినియోగం జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాటికి సంబంధించిన వివరాలు తెలిసినవారు 1972 ఫోన్ నంబర్కు సమాచారం అందించాలని కోరారు. రవాణా వాహనాలను తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా రవాణా అధికారి వి.దుర్గాప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కె.సుమిత్ర, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆశ షేక్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ వీవీవీ ఎస్ఎస్బాబు, ఆర్పీఎఫ్ ఎస్సై ఎ.కె.పాణిగ్రహి, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
విరమణ వృత్తికే కాని సేవా ధర్మానికి కాదు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వృత్తికే కానీ సేవాధర్మానికి కాదని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తన కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై పి.సత్యనారాయణ, ఏఎస్సైలు ఎం.సత్యనారాయణ, వేణుగోపాల ప్రాణిగ్రహి, ఆరిక చిన్నయ్య, సత్యవరపు రజనిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్శాఖలో అంకిత భావంతో సేవలందించిన వారి సేవలు పదిలంగా ఉంటాయని ఉద్యోగ విరమణ పొందిన వారు తమ అమూల్యమైన సూచనల మేరకు విధి నిర్వహణలో అనుభవ పూర్వకమైన సందర్భాలను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పంచుకోవాలని కోరారు. విరమణ అనంతరం వారి శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు. అనంతరం శాలువాలతో సన్మానించి, జిల్లా కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున జ్ఞాపికలు, చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్బీ సీఐ ఆదాం, సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రంగనాథం, ఏఆర్ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు, ఏఏఓ సతీష్బాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
పార్వతీపురంటౌన్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ఎస్.శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, డీఆర్డీఏ పీడీ సుధారాణిలతో కలిసి ప్రజల నుంచి 112 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఐసీడీఎస్ పీడీ డా.టి.కనకదుర్గ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఆర్.కృష్ణవేణి, జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ ఎస్ మన్మథరావు, సర్వే ఎ.డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలైతే చట్టపరమైన చర్యలు పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలైతే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే చట్టపరిధిలో నాణ్యమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధి నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి స్వయంగా స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదులలో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భర్త, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీపత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలు ఉన్నాయి. మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్కు 72 అర్జీలు ీసతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 72 అర్జీలు వచ్చాయి. చొర్లంగిలో సీహెచ్డబ్ల్యూవో పోస్టు ఇప్పించాలని కోడూరుకు చెందిన నీలవేణి కోరారు. హడ్డుబంగి పాఠశాలలో నాడు–నేడు పనులకు బిల్లులు మంజూరు చేయాలని ఎ.గాయత్రి అర్జీ ఇచ్చారు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకులో జమకాలేదని కారెంకొత్తగూడకు చెందిన సవర మల్లమ్మ వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ కుమార్, డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దుర్మరణం చెందింది. అందాల లోకాన్ని చూడడానికి వెళ్తూ అనంత లోకాలకు పయనమైంది. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిప వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామానికి చెందిన కర్రి నాగమణి(20) తన స్నేహితుడైన విశాఖపట్నం జిల్లా ప్రహ్లాదపురానికి చెందిన దాసరి కార్తీక్ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి అరకు అందాలను తిలకించేందుకు నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై బయల్దేరారు. దాసరి కార్తీక్కు చెందిన స్కూటీపై నాగమణి పయనిస్తోంది.కాగా మంగళపాలెం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం డిపోకు చెందిన సిటీ బస్సు స్టాపర్ను తప్పించ బోయి స్కూటీపైకి వెళ్లడంతో స్కూటీపై పయనిస్తున్న ఇద్దరూ రోడ్డు అంచున పడిపోయారు. కార్తీక్ కొద్దిగా దూరంగా పడడంతో సురక్షితంగా తప్పించుకున్నాడు. నాగమణి బస్సుపై పడిపోవడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. నాగమణి విజయనగరంలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మన్మథరావు తెలిపారు. -
800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాల్లో సోమవారం దాడులు చేసి 800 లీటర్ల బెల్లం ఊటను పట్టుకుని ధ్వంసం చేసినట్లు చినమేరంగి ఎస్సై అనీష్ తెలిపారు. గ్రామాల్లో సారా, మద్యం అమ్మినా తెలియజేయాలని, అటువంటి వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్సై ప్రజలకు సూచించారు.యువత చెడువ్యసనాలకు బానిసకావద్దని హితవు పలికారు. సారా తయారీకి ఉపయోగించిన సామగ్రిని ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్సిబ్బంది ఉన్నారు. 230 సారా ప్యాకెట్లు సీజ్ సాలూరు రూరల్: మండలంలోని బాగువలస గ్రామం వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 230 సారా ప్యాకెట్లు సోమవారం పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. నక్కడ వలస గ్రామానికి చెందిన సురగడ రామ్మోహన్ ను పట్టుకుని సారా ప్యాకెట్లతో పాటు ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.40 వేలు ఫైన్రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నామని ఈ క్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తుల నుండి సోమవారం కోర్డులో రూ.40 వేలు ఫైన్ కట్టించినట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. చిన్నబగ్గ సమీపంలో ఏనుగులుసీతంపేట: మండలంలోని చిన్నబగ్గ ఆశ్రమపాఠశాలకు సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు ఘీంకరిస్తోంది. సోమవారం రాత్రి ఏనుగులు ఇక్కడికి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నిన్న, మెన్నటి వరకు చిన్నబగ్గ, గోరపాడు కొండల్లో సంచరించిన ఏనుగులు ఇప్పుడు ఏకంగా గ్రామానికి దగ్గరలోనే తిష్ఠ వేయడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. ఏనుగులను కవ్వించవద్దని అటువైపు ఎవ్వరూ తిరగవద్దని స్థానికులకు ట్రాకర్లు తెలియజేస్తున్నారు. ఎఫ్బీవో దాలినాయుడుతో పాటు సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తున్నారు. ప్రత్యేక అధికారిని నియమించండి విజయనగరం గంటస్తంభం: జిందాల్ భూ సేకరణలో అవకతవకలు జరిగాయని, దీనిని సరిదిద్దేందుకు కలెక్టర్ వెంటనే ఒక ప్రత్యేక అధికారిని నియమించి భూములు కోల్పోయిన రైతులకు న్యాయంచేయాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ అంబేడ్కర్కు వినతిపత్రం అందజేశారు. భూములిచ్చిన కోన సీతమ్మ, కొదల మదన మేరీ కుటుంబాలకు నేటికీ పరిహారం అందలేదన్నారు. -
వైద్యుడు దేవుడితో సమానం
● విపత్కకాలంలోనూ రోగులకు సేవలు ●నేడు వైద్యుల దినోత్సవం విజయనగరం ఫోర్ట్: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. రోగులు వైద్యుడిని భగవంతుడిలా అరాధిస్తారు. ఎందుకంటే ప్రాణాలు నిలబెట్టగలిగే శక్తి వైద్యుడికి మాత్రమే ఉంటుంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నైనా వెరవకుండా ధైర్యంగా సేవలు అందించేది వైద్యులే. నాలుగేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేసినప్పటికీ వైద్యులు ఏమాత్రం భయపడకుండా వైద్యసేవలు అందించారు. వైద్యుల్లో సేవాదృక్పథంతో పనిచేసే వారు ఉన్నారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేసే వారు కూడా ఉన్నారు. సమాజంలో కొత్త కొత్త వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వాటి నివారణ చర్యలు కనుగొని వైద్యులు సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో రోగులకు సేవలందించే సమయంలో కోవిడ్ బారిన పడి పలువురు వైద్యులు మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ మిగిలిన వైద్యులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా కోవిడ్ బాధితులకు సేవలు అందించారు. జిల్లాలో 700 మంది వరకు వైద్యులు జిల్లాలో 50 పీహెచ్సీలు, 7 సీహెచ్సీలు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, 300 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో సుమారు 700మంది వరకు వైద్యులు పనిచేస్తున్నారు. వైద్యవృత్తి ఉన్నతమైనది వైద్యవృత్తి ఉన్నతమైనది. ప్రజలు డాక్టర్ని గౌరవించాలి. వైద్యం కోసం వచ్చే వారితో ప్రేమగా, అప్యాయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని అవసరమైన వైద్యాన్ని అందించాలి. వైద్యవృత్తిని చేపట్టినందుకు అదృష్టంగా భావించాలి. ప్రతి రోగిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, సర్వజన ఆస్పత్రివైద్యులు గౌరవప్రదంగా మెలగాలి సమాజంలో వైద్యులు గౌరవప్రదంగా మెలగాలి. వెద్యులను ప్రోత్సహిస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. వైద్యులపై ఒత్తిడి పెట్టకూడదు. ఒత్తిడి లేకుండా ఉంటే మెరుగైన వైద్యసేవలు అందించగలరు. వైద్యులు రోగులకు ప్రేమతో సేవలు అందించాలి. డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ సేవాభావం ఉంటే వైద్య వృత్తి చేపట్టాలి ఓపిక, సహనం ఉంటేనే వైద్య వృత్తిని చేపట్టాలి. సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి. సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వైద్యులు కృషి చేయాలి. ఆధునాతన వైద్యసేవలను ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలి. రోగులు వైద్యులను గౌరవించాలి. డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ఊరి బడి.. గుండెల్లో అలజడి!
● తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ● గ్రామంలోని పాఠశాలను మరోచోటకు విలీనం చేయవద్దని విజ్ఞప్తి సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం చేపట్టిన స్కూళ్ల విలీనం ప్రక్రియపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో నని తల్లడిల్లుతున్నారు. ఏళ్ల తరబడి ఊర్లో ఉన్న బడిని దూరం చేస్తే.. చిన్న వయస్సులో ఉన్న తమ పిల్లలు రహదారులు, కాలువ గట్లు దాటుకుంటూ ఎలా వెళ్లగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలను అంత దూరం పంపలేమని.. టీసీలిచ్చేస్తే మరో చోటకు మార్చుకుంటామని హెచ్ఎంలను అడుగుతున్నారు. నెలల తరబడి వీరు పోరాటం చేస్తున్నా.. అధికారులు చలించడం లేదు. ప్రభుత్వం కూడా వీరి మొర వినడం లేదు. ఫలితంగా పిల్లలను బడులకు పంపలేక, విద్యాసంవత్సరం వృథా చేయలేక సతమతమవుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు మార్చేస్తున్నారు. అన్నిచోట్లా ఇదే పరిస్థితి... పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని యాజమాన్యా ల్లో కలిపి 1,594 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో అనేక పాఠశాలలు విలీనం పేరుతో ఊరికి దూరమ వుతుంటే.. అక్కడికి తమ పిల్లలను పంపలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజుల కిందట బలిజిపేట మండలం పెదపెంకి–1 పాఠశా ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇదే విషయమై కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తిరుగు ప్రయాణంలో రహదారి ప్రమాదం బారిన పడ్డారు. ఇప్పటికీ వారి పాఠశాల తెరుచుకోలేదు. ●గరుగుబిల్లి మండలం హిక్కింవలస ఎంపీపీఎస్ లో 3, 4, 5 తరగతులను గరుగుబిల్లి జెడ్పీహెచ్ఎస్ లో కలపడంపై గ్రామస్తులు కొద్దిరోజులుగా ఆందో ళనలు చేస్తున్నారు. ఆ తరగతులను గతం మాదిరి కొనసాగించి, హిక్కింవలస ఎంపీపీఎస్ను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్చాలని కోరుతున్నారు. గ్రామంలో ఎటువంటి విచారణా చేయకుండానే మార్పు చేశారని ఇప్పటికే మూడు సార్లు అధికారు లను కలిసి వినతిపత్రాలు అందించారు. ●తమ గ్రామంలోని పాఠశాలను తరలించొద్దని పాలకొండ మండలంలోని బెజ్జి గ్రామస్తులు ఇటీవల ఆందోళనకు దిగారు. ఈ పాఠశాలను కొద్దిదూరంలోని తలవరం యూపీ పాఠశాలలో విలీనం చేశారు. దూరం కావడంతో అక్కడికి తమ పిల్లలను పంపేది లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. విలీనం పేరుతో గ్రామాలకు దూరమైన పాఠశాలల్లో తల్లిదండ్రులంతా దాదాపు ఇదే ఆవేదనతో ఉన్నారు. ●స్కూళ్లు ప్రారంభమై మూడు వారాలు గడిచిపోతున్నాయి. ఇప్పటికీ ఆయా పాఠశాలల్లో పిల్లలు తరగతులకు హాజరు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 175 పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఈ ఏడాది ఇంకా విద్యార్థులు చేరలేదని అధికారులు గుర్తించారు. గతేడాది ఒకటో తరగతి చదివిన విద్యార్థుల్లో 173 మంది రెండో తరగతిలో చేరలేదు. 3, 4, 5 తరగతుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. విలీన సమస్యను ప్రభుత్వం పునఃపరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫౌండేషన్ స్కూల్ వద్దు.. ప్రాథమిక పాఠశాలే ముద్దు చిత్రంలో కనిపిస్తున్నవారు గరుగుబిల్లి మండలం రావివలస గ్రామస్తులు. తమ ఊరి బడి సమస్యను కలెక్టర్కు వివరించేందుకు సోమవారం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు వచ్చారు. ఇక్కడి అంబేడ్కర్ నగర్లో ఎంపీపీ పాఠశాల(ఎస్డబ్ల్యూ) ఉంది. గతంలో షెడ్యూల్ కులాలు, గిరిజన పిల్లల కోసం.. డ్రాపౌట్లను తగ్గించే ఉద్దేశంతో చాలా ఏళ్ల క్రితం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వీరి పాఠశాలను ఫౌండేషన్ స్కూల్గా మార్చింది. దీనివల్ల 3, 4, 5 తరగతులను మరోపాఠశాలలో విలీనం చేశారు. దీనివల్ల కలిగే ఇబ్బందులను వివరిస్తూ.. బేసిక్ ప్రైమరీ పాఠశాలగానే ఉంచాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గోడు వినండి సారూ... కలెక్టరేట్కు వచ్చిన వీరంతా ఒకప్పుడు మడ్డువలస రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితు లు. సుమారు 20 ఏళ్ల కిందట బలిజిపేట మండలం పలగర గ్రామం గుడివాడ కాలనీ, కొట్టిస కాలనీగా ఏర్పడి 500 కుటుంబాల వరకు నివా సం ఉంటున్నాయి. అప్పట్లో ప్రభుత్వం నిర్వాసిత కాలనీ పిల్లల కోసం పాఠశాల నిర్మించింది. తల్లిదండ్రుల్లో అధిక శాతం మంది వ్యవసాయ, సిమెంట్ పనుల కోసం చైన్నె, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిపోతుంటారు. పిల్లలని ఇక్కడే వృద్ధుల వద్ద, బంధువుల ఇళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఇప్పుడు ఆదర్శ పాఠశాల పేరిట నిర్వాసితుల కాలనీ స్కూల్లో ఉన్న పిల్లలను అధికారులు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో శ్మశానం, రెండు చెరువులు, పెదంకలాం కాలువ ఉన్నాయి. చిన్న పిల్ల లు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఇప్పటికే పలుమార్లు డీఈఓ, డీఆర్ఓ, కలెక్టర్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. వారి మొర ఎవరూ వినడం లేదు. సోమ వారం మరోమారు కలెక్టరేట్కు వచ్చారు. ‘పాఠశాలల పునఃప్రారంభం నుంచి పిల్లలు బడులకు వెళ్లడం లేదు. వెళ్లినా తిరిగి పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజ నం పెట్టడం లేదు. పోనీ, టీసీలు ఇచ్చేయండన్నా ఎవరూ వినడం లేద’ని విద్యార్థుల తల్లులు ఎల్.జయలక్ష్మి, బౌరోతు లక్ష్మి, గుడివాడ నాగమణి, సంధ్యారాణి, నాగళ్ల లక్ష్మి వాపోయారు. -
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు మన్యం బిడ్డలు
గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల దేశిక్, కన్నయ్యగూడకు చెందిన తోయక నరేంద్రనరసింహ ఎంపికై నట్టు కోచ్, కొత్తగూడ జీటీడబ్ల్యూహెచ్ఎస్ పీడీ ఎన్.మాధవరావు తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన సోమవారం మాట్లాడుతూ.. జూన్ 26వ తేదీన విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో దేశిక్ అండర్ –10, నరేంద్ర నరసింహ అండర్–12 ఈపీఈఈ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. విజయవాడలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జూన్ 29న జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు వెల్లడించారు. వీరిద్దరూ మహారాష్ట్రలోని నాశిక్లో జూలై 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇన్చార్జి సీపీఓగా పట్నాయక్ పార్వతీపురం రూరల్: జిల్లా ఇన్చార్జి ముఖ్య ప్రణాళిక అధికారిగా ఎస్ఎస్ఆర్కే పట్నాయక్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్ప టివరకు పనిచేసిన పి.వీర్రాజు ఉద్యోగ విరమ ణ చేయడంతో ఆ స్థానంలో విశాఖపట్నం సీపీఓ కార్యాలయ సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న పట్నాయక్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. గణాంక సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. సచివాలయ ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సెలింగ్ విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సచివాలయం ఏఎన్ఎంలకు జూమ్లో సోమవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయనగరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, పార్వతీపురం డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు, ఏఓ ప్రభూజీ, సూపరింటెండెంట్ నాగరాజు కౌన్సిలింగ్ నిర్వహించారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పదోన్నతులుపార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఎస్జీ టీలకు స్కూల్ అసిస్టెంట్స్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించినట్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్.కృష్ణవేణి తెలిపారు. పీఓ ఆదేశాల మేరకు పదోన్నతుల ప్రక్రియను సోమవారం నిర్వహించి 19మందికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు కె.దేష్, ఏటీడబ్ల్యూఓ ఒ.కె చంద్రబాబు పాల్గొన్నారు. మడ్డువలసలో ఏనుగులు తిష్ట వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు పరిసరాల్లో తొమ్మిది ఏనుగులు తిష్టవేశాయి. చెరకు, వరినారు మడులను ధ్వంసం చేస్తున్నాయి. వంగర–రాజాం రోడ్డు పక్కన సోమవారం సంచరించడంతో అటవీ, పోలీస్ శాఖ సిబ్బంది అప్రమత్తమై రాకపోకలను కాసేపు నిలిపివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖ రేంజర్ మణికంఠేశ్వరరావు, సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తూ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. -
అడవిబాట పట్టి.. బడిని తీర్చిదిద్ది..
● వసతిని విస్మరించిన కూటమి ప్రభుత్వం ● గిరిజనులే సొంతంగా గతంలో రేకుల షెడ్, ఇప్పుడు పూరిపాక నిర్మాణం మక్కువ: వారంతా అడవి బిడ్డలు. తమ వలే పిల్లలు నిరక్షరాస్యులు కాకూడదని తలచారు. పిల్లలు చదుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల విద్యాభ్యాసనకు సరైన వసతి లేకపోవడంతో గతంలో రేకులషెడ్ నిర్మించారు. సమస్యను గుర్తించిన గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు శాశ్వతవసతి కల్పించాలని నాడు–నేడు రెండో విడతలో మార్కొండపుట్టి పంచాయతీ కె.పెద్దవలస ప్రాథమిక పాఠశాలకు రూ.37లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణాలు తలపెట్టింది. రూ.10లక్షల విలువైన పనులు జరిపింది. ఇంతలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పునాదుల దశలో ఉన్న పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. తన నియోజకవర్గంలోని పాఠశాల పిల్లలు వసతిలేక ఇబ్బంది పడుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పట్టించుకోకపోవడంతో కె.పెద్దవలస గ్రామస్తులు తల్లడిల్లారు. చివరకు.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 52 మంది పిల్లలు విద్యాభ్యాసనకు ఇబ్బంది పడకుండా ఉండాలన్న లక్ష్యంతో శ్రమదానంతో అడవిలో కర్రలు సేకరించారు. విరాళాలు పోగుచేసి గడ్డెను కొనుగోలు చేశారు. సుమారు వారం రోజుల పాటు శ్రమించి ఉపాధ్యాయుల సూచనల మేరకు చక్కని పూరిపాకను నిర్మించారు. దీనిని రెండు, మూడురోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
చేయి ఎత్తొద్దు!
గొంతు విప్పొద్దు..●బ్యానర్లు తెస్తే.. అటు నుంచి అటే... ● పీజీఆర్ఎస్లో కొత్త ఆంక్షలు ●పోలీసులతో వార్నింగులు ● వినతులిచ్చేవారి గళం నొక్కే ప్రయత్నం కొత్త ఆంక్షలు.. సరికొత్త నిబంధనలు అనుమతి లేనిదే నిరసనలు, ర్యాలీలు చేపట్టకూడ దన్నది కొత్తగా యంత్రాంగం తీసుకొచ్చిన నిబంధ న. కనీసం గుంపుగా తమ సమస్య వినిపించుకునేందుకు వచ్చినా.. పోలీసుల అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. రెండు రోజుల కిందట పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించేందుకు వస్తే.. కలెక్టరేట్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారిని వెనుకకు పంపించేశారు. తాజాగా సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలోనూ ఇదే తరహా ఆంక్షలు కనిపించాయి. సాధారణంగా సామాజిక సమస్యలపై సామూహికంగానే వినతులిచ్చేందుకు వస్తారు. ఆయా ప్రాంతంలోని గ్రామస్తులు.. వివిధ సంఘా ల వారు మూకుమ్మడిగా వచ్చి అధికారులను కలిసి తమ మొర వినిపిస్తారు. నెలలు, ఏళ్ల తరబడి ఆ సమస్యకు మోక్షం కలగకపోతే.. కాస్త గట్టిగానే తమ గళం వినిపించి, నినాదాలు చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ పద్ధతి ఉంది. అటువంటి గొంతులపైనా కూట మి ప్రభుత్వం కత్తిగట్టింది. కలెక్టరేట్ గేటు దాటి గుంపులుగా వస్తే ఆంక్షలే.. లోపలికి వినతి ఇచ్చేందుకు నలుగురైదుగురు మించి వెళ్లకూడదట. బ్యానర్లు ప్రదర్శించకూడదంట. చేయి ఎత్తి నినాదాలు చేయకూడదు. గొంతు ఎత్తి గట్టిగా తమ వాణి వినిపించకూడదంట! మరి వినతుల పరిష్కారం మాట అని అడిగితే.. ఆ మాటకు సమాధానమే ఉండదంట!! వచ్చిన వారికి పోలీసులతో ప్రశ్నలు, హెచ్చరికలు. ఇన్ని ఆంక్షలు తాము ఎన్న డూ చూడలేదని ప్రజాసంఘాల నాయకులు అంటుంటే.. తామేమీ నిందితులమా, తీవ్రవాదులమా అని సాధారణ అర్జీదారులు వాపోతున్నారు. అధికారుల వాహనాలకు షెడ్డులు.. అర్జీదారులకు ఆరుబయట గట్లు! కలెక్టరేట్ ప్రాంగణంలో ఇటీవల పలు మరమ్మతు పనులు చేపట్టారు. గదులు నిర్మించారు. అధికారుల వాహనాల పార్కింగ్కు షెడ్లు వేయించారు. పీజీఆర్ఎస్కు, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులకు ఆంక్షలు పెట్టి, కట్టడి చేస్తున్నారు. పీజీఆర్ఎస్ మందిరంవైపు ఎక్కువ మంది రాకుండా వైర్లతో వలయం కట్టారు. కనీసం వారికి ఆరుబయట వేచి ఉండేందుకు ఏర్పాట్లు సైతం లేవు. సోమవారం వర్షం పడుతున్నా.. చెట్ల కింద, గట్లపైన, గొడుగులు వేసుకునే ప్రజలు అవస్థలు పడ్డారు. అర్జీదారులకు నిలువ నీడ చూపని మన అధికారులు.. తమ వాహనాలు మాత్రం ఎండకు, వానకు పాడవకుండా షెడ్డులు కట్టించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు. వీరికి ఐదునెలల జీతాల బకాయిలు ఉన్నాయి. నెలల తరబడి జీతాల బకాయి ఉంటే.. నిరుపేదలమైన తాము ఎలా జీవించగలమని వాపోతున్నారు. పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించేందుకు మూకుమ్మడిగా వస్తే పోలీసులు అడ్డుకున్నారు. పరిమితంగానే లోపలికి వెళ్లి వచ్చేయాలని సూచించారు. -
535 ఎంఎస్పీలకు స్థానచలనం
విజయనగరం క్రైమ్: ఉమ్మడి విజయనగరం జిల్లా లో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 535 మంది మహిళా సంరక్షణ పోలీసుల(ఎంఎస్పీ)కు స్థానచలనం కలి గినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీ స్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో సోమవా రం రాత్రి 10 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగింది. ఎస్పీతో పాటు ఏఎస్పీ సౌమ్యలత కౌన్సె లింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. రోగులైన వారు, వైవాహిక పరిస్థితులు, విజువల్ ఇంప్లైయిడ్, తదిత ర అంశాలపై బదిలీల్లో పరిగణనలోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. మొత్తం 635 మందికి 535 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్డు/గ్రామ సచి వాలయాలను కేటాయించామన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు మేరకు బదిలీ ఉత్తర్వులను రెండు, మూడు రోజు ల్లో విడుదల చేస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌ దరి, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎస్ఐ ప్రభావతి, ఆర్ఎస్ఐ లు నీలిమ,మంగలక్ష్మి, డీపీఓ సిబ్బంది తేజ, రాంబాబు, శ్రీనివాసరావు, సుధారాణి, హేమంత్, పీఆర్వో కోటేశ్వరరా వు, ఐటీ కోర్ టీమ్ పాల్గొన్నారు. -
అలకల్లోలం..!
● వేటకు అల్పపీడనం దెబ్బ ● ప్రతికూల వాతావరణంతో కొనసాగని చేపల వేట ● ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులుప్రతికూల వాతావరణంతో పతివాడబర్రిపేటలో ఉధృతంగా వస్తున్న కెరటాలుపూసపాటిరేగ: సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన రెండు నెలలుగా వేట నిషేధం కారణంగా సముద్రంలో వేట నిలిపివేశారు. తీరా వేట ప్రారంభించిన నాటి నుంచి వాతావరణంలో మార్పులతో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడం తదితర కారణాలతో కొంత సమయం వేట సాగలేదు. తాజాగా గత మూడురోజులుగా అల్పపీడనం కారణంగా కెరటాలు ఉధృతిగా రావడంతో చేపల వేటకు వెళ్లినా చేపలు వలకు చిక్కని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో గాలులు వీయడం, అలలు ఎగిసి పడుతుండడంతో వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో 21 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. సంప్రదాయ బోట్లు, ఇంజిన్బోట్లు రెండు మండలాల్లో 1120 వరకు ఉన్నాయి. వాటిలో 885 బోట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంభించినప్పటి నుంచి చేపలు వలకు చిక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నిషేధ సమయంలో కుటుంబాలు ఎలాగో నెట్టుకొచ్చినా మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అలల ఉధృతి ఎక్కువై బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. వేట లేకపోవడంతో వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. వేట నిషేధ సమయంలో భృతి మంజూరుకు నిబంధనల పేరిట చాలామంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో వేట చేసిన ప్రతి మత్స్యకారుడికి మత్స్యకార భరోసా మంజూరైంది. కానీ నేడు మత్స్యకారుల పరిస్థితి అయోమయంగా మారింది. గత ఏడాది కూడా మత్స్యకార భరోసా ఊసెత్తని సర్కారు నిబంధనల పేరిట ఈ ఏడాది చాలా మందికి కోత విధించింది. ఏడాదిలో సగం రోజులు ప్రకృతి వైపరీత్యాలు, మరి కొన్ని రోజులు తుఫాన్ హెచ్చరికలు, ప్రతి కూలవాతావరణంతో వేట సాగక ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార జీవనవిధానంలో మార్పులకు సర్కారు ప్రత్యామ్నాయం ఆలోచించి వేట లేని సమయంలో తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.అరకొరగా మత్స్యసంపద వేట నిషేధసమయం తరువాత వేటకు వెళ్లినా చేపలు వలకు చిక్కడం లేదు. ప్రతి ఏడాది నిషేధం తరువాత చేపల వేట చేస్తే మత్స్య సంపద సమృద్ధిగా దొరికేది. కానీ ఈ ఏడాది నిషేధం తరువాత చేపల వేట సాగడం లేదు. వేటకు వెళ్లినా డీజిల్ఖర్చు కూడా రాని పరిస్థితి నెలకొంది. అల్పపీడనం కారణంగా మూడురోజులుగా వేట సాగలేదు. – సూరాడ కొర్లయ్య, పతివాడబర్రిపేటప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూలవాతావరణం నెలకొని అలల ఉధృతి పెరిగింది. వాతావరణంలో మార్పుల కారణంగా వేట చేయలేని పరిస్థితి. వేట సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. వేటలేని సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి ఆదుకోవాలి. – ఆకుల కాశీలు, పతివాడ బర్రిపేట -
ఇంటర్ విద్యార్థి మృతి
బొబ్బిలి: బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన అలమండ ఉదయ రాజ్(16) అనే ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ఆదివారం దుర్మరణం చెందాడు. బాడంగి మండలానికి చెందిన అలమండ రవి బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తూ బొబ్బిలిలోనే స్థిరపడ్డాడు. రవికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉదయరాజ్ విశాఖలోని శశి కాలేజ్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ఉదయరాజ్ పాత బొబ్బిలిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్పై వెళ్లాడు. స్నేహితుడితో మాట్లాడి తిరిగి రాతిపనివారి వీధిలోని తన ఇంటికి వస్తుండగా పాత బొబ్బిలిలో ఉన్న గుంతల వద్ద అదుపు తప్పి కిందపడిపోవడంతో లారీ ఢీకొంది. దీంతో ఉదయ రాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ప్రేమ్కుమార్ 8వ తరగతి చదువుతున్నాడు. తల్లి ఉష భర్తకు చేదోడు వాదోడుగా షాపు దగ్గర ఉంటోంది. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్సై పి జ్ఙానప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని సీహెచ్సీకి తరలించారు. -
బియ్యం దొంగలకు భరోసా..!
● వారి జోలికి వెళ్లొద్దని అధికారులకు కూటమి నేతల హుకుం ● అధికారులు మౌనం దాల్చారని విమర్శలువిజయనగరం ఫోర్ట్: బొండపల్లి మండలంలో పెద్దఎత్తున పీడీఎస్ బియ్యం పట్టివేత సంఘటన జరిగి 24 రోజులవుతున్నా చర్యలు శూన్యం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన దొంగలకు కూటమి నేతలు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించిన వారి జోలికి వెళ్లొద్దని కూటమికి చెందిన నేతలు సంబంధిత శాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుచేతనే అధికారులు మిన్నకుండిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారం చేపట్టిన తొలినాళ్లలో కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పడు పీడీఎస్ బియ్యం నేరుగా నారసంచులతోనే దొరికినప్పటికీ కిమ్మనకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రేషన్ వాహనాల ద్వారా పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతోందనే డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టిన మొదటి నెల ఆరంభంలోనే నార సంచులతో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించారు. ఇది పెద్ద ఎత్తున సంచలనమైంది. బొండపల్లి మండలంలో పట్టుబడిన బియ్యం పేదప్రజలకు అందించే పీడీఎస్ బియ్యం కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బొండపల్లి మండలంలోని కొండకిండాంలో గల కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, కిండాం ఆగ్రహారం మామిడి తోటలో 43 క్వింటాళ్ల ిపీడీఎస్ బియ్యం అధికారులు గుర్తించారు. రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్ బియ్యం కోళ్ల ఫారం, మామిడితోటల్లోకి తరలించడం సంచలనమైంది. అయితే ఈ సంఘటన జరిగి 24 రోజులవుతున్నా వ్యాపారులు ఏ రేషన్ షాపు నుంచి తరలించారనేది అధికారులు ఇంతవరకు తేల్చలేదు. ఎంతసేపు 6 ఎ కేసులు నమోదు చేశామని చెప్పడం తప్ప. వ్యాపారులకు సహకరించిన రేషన్ డీలర్ ఎవరనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. అయితే పీడీఎస్ బియ్యం ఏ రేషన్ షాపు నుంచి వెళ్లాయన్న విషయం సివిల్ సప్లైస్ అధికారులకు తెలిసినప్పటికీ కూతమి నేతలు బయటకు చెప్పవద్దని ఆదేశించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బయటకు చెప్పడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి లేని పాలన అందిస్తామని కూటమి నేతలు గొప్పలు చెబుతున్నారు. కానీ పీడీఎస్ బియ్యం తరలింపు ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా నోరు మెదపడం లేదు. వ్యాపారులపై కోర్టులో కేసులు పీడీఎస్ బియ్యం తరలించిన వ్యాపారులపై కోర్టులో కేసులు పెడతాం. బియ్యం తరలించిన రేషన్ డీలర్ల వివరాలు కూడా తెలిశాయి. వారిపై నిఘా పెట్టాం. వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. – కె.మధుసూదన్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
చెస్పోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
● అంతర్జాతీయ పోటీలకు 21 మంది ఎంపికవిజయనగరం: ‘సరిలేరు మాకెవ్వరు’ అని నిరూపించారు దివ్యాంగ క్రీడాకారులు. మూడు రోజులుగా జిల్లా వేదికగా జరిగిన 5వ జాతీయ దివ్యాంగుల చెస్ చాంపియన్షిప్లో పాల్గొన్న దివ్యాంగులు తమ ప్రతిభ చాటిచెప్పారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో నగరంలోని మెసానిక్ టెంపుల్లో జరిగిన పోటీల్లో దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 106 మంది క్రీడాకారులు పాల్గొన్న విషయం విదితమే. శనివారం రాత్రి వరకు 9 రౌండ్ల పోటీలు హోరాహరీగా సాగాయి. అనంతరం 9వ రౌండ్లో అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారులను ఆయా విభాగాల వారీగా విజేతలుగా ప్రకటించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర, జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం కార్యదర్శి కేవీ.జ్వాలాముఖిలు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర మాట్లాడుతూ మానసిక మేధోసంపత్తికి చెస్ వంటి క్రీడాకారులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చన్నారు. దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగ క్రీడాకారులు ప్రతిభా పాటవాలు చెప్పలేనివని, పోటీల్లో విజేతలుగా నిలిచిన వారితో పాటు పాల్గొన్న వారు విజేతలేనంటూ అభినందించారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి మాట్లాడుతూ జాతీయస్థాయిలో నిర్వహించిన దివ్యాంగుల చెస్ చాంపియన్షిప్ పోటీలు మొత్తం 7 కేటగిరీల్లో నిర్వహించామని, ఆయా కేటగిరీల్లో మొదటి మూడు స్థానాలు దక్కించుకున్న వారిని త్వరలో గోవాలో జరగనున్న ప్రపంచస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు రూ.2.30 లక్షల నగదు బహుమతులను అందజేశామని వివరించారు. కార్యక్రమంలో పలువురు చెస్ అసోసియేషన్ ప్రతినిధులు, అర్బిటర్లు, క్రీడాకారులు, వారి తలిదండ్రులు పాల్గొన్నారు. -
మద్యం వద్దు.. తాగునీరు ముద్దు
● సారిపల్లిలో వినూత్న ప్రచారం ● మద్యపాన నిసేధంపై ఇంటింటికీ కరపత్రాల పంపిణీనెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఎక్కడ చూసినా మద్యం లభిస్తోంది కానీ తాగునీరు మాత్రం దొరకడం లేదని గ్రామానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకులకు కనువిప్పు కలిగేందుకు గ్రామస్తులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ రాయి పైడమ్మ, ఎంపీటీసీ మజ్జి త్రివేణి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ పర్యటించి మద్యపాన నిషేధంపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేశామని, ఆలయాల నిర్మాణంతో పాటు గ్రామాభివృద్ధికి పలు తీర్మానాలు చేశామన్నారు. పేదలను పీల్చిపిప్పి చేస్తున్న మద్యాన్ని గ్రామంలో అమ్మకూడదని హెచ్చరికలు కూడా జారీ చేశామన్నారు. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిసేధమే లక్ష్యంగా కరపత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జల్జీవన్ మిషన్లో భాగంగా మంజూరైన ఇంటింటి కుళాయిల ఏర్పాటుకు కూటమి నాయకులు సహకరించాలని కోరారు. -
సైబర్ వలకు చిక్కి నగదు పోగొట్టుకున్న బాధితుడు
పాలకొండ రూరల్: ఓవైపు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు నేరగాళ్లు, హ్యాకర్ల బారిన పడుతున్నారు. తాజాగా పాలకొండ మండలం సింగన్నవలసకు చెందిన బిల్లకుర్తి ఉపేంద్రకుమార్కు సైబర్ వలకు చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 28 న సమీప గ్రామ సచివాలయానికి చెందిన ఓ కార్యదర్శి నంబర్ నుంచి ఓ ‘లింక్’ మెసేజ్ ఉపేంద్రకుమార్ వచ్చింది. గతంలో వలంటీరుగా పనిచేసిన క్రమంలో బహుశా కార్యదర్శి నుంచి ఈ లింక్ వచ్చి ఉంటుందని భావించి ఆ లింక్ ఓపెన్ చేశాడు. ఇంతలో సెల్ ఫోన్కు పలుమెసేజ్లు వరుసగా వస్తుండడంతో సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే అప్పటికే సెల్ హ్యాక్ కావడంతో స్నేహితులు, బంధువులకు పలు మెసేజ్లు వెళ్లాయి. తన ఆరోగ్య పరిస్థతి సరిగా లేదని ఆర్ధిక సాయం చేయాలని ఈ మెసేజ్ల సారాంశంగా బాధితుడు తెలుసుకున్నాడు. ఇంతలో తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఇదే సెల్కు అనుసంధానం చేసి ఉండడంతో వరుసగా నగదు మాయం అవుతుండడం, సమాచారం సెల్ఫోన్కు మెజేజ్ల రూపంలో వస్తుండడంతో ఆందోళన చెందాడు. తన ప్రమేయం లేకున్నా రూ.56వేల పైచిలుకు నదగు పలు దఫాలుగా మాయం కావడంతో ఆదివారం స్థానిక పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. -
చోరీ కేసులో రెండవ నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 2017లో డబ్బుల అపహరణ కేసులో రెండవ నిందితుడ్ని ఆదివారం అరెస్ట్ చేసినట్టు వన్టౌన్ సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఆ కేసులో బాధితుడు కర్రి రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, దర్యాప్తు పూర్తి చేశారు. ఆ కేసులో గుత్తి ప్రవీణ్ కుమార్, ఆర్.జయ ప్రకాష్ రెడ్డి, మహమ్మద్ అమీనుద్దీన్, చెల్లి రాజు, బూర రత్నాజీ, విశ్వనాథ్ రెడ్డి సంగీత కన్నన్లను ఇదివరకే అరెస్ట్ చేశారు. ఈ కేసులో రెండవ నిందితుడు తమిళనాడుకు చెందిన జీజే శ్రీనివాసులు పరారీలో ఉండగా ట్రాన్సిట్ వారెంట్తో విజయనగరం తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజలు రిమాండ్ విధించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు. రెండు బైక్లు ఢీకొని వ్యక్తి దుర్మరణంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పీఎస్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని నటరాజ్కాలనీకి చెందిన నూకరాజు(41) దుర్మరణం చెందాడు. నూకరాజు ఇంటి నుంచి బైక్పై ధర్మపురి వెళ్లాడు. తిరిగొస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో నూకరాజు కింద పడిపోగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు. -
‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: బెహరా వెంకట సుబ్బారావు సర్వ లభ్యరచనల పుస్తకం ‘మధ్యతరగతి మందహాసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం అరసం జిల్లాశాఖ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశమందిరంలో ఆదివారం వేడుకగా నిర్వహించారు. కార్యక్రమానికి కలిగొట్ల సన్యాసిరాజు అధ్యక్ష్యత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బహుభాషా గ్రంథకర్త డాక్టర్ వీవీవీ.రమణ మధ్యతరగతి గాథలు, వ్యథలను స్వయంగా పరిశీలించి, అనుభవించి రాసిన గొప్ప రచయిత బెహరా సుబ్బారావు అని ప్రశంసించారు. మన జీవితాల్లో జరుగుతున్న అనేక సంఘటనల సమాహారం మధ్యతరగి మందహాసమని విశిష్ట అతిథి, వ్యంగ్య కథల రచయిత డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ కేఎస్ఎస్ బాపూజీ కథలపై సమీక్ష చేస్తూ సునిశతమైన హాస్యాన్ని కథలలో జోడిస్తూ తాను చెప్పాల్సిన విషయాన్ని సున్నితంగా చెబుతూ ప్రతి కథకు గొప్ప కొసమెరుపులిచ్చారన్నారు. పుస్తక సంపాదకుడి సుబ్బారావు కుమారుడు మూర్తి మాట్లాడుతూ నాన్నగారి కథలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యానికి దోహద పడ్డాయన్నారు. సుబ్బారావు కథలు మధ్యతరగతి మహాభారతమని, అటువంటి గొప్ప కథల పుస్తకాన్ని సుబ్బారావు పుత్రుడు మూర్తి పెద్ద గ్రంథంగా తీసుకురావడం తండ్రిరుణం తీర్చుకున్న కుమారుడిగా ధన్యుడయ్యాడని అరసం జిల్లా అధ్యక్ష్యుడు జీఎస్.చలం పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత రాజోలు నుంచి హాజరైన ఎం.ఎస్.సూర్యనారాయణ కథల మీద సమగ్రమైన విమర్శ రావాలని, ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
బీమా భారం
● ఉచిత పంటల బీమా పథకానికి మంగళం ● పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ● వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటలకు బీమా వర్తింపు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించింది విజయనగరం ఫోర్ట్: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తయినా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేల పెట్టుబడి సాయం అందజేయలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా సాయం ఊసెత్తడం లేదు. మరోవైపు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసింది. రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించుకోవాలి. లేదంటే విపత్తుల సమయంలో పంటలు కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం అందదు. జిల్లాలో సాగవుతున్న వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటల సాగు విస్తీర్ణం ప్రకారం చూస్తే రైతులపై రూ.6.19 కోట్ల భారం పడనుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు పెట్టుబడి సాయం అందే దారి కనిపించక, మరోవైపు బీమా చెల్లింపునకు చేతిలో డబ్బులు లేక ఆవేదన చెందుతున్నారు. రైతన్నపై కూటమి ప్రభుత్వం కపటప్రేమ చూపుతోందని, తమ ఓట్లతోనే అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమనే ఇబ్బందులకు గురిచేస్తోందంటూ మండిపడుతున్నారు. ఖరీఫ్లో నాలుగు పంటలకు బీమా వర్తింపు... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నాలుగు పంటలకు పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. నాలుగు పంటలకు కూడా పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లించుకోవాల్సిందే. వరి పంటకు హెక్టారుకు రూ.500, నువ్వు పంటకు హెక్టారుకు రూ.162.50, మొక్కజొన్నకు హెక్టారుకు రూ.412, పత్తి పంటకు హెక్టారుకు రూ.4,807 చెల్లించాలి. ఈ లెక్కన జిల్లాలో ఆయా పంటల సాగువిస్తీర్ణం ప్రకారం రైతులు రూ.6.19కోట్ల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉచిత పంటల బీమా నాకు మూడు ఎకరాల మెట్టు భూమి ఉంది. అందులో అరటి తోట సాగు చేస్తున్నాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నా తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించడం వల్ల తుఫాన్ సమయంలో పంట నష్టపోతే 50వేల పరిహారం అందింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం రైతులను కట్టుకోమంటోంది. – గనివాడ సన్యాసినాయుడు, రైతు, పెదమధుపాడ గ్రామం రైతులే చెల్లించాలి పంటల బీమా పథకానికి సంబంధించి బీమా ప్రీమియంను రైతులే చెల్లించుకోవాలి. పంటల బీమా కడితే ప్రకృతి వైపరీత్యాల సమయంలో బీమా వర్తిస్తుంది. లేదంటే ఆర్థిక సాయం అందే పరిస్థితి ఉండదు. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఐదేళ్లూ ఒక్క రూపాయి కట్టలేదు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పంటల బీమా ప్రీమియం ఒక్క రూపాయి కూడా మేము చెల్లించలేదు. అంతా ప్రభుత్వమే చెల్లించేది. విపత్తుల సమయంలో పరిహారం అందేది. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. వరి పంట సాగుకు సిద్ధమవుతున్నాను. అధికారులు పంట బీమా ప్రీమియం చెల్లించాలని చెబుతున్నారు. లేదంటే పరిహారం అందదంటున్నారు. ఇది రైతుకు ఆర్థిక భారమే. ప్రభుత్వమే స్పందించి ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. – రంధి దేముడు, రైతు పెదవేమలి గ్రామం -
పడిపోయిన పైనాపిల్ ధర
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025నేడు పీజీఆర్ఎస్ సమావేశం సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అధికారులు నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సీతంపేట: కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే పీవీటీజీ గిరిజనుల అభివృద్ధి సాధ్యమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ రాహుల్ ఖురానా అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం డీఏ జుగా, పీఎం జన్మన్ పథకాల అమలు తీరును పరిశీలించడానికి సీతంపేట ఏజెన్సీలో రెండో రోజు ఆదివారం మొగదార కాలనీ, డి.బుడగరాయి, చిన్నరామ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో పీఎం జన్మన్ పథకాల ద్వారా నిరుపేద ఆదిమ గిరిజనులకు గృహాలు మంజూరు చేశామన్నారు. గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి అన్ని విధాల అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. వీటిని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ భవనాలు లేని చోట కొత్తవి నిర్మించనున్నారని ప్రభుత్వ స్థలం లేకపోతే అవసరమైన ప్రైవేటు స్థలం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలు విన్నారు. అంగన్వాడీ స్టాల్స్ను పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకటేష్, సీడీపీవో సిమ్మాలమ్మ, పీవీటీజీ కో ఆర్డినేటర్ కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వరాహ, నరసింహమూర్తి అవతారాల్లో జగన్నాథుడు విజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయా త్ర మహోత్సవాల్లో భాగంగా కోళ్ల బజారులో కొలువైన బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథస్వామి ఆదివారం వరాహ, నరసింహమూర్తి అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చ కులు పి.నగేషాచార్యులు, వెంకటరమణాచార్యులు స్వామివారికి పూజాదికాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ఒకటి, ఆరో తరగతుల్లో ప్రవేశాలు పెరగాలి : కలెక్టర్ పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతుల్లో ప్రవేశాలు పెరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1, 6 తరగతుల్లో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి విద్యార్థులు చేరేలా శ్రద్ధ కనబరచాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, వీఆర్వోల సహకారం తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రవేశాలన్ని ఈ డ్రైవ్ ద్వారా భర్తీ కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పాటు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, నోట్ బుక్స్ తదితర సామగ్రి కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకంతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా తల్లికి వందనం కింద రూ.15 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తోన్న సంగతిని కలెక్టర్ గుర్తు చేశారు. ఇన్ని వసతులు, లబ్ధిని చేకూర్చే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ప్రతీ ఏటా పెరగాలని, ఆ దిశగా తల్లితండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థికి పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు (పెన్) కేటాయించాలని, ఆ నంబరు ఉంటేనే విద్యార్థి రిజిస్టర్ అయినట్లవుతుందని తెలిపారు. తద్వారా తల్లికి వందనం వర్తిస్తుందని, ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలు పొందాలని, లేకుంటే వాటికి దరఖాస్తు చేయించి పెన్ పొందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై 1వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ డా. టి.కనకదుర్గ, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.సీతంపేట మార్కెట్కు ఆదివారం భారీగా పైనాపిల్ను గిరిజనులు విక్రయించేందుకు తీసుకువచ్చారు. అయితే ఓ వైపు బోరున వర్షం.. మరోవైపు పడిపోయిన ధరతో ఏం చేయాలో గిరిజనులకు తెలియలేదు. చివరకు ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్గా మారి ధరను మరింత తగ్గించి ఒక్కో పైనాపిల్ను రూ.7 నుంచి 10 మధ్య కొనుగోలు చేశారు. గిరిజనులు చేసేది లేక వారికే విక్రయించాల్సి వచ్చింది. గత వారం ఇదే పైనాపిల్ను రూ.10 నుంచి 15 వరకు కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల మోసాలకు నష్టాలు చవి చూస్తున్నామని వాపోయారు. – సీతంపేట న్యూస్రీల్ -
సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జేవీవీ రాష్ట్ర మహాసభలు
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించే 18వ జనవిజ్ఞాన వేధిక మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె.త్రిమూర్తులు పిలుపునిచ్చారు. స్థానిక ఏపీఎన్జీవో హోమ్లో ఆదివారం జరిగిన ఆహ్వాన సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు ప్రజలు హేతుబద్దంగా ఆలోచించి జీవించాలని గత 37 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక అవిరళ కృషి జరుపుతున్నదని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉద్యోగులు ఉపాధ్యాయులు, విద్యార్ధులు, యువకులు, మహిళలు మధ్యతరగతి మేధావులు, వృత్తి నిపుణులు దాదాపు 30 వేలకు పైగా సభ్యులున్న అతి పెద్ద సైన్స్ ప్రచార సంస్థ జనవిజ్ఞాన వేదిక అని కొనియాడారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు సంభవించినా సైన్స్కు సంబంధించి ఏ అంశం ముందుకొచ్చి చర్చనీయాంశంగా మారినా జేవీవీ కార్యకర్తలు ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘానికి చైర్మన్గా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణను సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రమణప్రభాత్, సాహితీ స్రవంతీ రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి పాల్గొన్నారు. ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం విజయనగరం అర్బన్: గణాంక శాఖ పితా మహులు ప్రొఫెసర్ పీసీమహల్నోబిస్ జన్నదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జరుపుకొనే జాతీయ గణాంక దినోత్సవం కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికా రి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలిత ఆయన చిత్రపటానికి సీపీవో పి.బాలాజీ, సిబ్బంది పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీపీవో మాట్లాడుతూ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్లాల్ నెహ్రూ అయితే భారత ప్రణాళిక పథకానికి పీసీమహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. గ్రామంలో భూమికి హద్దులు నిర్ధారించి అందులో సాగైన భూమి, సాగుకి పనికి రాని భూమి, దేవాలయాలు, చెరువులు, శ్మశానాలు, పల్లం భూమి, మెట్టు భూమి, సత్రాలు, పన్నులు వసూలు, వస్తువుల అమ్మకాలు, చారిటీ ద్వారా ఆదాయం వంటి విషయాలను సేకరణ ప్రక్రియ ప్రాధాన్యతను పాలకులకు తెలియజేశారని తెలి పారు. ఏడీ, ఉప గణాంకాధికారులు పాల్గొన్నారు. -
సంగాంలో ఏనుగుల సంచారం
వంగర:సంగాంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. శనివారం అర్ధరాత్రి రేగిడి మండలం సరసనాపల్లి తోటల్లోంచి మడ్డువలస వంతెన కింది భాగం మీదుగా సంగాం పంట పొలాల్లోకి ప్రవే శించాయి. మొక్కజొన్న, చెరకు, వరి పంటలను నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఆదివారం రాత్రి వంగర నుంచి రాజాం వెళ్లే రోడ్డును ఆనుకొని సంగాం పంట పొలాల్లో తొమ్మిది ఏనుగులు తిష్ట వేశాయి. అటవీ శాఖ సిబ్బంది, ఎలిఫెంట్ టేకర్స్ వాటి వెంట ఉంటూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
ఎంటీఎస్లకు అన్యాయం!
ఉపాధ్యాయ బదిలీల్లో... పార్వతీపురం టౌన్: ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల అనంతరం జిల్లాలో పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని ఎంటీఎస్లతో సర్దుబాటు చేసేందుకు వారం రోజుల కిందట కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో తమకు తీరని అన్యాయం జరిగిందని మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 475మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 1998, 2008 డీఎస్సీ బ్యాచ్లకు చెందిన వీరంతా మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో జిల్లాలో వివిధ పాఠశాలల్లో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన రెగ్యులర్ బదిలీల అనంతరం సుదూర ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతాలకు దూరంగా సుమారు 70–100 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బదిలీలపై ఎంటీఎస్ ఉపాధ్యాయులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. అరకొర జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెెళ్లి విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో సుమారు 80శాతం మంది రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సిన వారే ఉన్నారని చెబుతున్నారు. మండలాలకు ఎంటీఎస్లను పంపినా.. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేవనే కారణంతో 50శాతం మందికి పైగా ఎంటీఎస్లను విధుల్లోకి తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. క్లస్టర్ విధానంతో పాట్లు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన క్లస్టర్ విధానం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ విధానంలో ఎస్జీటీలతో కొన్ని ఉన్నత పాఠశాలలకు తాత్కాలికంగా భర్తీ చేశారు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలు రాలేదని అధికారులు చెబుతుండంతో ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కౌన్సెలింగ్ పూర్తయి వారం రోజులు గడుస్తున్నా.. పాఠశాలలు కేటాయించడం లేదని వాపోతున్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 475 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు ఇవే... కేవలం రూ.32 వేలతో పని చేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను పని చేస్తున్న మండలాల్లో సర్దుబాటు చేయలేదు. ప్రతీ మండలంలో ఉన్న మోడల్ స్కూల్లో ఒక ఎంటీఎస్ను నియమించలేదు. ప్రభుత్వం చూపిస్తున్న ఖాళీలు నివాస ప్రాంతాలకు 200 కిలోమీటర్లు ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి వస్తే హెచ్ఆర్ఎ, డీఏ ఇచ్చి రెగ్యులరైజేషన్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ క్లస్టర్లో క్లస్టర్ వేకెన్సీలు సృష్టించి ఎంటీఎస్లకు సర్దుబాటు చేయడంలేదు. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్లకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. మున్సిపల్ పాఠశాలలో వేకెన్సీలను కూడా 15 నుంచి 20మంది విద్యార్థులున్న ప్రతీ పాఠశాలలో ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించాలి. పాఠశాలలు కేటాయించాలి ఎంటీఎస్లకు పాఠశాలలు కేటాయించాలి. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్లకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అరకొర జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం, అధికారులు పునరాలోచించాలి. కొమరాడ మండలంలో క్లస్టర్కు కేటాయించారు. కాని పాఠశాల కేటాయించలేదు. – ఎంటీఎస్ ఉపాధ్యాయుడు క్లస్టర్ విధానంతో పాట్లు మండలాలను కేటాయించినా.. విధుల్లో చేర్చుకోని వైనం క్లస్టర్ పాఠశాలలకు నియామకం ఆందోళనలో ఎంటీఎస్లు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదంటున్న అధికారులు ఉమ్మడి జిల్లాలో 475 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు -
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
బాడంగి: మండలంలోని డొంకినవలస–బొబ్బిలి రైల్వేస్టేషన్ల మధ్య గొళ్లాది మంగళ గేటు సమీపంలో రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. బొబ్బిలి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సుమారు 45ఏళ్ల వయస్సు కలిగిన మహిళను రైలు ఢీకొనడం లేదా జారిపడి పోవడం వల్ల మృతి చెంది ఉంటుందని రైల్వే హెచ్సీ ఈశ్వరరావు తెలిపారు. మృతురాలి శరీరంపై ఎరుపు, పసుపు రంగుచీర కలిగి ఉందని, గుర్తు పట్టడానికి ఎటువంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచామని తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఆర్పీఎస్ఎస్ఐ 9490617089 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాముకాటుతో వృద్ధుడు.. గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందిన ఎప్పరిక తిరుపతిరావు(63) పాము కాటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిరావు గ్రామ సమీపంలో పశువుల శాల వద్ద పెంచుతున్న కోళ్లను కప్పేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లగా అక్కడ నాగుపాము కాటేసింది. తిరుపతిరావు ఆ పామును అక్కడే కొట్టి చంపేశాడు. ఇంటికొచ్చి కుటుంబీకులకు తెలియజేయగా వైద్యం నిమిత్తం భద్రగిరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిరుపతిరావు మృతి చెందినట్టు తెలిపారు. అనంతరం భద్రగిరి ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం నిర్వహించి తిరుపతిరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఉద్యోగాల పేరిట మోసం చేసిన నాల్గో వ్యక్తి అరెస్టు
విజయనగరం క్రైమ్ : ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసిన కేసులో నాల్గో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వన్టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. 2022లో రైల్వే, డాక్యార్డులో ఉద్యోగాలిస్తామంటూ నలుగురు ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేశారు. అప్పట్లో అందిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ వెంకటరావు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో నాల్గో నిందితుడైన కొత్తవలసకు చెందిన కోసూరు శివ వెంకట సత్యనారాయణను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని సీఐ తెలిపారు. రూ.80వేలు రికవరీ చేసినట్టు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు శనివారం పయనమయ్యారు. ఈ నెల 29నుంచి విజయవాడలో గల డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో అండర్ – 10, 12 వయస్సుల విభాగాల్లో జరగనున్న పోటీల్లో సైబర్, ఇప్పి, ఫాయిల్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో జిల్లా నుంచి పడాల గణేష్, జాయ్ జబేజ్, టి.నరేంద్ర, హసీనా శ్రీవల్లి, మొహమ్మద్ షేక్ అహ్మద్ ప్రాతినిధ్యం వహించనున్నారు. క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చీఫ్ కోచ్ డివి చారిప్రసాద్, సభ్యులు దాలిరాజు, పిల్లా శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు అభినందించారు. తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు విజయనగరం: జాతీయ స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ పోటీల్లో విజయనగరం జిల్లాకు క్రీడాకారులు మొత్తం 6 పతకాలు సాధించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు పాల్గొనగా.. ఆరుగురు క్రీడాకారులు పతకాలు సాధించటం విశేషం. పోటీల్లో షణ్ముఖ సిద్ధార్థ గోల్డ్ మెడల్, హర్షవర్ధన్ సిల్వర్ మెడల్, వైష్ణవి దేవి సిల్వర్ మెడల్, రోహిణి బ్రాంజ్ మెడల్, హర్షిని బ్రాంజ్ మెడల్, తరుణ్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. అంతేకాకుండా అత్యధిక పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్షిప్లో తృతీయ స్థానం దక్కించుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు దక్కించుకున్న జిల్లా క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, కోచ్లు, యశస్విని, కోటేశ్వరరావు అభినందించారు. ఒక్క రోజు ఎస్ఐగా ఖాన్ ● నలుగురు ఏఎస్ఐలకు పదోన్నతి విజయనగరం క్రైమ్: విశాఖ పోలీస్ రేంజ్ పరిధిలో నలుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో బి.సురేష్ పార్వతీపురం మన్యం జిల్లాకు, డి.సత్యారావును శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. మిగిలిన ఇద్దరు కె. శ్రీనివాసరావు, సర్దార్ ఖాన్లను విజయనగరం జిల్లాకు కేటాయించారు. ఎస్ఐగా పదోన్నతి పొందిన సర్దార్ ఖాన్ భోగాపురం ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఆయన్ను సర్దార్ ఖాన్ కలిసి అభినందనలు తెలిపారు. కాగా, ఎస్ఐగా పదోన్నతి పొందిన సర్దార్ ఖాన్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1982లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా చేరిన సర్దార్ ఖాన్ 2009లో ఏఎస్ఐగా, ఇప్పుడు ఎస్ఐగా పదోన్నతి పొందారు. సోమవారం రిటైర్ కానున్నారు. -
మలేరియాపై అప్రమత్తతే ప్రధానం
● త్వరలో దోమతెరలు పంపిణీ చేస్తాం ● మలేరియా నివారణ జోనల్ అధికారి మీనాక్షి సీతంపేట: మలేరియా జ్వరాల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని మలేరియా నివారణ జోనల్ అధికారి (జెడ్ఎంఓ) బొడ్డేపల్లి మీనాక్షి వైద్యులకు సూచించారు. మండలంలోని దోనుబాయి పీహెచ్సీ, సీతంపేట ఏరియా ఆస్పత్రులను శనివారం సందర్శించారు. మలేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. మలేరియా వ్యాప్తిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలు, వైద్యసేవల తీరుపై ఆరా తీశారు. దోనుబాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన వసతిగృహ సిక్ రూంను తనిఖీ చేశారు. కిటికీలకు మెస్లు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బూర్జగూడలో మలేరియా పాజిటివ్తో బాధపడుతున్న వ్యక్తి ఇంటికి వెళ్లి పరీక్షించారు. దోమల వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మలేరియా హైరిస్క్ గ్రామాల్లో విస్తృతంగా ఐఆర్ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.ఎస్.ప్రసాద్, డీఎంఓ పి.వి. సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, దోనుబాయి వైద్యాధికారి భానుప్రతాప్, సబ్ యూనిట్ ఆఫీసర్ మోహన్రావు, కన్సల్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శుల పోరుబాట
–8లోసాక్షి, పార్వతీపురం మన్యం: తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పలు మండలాల కార్యదర్శులు శనివారం విధులు బహిష్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఇక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలూ చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. పోలీసు స్టేషన్కు వెళ్లి అనుమతి తీసుకురావాలని సూచించారు. దీంతో అక్కడ నుంచి కొంతమంది కార్యదర్శులు పోలీస్స్టేషన్కు వెళ్లగా.. మరికొంతమంది ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్కడా వారి మొర వినేవారు లేకపోవడంతో వెనుదిరిగారు. ఉదయం 6 గంటలకే విధులా..? రోజూ ఉదయం 6 గంటలకే గ్రామాల్లో విధులకు హాజరై.. ఇంటింటి చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు ఆ రోజు దినపత్రికతో ఫొటో దిగి, దానిని పంచాయతీరాజ్ శాఖ పోర్టల్లో అప్లోడు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కార్యదర్శులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం తమను అవమానించేలా, అవహేళన చేసేలా ఉన్నాయంటూ వాపోతున్నారు. గతంలో వలంటీర్లు చేసిన కొద్దిపాటి సర్వేల భారమంతా తమపైనే వేస్తున్నారని.. దీనికితోడు స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్నుల వసూళ్లు, పీఆర్ వన్ యాప్, రెవెన్యూ వారి పీజీఆర్ఎస్ పనులు, గ్రామసభలు, జీపీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రోటాకాల్ వంటివి తామే చేయాల్సి వస్తోందని అంటున్నారు. దీనివల్ల తీవ్ర పని ఒత్తిడితో కుటుంబాలకు దూరమవుతున్నామని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ విధులకు న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శుల మనోవేదన, విధుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. పని వేళల్లో వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే విధులంటే ఎలా అంటూ ఆవేదన పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి -
● ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ అధికారుల దాడులు
మక్కువ: మండలంలోని శంబర గ్రామంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేశారు. ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.70వరకు అధిక ధర వసూలు చేస్తున్నారన్న రైతుల ఆవేదనపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రాంతీయ నిఘా, అమలు అధికారి బి.ప్రసాదరావు ఆదేశాల మేరకు శంబర గ్రామం కొత్తవీధిలో ఉన్న శ్రీ సత్య సాయి ట్రేడర్స్ను విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఎరువులు అధిక ధరకు రైతులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఎరువుల బౌతిక నిల్వలకు, స్టాక్ రిజిస్టర్కు వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. ఎఫ్సీఓ 1985, 28(1)డి, ఈసీ యాక్ట్ 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. రూ.28,77,422లు విలువ కలిగిన 2,399 బస్తాలు (119.925 టన్నులు) ఎరువును సీజ్ చేశారు. దుకాణం స్టాక్ రికార్డులు, తాళాలు, ఈ పాస్ మిషన్ను ఏఓ చింతల భారతికి అప్పగించారు. వాటిని జేసీకి సోమవారం అప్పగిస్తామని ఏఓ తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారి రామారావు, సబ్ఇన్స్పెక్టర్ పురుషోత్తం, పోలీస్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అక్కడ నర్సులే.. వైద్యులు!
కొమరాడ: కొమరాడ పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నా శనివారం ఒక్కరు కూడా ఆస్పత్రికి రాకపోవడంతో రోగులు, బంధువులు ఆందోళనకు దిగారు. వ్యాధులు ముసురుకున్న వేళ ప్రతిరోజు 80 ఓపీ నమోదవుతోంది. ఈ సమయంలో వైద్యులు రాకపోతే ఎలా అంటూ నిలదీశారు. 24 గంటలు వైద్యసేవలు అందించాల్సిన పీహెచ్సీలో కనీసం పగటిపూట కూడా వైద్యులు సేవలందించకపోవడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
శంబరలో 2,399 బస్తాల ఎరువు సీజ్
–8లోఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో పరిపాలన గాడి తప్పుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. కొన్ని శాఖల్లో కుర్చీలాటలు జరుగుతుంటే.. మరికొన్ని చోట్ల ముష్టియుద్ధాలే సాగుతున్నాయి. నువ్వెంతంటే.. నువ్వెంత అనుకున్నంత వరకూ వ్యవహారం ఉంది. ప్రభుత్వ శాఖల్లో క్రమశిక్షణ లోపిస్తున్నా.. సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తుండగా, సయోధ్య కుదర్చాల్సిన ప్రజాప్రతినిధులు ‘రాజకీయం’ చేస్తున్నారు. ●పార్వతీపురం పురపాలక సంఘంలో కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో సిబ్బంది మధ్య విభేదాలు జరుగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్లర్లు, ఆర్వో రూబిన్ల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం, రెవెన్యూ, ప్రజారోగ్యశాఖలోనూ విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా కమిషనర్కు, మిగిలిన విభాగాల అధికారులకు మధ్య సమన్వయం కొరవడింది. ఇటీవల ఉద్యోగులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. పెన్డౌన్ చేపట్టారు. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఆ ప్రభావం మున్సిపల్ సేవలపై పడుతోంది. ఉద్యోగులు సైతం ఎవరూ సమయానికి విధులకు హాజరు కాని పరిస్థితి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ● జిల్లా విద్యాశాఖ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రజాప్రతినిధులు తానా అంటే.. ఇక్కడి అధికారులు తందానా అంటున్నారు. ఒక్కొక్కరి వెనుక.. ఒక్కో ప్రజాప్రతినిధి ఉన్నారన్న విమర్శలు ఈ శాఖ సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి. సాక్షాత్తు డీఈఓ కుర్చీ కోసమే వివాదాలు రేగడం గమనార్హం. మరో ఉద్యోగి తనకున్న పలుకుబడితో ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేస్తూ, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇక్కడ డీఈఓ తిరుపతినాయుడు మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా రెగ్యులర్ అధికారిని నియమించలేదు. డీఈఓ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా ఉన్న రమాజ్యోతికి కొన్నాళ్లు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులకే ఇన్చార్జి డీడీఈఓగా ఉన్న రాజ్కుమార్ను నియమిస్తూ, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకంపై విమర్శలు రావడంతో కొన్నాళ్లు ఆ ప్రక్రియ ఆగినా.. మరలా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉన్నట్లు సంఘాల నాయకులు చెబుతున్నారు. ● సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలో రెండు రోజుల క్రితం ఈఈ పోస్టుపై కుర్చీలాట చోటుచేసుకున్న విషయం విదితమే. ప్రభుత్వమే తనను ఈఈగా నియమించిందని ఓ అధికారి.. కోర్టు ఉత్తర్వుల మేరకు తానే ఈఈగా కొనసాగుతానని మరో అధికారి ఛాంబర్లో వేర్వేరుగా కుర్చీలు వేసుకుని కూర్చోవడం గమనార్హం. ● గతంలో సాలూరు పట్టణ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు వివాదమైన విషయం తెలిసిందే. ఇందులో రాజకీయ జోక్యం వల్ల పెద్ద దుమారమే రేగింది. చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ● ఇటీవల పార్వతీపురం తహసీల్దార్పై స్థానిక ఎమ్మెల్యే దూషణలకు దిగిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో ఉన్న విభేదాలే దీనికి కారణమన్న విమర్శలున్నాయి. ఓ వర్గం ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోద్యం చూస్తున్నారు.. ఈ నాలుగు విభాగాలే కాదు.. జిల్లాలోని పలు శాఖల్లో ఇదే పరిస్థితి ఉంది. రాజకీయ అండదండలున్న పలువురు ఉద్యోగులు, అధికారులు.. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. వివాదాలను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా శాఖల్లో వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఉద్యోగులు పంతానికి పోతున్నారు. ఈ ప్రభావం పరిపాలన, అభివృద్ధిపై పడుతోందంటూ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. న్యూస్రీల్ జిల్లాలో గాడి తప్పుతున్న పరిపాలన ప్రభుత్వ శాఖల్లో ఇష్టారాజ్యం ఎవరికి వారే యమునాతీరే.. -
పెదపెంకి.. మూత‘బడి’!
సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలం పెదపెంకి–1 పాఠశాల కొద్దిరోజులుగా మూతపడే ఉంటోంది. 3, 4, 5 తరగతులను మరోచోటకు విలీనం చేయడాన్ని నిరసిస్తూ, కొద్దిరోజులుగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. వీరి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో 1, 2 తరగతులకు కూడా విద్యార్థులను గ్రామస్తులు పంపడం లేదు. ఉపాధ్యాయులు వస్తున్నా పిల్లలెవరూ రాకపోవడంతో పాఠాలు సాగని పరిస్థితి. శనివారం ఇన్చార్జి డీఈఓ రాజ్కుమార్ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. అధికారులెంత ప్రయత్నాలు చేస్తున్నా.. తమ విద్యార్థులను మరో పాఠశాలకు భయంభయంగా పంపలేమని వారు స్పష్టం చేస్తున్నారు. సజావుగా వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీలు పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ శనివారం సజావుగా సాగింది. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఆర్.కృష్ణవేణి, సూపరింటెండెంట్ కె.దేష్, ఏటీడబ్ల్యూఓ కె.చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ జరిగింది. బదిలీల్లో 56 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు స్థాన చలనం కలిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలకు లోబడి బదిలీ ప్రక్రియ చేపట్టినట్టు కృష్ణవేణి తెలిపారు. గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరం కారాదు ● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ శంకరరావు విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులు లేక అరకు మండలం లో తేరు పంచాయతీ పరి ధిలోని వంతులగుడ, తోడుబంద, ఈడారి, దంసానివలస, బొరకాలవలస, లండిగుడ, కాగువలస, తదితర పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదన్న వార్తలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు స్పందించారు. మీడియాతో శనివారం మాట్లాడుతూ సంబంధిత అధికారులు గిరిజన విద్యార్థులు విద్యావకాశాలను కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లోని బడి ఈడు పిల్లలందరూ విద్యనభ్యసించేలా చూడాలన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థుల పాఠశాల విద్యపై క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకునేలా చూడాలన్నారు. తల్లీబిడ్డలకు ఎఫ్ఆర్ఎస్ కష్టాలు సీతంపేట: మన్యంలోని తల్లీబిడ్డలకు ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం) రిజిస్ట్రేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. సిగ్నల్ లేకపోవడంతో పిల్లలను చంకన ఎత్తుకుని కొండలు దిగి సీతంపేట ఐసీడీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. యాప్లో నమోదు కాకపోతే వచ్చేనెలలో పోషణ పథకంలో భాగంగా ఐసీడీఎస్ లబ్ధిదారులకు ఎటువంటి టేక్హోం రేషన్ అందదని సంబంధిత అధికారులు చెప్పడంతో శనివారం అధిక సంఖ్యలో ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. బాలింతలు, గర్భిణులు, 7 నెలల నుంచి మూడేళ్ల మధ్య ఉన్న చిన్నారులు 4,612 మంది ఉండగా వీరిలో అర్హులు 3,113 మంది ఎఫ్ఆర్ఎస్ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు 2,150 మంది మాత్రమే ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ నెలాఖరులోగా మిగిలిన వారంతా ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీడీపీఓ సిమ్మాలమ్మ తెలిపారు. -
అరుదైన జువెనరీ గ్లకోమా చికిత్స
బొబ్బిలి: పట్టణంలోని బొబ్బిలి కంటి ఆసుపత్రిలో జాతీయ స్థాయి కంటి శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ కేవీ ఆప్పారావు అరుదైన కంటి శస్త్ర చికిత్స నిర్వహించారు. పార్వతీపురానికి చెందిన నరేంద్ర పంగి అనే మహిళకు చిన్నతనంలోనే గ్లకోమా (జువెనరీ గ్లకోమా)వ్యాధి సోకింది. ఈమె విశాఖ తదితర ప్రాంతాల్లో పలు ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు పొందినా నయం కాలేదు. చూపు మరింత మందగించింది. చివరికి డాక్టర్ కేవీ అప్పారావు డాక్టర్ను కలసింది. ఆయన చికిత్స చేసి ఇది అరుదైన జువెనరి గ్లకోమా వ్యాధి అని శస్త్ర చికిత్స అవసరమని ఆ ప్రకారం చేయడంతో ఈమెకు కంటి చూపు 70శాతం పైగా వచ్చినట్టు తెలిపారు. అసలు నాకు కంటి చూపు వస్తుందని అనుకోలేదని, బొబ్బిలిలో చికిత్స చేయించుకోవడం వలన తాను మునుపటిలా చూడగలుగుతున్నానని డాక్టర్ అప్పారావుకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఈమెకు 21 సంవత్సరాల వయసులోనే గ్లకోమా వచ్చిందన్నారు. ఇటువంటి వారికి వచ్చే అంధత్వాన్ని జువెనరీ గ్లకోమా వ్యాధి అంటారన్నారు. ఏమాత్రం దృష్టి లోపం ఉన్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. -
జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ, సీతం ఇంజినీరింగ్ కళాశాల సంయుక్తంగా జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నామని సీతం ఇంజినీరింగ్ కాలేజి డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు పేర్కొన్నారు. తోటపాలెం సత్య విద్యా సంస్థల వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యుల దినోత్సవం ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. వెద్యులు ప్రాణదాతలని, సమాజంలో వారి స్థానం ఎల్లప్పుడూ గౌరవప్రదంగానే ఉంటుందన్నారు. సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలతో ప్రపంచం ముందుకు వెళ్తుందని ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై జాతీయ వైద్యుల దినోత్సవం నాడు ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్, సత్య డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు.గంజాయి కేసులో ఐదుగురు అరెస్టు బొండపల్లి: మండలంలోని గొట్లం బైపాస్ రోడ్డు మీదుగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు యువకులతో పాటు గంజాయిని సీజ్ చేసినట్టు సీఐ రమణ, ఎస్ఐ మహేష్ శనివారం తెలిపారు. కురుపాంకు చెందిన డి.కీర్తిరాజ్కుమార్, పి.అమర్, ఎం.అఖిల్, ఒడిశాకు చెందిన టి.రమేష్, ఇ.శ్యామ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి 1200 గ్రాముల గంజాయి, ఆరు సెల్ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈవీఎం గొడౌన్ వద్ద పటిష్ఠ భద్రత : కలెక్టర్ పార్వతీపురం టౌన్: ఈవీఎం గొడౌన్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద గల ఈవీఎం గొడౌన్ను ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎం గొడౌన్ భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గొడౌన్ను పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్టు రాజకీయ పక్షాల ప్రతినిధులకు తెలిపారు. అదే విధంగా ప్రతి మూడు మాసాలకు (త్రైమాసిక) ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి గొడౌన్ను పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈవీఎం గొడౌన్ వద్ద లాగ్ బుక్లను పరిశీలించి, లాగ్బుక్లో అందరికీ అర్థమయ్యేలా వివరాలు నమోదు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను, భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
1850కి పైగా కేసుల నమోదు
విజయనగరం టౌన్: రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలందించేందుకు ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రత్యేక కార్యాచరణ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో పూరి రథయాత్రకి వెళ్లి, వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులు శనివారం విశాఖపట్టణం నుంచి విజయనగరం మీదుగా రైళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వెయిటింగ్ హాల్స్, క్యాటరింగ్ స్టాల్స్, ప్యాంట్రీకార్ల వద్ద ఆహార పదార్ధాలను పరిశీలించారు. టికెట్ లేకుండా ప్రయాణాలు చేసే వారిపై దృష్టి సారించారు. 1850 మందికి పైగా టికెట్ లేకుండా ప్రయాణాలు చేస్తున్న వారిని గుర్తించి, వారి నుంచి రూ.11 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేసినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ పేర్కొన్నారు. టికెట్ల కోసం సరైన క్యూలను నిర్వహించాలని, రైళ్లలో బోర్డింగ్ సులభతరం చేయాలని, క్యూఆర్ ఆధారిత కోడ్లతో డిజిటల్ చెల్లింపులను ఉపయోగించాలని, మండే వస్తువులను తీసుకువెళ్లవద్దని, టికెట్ తనిఖీ చేసినప్పుడు సరైన ఐడీ రుజువును చూపించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. -
మంత్రి ఉంటే ఆ మార్గం మూతే..!
● మంత్రి ఇంటి వద్ద ట్రాఫిక్ సమస్య ● రాకపోకలకు ఇబ్బందులు ● మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న అఫీషియల్ కాలనీవాసులు సాలూరు: సీ్త్ర శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసముంటున్న సాలూరులోని అఫీషియల్ కాలనీ వద్ద తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆమెను కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులు రోడ్డుపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ సమావేశాల సమయంలో నడిచేందుకు కూడా దారి ఉండని పరిస్థితి. రోడ్డుపై నిలిపిన వాహనాలను పక్కకు తీసుకుని తమ వాహనాలతో ముందుకువెళ్లాళ్సి వస్తోంది. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోతోందని వాపోతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా స్థానికుల సమస్యపై స్పందించని మంత్రి తీరును తప్పుబడుతున్నారు. రాజన్నదొరకూ దారి కరువే... అదే మార్గంలో నిరంతరం ప్రయాణించే మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరకు కూడా తరచూ ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. మంత్రి సంధ్యారాణి ఇంటిముందు నిలిపిన వాహనాలను పక్కకు తీసి శనివారం వెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు మంత్రి తీరును దుమ్మెత్తిపోశారు. ఈ సమస్యపై రాజన్నదొర స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. సాధారణంగా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు వారి ఇళ్లముందు ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, చొరవ తీసుకుని సమస్యను చక్కదిద్దాలన్నారు. తను డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో బాధ్యతాయుతమైన పాలకుడిగా కాలనీ వాసులకు ఏ ఒక్కరోజు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను రోడ్డు పక్కగా పార్కింగ్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించేవాడినన్నారు. మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద ఏడాదిగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పట్టణ సీఐకు ఫోన్ చేసి విషయం చెప్పినా సరైన స్పందన లేదన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పోలీసులు, మీడియా వచ్చే వరకు తన వాహనాన్ని ట్రాఫిక్లో నిలుపుదలచేస్తానని, అప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. -
గురుకులంలో ఇంటర్ విద్యకు మంగళం
● నీట్, ఐఐటీ బ్యాచ్ల పేరుతో రెగ్యులర్ ఇంటర్ను ఎత్తేశారు ● మూడు దశాబ్దాలుగా కొనసాగిన తరగతులు జరగవిక ● ఎంపీసీ, బైపీసీ కోసం జిల్లా శివారు ప్రాంతాలకు పరుగులు ● ఆవేదనలో గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ కుటుంబాల బాలికలు చీపురుపల్లి: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట’ అన్న చందంగా తయారైంది గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు గతంలో ఉన్న సౌకర్యాలు కంటే మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడం చూస్తుంటాం. ప్రస్తుత కూటమి పాలనలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీనికి పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో మూడు దశాబ్దాలుగా ఉన్న రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుకు మంగళం పాడడమే నిదర్శనం. చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలలో విద్యనభ్యసించేందుకు విద్యార్థినులు పోటీ పడేవారు. ఏటా ప్రవేశాల కోసం అధికమంది దరఖాస్తు చేసేవారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ కోర్సులు నిర్వహించడంలేదని తెలియడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన బాలికలు ఆవేదన చెందుతున్నారు. కళాశాల గేటుకు వేటాడుతున్న రెగ్యులర్ ఇంటర్ లేదన్న నోటీస్ బోర్డును చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలను కేవలం నీట్, ఐఐటీ బ్యాచెస్కు కేటాయించారని, రెగ్యులర్ ఇంటర్ ఇక్కడ లేదని సిబ్బంది చెబుతున్నారు. నీట్, ఐఐటీ లాంటి ఉన్నత కోర్సులకు వెళ్లే విద్యార్థులు కోసం ప్రత్యేకంగా బ్యాచ్లు నడపడం మంచిదే అయినప్పటికీ, రెగ్యులర్ ఇంటర్ పూర్తిగా రద్దు చేయడం అన్యాయమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోనల్ స్థాయిలో ఒక నీట్, ఐఐటీ క్యాంపస్ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జోనల్ స్థాయిలో ఒక నీట్, ఐఐటీ క్యాంపస్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలలో ఆ క్యాంపస్ను ఏర్పాటు చేసి రెగ్యులర్ ఇంటర్ను రద్దు చేశారు. ఈ క్యాంపస్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో ఒక్కటే ఉండేది. తాజాగా జోనల్స్థాయిలో ఒక్కోటి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అది కూడా చీపురుపల్లిలో ఏర్పాటు చేయడంతో రెగ్యులర్ ఇంటర్కు మంగళం పాడేలా చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ క్యాంపస్లో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎంట్రన్స్ కూడా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు. మూడు దశాబ్దాల చరిత్ర.. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 1984లో చీపురుపల్లి కేంద్రంగా గురుకుల బాలికల పాఠశాలను ఏర్పాటుచేశారు. తరువాత కాలంలో 1994లో గురుకుల బాలికల కళాశాలను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులను తీసుకొచ్చారు. 31 సంవత్సరాలుగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సు ఇప్పుడిక లేదు. పక్కనే నెలిమర్లలో ఉన్న అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాల ఉన్నప్పటికీ అక్కడ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు లేవు. దీంతో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కావాలనుకునే చీపురుపల్లి, నెలిమర్ల, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం నియోజవకర్గాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు జిల్లాలోని సుదూరంగా ఉన్న వేపాడ, వియ్యంపేట వంటి గురుకుల కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకుంది. రెగ్యులర్ ఇంటర్మీడియట్ లేదు.... జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ క్యాంపస్ను చీపురుపల్లి గురుకుల కళాశాలలో ఏర్పాటు చేశారు. దీంతో రెగ్యులర్ ఇంటర్మీడియట్ను రద్దు చేసి ఇక్కడి సీట్లను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ బ్యాచస్కు సంబంధించి సీట్లు కూడా పూర్తయ్యాయి. – రాణీశ్రీ, ప్రిన్సిపాల్, గురుకుల కళాశాల, చీపురుపల్లి -
గిరిజనులపై చిన్నచూపెందుకో?
గిరిజనులకు అది చేస్తున్నాం... ఇది చేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అవుతుందేతప్ప ఇప్పటికే పేరుకుపోయిన సమస్యలపై దృష్టిసారించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ముల క్కాయవలస పాఠశాల వంటివి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉన్నాయి. విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యల పరిష్కారంవైపు అధికారులతో పాటు పాలకులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందో అధికారులే సమాధానం చెప్పాలి. తక్షణమే పునాదుల దశలో ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తిచేయాలి. – బి.రవికుమార్, అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకుడు, పార్వతీపురం -
సమన్వయలోపం ఉంది.. సరిదిద్దుకుంటున్నాం!
● అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి ● జంఝావతి, కొఠియా అంతర్రాష్ట్ర వివాదాలను త్వరలో పరిష్కరిస్తాం ● జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కొంత సమచారలోపం వల్లే ఇది ఏర్పడిందని.. దీనిపై బహిరంగంగానే చర్చించామని, సరిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో జిల్లా మంత్రి, పజాప్రతినిధులకు ముందస్తు సమాచారాన్ని చేరవేస్తూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల గిరిజన ప్రాంతం అయినప్పటికీ జీడీపీలో 16.94 శాతం వృద్ధి సాధించి రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పని చేయాలని సూచించారు. వరితో పాటు ఉద్యానవన పంటలను ప్రోత్సహించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ప్రతి రైతూ సభ్యునిగా చేరాలని, తద్వారా వ్యవసాయ రుణాలను పొందవచ్చని మంత్రి హితవు పలికారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు జిల్లా అనుకూలంగా ఉన్నందున పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైందని.. దాంతో పాటు జీడి, మామిడి, పైనాపిల్ వంటి ఇతర యూనిట్ల స్థాపనకు ఆలోచన చేయాలని తెలిపారు. సాగు నీటి వినియోగం కోసం అవసరమైన లష్కర్లను రానున్న నాలుగు మాసాల్లోగా వేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంతర్రాష్ట్ర వివాదాలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కుంకీ ఏనుగుల మొదటి ఆపరేషన్ జిల్లాలోనే చేపట్టేలా కోరామని చెప్పారు. పీపీపీ విధానంలోనే వైద్య కళాశాల చేపడతామని స్పష్టం చేశారు. సమాచార శాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ శ్యామ్ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే విజయ్చంద్రలతో కలసి పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన స్టాల్ను సందర్శించి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం పార్వతీపురం మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన జీడి ప్రాసెసింగ్ యూనిట్ను తనిఖీ చేశారు. కూటమిలో విభేదాలు.. బీజేపీ, జనసేన డుమ్మా! ‘సుపరిపాలనలో తొలి అడుగు’.. అంటూ రాష్ట్రంలో మొదటి సమావేశం పార్వతీపురం మన్యం జిల్లాలో నే చేపట్టారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కూటమిలోని విభేదాలు బయటపడ్డాయి. కార్యక్రమానికి టీడీపీ మినహా.. కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు హాజరు కాలేదు. ఏ ఒక్కరికీ ఆహ్వానం అందలేనట్లు తెలుస్తోంది. పాలకొండ జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ కూడా గైర్హాజరయ్యా రు. ఆయన స్థానికంగా లేరని సమాచారం. తమకు ఆహ్వానం అందకపోవడంపై రెండు పార్టీల నాయకులూ గుర్రుగా ఉన్నారు. తమను పట్టించుకోవడం లేదని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎదుట కూటమి భాగస్వామ్యంలోని బీజేపీ నాయకులు మొరపెట్టుకున్నారు. తాను అంతా సరిదిద్దుతానని అప్పట్లో మంత్రి వారికి హామీ ఇచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరలా ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
పైడితల్లికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆలయంలో శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజామునుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. త్రుటిలో తప్పిన పెనుప్రమాదంబాడంగి: ఓ కారు అదుపుతప్పి భోజనం హోటల్లోకి దూసుకు పోయిన సంఘటనలో అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టెక్కలి నుంచి జయపూర్ వెళ్తున్న కారు స్పీడ్ బ్రేకర్ల ములంగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ముందుటైర్లు రాయిపైకి ఎక్కి పోవడంతో స్టీరింగ్ అదుపుతప్పింది. దీంతో మండలకేంద్రంలో పోలీస్స్టేషన్ ఎదురుగా గల ఎం.చైతన్య భోజనం హోటల్లోకి కారు ఒక్కసారిగా దూసుకుపోయింది. అయితే ఆ హోటల్లో టిఫిన్ సెక్షన్ లేకపోవడంతో పాటు ఉదయం 8గంటల సమయం కావడంతో పనివారు హోటల్ లోపల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బయట ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పిందని హోటల్ సిబ్బంది భయాందోళనతో చెప్పారు. మహిళపై కత్తిపీటతో దాడివేపాడ: మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తి పీటతో దాడి చేసినట్లు వల్లంపూడి పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఉడతా మణికంఠ గ్రామంలోని ఈర్లి సీతారాం (62)ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగాడు. మంచినీళ్లు ఇవ్వడానికి ఆమె గదిలోకి వెళ్లగా మెడలోని బంగారం తాడు తుంచి వేయడానికి మణికంఠ ప్రయత్నం చేశాడు. దీంతో సీతారాం కేకలు వేయగా పరిసరాల్లో ఉన్న వ్యక్తులు వచ్చేసరికి ఇంట్లో ఉన్న కత్తిపీటతో సీతారాం మెడపై మణికంఠ దాడి చేసి గాయపర్చాడు. స్థానికులు వెంటనే 108కు సమాచారమిచ్చి కోటపాడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవలకు విశాఖ కేజీహెచ్కు తీసుకువెళ్లారు. సమాచారం మేరకు ఎస్.కోట రూరల్ ఎస్సై ఎల్.అప్పలనాయుడు గ్రామానికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు. -
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో పని చేస్తూ.. బదిలీపై వెళ్లిపోవాలని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గట్టి షాక్ ఇచ్చారు. వారి స్థానంలో ఎవరైనా వస్తేనే వీరిని రిలీవ్ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా విభజన తర్వాత వచ్చిన ఉద్యోగుల్లో అధిక శాతం మంది దాదాపు మూడేళ్లుగా ఇక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతోనో.. ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో చెల్లించి విజయనగరం, విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం అడిగినంత ఇస్తామని మొత్తుకుంటున్నా.. కదలలేకపోతున్నారు. కీలక విభాగాల్లో పని చేస్తున్న వారి స్థానంలో ఇంకెవరూ రాకపోవడమే కారణం. ఇటీవల దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీలు జరిగాయి. కొంతమంది కదిలినా.. చాలామందికి మాత్రం స్థాన చలనం కలగలేదు. చాలాకాలంగా బదిలీపై ఇక్కడ నుంచి వెళ్తున్న వారే గానీ.. ఆ స్థానంలో ఎవరూ రావడం లేదు. ఈ ప్రభావం జిల్లా పాలనపై పడుతోంది. జిల్లా అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు తీయకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి. రెవెన్యూ, ఐటీడీఏ, వైద్యశాఖ తదితర కీలక విభాగాల్లో బదిలీల కోసం చూస్తున్న వారు అనేకమంది ఉన్నారు. ఇందులో కొంతమంది తమ పలుకుబడితో ఇక్కడి నుంచి వెళ్లినా.. కొంతమంది మాత్రం ఉండిపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా మారుమూల ప్రాంతం కావడం.. ఏజెన్సీగా భావిస్తుండటమే ఇందుకు కారణం. ఎవరినీ వదలద్దని చెప్పేసిన ఇన్చార్జి మంత్రి.. జిల్లా పరిపాలనకు అవసరమైన సిబ్బందిలో 50 శాతం మందే ఉన్నారని స్వయనా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఈ ప్రభావం జిల్లా పాలనపై పడుతోందని శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో తెలిపారు. ఇక్కడ ఉండటానికి ఎవరూ ఇష్టపడకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పిన ఆయన.. ఎవరికై నా ఇక్కడ నుంచి బదిలీ అయితే, ఆ స్థానంలో మరొకరు వస్తేనే ముందు వారిని రిలీవ్ చేయాలని స్పష్టం చేశారు. అసలు పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేందుకే ఎవరూ ఇష్టపడటం లేదు. ఎవరినైనా ఇక్కడకు బదిలీ చేసినా, కొంతమంది వచ్చి సంతకం పెట్టి, సెలవు మీద వెళ్లిపోతున్నారు. మరికొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతోనో.. పై స్థాయిలో పరిచయాలతోనో తమ ఉత్తర్వులు రద్దు చేయించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఇక్కడ నుంచి ఎలా వెళ్లగలమని జిల్లాలో పని చేస్తున్న పొరుగు జిల్లాల ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్నాళ్లయినా ఇక్కడే ఉండిపోవాలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ రిలీవర్ ఉంటేనే బదిలీ స్పష్టం చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్నేళ్లయినా ఇక్కడే చిక్కుకుపోవాల్సిందేనా... జీతాలు ఇవ్వడం లేదు... పార్వతీపురం రూరల్/పార్వతీపురం: గతంలో ఠంచన్గా అందే జీతాలు ఆరు నెలలుగా అంద డం లేదని, అడిగితే ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారని, ఉద్యోగభత్రతో పాటు జీతాలు నెలవారీ చెల్లించేలా చర్యలు తీసు కోవాలంటూ వైఎస్సార్ ఉద్యానవన కళాశాల సెక్యూరిటీ గార్డులు మంత్రి అచ్చెన్నాకుడుకు విన్నవించారు. తమను ఆప్కాస్లోనే కొనసాగించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయనకు వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో శంకరరావు, రమేష్, బ లరాం, ముత్యాలరావు, రామారావు, జమ్మయ్య, భూషణ్, రామకృష్ణ, మౌళి తదితరులున్నారు. మహిళా పోలీసుల పడిగాపులు సచివాలయ మహిళా పోలీస్ సిబ్బందికి శనివా రం జరగనున్న బదిలీలపై స్పష్టత ఇవ్వాలని, ఇతర మండలాలకు వేస్తే ఇబ్బందులు పడతా మంటూ మంత్రి అచ్చెన్నాయుడుకు విన్నవించేందుకు కలెక్టరేట్ వద్ద దాదాపు 4 గంటల సమ యం పడిగాపులు కాశారు. భోజన విరామ సమయంలో కొంతమంది మాత్రమే లోపలకు వెళ్లి మంత్రికి తెలిపే ప్రయత్నం చేసి వినతిపత్రాన్ని అందజేశారు. తమకు సమయం లేదని రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపాల ని మంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఈ బదిలీలపై ఆలోచించడం జరుగుతుందని, ఇప్పుడే ఒక నిర్ణ యానికి రాలేమని మంత్రి సమాధానం ఇచ్చారు. శనివారమే బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో స్పష్టమైన హామీ రాకపోవడంతో మహిళా పోలీసు సిబ్బంది నిరాశతో వెనుదిరిగారు. -
జిందాల్ రైతులకు వారంలో పరిహారం
విజయనగరం అర్బన్: జిందాల్ భూములకు సంబంధించి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని వారంరోజుల్లో అందజేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్ కోసం సేకరించిన భూములపై తన చాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఇప్పటివరకు చెల్లించిన పరిహారం, పెండింగ్ బకాయిలపై ఆరా తీశారు. సుమారు 28 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు మాత్రమే పరిహారం పెండింగ్ ఉందని, వారికి వెంటనే పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు జిందాల్ చెల్లించాల్సిన పరిహారంపైనా చర్చించారు. పదిరోజుల్లో పెండింగ్ బకాయిలను రైతులకు చెల్లించాలని జిందాల్ యాజమన్యాన్ని కలెక్టర్ ఆదేశించారు. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిందాల్ భూములకు సంబంధించి కేవలం 15 మంది రైతులకు మాత్రమే బకాయి ఉందని చెప్పారు. జిందాల్ పరిశ్రమకు అప్పట్లోనే సుమారు 1,166 ఎకరాలను ప్రభుత్వం అప్పటించిందన్నారు. ఈ భూముల్లో 180 ఎకరాలను జిందాల్ యాజమాన్యమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిందని చెప్పారు. ఇది కాకుండా మొత్తం 375 మంది రైతుల నుంచి 834 ఎకరాల అసైన్డ్ భూమిని, 151 ఎకరాల ప్రభుత్వ భూమిని జిందాల్కు కేటాయించినట్లు తెలిపారు. జిందాల్ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా రైతుల దగ్గర సేకరించలేదని, 2013 భూసేకరణ చట్టం ఇక్కడ వర్తించదని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 28.72 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు ఉన్న బకాయిని వారం రోజుల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1962లో మొత్తం 20 మందికి పట్టాలు ఇవ్వగా వారిలో నలుగురు మాత్రమే ఇళ్లు కట్టుకోగా, వారికి అప్పట్లోనే పరిహారం చెల్లించినట్లు తెలిపారు. షేర్లు, ఉద్యోగ కల్పన, వన్టైమ్ సెటిల్మెంట్కు సంబంధించి జిందాల్ యాజమాన్యమే రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుందని దానిలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఎస్కోట తహసీల్దార్ డి. శ్రీనివాసరావు, కలెక్టరేట్ డి సెక్షన్ సూపరింటెండెంట్ తాడ్డి గోవింద, ఇతర అధికారులు, జిందాల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సమీక్షించిన కలెక్టర్ అంబేడ్కర్ -
సిగ్నల్ లేక.. సకాలంలో 108 రాక..
● గంటన్నర పాటు నరకం చూసిన రోడ్డు ప్రమాద బాధితుడు ● ఆస్పత్రికి తరలించేందుకు అవస్థలు ● ఘాట్ రోడ్లో ఆటోబోల్తా సీతంపేట: మొబైల్ సిగ్నల్ లేక.. సకాలంలో 108 అంబులెన్స్ రాక రోడ్డు ప్రమాద బాధితుడు గంట న్నర పాటు నరకం చూసిన ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సీతంపేట మండలంలోని మారుమూలన ఉన్న బంజా రుగూడ–పుట్టిగాం మధ్య ఎత్తైన ఘాట్రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో మెట్టూరుకు చెందిన వీరన్నకు తీవ్రగాయాలయ్యా యి. ఈ సమయంలో అక్కడ 108కు ఫోన్ చేద్దామ ని ఆటోలో ఉన్న కుటుంబ సభ్యులంతా ఎంత ప్రయత్నించినా సెల్సిగ్నల్ లేకపోవడంతో వీలుపడలేదు. స్థానికులు సెల్సిగ్నల్ చోటకు పరుగుతీసి 108కు సమాచారం అందించారు. సీతంపేట, కొత్తూరు 108 అంబులెన్స్లు ఖాళీగా లేకపోవడంతో భామిని అంబులెన్స్ వస్తుందని సమాచారం ఇచ్చారు. మారుమూల ప్రాంతం కావడం, బాధితు ల సెల్ఫోన్కు సిగ్నల్ లేకపోవడం వంటి కారణాల తో భామిని అంబులెన్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 1.50 అయ్యింది. అప్పటికే వీరన్నకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరామర్శకు వెళ్లి ప్రమాదం పాలై.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన వీరన్న, అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఒకే ఆటోలో మర్రిపాడు మీదుగా కురుపాం మండలం గగాలి గ్రామానికి ఓ మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు దిగుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా కొట్ట డంతో ప్రమాదం జరిగింది. ఇందులో వీరన్నకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. -
అక్కరకు రాని ఈఎస్ఐ
● ఎక్స్రేకు దిక్కులేదు ● అరకొరగా రక్తపరీక్షలు ● శిథిలావస్థలో భవనాలు ● జరగని ఎల్ఎఫ్టీ పరీక్షలు విజయనగరం ఫోర్ట్: కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఈఎస్ఐ డిస్పెన్సరీ, డయోగ్నొస్టిక్ సెంటర్స్లో సౌకర్యాలు కల్పిస్తాం అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ఆ గొప్పమాటలు అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్షేమం మాట దేవుడెరుగు. కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితి ఉంది. దీంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు ఏదైనా జబ్బు చేసినా, ప్రమాదం జరిగినా చికిత్స కోసం వచ్చే ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎక్స్రేకు రేడియాగ్రాఫర్ కరువు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎక్స్రేకు దిక్కు లేకుండా పోయింది. సెంటర్కు ఎక్కువగా ఎముకల సంబంధిత వ్యాధులతో కార్మికులు వస్తారు. అదేవిధంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పడు గాయాలతో వస్తారు. వారికి వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్రే తీయాల్సి ఉంటుంది. అయితే డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎక్స్రే మిషన్ ఉన్నప్పటికీ తీసే నాథుడు లేకపోవడం వల్ల కార్మికులు ప్రైవేట్ ల్యాబొరేటరీలకు కార్మికులు వెళ్లి రూ. 300 నుంచి రూ. 350 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ ఉన్నప్పటికీ రేడియాలజిస్టు లేకపోవడంతో గైనకాలజిస్టులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నారు. సెంటర్లో ఓపీ విభాగాలు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం, అప్తమాలజీ, గైనిక్, ఈఎన్టీ, పిడియాట్రిక్ ఓపీ విభాగాలు ఉన్నాయి. ఆయా ఓపీ విభాగాల్లో సేవలు పొందేందుకు కార్మిక కుటుంబసభ్యులు ప్రతి రోజు 50 నుంచి 60 మంది వరకు వస్తారు. జాడే లేని ఎల్ఎఫ్టీ పరీక్ష డయోగ్నొస్టిక్ సెంటర్లో ఎల్ఎఫ్టీ (లిఫిడ్ ప్రొఫైల్ టెస్ట్) జరగడం లేదు. దీంతో కార్మికులు ఈ టెస్టు కోసం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తూ రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు చేస్తున్నారు. సెంటర్ పరిధిలో 21 వేల మంది కార్మికులు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్ పరిధిలో 21 వేల మంది కార్మికులు ఉన్నారు. వారంతా ఏదైనా జబ్బు చేస్తే చికిత్స కోసం వస్తారు. ఓపీ సేవలు అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. ఇన్పేషేంట్ సేవలు అవసరమైన వారికి విశాఖలోని మల్కాపురంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. శిధిలావస్థకు చేరిన భవనాలు ఈఎస్ఐ డయోగ్నొస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనాలన్నీ పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని కార్మికులు, సెంటర్ వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గాజులరేగ వద్ద నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. రేడియోగ్రాఫర్ లేరు ఎక్స్రేలు తీసే రేడియోగ్రాఫర్ వేరే ఉద్యోగం వచ్చి వెళ్లి పోయారు. దీంతో ఎక్స్రేలు తీయడం లేదు. రేడియాగ్రాఫర్ను నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సెంటర్ను ప్రైవేట్ భవనంలోకి మార్చాలని ప్రతిపాదన ఉంది. త్వరలోనే మార్చే అవకాశం ఉంది. డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సూపరింటెండెంట్, ఈఎస్ఐ డయోగ్నొక్ సెంటర్ -
అంధకారంలో అవస్థలు
చిత్రంలో చిమ్మచీకటిలో ఆరుబయట కూర్చున్నవారంతా నిండు గర్భిణులు. డెలివరీ సమయం దగ్గర పడడంతో గిరిశిఖర గ్రామాల నుంచి గుమ్మలక్ష్మీపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో నిర్వహిస్తున్న గర్భిణుల వసతి గృహంలో చేరారు. భారీ వర్షం కారణంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలోనే గడిపారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేయాల్సిన పరిస్థితి. వైటీసీ సిబ్బంది సమాచారంతో విద్యుత్ సరఫరా పనులను సంబంధిత సిబ్బంది చేపట్టారు. అయితే, ట్రాన్స్ఫార్మర్ నుంచి వైటీసీకి సరఫరా అయ్యే విద్యుత్ తీగెలు అండర్ గ్రౌండ్లో ఉండడంతో సరఫరాను పునరుద్ధరించలేకపోయారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గర్భిణులు ఊపిరిపీల్చుకున్నారు. వైటీసీకి జనరేటర్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి గర్భిణుల బంధువులు విజ్ఞప్తిచేశారు. – గుమ్మలక్ష్మీపురం -
సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలి
విజయనగరం ఫోర్ట్: సికిల్సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం ఆయన వైద్యారోగ్యశాఖ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వ్యాధి గ్రస్తులకు సికిల్సెల్ వ్యాధిపై అవగాహన కల్పించాలని కోరారు. గిరిజన గ్రామాల్లో 44 వేల మంది జనాభా నివసిస్తున్నారని, వారిలో 40 సంవత్సరాల లోపు జనాభా 22 వేలు ఉన్నారన్నారు. 17 వేల మందికి సికిల్ సెల్ టెస్టులు చేయగా ఇద్దరికి వ్యాధి ఉన్నట్లు తేలిందని చెప్పారు. 118 మందికి వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిర్ధారణ అయినట్లు తెలిపారు. వారే కాకుండా ప్రస్తుతం జిల్లాలో 160 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారని, వారికి అందిస్తున్న వైద్యంపై వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వ్యాధి వచ్చే అవకాశం ఉన్న 118 మందితో సమావేశం నిర్వహించి వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, డీఈఓ మాణిక్యం నాయుడు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణ, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ అరుద్ర, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ శివకుమార్, డాక్టర్ అర్చన, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ -
చిన్నబగ్గ కొండల్లోకి ఏనుగుల గుంపు
సీతంపేట: చిన్నబగ్గ కొండల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. శుక్రవారం ఉదయం కొండదిగువన ఉన్న ఏనుగుల గుంపు సాయంత్రానికి కొండపైకి చేరాయి. జీడి, అరటి చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది ఏనుగు ల గమనాన్ని పరిశీలించి గిరిజనులను అప్రమ త్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు. మన్యం బిడ్డలపై మలేరియా పంజా సీతంపేట: మన్యం బిడ్డలపై మలేరియా పంజా విసురుతోంది. మంచం పట్టిస్తోంది. మర్రిపా డు పీహెచ్సీ పరిధిలో మలేరియా వ్యాధి అధికంగా ఉంది. శుక్రవారం పీహెచ్సీలో ఓపీ 40 వరకు రాగా దీనిలో అధికమంది జ్వరపీడితులే ఉన్నారు. మలేరియాతో సౌజన్య, అఖిల్, అజిత్, నారాయణ ఆస్పత్రిలో ఇన్పేషెంట్లుగా చేరారు. తోటగూడలో లొంగిరి అనే వృద్ధురాలు, పీవీ ఈతమానుగూడలో ఆరిక అల్లూరి జ్వరంతో మంచం పట్టారు. 80కి పైగా గిరిజన గ్రామాల ప్రజల వైద్యానికి మర్రిపాడు పీహెచ్సీయే ఆధారం. గతంతో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండేవారు. వీరిలో ఒకరు పీజీ చదువుకోవడానికి వెళ్లిపోడంతో కొన్ని నెలలుగా పోస్టు భర్తీకాలేదు. వైద్యురాలు సత్యవేణి ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఓపీ చూడడం, గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించడం కష్టసాధ్యంగా మారింది. మెరుగైన సేవలు అందడం లేదు. కొన్నిసార్లు స్టాఫ్ నర్సులే వైద్యసేవలు అందిస్తున్నారు. 3న వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ● జెడ్పీచైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: వైఎస్సా ర్సీపీ జిల్లా విస్తృతస్థా యి సమావేశం వచ్చేనెల 3న నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జగన్నాథ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి కార్పొరేషన్/ మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర/జిల్లా/నియోజకవర్గ/మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాలోగల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిగా కుమారస్వామి విజయనగరం టౌన్: జిల్లా పర్యాటక శాఖ అధికారిగా పనిచేస్తున్న కుమారస్వామి జిల్లా మైనారిటీ అధికారిగా, కార్పొరేషన్ ఈడీగా ఇన్చార్జి బాధ్యతలను శుక్రవారం చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ రెండు పోస్టులలో కొనసాగాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సీ్త్రనిధి జిల్లా టార్గెట్ రూ.86 కోట్లు
సీతానగరం: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధికి వివిధరకాల వృత్తులపై శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పించనున్నట్లు వెలుగు సీ్త్రనిధి జిల్లా ఏజీఎం పి.కామరాజు అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని మండల వెలుగు సమాఖ్య కార్యాలయంలో వెలుగు ఏపీఎం రెడ్డిశ్రీరాములు అధ్యక్షతన సిబ్బందితో సీ్త్ర నిధి రుణసదుపాయాలపై ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం కామరాజు మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి జిల్లా టార్గెట్ రూ.86 కోట్లుండగా ఇప్పటి వరకూ రూ.9 కోట్ల 20లక్షలు పొదుపు సంఘాల సభ్యులకు ఇచ్చినట్లు చెప్పారు. మండలసమాఖ్య పర్యవేక్షణలో అర్హులైన వారందరికీ జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సీ్త్ర నిధి రుణాలు బ్యాంకుల ద్వారా సమకూర్చనున్నామన్నారు. అలాగే సీతానగరం మండలం టార్గెట్ రూ.8 కోట్లు ఉండగా ఇప్పటివరకూ రూ.90 లక్షలు రుణ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. వృత్తి పనిలో శిక్షణ పొందిన వారంతా అర్థికంగా లబ్ధిపొందడానికి వివిధ రకాల వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య సభ్యులు సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ఆటగాళ్లు..!
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల జాతీయ చెస్ చాంపియన్ షిప్ పోటీలు రెండవ రోజు ఆసక్తికరంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో నిర్వహిస్తున్న రెండోరోజు పోటీలను చిన్న శ్రీను సోల్జర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె పోటీల్లో విజేతలుగా నిలవాలంటూ ప్రోత్సహించారు. ఇదిలా ఉండగా దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన106 మంది క్రీడాకారులు జాతీయ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో తలపడుతుండగా..రెండవ రోజు ముగిసే సమయానికి 8 రౌండ్లు పూర్తయినట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జాల్వాముఖి తెలిపారు. శనివారం 9వ రౌండ్ ముగిసిన అనంతరం విజేతలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. వివిద కేటగిరీల్లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్న క్రీడాకారులను త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. ఆసక్తికరంగా చెస్ పోటీలు -
వాచ్మన్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్లో గల రాఘవ కన్స్ట్రక్షన్స్లో వాచ్మన్గా పనిచేస్తున్న కనిమెరకల వెంకట రమణ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాఘవులు నిందితుడి అరెస్టు చూపించి వివరాలను వెల్లడించారు. హతుడు వెంకటరమణ కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పాత బొబ్బిలిలోని చికెన్షాపులో పనిచేస్తున్న కోట సర్వేశ్వర రావు ఈ కేసులో నిందితుడని స్పష్టం చేశారు. వాచ్మన్ కనిమెరకల వెంకటరమణ విధుల్లో ఉండగా ఈనెల 20న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో బొబ్బిలి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. భర్తతో గొడవలున్న తన కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సర్వేశ్వర రావును వెంకటరమణ గట్టిగా హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న సర్వేశ్వరరావు గ్రోత్ సెంటర్కు వెళ్లి వెంకటరమణపై దాడి చేశాడు. సీసీ టీవీ పుటేజీ, కాల్డేటా, సంఘటన స్థలం వద్ద దొరికిన పర్స్ ఆధారంగా విచారణ జరిపి నిందితుడ్ని ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన సీఐ కె.సతీష్కుమార్, ఎస్సై రమేష్, సిబ్బందిని డీఎస్పీ రాఘవులు అభినందించారు. -
కనులపండువగా జగన్నాథుని రథయాత్ర
మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలు, భజనల నడుమ వీరఘట్టంలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం వైభవంగా సాగింది. తొలుత యజ్ఞకర్త ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ దంపతులు, అర్చకుడు లింగరాజ్రథో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి యాత్రను ప్రారంభించారు. పట్టణ వీధుల్లో రథంపై వస్తున్న స్వామివారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. దేవదాయశాఖ ఈఓ సూర్యనారాయణ యాత్రను పర్యవేక్షించారు. – వీరఘట్టం -
‘మత్తు’ జోలికి వెళ్లొద్దు
విజయనగరం క్రైమ్: మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని స్థానిక టాస్క్ఫోర్స్ సీఐ బంగారు పాప సూచించారు. నగర పరిధిలోని కస్పా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. గంజాయి, ఖైనీ, గుట్కా, మద్యం, సిగరెట్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై ఎంతో మంది యువత తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని, కన్నవారికి తీరని శోకం మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని తెలిపారు. -
మద్యం మత్తు వల్లే ప్రమాదం
రామభద్రపురం: మండలంలోని జోగిందొరవలసలో ఈ నెల 21వ తేదీన వల్లం నాయుడు అనే వ్యక్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి పాల్పడ్డాడని డీఎస్పీ ఎస్. రాఘవులు తెలిపారు. జొగిందొరవలసలో ట్రాక్టర్ ప్రమాదానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమాదానికి సంబంధించి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి మండలం మోసూరువలసకు చెందిన వంగపండు వల్లంనాయుడు, మోసూరు భాస్కరరావు, లక్ష్మణరావులు స్నేహితులు. అయితే వల్లంనాయుడు స్నేహితులిద్దరికి ఫోన్చేసి మద్యం తాగుదాం రమ్మని ఆహ్వానించాడు. ముగ్గురులో ఇద్దరు ద్విచక్రవాహనంపై, ఒకరు బ్లేడ్ ట్రాక్టర్పై రామభద్రపురం మండలంలోని జోగిందొరవలస గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడ మందు తాగారు. ఆ తర్వాత వల్లంనాయుడు మద్యం మత్తులో భాస్కరరావు బైక్ తాళం తీసుకున్నాడు. నా తాళం ఇవ్వు అని భాస్కరరావు ఎంతసేపు అడిగినా వల్లం నాయుడు ఇవ్వలేదు. దీంతో భాస్కరరావు ట్రాక్టర్ వెళ్లనివ్వనని చెప్పి బోయినెట్పై కూర్చున్నాడు. మద్యం మత్తులో ఉన్న వల్లంనాయుడు కూడా ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేసి ముందుకు లాగించేశాడు. ఆ రోడ్డు గోతులమయంగా ఉండడం వల్ల ప్రమాదవశాత్తు భాస్కర రావు కింద పడిపోవడంతో ట్రాక్టర్ చక్రాలు వెళ్లిపోగా వెనుక ఉన్న బ్లేడ్స్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసిన సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు దర్యాప్తు చేశారు. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా నిందితుడు అలా వ్యవహరించం వల్ల ప్రమాదకేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కార్యక్రమంలో ఏఎస్సై అప్పారావు పాల్గొన్నారు. ప్రమాదానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ -
నాలుగు తరగతులు..!
● ఉపాధ్యాయుడూ ఒక్కరే.. ● ఇదీ ములక్కాయవలస ప్రాథమిక పాఠశాల దుస్థితి ఒక గది.. పార్వతీపురం రూరల్: మానవుడు అంతరిక్షాన్ని చుట్టి వస్తున్న రోజుల్లోనూ గిరిజన ప్రాంత ప్రజలను విద్య, వైద్య కష్టాలు వీడడంలేదు. దీనికి పార్వతీపురం మండలం గోచెక్క పంచాయతీ ములక్కాయ వలస గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలే నిలువెత్తు నిదర్శనం. గత ప్రభుత్వంలో రెండోవిడత నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో పాఠశాల భవనం పునాదులకే పరిమితమైంది. అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కనీసం పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితం.. విద్యార్థులను వసతి కష్టాలు వెంటాడుతున్నారు. తాత్కాలికంగా వేసిన చిన్న రేకుల షెడ్లోనే ఆరు గ్రామాల నుంచి వస్తున్న చిన్నారులకు ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు తరగతుల విద్యార్థులకు ఇరుకు గదిలో బోధన సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. -
ధరాఘాతం..!
ఆయిల్ పామ్ ధర బాగుంది కదా అని రైతులు సాగుపై ఆసక్తి చూపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. అయితే గతేడాది వరకు నిలకడగా సాగిన ఆయిల్పామ్ ధర ఒక్కసారిగా తిరోగమనం బాట పట్టింది. పదిరోజుల వ్యవధిలోనే ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు వారాల్లోనే రూ.2వేల వరకు ఆయిల్పామ్ ధర తగ్గింది. ఈ తగ్గుదల మరింత ఉండే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు పేర్కొంటుండడంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ● ఒక్కసారిగా పడిపోయిన ఆయిల్పామ్ రేటు ● పదిరోజుల వ్యవధిలో టన్నుకు రూ.2వేలు తగ్గింపు ● ఆందోళనలో రైతులు ● జిల్లాలో 35వేల ఎకరాల్లో సాగు ●ధరలను స్థిరీకరించాలి రెతులను ఆదుకునేందుకు ఆయిల్పామ్ ధరలను స్థిరీకరించాలి. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయిల్పామ్ రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. సమీక్షల పేరుతో కాలయాపన చేయకుండా ఆయిల్ పామ్ రైతులను ఆదుకునేందుకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. –కెంగువ పోలినాయుడు, రైతు, కంబవలస, కొమరాడ మండలం●దిగుమతి సుంకం పెంచాలి ఆయిల్ పామ్కు గతంలో 27.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం ప్రస్తుతం 10 శాతానికి తగ్గిపోవడంతో పెట్టుబడి పెరిగి ఆయిల్పామ్ ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో టన్ను రూ.23వేలు ఉన్న ధర ప్రస్తుతం తగ్గిపోయింది. దిగుమతి సుంకం పెంచితే ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఆయిల్పామ్ ధరలను పెంచి రైతులను ఆదుకోవాలి. –అంబటి గౌరునాయుడు, రైతు, సంతోషపురం, గరుగుబిల్లి మండలంపార్వతీపురం: ఆయిల్ పామ్ ధరలు రోజురోజుకు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వరకు నిలకడగా సాగిన ధరలు ప్రస్తుతం తిరోగమన బాట పట్టాయి. పదిరోజుల వ్యవధిలో నే టన్నుకు రూ.2వేల మేర ధర తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పదిరోజుల క్రితం వరకు రూ.20,290లున్న టన్ను ధర నేడు రూ.18,650కి పడిపోయింది. అంతర్జాతీయ పరి ణామాలు, ముడిచమురు ధరల ఆధారంగా ఆయిల్పామ్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతుంటా యి. అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం ధరలపై పడడంతో చివరిగా రైతులు నష్టపోతున్నారు. గత ఏడా ది వరకు ఆయిల్పామ్పై దిగుమతి సుంకం 27.50 శాతం ఉండడంతో దేశీయ సాగు విక్రయాలపైనే శతశాతం ఆధారపడి డిమాండ్ బట్టి దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 27.50 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 17.50 శాతానికి తగ్గించారు. ఇదే అదునుగా భావించి మార్కెట్లో కంపెనీలు, వ్యాపారులు అమాంతం ధరలు తగ్గించి కొనుగోలుకు తెరతీశారు. రెండు వారాల్లోనే రూ.2వేల వరకు ధర తగ్గింది. ఈ తగ్గుదల మరింత ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పార్వతీపురం, కురుపాం, గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం, పాలకొండ, సాలూరు, జియ్యమ్మవలస, మక్కువ మండలాల్లో వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆయిల్పామ్ సాగును రైతులు ఆశాజనకంగా చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఏటా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతూనే వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు 20వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్పామ్ సాగు ప్రస్తుతం 35వేల ఎకరాల వరకు చేరింది. ఆయిల్పామ్ ధరలు తగ్గడం కారణంగా అనుబంధ ఉత్పత్తులు కూడా ధరలు తగ్గితే రైతులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. -
పురం పరువు గోవిందా!
● గాడి తప్పుతున్న మున్సిపల్ పాలన ● చీలిపోతున్న ఉద్యోగులు ● పెన్డౌన్కు దిగిన సిబ్బంది ● పట్టణ సమస్యలు గాలికి సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘం పరువు పోతోంది. పుర పాలన గాడి తప్పుతోంది. నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తోంది. పట్టణ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ఉద్యోగులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివాదాలతో రచ్చకెక్కుతున్నారు. ఏడాదిగా వివాదాలు.. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పాలన మారింది. ఇదే సమయంలో మున్సిపల్ పాలక వర్గం మాత్రం.. వైఎస్సార్ సీపీదే. మధ్యలో అడ్డదారిలోనైనా మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని కూటమి నాయకులు విఫలయత్నం చేశారు. అది కుదరలేదు. ఈలోగా కొంతమంది కౌన్సిలర్లు కూటమి పక్షాన చేరారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు రాకతో పరిస్థితి మొత్తం మారిపోయింది. అభివృద్ధి కుంటుపడిందన్నది ప్రధాన ఆరోపణ. సాధారణ సమావేశాలు సైతం చాలా రోజులు నిర్వహించక అభివృద్ధికి మోకాలడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కూటమి వార్డులపై ఫోకస్ పెట్టి.. వైఎస్సార్సీపీ వార్డులను, సభ్యులను టార్గెట్ చేశారు. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలకు ఏకీభవించకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తూ కక్ష సాధింపునకు దిగారు. సిబ్బంది మధ్య విభేదాలు కొద్ది రోజులుగా సిబ్బంది మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి కుర్చీలు విసురుకోవడం మొదలు.. పెన్డౌన్ చేపట్టి విధులు బహిష్కరించే వరకూ వచ్చింది. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ విభాగం అధికారి రూబిన్ మధ్య చాలా రోజుల నుంచి పొసగడం లేదు. తనకు సంబంధించిన మెడికల్ బిల్లుల విషయమై ఆర్వో రూబిన్.. కమిషనర్ను కొద్ది రోజుల క్రితం నిలదీశారు. ఆ తరువాత తమను ఆర్వో దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కమిషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నల్లబ్యాడ్జీలతో కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. ఆ మరుసటి రోజే సెలవు విషయమై ఇద్దరి ఉద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. కార్యాలయంలోనే కేకలు వేసుకోవడంతోపాటు.. కుర్చీలు విసు రుకున్నారు. తాజాగా గురువారం కూడా ఆర్వో రూబిన్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగులు పెన్డౌన్కు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇప్పటికై నా చల్లారుతుందా, లేదా అన్నది చూడాలి. ప్రధానంగా కమిషనర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. ఆయనపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విచారణకు వచ్చిన ఆ శాఖ ఆర్డీ ఎదుట కూడా పలువురు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మున్సిపల్ సిబ్బంది అవినీతిపైనా ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరిపైనా తీసుకున్న చర్యలు శూన్యం. కార్యాలయంలో పని చేస్తున్న మరికొంతమంది కూడా కమిషనర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. పాలన గాలికి.. సిబ్బంది మధ్య విభేదాలు, రాజకీయ కారణాలతో పుర పాలన పూర్తిగా గాడి తప్పింది. పట్టణంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మంచినీరు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు ఉద్యోగులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు తిరిగి.. తిరిగి విసిగిపోవాలే గానీ... ప్రయోజ నం ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
పార్వతీపురం: గ్రామసర్వేయర్లు ఎదుర్కొంటున్న స మస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స ర్వేయర్ల సంఘం నాయకుడు ఉదయ్ కుమార్ మా ట్లాడుతూ ఐదేళ్ల సర్వీసు పూర్తయినప్పటికీ రేషనలైజేషన్లో కానీ, బదిలీ ప్రక్రియనులోకానీ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. గ్రామ సర్వేయర్లుగా ఉన్న తమకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట తదితర మండలాల నుంచి సర్వేయర్లు పాల్గొన్నారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: దేవస్థానం భూముల్ని అన్ని విధాలా పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా స్థాయి దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 11 వేల ఎకరాల భూమి దేవదాయ శాఖ పరిధిలో ఉందని అందులో కొంత ఆక్రమిత భూమి ఉందని, ఈ భూమికి వెంటనే సర్వే చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే మాన్సాస్ ట్రస్టుకు చెందిన భూమిలో కూడా ఆక్రమణలు ఉన్నాయని, ఇందులో వ్యవసాయ, నివాస, వాణిజ్య పరంగా ఆక్రమించిన వివిధ సంస్థల ఆక్రమిత భూములకు సంబంధించి రూ.50 లక్షల వరకు యూజర్ చార్జీల కింద ఆక్రమణదారులు చెల్లించారని తెలిపారు. అయితే ఎటువంటి యూజర్ చార్జీలు చెల్లించకుండా కమర్షియల్గా వినియోగిస్తున్న దేవదాయ భూముల్లోని సముదాయాలను తొలగించాలని, అందుకు రెవెన్యూ అధికారులు పోలీస్ వారి సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. భూముల విషయంలో కోర్టు ఆర్డర్స్ను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. మ్యుటేషన్స్ చేయవలసిన వాటి వివరాలను మండలాల వారీగా ఆర్డీఓలకు అందజేయాలని, ఆర్డీఓలు వెంటనే మ్యుటేషన్ జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, దేవదాయశాఖ ఎ.సి శిరీష, ఆర్డీఓలు సవరమ్మ, రామ్మోహన్ రావు, ఆశయ్య, సర్వే ఎ.డి రమణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, డీఎస్పీ వీరకుమార్, డిప్యూటీ కమిషనర్, ఏఓలు పాల్గొన్నారు. -
రామయ్యా..చూడవేమయ్యా..!
● పవిత్ర బోడికొండను తవ్వేస్తున్న అక్రమార్కులు ● మనోభావాలను దెబ్బతీస్తున్నారని భక్తుల ఆగ్రహం ● స్పందించని అధికార యంత్రాంగంనెల్లిమర్ల రూరల్: సాక్షాత్తు శ్రీరాముడే నడయాడిన నేలగా రామతీర్ధాన్ని భక్తులు విశ్వసిస్తుంటారు. నీలాచలం పర్వతంగా పిలుస్తున్న రామతీర్థంలోని బోడికొండపై పాండవులు సంచరించినట్లు చరిత్ర చెబుతోంది. కొండపై శ్రీ కోదండరాముడి ఆలయంతో పాటు అలనాటి చారిత్రక గుర్తులను చూసేందుకు సందర్శకులు నిత్యం కొండపైకి వెళ్తుంటారు. అంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన బోడికొండను సైతం అక్రమార్కులు విడిచిపెట్టడం లేదు. గడిచిన కొద్ది నెలలుగా ధనార్జనే లక్ష్యంగా శ్రీరాముడి కొండనే తవ్వేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సీతారామునిపేట జంక్షన్ సమీపంలో ఉన్న కొండవద్ద గడిచిన కొన్ని రోజులుగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సమీప గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో కొందరు అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి కొండను తవ్వేస్తున్నారు. పట్టపగలే ఈ వ్యవహారం జరుగుతున్నా..ఇటు దేవస్థానం అధికారులు కానీ, అటు రెవెన్యూ యంత్రాంగం కానీ స్పందించకపోవడం బాధాకరం. కొండపై ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు సైతం కిందపడుతున్నాయంటే తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ట్రాక్టర్ లోడును పరిధిని బట్టి రూ.600 నుంచి రూ.1000 వరకు అమ్మేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రహదారి పక్కనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వ భూములకు ఎలాగూ రక్షణ లేదు సరికదా.. సాక్షాత్తు దేవుడి కొండనైనా అక్రమార్కుల నుంచి కాపాడలేరా..? అంటూ భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బోడికొండను తవ్వేస్తున్న అక్రమార్కులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైతు సమస్యపై రాజకీయం వద్దు
వీరఘట్టం: మండలంలోని పాలమెట్ట గ్రామంలో నాగావళి నదికి అనుసంధానంగా ఉన్న ఓపెన్ హెడ్ చానల్ పనులు చేపట్టేందుకు ఓ రైతుగా తాను వచ్చానని, రైతు సమస్యను రాజకీయం చేయవద్దని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కోరా రు. బొడ్డగెడ్డ వద్ద పాలమెట్ట–నీలానగరం ఓపెన్ హెడ్ చానల్ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు సమస్య. మా పూర్వీకుల నుంచి ఏటా ఖరీఫ్ సమయంలో కాలువ నిర్వహణను ఓ వ్యక్తికి అప్పగిస్తున్నామని అధికార యంత్రాంగానికి, మీడియాకు తెలియజేశారు. ఓపెన్హెడ్ చానల్ కింద బిటివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, ఎంవీ పురం, పనసనందివాడ, తలవరం గ్రామాల రైతులకు చెందిన 2,500 ఎకరాల ఆయకట్టు ఉందని, ఏటా రైతులు సంయుక్తంగా ఈ కాలువను బాగుచేసుకుని పంట పొలాలకు సాగునీరు అందేలా చేసుకుంటున్నారన్నారు. కూటమి నేతలు కాలువ పనులు చేపట్టనీయకుండా రెండు రోజులుగా ఈ ప్రాంత రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అరకొరగా పనులు చేపట్టి.. ఇటీవల పాలమెట్ట–నీలానగరం ఓపెన్ హెడ్ చానల్ పనులను రూ.11 లక్షల ఖర్చుతో అరకొరగా చేపట్టి నిధులను పక్కదోవ పట్టించి రైతులను కూటమి నేతలు మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ విక్రాంత్ ధ్వజమెత్తారు. ఈ ప్రాంత రైతులు తమ పంట కాలువను తామే బాగు చేసుకుంటామంటే ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారని ప్రశ్నించారు. అంతకు ముందు బిటివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, ఎంవీ పురం, పనసనందివాడ, తలవరం గ్రామాల రైతులతో కలిసి టెంకాయలు కొట్టి కాలువ పనులను ఎమ్మెల్సీ విక్రాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు, వీరఘట్టం జెట్పీటీసీ జంపు కన్నతల్లి, వైస్ ఎంపీపీ పర్రి విజయకుమారి, వైఎస్సార్సీపీ నాయకులు నిష్టల సన్యాసిరావు భుక్త, పాలవలస నందకుమార్, పొట్నూరు లక్ష్మ ణరావు, వావిలపల్లి పురుషోత్తమరావునాయుడు, శిష్టు మధుసూదనరావు, బౌరోతు రాజశేఖర్, దేవకివాడ భుజంగరావు, బెవర అప్పలనాయుడు, పన్నింటి శ్రీను, భుగత అమృతరావు, భోగి మణి, ఉత్తరావల్లి వెంకటరమణ, ఆరు గ్రామాల రైతులు పాల్గొన్నారు. భారీగా మోహరించిన పోలీసులు పాలమెట్ట గ్రామంలో గురువారం తెల్లవారేసరికి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గామంలోకి వచ్చే ప్రతి ఒక్కరి ఫొటోను సెల్ఫోన్తో తీయడంతో ఏం జరుగుతోందోనని ఆందోళన చెందారు. ఎమ్మెల్సీ విక్రాంత్ రైతులతో కలిసి పాలమెట్ట ఓపెన్ హెడ్ చానల్ పనులు ప్రారంభించేందుకు వస్తున్నారని, బందోబస్తుకు వచ్చామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. చానల్ పనుల ప్రారంభ కార్యక్రమం ప్రశాంతంగా జరగడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విజ్ఞప్తి పాలమెట్ట ఓపెన్హెడ్ చానల్ పనులకు శ్రీకారం మద్దతు పలికిన ౖరైతాంగం -
చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాల సమీపంలో ఏనుగులు
సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. గోరపాడు కొండల్లో బుధవారం తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు కొండ దిగి చిన్నబగ్గవైపు వచ్చి ఆశ్రమపాఠశాలకు కొద్దిదూరంలో ఉన్న జీడితోటల్లో ఘీంకరిస్తున్నాయి. అటువైపు ఎవ్వరూ వెళ్లవద్దని అటవీశాఖ ఎఫ్బీవో కె. దాలినాయుడుతో పాటు ట్రాకర్లు సూచిస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాలు మరింత పెరగాలికొమరాడ: గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమి క పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గత ఏడా ది కంటే మరింత పెరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఉపాధ్యాయులతో అన్నారు. ఈ మేర కు గురువారం ఆయన కొమరాడ మండలంలోని అంకుళ్లవలస, రావి కర్రివలస గ్రామాల్లో గల గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ఆకస్మికంగా సందర్శించా రు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి వారితో ముచ్చటించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. పీఎస్ల హేతుబద్ధీకరణకు సలహాలివ్వండిపార్వతీపురం టౌన్: జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు తగిన సలహాలు ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరా రు. అలాగే ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను తయారు చేయడంలో బీఎల్ఓలతో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువా రం ఆమె తన చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా డీఈఓ లేదా ఈఆర్ఓ స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయమై ఈసీ జారీ చేసే నియమాలు, మార్గదర్శకాలపై తగిన సలహాలను జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి కోరుతున్నట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా ను తయారు చేయడంలో బీఎల్ఓలకు సహకరించాలని, ఇందుకు గుర్తింపు పొందిన రాజకీ య పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్ లెవె ల్ ఏజెంట్ను నియమించాలని సూచించారు. -
ఈఈను నేను.. కాదు నేను..!
● ఇద్దరు ఈఈల మధ్య కుర్చీలాట ● ప్రభుత్వం నియమించిందని ఒకరు, కోర్టు జీఓ సస్పెండ్ చేసిందని మరొకరు.. ● ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ పోస్టుపై నెలకొన్న ఉత్కంఠ సీతంపేట: సీతంపేట ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలో ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పోస్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు ఈఈల మధ్య గురువారం కుర్చీలాట కొనసాగింది. కార్యాలయంలో వేర్వేరు కుర్చీల్లో ఇద్దరు కూర్చోవడంతో ఎవరు తమ ఈఈ అన్న ప్రశ్న కిందిస్థాయి ఉద్యోగుల్లో తలెత్తింది. కార్యాలయానికి వచ్చేవారు ఎవరికి రిపోర్టు చేయాలో తెలియక సందిగ్దంలో పడ్డారు. వివరాలు పరిశీలిస్తే.. ఏడు నెలల కిందట సీతంపేట ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో రమాదేవిని నియమించా రు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ నెల 9న ఆమె స్థానంలో కె.వి.ఎస్.ఎన్ కుమార్ను ఇక్కడ నియమించి రమాదేవిని నెల్లూరుకు బదిలీ చేశారు. ఈ నెల 11న కుమార్ సీతంపేట ఈఈగా బాధ్యతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలలకే తనను బదిలీ చేశారంటూ రమాదేవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బదిలీ జీఓను హైకోర్టు ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాలతో తను ఇక్కడే ఈఈగా కొనసాగుతున్నట్టు రమాదేవి స్పష్టం చేశారు. ప్రభుత్వ బదిలీ జీఓ ప్రాప్తికి తనుకూడా ఇక్కడే ఈఈగా విధులు నిర్వహిస్తున్నట్టు కుమార్ తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
శృంగవరపుకోట: ఇంటిముందు మావిడాకుల తోరణాలు వాడనేలేదు. పెళ్లింట సందడి ముగియనే లేదు. విధి ఆడిన ఆటలో నవవరుడు ప్రాణాలు చాలించాడు. తాళికట్టిన భర్త తరలిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి నవవధువు శోకంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లగుడు ప్రదీప్(26)కు ఇటీవల పెళ్లయింది. ప్రదీప్ తల్లితో కలిసి గురువారం గడ్డి కోసేందుకు వెళ్లాడు. గడ్డిమోపు పట్టుకుని తిరిగి వస్తున్న సమయంలో తెగి ఉన్న విద్యుత్ తీగ తగిలి షాక్కు గురయ్యాడు. దీంతో తల్లి అరుపులతో పక్క పొలాల్లో ఉన్న గ్రామస్తులు పరుగున వచ్చి చూసేసరికే ప్రదీప్ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. భర్త పార్ధివదేహాన్ని చూసి భార్య ఏడుస్తుంటే గ్రామస్తుల కళ్లు చెమర్చాయి. కాగా ఈ ఘటనపై ఇటు విద్యుత్శాఖ అధికారులు కానీ, అటు పోలీస్ ఉద్యోగులు కానీ నోరు మెదపలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. -
దోమల కాయిల్స్తో అనర్థాలు
● మార్కెట్లో విచ్చలవిడిగా నాశిరకం బ్రాండ్ల విక్రయాలు ● సహజ పద్ధతులే మేలంటున్న వైద్యులుపార్వతీపురం: దోమకాటుతో అనారోగ్యానికి గురవుతామన్న భయంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్ను వాడడం పరిపాటిగా మారింది. మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్తో పాటు మస్కిటో అగరబత్తీలను విరివిగా వినియోగిస్తున్నారు. వాటి ద్వారా వచ్చే పొగతో దోమలు రావని భావించి వెలిగిస్తుంటారు. పొగ బయటకు పోకుండా ఇంట్లోని తలుపులన్నీ బిగించి ఈ కాయిల్స్ను వెలిగిస్తారు. ఈ పొగలో కార్సినోజెనిక్ రసాయనాలు కలిగిఉండడం వల్ల ఆస్తమా ఉన్న వారికి, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు శరీరంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిజానికి మస్కిటో కాయిల్స్ వినియోగం వల్లే కేవలం దోమలు చనిపోవడం లేదు. ఆ పొగ ఉన్నంత సేపు దోమలు సంచరించేందుకు వీలులేక మగతగా ఉండి వాసన తగ్గిన తరువాత అలాగే పొగ ప్రభావం తగ్గిన వెంటనే యథావిధిగా మళ్లీ దోమలు దాడికి పాల్పడతాయి. రోజురోజుకు దోమలు ప్రబలడంతో మార్కెట్లోకి నాశిరకం బ్రాండ్లు కూడా వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ప్రకటనలతో మరింత ఆకర్షణగా.. గతంలో రీఫిల్స్ను 30, 35, 60 రాత్రులు పనిచేస్తాయంటూ విక్రయించేవారు. ప్రస్తుతం హై, లో ఆప్షన్లతో 45 ఎంఎల్ రీఫిల్స్ను విక్రయిస్తున్నారు. వాటిని హైలో పెట్టుకుంటే 10 నుంచి 15 రోజులు వస్తాయి. లో ఆస్షన్లో పెడితే 20 నుంచి 25రోజుల వరకు వస్తాయన్న ప్రత్యేకమైన ప్రకటనలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనంగా ఉన్నప్పటికీ ముందుముందు ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్యునిపుణులు హెచ్చరిస్తున్నారు, రీఫిల్స్లో ఉండే ప్రాలేత్రిన్, పెర్మేత్రిన్, ట్రాన్స్ఫ్లోత్రిన్ వంటి కృత్రిమ కీటక నాశకాలు వెలువడే పొగతో మన శ్వాసకోస వ్యవస్థ మరింత ప్రభావితం అవుతుంది. ఈ రసాయనాలు వాయువులో చేరి ఊపిరితిత్తులను బాధించి ఆస్తమా, బ్రాంకై టీస్ వంటి శ్వాససంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పార్వతీపురం, పాలకొండ, కురుపాం పరిసరాలలో ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.సహజ మార్గాలను ఉపయోగిస్తే మేలుప్రజలు ఈ దోమల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు కాయిల్స్, రీఫిల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాడిన తరువాత గదిని బాగా వెంటిలేట్ చేయాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రసాయన రీఫిల్స్కు బదులు సహజ మార్గాలను ఉపయోగించాలి. నిమ్మ, లవంగం, తులసి వంటి సహజ పదార్థాల ద్వారా దోమలను దూరం చేసే ప్రయత్నాలు అనారోగ్యానికి గురిచేయండా మేలుచేస్తాయి. వీలైనంత మేరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పడుకోవడానికి ఉపయోగించే బెడ్షీట్లు ఎండలో ఉంచుతూ శుభ్రం చేసుకోవాలి. కిటికీలు, వెంటిలేషన్స్కు మెస్ల అమరిక మంచిది. పడుకునే గదిలో గాలి ఆడేలా చూసుకుంటూ అవసరమైతే దోమతెరలు వినియోగించాలి. – డా.ఎన్ఎంకే తిరుమల ప్రసాద్, పీహెచ్సీ వైద్యాధికారి, బందలుప్పి -
వృద్ధిరేటు పెరిగేలా ప్రణాళికలు
పార్వతీపురంటౌన్: వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో వృద్ధిరేటు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. సుపరిపాలన కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వ శాఖాధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్యామ్ప్రసాద్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా ప్రతి ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, తృణధాన్యాలు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో అధిక ఆదాయం పొందాలని అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా పాల దిగుబడి గతేడాది కంటే ఈ ఏడాది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని, పశు సంపదను ప్రోత్సహించడంతో అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రగతిలో వృద్ధి రేటు గణనీయంగా పెరగాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, అటవీ, పశుసంవర్థక, వైద్యారోగ్య, ఇంటర్మీడియట్ విద్యశాఖల అధికారులు పి.వీర్రాజు, కె.రాబర్ట్ పాల్, వై.క్రాంతి కుమార్, వై.శ్రీదేవి, జేపీఏ ప్రసూన, డా.ఎస్.మన్మథ రావు, డా.ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, డీఆర్డీఏ పీడీలు ఎం.సుధారాణి, డా.టి.కనకదుర్గ, వై.నాగేశ్వరరావు, పరిశ్రమల కేంద్రం ఎ.డి పి.సీతారాము, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఆర్అండ్బీ ఇరిగేషన్ ఈఈలు ఒ.ప్రభాకరరావు, ఎస్.రామచంద్రరావు, డీఎస్.ప్రదీప్, ఎ.ఢిల్లీశ్వర రావు, పంచాయతీ రాజ్ డీఈఈ కె.సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
డ్రగ్స్ రహిత జిల్లాకు భాగస్వాములు కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురంటౌన్: డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అసుతోష్ శ్రీవాస్తవతో కలిసి కలెక్టర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్సీఎం నుంచి బయల్దేరిన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే మత్తు పదార్థాల పట్ల అవగాహన ఉండాలని, దీని నియంత్రణకు విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని. అప్పుడే సమాజం నుంచి డ్రగ్స్ను పూర్తిగా రూపుమాపవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో డ్రగ్స్ ను రూపుమాపవలసిన గురుతర బాధ్యత విద్యార్థులపై ఉందని, దానికోసం ఈగల్ క్లబ్బులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పార్వతీపురంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామన్నారు. డ్రోన్ టెక్నాలజీ, సీసీ కెమెరాలు, చెక్పోస్టులను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట నిఘా పెట్టినట్లు చెప్పారు. 1,873 కేజీల గంజాయి స్వాధీనం గతేడాది 22 గంజాయి కేసులను నమోదుచేసి 1,873 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 22 వాహనాలను సీజ్ చేశామని కలెక్టర్ చెప్పారు. గంజాయి సరఫరా చేసే వారిపై కూడా కచ్చితంగా కేసులను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సారా కూడా ఉంటుందని, దీనికోసం నవోదయం 2.0 కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. గంజా యి, సారా రహిత గ్రామాలుగా పార్వతీపురం మన్యం మన్యం జిల్లాను తీర్చిదిద్దాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయచంద్ర, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, పాలకొండ డీఎస్సీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్యరోగ్య శాఖాధికారి డా.ఎస్. భాస్కరరావు, యువత పాల్గొన్నారు. -
నేడు జగన్నాథుని రథయాత్ర
విజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్వామివారికి గురువారం వేకువజామునుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సంతపేట, దాసన్నపేట, మన్నార్ రాజ గోపాలస్వామి ఆలయం ఆవరణలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళావాహన, బింబ దర్శనం, నేత్రోత్సవం, ప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం స్వామివారి శాంతి కల్యాణోత్సవం, రాత్రి రథోత్సవానికి స్వామివారిని సిద్ధం చేశారు. రక్షాబంధనాలు ధరించారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మేళతాళాలతో స్వామివారి రథారోహణ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు, కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్ను ఆర్డీఓ జేవీవీ రామ్మోహనరావు గురువారం పట్టుకున్నారు. ట్రాక్టర్ను నిలువరించేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్డీఓ ఆదేశాల మేరకు మెట్టవలసలోని యజమాని మీసాల చంద్రశేఖర్ ఇంటి వద్ద ట్రాక్టర్ను ఆర్ఐ రామకుమార్, సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ తరలింపు, ఆపకుండా వెళ్లిపోయినందుకుగాను రూ.20వేల జరిమానా విధించామని ఆర్ఐ రామకుమార్ తెలిపారు. బ్యాటరీల చోరీ● ఆందోళన చెందుతున్న వాహన యజమానులు పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస ఫ్లైఓవర్ కింద పార్కింగ్ చేసి ఉంచిన మూడు లగేజీ వ్యాన్లు, ఒక లారీకి ఉన్న బ్యాటరీలను గుర్తుతెలియని దుండగులు అపహరించారని వాహన యజమానులు ఆందోళన చెందారు. గతంలో కూడా ఎన్నోమార్లు ఈ విధంగా వాహనాలకు ఉన్న బ్యాటరీలను వైర్లను చిందరవందరంగా కోసి దొంగిలించారని వాపోయారు. ఈ మేరకు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గురువారం ఉదయం వాహనాల వద్దకు వెళ్లేసరికి వైర్లు కట్చేసి ఉండడంతో బ్యాటరీలు లేకపోవడాన్ని గమనించినట్లు తెలిపారు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడికి గురైన వ్యక్తి మృతిబొబ్బిలి: పట్టణ పరిధిలోని గ్రోత్సెంటర్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ స్టోర్లో వాచ్మన్గా పనిచేస్తున్న కనిమెరకల వెంకటరమణ(55) పై ఈనెల 20న గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వెంకట రమణ కుమారుడు పురుషోత్తమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె.సతీష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే వెంకట రమణ విధులకు హాజరయ్యాడు. సరిగ్గా రాత్రి 12.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కంపెనీలోకి ప్రవేశించి బలమైన ఆయుధంతో వెంకటరమణ ముఖం, తలపై బలంగా దాడి చేశాడు. దీంతో వెంటనే స్థానికులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మూడు టీమ్లను నియమించామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రోడ్డు ఇలా.. బడికెళ్లేదెలా?
చిత్రంలో పెద్దపెద్ద గుంతలతో బురదమయంగా కనిపిస్తున్నది జియ్యమ్మవలస మండలం పరజపాడు– పెదకుదమ రోడ్డు. చినుకుపడితే చాలు చిత్తడిగా మారుతోంది. ఈ రోడ్డుపై రాకపోకలకు పరజపాడు, లక్ష్మీపురం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు నరకం చూస్తున్నారు. రోడ్డు బాగుచేయాలంటూ కూటమి నేతలను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షం కురిస్తే బడికి వెళ్లాలంటేనే భయం వేస్తోందన్నారు. పక్కా రోడ్డు నిర్మించాలని సర్పంచ్ పలు సార్లు మండల సర్వసభ్య సమావేశాల్లో మెరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. – జియ్యమ్మ వలస రూరల్ -
మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని మహిళల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మిషన్మత్స్యశక్తి, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్, గిరిబజార్ నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు సహాయం అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచి, సమాజంలో సమాన భాగస్వాములుగా చేయడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర కార్యక్రమమే ‘మిషన్ మత్స్యశక్తి’ అని వివరించారు. జిల్లాలో రూ.479 కోట్లుగా ఉన్న మత్స్య సంపద ద్వారా వస్తున్న జీడీపీని రూ.600 కోట్లకు పెంచాలన్నారు. దర్తీ అభాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద 90 శాతం రాయితీ రుణాలకు 165 గిరిజన గ్రామాల ప్రజల నుంచి ఈ నెల 30లోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. కనీసం 100 ఫిష్ పాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా కోటి చేపపిల్లలు దిగుబడి రావాలని కలెక్టర్ ఉద్బోధించారు. ● జిల్లాలో ఏర్పాటు చేసే జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు సిద్ధం కావాలని ఐటీడీఏ పీఓను కలెక్టర్ ఆదేశించారు. యూనిట్ నిర్వహణలో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ● గిరిబజారు వాహనాలను అప్పగించనున్నామని, వాటితో గిరిజన ప్రాంతాల్లో సరుకులను విక్రయించవచ్చన్నారు. నేడు నిషాముక్త్ భారత్ ర్యాలీ నిషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని గురువారం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇందులో యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నిషాముక్త్భారత్ ర్యాలీని మధ్యాహ్నం 3 గంటల నుంచి పార్వతీపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన అనంతరం కార్యాలయ సెల్లార్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, ఏపీఓ ఎ.మురళీధర్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, పార్వతీపురం మత్స్యకార అధికారి శ్రీదేవి, జిల్లా పశుసంవర్థక అధికారి డా.ఎస్.మన్మథరావు, జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి కె.సాయికష్ణ చైతన్య, ఎల్డిఎం ఎన్.విజయ్స్వరూప్, నాబార్డు ఏజీఎం దినేష్, కేవీకే శాస్త్రవేత్త డా.శ్రీనివాస్రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
పిల్లలు లేని ఫౌండేషన్ స్కూల్!
బోధించేందుకు టీచర్ ఉన్నారు. కానీ పాఠాలు వినేందుకు ఒక్క విద్యార్థి కూడా లేరు. ఇది సంతకవిటి మండలం గుజ్జన్నపేట ప్రాథమిక పాఠశాల దుస్థితి. దీనిని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఫౌండేషన్ స్కూల్గా మార్పుచేసి ఇక్కడ కొనసాగే 3, 4, 5 తరగతులను చిత్తారిపురం యూపీ స్కూల్లో విలీనం చేసింది. ఇప్పటివరకు ఇక్కడ రెండో తరగతి చదుతున్న ఒకే ఒక విద్యార్థి కూడా ప్రస్తుతం పాఠశాలకు రావడం లేదు. కొత్తగా ఒకటి రెండు తరగతుల్లో విద్యార్థులు ఎవరూ చేరలేదు. అంతే... టీచర్ ఎస్.నారాయణమ్మ విధులకు సమయానికి హాజరుకావడం, వెళ్లిపోవడమే జరుగుతోంది. విద్యాశాఖాధికారులు స్పందించి ఫౌండేషన్ స్కూల్ను రద్దుచేసి, ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏం చేస్తారో వేచిచూడాల్సిందే. – సంతకవిటి -
కొత్తవలస కేజీబీవీలో అగ్నిప్రమాదం
కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ శివారు అడ్డూరువానిపాలెం వద్ద గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం తెల్లవారు జూమున 3.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన రోటరీ క్లబ్ సంస్థ వారు బాలికలకు వితరణగా మంగళవారం అందజేసిన 280 పరుపులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు 79 మందికి చెందిన అభ్యసన సామగ్రి కాలిబూడిదయ్యా యి. కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచిన ఇద్దరు బాలికలు ప్రమాదాన్ని గుర్తించి అందరినీ అప్రమత్తం చేశారు. వెంటనే బాలికలందరూ భవనం నుంచి బయటకు పరుగుతీశారు. విద్యాలయం సిబ్బంది అందించిన సమాచారం మేరకు కొత్తవలస, ఎస్.కోట అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. పై అంతస్తులో ప్రమాదం కావడంతో మంటలు అదుపుచేయడం కష్టతరమైంది. ఉదయం 7 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. బాలికలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఎస్ఓ విజయకుమారితో పాటు బాలికల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. విద్యాలయాన్ని సందర్శించిన పీఓ ప్రమాద వార్త తెలిసిన వెంటనే సర్వశిక్షా అభియాన్ పీఓ డాక్టర్ అవగడ్డ రామారావు విద్యాలయానికి చేరుకున్నారు. ప్రమాదం తీరును ఎస్ఓ, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీఈఓ మాణిక్యంనాయుడు సందర్శించి విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. కాలిపోయిన అభ్యసన సామగ్రి, ఇతర వస్తువులు కొనుగోలుకు రూ.2లక్షలు మంజూరు చేసినట్లు పీఓ రామారావు తెలిపారు. సహాయక చర్యలు ప్రమాద స్థలాన్ని కొత్తవలస మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గొరపల్లి శివ, మేజర్ పంచాయ తీ సర్పంచ్ మచ్ఛ ఎర్రయ్యరామాస్వామి, వైఎస్సార్సీపీ నాయుకులు చెల్లయ్యలు పరిశీలించా రు. పాఠశాలకు 20 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని పంపించి సహాయక చర్యలు అందించారు. కాలిబూడిదైన 280 పరుపులు, 79 మంది విద్యార్థుల అభ్యసన సామగ్రి సురక్షితంగా బయటపడిన 270 మంది బాలికలు విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ప్రమాదం -
డీడీఆర్ఎఫ్ఓగా సింహాచలం
పార్వతీపురంటౌన్: జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారిగా పి.సింహాచలం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విపత్తులు, వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆయనకు సూచించారు. జిల్లాలోని నాలుగు అగ్నిమాపక కేంద్రాల పరిస్థితి, సిబ్బంది, మౌలిక సదుపాయాలను ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగుల నిరసన సాక్షి, పార్వతీపురం మన్యం: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ పార్వతీపురం మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. సచివాలయ ఉద్యోగుల జాబ్చార్ట్ను తక్షణమే ప్రకటించాలని, రేషనలైజేషన్కు సంబంధించి మిగులు ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగోన్నతులు, పెండింగు బకాయిల విడుదల చేయాలని కోరారు. సచివాలయ శాఖకు చట్టబద్ధత కల్పించాలన్నారు. డిమాండ్లన్నీ పరిష్కరించిన తర్వాతే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగ రాష్ట్ర కార్యదర్శుల నియామకంపార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్టీఐ విభాగంలో పదవులు దక్కాయి. పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన దేవుపల్లి నాగరాజును జనరల్ సెక్రటరీగా, కురుపాం నియోజకవర్గానికి చెందిన చందక వెంకటేశ్వరరావును సెక్రటరీగా నియమిస్తూ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆశ కార్యకర్తల నియామకాలకు నోటిఫికేషన్ జారీ పార్వతీపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా 34 మంది ఆశ కార్యకర్తల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసినట్టు డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రామీణ, గిరిజన గ్రామ సచివాలయాల పరిధిలో ఆశ కార్యకర్తల నియామకానికి ప్రభు త్వం అనుమతించిందన్నారు. సచివాలయం పరిధికి చెందిన 25–45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వివాహితులు, వితంతువులకు నియామకాల్లో ప్రాధాన్యమిస్తామన్నారు. 10వ తరగతి చదివి, తెలుగు చదవడం, రాయడం వచ్చినవారు దరఖాస్తులను జూలై 5లోగా సంబంధిత పీహెచ్సీల్లో అందజేయాలని కోరారు. -
గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025
● ఏది రాజకీయం.. చేయించిందెవరు? ● పెదపెంకి పిల్లల ప్రమాద ఘటనను ‘డైవర్షన్’ చేసేందుకు ప్రయత్నం ● మంత్రి లోకేశ్కు ‘ఎక్స్’లో పోస్టు చేసింది టీడీపీ కార్యకర్త శ్యామ్ ● ఎమ్మెల్యే విజయచంద్రకు అనుచరుడిగా గుర్తింపు ● వాస్తవాలు బయటకు రావడంతో ‘తప్పు’ను కప్పిపుచ్చే యత్నంన్యూస్రీల్ ఇదీ రాజకీయమే అందామా?ఆటో ప్రమాద ఘటనలో గాయపడిన చిన్నారులకు ఆర్థిక సహాయం నిమిత్తం టీడీపీ నాయకులు బుధవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున నగదు అందించారు. కొద్ది రోజులుగా పిల్లలు పోరాటం చేస్తున్నా, తమకేమీ తెలియదన్నట్లు చెబుతున్న తెలుగుదేశం పార్టీ పెద్దలు.. వారి సమస్య వినే తీరిక లేని నేతలు.. పిల్లలకు ప్రమాదం జరిగితే పరామర్శ చేయడం, ఆర్థిక సాయం అందించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానవతాదృక్పథంతో ఆ మొత్తం ఇచ్చారా.. లేకుంటే తాము వేసిన స్కెచ్ పారలేదనీ.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులను మభ్యపెట్టడానికే ఇచ్చారా.. దీన్నీ రాజకీయమే అనుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన నర్సిపురంలో ప్రమాదం జరిగితే.. ఏ ఒక్కరైనా ఎందుకు పరామర్శకు వెళ్లలేదని, ఇప్పుడే ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. -
వీఆర్ఏల నిరసన హోరు
పార్వతీపురం టౌన్: ఒకటిరెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదిగా ఆందోళనలు చేస్తున్నాం. వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు లేవు. చాలీచాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరు. ఖాళీలు భర్తీచేయకపోవడంతో అదనపు పనిభారం పడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. నెలకు ఇచ్చే రూ.11,000 వేతనంతో కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నామంటూ అధికారులకు గోడు వినిపించారు. వీరికి మద్దతుగా సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా నిరసనలు తెలిపినా.. వినతి పత్రాలు అందజేస్తున్నా సమస్యలు పరిష్కరించేవారు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వలే ఇక్కడా వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అటెండర్, నైట్ వాచ్మన్లుగా వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని, అదనపు విధుల నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రెడ్డి వేణు, గొర్లి వెంకటరమణ, వీఆర్ఏలు పాల్గొన్నారు.ఆర్థిక కష్టాలు వీఆర్ఏలకు నెలకు ఇచ్చే వేతనం కేవలం రూ.11,000. జిల్లా వ్యాప్తంగా 338 మంది వీఆర్ఏలు ఆర్థికంగా చితికిపోతున్నారు. మహిళలు అని చూడకుండా నైట్ వాచ్మన్ విధులకు పంపుతున్నారు. ఖాళీగా ఉన్న వాచ్మన్, అటెండర్ పోస్టులు భర్తీ చేయాలి. అదనపు పనిభారం నుంచి విముక్తి కలిగించాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయినా మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తాం. – ఈశ్వరరావు, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం -
పోలీస్ వెల్ఫేర్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీ
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు తమ విద్యార్హతలతో పాటు, కచ్చితంగా ఆంగ్లంలో విద్యాబోధన చేయగలిగిన సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగ ఖాళీలు, విద్యార్హత వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయ ఉద్యోగం 1: డీఈడీ లేదా బీఈడీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి 2వ తరగతి కోసం సింగిల్ మదర్ టీచర్ ఉద్యోగం 1సింగిల్ మదర్ టీచర్గా పని చేసేందుకు డీఈడీ, లేదా బీఈడీ అర్హతతో పాటు అన్ని సబ్జెక్టులను బోధించగలగాలి 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు సబ్జెక్టును బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాళీ 1డీఈడీ లేదా బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం బోధించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం ఖాళీ 1బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీ 1 కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసేందుకు బీఎస్సీ లేదా బీకాం లేదా ఇతర కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన డిగ్రీ లేదా సర్టిఫికెట్ కోర్సులను అర్హతగా కలిగి ఉండాలి. తోటమాలి ఖాళీ 1 పాఠశాలలో తోటమాలిగా పని చేసేందుకు ఆసక్తి కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు పైన తెలిపిన ఉద్యోగాలను భర్తీ కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన ఉదయం 10గంటలకు విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో గల పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూ, డెమో క్లాసులకు నేరుగా హాజరుకావచ్చని ఎస్పీ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం స్కూల్ ఆఫీసు నంబర్లు 9441022874, 6305883484 లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్ 9121109485, వెల్ఫేర్ ఆర్ఎస్సై 9121109484 నంబర్లను సంప్రదించ వచ్చని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి వట్టిగెడ్డ పాత బ్రిడ్జి సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన నూలక ప్రశాంత కుమార్(26) లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఇది వరకే వివాహం జరిగి ఇద్దరు పి ల్లలు ఉండగా భార్యతో విడాకులు తీసుకున్నాడు. తరువాత తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రశాంత కుమార్ మరో అమ్మయితో ప్రేమలో పడి ఆమెను ఇంటికి తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెప్పగా వద్దని మందలించారు. దీంతో ఈనెల 5వ తేదీన ఇంటి నుంచి బ్యాగ్తో వెళ్లిపోయి కొట్టక్కి బ్రిడ్జి వద్ద తన షర్ట్తో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల గ్రామాల్లో కూడా వాకబు చేశారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో సాలూరు రూరల్ పోలీస్స్టేషన్లో తమ కుమారుడు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం కొట్టక్కికి చెందిన పశువుల కాపరి చెట్టు కింద కుళ్లిపోయి దుర్వాసన కొడుతూ కింద పడి ఉన్న మృతదేహాన్ని చూసి గ్రామ వీఆర్వో మహేష్కు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు వీఆర్వో పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వ సమాచారం అందిన వెంటనే సీఐ కె.నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావు, ఏఎస్సై అప్పారావులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరివీలించారు. మృతదేహం వద్ద పడి ఉన్న సెల్ఫోన్ ఆధారంగా జీగిరాం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బ్యాగుతో పాటు అందులో ఉన్న బట్టల ఆధారంగా తమ కుమారుడేనని గుర్తించి భోరున విలపించారు. మృతదేహం తీయలేని దుస్థితిలో ఉండడం వల్ల పోలీసు అధికారులు ఘటనా స్థలంలోనే బాడంగి సీహెచ్సీ వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
● అంగన్వాడీ కేంద్రం శ్లాబ్కు ఊడిన పెచ్చులు మెంటాడ: మండలంలోని కుంటినవలసలో రెండవ అంగన్వాడీ కేంద్రం శ్లాబ్ పెచ్చులు రాలడం ఆందోళన కలిగించింది. బుధవారం కేంద్రంలో 17 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడే వచ్చిన ఆ గ్రామ యువతిపై ఆ పెచ్చులు పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన అంగన్వాడీ సూపర్వైపర్ హైమావతి వచ్చి ఆ పిల్లలను ఇళ్లకు పంపించారు. పిల్లలకు ఏమీకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం శ్లాబ్ కింద పిల్లలను ఉంచి కేంద్రాన్ని నడపడంపై పలువురు విమర్శలు చేసిన పట్టించుకోక పోవడం గమనార్హం.కూలిన వైన్షాపు ముందుభాగంబొబ్బిలి: పట్టణంలోని మేదరి బంద వద్ద గల మద్యం దుకాణ భవనం శ్లాబ్ ముందుభాగం బుధవారం కూలిపోయింది. అదృష్టవశాత్తు మద్యం కొనుగోలుకు ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న ఎకై ్సజ్ సీఐ పి.చిన్నం నాయుడు అక్కడికి వెళ్లి దుకాణం మూసివేయించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మద్యం దుకాణాన్ని మార్పు చేశాక తిరిగి తెరిచేందుకు అనుమతిస్తామని వ్యాపారులకు తెలియజేశారు. గురుదేవాలో చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్టు● మిస్టరీగా చోరీ సొత్తు రికవరీ కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో గత నెల 28వ తేదీన దొంగలు చొరబడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన పార్థగ్యాంగ్లో ఒకరిని మహారాష్ట్ర వెళ్లి పట్టుకుని అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో మహారాష్ట్రలోని బుల్దాన్ జిల్లాకు చెందిన ముత్తుపవర్ అక్షయ్, లక్ష్మణ పవర్లను అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సీఐ షణ్ముఖరావు బుధవారం తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ కేసులో కేవలం నిందితులను మాత్రమే పట్టుకుంటున్నట్లు పోలీసులు చూపుతున్నారే తప్ప ఎక్కడా చోరీకి గురైన సొత్తును రికవరీ చేస్తున్నట్లు చెప్పకపోవడం కొసమెరుపు. ఈ చోరీలో సుమారు 10కేజీల బంగారం,రూ 50లక్షలకు పైగా నగదు మాయమైనట్లు సమాచారం. నేడు ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాల, బాలికల ఎంపిక పోటీలు ఈనెల 26న నిర్వహించనున్నట్లు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ముఖ్య శిక్షకుడు డీవీ.చారి ప్రసాద్ బుధవారం తెలిపారు. నగరంలోని విజ్జి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి అండర్ –10, 12 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో అండర్–10 విభాగంలో 2016 జనవరి 1వ తేదీ అనంతరం, అండర్–12 విభాగంలో 2014 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా స్పష్టం చేశారు. క్రీడాకారులు విధిగా ఫెన్సింగ్ అసోసియేషన్ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని మరిన్ని వివరాలకు ఫోన్ 8374737707 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతకు బైక్స్
● అత్యాధునిక టెక్నాలజీతో తయారీ ● జిల్లాకు వచ్చిన 16 బైక్స్ విజయనగరం క్రైమ్: జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత కోసం కొత్తగా 16 మోటార్ సైకిల్స్ జిల్లా కేంద్రానికి వచ్చాయని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. డీజీపీ ఆఫీస్ నుంచి జిల్లాకు వచ్చిన బైక్స్ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ విధులను సమర్థవంతంగా నిర్వహిచేందుకు ఆ బైక్స్ను ఉపయోగిస్తామన్నారు. వాటిలో 15 టీవీఎస్ అపాచీ మోటార్సైకిల్స్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్నాయని తెలిపారు. ఈ మోటార్ సైకిల్స్ను సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు. జిల్లాలో ట్రాఫిక్ అవాంతరాలు తరచూ ఏర్పడుతున్న పోలీస్స్టేషన్లకు అలాగే రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న స్టేషన్లకు వాటిని కేటాయించనున్నా మని తెలిపారు. ఫోర్వీలర్స్ వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మోటార్ సైకిల్స్ వినియోగించి, పోలీస్ సిబ్బంది, అధికారులు చేరుకునే అవకాశముంటుందన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రమాదాల నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, ఆర్ఎస్సై(ఎంటీఓ) ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్సై (అడ్మిన్) ఎన్.గోపాలనాయుడు పాల్గొన్నారు. -
అందమే ఆనందం..!
విజయనగరం టౌన్: పెళ్లికుమార్తె ముస్తాబు చేస్తున్న బ్యూటీషియన్విజయనగరం టౌన్: ఫేషియల్ చేస్తున్న దృశ్యం● సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తున్న మహిళలు ● కాలానికి అనుగుణంగా మారుతున్న మహిళల తీరు ● ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్న సంస్థలు ● స్వయం ఉపాధికి మార్గం అంటున్న శిక్షకులు ● నేడు జాతీయ బ్యూటీషియన్ల దినోత్సవంరాజాం సిటీ:/విజయనగరం టౌన్: అందానికి ఎవరు ఎన్ని అలంకారాలు ఇచ్చినా, ఉపమానాలు చూపినా అందమే ఆనందం అంటున్నారు మహిళలు. ఆ అందం వెనుక మరో మహిళ ఉండి ఆ అందానికే వన్నెతెస్తోంది. ఇంట్లో, వీధిలో, బంధువుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు మహిళలు శ్రద్ధ తీసుకుంటున్నారు. కిట్టీ పార్టీల నుంచి పెళ్లిళ్ల వరకు ఏ శుభకార్యకమైనా అతివలదే సందడి. వేడుక ఏదైనా మేకప్ అదరాల్సిందే. వారి ఆశలకు అనుగుణంగానే పట్టణాల్లో బ్యూటీ పార్లర్లు కూడా విస్తరిస్తున్నాయి. అవుట్ డోర్ షూట్లు, పుట్టినరోజు, నిశ్చితార్థం ఇలా వేడుక ఏదైనా వనితకు ప్రత్యేకమే. ప్రతి శుభకార్యానికి ముందస్తు వేడుక ఇప్పుడో ట్రెండ్గా మారిపోయింది. అప్పటికప్పుడు పార్టీలకు వెళ్లేందుకు సైతం అభిరుచికి తగ్గట్టు మగువల అందానికి బ్యూటీషియన్లు మరింత వన్నె తెస్తున్నారు. నేడు జాతీయ బ్యూటీషియన్ల దినోత్సవం మహిళలు, విద్యార్థినులు సైతం అందానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాశ్చాత్య ధోరణి ఇప్పుడు పల్లెలకు సైతం పాకింది. పట్టణాల్లో ఏర్పాటుచేసిన బ్యూటీపార్లర్లు కూడా మగువల అభిరుచులకు తగ్గట్లు నిర్వహణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా కొద్దో గొప్పో బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకున్న వారికి ఓ ఆదాయ వనరుగా కూడా కలిసొస్తోంది. ఇంటివద్దే ఉంటూ నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పట్టణం నుంచి పల్లెల వరకు నేడు మహిళలు, చిన్నారులు సైతం అందంపైనే మక్కువ చూపుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న వేడుకలతో పాటు పెళ్లిళ్ల సీజన్లో నిశ్చితార్థం మొదలుకుని ఫొటోషూట్, పెళ్లి తంతు ముగిసే వరకు మగువలు అందంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారితో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. బ్రెడల్ మేకప్, శారీ డ్రాపింగ్, కేశాలంకరణ ఇలా ఎక్కడా మేకప్ విషయంలో రాజీపడడంలేదు. ఆదాయ వనరుగా.. బ్యూటీషియన్ కోర్సు చేసిన మహిళలకు ఇంటి వద్దే ఆదాయవనరుగా బ్యూటీ పార్లర్లు కలిసివస్తున్నాయి. ప్రతి నిత్యం ఐ బ్రో అందంగా తీర్చిదిద్దడంలో మెలకువలు పాటిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. మహిళల ఆసక్తిని, అభిరుచిని గమనించి బ్యూటీ పార్లర్లలో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. సింగిల్ ప్యాకేజీ, హోమ్ సర్వీసెస్ ద్వారా మగువలు వారి అందాన్ని మరింత మెరుగు పరుచుకుంటున్నారు. శరీరతత్వం, మనిషిరంగు, వేడుకను బట్టి వారికి అమరేలా మేకప్ చేస్తున్నారు. మేకప్ రకం, వాడే మెటీరియల్ బట్టి పారితోషికం కూడా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఇళ్లకు తీసుకువెళ్లి మేకప్ చేయించుకునేందుకు బ్యూటీషియన్లతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లి మేకప్ చేసేందుకు సైతం మెటీరియల్కు అనుగుణంగా రూ.4 వేల నుంచి రూ.10వేల వరకు రేట్లు నిర్ణయించి ఆదాయం సంపాదిస్తున్నారు. శిక్షణతో ప్రోత్సహిస్తున్న సంస్థలు.. మహిళలకు ఉపాధిమార్గాలు చూపేందుకు శిక్షణ సంస్థలు కూడా బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. దీంతో మహిళలు కూడా ఆసక్తి కనబరిచి శిక్షణ పొందుతున్నారు. అలాగే బ్యూటీ పార్లర్లలో పనిచేసుకుంటూ చిన్నచిన్న చిట్కాలను, మెలకువలను సైతం నేర్చుకుంటూ సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరగాలని, గురువారం జిల్లావ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డిజిటల్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, వీఆర్ఓలు, ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొనాలని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4,132 మంది 1వ తరగతి విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అవన్నీ ఈ డ్రైవ్ ద్వారా భర్తీ కావాలని తేల్చిచెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో చేరి ఆన్లైన్లో నమోదు కాని వారి వివరాలను రానున్న రెండు రోజుల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఇందుకు తల్లితండ్రులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, డ్రాపౌట్ విద్యార్థులను కూడా బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తల్లికి వందనం కార్యక్రమంపై విద్యాశాఖాధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పాటు అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు పెరగాలని, ఆ దిశగా తల్లితండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్, నోడల్ అధికారి డి.మంజులవాణి, ఐసీడీఎస్ పీడీ డా.టి.కనకదుర్గ, ఎంఈఓలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 27న సుపరిపాలన కార్యక్రమం సుపరిపాలన కార్యక్రమం ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఎస్.మన్మథ రావు, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, జిల్లా విపత్తు స్పందన/అగ్నిమాపక అధికారి పి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలి కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
విబా ద్వారా ఉచిత శిక్షణ
విజయనగరం బ్యూటీ అసోసియేషన్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళలకు, యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళలకు లబ్ధి చేకూర్చే బ్యూటీషీయన్ కోర్సు నేర్చుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు అటువంటి వారందరూ విజయనగరం జిల్లా కేంద్రంలోనే శిక్షణ తీసుకునేందుకు అనువుగా విబా ఏర్పాటుచేశాం. అసోసియేషన్ ఇక్కడ ఉండడం వల్ల పెద్దపెద్ద బ్యూటీ కంపెనీలు ఉచిత తరగతులను అందించేందుకు ముందుకు వస్తుండడం ఆనందంగా ఉంది. –బోని భాగ్యలక్ష్మి, వ్యవస్ధాపక అధ్యక్షురాలు, విజయనగరం బ్యూటీషియన్స్ అసోసియేషన్, విజయనగరం. -
ఇన్చార్జ్ తహసీల్దార్గా సంజీవకుమార్
పూసపాటిరేగ: పూసపాటిరేగ ఇన్చార్జ్ తహసీల్దార్గా సంజీవకుమార్ను నియమిస్తూ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. సాక్షి దినపత్రికలో ‘తహసీల్దార్ ఎక్కడ?’ శీర్షికన బుధవారం కథనం వెలువడింది. దీనిపై స్పందించిన రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు పూసపాటిరేగ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజీవకుమార్కు ఇన్చా ర్జ్ బాధ్యతలు అప్పగించారు. పదిరోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి రెవెన్యూ సేవలు అందకపోవడంతో విద్యార్థులు, వివిధ అవసరా ల నిమిత్తం వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు తహసీల్దార్ బాధ్యతలు ఇన్చార్జికి అప్పగించడంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. -
జిల్లా వేదికగా జాతీయ చెస్పోటీలు
● ఈనెల 28 వరకు జరగనున్న దివ్యాంగుల జాతీయ చెస్ చాంపియన్షిప్ ● పోటీలకు హాజరైన 16 రాష్ట్రాలకు చెందిన 150 మంది క్రీడాకారులువిజయనగరం: జాతీయస్థాయి చెస్ పోటీలకు విజయనగరం వేదికగా నిలిచింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం సారథ్యంలో నిర్వహించ తలపెట్టిన 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల చెస్ చాంపియన్ షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో నిర్వహిస్తున్న పోటీలను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పోటీలకు వచ్చిన క్రీడాకారులను ఆమె అభినందించారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 150 మంది దివ్యాంగ క్రీడాకారులు మంగళవారం జిల్లాకు చేరుకున్నారన్నారు. వారందరికీ మంగళవారం అన్ని రకాల మెడికల్ చెకప్ చేశామని చెప్పారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు అంతర్జాతీయ పోటీలకు వెళ్లనున్నారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ల్యాప్టాప్స్,సెల్ఫోన్ దొంగల అరెస్ట్
విజయనగరం క్రైమ్ : సెల్ఫోన్, ల్యాప్టాప్లను దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తమిళినాడు రాష్ట్రంలోని ఉదయరాజపాల్యంకు చెందిన మురుగన్ వెంకటస్వామి, గణేష్లను ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉదయ రాజ పాల్యంకు చెందిన ఇద్దరు వ్యక్తులు నగరంలోని వీటీ అగ్రహరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నగరంలోని స్టూడెంట్స్ రూమ్స్ లక్ష్యంగా చేసుకుని ల్యాప్ టాప్లు, సెల్ఫోన్ల అపహరణకు పాల్ప డేవారు. ఇలా విజయనగరంలోని కోటవీధి, కాటవీధి, విశాఖలోని పీఎంపాలెం వద్ద గల స్టూడెంట్స్ రూమ్ లలో దొంగతనాలకు పాల్ప డ్డారు. అయితే ఈ నెల ఆరవ తేదీన విజయనగరంలోని శివాలయం వీధికి చెందిన ఓ వ్యక్తి ల్యాప్టాప్, రెండు సెల్పోన్లు పోయినట్లు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ పార్టీని రంగంలోకి దించామని టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ క్రమంలోనే స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా ఈ ఇద్దరు నిందితులు నేరం చేసినట్లు నిర్థారణ అయిందన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. విచారణలో మొత్తం 57 సెల్ ఫోన్లు, 16 ల్యాప్టాప్లు, రెండు ఆపిల్ ఐ ప్యాడ్లు దొంగతనం చేసి అమ్మేసినట్లు నిందితులు అంగీకరించారని సీఐ చెప్పారు. 20 లీటర్ల సారా స్వాధీనం పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలసలో అక్రమంగా సారా విక్రయిస్తున్న చోడిపల్లి రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విక్రయానికి సిద్ధంగా ఉంచిన 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న సారాను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
జగన్నాథుని రథయాత్రకు సర్వంసిద్ధం
● జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీషవిజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సంతపేటలో ఉన్న జగన్నాథస్వామి ఆలయం ఆవరణలో ఉత్సవ కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి జూలై 5వ తేదీ వరకూ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 26న గురువారం స్వామివారికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళావాహన, బింబ దర్శనం, నేత్రోత్సవం, ప్రసాద వినియోగం పాణింగిపల్లి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. అదేరోజు సాయంత్రం జగన్నాథస్వామి శాంతి కల్యాణం, రాత్రి స్వామివారిని రథోత్సవానికి సిద్ధం చేయడం, రక్షాబంధనాలు ఉంటాయన్నారు. 27న శుక్రవారం ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాతసేవ, విశేష అర్చనలు, నీరాజనం, 9.30 గంటలకు మేళతాళాలతో స్వామివారి రథారోహణ, రక్షాబంధనాలు, అనంతరం స్వామివారి తొలి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 28న శనివారం నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం వరకూ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, మహిళా మండలి ఆధ్వర్యంలో విష్ణు సహస్ర నామ పారాయణం, జగన్నాథస్వామి వారి చరిత్ర పారాయణం, గోవిందనామస్మరణ ఉంటుందన్నారు. 5న మారు రథయాత్ర జూలై ఒకటో తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవి తిరువీధి ఉత్సవం, స్వామివారిని దర్శించడం, శ్రీ లక్ష్మీనారాయణ సంవాదం, శీలవిరుపు ఉత్సవం నిర్వహిస్తామని తెలిపారు. జూలై 5న శనివారం మారు రథయాత్ర, అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు. జూలై 6న స్వామివారికి ప్రధాన ఆలయంలో సంప్రోక్షణ, శాంతి హోమాలు, ప్రసాద వినియోగం చేస్తామన్నారు. జూలై 10న ఆషాడ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీసత్యనారాయణస్వామివారి సామూహిక వ్రతం నిర్వహిస్తామని, భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమణి, ఆలయ పూజారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
28న సాలూరులో జాబ్ మేళా
పార్వతీపురం టౌన్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాలూరు శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న ఉదయం 9 గంటలకు జాబ్మేళా జరగనుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డీగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్మేళాకు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన యువకులు httpr://nai punyam.ap.gov.in వెబ్సైట్లో పేరు నమోదు చేసుకొని, రిఫరెన్స్నంబర్తో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్ఫొటోతో జాబ్మేళాకు హాజరు కావాలని కోరారు. 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 94947 77553, 73825 59022 నంబర్లను సంప్రదించాలని సూచించారు.డాక్టర్ ప్రతిభపాలకొండ రూరల్: పాలకొండ పట్టణానికి చెందిన వినోద్కుమార్ ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో సత్తాచాటారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో వినోద్ జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని తండ్రి గణపతీశ్వరరావు, తల్లి పద్మకుమారి తెలిపారు. పాలకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన వినోద్ ఎంబీబీఎస్ విద్యను శ్రీకాకుళం రిమ్స్లో, ఎంఎస్ జనరల్ సర్జన్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో పూర్తిచేశారు. రాగోలు జెమ్స్లో సీనియర్ రెసిడెంట్గా విధులు నిర్వహించారు.మోహన్కాలనీ కొండల్లో ఏనుగులుసీతంపేట: మోహన్కాలనీ కొండ శిఖర పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. చిన్నబగ్గ టేకు ప్లాంటేషన్ నుంచి అక్కడకు వెళ్లిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ ఎఫ్బీఓ దాలినాయుడుతో పాటు ట్రాకర్లు ఎప్పటికప్పుడు ఏనుగుల గమనాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.పక్కి గ్రామానికి గజరాజుల గుంపుబొబ్బిలి రూరల్: మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తొమ్మిది ఏనుగుల గుంపు మంగళవారం పక్కి గ్రామ పరిసరాల్లోకి చేరుకున్నాయి. సీతానగరం మండలం నుంచి ముత్తాయివలస, కమ్మవలస, శివడవలస మీదుగా పక్కి గ్రామ పరిసరాల్లోని అరటితోటలకు చేరుకుని ధ్వంసం చేస్తున్నాయి. స్థానిక ప్రజలను అటవీ సిబ్బంది అప్రమత్తం చేశారు.భక్తిశ్రద్ధలతో దీపారాధననెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామి దేవస్థానంలో ఆంజనేయస్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి తమలపాకులు, సింధూరంతో అర్చనలు చేసినానంతరం హనుమాన్ చాలీషా పఠనం చేశారు. సాయంత్రం స్వామి సన్నిధిలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో దీపారాధన చేపట్టారు. -
క్రీడాకారులకు అండగా ఉంటాం
పాలకొండ: క్రీడాకారులకు అండగా ఉంటామని కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు అన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ అండర్–18 జట్టుకు ఎంపికై న రాష్ట్ర క్రీడాకారులకు మంగళవారం ఆయన అవసరమైన బ్యాగులు, కిట్లు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 10 రోజులుగా ఇక్కడ శిక్షణ పొంది, జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న హరిద్వార్లో జరగనున్న జాతీయస్థాయి అండర్–18 పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు మంగళవారం ఇక్కడి నుంచి బయలు దేరారు. ఈ సందర్భంగా క్రీడాకారులు కొండలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెన్నపు చంద్రశేఖర్, మాజీ క్రీడాకారులు దూబ వెంకటరమణ, మాజీ పీఈటీ రెడ్డి మాస్టర్ తదితరులు ఉన్నారు. -
డ్రోన్తో దోమల నివారణ మందు పిచికారీ
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో మలేరియా నియంత్రణలో భాగంగా డ్రోన్లతో దోమల నివారణ మందు పిచికారీకి శ్రీకారం చుట్టామని డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ పరిధి గౌడుగూడ గ్రామంలో డ్రోన్తో దోమల నివారణ మందు పిచికారీ ప్రక్రియను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రోగ్రాం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న నీటినిల్వ కుంటలపై టెమీఫాస్ మిశ్రమాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో దోమల నివారణ చర్యలకు సాంకేతికత దోహదపడుతుందన్నారు. గ్రామాల్లో జ్వరనిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. దీనికి ముందు ఆయన టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరాతీశారు. సిక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆయన వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి వై.మణి, ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, డీఎల్ఏటీఓ డాక్టర్ వినోద్, తాడికొండ పీహెచ్సీ వైద్యులు అభిలాష్, మలేరియా కన్సల్టెంట్ రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు -
పొదుపు సంఘాల లక్ష్యంలో ప్రభుత్వం విఫలం
విజయనగరం గంటస్తంభం: ఏ లక్ష్యంతో పొదుపు సంఘాలు పెట్టారో ఆ లక్ష్యం నేరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్.రమణి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె.పుణ్యవతి ఆధ్వర్యంలో స్థానిక ఎన్పీఆర్ భవనంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ..డ్వాక్రా సంఘాలను ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. పొదుపు చేసిన డబ్బులే రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు బ్యాంకులో ఇవ్వడం సరికాదన్నారు. సీ్త్ర నిధి రుణాల్లో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. సక్రమంగా కట్టినా అఽధిక వడ్డీలు తీసుకుంటు న్నారని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని కళ్లేపల్లి గ్రామంలో రూ.18 లక్షల వరకు అవినీతి జరిగితే ఐద్వా పోరాడి డబ్బులు సుమారు రూ.13 లక్షలు వరకు ఇప్పించినట్లు చెప్పారు. పెన్షన్ ఇస్తామని చెప్పి మహిళల దగ్గర వసూలు చేసిన అభయ హస్తం డ బ్బులు ఏమయ్యామని ప్రశ్నించారు. అత్యధిక బ్యాంకులు డ్వాక్రా మహిళాలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. అప్పును సక్రమంగా కట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు డ్వాక్రా మహిళలేనన్నారు. పొదుపు మహిళల సమస్యలు పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు పుణ్యవతి, లక్ష్మి, సహాధ్యక్షురాలు ఆర్.కృష్ణవేణి, జిల్లా కమిటీ సభ్యులు జి.అరుణ, కరుణ పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి రమణి -
డీఏ జుగా కార్యక్రమానికి విశేష స్పందన
పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమం జిల్లాలో బాగా జరుగుతోందని, గిరిజన ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెనన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 30 వరకు డీఏ జుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతిని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తమకు కావలసిన అవసరాలను, ధ్రువపత్రాలను, మౌలిక వసతులను ఎక్కువగా కోరుతున్నట్లు చెప్పారు. అలాగే పీఎం జన్మన్ గృహాలను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం అమలుచేసే పథకాలతో గిరిజన ప్రాంతాల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమన్నారు. గ్రామ, క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అందించేలా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజనులు వినియోగించుకోవాలి ఈ నెల 30 వరకు గిరిజనులకు అవసరమయ్యే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్ కార్డులు, జన్ధన్ ఖాతా, పీఎం జేజేబీవై, పీఎం ఎస్బీవై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధిహామీ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పీఎం ఎంవీవై, ఇమ్యునైజేషన్ తదితర సీ్త్ర శిశు సంక్షేమ ప్రయోజనాలను గిరిజన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ వివరించారు. పీవీటీజీ గృహాలు, గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ, క్లస్టర్ స్థాయి శిబిరాలను నిర్వహించడం, ఆరోగ్యం, ఆహారం, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయం, రెవెన్యూ ఇతర విభాగాల సమన్వయంతో కార్యకలాపాలు చేపట్టాలన్నారు. ఆధార్, ఈ– కేవైసీ డాక్యుమెంటేషన్ సంబంధిత సేవల కోసం సంబంధిత విభాగాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఆధార్లో నమోదు కాని వారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని, గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
గంజాయి వ్యాపారి ఆస్తుల సీజ్
విజయనగరంక్రైమ్: జిల్లాలోని రామభద్రపురం పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి ఆక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడైన శెట్టి ఉమామహేశ్వరరావు ఆలియాస్ హుస్సేన్ ఆలియాస్ పుతిన్కు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన స్తిరాస్తులు సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. విశాఖలో ఉంటున్న ఉమామహేశ్వరరావు కొంతమంది సహచరులతో కలిసి 147 కేజీల గంజాయిని తరలిస్తూ రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డాడన్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినప్పటికీ విచారణలో ఉమామహేశ్వరరావును ప్రధాన నిందితుడిగా గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్ 25న పీటీ వారెంట్తో అరెస్టు చేశామన్నారు. విచారణలో 2019 నుంచి 2025 మధ్యకాలంలో ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన భార్య స్వరూపరాణి, సోదరుడు వెంకటరావు పేరిట రూ.కోటి 89 లక్షల 84,768 ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని, ఇంక ఎవరూ కొనుగోలు చేయకుండా చట్టపరమైన నోటీసు జారీ చేశామన్నారు. ఈ కేసు విచారణలో ప్రధాన నింధితుడైన శెట్టి ఉమామహేశ్వరరావుపై అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ సిటీల్లో 7కు పైగా గంజాయి కేసులు నమోదయ్యా యని తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న అదనపు ఎస్పీ సౌమ్యలత, బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు, రామభధ్రపురం ఎస్సై ప్రసాదరావులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. -
తహసీల్దార్ ఎక్కడ?
● 10 రోజులుగా స్తంభించిన రెవెన్యూ సేవలు ● అయోమయంలో పూసపాటిరేగ మండల ప్రజలుపూసపాటిరేగ: పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విధుల్లో చేరి రోజు తిరగక ముందే వచ్చిన స్థానానికే మళ్లీ వెనక్కి వెళ్లడంతో పూసపాటిరేగ మండల ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈనెల 13వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి ఎన్వీ రమణ తహసీల్దార్గా పూసపాటిరేగలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మరుసటి రోజు నుంచే ఏమైందో ఏమో కానీ ఆయన విధులకు హాజరు కావడం లేదు. తహసీల్దార్ కార్యాలయానికి ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన విద్యార్థులు, ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇంటర్వ్యూలు, విద్యాసంస్థల్లో జాయిన్ అవడానికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కనీసం ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా ఇబ్బందులు ఉండేవి కావని పలువురు వాపోతున్నారు. గంటల వ్యవధిలో ఉద్యోగంలో చేరడం, వెనక్కి వెళ్లడం ఏమిటనేది అంతు చిక్కని ప్రశ్నగా పూసపాటిరేగ మండల ప్రజలకు మిగిలింది. పూసపాటిరేగ తహసీల్దార్గా పనిచేసిన తాడ్డి గోవిందను కలెక్టరేట్లోని ‘సి’ సెక్షన్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సాలూరు నుంచి ఎన్వీ రమణ వచ్చి విదుల్లో చేరారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ తహసీల్దార్ను రిలీవ్ చేయకుండానే పూసపాటిరేగలో ఆయన విధుల్లో చేరడంతో ఆగ్రహించిన కలెక్టర్ తహసీల్దార్ను వెనుక్కి పిలిచారని ఓవాదన వినిపిస్తుండగా, మరో వాదన మాత్రం రాజకీయంగానే తహసీల్దార్ను వెనక్కి పంపించారని బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నియామకంపై చర్చ జరుగుతోంది. కనీసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కనీసం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనీసం ఇన్చార్జ్ తహసీల్దార్ను అయినా నియమించి ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సమస్య పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఏపీ పీజీ ఈసెట్లో ర్యాంకుల పంట
విజయనగరం అర్బన్: ఆంధ్రయూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీపీజీఈసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. వివిధ గ్రూప్లలో టాప్ టెన్ ర్యాంక్లు సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, నానో ఇంజినీరింగ్ పీజీ కోర్సులలో ర్యాంకుల పంట పండించారు. భరత్కు మూడో ర్యాంక్ నెల్లిమర్ల రూరల్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్–2025 ఫలితాల్లో నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామానికి చెందిన కురిమినేని భరత్ నాయుడు ప్రతిభ చూపాడు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 76 మార్కులు సాధించి విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో మూడో ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. ఉత్తమ ర్యాంక్ను సాధించిన విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. అంపిలి విద్యార్థి ప్రతిభ పాలకొండ రూరల్: మండలంలోని అంపిలి గ్రామానికి చెందిన గేదల లక్ష్మీనారాయణ ఏపీ పీజీఈసెట్లో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఏయూ పరిధిలో రెండవ ర్యాంక్ సాధించాడు. విద్యార్థి తండ్రి అప్పలనాయుడు వ్యవసాయ కూలీకాగా, తల్లి పార్వతి మరణించారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఉత్తమ పరిశోధనలు చేయాలన్న తపనతో చదువుసాగిస్తున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపాడు. -
డైవర్షన్ పాలిటిక్స్!
–8లోపిల్లల ప్రమాద ఘటనపైనా.. బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం: పాపం.. చిన్నారులు! తమ బడి కోసం ఎంతో దూరం నుంచి కలెక్టరేట్కు వచ్చారు. వారితోపాటు.. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలూ ఉన్నారు. నిజమే.. స్వతహాగా ఆలోచించే నిర్ణయం తీసుకునే వయస్సు ఆ చిన్నారులది కాకపోవచ్చు. తమ బిడ్డల భవిష్యత్తుపైన తల్లిదండ్రులకు కచ్చితంగా భయం ఉంటుంది కదా!! ఊరి బడిని దూరం చేస్తామంటే.. తమ పిల్లలు ఎక్కడ తల్లడిల్లిపోతారో అని ఆ తల్లిదండ్రులు ఆలోచించారు. 3, 4, 5 తరగతులకు మరో ప్రాంతం వెళ్లాలంటే.. ఆ వయసులో కష్టమని భావించారు. అందుకే, మూకుమ్మడిగా తమ పిల్లలనే తీసుకుని సోమవారం కలెక్టరేట్కు వచ్చి ధర్నా చేపట్టారు బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ–1 పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు. వీరి పోరాటం కొన్ని నెలలుగా సాగుతోంది. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నాలుగు రోజుల కిందట అక్కడ ఎంఈవో కార్యాలయం ఎదుటా ధర్నా చేశారు. ఆ సమయంలో ఎంఈవో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన విషయాన్ని చెబుతూ, పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పిద్దామని సర్దిచెప్పారు. అయినప్పటికీ తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. ఈ నెల 23న ఓ వామపక్ష నాయకుడి సహకారంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ వద్ద పిల్లలతో కలసి ఉదయం 11 నుంచి గంటకుపైగా సమయం ధర్నా చేశారు. అదే సమయంలో ‘యువతపోరు’ కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్యే జోగారావు అదే సమయంలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్సార్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తదితరులు భారీ ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్ వెలుపలే పోలీసులు చాలాసేపు వారిని నిలువరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జోగారావు, వైఎస్సార్సీపీ నాయకులు కొంతమంది పీజీఆర్ఎస్కు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు వినతిపత్రం అందజేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న పెదపెంకి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తమ ఆవేదనను ఆయనకు వినిపించారు. పాఠశాల విషయమై పీజీఆర్ఎస్లోనే ఇన్చార్జి డీఈవోతో జోగారావు మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ‘యువత పోరు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ ఆవేదన కూడా వినాలని మీడియా ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరారు. లోకేశ్ మామా.. తమ బడిని కాపాడాలని నమస్కారాలు పెడుతూ వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు వినతిపత్రం అందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఆ కార్యక్రమం ముగిసిపోయింది. ఎవరికి వారు వెళ్లిపోయారు. న్యూస్రీల్ప్రమాదాన్నీ రాజకీయం చేసి.. అక్కడ నుంచి డీఈవో కార్యాలయానికి.. కలెక్టరేట్ నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారని సమాచారం. అనంతరం సాయంత్రం సమయంలో తాము వచ్చిన ఆటోలపైనే స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో కొంతమంది పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఘటనా స్థలానికి చేరుకుని, వారిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ప్రమాదాన్ని.. మాజీ ఎమ్మెల్యేనే వారిని స్వయంగా ధర్నాకు తీసుకెళ్లారని తప్పుడు ప్రచారంతో ఓ వ్యక్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనతో ఏ సంబంధమూ లేని ఎంఈవో, హెచ్ఎంలపై చర్యలు తీసుకోవాలని సూచనలు కూడా చేశాడు. ఆ వ్యక్తి చెప్పింది నిజంగా భావించిన మంత్రి లోకేశ్.. ఘటనపై చింతిస్తూ, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సోషల్ మీడియా వేదికగా ఆదేశించారు. వాస్తవాలు తెలిసి కూడా ఎల్లో మీడియా సైతం మాజీ ఎమ్మెల్యేపైనే నిందలు వేస్తూ దుష్ప్రచారానికి దిగింది. విద్యార్థుల ప్రమాద ఘటన మానవత్వం ఉన్న ఏ ఒక్కరికై నా దిగ్భ్రాంతి కలిగించకమానదు. బహుశా మంత్రి లోకేశ్ కూడా తక్షణం ఆ విధంగానే స్పందించి ఉంటారు. విద్యార్థులతో రాజకీయాలు చేయవద్దంటూ సూచించారు. ఇదే అదునుగా వాస్తవాలను కప్పిపుచ్చి, స్థానిక కూటమి నాయకులు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యేనే విద్యార్థులను ధర్నాకు తీసుకొచ్చారని సోషల్ మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టారు. దీనికి పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా జత కలిసి అదే తరహాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే పెదపెంకి–1 పాఠశాలలో 3, 4, 5 తరగతులు మరోచోటకు విలీనం అయ్యాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్లే.. ఆ ఊరి పిల్లలకు, తల్లిదండ్రులకు చదువు బెంగ పట్టుకుంది. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్లే.. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో ధర్నాలకు దిగారు. వీరి నిర్వాకాన్ని కప్పిపుచ్చి, ఒక ప్రమాద ఘటనను వైఎస్సార్సీపీపై నెట్టి, డైవర్షన్ పాలిటిక్స్కు కూటమి నేతలు తెర తీశారు. పాఠశాల ఉంచుతారా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వకుండా అనవసర విషయాలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి నేతల కుఠిల రాజకీయాలు శకునికి మించి వ్యూహాలు తమ బడి కోసం కలెక్టరేట్కు స్వచ్ఛందంగా వచ్చిన పెదపెంకి విద్యార్థులు తిరిగి వెళ్తుండగా ప్రమాదం ఘటనకు, మాజీ ఎమ్మెల్యే జోగారావుకు ముడిపెడుతూ దుష్ప్రచారం -
రైలులోనుంచి జారి పడి వ్యక్తి మృతి
సీతానగరం: మండలంలోని చినభోగిలి వద్ద విజయవాడ పాసింజర్ రైలులో నుంచి జారిపడి మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినభోగిలి గ్రామానికి చెందిన సవరపు మనోజ్(18) విశాఖపట్నం నుంచి విజయవాడ పాసింజర్లో వస్తూ సీతానగరం రైల్వేస్టేషన్లో దిగాల్సి ఉంది. అయితే స్వగ్రామానికి వచ్చే సమయానికి ముందుగానే రైలులోనుంచి జారిపడి మనోజ్ మృతి చెందినట్లు గుర్తించామని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తరలించారు. పురుగు మందు తాగి వ్యక్తి..కొమరాడ: మండలంలోని కళ్లికోట గ్రామానికి చెందిన మక్కా వ్యాపారినాయుడు(49) ఈనెల 3తేదీన మద్యం మత్తులో పురుగు తాగేయడంతో అస్వస్థతకు గురికాగా పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చిక్సిత కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య గౌరీశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కొమరాడ ఎస్సై నీలకంఠం మాట్లాడుతూ పోస్టుమార్టం నిమత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వ్యాన్ ఢీకొని వ్యక్తి..పార్వతీపురం టౌన్: పార్వతీపురం మున్సిపాలిటీలోని వివేకానంద కాలనీ గణేష్ రామ వీధికి చెందిన పతివాడ శ్రీను (52) వ్యాన్ ఢీకొని మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పతివాడ శ్రీను కొత్తవలస శివారులో నూడిల్స్, చికెన్ అమ్ముతూ ఉంటాడు. మంగళవారం మోటార్ సైకిల్పై ఇంటి నుంచి పార్వతీపురం పట్టణంలోకి వస్తుండగా రాయగడ రోడ్డులోని సాహు హాస్పిటల్ సమీపంలో రాయగడ నుంచి గుడ్లు లోడుతో వస్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు.కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్యరాజాం సిటీ: మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కె.అఖిల (23) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కంటు చండీ ప్రసాద్కు గరివిడి మండలంలోని మందిరివలస గ్రామానికి చెందిన అఖిలతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. మంగళవారం ఉదయం ఆమెకు ఒక్కసారిగా భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెకు సపర్యలు చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పునరావాస సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్టప్రకారం సంపూర్ణమైన పునరావాస సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కొండ మొదలు సర్పంచ్ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలో ఉన్న రహదారిపై ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్కు చేరుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకుడు శ్రీనునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూసేకరణ చట్టప్రకారం సమస్యలు పరిష్కరించాలని, నేటికి 18ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదని, తక్షణమే అందించాలని, నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించి డీపట్టా సాగు చేస్తున్న ఆదివాసీలకు పూర్తి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ హేమలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న పలు గిరిజన గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
సర్వజన ఆస్పత్రిలో పనిచేయని ఎంఆర్ఐ
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఎన్.సతీష్ తీవ్రమైన నడుం నొప్పితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎముకల విభాగానికి వెళ్లాడు. ఎంఆర్ఐ స్కాన్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోవడంతో స్కాన్ బాగైన తర్వాత ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పడంతో వెనుదిరిగాడు. ఇలా అనేక మంది రోగులు ఎంఆర్ఐ స్కాన్ కోసం వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా పనిచేయకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ ఉన్నప్పటికీ రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు వెళ్లాల్సిన పరిస్థితి. అధిక మొత్తంలో వెచ్చిస్తున్న రోగులు: ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఎంఆర్ఐ కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో స్కానింగ్కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేక రోగులు చేయించుకుంటున్నారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్న రోగులు వారం రోజులుగా ఇదే పరిస్థితిత్వరలో బాగు చేయిస్తాం ఎంఆర్ఐ స్కాన్ ప్రస్తుతం పనిచేయడం లేదు. ఎంఆర్ఐ స్కాన్ అత్యవసరమైన వారికి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఉచితంగా తీయిస్తున్నాం. ఎంఆర్ఐ స్కాన్ను త్వరితగతిన బాగు చేయిస్తాం. డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వసర్వజన ఆస్పత్రి -
చేతులెత్తి వేడుకుంటున్నాం.. మా బడి మాకివ్వండి!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజ కవర్గం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామం దళితవాడలోని పెదపెంకి ఎంపీపీ–1 ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతులను వేరే మోడల్ పాఠ శాలలో విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మొదలు పాఠశా ల పరిధిలో చదువుతున్న విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఆగిపోయింది. చదువు నిలిచిపోయింది. తమ దళితవాడలో 40 ఏళ్లకు పైగా కొనసాగుతూ వస్తున్న ప్రాథమిక పాఠశాలను తొలగించవద్దని ఇప్పటికే పలుమార్లు మండల అధికారులు, జిల్లా అధికారులకు తల్లిదండ్రులు గో డు వినిపించినా.. స్పందన లేకపోయింది. దీంతో గ్రామపెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలసి సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి జోరువానలోనూ నిరసన చేపట్టారు. పీజీఆర్ఎస్లో జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ శాసనభ్యులు అలజంగి జోగారావు దృష్టికీ సమస్యను తీసుకెళ్లారు. తమ తరఫున పోరాడి, న్యాయం జరిగేలా చూడాల ని కోరారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడు తూ.. పేద విద్యార్థులకు చదువును దూరం చేయవద్దని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్ష ణం స్పందించి వీరి పాఠశాలను యథావిధిగా కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి మంత్రి లోకేశ్కు రెండు జోతులూ జోడించి, నమస్కరించి.. పాఠశాలను తరలించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. మండల ఎంపీపీ గుడివాడ నాగమణి, సర్పంచ్ నగి రి పాపారావు, స్కూల్ కమిటీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో హెచ్సీకి తీవ్ర గాయాలు
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్సీ రామునాయుడు బెటాలియన్ మెయిన్ గేట్కు ఎదురుగా ఉన్న అయినాడ పంచాయతీలోని సత్యనారాయణపురం గ్రామంలో ఉంటున్నారు. సోమవారం 5.30 గంటల ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు బెటాలియన్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. విజయనగరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామునాయుడు తలకు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న పోలీసులు వచ్చి రామునాయుడును విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. కొద్ది సేపటి తర్వాత కారును గుర్తించినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. -
‘తోటపల్లి’ నిర్వాసితులకు ఇళ్ల బిల్లులు చెల్లించాలి
● రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసుపార్వతీపురం టౌన్: తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామాలైన పాతకల్లికోట, దుగ్గి గ్రామాలలో నిర్వాసితులు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వాసిత రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓ కె.హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మించుకున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదన్నారు. రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నిర్వాసిత మహిళలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మహిళలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో దుగ్గి, పాతకల్లికోట, తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసిత రైతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఓర్వలేకే మాజీ సీఎంపై కేసులు
రేగిడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఇటీవల పల్నాడులో పర్యటించిన సమయంలో చీలి సింగయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించాడని, దీన్ని సాకుగా చూపి జగన్ మోహన్రెడ్డి, తదితరులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మండలంలోని బూరాడ గ్రామంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విషాదకరమైన ప్రమాదాలను కూడా రాజకీయం చేయడం తగదని సూచించారు. ప్రమాదవశాత్తూ జరిగిన మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. బస్సు ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే డ్రైవర్పై కేసు నమోదు చేయడం పరిపాటని.. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. పల్నాడు సంఘటనకు సంబంధించి లేనిపోని కథనాలను మీడియాలో చూపించి జగన్ మోహన్రెడ్డిని ఏ–2గా చేర్చడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, వావిలపల్లి శశిభూషణరావు, బంకి చంద్రశేఖర్, టంకాల ఉమాపాపినాయుడు, రణస్థలం రమాదేవి, రాంబాబు, పిల్లా గౌరునాయుడు, దార గుర్నాథరావు, వైశ్యరాజు గోవిందరాజు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి
పార్వతీపురం టౌన్: కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్ట్కు సంబంధించి రబ్బర్ డ్యామ్ లిఫ్ట్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. దాలినాయుడు, తదితరులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో డీఆర్ఓ కె. హేమలతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాలినాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో జంఝావతి సాగునీరు రైతులకు అవసరమవుతాయన్నారు. రబ్బర్డ్యామ్ లిఫ్ట్ను బాగుచేస్తే సుమారు 24,640 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ పాడవ్వడంతో కొంతకాలంగా లిఫ్ట్ పనిచేయడం లేదని చెప్పారు. రైతులకు జంఝావతి నీరు అందించడంలో కూటమి నాయకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. కార్యక్రమంలో సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, పాలక రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. రైతులకు న్యాయం చేయండి : కాంగ్రెస్ నాయకులు -
‘జిందాల్’కు నీరిస్తే రైతులకు నష్టం
విజయనగరం ఫోర్ట్: జిందాల్ పరిశ్రమలకు బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నుంచి నీరు ఇస్తే రైతులు నష్ట పోతారని ఆయకట్టు పరిరక్షణ కమిటి సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిందాల్ భూముల్లో పెట్టనున్న చిన్న పరిశ్రమల పార్కుకు బుచ్చి అప్పారావు జలాశయం నుంచి నీరు ఇచ్చేందుకు విడుదల చేసిన జీఓ 14ను రద్దు చేయాలన్నారు. జలాశయం కింద ఉన్న శివారు కాలువలకు సిమెంట్ లైనింగ్, తూములు, షట్టర్ల ఏర్పాటుతో పాటు రాకపోకలకు వీలుగా వంతెనలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాజెక్ట్ మెయింటినెన్స్కు ఇచ్చే సాధారణ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. ధర్నాలో జామి మండల జెడ్పీటీసీ మాజీ సభ్యులు గొర్లె రవికుమార్, బండారు పెదబాబు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి. రాంబాబు, గులిపల్లి జయపాల్, కొత్తలి ఎర్నాయుడు, కోడెల ముత్యాలనాయుడు, కోడెల శ్రీను, బండారు సూర్యారావు, జాగారపు అప్పారావు, కిలపర్తి శ్రీరామ్మూర్తి, గనివాడ సన్యాసినాయుడు, తమటపు పైడినాయుడు, తదితరులు పాల్గొన్నారు. బుచ్చి అప్పారావు జలాశయం ఆయకట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు -
గురుకుల విద్యాలయాలలో మిగులు సీట్లకు రాతపరీక్ష
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లకు ఈ నెల 25న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6, 7 తరగతులకు సంబంధించి బాలురకు కొప్పెర్ల గురుకులంలో.. బాలికలకు నెల్లిమర్ల గురుకులలో ఉదయం 10 గంటల నుంచి 11 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా 8, 9 తరగతులకు సంబంధించి బాలురకు కొప్పెర్లలో.. బాలికలకు నెల్లిమర్లలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందు కేంద్రానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 89858 83015, 63038 38657 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఐదో తరగతిలో ఉన్న ఖాళీలను ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా కేటాయిస్తామని.. ఆసక్తి ఉన్న విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ జంక్షన్లో ఉన్న సమన్వయకర్త అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.లారీ బోల్తా ..జామి: మండలంలోని అలమండ సమీపంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విశాఖపట్నం నుంచి రాయపూర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్త్రెవర్కు స్పల్పగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని అలమండ పీహెచ్సీకి తరలించారు.ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతిపార్వతీపురం రూరల్: మండలంలోని జిల్లేడువలస సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచా రం అందుకున్న పోలీసులు మృతుడిని మక్కు వ మండలం ఎర్రసామంతవలస గ్రామానికి చెందిన మండంగి సుబ్బారావు(35) గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.విద్యుదాఘాతంతో యువకుడి మృతితెర్లాం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని డి.గదబవలస గ్రామం వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై సాగర్బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గంగన్నపాడు గ్రామానికి చెందిన పోరపు రామకృష్ణ (18) తెర్లాం నుంచి పెరుమాళి వైపు కొత్తగా వేసిన విద్యుత్ లైన్లో కూలి పనికోసం వెళ్తున్నాడు. సోమవారం కూడా విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా రావడంతో స్తంభం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లిదండ్రులు, చెల్లి ఉన్నారు. మృతిడి తండ్రి సోదన్నదొర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
● పీజీఆర్ఎస్కు 203 దరఖాస్తులు
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత అన్నారు. స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకురాలు సుధారాణితో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 203 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదునూ మానవతాకోణంలో ఆలోచించి శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా వినతులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాకారి కె.రాబర్ట్పాల్, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖధికారి బి.రాజ్కుమార్, పార్వతీపురం కో–ఆపరేటివ్ అధికారి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● వీరఘట్టం మండలం యు.వెంకంపేటలో ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, వర్షాకాలంలో శ్లాబ్ నుంచి నీరు లీకవడంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, అదనపు భవనం మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎస్. సింహాచలం వినతి అందజేశారు. ● గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమటి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మూసి వేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, వి ద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పాఠ శాలను పునఃప్రారంభించాలని తాడంగి దమ యంతమ్మ, తదితరులు వినతి సమర్పించారు. ● సర్వే నంబర్ 85–2లో ఉన్న భూమికి విద్యుత్ కనెక్షన్ పొందడానికి అవసరమైన రుసుం, సర్టిఫికెట్లను విద్యుత్ శాఖకు సమర్పించానని.. అయితే కొంతమంది కావాలనే పనిని అడ్డుకుంటున్నారని పార్వతీపురం మండలం డొంకలకోటపట్నం గ్రామానికి చెందిన డి.లక్ష్మి వినతి సమర్పించారు. ● గరుగుబిల్లి మండలం హిక్కింవలస గ్రామ పాఠశాలలో 3,4,5వ తరగతులు చదువుతున్న విద్యార్థులను గరుగుబిల్లి హైస్కూల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని పాఠశాలను మోడల్ ప్రై మరీ పాఠశాలగా మార్చి విద్యార్థులు స్థానికంగా చదువుకునేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. -
ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘చిప్స్ టు సిస్టమ్స్’ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరు కావడం విశేషం. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. విద్యతో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లోనూ వర్సిటీ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అధునాతన పారిశ్రామిక రంగానికి అక్కరకు వచ్చే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
శాశ్వత పరిష్కారం చూపండి..
● జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ● పీజీఆర్ఎస్కు 166 వినతులువిజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు లాగిన్లో ఎప్పటికప్పుడు సమస్యలను చూసుకుంటూ రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ లాగిన్ అయ్యి వినతులను శతశాతం పరిష్కరించాలని ఆదేశించారు. 166 వినతుల స్వీకరణ.. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 166 వినతులు వచ్చాయి. డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు, విజయనగరం ఆర్డీఓ సవరమ్మ, పౌరసరఫరాల డీఎం బి.శాంతి, డీఈఓ యూ.మాణిక్యంనాయుడు హాజరై వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 69 వినతులు.. పంచాయతీ శాఖకు 17.. పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డీఏకు 22 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 5, విద్యాశాఖకు 15, హౌసింగ్కు 2 అందగా వైద్యశాఖకు 4, విద్యుత్ శాఖకు 4 వినతులు రాగా.. మిగిలినవి ఇతర శాఖలకు చెందిన సమస్యలు.చట్ట పరిధిలో పరిష్కరించాలి ● ఏఎస్పీ సౌమ్యలత విజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఏఎస్పీ పి. సౌమ్యలత అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 43 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకున్నామన్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మొత్తం 43 వినతులు రాగా భూ తగాదాలకు సంబంధించినవి 15.. కుటుంబ కలహాలకు సంబంధించినవి 4.. మోసాలకు సంబంధించినవి 7.. ఇతర అంశాలకు సంబంధించినవి 17 ఉన్నాయన్నారు. ఏడు రోజుల్లో సమస్యలపై స్పందించి, వాటిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్డీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
జూలై 26, 27 తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు
బొబ్బిలి రూరల్: సీపీఐ 14వ జిల్లా మహాసభ లు జూలై 26, 27 తేదీల్లో బొబ్బిలి పట్టణంలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ వెల్లడించారు. మండలంలోని సీహెచ్ బొడ్డవలస గ్రామంలో సీపీఐ మండల సభను ఆదివారం నిర్వహించారు. మండల కార్యదర్శిగా కాగాన గణేష్ను ఎంపిక చేశారు. అనంతరం జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక పక్షాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహిస్తూ రైతు, పేద, బడుగు వర్గాల్లో వెలుగులు నింపేందుకు సీపీఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. నిరుపేద, గిరిజనులకు భూ హక్కుల ను కల్పించడమే తమ పోరాటాల లక్ష్యమన్నా రు. జిల్లా మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా స భ్యులు కోట అప్పన్న, కార్యదర్శి కాగాన గణేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి వేదన!
గిరిజన మహిళ ● భర్త లేరు.. పింఛన్ రాదు.. రేషన్ ఇవ్వరు.. ● ఇద్దరు చిన్నారులతో అష్టకష్టాలు పార్వతీపురం రూరల్: ఆమె ఓ గిరిజన మహిళ.. 19 ఏళ్లకే వివాహం జరిగింది. ఏడాది కిందట భర్త విష జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. భర్త మృతి చెందే నాటికి సంధ్య మొదటి బిడ్డకు ఏడాది వయసు. అప్పటికే మళ్లీ గర్భిణి కావడంతో తరువాత ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆడ బిడ్డకు నెలల వయసు. అప్పటి నుంచి ఆధారం లేక బిడ్డలతో అవస్థలు పడుతూనే ఉంది. ఆమె కష్టాలు చూసి ఇటు పాలకులకుగాని, అటు అధికారులకుగాని మనసు కరగ లేదు. పింఛన్ మంజూరు కాలేదు. రేషన్ ఇవ్వడం లేదు... ఇది ఓ గిరిజన మహిళ కన్నీటి వేదన. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ఉంటున్న కొండగొర్రి సంధ్య భర్త రమేష్తో పాటు ఒక బిడ్డతో ఉన్నంతలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. భర్త రమేష్ ఏడాది కిందట విష జ్వరంతో మృతి చెందాడు. అప్పటికే ఒక చిన్నారితో పాటు నెలల గర్భవతిగా ఉన్న సంధ్య ఒంటరిగా తన జీవితాన్ని అతి కష్టంతో నెట్టుకొస్తోంది. అంతలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్త మరణాంతరం తనకు వితంతు పింఛన్తో పాటు రేషన్ కార్డు మంజూరు చేయాలని సంబంధిత పంచాయతీ అధికారుల వద్ద మొర పెట్టుకుంది. అధికారుల చుట్టూ తన ఓపిక ఉన్నంత మేరకు తిరిగింది. అయినా వారి మనసు చలించలేదు. ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తన ఆవేదనను ప్రజా సంఘాల నాయకుల వద్ద చెప్పుకుంది. సంధ్య బాధను విన్న సీపీఎం నాయకులు కలెక్టర్ దృష్టిలో సోమవారం పెడతామని పింఛన్, రేషన్ కార్డు మంజూరుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. -
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
పార్వతీపురం టౌన్: కూటమి నేతలు గత ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి గెలిచాక వెన్నుపోటు పొడిచారని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఏడాదిగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఎదురు చూస్తుంది. జాబ్ క్యాలెండర్పై గంపెడాశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని పార్వతీపురం మన్యం జిల్లాలో గల సుమారు 1.49 లక్షల కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తోంది. నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తూ నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ క్రమంలో యువతకు మద్దతుగా నేడు జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏం చేశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, మరోసారి అధికారంలోకి వచ్చిన ఈయన పాలనలో ఉద్యోగాల భర్తీ అనేది కనిపించదు. 2009 ఎన్నికల్లో లక్షల్లో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అని హామీలు గుప్పిస్తే ప్రజలు విశ్వసించలేదు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో 600కు పైగా ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని చేర్చి అధికారంలోకి వచ్చారు. కానీ, ఐదేళ్లు అధికారం అనుభవించి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి యువ నేస్తం అంటూ మభ్యపెట్టారు. తాజాగా 2024లోనూ నిరుద్యోగ పల్లవి అందుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్ కో అసలు ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఆందోళనలో యువత కూటమి ప్రభుత్వంలో యువత ఆందోళనలతో ఉన్నారు. నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. ఎన్నికల్లొ ఇచ్చిన హామీల్లొ భాగంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. యువగళంలో లోకేష్ లక్షల్లో ఉద్యోగాలు ఇస్తారని హామీ నిచ్చారు. నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేదు. ఉద్యోగాలు ఇస్తారన్ని నమ్మకం లేదు. – ముగడ జగన్మోహన్రావు, వైఎస్సార్సీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ, పార్వతీపురం యువతను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే... నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతూ నిరుద్యోగులను నిలువునా ముంచారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంగా విద్యార్థులను, యువతను మోసం చేస్తున్న వైనాన్ని నిలదీస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ యూత్ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం యువతను నట్టేట ముంచారు.. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్థిక సాయంగా భృతి ఇస్తే నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. యువతను ఆదుకునేంత వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. – నంగిరెడ్డి శరత్బాబు, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నిరుద్యోగుల ప్రస్తావనే లేదు ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా నిరుద్యోగుల ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ఆసక్తి చూపడంలేదు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్ తీసుకుంటారా? యువతకు అండగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్నాం. – పల్లా అనంతనాయుడు, వైఎస్సార్సీపీ కురుపాం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు న్యూస్రీల్మేనిఫెస్టోలో.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్లో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినప్పటికీ ఆ ఊసే ఎత్తట్లేదు. ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు.. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై ఆందోళన ఇంటికో ఉద్యోగం అని మోసం చేశారు.. నేటి యువత పోరుకు వైఎస్సార్సీపీ మద్దతు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన -
నేటి యువత పోరుకు తరలిరండి
ఉప్పెనలా.. ● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సాలూరు: యువతకు ఉద్యోగాల కల్పన, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు తప్పడంతో వైఎస్సార్ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న యువత పోరుకు ఉప్పెనలా తరలి రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మోసం చేశారని ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురంలో హెచ్పీ పెట్రోల్ బంకు నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్టు తెలిపారు. ● యువతకు కూటమి వెన్నుపోటు ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాలకొండ రూరల్: అధికారం కోసం కూటమి నాయకులు అమలు కాని హామీలతో అన్నివర్గాల వారిని నమ్మించి మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మండిపడ్డారు. ముఖ్యంగా యువత, నిరుద్యోగులను, విద్యార్థులకు కూటమి వెన్నుపోటు పొడిచిందన్నారు. ఈ తీరును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ యువజన విభాగం, ముఖ్య నాయకులతో కలసి ఆదివారం ఆయన స్వగృహం వద్ద యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి నాయకులు, సీఎం చంద్రబాబు హామీల అమలుపై చిత్తశుద్ధితో వ్యవహరించ లేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ జరగలేదన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులను ఈ ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామని, అంతవరకూ రూ.3వేలు భృతి నిరుద్యోగులకు ఇస్తామని హామీనిచ్చి ఇంత వరకూ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. లోపాలు సరిదిద్దుకోలేక ప్రశ్నిస్తే వేధిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో యువతకు అండగా వైఎస్సార్ సీపీ సంయుక్తంగా నేడు కలెక్టర్కు వినతిపత్రం అందించనున్నట్టు తెలిపారు. నియోజకవర్గ, మండల యువజన విభాగాల అధ్యక్షులు పొట్నూరు లక్ష్మణరావు, అల్లు సురేష్కుమార్, పాలవలస దవళేశ్వరావు పాల్గొన్నారు. యువత పోరుకు సన్నద్ధం మాజీ ఎమ్మెల్యే కళావతి వీరఘట్టం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న కూటమి సర్కారుపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. ఆదివారం ఆమె స్వగృహం వండువలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న సోమవారం జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న యువత పోరు ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. -
ప్రాణదాతల ఆకలి కేకలు!
ఆ వాహనాల్లో పని చేసే సిబ్బంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణదాతలే... ఎందుకంటే అత్యవసర సమయాల్లో కుయ్.. కుయ్... అంటూ పరుగులు పెడుతూ ప్రాణాపాయంలో ఉన్న వారికి వైద్య సేవలు అత్యవసరంగా అందించి తరువాత అవసరమైన ఆసుపత్రులకు తరలిస్తారు. ఇంతటి ప్రాధాన్యత గల ఆ వాహనాల్లో పని చేసే సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి కూటమి పాలనలో నెలకొంది. గత ఎన్నికల సమయంలో వేతనం రూ.4వేలు పెంచుతామని హామీనిచ్చిన కూటమి నేతలు పెంపు మాట దేవుడెరుగు... మా వేతనాలు మాకు సకాలంలో చెల్లించాలని వేడుకొంటున్నారు. వారే 108 వాహన సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ రూరల్: అత్యవసర సమయంలో ప్రాణాలు నిలిపే 108 వాహనాల సిబ్బందికి మూడు నెలలుగా వేతన చెల్లింపుల్లేక ఆకలి కేకలు పెడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరబిందో సంస్థ పర్యవేక్షణలో విధులు చేపట్టిన వీరు కూటమి అధికారంలోకి వచ్చాక పర్యవేక్షణ బాధ్యతలను భవ్య సంస్థకు బదలాయించింది. ఈ క్రమంలో గత ఎన్నికల వేళ 108 సిబ్బంది వేతనాల పెంపు విషయమై కూటమి నేతలు హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపుతో పాటు రూ.4వేల వేతనం పెంచుతామని నమ్మబలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా జీతం పెరుగుదల లేక సకాలంలో జీతాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది ఆకలి కేకలు పెడుతున్నారు. తమ బకాయిల చెల్లింపులెప్పుడని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అప్పు చేస్తేనే.. 108 అంబులెన్సులు 15, నియోనాటెల్ (నవజాతి శిశువుల కోసం కేటాయించిన) వాహనాలు రెండు. జిల్లాలో 15 మండలాల్లో 108 వాహనాలు 17 మైదాన, గిరిజన ప్రాంతాల్లో సేవలు కొనసాగిస్తున్నాయి. వీటిలో 108 అంబులెన్సులు 15 కాగా, నియోనిటల్ (నవజాతి శిశువుల కోసం కేటాయించినవి) వాహనాలు రెండు ఉన్నాయి. ప్రతి వాహనానికి నలుగురు చొప్పున సిబ్బంది, మరో రెండు వాహనాల్లో ఇద్దరు చొప్పున 90 మంది వరకు సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో పైలెట్ (వాహన డ్రైవర్లు)కు నెలకు రూ.28 వేల వరకు, ఈఎంటీకి రూ.30 వేలు, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి రూ.20 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. అయితే నెలల కొద్ది 108 సిబ్బంది జీతాలు చెల్లించటం లేదు. మూడు నెలలు కావస్తున్నా వేతన చెల్లింపుల్లేవని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం కోసం ఆందోళన చేసినప్పుడు ఎంతో కొంత చెల్లించి చేతులు దులుపేసుకోవడం పరిపాటిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. జీతాలపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొచ్చే తామంతా కుటుంబ పోషణ, నిర్వహణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లగా తమ లీవ్ ఎన్క్యాష్మెంట్లు దాదాపుగా 60 రోజులతో పాటు గ్రాట్యూటీ, ప్రస్తుత వేతన బకాయిలు మొత్తంగా ఒక్కొక్కరికి రూ.లక్షా 50వేల నుంచి 2 లక్షల మేర బకాయిలు ఉన్నట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుత నెలలో పిల్లల బడులు, పుస్తకాలు, జీతాలు ఇలా అనేక ఖర్చులు వేధిస్తున్నాయంటున్నారు. పెరుగుతున్న పనిభారం.. ప్రస్తుతం 108 సిబ్బందిపై పనిభారం అధికంగా ఉంటోంది. వర్షాకాలం కావటంతో రోడ్డు ప్రమాదాలు పెరగడం, అత్యవసర కేసులు, పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రి నుంచి రిఫరల్ కేసులు అధికంగా ఉండటం వల్ల సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల సమయంలో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆసుపత్రులకు చేర్చాల్సి ఉంటుంది. అత్యవసర కేసులకు మెరుగైన చికిత్స, హైరిస్క్ పేషంట్లను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. విధి నిర్వహణలో భాగంగా పగలు, రాత్రి తేడా లేకుండా 108 వాహనాలు తిరుగుతూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా కీలక సేవలు అందిస్తున్న తమకు జీతాలు సక్రమంగా ఇవ్వకపోతే ఎలా పని చేయాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా భవ్య సంస్థ తమ ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి వివరించి బకాయిల చెల్లింపుతో పాటు జీతాల పెంపు హామీ అమలుకు కృషి చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లుల రాక.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కూటమి ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణను అరబిందో సంస్థ నుంచి భవ్య సంస్థకు అప్పజెప్పింది. వాహనాల నిర్వహణతో పాటు సిబ్బంది జీతాలు కూడా ఆ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గాను ఆ సంస్థకు ప్రభుత్వం పాత వాహనమైతే నెలకు సరాసరిన రూ 2.20 లక్షలు, కొత్త వాహనమైతే దాదాపుగా రూ.1.90 లక్షలు పైబడి చెల్లించాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. వీటితోనే వాహనాల నిర్వహణ, సిబ్బంది జీతాలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా రాకపోవటంతో వేతన చెల్లింపులు జరగటం లేదు. ఇదే స్థితి కొనసాగితే వాహనాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతాయని సమాచారం. 108 సిబ్బందికి మూడు నెలలుగా అందని వేతనాలు 15 మండలాల్లో 17 వాహనాలతో అత్యవసర సేవలు విధుల్లో 90 మంది ఈఎంటీలు, పైలెట్లు అరబిందో నుంచి భవ్య సంస్థకు 108 సేవల బదలాయింపు రూ.4వేల వేతనం పెంపునకు కూటమి ప్రభుత్వం హామీ ఏడాది గడిచినా చర్యలు శూన్యం -
ఏడు నెలలకే ఏపీఎం బదిలీ!
జియ్యమ్మవలస రూరల్: ఎక్కడైనా ఐదేళ్ల సర్వీసు పైబడిన, రిక్వెస్టు లెటర్ పెట్టుకున్న ఉద్యోగులను బదిలీ చేయడం పరిపాటి. కూటమి ప్రభుత్వంలో అడ్డగోలు బదిలీలతో ఉద్యోగవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జియ్యమ్మవలస మండలం ఏపీఎంగా పనిచేస్తున్న కె.త్రినాథమ్మ బాధ్యతలు చేపట్టిన ఏడు నెలలకే టీడీపీ నాయకులకు నచ్చలేదట. నియోజకవర్గ టీడీపీ నేతపై ఒత్తిడి తెచ్చి మరీ బదిలీచేయించారన్న చర్చ మండలంలో జోరందుకుంది. దీనిని మండల ప్రజాప్రతినిధి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. త్రినాథమ్మ స్థానంలో కొత్త ఏపీఎంగా పార్వతీపురం వెలుగు కార్యాలయం నుంచి బొంతాడ శివున్నాయుడు నియమించినట్టు చెబుతుండగా, తనకు సీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి రిలీవింగ్ ఆర్డర్ అందలేదని త్రినాథమ్మ తెలిపారు. రేగులగూడ కొండపై ఏనుగులు సీతంపేట: మండలంలోని వెంపలగూడ–రేగులగూడ మధ్య సంచరించిన నాలుగు ఏనుగుల గుంపు శనివారం రేగులగూడ కొండపైకి చేరుకున్నాయి. కొండపోడు పనులకు వెళ్లిన గిరిజనులంతా భయాందోళనతో పరుగు తీశారు. ఎఫ్బీఓ దాలినాయుడు, ట్రాకర్లు ఏనుగుల సంచారాన్ని తెలుసుకుని ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏనుగులను కవ్వించవద్దని సూచిస్తున్నారు. విజయనగరం భారీ స్కోర్ విజయనగరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో శనివారం నుంచి ప్రారంభమైన అంతర్ జిల్లాల మూడు రోజుల క్రికెట్ మ్యాచ్లో విజయనగరం భారీ స్కోర్ సాధించింది. విజయనగరం జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రీరామ్ సచిన్ అద్భుతంగా ఆడి 80 బంతుల్లో 152 పరుగులు సాధించడంతో తొలి రోజే విజయనగరం 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు తొలి రోజు 83.5 ఓవర్లలో 411 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ లోహిత్ రెడ్డి (91 పరుగులు), కార్తికేయ (63 పరుగులు) అర్థ సెంచరీలతో రాణించారు. ఆట ముగిసే సమయానికి శ్రీకాకుళం జట్టు నాలుగు ఓవర్లు వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు సాధించింది. వేగంగా ఆడి సెంచరీ సాధించిన శ్రీరామ్ సచిన్ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు ట్రెజరర్ పీఎస్ఎన్ వర్మ, సెలెక్టర్ సర్పరాజ్ అభినందించారు. -
విశాఖ యోగాంధ్రలో ఆకలి కేకలు
● 15 వేల మంది విద్యార్థులకు భోజనం కరువు ● విజయనగరానికి మధ్యాహ్నం ఒంటి గంటకు, మన్యం జిల్లాకు 3 గంటలకు చేరిన బస్సులు ● అప్పటివరకు ఆకలితో అలమటించిన విద్యార్థులు విజయనగరం అర్బన్/ విజయనగరం గంటస్తంభం: విశాఖలో యోగా డేకు వెళ్లిన విద్యార్థులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. సమయానికి తిండిలేక అవస్థలు పడ్డారు. తిరుగు ప్రయాణంలో జిల్లా సరిహద్దులో వడ్డించిన జావ మాదిరిగా ఉన్న ఉప్మాను తినలేక పారబోశారు. యోగాంధ్ర పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదీ పరిస్థితి... యోగాపై ప్రజల్లో అవగాహన పెంచాలని నెలరోజుల పాటు ఉద్యోగులను విధులకు దూరం చేసి కోట్లాది రూపాయలు వెచ్చించించి చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం జిల్లా విద్యార్థులను అవస్థలకు గురిచేసింది. విజయనగరం జిల్లా నుంచి విశాఖకు వెళ్లే 15 వేల మంది విద్యార్థులకు ఆయా కళాశాలలు, హాస్టల్స్ నుంచి 140 బస్సులు ఏర్పాటు చేశారు. ముందురోజు సాయంత్రానికే సిద్ధంచేసిన బస్సులను తెల్లవారి జామున 3 గంటలకే బయలుదేరి విద్యార్థులను విశాఖకు తీసుకెళ్లారు. జిల్లాకు కేటాయించిన భీమిలి బీచ్కు చేరే సరికి సంబంధిత పార్కింగ్ స్థలంలో పార్కింగ్ సమస్యతో పాటు కంపార్ట్మెంట్లో ఇవ్వాల్సిన స్నాక్స్, మ్యాట్లు అందలేదని విద్యార్థులు వాపోయారు. మ్యాట్లు, టీ షర్ట్లు లేకుండా, అల్పాహారం లేకుండానే యోగాడే పాల్గొన్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ జిల్లా ప్రవేశాల సరిహద్దులైన భోగాపురం, కొత్తవలస, జొన్నాడ రహదారులలో సంబంధిత బస్సులను ఆపించి టిఫిన్, తాగునీరు వంటివి అందించారు. అప్పటికే తిరుగు ప్రయాణం చేసిన పార్వతీపురం మన్యం జిల్లా బస్సుల్లోని యోగా సాధకులకు అల్పాహారం కూడా అందలేదు. వారంతా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లను అశ్రయించారు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రానికి చేరే సరికి ఒంటి గంట, పార్వతీపురం చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. తొలుత స్నాక్స్ పంపిణీని బస్సులు బయలుదేరే సమయంలోనే ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. విశాఖలో స్నాక్స్ ఇస్తున్నామని, జిల్లా కేంద్రంలో ఆ ఖర్చు అవసరం లేదని ఒకరోజు ముందు ఓ మంత్రి జిల్లా కేంద్రానికి ఆదేశాలిచ్చారట. దీంతో తొలిరోజు స్నాక్స్ పంపిణీ ఆపేశామని, ఇబ్బందులు ఎదురయ్యాయని అధికార వర్గాల్లో చర్చసాగుతోంది. యోగాంధ్ర కాదు... ఆకలి రహిత ఆంధ్రా కావాలి యోగాంధ్రకు తీసుకెళ్లిన గిరిజన విద్యార్థులను ఆకలితో అలమటింపజేయడం విచారకరం. కావాల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర, ఆకలి రహిత ఆంధ్రప్రదేశ్. ఒకరోజు ముందు విద్యార్థులందరినీ బస్సుల్లో తరలించడం, వారికి సరైన మరుగుదొడ్లు సదుపాయం కల్పించకపోవడం, సమయానికి తాగునీరు కూడా ఇవ్వకపోవడం దారుణం. ఆకలితో అలమటించిన తీరును చిన్నారులు వివరిస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం డొల్లతనమే. – ఎన్.నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి.. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన విద్యార్థులు ఆకలితో అలమటించడం చూసి బాధకలిగింది. బస్సుల్లో నిద్రపోయిన విద్యార్థులను పట్టించుకునే నాఽథుడే కరువయ్యారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని చెబుతూ నిరుద్యోగ భృతి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెనను వంటివి సీఎం చంద్రబాబు ఎగ్గొడుతున్నారు. యోగా పేరుతో మోదీ ప్రశంసల కోసం రూ.300 కోట్లు ఖర్చుపెట్టడం దుర్మార్గం. రెండు రోజులు ప్రైవేటు స్కూల్స్కు సెలవులు ఇచ్చి పిల్లలును చదువుకు దూరం చేశారు. గొప్పల యోగా వల్ల ప్రయోజనం శూన్యం. – రెడ్డి శంకరరావు, సీపీఎం నగర కార్యదర్శి గిన్నీస్ రికార్డు కోసం.. గిరిజన విద్యార్థులను పస్తులుంచుతారా? పార్వతీపురం: గొప్పల కోసం, మోదీ మెప్పుకోసం, గిన్నీస్ రికార్డు కోసం గిరిజన విద్యార్థులను ఆకలితో అలమటింపజేయడంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పార్వతీపురం పట్టణంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి 2 గంటలకు వసతిగృహాల విద్యార్థులను బస్సులలో తరలించడం సరికాదన్నారు. సరైన వసతిలేక, పడకునేందుకు సదుపాయంలేక విద్యార్థులు నరకయాతన అనుభవించారన్నారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, అధికారుల తమ పిల్లలను ఇలాగే తరలిస్తారా అని ప్రశ్నించారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులను ఎన్నడూ పట్టించుకోని అధికారులు, పాలకులు యోగాకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి విద్యార్థు లను తరలించడం దుర్మార్గమన్నారు. గిరిజనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రాంతంలో స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పోష్టికాహారం, మెరుగైన వైద్య అందించి ఆదుకోవాలని కోరారు. గిరిజనుల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. రూ.కోట్లు వెచ్చించి నిర్వహించిన యోగాకు బదులుగా గిరిజన ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు ఏర్పాటుచేసి ఈ ప్రాంతీయులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. జంఝావతి, వట్టిగెడ్డ, పూర్ణపాడులాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజాధనాన్ని ప్రభుత్వం దుబారా చేస్తోందని, దీనిని రైతులు, యువత గమనించాలని కోరారు. కార్యక్రమంలో నాయ కులు హరికృష్ణ, వికాష్, చరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో బదిలీలు
విజయనగరం ఫోర్ట్: ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న పలువురు వైద్యులకు బదిలీఅయింది. కె.నీరజ (జనరల్ మెడిసిన్ విభాగం)కు మల్కాపురం ఈఎస్ఐ ఆస్పత్రికి బదిలీకాగా, ఆమె స్థానంలో డాక్టర్ కిరణ్కుమార్ రాజమండ్రి నుంచి వస్తున్నారు. పి.భాస్కరరావు (జనరల్ సర్జన్)కు తిరుపతి, భవిత ( గైనికాలజీ)కు రాజమండ్రి బదిలీ అయింది. వీరి స్థానంలో ఉమావాణి, ఏవీఎస్ కృష్ణారావు మల్కాపురం ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి వస్తున్నారు. డాక్టర్ శ్రీవాణికి కూర్మన్న పాలేం ఈఎస్ఐ డిస్పెన్సరీకి బదిలీ కాగా, ఆమె స్థానంలో విశాఖపట్నం గురుద్వారా ఈఎస్ఐ డిస్పన్సరీ నుంచి డాక్టర్ మాధురిదేవి వస్తున్నారు. డాక్టర్ శిశరామకృష్ణకు విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురం ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి విజయనగరం ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్కు వస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు.. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు బదిలీ అయింది. డీపీహెచ్ఎన్ఓ మామిడి సత్యవతి, డీఎస్ఓ ధర్మారావుకు విశాఖపట్నంకు బదిలీ అయింది. సీనియర్ అసిస్టెంట్ రాజుకు విశాఖపట్నం ప్రాంతీయ ఐ ఆస్పత్రికి బదిలీ అయింది. -
ప్రయాణికుల ప్రయాస
ఆర్టీసీ బస్సుల్లో అధికశాతం విశాఖపట్నంలోని యోగాంధ్ర కార్యక్రమానికి తరలించడంతో విజయనగరం జిల్లా ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. ఆర్టీసీ కాంప్లెక్స్లోనే బస్సుల కోసం పడిగాపులు కాశారు. కొందరు ప్రయాణికులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కాంపెక్స్లోనే ఉండిపోయారు. బస్సులన్నీ యోగాంధ్రకు తరలించడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్కు వచ్చిన అరకొర బస్సుల్లో ఎక్కేందుకు పోటీపడ్డారు. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
సమ్మెలోకి మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది
బొబ్బిలి: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ఇంజనీరింగ్ సిబ్బంది స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం బొబ్బిలి కమిషనర్ ఎల్.రామలక్ష్మి, చైర్మన్ రాంబార్కి శరత్లకు సమ్మె నోటీసు అందజేశారు. గత కొన్ని నెలలుగా సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ బొబ్బిలిలో మాత్రం ప్రజాప్రయోజనార్థం విధులు నిర్వహిస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం, అధికారుల్లో ఏమాత్రం కదలిక లేకపోవడంతో తాము కూడా సమ్మెలోకి వెళ్తున్నట్టు చెప్పారు. మరో మూడు రోజుల వరకూ వాటర్ సప్లై కార్మికులు విధుల్లోనే ఉంటారని, అనంతరం వారు కూడా సమ్మెలో మాతో కలిసి పాల్గొంటారని తెలిపారు. సమ్మెను కొనసాగించకుండా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకుంటే ప్రజల ఇబ్బందులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
సంగీతంలో సాగరమంత సంగతులు
విజయనగరం: సంగీతంలో సాగరమంత సంగతులు ఉంటాయని, సంగీతం సార్వజనీనమైనదని సంగీత విద్వాంసురాలు, వరలక్ష్మీ త్యాగరాజ సంగీత నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు లక్ష్మీరామదాసు అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో కోడకూడలి వద్ద ఉన్న ఓ ప్రైవేటు అతిథిగృహంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సంగీతం మనోల్లాసాన్ని కలిగించే కళగా పేర్కొన్నారు. నిర్దిష్టమైన స్వర లయలతో కూడిన శృతి బద్ధమైన సంగీత ధ్వనులు మనసును సేదతీర్చి ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయన్నారు. సంగీతం శిశువులను, పశువులను, చివరకు పాములను కూడా రంజింపజేస్తుందని తెలిపారు. ఆరు లలిత కళల్లోనూ పండిత పామరులను ఉర్రూతలూగించగల కళ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ రామదాసును సమాఖ్య అధ్యక్షుడు గురు ప్రసాద్, శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ మార్కెట్ పూర్వ అధ్యక్షుడు పులిపాటి రామారావు, ఎం.సుభద్రాదేవి, తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఆలపించిన గీతాలు శ్రోతులను అలరించాయి. సంగీత విద్వాంసురాలు లక్ష్మీరామదాసు -
యోగాంధ్రకు రైట్ రైట్!
● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ● విశాఖ కార్యక్రమానికి బస్సుల్లో తరలింపు ● జిల్లాలోనూ పెద్ద ఎత్తున యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాక్షి, పార్వతీపురం మన్యం: అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇందులో పెద్ద ఎత్తున ప్రజలను, విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. ప్రధానంగా విశాఖ జిల్లాలో శనివారం నిర్వహించబోయే యోగాంధ్ర కార్యాక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. దాదాపుగా ఐదు లక్షల మందితో అక్కడ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు విద్యార్థులను, యోగా సాధకులను పెద్ద ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం డిపో నుంచి స్థానిక అవసరాలతో పాటు, ఇతర జిల్లాలకూ బస్సులను పంపారు. ఆర్టీసీ, హయ్యర్ బస్సులు కలిపి మొత్తం 56 సర్వీసుల వరకూ వెళ్తున్నాయి. సాలూరు, పాలకొండ డిపోల నుంచీ బస్సులు విశాఖకు శుక్రవారమే తరలివెళ్లాయి. ఇవి కాక.. ప్రైవేట్స్కూల్ బస్సులనూ వినియోగిస్తున్నారు. మొత్తంగా మన్యం జిల్లా నుంచి 175 బస్సుల వరకు వెళ్తున్నాయి. అదే సమయంలో జిల్లాలోనూ... విశాఖలో జరగనున్న యోగా స్ఫూర్తితో అదే సమయంలో జిల్లాలోనూ పెద్ద ఎత్తున యోగాసనాలు వేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజులుగా వివిధ ముఖ్య ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం విదితమే. శనివారం ఒక్కరోజే జిల్లాలో సుమారు 5.40 లక్షల మందితో యోగా చేయించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రతి మండల, గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో నమోదైన ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. ఇందుకోసం మొత్తం 3,150 ప్రదేశాలను గుర్తించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధ్రువపత్రాలు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటలకే వేదిక వద్దకు అందరూ చేరుకునేలా మండల ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు. యోగా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించనున్న యోగా ఏర్పాట్లను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. రైల్వేస్టేషన్ ప్రక్కన పార్క్, జగన్నాథపురం వీధిలోని స్కూల్, దేవాంగుల వారి వీధి, చర్చి వీధిలో మున్సిపల్ పార్క్ తదితర ప్రదేశాలను శుక్రవారం సందర్శించి యోగా ఏర్పాట్లపై ఆరా తీశారు. యోగా నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నిర్లక్ష్యం.. తోటపల్లికి శాపం
వీరఘట్టం/పాలకొండ/గరుగుబిల్లి: రైతు సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం మూడు జిల్లాల రైతులకు సాగునీటి ఆధారమైన తోటపల్లి ప్రాజెక్టుపై కపటప్రేమ చూపుతోందని, కాలువల అభివృద్ధి, షట్టర్ల ఏర్పాటు, ఆధునికీకరణ పనులను నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు. ఖరీఫ్ ఆసన్నమైనా రైతుల సాగునీటి సమస్యను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. తోటపల్లి జలాశయం ఎడమ ప్రధాన కాలువ రెగ్యులేటర్ను రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మా ట్లాడారు. తోటపల్లి ఆధునికీకరణ పనుల పూర్తిపై పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి దృష్టిసారించకపోవడం తగదన్నారు. 25 శాతం పనులు పూర్తికాలేదని ప్రాధాన్యత క్రమంలో ఉన్న తోటపల్లి ప్రాజెక్టును తప్పించి, ఆధునికీకరణ పనులను రద్దుచేయడం పద్ధతి కాదన్నారు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు కేవలం 9 శాతం మాత్రమే జరగగా అప్పటి టీడీపీ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా బిల్లులు చెల్లించలేదన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 వరకు 14 శాతం పనులు పూర్తి చేశామన్నారు. రెండు విడతల్లో రూ.23,59,28,652లను బిల్లుల రూపంలో చెల్లించిందన్నారు. ఖరీఫ్కు సాగునీరిస్తారా.... తోటపల్లి జలాశయం వద్ద ఉన్న ఎడమకాలువ రెగ్యులేటర్ తలుపులు మరమ్మతులకు గురికావడంతో ఎడమకాలువ ద్వారా నీరు వృథాగా పోతోందన్నారు. రైతులకు ప్రస్తుతం నీరు అవసరం లేకపోయినప్పటికీ తోటపల్లి నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు ఖరీఫ్ పనులు సజావుగా చేపట్టలేకపోతున్నారన్నారు. ఖరీఫ్లో నీటి అవసరం ఉన్నప్పుడు సాగునీరు అందుతుందా లేదా అనే ఆందోళనలో రైతాంగం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం తోటపల్లి ఆయకట్టు రైతులకు శాపంగా మారిందన్నారు. గత ఎన్నికల ముందు తోటపల్లి అంశాన్ని పదే పదే రైతుల వద్ద ప్రస్తావించి కల్లబొల్లి మాటలతో రైతుల ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆధునికీకరణ పనులను రద్దుచేసి రైతుల నోట్లో మట్టికొట్టిందన్నారు. ఖరీఫ్కు సాగునీరు విడుదల ప్రణాళికను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, వైఎస్సార్సీపీ వీరఘట్టం,పాలకొండ మండలాల కన్వీనర్లు దమలపాటి వెంకటరమణనాయుడు, కనపాక సూర్యప్రకాశరావు, నాయకులు కర్రి లీలాప్రసాదరావు, పిన్నింటి శ్రీను, కళింగ ప్రేమభూషణరావు, శంభాన శ్రీను, ఇ.లిల్లీపుష్పనాథం, రణస్థలం రాంబాబు, దుప్పాడ పాపినాయుడు, పాలవలస ధవళేశ్వరరావు, పొట్నూరు లక్ష్మణరావు, కోరాడ సూర్యనారాయణబాబు, మాచర్ల వెంకటరమణ, డోకల శ్రీను, నల్లబిల్లి విశ్వేశ్వరరావు, బంకి లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కలియుగ భస్మాసురుడు నారా లోకేశ్ రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో మంత్రి నారా లోకేశ్ కళియుగ భస్మాసురుడిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చివరకు కూటమి ప్రభుత్వానికి అదే రెడ్బుక్ భస్మాసుర హస్తంగా మారుతుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్,మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. ఇటీవల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించినప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు. జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. -
ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ అంటాబొంగు ఘాట్లో శుక్రవారం సాయంత్రం వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన వంగపండు తిరుపతి అనే మేస్త్రి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ సుత్తిగూడ గ్రామంలో సెంట్రింగ్ సామాన్లు కొనుగోలు చేశాడు. వీటిని తీసుకువెళ్లేందుకు గుమ్మడం గ్రామానికి చెందిన 10 మంది కూలీలతో వ్యాన్లో వచ్చాడు. అక్కడి మెటీరియల్ను తీసుకువెళ్తుండగా అంటాబొంగు ఘాట్ వద్దకు వచ్చే సరికి ప్రమాదానికి గురైంది. ఘాట్ ఎక్కలేక వ్యాన్ వెనక్కి వచ్చేసింది. దీనిని గమనించిన డ్రైవర్ బయటకు దూకేసి పారిపోయాడు. దీంతో వ్యాన్ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. సెంట్రింగ్ సామాన్లు వ్యాన్లో ఉన్న కూలీలపై పడిపోయాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు హూటహూటిన వచ్చి గాయపడిన వారిని బయటకు తీశారు. సంఘటన స్థలంలో కూలీల్లో సింగరాపు శివ(39), సింగరాపు రమణ (45) మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న వడ్డ గణపతి (33), దవరసింగి కుమార్ (35), సింగరాపు రమేష్ (34), నారపాటి బాబురావు (45), నారపాటి భాస్కరరావు (42), వంగపండు తిరుపతి (39), సింగరాపు శంకరరావు (38)ను ప్రైవేట్ వాహనంలో స్థానిక సీహెచ్సీకి తీసుకువచ్చారు. స్థానిక వైద్యాధికారి వివేక్, సిబ్బంది వారికి వైద్య సేవలు అందించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని పాడేరు జిల్లా ఆస్పత్రికి పంపిస్తామని వారు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని బాధిత కుటుంబాలకు ఫోన్లో తెలియజేశారు. ఇద్దరు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. సంఘటన స్థలంలో ఇద్దరు కూలీల మృతి మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అంటాబొంగు ఘాట్ ఎక్కలేక అదుపుతప్పడంతో ప్రమాదం క్షతుగాత్రులకు ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్య సేవలు -
మారిక విద్యార్థుల సమస్యలు తీరవా?
● పాఠశాలకు భవనం లేక చెట్ల కిందనే తరగతులు ● చర్చి వరండాలో మధ్యాహ్న భోజనంవేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీలో ఎత్తైన గిరిశిఖరంపై ఉన్న మారిక గిరిజన గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నా భవనం లేకపోవడంతో చెట్టుకిందనే పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల బదిలీ ప్రకియలో బదిలీపై మారిక పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుల విద్యాబోధనపై గిరిజనులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తమారిక, పాతమారిక తండాలకు సంబంధించి 27 మంది పిల్లలకు భవనం లేకపోవడంతో ఉపాధ్యాయులు చెట్ల కిందనే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చర్చి వరండాలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భోజనాలు పెట్టినట్లు ఉపాధ్యాయుడు రాంబాబు తెలిపారు. అలాగే ఎస్ఎంఎస్ సభ్యులతో కిచెన్ గార్డెన్తయారు చేయించడం ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు మంచి బోధన అందించాలన్న తపనతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు కనీస సౌకర్యాలైన పాఠశాల పక్కాభవనం, మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సత్య డిగ్రీ కళాశాల క్యాంపస్ డ్రైవ్లో 197 మందికి ఉద్యోగాలు
● యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని లిమ్కాబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ప్రముఖ చిత్రకారిణి సిరిపురపు ప్రవల్లికా నారాయణ్ వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వివిధ యోగాసనాలతో ఇంటర్నేషనల్ యోగాడే అని వేసిన చిత్రం అబ్బురపరుస్తోంది. విజయనగరం టౌన్విజయనగరం అర్బన్: పట్టణంలోని సత్య డిగ్రీ/పీజీ కళాశాల ప్రాంగణంలో లెర్నింగ్ ట్రీ ఆర్గనైజేషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 197 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిదేవమణి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డ్రైవ్లో 16 కంపెనీలు పాల్గొని 492 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలుత రిటన్ టెస్ట్, తరువాత టెక్నికల్ రౌండ్, ఇంటర్వ్యూలు నిర్వహించగా ప్రతిభ చూపిన 197 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు అభినందించారు. -
నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలవండి
భోగాపురం: కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారికి అండగా నిలబడాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడులు సూచించారు. ఈ మేరకు భోగాపురానికి చెందిన సుందర హరీష్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియ మితులైన సందర్భంగా శుక్రవారం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడులను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్ధులు, యువతకు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏడాది అవుతున్నా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయలేదని విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలో విద్యార్థుల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో నాయకులు గోపి, బంగార్రాజు, వెంకన్న, ప్రసాద్, శ్రీను, సాయిరాం, భాస్కరరావు, మాధవ, అప్పారావు, గురువులు, తదితరులు పాల్గొన్నారు. -
సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
విజయనగరం టౌన్: మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కేఏవీఎల్ఎన్. శాస్త్రి శుక్రవారం కళాశాల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సుతో పాటు రెండేళ్ల డిప్లమో కోర్సులో శిక్షణ ఉంటుందన్నారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డిప్లమో కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. కళాశాలలో గాత్రం, వీణ, వయోలిన్, నాదస్వరం, మృదంగం, డోలు, భరతనాట్యం కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నామని, అభ్యర్థుల వయస్సు 10 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలన్నారు. దరఖాస్తులను కళాశాల సమయవేళల్లో అందజేయాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఫోన్ 08922–223751 నంబర్లో కానీ నేరుగా కళాశాలలో గానీ సంప్రదించాలని కోరారు. -
22న జాబ్మేళా
నెల్లిమర్ల: పట్టణంలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 22న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్కుమార్ శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు.జిల్లా నైపుణ్యాభివృద్ధిసంస్థ, ప్రభుత్వ జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్మేళాకు హాజరుకావాలని సూచించారు.12 బహుళ జాతి కంపెనీలు మేళాలో పాల్గొంటాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను httpr://naipunyam.ap.gov.inఅనే వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.సారా అమ్మకాలపై దాడులుజియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా సారా అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 60 లీటర్ల సారాతో చినమేరంగి గ్రామానికి చెందిన వ్యక్తి పట్టుబడడంతో అదుపులోకి తీసుకున్నారు. సారా రవాణాకు ఉపయోగించిన పల్సర్బైక్ను సీజ్ చేసినట్లు సీఐ చెప్పారు. సారా సరఫరా చేస్తున్న రాయగడ జిల్లా కెరడ గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టులో హాజరు పరిచామన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తులుపార్వతీపురం టౌన్: జిల్లా పరిధిలో సమగ్ర శిక్ష మండల స్థాయిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమగ్ర శిక్ష ఏపీసీఎస్ వరల్డ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, సైట్ ఇంజినీర్లు తదితర పోస్టులకు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులతో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ సిబ్బంది సంబంధిత ప్రిన్సిపాల్తో కౌంటర్ సైన్ చేయించాలని సూచించారు. జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈనెల 21 వరకు కార్యాలయం పని వేళల్లో దరఖాస్తులు అందించాలని స్పష్టం చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయనగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన బమ్మిడి పైడిరాజు(50) హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన పైడిరాజు బైక్పై నాతవలస వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మపురి రోడ్డులో సుగర్ డౌన్ అయ్యి కళ్లు తిరిగి పడిపోయాడని ఎస్సై అశోక్ తెలిపారు. స్థానికుల సహాయంతో వైజాగ్లోని మెడికవర్ ఆస్పత్రిలో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. పైడిరాజు కుమార్తె కీర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
ఘనంగా రెవెన్యూ దినోత్సవం
విజయనగరం అర్బన్: రెవెన్యూ అధికారులు చట్టాలపై అవగాహన కల్పించుకుని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. రిటైర్ అయిన ఉద్యోగుల అనుభవాలను తెలుసుకుని సమర్థతను పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జరిగిన రెవెన్యూ దినో త్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సిబ్బంది, అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. రెవెన్యూ శాఖలో రిటైర్ అయిన అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించా రు. కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు ఆశయ్య, రామ్మోహన్రావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బాలాత్రిపుర సుందరి, రిటైర్డ్ డీఆర్ఓ గణపతిరావు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.గోవింద, సూర్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రిటైర్డ్ అధికారులకు సత్కారం -
రెవెన్యూ ప్రతిష్టను పెంపొందించాలి
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవలతో ఆ శాఖ ప్రతిష్ట మరింత పెంపొందాలని, ఆ దిశగా రెవెన్యూ శాఖాధికారులు, ఉద్యోగులు కృషిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్ వరకు అందరూ నిబద్ధతతో పనిచేసి ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ చాలా కీలకమైనదని, ఒక్కోసారి 24/7 విధులు నిర్వర్తించవలసి ఉంటుందన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, భూసేకరణ, వివిధ రకాల పత్రాల జారీ, ప్రభుత్వ పథకాల అమలు వంటివి ప్రజలకు అందించాల్సిన అన్ని సేవలు రెవెన్యూ శాఖతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వర్తించవలసి ఉంటుందని, తమ క్షేమాన్ని ఆశించకుండా ప్రజల కోసం నిస్వార్థం్గా నిబద్ధతతో పనిచేసే శాఖ రెవెన్యూ మాత్రమేనని కొనియాడారు. పనిచేయడంలో ప్రణాళిక ఉండాలి.. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పనిచేయడంలో ప్రణాళిక ఉండాలని, బాధ్యతగా చేస్తే మరింత మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రతి పని డిజిటలైజేషన్ అవుతుందని, కావున ప్రతి ఉద్యోగి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆన్లైన్ ద్వారా సేవలు అందించడం వల్ల పారదర్శకత ఉంటుందని, అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వివరాలను తెలుసుకునే సౌలభ్యం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. కె.చుక్కా అలియాస్ కోనేరు అప్పారావుకు బాండెడ్ లేటర్ చట్టం ప్రకారం చెక్కును అందజేశారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ప్రజలతో మమేకం కావాలి.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత మాట్లాడుతూ కుటుంబ శ్రేయస్సును వదిలి, విధి నిర్వహణలో పూర్తిగా నిమగ్నమైన ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులని కొనియాడారు. అన్నిసేవలు అందిస్తున్న రెవెన్యూ శాఖను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందించే సేవల ద్వారా వారి మన్ననలను పొందాలని హితవు పలికారు. ఉత్తమ సేవలు అందించడం ద్వారా రెవెన్యూ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, ఆ దిశగా అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కోరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉపాధ్యకుడు శ్రీరామమూర్తి, జిల్లా గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు సింహాచలం నాయుడు, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి సీహెచ్, రాధా కృష్ణమూర్తి తదితరులు రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలను గుర్తుచేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో వేగవంతంగా మరిన్ని సేవలు అందించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, ఉపతహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కరెంటు కోత!
బిల్లుల వాత.. సాక్షి, పార్వతీపురం మన్యం : ఎండలు మండుతున్నాయి. అంతకుమించి ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓవైపు అడపాదడపా వానజల్లులు కురుస్తున్నా.. వాతావరణం మాత్రం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఈ సమయంలో అనధికార విద్యుత్ కోతలు ప్రజలను విసిగిస్తున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా కోతలు ఉండటంతో ఇళ్లలో ఉండలేకపోతున్న పరిస్థితి. ఇదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మాత్రం గతంతో పోల్చుకుంటే రెండింతలు, మూడింతలు పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. సమయపాలన లేకుండా నిర్వహణ, ఇతర కారణాలు చెబుతూ కోత విధిస్తున్నారు. కొన్నిచోట్ల రోజులో నాలుగైదు గంటల చొప్పున సరఫరా ఉండటం లేదని విద్యుత్ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో అన్నీ కలిపి 2.84 లక్షలకుపైగా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం వేసవి ప్రభావం ఉండటంతో రోజుకు 1.190 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వినియోగమవుతోంది. వినియోగం పెరగడం ఒకవైపు.. కొద్దిరోజులుగా అడపాదడపా గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. చిన్నపాటి గాలి వీచినా కరెంటు నిలుపు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ప్రధానంగా నిర్వహణ, మరమ్మతుల పేరిట రోజులో మూడు, నాలుగు గంటలకుపైగా సరఫరా నిలిచిపోతోంది. ● పార్వతీపురం మండలంలోని నర్సిపురం 11కేవీ ద్వారా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా అవ్వగా.. ఆర్కే బట్టివలస, రంగాలగూడ, అడ్డూరువలస, సంగంవలస, ఎమ్మార్నగరం, సమీప ప్రాంతాలకు తరచూ విద్యుత్ కోతల కారణంగా గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారో తెలియక వాడుక నీరుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటం.. దోమల బెడదతో జ్వరాల బారిన పడుతున్నారు. ● పార్వతీపురం పట్టణంలో నిర్వహణ, మరమ్మతుల పేరిట వారంలో రెండు రోజులు 3 నుంచి 4 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నారు. ● బలిజిపేట మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలు ఉన్నాయి. ఒక వైపు ఎండల తీవ్రత, ఉక్కబోత విసిగిస్తుండగా.. అప్రకటిత విద్యుత్ కోతలు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కోతలు ఉన్నాయి. వర్షాల ప్రభావం వల్ల ఈదురు గాలులు వీచినా, వర్షం పడుతుందనే అనుమానం కలిగినా సరఫరాకు బ్రేక్ ఇస్తున్నారు. సీతానగరం మండలంలో మరమ్మతుల పేరుతో తరచూ సరఫరా నిలిచిపోతోంది. ● సాలూరు మండలంలో అనధికార కోతలు కొనసాగుతున్నాయి. రోజులో దాదాపు 2 నుంచి 3 గంటల వరకు కోత విధిస్తున్నారు. దీంతో వ్యవసాయ పంపుసెట్లు కూడా ఆగిపోయి రైతులకు ఇబ్బంది కలుగుతోంది. ● కొమరాడ మండలంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలున్నాయి. అర్ధరాత్రి సమయంలోనూ సరఫరా నిలిచిపోవడంతో ఫ్యాన్లు తిరగక, ఉక్కబోత భరించలేక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. జియ్యమ్మవలస మండలంలో ప్రతి శుక్రవారం నిర్వహణ పనుల పేరిట ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా ఆగిపోతోంది. గరుగుబిల్లి మండలంలో ఏ మాత్రం వర్షం కురిసినా, గాలి వీచినా కొన్ని గంటల పాటు సరఫరా నిలిచిపోతోంది. ● పాలకొండ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల పేరుతో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా ఆగిపోతోంది. దీనికి తోడు గాలులు, వర్షం కారణంగా సాయంత్రం సుమారు 2 గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా ఆధారిత వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పిండిమిల్లులు, వైద్య పరీక్ష కేంద్రాలు నడుపుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● వ్యవసాయం చేసుకొనే రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను అందించేది. నేడు పగటి పూట కనీసం 6 గంటల సేపు కూడా సరఫరా చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ● వీరఘట్టం మండలంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చే త్రీఫేస్ కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. విద్యుత్ కోసం రైతులు పంపుసెట్ల వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. భామిని మండలంలోనూ ఇదే స్థితి. సీతంపేట ఏజెన్సీలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. చిన్నపాటి వర్షాలకు సైతం రోజంతా సరఫరా ఆగిపోతోంది. లేకుంటే రోజులో ఏదో సమయాన రెండు, మూడు గంటలపాటు నిలుపు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది సాలూరు మండలం కురుకుట్టి పంచాయతీ పెదబారిగాం గ్రామంలోని కొండతామర చిన్నప్ప ఇంటికి జూన్ నెలలో వచ్చిన కరెంటు బిల్లు. అక్షరాలా రూ.7,624లు. వినియోగం వంద యూనిట్లే. గిరిజనుడైన ఈయనకు ఎస్సీ, ఎస్టీ రాయితీ కూడా ఉంటుంది. తనకు వచ్చిన బిల్లు చూసి లబోదిబోమంటున్నాడు.u జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు రోజుకు మూడు, నాలుగు గంటలపాటు నిలుపుదల మరోవైపు వినియోగదారులకు చార్జీల మోత చార్జీల బాదుడు విద్యుత్ లేకున్నా.. బిల్లుల బాదుడు మాత్రం వినియోగదారులకు తప్పడం లేదు. గతంలో రూ.200లోపు వచ్చిన వారికి ఇప్పుడు రూ.400 నుంచి రూ.600 వరకు బిల్లు వస్తోంది. గిరిజన ఆవాసాలకు సైతం రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల రాయితీ కూడా వర్తింపజేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ట్రూ ఆప్ చార్జీలు, సర్ చార్జీలంటూ ఎప్పుడో వినియోగానికి ఇప్పుడు లెక్క కట్టి వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. -
కాలేజీలో సీట్లు హౌస్ఫుల్..!
● ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు పోటెత్తిన అడ్మిషన్లు ● అధ్యాపకుల కృషిఫలితంగా కోలుకున్న కళాశాల రాజాం: నిన్నమొన్నటి వరకూ పదుల సంఖ్యలో మాత్రమే ఆ కళాశాలలో విద్యార్థినులు ఉండేవారు. ఒకగానొక దశలో ఆ కళాశాల ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అధ్యాపకులు నిరంతర శ్రమతో అక్కడ చదువుతున్న విద్యార్థుల అభ్యసనకు పదునుపెట్టారు. మంచి ఫలితాలు సాధించారు. ఫలితంగా ఒక్కసారిగా ఆ కళాశాలలో అడ్మిషన్లు సంఖ్య పెరగడం ప్రారంభించింది. కనీవినీ ఎరగని రీతిలో అడ్మిషన్స్ రాజాం పట్టణంలోని సారథిరోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. జిల్లాలో అత్యధికంగా ఇంటర్ అడ్మిషన్లు పూర్తిచేసుకున్న ఘనత ఈ కళాశాల ఇప్పుడు దక్కించుకుంది. ఈ ఏడాది వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ఇక్కడ 92 శాతం ఉత్తీర్ణత లభించడంతో పాటు విద్యార్థినులు అధికమార్కులు సాధించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఇక్కడ ఇంటర్ చేరికలు 163కు పెరిగాయి. కళాశాలలోని ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు సంబంధించి ఇంగ్లీషు, తెలుగు మీడియంలో బోధనచేస్తున్నారు. మొత్తం 11 మంది అధ్యాపకులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ చేరికలు కావడంతో అడ్మిషన్లు నిలుపుదల చేశారు. ప్రిన్సిపాల్ నిర్ణయాలతో.. ఏడాదిన్నర క్రితం ఇక్కడికి జనార్దనరావు ప్రిన్సిపాల్గా వచ్చారు. అంతకుముందు ఆయన సంతకవిటి మండలంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా చేసేవారు. అక్కడ కూడా ఆయన అనుసరించిన విఽధానాలు, క్రమశిక్షణ, సమయపాలన, కళాశాల అభివృద్ధి తదితర అంశాల్లో తన పాత్ర చాటుకున్నారు. అక్కడి నుంచి రాజాం ప్రభుత్వ బాలికల కళాశాలకు బదిలీపై వచ్చిన ఆయన ఇక్కడ కూడా విద్యార్థినుల్లో క్రమశిక్షణ అలవాటుచేయడం, నిరంతర శ్రమ, సమయపాలన, విద్యార్థినుల తల్లిదండ్రలుతో సమావేశాలు, పదోతరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడంతో ఇక్కడి కళాశాలపై అందరి దృష్టిపడింది. వీటికి తోడు అందరు అధ్యాపకులు పోటాపోటీగా బోధన చేయడంతో విద్యార్థినులు రాణించి, మంచి ఫలితాలు సాధించడం, ఫలితంగా ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. -
కూటమి కక్షపూరిత చర్యలు
బొబ్బిలి: ఇటీవలే కౌన్సిలర్లకు తాయిలాలతో వల వేసి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు వైస్చైర్మన్ పదవికి కూడా అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అడ్డడారులు వెతుక్కునే టీడీపీ నాయకులకు అధికార దాహం చల్లారడం లేదు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సందర్శకులు, కౌన్సిలర్ల కోసం కుర్చీలు, ఓ టేబుల్ ఉండేవి. అక్కడ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కూర్చుంటున్నారని సంవత్సరాల తరబడి ఉన్న ఫర్నిచర్ను గురువారం తొలగించారు. అధికారులు, కౌన్సిలర్ల కోసం, సందర్శకులు, అర్జీదారులు కూడా వచ్చి కాసేపు కూర్చుని తమ పనులు చక్కబెట్టుకుని వెళ్లేవారు. నిన్నమొన్నటి వరకూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే అధిక సంఖ్యలో ఉండడం వల్ల అక్కడ వారు కూడా కూర్చునే వారు. ఆయా వార్డులకు చెందిన ప్రజలు వస్తే వారి యోగక్షేమాలు కనుక్కుని అధికారుల వద్ద ఏమైనా పనులుంటే చేసిపెట్టేవారు. అవిశ్వాసంతో ఈ మధ్యనే అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అక్కడున్న విజిటర్స్ చాంబర్ను పూర్తిగా తొలగించారు. ఒక్క కూర్చీ కూడా లేకుండా చేశారు. గురువారం యాథాలాపంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అక్కడ కూర్చునేందుకు ఒక్క కుర్చీ కూడా లేకపోవడంతో అవాక్కయ్యారు. ఇదేం ఘోరం అంటూ కమిషనర్ రామలక్ష్మిని కలిసి అడ్గగా ఆమె నీళ్లు నమిలారు. ఏం చేస్తాం చెప్పండి నాకు కొద్ది రోజులుగా వాటిని తొలగించాలని బాగా ప్రెజర్ ఉందని కౌన్సిలర్లతో చెప్పారు. దీంతో కౌన్సిలర్లు నేరుగా వచ్చి కిందనే కూర్చున్నారు. కూటమి నాయకుల ఆదేశాలతో ఇలా కుర్చీలు తొలగించడం దారుణమని, ఇదేం చోద్యమని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కూటమి నాయకుల తీరు పట్ల ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు. సందర్శకులు, కౌన్సిలర్ల కుర్చీలు తొలగించి రాక్షసానందం -
రాజన్నదొరపై తప్పుడు మాటలు మాట్లాడితే ఖబడ్దార్
సాలూరు: మక్కువ మండల టీడీపీ అధ్యక్షుడు, మంత్రి సంధ్యారాణి సన్నిహిత అనుచరుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, స్థాయిని మరిచి విమర్శలు చేస్తే సహించేది లేదంటూ గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సాలూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఎంపీపీలు ప్రమీల, రాములమ్మ, సర్పంచ్లు ఆదయ్య, సుదర్శనరావు, ఎంపీటీసీ సుబ్బారావు, సీతారాం, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నాయకులు పరిమళ, ఉదయ్కుమార్, కల్యాణ్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏఎంసీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి సమక్షంలో టీడీపీ మండలాధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను ఉద్దేశించి దగాకోరు అంటూ చేసిన తీవ్ర అభ్యంతరకర పదజాలాన్ని వాడారంటూ అందరూ ముక్త కంఠంతో మండిపడ్డారు. ఓ గిరిజన రైతు కుటుంబం నుంచి నిబద్ధతగల రాజకీయనాయకుడిగా ఉపముఖ్యమంత్రి, మంత్రి స్థాయికి ఎదిగి ఎందరో గిరిజనులకు ఆదర్శంగా రాజన్నదొర నిలిచారన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సాలూరుకు సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు విరివిగా చేయించి, సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో తన పాలనలో చూపించారన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏనాడూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా పార్టీల విధి విధానాలపై రాజకీయ విమర్శలు మాత్రమే చేశారని గుర్తుచేశారు. అటువంటి రాజన్నదొరపై గుల్ల వేణు దగాకోరంటూ మాట్లాడడం దానిని అక్కడే ఉన్న మంత్రి సంధ్యారాణి వారించకపోవడాన్ని గిరిజనసమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆధారాలు చూపించాలిరాజన్నదొరను దగాకోరు అని వేణుగోపాల్ ఏ ఆధారాలతో మాట్లాడాడో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఆధారాలు చూపించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి సంధ్యారాణి సమక్షంలో విలేకరిని చంపుతానని హెచ్చరించిన వేణు, మంత్రి అండదండలతో రెచ్చిపోతున్నాడని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు భరత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మక్కువ టీడీపీ మండలాధ్యక్షుడిపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ -
బోర్డులు మార్చండి ప్లీజ్..!
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో విస్తరించిన అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు సరైన దిశగా లేకపోవడంతో వాహన చోదకులు అత్యంత వేగంగా ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. హార్న్ కొట్టాల్సిన ప్రాంతంలో సూచిక లేక స్కూల్ జోన్ల వద్ద నిర్దిష్ట వేగంతో వెళ్లక, మలుపులను గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ప్రజారవాణాకు సంబంధించిన, అలాగే ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే భారీ నుంచి అతిభారీ వాహనాలు వందల సంఖ్యలో ఈ రహదారిపై రాకపోకలు కొనసాగిస్తాయి. ఇప్పటికే రహదారిపై ఉన్న సూచికలు దిశ మార్చుకుని సక్రమంగా లేకపోవడంతో సరైన దిశలో వాటిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా సూచిక బోర్డులు -
సంతృప్తికరమైన జీవనశైలికి యోగా దోహదం
గంట్యాడ: భారతీయల వారసత్వ సాంస్కృతిక సంపదైన యోగాను యావత్ ప్రపంచం అనుసరిస్తోందని తద్వారా సమగ్రమైన, ప్రశాంతమైన సంతృప్తికరమైన జీవనశైలి వైపు పయనించే అవకాశం ఉందని రాష్ట్ర సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు గురువారం మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. యోగా ప్రతిరోజూ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చన్నారు. విద్యార్థులు వారి జీవనంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ మాణిక్యం నాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి, పర్యాటక అధికారి కుమారస్వామి, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎం.ఆనందరావు, మెప్పా పీడీ చిట్టిరాజు, ఎంపీడీఓ రమణమూర్తి, సీడీపీఓ ఉమాభారతి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ103 శ్రీ176 శ్రీ186కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి ● పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విజయనగరం ఫోర్ట్: కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్టు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. దీనికోసం గ్రామ స్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు వచ్చినట్టు తెలిపారు. విజయనగరం మెసానిక్ టెంపుల్లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసినది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు. కూటమి ప్రభుత్వం రాజధానిపై పోరాటం చేస్తే హౌస్ అరెస్టు చేశారని, స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తే దీక్ష భగ్నం చేశారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్, డాక్టర్ గేదెల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. హోటళ్లపై 6ఎ కేసు నమోదుడెంకాడ: మండలంలోని రెండు హోటళ్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి 6ఎ కేసు నమోదు చేశారు. ఈ మేరకు చింతలవలస పరిధి ఉన్న 99 ద రాయల్ బిర్యానీ హౌస్, జొన్నాడ వద్ద ఉన్న ద్వారకా హోటల్లో విజిలెన్స్ సీఐ బి.సింహాచలం, సిబ్బంది గురువారం తనిఖీ చేశారు. ఇంటిలో వినియోగించాల్సిన ఎల్పీజీ సిలిండర్లను హోటల్లో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో 99 ద బిర్యాని హౌస్లో 6 సిలిండర్లు, ద్వారకా హోటల్లో 5 సిలిండర్లను పట్టుకుని 6ఎ కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. పట్టుకున్న సిలిండర్లను సాయి గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ కిరణ్, వీఆర్వోలు కన్నయ్య, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. నేడు రెవెన్యూ దినోత్సవంపార్వతీపురంటౌన్: రెవెన్యూ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ డే సందర్భంగా ప్రతి రెవెన్యూ కార్యాలయంలో వేడుకలు జరుగుతాయన్నారు. ఈ వేడుకల్లో రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ వివరించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిడెంకాడ: విజయనగరం–నాతవలస ఆర్అండ్బీ రహదారిపై డెంకాడ మండలం పెదతాడివాడ కూడలి సమీపంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చిత్తూరు జిల్లాకు చెందిన యానాది రవి(36) మృతి చెందాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యానాది రవి, బావ కంతలచెరువు గోపి ఈ నెల 13వ తేదీన చిత్తూరు జిల్లా నుంచి ఐషర్వ్యాన్లో టమాటో లోడ్తో విజయనగరం వచ్చారు. 15వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో అన్లోడ్ చేశారు. అక్కడి నుంచి ఐషర్ వాహనం యజమానికి ఫోన్చేయగా పెదతాడివాడ వద్ద ఉన్న న్యూ వెంకట్ మినీ ట్రాన్స్పోర్టు కార్యాలయానికి వెళ్లి చిత్తూరు ఏమైనా కిరాయి ఉంటే చేసుకుని రావాలని చెప్పారు. దీనిలో భాగంగా యానాది రవి, బావ కంతలచెరువు గోపి పెదతాడివాడ వచ్చి ఉన్నారు. 18వ తేదీ రాత్రిభోజనం అనంతరం 11:30 గంటల సమయంలో ఫోన్ పట్టుకుని రవి బయటకు వెళ్లగా, గోపి వాహనంలో సేదదీరుతున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. చీకటిలో వెళ్లి వెతకగా రవి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వచ్చి రక్తపు మడుగులో ఉన్న యానాది రవిని పరీక్షించారు. అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారని మృతుడి బావ కంతలచెరువు గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. ఐషర్ వాహనంలో గోపి డ్రైవర్గా, రవి క్లీనర్గా పని చేస్తున్నారు. మృతుడు యానాది రవి చిత్తూరు జిల్లా బైరెడ్డిపాలెం మండలం నెల్లిపట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
జోగిందొరవలసకు ఝలక్..!
● తొలుత మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తింపు, తర్వాత రద్దు ● మౌలికవసతులు లేని కారణంగా జాబితా నుంచి తొలగింపు ● నష్టపోతున్న గిరిజన విద్యార్థులుఈ చిత్రంలో కనిపిస్తున్నది రామభద్రపురం మండలకేంద్రలోని పూడివీధి ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 54 మంది పిల్లలు చదువుతుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే విద్యాబోదన చేస్తున్నారు.ఈ పాఠశాల మోడ్ ప్రైమరీ పాఠశాలకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.ఈ పాఠశాలను కూడా మొదట్లో మోడల్ ప్రైమరీ పాఠశాలగా గుర్తించారు,ఆ తర్వాత పంచాయతీలో ఇప్పటికే మూడు మోడల్ ప్రైమరీ పాఠశాలలను గుర్తించాం. నాలుగోది వద్దు అని రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయాలతో పిల్లలు నష్టపోతున్నారని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
● 300 యూనిట్లు వినియోగం లేకున్నా.. ఉన్నట్లు రిమార్కు ● పరిశీలించకుండానే పంపించేస్తున్న సచివాలయ సిబ్బంది ● విద్యుత్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్న తల్లిదండ్రులు సాక్షి, పార్వతీపురం మన్యం: తల్లికి వందనం పథకంలో కొర్రీలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జాబితాలో తప్పులు కూడా చాలా మందిని అనర్హులుగా మిగిల్చాయి. భూమి లేకున్నా అధిక శాతం మందికి ఉన్నట్లు, విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినట్లు సచివాలయాల వద్ద జాబితాల్లో చూపుతోంది. జిల్లాలో 1,08,951 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద లబ్ధి కలిగిన విషయం విదితమే. వీరికి రూ.13 వేలు చొప్పున నిధులు జమయ్యాయి. ఇంట్లో చదువుకున్న పిల్లలందరికీ పథకం వర్తింపజేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కన మరింత మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. ఇంకా వేలాది మంది ఉంటారని అంచనా. వారంతా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ చూపడంతో.. జాబితాలో తప్పుల వల్ల అధిక శాతం మంది అర్హత కోల్పోయారు. ప్రధానంగా నెలకు వంద యూనిట్లు వినియోగిస్తున్న వారికి కూడా 300 యూనిట్లు వినియోగిస్తున్నట్లు రిమార్కుల్లో చూపుతున్నారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడి సిబ్బంది కనీసం పరిశీలించకుండానే విద్యుత్ కార్యాలయం వద్దకు వెళ్లాలని చెప్పి పంపించేస్తున్నారు. అక్కడ నుంచి ఏడాది వినియోగపు ధ్రువపత్రం తీసుకురావాలని చెబుతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ సెక్షన్ కార్యాలయాల్లో ఈఆర్వోలు, ఏఈవోలు, ఏఈలు వీటిని జారీ చేస్తారు. 300 యూనిట్లు ఎవరికీ వాడకం లేకున్నా.. సచివాలయ సిబ్బంది అందరితోనూ తెప్పిస్తుండటం వల్ల ప్రతిరోజూ విద్యుత్ సంస్థ కార్యాలయం వద్ద తల్లిదండ్రులు బారులు తీరుతున్నారు. వందలాది మందికి ఒకేసారి సర్టిఫికెట్లు ఇవ్వాల్సి రావడంతో అక్కడి సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది విద్యుత్ శాఖ సిబ్బంది తప్పిదాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 300 యూనిట్లు దాటి వినియోగిస్తున్న వారికి కూడా తక్కువగా ‘సర్దుబాటు’ చేసి, సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలు సడలించి, అందరికీ వందనం వర్తింపజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ● మారికవలస మీదుగా తిమ్మాపురం బీచ్కు బస్సురూట్ ● జిల్లాకు 30 కంపార్ట్మెంట్లు ● 4 చోట్ల పార్కింగ్ స్థలాల కేటాయింపు ● పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన కలెక్టర్, ఎస్పీ న్యూస్రీల్ -
1998నా.. 2008కా!
● బదిలీల్లో ప్రాధాన్యం ఎవరికి? ● తమ వృద్ధాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటున్న ఎంటీఎస్లు సాక్షి, పార్వతీపురం మన్యం: ఉపాధ్యాయుల బదిలీ లు ముగిశాయి. ఇక మినిమం టైం స్కేల్(ఎంటీ ఎస్) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్య డైరెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నా రు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోస్టింగులిచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 480 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1998 బ్యాచ్కు చెందిన వారిలో విధుల్లో చేరిన కొద్దిరోజులకే కొంతమంది ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పుడు పని చేస్తున్న వారిలో కొందరు ఒకట్రెండు సంవత్సరాల్లో రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జరగనున్న బదిలీల్లో తమను దూర ప్రాంతాలకు పంపిస్తే ఎలా చేయగలమని వారంతా వాపోతున్నా రు. ప్రభుత్వం కూడా బదిలీల్లో 2008 డీఎస్సీ వారికి తొలి ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. అదే జరిగితే తాము అన్యాయమైపోతామని 1998 ఎంటీఎస్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ప్రకటించారు. మిగిలి ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకుని మానవతాదృక్పథంతో స్థాన చలనానికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
‘తోటపల్లి’పై కూటమి కినుక
● సాగునీటి కాలువలను బాగు చేయలేదు ● దీనిపై రైతుల పక్షాన పోరాటం చేస్తాం ● నేటి సాయంత్రం కాలువల పరిశీలన కార్యక్రమం ● ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి పాలకొండ: తోటపల్లి కాలువలను ఆధునీకరించి రైతులకు సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు. పాలకొండలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగునీ టి కాలువల అభివృద్ధిపై ప్రభుత్వం కినుక వహించడాన్ని తప్పుబట్టారు. శిథిలావస్థకు చేరిన నాగావళి కుడి, ఎడమ కాలువల షట్టర్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు. షట్టర్లు పాడవ్వడంతో రిజర్వాయర్లోని నీరు సాగునీటి కాలువల్లోకి పెద్దస్థాయి లో చేరి గండ్లు పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి కే నీరు వృథాగా సరఫరా అవుతూ పంటపొలాల్లో చేరి వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. 2023–24 సంవత్సరంలో గత జగన్మోహ న్రెడ్డి ప్రభుత్వం కొత్త షట్టర్ల ఏర్పాటుకు రూ.20 లక్షలు మంజూరు చేసిందని, టెండర్ల దశలో ఎన్నిక ల కోడ్తో పనులు నిలిచిపోయినట్టు తెలిపారు. ఎడమ కాలువ ప్రధాన లింక్ కెనాల్ రక్షణ గోడకు సాంకేతి అనుమతులు తీసుకువచ్చామన్నారు. అనంతరం ప్రభుత్వం మారడంతో ఈ పనులు బుట్టదాఖలయ్యాయన్నారు. కాలువల ఆధునికీకర ణ పనులను పట్టించుకోకపోవడం విచారకరమన్నా రు. ప్రభుత్వం స్పందించి వెంటనే కాలువల షట్టర్లు బాగుచేయాలని, కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని బృందం కాలువల పరిశీలన కార్యక్రమాన్ని చేపడుతుందని వివరించారు. రైతులందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
యోగాంధ్రకు సమాయత్తం కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమానికి సమాయ త్తం కావాలని మండల ప్రత్యేక అధికారులు, జిల్లా, మండల అధికారులను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యోగాంధ్ర, స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర, డీఎ జుగా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నారని, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 3,150 వేదికల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 5.42 లక్షల మంది యోగాంధ్రకు రిజిస్టర్ చేసుకున్నారని, వీరంతా ఆ రోజు పాల్గొనేలా అధి కారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీవేదిక వద్ద బ్యాక్ డ్రాప్ బ్యానర్, సౌండ్ సిస్టం, ప్రత్యక్ష ప్రసారం, గ్రీన్ మ్యాట్ ఇతరత్రా ఏర్పాట్లు ఉండాలని, ఆ రోజు ఉదయం 6 గంటలకే అందరూ సిద్ధంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల ను కోరారు. యోగా చేసే సమయంలో క్వాలిటీతో కూడిన ఫొటోలు, వీడియోలు తీయించాలని, ప్రజాస్పందన కూడా తీసుకోవాలని కలెక్టర్ వివరించా రు. 21న జరగనున్న యోగాంధ్రలో ప్రజలతో పా టు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు భాగస్వా మ్యం కావాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికా రి డాక్టర్ ఎం.వినోద్కుమార్, డాక్టర్ టి.జగన్మోహనరావు, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్రరావు, డీపీఓ టి.కొండలరావు, మున్సిపల్ కమిషన ర్ సీహెచ్.వెంకటేశ్వర్లు, ఐటీడీఏ ఏపీడీ ఎ.మురళీధ ర్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్.కృష్ణవేణి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి ఇ.అప్పన్న, జిల్లా మత్స్య శాఖాధికారి టి.సంతోష్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాల గురుకుల సమన్వయకర్త ఎస్.రూపావతి గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా పరిధిలోని 8, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని 5 పాఠశాలల్లో గురు వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి తరగతికి సంబంధించిన ప్రశ్నపత్రం ముందు తరగతి గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ సిలబస్ ఆధారంగా రూపొందించి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 89858 83015, 63038 38657 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఉమ్మడి విజయనగ రం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మిగులు సీట్ల ప్రవేశాల కోసం ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రూపావతి చెప్పారు. బాలికలకు ఈ నెల 22న చీపురుపల్లి బాలికల గురుకుల పాఠశాలలోను, బాలురకు ఈ నెల 23న కొప్పెర్ల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియట్ మిగులు సీట్లకు బాలికలకు ఈ నెల 26న నెల్లిమర్ల గురుకుల పాఠశాలలోను, బాలురకు 27న కొప్పెర్ల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. 22 నుంచి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మిగులు సీట్లకు కౌన్సెలింగ్ ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయకర్త ఎస్.రూపావతి -
పురం గొంతెండుతోంది!
ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదు.. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. ఎన్నిసార్లు అడిగినా అదిగోఇదిగో అంటున్నారు తప్ప ఫలితం నీటి సరఫరా చేయడం లేదు. కొద్దిరోజులుగా కుళాయిల ద్వారా నీరే రావడం లేదు. – లక్ష్మి, నాలుగో వార్డు●సాక్షి, పార్వతీపురం మన్యం: ఒకటి కాదు.. రెండు కాదు.. పది రోజులుగా పార్వతీపురం పట్టణాన్ని నీటి ఎద్దడి వెంటాడుతోంది. తాగేందుకు నీరులేక పుర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ సమ్మె చేస్తుండటం నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెంతనే తోటపల్లి జలాశయం అగుపిస్తున్నా.. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోందంటూ పట్టణ ప్రజలు దుయ్యబడుతున్నారు. మహిళల నిరసనతోనూ దిగిరాని అధికారులు 30 వార్డులున్న పార్వతీపురం పట్టణంలో కుళాయిల ద్వారా నీటి సరఫరా అరకొరగానే లభిస్తోంది. ఐదు రిజర్వాయర్లు ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకోసారి, మరికొన్ని చోట్ల వారానికోసారి ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇంజినీరింగ్ వర్కర్ల సమ్మెతో అది కూడా రావడం లేదు. పట్టణంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నాలుగు రోజుల కిందట పలు వీధుల మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. జనసైనికులు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం. ఆ తర్వాత ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేశారు. కొన్ని వార్డులను వదిలేశారు. ఇస్తున్న చోట మహిళలు, పురుషులనే తేడా లేకుండా బిందెలు పట్టుకుని నిరీక్షిస్తున్నారు. దొరికితే మహాభాగ్యమనుకుని.. కొద్ది రోజులపాటు నిల్వ చేసుకుంటున్నారు. ఇక్కడా వివక్షే.. ట్యాంకర్ల ద్వారా కూటమి నేతృత్వం వహిస్తున్న, మద్దతుగా నిలిచిన కౌన్సిలర్లు ఉన్న వార్డులకే సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులను వదిలేశారు. ఆయా ప్రాంతాల్లో పాలకవర్గం వైఫల్యం వల్లే నీటి ఎద్దడి ఏర్పడిందని ప్రచారం చేయిస్తున్నారు. దీనికి మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సమస్యలపైనా రాజకీయాలేమిటని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా నీటి సమస్యను పరిష్కరించి, కుళాయిల ద్వారా సరఫరా చేయాలని కోరుతున్నారు. -
మా బడిని మా ఊరిలోనే ఉంచండి
బలిజిపేట: మా బడి మా దళితపేటలోనే ఉంచాలని, మా వలస కుటుంబాల పిల్లలకు న్యాయం చేయాలని, దళితులమని ఆగ్రహించకుండా ఆలోచించి న్యాయం చేయాలంటూ పెదపెంకి దళితపేటకు చెందిన పాఠశాల–1 విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం రోడ్డెక్కారు. పెదపెంకి దళితపేటలో ఉండే ఒకటో నంబరు పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించడంతో ఆందోళనకు దిగారు. 50 సంవత్సరాల నుంచి దళితపేటలో ఉండే బడిని గ్రామస్తులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించకుండా, చైర్మన్, ప్రజల అంగీకారం లేకుండా మరో పాఠశాలలో ఎలా విలీనం చేశారని ప్రశ్నిస్తున్నారు. గాలులు, వర్షాలుపడే సమయంలో దూరంగా ఉన్న పాఠశాలలకు పిల్లల ఎలా వెళ్లిరాగలరని నిలదీశారు. బడి ఎత్తేస్తే పిల్లలను నచ్చిన చోట చేర్చుకుంటామని స్పష్టంచేశారు. సమస్యను పరిష్కరించకపోతే జిల్లాస్థాయిలో ధర్నాకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఎంఈఓ–1 సామల సింహాచలంకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ పాఠశాలను ఎత్తేయలేదని, కేవలం 3, 4, 5 తరగతుల విద్యార్థులను మాత్రమే తరలించినట్టు చెప్పారు. తల్లిదండ్రులు ఇచ్చిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
యోగాంధ్ర విజేతలకు అభినందన
పార్వతీపురం టౌన్: యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా వాసులను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ బుధవారం అభినందించారు. 13 కేటగిరీలకు 8 కేటగిరీల్లో 10 స్థానాల్లో బహుమతులను గెలుచుకోవడం హర్షణీయమన్నారు. 10 బహుమతుల్లో మూ డు ప్రథమ, రెండు ద్వితీయ, ఐదు తృతీయ బహుమతులు ఉన్నాయి. కార్యక్రమంలో డీఆర్వో హేమలత, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాంఅధికారి డాక్టర్ వినోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. పైడితల్లి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తా ● బాధ్యతలు స్వీకరించిన ఇన్చార్జి ఈఓ కె.శిరీష విజయనగరం టౌన్: పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి అందరి సహకారంతో కృషిచేస్తానని ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష తెలిపారు. ఇన్చార్జి ఈఓగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. చంద్రబాబు అంటేనే మోసం.. రేగిడి: జగన్ అంటే నమ్మకం...చంద్రబాబు అంటేనే మోసం అనే పుస్తకాన్ని రేగిడి మండలం చిన్నశిర్లాం గ్రామంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో అంతా మోసమే జరిగిందని, ఈ మోసాన్ని వివరిస్తూ పార్టీ అధిష్టానం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ప్రచురించిందని వెల్లడించారు. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మండలాలు వారీగా ఆవిష్కరణలు జరుగుతున్నా యని వివరించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఏడాది కాలంలోనే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందించా రని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎన్నికలు ముందు ప్రజలకు సూపర్సిక్స్ హామీలిచ్చి మోసం ఫిక్స్ చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, నాయకులు పాల్గొన్నారు. -
కౌలురైతు కన్నీరు..!
కూటమికి పట్టని...● కౌలు రైతుల కార్డుల జారీలో అంతులేని నిర్లక్ష్యం ● విత్తనాలు రాయితీ లేక ఇబ్బందులు ● అందని పంట రుణాలు ● జిల్లాలో 9వేల మంది కౌలు రైతులు ● ఇప్పటి వరకు అందజేసినవి 940 మాత్రమే..పార్వతీపురం టౌన్: ఖరీఫ్ సీజన్ ఆసన్నమైంది. కొన్నిచోట్ల వరి వెదలు జల్లుతున్నారు. ఇప్పటికీ కౌలురైతుల గుర్తింపు పూర్తికాలేదు. జిల్లా వ్యాప్తంగా 9వేల మంది కౌలురైతులు ఉంటే 940 మందికి మాత్రమే కౌలు రైతు గుర్తింపు కార్డులు అందజేశారు. దీంతో విత్తనాలు, వ్యవసాయ పరికరాలు రాయితీపై అందని పరిస్థితి. అన్నదాత సుఖీభవకు కౌలు రైతులను దూరం చేసిన కూటమి ప్రభుత్వం.. గుర్తింపు కార్డుల జారీలోనూ జాప్యం చేస్తుండడంపై కన్నీరు పెడుతున్నారు. కొందరు రైతులు కాడివిడిచి వలసబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యం గతంలో విత్తనాల పంపిణీ నుంచి పంట కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాలు రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచేవి. ఆర్బీకేలను ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చి వాటి సేవలను దూరం చేస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. దీనికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు (సీసీఆర్) జారీలో జాప్యమే నిదర్శనమని చెబుతున్నారు. వరి విత్తనాలు, ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను పూర్తిధర చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామని పేర్కొంటున్నారు. సీసీఆర్ కార్డుతో ప్రయోజనాలు బోలెడు పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి, నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా, పంట రుణాలు ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్ కార్డులు తప్పనిసరి. ఈ కార్డులుంటేనే రైతులకు అర్హత ఉంటుంది. కౌలుదారులకు కీలకమైన కార్డుల జారీలో జాప్యం నెలకుంది. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో కేవలం 940 మందికి మాత్రమే సీసీఆర్ కార్డులు జారీ చేశారు. వ్యవసాయశాఖ సిబ్బంది కార్డుల జారీకి చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారే తప్ప జూన్నెల పూర్తవుతున్నా కౌలు రైతులకు సీసీఆర్ కార్డు అందని పరిస్థితి నెలకుంది.ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు.. జిల్లాలో 940 మంది కౌలురైతులకు సీసీఆర్ కార్డులు జారీ చేశాం. మిగిలిన వారిని వీఆర్వోలు ఎంపిక చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కార్డుల జారీకి చర్యలు చేపడతాం. ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం కల్పిస్తాం. – రాబర్ట్ పాల్, జిల్లా వ్యవశాయశాఖ అధికారి, పార్వతీపురం మన్యం -
● కమ్మవలసలో ఏనుగుల గుంపు
బొబ్బిలి రూరల్: మండలంలోని కమ్మవలసలో తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మంగళవారం రాత్రి ముత్తాయివలస నుంచి కమ్మవలసకు చేరుకున్న ఏనుగులు అక్కడే మామిడితోటల్లో తిష్టవేశాయి. దీంతో ఏరోజు ఏ గ్రామానికి చేరుకుని ఏ హాని తలపెడతాయోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపులో ఇటీవల జన్మించిన గున్న ఏనుగు, మరో రెండు చిన్నవి, ఆరు పెద్ద ఎనుగులు ఉన్నాయి. అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల జాడను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భయాందోళనలో గ్రామస్తులు