breaking news
Parvathipuram manyam District Latest News
-
అనుమానాస్పద వ్యక్తులను విచారణ చేస్తాం
విజయనగరం టౌన్: ఇండియా వన్ ఏటీఎం చోరీ కేసులో అనుమానితులందరినీ విచారణ చేస్తామని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ సంఘటన జరిగిన గంట్యాడ మండలం లక్కిడాం జంక్షన్ లో మంగళవారం రాత్రి చోరీ జరిగిన ఏటీఎం ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. చోరీ జరిగిన తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించి, 50 మందితో కూడిన 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించి ఏటీఎం తాడుతో బొలెరో వాహనానికి కట్టి కొంతదూరం లాక్కెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఏటీఎంలో రూ.లక్షా50వేలు నగదు ఉంటుందన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే జిల్లా పోలీస్యంత్రాంగం అప్రమత్తమైందని, నేరస్థలాన్ని ఇప్పటికే క్లూస్ టీమ్ పరిశీలించిందని, ఆధారాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించామన్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలనే లక్ష్యంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజ్లు సేకరించామన్నారు. అవసరమైన చోట సాంకేతిక నిపుణుల సహకారంతో డిటిజల్ ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు అధికారులు ప్రతి చిన్న ఆధారాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలని, జిల్లా సరిహద్దులతో పాటూ పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం పెంచి నిందితుల కదలికలపై నిఘా ఉంటాలని, ఎమ్ఓ క్రిమినల్స్ను విచారణ చేయాలని ఆదేశించారు. ఏటీఎం కేంద్రాల భద్రత విషయంలో బ్యాంక్ యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నాణ్యమైన సీసీ టీవీ కెమెరాలు, అలారం వ్యవస్ధ, తగినంత లైటింగ్, భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్కు లేదా డయల్ 100/ 112కి సమాచారమందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ పూర్తిగా కట్టుబడి ఉందని, నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గంట్యాడ ఎస్సై డి.సాయికృష్ణ, సీసీఎస్ సీఐ డీడీ.నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇండియా వన్ ఏటీఎం చోరీ స్ధలాన్ని పరిశీలించిన ఎస్పీ -
నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట
–10లో● నేటి నుంచి రిలే దీక్షలు పార్వతీపురం రూరల్ : డీఎస్సీ అర్హులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. నిరుద్యోగులకు అండగా నిలుస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నుంచి ఆదివారం వరకు (ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు) నాలుగు రోజుల పాటు స్థానిక వైఎస్సార్ విగ్ర హం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. పార్వతీపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతాయి. తొలి రోజైన గురువారం ఉద యం బలిజిపేట మండల యువత, మధ్యాహ్నం పార్వతీపురం పురపాలక సంఘం యువత ఈ శిబిరం దీక్షలో కూర్చుంటారు. యువత, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మె ల్యే అలజంగి జోగారావు ఒక బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
బాలికల వసతిగృహంలో న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ
పార్వతీపురం రూరల్ : జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం – 2ను మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఆదేశాల మేరకు హాస్టల్ను సందర్శించిన ఆమె విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలు, వసతిగృహంలో పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు తనిఖీల్లో భాగంగా హాస్టల్ గదులు, వంటగది, భోజనశాలను పరిశీలించి, నిర్వాహకులను పిలిచి విద్యార్థులకు అందిస్తున్న రోజువారీ భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో ఆమె నేరుగా ముఖాముఖి మాట్లాడారు. నిబంధనల ప్రకారం మెనూను పాటిస్తున్నారా.. లేదా? రోజూ సరైన భోజనం పెడుతున్నారా లేదా? అని విద్యార్థినులను అడిగి నిర్ధారించుకున్నారు. వసతిగృహంలో పరిశుభ్రత పాటిస్తున్న తీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ గదులతో పాటు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆమె హితవు పలికారు. -
వేర్వేరు ప్రమాదాల్లో పలువురి మృతి
విజయనగరం టౌన్: మండలంలోని బియ్యాలపేట గ్రామంలో నేలబావిలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధించి రూరల్ పోలీసులు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాగిత నరసింగరావు(30) మంగళవారం రాత్రి పశువులను మేపుతూ కాలుజారి నూతిలో పడి మృతిచెందాడు. ఆయనకు భార్య లీలావతి ఉంది. మృతుని తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వి.అశోక్ కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చీపురుపల్లి: మండలంలోని కలిసెట్టిబడి గ్రామానికి చెందిన చింత సురపునాయుడు గడ్డి మందు తాగి మృతి చెందాడు. పాల్పడ్డాడు. సూరపునాయుడు కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతోనే గడ్డి మందు తాగి మృతి చెందినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో లాడ్జిలో యువకుడు.. విజయనగరం టౌన్: మండలంలోని గుణుపూరు పేటకు చెందిన యువకుడు విజయనగరంలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బుధవారం జరిగిప ఈ సంఘటనకు సంబంధించి వన్టౌన్ పోలీసులు, గుణుపూరు పేట గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుణుపూరుపేటకు చెందిన పడాల భరత్ కుమార్ (30) మంగళవారం విజయనగరం పట్టణంలోని బాలాజీ లాడ్జిలో బస చేశాడు. ఉదయం 10.30 గంటల సమయంలో గుండెనొప్పి అని పడిపోవడంతో హోటల్ సిబ్బంది 108కి కాల్ చేశారు. అయితే అప్పటికే మృతిచెందాడని వైద్యులు పేర్కొన్నారు. భరత్కుమార్కు ఇంకా వివాహం కాలేదు. సోదరుడు గణేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై కమల్ భార్గవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి.. గుర్ల: మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన గెద్ద గడ్డి నాయుడు (39) విద్యుత్ షాక్తో మృతిచెందాడు. గడ్డి నాయుడు మంగళవారం రాత్రి తన పొలానికి నీరు కట్టడానికి వెళ్లి విద్యుత్ మోటార్ ఆన్చేయగా షాక్కు గురై మృతి చెందాడు. రాత్రి సమయంలో వెళ్లిన వ్యక్తి అర్థరాత్రి అయినా ఇంటికి రాకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విద్యుత్ మోటార్ వద్ద చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులు గుర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మృతుడికి భార్య పైడిరాజు, కుమారుడు దినేష్ ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.నారాయణ రావు బుధవారం తెలిపారు. గ్రోత్ సెంటర్లో బీహార్ యువకుడు.. బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్లో బీహార్ యువకుడు మృతి చెందాడు. అక్కడి గురుదత్త ఎంటర్ ప్రైజర్స్ అనే పరిశ్రమలో పొడి మిశ్రమాన్ని వేరు చేసే ఇనుప జల్లెడకున్న ఇనుప రాడ్ ఛాతీ, చేతుల మీదుగా గుచ్చుకోవడంతో బీహార్లోని రాజ్కార్ తాలూకా ప్రొక్రైరా గ్రామానికి చెందిన బికాస్ మాజీ (26) అనే యువకుడు మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో పోలీసులు బుధవారం గ్రోత్సెంటర్లోని గురుదత్త కంపెనీకి వెళ్లి మృతదేహాన్ని బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. మృతుడి సహచర కార్మికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు బుధవారం మధ్యాహ్నానికి బొబ్బిలి చేరుకున్నారు.నాలుగేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న బికాస్కు ఏడాది కిందటే వివాహమైనట్లు చెబుతున్నారు. మృతుడికి భార్య అనిషాదేవి, రెండు నెలల కుమార్తె మిస్టీ ఉన్నారు. డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ కె.నారాయణ రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. -
నలుదిక్కులా.. నిరసన సెగ!
–10లోగురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026పార్వతీపురం: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికా రులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభా కరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సన్నాహకాలపై బుధవారం నిర్వహించిన జూమ్ సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాల నుంచి ఉత్తమ సాంస్కృతిక బృందాలను ఎంపిక చేసి విద్యార్థులకు వెంటనే శిక్షణ ప్రారంభించాలని సూచించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక చైతన్యం ప్రతిబింబించే సాంస్కృతి క, క్రీడా ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ కె.హేమలత తో పాటు వివిధ శాఖల అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు. పాలకొండ: పాలకొండ గృహ నిర్మాణ శాఖ ఏఈ సుధారాణిపై ఆ శాఖ ఈఈ సోమేశ్వరరా వు బుధవారం విచారణ చేపట్టారు. పట్టణంలో ని బాసూరు వీధి సచివాలయంలో వార్డు ఇంజనీర్లును విచారించి వారి నుంచి రాతపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు. ఇటీవల వార్డు ఇంజినీర్లు తమ లాగిన్ నుంచి సిమెంట్ బస్తాలు తమకు తెలియకుండా ఏఈ పక్కదారి పట్టించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టామని ఈఈ తెలిపారు. ఇప్పటికే లబ్ధిదా రులను విచారించామని, ప్రస్తుతం ఇంజినీరింగ్ అసిస్టెంట్లను విచారిస్తున్నామని ఆయన తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. సాలూరు: పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల లో ఈ నెల 10న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్, కన్వీనర్ డి.శ్రీనివాసాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో రెయిన్ గ్రూప్ ఆటోమోటివ్ లిమిటెడ్, అర్న ఎనర్జిస్, ఎలక్ట్రో స్టీల్ కేస్టింగ్ లిమిటెడ్ తదితర కంపెనీలకు చెందిన హెచ్ఆర్ ప్రతినిధు లు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎస్ఎస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోలు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ తదితర వివరాలతో పాటు ఒరిజినల్, జెరాక్స్ పత్రాలు తీసుకుని మేళాకు హాజరు కావాలన్నా రు. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నంబర్ లేని వారు కూడా ఈ మేళాకు నేరుగా హాజరుకావచ్చని తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అప్రెంటిస్ తరువాత సంబంధిత అభ్యర్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అప్రంటిస్ అడ్వయిజర్ శ్రీనివాసరావు 9573644439 నంబరును సంప్రదించాలని సూచించారు. పార్వతీపురం రూరల్ : ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఆచరణలో అడుగున పడిపోవడంతో.. దాదాపు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి జ్వాలలు రగులుకుంటు న్నాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు, ఏజెన్సీ హ క్కుల ఉల్లంఘన, ఫీజు బకాయిల నుంచి ఇంధన ధరల పెంపు వరకు వివిధ సమస్యలపై ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ ఫెడరేషన్లు, కార్మికులు ఇప్పటికే కలెక్టరేట్ల ఎదుట ఆందోళన బాట పట్టారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఈ నిరసన గళానికి శ్రుతి కలుపుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ధర్నాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై భగ్గు గద్దెనెక్కే ముందు ఇచ్చిన ప్రధాన హామీలు, పథకా లు నీటి మూటలుగా మిగిలిపోయాయన్న విమర్శ లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ–2025లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. అర్హులకు అన్యాయం జరిగిందని, ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబడు తూ డిమాండ్ చేస్తున్నారు. చట్టాల రక్షణకై గిరిజనుల గర్జన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఉపాధికి జీవాధార మైన జీఓ నంబర్–3 రద్దుతో తలెత్తిన పరిస్థితు లపై ఆదివాసీ సంఘాలు రగిలిపోతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, గిరిజన భూములకు రక్షణ కవచమైన 1/70 చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కు పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజనుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. ఉపాధ్యాయులపై ఉక్కుపాదం.. కార్మికుల కన్నీరు విద్యాశాఖలోనూ తీవ్ర అశాంతి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ ఫెడరేషన్లు ఆందోళనలకు దిగుతున్నాయి. మరోవైపు ఏకంగా రూ.7,000 కోట్ల మేర ఫీజు బకాయి లు పేరుకుపోవడం, మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కరవవడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించే దిశగా సర్కారు అడుగులు వేస్తుండటంతో.. ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులు తమ ఉపాధికి గండి కొడుతున్నారంటూ ఆందోళనలు ఉద్ధృతం చేశారు. కూడగడుతున్న వ్యతిరేకత సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్న ఇంధన ధరల పెంపు, ప్రభుత్వ ఏకపక్ష జీఓలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ.. వైఎస్సార్సీపీ సహా వామపక్ష, ఇతర ప్రజా సంఘాలు నిత్యం కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలకు దిగుతున్నాయి.హామీలు నమ్మి ఓటేసిన నిరుద్యోగులను, యువతను ఈ కూటమి ప్రభుత్వం నిలువునా వంచించింది. మెగా డీఎస్సీ–2025 పేరుతో తీవ్రమైన అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థులకు మొండిచేయి చూపారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించి నిజాయితీపరులకు న్యాయం చేయాలి. మరోవైపు రూ.7,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది పేద విద్యార్థుల చదువులు వీధి పాలు అయ్యే పరిస్థితి వచ్చింది. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను స్వస్తి పలికే వరకు మా పోరాటం ఆగదు. – అనంత నాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గిరిజనుల విద్యా, ఉపాధి హక్కులకు జీవనా ధారమైన జీఓ నంబరు–3 రద్దయ్యాక ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం వెంటనే దానికి ప్రత్యామ్నా య చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఆదివా సీల భూములను కాపాడే 1/70 చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయాలి. గిరిజనుల హక్కు లను కాలరాస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ను జయప్రదం చేయాలి. – కె.రామస్వామి, గిరిజన కార్మిక సంఘం నాయకుడు -
8న ఏజెన్సీ బంద్
పార్వతీపురం రూరల్ /సీతంపేట: గిరిజనుల ఉపాధికి జీవనాధారమైన జీఓ నంబరు–3కి ప్రత్యామ్నా య చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, ఏజెన్సీ భూములను రక్షించే 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8న రాష్ట్ర వ్యా ప్త ఏజెన్సీ బంద్కు పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో బుధవారం వివిధ గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీతంపేటలో వాల్పోస్టర్లు విడుదల చేశారు. సుప్రీంకోర్టు రద్దు చేసిన జీఓ–3 లక్ష్యాలకు అనుగుణంగా, నేతల ఎన్నికల హామీ మేరకు ప్రత్యామ్నాయంగా శ్యామ్నాయక్ చట్టాన్ని తేవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేలా కోర్టు కేసుల పేరుతో 1/70 చట్టాన్ని నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ గిరిజన యువత ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని, ఈ చట్టాలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. గిరిజన హక్కుల సాధన కోసం ఈ నెల 8న నిర్వహించే ఏజెన్సీ బంద్కు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపి జయప్రదం చేయా లని విజ్ఞప్తి చేశారు. వివిధ సంఘాల నేతలు కె.రామస్వామి, పి.రంజిత్ కుమార్, బి.వి.రమణ, సీతారాం, రెడ్డి ఈశ్వరరావు, గంగునాయుడు, దాసు, వేణు, ఇందిర, తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయాలి
● ఆర్డీఓ ఆర్ మాధురిసీతానగరం: పార్వతీపురం మన్యంజిల్లాలో రేషన్ డిపోలద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులోగా వినియోగదారులకు అందజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.మాధురి అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట గ్రామంలో రేషన్ షాపులో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను బుధవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రేషన్ షాపులో ఈ–పోస్ యంత్రం పనితీరు, సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లును ఆర్డీవో భౌతికంగా పరిశీలించారు. అనంతరం రేషన్కార్డు దారులతో ముఖాముఖి మాట్లాడి సరుకుల సరఫరావిధానం, తూకాలు, నాణ్యత, పంపిణీ వేళలపై అడిగి తెలుసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే సరుకుల పంపిణీలో ఎలాంటి అక్రమాలులేదా అలసత్వం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి లబ్ధిదారుకు సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో సరుకులు అందేలా చూడాలని డీలర్లు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. తూకంలో తేడాలు వచ్చినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, డీటీలు ఉమామహేశ్వరరావు, పైడిరాజు, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.మాధురి బుధవారం పంపిణీ చేశారు. మండలంలోని లచ్చయ్యపేట సచి వాలయం పరిధిలో రీసర్వే పనులుపూర్తి చేసిన గ్రామాల్లో తప్పులులేని పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను ముమ్మరం చేసిందన్నారు. పట్టాదార్ పుస్తకాల్లో ఎక్కించవలసిన నంబర్లున్న ఆయా భూములకు సంబంధించిన లిఖిత పూర్వకంగా దఖలు పడిన రికార్డులతో తమదృష్టికి తేవాలన్నారు.అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుగర్ఫ్యాక్టరీలో ఉన్న బియ్యంగోదాంల నుంచి సుంకి పురుగుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, కాలువల సమస్యలున్నాయని కాలువలు, తాగునీరు, సుంకిఉరుగులునివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఆర్డీఓ ఆర్ మాధురి దృష్టికి తెచ్చారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్కుమార్ పాల్లొన్నారు. -
దుప్పాడలోని భూమి దేవదాయ శాఖదే
● ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు ● అసిస్టెంట్ కమిషనర్ శిరీష హెచ్చరికవిజయనగరం క్రైమ్: మండల పరిధిలోని దుప్పాడలో ఉన్న 4 ఎకరాల 62 సెంట్ల భూమి దేవదాయ శాఖకు చెందిందని దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష బుధవారం స్పష్టం చేశారు. సదరు భూమిని కొందరు కంచె వేసి ఆక్రమించుకున్నారని ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు రావడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీసుల సహాయంతో ఆ స్థలాన్ని నేరుగా పరిశీలించినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ స్థలం దుప్పాడ గ్రామస్తుల సంక్షేమానికి ఉద్దేశించినదని, గ్రామస్తులు మినహా వేరెవరైనా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలను తొలగించి, సదరు స్థలంలో రామాలయం నిర్మించాలని దుప్పాడ గ్రామస్తులు నిర్ణయించారని.. వారి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
సమస్యలపై శంఖారావం
శృంగవరపుకోట: దళిత, గిరిజన వాడల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమరమే సమస్యలపై శంఖారావం అని సిటు కార్యదర్శి మద్దిల రమణ చెప్పారు. దళితవాడలు, గిరిజన పల్లెల్లో ఉన్న సమస్యలను ప్రస్తావించి, పరిష్కారం కోసం పనిచేసేందుకే గత నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కేవీపీఎస్, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో శంఖారావం పేరుతో కార్యక్రమాలు చేశామన్నారు. కులవ్యవస్థ ఏరూపంలో ఉన్నదీ, దళితులు గిరిజనుల నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు పాలక ప్రభుత్వాలు ఎలా కల్పిస్తున్నాయి అనే అంశాలపై సర్వే చేశామన్నారు. దళితులకు శ్మశానవాటికలు లేవు. ఉన్నవాటికి సౌకర్యాలు లేవు. ఉన్నత వర్గాల వారికి శ్మశాన వాటికలవద్ద షెడ్, బోర్లు, కాంపౌండ్ నిర్మించారు. దళితులకు మాత్రం నీరుపారే గెడ్డల్లో సౌకర్యాల్లేకుండా వివక్ష చూపుతున్నారు. దళితులు గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పాలకులు, అధికారులు పట్టాలు మంజూరు చేయకుండా, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసి, చట్టప్రకారం భూమి ఇవ్వాలి. సాగులో ఉన్న వారికి పట్టాలు మంజూరు చేయాలి. మాన్సాస్, పోడు భూములు సాగు చేస్తున్న వారందరికీ కౌలురైతు పట్టా మంజూరు చేయాలి. , దళితులు, గిరిజనులు నివాసముంటున్న ప్రాంతంలో కాలువలు, సీసీ రోడ్లు తాగునీరు సమస్య పరిష్కారం చేయాలి. పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ బోర్డు నుంచి లోన్లు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని తహసీల్దార్ డి.శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన గిరిజన సంఘం నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, గిరిజనులు, దళితులు పాల్గొన్నారు. -
లక్షణంగా రప్పించి పొమ్మన్నారు..!
రాజాం: అంతన్నారు..ఇంతన్నారు..చివరకు చేతులెత్తేశారు..లక్ష రూపాయల ప్రైజ్ మనీ అంటూ ప్రచారం చేసి విద్యార్థులను ఆశపెట్టారు. పలుచోట్ల పోటీ పరీక్షలు పెట్టి విజేతలను ఎంపికచేసి, వివరాలు ప్రకటించారు. ప్రైజ్ మనీ మాత్రం ఇంతవరకూ ఇవ్వలేదు. ఈ తంతు ఎక్కడో జరగలేదు..జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు సందర్భంగా విద్యాశాఖ అధికారులు, జిల్లా అధికారులు చేసిన తతంగం. జిల్లాలో ఎయిర్పోర్టు ప్రారంభం సందర్భంగా నెలరోజుల ముందునుంచే ఆర్భాటం చేశారు. రూ.30 కోట్ల మేర ఖర్చు చేశారు. ఈ హడావుడిని విద్యాశాఖ మరింత ఎక్కువచేసింది. లోకేష్ బాబు చూస్తాడనో మెచ్చకుంటాడనో గొప్పలకు పోయింది. జిల్లా వ్యాప్తంగా తొలుత మండల స్థాయి, అనంతరం జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, ట్యాగ్లైన్ పోటీలను పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించింది. మండలంలో ప్రతి పోటీకి ఒక్కో విజేతను ఎంపికచేశారు. అనంతరం వారందరికి జిల్లా స్థాయిలో నిర్వహించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎంపికచేశారు. వారిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.1 లక్ష ప్రైజ్ మనీ ప్రకటించారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాలకు సైతం ప్రైజ్లు ఇస్తామని (నగదు ఎంతనేది చెప్పలేదు) అన్నారు. ఇలా నాలుగు విభాగాల్లో పాఠశాల, కళాశాల స్థాయిలో జిల్లా విజేతలతో పాటు మండల స్థాయిలో నాలుగు విభాగాల్లోని విజేతలను జూలై 31న భోగాపురం రావాలని పిలిచారు. ముందురోజు బహుమతులు ఇస్తామని, విద్యాశాఖ అధికారులతో సత్కారాలు జరుగుతాయని ఆర్బాటం చేశారు. సొంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వారిని భోగాపురం తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత వారిని పట్టించుకోకపోగా, పోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని, ప్రైజ్లు ఇంటికి పంపిస్తామని చెప్పి విద్యార్థులను వెనక్కు పంపించేశారు. ఆ సమయంలో బస్సులు లేక, అక్కడ వసతి లేక అటు విద్యార్థులు, ఇటు వారిని తీసుకెళ్లిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ రాత్రి నానా అవస్థలు పడి, పైవేట్ వాహనాలు ద్వారా ఇంటికి చేరుకున్నారు. వేలరూపాయల చేతిచమురు వదిలించుకున్నారు. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ అంటూ భారీ ప్రచారం చేసి, పోటీలు నిర్వహించి, విద్యార్థులకు ఆశలు పెట్టిన అధికారులు ఇంతవరకూ ప్రైజ్ మనీ విద్యార్థులకు అందించలేదు. భోగాపురం వెళ్లిన వారిని కనీసం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ప్రభుత్వ విద్యాశాఖ తీరు అంటూ మండిపడుతున్నారు. అధికారులు ఏమంటున్నారంటే.. భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించడం, విజేతలను భోగాపురం రమ్మని చెప్పడంపై జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు వివరణ ఇచ్చేందుకు ఫోన్ లిఫ్ట్చేసేందుకు నిరాకరించారు. రాజాం ఎంఈఓలు ప్రవీణ్కుమార్, యాగాటి దుర్గారావుల వద్ద సాక్షి ప్రస్తావించగా, మండల స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించామని, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.లక్ష ప్రైజ్మనీ ఇస్తామన్నారని చెప్పారు. మండల స్థాయి విజేతలను సైతం భోగాపురం రమ్మన్నారని, ఎటువంటి ప్రైజ్లు ఇంతవరకూ ఇవ్వని విషయం వాస్తవమేనని వెల్లడించారు. ఉన్నతాధికారులకు ఈ విషయంపై సమాచారం ఇచ్చామని, త్వరలో బహుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రైజ్మనీ అన్నారు..కామ్గా ఉన్నారు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ సందర్భంగా విద్యార్థులకు పలుపోటీపరీక్షలు జిల్లా స్థాయిలో ఎంపికలు ప్రథమ స్థానానికి రూ.1 లక్ష అంటూ ప్రకటనలు ముందురోజు రమ్మని ఆదేశాలు వెళ్లిన తరువాత వెనక్కు పంపించేసిన అధికారులు తిప్పలు పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు విజేతలకు ఇంతవరకూ అందని రూ.లక్ష పారితోషకం -
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్తో ఆర్థిక వెసులుబాటు
వీరఘట్టం: ఎల్నినో పరిస్ధితులను ఎదుర్కొంటూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవడానికి ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ డా. ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. మండలం తలవరం పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వరి, చేపల మిశ్రమ పెంపకం కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి పొలంలో దాదాపు 350 చేప పిల్లలను కలెక్టర్ తన చేతుల మీదుగా వదిలి, వినూత్న కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి లభ్యత తక్కువగా ఉన్న తరుణంలో, ఎల్నినో ప్రభావం ఉన్న సమయాల్లోనూ రైతులకు స్థిరమైన ఆదాయం అందించడానికి ఈ సమగ్ర వ్యవసాయ నమూనా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకే వనరు నుంచి అటు వరి పంటను, ఇటు చేపల దిగుబడిని పొందవచ్చునని ఇది రైతులకు ఆర్థికంగా మంచి వెసులబాటు ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోనే తొలిసారిగా ప్రారంభించిన మోడల్ కార్యక్రమం రైతులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర ప్రాంతాల రైతులు కూడా దీనిని స్ఫూరిగా తీసుకోవాలని సూచించారు. ఈ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో సాగులో ఉన్న వరి పంటను పరిశీలించారు. చీడ, పీడల నివారణ కోసం పంటలో పిచికారీ చేస్తున్న జీవామృతాల తయారీ విధానాన్ని ఏఓ జె.సౌజన్య వివరించారు. అనంతరం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో గట్టు మీద చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పొలం గట్టుపై మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్, జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీశంకర్, జిల్లా మత్య్సశాఖ అధికారి టి.సంతోష్కుమార్, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం ఎం.షణ్ముఖనాయుడు, తహసీల్దార్ వి.రాజేశ్వరరావు, ఎంపీడీఓ బి.వెంకటరమణ, సబివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
సంస్కృతికి ప్రతిబింబంగా ‘ఆదివాసీ దినోత్సవం’
పార్వతీపురం రూరల్ : గిరిజన హక్కుల పరిరక్షణ, వారి విలక్షణ సంస్కృతీ సాంప్రదాయాలను సమున్నతంగా చాటిచెప్పేలా జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) ఆర్.వైశాలి పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ ఆవరణలోని ‘గిరిమిత్ర’ హాల్లో వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, నాయకులతో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 9న ఉత్సవాలు జరగనుండగా, జిల్లా స్థాయిలో ఆగస్టు 8నే మిన్నంటేలా నిర్వహించేందుకు అధికారులు, గిరిజన సంఘాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆదివాసీల సమగ్ర అభివృద్ధితో పాటు వారి ఉనికిని, ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పీఓ పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సాంప్రదాయ గిరిజన నృత్యాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. గిరిజన వైభవాన్ని చాటిచెప్పే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, సంఘాల నాయకులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. -
ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు ప్రత్యేకశిక్షణ
● సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య నెల్లిమర్ల: ఈ ఏడాది విద్యార్థులకు ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు ఎక్సెలెనన్స్ సెంటర్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా నెల్లిమర్లలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో అధికారులు, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమంపై ఉన్న సామాజిక చిన్నచూపును, వివక్షను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో సంక్షేమం ప్రతి విద్యార్థి హక్కు అని, వసతి, భోజనం, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. రాష్ట్రంలో 1350 మంది శానిటరీ వర్కర్లను, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంక్షేమం, శాఖ ఒక కుటుంబమని, కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. గతంతో పోలిస్తే, వసతిగృహాల్లో సౌకర్యాలు, విద్య మెరుగుపడ్డాయని, టెన్త్, ఇంటర్ ఫలితాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.రూపవతి సమావేశానికి అధ్యక్షత వహించగా, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె .ఎస్. శ్రీనివాసచార్యులు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి వీహెచ్ రాధా కుమారి, కళాశాల ప్రిన్సిపాల్ ఉషారాణి, ఎస్డబ్ల్యూహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమానికి సిద్ధం కావాలి
పాలకొండ: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై యువత, విద్యార్థులు ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కల్యాణ ఏఎంజీ ఫంక్షన్ హల్లో నియోజకవర్గానికి ని సంబంధించి టౌన్ హల్ సమావేశం బుధ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్నికల ముందు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు రెండేళ్ల తరువా త డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థులను దగా చేశారని ఆరోపించారు. లోకేష్ యువగళం సభ్యుల కు ఉద్యోగాలు ఇవ్వడానికి కొత్త జీఓ తెచ్చి అక్రమాలకు పాల్పడి స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు కట్ట బెట్టారని తెలిపారు. అర్హులైన వారికి, మెరిట్ మా ర్కులు వచ్చిన వారికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ లిస్టు అభ్యర్థుల డేటాను మాయం చేశారని తెలిపారు. మొదటి ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు రాలేదో ప్రభు త్వం చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు. స్పోర్ట్ కోటాను 3 శాతంకు పెంచి 29 క్రీడలను 65కు పెంచారని వివరించారు. వారి నుంచి రూ. 15 లక్షలు చొప్పున తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై అభ్యర్థులు ఆధారాలతో కోర్టుకు వెళ్లారని, హైకోర్టు కూడా విచారణ జరపా లని ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఉన్న డిమాండ్లుపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ స్కామ్కు బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు నిరుద్యోగులు, యువత తరఫున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు యువతకు అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని కోరారు. సమావేశంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్త లు, పలు వర్గాల ప్రజలు పాల్గొన్నారు. -
అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించండి
మక్కువ: అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని శంబర, మక్కువ ప్రాంతాల్లోని పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో వైద్యారోగ్య సిబ్బందితో మంగళవారం సమావేశమైన ఆయన..వైద్యసేవలు, ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. 4డీ లక్షణాల గుర్తింపు లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆర్బీఎస్కే 2.0 స్క్రీనింగ్ పక్కాగా చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో గుండె జబ్బు, కేన్సర్, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, తగిన చికిత్స, వైద్య సలహాలు అందేలా చూడాలన్నారు. సంచార చికిత్స శిబిరాలతో పాటు గ్రామగ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎల్.శివాజీనాయుడు, ఆర్.చంద్రశేఖర్, బి.ఫణీంద్ర, సీహెచ్వో సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ
పార్వతీపురం రూరల్ : విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పార్వతీపురం, పాలకొండ, సాలూరు పట్టణాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలను ఎస్ఈ పి.త్రినాథరావు ప్రారంభించారు. ప్రజలు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు ముందస్తు భద్రతా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇళ్ల నిర్మాణ సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడాలని ఎస్ఈ సూచించారు. భవనాలపైకి ఇనుప రాడ్లు, పరంజా సామగ్రి తీసుకెళ్లే సమయంలో విద్యుత్ శాఖ అధికారుల అనుమతితో లైన్ క్లియరెన్స్ పొందాకే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇటీవల దుకాణాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టే క్రమంలో లైన్ల స్పర్శ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అవగాహన లోపమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇళ్లలో నాణ్యమైన పరికరాలనే వినియోగించాలని, తడి బట్టలు లేదా తడి చేతులతో స్విచ్లను తాకరాదని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది ప్లకార్డులతో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. -
బడ్జెట్ తలకిందులవుతోంది!
నెలవారీ వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం వరకు రూ.1,300 ఉన్న 26 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు ఏకంగా రూ.1,700 దాటిపోయింది. సన్నబియ్యం కొందామంటేనే భయమేస్తోంది. బియ్యం ధరలకు తోడు అన్ని సరుకుల ధరలూ పెరిగిపోవడంతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. నూకల ధరలు కూడా మండిపోతుండటంతో సామాన్యులు బతకడం కష్టంగా మారింది. అక్రమ నిల్వలపై తనిఖీలు చేసి, ప్రభుత్వం వెంటనే ధరలను నియంత్రించాలి. – అంబటి సురేష్, ప్రైవేటు ఉద్యోగి, నర్సిపురం ● -
పనసవలస విద్యార్థికి గోల్డ్ మెడల్
రేగిడి: మండలంలోని పారంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కడగల కార్తీక్కు రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్(స్వర్ణ పతకం) లభించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.సునీత ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి రన్నింగ్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో విద్యార్థి పాల్గొని, విశేష ప్రతిభ కనబరచడంతో స్వర్ణ పతకం వరించిందన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి, ఐదో స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులంతా సదరు విద్యార్థిని అభినందించారు. అదనపు ఎస్పీ పరిశీలన సీతానగరం: మండల కేంద్రంలోని మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న వక్కలగడ్డ సురేష్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగి బంగారు ఆభరణాలు అపహరణకు గురికాగా ఆ ఇంటిని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. చోరీ జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని, నిత్యం జనసంచారం ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చన్నారు. ఆయన వెంట ఎస్ఐ హేమలత తదితరులు ఉన్నారు. ‘హోటల్ మేనేజ్మెంట్’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంవిజయనగరం క్రైమ్: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం ఇన్చార్జ్ శివరామకృష్ణ ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా తిరుపతిలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు స్పష్టం చేశారు. బీఎస్సీ(హెచ్హెచ్ఏ) మూడేళ్ల కోర్సుకు ఇంటర్మీడియట్లో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. క్రాఫ్ట్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్కు ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు అందుబాటులో ఉందని, ఈ కోర్సులో ప్రవేశానికి ఎటువంటి వయోపరిమితి లేదన్నారు. ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఏపీ పర్యాటక హోటళ్లు, ఫైవ్స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు బ్యాంకు లోన్ సదుపాయం ఉంటుందని, బాలబాలికలకు వేర్వేరుగా వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలకు అందజేయాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 9701343846, 9100558006, 9700440604లను సంప్రదించాలని కోరారు. ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలి● జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్పార్వతీపురం రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, వరినాట్లకు నీటి కొరత ఏర్పడిందని, రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీ శంకర్ ఓ ప్రకటనలో మంగళవారం సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 28,883 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోందని, ప్రస్తుతం నారుమడులు సిద్ధంగా ఉన్నప్పటికీ, దమ్ము చేసి వరినాట్లు(ఉభాలు) వేయడానికి తగినంత నీరు లేదన్నారు. ఎల్నినో వల్ల ఏర్పడిన ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. మెట్టు, కాలువ చివరి భూముల్లో రాగులు, కొరల్రు, మినుము, పెసర వంటి పంటలు వేసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా వివాహిత మృతి విజయనగరం టౌన్: అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన స్థానిక పట్టణంలోని కేఎల్ పురంలో మంగళవారం జరిగింది. ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి..కేఎల్ పురంలో నివాసం ఉంటున్న మేడపల్లి లావణ్య(31) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయిందని, ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. మృతురాలి భర్త వృత్తి రీత్యా దుబాయ్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తల్లి రమణి ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఏఎస్ఐ రామలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
యువ గుండెకు ఏమైంది?
యువత గుండె అకస్మాత్తుగా ఆగిపోతోంది..దృఢంగా ఉన్న వారు సైతం కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో గుండెపోటు బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. ఇటీవల గుండెపోటు మరణాల్లో యువత సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానం, ఆహారపు అలవాట్లే హార్ట్ ఎటాక్కు కారణం కాగా జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలానికి చెందిన లక్ష్మి అనే 35 ఏళ్ల మహిళ గుండెపోటుకు గురికావడంతో బంధువులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇదిలా ఉంటే ఇదే విజయనగరానికి చెందిన గోపి అనే 34 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు బారినపడ్డాడు. బంధువులు అప్రమత్తమై విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స అనంతరం డిశార్జ్ అయ్యారు. హార్ట్ఎటాక్ లక్షణాలు ఇవీ.. గుండెపోటుకు గురైన సమయంలో ఛాతిలో నొప్పి విపరీతంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా చెమట పడుతుంది. వాంతులు వచ్చే భావన కలుగుతుంది. ఒక్కోసారి వాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లూ చేతులు చల్లబడతాయి. గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా ఏదో బరువు ఛాతిపై పెట్టినట్లు అనిపిస్తున్నా..శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండెపోటు సూచనగానే భావించాలి. ఛాతిలో వచ్చిన నొప్పి.. ఎడమ చేయి భుజంలోకి పాకుతున్నా, విపరీతంగా చెమట వస్తున్నా హార్ట్ ఎటాక్గానే అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా గుండెజబ్బుగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుండెపోటుకు గురవుతున్న యువత పెరుగుతున్న ఆకస్మిక మరణాలు జీవనశైలిలో స్వల్ప మార్పులతో హృదయం పదిలం: వైద్య నిపుణులు అంతా 25 నుంచి 35 ఏళ్లలోపు వారే.. జిల్లాలో తక్కువ వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు గుండెపోటుకు గురియ్యేవారు. ప్రస్తుతం 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అధికంగా గుండె జబ్బుల బారినపడుతున్నారు. గతంలో పౌష్టికాహార విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్కు అలవాటు పడుతున్నారు. ఫలితంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి హార్ట్ ఎటాక్(గుండెపోటు)కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. -
టీచర్లకు టెట్ కష్టాలు!
నేటి నుంచి టెట్ రామభద్రపురం: విద్యార్హత, వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ఉత్తీర్ణత నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో పాటు టీచర్లకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ పరీక్ష తప్పకుండా రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక అయ్యవార్లు తలలు పట్టుకుంటున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించడంతో 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా, టీచర్లకు టెట్ కష్టాలు తెచ్చిపెట్టిందని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. టీచర్లకు టెట్ కష్టాలు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో సమానంగా టీచర్లు కూడా 150 మార్కులకే టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పదిహేను, ఇరవై ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు మళ్లీ టెట్ అర్హత పరీక్షలు రాయాల్సి రావడం సవాల్గా మారింది. ఎస్టీటీలు ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్, సైకాలజీ సిలబస్లలో 150 మార్కులు రాయాల్సి ఉండగా స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లిష్, తెలుగు టీచర్లు ఇంగ్లిష్తో పాటు తెలుగు సిలబస్ ఉంటుంది. సైన్స్, గణితం, సోషల్ టీచర్లు తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సిలబస్ను రాయాలి. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు అందరూ సైకాలజీ సిలబస్ కూడా రాయాల్సి ఉంది. కొత్త సిలబస్, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రాయాల్సి ఉండడంతో అయ్యవార్లలో ఆందోళన కలిగిస్తోంది. 3 కేంద్రాలు.. 12,358 అభ్యర్థులు నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ నేటి నుంచి 16వ తేదీ వరకు టెట్ ఆందోళనలో అయ్యవార్లు తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు టెట్ కష్టాలు తప్పలేదని ఆవేదన విజయనగరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షకు 12,358 మంది హాజరు కానున్నట్టు వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించటంతో అభ్యర్థులు నిర్ణీత సమయానికి అరగంట ముందుగా పరీక్ష కేంద్రంకు హాజరు కావాలని సూచించారు. డెంకాడ మండలం చింతలవలసలో డాక్టర్ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగ వద్దనున్న సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అయాన్ డిజిటల్ జోన్లో జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రతి రోజు మూడు కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమని, అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్/పాన్/ ఓటరు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షకు సంబంధించి ఎటువంటి సందేహాలు, సమస్యలు నివృత్తి చేసుకునేందుకు 95503 94572, 96180 42932, 99895 68641 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్
విజయనగరం అర్బన్: స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో చాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్ సెంట్రల్, బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింబోసిస్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ ఒ.నరేష్కుమార్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు విస్తృతంగా ఏర్పడ్డాయన్నారు. ముఖ్యంగా విజయనగరంలో సరికొత్త పెట్టుబడులు పెట్టే వారికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అన్నారు. సరికొత్త పారిశ్రామిక టెక్నాలజీ ప్రాజెక్టులపై గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ రమాదేవి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం : సబ్ కలెక్టర్
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9న ఘనంగా నిర్వహిద్దామని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై గిరిజన సంఘాల నాయకులతో మంగళవారం ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆహార కమిటీ, ఆహ్వాన కమిటీ, సాంస్కృతిక కమిటీ తదితర కమిటీలను నియమించనున్నట్టు తెలిపారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆదివాసీ దినోత్సవం ఒక వేదిక అన్నారు. వేడుకల నిర్వహణలో గిరిజన సంఘాల నాయకులు, పెద్దలు, యువత, మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న గిరిజన జేఏసీ నాయకులు ఉత్సవాల నిర్వహాణపై పలు సలహాలు సూచనలిచ్చారు. సమావేశంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఆదివాసీ జేఏసీ నాయకులు బి.శ్రీనివాసరావు, బి.ఉమామహేశ్వరరావు, బి.రామ్మోహన్రావు, ఎం.రవికుమార్, ఎన్.కాంతారావు, జె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘దివిసీమ గాంధీ’ మండలికి పోలీసుల నివాళి పార్వతీపురం రూరల్ : ‘దివిసీమ గాంధీ’గా గుర్తింపు పొందిన మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి, ఇతర అధికారులు మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, విద్యా వికాసం, తెలుగు భాషా పరిరక్షణకు మండలి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దివిసీమలోని నిరుపేదలకు వేలాది ఎకరాల బంజరు భూములను పంపిణీ చేసిన ఆయన జీవితం, సేవాభావం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి, సీఐలు రమణమూర్తి, వెంకట్రావు, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఏఏఓ బాలరాజు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల పార్వతీపురం రూరల్: రాష్ట్రంలో ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిందని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 5 నుంచి 20 వరకు హెల్ప్డెస్క్లో ధ్రువపత్రాల పరిశీలన, 12, 13 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 20న ఆప్షన్ల మార్పులకు అవకాశం కల్పించారు. ఆగస్టు 26న సీట్ల కేటాయింపు ఉంటుందని, 27 నుంచి 29వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో చేరా లని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వసతిగృహం, డిజిటల్ తరగతులు, గ్రంథాలయం, ల్యాబ్లు తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రవేశాలు, ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. పాలకొండలో భారీ వర్షం పాలకొండ రూరల్: మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు.. సాగులో వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు పాలకొండలో మంగళవారం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఉరుములు, మెరుపులతో సుమారు 40 నిమిషాల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో రైతులు ఊరట చెందారు. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ వర్షంతో రైతులు పొలం బాట పట్టారు. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. -
ఇబ్బందులకు గురవుతున్నారు..
డీఎస్సీ అమలు నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధన తెరపైకి తీసుకురావడం సరైంది కాదు. దీని వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే బాగుండేది. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. – జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్, బొబ్బిలి -
టెన్త్ ఉత్తీర్ణులు ఇంటర్లో చేరాలి : కలెక్టర్
పార్వతీపురం: జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్లో ఏదో ఒక కళాశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత శాఖల అధికారులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, సంక్షేమ వసతిగృహాల్లో కేటాయించిన సీట్లను వందశాతం భర్తీ చేయాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేయని యువత, ఉద్యోగులు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంటర్మీడియెట్, డిగ్రీలో ప్రవేశాలు పొందేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎల్నినోపై రైతులకు అవగాహన కల్పించాలి ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, లాభదాయక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మార్ట్ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో ప్రతీ రోజు శిక్షణలు నిర్వహించాలని, పంట బీమా శాతం వందకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాలూరులో మిలెట్ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల మహిళలు, వేలాది మంది రైతులకు ఉపాధి, ఆదాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. జీడి తోటల్లో అంతర్ పంటలు, పాఠశాలల్లో నర్సరీలు, చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పౌష్టికాహార లోపంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ పురోగతిపై జూమ్ సమావేశంలో సమీక్ష నిర్వహించిన ఆయన అంగన్వాడీ సేవలను క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ అధికారులు, సీడీపీఓలు, ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ వరాలేవీ?
విజయనగరం గంటస్తంభం: భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఇటీవల వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర వాసులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెనుదిరిగారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడమంటే ఇదేనా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. మంగళవారం విజయనగరానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి, కాసేపు మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చివరకు ఈ ప్రాంత ప్రజల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు. భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయానికి భోగాపురం పేరు కాకుండా వైజాగ్–జీఎంఆర్ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభ ఆద్యంతం పరస్పర ప్రొగడ్తలకే పరిమితమైందన్నారు. విజయనగరం జిల్లా వాసుల మనోభావాలు దెబ్బతీయకుండా విమానాశ్రయానికి భోగాపురం పేరును కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు.. ఉత్తరాంధ్రలో నాగావళి–వంశధార నదుల వివాదం, కొటియా గ్రామాల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, మూతపడిన పరిశ్రమలు, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై ప్రధాని మోదీ స్పందించ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు డోలీల్లో రోగులను తరలించే పరిస్థితులు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మోదీని పొగిడేందుకే కార్యక్రమం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, నాయకులు బుగత అశోక్, అలమండ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చి ఎలాంటి హామీలు ఇవ్వలేదు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి హామీలిస్తారోనని వేచి చూసిన వారికి తీవ్ర నిరాశ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య -
దుకాణానికి వెళ్లాలంటే..
కిరాణా దుకాణానికి వెళ్లాలంటేనే భయపడుతున్నాం. చిల్లరగా కిలో సన్నబియ్యం కొనాలంటే రూ.65 పైనే చెల్లించాల్సి వస్తోంది. బ్రాండ్ల పేరుతో, 26 కిలోల ప్యాకింగ్ నెపంతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. కూలి నాలి చేసుకునే మాలాంటోళ్ల బతుకు మరింత భారంగా మారింది. రెక్కల కష్టం బియ్యం కొనుగోలుకే సరిపోతోంది. మార్కెట్లో అధికారుల పర్యవేక్షణ, ధరల నియంత్రణ ఏమాత్రం కనిపించడం లేదు. సామాన్యుల కష్టాలను గుర్తించి ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. –ఎమ్.కుసుమ, గృహిణి, పార్వతీపురం ● -
గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సామర్లకోట: గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన చట్టాలపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు పెసా చట్టంపై మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రసాదరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంత పరిపాలనలో కీలకమైన పెసా చట్టం, గిరిజన ఉప ప్రణాళిక అమలుకు అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలన్నారు. 10 రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాలకు పెసా చట్టం వర్తిస్తుందని తెలిపారు. అటవీ హక్కుల చట్టం అమలుపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. గిరిజనుల భూమి, నీరు, అటవీ వనరులు, సంస్కృతి, పాలనా వ్యవస్థలపై వారి హక్కులను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గిరిజన చట్టాలు, ఉప ప్రణాళికపై విస్తృత అవగాహనతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయవచ్చునని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, డీడీఓ శర్మ, పెసా చట్టం రాష్ట్ర కో ఆర్డినేటర్ సంతోష్, ఎంపీడీఓ సుశీల, డిప్యూటీ ఎంపీడీఓలు చక్రపాణిరావు, చిన్నబ్బులు, ఫ్యాకల్టీలు శ్రీనివాసు, సుమాంజలి, నరేష్ పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
విజయనగరం గంటస్తంభం: పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని, తొలుత భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం భూముల రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22–ఎ దరఖాస్తులు, రెవెన్యూ వన్, పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారం వంటి వాటిపై సమీక్షించారు. ఆగస్టు నెలకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను మూడు రోజుల్లోగా పంపిణీ చేయాలని, సెప్టెంబరు నెలాఖరులోపు 50 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి కావాలని, ఫేజ్–3లో పెండింగ్లోని పాస్పుస్తకాల పంపిణీని కూడా వెంటనే చేపట్టాలన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించాలి.. జీవో నంబరు 444 కింద వీఆర్వో, ఎంపీడీవో లాగిన్లలో ఉన్న 22–ఎ దరఖాస్తులను ఈ నెలలోనే పరిష్కరించాలని, ఏ దరఖాస్తు పెండింగ్లో ఉండకూడదని అధికారులకు జేసీ స్పష్టంచేశారు. రెవెన్యూ వన్ స్కానింగ్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఐదో స్ధానంలో ఉందని, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి, మరింత మెరుగైన ర్యాంకు సాధించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలన్నారు. సమావేశానికి డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సర్వే ఏడీ విజయ్కుమార్, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆన్లైన్లో హాజరయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలి అధికారులతో సమీక్ష సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్ -
మాజీ సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్సీ విక్రాంత్
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాలకొండకు చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్..తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. – పాలకొండ రూరల్ నకిలీ వైజాగ్ టీఎంటీపై హెచ్చరికవిజయనగరం: వైజాగ్ టీఎంటీ పేరుతో మార్కెట్లో నకిలీ, నాసిరకం టీఎంటీ రీబార్లు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విశాఖ ఉక్కు కర్మాగారం(ఆర్ఐఎన్ఎల్) వెల్లడించింది. గృహ నిర్మాణదారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు అసలైన వైజాగ్ టీఎంటీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. నాసిరకం ఉక్కు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడంతో భవనాల భద్రత, బలం, మన్నికపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రతి అసలైన రీబార్పై వైజాగ్ టీఎంటీ బ్రాండింగ్తో పాటు ఆర్ఐఎన్ఎల్ గుర్తు స్పష్టంగా ఉంటుందని, కొనుగోలు సమయంలో వాటిని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉత్పత్తి అసలు ధనంపై సందేహాలుంటే సమీప ఆర్ఐఎన్ఎల్ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. ప్రజల భద్రత దృష్ట్యా నకిలీ ఉత్పత్తులకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. -
బ్లేడ్తో గొంతు కోసుకొని..
● వంగర పోలీస్స్టేషన్ వద్ద తలగాం వాసి ఆత్మహత్యాయత్నంవంగర: స్థానిక పోలీస్స్టేషన్ వద్ద తలగాం గ్రామానికి చెందిన కిమిడి సునీల్ గొంతు కోసుకొని మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎస్ఐ షేక్ శంకర్ తెలిపిన వివరాలిలా.. కొన్నాళ్ల క్రితం సునీల్ ఎం.సీతారాంపురానికి చెందిన శ్రీలతను వివాహం చేసుకున్నాడు. భర్త సునీల్, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని శ్రీలత వంగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త సునీల్తో పాటు ఆమె అత్తమామలపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇరువర్గాలను మంగళవారం పోలీస్స్టేషన్కు పిలిపించగా ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇస్తుండగా ఈ కేసులో పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ స్టేషన్లోనే సునీల్ బ్లేడుతో గొంతు, చేయి భాగం కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు అతడిని రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల తాళ లేకనే సునీల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు బంధువుల ఆరోపణ. -
ఉద్యోగుల క్రికెట్ సమరం
పార్వతీపురం రూరల్: జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆమోదంతో నిర్వహించిన స్పోర్ట్స్ ఈవెంట్స్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఉద్యోగుల మధ్య మైత్రీభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. క్రీడాకారులు మైదానంలో క్రీడాస్ఫూర్తిని చాటగా, క్రికెట్ ఇన్చార్జ్ లక్ష్మణ్ జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీలో భాగమైన ‘పూల్–ఎ’ మ్యాచ్ల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. మొత్తం 18 ప్రభుత్వ శాఖల జట్లు ఈ పూల్లో పోటీపడుతున్నాయి. తొలి విడతలో వీబీ–జీ రామ్జీ వర్సెస్ పశుసంవర్ధక, వైద్యారోగ్య వర్సెస్ ఆడిట్, ఇరిగేషన్ వర్సెస్ పంచాయతీరాజ్, కలెక్టరేట్ వర్సెస్ ఏపీఈపీడీసీఎల్, మున్సిపల్ వర్సెస్ అగ్రికల్చర్, ట్రైబల్ వెల్ఫేర్ వర్సెస్ ఎస్సీఎస్డబ్ల్యూ, పౌరసరఫరాలు వర్సెస్ ట్రెజరీస్, రెవెన్యూ వర్సెస్ సర్వే జట్లు తలపడనున్నాయి. విద్యాశాఖ, పీఆర్ ఎడ్యుకేషన్ జట్లు తదుపరి రౌండ్లలో విజేతలతో పోటీపడతాయి. మొదటి రౌండ్ విజేతలు తర్వాతి దశలు, సెమీఫైనల్స్ (ఎం–15, ఎం–16) దాటుకుని ’పూల్–ఎ’ విజేతను నిర్ణయించే ఆఖరి ఫైనల్ (ఎం–17) పోరుకు చేరుకుంటాయి. -
బిడ్డకు తల్లిపాలే శ్రీరామరక్ష
పార్వతీపురం రూరల్: పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలల వరకు తల్లిపాలే శ్రీరామరక్ష అని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.విజయలక్ష్మి స్పష్టంచేశారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం పార్వతీపురంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిబ్బందితో తల్లిపాల ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. శిశువుకు తల్లిపాలు సంజీవనిలా పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో డీఐఓ డా.వై.విజయ్ మోహన్, ఆర్బీఎస్కే పీఓ డా.టి.జగన్మోహనరా వు, డీపీఎంఓ రవికుమార్ రెడ్డి, డీఎంఓ సూర్యనారాయణ, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్, డీపీఓ లీలారాణి, డీపీహెచ్ఎన్ఓ విజయలక్ష్మి, డీసీఎం విజయలత, సూపర్వైజర్లు పుష్ప, ఇందిర, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
రాజాం సిటీ: ఏమరపాటుగా ఉన్న ప్రయాణికులను టార్గెట్గాచేసుకుని చోరీకి పాల్పడిన నిందితులను రాజాం పోలీసులు పట్టుకున్నారు. ఐదు నెలల క్రితం చీపురుపల్లి నుంచి రాజాం మీదుగా స్వగ్రామానికి ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తల దగ్గర బంగారు నగలు చోరీచేసి పరారైన వారిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకుని సంబంధిత బాధితులకు సోమవారం బంగారం అప్పగించారు. ఇందుకు సంబంధించిన టౌన్ సీఐ డి.నవీన్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలం సతివాడ గ్రామానికి చెందిన మరిశర్ల భాగ్యలక్ష్మి, భర్త సూర్యనారాయణలు ఈ ఏడాది మార్చి 3న సికింద్రాబాద్ నుంచి రైలులో వస్తూ చీపురుపల్లిలో దిగారు. అక్కడి నుంచి రాజాం మీదుగా స్వగ్రామం వెళ్లేందుకు ఆటో ఎక్కారు. రాజాం చేరుకుని ఆటో దిగి వారితో తీసుకువచ్చిన బ్యాగును చూసుకున్నారు. అందులో ఉన్న ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను ఉత్తరప్రదేశ్కు చెందిన మెహర్వాన్ ఆలీ, ఇర్షాద్ ఆలీగా గుర్తించారు. రాజాం ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్, విజయనగరం సీసీఎస్ బృందంతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లి నిందితులను అరెస్టుచేసి వారి నుంచి బంగారునగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత బాధితులకు సోమవారం బంగారం నగలను అప్పగించామని సీఐ తెలిపారు. -
అలసత్వం వద్దు
ప్రజా సమస్యల పరిష్కారంలో పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మే రకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రత్యేక ఉపకలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఎస్డీసీ డి. ధర్మరాజులతో కలిసి మొత్తం 69 వినతులను స్వీకరించారు. వాటిలో 16 రెవెన్యూకు సంబంధించినవి కాగా 53 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయని గుర్తుంచుకుని, సాంకేతిక కారణాలతో కేసులను మూసివేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, ఫిర్యాదుదారు సంతృప్తి చెందిన తరువాతే పీజీఆర్ఎస్ పోర్టల్లో పరిష్కరించినట్లు నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరుపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు నాణ్యత, రైతుభరోసా, విద్యుత్ బిల్లు, గోకులం షెడ్ల బకాయిలు, భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్పుస్తకాలు, భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. గడువులోగా ఫిర్యాదుల పరిష్కారం: ఎస్పీ పార్వతీపురం రూరల్: ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దిష్ట గడువులోగా సత్వరమే పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల్లోని వాస్తవాలను విచారణ చేసి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ప్రతి వారం పీజీఆర్ఎస్కు వచ్చే సమస్యలు తక్షణం పరిష్కరించాలని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఇచ్చిన వినతులు ఎంతవరకు పరిష్కారమయ్యాయనేది వారికి ఫోన్ చేసి అడగాలన్నారు. క్యూఆర్ కోడ్ కూడా ప్రారంభించామన్నారు. అనంతరం మొత్తం 15 వినతులు స్వీకరించారు. కుక్ ఉద్యోగం నుంచి అటెండర్ ఉద్యోగానికి ప్రమోట్ చేయాలని ఎస్ఎస్ మణుగుకు చెందిన కె.శ్రీరాములు కోరాడు. మర్రిపాడు, పూతికవలస రహదారి మరమ్మతులు చేయాలని, బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని పత్తిక కుమార్ వినతిపత్రం అందజేశాడు. పవర్టిల్లర్లు ఇప్పించాలని పెద్దగూడకు చెందిన సవర సాంబయ్య, సుక్కయ్యలు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, డీపీఎం ఎం.వి.రమణ, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూ రీ –సర్వే పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రీసర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతోపాటు పీజీఆర్ఎస్, ఇతర రెవెన్యూ పెండింగ్ దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని సూచించారు. సరిహద్దు వివాదాలు, రెవెన్యూ రికార్డుల దిద్దుబాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ మాధురి, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పాలకొండ: పాలకొండ గృహ నిర్మాణ శాఖ ఏఈ సుధారాణిపై పీడీ ధర్మరాజు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. పాలకొండ మండల గృహనిర్మాణ శాఖ పోస్టు నుంచి తప్పించి వీరఘట్టం ఏఈకి ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏఈపై ఇటీవల పాలకొండ పట్టణంలోని సచివాలయ వార్డు ఇంజినీర్లు నగరపంచాయతీ కమిషనర్తోపాటు గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమకు సంబంధం లేకుండా తమ లాగిన్ నుంచి గృహనిర్మాణ శాఖ లబ్ధిదారులకు సిమెంట్ అందించకుండా అందించినట్లు ఏఈ నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ ఈఈ సోమేశ్వరరావు లబ్ధిదారులను విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర వేడుకలను దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లను లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాలు, స్టాళ్లు, సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉండాలని చెప్పారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరిస్తామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు. -
ప్రభుత్వ ఉద్యోగులు నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేయాలి
పార్వతీపురం: ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులను తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేర కు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి చేయని శాఖలు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే సోమవారం నాటికి 100 శాతం రిజిస్ట్రేషన్లు సాధించాలని సూచించారు. ఈ నెలాఖ రు నాటికి కనీసం 54 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేశారు. కోర్సుల ప్రగతిని ప్రతినెలా సమీక్షిస్తామని, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోన్ ఇన్కు స్పందన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యానాణ్యత, విద్యార్థుల సంక్షేమంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి సోమవారం నిర్వహించిన ప్రత్యేక ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 15మండలాల నుంచి మొత్తం 58 కాల్స్ వచ్చాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యానాణ్యత, సంక్షేమ కార్యక్రమాలపై సూచనలు, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ‘‘మన్యం డ్యాన్స్’’ ‘‘మెగా కోలాటం’’ ‘‘ ఆనందలహరి’’ ‘‘ ముస్తాబు’’ వంటి వినూత్న కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి, విద్యార్థుల ప్రవేశాలు, హాజరు మెరుగుపడ్డాయని పలువురు అభినందించారు. విద్యార్థుల సామర్థ్యాలు, అభిరుచులను గుర్తించేందుకు సైకో మెట్రిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో విద్యారంగ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని కలెక్టర్ తెలిపారు. -
కలెక్టరేట్లో కష్టాల నివేదన
● వెల్లువెత్తిన అర్జీలుపార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ గోడును కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డికి విన్నవించుకున్నారు. భూకబ్జాలు, ఉపాధ్యాయుల కొర త, సంక్షేమ పథకాలు అందకపోవడం తదితర స మస్యలతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. కాళ్లు చేతులు లేని ఆ దేహాన్ని మోసుకుంటూ ఓ భార్య పడుతున్న ఆరాటం..అన్యాయాన్ని ఎదిరించలేక ఆ దివ్యాంగుడి కళ్లలో ఉబికివస్తున్న ఆవేదన..సోమవారం కలెక్టరేట్లో అందరినీ కలిచివేసింది. బలిజిపేట మండలం పెద్దింపేటకు చెందిన వెన్నెల వెంకటరాజు అనే వృద్ధ దివ్యాంగుడికి గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 53–7, 53–9 స్థలంలో 2018లో వెన్నెల దామోదర్ అనే వ్యక్తి తాత్కాలికంగా ఇల్లు కట్టుకునేందుకు రేకుల షెడ్డు, పశువుల పాక వేశాడు. ఇప్పుడు ఆ స్థలం ఖాళీ చేయమంటే దిక్కున్న చోట చెప్పుకోమంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడు. ఊరి పెద్దలు చెప్పినా పెడచెవిన పెడుతున్నాడు. ‘అయ్యా.. నేను కదలలేని వాడిని. నా చేతకానితనాన్ని ఆసరాగా తీసుకుని నా స్థలాన్ని మింగేయాలని చూస్తున్నాడు.. ఆ కబ్జాకోరు బెదిరింపుల నుంచి కాపాడి నా స్థలం నాకు ఇప్పించండి సారూ‘ అంటూ వెంకటరాజు తన భార్య సాయంతో అధికారుల ముందు కన్నీటిపర్యంతమయ్యాడు. బడికి వెళ్తున్నామన్న సంబరమే తప్ప..అక్కడ తమకు పాఠాలు చెప్పే పంతుళ్లు ఎవరొస్తారో ఆ పసిబిడ్డలకు తెలియదు. నిన్న వచ్చిన సారు ఇవాళ రాడు. ఇవాళ వచ్చిన సారు రేపు రాడు. ఇది మక్కువ మండలం అలుగరువు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల దుస్థితి. 1 నుంచి 4వ తరగతి వరకు 45 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న ఈ బడిలో గత రెండేళ్లుగా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేడు. అంతా డిప్యుటేషన్ల మీదే నెట్టుకొస్తున్నారు. రోజుకో టీచర్ వస్తుండడంతో ఆ పసివాళ్ల చదువులు అగమ్యగోచరంగా మారాయి. నిబంధనల ప్రకారం కనీసం ఇద్దరు రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిన చోట, ఒక్కరూ లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ‘మా పిల్లల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది సారూ.. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకై నా కనీసం ఇద్దరు సీఆర్టీలనైనా నియమించి ఆ గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేయండి అంటూ పాఠశాల కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దళితుల భూములపై పెత్తందారుల కన్ను మక్కువ మండలం పాపయ్యవలసలో 50 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన డీ–పట్టా భూములను కాజేసేందుకు కొందరు పెత్తందార్లు రెవెన్యూ అధికారుల అండతో యత్నిస్తున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది. తక్షణమే ఆ భూములను రీ–సర్వే చేసి దళితుల పేరిట ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. -
‘తల్లికి వందనం’ ఏదీ సారూ..!
కలెక్టరేట్ ప్రాంగణంలో ఓ తల్లి చేతిలో ఓ సాధారణ కాగితం..దానిపై వచ్చీరాని అక్షరాలతో రాసిన అర్జీ..పక్కన బిక్కుబిక్కుమంటూ నిలబడిన ఐదో తరగతి చదువుతున్న కూతురు. ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అమాయకత్వంతో పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందిన నిమ్మ దేవి అధికారుల ముందుకు వచ్చింది. ‘అయ్యా నాకు రావాల్సిన ’తల్లికి వందనం’ డబ్బులు రాకుండా చేశారని మాకు మీరే న్యాయం చేయాలి‘ అంటూ ఆ తల్లి అధికారులకు విన్నవించేందుకు తన కుమార్తెను వెంటేసుకుని, వచ్చీరాని రాతతో ఆ అమాయకపు తల్లి తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఫిర్యాదు చేసింది. అలాగే ఇదే విషయమై, సాంకేతిక కారణాలతో ’తల్లికి వందనం’ సాయం జమకాలేదంటూ మరో 11 మంది మహిళలు సైతం ప్రజావాణిలోని ప్రత్యేక కౌంటర్లో అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. -
ఎయిర్పోర్టు ప్రారంభం రాజకీయ ఆర్భాటమే
విజయనగరం గంటస్తంభం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచార వేదికగా మార్చిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. రైతుల భూములతో నిర్మించిన విమానాశ్రయానికి విజయనగరం జిల్లా పేరు పెట్టకుండా విశాఖపట్నం పేరు పెట్టడం అన్యాయమన్నారు. నిర్వాసిత రైతులకు పూర్తి పరిహారం, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కల్పించలేదని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమన్నారు. ఉపాధి కల్పన, స్ధానిక యువతకు ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకరరావు, టీవీ రమణ పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం తగదు
● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో 189 వినతుల స్వీకరణవిజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 189 వినతులు స్వీకరించారు. ఇందులో 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రతి వినతిని నిర్దేశిత గడువులో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యంతో విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడిన తర్వాతే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికల్లో నమోదు చేయాలని సూచించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి భూ వివాదాలు, సర్వే సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున క్షేత్రస్ధాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిరంతరం సమీక్షించాలని సూచించారు. 1100 ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్ఫ్రీ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజల్లో ఈ సేవలపై మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాఖల వారీగా వినతులు పంచాయతీరాజ్–30, డీఆర్డీఏ– 18, గ్రామ సచివాలయ శాఖ– 15, విద్య–13, ఇతర శాఖలు–12, విద్యుత్–9, మున్సిపల్–8, వైద్య ఆరోగ్య శాఖ–5, డీసీహెచ్ఎస్–1. చట్టపరిధిలో సత్వరన్యాయం: 21 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ దామోదర్ విజయనగరం టౌన్: చట్టపరిధిలో బాధితులకు సత్వరన్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ అహర్నిశలూ శ్రమిస్తుందని, బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 21 మంది బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విని వాటికి సంబంధించిన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. తమ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యలను పూర్తిగా విని, వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి
పార్వతీపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో క్లెయిమ్లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకుడు, రాష్ట్ర సీసీఎల్ఏ అదనపు కార్యదర్శి జె.వెంకటరమణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డితో పాటు ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫామ్–6, 7, 8లు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచుకోవాలని, తొలగించిన, సవరించిన పేర్ల జాబితాలను గ్రామ, మండల కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. ఓటర్ హెల్ప్లైన్ యాప్, ఆన్లైన్ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా 18ఏళ్లు నిండే యువతను గుర్తించి కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఆర్.వైశాలి. డీఆర్ఓ కె. హేమలత, ఆర్డీఓ కె. మాధురి, పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కరువు ముప్పు..!
కనుచూపు మేరలో..బొబ్బిలి: జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో ఏటా వరి సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది దాదాపు 30 శాతం కూడా ఉభాలు కాలేదు.వరి నారు వేసిన 21 రోజుల్లో నాట్లు వేసుకోవాల్సి ఉన్నా ఇప్పటికే చాలా చోట్ల 35 నుంచి 40 రోజులుగా వరి నారు ముదిరి పోతోంది. కాలువలు, బావుల్లో నీరు ఇంకిపోతోంది. వరి నారును కొంతమంది మళ్లీ వేసుకున్నారు. అదీ పనికి వచ్చేలా లేదు. కరువు పొంచి ఉంది. రెండు నెలలుగా రైతులు వర్షం కోసం కంటిమీద కునుకులేకుండా ఎదురు చూస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాలు వచ్చి వెళ్లిపోతున్నాయే తప్ప చుక్క నీరు రాల్చడం లేదు. ఇటీవల వచ్చిన తుఫాన్ వర్షాలు కూడా అంతే. రెండు రోజులు మేఘావృతమై పూలజల్లులు కురవడం, మరుసటి రోజంతా మాడు పగిలే ఎండలుకాయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. రైతులను ఆదుకుని కరువునుంచి గట్టెక్కించే చర్యలుతీసుకోవాలి కానీ అదిశగా కనీసం అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.జిల్లాలో గడిచిన రెండునెలల్లో వర్షపాతం వివరాలు(మి.మీలలో) నెల సాధారణ కురిసిన జూన్ 123.5 96.3జూలై 100.5 41.9 బోర్ల వద్ద ఎండుతున్న వరిపైరు వీఆర్ఎస్, పాల్తేరు చానళ్లలో కానరాని సాగునీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ప్రభుత్వం ఆగస్టు వచ్చేసినా 30శాతం కూడా పడని వరినాట్లు -
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బొబ్బిలి రూరల్: మండలంలోని పెంట గ్రామం వద్ద వేగావతి నది నుంచి ఇసుక తవ్వి అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వీఆర్ఓ వెంకినాయుడు ఆదివారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిఘా పెట్టామని, అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామని, సెలవు రోజు కావడంతో ఉన్నతాధికారులు అందుబాటులో లేనందున ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉంచామన్నారు. తదుపరి చర్యలు తహసీల్దార్ తీసుకుంటారని చెప్పారు. గిన్నిస్ రికార్డ్స్’లో విజయనగరం వాసివిజయనగరం టౌన్: అమెరికాలో సిలికానాంధ్ర సహకారంతో 300 మంది మృదంగ కళాకారులతో ఒకే వేదికపై 30 నిమిషాల పాటు రూపొందించిన లయవిన్యాసం కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన విజయనగరానికి చెందిన డాక్టర్ పత్రి సతీష్ కుమార్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ప్రస్తుతం చైన్నెలో ఉంటున్న ఆయన తెలుగువాడిగా, విజయనగరం వ్యక్తిగా రికార్డు అందుకోవడం పట్ల విజయనగర సంగీతాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మృదంగ విద్వాంసుడు డాక్టర్ మండపాక రవి, సంగీతాభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. 2.5 కిలోల గంజాయి పట్టివేతవిజయనగరం టౌన్: ఒడిశా రాష్ట్రంలోని మునిగుడ ప్రాంతం నుంచి తమిళనాడు రాష్ట్ర రాజధాని చైన్నెకి అక్రమంగా సరఫరా చేస్తున్న సుమారు రూ.లక్షా 25వేల విలువైన 2.5 కిలోల గంజాయిని రైల్వేపోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జీఆర్పీ ఎస్సై వి.బాలాజీరావు మాట్లాడుతూ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది రైల్వేస్టేషన్లోని ఫ్లాట్ఫామ్స్పై తనిఖీ నిర్వహిస్తుండగా ఒడిశాలోని కొంధమాల్ జిల్లాకు చెందిన ధర్మేంద్ర పల్లా అనే వ్యక్తి గంజాయిని చైన్నె తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, గంజాయి స్వాధీనం చేసుకుని నిదితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం రైల్వేకోర్టుకు తరలించామని చెప్పారు. శృంగవరపుకోట: మండలంలోని సన్యాసయ్యపాలెం గ్రామంలో 16 కేవీఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కు వస్తున్న విద్యుత్ కనెక్ష న్ కట్ చేసి, ట్రాన్స్ఫార్మర్ దించేసి డీటీఆర్ వైండింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి దొంగిలించి తీసుకుపోయారు. ఉదయం గ్రామానికి విద్యుత్ సరఫరా లేదన్న కంప్లైంట్తో లైన్కు వచ్చిన సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ దించేసి విడిభాగాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి వెంటనే ఎస్.కోట ఏఈ జి.రామారావుకు తెలిపారు. ఈ మేరకు ఆయన వెంటనే ఎస్కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాజువాకలో బొబ్బిలి యువతి ఆత్మహత్యబొబ్బిలి: పట్టణానికి చెందిన ముస్లిం యువతి విశాఖ జిల్లా గాజువాకలో ఆత్మహత్యకు పాల్ప డింది. బొబ్బిలికి చెందిన రషీదా బేగం(26) విశాఖలోని ఓ బ్యూటీ పార్లర్లో రెండున్నరేళ్లుగా పనిచేస్తోంది. ఓ పీజీ హాస్టల్లో ఉంటూ తాను పనిచేస్తున్న బ్యూటీ పార్లర్కు నిత్యం వెళ్లి వస్తుంటుంది. అయితే ఆదివారం ఆమె గాజువాకలోని ఓ హోటల్లో రూమ్ తీసుకుని అందులోనే ఉరి వేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ లేదని, పోలీసుల నుంచి త్వరగా రమ్మని సమాచారం వచ్చిందన్నారు. వెంటనే తండ్రి నూర్ఖాన్, తల్లి మున్నీబేగంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బొబ్బిలి తీసుకువచ్చేందుకు విశాఖ వెళ్లారని మృతురాలి పెదనాన్న కుమారుడు విలేకరులకు తెలిపాడు. -
ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీల ‘చలో ఢిల్లీ’
పార్వతీపురం రూరల్: సగానికి పైగా జనాభా.. చట్టసభల్లో నామమాత్రపు ప్రాతినిధ్యం. ఈ అసమానతలను రూపుమాపుతూ, రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీలకు 34శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిగాపు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ సమానత్వం, సామాజిక న్యాయం దక్కాలంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేలా ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని కోరారు. కులవృత్తుల వికాసానికి రూ.15 వేల కోట్లతో ‘ఆర్టిజన్స్ వెల్ఫేర్ స్కీమ్’, ప్రత్యేక సబ్ప్లాన్న్ చట్టాన్ని తీసుకురావాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ గర్జనకు బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తినాయుడు సంఘీభావం తెలిపారు. బాధ్యతల పంపిణీ మన్యం జిల్లా ఉపాధ్యక్షులుగా జి.రవి, పాత గౌరీశంకర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా బోను మధుయాదవ్, కార్యదర్శిగా కుప్పిలి సంతోష్, విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడిగా మహేష్ నియమితులయ్యారు. కార్యక్రమంలో మోహనన్రావు, తోకాడ రాము, సి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్ యాదవ్ చట్టసభల్లో 3శాతం రిజర్వేషన్లు.. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్ -
చినుకు కినుకు..!
● పెద్దగెడ్డకు గండం ● పూర్తిస్థాయికి చేరని నీటిమట్టం ● అన్నదాతల్లో ఆందోళనపాచిపెంట: మండలంలోని పెద్దగెడ్డ జలాశయంపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన మొదలైంది. పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లో సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ జలాశయం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోలేదు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 213.80 మీటర్లు కాగా ప్రస్తుతం 209.70 మీటర్ల వద్ద మాత్రమే నీరు ఉంది. ప్రస్తుతం పెద్దగెడ్డ ఆయకట్టు రైతుల ఆశలన్నీ వర్షాలపైనే ఉన్నాయి. జలాశయంలో నీటిమట్టం పెరిగితేనే పంటలకు ఊరట లభిస్తుందని, లేకుంటే తీవ్ర నష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు. 40 క్యూసెక్కుల నీటి విడుదల ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్పిల్వే, ప్రధాన కాలువ ద్వారా ఇటీవల రోజుకు 40 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం నుంచి అది కూడా నిలుపుదల చేశారు. ఈ నీరు ప్రస్తుత ఆయకట్టు అవసరాలకు సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల భవిష్యత్తుపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. 150 క్యూసెక్కులు వదిలితే 40రోజులకే డెడ్ స్టోరేజ్.. ప్రస్తుత ఆయకట్టుకు సరిపడా నీరు అందించాలంటే రోజుకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని పెద్దగెడ్డ జలాశయ అధికారులు చెబుతున్నారు. అయితే అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తే 40 రోజుల్లోనే జలాశయం పూర్తిగా డెడ్ స్టోరేజ్కు చేరుకునే ప్రమాదం ఉందని, వర్షాలు సకాలంలో కురవకపోతే సాగునీటి సమస్య మరింత తీవ్రం కానుందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు చెబుతున్నారు. జలాశయంలో నీరు ఉన్నప్పటికీ అవసరమైనంతగా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు కూడా లేకపోవడంతో పంటలు నిలబడతాయో లేదో భయంగా ఉంది. అధికారులు ముందుగానే చర్యలు తీసుకుని రైతులకు భరోసా కల్పించాలి. ఈదుబిల్లి సుధీర్ నాయుడు, ఆయకట్టు రైతు, మిర్తివలస -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
పార్వతీపురం: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజలు తమ వినతులను సమర్పించవచ్చునని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు, వాటి స్థితిని మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవడంతో పాటు1100 టోల్ఫ్రీ కాల్సెంటర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చునన్నారు. కలెక్టరేట్లో ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ’క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన ఇవ్వండి పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను వెల్లడించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి ప్రజలను కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నారు యాజమాన్యంపై అవగాహన అవసరంపాలకొండ రూరల్: ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ స్థితి నుంచి వరి పంట సాగులో యాజమాన్య పద్ధతులు అవసరమని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామాన్ని ఆయన ఆదివారం సందర్శించి అక్కడి రైతులతో మమేకమయ్యారు. ఈ క్రమంలో అక్కడి పంటల సాగు తీరుపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సాగునీటి ఎద్దడి ఏర్పడే సమయంలో నారు యాజమాన్యం, వర్షం అనుకూలించే ప్రాంతాల్లో స్వల్పకాలిక వంగడాలను వేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ స్థితిగతులను ఏ విధంగా అధిగమించాలనే అంశాలపై సీతంపేట వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, పి.సౌజన్య తదితరులు వివరించారు. ప్రకృతి విపత్తులనుంచి నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాపై అవగాహన కలిగి ఉండాలని, సకాలంలో బీమా చేయడం వల్ల అర్థిక వెసులుబాటు ఉంటుందని వ్యవసాయ సహాయకుడు వి.గుణశేఖర్ తెలిపారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయనగరానికి చెందిన భక్తులు బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని ఆదివారం కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన కె.సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశా రు. రూ. 2.50లక్షల వ్యయంతో సుమారు 19 గ్రాముల బంగారాన్ని వినియోగించి బొట్టు, నత్తు, బొల్లాకిని తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతల కు ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
బళ్లారి రాఘవకు పోలీస్ శాఖ నివాళులు
పార్వతీపురం రూరల్: తెలుగు నాటక రంగ పితామహుడు తాడిపత్రి రాఘవాచార్యులు (బబళ్లారి రాఘవ) జయంతి వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బళ్లారి రాఘవ గొప్ప నటుడే కాకుండా, తెలుగు నాటక రంగానికి జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడని కొనియాడారు. కళ ద్వారా ఆయన ప్రజల్లో తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని స్మరించుకున్నారు. వృత్తిరీత్యా గొప్ప న్యాయవాది కూడా అయిన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఏఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కొలిక్కిరాని కొత్త పంచాయతీలు
దత్తిరాజేరు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని మధుర గ్రామాలను పంచాయతీలుగా మార్పు చేసే ప్రతిపాదనలపై ఇప్పటికి సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు ఉన్న మధుర గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి మండల పరిషత్ అధికారులు అర్హత ఉన్న మధుర గ్రామాల ప్రజలు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నారు.అలాగే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తీర్మానాలు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా అందిన దత్తిరాజేరు మండలంలోని గదబవలస, మర్రివలస, పోలవంగర, పాపయ్యవలస, జగన్నాథపురం, మజ్జిపేట గ్రామాల ప్రతిపాదనలను గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వానికి పంపించారు. అయితే నేటివరకు కొత్త పంచాయతీల ఏర్పాటు గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించక పోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో మధుర గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటైన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా పాత పంచాయతీల స్థానంలో నిర్వహిస్తారా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయండిపాపాయ్యవలసతో పాటు అర్హత ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయండి. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులు నేరుగా మాగ్రామ పంచాయతీకి జమ అవుతాయి. తద్వారా గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రత్యేక పంచాయతీగా ఉండడం వల్ల అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ఎస్. శ్రీనివాసరావు, పాపయ్యవలస గ్రామం ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రతిపాదనలు ప్రభుత్వ ఆదేశాల మేరకే మండలంలోని ఆరు మధుర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు గత ఏడాది డిసెంబర్లో అప్పుడు ఉన్న అధికారులు పంపించారు. కొత్త పంచాయతీలు ఎప్పడు ఏర్పాటు చేస్తారన్నది ఉన్నతాధికారుల నుంచి సమాచారం రాలేదు. వచ్చిన వెంటనే తెలియజేస్తాం. ఎస్.తాత ఎంపీడీఓ దత్తిరాజేరుకొత్త పంచాయతీలతో స్వయం ప్రతిపత్తి అన్ని అర్హతలు ఉన్న గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటైతే స్వయం ప్రతిపత్తి సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మధుర గ్రామాలు అభివృద్ధి విషయంలో చిన్నచూపుకు లోనవుతున్నాయి. అలాగే మధుర గ్రామాల ప్రజలకు గ్రామ పంచాయతీల ద్వారా అందాల్సిన పథకాల విషయంలో ఆన్నాయం జరుగుతోందనే భావన వ్యక్తమ వుతోంది. పెద్ద పంచాయతీల పరిధిలో రెండో మూడో మధుర గ్రామాలకు వచ్చే నిధులు పెద్ద పంచాయతీకే వినియోగించే అవకాశాలే అధికం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు అర్హతలు ఉన్న మధుర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గత ఏడాది హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం 2025 డిసెంబర్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు 6 మధుర గ్రామాలపై వీడని సందిగ్ధం -
ఏఐ ఫ్యూజన్ సదస్సులో ‘సీతం’ ప్రతిభ
విజయనగరం అర్బన్: విశాఖపట్నంలో ఏఐ రంగం అగ్రశ్రేణి నిపుణులతో ఆదివారం జరిగిన ‘ఏఐ ఫ్యూజన్ వైజాగ్’ అనే సదస్సులో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు నాయకత్వంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బోష్, జేపీ మార్గాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు చెందిన సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని, కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులు, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, భవిష్యత్ ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశ్రమ నిపుణులతో నేరుగా మాట్లాడే ఇటువంటి అవకాశాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి భవిష్యత్ సాంకేతిక సవాళ్లకు వారిని సిద్ధం చేస్తాయని డాక్టర్ శశిభూణరావు తెలిపారు. ప్రపంచ స్థాయి అనుభవాన్ని విద్యార్థులకు అందించడమే తమ సంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ చూపిన సీతం కళాశాల బృందానికి నిర్వాహకులు జ్జాపికలను అందజేశారు. -
వారిపై ఎందుకో వివక్ష?
● ఎంటీఎస్ ఉపాధ్యాయులకు అందని జీతాలు ● రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులుబలిజిపేట: ఎంటీఎస్ ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారికి జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. వారు ఎప్పుడు ఏ పాఠశాలకు డిప్యుటేషన్ పేరిట వెళ్లాల్సి వస్తుందో తెలియదు. మండల, డివిజన్స్థాయిలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు వారికి కౌన్సెలింగ్ జరిగేటప్పుడు వారికి అన్యాయం జరుగుతోందనేది జగమెరిగిన సత్యం. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు అన్ని నిబంధనలు పాటించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా వారికి న్యాయం జరిగిన దాఖలాలు లేవు. పాఠశాలలు జూన్ నెలలో ప్రారంభించినా నేటికీ వారికి జీతాలు అందకపోవడం గమనార్హం. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా తలెత్తిన సాంకేతిక కారణాలు చూపుతూ జీతాల చెల్లింపు నిలుపుదల చేస్తున్నారు. స్వల్ప వేతనంతో జీవనం సాగిస్తున్న ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో వారు పనిచేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 400మందికి పైగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. జూన్ నెలలో బదిలీల అనంతరం కొత్త పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇప్పటివరకు జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్యలంటూ సాకులు ఉపాధ్యాయుల తప్పిదం లేకపోయినా పొజిషన్ ఐడీల మ్యాపింగ్, క్యాడర్ స్ట్రెంత్ డిస్ప్లే, ఇతర సాంకేతిక ప్రక్రియలు పూర్తికాకపోవడంతో బిల్లులు సమర్పించలేని పరిస్థితి ఎదురైంది. జూన్ నెలలో జిల్లా కౌన్సెలింగ్ జరిగిన తరువాత రోజున ఎంఈఓలు మండలస్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి విధుల నిర్వహణకు పాఠశాలలు కేటాయించి ఎప్పుడు, ఎక్కడికి అవసరమైతే అక్కడికి డిప్యుటేషన్పై వెళ్లాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. జూన్ నెలలో జీతాల బిల్లులు పెట్టిన తరువాత ఎంటీఎస్లకు జిల్లా కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో జీతాల బిల్లులకు సాంకేతిక సమస్య ఎదురైంది. బిల్లులు సక్రమంగా పెట్టనందున జూలైలో జీతాలు అందలేదు. పోనీ జూలైలో అయినా సక్రమంగా సాగుతోందా? అంటే అదీ జరగలేదు. దీంతో వారికి రెండు నెలల జీతాలు అందలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు వారి జాయినింగ్ ఆర్డర్లు, కుల ధ్రువీకరణ పత్రం పట్టుకుని జిల్లా ఎస్టీఓ కార్యాలయానికి రావాలని సూచించడంతో ఎంటీఎస్ ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్యలు పరిష్కరించి జీతాలు మంజూరుచేయాలని వారు కోరుతున్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో స్థిరమైన విధానం లేదు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు చెల్లించాలి. దీనిపై సంఘాల తరఫున డిమాండ్ చేశాం. నిధి పోర్టల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలి. ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఎస్టీఓ కార్యాలయానికి వ్యక్తిగతంగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవిధంగా కాకుండా డీడీఓల ద్వారా అప్లోడ్ చేసే విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది. ఎం.శేషగిరి, అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా -
అథ్లెటిక్స్ ఎంపిక పోటీలకు స్పందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 600మంది కీడాకారులు హాజరయ్యారు. అండర్–14,16,18, 20 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లీలా కృష్ణ, శ్రీకాంత్ తెలిపారు. -
వెలుగు మార్కెట్
సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026మసకబారిన వెలుగు మార్కెటింగ్ కేంద్రాలు చీకటి మయమవుతున్నాయి. వన్ధన్ వికాసకేంద్రాలు ఇప్పటికే మూలకు చేరాయి. దీంతో గిరిజనుల ఆదాయవనరులు సన్నగిల్లుతున్నాయి. ఒక్కో గిరిజన కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఆదాయం మాట అటుంచితే ఇప్పటికే దళారీ వ్యాపారుల మాయలో పడి నష్టపోతున్నారు. ఇటు జీసీసీ వంటి సంస్థలు ఉన్నా నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. సీతంపేట: గిరిజన ప్రధాన ఆదాయ వనరులు చింతపండు, జీడి, పైనాపిల్, పసుపు, కంది పంటలు. వాటిని పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనేది ఐటీడీఏ ఆశయం. వెలుగు ద్వారా మార్కెటింగ్ కేంద్రాలను నెలకొల్పి తద్వారా ఆదాయ వనరులు మహిళా సంఘాలకు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం వన్ధన్ వికాస కేంద్రాలు (వీడీవీకే)ల పేరుతో ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పి ఉత్పత్తులను మార్కెట్ చేయాలనేది ఉద్దేశం. ఐటీడీఏ పరిధిలో సుమారు 12వేల ఎస్హెచ్జీ గ్రూపులు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం పసుపు, చింతపండు, జీడి ప్రాసెసింగ్ కేంద్రాలను పది చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకు ఒక్కో యూనిట్కు ట్రైకార్ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే వెలుగు ద్వారా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లేక మూతపడ్డాయి. జీడి ప్రాసెసింగ్ కేంద్రాలను శంభాం, జిల్లేడుపాడు, సీతంపేటలలో ఏర్పాటు చేశారు. వాటికి కూడా భారీ యంత్రాలను సమకూర్చారు. మహిళా సంఘాలు ప్రాసెస్ చేసి జీడిపిక్కలు తీసి ప్యాకెట్ల రూపంలో తయారు చేసినా సరైన మార్కెట్ సదుపాయాలు కల్పించలేకపోయారు. ఆయా కేంద్రాలు తెరుచుకోలేదు. సీజన్లో చింతపండు కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి నాణ్యమైన చింతపండును పిక్కతీసి ప్యాకెట్ల రూపంలో తయారు చేసి వసతిగృహాలు, ఇతర మార్కెటింగ్ కేంద్రాలకు విక్రయించాలనేది ఉద్దేశం. ఈ యూనిట్ను సీతంపేటలో ఏర్పాటు చేసినా అదికూడా పనిచేయడం లేదు. స్థానికంగా ఐటీడీఏ సమీపంలో ఈ కేంద్రాలు నెలకొల్పినప్పటికీ దిబ్బగూడలో నెలకొల్సిన పసుపు ప్రాసెస్ యూనిట్ తప్ప మరేమీ నడవడం లేదు. వాటిన్నింటికీ సుమారు రూ. కోటి వరకు వెచ్చించినా నిధుల వృథా తప్ప ప్రయోజనం లేదని గిరిజనులు పెదవివిరుస్తున్నారు. వెలుగు అదికారుల సరైన పర్యవేక్షణ లేదు. ఈ మార్కెటింగ్ కేంద్రాలపై దృష్టిసారించాలని సంబంధిత వెలుగు అధికారులకు ఎప్పటి నుంచో విన్నవిస్తున్నాం. లక్షల్లో వృథా చేశారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. గిరిజనులకు మంచి మార్కెట్ సదుపాయాలు కల్పించి ఉపాధి సౌకర్యాలు మెరుగుపర్చాలి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ ఏజెన్సీలో సుమారు 15 వేల ఎకరాల్లో పైనాపిల్ పండుతుంది. దాదాపు 50 టన్నులు ఉత్పత్తి వస్తుంది. ఈ ఏడాది ధరలు లేక గిరిజన రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు బజార్లకు తీసుకువెళ్లి కొద్దిమంది మాత్రమే విక్రయాలు జరిపారు. జీడి పంట 30 వేల ఎకరాల్లో పండుతుంది. 5లక్షల కిలోల ఉత్పత్తి ఏటా జరుగుతుంది. పసుపు 5 వేల ఎకరాల్లో సాగవుతుంది. సుమారు 10 వేల కిలోల ఎండు పసుపు ఉత్పత్తి అవుతుంది. చింతపండు 5 వేల ఎకరాల్లో పండుతుంది. ఏడాదికి 100 టన్నుల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంకా ఉసిరి 200 ఎకరాల్లో పండగా 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. గిరిజనుల అటవీ ఉత్పత్తులు చెడిపోకుండా నెలల తరబడి నిల్వ ఉంచి అనంతరం వాటిని విక్రయించుకోవడానికి వీలుగా కోల్డ్ స్టోరేజీలు వంటి సదుపాయాలు లేవు. గతంలో సీతంపేట వారపు సంత వద్ద రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీ పూర్తిగా పాడైంది. మూలనపడిన వన్ధన్ కేంద్రాలు రూ.కోటిపైనే వృథాగా యంత్రాలు గిరిజనులకు మధ్య దళారులే దిక్కు మూతపడిన జీడి ప్రాసెసింగ్ కేంద్రం -
సాహిత్యానికే వన్నెతెచ్చిన సృజనశీలి ‘తులసి’
విజయనగరం టౌన్: తెలుగు సాహిత్యాన్ని దశ దిశ లా వ్యాప్తి చేసి, తన జీవితాన్ని సాహిత్యానికి అంకి తం చేసిన సాహిత్య సృజన శీలి చాగంటి తులసి అని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. భార త సాహిత్య రంగానికి చాగంటి తులసి చేసిన అవిర ళకృషి మరువలేనిదని కొనియాడారు. తులసి సా హిత్య రచనలను ఆమె సమక్షంలోనే సమీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని సాహితీవేత్తలు ఆనందపరవశులయ్యారు. స్థానిక పాల్నగర్లో తులసి స్వగృహంలో చాగంటి తులసి సాహితీ సమాలోచన పేరుతో సాహిత్యంలో విశేష కృషి చేసినటువంటి సాహితీవేత్తలను సముచితరీతిలో ఆదివారం సత్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు జిఎస్.చలం, రత్నాల బాలకృష్ణ ఆధ్వర్యంలో వారికి చా.సో కథా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు తులసి కథల సంపుటి యాష్–ట్రే పుస్తకావిష్కరణ చేశారు. చాగంటి కృష్ణకుమారి సమీక్షించారు. సచీ రౌత్రాయ్ అనువాద కథల్ని ధవళ సర్వేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త రామసూరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తులసి సాహిత్యంపై యువ సాహితీవేత్తలు దుప్పల రవికుమార్, కూరెళ్ల శ్రేయ, సుభ, గీతా రమాదేవి, రత్నాల బాలకృష్ణ ప్రసంగించారు. 90 ఏళ్ల వయసులో సాహిత్యంపై మక్కువ చూపిస్తున్న చాగంటి తులసి కీర్తిని కొనియాడారు. చింతా అప్పలనాయుడుకు చా.సో కథా పురస్కారం వ్యంగ్య శైలిలో దోపీడి వ్యవస్థను తూర్పారబట్టిన ‘నగ జనకరి నాం నాం..’ అంటూ తన కథల ద్వారా దండోరా మోగిస్తున్న కథకుడు చింతా అప్పలనాయుడు చా.సో కథా పురస్కారం అందుకున్నారు. ఉత్తరాంధ్ర నుడికారాన్ని, యాసను, భాషను ప్రతి కథలోనూ ఇంకించి, రైతులు, దళితుల, గిరిజనుల దోపిడీకి కారణమైన వ్యవస్థలో లోపాలను తన రచనల ద్వారా ఎత్తి చూపారని సాహితీవేత్తలు విశ్లేషించారు. ఉత్తరాంధ్ర సంభాషణలు, వాలకాలు, చతు రోక్తులు, మాటలు, సామెతలు, దుక్కి, ఇలమీద దేవత, అరిసేతిలో బువ్వ, పువ్వు వంటి కవితా సంకలనాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి న చింతా అప్పలనాయుడుకు చాసో కథా పురస్కా రంతో సత్కరించారు. రూ.10 వేలు నగదు పురస్కారం, జ్ఞాపిక, శాలువతో సత్కరించారు. ఆయన రాసిన ‘నకజనకరి నాం..నాం..’ కథల సంపుటిని సరిపల్లి నాగరాజు సమీక్షించారు. తెలంగాణ రచయిత్రి స్వర్ణ కిలారికికి అనువాద పురస్కారం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న తెలంగాణ రచయిత్రి స్వర్ణ కిలారికి చాగంటి తులసి అను వాద పురస్కారం దక్కింది. ఈ మేరకు రూ.15 వే లు నగదు పురస్కారం, జ్ఞాపిక, సాలువతో ఆమెను గౌరవప్రదంగా సత్కరించారు. ద్వారం దుర్గాప్రసా ద్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో లిప్తకాలపు స్వప్నం పుస్తకాన్ని లండ సాంబ మూర్తి సమీక్షించా రు. తొలి అనువాదం లిప్తకాలపు స్వప్నంతో ప్రతిష్టాత్మక తెలుగు యూనివర్సిటీ అనువాద పురస్కారాన్ని అందుకుని, సాహితీ జగత్తులో కథా రచయిత్రిగా, అనువాదకురాలిగా, నవలా రచయిత్రిగా, సంపాదకురాలిగా తనదైన ముద్రతో స్వర్ణ ముందుకు సాగుతున్నారన్నారు. మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలు, సమాజంలోని రక రకాల కోణాలు విశ్లేషించే కథలతో నల్ల బంగారం, గోడ అవతల వంటివి కథా సంపుటులుగా వెలువరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయన్నారు. -
లెక్కలేని తనం..!
కొత్తవలస: భక్తితో పైసా పైసా కూడబెట్టి అమ్మవారికి సమర్పించుకునే భక్తుల నమ్మకాన్ని దేవాదాయశాఖ అదికారులు నిలువునా దోచుకుంటున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అధికారులే పక్కా అక్రమాలకు తెరలేపారు. కొత్తవలస మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామం సమీపంలో గల పుణ్యక్షేత్రం ధారపైడితల్లమ్మ అమ్మవారి ఆలయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంవారం లక్షల్లో నగదు, బంగారం, వెండి భక్తులు సమర్పిస్తుండగా కేవలం రూ.4వేలు, రూ.5వేలు వస్తున్నాయని కానుకలు సమర్పించిన భక్తులకు రసీదులు కూడా ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధార పైడితల్లిమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి స్థానికంగా ఉండటే గిరిజనులు అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. ఆలయానికి ప్రతి ఆదివారం, మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడే వంటలు చేసుకుని అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో భక్తులు లక్షల్లో కానుకలు చెల్లిస్తూ వస్తున్నారు. దీంతో భక్తులు సమర్పించిన కానుకులకు సరైన లెక్కలు లేకపోవడంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఆలయాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖకు అప్పజెప్పారు. దీంతో అప్పట్లో దేవదాయ శాఖ అధికారులు ఆది,మంగళవారాల్లో ఉదయం ఆలయం వద్ద హుండీని ఏర్పాటు చేసి సాయంత్రం కొంతమంది భక్తుల మధ్య హుండీలోని కానుకలను లెక్కించేవారు. కాగా రెండు సంవత్సరాల నుంచి అధికారులు ఈ తంతంగాన్ని పక్కన పెట్టి వారే స్వయంగా సంచుల్లో కానుకలను భక్తుల నుంచి స్వీకరించడం మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారంఆలయంలో దేవదాయశాఖ హుండీని ఏర్పాటు చేయాల్సి ఉండగా..ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హుండీలు ఏర్పాటుచేయకపోగా ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించుకునే కానుకలకు రసీదులు ఇస్తాం. ఆ కానుకులు మా సంచుల్లో వేయండి అంటూ వసూళ్లకు దిగడం గమనార్హం. అయితే భక్తులు సమర్పిస్తున్న కానుకలకు, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనలేదు. సంచుల్లో వసూలు చేస్తున్న కానుకలకు, అధికారులు ఇస్తున్న రసీదులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోంది. దేవదాయశాఖ అధికారుల్లో కరువైన జవాబుదారీతనం ధార పైడితల్లమ్మ ఆలయంలో కానరాని హుండీ నేరుగా భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్న అధికారులుమా శాఖ అధికారులపై భక్తులు నమ్మకం ఉంచాలిహుండీని ఏర్పాటు చేస్తే దొంగలు దోచుకుపోతున్నారు. అందుకే వారం వారం మా సిబ్బంది వచ్చి భక్తుల నుంచి నేరుగా సంచుల్లో కానుకలను సేకరిస్తున్నాం. వంద రూపాయలకు పైబడి కానుక ఇచ్చిన భక్తులకు రసీదు ఇస్తున్నాం. భక్తులు, గ్రామస్తులకు మాపై నమ్మకం ఉండాలి. శ్రీనివాసరావు, ఆలయ ఈఓ లక్షల్లో దోచుకు పోతున్నారుఈ ఆలయానికి వారంలో రెండు రోజుల పాటు వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన భక్తులు సమర్పించిన కానుకులు లక్షల్లోనే ఉంటాయి. అలాగే పలువురు భక్తులు బంగారం, వెండి ఆభరణాలు సైతం సమర్పించుకుంటున్నారు. అయినా అదికారులు నిబంధనలకు విరుద్ధంగా సంచుల్లో కానుకలను సేకరిస్తూ 30 మందికో 40 మందికో తూతూమంత్రంగా రసీదులు ఇచ్చి మిగిలిన సొమ్ము దోచుకుపోతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలి. – ఉగ్గిన పద్మనాభస్వామి, అప్పన్నదొరపాలెం, గ్రామపెద్ద ఆగ్రహంలో భక్తులు, గ్రామస్తులు అమ్మవారికికి మేము సమర్పించే కానుకలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప అధికారుల జేబులు నింపడానికి కాదని భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీని ఏర్పాటు చేయకుండా సంచుల్లో కానుకలను స్వీకరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
● సన్మానం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్బాబు కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం సాధించినందుకు గాను ఆయన తండ్రి శ్రీనివాసరావును గ్రామస్తులు ఆదివారం ఘనంగా సత్కరించారు. అజయ్బాబు దేశానికే కాదు..గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చారని గ్రామపెద్దలు ప్రశంసించారు. కొడుకును ప్రోత్సహించి, అతడి విజయానికి దోహదపడిన తండ్రిని సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకుడు మొయిద అప్పారావు, నాయకులు ఆదినారాయణ, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు. -
15తులాల బంగారం ఆభరణాల చోరీ
సీతానగరం: మండల కేంద్రంలోని ప్రధాన మార్కెట్లో మెయిన్ రోడ్డును ఆనుకుని నివాసం ఉంటున్న కూర్మదాసు కిరణ్ ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 15 తులాల బంగారం ఆభరణాలు చోరీ చేసినట్లు ఎస్సై ఎం.హేమలత తెలిపారు. ఆదివారం ఉదయం నిద్ర లేచిన అనంతరం ఇంట్లో తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి బీరువా తెరిచే సరికి అందులో భద్రపర్చిన బంగారం నగలు లేవపోవడాన్ని గుర్తించి ఇరుగు పొరుగువారికి తెలియజేసి, బాధితుడు కిరణ్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని క్లూస్టీమ్ సందర్శించి వేలిముద్రలను సేకరించినట్లు ఎస్సై చెప్పారు. మార్కెట్లో దొంగతనం జరిగిన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినట్లు తెలిపారు. పార్వతీపురం సీఐ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసుమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హేమలత తెలియజేశారు. -
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో కేసుల పరిష్కారం జరుగుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వం–దేశం కోసం అనే అంశంపై న్యాయమూర్తులు, న్యాయవాదులతో శనివారం చర్చించారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్బౌన్స్ తదితర కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణ నుంచి పూల్బాగ్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి, మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. 90 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని, మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం కోర్టు ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ వర్తించినా.. అదనపు వసూళ్లు..!
● అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ● నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామూళ్ల కోసం మౌనంనెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులువిజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరు రోగులకు వచ్చిన సమస్యే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. చర్యలు చేపట్టాల్సిన ఆరోగ్యశ్రీ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది అధికారులకు చెబితే కొన్ని చూసీచూడనట్లు వదిలేయాలని ఓ అధికారి సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సర్కార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా కమర్షియల్గా మార్చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ట్రస్టు ఇచ్చే నిధులతో పాటు అదనంగా కూడా రాబట్టుకునే పనిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరిగిన కో పేమెంట్స్ ఆరోగ్యశ్రీ పథకంలో కో పేమెంట్స్ బాగా పెరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదనపు వసూళ్లకే కో పేమెంట్స్ అని నెట్వర్క్ ఆస్పత్రులు పేరు పెట్టాయి. కో పేమెంట్ లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స గాని, శస్త్రచికిత్సలు చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు ఇష్టపడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయనే విషయం ఆరోగ్యశ్రీ అధికారులకు తెలిసినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామ్మూళ్ల కోసం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోగుల నుంచి నెట్వర్క్ ఆస్పత్రుల అదనపు వసూళ్లుకు అడ్డులేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీపురుపల్లికి చెందిన ఓబాలుడికి హైడ్రాసిల్ నొప్పి రావడంతో విజయనగరం పట్టణంలోని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్వర్క్ ఆస్పత్రిలో చూపించగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో ఇన్పేషేంట్గా చేర్పించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బాలుడికి శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ అదనంగా మరో రూ.8 వేలు బాలుడి కుటుంబ సభ్యుల దగ్గర ఆస్పత్రి సిబ్బంది తీసుకున్నారు. విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్ద పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల్లో అ వ్యక్తికి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ రూ.50 వేలు అదనంగా అవుతుందని చెప్పడంతో అంత ఇచ్చుకోలేమని చెప్పి, మరో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూడా రూ.15 వేల వరకు అదనంగా ఇవ్వాలని చెప్పారు. దీంతో ఆ ఆస్పత్రిలో ఆ వ్యక్తిని చేర్పించారు. ఉచితంగా వైద్య సేవలు అందించేలా చూడాలి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించే ప్రతినెట్వర్క్ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు ఉంటారు. వారిని పర్యవేక్షించేందుకు టీమ్ లీడర్లు కూడా ఉంటారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందేవిధంగా చూడాల్సింది వారే. ఆస్పత్రిలో రోగులు చికిత్స పొందే ప్రతిరోజూ రోగుల దగ్గరకు వెళ్లి వైద్య సేవల గురించి ఆరా తీయాలి. అదేవిధంగా డబ్బులు ఎవరైనా తీసుకుంటున్నారా? అని రోగులనుంచి ఆరా తీయాలి. అయితే ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి రోగికి నెట్వర్క్ ఆస్పత్రి వారు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అదనంగా డబ్బులు అడినట్లయితే సంబంధిత ఆస్పత్రి మిత్రాకుగాని, నాకు గానీ లఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. డాక్టర్ కె. సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
తమ్ముళ్ల ఖాతాలోకి.. పంచాయతీల సొమ్ము!
● గిరిజన పంచాయతీలే టార్గెట్ ! ● పనులు చేయకుండానే స్వాహా ● రూ.18 లక్షల వరకు పక్కదారి సాక్షి, పార్వతీపురం మన్యం: సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత గిరిజన పంచాయతీల్లో కనీస పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులు జరిగిన దాఖలాల్లేవు. ఇదే సమయంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు.. తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి మళ్లిపోతున్నాయి. వారి సొంత జేబులో సొమ్ములా వాడేసుకుంటున్నారు. ఇదే తరహాలో సాలూరు నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో గల గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కొద్ది రోజుల కిందట డ్రా చేసినట్లు సమాచారం. సాలూరు మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా చేసినట్లు భోగట్టా. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలనే ఇందుకు ఎంచుకున్నారు. పనులు చేయకుండా నిధులు డ్రా చేయడం పట్ల తాము ఇరకాటంలో పడిపోతామేమో అని ఆయా కార్యదర్శులు ఆందోళనలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు కావడం.. మండల అధికారుల సిఫార్సులు కూడా ఉండడంతో నోరు మెదపలేక పోతున్నారు. ఇప్పుడు ఆయా పంచాయతీల్లో నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని తెలుస్తోంది. గిరిజన పంచాయతీలే అధికం.. నిధులు డ్రా చేసిన పంచాయతీల్లో ఎక్కువ భాగం గిరిజన, గిరి శిఖర ప్రాంతాలే ఉన్నాయి. అది కూడా గతంలో వైఎస్సార్ సీపీ సర్పంచ్లు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీలనే ఎంచుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ భాగోతం బయట పడినా నిందను వారి మీదకు నెట్టేయవచ్చన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చని గ్రామస్తులు అంటున్నారు. ఈ పంచాయతీల్లో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ప్రశ్నించలేని పరిస్థితిలో వారు ఉండటం ఆ ‘తమ్ముడికి’ కలిసి వచ్చింది. కొత్తవలస పంచాయతీ నుంచి రూ.2,00,364, కందులపథం పంచాయతీ నుంచి 1,00,300, తోణాం రూ.1,49,978, సారిక రూ.2,00,482, మరిపల్లి రూ.1,00,300, కురుకుట్టి 2,50,750, అన్నంరాజువలస రూ.2,49,216, తుండ రూ.2,00,010, గంజాయిభద్ర రూ.లక్ష, పట్టుచెన్నూరు రూ.1.50 లక్షలు, కూర్మరాజుపేట రూ.50,622, కొదమ నుంచి రూ.1.20 లక్షల చొప్పున నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా కావడం.. మెజారిటీ పంచాయతీలు గిరిజన ప్రాంతానికి చెందినవే అవ్వడం గమనార్హం. పాచిపెంట మేజర్ పంచాయతీలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ కోసమని మంత్రి అనుచరుడి పేరు మీద రూ.లక్ష రూపాయల నిధులు డ్రా చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు చేతులా సంపాదనకు అలవాటు పడిన తెలుగు తమ్ముళ్లు.. ప్రత్యేక అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, పనులు చేయకుండానే నిధులు దోచేస్తుండడం పట్ల గ్రామస్తుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పంచాయతీల్లో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటివి ఏవైనా ప్రత్యేక అధికారుల అనుమతితోనే జరగాలి. 15వ ఆర్థిక సంఘం ఆఖరి విడత నిధులపై కన్నేసిన ఆ మండల స్థాయి నాయకుడు 12 గ్రామ పంచాయతీల్లో నిధులను ఎలాంటి పనులూ చేయకుండానే డ్రా చేశారని సమాచారం. ముఖ్యంగా ఎల్ఈడీ దీపాలు కొనుగోలు పేరిట ప్రత్యేక అధికారుల మీద ఒత్తిడి తెచ్చి నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఆయా పంచాయతీల్లో స్థానిక నాయకులకు కూడా చెప్పకుండానే ఈ తంతు నడపడంపై ఆయా పంచాయతీల్లో ఉన్న అధికార పార్టీ నాయకులకూ మింగుడు పడడం లేదు. -
పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు
● రైతుల నెత్తిన మరింత భారం ● చెల్లింపునకు పాట్లురామభద్రపురం: ఖరీఫ్ సీజన్లో వరి మినహా పత్తి, మొక్కజొన్న తదితర మిగతా పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే వరి పంటకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండగా, మిగతా పంటలకు గడువును పొడిగించింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు, తీసుకోని వారితో పాటు కౌలు రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ గడువు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,16,990 హెక్టార్లు. ఇందులో వరి 97,500 హెక్టార్లు, మొక్కజొన్న 10,791 హెక్టార్లు, పత్తి 2,200 హెక్టార్లలో సాగు లక్ష్యం. ఇప్పటి వరకు వెదలు, ఉబాలుతో వరి సాగు చేసింది 10,600 హెక్టార్లు, మొక్కజొన్న 7,212 హెక్టార్లలో సాగైంది. పంటల బీమా ప్రీమియం చెల్లింపులో తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రెండు పంటలకుగాను ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద బ్యాంకులో రుణాలు తీసుకున్న వారు, తీసుకొని వారు కలిపి 6,393 హెక్టార్లకు 56,600 మంది రైతులు సుమారు రూ.31 లక్షలు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. వాతావరణ ఆధారిత పథకం కింద పత్తి 2,112 హెక్టార్లకుగాను 462 మంది రైతులు 81 హెక్టార్లకు మాత్రమే పంటల బీమా ప్రీమియం సుమారు రూ.3,87 లక్షలు చెల్లించారు. చెల్లింపునకు పాట్లు ఎల్నినో పరిస్థితులు ఉన్నందున పంట చేతికిరాని సమయంలో కనీసం బీమా పరిహారమైనా వస్తుందనే ఆశతో ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు. అయితే మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీ)ఆర్ఎస్కేలు, డిజిటల్ కేంద్రాలలో సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో రైతులు ప్రీమి యం చెల్లింపు కోసం గంటల తరబడి నిరీక్షిస్తూ పా ట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రైతులు తా ము చేసిన పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లిస్తేనే బీమా పథకాలు వర్తించనున్నాయి. అన్నదాతపై బీమా భారం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ఆ భారాన్ని రైతులపైనే వేసింది. ఒక వైపు ఎలినినో ప్రభావంతో వర్షాలు లేక పొలంలో తాము కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతుండటం, చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులే పంటల ప్రీమియం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా అన్నదాత మరిన్ని కష్టాలు పడుతున్నాడు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైతులపై పైసా భారం మోపకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ–పంట ఆధారితంగానే బీమా ప్రీమియం చెల్లించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపైనే వేసింది.15లోగా ప్రీమియం చెల్లించాలి రైతు ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా నమోదు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పెంచింది. రైతులు చివరి వరకు వేచి ఉండకుండా బ్యాంకులో రుణాలు ఉన్న వారు, లేని రైతులు మొబైల్ యాప్ ద్వారా లేక ఆర్ఎస్కేలు, సీఎస్సీల వద్ద ప్రీమియం చెల్లించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మధుసూదనరావు, ఏడీఏ, బొబ్బిలి -
కోటి రెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
● రూ.50 వేలు సాయం అందించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్లవిజయనగరం అర్బన్: వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఇటీవల అకాల మరణం చెందిన విజయనగరం బాబామెట్ట నివాసి కోటి రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కోటి రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.50 వేలు అందజేశారు. ఆయన వెంట ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ గాదం మురళి, వర్మరాజు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు కె.సుధాకర్, కాశిరెడ్డి నవీన్, సతీష్, సాయికుమార్, మువ్వల భాస్కర్, శ్రీహరిబాబు, రవి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
కక్షసాధింపుతోనే మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
● యూనివర్సిటీలను సైతం పాడు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ● మాజీ ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి: ఏయూ మాజీ వీసీ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని సస్సెండ్ చేసేందుకు రాత్రికి రాత్రి ఇచ్చిన కమిటీ నివేదికను ఆసరా చేసుకో వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని పదవీ విరమణ రోజునే సస్సెండ్ చేయడం అనేక రకాల అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆయన పదవీకాలంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఆఘమేఘాల మీద నివేదిక తెప్పించుకుని కొత్త కమిటీ ద్వారా సస్పెండ్ చేయడం ముమ్మాటికీ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్ణయమేనన్నారు. వాస్తవానికి యూనివర్సిటీ అంతర్గత విచారణ పూర్తి కాకముందు విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, వెంటనే నివేదిక తెప్పించుకోవడం సస్సెండ్ చేయడం చకచకా జరిగిపోయాయన్నారు. ఇన్నాళ్లుగా యూనివర్సిటీలో అంతా బాగుండి, ఆయన పదవీ విరమణ రోజే చంద్రబాబుకు అక్రమాలు గుర్తొచ్చాయా అని శంబంగి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఇప్పుడు యూనిర్సిటీల్లోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగినన్ని అక్రమాలు, అధర్మాలు ఎక్కడా జరగలేదన్నారు. రాత్రి వేళల్లో చీకటి జీఓలు విడుదల చేయడం చంద్రబాబుకు అలవాటైనా మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. మరో పక్క పత్రికా ఎడిటర్లపైనా కేసులు నమోదు చేసేందుకు జీఓలు విడుదల చేయడం దేశంలో ఎక్కడా తాను చూడలేదన్నారు. ఇటువంటి చీకటి జీఓలు విడుదల చేయడం మానుకుని ఉన్న మూడేళ్ల కాలం ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించాలని చంద్రబాబుకు హితవు పలికారు.రైతు సేవా కేంద్రంలో చోరీ బొబ్బిలి రూరల్: మండలంలోని సిహెచ్.బొడ్డవలస గ్రామ రైతు సేవా కేంద్రలో శుక్రవారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు దొంగిలించుకుపోయారు. ఈ మేరకు హార్టీకల్చర్ అసిస్టెంటుగా పని చేస్తున్న ఆరికతోట నాగభూషణం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి పది గంటల వరకు తాను విధుల్లోనే ఉన్నానని, అప్పుడే తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆర్ఎస్కే తాళాలు పగిలి ఉన్నాయని లోపలికి వెళ్లి చూస్తే కంప్యూటర్, ప్రింటర్, టీవీ కనిపించలేదని దొంగలు వాటిని పట్టుకుపోయారని సుమారు రూ.లక్షన్నర విలువుంటుందని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, నెల్లిమర్ల రూరల్: భోగాపురంలో విమానాశ్రయ ప్రారంభోత్సవానికి నెల్లిమర్ల మండలం నుంచి సుమారు 6వేల మందిని ప్రత్యేక బస్సుల్లో తరలించిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం డెంకాడ మండలం నాతవలస టోల్గేట్ సమీపంలో ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజన నాణ్యతపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నం పూర్తిగా ముద్దగా మారడంతో చాలా మంది ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. బ్రేక్ఫాస్ట్గా ఇచ్చిన పులిహోర సైతం ఉడకలేదని ప్రజలు ఆరోపించారు. చాలా మంది తినకుండానే ఆకలితో వెనుతిరిగారు. దీంతో అక్కడున్న టీడీపీ నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజలు పాల్గొనే కార్యక్రమంలో నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమయ్యారని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ మండల నాయకుడు గేదెల రాజారావు తెలిపారు. -
700 క్యూసెక్కుల నీరు సరఫరా
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా శనివారం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. గత కొంత కాలంగా ఖరీఫ్ సీజన్కు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 24,788 ఎకరాల ఆయకట్టు భూములకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయకట్టుకు నీటి అవసరం ఉండడంతో మరో 200 క్యూసెక్కుల నీటిని పెంపుదలచేసి మొత్తం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ నితిన్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 61.96 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ ● ప్రజలు సురక్షితంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు విజయనగరం గంటస్తంభం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న వాహనాల రాకపోకలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి స్వయంగా పర్యవేక్షించారు. సుమారు గంటపాటు అక్కడే ఉండి ఈఎంఎస్ వ్యవస్థతో వాహనాల కదలికలను పరిశీలించారు. ప్రధాని పర్యటనకు వచ్చిన 4,860 బస్సుల్లో ప్రయాణించిన ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సెర్ప్ డైరెక్టర్(అడ్మిన్) ఎ.కల్యాణ్ చక్రవర్తితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు విజయనగరం టౌన్: అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగించినందుకు జిల్లా ప్రజలకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్శాఖ ముందస్తు ప్రణాళికతో చేపట్టిన భద్రతా, బందోబస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు. జాతీయ రహదారిపై కాసేపు వాహనాల రద్దీ ఏర్పడినప్పటికీ అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా స్పందించి ట్రాఫిక్ను త్వరితగతిన సాధారణ స్ధితికి తీసుకువచ్చారన్నారు. బందోబస్తు విధులను అత్యంత క్రమశిక్షణతో, నిబద్దతతో నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎయిర్పోర్టుకు శంఖారావం చేసిన కోడూరు వాసి బాడంగి: మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన యోగా శిక్షకుడు కడిమిశెట్టి రమేష్కు అరుదైన అవకాశం లభించింది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం తొలుత శంఖానాదం చేశారు. విజయనగరం డిప్యూటీ కలెక్టర్ శర్మ సూచనల మేరకు ప్రధాని మోదీ పాల్గొన్న సభాస్థలి వద్ద శంఖారావంపూరించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు రమేష్ తెలిపారు. -
‘ఇస్రో అకాడెమియా కనెక్ట్’లో సీతం అధ్యాపకులు
విజయనగరం అర్బన్: విశాఖపట్నం ఆంధ్రయూనివర్సిటీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఇస్ట్రో అకాడెమియా కనెక్ట్’ ఒకరోజు సదస్సులో సీతం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ పరిశోధనలు, విద్యార్థులకు ఇంటర్న్షిప్, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రయోగ వాహనాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాల్లో విద్యా సంస్థలకు ఇస్రో పూర్తి సహకారం అందిస్తుందని ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ ఎం.గణేష్ పిళ్లై పేర్కొన్నారు. ఈ సదస్సులో పొందిన విజ్ఞానాన్ని ప్రత్యేక వీక్షణ కార్యక్రమాలతో విద్యార్థులతో పంచుకుంటామని అధ్యాపకులు తెలిపారు. జాతీయ స్థాయి పరిశోధనల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు కళాశాల కృషి చేస్తోందని సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు పేర్కొంటూ పాల్గొన్న అధ్యాపకులను అభినందించారు. -
విద్యార్థినులకు కడుబండి పరామర్శ
శృంగవరపుకోట: మండలంలోని తాటిపూడి వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల కళాశాలలో జ్వరాల బారినపడిన విద్యార్థినులను మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం పలువురు నేతలతో కలిసి పరామర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థినులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అక్కడే ఉన్న కొ ట్టాం పీహెచ్సీ వైద్యాధికారి హారికతో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న సేవల గురించి, ప్రిన్సి పాల్ శారదాబాయితో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం, కళాశాలలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతులు,ఇతర సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎటువంటి అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, నాయకులు వాకాడ రాంబాబు, కె.వెంకటరావు, టి.సాంబరాజు, డి.సన్యా సిదేముడు, ఆల్తి బాబురావు, ఎస్.కనకం, చిన్నా మాస్టర్ ఉన్నారు. -
డీఎస్సీ లీకేజీ పాపం ప్రభుత్వానిదే..
ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అడుగడుగునా అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్హులైన నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. దీనిపై ఇప్పటికే నిరుద్యోగ యువత, విద్యార్థు లు ఎక్కడికక్కడ నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్న్రెడ్డి పిలుపు మేరకు మన్యం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. మా ప్రధాన డిమాండ్ ఒకటే.. ఈ మెగా స్కామ్పై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో యువతతో కలిసి రిలే నిరాహార దీక్షలు, 10న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు చేపడతాం. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. – పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి పార్వతీపురం రూరల్: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో చోటు చేసుకున్న భారీ అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ మన్యం జిల్లా ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, అరకు పార్లమెంట్ పరిశీలకులు చిన అప్పలనాయుడు శుక్రవారం కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, అర్హతలేని వారికి క్రీడా కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించి లీకేజీకి పునాది వేశారని ధ్వజమెత్తారు. వ్యవస్థలో పని చేసిన వారికే టాప్ ర్యాంకులు రావడం దీనికి నిదర్శనమన్నారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను గాలికొదిలేసిందని విమర్శించారు. దాదాపు రూ. 9,500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, ఫీజు లు కట్టలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ నిధుల ను విడుదల చేయాలని కోరారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు.. నేటికీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. బకాయిలతో సహా నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ను కోరారు. పార్టీ పలు అనుబంధ విభాగాల నాయకులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి లోకేశ్కు సవాల్ చేస్తున్నా..
మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. గతంలో వైఎస్ జగన్మోహన్న్రెడ్డి బయటపెట్టిన ప్రతి అంశంపై స్పష్టమైన సమయపాలనతో విచారణ జరగాలి. నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున పోరాడేందుకు మా పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఎన్నికల్లో నిరు ద్యోగ భృతి ఇస్తామన్న కూటమి సర్కారు నేటికీ మోసం చేస్తూనే ఉంది. డీఎస్సీలో డబ్బులిచ్చి, అనర్హులను ఎంపిక చేసుకున్నారు. సీబీఐ విచారణ జరిపించాలి. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే మంత్రి లోకేశ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సిందే. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ -
లెక్కలేని ఓట్లు.. లక్షకు మించి..!
సాక్షి, పార్వతీపురం మన్యం: అనుకున్నదే అయ్యింది. ఓట్ల రాజకీయం మొదలైంది. భారీ సంఖ్యలో ఓట్లకు గండం ఏర్పడింది. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2026 మే 25 నాటికి జిల్లాలో 7,90,562 ఓట్లు ఉండగా.. సర్ ప్రక్రియ తర్వాత 7,15,443గా లెక్క తేలాయి. ఇందులో పురుషులు 3,49,188 కాగా.. మహిళలు 3,66,189 మంది ఉన్నారు. ఇతరులు 66 మంది. సవరించిన జాబితా ప్రకారం.. మరణించిన వారు 36,003.. గుర్తించలేని/గైర్హాజరు 11,280, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 17,284, డబుల్ ఎంట్రీలు 10,462, ఇతరులు 90 ఓట్లు కలిపి మొత్తం 75,119 ఓట్లు డోలాయమానంలో ఉన్నాయి. ఈ ఓట్లన్నీ దాదాపు తొలగిపోయినట్లే. ఇదంతా ఒక ఎత్తయితే.. 19,952 ఓట్లు మ్యాపింగ్ కాకుండా మిగిలిపోయాయి. చిన్నచిన్న తప్పులు (తార్కిక వైరుధ్యాలు) ఉన్న ఓట్లు ఏకంగా 1,07,112 ఓట్లు ఉండడం గమనార్హం. పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పు దొర్లడం వంటివని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ తిరస్కరించారు. ఈ లెక్కన దాదాపు 1.50 లక్షలకు పైగా ఓట్లకు గండం ఏర్పడినట్లే. వీరందరికీ నోటీసులు ఇస్తామని అధికారులు అంటున్నారు. ఫారం 6, 7, 8ల ద్వారా తిరిగి ఓటును పునరుద్ధరించుకోవచ్చని చెబుతున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందన్నది ప్రశ్నార్థకమే. ప్రతి నియోజకవర్గంలో 30 వేల నుంచి 40 వేల వరకూ ఓట్లు ప్రమాదంలో పడ్డాయి. సర్ ప్రక్రియ మొత్తం అస్తవ్యస్తంగా సాగింది. ఎన్యుమరేషన్ ఫారాలు శతశాతం పంపిణీ చేశామని చెబుతున్న అధికారులు.. చిరునామా లేక, ఇతర కారణాల వల్ల వాటిని తిరిగి తీసుకోలేకపోయిన ఓట్లు వేలల్లో ఉండడం గమనార్హం. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన బీఎల్ఏలు దగ్గరుండి కథ నడిపించారన్న విమర్శలు వచ్చాయి. రానున్న పంచాయతీ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, గ్రామీణ ప్రాంతాలు.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లనే లక్ష్యంగా చేసుకొని అధికారి పార్టీకి చెందిన నాయకులు చక్రం తిప్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్య నియోజకవర్గం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం పాలకొండ 87,799 92,575 14 1,80,388 కురుపాం 86,331 91,328 41 1,77,700 పార్వతీపురం 85,443 87,815 8 1,73,266 సాలూరు 89,615 94,471 3 1,84,089 డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలను ప్రతి ఓటరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఓటరు పేరు నమోదు కాకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగుతున్నట్లయితే సంబంధిత ఎన్నిక ల నమోదు అధికారి/సహాయ ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించి ఆగస్టు 30లోగా దరఖా స్తు చేసుకోవచ్చు. మ్యాపింగ్, తార్కిక వైరుధ్యా లు కేటగిరీలలో గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. సంబంధిత ఓటర్లు ఎన్నిక ల సంఘం సూచించిన పత్రాలలో ఏదో ఒక పత్రాన్ని, ఆధార్ కార్డుతో పాటు, నిర్దేశిత గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. – ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి. -
ఎన్సీఎస్ కర్మాగారంలో సీబీఐ సోదాలు!
సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అంతర్భాగమైన లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారానికి సంబంధించిన ఆస్తులపై శుక్రవారం పలుచోట్ల సీబీఐ అధికారులు సోదాలు జరిపినట్టు తెలిసింది. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, విజయనగరం, లచ్చయ్యపేటలో ఉన్న కంపెన్నీ కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు సమాచారం. 2015 ఆర్ధిక సంవత్సరంలో నేషనల్ స్పాట్ (ఎన్ఎస్ఈఎల్) ఎక్సేంజ్ లిమిటెడ్ నుంచి రూ.155 కోట్ల రాసుగర్, మెటీరియల్, బొగ్గు వ్యాపారం నిమిత్తం ఎన్సీఎస్ యాజమాన్యం రుణం తీసుకుని 16 అకౌంట్లలోకి సర్దుబాటు చేసింది. తీసుకున్న రుణం సకాలంలో తీర్చక పోవడం, సంస్థ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఏదో కుంభకోణం జరిగిందన్న అనుమానంతో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. సోదాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా నాయుడు
పార్వతీపురం రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభా గం నూతన బాధ్యులను పార్టీ కేంద్ర కార్యాల యం ప్రకటించింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపింది. ఈ మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పల్లా అనంత నాయుడు నియమితులయ్యారు. కురుపాం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ముంజి సురే ష్కు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని వివి ధ నియోజకవర్గాల యువజన విభాగ సమన్వ యం, సంస్థాగత బాధ్యతల నిమిత్తం ఈ ప్రకటన విడుదల చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భామిని: మండలంలో కొబ్బరి తోటల్లో గజరా జులు సంచరిస్తున్నాయి. బిల్లుమడలో కొబ్బరి తోటలను శుక్రవారం నాశనం చేశాయి. వంశ ధార నదీ తీరం వెంబడి నాలుగు ఏనుగుల గుంపు పంటలపై దాడులు చేశాయని రైతులు వాపోతున్నారు. గజరాజుల వరుస దాడులతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. పార్వతీపురం: జిల్లాలో మలేరియా, ఇతర జ్వరా ల నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి క్షేత్ర స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాల ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జ్వరాల కేసులను గుర్తించి రాపిడ్ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు, యాక్ట్ కిట్లు అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలలో అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య శిబిరాల వివరా లు, రోగుల వ్యాధుల వర్గీకరణను ప్రతీ రోజూ ప్రొఫార్మా ప్రకారం నమోదు చేసి నివేదికలు పంపాలని, గ్రామాల్లో ఫ్రైడే – డ్రైడే కార్యక్ర మాన్ని సమర్ధవంతంగా నిర్వహించి, లార్వా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహి స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ గత నెలలో 1.25 లక్షలకు పైగా ఓపీ సేవలు అందించామని, జూలై 1 నుంచి 30వరకు 47,324 మందికి రాపిడ్ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంత ర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులతో శుక్రవారం జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించా రు. ప్రజలను సభా వేదికలకు తరలించే బస్సులు నిర్ణీత సమయానికి బయలుదేరి గమ్యస్థానానికి చేరేలా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. బస్సుల్లో ఖాళీలు ఉంటే బఫర్ జాబితా నుంచి వెంటనే భర్తీ చేయాలని, ప్రయాణి కుల వివరాలను జిల్లా గ్రూపులలో వెంటనే పంపించాలని ఎంపీడీఓలకు ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై సీఎంఓకు ఫిర్యాదు చేస్తా..
● మక్కువ రెవెన్యూ అధికారులపై మండిపడిన ఆర్డీఓ ● ఒకరికిచ్చిన పట్టాపై మరొకరికి పొజిషన్ పట్టా ఎలా ఇచ్చారు? మక్కువ: ఓ వ్యక్తికి అందించిన ఇంటి పట్టాపై.. అదే స్థలంలో మరో వ్యక్తికి ఎలా పొజిషన్ పట్టా ఇచ్చా రు? దీని వల్ల రెండు కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని మీకు తెలియదా..! ఈ విషయంలో మీపై సీఎంఓకు రిపోర్టు రాస్తానంటూ పార్వతీపు రం ఆర్డీఓ కె.మాధురి మక్కువ రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. మండలంలోని చెముడు గ్రామానికి చెందిన బొద్దూరు కృష్ణకి గత జగనన్న ప్రభుత్వం లేఔట్లో 84/11లో ఇంటి పట్టా మంజూరు చేసింది. అదే స్థలంలో అదే గ్రామానికి చెంది న బుసాల సావిత్రి అనే మహిళకు రెవెన్యూ అధికా రులు 2024లో పొజిషన్ పట్టా మంజూరు చేశారు. దీంతో సావిత్రి కృష్ణకు మంజూరు చేసిన ఇంటి స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ సమస్యపై పలుమార్లు బొద్దూరు కృష్ణ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపో వడంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ ఏడాది ఏప్రిల్ 24న ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఆర్డీఓ మాధురి శుక్రవారం మక్కువ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఒకరికి పట్టా ఇచ్చిన దానిపై వేరొకరికి పొజి షన్ పట్టా ఎలా ఇచ్చారు? పరిశీలన చేయకుండా ఇలా పొజిషన్ పట్టా ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడ్డారు. అప్పటి తహసీల్దార్ హోదాలో పొజిషన్ పట్టా జారీ చేసిన ప్రస్తుత మక్కువ తహసీల్దార్ కార్యాలయ ఉప తహసీల్దార్ ఇబ్రహీంను ఆర్డీఓ ప్రశ్నించారు. వీఆర్ఓ, ఆర్ఐ రిపోర్టు మేరకు పొజిషన్ పట్టా ఇచ్చానని ఉప తహసీల్దార్ చెప్పడంతో వారి చెబితే కేసు స్టడీ చేయకుండా ఇచ్చేస్తారా? అంటూ నిలదీశారు. ఇందుకు బాధ్యులైన అందరిపై సీఎంఓకు రిపోర్టు రాస్తానని హెచ్చరించారు. మాన్యువల్ భూ రికార్డుల కంప్యూటరీకరణ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మక్కువ ఎంఎల్ఎస్ పాయింట్ తనిఖీ చేశారు. -
లోకేశ్దే బాధ్యత
మెగా డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అవకతవకలు, లీకేజీలపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాలి. ఈ వైఫల్యానికి కారణమైన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలన్నది మా పార్టీ తరఫున ప్రధాన డిమాండ్. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. తక్ష ణమే ఆ భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం ఘటనలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసును సాకుగా చూపి, కక్షసాధింపు చర్య ల్లో భాగంగానే అరెస్టులకు పాల్పడుతున్నారు. గురువారం విశాఖ విమానాశ్రయం నుంచి జైలు వరకు వైఎస్ జగన్ పర్యటనకు ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పోలీసులు లాఠీచార్జి చేసి అడ్డుకున్నా వేలాదిగా జనం తర లిరావడమే చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం. పార్టీలకతీతంగా అంతా జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నా రు. ప్రభుత్వం ఇప్పటికై నా డీఎస్సీ దోషులపై చర్యలు తీసుకోవాలి. –శరగడం చిన అప్పలనాయుడు, పార్లమెంటు పరిశీలకులు -
డీఎస్సీ పేరిట దగా..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువత ను, వారి తల్లిదండ్రులను మోసం చేసింది. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి మెడలు వంచిన తరహా లోనే.. రాష్ట్రంలోనూ ‘జెన్–జి’ యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్సీపీ అండతో యువత వీధి పోరాటాలకు సిద్ధమవుతోంది. చంద్రబాబు మెడలు వంచైనా సరే... నిరుద్యోగులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను అందించే బాధ్యతను వైఎస్సార్సీపీ తీసుకుంటుంది. – అలజంగి జోగారావు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే -
పర్యాటకానికి కేరాఫ్ పార్వతీపురం మన్యం
సీతంపేట: పర్యటకానికి కేరాఫ్ అడ్రస్గా పార్వతీపురం మన్యం జిల్లా నిలుస్తుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి మంగళవారం మన్యం సవారి బైక్ ర్యాలీ నిర్వహించా రు. స్థానిక అడ్వంచర్ పార్కు నుంచి సున్నపుగెడ్డ వరకు బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈస్ట్రన్ ఘాట్స్ గ్రీనరీ ఒక గ్రీన్ వరల్డ్లా కనిపిస్తుందని, పర్యాటకులు మేఘాల నడుమ ప్రయాణించేలా రైడ్ విత్ క్లౌడ్ అనుభూతిని అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. కాంక్రీట్ జంగిల్ దాటి అడవుల్లో కనీసం 3 గంటలు సమయం గడిపితే శరీరానికి లభించే ఆక్సిజన్, ఆరోగ్యంపై పరిశోధనలు సైతం సానుకూల ప్రభావం చూపుతాయన్నా రు. సున్నపుగెడ్డ మార్గం లాంటి మరిన్ని పర్యా టక రూట్లను త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం సోమగండి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పింఛన్లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.మాధురి, డీఆర్ డీఏ పీడీ ప్రభావతి, తహసీల్దార్ శ్రీకన్య, ఎంపీ డీఓ మిశ్రో, తదితరులు పాల్గొన్నారు. సాలూరు: అధికారుల నిర్లక్ష్యమో కూటమి ప్రభుత్వ వైఫల్యమో మన్యంలో మరో చిన్నారి అనారోగ్యంతో మృతి చెందింది. కేవలం జ్వరం వచ్చి సరైన చికిత్స అందక ఇటీవల చిన్నారులు మృత్యువాత పడుతున్న సంఘట నలు పాఠకులకు విదితమే. తాజాగా బుధవా రం సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ శిఖపరువు గ్రామానికి చెందిన మూడే ళ్ల చిన్నారి కేవలం జ్వరంతో సరైన చికిత్స అందక మరణించింది. వివరాల్లోకి వెళితే శిఖపరు వు గ్రామంలో నివాసముంటున్న కూనేటి రా ము, జానులకు ఒక్కగానొక్క కుమార్తె మేరీ. మేరీకి ఈ నెల 27వ తేదీన జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక తోణాం పీహెచ్సీకి తీసుకువెళ్లారు. పీహెచ్సీలో చిన్నారికి వైద్యపరీక్షలు చేయగా టైఫాయిడ్, మలేరియా నెగటివ్ వచ్చిందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. చికి త్స అందించేందుకు ఆస్పత్రిలో ఉండాలని వైద్యసిబ్బంది చిన్నారి తల్లిదండ్రులకు సూచించారు. అయితే తమ గ్రామం దగ్గరే కావున వచ్చి చికిత్స తీసుకుంటామని చెప్పి పాపను తల్లిదండ్రులు ఇంటికి తీసుకు వెళ్లిపోయారు. 27 సాయంత్రం, 28న ఉదయం, సాయంత్రం చిన్నారిని పీహెచ్సీకి తీసుకురాగా వైద్యం అందించారు. 29 ఉదయం తమ గ్రామం నుంచి పీహెచ్సీకి వెళ్లేందుకు వాహనం ఏమీ రాకపోవ డం, తల్లిదండ్రులిద్దరు జలుబు, జ్వరంతో ఉండడంతో చిన్నారిని పీహెచ్సీకి తీసుకువెళ్లలేకపోయారు. ఈలోగా చిన్నారికి ఇంటి వద్దే విరో చనాలై మరణించింది. గురువారం శిఖపరువు గ్రామానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి వెళ్లి వైరల్ జ్వరంతో మృతి చెందిన చిన్నా రి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైరల్ జ్వరంతో చిన్నారి మరణించిందని, ఆమె తల్లిదండ్రులు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని తెలియజేశా రు. అయితే ఇదే గ్రామంలో సబ్సెంట ర్ ఉన్నప్పటికీ గ్రామంలో చిన్నారి అనారోగ్యంతో మరణించడంపై ప్రజల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆగస్టు 2న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్ గురువా రం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి నగర శివారులోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయ ని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
గిరిజన బాలికలకు నృత్య‘శిక్ష’ణ!
విజయనగరం అర్బన్/పూసపాటిరేగ: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర యం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ ముందు ‘మెప్పు’ కోసం చంద్రబాబు సర్కారు పాకులాడుతోంది. థింసా నృత్య శిక్షణ పేరిట గిరిజ న బాలికలను అవస్థలకు గురిచేస్తోంది. ‘గిన్నిస్ రికా ర్డు’ ఆర్భాటం కోసం వేలాది మంది గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులను చదువులకు దూరం చేయడం, మండే ఎండలో శిక్షణ ఇస్తుండడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రికార్డు సంఖ్యలో 14 వేల మంది గిరిజన బాలికలతో థింసా నృత్యం చేయించాలని సర్కారు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఐటీడీఏ పాడేరు పరిధి నుంచి 7 వేల మంది, పార్వతీపురం మన్యం నుంచి 3 వేలు, రంపచోడవరం నుంచి 2 వేలు, సీతంపేట నుంచి 2 వేల మంది 8, 9, 10 తరగతులు చదువుతున్న బాలికలను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 26వ తేదీ నుంచి ఎయిర్పోర్టు గ్రౌండ్లో థింసా నృత్యంపై శిక్ష ణ ఇస్తోంది. శిక్షణ, ప్రచారం మోజుపై ఉన్న ఆసక్తి గిరిజన బాలికలకు సదుపాయాలు కల్పించడంలో చూపడం లేదు. సరైన తిండిలేక, పడుకునేందుకు చోటులేక నరకయాతన పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల్లో సరైన వసతులు లేకుండా పశువులకంటే హీనంగా వసతిగృహాలు, కళాశాలల్లో ఉంచడంపై బాలికల తలిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో గోదావరి పుష్కరాలు, యోగాసన సాధన, ఆలయాల వద్ద జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ.. ప్రచారం పేరుతో ప్రాణాలు తీయడం చంద్రబాబుకు అలవాటని, గిరిజన బాలికలు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ గిరిజన సంఘాల నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆకలి కేకలు.. రికార్డులు తిరగరాయాలన్న ఆకాంక్షే తప్ప, సుదూ ర ప్రాంతాల నుంచి వచ్చే బాలికల కనీస అవసరాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి నృత్య సాధన పేరిట గంటల తరబడి ఎండలోనే శిక్షణ ఇస్తున్నారు. వీరికి విజయనగరం జిల్లాలోని డెంకా డ, భోగాపురం, నెల్లిమర్ల, పూసపాటిరేగ ప్రాంతా ల్లోని వసతి కేంద్రాల్లో, విశాఖ సరిహద్దుల్లోని తగరపువలస, భీమిలి మండలాల వసతి కేంద్రాల్లో బాలికలకు ఆశ్రయం కల్పించారు. 150 మందికి మాత్రమే వసతి ఉన్న ఆయా కేంద్రాల్లో మరో 200 మంది వరకు అదనంగా చేర్చడంతో సౌకర్యాలు మృగ్యమయ్యాయి. పిల్లలకు వండిన అన్నం సరిపో క, అర్ధాకలితోనే నిద్రపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఫ్యాన్లు పనిచేయక, ఉక్కబోత, విషపురుగు ల బెంగతో బాలికలు నిద్రకుదూరమవుతున్నారు. 14 వేల మంది బాలికలకు తగినన్ని మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో దుర్వాసన మధ్యే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని గిరిజన విద్యార్థిని, ఉపాధ్యాయురాలు తెలిపారు. బలి పశువులుగా టీచర్లు.. ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి విద్యార్థినులతో పాటు వారిని పర్యవేక్షించేందుకు వచ్చిన గిరిజన సంక్షేమ పాఠశాలల టీచర్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు. 13 వేల మంది బాలికల్లో 50 మందికి ఒకరు వంతున దాదాపు 260 మంది టీచర్లను గైడ్లుగా నియమించా రు. ‘పిల్లల బాధ్యత మాపై తోసేశారు.. కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు, రాత్రి పడుకోవడానికి సరిప డా స్థలం కూడా లేదు.. పిల్లలు ఆకలితో అల్లాడుతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు.. ఏదైనా విపత్తు జరిగితే అధికారులు తప్పించుకుంటారు.. మా సరిస్థి తి ఏమిటి?’ అంటూ పలువురు టీచర్లు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్టహాసంగా థింసా నృత్యం చేయించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్న సర్కారు.. తక్షణమే బాలికలకు నాణ్యమైన భోజనం, రక్షణ, సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని గిరిజన, విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి. ప్రచార ఆర్భాటం.. గిరిజన బాలికల ప్రాణాలతో చెలగాటం! థింసా శిక్షణ పేరిట నరకయాతన 14 వేల మంది బాలికలను తరలించి చేతులెత్తేసిన అధికారులు డెంకాడ, భోగాపురం మండలాల్లో అస్తవ్యవస్తంగా వసతులు.. కన్నీరు పెడుతున్న విద్యార్థినులు, టీచర్లు బయటకు చెప్పుకోలేక మదనపడుతున్న వైనం -
ఉరకలెత్తిన ఉత్సాహం
భోగాపురం జాతీయరహదారిపై ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తదితరులు జననేత రాకతో సాక్షి ప్రతినిధి, విజయనగరం: జై జగన్.. జైజై జగన్.. అన్నా.. మళ్లీ నువ్వే సీఎం.. అన్న నినాదాలతో జాతీయ రహదారి హోరెత్తింది. జననేత అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా అభిమానలోకం ఉరకలెత్తే ఉత్సాహంతో వెంటసాగింది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఘనంగా స్వాగతం పలికింది. శ్రీకాకుళం జిల్లా అంపోలు సబ్ జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జిల్లా మీదుగా గురువారం వెళ్లిన జననేతకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జననేత రాకకోసం జాతీయ రహదారిపై వివిధ కూడళ్లలో ఎదురుచూశారు. ఆయన కనిపించేసరికి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉదయం 10 గంటల నుంచి మహిళలు, యువత, విద్యార్థులు నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, నాతవలస, సీహెచ్ అగ్రహారం తదితర కూడళ్లకు చేరుకుని జననేత రాకకోసం ఎదురు చూశారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి.. దాని శ్రీకారానికి మీరే కారణం.. థాంక్యూ జగన్ సర్ అంటూ ప్ల కార్డులు చూపిస్తూ ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు పక్కన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. రైతులు...యువత జననేతతో కరచాలనానికి ఎగబడ్డారు. ఎక్కడికక్కడ ఆయన వాహనానికి స్వాగతం పలుకుతూ అడుగు పడనివ్వకుండా.. కాన్వాయ్ ముందుకు సాగనివ్వకుండా అభిమాన దడి కట్టేశారు. పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జననేత వెంట శ్రీకాకుళం వరకు సాగారు. గజమాలతో స్వాగతం నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండల అప్పలనాయుడు సారథ్యంలో వందలాది మంది యువకులు గజమాలతో స్వాగతం పలికారు. దాదాపు కిలోమీటరు దూరం నుంచి కనిపించేలా ఆకాశానికి భూమికి నిచ్చెన వేసేలా పార్టీ రంగులతో గజమాల భారీ క్రేన్కు వేలాడుతూ జననేతకు స్వాగతించింది. వేలాది కార్యకర్తల నడుమ ఆ గజమాల వైఎస్ జగన్ మెడలో అలంకారమై తనకుతాను పులకించిపోయింది. ఈ కార్యక్రమం ఆద్యంతం భోగాపురం, డెంకాడ మండలాల కార్యకర్తలు యువతలో నూతనోత్సాన్ని నింపింది. సీహెచ్ ఆగ్రహరంలో... సీహెచ్ అగ్రహారం కూడలిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకుని వైఎస్ జగన్కు స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి జైజగన్ అంటూ నినదించారు. పోలీసు ఆంక్షలను ఛేదించి.. భోగాపురం విమానాశ్రయం నిమిత్తం ప్రధాని రాకతో ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఆ పోలీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిలువరించేందుకు ఉపయోగించింది. అయితే, జననేతను చూడాలన్న లక్ష్యంతో జనం వివిధ మార్గాల్లో జాతీయ రహదారికి చేరుకున్నారు. అభిమాన నాయకుడు తమ ఊరు రావడంతో తమ ఇంటికి పండగ వచ్చినట్లు.. తమ ఇంట్లో సంబరం జరుగుతున్నట్లు ఫీలయ్యారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను సైతం తమతో పాటు తీసుకొచ్చి తమ అభిమాన నాయకుడితో ఫొటోలు తీయించి షేక్ హ్యాండ్ చేయించడానికి ఉత్సాహపడ్డారు. ● భోగాపురంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, నాయకులు యు.శివారెడ్డి, యు.విజయబాస్కరరెడ్డి, కె.వెంకటరమణ తదితరులు జననేతకు స్వాగతం పలికారు. ● నాతవలస వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వైఎసార్సీపీ యువజన, ఐటీ విభాగం అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్, మణిదీప్, తదితరులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తన అనుచరులతో కలిసి జగనన్నకు స్వాగతం పలికేందుకు ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు, నాయకులు మావుడి రంగునాయుడు పాల్గొన్నారు. సిరిసహస్రకు జగనన్న ఆశీస్సులు జననేత రాకకోసం.. విజయనగరం రూరల్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించేందుకు విజయనగరం జిల్లా మీదుగా వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేతకు విజయనగరం నియోజకవర్గ నేతలు ఘనస్వాగతం పలికారు. నాతవలస, సీహెచ్ అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై జననేతకు మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మేయర్ వి.విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కోలగట్ల శ్రావణిని జననేత ఆశీర్వదించారు. జననేతకు అభిమాన హారతి స్వాగతం పలికేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు జనసంద్రంగా మారిన జాతీయ రహదారి జననేతను చూసి కేరింతలు కొట్టిన అభిమానులు విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్హన్ రెడ్డికి ఆనందపురం వద్ద జెడ్పీ చైర్మన్ మజ్జిశ్రీనివాసరావు కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర పుష్ఫగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆమెను జగన్ ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. -
30 కార్లతో జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం
సాలూరు రూరల్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం శ్రీకాకుళం వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి స్వాగతం పలికేందుకు నాతవల స కూడలి వద్దకు సుమారు 30 కార్లతో సాలూ రు నియోజకవర్గం నుంచి ఉదయం 9 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలదేరనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం జన్నదొర తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడు తూ రాజకీయ కుట్రలతో సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనకు ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ ధైర్యం చెప్పేందుకు జగన్ మోహన్ రె డ్డి వస్తున్నారన్నారు. సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని రాజన్నదొర కోరారు. పాచిపెంట: ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ధింసా నత్య ప్రదర్శనలో పాల్గొనేందుకు పాచిపెంట మండలంలోని పలు గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులను బుధవారం ఎనిమిది బస్సుల్లో తరలించారు. ఈ బస్సులను పి.కోనవలస వద్ద గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. సీతంపేట నుంచి.. సీతంపేట: భోగాపురంలో ధింసా నృత్యం చేయడానికి సుమారు 2 వేల మంది విద్యార్థులను అధికారులు బుధవారం తరలించారు. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనున్న విషయం విదితమే. ఈ సందర్భంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల గిరిజన విద్యార్థులను ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. రేగిడి: మండల పరిధిలోని లచ్చన్నవలస ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న మంతిన హేమలత బ్రెయిన్ స్ట్రోక్తో బుధవారం మృతిచెందినట్లు ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. ఈ నెల 24న పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ డే సమావేశం నిర్వహించిన సమయంలో ఆమె అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మెదడులో రక్తనాళాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారని ఎంఈఓ వెల్లడించారు. -
ఇంటింటికీ నీరసం!
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం ఆశించిన స్థాయిలో స్పందన కానరావడం లేదు. సొంత క్యాడర్ నుంచే ఊపు అందుకోలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తం 45 రోజుల పాటు ప్రతి ఇంటికీ వెళ్లాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27న ప్రారంభించినప్పటికీ.. తొలి రెండు రోజుల్లోనే క్షేత్రస్థాయిలో ఆశించిన ఉత్సాహం కనిపించడం లేదని పార్టీ వర్గాల్లోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పుకోదగ్గపాలన లేక... మహిళలకు ఉచిత బస్సు పథకం మినహా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవని.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల్లో భారీగా కోత విధించడం వల్ల నిలదీతలు తప్పవన్న భయం టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. అభివృద్ధి పనులు జరగడం లేదు. ప్రధాన పట్టణాలతో పాటు, గ్రామాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎరువులు రైతులకు దొరకడం లేదు. వీటిపై ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపైనా ప్రజల నుంచి ప్రతిఘటన ఉంటుందన్న భయం నాయకుల్లో ఉంది. దీనికితోడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక స్థాయిలో కార్యకర్తలు ఎదురుచూసిన పనులు జరగలేదన్న అసంతృప్తి కొంతమందిలో ఉందని, అదే కార్యక్రమంపై ప్రభావం చూపుతోందని ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలు, నాయకుల్లో ఆశించిన స్థాయిలో పాల్గొనే ఉత్సాహం కనిపించడం లేదని, కార్యక్రమం కేవలం లాంఛనప్రాయంగా కొనసాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలను పక్కనపెట్టి టీడీపీ ఒక్కటే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడంపై ఆ రెండు పార్టీ ల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో జనసేన ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకొండ వంటి నియోజకవర్గంలో కూడా ఆశించిన స్థాయిలో కార్యక్రమం జరగడం లేదు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు ఉండగా.. వీటి పరిధిలో సుమారు 2,57,047 గృహాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గాల్లోని మూడింటిలో మొక్కుబడిగా కార్యక్రమం సాగుతుండగా.. జనసేన ఎమ్మెల్యే ఉన్న పాలకొండ నియోజకవర్గంలో పేరుకే నిర్వహించి, మమ అనిపిస్తున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీలో వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వంలో తాము కూడా కీలక భాగస్వాములమేనని, ప్రచార కార్యక్రమాల్లో తమకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిందని బీజేపీ, జనసేన నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. మొదట్లోనే ఇలా ఉంటే.. ముందున్న రోజుల్లో ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లి ఆశించిన ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు తాడంగి సాయిబాబు, సహాయ కార్యదర్శి ఊర్లక నాగార్జున డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం లిడికి వలసలో బుధవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వచ్చిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను ప్రశ్నించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... గోచెక్క పంచాయతీ లిడికివలస గ్రామం కొత్త లిడికివలస నుంచి లిడికివలస మీదుగా తాడంగివలస, ఆడారు పంచాయతీ జిల్లేడువలస మీదుగా ఒడిశా సరిహద్దు వరకు గిరిజన గ్రామాలకు అనుసంధానంగా రోడ్లు వేయాలని వినతిపత్రం అందజేశారు. -
బందోబస్తు విధులు సమర్థంగా నిర్వహించాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో రహదారులను పరిశీలించారు. ఆక్టోపస్ ఐజీ శ్రీకాంత్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టీలతో కలిసి ప్రధానిపాల్గొనే సభకు బస్సులు వచ్చే మార్గాలను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. నిర్మాణ పనులు అవుతున్నందున ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు, ర్యాంపులు నిర్మించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విధులు నిర్వహించేందుకు కేటాయించిన ప్రాంతాలను విడిచిపెట్టవద్దన్నారు. బందోబస్తు నిమిత్తం వచ్చిన సిబ్బందికి వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభ నిర్వహించే ప్రాంతాలను, ఎయిర్పోర్టు ఆవరణలో పలు ప్రాంతాలను డాగ్స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షణ్ణంగా పరిశీలించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, వెల్ఫేర్ డీఐజీ అన్భురాజన్, బెటాలియన్ కమాండెంట్ రవిశంకరరెడ్డి, విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2026
ఇంట్లో ముగ్గురమూ జ్వరాల బారిన పడ్డాం. ఇప్పుడు మా పాప రాజేశ్వరికి బాగాలేదు. డోకిశీల ఆస్పత్రికి తీసుకెళ్తే మందులు ఇచ్చి పంపేశారు. తగ్గడం లేదు. కనీసం పరీక్షలు కూడా చేయడం లేదు. పార్వతీపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాం. పరీక్షలు చేసి మలేరియా అన్నారు. రూ.10 వేల వరకూ ఖర్చు అయ్యింది. అప్పు చేశాం. – చిరంజీవి, కొత్తవలస గ్రామం మా ఇంట్లో నాకు, మా ఆయన కు, బాబుకు కూడా జ్వరాలే. నెల రోజులుగా గ్రామంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం రూ.5 వేల వరకూ ఖర్చు చేశాం. ప్రభుత్వాస్పత్రికి వెళ్లినా తగ్గడం లేదు. – స్వాతి, కొత్తవలస గ్రామం సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర తీవ్రతతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. జిల్లాలోని మూడు ఏరియా ఆస్పత్రులు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రిలో సగటున రోజుకు 2 వేలకుపైగా ఓపీ నమోదవుతోంది. ఇందులో సగం మంది వరకు జ్వరం లక్షణాలతో ఉన్నవారే ఉంటున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వేల రూపాయలు ఖర్చు కావడంతో పేద గిరిజన వర్గాలు లబోదిబోమంటున్నాయి. ఇంటిల్లిపాదీ జ్వరాల బారిన పడడంతో వైద్యానికి తీసుకెళ్లే దిక్కు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉండడం లేదు. రోగుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు కూడా చాలడం లేదు. ఒక్కో బెడ్మీద ఇద్దరు, ముగ్గురు చొప్పున చికిత్స పొందుతున్నారు. మలేరియా కేసులే అధికం ఈ ఏడాది ఐదారునెలల్లోనే మన్యంలో 700 పైబడి మలేరియా కేసులు నమోదైనట్టు వైద్య రికార్డులు చెబుతున్నాయి. వాస్తవానికి మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల బారిన పడిన వారి సంఖ్య వేలల్లో ఉంది. జూన్ నుంచి ఆగస్టు వరకూ మలేరియా కేసులు ఏటా ఎక్కువగా నమోదవుతుంటాయి. దీనికి సంబంధించి ముందస్తు చర్యలను వైద్యశాఖ చేపట్టలేదు. చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా కేసులకు కూడా సాధారణ పారాసిటమాల్ టాబ్లెట్, ఇంజక్షన్లు ఇచ్చి సరిపెడుతున్నారు. ఎన్ని రోజులు మందులు వాడినా తగ్గకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ●కొద్ది రోజులుగా వాతావరణం మారింది. చిరు జల్లులు, పరిసరాల్లో నిల్వ నీరు, బురద, తాగునీటి కాలుష్యం వంటి కారణాలతో వైరల్ జ్వరాలు, మలేరియా, డయేరియా వంటివి వ్యాప్తి చెందుతున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు జ్వర పీడితులు పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ కొత్తవలస గ్రామంలో కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వర పీడితులు ఉన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు కూడా రోగాల బారిన పడడంతో ఇంట్లో గంజి కాచే దిక్కు కూడా ఉండడం లేదని గిరిజనులు అంటున్నారు. డోకిశీల పీహెచ్సీకి వెళ్తే.. సాధారణ జ్వరం మాత్రలు ఇచ్చి పంపుతున్నారని, కనీసం పరీక్షలు కూడా చేయడం లేదని వాపోతున్నారు. గ్రామంలో జ్వరాల తీవ్రత అధికంగా ఉందని, వైద్య శిబిరం నిర్వహించాలని కోరితే.. ఏఎన్ఎం, ఆశలను పంపించి.. బ్యానర్ పెట్టి, సాధారణ మందులు ఇచ్చి మమ అనిపించేశారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రాము తెలిపారు. చేసేది లేక, ఆటోకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చి, పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిని రోగులు ఆశ్రయిస్తున్నారని.. అక్కడ వైద్యానికే వేలాది రూపాయలు ఖర్చు అవుతోందని చెప్పారు. గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ దేరుగండ గ్రామానికి చెందిన తోయక ఈశ్వరరావు, సుజాత దంపతుల కుమారుడు వరుణ్(10) ఇదే మండలంలోని టిక్కబాయి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల మలేరియా బారిన పడ్డాడు. మందులు వాడినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సాలూరు మండలం ఎగువమెండంగిలో ఇటీవల అనారోగ్యంతో గిరిజన బాలుడు మృతి చెందారు. వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. 75 మందికి పరీక్షలు చేయగా.. ఆరుగురికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 14 ఏళ్లలోపు వారే ఐదుగురు ఉన్నారు. -
పెద్దాస్పత్రికి పెద్ద జబ్బు..!
● సర్వజన ఆస్పత్రిలో నిలిచిపోయిన ప్రధానమైన వైద్య పరీక్షలు ● ప్రైవేటు ల్యాబ్ల్లో రూ.వేలల్లో ఖర్చు చేస్తున్న రోగులువిజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఒంట్లో నీరసంగా ఉంటోందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు సుగర్ వ్యాధికి సంబంధించి హెచ్బీఏవన్సీ పరీక్ష రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆమె ఆస్పత్రిలోని ల్యాబొరేటరీ వద్దకు వెళ్లగా అక్కడ సిబ్బంది ఆ పరీక్ష లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.500 పెట్టి హెచ్బీఏవన్సీ పరీక్ష చేయించింది. ● గంట్యాడ మండలానికి చెందిన భవాని అనే మహిళకు థైరాయిడ్ లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలని చీటీ రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబొరేటరీకి వెళ్లగా థైరాయిడ్ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.600 పెట్టి చేయించుకుంది. ● జామి మండలానికి చెందిన రామునాయుడు అనే వ్యక్తికి జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ వైద్యులు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) రాశారు. దీంతో సీబీపీ పరీక్ష కోసం ల్యాబొరేటరీ వద్దకు వెళ్లాడు. ఇక్కడ సీబీపీ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.500 పెట్టి చేయించుకున్నాడు. వీరు ముగ్గురే కాదు. ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి వచ్చిన అనేక మంది రోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయినా సర్వజన ఆస్పత్రికి జబ్బు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీసం వైద్య పరీక్షలు కూడా అందించలేని దుస్థితిలో టీడీపీ సర్కార్ ఉందని రోగులు ఆగ్రహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యం అందే పరిస్థితి లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలల నిత్యం అధిక సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తారు. అయితే ఉచితంగా వైద్యం అందించాల్సిన ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడం వల్ల చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి రోగులకు దాపురించింది. నిలిచిపోయిన ప్రధాన వైద్య పరీక్షలు రోగులకు వ్యాధి నిర్ధారణలో ప్రధానమైన వైద్య పరీక్షలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిలిచిపోయాయి. మధుమేహం(సుగర్) వ్యాధి నిర్ధారణలో అతి ప్రధానమైన హెచ్బీఏ1సీ (మూడు నెలల సుగర్ను నిర్ధారించే) పరీక్ష కొద్ది రోజులుగా చేయడం లేదు. అదేవిధంగా థైరాయిడ్ పరీక్ష అయితే రెండున్నర నెలలుగా చేయడం లేదు. ముఖ్యంగా సీబీపీ(కంప్లీట్ బ్లడ్పిక్షర్) పరీక్ష కూడా గత కొద్ది రోజులుగా నిలిచిపోయింది. ప్రస్తుత సీజన్లో ఈ పరీక్ష చాలా అవసరం. ఎందుకంటే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ అధికంగా ఉన్న నేపథ్యంలో సీబీపీ పరీక్షను ప్రతి రోగికి వైద్యులు రాస్తారు. కొరవడిన ముందుచూపు టీడీపీ సర్కార్ కు ముందు చూపు కొరవడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బోధనాస్పత్రి కావడంతో సర్వజన ఆస్పత్రికి ప్రతిరోజూ 1000 నుంచి 1200 మంది వరకు రోగులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు కూడా అత్యధికంగా జరుగుతాయి. ఈ క్రమంలో ముందస్తుగానే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలకు అవసరమైన టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి. కిట్లు అయిపోయే వరకు సరఫరా చేయక పోవడం పట్ల రోగులు మండిపడుతున్నారు. -
బిల్లుల చెల్లింపులో అనుమానాలు..!
● డిప్యూటీ ఎంపీడీఓకు తెలియకుండా లాగిన్లో అప్రూవల్ ● కంప్యూటర్ ఆపరేటరే వెండర్ సంతకవిటి: మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో జనరల్ ఫండ్ నుంచి బిల్లుల చెల్లింపు పలు అనుమానాలకు తావిస్తోంది. పంచాయతీ కార్యదర్శులు కంప్యూటర్ ఆపరేటర్తో కలిసి పంచాయతీ ప్రత్యేకాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓకు తెలియకుండా లక్షల్లో డబ్బులు డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల నుంచి ఈఓపీఆర్డీ లాగిన్లో బిల్లులు చెల్లింపునకు అవకాశం ఇవ్వగా అదే అదునుగా గ్రామాల్లో లక్షల్లో చెల్లింపులు చేపట్టినట్లు సమాచారం. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓను వివరణ కోరగా దాదాపు రూ.12 లక్షలు బిల్లులు చెల్లింపులు జరగడం వాస్తవమేనన్నా రు. ఈఓపీఆర్డీ పాత లాగిన్, పాస్వర్డ్ వాడుతుండడంతో ఆయనకు తెలపకుండానే కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కటై బిల్లులు చెల్లింపులు చేశారన్నారు. ఇందులో చాలా పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటరే వెండర్గా ఉన్నారని దర్యాప్తు చేయాలని కోరారు. వనంగుడిలో పైడితల్లి చండీయాగంవిజయనగరం టౌన్: ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో వేదపండితులు బుధవారం చండీయాగం నిర్వహించారు. సుమారు వందమందికిపైగా భక్తులు యాగంలో పాల్గొన్నారు. యాగ విశిష్టతను వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి భక్తులకు వివరించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను యాగంలో పాల్గొన్న భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు నేతేటి ప్రశాంత్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి ,తరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామికి విశిష్ట పూజలు విజయనగరం టౌన్: గురుపౌర్ణమి పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్దనున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి విశ్వబ్రాహ్మణ పురోహితులు లక్కోజు ఓంకార్ సిద్దాంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి అభిషేకాలు చేశారు. అనంతరం సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు, ప్రతినిధులు వేముల సురేష్బాబు, లక్కోజు బాబు, సంజీవి, శ్రీనివాసరావు భక్తులు పాల్గొన్నారు. -
‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ జిల్లా స్థాయి పోటీల విజేతలు
విజయనగరం అర్బన్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’–‘వై డిస్ట్రిక్ట్ టేక్స్ ఆఫ్’ థీమ్పై జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రవేఖనం, క్విజ్ పోటీలు ఎంఆర్సంస్కృత ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి మండల స్థాయిలో ఎంపికై న విద్యార్ధులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వెంకటరమణ, డీసీఈబీ కార్యదర్శి టి.సన్యాసిరాజు విజేతలకు బహుమతులు ప్రకటించారు. జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల విజేతలు ప్రథమ: ఎస్.భానుప్రకాశ్ (జెడ్పీహెచ్ జరజాపుపేట), ద్వితీయ: జి.హేమలత (జెడ్పీహెచ్ వల్లాపురం), తృతీయ: కె.గీత (కేజీబీవీ, మెరకముడిదాం), చిత్రలేఖనం విజేతలు ప్రథమ: పి.బాలాజీ (జెడ్పీహెచ్ బొద్దూరు), ద్వితీయ: బి.జయశ్రీ (జీజీహెచ్ఎస్ విజయనగరం), తృతీయ: సీహెచ్.సంధ్య (జెడ్పీహెచ్ఎస్, బుడతనాపల్లి), క్విజ్ విజేతలు ప్రథమ: ఎం.లోహిత, బి.చరణ్ (ఏపీఎంఎస్, అక్కివరం), ద్వితీయ: పి.తనిష్క (జెడ్పీహెచ్ చీపురుపల్లి), బి.కొండలరావు (జెడ్పీహెచ్ఎస్, పాలవలస), తృతీయ: ఎం.శంకర్ (జెడ్పీహెచ్ఎస్ గోవిందపురం), సీహెచ్.మౌనిక (జెడ్పీహెచ్ఎస్ కుమిలి). విద్యార్థుల్లో సృజనాత్మకత, జిల్లాపై గౌరవభావాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని డీఈఓ పేర్కొన్నారు. -
మహిళలు లక్షాధికారులుగా ఎదగాలి
పార్వతీపురం: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఉపాధి కోరేవారిగా కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి లక్షాధికారులు కావాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన మహిళా పారిశ్రామకవేత్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగా పురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తపరిశ్రమల స్థాపనకు అవసరమైన రుణాలు, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. మహిళల ఆదాయం పెరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ప్రభుత్వ పథకా లను వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సీహెచ్. ప్రభావతి, ఎల్డీఎం ఎస్.సోమశేఖర్, మెప్మా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్త పరిశ్రమలతో జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించి జిల్లా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీపీ) సమావేశంలో ఆయన పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు, ఎగుమతుల ప్రోత్సాహంపై సమీక్షించారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి స్థానిక వనరుల ఆధారంగా విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ టి.సీతారాం, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన పెదపెంకి మహిళలు
పెదపెంకి గ్రామంలో సమస్యలపై మహిళలు రోడ్డెక్కారు. గ్రామంలోని కూరాకుల వీధి, కాపువీధికి చెందిన మహిళలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెదపెంకి బస్టాండ్ వద్ద బుధవారం నిరసన తెలిపారు. వీధి కాలువలు వేస్తామని గుమ్ములు పెట్టి వదిలేశారు. తాగునీరు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నాం. గుమ్ముల్లో వృద్ధులు పడిపోతున్నారు. కాలువ గుమ్ముల్లో నీరు నిల్వ ఉండి దుర్గంధంగా మారుతోంది. దోమల బెడద ఎక్కువగా ఉండి జ్వరాలు సోకుతున్నాయి. వెంటనే సమస్యలను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. గ్రామాన్ని ఎప్పుడు బాగుచేస్తారో తెలియదు కానీ గడిచిన 4నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలువల నిర్మాణాలు జరుపుతామని జేసీబీలతో గుమ్ములు తీసి వదిలివేయడం దారుణంగా ఉందని మహిళలు ఆగ్రహించారు. కార్యక్రమంలో నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు సంజీవనాయుడు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. -
బిల్లులు ఆపండి..!
బలిజిపేట: మండలంలోని పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనుల నిర్వహణలో మూడుముక్కలాట సాగుతుండడంతో ప్రత్యేక నిధులు మంజూరుచేసిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు శిరోభారంగా మారింది. పెదపెంకిని దత్తత తీసుకుని ఫైలేరియా రహిత గ్రామంగా తీర్చుదిద్దుదామనుకుని ఉపాధిహామీ పథకం ద్వారా 5.85కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. నిధుల వినియోగంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య మూడుముక్కలాట జరుగుతుండడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేటాయించిన నిధుల ప్రాప్తికి పనులు నాణ్యతతో జరిగాయా అంటే అదేమీ లేదని రుజువైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పనుల నిర్వహణపై అసంతృప్తి చెంది కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత పనుల బిల్లులు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. పనుల పర్యవేక్షణకు తరచూ బృందాలను పంపిస్తున్నారు. అందరు భాగస్వాములే.. పెదపెంకి అభివృద్ధి పనుల్లో లోపాలకు ఎమ్మెల్యే విజయచంద్ర, స్థానిక నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ భాగస్వాములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేకు మద్య విభేదాలు ఉండడంతో రణరంగం జరిగిందని చెబుతున్నారు. పనులు ప్రారంభించేటప్పుడు స్థానిక నాయకులు కొంతమందికి పనులు అప్పగించి చేయిస్తుండగా ఎమ్మెల్యే విజయచంద్ర వచ్చి ఆయన ప్రతిపాదించిన వ్యక్తికి కాంట్రాక్ట్ పనులు అప్పగించాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో తలొగ్గిన అధికారులు కొత్త కాంట్రాక్టర్ చేత పనులు చేయించారు. దీంతో ఆ కాంట్రాక్టరు ఇష్టానుసారం పనులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వారితో కుమ్మకై ్క వారి పాత్ర వారు పోషిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. బృందాల పర్యవేక్షణ ఇటీవల రాష్ట్రస్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి పనుల నాణ్యతను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించి నివేదికలు అందించారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పేషీ నుంచి ఓఎస్డీ కె.సాయినవీన్ బృందం వచ్చి గ్రామంలో జరిగిన పనుల నిర్వహణ ఏవిధంగా ఉంది, ఏం జరుగుతోంది? ప్రజల అభిప్రాయం ఏమిటి? వారి సమస్యలు ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. 21పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది పెదపెంకిలో ముందుగా 5.80కోట్లతో 66సీసీ రోడ్లు, 18ఆర్డబ్ల్యూఎస్ పనుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. ఆ తరువాత అంతర్గత పరిణామాలతో 49సీసీ రోడ్ల నిర్మాణాలు చేయాలని వాటికే నిధుల కేటాయింపు అని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 17సీసీ రోడ్ల నిర్మాణాల బిల్లుల విషయం సందిగ్థంలో పడింది. సీసీ రోడ్లకు సంబంధించి 21పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది. ఉపాధిహామీ పథకంలో రూపురేఖలు మారడంతో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యేవరకు బిల్లుల సమస్య ఉండే అవకాశాలున్నాయి. జరిగిన పనులకు బిల్లులు చెల్లింపు చేయాలని కోరుతున్న కాంట్రాక్టర్లు పనుల విషయంలో ముఖం చాటేస్తుండడంతో పనుల్లో తాత్సారం జరుగుతున్నట్లు సమాచారం. ఇంతలో ఒక్కసారిగా పిడుగుపడినట్టు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పనులు ఎంతమేర జోరుగా సాగుతాయో? లేదా నత్తనడకగా సాగుతాయా ? అనేది వేచి చూడాల్సిందే. డిప్యూటీ సీఎం ఆదేశాలు పెదపెంకిలో చేసిన పనుల్లో నాణ్యతా లోపాలు పనులు పరిశీలిస్తున్న కొత్త బృందం -
కష్టానికి తగిన ఫలితం దక్కాలి
బలిజిపేట: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగు ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మహిళలు నడుం బిగించారు. దశాబ్దాలుగా వెట్టిచాకిరీ చేస్తున్నా న్యాయం జరగడం లేదన్న బాధతో రగి లిపోతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారికిచ్చే వేతనంలో తమకు పావు వంతు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. పాదయాత్ర, ఎన్నికల హామీ నెరవేర్చాలి ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత, రెగ్యులర్ కాని పక్షంలో మినిమమ్ టైం స్కేలు వంటి పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చా రు. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచి నా సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏరుదాటిన తరువాత తెప్ప తగలేయడం అంటే ఇదే అని వారు మండిపడుతున్నారు. వారి డిమాండ్లు ఇవే: సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలి. హెచ్ఆర్ పాలసీని అమలుచేయాలి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. కానిపక్షంలో మినిమం టైం స్కేలు వర్తింపచేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 60నుంచి 62ఏళ్లకు పెంచడంతో పాటు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందజేయాలి. ఉద్యో గ భద్రతతో పాటు పెన్షన్, ఈఎస్ఐ, సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. డీఎస్సీ, ప్రభుత్వ రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో వెయిటేజీ కల్పించాలి. రాష్ట్ర హైకో ర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని పలుపర్యాయాలు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఈ నెల 30, 31తేదీల్లో కలెక్టరేట్ వద్ద ధర్నాకు శ్రీకా రం చుట్టారు. సీఐటీయూ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్దాలుగా చేస్తున్న శ్రమదోపిడీ ఇకచాలు. న్యాయపరమైన కోరికలను నెరవేర్చాల్సిందే. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలి. డిమాండ్ల పరిష్కారానికి 30, 31తేదీలలో కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. –మన్మథరావు, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి, బలిజిపేట -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
● స్కానింగ్ కేంద్రాల నమోదు తప్పనిసరి ● పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై డీఎంహెచ్ఓ సమీక్షపార్వతీపురం రూరల్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టం (పీసీపీఎన్డీటీ–1994) ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి.విజయలక్ష్మి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం స్థానిక వైద్యారోగ్య కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం పటిష్ట అమలు, కార్యాచరణపై జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు విధిగా ‘డిస్ట్రిక్ట్ అథారిటీ ఆఫ్ పీసీపీఎన్డీటీ’లో నమోదు చేసుకోవాలని ఆదేశించారు. లింగ వివక్షను అరికట్టేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు, కళాశాలలు, యువజన సంఘాలు, మహిళా మండళ్లలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 1800 233–2447 టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ వెల్ల డించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం జిల్లాలో మాతృ, శిశు మరణాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో డీఐఓ వై.విజయ్ మోహనన్, డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు కేవీఎస్.పద్మావతి, కె.విజయపార్వతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, ప్రోగ్రాం అధికారులు జగన్మోహనరావు, రవికుమార్ రెడ్డి, ఎస్.కె.హఫీజా, వైద్యులు నాగరాజు, కమల, రవి, పద్మజ, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్, డీపీహెచ్ఏవో విజయలక్ష్మి పాల్గొన్నారు. -
కుంకీలతో రైతుల సమస్యకు పరిష్కారం
సీతానగరం: శాసీ్త్రయ, మానవీయ, సుస్థిర పద్ధతుల ద్వారా ప్రజలను, అటవీ మృగాలను రక్షంచడమే ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె.పవన్కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో అప్పయ్యపేట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్ర శిలాఫలకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ బుధవారం పర్చువల్ విధానంలో అమరావతి నుంచి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి మనది కాదని మనమే ప్రకృతికి చెందిన వారమని, మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రకృతిపై సమానమైన హక్కు ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో ఇచ్చి న హామీని నేడు అమలు చేశామన్నారు. మంత్రిగుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఏనుగులవల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చూడాలన్న ప్రజలకల నేటికి నెరవేరిందన్నారు. అందుకు కుంకీ ఏనుగులు దోహద పడతాయన్నారు. కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్డ్డి మాట్లాడుతూ మన్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసి ముగింపు పలకడం ఆనందదాయక మన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బి.విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, ఆర్డీఓ కె. మాధురి, జిల్లా అటవీ శాఖఅధికారి ప్రసూన, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సీహెచ్ దీనకుమార్, అటవీ అధికారి రవికుమార్, మనోజ్కుమార్, ఏనుగుల పర్యవేక్షణ అధికారి మణికంఠేష్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలకు లోకేష్దే బాధ్యత..
కేంద్రంలో నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగినప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకున్న విధంగానే, ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పేపర్లు తయారుచేసే ఎస్సీఈఆర్టీ విభాగంలో 2016 నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే యువకుడికి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్, టీజీటీలో 6వ ర్యాంక్ రావడం పేపర్ లీకేజీకి ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ముందుగా మొదటి ర్యాంక్ అని మెరిట్ లిస్ట్ ఇచ్చి, ఆరోపణలు రాగానే రెండో ర్యాంక్కు మార్చారు. తీరా ఇప్పుడు అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేసింది. తనను కౌన్సెలింగ్కు పిలవలేదని ఆ అభ్యర్థి కోర్టుకు వెళ్లడమే పేపర్లీకేజీ అయిందనడానికి అతి పెద్ద సాక్ష్యం. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అయితే మరీ దారుణం. ఎటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా నేరుగా పోస్టింగ్ ఇచ్చేలా జీఓ నంబర్–4, 47లను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన వారికి కాకుండా.. కేవలం యూనివర్సిటీల్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు ఉన్న వారి అనుకూల వ్యక్తులకు ఈ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారు. ఆ పని పూర్తికాగానే గుట్టుచప్పుడు కాకుండా ఆ రెండు జీఓలను రద్దు చేసేశారు. డీఎస్సీపై ఏకంగా 30 వేల ఫిర్యాదులు వచ్చాయని మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ స్వయంగా ఒప్పుకున్నారు కదా!.. కోర్టులో 300కు పైగా పిటిషన్లు పడ్డాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ చేతకానితనమే. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి● -
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● ఎస్పీ ఏఆర్ దామోదర్పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం ఆదేశించారు. దేశ ప్రధాని జిల్లాలోని భోగాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఐజీ కె.శ్రీకాంత్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాపూజీ, గ్రేహౌండ్స్ ఎస్పీ డా.సుమిత్ గరుడ్తో కలిసి ఎయిర్ పోర్ట్కు వెళ్లే రహదారులను, పార్కింగ్ స్థలాలు, మీటింగ్ స్థలం, కమాండ్ కంట్రోల్, ఎయిర్ పోర్ట్ మార్గానికి అనుసంధానం చేస్తున్న ట్రంపెట్ లను సందర్శించి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధాని పర్యటనలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారిని ఎయిర్ పోర్ట్ రహదారికి అనుసంధానం చేసే పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల నుంచి సుమారు 5వేల బస్సులు, ముఖ్య వ్యక్తులు, ప్రముఖులకు సంబంధించి మరో 5వేల కార్లు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. జాతీయ రహదారిని ఎయిర్ పోర్ట్ రహదారికి అనుసంధానం చేసే ప్రాంతాల వద్ద పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. వీఐపీ వాహనాలు సన్ రే రిసార్ట్ మీదుగా ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి చేరుకునే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. -
సీ్త్రలు శక్తి చూపాల్సిందే..
బస్సు ఎక్కాలంటే..ఈ చిత్రాలు చూశారా.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో మంగళవారం బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. శక్తినంతా కూడగడితే తప్ప బస్సు ఎక్కలేని పరిస్థితి. విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షణ కోసం విజయనగరం నుంచి వెళ్లేందుకు అరకొర ఆర్టీసీ సర్వీసులు ఉండడంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. ఆర్టీసీ డిపోలు, రోడ్లపైనే బస్సు ఎక్కేందుకు పోటీపడ్డారు. తోపులాటల్లో కొందరు కిందపడి గాయపడ్డారు. మరికొందరు ఫుట్బోర్డులపై ప్రమాదకర ప్రయాణాలు సాగించారు. వృద్ధులు, చిన్నారులు బస్సులు ఎక్కలేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. అరకొర బస్సులు నడుపుతూ సీ్త్రశక్తి పథకం అమలు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుండడంపై మండిపడ్డారు. ఇంతటి ప్రయాణ కష్టాలు ఎన్నడూ చూడలేదని, బస్సుల్లో ప్రయాణం మరిచిపోవాల్సిందేనంటూ పలువురు పురుష ప్రయాణికులు నిట్టూర్చారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు..
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో ఓటు కనిపించని వారితో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం 17 ఏళ్లు నిండిన యువతీయువకులు కూడా ఓటు హక్కు కోసం ముందస్తు దరఖాస్తు చేసుకునే సదుపాయం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే సదరు దరఖాస్తు దారు ముందస్తు దరఖాస్తు చేసుకున్నప్పటికీ 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతనే వారి పేర్లు తుది ఓటరు జాబితాలో ప్రచురితమవుతాయి. ప్రస్తుతం సచివాలయాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉన్నారు. అర్హత ఉండి ఓటు లేని ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. – రామ్మోహనరావు, ఆర్డీవో, బొబ్బిలి -
17 ఏళ్లకే ఓటరుగా నమోదు..!
రామభద్రపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం అందులో భాగంగా 17 ఏళ్లకే కొత్త ఓటరుగా నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల సర్ ప్రక్రియలో ఓటు కనిపించని వారు కూడా అర్హత ఉండి ఉంటే కొత్తగా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చు. యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా మరో చాతరిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఇకపై 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ముందస్తుగానే ఓటరు జాబితాలో పేరు నమోదుకు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే యువత ముందస్తు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు కావడంతో పాటు ఓటు హక్కు లభిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఉండాల్సిన ధ్రువీకరణపత్రాలు.. 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఓటరు ఐడీ కూడా ఉండాలి. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు పరిశీలిస్తారు. వారు ధ్రువీకరణ పత్రాలను వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత అర్హులా కాదా అని తేల్చి ఓటు హక్కు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 17 ఏళ్లకే ప్రారంభమైనప్పటికీ సదరు యువతకు 18 ఏళ్లు నిండిన తర్వాతనే వారి పేర్లు తుది జాబితాలో ప్రచురితమవుతాయి.ఈ సరికొత్త విధానంపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలలో ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ సలభతరమైన ముందస్తు దరఖాస్తు ప్రక్రియ వల్ల వేలాదిమంది యువతకు సరికొత్త ఓటరుగా మారే అవకాశం లభించనుంది. విద్యాసంస్థల గణాంకాల ప్రకారం 2023–24 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయస్సు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఇప్పుడు 17 నుంచి 18 ఏళ్లు నిండుతున్నాయి. వారు చేసుకునే ముందస్తు దరఖాస్తు ప్రక్రియ వల్ల ఓటర్ల సంఖ్య పెరిగే అవకాం కనిపిస్తోంది. ముందస్తుగా దరఖాస్తుల ఆహ్వానం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటుహక్కు జాబితాలో చేరనున్న కొత్త ఓటర్లు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కసరత్తు వేలాదిమంది యువతకు దక్కనున్న అవకాశం -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వివిధ శాఖల అధికారులంతా పరస్పరం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్ధసారథి ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై, మంత్రులు డోలా శ్రీ బాలాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లతో కలిసి భోగాపురం ఎయిర్పోర్టు అడ్మినిస్ట్రేషన్ భవనంలో మంత్రి పార్ధసారథి మంగళవారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ప్రధాని పర్యటన కార్యక్రమం నోడల్ అధికారి ఎంటి కృష్ణబాబు, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, లోకం నాగమాధవి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, పలువురు కూటమి నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యంలో గళమెత్తాల్సిందే...
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ లీకేజీపై దేశ యువత, జెన్–జీ పోరాటం అసా ధారణం. వ్యవస్థలో తప్పులు చేయవచ్చు. వాటిని పార్టీలకు అతీతంగా ప్రశ్నించడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రస్తుతం మన రాష్ట్రంలో డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా కింద అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టడం ద్వారా విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. క్వాలిటీలేని ఉపాధ్యాయులు వస్తే రాబోయే తరాల భవిష్యత్తు అంధకారమవుతుంది. అమరావతి, ఎయిర్పోర్ట్లు అంటున్న పాలకులు.. సామాన్యుల సమస్యలను విస్మరిస్తున్నారు. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ఏకమై శాంతియుతంగా గళమెత్తాలి. – శత్రుచర్ల పరీక్షిత్రాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
డీఎస్సీ అక్రమాలపై.. గర్జించిన యువజనం
ప్లకార్డుతో నిరసన సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: మెగా డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాలు డిమాండ్ చేశాయి. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులు చెల్లించాలని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందించాలని డిమాండ్ చేస్తూ.. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంగళవారం వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. వందలాది మందితో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ మన్యంలో హోరెత్తిన నిరసన -
వ్యవసాయ ఆవిష్కరణలకు సీటీయూఏపీ, ఐకార్, నార్మ్ సహకారం
విజయనగరం రూరల్: గిరిజన యువత నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఆవిష్కరణలు, పరిశోధన, ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయం–ఏపీ, ఐకార్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) వ్యూహాత్మక భాగస్వామ్యంపై మంగళవారం చర్చించామని సీటీయూఏపీ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ టి.శ్రీనివాసన్ తెలిపారు. ఈ సందర్భంగా వృక్ష శాస్త్ర విభాగధిపతి డాక్టర్ అనిరుధ్కుమార్, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎం.సుందరంతో హైదరాబాద్లో వీసీ భేటీ అయ్యారు. గిరిజన యువతలో నైపుణ్యాలు, వ్యవసాయ ఆధారిత వ్యవస్థాపకత పెంపొందించడం, అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్, గిరిజన ఉత్పత్తులకు విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానం, వాతా వరణ అనుకూల వ్యవసాయ విధానాలతో పాటు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయ నిర్వహణ, పరిశోధన, నాయకత్వం తదితర రంగాల్లో సంయుక్త శిక్షణపై చర్చించామని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను బలోపే తం చేయాలని ఇరు సంస్థలు ఆకాంక్షించినట్లు ఇన్చార్జి వీసీ తెలిపారు. -
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ
మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పాలనే బాధ్యతతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టాం. దేశంలో పేపర్ లీకేజీ వ్యవహారంపై యువత రోడ్డెక్కితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా రాజీనామా చేశారో... ఇక్కడ రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కచ్చితంగా రాజీనామా చేయాలని విద్యార్థి లోకం తరపున డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు సూటిగా చెబుతున్నాం.. మీ ప్రభుత్వంలో ఒక మంత్రి శాఖలో అవినీతి జరిగితే, నిరుద్యోగులతో చెలగాటం ఆడితే ఇప్పటివరకు మీరెందుకు స్పందించలేదు? విద్యార్థులంటే మీకంత చిన్నచూపా? మీ కొడుకు ’మాలోకం’ చేసిన ఘనకార్యాలను ఒకసారి పరిశీలించి, తక్షణమే ఆయన్ని బర్తరఫ్ చేయండి. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేలు, మహిళలకు రూ.1500 ఏమయ్యాయి? ప్రతి జనవరిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన ఊసేలేదు. జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ’ఇంటికో అబద్ధం’ అనే కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తోంది. మన్యం జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు నిలదీయాలి. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం -
రోడ్డెక్కిన విద్యార్థులు
రేగిడి: మండల పరిధిలోని జోడుబందల, సరసనాపల్లి, కందిశ, తునివాడ గ్రామాలకు చెందిన విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కారు. పాఠశాలలు, కళాశాలలకు చేరుకునేందుకు సకాలంలో బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు పెంచాలంటూ జోడుబందల కూడలిలో రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు గంట సమయం వాహనాలను అడ్డుకోవడంతో సమాచారం అందుకున్న ఎస్సై వి.బాలకృష్ణ ఆందోళన ప్రదేశానికి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్యను పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. అవసరమైన బస్సులను తక్షణమే వేళకు నడపాలని విద్యార్థులు కోరారు. బస్సు సర్వీసుల పెంపు విషయం ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎస్ఐ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
సామాన్యుడి ఇంట ధరల మంట
● క్వింటాకు రూ.800 చొప్పున పెరిగిన బియ్యం ధరలు ● నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు ● బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు ఈ చిత్రంలో చేతిలో చిన్న సంచితో బియ్యం చూపిస్తున్నది రామభద్రపురం గ్రామానికి చెందిన కనపాక బాబ్జి. ఇతడు రోజూ కూలీ పనిచేసుకుంటూ జీవనం స్తాస్తున్నాడు. ఈయన ప్రతినెలా బియ్యం కొనుగోలు చేస్తాడు. గత నెలలో 5 కిలోల బియ్యం రూ.300లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం అవే బియ్యం రూ.360కు ధర పెరగడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈయన జూన్ నెలవరకు ఇంట్లో సరిపడా సరుకులకు సుమారు రూ.3 వేలు ఖర్చుపెట్టగా, ఇప్పుడు ఆ ఖర్చు రూ.4వేలకు చేరిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. రామభద్రపురం: నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి దడపుట్టిస్తున్నాయి. బియ్యంతో పాటు వంట నూనె, కందిపప్పు, వేరుశనగ పలుకులు, పంచదార, తదితర నిత్యావసర వస్తువుల ధరలు నింగినితాకుతున్నాయి. సామాన్యుల బతుకు భారంగా మారింది. ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం నుంచి దొడ్డ బియ్యం వరకు నెలరోజుల్లో 20 నుంచి 40 శాతం ధరలు పెరగడంతో సామాన్యులకు రెండు పూటలా గడవడం కష్టంగా మారింది. గతనెలలో రూ.1450 ఉండే 25 కిలోల సన్నబియ్యం బస్తా ప్రస్తుతం రూ.1650కు చేరింది. తక్కువ రకం కర్నూలు రకం బియ్యం గత నెలలో రూ.1050లు ఉండగా ప్రస్తుతం రూ.1500లకు చేరింది. ప్రతి క్వింటా బియ్యం బస్తాకు నెలరోజుల్లో దాదాపు రూ.800లు పెరిగిందటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కూరగాయల ధరలు కూడా అమాంతం పెరగడంతో పేదలు బెంబేలెత్తిపోతున్నారు. బతుకు ఎలా సాగేదంటూ ఆందోళన చెందుతున్నారు. -
చెరువులో పడి మహిళ మృతి
గంట్యాడ: మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన రంధి దేవుడమ్మ (56) చెరువులో పడి మృతిచెందింది. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించిన ఆమె మంగళవారం ఉదయం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా గ్రామంలోని చంద్రాజీ చెరువులో మృతదేహమై కనిపించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అనారోగ్య కారణాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, లేదా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మ్యాక్సీ క్యాబ్ ఢీకొని వ్యక్తి మృతిబలిజిపేట: మండలకేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెర్లాం మండలం ఆమిటి గ్రామానికి చెందిన మరడాన అప్పలస్వామి(52) మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై రమణ కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ఏఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలం ఆమిటి గ్రామానికి చెందిన అప్పలస్వామి వ్యవసాయ పని నిమిత్తం గాబుమందు కొనేందుకు తన ద్విచక్రవాహనంపై బలిజిపేట వచ్చి కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నాడు. అదే సమయంలో బలిజిపేట వైపు కొబ్బరి బొండాల లోడుతో టాటా మ్యాజిక్ మ్యాక్సీ క్యాబ్ వస్తోంది. ఈ క్రమంలో గొల్లవీధి మలుపువద్ద మ్యాక్సీ క్యాబ్ అప్పలస్వామి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో కాళ్లు విరిగి, తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవకర్ కె.జనార్దన్ను అదుపులోకి తీసుకున్నామని ఏఎస్సై చెప్పారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి● మరో యువకుడికి గాయాలు పార్వతీపురం రూరల్: నూతన దుకాణానికి బోర్డు అమర్చుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన పార్వతీపురం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. పట్టణంలోని సుదర్శన్ షాపింగ్ మాల్ ఎదురుగా కొత్తగా ఒక దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ దుకాణం పేరుతో ఉన్న బోర్డును ఇద్దరు యువకులు భవనం పైనుంచి కిందకు దించుతూ అమర్చే పని చేపట్టారు.ఈ క్రమంలో వారు పట్టుకున్న బోర్డు ప్రమాదవశాత్తు భవనం ఎదురుగా వెళ్తున్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి పురోహిత్ ముఖేష్ కుమార్ (23) అనే యువకుడు తీవ్రంగా షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ముఖేష్తో పాటు బోర్డును పట్టుకున్న మరో యువకుడికి సైతం గాయాలు కావడంతో, గమనించిన స్థానికులు వెంటనే పార్వతీపురం ప్రభుత్వ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఈ ఇద్దరు యువకులను రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మార్వాడీలుగా గుర్తించారు. అసభ్యకర ప్రవర్తన కేసులో రెండేళ్ల జైలు, జరిమానాబొబ్బిలి: పట్టణానికి చెందిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన స్థానికుడు బొట్ట అప్పారావు అనే వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విఽధిస్తూ న్యాయమూర్తి హేమ స్రవంతి జానకిరామ్ మంగళవారం తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పారావు 2020లో మహిళపై వేధింపులకు పాల్పడగా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం ఆ కేసు తుది తీర్పును అనుసరించి న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చినట్లు తెలిపారు. -
బరువు ఎత్తడంలో ‘అజేయు’డిగా..
నెల్లిమర్ల రూరల్: కొన్నిసార్లు విజయాలు వ్యక్తిగతంగా నిలుస్తాయి. మరికొన్నిసార్లు అవి ఒక కుటుంబ చరిత్రను సృష్టిస్తాయి. పట్టుదలకు పౌరుషం తోడైతే ఎలా ఉంటుందో గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్–2026 సాక్షిగా జిల్లాకు చెందిన యువకుడు నిరూపించాడు. పురుషుల 79 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్బాబు సోమవారం అర్ధరాత్రి చేసిన అద్భుతమైన ‘హిస్టారికల్ లిఫ్ట్’కు అంతర్జాతీయ వేదిక ఫిదా అయ్యింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సరికొత్త గేమ్స్ రికార్డుతో రజత పతకాన్ని ముద్దాడాడు. ఒకప్పుడు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కామన్వెల్త్ వేదికపై పతకం కొట్టి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడు అజయ్ వెండి పతకంతో తండ్రి వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాడు. స్నాచ్లో నయా హిస్టరీ.. క్లీన్ అండ్ జెర్క్లో సంచలనం స్నాచ్ విభాగంలో అజయ్ బాబు ఏకంగా 149 కేజీల అసాధారణ బరువు ఎత్తడంతో సరికొత్త కామన్వెల్త్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఘనతతో గ్లాస్గో వేదిక కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తన సర్వ శక్తులను ఒడ్డి ఏకంగా 181 కేజీల బరువును గాల్లోకి లేపాడు. ఆ బరువుతో స్థిరంగా నిలబడిన ఆ కొన్ని సెకెన్ల దృశ్యం భారత క్రీడా చరిత్రలోనే ఒక అద్భుత హిస్టారికల్ లిఫ్ట్గా నిలిచింది. మొత్తంగా 330 కేజీల బరువుతో అజయ్ రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయిత్ (331) కేజీలు కేవలం ఒక్క కిలో తేడాతోనే బంగారు పతకాన్ని సాధించాడు. 16 ఏళ్ల తరువాత మార్మోగిన జిల్లా పేరు గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్కు ఆంధ్రప్రదేశ్ నుంచి అజయ్బాబు ఒక్కడే ఎంపికయ్యాడు. త్రుటిలో స్వర్ణం చేజారినప్పటికీ అసాధారణ ప్రతిభతో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక తండ్రి కల దాగి ఉంది. 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు దేశం తరఫున ఆడి కాంస్య పతకం గెలిచాడు. తండ్రి సాధించిన ఘనతను ఆదర్శంగా తీసుకున్న అజయ్ అనుకున్నట్లే గ్లాస్గో వేదికపై వెండిని ముద్దాడి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అజయ్ సాధించిన విజయంపై స్వగ్రామమైన కొండవెలగాడలో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో పాటు జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మె ల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.అజయ్ తండ్రికి సత్కారం కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వల్లూరి అజయ్బాబు వెండి పతకం సాధించి కొండవెలగాడ గర్వాన్ని ప్రపంచానికి చాటాడని జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు గదల సన్యాసినాయుడు అన్నారు. కొండవెలగాడలో అజయ్ తండ్రి శ్రీనివాసరావును మంగళవారం ఘనంగా సత్కరించారు. వెయిట్లిఫ్టర్లగా తండ్రీకొడుకుల ఘనతను ప్రశంసించారు. వీరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. కామన్వెల్త్ గేమ్స్లో అదరగొట్టిన అజయ్ 149 కేజీల స్నాచ్లో రికార్డు క్లీన్ అండ్ జెర్క్లో 181 కేజీలు లిఫ్ట్ మొత్తం 330 కేజీల బరువును ఎత్తి వెండి పతకం 16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ పోడియంపై జిల్లా పేరు నాడు తండ్రికి కాంస్యం.. నేడు తనయుడుకి రజతం.. -
విలేజ్ హెల్త్క్లినిక్స్లో జరగని డెంగీ పరీక్ష..!
● కానరాని టెస్టింగ్ కిట్లు ● పరీక్ష కోసం పీహెచ్సీకి వెళ్లాల్సిన పరిస్థితివిజయనగరం ఫోర్ట్: ప్రజారోగ్యాన్ని టీడీపీ సర్కార్ గాలికివదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యసేవల కోసం అవస్థలు పడుతున్నారు. గ్రామీణుల చెంతనే అందాల్సిన వైద్య సేవలు అందకపోవడం వల్ల వారు పీహెచ్సీలకు వెళ్లాల్సిన దుస్థితి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంది. వ్యాధి నిర్ధారణ త్వరగా చేయగలిగితే చికిత్స అందించి ప్రాణపాయం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చేసే డెంగీ పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో కిట్ల కొరత జిల్లాలో482 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. వాటి పరిధిలో జ్వరం బారిన పడిన వారికి మలేరియా, డెంగీ పరీక్షలు చేయడానికి మలేరియా, డెంగీ టెస్టింగ్ కిట్లు ప్రభుత్వం సరఫరా చేయాలి. అయితే డెంగీ టెస్టింగ్ కిట్లు చాలా చోట్ల లేనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జ్వరపీడితులకు మలేరియా టెస్టు మాత్రమే వైద్యసిబ్బంది చేస్తున్నారు. మలేరియా కంటే డెంగీ ప్రమాదకరమైనది. డెంగీ వ్యాధిని త్వరగా గుర్తించాల్సి ఉంటుంది. డెంగీ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే వ్యాధి తీవ్రమై ప్రాణాలమీదకు వస్తుంది. పీహెచ్సీకి వెళ్లాల్సిన పరిస్థితి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డెంగీ కిట్ల కొరత వల్ల జ్వరపీడితులు డెంగీ టెస్టు కోసం పీహెచ్సీలకు వెళ్లాల్సిన పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విలేజ్ హెల్త్ క్లినిక్లోనే మలేరియా, డెంగీ కిట్లు అందుబాటులో ఉంచేవారు. ఇంటింటా సర్వే నిర్వహించి జ్వరపీడితులు ఉంటే వారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స కోసం రిఫరల్ ఆస్పత్రికి పంపించేవారు. దీని వల్ల వారికి త్వరగా చికిత్స అందడం వల్ల త్వరగా కోలుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేక పోవడం వల్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ చేసి చర్యలు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డెంగీ కిట్ల కొరత విషయం తెలియదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. పీహెచ్సీల్లో నుంచి విలేజ్హెల్త్ క్లినిక్లకు కిట్లు అందిస్తారు. – డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎంహెచ్ఓ -
ఘనంగా కోటదుర్గమ్మకు సారె
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మకు ఆషాడమాస సారె కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. వేలాదిగా మహిళలు చీర, పసుపు, కుంకుమలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ మాట్లాడుతూ అమ్మవారికి ఆషాడ మాసంలో సారె పండగ నిర్వహించడం ద్వారా కరువు కాటకాల నుంచి ప్రజలను అమ్మవారు కాపాడుతుందన్నారు. అమ్మవారికి భక్తులు అందించిన కూరగాయలు, పండ్లుతో మంగళవారం నుంచి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి వీవీ సూర్యనారాయణ తెలిపారు. -
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురం: జిల్లాలో జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న తాగునీటి, పారిశుధ్య పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవా రం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో తాగునీటి, పారిశుధ్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అవసరమైన చోట కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల కోసం ప్రతిపాదనలు పంపాలని, గ్రామస్థాయి వాటర్ అండ్ శానిటేషన్ కమిటీల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి వివరాలను జలజీవన్ మిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా నీటి సరఫరా, పారిశుధ్య మిషన్ అధికారి పి.మధుకుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
వందనం పేరుతో నిరాశ!
● అర్హులకు అందని ‘తల్లికి వందనం’ ● పీజీఆర్ఎస్కు తరలివస్తున్న బాధితులు సాక్షి, పార్వతీపురం మన్యం: అన్ని అర్హతలూ ఉన్నా.. తల్లికి వందనం పథకం అందకపోవడంతో జిల్లాలో వేలాది మంది తల్లులు తల్లడిల్లుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే.. ఎవరికీ అందకపోవడం, ఒకరికే అందడం.. రూ.13 వేలుకు రూ.3 వేలే జమ కావడం.. ఆదాయపు పన్ను చెల్లించిన ఇంకెవరిదో పేరు.. మ్యాపింగ్ సమయంలో కలిసి పోవడం.. ఇలా సమస్యలు కోకొల్లలుగా వస్తున్నాయి. బాధితులు పెద్ద ఎత్తున సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు తరలివచ్చారు. వీటితో పాటు.. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రభాకరరెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. కురుపాం ప్రాంతానికి చెందిన లక్కోజు తన్మయి నాలుగో తరగతి చదువుతోంది. తల్లికి వందనం పథకం కింద గత ఏడాది రూ.13 వేలు తల్లి వాణి ఖాతాలో జమ కాగా.. ప్రస్తుత ఏడాది రూ.3 వేలు జమ అయింది. మరో పాఠశాల ఖాతాలో నిధులు జమ అయినట్లు చూపుతున్నారని.. అక్కడికి వెళ్లి అడిగితే, తమ పాఠశాలను ఎప్పుడో మూసి వేశామని అంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పథకం నిధులు మొత్తం వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఈ చిత్రంలోని మహిళ పేరు ఎస్.భవానీ. సాలూరు పట్టణం. ఈమెకు ఇంటర్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ, రెండేళ్లుగా తల్లికి వందనం పథకం లబ్ధి కలగడం లేదు. వాస్తవంగా వినియోగించిన మొత్తం కంటే, కరెంట్ బిల్లు అధికంగా వస్తున్నట్లు చూపుతోంది. అందుకు తగిన ఆధారాలు కూడా ఆమె చూపించారు. దీనికితోడు ఈ ఏడాది ఆదాయపు పన్ను చెల్లిస్తున్న శీలా కుమారి అనే మహిళ వివరాలు మ్యాపింగ్ సమయంలో వీరి దాంట్లో కలిసిపోయింది. దీంతో పథకానికి అనర్హులుగా మిగిలిపోయారు. తప్పులు సరి చేసి, తమకు న్యాయం చేయాలని ఆ తల్లి కోరుతున్నారు. కొమరాడ మండలం నయా కుంతేసు, మసిమండ, కూడేసు, చినకేర్జిల, వనకబడి తదితర గిరిజన ప్రాంతాల రైతులకు పట్టాలు, పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఎరువులు ఇవ్వడం లేదు. పోడు భూములు కావడం వల్ల ఆన్లైన్లో లేక, యూరియా అందడం లేదు. తమకు మాన్యువల్గా అయినా ఇప్పించాలని వారంతా కోరుతున్నారు. -
ప్రాణం తీసిన మద్యం మత్తు
పార్వతీపురం రూరల్: మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తీవ్ర మద్యం మత్తులో గడ్డి మందు తాగిన ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన జియ్యమ్మవలస మండలం కుందర తిరువాడ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన అక్కిన సీతారామనాయుడు (55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే పొలంలో కలుపు నివారణకు గడ్డి మందు పిచికారీ చేయడానికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన.. పొలంలో మందు కొడుతూనే ప్రమాదవశాత్తు ఆ గడ్డి మందునే సగం వరకు తాగేశాడు.గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీకాకుళం రూరల్: బొల్లినేని మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నేతృత్వంలో ఫ్రంట్లైన్ హెల్త్కేర్ గివింగ్ అసిస్టెంట్, వెల్నెస్ థెరపిస్ట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసై 18 నుంచి 27 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు డిప్లమో, బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలకు 7995013422, 7680945357 నంబర్లను సంప్రదించాలని కోరారు. పార్వతీపురం రూరల్: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ‘స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం)’లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అడ్మిషన్న్స్ ఇన్చార్జి కె.శివరామకృష్ణ సోమవారం తెలిపారు. ఇంటర్ అర్హతతో మూడేళ్ల బీఎస్సీ (హెచ్ అండ్ హెచ్ఏ) డిగ్రీ కోర్సు, టెన్త్ అర్హతతో ఏడాది వ్యవధి గల క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, ఐదు నెలల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ కోర్సులకు ఎలాంటి వయో పరిమితి లేదు. అభ్యర్థులకు తరగతులతో పాటు ప్రముఖ ఫైవ్స్టార్ హోటళ్లలో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఏపీ పర్యాటక శాఖ, ఇతర ఫైవ్స్టార్ హోటళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. విద్యార్థులకు బ్యాంకు రుణ సదుపాయం, బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతులు ఉన్నాయి. ఆసక్తి గలవారు దరఖాస్తులను ఆగస్టు 4లోగా కళాశాలకు పంపాలి. ఇతర వివరాలకు ఫోన్ 97013 43846, 91005 58006, 97004 40604 నంబర్లలో లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్ఐహెచ్ఎమ్టీపీటీ.ఓఆర్జీ వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించారు. రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహంవిజయనగరం క్రైమ్: అలమండ రైల్వేయార్డ్ దిగువ ఉన్న రైల్వే ట్రాక్పై ఎలక్ట్రికల్ పోల్ వద్ద గుర్తు తెలియని మృతదేహాం పడి ఉండడాన్ని విజయనగరం జీఆర్పీ సిబ్బంది సోమవారం కనుగొన్నారు. మృతుని వయస్సు సుమారు 35నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని జీఆర్పీ హెచ్.సీ అశోక్ తెలిపారు. మృతుడు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామనఛాయ రంగులో చింపిరి గెడ్డం కలిగి ఉన్నాడని, శరీరంపై బిస్కెట్ రంగు లోయర్, స్లీల్ లెస్ రౌండ్ నెక్ నలుపు రంగు గల బనియన్ దానిపై బుల్స్ 23 అను ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయన్నారు. మెడలో తెలుపు ఆకు పచ్చ ఎరుపు రంగు గల దారంతో ఉన్న తాడు ధరించి ఉన్నాడని మృతదేహాన్ని గుర్తించిన గలిగిన వారు ఫోన్ 6301365605, 9192475 85742 నంబర్లకు తెలియజేయాలని హెచ్సీ అశోక్ కోరారు. -
తీరనున్న దశాబ్దాల ‘నేరడి’కల
● రూ.641.10 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం ● ప్రభుత్వం పరిపాలన అనుమతి సాక్షి, పార్వతీపురం మన్యం: ఎన్నో ఏళ్లుగా వివాదా ల నడుమ ఊగిసలాడుతున్న ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని భామిని మండలం నేరడి(బి)లో వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. వంశధార స్టేజ్–2లో నేరడి బ్యారేజీ నిర్మాణ పనులను రూ.641.10 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణ పనులతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం.. భూసేకరణ వ్యయం కలిపి రూ.641.10 కోట్లలోపే ఉండాలని షరతు విధించింది. వాస్తవానికి వీటికి సుమారు రూ.650 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే భామిని మండలంలోని 18 గ్రామాల్లో ఉన్న దాదాపు 30 వేల ఎకరాల్లో పంట భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు పుష్కలంగా సమృద్ధిగా అందుతుంది. అటు శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి కూడా సాగునీటి వెతలు తీరుతాయి. దశాబ్దాల కల.. వంశధారలో లభ్యమయ్యే 115 టీఎంసీల నీటిలో 50 శాతం వినియోగించుకునేందుకు 1962 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ – ఒడిశా రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. అప్పటి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం(ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా) కాట్రగడ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అంగీకారం తెలిపింది. 1986లో నాటి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఒడిశా సీఎం బిజూ పట్నాయక్ మధ్య ముఖాముఖి చర్చలు సైతం జరిగా యి. ఆ తర్వాత 2000లో అధికారంలోకి వచ్చిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నేరడి బ్యారే జీ నిర్మాణానికి రకరకాల అభ్యంతరాలను చెబుతూ వచ్చింది. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమస్యను నివేదించడంతో, 2010లో కేంద్ర ప్రభుత్వం వంశధార ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాలను పలు సందర్భాల్లో సందర్శించిన ట్రిబ్యునల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యారేజీ నిర్మాణానికి అనుమతినిస్తూ వంశధార నదీ జల వివాదాల ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017లో తీర్పునిచ్చింది. బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాలను సేకరించి ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రిబ్యునల్ తీర్పు అనుకూలంగా వచ్చినా పాలకుల నుంచి ఆ చొరవ లేకపోవడంతో, నేరడి బ్యారేజీ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దివంగత వైఎస్ ఆశయాలకు అనుగుణంగా... వెనుకబడిన ఉత్తరాంధ్రను సస్య శ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో జలయజ్ఞంలో భాగంగా వంశధార స్టేజ్–2 పనులను చేపట్టారు. నేరడి బ్యారేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దీనిపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరడి బ్యారేజీని నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగి రెండు రాష్ట్రాలతో పలు దఫాలుగా చర్చించింది. ఈ వివాదం పరిష్కారమయ్యేలోగా ఉత్తరాంధ్ర రైతులకు ముందస్తు ఫలాలను అందించేందుకు వంశధారపై కాట్రగడ్డ సైడ్ వియర్, వరద కాలువ, హిరమండలం రిజర్వాయర్ పనులను నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. పనులను శరవేగంతో పూర్తి చేశారు. వైఎస్ ముందు చూపుతో చేపట్టిన ఈ చర్యల వల్ల వంశధార ట్రిబ్యునల్ నేరడి బ్యారేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2021, నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్కు వెళ్లి, అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీతో పాటు.. జంఝావతి ప్రాజెక్టు సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఇన్నాళ్లూ చొరవ చూపని ప్రభుత్వం.. ట్రిబ్యునల్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి ఇంజినీరింగ్ అధికారులు సిద్ధమైనా.. ఒడిశా అధికారుల నుంచి స్పందన లేదు. ట్రిబ్యునల్ తీర్చుపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదం ఎటూ తేలలేదు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించగలిగితే నేరడితో పాటు.. కొమరాడలోని జంఝావతి అంతర్రాష్ట్ర జల వివాదం కొలిక్కి రావడం పెద్ద సమస్య కాదు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఆ చొరవ చూపలేదు. ప్రస్తుతం అంతా సానుకూలంగా ఉండడం.. పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడంతో ఇప్పటికై నా బ్యారేజీ కల నెరవేరుతుందని రెండు జిల్లాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. గెజిట్లో పేర్కొన్న దాని ప్రకారం.. ప్రాజెక్టుకు అవసరమైన 106 ఎకరాల భూమిని చట్ట ప్రకారం ఒడిశా సేకరించాలి. దీనికి పరిహారం, ఇతర ఖర్చులను ఆంధ్రా నుంచి చెల్లించాలి. బ్యారేజీ వద్ద వంశధార నది లభ్యత 115 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు సగం సగం వినియోగించుకోవాలి. సాంకేతిక ఆమోదంపై ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ శాఖ అధికారుల భేటీ అనంతరం బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి, డిజైన్ చేసి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు పంపిస్తారు. వారి నుంచి సాంకేతిక ఆమోదం వచ్చాక పనులు పట్టాలెక్కనున్నాయి. ఇదే విధంగా జంఝావతి సమస్య కూడా పరిష్కారం కావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
విద్యార్థి, యువజన ర్యాలీని జయప్రదం చేయండి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు పిలుపు జియ్యమ్మ వలస రూరల్: రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలో లొసుగులను బయటకు తీసేందుకు, అలాగే డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఖరిపై నిలదీసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జరగనున్న విద్యార్థి, యువజన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు పిలుపునిచ్చారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నీట్ పేపర్ లీకేజీ, ఫీజు రీయింబ ర్స్మెంట్, నిరుద్యోగ భృతి మొదలైన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురం కాంప్లెక్స్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఇలా...
సాలూరు ఓట్లు : 2,05,985 ఫారాలు డిజిటలైజ్ అయినవి : 1,84,089 (89.37 శాతం) సేకరించలేనివి : 21,896 (10.63 శాతం) కురుపాం ఓట్లు : 1,95,916 ఫారాలు డిజిటలైజ్ అయినవి : 1,77,700 (90.70 శాతం) సేకరించలేనివి : 18,216 (9.30 శాతం)పార్వతీపురం ఓట్లు: 1,91,718 ఫారాలు డిజిటలైజ్ అయినవి : 1,73,273 (90.38 శాతం) సేకరించలేనివి : 18,445 (9.62 శాతం)పాలకొండ ఓట్లు : 1,96,943 ఫారాలు డిజిటలైజ్ అయినవి : 1,80,388 (91.59 శాతం) సేకరించలేనివి : 16,555 (8.41 శాతం) -
వికసించిన బ్రహ్మకమలాలు
పాలకొండ: మండలంలోని టీడీపారాపురం గ్రామంలో కర్నేన యోగిత పెరట్లో బ్రహ్మకమలం పూలు వికసించాయి. అరుదుగా కనిపించే ఈ పూల మొక్కలను కొంతకాలగా పెంచుతున్నామని యోగిత తెలిపారు. సాధారణంగా రాత్రి సమయంలో ఈ పూలు సాక్షాత్తు దేవుని రూపంగా భావిస్తారు. ఒకే సారి 9 పూలు పూయడంతో మహిళలు పసుపు, కుంకుమలతో పూజలు చేస్తున్నారు. వాట్సాప్లో 1,000కి పైగా ప్రభుత్వ సేవలు● కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి పార్వతీపురం: ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్న సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి కోరారు. వాట్సాప్ 9552300009 నంబర్కు సందేశం పంపడం ద్వారా రెవెన్యూ, విద్య, వ్యవసాయం, విద్యుత్, రవాణా, మున్సిపాలిటీ, పీజీఆర్ఎస్ తదితర శాఖలకు చెందిన 1,000కి పైగా సేవలను తెలుగు, ఆంగ్ల భాషల్లో 24 గంటల పాటు పొందవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్థితి, ఫిర్యాదుల పురోగతి, ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి సంక్షేమ పథకాల స్టేటస్ను కూడా తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 92,527 మందికి ఈ సేవలపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, డీఆర్వో కె. హేమలత, డీఆర్డీఏ పీడీ ప్రభావతి తదితర అధికారులు పాల్గొన్నారు. రీ–సర్వే పనులు వేగవంతం చేయాలి● జేసీ వైశాలి పార్వతీపురం: జిల్లాలో భూముల రీ–సర్వే పనులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో పాలకొండ సబ్ కలెక్టర్, పార్వతీపురం ఆర్డీఓ, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రీ–సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రైతుల హక్కులకు భంగం కలగకుండా సర్వే నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ కె. మాధురి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో ఆరోగ్యం పార్వతీపురం: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించి నిరంతరం ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పలు శాఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులందరూ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, హెచ్ఓడీలు తమ సిబ్బందిని ముందుండి నడిపించాలని సూచించారు. వంద శాతం ఈ–ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 11 రోజులకు రూ.59,490 ఆదాయంపాలకొండ: పట్టణంలో నిర్వహించిన జగన్నాథ స్వామి రథయాత్ర వేడుకకు ఆదాయం రూ.59,490 సమకూరినట్లు ఆలయ ఈఓ పరమేశ్వరి తెలిపారు. ఈ నెల 16 నుంచి 26 వరకు ఉత్సవాలు నిర్వహించినట్లు వివరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి 11 రోజులపాటు భక్తులు అందించిన కానుకలను సోమవారం లెక్కించామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు మఠం విశ్వనాథం దాస్, మఠం చక్రిదాస్, దేవాదాయ శాఖ సీఐ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
చికెన్పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు అలసత్వం తగదని, అర్జీదారుల సమస్యల మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ కె.హేమలత, డీఆర్డీఏ పీడీ ప్రభావతితో కలిసి 74 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 21 రెవెన్యూకు సంబంధించిన అర్జీలు రాగా, 53 ఇతర అర్జీలున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ అర్జీలను మూసివేయరాదన్నారు. పరిష్కారం పూర్తయినట్లు పోర్టల్లో నమోదు చేసేముందు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీదారుతో మాట్లాడి నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. అసంపూర్ణ నివేదికలిస్తే కఠిన చర్యలు తప్పవని, పెండింగ్ ఫిర్యాదులకు గడువు విధించి వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. చట్ట పరిధిలో సత్వర న్యాయం: ఎస్పీ పార్వతీపురం రూరల్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్ట పరిధిలో సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, మహిళలపై వేధింపులు, అధిక వడ్డీలు తదితర సమస్యలపై ఈ వేదికలో మొత్తం 7 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల్లోని వాస్తవాలను నిర్ధారించుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యల నివేదికలను ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 33 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో ఏపీఓ జి.చిన్నబాబు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు గిరిజనులు వివిధ సమస్యలపై 33 వినతులు సమర్పించారు. పవర్ వీడర్ ఇప్పించాలని పెద్దగూడకు చెందిన సవర సింగడు అర్జీ ఇచ్చారు. హౌసింగ్ పెండింగ్ బిల్లు చెల్లించాలని బగందరకు చెందిన పద్మావి విన్నవించారు. హౌసింగ్ మంజూరు చేయాలని బత్తిలి గ్రామస్తుడు కె.వెంకటరావు తదితరులు కోరారు. కొండపోడు పట్టాలు కావాలని సత్యజగన్నాథపురం గ్రామస్తురాలు కృష్ణవేణి కోరారు. మొగదారగూడలో సీసీ రోడ్డు నిర్మించాలని సవర చిరంజీవి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి -
రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు
పార్వతీపురం: ఖరీఫ్–2026 సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు, అధిక ధరలకు ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎరువులు, విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ–పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, రైతు సేవా కేంద్రాలతో క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి టి. భవానీ శంకరరావు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టు రహదారికి జాతీయరహదారిని అనుసంధానం చేయాలి
పూసపాటిరేగ: దేశప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 1న జిల్లాకు విచ్చేస్తున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతీయరహదారిని ఎయిర్పోర్టు రహదారికి అనుసంధానం చేయాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశప్రధాని జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయరహదారిని ఎయిర్పోర్టు రహదారికి మూడు చోట్ల అనుసంధానం చేయాలన్నారు. ఈ మేరకు ఎస్పీ దామోదర్ సోమవారం నేషనల్ హైవే అథారిటీ అఽధికారులు, పోలీసు అఽఽధికారులతో కలిసి రాజాపులోవ జంక్షన్ నుంచి రావివలస జంక్షన్ వరకు జాతీయ రహదారిపై పర్యటించి పలుచోట్ల పరిశీలించారు. ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, ఆనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల నుంచి సుమారు 5వేల బస్సులు, ముఖ్య వ్యక్తులు, ప్రముఖులకు సంబంధించి మరో 5వేల కార్లు, పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి 16పై మూడు చోట్ల ఐరన్సేఫ్ గార్డులు తొలగించి ఎయిర్పోర్టు రహదారికి అనుసంధానం చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసు అఽధికారులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
రామాయవలసలో ఏనుగుల గుంపు
మెరకముడిదాం: మండలంలోకి ఆదివారం సాయంత్రం ప్రవేశించిన ఏనుగుల గుంపు సోమవారం సాయంత్రానికి ఎం.రావివలస మీదుగా రామాయవలస, గొల్ల లమర్రివలస గ్రామాల మధ్యలో ఉన్న మామిడితోటలోకి ప్రవేశించినట్లు ఎలిఫెంట్ ట్రాకర్స్ సాయి, చంటి, ఉపేంద్ర, నాగ చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు సులోచనారాణి ఏనుగుల గుంపు ఉన్న సమీపంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా రామాయవలస, గొల్లలమర్రివలస గ్రామాల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారిని అప్రమత్తం చేయాలని తమ సిబ్బందికి తహసీల్దార్ సులోచనా రాణి సూచించారు. -
కరెంటుకే షాక్..!
విజయనగరం: ఎల్నినో దెబ్బకు వర్షాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉండగా తీవ్రమైన వేడిమితో జిల్లా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షా కాలంలో విద్యుత్ వినియోగం పెరిగింది. పల్లెలు, పట్టణాల్లో ఒకే మాదిరిగా విద్యుత్తును వినియోగిస్తుండడంతో మీటర్లు రయ్ రయ్మంటూ పరుగు పెడుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో విజయనగరం టౌన్, విజయనగరం రూరల్, బొబ్బిలి డివిజన్ల పరిధిలో మరో 9 సబ్ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 98 సబ్ స్టేషన్లు ఉండగా..24,428 డీటీఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 8,640 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వాటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా 7,19,165 సర్వీసులకు ప్రతిరోజు విద్యుత్సరఫరా చేస్తుండగా..వాటిలో గృహావసర విద్యుత్సర్వీసులు 6,00,828, వాణిజ్య సర్వీసులు 64,361, పారిశ్రామిక సర్వీసులు 2432, వివిధ రకాల ఇనిస్టిట్యూషన్ సర్వీసులు 15,332, వ్యవసాయాధారిత సర్వీసులు మరో 36,215 సర్వీసులు ఉన్నాయి. వాటిలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటి వేళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు, ఇతర సర్వీసులకు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అప్రకటిత కోతలు.. వాస్తవానికి జూలై నెల వచ్చిందంటే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుంది. అయితే ఈఏడాది ఎల్నినో ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులను ప్రజలు అనుభవిస్తున్నారు. వర్షాలు పూర్తిగా లేకపోవడం..ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా వేసవి తరహాలో వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలో విద్యుత్తు డిమాండ్ పెరగడంతో అప్రకటిత కోతలు మొదలు పెట్టారు. పల్లెలు, పట్టణాల్లో గంటల కొద్దీ మరమ్మతుల పేరిట కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. మరో పక్కన లోడు అధికమై విద్యుత్తు నియంత్రికలు మొరాయిస్తూ కాలిపోతున్నాయి. మార్చి మూడవ వారం వరకు జిల్లాలో సగటు వినియోగం 9 ఎంయూ (90 లక్షల యూనిట్లు) ఉండగా..గడిచిన మూడు రోజుల్లో 50 లక్షల యూనిట్లు పెరుగుదలను నమోదు చేసుకుని 9.5 ఎంయూ వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మే, జూన్ నెలల్లో మరో 50 లక్షల యూనిట్లు పెరిగి మొత్తంగా 10 ఎంయూ పైగా పెరిగింది. తాజాగా జూలై నెలలో గతేడాది 9 ఎంయూ విద్యుత్ను సరాసరిన వినియోగదారులు వినియోగించగా .. ప్రస్తుత 2026లో 10 నుంచి 11 ఎంయూ వరకు పెరగడం గమనార్హం.నిరంతరాయ సరఫరాకు చర్యలు ఈ ఏడాది వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ వినియోగం పెరిగింది. వర్షాలు లేకపోవడంతో ఉక్కపోత ఎక్కువైంది. దీంతో వినియోగదారులు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. దీంతో ప్రసుతం 10లక్షల 80వేల యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నారు. వినియోగదారులకు అవసరమైన సరఫరాను చేస్తున్నాం. చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించి సరఫరాను పునరుద్దరిస్తున్నాం. – మువ్వల లక్ష్మణరావు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం ఆపరేషన్ సర్కిల్ జోరుతగ్గని విద్యుత్ వినియోగం వేసవిలో మాదిరి తిరుగుతున్న విద్యుత్ మీటర్ ఎల్నినో ప్రభావంతో కురవని వర్షాలు..ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి గతేడాదితో పోల్చుకుంటే జూలై నెలలో పెరిగిన విద్యుత్ వినియోగం ఆగని ఏసీలు, కూలర్, ఫ్రిజ్ల వినియోగం -
మైనింగ్ భూతానికి బలైపోతున్నాం
● పెదగుడబ గ్రామస్తుల ఆవేదనపార్వతీపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల వెల్లువతో హోరెత్తింది. ఓ వైపు కాలుష్య కోరల్లో చిక్కుకున్న జనం కన్నీటి పర్యంతమవగా.. మరోవైపు సాగునీరు లేక అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై కలెక్టరెట్కు వచ్చిన బాధిత ప్రజలు తమ గోడును కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించారు. ఊరు విడిచి పొమ్మంటారా? గరుగుబిల్లి మండలం పెదగుడబ సమీపంలో సాగుతున్న అక్రమ మైనింగ్తో బతకలేక పోతున్నామని గ్రామస్తులు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట వాపోయారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం అందజేశారు. క్వారీలో రిగ్గుల పేలుళ్ల ధాటికి ఇళ్లు బీటలు వారుతున్నాయని, రాత్రింబవళ్లు భారీ వాహనాల రాకపోకలతో కంటిమీద కునుకు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ధూళి కాలుష్యంతో ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నామని, జంఝావతి కాలువను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. కన్నీరు పెట్టిస్తున్న కాలువలు.. తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ కింద ఏడు, ఎనిమిదో బ్రాంచ్లకు సాగునీరందక వరి నారుమళ్లు ఎండల ధాటికి మాడిపోతున్నాయని పాలకొండ మండలం లంబూరు రైతులు ఆందోళన చేపట్టారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. హుస్సేనున్పురం వద్ద నామమాత్రంగా నీరు వదిలి చేతులు దులుపుకుంటున్న అధికారులు..చివరి ఆయకట్టును గాలికొదిలేశారని మండిపడ్డారు. తక్షణం నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రాధేయపడ్డారు. విద్యార్థులకు ‘బడి బస్సు’ వేయాలి పార్వతీపురం నుంచి ఎమ్మార్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలకు ప్రత్యేక బడి బస్సు సౌకర్యం కల్పించాలని పీడీఎస్ఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. -
గర్భిణులకు అందని పౌష్టికాహారం
● వేలాది మంది లబ్ధిదారుల ఎదురుచూపు ● జిల్లాలో 2499 అంగన్వాడీ కేంద్రాలు విజయనగరం ఫోర్ట్: సీ్త్ర, శిశు సంక్షేమకానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతుంది. కానీ అది అమలులో మాత్రం కానరావడం లేదు. గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం కూడా సకాలంలో అందించలేని దుస్థితిలో టీడీపీ సర్కార్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం కోసం గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు. ప్రతినెల ఐదో తేదీలోగా గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని కిట్లు (పౌష్టికాహారం కిట్లు) అందిస్తారు. అయితే ఈనెల 24వతేదీ వచ్చినా టీడీపీ సర్కార్ ఇంతవరకు వాటిని ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టులు జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు, 292 మినీ అంగన్వాడీ కేంద్రాలు, 2,207 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో గర్భిణులు, బాలింతలు 14,568 మంది ఉన్నారు. అందని బాలసంజీవిని కిట్లు ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు బాలసంజీవని(పౌష్టికాహారంతోకూడిన) కిట్లు అందిస్తారు. ప్రతి లబ్ధిదారుకు అటుకలు కేజీ, చోడిపిండి 2 కేజీలు, బెల్లం పావు కేజీ, చెక్కీలు 250 గ్రాములు, ఎండు కర్జూరం 250 గ్రామలతో కూడిన బాలసంజీవని కిట్టు అందిస్తారు. అయితే ఈరోజు వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందాల్సిన బాలసంజీవని కిట్లు అందకపోవడంతో గర్బిణులు, బాలింతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.కాంట్రాక్ట్ ఖరారు కావడం లేటు గర్భిణులు, బాలింతలకు అందించే బాలసంజీవని కిట్లు ఇంతవరకు కేంద్రాలకు రాలేదు. బాలసంజీవని కిట్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఖరారు కావడం ఆలస్యం అవడంతో ఈనెల పంపిణీ ఆలస్యమైంది. కిట్లు వచ్చిన వెంటనే కేంద్రాలకు సరఫరా చేయనున్నాం. కేవీ బాలమణి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిణి -
వేల ఓట్లపై..సందేహాలా సర్!
● జిల్లాలో ప్రశ్నార్థకంగా 75 వేల ఓట్లు ● ప్రతిపక్ష ఓటర్లపై అధికార పార్టీ కత్తెర పెట్టిందన్న ఆరోపణలుసాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. దాదాపు 75 వేల వరకు ఓట్లు గల్లంతు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలకు చెందిన వారి ఓట్లే ప్రమాదంలో పడ్డాయన్న వాదన వినిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు..తమ పార్టీ కార్యక్రమంలా దగ్గరుండి, ఈ ప్రక్రియను వారి కనుసన్నల్లో నిర్వహించడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. తమ పార్టీకి బలం ఉన్న గ్రామాలు, మండలాల్లోనే పెద్ద సంఖ్యలో ఓట్లను జాబితా నుంచి తొలగించారని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ఆచూకీ లేని ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లతో పాటు, అర్హులైన పలువురి ఓట్లు కూడా తొలగించే ప్రయత్నం సాగిందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం దీనిపై ప్రత్యేకంగా స్పందించి, ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు, ఆచూకీ లేని నమోదులను మాత్రమే నిబంధనల ప్రకారం తొలగిస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగమూ కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని చెబుతున్నారు. ‘సర్’ ముగిసే నాటికి ఆచూకీ లేని 75,112 ఫారాలు సర్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,90,562 మంది ఓటర్లు ఉండగా.. అందులో 7,15,450 మంది ఓటర్ల ఎలక్ట్రోరల్ ఫారాలను (90.50 శాతం) డిజిటలైజ్ చేశారు. మిగిలిన 75,112 ఫారాలు (9.50 శాతం) మరణాలు, చిరునామా మార్పులు, ఇతర కారణాల వల్ల సేకరించడానికి వీల్లేనివిగా నమోదు చేశారు. ఇందులో 36,003 మంది ఓటర్లు మరణించినట్లు చెబుతున్నారు. 17,278 మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారని..11,279 మంది అందుబాటులో లేకపోవడం లేదా చిరునామా లభించకపోవడం వల్ల సేకరించలేకపోయారన్నది అధికారుల మాట. 10,462 మంది ఇప్పటికే ఓటరుగా(డబుల్) నమోదై ఉండగా.. మరో 90 మంది ఇతర కారణాల వల్ల ఈ జాబితాలో చేరారని అంటున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే.. సర్ ప్రక్రియ మొత్తం అధికార పార్టీకి చెందిన వారి కనుసన్నల్లోనే జరిగింది. ఆ పార్టీకి చెందిన బీఎల్వోలు దగ్గరుండి మరీ..తమకు అనుకూలంగా లేని వారి ఓట్లు తొలగించారన్న విమర్శలు ఉన్నాయి. మిగతా పార్టీలు ఈ ప్రక్రియపై పెద్దగా దృష్టి సారించకపోవడం వారికి కలిసొచ్చింది. 2002 నాటి జాబితా ప్రకారం చిరునామాలు దొరక్కపోవడం కూడా సమస్యగా మారింది. కోడళ్ల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. వైఎస్సార్సీపీకి బాగా పట్టు ఉన్న సాలూరు, కురుపాం నియోజక వర్గాల్లో ఎక్కువ ఓట్లు గల్లంతయ్యాయి. పార్వతీపురం, పాలకొండ నియోజక వర్గాల్లోనూ వేల ఓట్ల తొలగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జాబితాపై అభ్యంతరాలు తెలుపడానికి, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31 నుంచి ఆగస్టు వరకు అవకాశం కల్పించారు. అర్హులైన పౌరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవాలి. ఓటు లేకుంటే అవసరమైన దరఖాస్తులు సమర్పించాలి. –డా.ఎన్.ప్రభాకర రెడ్డి, కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి -
ఆశ్రమ పాఠశాల తరలింపుపై ఆందోళన
పాచిపెంట: మండల కేంద్రంలోని పద్మాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తరలింపు అంశం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారిని తాత్కాలికంగా సాలూరు వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్)కి తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మూడు ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు. తమ పిల్లలను సాలూరు వైటీసీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించబోమని స్పష్టం చేస్తూ ఆందోళనకు దిగారు. అవసరమైతే తమ పిల్లలకు ట్రానన్స్ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇచ్చేయాలని నినాదాలు చేశారు. దీంతో పాఠశాల ఆవరణలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైటీసీపై అభ్యంతరాలు.. సాలూరులోని వైటీసీ శ్మశానవాటికకు సమీపంలో ఉండడంతో పాటు తమ గ్రామాలకు దూరంగా ఉండడంతో అక్కడ చిన్నారులను ఉంచడం సమంజసం కాదని తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లల భద్రతతో పాటు వారి మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా అయినా అందుబాటులో ఉండే, అనువైన ప్రాంతంలో పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను కొనసాగించాలని అధికారులను కోరారు. చర్చల తర్వాత విద్యార్థుల తరలింపు తల్లిదండ్రుల నిరసనతో విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొంతసేపు నిలిచిపోయింది. ఈ సమాచారం అందుకున్న అధికారులు, ఐటీడీఏ సిబ్బంది తల్లిదండ్రులతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చివరకు కొంతమంది తల్లిదండ్రులను ఒప్పించడంతో సుమారు 130 మంది విద్యార్థులను సాలూరు వైటీసీకి తరలించారు. అయితే మిగిలిన 80 మంది విద్యార్థులను తల్లిదండ్రులు తమ వెంట తీసుకెళ్లిపోయారు. సరైన ప్రత్యామ్నాయం చూపించే వరకు పిల్లలను పంపే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, విద్యార్థుల భద్రతకు భంగం కలగకుండా, తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వైటీసీకి పిల్లలను పంపబోమంటూ బస్సుల అడ్డగింత తల్లిదండ్రులను ఒప్పించి 130 మంది విద్యార్థుల తరలింపు 80 మందిని వెంట తీసుకెళ్లిన తల్లిదండ్రులు -
రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం
పార్వతీపురం రూరల్: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పార్వతీపురం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.25 లక్షల విలువైన 2.530 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన ద్వారం సమీపంలో టౌన్ సీఐ బి. వెంకటరావు, ఎస్సై వై. సింహాచలం తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని తనిఖీ చేయగా రెండున్న కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను చైన్నెకి చెందిన అబ్దుల్ ఇర్ఫాన్ (33), కార్తీ (27)లుగా పోలీసులు గుర్తించారు. ఒడిశాలోని రాయగడ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసి చైన్నెకి తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల నుంచి గంజాయితో పాటు రెండు బ్యాగులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆధార్ కార్డు, రూ.800 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రధాని పర్యటన నేపథ్యంలో.. ఆకస్మిక వాహన తనిఖీలు
● వాహనదారులు చొరబడకుండా సూచిక బోర్డుల ఏర్పాటు ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ● మీటింగ్ స్థలానికి వాహనాలు వచ్చే మార్గాల పరిశీలన పూసపాటిరేగ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 1న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు వెళ్లవలసిన మార్గాలు, వాటికి కేటాయించిన పార్కింగ్ స్థలాల ను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడూతూ భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. వాహనాలు వచ్చే మార్గాల్లో వాహనదారులు దారి తప్పకుండా, స్పష్టంగా కనిపించే విధంగా ప్రధాన జంక్షన్లలో పెద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మార్గాల నుంచి వచ్చే వాహనాలకు ఎటువంటి ట్రాఫిక్ ఆటంకాలు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించా రు. బందోబస్తు నిమిత్తం విధులకు వచ్చే పోలీసు అధికారులు, సిబ్బందికి వసతి, భోజన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణంతో పాటు భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధాని పర్యటన వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అత్యున్నత స్థాయి నిఘా, పటిష్టమైన భద్రతా బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. -
ఎంఎస్ఎంఈ పార్కు పనుల అడ్డగింత
● పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన కొత్తవలస: మండలంలోని బలిఘట్టం గ్రామం సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కులో పనులకు పరిహారం అందించలేదంటూ రైతులు ఆది వారం పనులను అడ్డుకుని ఆందోళన చేశారు. ఈ పార్కు నిర్మాణానికి గతంలో ప్రభుత్వం భూ సేకరణ నిర్వహించింది. సేకరించిన భూమికి సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు. గత ఏడాది సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అట్టహాసంగా ఎంఎస్ఎంఈ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. కాగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో బల్లిఘట్టం, అడ్డూరువానిపాలెం తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 20 మంది పార్కు వద్దకు చేరుకుని తమకు పూర్తిస్థాయిలో పరిహారం ప్రభుత్వం అందించలేదు. పనులను ఆపండి అంటూ అడ్డుకున్నారు. ఆదివారం కావడంతో అదికారులు అందుబాటులో లేకపోవడంతో పనులను నిలిపేశారు. -
శ్రమ ఎక్కువ.. ధర తక్కువ
సీతంపేట: మధుర ఫలాలుగా పిలవబడే సీతాఫలాల సీజన్ సీతంపేట ఏజెన్సీలో ఆరంభమైంది. ఈ ఏడాది దిగుబడులు ఆశించినంతగా లేవని గిరిజన రైతులు చెబుతున్నారు.ఽ మద్దతు ధరలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రతి శనివారం కుశిమి వారపు సంతకు, ఆది, సోమవారాల్లో సీతంపేట మార్కెట్లోకి సీతాఫలాలను గిరిజన రైతులు తీసుకువస్తున్నారు. కావిడ సీతాఫలాలు రూ.1000 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. ట్రేలలో కూడా విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రే రూ.700 వరకు అమ్మకాలు చేస్తున్నారు. గతేడాది ట్రే సీతాఫలాలు రూ.1000 పైబడే అమ్మకాలు జరిపామని గిరిజనులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రారంభమైన సీజన్ అక్టోబరు మొదటి వారంతో ముగుస్తుంది. సీజన్ మధ్యలో ఎక్కువ మంది మార్కెట్కు సీతాఫలాలు తీసుకువస్తే దళారీ వ్యాపారులు రింగ్గా మారి ధరలు దించేస్తారని గిరిజన రైతులు వాపోతున్నారు. అప్పుడు కావిడ ధర రూ.500కు కూడా పడిపోయే పరిస్థితి ఉంటుందని తెలిపారు. గిరిజనులకు పైనాపిల్ తర్వాత అత్యధిక ఆదాయాన్ని తెచ్చే పంట ఇది. ఈ ఏడాది పైనాపిల్ పండ్లతో నష్టాలు చవిచూసిన గిరిజనులు సీతాఫలంలోనైనా ఆదాయాలు వస్తాయేమోనని ఆశతో ఉన్నారు. 500 ఎకరాల్లో పంట సాగు.. సీతంపేట ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయంలో భాగంగా దాదాపు 500 ఎకరాల్లో సీతాఫలం పంట సాగవుతుంది. సుమారు 200 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కొండపోడు పంటలతో పాటు కొండదిగువన కూడా సీతాఫలాల చెట్లు ఉంటాయి. ఖరీఫ్ సీజన్లో వరిలో పెట్టుబడులు పెట్టడానికి ఈ పంట ఎంతో దోహద పడుతుందని గిరిజనులు చెబుతున్నారు. గతేడాది మొదట్లో ఇదే ధరలు ఉన్నప్పటికీ మద్యలో ధరలు తగ్గిపోయాయి. గిరిజనులు నిల్వ చేసుకోవడానికి వీలుకాని పండ్ల జాతిలో సీతాఫలం ఒకటి. చెట్టునుంచి తీసిన పండ్లు రెండు, మూడు రోజుల్లో విక్రయించకపోతే పండు కుళ్లిపోతుంది. ధరలు ఉంటాయో లేదో తెలియదు ధరలు ఎంత వరకు నిలబడతాయో తెలీదు. గతంలో ఒక్కొక్కరు రూ.10 వేల వరకు ఆదాయం సంపాదించే వారు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేని పరిస్థితి ఉంది. ఎస్.సురేష్, బుడగరాయి ప్రతి ఏటా నష్టాలు తప్పడం లేదు. సీజన్ ఆరంభంలో ఽసరైన ధరలు పలుకుతాయి. మధ్యలో ధరలు పడిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పైనాపిల్ విక్రయాల్లో సైతం నష్టాలు చవిచూశాం. ఎస్.సుక్కయ్య, ఈతమానుగూడ సీతాఫలాల సీజన్ ఆరంభం 500 ఎకరాల్లో పంట సాగు 200 టన్నులకు పైగా దిగుబడి కావిడ ధర రూ.1000 రూ.1200 మైదాన ప్రాంతాల్లో డిమాండ్ ఒడిశా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి సీతాఫలాలు కొనుగోలు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో వారు కిలోల వంతున విక్రయించి లాభాలు ఆర్జిస్తారు. ఇక్కడ కిలో సరాసరి రూ.20 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు మైదాన ప్రాంతాల్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు అమ్మకాలు జరుపుతారు. కొంతమంది దళారీ వ్యాపారులు సీజన్ ఆరంభంలోనే గ్రామాల్లోకి వెళ్లి అడ్వాన్సులు ఇచ్చి పంట కొనుగోలు చేస్తారు. అప్పట్లో కావిడ రూ.400 చొప్పున వ్యాపారులు అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడు కూడా అదే ధరలకు ఆ వ్యాపారులకు విక్రయించాల్సి ఉంటుంది. కావిడ రూ.1200లు ఉన్నా పాత ధరకే ఇవ్వాల్సి ఉంటుందనే నిబంధనలు వ్యాపారులు పెడతారు. -
పట్టపగలే దొంగతనం
వీరఘట్టం: మండలంలోని చలివేంద్రి గ్రామంలో ఆదివారం పట్టపగలే దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గర్బాన శంకరరావు ఇంటిలో దొంగలుపడి రూ. 1.80 లక్షల నగదు, అరతులం బంగారు చెవిదిద్దులు తీసుకెళ్లిపోయారు. బాధితుడు, పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బాధితుడు శంకరరావు వ్యవసాయ పనుల పెట్టుబడి కోసం రెండు రోజుల కిందటే బ్యాంక్లో బంగారం తాకట్టుపెట్టి రూ. 1.80 లక్షల నగదు తీసుకుని, ఇంటిలోని బీరువాలో భద్రపరిచాడు. ఆదివారం ఉదయం ఆయన పొలం పనులకు వెళ్లగా.. అతని భార్య హేమ భోజనం తీసుకుని పొలానికి వెళ్లింది. ఇంటికి తాళం వేసి, పక్కనే ఉన్న గోడపై తాళంచెవి పెట్టడంతో.. గమనించిన దొంగలు ఇంటి తలుపులు తెరిచి దొంగతనానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై షణ్ముకరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ దర్శనానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతి ● పలువురికి గాయాలుసీతానగరం: దైవ దర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతి చెందిన సంఘటన ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాల ప్రకారం.. చీపురుపల్లి మండలం అలజంగి గ్రామానికి చెందిన చింత గురునాయుడు (52) అలియాస్ దాసు, కుటుంబ సభ్యులు పది మందితో కలిసి రాయగడలోని మజ్జిగౌరి దర్శనానికి ఆటోలో శనివారం రాత్రి బయలుదేరారు. సీతానగరం మండలం జోగింపేట వద్దకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చేరుకున్నారు. ఈ సమయంలో అదే రోడ్డులో పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న బొలేరో వ్యాన్ ఎదురుగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గురునాయుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన వారు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథ్ పరిశీలించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హేమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారమే ఏపీటీఎఫ్ లక్ష్యం
రాజాం సిటీ: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏపీటీఎఫ్ ముందడుగు వేస్తోందని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల అన్నారు. ఆదివారం స్థానిక సన్స్కూల్ ఆవరణలో ‘రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 – ఉపాధ్యాయుల విభజన’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విభజనపై ఉపాధ్యాయులు లేవనెత్తుతున్న అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.వేణుగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగుల విభజనలో జరిగిన లోపాలు ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాకుండా ఏపీటీఎఫ్ చూడాలని సూచించారు. ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకు ఈ అవగాహనా సదస్సు ఏర్పాటు చేశామని జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు సరస్వతి, బాలకృష్ణ, వెంకటపతిరాజు, జోగినాయుడు, పాల్తేరు శ్రీనివాస్, తిరుమలరావు, చావలి శ్రీనివాస్, బుఖారి బాబు, అచ్యుతకుమార్, ఆర్.అప్పలనాయుడు, లంక రామకృష్ణ, సీతంనాయుడు, భాస్కరరావు, శివరావు, మహేష్, తదితరులతో పాటు మూడు జిల్లాల నుంచి 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పక్కాగా వాహన తనిఖీలు
● ఎస్పీ ఏఆర్ దామోదర్ గంట్యాడ: ఆగస్టు 1న ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో విజయనగరం పట్టణం, రూరల్, భోగాపురం, భోగాపురం సర్కిల్ పరిధిలో పక్కాగా వాహన తనిఖీలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గాల్లో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. ఎయిర్పోర్టు పరిసర గ్రామాల్లో కూంబింగ్, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాని పర్యటన ముగిసే వరకు భద్రతా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పెంట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు అవార్డులు బొబ్బిలిరూరల్: రాష్ట్ర అటవీశాఖ కాకినాడలో నిర్వహించిన స్పారో హీరో జాతీయస్థాయి కథా రచనల పోటీల్లో పెంట జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు రాణించారు. ఎం. జయశ్రీ సీనియ ర్ విభాగంలో మొదటి స్థానం సాధించగా, రెండో స్థానాన్ని శ్రీలాస్య సాధించింది. అలాగే జూనియర్ విభాగంలో ఎన్. ప్రణీతకు మూడో స్థానం, డ్రాయింగ్ జూనియర్ విభాగంలో జి. అశ్విన్కుమార్కు నాలుగో స్థానం లభించింది. కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అటవీశాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మోహనరావు విద్యార్థులతో గైడ్ టీచర్లు కె సింహాచలం, ఎం శ్రీనివాసరావులను అభినందించారు. భట్రాజుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సతీష్రాజు విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లాకు చెందిన సీహెచ్సీఎస్వీ రాజు (సతీష్రాజు)ను సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భట్రాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల పక్కిరాజు, ఏపీ రాష్ట్ర భట్రాజుల కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వరరాజు, విజయనగరం జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య సీతానగరం: తీవ్ర మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అంటిపేటలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చుక్క త్రినాథ్ (75) భార్యర తొమ్మిది నెలల కిందట మృతి చెందింది. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కుమార్తెకు కూడా వివాహం జరిగిపోవడంతో కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక కొన్నాళ్లుగా ముభావంగా ఉంటున్నాడు. ఈక్రమంలో ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ కమలాకర్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమం
● సీతంపేటలో ఆదివాసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం సీతంపేట: ఆదివాసుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు, భూ హక్కుల సంరక్షణ చట్టాల సమర్థవంతమైన అమలు కోసం ఐక్యంగా ఉద్యమించాలని సీతంపేట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సామాజిక భవనంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానించారు. ప్రధానంగా జీవో నంబర్ 3, వన్బై సెవెన్టీ చట్టం, పీసాచట్టం, అలాగే ఆదివాసుల హక్కులకు సంబంధించిన ఇతర ముఖ్యమైన చట్టాల అమలు, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చట్టాల అమలులో ఉన్న లోపాలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లడంతో పాటు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు నిర్ణయించారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం భారీ ప్రజా కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ కార్యక్రమానికి సంబంధించిన తేదీని ఒకటి లేదా రెండు రోజుల్లో ఖరారు చేసి ప్రకటించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. హక్కుల సాధనలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, యువత ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీతంపేట జేఏసీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు కొండగొర్రి ధర్మారావు, రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు బిడ్డిక తేజేశ్వరరావు, జేఏసీ నాయకులు కొండగొర్రి సుబ్బారావు, బి.దమయంతినాయుడు, బి.ఉమామహేశ్వరరావు, నిమ్మక కాంతారావు, కె.భాస్కరరావు, బి.రామ్మోహన్రావు జేఏసీ కార్యదర్శులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారుపై సమరం
విజయనగరం: ఎన్నికలకు ముందు యువత, విద్యార్థులకు ఇచ్చిన హమీలను విస్మరించి మాయమాటలు, మోసకారి చర్యలతో పబ్బంగడుపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించనున్నట్లు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 28న పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలతో పాటు ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీల విషయంలో చేస్తు న్న మోసంపై గళం విప్పనున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం విజయనగరంలోని రింగ్రోడ్లో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిరసన ర్యాలీకి సంబందించి వాల్పోస్టర్లను పార్టీ యు వజన విభాగం నాయకులతో కలిసి ఆయన ఆవి ష్కరించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు విజయనగరంలోని మున్సిపల్ కార్యాలయం జంక్షన్ నుంచి గంటస్తంభం జంక్షన్, మెయిన్ రోడ్ మీదుగా మూడులాంతర్ల జంక్షన్ వరకు నిరసన సాగుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొ ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్కారు మెడలు వంచేంత వరకు పోరటం జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించి న నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపై ఇటీవల ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థులు చేపట్టిన పోరటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింద ని అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారని మజ్జి శ్రీని వాసరావు గుర్తు చేశారు. ఇదే తరహాలో ఆఽంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత నిర్వహించిన డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచేందుకు యువత, విద్యార్థులకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీలో అక్రమా ల ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఆ బాధ్యతలను తొలగించాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థులకు ఇచ్చిన హమీలు అమలు ఎప్పుడు..? ఎన్నికలకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు చంద్రబాబు సర్కారు ఇచ్చిన హమీలు ఎప్పుడు అమలు చేస్తారని మజ్జి శ్రీని వాసరావు ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామని ప్రకటించి రెండేళ్లుగా గడుస్తున్నా అమలు చేయలేదన్నారు. అదే విధంగా ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజురీయింబర్స్మెంట్ బకా యిల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో యువత, విద్యార్థుల భవిష్యత్ కోసం రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షగా వైఎస్సార్సీపీ పోరుబాట పడుతుందని చె ప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ, పట్టణ స్థాయి నుంచి యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీఎస్సీలో దగా: మాజీ ఎమ్మెల్యే అలజంగి పార్వతీపురం రూరల్: ఉపాధ్యాయ నియామకాల్లో (డీఎస్సీ) జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన పార్వతీపురంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో డీఎస్సీ ప్రక్రియలో దొర్లిన బాగోతం, చోటుచేసుకున్న అక్రమాల గురించి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరికీ విధితమేనని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ తీరుతో దగాపడ్డ నిరుద్యోగ యువత పక్షాన గళమెత్తేందుకు ఈ నెల 28న వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో పార్వతీపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జోగారావు వెల్లడించారు. ఈ అక్రమాలపై ముక్తకంఠంతో నిలదీసేందుకు జరిగే ఈ పోరులో యువత పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మజ్జి శ్రీనివాసరావు -
గర్భగుడి నుంచి గ్రీన్ పిచ్ వరకు..
● ఘనంగా ప్రారంభమైన బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ ● టోర్నమెంట్లో పాల్గొన్న ఎనిమిది టీమ్లు విజయనగరం టౌన్: నిత్యం వేదమంత్రోచ్ఛారణలతో ధార్మిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపే ఆ చేతులు ఆనందంతో కాసేపు ఉల్లాసంగా.. ఉత్సాహంగా బ్యాట్, బంతి పట్టుకుని ఆనందపడ్డాయి. ఆదివారం స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా క్రీడాశాఖాధికారి వెంకటేశ్వరరావు దంపతులు ప్రారంభించారు. జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు టీవీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటి రోజు టోర్నీలో ఎనిమిది టీమ్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వరరావు దంపతులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు భమిడిపాటి రామ్కుమార్ శర్మ, గౌరవాధ్యక్షుడు ఈఆర్.సోమ యాజులు, అల్లంరాజు సూర్యరాజేశ్వరశర్మ, పప్పు సరోజిని, భమిడిపాటి జోగేష్ శర్మ, రామాయణం సత్యనారాయణ శర్మ, కాశీభట్ల పవన్కుమార్ శర్మ, సంగీసపు మోహన్శర్మ, నూతి సుబ్రహ్మణ్యం, బొడ్డపాటి కామేశ్వరశర్మ, నౌడూరి మణికుమార్ శర్మ, చెంబోలు సూర్యనారాయణ శర్మ, జయంతి సత్యనారాయణ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి
విజయనగరం ఫోర్ట్: ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వ్యవసాయ శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత ఎరువులు తీసుకోని రైతులు ఎరువులు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని రైతులు ఇప్పటికే రెండో విడత ఎరువులు తీసుకుంటున్నారని తెలిపారు. రెండు విడతల ఎరువుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొదట విడతకు 12,259 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 11,653 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మండలాల వారీగా పరిస్థితులను అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సలహాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు సెల్లార్లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీలను మీ కోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల నమోదు, అర్జీల స్థితి దానికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100కు నేరుగా కాల్ చేయవచ్చునన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేశామని చెప్పారు. సెప్టెంబర్ 27న ఏకపాత్రాభినయ పోటీలుపార్వతీపురం: శ్రీ వాణి ఆర్ట్స్ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో సెప్టెంబర్ 27న ఉత్తరాంధ్ర స్థాయి పౌరాణిక పద్యనాటక ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.పీజేనాయుడు ఆదివారం తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు కళాకారులు పాల్గొనే ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.5,200తో పాటు ఇత్తడి కిరీటం, ద్వితీయ బహుమతిగా రూ.3,400, తృతీయ బహుమతిగా రూ.2,500 నగదు, షీల్డ్ అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు ప్రత్యేక బహుమతులు కూడా ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల కళాకారులు డా. పీజేనాయుడు(9440012010), ఎం.సింహాచలం (9849833439), జి.చినతిరుపతి(95507 54406) ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. జిల్లాలో ఎలక్ట్రోరల్ ఫారాల పరిశీలన పూర్తిపార్వతీపురం: జిల్లాలో ఓటర్ల ఎలక్ట్రోరల్ ఫారాల నమోదు, పరిశీలన ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లాలోని మొత్తం 7,90,562 మంది ఓటర్లలో 7,15,450 (90.50 శాతం) ఫారాలను డిజిటలైజ్ చేయగా, మిగిలిన 75,112 ఫారాలు మరణాలు, వలసలు, చిరునామా మార్పుల కారణాలతో సేకరించలేనివిగా నమోదయ్యాయని వెల్లడించారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన పౌరులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవాలని కలెక్టర్ కోరారు. విజయనగరం అర్బన్: ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం)’ విశిష్టతను ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘30 సెకన్ల గ్రూప్ రీల్’ ‘సెల్ఫీ రీల్’ కాంటెస్ట్లను నిర్వహిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కేఎస్ విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘విమానాశ్రయం మీ దృష్టిలో ఏమిటి? మీకు ఎందుకు గర్వకారణం?’అనే అంశంపై 30 సెకెన్ల నిడివితో గ్రూప్ లేదా సెల్ఫీ వీడియో రూపొందించాలి. రీల్ను మీ ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేస్తూ ఏపీఅఫీయల్ న్యూస్ ఖాతాను ట్యాగ్ చేయాలి. ప్రచురించేటప్పుడు ఏఎస్ఆర్ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాష్ ట్యాగ్ను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎంపిక చేసిన టాప్–5 విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. ఆసక్తిగల యువత తమ వీడియోలను ఈ నెల 29లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బొండపల్లి: వరుణుడి కటాక్షం కోసం రైతులు, చిన్నారులు బొండపల్లి మండలంలోని గిట్టుపల్లి గ్రామంలో ఆదివారం కప్పల పండుగను నిర్వహించారు. కప్పల పండుగ చేస్తే తప్పనిసరిగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం గ్రామాల్లోని రైతులకు ఉండడంతో చిన్నారులు, పెద్దలు కలిసి గ్రామంలో కప్పలను పసుపుబట్టల్లో కట్టి ఇంటింటికీ తీసుకువెళ్లి స్నానాలు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిసి పంటలు సాగు చేయడానికి అవకాశం కల్పించి ముందుకు నడిపించాలని గ్రామంలోని చిన్నా పెద్దా పండుగను నిర్వహించి, పూజలు చేశారు. -
ఈ నగరాలకు ఏమైంది?
నార సంచుల వినియోగమే పర్యావరణానికి మేలు సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తగ్గించుకోవాలి. ప్లాస్టిక్కు బదులు నార సంచులు, గుడ్డ సంచులు, జూట్ ఉత్పత్తులు, కాగితపు సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలి. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, నిల్వ, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నివారించాలి. ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రజలు, వ్యాపారులు కలిసి పనిచేయాలి. ప్లాస్టిక్కు మనమే దూరంగా ఉంటేనే భావితరాలకు స్వచ్చమైన వాతావరణాన్ని అందించగలం. సరిత, కాలుష్య నియంత్రణ మండలి, ఈఈ, విజయనగరం విజయనగరం గంటస్తంభం: ఓ వైపు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు..ఫలితంగా మరో వైపు పర్యావరణానికి ముప్పు. కేంద్ర ప్రభుత్వం సింగిల్–యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించి నాలుగేళ్లు దాటుతున్నా ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాత్రం ఆ నిబంధనలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, థర్మాకోల్ వస్తువుల వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఫలితంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఇవి పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. అవగాహనతో ఆగిపోయిన ప్రచారం గతంలో విజయనగరం నగర పాలక సంస్థ, బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల, ఎస్.కోట నగర పంచాయతీలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. వ్యాపారులకు సూచనలు జారీ చేశాయి. కొంతకాలం తనిఖీలు కూడా చేపట్టాయి. అయితే ఆ తర్వాత ఆ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో కొనసాగకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం మళ్లీ పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.తనీఖిలు..జరిమానాలు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2025–26లో 196 తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.2.92 లక్షల జరిమానా విధించారు. 3 టన్నుల నిషేధిత సింగిల్–యూజ్ ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకుని విశాఖపట్నంలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు తరలించి నిర్వీర్యం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. మార్కెట్లలో యథేచ్ఛగా వినియోగం కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, పండ్ల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్ల, టీ దుకాణాల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్ల వినియోగం అధికంగానే కొనసాగుతోంది. వస్తువులు కొనుగోలు చేసే వినియోగాదారులకు కూడా వ్యాపారాలు ప్లాస్టిక్ కవర్లనే అందిస్తున్నారు. కాటన్ సంచులు వెంట తీసుకెళ్లే అలవాటు ప్రజల్లో పూర్తిగా పెరగకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. కానరాని ప్లాస్టిక్ నిషేధం అమలు ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వినియోగం నివేదికల్లో తనిఖీలు..క్షేత్రస్థాయిలో పాలిథిన్ కవర్ల హవా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు -
రచ్చ గెలిచి.. ఇంట ఓడి..!
బొబ్బిలి: ఇంటిపేరు కస్తూరి వారు. ఇంటినిండా గబ్బిలాల కంపు అన్న చందంగా ఉంది బొబ్బిలి వీణల కేంద్రం పరిస్థితి. బొబ్బిలి వీణల కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతే కాదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఇక్కడి జ్ఙాపికలు, బహుమతుల వీణలు, తయారీ విధానానికి అబ్బురపడ్డారు. ఇక్కడి కార్మికులను వైట్ హౌస్కు ఆహ్వానించారు. ఇక్కడి తయారీ దారులు దేశ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గుర్తింపు పొందారు. వీణల కేంద్రంలో ఎన్నో వీణలు తయారయ్యాయి. కానీ ఇక్కడి వీణల కేంద్రం మాత్రం అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రం చుట్టూ తుప్పలు, డొంకలు బొబ్బిలి వీణల కేంద్రం ఆవరణ, ప్రహరీ లోపల తుప్పలు, డొంకలతో నిండి ఉంది. ఏటా ఇవి పెరుగుతున్నా చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యాడు. వాస్తవానికి వీణల కేంద్రం ఏటా దాదాపు రూ.40వేలు పన్నుల రూపేణా మున్సిపాలిటీకి చెల్లిస్తోంది. అయినా మున్సిపల్ కార్మికులతో ఇక్కడ పరిశుభ్రం చేయించేందుకు అధికారులు చొరవ చూపడం లేదు. ఫలితంగా ఆవరణ అంతా నాగుపాములు, జెర్రిపోతులు, ఉల్లి పాములు తిరుగుతూ కళాకారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సుమారు 38 మంది కళాకారులు ఉన్న వీణల కేంద్రం వద్ద వారు మరుగుదొడ్లకు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా చుట్టూ పొదలు దర్శనమిస్తున్నాయి. చీకట్లోనే కేంద్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న వీణల కేంద్రానికి వెళ్లాలంటే చీకటి తప్పదు. ఇక్కడి కేంద్రం బోర్డు వద్ద వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కళాకారులు కోరినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. అంతే కాదు వీణల కేంద్రానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు వెలిసిపోయి తుప్పుపట్టింది. కానీ పట్టించుకునే నాథుడే లేడు. కేంద్రం వద్ద బోర్డు లేక పోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వీణల కొనుగోలు కోసం వచ్చిన ఔత్సాహికులు కేంద్రం ఎక్కడుందని స్థానికులను అడగాల్సి వస్తోంది. తుప్పలు తొలగించి వీణల కేంద్రం వద్ద లైట్లు వేసి కేంద్రానికి మునుపటి శోభ తీసుకురావాలని వీణల కేంద్రం కళాకారులు, స్థానికులు కోరుతున్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు.. స్థానికంగా పారిశుధ్య లోపంతో కంపు.. తుప్పలు తొలగించకపోవడంతో పాములు, కీటకాల బెడద ఇదీ బొబ్బిలి వీణల కేంద్రం దుస్థితి -
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం
వీరఘట్టం: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదామని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. వీరఘట్టం మండలం బిటివాడలో శనివారం నిర్వహించిన గట్టు మీద చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొని పొలం గట్లపై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలం గట్టుపై మొక్కలు నాటడంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యం అవుతుందన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, వ్యవసాయశాఖ జేడీ భవానీశంకర్, ఏడీఏలు రత్నకుమారి, అన్నపూర్ణ, డీపీఎం శ్రావణ్కుమార్, మండల వ్యవసాయశాఖ అధికారి జె.సౌజన్య పాల్గొన్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వైద్యం అందాలి ● డీఎంహెచ్ఓ పి.విజయలక్ష్మి గుమ్మలక్ష్మీపురం: అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు పూర్తి వైద్యం అందించాకే అవసరమైతే ఇంటికి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.విజయలక్ష్మి సూచించారు. టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న తోయక వరుణ్ అనారోగ్యంతో స్వగ్రామమైన దేరుగండలో గురువారం మృతి చెందిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వరుణ్ చదివిన ఆశ్రమ పాఠశాలను డీఎంహెచ్ఓ శనివారం సాయంత్రం సందర్శించారు. విద్యార్థి మృతి చెందిన సంఘటనపై హెచ్ఎం, డిఫ్యూటీ వార్డెన్, వైద్యాధికారి ఇతర సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థికి అందించిన చికిత్స వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది, ఆశ్రమ పాఠశాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల్ని ఆస్పత్రిలో చేర్పించి, పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని, కోలుకున్న తర్వాత తల్లిదండ్రులు కోరితే ఇళ్లకు పంపించాలనన్నారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ కె.వి.ఎస్ పద్మావతి, జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. నేర ప్రవృత్తిని విడనాడాలి ● ఖైదీలకు న్యాయమూర్తి ఎం.మాధురి సూచన ● సబ్ జైలు ఆకస్మిక తనిఖీ పార్వతీపురం రూరల్: కారాగారాల్లో ఉన్న ఖైదీలు నేరప్రవృత్తిని విడనాడి, సత్పౌరులుగా జీవించాలని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.మాధురి సూచించారు. పార్వతీపురం సబ్ జైలును ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు వివక్ష చూపరాదన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. అనంతరం జైల్లోని లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్ల విధులను పరిశీలించారు. రిమాండ్లో ఉన్న ఏ ఒక్క ముద్దాయీ న్యాయవాది లేరనే ఇబ్బంది పడకూడదని, ఆర్థిక స్తోమత లేని వారికి సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదిని సమకూర్చుతామని స్పష్టం చేశారు. అనంతరం ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులోని వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్లను పరిశీలించి సరుకులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జె.సౌమ్యజోసఫిన్, సబ్ జైల్ సూపరింటెండెంట్ జి.రాము పాల్గొన్నారు. -
కట్టెల పొయ్యిలపైనే వంటలు
మక్కువ మండలం ములక్కాయవలస పీఎంశ్రీ ఏపీ మోడల్ పాఠశాలలో 617 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారిలో సుమారు 94 మంది విద్యార్థినులు వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. ఇక్కడ గ్యాస్తో కాకుండా, కట్టెలతో వంటలు చేస్తున్నారు. పాఠశాలలో నిల్వ ఉన్న కట్టెలు, టింబర్ డిపోను తలపిస్తున్నాయి. ఆరుబయట వంటలు సాగిస్తున్నారు. పీఎంశ్రీ నిధులతో ఆర్ఓ ప్లాంట్ మంజూరైనప్పటికీ, కేవలం ఇన్స్టాల్ చేసి, పైపులకు కనెక్షన్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు దొరకడంలేదు. బోరు నీరే ఆధారం అవుతోంది. ● మరుగుదొడ్లు పక్కనే ఉన్న ట్యాప్ల వద్ద భోజనం చేసిన కంచాలు (ప్లేట్లు) శుభ్రం చేసుకుంటున్నారు. మరుగుదొడ్ల నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. -
వారికి పీఎం ‘సిరి’... వీరికి కష్టాల ఉరి..!
ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ/పాచిపెంట: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం కింద పలు పాఠశాలలను ఎంపిక చేసి అక్కడ మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు... వారిలో నైపుణ్యాభివృద్ధికి ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, బ్యాంకింగ్ వృత్తివిద్య కోర్సు లను.. క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసి వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో వంటి క్రీడల్లో తర్ఫీదు, అవసరమైన సామగ్రి పంపిణీ, శుద్ధ జల ప్లాంటు, గ్రంథాలయాల ఏర్పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, ల్యాబ్ల ఏర్పాటు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ.. ఇలా అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. ఒక్కో పాఠశాలకూ సౌకర్యాల కల్పన కోసం సుమారు రూ.3 కోట్ల వరకూ నిధులు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో మక్కువ, పాచిపెంట మండలం పాంచాలి, పాలకొండ, అన్నవరం, సీతంపేట, వీరఘట్టం, భామిని, సాలూరు, పురో హితునివలస, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని పురపాలక ఉన్నత, ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆదర్శ.. ఇలా మొత్తం 20 పాఠశాలలను పీఎంశ్రీకి ఎంపిక చేశారు. రూ.లక్షలు వెచ్చించి పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్ర ఆశయం జిల్లాలో పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసేస్తున్నారు. కొన్ని చోట్ల అరకొర పనులతోనే మమ అనిపిస్తున్నారు. జిల్లా విద్యా శాఖాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు కుమ్మకై ్క నిధులను కై ంక్యర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు కూడా అధికార పార్టీకి చెందిన వారే చేసుకుంటున్నారు. పాచిపెంట మండలం పాంచాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2023–24 విద్యా సంవత్సరానికి పీఎంశ్రీ పథకానికి ఎంపికై ంది. ఈ పథకం కింద పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం సుమారు రూ.32 లక్షల నిధులు మంజూర య్యాయి. వర్షపు నీటి సంరక్షణ కోసం నాలుగు ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.లక్ష, కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు రూ.1.50 లక్షలు, రాంప్స్ అండ్ రైలింగ్ పనుల కోసం రూ.1.25 లక్షలు, లైబ్రరీ రూమ్ నిర్మాణానికి రూ.23,10,000 మంజూరయ్యాయి. పాఠశాలలో జరిగిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు.. పనుల వాస్తవ స్థితి, వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. చాలా వరకు పనులు చేయకుండానే నిధులు డ్రా చేసుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ వర్కులకు సంబంధించి బిల్లులు మొత్తం పాంచాలి మాజీ సర్పంచ్, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు గూడెపు యుగంధర్ కుమార్ పేరిట చెల్లించడం గమనార్హం. మక్కువ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 537 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ కూడా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పాఠశాల ప్రహరీ కూలిపోయింది. మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. 50 శాతం మంది విద్యార్థినులకు ఒక్కచోటే మరుగుదొడ్లు ఉన్నాయి. ఆరుబయట చెట్ల కింద వంటలు చేస్తున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో, క్యూలో నిలబడి ప్లేట్లు పట్టుకొని భోజనం కోసం విద్యార్థులు పాట్లు పడుతున్నారు. పీఎం శ్రీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు టీ షర్టులు, యోగా మేట్ల కాంట్రాక్టును విద్యాశాఖలో పనిచేస్తున్న శంకరరావు భార్య సంస్థకు అప్పనంగా అప్పగించారు. రూ.19 లక్షల విలువైన కాంట్రాక్టును టెండరు కూడా లేకుండా ఏక పక్షంగా కట్టబెట్టారు. సామగ్రి ఇవ్వకుండానే బిల్లులు కూడా చెల్లించడం గమనార్హం. విద్యాశాఖ వైఖరిని డీఆర్సీ సమావేశంలో ఇన్చార్జి మంత్రి తప్పుబట్టారు. అరకొర పనులతో పీఎం శ్రీ నిధులు స్వాహా? టెండర్లు కూడా అయినవారికే.. మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు -
గజరాజుల సంచారంతో భయాందోళనలు
బాడంగి: వారం రోజులుగా గజరాజుల గుంపు మండలంలో తిష్టవేసి పినపెంకి – ఆకులకట్ట పరిసరాల పొలాల్లో తిరుగాడుతుండడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. గ్రామాల్లోకి చొరబడకుండా అటవీ శాఖ, పోలీసు సిబ్బంది కపలా కాస్తున్నా.. పంట పొలాల్లోకి వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. శనివారం గూడెపువలస నుంచి మల్లంపేట పొలాల మీదుగా పాల్తేరు పొలాలకు గజరాజులు చేరుకున్నాయి. అక్కడి ప్రజలు కర్రలతో వాటిని అదిలించగా రావివలస తోటలు, పొలాల్లోకి చేరకున్నాయి. మొత్తంగా మండలంలోనే సంచరిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
రైతన్నపై బీమా భారం
బలిజిపేట: రైతులను ఉద్దరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిలువునా ముంచేసింది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసింది. విపత్తుల సమయంలో సాయం అందకుండా చేసింది. ఇప్పుడు భీమా ప్రీమియం భారం రైతులపై పడింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరి, మొక్కజొన్న పంటలు చేతికందే పరిస్థితులు కనిపించడంలేదు. కరువుకాలంలో పరిహారం అందాలంటే ప్రీమియం సొమ్ము రైతులు చెల్లించాలంటూ వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో కొందరు రైతులు అప్పులు చేసి ప్రీమియం డబ్బులు చెల్లిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని లబోదిబోమంటున్నారు. విత్తనం నుంచి ఎరువు వరకు, పరిహారం నుంచి పంట అమ్మకం వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో సాగునీటి వెతలు తప్పడంలేదని వాపోతున్నారు. అప్పట్లో రైతులకు భారం లేకుండా.. వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకునే దిశగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019 ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను అమలు చేశారు. విపత్తుల సమయంలో సాగుసాయం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – పత్తి, అరటి పంటలకు ప్రీమియం చెల్లింపులకు జూలై 24తో గడువు ముగిసింది. బ్యాంకు నుంచి రుణం పొందిన రైతుల ప్రీమియం మొత్తాన్ని సంబంధిత నిబంధనల ప్రకారం బ్యాంకు నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించబడుతుంది. బ్యాంకు రుణం లేని రైతులు ప్రీమియంను కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా చెల్లించి పంటల బీమా పొందవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలు కురవక పంటలు పండుతాయా? లేదా? అనే సందిగ్దంలో ఉన్నాం. దుక్కులు, విత్తనాలు, నారు బతికించుకునేందుకు అధిక పెట్టుబడి అయ్యింది. ఇప్పుడు బీమా ప్రీమియం చెల్లించాలంటే మరింత భారమే. గతేడాది ప్రీమియం చెల్లించిన రైతులు పంటలు నష్టపోయిన సమయంలో పరిహారం కూడా అందలేదు. – సత్యంనాయుడు, రైతు, బలిజిపేట ఉచిత పంటల బీమాకు మంగళం రైతన్నకు చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం ప్రీమియం రైతులే చెల్లించేలా ఉత్తర్వులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై ఆందోళన అప్పులు చేసి బీమా ప్రీమియం చెల్లిస్తున్న రైతులు -
గౌరవం మరిచారు..
గృహ గణన చేశారు.. సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ: జనగణన 2027లో భాగంగా గృహగణన కార్యక్రమం మే 1 నుంచి 30వ తేదీ వరకు జరిగింది. జిల్లాలోని రూరల్, పట్టణ ప్రాంతాల్లో నెల రోజుల పాటు వందలాది మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గృహగణన ప్రక్రియ నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికీ గౌరవ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో గణన విధులను సిబ్బందితో గౌరవంగా చేయించుకున్న అధికారులు.. వారికి గౌరవంగా చెల్లించాల్సిన మొత్తాన్ని నేటికీ ఇవ్వలే దు. గృహగణన ప్రక్రియ ముగిసి సుమారు రెండు నెలలు అవుతున్నా ఎన్యూమరేటర్లకు, సూపర్ వైజర్లకు గౌరవ వేతనం అందించలేదు. ఎందుకు జాప్యం? జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,136 హౌస్ లిస్టింగ్ బ్లాక్లు ఉండగా.. మొత్తం 3,45,608 గృహాలకు గానూ, 10,38,857 జనాభా వివరాలను సేకరించా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. గృహగణన విధులు నిర్వర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఒకొ క్కరికీ రూ.9 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. శిక్షణకు హాజరైనందుకు రూ.1,200 ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కరి మొత్తం రూ.10,200 చెల్లించాల్సి ఉంది. జనగణన కార్యక్రమాలకు సంబంధించిన నిధులను కలెక్టర్ల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తూ ఉత్తర్వులను గత మే నెలలోనే ప్రభుత్వం జారీ చేసింది. జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణ న ప్రక్రియ పూర్తయితే వెంటనే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గౌరవ వేతనం చెల్లించాలని పేర్కొంది. నేటికీ ఆ మొత్తం మాత్రం ఇంకా జిల్లా అధికారుల నుంచి వెళ్లలేదు. -
జోగింపేట చేరుకున్న ‘కుంకీ’లు
సీతానగరం : జిల్లా ప్రజలకు దశాబ్ద కాలంగా ఆందోళనకు గురి చేస్తున్న ఏనుగుల తరలింపునకు సంబంధించి కుంకీ ఏనుగులు శనివారం వచ్చేశాయి. మండలంలోని అప్పయ్యపేట – జోగింపేట గ్రామాలను ఆనుకుని ఉన్న కొండపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏనుగుల సంరక్షణ కేంద్రానికి కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. ఎనిమిది ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు మచ్చిక చేసుకుని తరువాత ఏనుగులు ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడకు చేరేలా వీటి ద్వారా చర్యలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి వచ్చిన ఏను గులు జోగింపేట సంరక్షణ కేంద్రానికి చేరడంతో జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలు ఏనుగుల బారి నుంచి ఇక ముప్పు తప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కుంకీ ఏనుగులైన జయంతి, అభిమన్యులకు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పర్యవేక్షణలో మండల రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జోగింపేట ఏనుగుల సంరక్షణ కేంద్రానికి చేరిన కుంకీ ఏనుగులకు చీఫ్ కన్జర్వేటరు ఆఫ్ పారెస్ట్స్ అధికారి ఐకేవీ రాజు, ఎమ్మెల్యే బి.విజయచంద్ర, డీఎఫ్ఓ జీఏపీ ప్రసూన, పలమనేరు, పాలకొండ సబ్ డీఎఫ్ఓలు పూజలు చేసి ఆశీర్వాదం చేసుకున్న అనంతరం వాటి స్థావరాల వద్ద సపర్యలు చేసి గొలుసులతో బంధించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, ఎస్ఐ హేమలత, అటవీ శాఖ సెక్షన్ అధికారులు, ఫీల్డ్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వినూత్న నిరసన
గిరిజనాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది... అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు.. రోడ్లు అధ్వానంగా మారాయి.. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదంటూ కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ జాకరగూడ గిరిజనులు, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి బి.అనిల్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జాకరగూడ రోడ్డుపై వరినాట్లు వేస్తూ, రోడ్డుపై ఉన్న నీటిలో స్నానం చేస్తూ నిరసన తెలిపారు. జాకరగూడ నుంచి అధ్వానంగూడ, సంజువాయి గ్రామాల వరకు మూడు కిలోమీటర్ల రోడ్డును బాగుచేయాలని డిమాండ్ చేశారు. – కురుపాం -
●కలెక్టర్గా కాదు.. నాన్నగా..!
పార్వతీపురంలోని డీవీఎం పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. ఆయన కలెక్టర్ హోదాలో కాక.. తండ్రి స్థానంలో హాజరు కావడం విశేషం. తన కుమారుడు కూడా ఇదే పాఠశాలలో చదువుతుండడంతో, బాధ్యతాయుతమైన తండ్రిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిపై ఇచ్చిన సందేశాన్ని, సూచనలను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో మాట్లాడి, విద్యార్థుల చదువు, ఇతర నైపుణ్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం -
పీజీఆర్ఎస్కు 23 వినతులు
సీతంపేట: ఐటీడీఏలో పాలకొండ సబ్కలెక్టర్, ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 23 అర్జీలు వచ్చాయి. ఆర్వోఎఫ్ఆర్ పట్టా వివరాలను గిరిభూమి పోర్టల్లో నమోదు చేయాలని చిన్నసున్నాపురానికి చెందిన కోట వరహాలమ్మ కోరింది. అన్నదాత సుఖీబవ మొత్తం ఇప్పించాలని రేగులగూడ, బూతలగూడకు చెందిన సవర రాదమ్మ, సవర సోంబారమ్మ వినతి అందజేశారు. అడ్డంగి గ్రామానికి సెల్టవర్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేశారు. సీతంపేట సెంటర్లో సులభ్ కాంప్లెక్స్ను ప్రయాణికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం: విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించాల్సిన అవసరం ఉందని పార్వతీపురం ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి అన్నారు. గుమ్మలక్ష్మీ పురం మండలం టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొ ని మాట్లాడారు. పిల్లల భవిష్యత్తును తీర్చిది ద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంగా ఉండాలని సూచించారు. అనంత రం ఆమె పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదిని పరిశీలించారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి విద్యార్థులకు నిరంతర విద్యుత్, తాగునీరు, పరిశుభ్రమైన వాతావర ణం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం జ్ఞానప్రకాష్, డిప్యూటీ వార్డెన్ వెంకటరావు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ● క్లీనర్ మృతి, డ్రైవర్కు తీవ్ర గాయాలుపాచిపెంట: మండలంలోని పి.కోనవలస ఘాట్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ దుర్మరణం చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన లారీ జగదల్పూర్ నుంచి రాజాం వైపు మొక్కజొన్న లోడుతో వెళ్తుండగా పి.కోనవలస ఘాట్ రోడ్డులో దుర్గగుడి సమీపంలోని ఒక్కసారిగా అదుపుతప్పిన లారీ కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జ యింది. క్యాబిన్లో క్లీనర్ ఇరుక్కుపోయి అక్కడికక్కడే మతిచెందాడు. డ్రైవర్ రోహిత్ న్శ్యా మ్ గార్డే తీవ్రంగా గాయపడగా, స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీ సులు, 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్ మతదేహాన్ని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు పాచిపెంట ఎస్సై అర్జున్ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు. -
బీఎన్ఆర్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్ ప్రారంభం
బీచ్రోడ్డు: బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తన ఐదో షోరూమ్ను విశాఖపట్నంలోని శ్రీ సంపత్ వినాయక ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది. నూతన షోరూమ్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొని సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి సమ్యుక్తా మీనన్ హాజరై షోరూమ్ను సందర్శించారు. బంగారు, వజ్రాభరణాలను పరిశీలించి అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను సంస్థ ప్రకటించింది. బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జీలు 0 శాతం, బంగారు ఆభరణాల తరుగుపై 3 నుంచి 9 శాతం వరకు, డైమండ్ ఆభరణాల తరుగుపై 25 శాతం వరకు తగ్గింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. డైమండ్ ఆభరణాలు ప్రతి క్యారెట్ రూ.46,999 నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే అన్ని రకాల కొనుగోళ్లపై జీఎస్టీని సంస్థే భరిస్తుందని వెల్లడించింది. ఈ సందర్భంగా బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ నాగిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రజల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యమైన ఆభరణాలు, మెరుగైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. -
ఎనిమిదేళ్ల బాలుడికి కోవిడ్ పాజిటివ్
విజయనగరం ఫోర్ట్: ఎనిమిదేళ్ల బాలుడికి కరోనా సోకింది. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన బాలుడు ఈనెల 17వ తేదీన మలేరియా జ్వరంతో విజయనగరం జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రి పిల్లల విభాగంలో కుటుంబ సభ్యులు చేర్పించారు. బాలుడి కాలుపై గాంగ్రిన్ (పుండు) రావడంతో ఘోషాస్పత్రి వైద్యులు బాలుడిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి డెర్మటాలజీ విభాగానికి ఈ నెల 23న రిఫర్చేశారు. కుటుంబ సభ్యులు బాలుడిని డెర్మటాల జీ వైద్యునికి చూపించగా కోవిడ్ వల్ల ఏర్పడిన గాంగ్రిన్గా అనుమానించి కోవిడ్ టెస్టు చేయాలని ల్యాబ్కు పంపించారు. అక్కడి వైద్య సిబ్బంది బాలుడికి రాపిడ్ టెస్టు చేయగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కచ్చితమైన నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం ప్రభుత్వ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్కు శాంపిల్ పంపించారు. శుక్రవారం ఆర్టీపీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.బాలుడికి కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్లో ఉండాలని ఇంటికి పంపించారు. -
కరి విధ్వంసానికి చెక్ పడేనా?
● జిల్లాకు వస్తున్న ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీలు జయంత్, అభిమన్యు ● కార్యరూపం దాల్చితే మన్యం వాసులకు తీరనున్న గజగండం సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న సమస్యల్లో అడవి ఏనుగుల బీభ త్సం ప్రధానమైనది. పంటలు ధ్వంసం కావడం, ఇళ్లపై దాడులు, గిరిజనుల ప్రాణాలు కోల్పోవడం, రాత్రిళ్లు భయంతో గ్రామాలు నిద్రపోకపోవడం... ఇవన్నీ ఈ ప్రాంత ప్రజలకు నిత్యకృత్యంగా మారా యి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాయ ని రెండేళ్లుగా ప్రభుత్వం చెబుతున్న కుంకీ ఏనుగులు.. ఎట్టకేలకు జిల్లాకు వస్తున్నాయి. జిల్లాలోని కొమరాడ, మక్కువ, సాలూరు, పాచి పెంట, పార్వతీపురం, గరుగుబిల్లి, భామిని మండ లాల పరిధిలో రెండు ఏనుగుల గుంపు సంచారం చాలా కాలంగా కొనసాగుతోంది. ఒడిశా అడవుల నుంచి ఆహారం, నీటి కోసం గుంపులుగా కొన్నేళ్ల కిందట వచ్చిన ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించి రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. వీటి వల్ల వరి, మొక్కజొన్న, అరటి, చెరకు, జీడి, మామిడి తోటలు భారీగా దెబ్బతింటున్నాయి. వ్యవసాయ మే జీవనాధారంగా ఉన్న గిరిజనులు ఏటా లక్షల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇప్పటి వర కూ దాదాపు 700కు పైగా హెక్టార్లలో రూ.2.70 కో ట్ల మేర పంటలకు నష్టం కలిగించాయి. పరిహారం అందినా ఆలస్యం కావడం, పూర్తి స్థాయిలో అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు తీస్తున్న ఏనుగులు పంట నష్టం మాత్రమే కాదు... మనుషుల ప్రాణాల ను కూడా ఏనుగులు బలితీసుకుంటున్నాయి. ఇప్ప టి వరకూ 13 మంది వరకూ మనుషులు ఏనుగుల దాడిలో మృతి చెందారు. వివిధ ప్రమాదాల్లో ఏనుగులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాయి. పొలాలకు వెళ్లిన రైతులు, అటవీ ప్రాంతాల్లో సంచరించే గిరిజనులు, కట్టెల కోసం వెళ్లిన మహిళలు కూడా ఏనుగుల దాడులకు గురైన ఘటనలు ఎన్నో ఉన్నా యి. రాత్రి అయితే గ్రామాల ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా హామీలు... ఏనుగుల సమస్యను నియంత్రించేందుకు.. మానవ–ఏనుగు ఘర్షణల నివారణకు కుంకీ ఏనుగులను తీసుకొస్తామని ప్రభుత్వం రెండేళ్లుగా ప్రకటిస్తోంది. అధికారుల బృందాలు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం కూడా చేశాయి. పలుమార్లు తేదీలు ప్రకటించినా అమలు కాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు రెండు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను జిల్లాకు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు పూర్తి చేసింది. కుంకీలైన జయంత్, అభిమన్యులను పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి కేంద్రానికి తరలిస్తున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ఈ గజరాజులకు స్వాగతం పలికారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీలు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి. కుంకీలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పెంపుడు ఏనుగు లు. అడవి ఏనుగులను నియంత్రించడం, వాటిని గ్రామాల నుంచి అడవుల్లోకి తరలించడం, ప్రమాదకర పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కర్ణాటక, తమిళనాడు, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో కుంకీలను విజయవంతంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు అదే విధానాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా అమ లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సీతానగరం మండలం గుచ్చిమి వద్ద సుమారు 1,100 ఎకరాల్లో రూ.2.50 కోట్ల వ్యయంతో తాత్కాలిక సంరక్షణ కేంద్రం నిర్మించారు. నేడో, రేపో కుంకీలు ఇక్కడికి చేరుకుంటాయి. వీటి వల్లనైనా సమస్య పరిష్కారం అవుతుందా? అన్నది చూడాలి. -
●బడి చుట్టూ ఖాకీ కంచె..
అక్షరాలు దిద్దే బడుల వద్ద అడుగడుగునా ఖాకీల పహారా కొనసాగుతోంది. ఒకవైపు మెగా ‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’ (పీటీఎం) సందడి, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై వామపక్ష, విద్యార్థి సంఘాల బంద్ పిలుపు.. తల్లికి వందనం లబ్ధి జమకాని తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు పోలీసు వలయంలోకి మారాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికే పోలీసులు మోహరించారు. ముఖద్వారాల వద్ద కాపలాకాశారు. బడులన్నీ పోలీసు పహారాలో దర్శనమివ్వడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు. –పార్వతీపురం రూరల్


