Parvathipuram manyam District Latest News
-
●ప్రమాదాలు అధిగమించేలా..
రోడ్డు ప్రమాదాలు అధిగ మించేందుకు ఉన్నతాధికారుల సూచనలతో ప్రత్యే క చర్యలు చేపడుతున్నాం. ప్రమాదాలు జరిగే ప్రాంతా ల వద్ద హెచ్చరిక బోర్డులు, సూచనలు ఏర్పాటు చేస్తున్నాం. నిత్యం వాహ న తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించే చైతన్య క్యార్యమ్రాలు నిర్వహిస్తున్నాం. నిత్యప్రమాదా లు జరిగే ప్రాంతాలను గుర్తించాం. అక్కడి ప్రజలు, అధికారుల సమన్వయంతో ప్రమాద నివారణ చర్యలు చేపడతాం. ముఖ్యంగా ఏజెన్సీపై దృష్టి పెడుతున్నాం. –ఎం.రాంబాబు, డీఎస్పీ, పాలకొండ -
కదలని ఏనుగులు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. మండలంలోని నందివానివలసలో తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు సోమవారం సుంకి గ్రామ పరిసరాల్లోని నాగావళినది ప్రాంతంలో గల పంప్హౌస్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏ గ్రామంలో చొరబడి ఎవరికి హాని కలగజేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
పార్వతీపురం: పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదుల పరి ష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఐటీడీ ఏ పీఓఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ దిలీప్కళ్యాణ్ చక్రవర్తితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 72 వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఇందులో పీజీఆర్ఎస్కు 50, రెవెన్యూ క్లినిక్కు 20 అర్జీలు వచ్చాయి. పెండింగ్ సమస్యలను శాఖల వారీగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఫీల్డ్ పర్యటనల ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. అర్జీదారులతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పారు. అర్జీలు పెండింగ్లో లేకుండా, రీ ఓపెన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎస్ఎల్ ఏ గడువులు దాటకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని ఇలా... ●జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మాణం చేస్తున్న లబ్ధి దారులకు బిల్లులు చెల్లించాలని కోరుతూ గిరిజన సంక్షేమ సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ అర్జీ అందజేశారు. అలాగే పార్వతీపురం మండలంలోని అడారు గ్రామ పాఠశాలలోని టేకు చెట్లను అక్రమంగా నరికి తరలించి న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో అర్జీని రంజిత్ కుమార్ అందజేశారు. ●వీరఘట్టం మండలం నీలానగరం గ్రామానికి చెందిన బి.ఈశ్వరరావు తన తండ్రి వీఆర్ఓగా విధులు నిర్వహించి మృతి చెందారని తన తండ్రి ఉద్యో గం వారసుడైన తనకు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశాడు. గడువులోగా సమస్యలను పరిష్కరించాలి పార్వతీపురం రూరల్: నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పది ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, వేధింపులు, అత్తారింటి సమస్యలు, నకిలీ పత్రాలు, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు వాస్తవాలుగా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకున్న నివేదికను ఎస్పీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై శిరీష తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 7 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 7 వినతులు వచ్చాయి. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అనసధద్ర ఈఎంఆర్ఎస్ నుంచి మెళియాపుట్టి ఈఎంఆర్ఎస్కు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని నేతల గ్రామానికి చెందిన చరిష్మా కోరింది. కోదుల వీరఘట్టం గ్రామానికి కాలువలు నిర్మించాలని గేదెల నరేష్ కోరారు. ఆయిల్ ఇంజిన్ స్ప్రేయర్లు ఇప్పించాలని పెద్దూరుకు చెందిన నిమ్మక నగేష్ వినతి ఇచ్చారు. గజపతినగరానికి చెందిన కమల రేషన్ కార్డు ఇప్పించాలని కోరింది. అంన్వాడీ ఆయా పోస్టుల భర్తీలో ఎస్టీకి బదులుగా ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందని, మార్పు చేయాలని దశమంతుపురానికి చెందిన నగేష్ కోరారు. కార్యక్రమంలో పీహెచ్వో ఎస్.వి గణేష్, డిప్యూటీఈఓ నారాయుడు, వ్యవసాయాధికారి వాహిని తదితరులు పాల్గొన్నారు. -
ఘాట్రోడ్లలో ప్రయాణం.. తప్పదు భారీమూల్యం
● రోజుల వ్యవధిలో వరుస ప్రమాదాలు ●పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు ● క్షతగాత్రులుగా మారుతున్న మరికొంత మంది ●జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఘాట్ రోడ్లు.. ● బ్లాక్స్పాట్లుగా గుర్తించకుంటే కష్టంపాలకొండ రూరల్/ సీతంపేట: ఏజెన్సీ అందాలు కలబోసి ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో రహదారి ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. రోజు ఏదో ఒక చోట రహదారి ప్రమాదాల బారిన పడి మృతి చెందడం..లేకుంటే తీవ్ర గాయాలపాలై క్షతగాత్రులుగా మారడం పారిపాటి. దీంతో అనేక కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్న విషయం విదితమే. జిల్లాలోని 15 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఏజెన్సీలో ఘాట్ రోడ్లు, ప్రమాదకర మలుపులు అనేకం. ముఖ్యంగా సీతంపేట, భామిని మండలాలకు వెళ్లాలంటే అనేక మలుపులు, ఛిద్రమైన రహదారులు దాటాల్సి ఉంది. ఈ మండలాలతో పాటు కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, మ క్కువ, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో అంతర్గత గ్రామాలకు వెళ్లాల న్నా అనేక సమస్యలు అధిగమించాల్సి ఉంది. ముఖ్యంగా జెడ్, ఎస్, హెయిర్ పిన్ మలు పులతో పాటు ఘాట్ రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనికితోడు గిరిజన ఆవాసాలు,గూడలు అధికంగా కొండలపై ఉండడం, అక్కడికి రవాణా సౌకర్యం అంతంత మాత్రంగా ఉండడంతో వారు ద్విచక్రవాహనాలు ఆటోలు, వ్యాన్లు, మినీ జీపులు, మ్యా క్సీ క్యాబ్లపై ఆధారపడుతన్నారు. ఈ క్రమంలో ఏ చిన్న ప్రమాదం సంభవించినా పదుల సంఖ్య లో ప్రయాణికులు ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో.. ఇటీవల నాలుగు రోజుల క్రితం పాలకొండ మండలం జంపరకోటకు చెందిన 11 మంది ఓ ఆటోలో సీతంపేట మండలంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తూ ఇదే మండలం మేడకోట ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఆటో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడగా మిగిలినవారు తీవ్రగాయాల పాలయ్యారు. ఇదే మండలం వాబ గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో దంపతులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. సీతంపేట పరిధిలో ఆడలి వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి వచ్చే క్రమంలో ఘాట్ రోడ్ల మలుపుల వద్ద తరచూ ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు ఆరుగురు మరణించగా మరి కొందరు ఆస్పత్రుల పాలయ్యారు. పాలకొండ మండలం సిరికొండ, మంగళాపురం, తంపటాపల్లి, అట్టలి, వీరఘట్టం మండలం తూడి, ఎం.రాజపురం, కెల్ల తదితర గ్రామాల మలుపుల వద్ద అనే క రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. గుమ్మలక్షీపురం మండలం కల్లిగట్టు కూడలి, గోరటి ఘాట్రోడ్డు, మండ రోడ్డులో మలుపు, సాలూరు మండలం రొడ్డవలస, కరడవలస, ఒకటవ మైలు రాయి ఘాట్ రోడ్డు మలుపులు, జీగ్రామ్ సాలూరు బైపాస్ రోడ్డు, కొమరాడ మండలం బంగారంపేట సమీపంలో మలుపు, మక్కువ మీదుగా దుగ్గేరు, పార్వతీపురం మండలంలో చినమరికి, పెద మరి కి మీదుగా ఒడిశా రహదారి, నర్సిపురం రోడ్డు, పాచిపెంట మండలంలో పి.కోనవలస(సుంకి) ఘాట్ రోడ్డు, గరుగుబిల్లి మండలంలో తోటపల్లి కుడికాలువ రోడ్డు, నందివానివలస, అడ్డాపుశిల రోడ్డులో ప్రమాదాలు పరిపాటిగా జరుగుతున్నట్లు ఆయా ప్రాంతవాసులు చెబుతున్నారు. బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలి నిత్య ప్రమాదాలకు నెలవుగా మారుతున్న రహదారులు, ఘాట్ రోడ్లు, మలుపులను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలి. సంబంధిత అధికారుల సమన్వయంతో అవసరమైన చోట వేగనిరోధకాలు, హెచ్చరిక బోర్డులు, ఘాట్ రోడ్లలో రక్షణ గోడలు, రెయిలింగ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో ఏటా దాదాపు మూడు వందల వరకూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలు ఎక్కువగా ఏజెన్సీలోనే జరుగుతున్నాయి. -
నిడగల్లు నడిచెళ్లాయ్!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలంలోని అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో మాయమైన టేకు చెట్లు.. దుంగల రూపంలో సీతానగరం మండలం నిడగల్లు వద్ద ఓ సామిల్లులో ప్రత్యక్షమయ్యాయి. ఓ వైపు దీనిమీద ఒక కేసు గాని కేసు నడుస్తున్నా.. నియోజకవర్గ పెద్దలు మాత్రం దర్జాగా దానిని కోత కోసం మిల్లుకు తరలించడం గమనార్హం. ఎక్కడ అడారు.. ఎక్కడ నిడగల్లు! దగ్గరలో ఉన్న మిల్లులో అయితే ఎవరికై నా అనుమానం వస్తుందని కాబోలు... కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సీతానగరం మండ లం నిడగల్లు ఊరి చివరన చిన్ని సామిల్లుకు తరలించారు.ఆ కలపే నడిచి వెళ్లిందో.. లేదా కర్రి మహేష్ కు చెందిన ట్రాక్టర్లో రాత్రికి రాత్రి తరలించారో మరి! ఈ విషయం ఊరంతా కోడై కూస్తున్నా అధికారులకు తెలియకపోవడం విడ్డూరం.. వింత!! నియోజక వర్గానికి చెందిన ముఖ్యనేత అడిగీ అడగడంతోనే పార్వతీపురం, సీతానగరం మండలాల ‘తెలుగు తమ్ముళ్లు’ దగ్గరుండి పాఠశాలలకు సెలవు ఇచ్చిన మరుసటి రోజే ఏళ్ల కిందటినాటి టేకు చెట్లను కొట్టించి తీసుకువెళ్లిపోయారు. ఇంటి నిర్మా ణం కోసం.. ప్రభుత్వ స్థలంలో, పాఠశాల ఆవరణలో.. అటవీ శాఖ అనుమతి కూడా లేకుండా రాత్రికి రాత్రే చెట్లు నరికి తరలించుకోవడం గమనార్హం. ఫిర్యాదుకు వెనకడుగు.. పార్వతీపురం మండలంలోని అడారు ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్లను గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు నరికేసి తరలించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.గోపమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో గత శుక్రవారం ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఈ నెల 26వ తేదీన చెట్లు కొట్టివేశారని.. పాఠశాలలో పనిచేస్తున్న ఆయా తులసమ్మ భర్త ఇచ్చిన సమాచారం మేరకు తాను సహచర ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించానని ఆమె చెప్పారు. 12 టేకు చెట్లను నరికించి తరలించుకుపోయారని ఫిర్యాదులో పేర్కొనగా.. రెండు రోజుల కిందట ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టిన తహసీల్దార్ సీహెచ్ సత్యనారాయణ 14 చెట్లు అని చెప్పడం గమనార్హం. మండలానికి చెందిన టీడీపీ నాయకులే దగ్గరుండి చేయించారని.. వారి పేర్లు సైతం పాఠశాల యాజమాన్య కమిటీకి తెలుసని గ్రామస్తులు చెబుతున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందని అంటున్నారు. అంతా గ్రామ దేవత పండగ హడావిడిలో ఉండగా.. గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోయారని తెలుస్తోంది. పత్రికల్లో కథనాలు వచ్చినంత వరకూ అధికారులు పరిశీలనకు రాకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఏళ్ల నాటి, రూ.లక్షల విలువ చేసే టేకును తరలించినా.. అటవీ శాఖ స్పందన లేదు. కేసు నమోదైనా పోలీసుల నుంచి పురోగతి లేదు. అటవీశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని పరిశీలించినా.. అక్క డ నుంచి ముందుకు వెళ్లకపోవడం.. అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. విష యం బహిర్గతం అయినా.. కేసు నమోదైనా సరే... టేకు దుంగలను దర్జాగా సీతానగరం మండలం నిడగల్లు ఊరి చివరన ఉన్న సామిల్లుకు ట్రాక్టర్లో తరలించారు. వాటికి కోత పూర్తి చేశాక.. నామరూపాలు పోయాక.. తీరిగ్గా విచారణ ముందుకు తీసుకువెళ్తారేమో అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం కనీసం కలప కూడా కొనుగోలు చేసుకోలేని పేదరికంలో టీడీపీ పెద్దలు ఉన్నారని విమర్శిస్తున్నారు.టేకు చెట్ల దొంగల వెనుకున్న వారిని పట్టుకొని శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు రామస్వామి డిమాండ్ చేశారు. అడారు ఎంపీ పీ స్కూల్ ఆవరణలో దొంగతనంగా నరికిన 14 టేకు చెట్లను సోమవారం పరిశీలించారు. దీని వెనుక చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారని అను మానం వ్యక్తం చేశారు. వెంటనే వారిని శిక్షించాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నా యకులు పాలమెట్ట రాము, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.వరాలు పాల్గొన్నారు. అడారు గ్రామ పాఠశాల ఆవరణలో ఏళ్లుగా పెంచుతున్న టేకు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేశారు. -
మెట్లపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
సీతంపేట: మండలంలోని జి.గుమ్మడ గ్రామానికి చెందిన ఆరిక సోమయ్య (63) అనే వృద్ధు డు మెట్లపై నుంచి జారిపడి శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు దోనుబాయి ఏఎస్సై త్రినాథరావు తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి మెట్లు ఎక్కుతుండగా జారి పడడంతో సోమ య్య తలకు బలమైన గాయమైందన్నారు. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించి ప్రథ మ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సీతంపేట: స్థానికంగా నిర్వహిస్తున్న ఐటీడీఏ పెట్రోల్ బంకులో సోమవారం పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం వారపు సంత కావడంతో ఎక్కువ మంది వాహనదారులు సీతంపేటకు రావడం, పెట్రోల్ బంకులో పెట్రోల్ లేకపోవడంతో బయట మార్కెట్లో కొనుగో లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు తెలియజేశారు. పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, సోమవారం ప్రారంభించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ హాల్లో ఈ శిబిరం నిర్వహిస్తారని, ఒక వారం ఆయుర్వేదం, మరో వారం హోమియోపతి సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంపు లక్ష్యమని పేర్కొన్నా రు. డీఎంహెచ్ఓ భాస్కరరావు, జిల్లా ఎన్సీడీ అధికారి డా.జగన్మోహన్రావు పాల్గొన్నారు. సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రి రోగులతో సోమవారం కిటకిటలాడింది. మొత్తం 293 మంది ఓపీ కోసం రాగా వారిలో 46 మంది వరకు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నా రు. అత్యవసరమైన వారిని ఇన్పేషెంట్లుగా ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు సంబంధిత వైద్యాధికారులు తెలిపారు. -
ఆండ్ర భూముల ఆక్రమణ
● పట్టించుకోని యంత్రాంగం ● ఆవేదనలో నిర్వాసిత గిరిజనులు రిజర్వాయర్ భూమిని జేసీబీతో చదును చేస్తున్న దృశ్యం మెంటాడ: మండలంలోని ఆండ్ర రిజర్వాయర్ ముంపు భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. జేసీబీతో చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు కనీసం కన్నెత్తి చూడడంలేదు. భూముల ఆక్రమణల వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెంటాడ మండలంలోని లోతుగెడ్డ, నిక్కలవలస, ఆండ్ర గ్రామాల రెవెన్యూ పరిధిలో సుమారు వెయ్యిఎకరాల విస్తీర్ణంతో ఆండ్ర రిజర్వాయర్ను నిర్మించారు. అవసరమైన భూములను రైతు ల నుంచి సేకరించారు. అయితే, రిజర్వాయర్ వల్ల పూర్తిగా భూములు కోల్పోయిన గిరిజనులు రిజర్వాయర్లో ముంపు కాకుండా ఖాళీగా ఉన్న భూముల్లో వ్యవసా యం చేయడానికి సిద్ధపడితే అప్పటి రెవెన్యూ ఇరిగేష న్ అధికారులు అడ్డుకున్నారు. నిక్కలవలస రెవెన్యూ లో అధికంగా భూములున్న వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వాగులు, గెడ్డపోరంబోకు ప్రభుత్వ భూములన్నింటి నీ చదునుచేసి కలిపేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వాయర్ భూములపై అతని కన్ను పడింది. కిందటి వేసవిలో రిజర్వాయర్లో నీరు తగ్గగానే భూములను చదును చేయడానికి ప్రయత్నిస్తే గిరిజన నిర్వాసితులు అడ్డుకున్నారు. మళ్లీ రెండు రోజుల నుంచి జేసీబీతోల చదును చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు వెళ్లి అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదెక్కడి అన్యాయం నా భూమి 5 ఎకరాలు రిజర్వాయర్లో కలిసిపోయింది. సెంటు భూమి కూడా మిగల్లేదు. రిజర్వాయర్ ఒడ్డున ఎప్పుడూ నీటి ముంపునకు గురికాని భూములను వ్యవసాయం చేద్దామంటే అధికారులు కుదరదని వెళ్లగొట్టారు. బయటి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో భూములను కొనుగోలుచేసి చుట్టు పక్కల ప్రభుత్వ భూములను, రిజర్వాయర్ భూములను ఆక్రమించేస్తున్నా అతడిని మాత్రం రెవెన్యూ అధికారులు ఏమీ అనడంలేదు. – ఇంటి నరసింహులు, నిక్కలవలస, ఆండ్ర రిజర్వాయర్ నిర్వాసిత రైతు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూములు, వాగులు, గెడ్డపోరంబోకు భూములు, రిజర్వాయర్ భూములు ఆక్రమించడం చట్టరీత్యా నేరం. ఆక్రమిస్తే క్షేత్ర పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. – విజయభాస్కర్, తహసీల్దార్, మెంటాడ -
పోలీస్ సిబ్బంది కావలెను..!
బొబ్బిలి: సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయం బొబ్బిలి పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇరుకు రోడ్లున్న బొబ్బిలిలో ట్రాఫిక్తో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ వంటి అంశాల్లో పర్యవేక్షణకు ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పూర్తిస్థాయిలో ఉన్న పోలీస్ యంత్రాంగం దాదాపు సగానికి తగ్గినట్లనిపిస్తోంది. విచిత్రమేమిటంటే మండల కేంద్రాల్లో ఉండాల్సిన ఎస్సైల పోస్టులకు కూడా అధికారులను నియమించడం లేదు. పక్క స్టేషన్ల ఎస్సైలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే యువత, ఇతర బాధ్యతారాహిత్య వ్యక్తుల వల్ల రోడ్డు ప్రమాదాలు, క్షణికావేశంలో పరస్పరం దాడులు సంభవించే పరిస్థితులు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఇటువంటి సమయంలో పూర్తిస్థాయి సిబ్బంది ఉంటే పర్యవేక్షణ సులువవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉండాల్సిన సిబ్బంది నియామకంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు ఎస్సై పోస్టులు ఖాళీ బొబ్బిలి సబ్ డివిజన్లో 9 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడం సాధారణమే. కానీ ఏకంగా ఆరు ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బొబ్బిలి ఎస్సై ఆర్ రమేష్ కుమార్ వీఆర్కు పంపించారు. అలాగే మరో ఎస్సై ఉండాలి కానీ నేటికీ నియామకం కాలేదు. ఇక వుమెన్ ఎస్సైగా రెండేళ్ల కిందట ఒకామె విధులు నిర్వహిస్తుండగా ఆమెను దిశ పోలీస్స్టేషన్కు బదిలీ చేసి నేటికీ ఎవరినీ నియమించలేదు. ఇక్కడే ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహించిన జ్ఙాన ప్రసాద్ను రామభద్రపురం బదిలీ చేశారు. అలాగే బాడంగి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తారకేశ్వర రావును సీసీఎస్కు బదిలీ చేశారు. తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ను అరెస్టుచేసే క్రమంలో జరిగిన రాజకీయ బదిలీగా దీనిని చెప్పుకుంటున్నారు. అలాగే మానాపురం ఎస్సై జయంతిని క్రైమ్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. వారితో పాటు దత్తిరాజేరు మండలం బూర్జి వలస ఎస్సై రాజేష్ను కూడా సీసీఎస్కు పంపించారు. దీంతో సబ్ డివిజన్ మొత్తంలో ఉన్న 9 పోలీస్స్టేషన్లలో 6గురు ఎస్సైలు లేనట్లు లెక్క. శాంతిభద్రతల విషయంలో నిత్యం ఉండాల్సిన పోలీసుశాఖలో సిబ్బందిని ఎందుకనో నియమించడం లేదు. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజానీకం విమర్శిస్తోంది. ఇలా వచ్చి అలా సెలవుపై వెళ్లిపోయి.. బొబ్బిలి ట్రాఫిక్ ఎస్సై జ్ఞానప్రసాద్ను రామభద్రపురం బదిలీ చేశారు. ఎందుకంటే అక్కడ అప్పటికే ఉన్న వెలమల ప్రసాదరావు స్థానిక నాయకులకు నచ్చలేదన్న కారణంతో కూటమి ప్రభుత్వం వీఆర్కు పంపించేలా చర్యలు తీసుకుందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో బొబ్బిలికి తీవ్రమైన ట్రాఫిక్ కారణంగా ఎల్.కోట ఎస్సైగా పనిచేసిన సీహెచ్ నవీన్ పడాల్ను ఇక్కడ ట్రాఫిక్ ఎస్సైగా నియమించారు. సరిగ్గా దాడితల్లి అమ్మవారి పండగ ముందు రోజు విధుల్లో చేరిన ఆయన పండగ ముగిసిన వెంటనే మరో చోట పోస్టింగ్ ప్రయత్నాలకోసం సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు బొబ్బిలి సర్కిల్ కార్యాలయంలో ఇద్దరు ఎస్సైలు, ఒక వుమెన్, ఒక ట్రాఫిక్ ఎస్సై లేరు. ఏఎస్సైలు, కానిస్టేబుళ్లతోనే సీఐ నారాయణ రావు నెట్టుకొస్తున్నారు. మరో విషయం ఏంటంటే బొబ్బిలి సర్కిల్ కార్యాలయానికి 72 మంది సిబ్బంది (పేట్రన్ ) ఉండాలి. ఆ మేరకు పోస్టులు మంజూరై ఉన్నాయి. కానీ ఇప్పుడు అందులో సగం మంది కూడా లేరు. మొత్తంగా చూస్తే బొబ్బిలి డివిజన్కు 30 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మే నెలలో అమ్మవార్ల పండగలున్నాయి. సోమవారం నుంచి మండలంలోని మెట్టవలసలలో పండగ ఉంది. మొన్న దాడితల్లి అమ్మవారి పండగ లాగానే ఇక్కడ కూడా ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకు రావాల్సి వస్తోంది. బొబ్బిలి డివిజన్లో ఆరు ఎస్సై పోస్టులు ఖాళీ విధుల్లో చేరిన వెంటనే సెలవులో ట్రాఫిక్ ఎస్సై జాడే లేని వుమెన్ ఎస్సై అదే కోవలో బాడంగి, బూర్జివలస, మానాపురం స్టేషన్లు నియామకానికి ప్రాధాన్యమివ్వని కూటమి సర్కార్ -
అనారోగ్యంతో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గల్లా షణ్ముఖరావు (29) అనారోగ్యంతో అస్పత్రి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్థానికులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గల్లా షణ్ముఖరావు 2021 సీఆర్పీఎఫ్ జీడీ కానిస్టేబుల్గా విశాఖపట్నం 198 బెటాలియన్లో పనిచేస్తున్నారు. అనారోగ్యంగా ఉండడంతో మిలట్రీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో సీఆర్పీఎఫ్ సీఐ డి.కృష్ణారావు ఆధ్వర్యంలో సైనికలాంఛనాలతో బొద్దాం శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం గౌరవవందనం చేస్తూ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు నిర్వహించి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం జాతీయ జెండాను షణ్ముఖరావు తల్లిదండ్రులు వెంకటరమణ ముత్యాలమ్మకు అందజేశారు. సీతంపేట: మండలంలోని వాబ జంక్షన్ వద్ద గురువారం ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో గాయపడిన పాలకొండ మండలం జంపరకోటకు చెందిన వరలక్ష్మి (55) శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త జీలకర్ర మోహన్రావు సంఘటన స్థలంలోనే మృతిచెందిన విషయం విదితమే. గాయపడిన వరలక్ష్మి మృతిచెండంతో జంపరకోటలో మరోమారు విషాదఛాయలు అలముకున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు -
ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’
విజయనగరం అర్బన్: జిల్లాలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్–యూజీ 2026 ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,824 మంది అభ్యర్థులు నమోదు చసుకోగా 1,790 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన జిల్లా జాయింట్ కలెక్టర్ (నోడల్ అధికారి) సేతు మాధవన్ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్, విద్యాశాఖ సహా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసినట్లు అధికారులు తెలిపారు. గోడకూలి ఇద్దరికి గాయాలుసీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఇంటిపని చేస్తుండగా ఆదివారం గోడకూలి ఇద్దరు మేసీ్త్రలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తామరఖండిలో బొంగు తవిటినాయుడు ఇంటిపనికి బొబ్బిలికి చెందిన కర్రి సింహాచలం, కర్రి లక్ష్మణ వచ్చారు. ఆదివారం ఉదయం పని ప్రారంభించి పాత ఇంటి గోడల మధ్య కాలమ్స్ కడుతుండగా ఆదేఇంటికి సంబంధించిన పాతగోడ కూలి పోయి ఇటుక బెడ్డలు ఆ ఇద్దరిపై పడడం వల్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులు సింహాచలం, లక్ష్మణలను 108 వాహనంలో చికిత్సనిమిత్తం పార్వతీపురం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సింహాచలం పరిస్థితి విషమించడంతో విజయనగరం మహరాజా ఆస్పత్రికి తరలించగా లక్ష్మ ణ పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కీసరలో ఏనుగుల విధ్వంసంభామిని: మండలంలోని కీసరలో నాలుగు ఏనుగులు ఆదివారం పంటలు ధ్వంసం చేసి నష్టంకలిగించాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులు గతంలో మొక్కజొన్న పంటనే తినివేసేవి. ప్రస్తుతం రైతులు ఆలుగాలం శ్రమించి పండించి ఆరబెట్టిన మొక్కజొన్న గింజలపై ప్రతాపం చూపాయి. గ్రామం చుట్టూ ఆరబెట్టిన మొక్కజొన్న కళ్లాల్లో విచ్చల విడిగా తిరుగాడుతూ ఆరబెట్టిన గింజలను ధ్వంసం చేసి బస్తాల్లో కుట్టిన మొక్కజొన్న గింజలను పాడు చేశాయి. జొన్న గింజల బస్తాలను నాలుగు పక్కలను విసిరివేస్తూ పాడు చేశాయి. పంటలు ఇంటికి చేరే సమయంలో ఏనుగులు విధ్వంసం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: స్థానిక తోటపాలెం నివాసి బూర రాము (44) తన కంపెనీలో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీటీ అగ్రహారంలో సిల్వర్ గిన్నెల కంపెనీ నడుపుతున్న రాము మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్య సంధ్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. కంపెనీ కోసమని రూ.యాభై లక్షల వరకు అప్పు చేశాడు. అయితే కంపెనీ టర్నోవర్లో తీవ్ర నష్టం రావడం, తీసుకున్న అప్పులు సకాలంలో కట్టలేకపోవడంతో మనస్తాపం చెంది కంపెనీలోనే రాడ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్ తెలిపారు. -
పారని పథకం
● తాగునీటికి ఆదివాసీల విలవిలభామిని: వేసవి తాపంతో అల్లాడుతున్న తరుణంలో తాగునీటి కోసం భామిని మండలంలోని కోటకొండ, కోసింగూడ ఆదివాసీ గ్రామాల గిరిజనులు అల్లాడుతున్నారు. తివ్వాకొండల పైకి నీరు అందించే మినీరక్షిత నీటి పథకాలు మరుగున పడడంతో తాగునీరు లేక ఆదివాసీలు నానా అవస్థలు పడుతున్నారు. రోజువారీ అవసరాలకు, తాగడానికి సుమారు మూడు కిలోమీటర్లు కొండ దిగి నూతి నుంచి నీరు తెచ్చుకుంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. నూతిలో ఊట కోసం పడిగాపులు పడుతున్నట్లు విలపిస్తున్నారు. తాము తాగునీటి కోసం పడుతున్న శ్రమను అధికారులు గుర్తించి తాగునీటి సమస్యను వెంటనే తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. గర్భిణులు, వృద్ధులు నీరు తెచ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నాయని వాపోతున్నారు. గొంతు తడుపుకోవడానికి మూడు కిలోమీటర్లు కొండ దిగి నూతి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. వృద్ధులు.గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. నూతి దగ్గర గంటల కొద్దీ పడిగాపులు పడుతూ నీరు తోడుతున్నాం. మాకు నీటి బాధలు తప్పించాలి. –ఆరికి రాణి, ఆదివాసీ గిరిజన యువతి, కోటకొండ -
అదనపు సాయం ప్రకటించి.. లక్షణంగా పక్కన పెట్టి..!
నిజంగా నిద్రపోయే వారిని నిద్ర నుంచి ఎవరైనా లేపగలరు. దొంగ నిద్ర నటించే వారిని నిద్ర లేపడం ఎవరి తరమూ కాదన్నట్లుంది ప్రభుత్వం తీరు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం నిధులు సమకూర్చినప్పటికీ అదనపు సాయం చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంలో గిరిజనులకు మొండిచేయి చూపుతోంది.సీతంపేట: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పక్కా గృహాలు లేని పీవీటీజీ (పర్టికులర్లీ వలనర్బుల్ ట్రైబ్గ్రూప్)లకు ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం చర్యలు తీసుకుంది. పీఎం జన్మాన్ పథకం పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక్కో గృహానికి రూ.2.39 లక్షలు అందిస్తుంది. మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తుంది. చంద్రబాబు సర్కార్ కూడా దానికి అదనంగా రూ.లక్ష అదనపు సాయం మంజూరు చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి 2024 డిసెంబర్ 10వ తేదీన జీవో కూడా జారీ చేశారు. గిరిజనులు ఎంతో ఆశతో ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని ఆశించారు. వారి ఆశలు ఎదురు చూపులు గానే మిగిలాయి. ఏడాదిన్నర గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్కపైసా కూడా అదనపు నిధులు విడుదల చేయలేదు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1748 ఇళ్లు మంజూరయ్యాయి. కేవలం 233 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులు పూర్తి చేశారు. 336 మంది పునాదులు నిర్మించారు. రూఫ్ లెవెల్ 450 మంది లబ్ధిదారులు నిర్మించారు. శ్లాబ్ స్థాయి 361 మంది ఉన్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారు 368 మంది ఉన్నారు. ఒక్కో ఇంటికి పునాదులు వరకు నిర్మిస్తే రూ.70 వేలు, రూఫ్ స్థాయిలో రూ.90 వేలు, శ్లాబ్ నిర్మిస్తే రూ.40 వేలు, ఎన్ఆర్ఈజీఎస్ రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు చెల్తించాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఆదివాసీలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తామని జీవో జారీ చేయడంతో పీఎం జన్మాన్ పథకంలో గృహ లబ్ధిదారులైన ఆదివాసీలు ఎంతో ఆనందించారు. ఇంటి నిర్మాణం ఉత్సాహంగా ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కానీ కూటమి సర్కారు మాట నిలుపుకోకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. యుద్ధ ప్రభావంతో నిర్మాణ సామగ్రి అయిన ఇసుక, సిమ్మెంట్, ఇటుక, చిప్స్, ఇనుము ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అలాగే కూలీల ఖర్చులు పెరగడంతో కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక నిధులు ఎటూ సరిపోక పోవడంతో ఇంటినిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఉందని గిరిజనులు చెబుతున్నారు. ఆదివాసీలు నిర్మించుకునే ఇళ్లకు ప్రస్తుతం ఇస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదు. అదనపు సాయం చేస్తామని జీవో జారీ చేసి ఇంతవరకు ఆ విషయం పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. వెంటనే ఆదనపు ఆర్థికసాయం అందించాలి. కొన్ని చోట్ల లబ్ధిదారులకు సాధారణ బిల్లులు కూడా ఇళ్లు నిర్మించిన వాటికి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో గిరిజనులకు ఆర్థికసాయం అందేలా చూడాలి. విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే హౌసింగ్ లబ్ధిదారులకు ప్రోత్సాహం ప్రకటించి విడుదల చేయని ప్రభుత్వం జీవో జారీ చేసి ఏడాదిన్నరైనా విడుదల కాని నిధులు గిరిజనులకు మిగులుతున్న ఎదురుచూపులు ముందుకు సాగని ఇళ్లనిర్మాణం అదనపు సాయం నిధులు ఇంకా రావాల్సి ఉంది. మంజూరైన వెంటనే బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు గిరిజనులు వివిధ దశల్లో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లిస్తున్నాం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. సీహెచ్.వెంకటేష్, హౌసింగ్ ఏఈ, సీతంపేట -
ఉద్యమ నేతకు ఘనంగా నివాళి
విజయనగరం గంటస్తంభం: గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, షాపు ఉద్యోగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సీపీఎం నేత రెడ్డి శ్రీరామమూర్తి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. రెడ్డి శ్రీరామమూర్తి 5వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రీరామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన మరణం ఉమ్మడి జిల్లా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ గిరిజనులు, కార్మికులు, షాపు ఎంప్లాయీస్ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు. కురుపాం నియోజకవర్గంలో సీపీఎం విజయంలో ఆయన పాత్ర విశేషమని గుర్తచేశారు. వ్యవసాయ కార్మిక, గిరిజన, కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసం అంకితభావంతో పని చేశారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్మోహనరావు, రాము, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పదో తరగతి టాపర్లకు ఘనంగా సత్కారం
విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో అధికమార్కులు తెచ్చుకున్న పలువురు విద్యార్ధులకు కలెక్టరేట్లోని సమావేశ మందింరంలో ఆదివారం ఘనంగా సత్కారం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల నుంచి ప్రతిభ కనపరిచిన 68 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి వంతున నగదు ప్రోత్సాహకం, మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా గౌరవించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. ముఖ్య అతిథులుగా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, వేపాడ చిరంజీవిరావు, డీఈఓలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
మూగరోదన..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయం కలిసి రాకపోయినా పాడిపశువుల ద్వారా పాల విక్రయంతో వచ్చే ఆదాయంతో జీవించవచ్చనేది రైతుల భావన. వ్యవసాయం చేసే ప్రతి రైతు రెండు, మూడు పాడిపశువులను మేపుతుంటాడు. అదేవిధంగా పౌల్ట్రీఫారాలు కూడా జిల్లాలో అధికంగానే ఉన్నాయి. గొర్రెలు, మేకల పెంపకం దారులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ మూగ జీవాలకు ఏదైనా జబ్బు చేస్తే వైద్యసేవలు అందించే వారే కరువయ్యారు. జిల్లాలోని అనేక పశువైద్య శాలల్లో పశు వైద్యులు లేరు. దీంతో పశుసంవర్థకశాఖ సహాయకులే దిక్కుగా నిలుస్తున్నారు. దీని వల్ల పశువైద్యులు అందించాల్సిన సేవలు మూగజీవాలకు అందని పరిస్థితి. పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటకీ టీడీపీ సర్కార్ భర్తీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పశు వైద్యశాలలు జిల్లాలో ప్రాంతీయ పశు వైద్య ఆస్పత్రులు 13 ఉన్నాయి. లైవ్స్టాఫ్ అధికారులున్న గ్రామీణ పశువైద్యశాలలు 40 ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ఒకటి ఉంది. వైద్యులున్న పశు వైద్యశాలలు 64 ఉన్నాయి. అదేవిధంగా సంచార పశు వైద్య శాలలు 13 ఉన్నాయి. పశువుల వివరాలు జిల్లాలో ఆవులు 3,77, 960 ఉన్నాయి. గేదెలు 97, 845 ఉన్నాయి. గొర్రెలు 4,48, 154, మేకలు 1, 56, 511, పందులు 2585, కోళ్లు 51, 26, 764 ఉన్నాయి. 150 రకాల మందులు అందుబాటులో ఉండాలి ఖాళీగా 14 పశువైద్యుల పోస్టులు జిల్లాలో 14 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఒక ఎ.డి పోస్టు, ఒక వెటర్నరీ లైవ్స్టాఫ్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి. గంట్యాడ మండలం బోనంగి, మెరకముడిదాం, గర్భం, గరివిడి మండలంలోని జి.బొండపల్లి, ఎస్.కోట మండలం బొడ్డవర, దత్తిరాజేరు, దత్తిరాజేరు మండలం మానాపురం, వంగర, వంగర మండలం రాజుల గుమడ, చీపురుపల్లి, మెంటాడ, రామభద్రపురంలో మండలం కొట్టక్కి, రాజాం మండలంలో పొగిరి, సంకలిలో పశువైద్యుల కొరత ఉంది. అదేవిధంగా రాజం ఎ.డి (సహాయ సంచాలకుడు), గంట్యాడ మండలం పెదవేమలిలో వెటర్నీరీ లైవ్స్టాఫ్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి. అందని నాణ్యమైన పశువైద్యం పశువైద్యుల కొరత వల్ల మూగజీవాలకు నాణ్యమైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పశు సంవర్థక శాఖ సహాయకులు వారి పరిజ్ఞానం మేరకు చికిత్స అందిస్తున్నారు. పశు వైద్యశాలల్లో వైద్యుల కొరత 14 పశు వైద్యశాలల్లో వైద్యులు లేరు రాజం ఎ.డి పోస్టు కూడా ఖాళీ పశు సంవర్థక శాఖ సహాయకులే దిక్కు జిల్లాలో పశు వైద్య శాలలు 118 జిల్లాలో 3,77,960 అవులు గేదెలు 97,845ఖాళీగా పశువైద్యాధికారి పోస్టులు జిల్లాలో కొన్ని చోట్ల పశు వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిక్రూట్ మెంట్ అయితే వైద్యులు వస్తారు. డాక్టర్ ఎన్. దామోదర్రావు, జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ -
మూడోరోజూ.. ముచ్చెమటలు..!
పాలకొండ: పాలకొండ సబ్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యుత్ కష్టాలు తీరలేదు. శుక్రవారం మధ్యాహ్నం వీచిన గాలివాన కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరా ఆదివారం నాటికి పునరుద్ధరణ జరగలేదు. శనివారం రాత్రికి నగర పంచాయతీలో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసిన అధికారులు గ్రామీణ ప్రాంతాలకు మాత్రం ఆదివారం రాత్రి వరకు విద్యుత్ అందించలేదు. ప్రధానంగా సీతంపేట ఫీడర్ పరిధిలోని సింగన్నవలస, పరశురాంపురం, వెలగవాడ, సిరికొండ, రుద్రిపేట తదితర గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. మూడు రోజులపాటు కరెంటు సరఫరా లేకపోవడంపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కనీసం ఫిర్యాదులకు కూడా అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్ లేని కారణంగా జాగారం చేస్తున్నామని వాపోతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ యోగి వద్ద ప్రస్తావించగా మరమ్మతు పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరో రోజులో గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. -
రహదారి భద్రతపై ప్రతిజ్ఞ
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీతంపేట మండలంలోని కుశిమి కూడలి వద్ద రహదారి భద్రతపై ఆదివారం పాలకొండ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు డ్రైవింగ్కు ఇవ్వవద్దని సీఐ సూచించారు. రోడ్డు నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓవర్ స్పీడ్ వెళ్లవద్దని, ఘాట్రోడ్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
విదేశీ అతిథులు వచ్చేశాయ్..
బొండపల్లి: ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం కాని దేశం నుంచి పక్షులు మండలానికి వచ్చేశాయి. కొన్నేళ్లుగా సైబీరియా దేశం నుంచి పక్షులు మే నెల ప్రారంభంలోనే వచ్చి సందడి చేస్తుంటాయి. మండల కేంద్రంలోని రాజు చెరువులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహర వేటలో ఉండే ఈ పక్షులు రాత్రి కాగానే గజపతినగరం మండలం లోగిశ గ్రామంలోని చింతచెట్ల పైకి చేరుకుని సేద తీరుతాయి. ఈ పక్షులు రావడాన్ని ఇటు బొండపల్లి, అటు లోగిశ ప్రజలు శుభసూచికంగా భావిస్తారు. ఇక్కడకు వచ్చిన పక్షులు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసిన తర్వాత అక్టోబర్ సమయంలో తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడి ప్రజలు పక్షులకు ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా నడుచుకోవడం విశేషం. చేయనున్న సైబీరియా పక్షులు -
ఆపై అవస్థలు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026● ప్రధాన ఆస్పత్రుల్లో కానరాని సౌకర్యాలు ● సిబ్బంది కొరత తీవ్రం ● రోగులకు అందని సేవలు సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/కురుపాం/పాలకొండ/పాలకొండ రూరల్/సాలూరు: వాతావరణంలో మార్పులు..తీవ్రమైన వడగాడ్పులు, భరించలేని ఎండ..గ్రామాలు, పట్టణాల్లో వరుస పండగలు..పారిశుద్ధ్య లోపం.. రోగాలు, జ్వరాలు దాడులు చేయడానికి ఇలా అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అక్కడేమో సౌకర్యాలు, వైద్యసేవలు అందక రోగులకు అవస్థలు మిగులుతున్నాయి. జిల్లా ఆస్పత్రి..సామర్థ్యానికి మించి జిల్లా కేంద్రాస్పత్రిపై రోగుల భారం పరిమితికి మించి పెరుగుతోంది. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న పడకల కంటే చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. మొత్తం 172 పడకల (150 సాధారణ, 10 ఎన్.ఆర్.సి, 12 ఎస్.ఎన్.సి.యు) సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో, ప్రస్తుతం వివిధ విభాగాల్లో కలిపి 237 మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇది నిర్ణీత సామర్థ్యం కంటే సుమారు 37 శాతం అదనపు భారం కావడం గమనార్హం. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ రోగుల తాకిడి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘సాక్షి‘ పరిశీలన సమయానికి మాతా శిశు సంరక్షణ (ఓబీజీ) విభాగంలో అత్యధికంగా 89 మంది రోగులు ఉన్నారు. జనరల్ మెడిసిన్ విభాగంలో 47 మంది, సర్జరీలో 29 మంది, పిడియాట్రిక్ విభాగంలో 28 మంది చికిత్స పొందుతున్నారు. శిశు మరణాల నివారణ కేంద్రం (ఎస్ఎన్సీయూ) లో 17 మంది, పోషకాహార పునరావాస కేంద్రం(ఎన్ఆర్సీ)లో 9 మంది చిన్నారులు ఉన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లభ్యత లేకపోవడంతో, ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థుల సేవలు కీలకంగా మారాయి. సాధారణ సిబ్బంది కంటే శిక్షణలో ఉన్న విద్యార్థులే వార్డుల్లో అధికంగా కనిపిస్తున్నారు. మందుల సరఫరా, రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, ఓపీ స్లిప్పుల నమోదు వంటి కీలకమైన పనుల్లో వారే కనిపిస్తున్నారు. రేడియాలజీ, మైక్రోబయాలజీ వంటి కొన్ని ప్రధాన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వనరులు, విద్యార్థుల సహాయంతోనే ప్రస్తుత వైద్య సేవలు కొనసాగుతున్నాయి.. సాలూరులో ఇటీవల నూతనంగా ఏరియా ఆస్పత్రి ప్రారంభించినప్పటికీ..మౌలిక వసతుల లేమి కనిపిస్తోంది. ఇటీవల ఓ క్షతగాత్రుడికి అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. ఆస్పత్రిలో సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో విజయనగరానికి రిఫర్ చేశారు. పూర్తిగా పనులు జరగకుండానే ఆస్పత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు. అధికార పార్టీ గొప్పల కోసం పనులు పూర్తి కాకముందే ఆస్పత్రిని ప్రారంభించారన్న విమర్శలు ఉన్నాయి. కురుపాం నియోజక కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం కొమరాడ మండలాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వివిధ సమస్యలతో ఆశ్రయిస్తుంటారు. రోగులకు సరిపడా పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఇక్కడ లేవు. ఒకే పడకపై ఇద్దరు రోగులు చొప్పున చికిత్స పొందడం పరిపాటిగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం నేటికీ వాటిని అందుబాటులోకి తీసుకురాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు -
ఎస్టీ కమిషన్ ముందుకు జిందాల్ విచారణ
శృంగవరపుకోట: జిందాల్ భూముల సేకరణ వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై విచారణకు హాజరు కావాలని ఎస్టీ కమిషన్ నుంచి జిల్లా అధికారులకు సమన్లు అందినట్లు ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొడ్డవరలోని తన నివాసంలో మాట్లాడుతూ హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్హౌస్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేతృత్వంలో జరగనున్న విచారణకు తాను హాజరవుతున్నట్లు చెప్పారు. గతంలో నాలుగు దఫాలు విచారణకు షెడ్యూల్ జారీ చేసినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరు కావడం వల్ల విచారణ జరగలేదన్నారు. జిల్లా అధికారుల గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన కమిషన్ ఈ దఫా కచ్చితంగా హాజరు కావాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ దఫా విచారణలో వాస్తవాలు వెలుగు చూసి నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాసితుల పోరాటానికి స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, మార్చి 30న వాయిదా పడిన ఎస్టీ కమిషన్ పర్యటనను త్వరలోనే పునరుద్ధరించాలని, కమిషన్ స్వయంగా బాధిత ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వాస్తవాలను వెల్లడించాలని ఆయన కోరారు. అధికారులు కమిషన్ ఎదుట వాస్తవాలు మాట్లాడితే నినర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పాలకొండ ఆస్పత్రికి వెళ్తే.. వేచి ఉండాల్సిందే
డివిజన్ కేంద్రం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఫిజీషియన్ కొరత రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక్కడ ఉండాల్సిన వైద్యుడు ఇన్చార్జిగా వేరే చోట పని చేస్తుండడంతో ఆ విభాగానికి సంబంధించి ఆస్పత్రికి వస్తున్న రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనుల పేరిట జరుగుతున్న అంతర్గత నిర్మాణాలతో రోగులకు దుమ్ము, ధూళి తప్పడం లేదు. అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 25 మంది వైద్యులు సేవలు కొనసాగిస్తున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా సేవలు కొనసాగిస్తున్నాం. మందులు కూడా పూర్తిస్థాయిలో ఉన్నాయి. – డాక్టర్ కె.చిరంజీవి, సూపరింటెండెంట్, పాలకొండ ఆస్పత్రి కురుపాం సామాజిక ఆరోగ్యకేంద్రం -
మీకోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కారవేదికలో(పీజీఆర్ఎస్) అర్జీల వివరాల మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్ను ఏర్పాటుచేశామన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు నేడు మెగా మెడికల్ క్యాంప్ పార్వతీపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల కోసం మే 4న సోమవారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్రెడ్డి ఆదివారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మెగా వైద్యశిబిరం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు. శిబిరంలో నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయనున్నారన్నారు. పారిశుధ్య కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కదలని ఏనుగులుగరుగుబిల్లి: గడిచిన పదిరోజుల నుంచి ఏనుగులు ఈ ప్రాంతంనుంచి కదలకపోవడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని నందివానివలస, తోటపల్లి, ఖడ్గవలస, నాగూరు తదితర గ్రామాల్లో ఏనుగులు సంచరించి పలు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అయితే మండలంనుంచి ఏనుగులు వెళ్లకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులనుంచి తోటపల్లి, నందివానివలస, గిజబ గ్రామాలలో సంచరిస్తున్న ఏనుగులు తాజాగా ఆదివారం నందివానివలసలోని పంట పొలాల్లో దర్శనమిచ్చాయి. ప్రస్తుతం పొలంలో అరటి, పామాయిల్, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు ఉండడంతో ఎప్పుడు ఏ పంటలకు నష్టం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తెర్లాం: మూడుముళ్ల బంధం... ఏడడుగుల అనుబంధం... జన్మజన్మలకు తీరని రుణానుబంధం...అదే దాంపత్య బంధం. పెద్దలు చెప్పినట్టుగానే ఆ దంపతులు మరణంలోనూ బంధాన్ని వీడలేదు. అనారోగ్యంతో ఒక్కటిగా చనిపోయారు. అదీ ఆదివారం గంటల వ్యవధిలోనే... ఈ ఘటన తెర్లాం మండలం గొలుగువలసలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే...గొలుగువలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాకేటి రామకృష్ణ(65), సింహచలం(60) ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. వీరిరువురు 40 సంవత్సరాలుగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. కొద్ది రోజులు కిందట వీరిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వారం రోజుల కిందట శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి బంధువులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామకృష్ణ భార్య సింహాచలం మృతి చెందింది. ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడడంతో ఆయనను సొంత గ్రామమైన గొలుగువలసకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి రామకృష్ణను ఆటోలో తీసుకువస్తుండగా భార్య సింహాచలం మరణించిందని తెలియడంతో మార్గమధ్యలోనే ఆయన కూడా మరణించాడు. భార్యాభర్తలిద్దరూ నాలుగు గంటల వ్యవధిలోనే మృతి చెందారన్న విషయం గ్రామస్తులకు తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నలభై ఏళ్లుగా ఒక్కటిగా కలసిమెలసి దాంపత్య జీవనం సాగించిన ఇద్దరూ మరణంలోనూ ఆ బంధాన్ని వీడలేదని బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఐటీడీఏ.. గాడిన పడేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు దాదాపు రెండేళ్లుగా రెగ్యులర్ పీఓలు లేరు. ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నాయి. దీంతో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. కొంతకాలంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సైతం నిర్వహించిన దాఖలాలు లేవు. గిరిజన సంక్షేమం, సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గిరిజన సంక్షేమం కోసం వినియోగించాల్సిన ఐటీడీఏ నిధులు.. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినా పట్టించుకునే నాథుడే లేడు. గిరి వెలుగులో లక్షలాది రూపాయలు దుర్వినియోగం జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు శూన్యం. ఐటీడీఏ పరిధిలో విద్యార్థుల మరణాలు, డోలీ మోతలు, తాగునీటి సమస్యలు, మెనూ పాటించకపోవడం వంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రెండేళ్లలో కొంతమంది పాలకులు, అధికారులు ఐటీడీఏను ఆదాయ వనరుగా వినియోగించుకుంటున్నారే తప్ప.. గిరిజన సంక్షేమం కోసం దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మూడు నెలలకు ఒక సారి జరగాల్సిన పాలక వర్గ సమావేశం పత్తాలేకుండా పోయింది. పాలకవర్గ సమావేశం నిర్వహిస్తే నిలదీతలు తప్పవేమో అన్న భయం ప్రజాప్రతినిధులను వెంటాడుతోందని గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో, గ్రామాల్లో పర్యటన, పరిశీలన చేసి సమస్యలు పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎవరూ ముందుకు రావడం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు నివారణ కోసం ఏఎన్ఎం నియామకాల ఊసు లేదు. సబ్లెక్టర్ ఆర్.వైశాలిని పార్వతీపురం ఐటీడీఏ రెగ్యులర్ పీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం సబ్ కలెక్టర్గా ఆమె పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఆమె కఠినంగా వ్యవహరించారు. అర్ధరాత్రి వేళ తనిఖీలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. పీఓ పోస్టుకు వైశాలి న్యాయం చేస్తారన్న నమ్మకంతో గిరిజన సంఘాలు ఉన్నాయి. అందుకనుగుణంగానే విధుల్లో చేరిన వెంటనే తన మార్కు చూపించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులు, పీఈటీలకు ‘అప్గ్రేడ్’ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న సమస్యను మొదటి గ్రీవెన్స్లోనే పరిష్కారం చూపారు. మిగిలిన అంశాలపైనా ఆమె దృష్టి సారించి ఐటీడీఏను గాడిలో పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు. కొద్ది నెలల్లో పీఓ వైశాలి వ్యక్తిగత కారణాల రీత్యా దీర్ఘకాలిక సెలవు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో మళ్లీ ఇన్చార్జి పాలన తప్పకపోవచ్చు. మరోవైపు.. సీతంపేట ఐటీడీఏకు రెగ్యులర్ పీఓను నియమించాల్సిన అవసరం ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత పార్వతీపురం ఐటీడీఏకు రెగ్యులర్ పీఓ కొత్త పీఓ ‘వైశాలి మార్కు’ చూపిస్తారని ఆశాభావం సీతంపేట.. ఇంకా ఇన్చార్జి అధికారి పాలనలోనే.. -
టేకు చెట్ల మాయం.. ఎవరి హస్తం?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలంలోని అడారి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో టేకు చెట్ల మాయంపై ఎట్టకేలకు స్కూల్ హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 26న చెట్లు నరికివేసినట్లు.. ఫిర్యాదులో పేర్కొన్నారు. 12 చెట్లను ఐదుగురు వ్యక్తులు తొలగించినట్లు వారు చెబుతుండగా.. అంతకు మించి ఉంటాయని స్థానికులు అంటున్నారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పాఠశాలలలో టేకు చెట్లు మాయం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం ఇన్చార్జి తహసీల్దార్ సత్యనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. 14 చెట్లు కోతకు గురైనట్లు ఆయన చెబుతున్నారు. ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం అన్నది ప్రశ్నగా మారింది. అధికార పార్టీ నాయకుల ప్రమేయంతోనే చెట్లు నరికి వేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో కేసు ఎంత వరకూ ముందుకు వెళ్తుందన్నది చూడాలి. ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ పార్వతీపురం: జిల్లాలో ఏపీ ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్పత్రి సివిల్ పనులను గడువులోగా పూర్తి చేయా లని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాల యం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పనుల పురోగతిని సమీక్షిస్తూ, సమగ్ర ప్రెజింటేషన్ ఇవ్వాలని సూచించారు. విద్యుత్ సౌకర్యం, జనరేటర్లు, ప్రహరీల పనులపై దృష్టి సారించి, నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, సమన్వయం మెరుగుపరచాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణాల పరిశుభ్రత, సుందరీకరణపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో పార్వతీపురం, పాలకొండ, ఐటీడీఏ పీఓలు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, డీసీహెచ్ఎస్ జి.నాగభూషణరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జనగణనకు సహకరించాలి జిల్లాలో మే 1 నుంచి ప్రారంభమైన ఇంటింటికి జనగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ మే 30 వరకు ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి గృహాల స్థితిగతులు, వసతులు, కుటుంబ వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు. ఇచ్చే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా నిజమైన వివరాలు అందించి గణన విజయవంతం చేయాలని కోరారు. -
చల్లగా హాని.. గడువు ముగిసినా పోనీ!
గుమ్మలక్ష్మీపురం: ఎండగా ఉందని.. చల్లని శీతల పానీయం కోసం ఆశ పడతాం.. కాస్త నీరసంగా ఉందని మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింకు వైపు చూస్తాం.. ఆకలిగా ఉందని, బాగా మసాలా దట్టించి.. ఘుమఘుమలాడే నాన్వెజ్ వంటకాన్ని ఆవురావురని తింటాం. ఇక్కడే ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం. ఏజెన్సీ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని వ్యాపారులు రెండు చేతులా వినియోగించుకుంటున్నారు. కాలం చెల్లిన కూల్ డ్రింకులను విక్రయించి, ఆరోగ్యంపై నిశ్శబ్దంగా దాడి చేస్తున్నారు. హోటళ్లలో రంగు కలిపిన ఆహార పదార్థాలను తినిపిస్తున్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురం పరిధిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (డివిజన్ –1) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార పదార్ధాలు, కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించి, సంబంధిత వ్యాపారులపై అడ్యుడికేషన్ కేసు లు దాఖలు చేశారు. తనిఖీ బృందం గుమ్మలక్ష్మీపురంలోని ఏడు ప్రధాన వ్యాపార సంస్థలను పరిశీలించగా నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్యాంపా కోలా, పెప్సీ, థమ్సప్, 7 అప్ వంటి బ్రాండెడ్ కూల్ డ్రింక్స్తో పాటు ఎనర్జీ డ్రింక్స్ వందల సంఖ్యలో గడువు ముగిసినా విక్రయానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. బిర్యానీ పౌడర్, సాంబార్ పౌడర్, సోన్ పాపిడి వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కూడా గడువు తేదీ దాటినట్లు నిర్ధారించారు. బుడంకాయల మదన్ కుమార్, పొట్నూరు సుందరరావు, బి.నాగరాజు, అందవరపు శ్రీనివాసరావు, డోకి శ్రీధర్, వెంకటకృష్ణ, చప్పా మాధవ నాయుడు అనే వ్యాపారుల షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. నిల్వలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటం కాలం చెల్లిన శీతల పానీయాల విక్రయం రంగు కలిపిన, నిల్వ ఉంచిన మాంసాహార పదార్థాలు ఆహార భద్రతా విభాగం అధికారుల తనిఖీల్లో బట్టబయలు -
గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు పిలుపు
సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశాలు పొందిన వారికి ఉచిత భోజన వసతితో కూడిన విద్య అందిస్తారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాల్లో 8 కళాశాలలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీలతో పాటు ఒకేషనల్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, సీజీఏ గ్రూపులు ఉన్నాయి. వీటిలో 1030 సీట్లు భర్తీ చేస్తారు. మెరిట్ ఆధారంగానే... పదో తరగతిలో వచ్చే మెరిట్ మార్కులు ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. ప్రతి గ్రూపుకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీ 36 సీట్లు, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈక్యూ ఒక్కో సీటు మొత్తం నాలుగు సీట్లు భర్తీచేస్తారు. ఒకేషనల్ ఎఅండ్టీ 20, సీజీఏ గ్రూపులో 30 సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి... విద్యార్థులు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడబ్ల్యూఆర్.గవ్.ఇన్లో ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్జాబితాను ఈ నెల 22న ప్రకటిస్తారు. 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సీతంపేట బాలికల జూనియర్ కళాశాల పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఐటీడీఏల పరిధిలో 1030 సీట్లు ఈ నెల 20వరకు దరఖాస్తు గడువు -
స్వామికి అపచారం.. ఎందుకంత నిర్లక్ష్యం?
● ఆలయ అసలు విగ్రహాలను అలా పడేస్తారా..? ● తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద స్వామి సేవకుల నిరసన సాక్షి, పార్వతీపురం మన్యం/గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అపచారం జరిగినా దేవదాయశాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్వామివారి సేవకులు ప్రశ్నించారు. ఆలయంలో కొద్ది రోజులుగా చేపడుతున్న నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. స్వామి వారి విగ్రహాన్ని తొలగించి, నిర్లక్ష్యంగా రహదారి పక్కన రేకుల షెడ్డులో వదిలేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక బీజేపీ నేతలు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో కలిసి శనివారం ఆలయం వద్ద నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఆలయ చైర్మన్, ఈవోకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. దీంతో చాలాసేపు అక్కడే ధర్నా చేయడంతో అక్కడున్న ప్రైవేట్ ట్రస్టు సభ్యులు స్వామి సేవకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. కేంద్రం అందించే ఉపాధి నిధులతో కూడా ఇక్కడ పలు పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. స్వామి వారికి అపచారం చేయవద్దని తాము కోరుతున్నామన్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో మాదిరి.. ఇక్కడ కూడా కొత్త ప్రతిమలతో పాటు, పూర్వ విగ్రహాలను ముందు ప్రతిష్ఠించి నిత్య పూజలు అందేలా చేస్తామని అప్పట్లో చెప్పారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా చేశారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని.. ట్రస్టు కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం..!
● రైతన్నకు అందని పంట నష్టపరిహారం ● విపత్తుల వేళ పంటలు కోల్పోయినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ● ఎందుకీ ‘పచ్చ’పాతం అంటూ ఆవేదన వీరఘట్టం: ● గతేడాది ఖరీఫ్లో సంభవించిన మోంథా తుఫాన్ రైతన్నను నిలువునా ముంచేసింది. అపార పంట నష్టం కలిగించింది. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం అందలేదు. ● ఇటీవల ఈదురుగాలులతో కూడిన వానలు ఉద్యానవన పంటలు సాగుచేసిన రైతుల నడ్డి విరిచాయి. మొక్కజొన్నతో పాటు అరటి, బొప్పాయి, జీడిమామిడి, మామిడి పంటలకు నష్టం చేకూర్చాయి. రైతన్న ఆవేదన చెందుతున్నా పరిహారం అందుతుందన్న ధీమా లేదు. ఆదుకుంటారన్న నమ్మకం కలగడంలేదు. రైతు సంక్షేమమే లక్ష్యమంటూ ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమినేతలు ఓట్లు దండుకున్నాక మొఖం చాటేశారు. రైతన్న సాగు కష్టాలు ఎదుర్కొంటున్నా కనికరం చూపడం లేదు. గిట్టుబాటు ధరతో పాటు విపత్తుల వేళ ఆదుకునేదిశగా కనీస చర్యలు తీసుకోవడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి బీమా ధీమా లేకుండా చేశారు. కొందరు రైతులు ప్రీమియం చెల్లించినా బీమా అందని పరిస్థితిని తీసుకొచ్చారు. చంద్రబాబు నోటివెంట తరచూ వచ్చే సాగుదండగన్న మాటను నిజంచేస్తున్నారని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. పంటలు పాడైనా... గతేడాది అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు జిల్లా వ్యాప్తంగా సుమారు 6,250 ఎకరాల్లో అరటి పంటకు నష్టం జరిగినట్లు ఉద్యానవన శాఖ అధికారులు గుర్తించారు. అలాగే, గతేడాది అక్టోబర్ నెలాఖరులో సంభవించిన మోంథా తుఫాన్ జిల్లా రైతాంగానికి వణుకు పుట్టించింది. తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు వేల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. అయితే అధికార యంత్రాంగం మాత్రం కేవలం 815 ఎకరాల్లో మాత్రమే అరటి, వరి, తదితర పంటకు నష్టం జరిగినట్లు పంటల నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. అయినా ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ కూడా పంట పరిహారం అందలేదు. అయితే, తుఫాన్కు వాతావరణశాఖ నామకరణం చేయలేదన్న సాకును చూపి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయకపోవడం గమనార్హం. ● శుక్రవారం ఈదురుగాలులు భయానకంగా వీచాయి. గాలుల ధాటికి మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, భామిని, కురుపాం, మక్కువ, సాలూరు మండలాల్లో 10 వేల ఎకరాల్లో మామిడి పంట నేలమట్టమైందని రైతులు చెబుతున్నారు. జియ్యమ్మవలస, కురుపాం, గరుగుబిల్లి, వీరఘట్టం మండలాల్లో 1000 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇంత జరిగినా ఆదుకునే చర్యలు కానరాకపోవడం రైతుల ను ఆవేదనకు గురిచేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతును రాజుగా చూసేదని, సాగుకు అండగా నిలిచేదని గుర్తుచేసుకుంటున్నారు. వీరఘట్టం మండలం అచ్చెపువలస సమీపంలో 1.5 ఎకరాల్లో మామిడి తోట ఉంది. మరో వారం రోజుల్లో కోత కోద్దామని అనుకున్నాను. ఇంతలో శుక్రవారం పెను ఈదురుగాలు వీయడంతో కాయలు మొత్తం రాలిపోయాయి. సుమారు రూ.80 వేలు ఆదాయం వస్తుందనుకున్నాను. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ఆరిక కామేశ్వరావు, రైతు, అచ్చెపువలస, వీరఘట్టం మండలం50 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వీరఘట్టం, పాలకొండ మండలాల్లో 50 ఎకరాల మామిడి తోటలను రైతుల వద్ద కౌలుకు తీసుకున్నాను. శుక్రవారం వీచిన గాలులకు కాయలు మొత్తం రాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వస్తుంది. అధికారులు పరిశీలించి ఆదుకోవాలి. – సొండి అనీల్, మామిడి రైతు, వీరఘట్టం పంటల నష్టం జరిగినప్పుడు బాధిత రైతులు సమీపంలో ఉన్న సచివాలయంలో తెలియజేయాలి. అప్పుడు అధికారులు వచ్చి జరిగిన పంటల నష్టాన్ని పరిశీలిస్తారు. తద్వారా పంటల నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. – సత్యన్నారాయణ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి, పార్వతీపురం మన్యం గతేడాది వచ్చిన మోంథా తుఫాన్కు 3 ఎకరాల్లో క్యాబేజీ, 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. పంట నష్టం వివరాలను అధికారులకు తెలియజేశారు. వివరాలు అన్నీ రాసుకున్నారు. ఈ రోజు వరకు నాకు పంట నష్టం చిల్లిగవ్వ కూడా అందలేదు. – కర్రి సింహాచలం, రైతు, వీరఘట్టం -
రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సీతానగరం: మండలంలోని విశాఖ – రాయగడ రైల్వేలైన్లో జగ్గునాయుడుపేట(ఆర్.వెంకంపేట) గేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు స్థానికులు శనివారం గుర్తించారు. రైల్వే పోలీసులు అందించిన వివరాలు.. జగ్గునాయుడుపేట ఎల్సీ గేటు సమీపంలో గుర్తు తెలియని 45 ఏళ్లు పైబడిన పురుషుడు గుర్తు తెలియని రైలు బండి నుంచి జారిపడి లేదా రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొన్నారు. తెలుగు రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నలుపు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. అతని వద్ద రైల్వే టికెట్ లభించిందని అది బ్రహ్మపూర్ నుంచి సూరత్ టిక్కెట్ అని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 92475 85742, 94918 13163, 83099 01038 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఏనుగులతో భీతిల్లుతున్న ప్రజలు
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల మీదుగా నందివానివలస గ్రామానికి ఏనుగులు శుక్రవారం చేరుకున్నాయి. వారం రోజులనుంచి మండలంలోని పలుగ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నందివానివలస, తోటపల్లి, ఖడ్గవలస, నాగూరు తదితర గ్రామాల్లో సంచరించి పలు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పొలంలో అరటి, పామాయిల్, వేరుశనగ తదితర పంటలు ఉండడంతో ఎప్పుడు ఏ పంటలకు నష్టం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పంధించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఉపాధి వేతనదారులకు గుర్తింపు కష్టాలు
రామభద్రపురం: ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ ఫేస్ అంథెంటికేషన్ నిబంధన కూలీలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. నెట్వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు, ఈ–కేవైసీ పెండింగ్ వంటి కారణాలతో కూలీలకు హాజరు పడడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకంలో నిబంధనలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం వేసవి సీజన్లో ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 6,26,094 మంది వేతనదారులు ఉండగా రోజుకు సుమారు 1.70 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వారికి ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కూలీల వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కూలీల ముఖ గుర్తింపు సరిగ్గా నమోదు కాకకపోవడం, సర్వర్ సమస్యల కారణంగా పడిగాపులు కాయాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు.కొన్ని గ్రామాల్లో పనులు చేయక ముందే ఫేస్ ఆథెంటికేషన్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు నమోదు చేస్తుండగా వారి వివరాలతో పాటు ముఖ గుర్తింపు నమోదైన వారు పనులు చేస్తున్నారు.నమోదు కాని వారు మొర్రో అంటూ కిలోమీటర్లు నడిచి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. అలాగే మరి కొన్ని గ్రామాలలో పనులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లిపోయే ముందు ఆయా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ముఖ గుర్తింపు, వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కూలీల ముఖ గుర్తింపు సరిగ్గా నమోదు కాని కూలీలు ఆ రోజు వేతనం నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ ఆథెంటికేషన్ సమస్యతో కళ్లు,వేలి ముద్రలు, ఆధార్ మిస్మ్యాచ్ సమస్యతో యాప్ గుర్తించకపోవడం, ఫేస్ మ్యాచ్ కాకపోవడంతో హాజరు పడడం లేదని కూలీలు చెబుతున్నారు. పని ప్రదేశంలో ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోవడంతో ఫొటోలు తీయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని క్షేత్ర స్థాయి సిబ్బంది అంటున్నారు. వేతనదారుల ఆకలికేకలు.. ఉపాధి హామీ శ్రామికులు ఉపాధి పనులు చేయగా వచ్చే వేతనాలతోనే బతుకు బండిని నెట్టాలి.అయితే వారి పొట్టకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.మండుటెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు ఏకంగా నాలుగు నెలలుగా కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. వారు చేసిన పనులకు గానూ జిల్లాలో దాదాపు రూ.24 కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నా..ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉపాధి వేతనాలు అందక వేతనదారులు నానా అగచాట్లు పడుతున్నారు.నాలుగు నెలలకు సంబధించిన ఉపాధి కూలి ఖాతాల్లో జమకాకపోవడంతో కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు తల్లడితున్నాయి. ఫేస్ ఆథెంటికేషన్కు సాంకేతిక సమస్య పడిగాపులు కాస్తున్న కూలీలు కానరాని వేసవి భత్యం నాలుగు నెలలుగా అందని వేతనాలు వేతనదారుల వేదన ఆగిన వేసవి భత్యం.. వేసవిలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో శ్రామికులు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు.ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిలో భత్యం అందిస్తూ వస్తున్నాయి.ఉపాధిహామీ పథకంలో ఏటా వేసవి భత్యాన్ని ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు నెల వారీగా పెంచి అందించే వారు. చేసిన పనికి తగ్గట్లు 15 నుంచి 30 శాతం వరకు అదనపు భత్యం లభించేది. వేతనదారులకు ఒక్కొక్కరికి రోజువారీ రూ.200 వస్తే వేసవి భత్యం 30 శాతం కలిపి రూ.260 వారి ఖాతాలకు వారి ఖాతాలకు జమచేసేవారు. అయిటే కూటమి ప్రభుత్వం వచ్చాక వేసవి భత్యం అందించకపోవడంతో శ్రామికులు ఆర్థికంగా నష్టపోతున్నారు.అలాగే వారి జీవనంపై అదనపు భారం పడుతోంది. ఇప్పటి నుంచైనా వేసవి భత్యం ఇవ్వాలని వేతనదారులు కోరుతున్నారు. వయసు పైబడిన వారితో ఇబ్బంది సాంకేతిక సమస్య కారణంగా వయసు పైబడిన కూలీలకు కొంత ఇబ్బంది కలుగుతోంది. కళ్లు, వేలిముద్రలు గుర్తించకపోవడం,ఫేస్ మ్యాచ్ కాకపోవడం జరుగుతోంది. అలాంటి వారికి కొంత ఇబ్బందైనా నష్టం కలగకుండా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి హాజరు పడేలా చూస్తున్నాం. వేతనదారులు నష్టపోకుండా కూలి డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటాం. ఎస్ శారదా దేవి,ఉపాధిహామీ పీడీ -
కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకే చట్టాల్లో మార్పు
● రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ ● వేడుకగా మే డే వేడుకలువిజయనగరం టౌన్: అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక న్యూపూర్ణ జంక్షన్ వద్ద శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్, ఏఐఎఫ్టీయూ (న్యూ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే దళారీ బూర్జువా వర్గంగా వ్యవహరిస్తున్న పాలకులు దోపిడీ విధానాలకు వంతపాడుతూ దేశంలోనే రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి తగినట్లుగా చట్టాలను మారుస్తున్నారన్నారు. దేశంలో ఉన్న కుల,మత, వర్గ వ్యత్యాసాలను ఉపయోగించుకుని ప్రజలను విభజించేందుకు, ప్రధాన సమస్యలను ఆలోచించకుండా ఉండేందుకు టెర్రరిజం, మైనారిటీ, రిజర్వేషన్ల పేరుతో అల్లర్లను రెచ్చగొడుతున్నారన్నారు. ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను కంపెనీ యాజమాన్యాలకు అణిగిమణిగి ఉండేలా, వారి హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్లు ముఖ్యంగా యూనియన్లను లేకుండా చేసేందుకు, నాయకుల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవన్నారు. శ్రీ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ నాయకుడు అప్పలరాజు రెడ్డి మాట్లాడుతూ రారేడో, ఊబర్ వంటి యాప్స్ వచ్చి ఆటో కార్మికుల పొట్టకొడుతున్నాయని, ఉచిత బస్సు పథకం ఏకంగా కార్మికులను రోడ్డున పడేసిందని వాపోయారు. యూనియన్ కార్యదర్శి రెడ్డి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.విశ్వనాథ్, రజక సంఘం నాయకులు కె.సతీష్, చిన్న, అప్పలరాజు, ఎన్వైఎస్ జిల్లా కన్వీనర్ సీహెచ్. ధర్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
చివరి ప్రయాణం
పాలకొండ రూరల్: ఒకే గ్రామానికి చెందిన నలుగురి ఆఖరి ప్రయాణం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. ఆ నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహన సంస్కారాలు జరుగుతుంటే గ్రామస్తుల కన్నీరు ఆగలేదు. పాలకొండ మండలానికి చెందిన పలువురు గిరిజనులు గురువారం సీతంపేట మండలం పుబ్బాడలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా మీనకోట మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జంపరకోటకు చెందిన ఆరిక లక్ష్మి (55), కొండగొర్రి శ్రావణి (25), ఉర్లక శాంతి (30)తో పాటు ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణ (36) మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో వారి మృతదేహాలకు శుక్రవారం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కె.చిరంజీవి పర్యవేక్షణలో పోస్టుమార్టం చేపట్టారు. అప్పటికే మృతుల బంధువులు, వారి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసుల పంచనామా అనంతరం అధికారిక చర్యలు పూరికావడంతో మధ్యాహ్నం 12 గంటలకు మృతదేహాలను మహిళల స్వగ్రామం జంపరకోటకు, ఆటో డ్రైవర్ మృతదేహం ఆయన గ్రామమైన డోలమడకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. మృతదేహాలు గ్రామాలకు చేరడంతో ఒక్కసారిగా ఆయా పల్లెల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు, సన్నిహితుల రోదనలు మిన్నంటాయి. డోలమడలో ఆటో డ్రైవర్కు అంత్యక్రియలు నిర్వహించారు. జంపరకోటలలో మృతిచెందిన ముగ్గురు మహిళలతో పాటు అదే గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావు(60) శుక్రవారం సీతంపేట మండలం వాబ వద్ద బైక్పై భార్యతో వస్తుండగా బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలో మరణించాడు. మోహనరావు మృతదేహానికి సీతంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పోస్టుమార్టం పూర్తి చేశాక మృతదేహం అదే సమయానికి గ్రామానికి చేరింది. దీంతో నలుగురి మృతదేహాలకు ఒకే చోట దహనసంస్కారాలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు రోడ్డు ప్రమాద ఘటనల్లో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మరణించటంతో వారి కుటుంబసభ్యుల రోదనలను అదుపుచేయడం ఎవరి తరమూ కాలేదు. ప్రయాణం మిగిల్చిన విషాదాన్ని తలుచుకుంటూ గిరిజనులు తల్లడిల్లిపోయారు. కోలుకుంటున్న క్షతగాత్రులు ఇదిలా ఉండగా ఆటో ప్రమాదంలో గాయాలపాలై శ్రీకాకుళంలో వైద్య సేవలు పొందుతున్న కొండగొర్రి మౌనిక, ఎనిమిదేళ్ల నిమ్మక చాందినితోపాటు మృతురాలు శ్రావణి పిల్లలు హేమ, రిషికుమార్తోపాటు గాయపడిన కె.మల్లమ్మ, కె.పద్మలత తదితరులు కోలుకుంటున్నారు. జంపరకోటకు చేరిన మృతదేహాలు ఒకే చోట నలుగురి దహన సంస్కారాలు డోలమడలో ఆటో డ్రైవర్ రమణ అంత్యక్రియలు కన్నీటి పర్యంతమైన రెండు గ్రామాల ప్రజలు -
తారకరామ తీర్ధసాగర్పై కలెక్టర్ సమీక్ష
విజయనగరం అర్బన్: తారకరామ తీర్ధసాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షిస్తూ మొత్తం రూ.110 కోట్ల పరిపాలన అనుమతుల కోసం తక్షణమే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించి త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఆర్డీఓ సుధాసాగర్, ఇరిగేషన్ జాఖ అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలి జిల్లాకు మంజూరైన పరిశ్రమలు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆమోదం పొందిన పరిశ్రమలు వేగంగా అమలు కావాలని ముఖ్యంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, ఫుడ్ పార్క్లు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఎంఓయూలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమలకు అవసరమైన లాజిస్టిక్స్ సదుపాయాలను కూడా సమర్ధవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, రామ్మోహన్రావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పడవ బోల్తా: ఒకరి మృతి
పూసపాటిరేగ: మండలంలోని తమ్మయ్యపాలెం సముద్రపు రేవులో పడవ బోల్తాపడి ఒకరు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. వివరాల్లోకి వెళ్తే.. పతివాడ పేటకుచెందిన వాసుపల్లి ఎల్లయ్య (50) తన సహచరులతో కలిసి శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో సముద్రంలో చేపలవేటకు బయలు దేరాడు. కొద్ది క్షణాల్లోనే కెరటాల ఉధృతికి పడవ బోల్తా పడడంతో ఎల్లయ్య గల్లంతయ్యాడు. అదే పడవలో ఉన్న ముగ్గురు మత్స్యకారులు అతి కష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన ఎల్ల య్య కోసం పలువురు మత్స్యకారులు గాలించగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి రేవులో శవమై ఒడ్డుకు చేరాడు. సమాచారం మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సురక్షితం -
అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం
పార్వతీపురం రూరల్: మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్ సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కుటుంబాల సమస్యలు, పెండింగ్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలపై వివరాలు తెలుసుకుని, అవి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని డీపీఓ అధికారులను ఆదేశించారు. మరణించిన సిబ్బంది కుటుంబాలకు ఎల్ల ప్పుడు అండగా ఉంటామని, రిటైర్డ్ సిబ్బంది సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐ నాయుడు, డీపీఓ ముంతాజ్ బేగం, ఏఏఓ శంకరరావు పాల్గొన్నారు. -
ఆయిల్ ట్యాంకర్, బస్సు, కారు ఢీ
● నుజ్జునుజ్జయిన కారుసాలూరు: పట్టణ సమీపంలో జాతీయరహదారిపై శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. కాసేపటికి ప్రమాదానికి గురైన బస్సును వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై ఎస్సై అనిల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రామభద్రపురం నుంచి సాలూరు వస్తున్న జియో ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది.ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన బస్సును వెనుకనుంచి వచ్చి ఓ కారు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్, లారీ క్లీనర్కు గాయాలవగా, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్ చేశారు.దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మా దేవుడు మీరే మాస్టారు
● రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి ● గ్రామస్తుల కంటకన్నీరురామభద్రపురం: గ్రామంలోని పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తూ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. మంచి మాస్టారును కోల్పోయామని, హఠాత్తుగా విషాద వార్త వినాల్సి వస్తుందను కోలేదని గ్రామంలోని ప్రజలు, చిన్నారులు, తల్లిదండ్రులు వాపోయారు. రామభద్రపురం మండలంలోని నాయుడువలస గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మూడేళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి వేణు మాస్టారు గురువారం పార్వతీపురం మండలంలోని బంధువుల ఇంట పెళ్లికి ద్విచక్రవాహనంపై వెళ్తూ వెంకంపేట పంచాయతీ వైకేఎంనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మూడేళ్ల పాటు టీచర్గా పనిచేసిన ఆయన గ్రామంలోని అందరిలో కుటుంబసభ్యుడిగా కలిసిపోయారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ మంచి మాస్టారుగా పేరు పొందారు.హెచ్ఎం అకాల మరణం అందరినీ కలిచివేసింది. శుక్రవారం వైఎస్సార్సీపీ నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు నడిమింటి సత్యం, గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామప్రజలు, తల్లిదండ్రులు,విద్యార్థులు మాస్టారు మృతిపట్ల రెండు నిమిషాలు మౌనం పాటించడంతో పాటు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఎంఈవో తిరుమలప్రసాద్, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం జేసీ రాజులు వేణు మాస్టారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. -
మలేరియా నియంత్రణకు చర్యలు
కొమరాడ: జిల్లాలో మలేరియా నియంత్రణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు తెలిపారు. గిరిశిఖర గ్రామాలైన బిన్నిడి, డి. గుణదలో మలేరియా నివారణ మందును శుక్రవారం పిచికారీ చేయించారు. ఎన్సీడీ పీఓ డాక్టర్ టి.జగన్మోహనరావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఐఆర్ఎస్ నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. అన్నిగదుల్లో స్ప్రేయింగ్ తప్పనిసరిగా చేయాలని సిబ్బందికి సూచించారు. దోమతెరల వినియోగంపై అవగాహన కల్పించారు. అక్కడ విద్యార్థులు, పిల్లలకు వేసవి ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు చేశారు. జిల్లాలో 1032 మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఐఆర్ఎస్ మొదటి విడత పిచికారీ జూన్ 15 వరకు వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎంఓ సూర్యనారాయణ, మాదలింగి పీహెచ్సీ వైద్యాదికారి ఎస్.తనూజ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
మార్కులే సాక్షి
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చూపారు. అధికమంది ఉత్తమ మార్కులు సాధించారు. దీనికి ‘సాక్షి’ యాజమాన్యం అందించిన పదోతరగతి మెటీరియల్ దోహదపడిందని విద్యార్థులు చెబుతున్నారు. సరళంగా, వివరణాత్మకంగా, సులభంగా అర్థంచేసుకునేందుకు వీలుగా విద్యానిపుణులతో తయారుచేసిన మెటీరియల్ ఉత్తమ మార్కుల సాధనకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. మంచి మెటీరియల్ అందించి విజయంలో భాగస్వామ్యమైన ‘సాక్షి’కి కృతజ్ఞతలు చెబుతున్నారు. – జియ్యమ్మవలస రూరల్/సీతానగరం -
గాలివాన బీభత్సం
● నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● మామిడి, బొప్పాయి, అరటి పంట్లకు తీవ్ర నష్టం ● విద్యుత్ అంతరాయంతో ఇక్కట్లు జియ్యమ్మవలస రూరల్: పెదకుదమలో నేలవాలిన అరటి తోటలో రైతు నవీన్ కుమార్ పాలకొండరూరల్/వీరఘట్టం/గరుగుబిల్లి/కొమరాడ/జియ్యమ్మవలస రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, తదితర మండలాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. మామిడి, బొప్పాయి, అరటి పంటలకు తీవ్ర నష్టంవాటిల్లింది. మొక్కజొన్న నేలమట్టమైంది. 60–80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు జనం భయపడ్డారు. ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈదురుగాలులతో కూడిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ●వీరఘట్టం మండలంలో సుమారు 2వేల ఎకరా ల్లో కోతదశలో ఉన్న మామిడి పంట నేలమట్టమయ్యింది. 10 ఎకరాల్లో బొప్పాయి, అరటి తోట లు నేలమట్టమయ్యాయని రైతులు చెబుతున్నారు. ●గరుగుబిల్లి మండలంలోని గిజబ, తోటపల్లి పంచాయతీ పరిధిలోని నందివానివలస గ్రామాల రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. ●కొమరాడ మండలంలో పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర రాష్ట్ర రహదారిపై కూనేరు రామభద్రపురం సమీపంలో భారీ వృక్షం నెలకొరింది. చెట్టును యుద్ధ ప్రాతిపదికన తొలగించి రాకపోకలను పోలీసుల క్రమబద్ధీకరించారు. ●జియ్యమ్మవలస మండలంలోని కుదమ, గౌరీపురం, పరజపాడు, పెద్దకుదమ, సింగనాపురం, గంగరాజుపురం, తదితర గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో చేతికందిన అరటి పంట నేలమట్టమైంది. లక్షల రూపాయలు పెట్టుబడి నేలపాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ●పాలకొండ మండలంలో ఎం.సింగుపురం సీహెచ్సీ ఎదరుగా 9 విద్యుత్ స్తంభాలు, అన్నవరం, బెజ్జి, పొట్లి, సింగన్నవలస తదితర గ్రామాల్లో 4, పట్టణంలో మున్సిపాల్ కార్యాలయం, యాలం కూడలి, విద్యుత్ సబ్ స్టేషన్ వతదితర ప్రాంతాల్లో 5 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్కో డీఈ కె.విష్ణుమూర్తి, ఏఈ యోగి నేతృత్వంలో సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. -
జిల్లా అక్షరాస్యతా శాతం 83.87
పార్వతీపురం: జిల్లాలో ఉల్లాస్–అక్షర ఆంధ్రా కార్యక్రమం విజయవంతంగా అమలు కావడంతో అక్షరాస్యత శాతం ఘననీయంగా పెరిగిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నా రు. తన చాంబర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2011లో 50.38శాతంగా ఉన్న అక్షరాస్యత, 2025 నాటికి 75.74 శాతానికి, 2026 నాటికి 83.87శాతానికి పెరిగిందన్నారు. జీఎస్డబ్ల్యూఎస్ సర్వేలో గుర్తించి న నిరక్ష్యరాస్యుల్లో లక్ష్యానికి మించి 67,686 మందిని నమోదు చేసి, శతశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. కార్యక్రమంలో వేలాది వలంటీరు టీచర్లు పాల్గొని విద్యాబోధ న అందించారన్నారు. అక్షరాస్యతలో పార్వతీ పురం మన్యం జిల్లాను అగ్రస్థానంలో నిలిపిన అధికారులను, వలంటీర్లను కలెక్టర్ అభినందించారు. నేడు బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాక బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాజీవ్ రంజ న్ మిశ్రా శనివారం విజయనగరం రానున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టర్ కార్యాలయంలో బీసీ, కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కురుపాం: ‘జలధార–జలహారతి’ కార్యక్రమం అమలులో రాష్ట్రంలో జిల్లాను ముందంజలో నిలపాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ పనులు బాధ్యతగా చేపట్టాలన్నారు. కురుపాం ఎంపీడీ ఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ పనుల్లో వేతనదారుల భాగస్వామ్యాన్ని పెంచాలని, 100 శాతం లేబర్ రిపోర్టింగ్ సాధించాల ని సూచించారు. అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ–శ్రమ పోర్టల్లో నమోదు కావాలని, ఇది పూర్తిగా ఉచితమని, బీమా రక్షణతో పాటు కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవసరమని తెలిపారు. టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కలిసి 100 శాతం నమోదు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్మిశ్రా జిల్లాలో శనివారం పర్యటించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కుల సంఘాలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. -
● ఆశించిన మార్కులకు ‘సాక్షి’సహాయం
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 595 మార్కుల సాధనకు ‘సాక్షి స్టడీ’ మెటీరియల్ సహాయపడింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో సందేహాల నివృత్తికి మెటీరియల్ దోహదపడింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు సాధించగలిగాను. – ఆర్.నిత్యకనక వర్షిణి, సీతానగరం సాక్షి యాజమాన్యం గణితం, సైన్స్ సబ్జెక్టుల స్టడీమెటీరియల్ను చదివాను. పదోతరగతిలో 585 మార్కులు సాధించాను. అధిక మార్కుల సాధనకు ఉపా ధ్యాయుల బోధనతో పాటు మెటీరియల్ దోహదపడింది. – బి.సాయికృష్ణ, రాచకిండాం హైస్కూల్ పబ్లిక్ పరీక్షల ముందు సాక్షి యాజమాన్యం స్టడీ మెటీరియల్ అందించింది. ఈ పుస్తకాల్లో కంటెంట్ కనిపించింది. ప్రాక్టీస్ చేశాను. పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించి టాపర్గా నిలిచాను. – గొర్లె సాద్విక, చిన్నయ్యపేట, మందరాడ జెడ్పీ హైస్కూల్, సంతకవిటి మండలం -
శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంత లోకాలకు..
శుభ కార్యానికి వెళ్లిన వారు మృత్యుఒడికి చేరారు. బంధువుల శుభకార్యంలో సంతోషంగా గడిపి... తిరుగు ప్రయాణంలో వస్తున్న వారిని మృత్యువు దారి కాచి వెంటాడింది. నలుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అంతవరకు ఆటోలో సరదగా కబుర్లు చెబుతూ వస్తున్న వారు ఒక్కసారిగా హహకారాలు చేశారు. ఇంతలోనే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... పాలకొండ/పాలకొండ రూరల్: పాలకొండ మండలం బడ్డుమహసింగి గ్రామానికి చెందిన గిరిజనులు సీతంపేట మండలం పుబ్బాడ గ్రామంలో గురువారం జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లేందుకు డోలమడ గ్రామానికి చెందిన ఆటోను కుదుర్చుకుని బయలుదేరారు. ఆటోలో 12 మంది వరకు వెళ్లారు. జంపరకోట మీదుగా సీతంపేట వెళ్లేందుకు ఉన్న ఘాట్ రోడ్డులో వెళ్లిన వీరు శుభకార్యంలో భోజనాలు చేసిన అనంతరం అదే రోడ్డులో ఆటోలో సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రహదారిలో మార్గమద్యంలోకి చేరుకునే సరికి సీతంపేట మండలం మీనకోట వద్ద ఆటో ఘాటీ డౌన్లో అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కొండగొర్రి శ్రావణి(30), ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణ(33), ఉర్లక శాంతి(35) సంఘటన స్థలంలోనే మరణించారు. ఆరిక లక్ష్మి(55) తీవ్రంగా గాయపడగా ఈమెను ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమద్యంలో మృతి చెందింది. ఆస్పత్రుల్లో క్షతగాత్రులు.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండగొర్రి మౌనిక, ఎనిమిదేళ్ల నిమ్మక చాందినిలను శ్రీకాకుళం ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆస్పత్రిలో కొండగొర్రి మౌనిక కుమారుడు రుషికుమార్, కొండగొర్రి హేమ, కొండగొర్రి మల్లమ్మ, కొండగొర్రి పద్మలత చికిత్స పొందుతున్నారు. ఎస్పీ మాధవరెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్, డీఎస్పీ రాంబాబు ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా రాత్రి సమయం వరకు మృతదేహాల ఆస్పత్రికి తరలించలేదు. ఘాటీ రోడ్డు కావడంతో మృతదేహాలను తీసుకురావడం కష్టంగా మారింది. ఆనందం ఆవిరి ఈ ఘటనలో మరణించిన ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణకు ఆటోనే జీవనం. అదే ఆటో ఆయనకు మృత్యుశకటంగా మారింది. రమణకు భార్య నాగమణితో పాటు వినీత, చందు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వినీత గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 563 మార్కులు సాధించింది. కుమార్తెను అభినందించి సాయంత్రం అన్నీ కొనిపెడతానని చెప్పి బయలుదేరిన తండ్రి ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమార్తె విజయం ఆనందించేలోపే తండ్రి ఇలా దుర్మరణం చెందడంతో ఆయన కుటుంబంతో పాటు గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మిన్నంటిన రోదనలు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒకే గ్రామస్తులు కావడంతో బడ్డుమహసింగిలో రోదనలు మిన్నంటాయి. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శుభకార్యంలో ఆనందంగా గడిపి ఇళ్లకు వస్తున్న వారిలో నలుగురు మృత్యువాత పడడం, మిగిలిన వారంతా క్షతగాత్రులుగా మారడంతో గ్రామంలో అంతులేని విషాదం అలుముకొంది. మీనకోట వద్ద ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా తిరుగు ప్రయాణంలో నలుగురు దుర్మరణం ఆరుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ఆస్పత్రిని సందర్శించిన ఎస్పీ, సబ్ కలెక్టర్ -
విలేకర్లపై దాడి చేసిన నిందితుల అరెస్టు
సాలూరు: పట్టణంలో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావు, సీవీఆర్ టి.వి రిపోర్టర్ చింతాడ సుబ్రహ్మణ్యంపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. పట్టణంలో పెద్దవీధికి చెందిన నిందితులైన కోనమజ్జి అజయ్, గండి అభి, సొండి శ్రీను బుధవారం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించారు. అనంతరం వారు ద్విచక్ర వాహనంపై బయలుదేరి అతి వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ శ్రీనివాసరావు, సుబ్రహ్మణం నడుపుతున్న దిచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా, నిందితులు అసభ్య పదజాలాలను ఉపయోగిస్తూ ఫిర్యాదుదారులను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. నిందితులని అరెస్టు చేశామని, కోర్టులో హాజరపరచనున్నట్టు సీఐ తెలిపారు. తొలగని అనుమానాలు? సాక్షి విలేకరిపై జరిగిన దాడి కేసుకు సంబంధించి స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని మరో ఫిర్యాదుదారుడైన సీవీఆర్ టీవీ రిపోర్టర్ సుబ్రహ్మణ్యం చెబుతుండగా ఆ నాలుగో వ్యక్తిని పట్టుకోకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. నిందితుల యొక్క ఫోన్ పేలు, కాల్ డేటాను పరిశీలిస్తే దీని వెనుక ఉన్న ఆ నాలుగో వ్యక్తి ఎవరన్నది వెలుగులోకి వస్తుందని చర్చించుకుంటున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
శ్రద్ధగా రాశారు..
శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026● పదో తరగతి ఫలితాల్లో మన్యం విజయదుందుభి ● వరుసగా నాలుగోసారి రాష్ట్రంలో ‘టాప్’ ● 96.07 శాతం ఉత్తీర్ణత నమోదు ● బాలికలదే పైచేయి.. సాక్షి, పార్వతీపురం మన్యం పదో తరగతి ఫలితాల్లో మన్యం బిడ్డలు మరోసారి అదరగొట్టారు. జైత్రయాత్రను కొనసాగించారు. తమకు ఎదురే లేదని నిరూపించారు. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. తమ ర్యాంకును మెరుగుపరుచుకుంటూ.. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా నాలుగోసారి సింహాసనం మీద సగర్వంగా కూర్చొన్నారు. ఏపీ పదో తరగతి ఫలితాలు గురువారం ఉదయం విడుదల కాగా.. 96.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా నిలిచింది. గిరిజన ప్రాంతమైనప్పటికీ.. విద్యా రంగంలో మన్యం స్థిరమైన ప్రతిభ చూపుతుండటం విశేషం. మరోసారి సత్తా చాటిన బాలికలు ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు రాబట్టారు. 590కి పైగా పలువురు మార్కులు సాధించడం విశేషం. పదో తరగతిలో 10,506 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో బాలురు 5,109 మంది కాగా.. బాలికలు 5,397 మంది ఉన్నారు. మొత్తంగా 10,092 మంది ఉత్తీర్ణత సాధించారు. 96.54 శాతంతో జిల్లాలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ● ఫలితాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లాలో ఉన్న మొత్తం తొమ్మిది ప్రీ మెట్రిక్ వసతిగృహాల్లో 82 మంది పరీక్షలు రాశారు. ఇందులో 79 మంది ఉత్తీర్ణత సాధించారు. 75 మంది ప్రథమ శ్రేణి, నలుగురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఏడు వసతిగృహాల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 500 మార్కులు కంటే ఎక్కువ వచ్చిన వారు 33 మంది ఉన్నారని జిల్లా వెనుకబడిన సంక్షేమ, సాధికారక అధికారి ఇ.అప్పన్న తెలిపారు. సారిపల్లి నవనీత్కుమార్ 578/600(బూర్జ), దాసరి దీనిష్కుమార్ 578(గరుగుబిల్లి), రెడ్డి స్వాతి 576(పార్వతీపురం),అలుగూలు మధు 568 (జియ్యమ్మవలస) మార్కులు సాధించారు. ● పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 40 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 98.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 1,810 మంది పరీక్షలు రాయగా.. 1,788 మంది ఉత్తీర్ణత సాధించారు. భద్రగిరి పాఠశాలకు చెందిన ఆకుల వసంత 581 మార్కులతో టాపర్గా నిలిచింది. ఆరు గురుకులాల్లో 99.03 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 414 మంది పరీక్షకు హాజరు కాగా.. 404 మంది ఉత్తీర్ణులయ్యారు. బిడ్డిక భవానీ 588 మార్కులతో టాపర్గా నిలిచినట్లు డీడీ విజయశాంతి తెలిపారు. అభినందనల వెల్లువ పదో తరగతి ఫలితాల్లో వరుసగా నాలుగోసారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించడం పట్ల విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తొలి స్థానంలో నిలవడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, అధికారుల సమన్వయంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. మంచి మార్కులకు ‘సాక్షి’ దోహదం నేను పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించడానికి సాక్షి స్టడీ మెటీరియల్ ఎంతో దోహదపడింది. సాక్షి అందజేసిన మ్యాథ్స్, ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ బాగా ఉపయోగపడ్డాయి. ఈ మెటీరియల్లో ఉన్న ముఖ్యమైన విషయాలను ఉపాధ్యాయులు తరచూ బోధించడంతో గణితంలో 100, సైన్స్లో 98 మార్కులు సాధించగలిగాను. సాక్షి మీడియాకు ధన్యవాదాలు. – బౌరోతు తరణి, తలవరం హైస్కూల్, వీరఘట్టం -
అమ్మ ఎక్కడ...
ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిదేళ్ల రుషికుమార్, ఆరేళ్ల హేమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి తల్లి కొండగొర్రి శ్రావణి సంఘటన స్థలంలోనే మరణించింది. తల్లి మృతి చెందిందన్న విషయం తెలియని ఆ చిన్నారులిద్దరూ అమ్మ ఎక్కడంటూ రోదిస్తుంటే అక్కడి వారి హృదయాలు చలించిపోయాయి. బంధువులు సమాధానం చెప్పలేక... చిన్నారులను సముదాయించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మా అమ్మ ఎక్కడంటూ అభంశుభం తెలియని ఆ చిన్నారుల రోదనలు అరణ్యరోదనలే అవుతున్నాయి. తల్లిని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు హేమ, రుషికుమార్ -
పదిలంగా నిలిచారు!
● 20 గిరిజన విద్యా సంస్థల్లో శతశాతం విద్యార్థుల పాస్ ● 94 శాతం ఉత్తీర్ణత ీసతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలో వివిధ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పదో తరగతి ఫలితాల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అదరగొట్టారు. మొత్తం 49 విద్యా సంస్థలకుగాను 20 పాఠశాలల్లో శతశాతం ఫలితాలు సాధించారు. 1785 మంది విద్యార్థులకుగాను 1692 మంది పాసయ్యారు. దీనిలో ఆశ్రమ పాఠశాలల నుంచి 1476 మంది హాజరు కాగా 1390 మంది ఉత్తీర్ణత సాధించారు. గిరిజన గురుకులాల నుంచి 309 మంది హాజరు కాగా 302 మంది పాసయ్యారు. మొత్తం 94.79 శాతం ఉత్తీర్ణత సాధించారు. చిన్నకోస్తాకు చెందిన బి.జాస్మిన్ 590 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. పూతికవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన వూయక సుస్మిత 583 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచింది. సామరెల్లి బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన బిడ్డిక జయశ్రీ 581 మార్కులు సాధించింది. బాలికల పాఠశాలల్లో బుడంబో, బరణికోట, బొమ్మిక, సవర బొంతు, బడ్డుమాసింగి, సామరెల్లి, సీతంపేట, ముత్యాలు, హడ్డుబంగి, పూతికవలస, సీతంపేట ఏపీఆర్ గర్ల్స్, పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించాయి. బాలుర ఆశ్రమ పాఠశాలల్లో ఎస్ఎస్ మణుగు, చిన్నబగ్గ, దోనుబాయి, మల్లి, పెద్దపొల్ల, శంబాం, గంగంపేట, మల్లి పీటీజీ గురుకుల బాలుర పాఠశాల, సీతంపేట గురుకుల బాలుర పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించారు. బి.జయశ్రీ(581) సామరెల్లి ఆశ్రమ పాఠశాల బి.జాస్మిన్ (590), చిన్నకోస్తా, ఆశ్రమ పాఠశాల వి.సుశ్మిత (583), పూతికవలస ఆశ్రమ పాఠశాల -
జలధార పనుల్లో వెనుకబాటు వద్దు : కలెక్టర్
పార్వతీపురం: జిల్లాలో జరుగుతున్న జలధార – జలహారతి పనుల్లో ఎలాంటి వెనుకబాటు ఉండకూడదని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని ఆయన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని, సోక్పిట్స్ నిర్మాణం, చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువులు, కాలువల ఆక్రమణలను వెంటనే తొలగించి హద్దులను నిర్ధారించాలన్నారు. ప్రతీ గ్రామంలో పనుల పురోగతిపై చెక్లిస్టు సిద్ధం చేసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మే 10వ తేదీలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమీక్షలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
కిశోరి వికాసం కార్యక్రమానికి శ్రీకారం
పార్వతీపురం: బాలికల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో కిశోరి వికాసం కార్యక్రమానికి కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మే 1 నుంచి జూన్ 11 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో బాలికలకు విద్య, ప్రాముఖ్యత, ఆరోగ్యం – పోషకాహారం, రుతు పరిశుభ్రత, లైంగిక – పునరుత్పత్తి, ఆరోగ్యం, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, మత్తు పదార్ధాల నివారణ, కెరీర్ మార్గదర్శకత్వం, సైబర్ భధ్రత, ఆర్థిక నిర్వహణ, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. బాలికల్లో ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కిశోరి వికాసం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ తదితరులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి సీతంపేట: మండలంలోని వాబ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం పాలకొండ మండలం జంపరకోటకు చెందిన జీలకర్ర మోహన్రావు (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై వై.అమ్మన్నరావు అందించిన వివరాల ప్రకారం రాయికురిడి గ్రామంలో జరిగే గ్రామపండగకు వెళ్లి భార్య వరలక్ష్మితో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణంలో వస్తున్నాడు. వాబ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తోంది. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య వరలక్ష్మికి తీవ్రగాయలయ్యాయి. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరళించారు. ఆమె పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరళించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నేటి నుంచి జనగణన ● ఇంటింటి గణనకు ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగంసాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి జనగణన ప్రక్రియను జిల్లాలో మే 1వ తేదీ నుంచి 30 రోజుల పాటు చేపట్టనున్నారు. ఇది వరకే ప్రారంభించిన స్వీయ గణన(సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియలో 15 శాతం పూర్తి చేసి, రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 16 నుంచి 30 మధ్య స్వీయగణన చేపట్టారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి జనగణనను 20వ తేదీలోగా పూర్తి చేసేలా క్షేత్ర స్థాయి సిబ్బంది పని చేయాలని అధికారులు స్పష్టం చేశారు. జనగణన కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ అధికారులను, ఎన్యూమరేటర్లను నియమించారు. సగటున 800 జనాభాను ఒక యూనిట్గా పరిగణిస్తున్నారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఏ ఒక్కరికీ సెలవులు ఇవ్వరాదని నిర్ణయించారు. తప్పులు చేసే ఉద్యోగులపై జనగణన చట్టం 11 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని 15 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో 1,744 ఎన్యూమరేటర్లు, 302 మంది సూపర్వైజర్లతో ఇంటింటి జనగణన ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాబా 9.25 లక్షలు. చాలా ఏళ్ల తర్వాత గణన చేపడుతున్నారు. ప్రజలు కచ్చితమైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు సహకరించాలని అధికారులు కోరారు. ఫిర్యాదులకు కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రజల సౌకర్యార్థం, ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా, డివిజన్, చార్జి అధికారి స్థాయిల్లో కంట్రోల్రూంలను, రాష్ట్ర స్థాయిలో టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. జిల్లా కంట్రోల్ రూం 08963–796085 నంబరుకు ఎవరైనా సంప్రదించవచ్చు. పింఛన్ల పంపిణీ ఎలా? జనాభా లెక్కల కోసం నియమించిన ఎన్యుమరేటర్లలో దాదాపు 80 శాతం మంది వరకు సచివాలయ సిబ్బందే ఉన్నారు. ప్రస్తుతం మే నెలకు సంబంధించి ఒకటో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో పింఛన్లు అందజేయాల్సి ఉండగా.. ఇదే సమయంలో గణన విధులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రభావం దేనిపైన పడుతుందోనని సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
పాఠశాలలో టేకు చెట్లు మాయం
● ముఖ్య నాయకుడి ఇంటి నిర్మాణం కోసం అక్రమంగా తరలింపుసాక్షి, పార్వతీపురం మన్యం : పార్వతీపురం మండలం అడారు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో సుమారు 20 టేకు చెట్లు మాయమయ్యాయి. రాత్రికి రాత్రే వీటిని కొట్టి, తరలించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఓ ముఖ్య నాయకుడి ఇంటి నిర్మాణం కోసం అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు దగ్గరుండి, గుట్టుగా వీటిని తొలగించి, తరలించుకుపోయినట్టు సమాచారం. ఏళ్ల క్రితం నాటి ఈ చెట్ల కలప విలువ రూ.లక్షల్లో ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండానే, విశాలమైన చెట్లను తొలగించి తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
జామి: స్నేహితుడిని స్కూటీపై దించడానికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ మృత్యువు రూపంలో వెంటాడి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్.కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన యువకుడు కొటాన ఎర్నాయుడు (24) బీటెక్ పూర్తిచేశాడు. విశాఖ పట్నంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామం అయిన ఖాసాపేటలో పండగకు వచ్చాడు. స్నేహితుడిని బుధవారం పెంట శ్రీరాంపురం స్కూటీపై దించడానికి తీసుకువెళ్లాడు. తాండ్రంగి గ్రామం సమీపంలో జామి నుంచి పిక్క లోడ్తో రేవళ్ల పాలెం వెళ్తున్న ట్రాక్టర్ వెనుకనుంచి స్కూటీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఎర్నాయుడు మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న జామి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర జనార్దన్ తెలిపారు. వెంకటరావు, చినతల్లి దంపతులకు ఎర్నాయుడు ఒక్కడే కుమారుడు.ఇద్దరు అక్కలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో లైన్మన్..సీతంపేట: మండలంలోని గొయిది గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నబగ్గ సచివాలయ పరిదిలో లైన్మన్గా పనిచేస్తున్న కీసరజోడుకు చెందిన బిడ్డిక శంకరరావు (36) బుధవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సోమగండి వీఆర్వో తులసిరావుకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎస్సై వై.అమ్మన్నరావు అందించిన వివరాల ప్రకారం పాలకొండలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి ఇద్దరూ వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న శంకరరావు ముందున్న బైక్ను ఓవర్టేక్ చేయబోయే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ అదుపు తప్పి కిందపడిపోయారు. తలపై శంకరరావుకు తీవ్రగాయలవడంతో వెంటనే 108 సాయంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య శిరీష, ఏడాది కుమారుడు నివేది ఉన్నాడు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
పాలకొండ: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపాల్ శ్యామ్బాబు అన్నారు. పాలకొండ డిగ్రీ కళాశాలలో బుధవారం రసాయన శాస్త్రంపై అంతర్జాతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల వర్సిటీల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రం ప్రాధాన్యత, ప్రాముఖ్యతను వివరించారు. ఆదికవి నన్నయ్య వర్సిటీ ప్రొఫెషర్ బి.జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం, శక్తి, పర్యావరణ స్థితి స్థాపకత, సుస్థిరతకు రసాయన శాస్త్రం ఎంతగా దోహదపడుతుందని వివరించారు. ఐఐటీ పట్నా ప్రొఫెషర్ టి.రాజగోపాల్, ఐఐటీ తిరుపతి ప్రొఫెషర్ ఎస్.సోమేశ్వరరావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఎస్.శర్మ, ఆర్కేసీ యమజాల, పాలకొండ కళాశాల అధ్యాపకుడు ఎస్.రామకృష్ణ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.జయమని, అధ్యాపకులు బి.రాజు, ఎం.శాంతి, కె.శ్రీనివాసరావు, పి.రాజ్యలక్ష్మి, ఎ.శ్రీనివాసరావు, ఎస్.జగన్మోహనరావు పాల్గొన్నారు. -
అసంతృప్తిదారులు x తహసీల్దార్లు
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. చాలావరకు సమస్యలకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అశ్రద్ధ, అవినీతి కారణమవుతోంది. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వంటివి నిర్వహిస్తున్నా.. ఆ దరఖాస్తులు మళ్లీ మండల కార్యాలయాలకే వెళ్లడం.. యథాస్థితిలో సమస్య ఉండిపోవడం పరిపాటిగా మారింది. ఇందువల్లే అర్జీదారులు పదేపదే అవే వినతులను తిప్పుతున్నారు. ఈ సమస్యను గుర్తించే కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రత్యేక కార్యక్రమం అమలుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ సమస్యలపై అసంతృప్తి అర్జీదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గతంలో ప్రజావాణి, స్పందన, పీజీఆర్ఎస్ వేదికల ద్వారా అందిన వినతులపై ఇంకా పరిష్కారం లభించలేదని పేర్కొన్న అర్జీదారులను ప్రత్యేకంగా పిలిపించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్పుస్తకాలు, ఆర్ఓఆర్ నమోదు, వారసత్వ మార్పులు, సరిహద్దు వివాదాలు, ఆక్రమణల తొలగింపు, భూమి రికార్డుల సవరణలు తదితర అంశాలపై సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 50 అర్జీలు అందాయి. ఇవన్నీ గతంలో వచ్చినవే. ఇప్పుటికే వీటిపై పలుమార్లు దరఖాస్తులు అందించారు. తహసీల్దార్ల వద్దే సమస్య పరిష్కారం కావడం లేదని గుర్తించిన కలెక్టర్.. అన్ని మండలాల నుంచీ వారిని పిలిపించారు. కలెక్టర్ దగ్గరికి వెళ్లేలోపే సంబంధిత అర్జీదారులను ఆయా మండలాల తహసీల్దార్లు అడ్డుకోవడం గమనార్హం. ఇన్నాళ్లూ చేయలేనిది.. ‘రేపు ఉదయం మండల కార్యాలయానికి రండి.. మీ పని అయిపోతుంది.. కాగితం ఇచ్చేస్తాం’ అంటూ పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది చేసేది లేక.. అక్కడి నుంచి వెనుదిరగగా.. మరికొందరు అధికారులపై కోపంతో ఎన్నిసార్లు తిరిగినా తమ పని అవ్వడం లేదని కలెక్టర్ ప్రభాకర రెడ్డి, జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ సప్నిల్ జగన్నాథ్, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలతల వద్ద మొర పెట్టుకున్నారు. ● పాలకొండ పరిధి వాటపాగు గ్రామానికి చెందిన శిల్లా భాస్కరరావుకు చెందిన భూముల్లో కొంతభాగం ఆన్లైన్ లో వేరొకరి పేరున చూపిస్తోంది. పత్రాలు పరిశీలించి, రీ సర్వే జరిపి తమ పేరిట వెబ్ ల్యాండ్లో నమోదు చేయాలని ఇప్పటికే పలు దఫాలు వారు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో కలెక్టర్ ఎదుట నేరుగా చెప్పుకుందామని వచ్చారు. ● పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ మడకవానివలసకు చెందిన రాయల రాములు.. తన తండ్రి పేరున పార్వతీపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రమంగా దాఖలు పడిన భూములు ఉన్నాయని, ఇప్పుడు ఆ భూములను వంగపండు భాస్కరరావు, వంగపండు జయమ్మ, సుశీలమ్మ తదితరులు అక్రమంగా ఆక్రమించుకుని దున్నుతున్నారని తెలిపారు. పార్వతీపురం తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్కు దరఖాస్తు అందజేశారు. అసంతృప్తి అర్జీదారులతో కలెక్టర్ ముఖాముఖి అవే సమస్యలు పునరావృతం అర్జీలు ఇవ్వనీయకుండా అడ్డుపడిన తహసీల్దార్లు!సాలూరు మండలం కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన అన్నదమ్ములు సీదిరపు శ్రీరాం, శోభన్ కుమార్ అనే గిరిజనులు తమ తాతల కాలం నుంచి 4.15 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపారు. భూమి హక్కుకు సంబంధించిన అన్ని కాగితాలూ వారి వద్ద ఉన్నాయి. సుమారు రెండేళ్ల నుంచి ఆ భూమికి వేరొకరు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. గతంలో వీరు పలుమార్లు అధికారులను కలిశారు. ఎక్కడా న్యాయం జరగడం లేదని చెబుతున్నారు. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పార్వతీపురం రూరల్: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై జరిగిన భౌతిక దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని పేర్కొంది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావుకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. పోలీస్ స్టేషన్ సాక్షిగా ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టారంటే జిల్లాలో విలేకరుల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని ధ్వజమెత్తారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగితే జిల్లావ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు గంగి శ్రీనివాసరావు, ఆర్.సుధాకర్, గోపాల్, దుర్గా, అనంతరావు, సాక్షి స్టాఫర్ రామకృష్ణ, నవీన్, దివానీ, సోమశేఖర్, కాకిముక్కల నాగు, శేఖర్, శాస్త్రి, శంకరరావు, నాయుడు, కృష్ణ, సుధీర్, తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల స్వీయగణన నమోదు తప్పనిసరి
● జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ.ప్రసాదరావువిజయనగరం గంటస్తంభం: జిల్లాలోని దుకాణాలు,వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులంతా స్వీయగణన నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ.ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు ఈ నమోదు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు తన వ్యక్తిగత వివరాలు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం సరైన విధంగా నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయగణన ద్వారా కార్మికుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చి, భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని కోరారు. ముఖ్యంగా తమ సంఘాలకు చెందిన కార్మికులు తప్పనిసరిగా స్వీయగణనలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డెంకాడ: మండలంలోని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్న ఎస్వీఎస్ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ, యూకేజీ తరగతులకు ఒక పోస్టు, 1నుంచి 5వ తరగతి బోధించేందుకు ఇంటర్, బీఏ, బీఎస్సీలతో పాటు టీపీటీ, హెచ్పీటీ, డీఈడీల అర్హత కలిగిన వారితో 4 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు. 6నుంచి 10వ తరగతి వరకూ హిందీ బోధించేందుకు బీఏతో పాటు హిందీ పండిట్ విద్యార్హత అని తెలిపారు. కంప్యూటర్ తరగతులు బోధించేందుకు 1 ఉపాధ్యాయ పోస్టు ఉందని, దీనికి బీసీఏ, బీఎస్సీ, బీఈ, బిటెక్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దరఖాస్తులను rvremschool @gmail.com గాని, వాట్సాప్ నంబర్ 73282234573కు గానీ పంపగలరన్నారు. అడ్మినిస్ట్రేషన్ 9573184185, స్కూల్ కాంటాక్ట్ నంబర్ 7382234573, బీడబ్ల్యూ అధికారి ఎన్.గణేష్ 9440906345కు ఫోన్ చేసి మరింత సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు. -
ఏనుగుల సంచారంతో భయాందోళన
గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో మండలంలోని ప్రజలు భీతిల్లుతున్నారు. నందివానివలసలోని తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు బుధవారం సాయంత్రానికి తోటపల్లి గ్రామ పరి సరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండంతో ఎప్పుడు ఏ గ్రామంలో ఎవరికి హాని చేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
అంతర్జాతీయ వేదికపై అక్కాచెల్లెళ్లు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు బెల్లాన హారిక, బెల్లాన భార్గవి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఓషియానియా ఖండంలో ఉన్న సమోవాలో జరుగుతున్న యూత్ అండ్ జూనియర్ కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఇటీవల బెల్లాన భార్గవి ఒకే రోజు బంగారు, వెండి పతకాలను కై వసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే వేదికపై భార్గవికి స్వయాన అక్క హారిక కూడా బుధవారం పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. అంతర్జాతీయ వేదికపై హారిక అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. స్నాచ్లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 110 కిలోలు..మొత్తంగా 197 కిలోల బరువును లిఫ్ట్ చేసి విజేతగా నిలిచింది. ఒకే వేదికపై అక్కా చెల్లెళ్ల డబుల్ విజయం జిల్లాలో క్రీడా వాతావరణాన్ని మరింత ఉత్సాహపరిచింది. తల్లిదండ్రులు బెల్లాన శ్రీనివాసరావు, గౌరి ప్రోత్సాహం, కోచ్ వల్లూరి శ్రీనివాసరావు మార్గదర్శకత్వంతో విజయాన్ని సాధించినట్లు అక్కాచెల్లెళ్లు తెలిపా రు. వారిద్దరికీ జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, సీనియర్ కోచ్ చల్లా రాము, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ ప్రోత్సహించారు. వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో పతకాల పంట ఇటీవల బంగారు, వెండి పతకాలు సాధించిన చెల్లి తాజాగా బంగారు పతకాన్ని కై వసం చేసుకున్న అక్క -
చుక్కానిలా డీవీజీ కథలు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్ర జిల్లాలు కథలకు పుట్టినిల్లు అని మరోసారి రుజువైందని, డాక్టర్ డీవీజీ శంకరరావు కథలు చుక్కానిలా ఉన్నాయని సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు అన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో చీకటి దివాకర్ అధ్యక్షతన మహాకవి శ్రీశ్రీ జయంతి, మేడే పురస్కరించుకుని డాక్టర్ డీవీజీ శంకరరావు కథల సంపుటి పుస్తకావిష్కరణను జెడ్పీ మీటింగ్ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎం.జై చంద్రనాయుడు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అణగారిన వర్గాల కోసం, స్వేచ్ఛాజీవనం కోసం, కార్మికుల హక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం శ్రీశ్రీ రచనలు చేశారన్నారు. డాక్టర్ ఎం.రమాగీతాదేవి, పాయల మురళీకృష్ణ పుస్తక సమీక్ష చేశారు. డీవీజీ రచనలు మానవత్వాన్ని మృదువుగా తాకే స్పర్శ రేఖలని, వైద్యునిగా పొందిన అనుభవాలు, జీవిత సత్యాలు వారి కలంలో జీవం పోసుకుని మన ముందుకు వచ్చాయన్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన షేక్ భాషా, కె.వి.శేషారావు, ఎల్.ఆర్.స్వామిలకు సభ నివాళులర్పించింది. ఎస్.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. -
జిల్లా కేంద్రంలో చాగంటి ప్రవచనం
● హాజరైన హైకోర్టు జడ్జి దంపతులుపార్వతీపురం: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన వక్త, ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. బెలగాంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి శతాబ్ది ప్రయుక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పారు. ధర్మం, నైతిక విలువలు, కుటుంబ జీవన విధానం, భక్తిమార్గం తదితర అంశాలపై ఆయన చేసిన ప్రవచనాలు అన్ని వర్గాలవారిని ఆకర్షించాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చాగంటి పార్వతీపురం పట్టణం రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి సీహెచ్.మానవేంద్రనాఽథ్ రాయ్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
చల్లబడిన వాతావరణం
పాలకొండ రూరల్: ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో పాలకొండ, పరిసర ప్రాంత ప్రజలు ఊరట చెందారు. కొద్ది రోజులుగా తీవ్ర ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు బుధవారం రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షం ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని అందించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఊపిరి పీల్చుకున్నారు. పగటి పూట ఉదయం 9 గంటల నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చుతుండడంతో ఇళ్లకు పరిమితమైన స్థానికులు తాజా వర్షంతో వేడి నుంచి కొంతమేర ఉపశమనం పొందారు. మరోవైపు వేసవి దుక్కులు చేపడుతున్న తమకు ఈ వర్షం మేలు చేకూర్చనుందని రైతులు పేర్కొంటున్నారు. -
మామిడి రైతు కుదేలు..!
● కళ తప్పిన మ్యాంగో మార్కెట్ ● తెగుళ్లతో నేలరాలుతున్న మామిడిపంట ● తగ్గిపోతున్న సాగు విస్తీర్ణంమెరకముడిదాం: ఏటా వేసవికాలంలో మామిడిపంట ఎగుమతులు, దిగుమతులతో కళకళలాడిన విజయనగరం జిల్లా మార్కెట్ ఈ ఏడాది దిగుబడిలేక వెలవెల బోతోంది. దీర్ఘకాలంగా మామిడిపంట సాగుతో జీవనం సాగించే రైతాంగానికి వాతావరణ ప్రతికూలతతో పంట పాడై పోగా ఉన్న పంట కాస్తా తెగుళ్లతో పూత, పిందెరాలిపోవడంతో మిగిలిన పంటను కొనేవారు ముందుకు రాక మామిడిరైతులు కుదేలవుతున్నారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా 30,940 ఎకరాల్లో మామిడిపంటను రైతులు సాగుచేస్తున్నారు. అయితే మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న బంగినపల్లి, సువర్ణరేఖ రకాల మామిడిపంట దిగుబడి పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, చైన్నై, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఏడాది ముఖం చాటేసే పరిస్థితి నెలకొంది. మామిడి సీజన్లో ఎగుమతి, దిగుమతులపై కూలీలు, దళారులు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్ల డ్రైవర్లు వందలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిపొందుతుండగా, మార్కెట్ ప్రతికూలతతో వారంతా రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. తెగుళ్లతో నష్టాలు: ఏటా పూతదశలోనే ప్రారంభమవుతున్న తెగుళ్లు పిందెదశలో ఉధృతమై కాపు నేలరాలిపోయి రైతులు తీవ్రనష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది సైతం నల్లతామర, తేనెమంచు తెగుళ్లతో పాటు ఇతర తెగుళ్ల కారణంగా చాలా వరకూ మామిడిపంట నేలరాలిపోయింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చాలావరకూ పంట నేలరాలిపోగా, ఉన్న కాస్త పంట వర్షం కారణంగా పురుగు పట్టిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం పనుకులు రకం సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో తక్కువధరకే అమ్మకోవలసిన పరిస్థితి నెలకొంది. వాతావరణ ప్రభావంతో రైతులు భయపడి సీజన్ ప్రారంభం నుంచే ఎదుగుదల రాకపోయినా కాయలు కోసి అమ్మేసుకోవడంతో ధర గిట్టుబాటు కావడంలేదు. సీజన్ మొదటిలో పనుకులు రకం టన్ను రూ.35 వేలు పలకగా, ప్రస్తుతం సగం ధర కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. బంగినపల్లిలో నంబర్ వన్ రకం– టన్ను రూ.60 వేలకు పైగా ధర పలుకుతున్నప్పటికీ మార్కెట్లో ఈ రకం పెద్దగా కనిపించడంలేదు. మామిడి రుచి చూద్దామని ఆశించేవారికి డజను కాయలు వందలాదిరూపాయల ధర పలుకుతుండడంతో కొనేందుకు వెనక్కి తగ్గుతున్నారు.పూర్తిగా నష్టపోయాం..మామిడితోటలు సాగు చేస్తే గతంలో మంచి దిగుబడి వస్తుండడంతో మంచి రాబడి వచ్చేది, దానికి తగిన లభాలు వచ్చేవి. గత నాలుగేళ్లుగా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది, కాస్తో, కూస్తో దిగుబడి వస్తుందంటే ఆపంట ప్రకృతి కన్నెర్రకు నేలపాలవుతోంది. ప్రతి ఏడాది లక్షల్లో మదుపులు పెట్టినప్పటికీ తగిన దిగుబడి రాకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో మామిడిపంటపై బీమా ఉండేది. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా..భయం ఉండేది కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి రైతులు బీమా కడుతున్నప్పటికీ విపత్కరపరిస్థితుల్లో ఆ బీమా రావడంలేదు, ఎందుకో అర్థం కావడంలేదు. మామిడిపంటతో నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలి. శిరువూరు నారాయణమూర్తిరాజు, సువర్ణరేఖ మామిడిరైతుల సంఘం అధ్యక్షుడు, సోమలింగపురం -
హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
అమానుషం సాలూరు రూరల్: సాక్షి సాలూరు టీవీ రిపోర్టర్ శ్రీనివాస్పై బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడాన్ని ఎస్ఎఫ్ఐ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు హెచ్.సింహాచలం, బి.అనిల్ ఖండంచారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకర్ల పైదాడి మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. వారి వెంట ఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, ఎ.గంగారావు ఉన్నారు. మోహన్పై దాడి జరిగిన సంఘటలను గుర్తుచేశారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా పేర్కొన్నారు. నిందితులను పట్టుకోకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్పై హత్యాయత్నం దుండగుల దాడితో తీవ్ర గాయాలు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ జర్నలిస్టు సంఘాల ఆందోళన బాధితుడిని పరామర్శించిన జెడ్పీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం -
‘బెట్టింగ్ మాయాజాలం‘ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: క్రికెట్ బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ డీపీఓలోని తన చాంబర్లో బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ యువత క్రికెట్ బెట్టింగులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోవడంతో పాటు, చదువులను నిర్లక్ష్యం చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. క్రికెట్ బెట్టింగులు, ఇతర ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యువత ఏవిధంగా ప్రభావానికి గురవుతున్నది, వారి జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నది, డబ్బులను ఎలా నష్టపోతున్నది అన్న విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ‘బెట్టింగ్ మాయాజాలం‘ అనే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించామన్నారు. ఈ షార్టు ఫిల్మ్ ను పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామ సందర్శన, కళాశాలల్లో నిర్వహించే అవగాహన సదస్సుల్లోను ప్రదర్శించి, బెట్టింగుల వలన కలిగే అనర్థాలను వివరిస్తారని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపడతామన్నారు. బెట్టింగులను నియంత్రించేందుకు పోలీసు అధికారులు తమ స్టేషన్ పరిధిలోని లాడ్జిలు, హాస్టల్స్, విద్యార్థులు, యువత ఎక్కువగా గుమిగూడే కళాశాలలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీలు చేపట్టే సమయంలో యువత మొబైల్ ఫోన్లను పరిశీలించి, వారి మొబైల్స్ లోని బెట్టింగ్ యాప్లు తొలగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సిఐ కె.కుమారస్వామి పాల్గొన్నారు. -
గడువులోగా రీ సర్వే
విజయనగరం అర్బన్: జనవరి నెల నుంచి ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న రీ సర్వే, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీ సర్వే, పాస్పుస్తకాల ముద్రణ ప్రక్రియలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి కొనసాగుతున్న రీసర్వే పనులను మండల, గ్రామాల వారీగా సమీక్షించారు. సర్వే పూర్తయ్యాక సర్టిఫికెట్లు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. సర్వే అనంతరం తప్పనిసరిగా సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. 2026 జనవరి వరకు పంపిణీ చేసిన పాస్పుస్తకాలలో ఉన్న తప్పులను సరిచేసిర ఇవ్వాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్లో డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. జేసీ సేతు మాధవన్ -
సమయపాలన తప్పనిసరి
● రాష్ట్ర ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్పాలకొండ రూరల్: ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్ నాయక్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని తన బృంద సభ్యులతో కలిసి ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రతి వార్డు నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, ఇతర మౌలిక వసతులు, అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. ఈ క్రమంలో ముఖ ఆధారిత హాజరుపై కచ్చితత్వం అవసరమన్నారు. సకాలంలో విధులకు హాజరు లేకుంటే సేవలు సక్రమంగా అందించడంలో ఏర్పడే అవరోధాలను ఎలా అధిగమిస్తారని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ హాజరులో అలస్యం గుర్తిస్తే ఓ రోజు సెలవుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మంజూరైన నిధులతో జరుగుతున్న పనుల తాజా స్థితిగతులు, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కడియం చిరంజీవి, ఆర్ఎంఓ కె.రవికుమార్, సహ వైద్యులు, పలు విభాగాల సిబ్బంది ఉన్నారు. -
యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
బొండపల్లి: మండల కేంద్రం బొండపల్లిలో కొద్ది రోజులుగా చెరువులో గ్రావెల్ను అభివృద్ధి పనుల ముసుగులో అక్రమంగా తరలించుకుపోతున్నారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొత్త చెరువులో రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే వందలాది ట్రాక్టర్ల గ్రావెల్ను రాత్రి పూట యథేచ్ఛగా తరలిస్తున్నారు. గ్రావెల్ను ఇళ్ల నిర్మాణంలో ఖాళీ స్థలాలను ఎత్తు చేసుకునేందుకు, పశువుల శాలలు ఖాళీ స్థలాలను ఎత్తు చేసేందుకు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడంతో వారి అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. చెరువుల్లో గ్రావెల్ తవ్వాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, మైన్స్ అధికారుల అనుమతులు తీసుకున్న తర్వాత వారు సూచించిన మోత్తాన్ని ప్రభుత్వానికి జమ చేసి తరలించాల్సి ఉంది. మరో వైపు వాల్టా చట్టం నిబంధనలకు లోబడి తరలించాలి. ఈ నిబంధనలు అన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ రోడ్డు పనులు, అభివృద్ధి పనుల పేరుతో గ్రావెల్ను తరలిస్తూ పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఇటీవల బొండపల్లిలో జరిగిన గ్రామ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారుల ముందు బాహాటంగానే నిలదీసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. అభివృద్ధి పనుల ముసుగులో తరలింపు -
ఫిన్సంజీవితో జేఎన్టీయూ జీవీ ఎంఓయూ
విజయనగరం రూరల్: విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యంగా జేఎన్టీయూ–జీవీ ఫిన్సంజీవి ఎడ్యువెల్త్ సర్వీసెస్తో బుధవారం అవగాహన (ఎంవోయూ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా జేఎన్టీయూ–జీవీ ప్రిన్సిపాల్ కేసీబీ రావు, ఫిన్సంజీవి సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీను మాడెం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి అందిపుచ్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఒప్పందంతో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, సంపద నిర్వహణపై అవగాహన, వృత్తి మార్గదర్శకత్వాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడి వ్యూహాలు, ఉద్యోగ అవకాశాలు, వర్క్షాపులు, సెమినార్ల నిర్వహణ వంటి కార్యకలాపాలు అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉచితంగా అనేక శిక్షణ కార్యక్రమాలు అందించనుందన్నారు. ● ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం గజపతినగరం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీ కొట్టడంతో ఒవ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం నుంచి విజయనగరం వస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న మరో భారీ వాహనం లైటింగ్ వల్ల ఆగి ఉన్న లారీ కనిపించక పోవడంతో లారీ వెనుక బాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో జరిగిన ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ పక్క సీట్లో ఉన్న విజయనగరానికి చెందిన పి.ప్రశాంత్ (36)అనే వ్యక్తి ఎడమకాలికి రెండు చోట్ల ఫ్రాక్చర్ అయింది. దీంతో108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించి వైద్య సేవలు అందించారు. గజపతినగరం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడు ప్రశాంత్ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులు తరలించారు.అక్కడి నుంచి కుటుంబసభ్యులు ఓప్రై వేట్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. లారీని ఢీకొట్టిన వ్యాన్ ముందు భాగం అంతా నుజ్జునుజ్జయింది. ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు సంఘనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం తెలిపారు. గంజాయి ధ్వంసం విజయనగరం రూరల్: ఎకై ్సజ్ శాఖాధికారులు గతంలో స్వాధీనం చేసుకున్న 841.962 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో వివిధ కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులుప్పాడలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ వద్ద ధ్వంసం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎ.సి పైడి రామచంద్రరావు, ఈఎస్ బమ్మిడి శ్రీనాథుడు, విజయనగరం ఎకై ్సజ్స్టేషన్ సీఐ కె.మన్మధకుమార్, ఎస్.కోట సీఐ, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు విజయనగరం గంటస్తంభం: పరిశ్రమల స్థాపన, నిర్వహణకు అవసరమైన అనుమతులను వేగవంతంగా జారీ చేస్తూనే కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీపీసీబీ ఈఈ సరిత తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూత్రాలకు అనుగణంగా సీటీఈ, సీటీఓ దరఖాస్తులను ఏపీఓసీఎంఎంఎస్ ద్వారా సులభంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీల పరిశ్రమలకు గడువులోపు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పరిశ్రమల తనిఖీలు క్రమంతప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించి సేవలను వినియోగించుకోవాలని కోరారు. -
సరైన పరిహారం ఇవ్వకుండానే భూసేకరణ
● హ్యాపీ హోం లేఅవుట్ బాధితుల అందోళనకొత్తవలస: రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల హ్యాపీ హోం లేఅవుట్లో గల ప్లాట్ల యజమానులకు సరైన పరిహారం ఇవ్వకుండానే అదికారులు భూసేకరణ చేసేశారని సంబంధిత లేఅవుట్ ప్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసుకున్న యజమానులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత లేఅవుట్లో సుమారు 30 సంవత్సరాల క్రితం నివాస అవసరాలకు ప్లాట్లను కొనుగోలు చేసుకున్నామని అప్పట్లో గజాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, పరిహారం మాత్రం సెంట్లలో ఇచ్చారని ఈ ప్రక్రియ వల్ల తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వానికి గజాల్లో చలానాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అధికారులు మాత్ర సెంట్లలో పరిహారం అందజేశారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదని వాపోయారు.ఇప్పటికై నా జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు.కార్యక్రమంలో పలువురు ప్లాట్లు కోల్పోయిన యజమానులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
విజయనగరం క్రైమ్: తన తండ్రి నడిపల్లి రమణ(58) కనిపించడం లేదంటూ కూతురు పావని విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది. మతిస్థిమితం లేని కారణంగా రమణ ఈనెల 15వ తేదీన రాత్రి 8.30 గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లి నేటి వరకు తిరిగి రాలేదని కూతురు పావని ఫిర్యాదులో పేర్కొంది. సీఐ చౌదరి ఆదేశాలతో ఆవాల రమణ విచారణాధికారిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెచ్సీకి తీవ్ర గాయాలు● బైక్ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ 26వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట్యాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎ. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు బొబ్బిలి దాడి తల్లి అమ్మవారి బందోబస్తుకు డ్యూటీ పడింది. ఇందులో భాగంగా విధుల నిమిత్తం శ్రీనివాసరావు తన మోటార్ సైకిల్ పై మంగళవారం సాయంత్రం బొబ్బిలి వెళ్తుండగా మండలంలోని పాలధార చెరువు వద్దకు వచ్చేసరికి బొబ్బిలి నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కు బలంగా గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ బి.బలరాం తన ఆటోలో క్షతగాత్రుడు శ్రీనివాస రావును ఎక్కించి గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. ఇక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారణమని ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండు బైక్లు ఢీకొని ఇద్దరు యువకుల మృతిపార్వతీపురం రూరల్/గుమ్మలక్ష్మీపురం: ఇద్దరు యువకులు శుభకార్యానికి ఆహ్వానించేందుకు వెళ్తుండగా, మరో ఇద్దరు అశుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. విధి ఆడిన వింత నాటకంలో ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్లు ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మంగళవారం గుమ్మలక్ష్మీపురం మండలం బెల్లిడి గ్రామ సమీపంలో జరిగింది. కురుపాం మండలం తియ్యలవలస గ్రామానికి చెందిన ఊయక గణేష్, సింహాచలం ఒక శుభకార్యానికి సంబంధించి కార్డులు పంచేందుకు స్కూటీపై గొరడ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో బొడ్లగూడ గ్రామానికి చెందిన కొండగొర్రి మన్మథరావు (25), కిల్లక కార్తీక్ రేగిడిలో జరిగిన ఓ పెదకర్మ కార్యక్రమానికి హాజరై బైక్పై తిరిగి వస్తున్నారు. బెల్లిడి మలుపు వద్దకు వచ్చేసరికి రెండు వాహనాలు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో మన్మథరావు అక్కడిక్కడే మృతి చెందగా, గణేష్ను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. గాయపడిన కార్తీక్, సింహాచలం ప్రస్తుతం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటగాళ్లకు ఆహ్వానం..!
పాలకొండ రూరల్: ప్రస్తుత వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు శాప్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నిర్ణయించింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 65 పాఠశాలలకు చెందిన క్రీడా ప్రాంగణాల్లో పలు రకాల ఆటలపై ఔత్సాహిక క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు జిల్లా క్రీడా అధికారి సంబంధిత ఉపాధ్యాయులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 8 నుంచి 16 ఏళ్ల మధ్య గల ఔత్సాహికులకు శిక్షణ అందించేలా చర్యలు చేపట్టారు. మే నెల 1 నుంచి 30 వరకూ ఈ శిబిరాలు నిర్దేశిత పాఠశాలల్లో కొనసాగనున్నాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య క్రీడాకారులకు శిక్షణ అందిస్తారు. జిల్లాలో శిబిరాల నిర్వహణ ఇలా.. పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతంపేట ఏపీటీడబ్ల్యూ ఆర్ఎస్, జీఎల్.పురం పి.ఆమిటి క్రీడాప్రాంగణం, ఇదే మండలం తాడికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ఆర్చరీ), సీతానగరం మండలం బూర్జ జెడ్పీహెచ్ఎస్, పాలకొండ పట్టణం పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో, సీతంపేట కేవీకే, జీఎల్.పురం హెచ్ గ్రౌండ్స్, సీతానగరం మండలం గాజులవలస, వీరఘట్టం జెడ్పీహెచ్ఎస్లో (అథ్లెటిక్స్), పార్వతీపురం ఆఫీసర్స్ క్లబ్ ఇండోర్ స్టేడియం, చర్చివీధిలో గల మున్సిపల్ పార్కు, సాలూరు ఇన్డోర్ స్టేడియం, సీతంపేట మండలం కేవీకే ఇండోర్ స్టేడియం, మక్కువ మండలం వెంకటబైరిపురం జెడ్పీహెచ్ఎస్, కురుపాం మండలం గుమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం (బాడ్మింటన్), వీరఘట్టం మండలం తెట్టంగి జెడ్పీ ఉన్నత పాఠశాలలో (బాల్ బాడ్మింటన్), గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర జెడ్పీహెచ్ఎస్ (బేస్ బాల్), సీతంపేట కేవీకే (బాస్కెట్ బాల్), పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల బ్రాంచ్, స్థానిక ఇందిరాకాలనీ ప్రాథమిక పాఠశాల, భామిని మండల పరిధిలో ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణం(బాక్సింగ్), పార్వతీపురం జట్టు ఆశ్రమం, ఇదే మండలం నర్సిపురం జెడ్పీ హెచ్ఎస్, రిషీ స్కూల్, కొమరాడ మార్కొండపుట్టి జెడ్పీహెచ్ఎస్లో (చెస్), కొమరాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం(క్రికెట్), పార్వతీపురం ఓల్డ్ బస్టాండ్ పార్కు ఏరియాలో (ఫెన్సింగ్), ఇదే మండలం నర్సిపురం జెడ్పీహెచ్ఎస్, కొమరాడ మండలం కోటిపాం జెడ్పీహెచ్ఎస్, జియ్యమ్మవలస మండలం కొత్తగూడ జెడ్పీ హెచ్ఎస్లో(హ్యాండ్బాల్), సీతంపేట కేవీకేలో (హాకీ), పార్వతీపురం జీయాన్ష్ ఇంటర్నేషల్ స్కూల్(జూడో), ఇదే పరిధిలో చాకలిబెలగాం ప్రైవేట్ గ్రౌండ్స్, పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతంపేట మండలం కేవీకే, పాచిపెంట మండలం పాంచాలి జెడ్పీ హెచ్ఎస్ఓ క్రీడా ప్రాంగణాల్లో (కబడ్డీ), పార్వతీపురం విద్యుత్ కేంద్రం, నోబెల్ స్కూల్, సాలూరు మండలం మామిడిపల్లి జెడ్పీహెచ్ఎస్, ఇదే మండలం టోనం జెడ్పీహెచ్ఎస్, కురుపాం మండలం రస్తకుంటుబాయి ఏఈ స్కూల్ క్రీడా ప్రాంగణం(కరాటే), పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ఖోఖో), పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళశాల, పాలకొండ ప్రైవేట్ గ్రౌండ్స్లో (తైక్వాండో), పార్వతీపురం ప్రకాశం క్లబ్లో (టెన్నిస్), పార్వతీపురం పరిధిలో వెంకంపేట, ఎంఆర్నగర్ జెడ్పీహెచ్ఎస్, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాలూరు జెడ్పీ హెచ్ఎస్, సీతంపేట మండలం కేవీకే, జీఎల్.పురం మండలం ఉదయపురం జెడ్పీహెచ్ఎస్, కొమరాడ మండలం బెన్నిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బలిజిపేట జెడ్పీహెచ్ఎస్ క్రీడా ప్రాంగణాల్లో (వాలీబాల్), పార్వతీపురం జీటీడబ్ల్యూ ఏహెచ్ఎస్లక్ష (వెయిట్లిఫ్టింగ్), పార్వతీపురం కేఎంహెచ్ రోడ్డు యోగా సెంటర్, జగన్నాథపురం, 5వ లైన్ గణేష్ నగర్, పాలకొండ ప్రభ్వు డిగ్రీ కళాశాల, ఇదే ప్రాంత పరిధి వడమ ఎంపీయూపీ స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాలూరు శ్రీరామా యోగా సేవాసమితిలో యోగాపై శిక్షణలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఔత్సాహికులు వారికి నచ్చిన క్రీడల్లో తర్ఫీదు పొందేందుకు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. శాప్ నేతృత్వంలో వేసవి క్రీడా శిక్షణ మే 1 నుంచి ప్రారంభం జిల్లా వ్యాప్తంగా 65 పాఠశాలల ఎంపిక ఔత్సాహిక క్రీడాకారులకు ఉపయుక్తంనిపుణులతో పర్యవేక్షణ వేసవి శిక్షణ శిబిరాలను సముచిత లక్ష్యంతో ఏర్పాటు చేశాం. బాధ్యతలను నేరుగా పర్యవేక్షిస్తాం. ఔత్సాహిక క్రీడాకారులకు నిపుణులు, అణుభవజ్ఞులైన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన, సీనియర్ క్రీడాకారులతో తర్ఫీదు అందించనున్నాం. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల ఉత్సుకతను గ్రహించి శిక్షణ శిబిరాలకు పంపించాలి. మరిన్ని వివరాలకు స్థానిక పాఠశాలల్లో సంప్రదించాల్సి ఉంటుంది. – డాక్టర్ కె.శ్రీధర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, పార్వతీపురం మన్యం -
పెట్రోల్..కష్టాల్..!
● బారులు తీరిన వాహనాలు ● వినియోగదారులకు తప్పని అవస్థలు ● బంకుల నుంచి బ్లాక్ మార్కెట్కు తరలింపు ● బంకుల వద్ద పోలీసుల పహారాపాలకొండ: పాలకొండ డివిజన్ కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలో ఎనిమిది పెట్రోల్ బంకులు ఉన్నా ఆయిల్ కొరత తీవ్రంగా వెంటాడుతోంది. సోమవారం రాత్రి నుంచి బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. డీజిల్ అమ్మకాలు పూర్తిగా నిలిపివేయడంతో రవాణా వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర వాహనాలకు మాత్రమే ఆయిల్ అందించాలని ఆదేశాలు ఉన్నాయని బంకుల యజమానులు డీజిల్ వేయడానికి నిరాకరిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు కొన్ని బంకుల్లో అధిక ధరలకు డీజిల్ అమ్మకాలు చేపట్టారని వినియోగదారులు చెబుతున్నారు. క్యాన్ల ద్వారా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్ల ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం బంకుల వద్ద పహారా కాసి వాహనానికి ఒక లీటరు చొప్పున పెట్రోల్ వేయించేలా ఏర్పాట్లు చేశారు. సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ బంకులను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు ఆయిల్ పోయాలని స్పష్టం చేశారు. -
పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలు
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు జిల్లాలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. సీతంపేట మండలం పనుకు వలసలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకోవాలని, బ్యాంకులు రుణాల మంజూరులో సహకరించాలని సూచించారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రుణాల మంజూరులో అలసత్వం వద్దు లబ్ధిదారులకు రుణాల మంజూరులో అలసత్వం చూపరాదని బ్యాంకు అధికారులను కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ డేలో పెండింగ్ రుణాలపై సమీక్ష నిర్వహించారు. రుణ దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యం, పత్రాల లోపాలు, సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఇంధన కొరత లేదు● జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిల్వల వివరాలను పరిశీలించారు. ఎక్కడా స్టాక్ కొరత లేకుండా అవసరం అయినపుడు వెంటనే ఇండెంట్ పెట్టి సరఫరాను పునరుద్ధరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన నిల్వలు ఉంచాలని యాజమాన్యాలను ఆదేశించారు. పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. మే 2న బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడి రాకపార్వతీపురం: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ మిశ్రా మే 2న విజయనగరం రానున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిన సంక్షేమ సాధికారి అధికారి ఇ.అప్పన్న మంగళవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బాలల హక్కుల పరిరక్షణ సామాజిక బాధ్యతసీతంపేట: బాలల హక్కుల పరిరక్షణను అందరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్లా మధుసూదనరావు అన్నారు. ఈ మేరకు సీతంపేటలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో అంగన్వాడీలు, వీఆర్ఓలు, ప్రజలతో బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, విద్య, ఆరోగ్య సమగ్ర వికాసంపై ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ అనేది కమిషన్, ఐసీడీఎస్తోపాటు ప్రజలందరి సమష్టి బాధ్యత అన్నారు. బాల్యవివాహాలను అంతా కలిసి సమూలంగా నిర్మూలించాలని కోరారు. పిల్లలను పనిలో పెట్టడం నేరమన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్లు లేకుండా ప్రతి చిన్నారిని బడికి పంపించేలా వారి తల్లిదండ్రులను చైతన్యం చేయాలంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన పాలకొండ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులను సన్మానించారు. -
వైభవంగా రామాయణ పారాయణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో భగవత్ రామానుజదాస బృందం ఆధ్వర్యంలో సహస్ర శ్లోక రామాయణ పారాయణం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. 24వేల శ్లోకాలతో ఉన్న వాల్మీకి రామాయణాన్ని వెయ్యి శ్లోకాలుగా తయారు చేయించి ఆ గ్రంథాన్ని మొదటిగా భధ్రాచలం క్షేత్రంలో పారాయణం చేసినట్లు బృంద ప్రతినిధి శ్రీమాన్ కందాల రాజగోపాలాచార్యులు తెలిపారు. అనంతరం శ్రీరంగం, శ్రీకూర్మం, సింహాచలం, పద్మనాభం వంటి దివ్య క్షేత్రాల్లో పారాయణం చేసినట్లు వివరించారు. ఈ మేరకు రామతీర్థంలో 108వ సహస్ర శ్లోక రామాయణ పారాయణం చేసి పట్టాభిషేకం జరిపించామని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
కొఠియా గ్రామాలకు స్వాతంత్య్రం ఎప్పుడు?
● గిరిజనులను విడిపించేందుకు ఆంధ్రాప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? ● మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పాలి ● మాజీ డిప్యూటీ సీఎ పీడిక రాజన్నదొరసాలూరు: వివాదాస్పద ఆంద్రా ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల్లోని గిరిజనులకు స్వాతంత్య్రం ఇంకా రాలేదని, భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్చేచ్ఛా హక్కుకూడా వారికి లేకుండా పోయిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర వాపోయారు. ఈ మేరకు మంగళవారం ఆయన పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. జనగణనను తాము ఆంధ్రాలో చేసుకుంటామని చెప్పినందుకు ఒడిశా అధికారులు తప్పుడు కేసులు పెట్టి ఇద్దరు ఎగువశెంబి గిరిజనులను ఆంధ్రాలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారని అక్కడ గిరిజనులు, నాయకులు వాపోయారని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భూభాగంలోకి ఒడిశా పోలీసులు వచ్చి ఇద్దరు గిరిజనులను అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తే మంత్రి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి ప్రైవేట్ లాయర్లు ఒడిశా వెళ్లి వారిని విడిపించడం కాదని, ఆంధ్రా ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్లి వారిని విడిపించారా? అలా ఎందుకు ఆంధ్రా ప్రభుత్వం చేయలేదని ప్రశ్నించారు. పైగా వారిని విడిపించామంటూ మీ సొంత మీడియాలో చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలకు ఏమైనా పొంతన ఉందా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రికి సూచించారు. దేశంలో, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో దశాబ్దాల కొటియా వివాదానికి శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. కొఠియా సమస్యను పలుమార్లు తాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తెలపగా అప్పటి ఒడిశా సీఎం నవీన్పట్నాయక్ను జగన్మోహన్ రెడ్డి కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాపం..ప్రజలకు శాపం పెట్రోల్, డీజిల్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్య పాపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తగు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల కేవలం ఆంధ్రా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. పక్కనున్న మిగిలిన ఏ రాష్ట్రంలోను ఈ కొరత లేదన్నారు. ఆంధ్రాలో చాలావరకు బంక్లు నో స్టాక్ బోర్డుతో దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఇంధన కొరత ప్రభావం చివరకు పడేది ప్రజలపైనే నన్నారు. దీనివల్ల ఽ ప్రజలపై ధరల భారం పడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు ఆ భారాన్ని మోయాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు. -
ప్రమాద స్థలంలో విచారణ
● రవాణా శాఖ ఉపకమిషనర్ పరిశీలనపూసపాటిరేగ: మండలంలోని పూసపాటిరేగ పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంపై విజయనగరం రవాణా శాఖ ఉపకమిషనర్ మణికుమార్ మంగళవారం విచారణ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పలువురు తెలియజేశారు. పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన విశాఖపట్నానికి చెందిన కరుణాకరన్ శ్రీనివాసరావు(57),బొబ్బిలి మండలం జోగిపేటకు చెందిన కళ్లంపూడి సింహాచలం(50), శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గంగుపేటకు చెందిన సదనపల్లి రాము, అదే గ్రామానికి చెందిన సదనపల్లి ఈశ్వరరావు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వ్యక్తికి విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరన వేగమే ప్రమాదానికి కారణం పూసపాటిరేగ పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో కారు మితిమీరిన వేగంతో వెళ్లూ అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. భోగాపురం మండలం రాజాపులోవ జంక్షన్ నుంచి పూసపాటిరేగ మండలం కందివలస వరకు రాత్రి వేళల్లో జాతీయ రహదారిపైనే నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలుపుదల చేయడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాదిగా జరిగిన ప్రమాదాల్లో ఎక్కువగా ఆగి ఉన్న లారీలను ఢీకొన్న సంఘటనల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
హెల్ప్లెస్ హ్యాండ్స్!
● మూణ్ణాళ్ల ముచ్చటగా ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ● రోగులకు అందని సహాయం ● జిల్లా ఆసుపత్రి సిబ్బంది తీరు.. ‘తెలియదు, మర్చిపోయాం!’ సాక్షి, పార్వతీపురం మన్యం: ● పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో మంగళవారం ఉదయం తేనెటీగల దాడిలో పలువురు ఉపాధి హామీ వేతనదారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి గురించి ఆరా తీసేందుకు పలువురు గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రారంభం మొదలు.. చివరి వరకు వీరి ప్రశ్నకు సమాధానం ఇచ్చే వారే కరువయ్యారు. ఆస్పత్రి కింద భాగంలో అడిగితే.. రెండో అంతస్తుకు వెళ్లాలని! పైకి వెళ్లి అడిగితే.. కుడి వైపు వెళ్లాలని ఒకరు.. అక్కడికి వెళ్తే, ఇటు కాదు.. ఎడమ వైపు పోవాలని మరొకరు! ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బదులిచ్చారు. కనీసం అక్కడే విధుల్లో ఉన్న నర్సులు, వైద్యులు, సిబ్బందికి కూడా వీరి సమాచారం తెలియక పోవడం గమనార్హం. తమ వారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ఆ గ్రామస్తులకు సుమారు అరగంట సమయం పట్టింది. వీరికి వివరాలు చెప్పేందుకు ‘హెల్పింగ్ హ్యాండ్స్’ వలంటీర్లు ఎవరూ కనిపించలేదు. ● ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు ఎలా ఉందంటే.. తేనెటీగల దాడిలో గాయపడిన వారు 15 మందని ఒకరు.. ఆరుగురే ఉన్నారని ఇంకొకరు.. లేదు ఇద్దరే చికిత్స పొందుతున్నారని మరొకరు... ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా పొంతన లేని సమాధానాలు చెప్పడం విశేషం. జిల్లా సర్వజన ఆస్పత్రిలో రోగులకు.. వారి బంధువులకు సరైన సేవలు అందని పరిస్థితి నెలకొంది. వైద్యం మాట దేవుడెరుగు.. కనీస సమాచారం ఇచ్చే వారే కరువయ్యారు. వైద్యులు, లెక్కకు మించి నర్సులు, సిబ్బంది ఉన్నా.. వైద్యం కోసం వెళ్లిన రోగులకు, వారి బంధువులకు ఏ ఒక్కరి నుంచీ స్పష్టమైన సమాధానం, సమాచారం దొరకడం లేదు. ఆస్పత్రిలో రోజుకు 300కు పైగా ఓపీ నమోదవుతుంది. నిత్యం ఇన్ పేషెంట్లు 100కు పైగానే ఉంటున్నారు. వలంటీర్లు లేని హెల్పింగ్ హ్యాండ్స్.. ఇటీవల ఆస్పత్రిలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి శ్రీకారం చుట్టారు. గిరిజనులు, దూర ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆస్పత్రుల్లో సేవలు సులభతరం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఓపీ, ల్యాబ్, మందులు ఇచ్చే వద్ద, ఇతర ఏ సహాయం కావాలన్నా హెల్పింగ్ హాండ్స్ వలంటీర్ చేదోడుగా ఉంటారని కార్యక్రమం ప్రారంభం సమయంలో కలెక్టర్ తెలిపారు. ఆయన ఆలోచన మంచిదే అయినప్పటికీ.. ఆచరణలో మూడు రోజులు ముచ్చటగానే మిగిలిపోయింది. ఆస్పత్రిలో ఎక్కడా వలంటీర్లు కానరాని పరిస్థితి నెలకొంది. కనీసం ఆస్పత్రి సిబ్బంది అయినా మానవతా దృక్పథంతో సహాయం చేసే పరిస్థితి ఉండటం లేదని రోగుల బంధువులు అంటున్నారు. సిబ్బందిని ఎవరైనా అడిగినా.. ‘తెలియదు.. మర్చిపోయాం’ అన్న రీతిలోనే వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. హెల్పింగ్ హాండ్స్ కాస్త.. హెల్ప్లెస్గా మారిపోయిందని చెబుతున్నారు. -
మద్యం ఫుల్.. పెట్రోల్ నిల్..!
పాలకొండ: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మద్యం ఊరూరా దొరుకుతోందని, ఆయిల్ కొరత ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిలు ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాలకొండ పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద మంగళవారం ధర్నా చేశారు. దేశంలో ఎక్కడా లేని ఆయిల్ కొరత ఒక్క ఏపీలోనే వెంటాడుతుందన్నారు. ఆయిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల్లో గంటల తరబడి వేచి ఉన్న వాహనచోదకులకు మజ్జిగ పంపిణీ చేశారు. వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి -
పెండింగ్ ఇంక్రిమెంట్స్ విడుదల చేయాలి
● కంటెంజెంట్ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారావువిజయనగరం ఫోర్ట్: వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 3 సంవత్సరాల పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలని కంటిజెంట్ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.దుర్గారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. హెచ్ఆర్ సెల్ను వెంటనే ఏర్పాటు చేసి, కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. యూపీహెచ్సీ స్టాఫ్ నర్సులకు గతంలో లాగానే 35 రోజుల సాధారణ సెలవులు అమలు చేయాలన్నారు. క్లియర్ వేకెన్సీ, పరస్పర బదిలీలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, రేషనలైజేషన్ పేరుతో ఎన్హెచ్ఎం ఉద్యోగులకు నష్టం కలిగించే నిర్ణయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కళావతి, జిల్లా కార్యదర్శి గౌరీశ్వరి, బి. శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
తీర్థాల్లో గ్రామీణ సంస్కృతి ఉట్టిపడాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులక్కవరపుకోట: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అమ్మవారి పండగలు, తీర్థాలు, జాతరలు పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిష్త్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మండలంలోని తలారి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ (సింగపూర్) ఆధ్వర్యంలో సోమవారం సత్యవమ్మ పేరంటాలు అమ్మవారి తీర్థం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా గ్రామం సమీపంలో గల సత్యవమ్మ పేరంటాలు అమ్మవారి ప్రాంగణంలో జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ స్థాయిల్లో ప్రతిభా పరీక్షలను నిర్వహించారు.ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు భారీఎత్తున నగదు బహుమతులను అందజేశారు. అలాగే జిల్లా స్థాయి కోలాటం పోటీలను నిర్వహించి మహిళలకు నగదు బహుమతి అందజేశారు. అనంతరం రాష్ట్రస్థాయి గుర్రాలు, ఎడ్ల పరుగు ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన గుర్రాలు, ఎడ్ల బళ్ల యజమానులకు రూ.30 వేలు, రూ.25వేలు చొప్పున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేతులమీదుగా నిర్వాహకులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, కేఏ నాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొరపల్లి జయప్రకాష్ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గుమ్మడి స్వాతికుమారి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మేడే ఉత్సవాలకు సన్నాహాలు పూర్తి
● వాల్పోస్టర్లు, కరప్రతాల ఆవిష్కరణవిజయనగరం గంటస్తంభం: ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవమైన మేడే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో సన్నాహాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మేడే ఉత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం కొత్తదేవరవీధిలో గల కార్యాలయంలో ఆవిష్కరించారు. మే1వ తేదీ ఉదయం 10 గంటలకు కుప్పిలి వీధిలోని పైడిరాజమ్మ సామాజిక భవనంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కామ్రేడ్ బొడ్డు వాసుదేవరావు ముఖ్య అతిఽథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.రాజు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మేడే పోరాటస్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిప్రసాద్, సన్యాసిరాజు, అప్పారావు, సత్యారావు, గోవింద్, అచ్చన్న, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం.. ఏజెన్సీ రైతులకు దూరం
ఏజెన్సీ మిళితమై ఉన్న పాలకొండ నియోజకవర్గంలో ప్రస్తుత సీజన్లో 34వేల ఎకరాలకు పైగా జీడిసాగుపై రైతులు ఆధార పడుతున్నారు. గిరిజన ఆవాసితమైన సీతంపేట మండల పరిధిలో సుమారు 10వేల మంది వరకూ గిరిజనులు 25 వేల ఎకరాల వరకు జీడి సేద్యం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ప్రభుత్వం ద్వారా అందాల్సిన ప్రోత్సాహం గిరిజనులకు లేదు. హెక్టారుకు 600 కేజీల మేర దిగుబడి వస్తుండడంతో సంబంధిత రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం ద్వారా సరైన మద్దతు ధర కల్పించాల్సిన యంత్రాంగం.. ఆ దిశగా ఆడగులు వేయడం లేదు. దీంతో గిరిజన రైతులు దళారులు, వ్యాపారుల బారిన పడి నష్టపోతున్నారు. జీసీసీ – ఐటీడీఏ వన్ ధన్ (వీడీవీకెఎస్) వికాస్ కేంద్రాల ద్వారా కొనుగోలుకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. గతేడాది కిలో జీడిపిక్కలు రూ.155 వరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది రూ.200లకు పైబడి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యలు లేవు. ప్రస్తుత సీజన్లో సేకరణ చేపట్టి ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా పిక్కల నుంచి పప్పును వేరుచేసి విక్రయించి, సరైన ధర అందించాల్సిన కేంద్రాలు తెరుచుకోలేదు. సీతంపేట మండల పరిధిలో జిల్లేడుపాడు శంభాం, సీతంపేటలో గల జీడి ప్రాసెసింగ్ కేంద్రాలు మరింత చురుగ్గా పనిచేయాల్సి ఉంది. -
ప్రకృతి కరుణించక...
గతేడాది డిసెంబర్ నెలలో మంచు, ఎండ కారణంగా జీడి పూత తక్కువగా వచ్చింది. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల చాలా వరకు పూత దెబ్బతింది. ప్రకృతి సహకారం లేక ఈ ఏడాది జీడి పంట దిగుబడి తగ్గింది. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో సుమారు 2 వేల ఎకరాలు, సాలూరు మండలంలో 3,400, పాచిపెంట 600 ఎకరాలు.. మొత్తం 6 వేల ఎకరాల్లో దాదాపు 5 వేల మంది రైతులు జీడి పంటను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొనుగోలుకు జీడి ప్రొసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్సు కూడా లేకపోవడంతో రైతులు మరింత దారుణంగా నష్టపోతున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ జీడి పరిశ్రమ వారు.. పిక్కలు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు లాభపడడం గమనార్హం. -
మద్దతు కరువు.. దళారుల దరువు..!
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్/సాలూరు/గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం రూరల్: గిరిజన రైతులకు కల్పవృక్షంగా నిలవాల్సిన ‘తెల్ల బంగారం’ (జీడి) ఇప్పుడు వారి కళ్లల్లో కన్నీరు మిగులుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో మన్యం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో సుమారు 99 వేల ఎకరాల్లో సాగువుతున్న జీడి పంటపైనే వేలాది గిరిజన కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మార్కెట్లో గిరాకీ ఉన్నా.. ప్రభుత్వం నుంచి కొనుగోలుకు సహకారం లేకపోవడంతో రైతులు దళారుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పార్వతీపురం ఏజెన్సీలో 65 వేల ఎకరాలు, పాలకొండ ప్రాంతంలో 34 వేల ఎకరాల్లో జీడి సాగవుతోంది. హెక్టారుకు 600 కేజీల దిగుబడి వస్తున్నా, రైతుకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. పంట ఆరంభం నుంచి తెగుళ్ల బెడద వేధిస్తున్నా.. అధికారుల నుంచి కనీస సలహాలు లేవు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన గిరిజనులు.. పంటను ఇళ్లలో నిల్వ చేసుకోలేక తెచ్చిన అప్పులు తీర్చలేక దళారులు నిర్ణయించిన ధరకే తెగనమ్ముకుంటున్నారు. మూలనపడిన ‘ప్రాసెసింగ్’ చక్రం.. గిరిజనులకు అండగా ఉండాల్సిన ప్రాసెసింగ్ యూనిట్లు పాలకుల నిర్లక్ష్యంతో మూలకు చేరాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన యూనిట్లు నిరుపయోగంగా మారాయి. ఎల్విన్ పేటలో భవనాల పరిశీలనతోనే కాలక్షేపం చేయగా.. పార్వతీపురంలోని కేంద్రం ముడిసరకు లేక మూతపడింది. సీతంపేట మండలం జిల్లేడుపాడు, శంభాం కేంద్రాలు కూడా అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఫలితంగా విలువైన యంత్రాలు తుప్పు పడుతున్నాయి. గతేడాది కిలో జీడిపిక్కలకు రూ.155 వరకు ధర పలికింది. ఈ ఏడాది పెట్టుబడి వ్యయం పెరగడంతో రూ.200 పైబడి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. జీసీసీ, ఐటీడీఏ (వీడీవీకేఎస్) కేంద్రాలు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో ప్రైవేటు వర్తకులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. పప్పు వేరుచేసే ప్రక్రియ సరిగ్గా లేకపోవడంతో పంట విలువ పడిపోతోందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. ముడి సరకుకూ డబ్బులు లేవాయే.. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని పార్వతీపురంలో వీడీవీకే గ్రూపు సభ్యులతో జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.కోటి వరకూ యూనిట్, ఇతర ఏర్పాట్లకు వ్యయం అయ్యింది. రోజుకు ఒక టన్ను చొప్పున.. ఏడాదికి సుమారు 300 టన్నుల వరకు ప్రాసెసింగ్ చేయాలని భావించారు. గత ఏడాది 48 మెట్రిక్ టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. సుమారు రూ.75 లక్షల మేర పిక్కల కొనుగోలుకే ఖర్చు చేశారు. సరకు అయిపోయింది. ప్రాసెసింగ్ ఆగిపోయింది. ఇందుకు కారణం జీడిపిక్కల కొనుగోలుకు డబ్బులు లేకపోవడమే. నిధుల సేకరణ ఐటీడీఏకు భారంగా మారింది. పిక్క పచ్చిగా ఉండడం వల్ల కూడా కొనుగోలుకు ముందుకు రాలేకపోతున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాల్లో రైతులకు ఎక్కడా మద్దతు దొరకడం లేదు. పార్వతీపురం వచ్చి వ్యాపారులకు విక్రయిస్తే.. కిలో రూ.145 నుంచి రూ.155 మధ్యలోనే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఒక ధర స్థిరంగా ఉండడం లేదు. దిగుబడి తగ్గినా.. పెరగని ధర కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఎక్కువ శాతం మంది గిరిజనులు జీడి సాగుపైనే ఆధారపడుతుంటారు. ఏటా జీడికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండేది. ఒకానొక సమయంలో కేజీ జీడి రూ. 200 వరకు ధర పలకగా.. ఈ ఏడాది మాత్రం కేజీ ధర రూ.145కి పడిపోయింది. దీంతో జీడిరైతు లబోదిబోమంటున్నాడు. ధర పడిపోవడానికి ముఖ్య కారణం పూర్తిస్థాయిలో జీడిలో నాణ్యత లేక పోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో జీడి పిక్కలు ఎండినవి వస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుందని.. పచ్చిగా ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో ధర తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి దిగుబడి తక్కువగా ఉంటే మార్కెట్లో ధర పెరగాలి. ఇప్పుడు దిగుబడి తక్కువగా ఉన్నా.. ధర లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడీపిక్కలను గ్రేడింగ్ చేస్తున్న సిబ్బంది విలవిల్లాడుతున్న జీడి రైతులు ప్రాసెసింగ్ లేదు.. ప్రోత్సాహం దొరకదు తెల్లబంగారానికి కొరవడిన ఆదరణ లక్షలు వెచ్చించినా మూలకే ప్రాసెసింగ్ యూనిట్లు -
జర్నలిస్టులపై దాడులను ఐక్యంగా ఎదుర్కొందాం
విజయనగరం అర్బన్: జర్నలిస్టులపై దాడులను ఐక్యంగా ఎదుర్కొందామని, ఆ దిశగా సంఘం పటిష్టత కోసం ప్రతిఒక్కరు అవగాహనతో ఉండాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్వీప్రసాద్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరిల్ సిబ్బంది సమావేశ భవనంలో సంఘ జిల్లా కమిటీ మంగళవారం నిర్వహించిన ఒక రోజు జర్నలిస్టుల శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఇటీవల సాక్షి మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులుపెడుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఖండించి ఐక్యపోరాటం చేశామన్నారు. శిక్షణ కార్యక్రమంలో జర్నలిస్టుల విధు లు, సంఘం ఐక్యత అంశాలను సీనియర్ జర్న లిస్టులు వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సంఘ జిల్లా కమిటీ త్వరలో నిర్వహించనున్న మహాసభ నిర్వహణపై సమీక్షించారు. సీనియర్ జర్నలిస్టు ఎలిశెట్టి సురేష్ కమిటీ చైర్మన్గా, మహాపాత్రో కో–చైర్మన్గా ఉన్న అడహాక్ కమిటీని జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు 11 మందితో ఏర్పాటు చేశారు. హైపవర్ కమిటీగా పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు అల్లు యుగంధర్, టి.రాధాకృష్ణ, పంచాది అప్పారావు, హిందూ శ్రీనివాస్, కొప్పర గాంధీతో పాటు మరో పది మంది సభ్యులను ఎంపిక చేశారు. -
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం: మహిళలను కించపరిచేలా, వైఎస్సార్సీపీ నాయకులను అవమానించేలా తన పత్రికలో జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్య లు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ పీఏసీ సభ్యురా లు పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం, పాల కొండ నియోజక వర్గ సమన్వయకర్తలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి డిమాండ్ చేశా రు. ఇదివరకే నియోజకవర్గాల సీఐలకు ఫిర్యాదులు చేశామని గుర్తు చేశారు. ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మరోసారి ఫిర్యాదులు అందించామని చెప్పారు. జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు కలిసి ఎస్పీ కార్యాలయానికి సోమవారం చేరుకున్నారు. ఎస్పీ మాధవ్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో.. అదనపు ఎస్పీకి నియోజకవర్గాల వారీ ఫిర్యాదు కాపీలు అందజేశా రు. పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని.. ఇప్పటికై నా ఏబీఎన్ రాధాకృష్ణపై కేసులు నమోదుచేయాలని కోరారు. అనంతరం మీడియాతో ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట, రోత రాతలు రాస్తున్నారని.. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యు లు, మహిళలనే లక్ష్యంగా చేసుకొని వాడలేని భాష ను ఉపయోగించి సభ్య సమాజం తలదించుకునే లా చేశారని తెలిపారు. జర్నలిజం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వానికి జాకీలు లేపుతూ, గౌరవ ప్రదమైన పాత్రికేయ వృత్తి పరువు తీస్తున్నారని చెప్పా రు. నియోజకవర్గాల్లో ఫిర్యాదులు అందించినా చర్యలు లేకపోవడం వల్లే ఎస్పీ కార్యాలయ పీజీఆర్ఎస్కు వచ్చామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు బాపూజీ నాయుడు, పార్వతీపురం నియోజకవర్గం పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, సాలూరు నియోజకవర్గం నుంచి వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, దండి శ్రీను, రఘుపాత్రుని సాంబ, మువ్వల ఆదయ్య, మజ్జి అప్పారావు, నాలుగు నియోజకవర్గాల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం దారుణం. మహిళల పట్ల అభ్యంతరకరంగా ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా రాధాకృష్ణ మీద కేసు పెట్టి, ఆయనను అరెస్టు చేయాలి. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు, నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు ఆయన క్షమాపణ చెప్పాలి. రాధాకృష్ణ చేసింది తప్పు అని తెలిసినా కూడా సమర్థించే ఎమ్మెల్యేలు, మంత్రులు, మహిళా నాయకులు ఈ ప్రభుత్వంలో ఉండటం సిగ్గుచేటు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు కూడా వర్తించేలా లేవా? మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని అడగలేదా? రాధాకృష్ణకు ఒకటే అడుగుతున్నా.. చంద్రబాబు నాయుడు మోదీని తిడితే మీరు ఏం రాశారు? చంద్రబాబు నాయుడు మోదీని పొగిడితే మీరు జాకీలు వేయలేదా? చంద్రబాబు నాయుడు అమిత్ షా మీద రాళ్లు విసిరినప్పుడు ఆ నిర్ణయాన్ని మీరు సమర్థించలేదా? చంద్రబాబు నాయుడు అమిత్ షాను ఈరోజు జాకీలు వేస్తే మీరు ఎత్తట్లేదా? చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని అంటే ఆ రోజు మీరు సమర్థించలేదా? తర్వాత ప్యాకేజీ వద్దు.. హోదా ముద్దు అని చంద్రబాబు అంటే ?మీరు సమర్థించలేదా? ఆయన అవునంటే అవును.. కాదంటే కాదు. మీరే వెన్నెముక లేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మేము ఉన్నామా? – పాముల పుష్ప శ్రీవాణి, పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ నమ్మకంతోనే శాంతియుతంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చాం. ఫిర్యాదు ఇచ్చాం. కచ్చితంగా ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాట తప్పింది. రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెడుతోంది. వారి లోపాలను ఎత్తి చూపే, ప్రశ్నించే వైఎస్సార్ సీపీ, జగన్ మోహన్ రెడ్డి మీద ఏదో విధంగా దాడి చేయాలి. పార్టీ క్యాడర్ ను కించపరిచి బలహీనం చేసే కుతంత్రమే ఇది. రాధాకృష్ణ, ఆ తప్పులను సమర్థించే చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటివారంతా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? సంక్షేమం ఎలా ఉంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం రాధాకృష్ణకు లేదు. అందుకే ప్రభుత్వానికి వత్తాసు పాడుతున్నారు. మా పార్టీలో ఉన్న టువంటి నాయకులను, మహిళలను కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్రెడ్డిని ఇలా వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతున్నారు? ఈరోజు ప్రజలకు న్యాయం చేసేటువంటి పరి స్థితి ఉందా? వీటన్నిటిని ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకు ఉందా? వీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గానీ, వీరి చర్యలు గానీ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు. ప్రతి ఒక్క మహిళ కూ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ నియోజకవర్గం -
అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పార్వతీపురం రూరల్: రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం మొదటి దశలో 2,646 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న 263 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ నియామకాలు చేపడుతుంది. జిల్లాలో ఖాళీల వివరాలు: మొత్తం 263 పోస్టుల్లో 5 అంగన్వాడీ కార్యకర్తలు, 258 సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో అత్యధికంగా 175 పోస్టులు, సీతంపేట పరిధిలో 57, పార్వతీ పురం డివిజన్ పరిధిలో 31 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా సంబంధిత గ్రామం/ వార్డులో నివసించే వివా హిత మహిళలై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్హత, వయోపరిమితి కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సమర్పించాలని అధికారులు సూచించారు. పార్వతీపురం: జిల్లాలో జరుగుతున్న భూ రీ– సర్వే పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ రీసర్వే ద్వారా భూ రికార్డు ల ప్రక్షాళన జరిగి రైతులకు శాశ్వత హక్కులు లభిస్తాయని పేర్కొన్నారు. సర్వే పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ జాప్యం లేకుండా పూర్తి చేయాలని, వివాదాలను పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ఆధునిక పరికరాలు, డ్రోన్ల ద్వారా సేకరించిన డేటాను కచ్చి తంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించా రు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. సాలూరు: మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పరామర్శించారు. ఇటీవల రాజన్నదొర నేత్ర శస్త్ర చికిత్స చేసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం రాజన్నదొరను సాలూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో కళావతి కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీతంపేట: ఉప్పరజమ్మి నుంచి రేగుమానుగూడ వరకు రూ.50 లక్షలతో చేపట్టిన రోడ్డు పనుల్లో నాణ్యత పాటించడం లేదని హడ్డుబంగి మాజీ సర్పంచ్ సూర్యారావు, మంగయ్య తదితరులు ఆరోపించారు. ఈ మేరకు ఫొటోల తో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబుకు సోమ వారం ఫిర్యాదు చేశారు. వాటరింగ్ సక్రమంగా చేయడం లేదని, రోడ్డు లెవెలింగ్ సరిలేదన్నా రు. సిమెంట్ మోతాదు పాటించడం లేదని, అస్తవ్యస్తంగా రోడ్డు పనులు చేస్తున్నా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించడం లేదన్నారు. ఇలా నిర్మిస్తే రోడ్డువేసిన కొద్ది రోజులకే పాడ య్యే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. -
బంకుల్లో బారులు
వీరఘట్టం/పాలకొండరూరల్: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత వీరఘట్టం మండలాన్ని సోమవారం తాకింది.బంకుల వద్ద డీజిల్ నో–స్టాక్ బోర్డులు పెట్టడంతో డీజిల్తో నడుపుతున్న ఆటోలు, పలువురు వాహనదారులు అవస్థలు పడ్డారు. అయితే డీజిల్ నిల్వలు ఆదివారానికి ఉన్నప్పటికీ వీరఘట్టంలోని బంకుల యాజమాన్యం రాత్రికి రాత్రే తమకు తెలిసిన వారందరికీ క్యాన్లలో పట్టేసి ఇచ్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్ పెట్రోల్ బంకు వద్ద పలువురు ఆటో డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. స్టాకు ఉంచుకునే ఎందుకు మీరు ఇవ్వడం లేదని అక్కడి సిబ్బందిని నిలదీశారు. అనంతరం రెవెన్యూ డీటీ ప్రసాదరావు, ఎస్సై షణ్ముఖరావు బంకు వద్దకు వచ్చి స్టాకు వివరాలను పరిశీలించారు. మంగళవారం నాటికి పూర్తి స్థాయిలో డీజిల్ ఉంటుందని వాహనదారులకు నచ్చజెప్పారు. వాహనాలు తీసుకువచ్చేవారికి మాత్రమే పెట్రోల్ గాని, డీజిల్ గాని ఇవ్వాలని క్యాన్లకు ఇంధనం ఇవ్వవద్దని బంకు సిబ్బందికి సూచించారు. అయితే డీజిల్ కొరత వల్ల చాలా ఆటోలు స్టాండ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. -
చంద్రబాబుకు బాకాలు
●పాత్రికేయ ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ పాత్రికేయ ముసుగులో చంద్రబాబు ప్రభుత్వాని కి బాకాలు ఊదుతున్నా రు. ఆయనకు నచ్చితే తప్పులు చేసినా జాకీలు పెట్టుకొని లేపుతారు. లేకుంటే బురద జల్లు తూ, విషం చిమ్ముతారు. పాత్రికేయ వృత్తి అంటే మాకు గౌరవం. రాధాకృష్ణ లాంటివారు జర్నలిజం పరువు తీస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి మేలు చేయడానికే ఆయన ఛాన ల్, పత్రిక ఉంది. వైఎస్సార్సీపీ నేతలు, మహిళ లు లక్ష్యంగా ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇంత జుగుప్సాకర రీతిలో ఆయన పత్రిక ద్వారా మహిళల పట్ల విషం చిమ్ముతున్నా ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ స్పందించకపోవడం శోచనీయం. దీనికి రాధాకృష్ణ కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – శత్రుచర్ల పరీక్షిత్ రాజు, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ. పార్టీలో ఉన్న మహిళలు, మా కుటుంబ సభ్యుల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చాలా అనుచిత వ్యాఖ్య లు చేశారు. ఓ వైపు మహిళలకు ఏదైనా జరిగితే తక్షణమే వస్తామని పవన్ కల్యాణ్ అంటారు.. మహిళల పక్షపాతి ప్రభుత్వమని చంద్రబాబు చెబుతారు. చర్యలైతే ఎక్కడా లేవు. మహిళా హోం మినిస్టర్ అనిత కూడా ఎక్కడా స్పందించిన సందర్భం లేదు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన కాక ఇంకేంటి? పోలీస్ యంత్రాంగం పట్ల మాకు గౌరవం ఉంది. అందువల్లే మరో సారి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి విన్నవించుకుంటున్నాం. ఎస్పీ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వీధి పోరాటం చేసినా సరే.. కచ్చితంగా ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకునేటట్టుగా చేస్తాం. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గం. -
కొటియా గిరిజనులను విడుదల చేయాలి
● కలెక్టరేట్ వద్ద సీపీఎం నిరసనపార్వతీపురం రూరల్: ఒడిశా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన కొటియా సరిహద్దు గ్రామ గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ.. సరిహద్దు గ్రామాల్లో గిరిజనులను ఒడిశా పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అరెస్టయిన తాడంగి పిలుపు, చిరంజీవిలను వెంటనే విడిపించేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. కొటియా సరిహద్దు సమస్యకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని, గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పరిష్కారం లభించని పక్షంలో ప్రజా సంఘాలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ మేరకు జాయింట్ కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కొటియా గ్రామస్తులు తాడంగి సన్నం, కేసు, సీపీఎం నేతలు మర్రి శ్రీనివాసరావు, బి.వెంకటరమణ, గేదెల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు బత్తిన మోహనన్ రావు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాలక రంజిత్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కొత్తవలస: మండలంలోని అడ్డూరువానిపాలెం సమీపంలో గల తోటలో రామలింగాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సీముసిరి నర్సునాయుడు(38)ఆదివారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రసాదరావుతెలిపారు. నర్సునాయుడు రోజూ ఆటోలో లేబర్ను విశాఖపట్నం తీసుకుని వెళ్లి సాయంత్రం వారిని పికప్ చేసుకుని తీసుకొచ్ఛేవాడు.ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రాకపోవడంతో అనుమానం వచ్చి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెతకగా అడ్డూరువానిపాలెం సమీపంలో గల మామిడితోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మృతుడికి 6,4 సంవత్సరాలు వయస్సుగల పాప,బాబు ఉన్నారు. -
అర్జీల సంపూర్ణ పరిష్కారమే లక్ష్యం
● జేఈ యశ్వంత్ కుమార్ రెడ్డిపార్వతీపురం: పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి దరఖాస్తుకు సంపూర్ణ పరిష్కారం అందించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశంలో ఎస్డీసీ దిలీప్ కల్యాణ్ చక్రవర్తి, డీఆర్ఓ కె.హేమలతతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీ దారుల నుంచి 56 వినతులను జేసీ స్వీకరించారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్కు 39, రెవెన్యూ క్లినిక్కు 17 అర్జీలు వచ్చాయి. పెండింగ్ సమస్యలను శాఖల వారీగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు జేసీ సూచించారు. ఫీల్డ్ పర్యటనల ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. అర్జీ దారులతో సానుభూతితో వ్యవహరించాలని హితవు పలికారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టాలి పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, వేధింపులు, ఆన్న్లైన్ మోసాలు వంటి అంశాలపై బాధితులు ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి, ఫిర్యాదుల పూర్వాపరాలను విచారించి చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశంలో ఏపీఓ చిన్నబాబు సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 15 వినతులు వచ్చాయి. మర్రిపాడుకు చెందిన పాత్రో మినీ ట్రాక్టర్ మంజూరు చేయాలని అర్జీ అందజేశాడు. సర్వే చేసి కొండపోడు పట్టాలు ఇప్పించాలని వెంకటాపురానికి చెందిన గిరిజనులు వినతి ఇచ్చారు. అలాగే తాగునీటి బోరు గ్రామానికి వేయాలని, తాగునీటి బోరుకు మోటార్ వేయించాలని తుప్పలగూడ గ్రామస్తుడు రజినీకుమార్ కోరారు. భూ సమస్య పరిష్కరించాలని దొండమానుగూడ గ్రామస్తుడు సరవ కృష్ణారావు విన్నవించాడు. పవర్ వీడర్లు ఇప్పించాలని వెంకటాపురం, జంతూరు, బెండకాయలపేట తదితర గ్రామాలకు చెందిన లక్ష్మమ్మ తదితరులు కోరారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ నారాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన విద్యార్థికి ఆర్థిక సాయం
పాలకొండ రూరల్: స్థానిక ముదునూరువారి వీధికి చెందిన లక్ష్మీకాంత్ అనే విద్యార్ధి కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మేడపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో చలించిపోయిన వివేకానంద హైస్కూల్ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. దాదాపు రూ.2,20,000 మొత్తాన్ని విరాళంగా సేకరించి లక్ష్మీకాంత్ కుటుంబానికి అందించారు. ఈ సహాయాన్ని వివేకానంద హైస్కూల్ ప్రిన్సిపాల్ గవర పారినాయుడు, డైరెక్టర్లు, ప్రముఖ వ్యాపారవేత్త తుమ్మగుంట శంకరరావు, ఉపాధ్యాయులు కలిసి లక్ష్మీకాంత్ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఔదార్యం, సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు. -
తోటపల్లి ఆలయ నిర్వహణలో అక్రమాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తోటపల్లి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ జియ్యమ్మవల స గ్రామానికి చెందిన ప్రశాంతి సోమవారం పీజీ ఆర్ఎస్ కార్యక్రమంలో డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక ప్రైవేట్ ట్రస్టు పెత్తనం సాగిస్తోందని ఆమె ఫిర్యాదు చేశారు. ఆలయానికి వచ్చే విరా ళాలు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సింది పోయి, ప్రైవే ట్ వ్యక్తుల ఖాతాల్లో జమ అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాల తయారీలో టెండర్ల ప్రక్రియను పక్కనపెట్టి, పారదర్శకత లేకుండా తమకు నచ్చిన వారికి పనులు కట్టబెడుతున్నారన్నారు. ఆలయ అధికారుల సమక్షంలోనే నిధుల మళ్లింపు జరుగుతున్నా స్పందించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. దేవస్థానంలో ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పూజలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఆలయాన్ని పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
అర్హులకు అందించండి చాలు..
సాక్షి, పార్వతీపురం మన్యం: పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి అన్నదాత–సుఖీభవ నిధులు రూ.14 వేలు ఇటీవల జమయ్యాయి. తాను పథకం పొందేందుకు అనర్హురాలినని.. ఆ నిధులను ఆమె తిరిగి ఇచ్చేందుకు సిద్ధం అయ్యా రు. తాను దరఖాస్తు చేయనప్పటికీ.. ఆ మొత్తం జమ కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఏదో కుట్ర పూరితం ఇందులో ఉందని సందేహం వ్యక్తం చేశారు. తనకు జమ అయిన డబ్బులు తిరిగి తీసు కోవాలని కలెక్టరేట్లో సోమవారం సంయుక్త కలెక్ట ర్ యశ్వంత్ కుమార్ రెడ్డిని కలిసి కోరారు. రూ.14 వేలు నగదు అందజేశారు. ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. పరిశీలించి, ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు తీసుకోకుంటే డీడీ, చెక్కు రూపంలోనైనా తాను అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని కళావతి చెప్పారు. అర్హులకు అన్యాయం చేస్తూ... అర్హులకు అన్యాయం చేస్తూ అన్హులకు పథకాలు అందించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. అర్హులను, అనర్హులను కచ్చితంగా వేరు చేసి, కేవలం నిజమైన రైతు లబ్ధిదారులకే పెట్టుబడి నిధులు సక్రమంగా, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జేసీను కోరారు. వండువ గ్రామంలో 1,435 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి గత ప్రభుత్వ కాలంలో సుమారు 700 మంది రైతు లకు మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయ లు అయిదు సంవత్సరాల కాలంలో రైతు భరోసా ద్వారా అందించామని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక.. చాలామంది అర్హులకు పథకం అందలేద న్నారు. వారందరికీ న్యాయం చేయాలని.. తనకు పడిన అన్నదాత సుఖీభవ డబ్బులు వెనక్కి తీసుకోవాలని కోరారు. వాస్తవంగా మాజీ ఎమ్మెల్యే కళావతికి స్వగ్రామం వీరఘట్టం మండలం వండువలో కొంత భూములు ఉన్నాయి. ఆమె గతంలో బ్యాంక్ ఉద్యోగి.. పాలకొండ నియోజకవర్గం నుంచి పదేళ్లపాటు శాసన సభ్యురాలిగా ప్రజలకు సేవలందించారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారుగానూ ఉన్నా రు. ఆర్థికంగా స్వావలంబన కలిగిన ఒక మాజీ శాసన సభ్యురాలిగా, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిగా, పేద రైతులకు అందవలసిన ఈ సంక్షేమ నిధులు తన ఖాతాలో పడడం అత్యంత హేయమైన, అమర్యాదకరమైన పరిణామంగా ఆమె భావించారు. ఈ డబ్బులు స్వీకరించడం సమ్మతం కాదని భావించి.. ఆ నిధులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి సిద్ధపడి, సంయుక్త కలెక్టర్ను కలిశారు. -
దేవర మహోత్సవం
శోభాయమానం.. విజయనగరం టౌన్: సిరులతల్లి.. పైడితల్లి దేవర మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకెళ్లే ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి స్తపన మందిరంలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ వేదపండితులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ఈఓ కె.శిరీష నేతృత్వంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఆలయం చుట్టూ జై పైడిమాంబ .. జైజై పైడిమాంబ నామస్మరణతో మూడుసార్లు ప్రదక్షణ చేశారు. అనంతరం ఉత్సవ రథంపై అమ్మవారిని ఆశీనులు చేసి హారతులిచ్చారు. భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, భక్తుల జయజయ ధ్వానాలతో అమ్మరథం కదిలింది. రైల్వేస్టేషన్ వద్ద నుంచి ప్రారంభమైన రథం.. గాడీఖానా, సీఎంఆర్ కూడలి, వైఎస్ఆర్ సర్కిల్, ఎన్సీఎస్, కన్యకపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, మున్సిపల్ ఆఫీస్, కమ్మవీధి, తెలకలవీధి రామమందిరం మీదుగా హుకుంపేటకు చేరుకుంది. అక్కడ చదురు వద్ద ఉత్సవ విగ్రహాన్ని, పూజారి ఇంటివద్ద ఇత్తడి ఘటాలను ఉంచి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు ఘటాలతో ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, సాముగరిడీ, పులివేషధారణలు, కోలాటం, కాళికామాత వేషధారణలు, పెద్దపెద్ద బొమ్మల ప్రదర్శన, డప్పు వాయిద్యాల నడుమ ఘటాలను ఊరేగింపుగా మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి తీసుకెళ్లారు. అక్కడ ఘటాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆలయ తలయారి రామవరపు చినపైడిరాజు బృందం జంగిడి మీద దీపం పెట్టుకుని, చదురుగుడి నుంచి డప్పు వాయిద్యాలతో మంగళవీధి మీదుగా చెరువులోకి వెళ్లి అమ్మవారి మనవి చెప్పారు. అక్కడి మట్టిని పసుపు, కుంకుమగా మార్చి పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా మంగళవీధి నుంచి గంటస్తంభం మీదుగా తిరిగి చదురుగుడికి అమ్మవారిని తీసుకువచ్చి ఆశీనులు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి సిరిమానోత్సవంలో జరిగే ఉయ్యాల కంబాల మహోత్సవం వరకు అమ్మవారు చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. -
సబ్ జైలు సందర్శన
చీపురుపల్లి: పట్టణంలోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైల్లో ఖైదీలకు ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే సబ్ జైల్లో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఖైదీల పట్ల గౌరవంగా మెలగాలని సూచించారు. ఖైదీలకు న్యాయస్థానం కల్పించిన న్యాయ సేవ హక్కులను వివరించారు. ఖైదీల పట్ల వివక్ష చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సబ్ జైల్లోనే లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు. కామన్వెల్త్ వేదికపై మెరిసిన భార్గవి● యూత్లో గోల్డ్, జూనియర్లో సిల్వర్ మెడల్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన బెల్లాన భార్గవి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ మరోసారి జిల్లాకు గర్వకారణమైంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఓషియానియా ఖండంలో ఉన్న సమోవాలో జరుగుతున్న యూత్ అండ్్ జూనియర్ కామన్వెల్త్ వెయిట్లిప్టింగ్ చాంపియన్షిప్లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ పోటీల్లో భార్గవి యూత్ విభాగంలో బంగారు పతకం సాధించగా, జూనియర్ విభాగంలో వెండి పతకం అందుకుంది. స్నాచ్లో 78 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 102 కిలోలు ఎత్తి మొత్తం 180 కిలోలతో మెరుగైన స్కోరు నమోదు చేసింది. కఠినమైన పోటీని ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడి ఈ విజయాలను అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. తండ్రి బెల్లాన శ్రీనివాసరావు, తల్లి గౌరి ప్రేరణతో ఈ విజయాన్ని సాధించినట్లు భార్గవి తెలిపింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణికి జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, సీనియర్ కోచ్లు చల్లా రాము, వల్లూరి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. విశాఖలో జామి నివాసి ఆత్మహత్యఆనందపురం (విశాఖ): విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన సారిపిల్లి వినోద్ (27) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తర్లువాడ వద్ద నిర్మిస్తున్న గూగుల్ డేటా సెంటర్ పనుల కోసం వినోద్ ఇక్కడికి వచ్చారు. అయితే తీవ్రమైన అప్పుల బాధతో సతమతమవుతున్న వినోద్ మనస్తాపానికి గురై తర్లువాడ సమీపంలోని ఒక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మరణించే ముందు తన తమ్ముడికి ఫోన్ చేసి, తన భార్యాపిల్ల లను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరి ఫోన్ కట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆనందపురం పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ స్టేషన్ పరిధిలోని బొగ్గులదిబ్బకు చెందిన తెరండి గోవింద(46) ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గోవింద్కు 15 ఏళ్ల క్రితం సంతోషికుమారితో పెళ్లయ్యింది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒకబాబు ఉన్నాడు. అయితే వ్యసనాలకు బానిసైన గోవింద్ తరచూ ఇంటికి వస్తూ గొడవ పడేవాడు. ఈ బాధ భరించలేకే భార్య సంతోషికుమారి కొడుకును తీసుకుని కన్నవారింటికి వెళ్లిపోయింది. ఘోషాఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్లో స్వీపర్గా పనిచేస్తున్న గోవింద్ మృతదేహమై కనిపించాడు.భార్య సంతోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ అంజిబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పీజీఆర్ఎస్కు 181 అర్జీలు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎల్) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లా వ్యాప్తంగా స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై 181 వినతిపత్రాలు, ఫిర్యాదులు సమర్పించారు. కార్యక్రమంలో మొత్తం 181 వినతులు అందగా, అందులో అత్యధికంగా 69 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలిన వాటిలో డీఆర్డీఏ–17, పంచాయతీరాజ్–16, విద్యుత్శాఖ–7, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ–4, గ్రామ సచివాలయ శాఖకు 4, విద్యాశాఖకు 3, మున్సిపల్, హౌసింగ్ శాఖలకు చెరో రెండు, ఇతర శాఖలకు 56 అర్జీలు నమోదయ్యాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో ఆలస్యం అసలు సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ వినతులను వెంటనే పరిష్కరించి డిస్పోజ్ చేయాలని ఆధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, సర్వే సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్ఎస్ వినతులను ఆన్లైన్లో నిరంతరం పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై బాధ్యతగా స్పందించాలని అధికారులకు సూచించారు. అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తరువాతే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తి బాబు, స్పెష్ల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. అర్జీలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి పీజీఆర్ఎస్లో అందిన అర్జీలకు స్పీకింగ్ ఆర్డర్లో స్పష్టమైన ఎండార్స్మెంట్ ఉండాలని సరైన సమాధానం ఇవ్వని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి హెచ్చరించారు. అర్జీలపై తోచిన విధంగా రాయకుండా అర్జీదారుతో తప్పనిసరిగా మాట్లాడి సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఓస్ సమీక్షలో భాగంగా వినతుల పరిష్కారం, రీ–సర్వే, వాట్సాప్ గవర్నెన్స్, స్వీయ గణన, ఫ్యామిలీ సర్వే, సచివాలయాల తనిఖీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ ఏఆర్.దామోదర్ సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో 36 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి: వైఎస్సార్సీపీ నేతల వినతి విజయనగరం: జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్కు వినతిపత్రం అందచేశారు. అనంతరం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గొర్లె రవికుమార్, ఇప్పిలి అనంత్ మాట్లాడుతూ వేతన బకాయిలు వల్ల రోజువారీ కూలీపై ఆధారపడ్డ వేతనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఈ పరిస్థితి తలెత్తలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని కోరారు. అదేవిదంగా అధికారంలో ఉన్న నేతలు గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు నకిలీ మస్తర్లు వేసి, పనులు చేపట్టకుండా వారిని తమ రాజకీయ కార్యక్రమాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి నకిలీ మస్తర్ల పై తగు విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పని అడిగిన వేతనదారులకి సకాలంలో పని కల్పించాలని సూచించారు. తమ వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, వేతన బకాయిలు కోసం ప్రభుత్వానికి మరోమారు నివేదించనున్నట్లు కలెక్టర్ చెప్పినట్లు పేర్కొన్నారు. -
కారు బొలెరో..ఢీ : ఇద్దరికి గాయాలు
గజపతినగరం: మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, బొలెరో వాహనాలు అదుపుతప్పి సోమవారం ఢీకొన్నాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న కారు ఎరువుల లోడుతో ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎం.సూర్యనారా యణ రాజు(44),కె.ప్రకాష్ రావు(48)లకు స్పల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు గజపతినగరం ప్రభుత్వ కేంద్రాస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనలో వాహనాలకు డ్యామేజ్ తప్ప ప్రాణాపాయం లేదని స్థానికులు తెలిపారు. -
దర్శకుడు ఆదిత్యకు ఇండోనేషియా పురస్కారం
వేపాడ: గత 30 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన మండలంలోని కుమ్మపల్లి గ్రామానికి చెందిన డా.పి.సి.ఆదిత్య(దర్శకుడు)ను 2026 ఇండోనేషియా 2026 ఎక్స్లెంట్ అవార్డు వరించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన గ్రీన్ ఇండియా పరివార్తో కలిసి పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఇండోనేషియా కు చెందిన ఎన్జీఐపీఫౌండేషన్ డైరెక్టర్ పీసీ ఆదిత్యసేవలను గుర్తించి అవార్డు అందజేయడం అభినందనీయమని ఇండియా ప్రతినిధి నీరజ్ గుప్తా అభినందించినట్లు ఆదిత్య తెలిపారు. మనదేశానికి మిత్రదేశమైన ఇండోనేషియా నుంచి అంతర్జాతీయఅవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
ఏడీఏపై వీఏఏల ఫిర్యాదు
దత్తిరాజేరు: గజపతినగరం వ్యవసాయ శాఖ సహయ సంచాలకురాలి (ఏడీఏ)పై కొద్ది రోజుల క్రితం వీఏఏలు ఆంద్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. గజపతినగరం నియోజకవర్గంలోని గజపతినగరం దత్తిరాజేరు, బొండపల్లి, సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో రైతు సేవా కేంద్రాలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఇక్కడికి ఆమె వచ్చినప్పటి నుంచి సిబ్బంది పర్సనాలిటీ, జీవనశైలి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు, ఆమె కుమార్తె పాకెట్ మనీ అంత తమ జీతం ఉండదని, ఆమె ప్లైట్ టిక్కెట్ ఖరీదు మాజీతాలు చేయవని, ఆమె కాళ్లకు వేసుకున్న చెప్పుల పాటి విలువ మా జీతాలు ఉండవని చాలా హీనంగా.అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, ఫిర్యాదులో పేర్కొన్నారు. మాతో నిర్వహించిన మీటింగ్లకు ఆమె భర్త హాజరై లేనిపోని మాటలు ఆడుతున్నారని ఆమె భర్తతో కాలం చెల్లిన మందులు అమ్మించి రైతులను మోసం చేస్తున్నారని రైతు సేవా కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందిపై లేని పోని అభాండాలు వేసి అక్రమ సంబంధాలు కూడా అంటగడుతున్నారని ఫిర్యాదు చేశారు. గత ఖరీఫ్(2025)మందులకు 2026 జూన్లో తయారైనట్లు స్టిక్కర్లు తగించి మందులు అమ్ముతున్నారని సహకరించక పోతే లేనిపోని మాటలు అడుతున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో ఇలా జరగడం వల్ల ఈవిషయంపై గతంలో అధికారులు విచారణ చేపట్టినా తూతూమంత్రంగానే చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జనగణనతోనే ప్రగతి : జేసీ
పార్వతీపురం రూరల్: రాబోయే దేశ వ్యాప్త జనగణన ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు పార్వతీపురంలో నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పరుగును ప్రారంభించి, స్వయంగా పాల్గొని సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ పరుగు పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగుతూ కలెక్టరేట్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జనగణన కేవలం అంకెల సేకరణ మాత్రమే కాదని, అది దేశ సౌధానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. పౌరులు అందించే కచ్చితమైన సమాచారం ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందుతాయని వివరించారు. ప్రతి ఇంటికీ గణన ప్రాముఖ్యతను చేరవేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. పౌరులంతా బాధ్యతాయుతంగా గణన అధికారులకు సరైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ డి.పావని, డీఈఓ పి.బ్రహ్మజీరావు, వివిధ శాఖల అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న దొంగలు..!
నెల్లిమర్ల రూరల్: మండలంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయాలు, ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల రామతీర్థం పంచాయతీ దేవుని నెలివాడలో ఉన్న అమ్మవారి ఆలయంలో తాళాలు విరగ్గొట్టి హుండీలోని డబ్బులతో పాటు అమ్మవారి బంగారు ఆభరణాలను ఎత్తుకువెళ్లారు. ఆ ఘటన మరువక ముందే శనివారం అర్ధరాత్రి గొర్లిపేట జగనన్న కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని దొంగిలించుకుపోయారు. గతంలో కూడా నెల్లిమర్ల–రణస్థలం రహదారిలో బైక్ చోరీలు ఎన్నో జరిగాయి. రాత్రి వేళ రహదారి మొత్తం నిర్మానుష్యంగా ఉండడం..జాతీయ రహదారికి అత్యంత దగ్గరగా ఉండడంతో ఈ రహదారిని చోరీలకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో నిఘా పెంచాలని కోరుతున్నారు. -
కాదంటే కారాగారమే..?
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా – ఒడిశా సరిహద్దు కొటియా గ్రూపు గ్రామాల్లో గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వంలో రక్షణ కరువైంది. ఇటీవల చేపట్టిన జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొటియా గ్రామాల్లోని ఇద్దరి గిరిజనుల అరెస్టుకు కారణమైంది. కొటియా గ్రామాల గిరిజనులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొటియా గ్రూపు గ్రామాల్లో ఒకటైన ఎగువశెంబి గ్రామంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఒడిశా అధికారులు పర్యటించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని వారికి సూచించారు. దీనికి గిరిజనులు స్పందిస్తూ తాము ఆంధ్రాలో ఉంటామని, ఇక్కడే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటామని గ్రామానికి చెందిన తాడంగి పిళ్లు, తాడంగి చిరంజీవి తదితరులు చెప్పారు. దీనికి గ్రామస్తులంతా ఒక్కటై ఒడిశా చేపడుతున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ను తిరస్కరించడంతో అధికారులు వెనుదిరిగారు. సంబంధిత అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలతో ఒడిశాలోని కొటియా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒడిశా పోలీసులు శనివారం సాయంత్రం పిళ్లు, చిరంజీవిని తోణాం సమీపంలో అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కొరాపుట్ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో బాధిత కుటుంబాలు, గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆంధ్రాలో ఉంటామని చెప్పడమే చేసిన నేరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలు గిరిజన సంఘాలు, సీపీఎం తదితర ప్రజా సంఘాల నాయకులు గిరిజనుల అక్రమ అరెస్టులను ఖండించారు. చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. స్పందించిన జేసీ గిరిజనుల అరెస్టు విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ యశ్వంత్కుమార్రెడ్డి స్పందించారు. జేసీ ఆదేశాలతో తహసీల్దార్ సురేష్ ఎగువశెంబి గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబాలతో, స్థానికులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో... కొటియాలో గిరిజనులకు రక్షణ కరువు ఇద్దరు గిరిజనులను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు జనగణనను కాదన్నందుకే... చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం -
రైతు కంటకన్నీరు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిధి నందివానివలస గ్రామంలో ఆదివారం ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేసింది. మజ్జి సింహాచలం అరటి తోటపై దాడి చేయడంతోసుమారు రూ.50 వేల నష్టం వాటిల్లింది. చౌడాడ శ్రీను భూముల్లో పైపులు, బెండులు పాడవడంతో నీరు వృథా అయింది. గోళ్ల అన్నపూర్ణ అరటి తోట కూడా దెబ్బతింది. పంట కోత సమయంలో ఇలాంటి నష్టాలతో ఆర్థికంగా కుంగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏనుగులను తరలించి, నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. -
శ్యామలాంబకు పాలస్నానం రేపు
చీపురుపల్లి: గరివిడి మండలంలోని అర్తమూరు గ్రామంలో వెలసిన గ్రామదేవత శ్యామలాంబకు ఏటా నిర్వహించే పాలస్నానం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మమారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పాలస్నానం చేయనున్నారు. పాలస్నానం సందర్భంగా రాత్రి సాంస్కృతిక కార్యమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అభివృద్ధి ధర్మకర్త(ఆశాది) పొన్నాడ సూర్యనారాయణ, గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రావెల్ తరలిస్తున్న లారీ, జేసీబీ అడ్డగింతబొండపల్లి: మండలంలోని కనిమెరక గ్రామ పంచాయతీ పరిధిలో గల మంగలి చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న జేసీబీతో పాటు, లారీని పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావు తెలిపారు. వాల్టా చట్టం నిబంధనలు ఉల్లఘించి గ్రావెల్ను చెరువు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు రూ.15 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. అక్రమంగా గ్రావెల్ను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ హరిప్రసాద్ వీఆర్ఓలు పాల్గొన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో ప్రవేశాల ప్రారంభంచీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడిలో గల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో చెవిటి,మూగ,దృష్టి లోపం ఉన్న చిన్నారులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని వెల్ఫేర్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ జీవీఎన్.రామకృష్ణ తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి,ఉచిత భోజనం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు ఫోన్ 9494777905 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఆకస్మికంగా ఉపాధ్యాయుడి మృతివేపాడ: మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కాపు సత్యనారాయణ (40) ఆదివారం ఆకస్మికంగా మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్దానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో జరిగిన ఫంక్షన్లో పాల్గొన్న ఆయనకు ఆకస్మికంగా ఆరోగ్యం బాగోకపోవడంతో ఎస్కోటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కాపు సత్యనారాయణ ప్రస్తుతం మెంటాడ మండలం బిరసాడవలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య జయ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతిపట్ల వేపాడ మండల ఉపాధ్యాయులు దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆటోను ఢీకొట్టిన కారు: 13 మందికి గాయాలు
పూసపాటిరేగ: భోగాపురం మండలం నారుపేట వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం నెమ్మదిగా వెళ్తున్న లగేజీ ఆటోను వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో 13 మందికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదే దిశగా ప్రయాణికులతో వెళ్తున్న లగేజీ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన వ్యక్తులను సుందరపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న డి.దేవి, కె.సావిత్రి, డి.నాగమణి, డి. లావణ్య, డి.లక్ష్మీదేవి, డి.నిహారిక, డి.మీనాక్షి, డి.రోహిణి, డి. శశాంక్కు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు అవడంతో సంఘటనా స్థలం నుంచి విజయనగరంలోని ఓ పైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులు రాజాం మండలం శ్యాంపురం గ్రామస్తులు కాగా వారు జీవనోపాధి నిమిత్తం విశాఖ సుజాత నగర్లో నివాసం ఉంటున్నారు, శ్రీకాకుళం సమీపంలో రాజులమ్మ ఆమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో సుజాతనగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కారులో ప్రయాణిస్తున్న రణస్థలం మండలం జీరుపాలెంకు చెందిన డి. సుశీల, డి.రాముడుకు గాయాలయ్యాయి. వారికి సుందరపేట ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ మేరకు భోగాపురం సీఐ కె. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమం -
యువకుడిపై పొక్సో కేసు నమోదు
విజయనగరం క్రైమ్ : విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సీఐ నరసింహమూర్తి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లూరు చెందిన 19 ఏళ్ల యువకుడు, 15 ఏళ్ల బాలిక ఏడాదిగా ప్రేమించు కుంటున్నారు.బాలికతో తరచూ మాట్లాడడం కోసం యువకుడు బాలికకు సెల్ఫోన్ కూడా కొని ఇచ్చాడు. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని షికార్లు తిరిగారు. రెండు రోజుల క్రితం వీటీ అగ్రహారంలో ఉంటున్న బాలికకు వాంతులు కావడంతో తల్లికి చెప్పింది. ఆపై భరించలేనంత కడుపు నొప్పి రావడంతో పరీక్ష చేయగా గర్భిణిగా తేలింది. వెంటనే కన్న వారు స్థానిక ఘోషా ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్కు బాలిక తల్లి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ రాఘవులు స్థానిక ఘోషా హాస్పిటల్కు వెళ్లి బాలిక నుంచి వివరాలు తెలుసుకుని చెల్లూరు కు చెందిన కేశవ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దర్యాప్తులో బాలిక పై చేసిన ఘోరం రుజువు కావడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కామేశ్వరరావుకు లాస్యప్రియ ఉగాది ప్రతిభా పురస్కారంవిజయనగరం టౌన్: ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకుడు, ధర్మాస్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు పీఎస్వీ.కామేశ్వరరావుకు ఇండియన్ కల్చరల్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో లాస్యప్రియ ఉగాది ప్రతిభా ఆచార్య పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాస్యప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వ్యవస్థాపకుడు మేడిది నాగేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన కూచిపూడి సంస్థల ప్రతినిధులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. -
డా. నీలిమకు ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’
విజయనగరం అర్బన్: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నిర్వహించిన అంతర్జాతీయ వీడియో పోటీలో విశాఖపట్నానికి చెందిన డా. నీలిమ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ను అందుకున్నారు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా స్థానిక సీతం కళాశాలలో ఆదివారం ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు. ‘ఐపీ అండ్ స్పోర్ట్స్’ అనే థీమ్పై డా. నీలిమ రూపొందించిన ‘కలరిపయట్టు’ వీడియో విశేష ప్రజాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల నుంచి వచ్చిన 182 వీడియోల్లో ఆమె వీడియో టాప్–20లో స్థానం సంపాదించడం విశేషం. భారతదేశం నుంచి ఎంపికై న ఏకై క ప్రతినిధిగా ఆమె నిలిచారు. ఏప్రిల్ 6 నుంచి 19 వరకు నిర్వహించిన ఆన్లైన్ ఓటింగ్లో అత్యధిక మద్దతు సాధించి డా.నీలిమ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సత్య విద్యా సంస్థల సెక్రటరీ–కరెస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, డా. నీలిమ సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు పాల్గొన్నారు. అభినందించిన మాజీ ఎంపీ డా. బొత్స ఝాన్సీ -
నిరుద్యోగులతో బంతాట..!
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విజయనగరం ఫోర్ట్: టీడీపీ సర్కార్ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మాదారి అడ్డదారి అన్న విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను సైతం తుంగలో తొక్కే విధంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరు చూసి నిరుద్యోగ అభ్యర్థులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల పోస్టుల విషయంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుందని వైద్య ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. నియామక ఆదేశాలిచ్చి... ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు కేడర్ పోస్టులకు 2024 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు – 09, ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టు – 01, ఆఫీస్ సబార్డినేట్ పోస్టు – 01, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టు – 01కి నోటిఫికేషన్ ఇచ్చారు. 16 నెలల తర్వాత కొద్ది రోజులు క్రితం పోస్టుల భర్తీ పక్రియ చేపట్టారు. వీరందరికి కొద్ది రోజులు క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. వారం రోజుల్లో విధుల్లో చేరాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఎంపికై న అభ్యర్థులు ఆర్డర్స్ పట్టుకుని ఉద్యోగాల్లో చేరేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లారు. తీరా అక్కడ అధికారులు ఇప్పుడు మిమ్మల్ని విధుల్లోకి తీసుకోం... మళ్లీ ఎప్పుడు చేరాలనేది తామే చెబుతామని చెప్పి వెనక్కి పంపినట్టు తెలిసింది. దీంతో ఎంపికై న అభ్యర్థులు చేసేదిలేక నిరాశతో వెనుదిరిగారు. అసలు తమ నియామక విషయంలో ఏం జరుగుతుందని వారు మదనపడుతున్నారు. నియామక ఆదేశాలిచ్చిన తరువాత ఈ నిర్లక్ష్యమేమిటని వారు వాపోతున్నారు. అభ్యర్థుల్లో ఆందోళన పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 7వ తేదీలోగా విధుల్లో చేరాలని వైద్య కళాశాల అధికారులు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్నారు. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ గడువు 7వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాలు తమకు వస్తాయా? లేక టీడీపీ సర్కార్ మార్చేస్తుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డర్స్ ఇచ్చేది మేమే కదా తేదీలు మార్చి మళ్లీ ఆర్డర్స్ ఇవ్వవచ్చని చావు కబురు చల్లగా వైద్య కళాశాల అధికారులు చెబుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎప్పుడు ఇలా లేదు.. పోస్టుల భర్తీ విషయంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన ఒకటి రెండు నెలల్లో భర్తీ చేసి విధుల్లోకి తీసుకుంటారు. కానీ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పోస్టుల భర్తీ ప్రక్రియ విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును సర్వత్రా తప్పుబడుతున్నారు. ఇదేమి విడ్డూరమని ప్రశ్నిస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, జీడీఏ, ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన మాట వాస్తవమే. వారిని విధుల్లోకి తీసుకోలేదు. క్లారిఫికేషన్ కోసం డీఎంఈకి లెటర్ రాశాం. అక్కడ నుంచి క్లారిఫికేషన్ రాగానే విధుల్లోకి తీసుకుంటాం. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన వారినే విధుల్లోకి తీసుకుంటాం. – డాక్టర్ దేవీమాధవి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల -
నిండుకున్న మందులు
విజయనగరం ఫోర్ట్: మెరకముడిదాం మండలానికి చెందిన ఓ ఫైలేరియా రోగి విజయనగరంలోని ఫైలేరియా యూనిట్కు వెళ్లి వ్యాధి నివారణకు ఉపయోగించే డీఈసీ మాత్రలు అడగ్గా మందులు లేవనిచెప్పి పంపించేశారు.● గంట్యాడ మండలానికి చెందిన ఓరోగి కూడా విజయనగరంలో ఉన్న ఫైలేరియా యూనిట్కు డీఈసీ మాత్రల కోసం వెళ్లగా అక్కడి సిబ్బంది మందులు లేవని చెప్పి పంపించేశారు. ఇలా వీరిద్దరే ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న అనేక మంది రోగులకు ఎదురువుతున్న పరిస్థితి ఇది. ఫైలేరియా (బోద) వ్యాధి నివారణలో డీఈసీ మాత్రలు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. దీంతో వ్యాధిగ్రస్తులు ఈ మాత్రలు వేసుకోవడానికి అసక్తి చూపుతారు. వేలాది మంది బోదవ్యాధిగ్రస్తులు జిల్లాలో ఉన్నారు. బోధవ్యాధిగ్రస్తుల పట్ల సమాజంలో వివక్ష ఉంది. బోధవ్యాధి సోకినవారిలో చాలా మంది అవివాహితులుగా ఉండిపోతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే రోగులు మరింత ఇబ్బంది పడతారు. ఈ వ్యాధిగ్రస్తులకు చిన్న రాయి గుచ్చుకున్నా పెద్దపెద్ద గాయాలై పోతాయి. అంతేకాకుండా సెల్యూలైటిస్ వ్యాధి త్వరగా వీరికి సోకుతుంది. దీంతో వారు మందులు వాడుతూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో 3,238 మంది రోగులు జిల్లాలో 3,238 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గుర్ల, బలిజిపేట మండలాల్లో ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధిసోకడం వల్ల వారంతా నిత్యం ఇబ్బంది పడుతూ ఉంటారు. మందుల సరఫరా నిలిపివేసిన సర్కార్ ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అందించే డీఈసీ మాత్రల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్నవారికి డీఈసీ మాత్రలు అందడం లేదు. మందులు అవసరమైన రోగులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఉచితంగా అందాల్సిన మందులకు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైలేరియా రోగులు జ్వరం, కాలువాపు, ఇన్ఫెక్షన్స్కు గురవుతారు. అటువంటప్పుడు డీఈసీ మాత్రలు వాడితే అవి తగ్గుతాయి. క్యూలెక్స్ దోమ కుట్టడంతో వ్యాధి వ్యాప్తి క్యూలెక్స్ అనే దోమ కుట్టడం వల్ల బోద వ్యాధి వ్యాప్తి చెందుతుంది. బోధవ్యాధి అంతత్వరగా బయట పడదు. వ్యాధి బయట పడడానికి 10, 15 ఏళ్లు పడుతుంది. కొద్దిపాటి జ్వరానికి తరచూ గురవుతారు. చంకల్లో, గజ్జల్లో బిళ్ల కట్టడం, కాళ్లు చేతులపై ఎర్రని చారలు కనబడతాయి. కొంత కాలం తార్వాత కాళ్లు, చేతులు, వృషణాలు , ఇతర జన నేంద్రియములకు సంబంధించిన వాపులు కూడా బోద వ్యాధి లక్షణాలే. బోధ వ్యాధిసోకిన వ్యక్తికి 21 రోజుల పాటు తొలుత చికిత్స అందిస్తారు. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి 12 రోజుల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఫైలేరియాకు మందుల సరఫరా నిలిపివేసిన ప్రభుత్వం జిల్లాలో 3,238 మంది వరకు ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ప్రైవేటుగా మందులు కొనుగోలు చేస్తున్న రోగులుకొత్త కేసులకు మాత్రమే ! ప్రస్తుతం వ్యాధిబారిన వారికి మందుల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. సంబంధిత పీహెచ్సీలకు వెళితే వారికి డీఈసీ మాత్రలు ఇస్తారు. కొత్తగా నమోదైన కేసులకు మాత్రమే మందులు ఇస్తున్నాం. ఎం.సింహాచలం, జిల్లా మలేరియా నివారణ అధికారి -
నిద్రిస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
కురుపాం/గుమ్మలక్ష్మీపురం: నిద్రలో ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. గుమ్మలక్ష్మీపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానిక సంత వీధిలో శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఓ ఇంటి వరండాలో మహిళ నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కుని పరారయ్యారు. బాధితురాలు తేరుకుని కేకలు వేసేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నేరస్థలం వద్ద లభించిన ఆధారాల ప్రకారం ఒక అనుమానిత వ్యక్తి ఛాయాచిత్రాన్ని సేకరించారు. చిత్రంలో ఉన్న వ్యక్తి వివరాలు గానీ, ఈ నేరానికి సంబంధించిన సమాచారం గానీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించదలచిన వారు ఎల్విన్ పేట సర్కిల్ ఇన్న్స్పెక్టర్ 92487 01917, ఎల్విన్ పేట సబ్ ఇన్స్పెక్టర్ 7981296171 లేదా నీలకంఠాపురం సబ్ ఇన్న్స్పెక్టర్ 6281897578 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందజేయనున్నామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు యంత్రాంగం వెల్లడించింది. -
నేడు పీజీఆర్ఎస్
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్లో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు 1100 నంబరుకు నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం సోమవా రం సాయంత్రం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ కె.శిరీష ఆదివారం తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో కొలువుదీరిన పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. అనంతరం మేళతాళాలు, భాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలతో అమ్మవారిని వనంగుడి నుంచి గాడీఖానా, కన్యకపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటి వద్దనున్న చదురువద్దకు తీసుకువెళ్తారన్నారు. అక్కడ ఘటాలకు పూజలు, ఊరేగింపు అనంత రం మంగళవారం వేకువజాము నుంచి అమ్మవారు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మళ్లీ పైడితల్లి అమ్మవారు జాతర చివరి ఘట్టమైన ఉయ్యాలకంబాల మహోత్స వం తర్వాత అమ్మవారిని వనంగుడికి తీసుకువస్తామన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. విజయనగరం టౌన్: విజయభావన సాహిత్య సదస్సులో భాగంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం శ్రీభాష్యం హరిచంద న్ రచించిన ‘శబలత’ గ్రంథావిష్కరణను సాహితీ విజయసారథి డాక్టర్ ఎ.గోపాలరావు ఆదివారం ఆవిష్కరించారు. ప్రముఖ కవి మానాపురం రాజాచంద్రశేఖర్ సమీక్షించారు. సమ్మానకర్తగా కొంకెపూడి అనూరాధ వ్యవహ రించారు. ఈ సందర్భంగా చిరకాలం సేవలందించిన తూట బాబాజీని సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. భావుకత సామాజిక వాస్తవికత ముప్పేట అల్లికగా గ్రాంథిక వ్యవహార భాషలలో సాగిన చిక్కని కవిత్వం ఈ శబలత అన్నారు. గ్రంథ రచయిత డాక్టర్ హరిచందన్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న వివి ధ అంశాలపై స్పందనగా వచ్చిన కవిత్వమన్నా రు. డాక్టర్ భైరవభట్ల విజయాదిత్య ఆహ్వానం పలకగా, పార్ధన, పద్యపఠనం చేశారు. కార్యక్రమంలో దశగ్రంథాల సుబ్రహ్మణ్యం, సోమే శ్వరరావు, బాబూజీ, హరిప్రియ, ఆముక్తమా ల్యద, చీకటి దివాకర్, మానాప్రగడ సాహితీ, తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి: పట్టణం పండగ సందడిలో మునిగి తేలుతోంది. దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల తొలేళ్ల ఉత్సవాల ముందు రోజు జరుపుకునే దేశమ్మతల్లి వారోత్సవాలు సందడిగా సాగా యి. పాత బొబ్బిలి సరేపోలమ్మ ఆలయ ధర్మకర్త చోడిగంజి రమేష్నాయుడు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ప్రభల ఊరేగింపు క్రతువు సరేపోలమ్మ ఉత్సవాల్లో ఏటా ఆనవాయితీగా వస్తోంది. అలాగే దిమిలి పొడుగు మనుషుల విచిత్ర వేషధారణలూ ఆకట్టుకున్నాయి. మరో పక్క దేశమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులను ఆశీర్వదించడానికా అన్నట్టు శివపార్వతులు, ఇతర దేవతామూర్తు లు, రుషుల అలంకరణలతో ప్రదర్శనలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి నెట్టాయి. జంట సిరిమానులు తిలకించేందుకు ఇతర భక్తులు ఆయా బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. -
ఏపీటీఎఫ్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) విజయనగరం జిల్లా కౌన్సిల్ సమావేశం స్థానిక రింగ్ రోడ్డులోని పీఎస్ఆర్ స్కూల్లో ఆదివారం జరిగింది. తొలుత జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా ఆర్.కష్ణ, అధ్యక్షుడిగా ఎన్.వి. పైడిరాజు, ప్రధాన కార్యదర్శిగా గంట సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏవీ శ్రీనివాసరావు, సీహెచ్. రామారావు, బి.శరత్కుమార్, గుమ్మడి శ్రీనివాసరావు, కార్యదర్శులుగా పి.దామోదర్ నాయుడు, కేవీ రమణ, కె.శ్రీనివాసులు, ఎన్. సూర్యనారాయణ, పి.రమేష్ నాయుడు, జి.వెంకటరమణ, ఎన్. చిన్నాదేవి, కె. త్రినాథరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎ. సదాశివరావు, డి.ఈశ్వరరావు, వై.సత్యం, ఎం.బలరాం నాయుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.బలరాం నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజుల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలపై పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు డి. ఈశ్వరరావు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఐటీడీఏలో ఏం జరుగుతోంది?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏలో ఏం జరుగుతోంది? ఎవరికి వారు పై చేయి సాధించడానికి.. పంతాలకు పోయి, పరిపాలనను గాలికి వదిలేశారన్న విమర్శలు గిరిజన సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్చార్జి పీవోగా ఉన్న యశ్వంత్ కుమార్ రెడ్డి.. ఇంకా ఆ పోస్టు నుంచి రిలీవ్ కాలేదు. కొన్ని ఫైళ్లు, బిల్లులు క్లియర్ చేసేందుకే ఆయన బాధ్యతలు అట్టిపెట్టుకుని ఉన్నట్టు సమాచారం. ఇక్కడి పీవోగా నియమితులైన సబ్ కలెక్టర్ వైశాలి.. బాధ్యతలు స్వీకరించలేదు. ఆమె ఇక్కడే కూతవేటు దూరంలోని కార్యాలయంలో ఉన్నా బాధ్యతలు స్వీకరించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చి వారం గడుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను కూడా లెక్క చేయలేని పరిస్థితి ఇక్కడ ఉంది. వాస్తవంగా వైశాలికి పీవోగా ఉద్యో గోన్నతి కల్పించారు. నిర్ణీత కాలంలో బాధ్యతలు స్వీకరించకపోతే శాఖాపరంగా ఇబ్బందులు ఎదుర య్యే అవకాశం ఉందని అధికారిక సమాచారం. ● మరోవైపు ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా.. గిరిజన సంక్షేమ శాఖ డీడీగా ఉన్న విజయశాంతిని ఒంటరిని చేసే ప్రక్రియ సాగుతోందని ఆ విభాగ సిబ్బంది అంటున్నారు. మొదటి నుంచి ఆమె పట్ల అయిష్టంగా ఉన్న కొంతమంది.. నిర్ణయాల్లో ‘అధికారం’ ఇవ్వడం లేదని.. డీడీకి సంబంధం లేకుండానే.. ఈ శాఖపై పరిజ్ఞానం లేని కొంతమంది ఉద్యోగులను కొద్దిరోజుల కిందట ఆకస్మాత్తుగా ఇక్కడికి బదిలీ చేశారని ప్రచారం నడుస్తోంది. కొన్ని నిర్ణయాల్లో కీలకంగా, అప్రమత్తంగా ఉండాల్సిన గిరిజన సంక్షేమ విభాగంలో అటువంటి వారిని విధుల్లోకి తీసుకోవడానికి డీడీ అయిష్టత చూపుతున్నారు. ఈ నెపంతో డీడీకి మెమో, చార్జిమోమోను ఇన్చార్జి పీవో యశ్వంత్కుమార్ రెడ్డి జారీచేశారు. ఈ ప్రచ్ఛన్నయుద్ధం నేపథ్యంలో డీడీని సరెండర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ● మొత్తంగా ఏటీడబ్ల్యూఓలు, మరో విభాగ అధికారి సంబంధం లేని విషయాల్లో తలదూర్చి కార్యాలయాల్లో రాజకీయాలకు కారణమవుతున్నారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ● తప్పు చేసిన వార్డెన్లకు రాజకీయ ఒత్తిళ్లతో తిరిగి పోస్టింగ్లు ఇస్తున్నారు. నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలోనే అశ్లీల నృత్యాలు చేయించి.. సస్పెండ్ అయిన వార్డెన్ను రెండు నెలల్లోనే రీవోక్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే బంధువు కావడమే కారణమని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. వారమైనా రిలీవ్ కాని పీవో బాధ్యతలు స్వీకరించని సబ్కలెక్టర్ వైశాలి తప్పుచేసిన వార్డెన్పై కఠిన చర్యలేవీ? డీడీని సరెండర్ చేసే యోచనలో ఇన్చార్జి పీవో? -
మలేరియా రహిత సమాజమే లక్ష్యం
పార్వతీపురం రూరల్ : మలేరియా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా ఆరోగ్య కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి వారం డ్రై–డే పాటించాలని సూచించారు. దోమ తెరలు వాడటం, లార్వా వృద్ధిని అరికట్టడం ద్వారానే వ్యాధిని నియంత్రించగలమన్నారు. మా ఊరికి మలేరియా వచ్చింది కార్యక్రమంతో శాఖల మధ్య సమన్వయం పెరిగిందని, ఇది మలేరియా నివారణకు తోడ్పడుతోందని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో జ్వర సర్వే నిర్వహించి బాధితులను త్వరగా గుర్తించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ, వైద్యులు విజయమోహన్, జగన్మోహనరావు, సూర్యకౌశిక్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
తప్పిన ప్రమాదం
● గ్యాస్ బండ పైపు నుంచి చెలరేగిన మంటలు లక్కవరపుకోట : మండలంలోని బీసీ కాలనీలో ఒక ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకొని వీధిలోకి పరుగులు తీసింది. ఏం జరుగుంతుందో తెలియకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బీసీ కాలనీలో పొలమరశెట్టి వెంకటరావు భార్య శనివారం మధ్యాహ్నం వంట చేస్తుండగా గ్యాస్ పైపు నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి బయటకు పరుగులు తీసి ఇరుగు పొరుగు వారికి చెప్పింది. దీంతో స్థానికులు ఇంటిలోకి వచ్చి చూడగా మంటలు రేగి వంటింట్లో గల సామాన్లు కాలిపోయాయి. మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. స్థానిక యువత పోలీసులకు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
పనితీరు ఆధారంగా గౌరవ వేతనం
విజయనగరం ఫోర్ట్: పనితీరు ఆధారంగా గ్రామ సంఘం అసిస్టెంట్ల గౌరవ వేతనాలను ప్రతీ నెల సమయానికి జనరేట్ చేయాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఎంఎస్ అకౌంట్స్, కంప్యూటర్ ఆపరేటర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 31 నాటికి మండల సమాఖ్యలలో ఉన్న బ్యాంకు ఖాతాలు, బ్యాంకు బ్యాలెన్స్లు కన్ఫర్మేషన్ ఆన్లైన్ పూర్తి చేయాలన్నారు. రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు. ఇంటర్నల్ ఆడిట్లో గమనించిన అంశాలను, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలన్నారు. గ్రామ సంఘాల, మండల సమాఖ్యలు నిధుల స్థితిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంస్థాగత నిర్మాణం వెబ్సైట్లో అప్డేట్ చేయాలన్నారు. మండల సమాఖ్య నిర్వాహణ ఖర్చులు మొత్తం ఆదాయానికి 30 శాతంకు లోపే ఉండేలా వ్యయ నియంత్రణ చేయాలన్నారు. గ్రామ సంఘాల్లో ఉన్న సొంత నిధుల స్థితిని తెలుసుకుని అంతర్గత అప్పులు ఇవ్వడం, తిరిగి రికవరీకి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు సంచాలకులు కె.సావిత్రి, డీపీఎంలు ఎ.చిరంజీవి, సీతారామయ్య, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి -
మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
గుమ్మలక్ష్మీపురం: ఇంటి బయట నిద్రిస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు, తాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పారిపోయిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతవీధికి చెందిన సుజాత ఉక్కపోత కారణంగా ఇంటి బయట నిద్రించింది. శనివారం వేకువజామున 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సుజాత మెడలోని బంగారు గొలుసు లాక్కొని, మళ్లీ మెడలోని బంగారు తాడును కూడా లాక్కొనేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చి ప్రతిఘటించింది. బంగారు తాడు తెగిపోవడంతో సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు. సుజాత తేరుకుని చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. గుర్తు తెలియని వ్యక్తి కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె ఎల్విన్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ బి.హరి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అపహరణకు గురైన ఆభరణాలు సుమారు మూడు తులాల వరకు ఉంటుందని తెలిపింది. -
గూడ్స్ రైలులో మంటలు
బొండపల్లి: బొగ్గుతో రవాణా అవుతున్న గూడ్సు రైలులో మంటలు వ్యాపించిన సంఘటన మండలంలోని గరుడుబిల్లి రైల్వేస్టేషన్ వద్ద చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు.. రాయగడ నుంచి విశాఖపట్నం బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో ఒక భోగిలో మంటలు శుక్రవారం అర్ధరాత్రి రావడంతో స్టేషన్మాస్టర్ కిషోర్కుమార్ గమనించి స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు. ఈ విషయాన్ని గజపతినగరం అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వాహనంతో వచ్చి అగ్ని మాపక అధికారి రవి ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేయడంతో మిగతా భోగీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. తర్వాత రైలును యాధావిధిగా విశాఖపట్నం తరలించారు. -
మే 1నుంచి జనగణన : కలెక్టర్
● స్వీయ గణనకు ఈ నెల 30 వరకు అవకాశం పార్వతీపురం: జిల్లాలోని 15 మండలాలు, మూడు మున్సిపాల్టీల్లో మే 1వ తేదీ నుంచి జనగణన ప్రారంభమవుతుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,744మంది ఎన్యూమరేటర్లు, 302 మంది సూపర్వైజర్లను నియమించామన్నారు. ఇందులో భాగంగా స్వీయ గణనను ఏప్రిల్ 16నుంచి 30 తేదీ వరకు ప్రతీ ఒక్కరు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ఎస్ఈ.సెన్సెస్.జీఓవీ.ఇన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. దేశ జనగణన చరిత్రలో తొలిసారిగా స్వీయగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్)కు అవకాశం కల్పించారన్నారు. ఈ అవకా శాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేత్ర వైద్య సేవలపై నిశిత పర్యవేక్షణ పార్వతీపురం రూరల్: జిల్లాలో నేత్ర వైద్య సేవల తీరుతెన్నులపై జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అంధత్వ నివారణ సంయుక్త సంచాలకులు డాక్టర్ సునీల్కుమార్ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా అధికారి డాక్టర్ సూర్యకౌశిక్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో సేవలందిస్తున్న స్వచ్ఛంద కంటి ఆస్పత్రుల ప్రతినిధులతో వైద్య శిబిరాల నిర్వహణ, శస్త్రచికిత్సల నాణ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా నేత్ర వైద్య అధికారి జీరు నగేష్రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమ పోర్టల్లో నెలవారీ నివేదికలు, ఫాలో–అప్ వివరాలను ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయాలని సూచించారు. కేటరాక్ట్ శస్త్రచికిత్సల నమోదులో పాటించాల్సిన మెలకువలను వివరించారు. సేవలలో పారదర్శకత, నమోదులో కచ్చితత్వం ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో పుష్పగిరి, శంకర్ ఫౌండేషన్, జెమ్స్, మిమ్స్, అనిల్ నీరుకొండ ఆస్పత్రుల ప్రతినిధులు, జిల్లా ఆస్పత్రి వైద్యులు కృష్ణారావు పాల్గొన్నారు. రీ సర్వేను వేగవంతం చేయాలి పార్వతీపురం: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో వీఆర్వోలు, మండల, గ్రామ సర్వేయర్లతో రీసర్వే పురోగతిపై శనివారం సమీక్షించారు. దశలవారీగా సర్వే నిర్వహిస్తూ ఈకేవైసీని తప్పనిసరి చేయాలన్నారు. డ్రాప్ట్ దశకు ముందే అవసరమైన సవరణలు పూర్తిచేయాలని సూచించారు. 95 శాతం ఈకేవైసీ లక్ష్యం సాధించాలన్నారు. ప్రతి వీఆర్వో రోజుకు కనీసం 50 ఖాతాలు పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్ వెర్ఫికేషన్లో ఫొటోలు అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా సేకరించాలని తెలిపారు. జిరాయితీ ఖాతాల ఆమోదాన్ని ఆర్డీఓ స్థాయికి అప్పగించడంతో ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మరణించిన వారి ఖాతాలను వారసులకు బదిలీ విషయంలో స్పష్టతతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. మలేరియా రోగులు సత్వర చికిత్స తీసుకోవాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: మలేరియా వ్యాధి సోకిన వారు సకాలంలో చికిత్సతీసుకోవాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి అన్నారు. విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. దోమల నియంత్రణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరలక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మలేరియా నిర్మూలనకోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. జిల్లా మలేరియా అధికారి సింహాచలం, డీఎల్ఓ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పనులు అడ్డుకుంటే అరెస్టు చేయండి
● మంత్రి సంధ్యారాణి మక్కువ: మక్కువ ప్రధాన రహదారి విస్తరణ పనులకు ఆటంకం కలిగించిన వారిని అరెస్టు చేయాలని మంత్రి సంధ్యారాణి పోలీసులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాదర్బార్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మక్కువ ప్రధాన రహదారి విస్తరణ పనులను ఎవరు అడ్డుకున్నా... రోడ్డు విస్తరణ పనులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినా అరెస్డు చేయాలని సాలూరు సీఐ రామకృష్ణను ఆదేశించారు. రహదారిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయాలన్నారు. సొంత పార్టీ నుంచే ఫిర్యాదులు ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆ పార్టీ నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మక్కువ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులే ఎక్కువ మంది కనిపించారు. వీరిలో చాలా మంది రోడ్లు, భూ సమస్యలపై, పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. మంత్రి మాటలకు ఉపాధి వేతనదారులు షాక్ ఉచిత బస్సులో ఉపాధి వేతనదారులు పని ప్రదేశం నుంచి ఆర్టీసీ బస్సులో శనివారం మక్కువ ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి వేతనదారులతో మాట్లాడుతుండగా ఉపాధి బిల్లులు అందడం లేదని వేతనదారులు సమస్యని తీసుకువచ్చారు. దీంతో మంత్రి మాట్లాడుతూ ఉపాధి బకాయిలు బ్యాంకులో ఉంటే.. మీ వద్ద ఉన్నట్టే అంటూ మాట్లాడటంతో వేతనదారులు షాకయ్యారు. ఎంపీడీఓ అర్జునరావు, తహసీల్దార్ కె.భరత్కుమార్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏడాదంతా గజరాజుల బెడదేనా..!
జియ్యమ్మవలస రూరల్: మండలంలో గజరాజుల సంచారంతో ఏడాది పొడవునా పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం సింగనాపురం గ్రామ సమీపాన పంట పొలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. వ్యవసాయం, బోర్లు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యను పరిష్కరించలేకపోవడంతో కూటమి ప్రభుత్వం మాట నీటి మూటేనని రైతులు విమర్శిస్తున్నారు. పరిహారం కోసం రైతుల ధర్నా నెల్లిమర్ల: తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు 1లో భాగంగా నిర్మిస్తున్న కాలువలో ముంపునకు గురవుతున్న తమ భూములకు పరిహారం వెంటనే చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సారిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమకు న్యాయం చేయాలని శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు పరిహారం చెల్లించిన తర్వాతే భూముల్లోని చెట్ల వేలం పాట వేయాలన్నారు. భూ సేకరణకు సంబంధించి అవార్డు ఎంక్వయిరీ కూడా సక్రమంగా చేయలేదని తహసీల్దారు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 1200 ఎకరాల భూములు కోల్పోయి, పూర్తిగా నిరాధారమైన తమ గ్రామానికి పీఏఎఫ్ ప్యాకేజీ మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు మజ్జి రామారావు, సారిపల్లి గురునాధరావు, మజ్జి నాగరాజు, పాలూరి భానోజి తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు వస్త్ర వ్యాపారి మృతి
రాజాం సిటీ: కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆ యువకుడు. తన తండ్రి శ్రీనివాసరావు చేస్తున్న బట్టల వ్యాపారాన్నే వృత్తిగా ఎంచుకుని కొంతకాలం తండ్రితో వ్యాపారం చేస్తూ మెలకువలు నేర్చుకున్నాడు. తరువాత వేరుగా వ్యాపారం చేయడం మొదలు పెట్టి కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. వ్యాపారంలో నిమగ్నమైన ఆ యువకుడిని వడదెబ్బ రూపంలో మృత్యువు కబళిస్తుందని తెలుసుకోలేకపోయాడు. మండల పరిధి దోసరి గ్రామానికి చెందిన కత్తిరి బాబి (23) వడదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కత్తిరి బాబి వస్త్ర వ్యాపారం చేస్తూ ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నాడు. గుమ్మలక్ష్మీపురంలో నివాసం ఉన్న బాబి ఎప్పటిలాగే ఈ నెల 24న కూడా వ్యాపారానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకున్న తరువాత ఎండ తీవ్రతతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి కురుపాం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా తను కష్టపడుతూ తన అన్నయ్య అభిని డిగ్రీ చదివించడంతో పాటు ఉద్యోగం సాధించేందుకు అవసరమయ్యే కోచింగ్కు అయ్యే ఖర్చు భరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. తాను ఎలాగూ చదువుకోలేకపోయానని, తన అన్నయ్యను అయినా మంచి ఉద్యోగిగా చూడాలని ఆశపడేవాడని పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న బాబి మృతితో తల్లిదండ్రులు కత్తిరి శ్రీనివాసరావు, మల్లీశ్వరితో పాటు కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. వడదెబ్బ కారణంగానే బాబి మృతి చెందాడని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కురుపాం : మండలంలోని మర్రిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక రాహుల్(9) అనారోగ్యంతో శనివారం సొంతూరులోనే మృతి చెందాడు. రాహుల్ నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడని, పాఠశాలలో ఉండగానే అనారోగ్యంతో బాధపడేవాడని, సంబంధిత సిబ్బంది పట్టించుకోలేదని.. పాఠశాల ఉన్న సమయంలో తమ వెంట పంపించాలని కోరినా పంపలేదని రాహుల్ తల్లి శాంతి కన్నీరుమున్నీరైంది. రాహుల్ కుటుంబానికి పది లక్షలు రూపాయిలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థి గ్రామానికి వెళ్లి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. రాహుల్ మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోసరిలో విషాదం -
ఏషియన్ బాక్సింగ్ పోటీలకు కోచ్గా సీతారామాంజనేయులు
విజయనగరం: విజయనగరం ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ పి.సీతారామాంజనేయులు ఏషియన్ బాక్సింగ్ పోటీలకు ఇండియా జట్టు కు కోచ్గా ఎంపికయ్యారు. ఏషియన్ అండర్ – 15 బాల, బాలికల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు పంజాబ్లో శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం నుంచి తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో వచ్చే నెల 1 నుంచి 16వ తేదీ వరకు జరిగే అండర్–15 విభాగంలో ఉజ్బెకిస్తాన్లో బాక్సింగ్ పోటీలకు కోచ్గా వ్యవహరించనున్నారు. ఈయన ఎంపిక పట్ల క్రీడాకారులు, కోచ్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు బొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లిలోని పెట్రోలు బంకు సమీపంలో జాతీయ రహదారి 26పై బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన కోరాడ మనోజ్ తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని పెట్రోలు బంకుకు వస్తుండగా విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడిని 108 వాహనంలో గజనతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ప్రధమ చిక్సిత అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని మహరాజా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తి అరెస్టు కొత్తవలస : వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంల వద్ద అమాయకులను గుర్తించి వారిని బురిడీ కొట్టి మోసాలకు పాల్పడుతున్న తెర్లాం మండలం సతివాడకు చెందిన ఎ.శ్యాంసుందరరావుని సీఐ ఎస్.షణ్ముఖరావు శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి సీఐ తెలిపిన వివరాలు... నిందితుడు శ్యాంసుందరరావు ఏటీఎంల వద్ద అనుమానంగా తిరుగుతూ ఏటీఎంలు వినియోగించే అమాయకులకు సహకరిస్తున్నట్టు నటించి వారి ఏటిఎంను మార్చి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన కొత్తవలస ఎస్బీఐ ఏటీఎం వద్ద ఎస్.శ్రీనును మోసం చేసి రూ.13వేలు కాజేసినట్టు సీఐ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శ్యాంసుందరరావును అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డులిచ్చి మోసపోవద్దని సూచించారు. ఆయన వెంట ఎస్ఐలు జోగారావు, ప్రసాద్ ఉన్నారు. -
కష్టాలు బారెడు
–8లోబండ ● భారత్ గ్యాస్ అందక వినియోగదారుల అవస్థలు ● ఖాళీ సిలిండర్లతో గంటలకొద్దీ ఎండలో నిరీక్షణ ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026గత సంక్రాంతి నుంచి మాకు సిలిండర్లు రా వడం లేదు. వంట కోసం కట్టెలు ఏరుకుంటున్నాం. ఎన్నిసార్లు ఇక్కడ ఆఫీసుకు వచ్చినా బండ ఇవ్వడం లేదు. బయట తెచ్చుకున్నా.. రూ. 1,100 వరకూ తీసుకుంటున్నారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిస్థితి బాలేదు. అధికారులు దృష్టి సారించాలి. – సుజాత, బంటువానివలస మాకు కొద్ది రోజుల కిందటే సిలిండర్ బుక్ అయినట్లు చూపింది. ఇప్పటివరకూ బండ ఇవ్వడం లేదు. సాలూరు ఏజెన్సీ వారు చూసుకుంటారు అని నంబర్ ఇచ్చారు. ఎన్నిసార్లు చేసినా అవ్వడం లేదు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే ఉన్నా.. ఈ రోజు అయినా బండ ఇంటికి తీసుకు వెళ్తామో, లేదో..! అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. – చంటి, శివిని సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ సరఫరా కేంద్రం కొన్నాళ్లుగా తెరుచుకోవడం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లో వంట గ్యాస్కు కష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు.. ఈ కేంద్రం చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదాలు వినియోగదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. కొన్ని నెలలుగా ఏజెన్సీ యాజమాన్యం విషయంలో వివాదాలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి కేంద్రం మూతపడే ఉంది. గతంలో పలుమార్లు ఇక్కడ వినియోగదారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం సాలూరు ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పరిస్థితిలో మార్పులేదు. వినియోగదారుల కష్టాలు తీరలేదు. ఇదే ఆధారం.. కొమరాడ మండలంలోని కందివలస, కుమ్మరిగుంట, కంభవలస, రాజ్యలక్ష్మిపురం, రావికర్ర వలస, సుందరాపురం, అంకుళ్లవలస, కోనవలస, డంగభద్ర, బొడ్డవలస, లక్ష్మీపేట, పార్వతీపురం, మండల పరిధిలోని పలు గ్రామాలు, బలిజిపేట, సీతానగరం తదితర ప్రాంతాల భారత్ గ్యాస్ వినియోగదారులు ఈ ఏజెన్సీపైనే ఆధారపడి ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు చవిచూస్తున్నారు. సాంకేతిక కారణాలతో గ్యాస్ ఏజెన్సీ కోడ్ను మార్చకపోవడం వల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ప్రయత్నించినా బుకింగ్ అవ్వడం లేదు. ఓటీపీలు రావట్లేదు. కొంతమందికి బుక్ అయినట్లు సంక్షిప్త సందేశాలు వస్తున్నా.. సిలిండర్లు మాత్రం ఇవ్వడం లేదు. అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో వినియోగదారుల కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. దాదాపు గత సంక్రాంతి నుంచి తమకు సిలిండర్లు రావడం లేదని వినియోగదారులు గగ్గోలుపడెతున్నారు. ఇటీవల ఆందోళన నేపథ్యంలో 125 గ్యాస్ సిలిండర్లను తెప్పించి వేచి ఉన్న వారికి పంపిణీ చేశారు. శనివారం కూడా గ్యాస్ సిలిండర్ లారీ లోడు రావడంతో సమాచారం అందుకున్న వందలాదిమంది బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పడిగాపులు కాశారు. తమ వంతు కోసం ఖాళీ సిలిండర్లను వరుసలో పెట్టారు. రోజంతా పడిగాపులు కాసినా.. వీరికి సమాధానం ఇచ్చేవారు కూడా లేకపోవడం గమనార్హం. ఫోన్లు చేస్తే సంబంధిత భారత్ గ్యాస్ ప్రతినిధులు స్పందించడం లేదని వారంతా వాపోతున్నారు. ఫోన్ చేస్తే.. సాలూరులో సంప్రదించాలని ఒకసారి, రామభద్రపురం అని మరోసారి చెబుతూ తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇక్కడో ఆట!
ఆడ బిడ్డలతో అక్కడో మాట.. ● చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ● న్యాయం కోసం మండుటెండలో మహిళల పోరాటం సాక్షి, పార్వతీపురం మన్యం: చెప్పేవి మహిళా పక్షపాతి మాటలు.. చేసేవి మహిళలను రోడ్డుకీడ్చే చేష్టలు! చంద్రబాబు ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో న్యాయం కోసం అయిదుగురు అబలలు మండుటెండలో గత బుధవారం నుంచి పార్వతీపురంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజకీయ చదరంగంలో అన్యాయంగా ఉద్యోగాలు పోగొట్టుకుని, పొట్టచేత పట్టుకుని ఆకలి కేకలు పెడుతున్నారు. ఒకవైపు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, ‘ఆమె’కు సమాన హక్కులు అంటూ డ్రామాలు చేస్తున్న పాలకులు... తమ సొంత రాష్ట్రంలో.. సాక్షాత్తు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో ఆడ బిడ్డలు.. అందునా చిరుద్యోగులు బలైపోతే... వారి ఆవేదన మన్యం గడప దాటకపోవడం గమనార్హం. గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒత్తిడి వల్లే కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సాలూరు మండలం కరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్ సహా ఇతర సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ.. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించబోమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గానీ నేటికీ స్పందించలేదు. ప్రభుత్వ పెద్దలు స్పందించి న్యాయం చేయాలని ఆ ఆడబిడ్డలు వేడుకుంటున్నారు. -
పక్కాగా ఎన్నికల రోల్స్ మ్యాపింగ్
పార్వతీపురం: జిల్లాలో ఎన్నికల రోల్స్ మ్యాపింగ్, ఫారంల పరిశీలన పారదర్శకంగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో వాటి వివరాలను వెల్లడించారు. 2002 రోల్స్ డేటాను 2025 డేటాతో బీఎల్ఓల యాప్లో మ్యాపింగ్ చేస్తూ 68.53 శాతం పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. గతేడాది జనవరి 6 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16,799 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. వాటిలో 273 పెండింగ్లో ఉన్నాయన్నారు. ఫారం–6 కింద 7,437 దరఖాస్తుల్లో 6,358 కొత్త ఓటర్లు చేరారన్నారు. ఫారం–7 కింద 2,046 ఓట్లు తొలగించగా, నాలుగు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఫారం–8 కింద 6,934 సవరణలు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్ల జాబితా కచ్చితత్వం కోసం రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. -
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
–8లో● ఎన్సీడీ జిల్లా అధికారి జగన్మోహనరావు పార్వతీపురం: వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్సీడీ జిల్లా అధికారి డా.టి జగన్మోహన్రావు సిబ్బందికి సూచించారు. మండలంలోని పెదగుడబ పంచాయతీ ఎస్ఆర్పేటను శనివారం ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న సంచార వైద్య శిబిరంలో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందుల లభ్యతను పరిశీలించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు మందులు క్రమంగా తీసుకునేలా పర్యవేక్షణ చేయాలని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించాలని సిబ్బందికి సూచించారు. వేసవి నేపథ్యంలో వాతావరణ మార్పులు–మానవ ఆరోగ్యం కార్యక్రమం ద్వారా గ్రామంలో పోస్టర్లతో అవగాహన కల్పించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నీటిని కోల్పోతుందని, దాహం లేకపోయినా తరుచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎండలో ఎక్కువ సేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిబిరంలో వైద్యాధికారిణి ఎం.చాందిని, సీహెచ్ఓ ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లే.. క్రీడా లోకం...
అనుబంధం.. ఆప్యాయత.. ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసేందుకు వివిధ రకాల ఆట వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చులో ఇంట్లోనే కొన్ని రకాల ఆటలను రూపొందించుకోవచ్చు. పాత తరం నుంచి వచ్చే వాటిని అమ్మమ్మ, నానమ్మ, తాతల నుంచి నేర్చుకోవచ్చు. ఇదే క్రమంలో పిల్లల ముందు అవసరానికి మించి ఫోన్ వినియోగించడం ద్వారా వారి మనసు మళ్లే అవకాశం ఉందని గుర్తించాలి. వారితో పాటు కొన్ని రకాల వాటిల్లో భాగస్వాములైతే.. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగనుంది. అందుకు రోజులో కొంత సమయాన్ని తప్పక కేటాయించాలని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఇదే క్రమంలో ఆటల ద్వారా గెలుపోటములు సమానంగా స్వీకరించే సామర్థ్యం సొంతమవుతుంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ ఇంటి ఆవరణలో కాస్త ఖాళీ స్థలం ఉంటే.. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్(మినీ సెట్) ఆడుకోవచ్చు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక్కో సెట్ రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. ఇద్దరు లేదా నలుగురు ఒకేసారి రంగంలో దిగొచ్చు. వాటి ద్వారా దూరదృష్టి, మెదడు చురుకుదనం పెరుగుతుంది. కండరాలను బలంగా మార్చుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బిజినెస్, లూడో రూ.100 – రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. బిజినెస్ గేమ్లో నలుగురు ఆడవచ్చు. పాచికలతో కూడిన ఆట. వ్యాపార మెలకువలు తెలుస్తాయి. లూడో గేమ్తో కుటుంబం, స్నేహితుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పిల్లల్లో లెక్కలు, సంఖ్యల గుర్తింపు సామర్థ్యం పెంచుతాయి. వైకుంఠపాళి, అష్టాచెమ్మ.. ఒక్కో క్రీడా సెట్ రూ.300 వరకు పలుకుతుంది. వైకుంఠపాళి, అష్టాచెమ్మ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గెలుపోటములు, హెచ్చుతగ్గులను ఈ ఆటలు బోధిస్తాయి. మెదడుకు చక్కటి వ్యాయామం లభిస్తుంది. వ్యూహాలు నేర్చుకోవచ్చు. రోజంతా వినోదాన్ని పంచుతాయి. చదరంగం.. చెస్ బోర్డు రూ.200 నుంచి రూ.300ల లోపే లభిస్తుంది. ఇద్దరు సరదాగా ఆడుకోవచ్చు. మెదడుకు పదును పెట్టే చురుకై న ఆట. మేధో, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. ప్రత్యర్థులకు అందకుండా వ్యూహాలు రచించడం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెంపొందుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. -
అంగన్వేడిలో చిన్నారులు
● భగ్గుమంటున్న ఎండలు ● ఉక్కపోతతో అంగన్వాడీ చిన్నారులు విలవిల ● గొడుగు నీడలో ఇంటికి పయనంముఖ్యంగా నీడలోనే పిల్లలు ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్కు గురైతే వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా ఆస్పత్రుల్లో లభించే ఓఆర్ఎస్ ప్యాకెట్లను మాత్రమే అందించాలి. డబ్బా ఓఆర్ఎస్లను పట్టరాదు. అవి పడితే యూరిన్ మరింత అధికమై ప్రమాదకరంగా మారుతుంది. వైద్యులను సంప్రదించి తగు చికిత్స అందించాలి. – బంకురు అప్పలనాయుడు, చిన్నపిల్లల వైద్యనిపుణుడు, సాలూరు గత ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు 15 రోజులు సెలవులను మే 1వ తేదీ నుంచి అమలు చేసేవి. ఆ మేరకు ఏపీ అంగన్వాడీవర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మే నెలంతా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం గరిష్టంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల బాలింతలు, గర్భిణులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – ఎన్.వై.నాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి,సాలూరు పార్వతీపురం రూరల్/సాలూరు: భానుడి భగభగలు అంగన్వాడీ చిన్నారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి తాపానికి విలవిల్లాడుతున్నారు. కొన్నిచోట్ల వేడిని తట్టుకోలేక డీ హైడ్రేషన్కు గురవుతున్నారు. జిల్లాలో 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా లేకపోవడం చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో ఒకే గదిలో ఒకవైపు అంగన్వాడీ సామగ్రి, మరోవైపు వంటా వార్పు సాగుతుండటంతో వేడి మరింత రెట్టింపవుతోంది. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పురిపాకలు, రేకుల షెడ్లలోనే కేంద్రాలు నడుస్తుండడంతో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలో ‘గొడుగు’ ప్రయాణం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రం విడిచిపెట్టే సమయానికి సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఆ తీవ్రమైన ఎండలో చిన్నారులు ఇళ్లకు చేరుకోవడం ప్రాణాంతకంగా మారుతోంది. కలెక్టర్ సూచనల మేరకు చిన్నారులను గొడుగుల నీడలో ఇంటికి సాగనంపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,496 ప్రధాన, 163 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేవలం అద్దె భవనాలే దికై ్కనచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. -
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
విజయనగరం క్రైమ్: స్థానిక రౌతు వీధికి చెందిన రాంబల్పు మనోజ్కుమార్ అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. తన కొడుకు కనిపించడం లేదని తల్లి దేవి ఫిర్యాదు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి, వెతుకులాట ప్రారంభించామని దర్యాప్తు అధికారి చిన్నయ్య చెప్పారు. విజయనగరం క్రైమ్: వివాహితుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రేగిడి శ్రీకాంత్ ఇంతవరకు ఇంటికి రాలేదని ఆయన భార్య రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఐవో రవి తెలిపారు. -
మన్యంలో పొంచి ఉన్న ప్రమాదం
సీతంపేట: మన్యం అంటనే మలేరియా పాజిటివ్ కేసులకు పెట్టింది పేరనే నానుడి ఉంది. ఇప్పుడు మన్యంతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా మలేరియా విలయతాండవం చేస్తోంది. గిరిజనగ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా విజృంభిస్తున్నాయి. ఏటా జనవరి నుంచి డిసెంబర్ వరకు 700కు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు. కానీ ఆ సంఖ్య వెయ్యికి పైగానే ఉండొచ్చనేది అంచనా. ఈ ఏడాది ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా కేసులు 110 వరకు నమోదయ్యాయి. అధికారులు 233 గిరిజన గ్రామాలను హైరిస్క్ మలేరియా గ్రామాలుగా గుర్తించి మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్నారు. జ్వరం వచ్చి రక్తపరీక్షలు చేయించుకుంటే మలేరియా,టైఫాయిడ్ ఈ రెండింటిలో ఏదో ఒకటి రావడం పరిపాటిగా మారింది. 3లక్షల దోమతెరలకు 23 వేలే వచ్చాయి... మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 3లక్షల దోమతెరలు అవసరం కాగా కేవలం 23వేల 339 వందల దోమతెరలు మాత్రమే ఈ సంవత్సరం వచ్చాయి. వాటిని 8 పీహెచ్సీల పరిధిలో మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కడ నమోదవుతున్నాయో అక్కడ పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 12 వేల దోమ తెరలు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
నాలుగు కంకర ట్రాక్టర్ల సీజ్
వీరఘట్టం: వంగర మండలం రుషింగి నుంచి వీరఘట్టం మండలం చిట్టపులివలస గ్రామానికి కంకరను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను జిల్లాకు చెందిన మైనింగ్ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలుబొబ్బిలి: పట్టణ సమీపంలోని సరేపోలమ్మ ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస పట్నాయక్ అనే వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఓ పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్న శ్రీనివాస పట్నాయక్ తన స్వగ్రామం జగన్నాథపురం నుంచి పట్టణంలోకి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుకవైపు నుంచి బైక్తో ఢీ కొని పరారయ్యాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడి దగ్గరకు ఏఎస్సై కొండల రావు వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. 8 పోక్సో కేసుల్లో నిందితులకు జీవిత ఖైదువిజయనగరం క్రైమ్: ఈ ఏడాది ఎనిమిది పోక్సో కేసులలో నిందితులందరికీ యావజ్జీవ ఖైదు విధించినట్లు చిన్నారులు, మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ పని చేస్తోందని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో 46 పోక్సో కేసుల్లోను, 33 క్రైం ఎగినిస్ట్ వుమన్ కేసుల్లోను నిందితులకు కఠినమైన శిక్షలు విధించారన్నారు. పోక్సో కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎప్పటికప్పుడు గమనిస్తూ, చర్యలు చేపట్టడం సత్ఫలితాలనిస్తోందన్నారు. 2024లో 10, 2025లో 28, ఈ ఏడాదిలో 8 పోక్సో కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు లేదా 20ఏళ్లు కఠిన కారాగార శిక్షలు విధించారన్నారు. మహిళల భద్రతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదంభామిని: మండలంలోని బత్తిలి సమీపంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు పెనప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. శ్రీకాకుళం నుంచి బత్తిలి వస్తున్న ఆర్టీసీ బస్సు బత్తిలి వెర్రిగెడ్డ బ్రిడ్జి ప్రవేశంలో పక్కకు తిప్పి ఘోర ప్రమాదం నుంచి ప్రయాణికులను తప్పించింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిడ్జి అంచు నుంచి గెడ్డలోకి దిగిపోవలసిన ఆర్టీసీ బస్సు వెనుక చాసీ గట్టుకు తగిలి గెడ్డలోకి పడకుండా బస్సు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే బత్తిలి గ్రామస్తుల సహకారంతో ప్రయాణికులను దించి వేశారు. డ్రైవర్, కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 13 కేజీల గంజాయి పట్టివేతవిజయనగరం క్రైమ్: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి 66 వేలు విలువ చేసే 13 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా శుక్రవారం అడ్డుకున్నామని గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీ రావు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం షిమోగాకు చెందిన వి.వరుణ ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైడ్ చేయగా వరుణ్ అడ్డంగా దొరికాడని, గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విశాఖ రైల్వే కోర్టుకు తరలించామన్నారు. -
వాడవాడలా ఆవకాయ ఘుమఘుమలు
విజయనగరం గంటస్తంభం: వేసవి ఎండలు మండుతుంటే పల్లెల్లో మాత్రం మరో రకమైన సందడి మొదలవుతుంది. చెట్ల మీద పచ్చగా వేలాడే మామిడికాయలు కంటికి హాయిగా కనిపిస్తే, ఇంటింటా ఆవపిండి కాలం వచ్చింది అనగానే గ్రామాల్లో మహిళల కళ్లల్లో ప్రత్యేక మెరుపు కనిపిస్తుంది. మామిడికాయలు ఇంటికి చేరగానే అసలు పని మొదలవుతుంది. ముక్కలు కోసి,ఆవపిండి కలిపి,నూనె పోసి..చివరికి పెద్ద జాడీల్లో నింపే సమయం వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో అందరూ ఉంటారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వాడవాడలా ఆవకాయ సందడి కనిపిస్తోంది. గ్రామాల్లో మాత్రమే కాదు..పట్ట ణాల్లో కూడా ఇంటింటా ఆవకాయ సీజన్ మొదలైంది. మార్కెట్లలో మామిడికాయలకు డిమాండ్ పెరిగింది. -
దోమ చిన్నదే..వ్యాధి పెద్దది..!
● ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ● ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ● దోమ తెరలు వినియోగించాలి. ● ఇంటి కిటికీలకు మెస్లు బిగించాలి. ● తాగిపడేసిన కొబ్బరి బొండాలు, వాడిన టైర్లు ఇంటి పరిసరాల్లో ఉండకూడదు. ● వాటర్ ట్యాంకులకు మూతలు వేయాలి. ● మలాథియన్ స్ప్రేయింగ్ ఇంటి లోపల, బయట చేయించుకోవాలి.విజయనగరం ఫోర్ట్: మలేరియా పేరు వినగానే జనం భయపడేవారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా భయపడేవారు. మలేరియా బారిన పడి అస్వస్థతకు గురయ్యేవారు కొందరు..వ్యాధితో పోరాటం చేయలేక మృత్యువాత పడేవారు మరికొందరు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ఆస్కారం ఉంది. శనివారం ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. అప్పుడే మొదలైన మలేరియా వ్యాప్తి సాధారణంగా వర్షాకాలంలో మలేరియా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అధికంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం మైదానం, గిరిజన ప్రాంతం తేడా లేకుండా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా వర్షాకాలం రాకముందే వ్యాధి వ్యాప్తి మొదలైంది. మలేరియా వ్యాప్తికి దోమలే కారణం అనాఫిలిస్ అనే దోమ కుట్టడం వల్ల మలేరియా సోకుతుంది. జూన్ నుంచి ఆక్టోబర్ మధ్య కాలంలో ఎక్కువగా మలేరియా కారక దోమలు వ్యాప్తి చెందుతాయి. అనాఫిలిస్ దోమ మలేరియా వ్యాధి క్రిములను రోగి నుంచి ఆరోగ్యవంతులకు కూడా చేరవేస్తుంది. వర్షాకాలం సీజన్లో తరచూ వచ్చే వ్యాధి మలేరియా. దీని లక్షణాలు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా కారక సూక్ష్మక్రిములు, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిఫారమ్, ప్లాస్మోడియం బవెల్ రూపంలో ఉంటాయి. వ్యాధి లక్షణాలు: మలేరియా సోకితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కొన్ని సార్లు చలికూడా వేస్తుంది. పాల్సిఫారమ్ మలేరియా తీవ్రంగా ఉంటుంది. జ్వరం వచ్చిన రెండుగంటలలోపు ఆస్పత్రిలో చేర్పించాలి. తలనొప్పి, ఒంటినొప్పులు, వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు చేయించాలి. రోజు విడిచి రోజు జ్వరం రావచ్చు. మలేరియా క్రిములున్న దోమ ఆరోగ్యవంతులకు కుట్టిన 10 నుంచి14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి. జ్వరంతో పాటు వాంతులు కూడా అవుతుంటాయి. జిల్లాలో 56 కేసులు నమోదు జిల్లాలో జనవరి ఒకటో తేది నుంచి ఏప్రిల్ 23 వతేదీవరకు 56 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 2025లో 390 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొదలైన మలేరియా వ్యాప్తి ఇప్పటివరకు 56 కేసుల నమోదు మలేరియా పట్ల నిర్లక్ష్యం తగదు.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 2025– 26 లో 390 కేసులు నమోదు నేడు ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవంవ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:చర్యలు తీసుకుంటున్నాం: మలేరియా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధి సోకే ప్రాంతాల్లో దోమల నివారణ మందును మేఒకటో తేదీనుంచి మొదటి విడత స్ప్రేయింగ్ చేయించనున్నాం. జిల్లాలోని 19 మండలాల్లో గల 26 పీహెచ్సీల పరిధిలో 165 హైరిస్క్ గ్రామాల్లో స్ప్రేయింగ్ చేయించనున్నాం. ఎం.సింహాచలం, జిల్లా మలేరియా నివారణ అధికారి -
ఘనంగా వేదగాయత్రీమాత ఆలయ వార్షికోత్సవం
విజయనగరం టౌన్: సనాతన గురుకులాశ్రమ గాయత్రి శ్రీ విద్యాపీఠం 33వ వార్షిక బ్రహ్మోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూల్బాగ్లోని ఉన్న విద్యాపీఠం ఆవరణలో కొలువైన అమ్మవారికి యనమండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి విమలానందనాథ గురువర్యులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ విద్యాపీఠంలో కొలువైన గాయత్రి, సావిత్రి, సరస్వతి స్వరూప సంధ్యామూర్తులకు అష్టోత్తరశత కలశాభిషేకం, పంచామృతాభిషేకాలు, శ్రీ చక్ర కుంకుమార్చన, గాయత్రి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి, తరించారు. -
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
పూసపాటిరేగ: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని విశాఖ రీజియన్ ప్రకృతి వ్యవసాయం టెక్నికల్ మేనేజర్ కె.ప్రకాష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పూసపాటిరేగ మండలంలోని గోవిందపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులకు ముగింపు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సాగులో అవలంబించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. నిరంతర ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా అందుబాటులోకి తీసుకోవాలి అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ సిబ్బంది ఇన్పుట్ ప్రిపరేషన్, ఉపయోగాలపై పూర్తిస్థాయిలో తెలియజేశారు. తొలకరికి 15 కేజీల విత్తనాల కిట్లు అందజేస్తామన్నారు. తొలకరి సాగుకు 30 రకాల విత్తనాల ద్వారా పచ్చిరొట్ట ఎరువులు తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి అడ్డూరి శ్రీని వాసరావు, విస్తరణాధికారి ఎస్.భాను, ప్రకృతివ్యవసా యం సిబ్బంది కమల, అశ్వని తదితరులు పాల్గొన్నారు. టెక్నికల్ మేనేజరు ప్రకాష్ -
విద్యుత్ షాక్తో వెల్డర్ మృతి
శృంగవరపుకోట: వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్.కోట మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మండలంలోని గవరపాలెం గ్రామానికి చెందిన కాండ్రేగుల ఈశ్వరరావు(48) కొంత కాలం పాటు దుబాయ్లో వెల్డర్గా పనిచేసి ఆరేళ్ల క్రితం స్వంత గ్రామానికి వచ్చి భవానీనగర్ వద్ద వెల్డింగ్ దుకాణం పెట్టుకుని పని చేస్తున్నాడు. శుక్రవారం గంట్యాడ మండలంలోని మధుపాడ పంప్హౌస్ వెనుక ఉన్న షెడ్ నిర్మాణ పనులకు వెళ్లాడు. అక్కడ వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడు ఈశ్వరరావు భార్య వ్యవసాయ పనులు చేస్తుండగా, ఇద్దరు కుమారులు షిప్లో పని చేస్తారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. నేల బావిలో పడి వృద్ధుడు..రామభద్రపురం: మండలంలోని తారాపురంలో శుక్రవారం ప్రమాదవశాత్తు నేల బావిలో పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన పిల్లా లక్ష్మణరావు(77) శుక్రవారం ఉదయం పొలం పనికి వెళ్లాడు. అయితే దాహం వేయడంతో గ్రామం సమీపంలో ఉన్న చాకిరేవు పొలంలో సామంతుల కొత్తయ్య మాస్టారుకు చెందిన నేలబావిలో నీరు తాగడానికి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతిచెందాడు.కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు హెచ్సీ ఎం.సత్యనారాయణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన గొల్లుపాలెం మాజీ సర్పంచ్
బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామ మాజీ సర్పంచ్ పల్లి రామునాయుడు తన అనుచరులతో కలిసి గురువారం బోడసింగిపేటలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఆయన టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరించగా, తర్వాత వైఎస్సార్సీపీలో చేరి ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో విభేదాల కారణంగా తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరగా అయనకు పార్టీ కండువా కప్పి జెడ్పీ చైర్మన్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు, వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ బొత్స అప్పలనరసయ్య, గ్రామ నాయకులు గొల్లు సతీష్, మూకల చలం నాయుడు, పల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. -
వీడిన మర్డర్ మిస్టరీ
● రౌడీషీటర్ హరనాథ్గా హతుడి గుర్తింపు ● ఐదుగురు కలిసి హత్యవిజయనగరం క్రైమ్: స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమోదైన పావాడ హరనాథ్ను అదే బస్తీలో ఉంటున్న స్నేహితులే గంజాయి మత్తులో హత్య చేసినట్లు ఎస్పీ శుక్రవారం తెలిపారు. ఆధిపత్యం కోసమే తోటి మిత్రుడిని ప్లాన్ చేసి అంతమొందించారన్నారు. ఈ కేసుకు సంబంధించి వన్ టౌన్ సీఐ ఆర్వేఆర్కే చౌదరి, క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు బృందం మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని జొన్నగుడ్డికి చెందిన పావాడ సంతోషి అనే మహిళ తన కొడుకు పావాడ హరనాథ్ మార్చి 27 వ తేదీ రాత్రి నుంచి కనిపించడం లేదని వన్ టౌన్ పోలీసులకు ఈ నెల10వ తేదీన ఫిర్యాదు చేయగా వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విజయనగరం మండలం నారాయణ పురం గ్రామ శివారులోని నూతిలో ఒక వ్యక్తి.. మృతదేహం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు పరిశీలించి మిస్సింగ్ అయిన పావాడ హరనాథ్గా గుర్తించారు. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్పుచేసి, వన్ టౌన్ సీఐ దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతి చెందిన పావాడ హరనాథ్ పై రౌడీషీటు ఉన్నట్లు, ఇప్పటికే 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిసింది. హత్య నేపథ్యం.. జొన్నగుడ్డిలో ఉంటున్న పావాడ హరనాథ్కు అదే ప్రాంతంలో ఉంటున్న బాక్సర్ (ఎ1) సొంటేన లక్ష్మణరావు అలియాస్ లక్ష్మణకు ఇటీవల గొడవ జరగ్గా ఇద్దరూ కొట్టుకున్నారు. అనంతరం తాను బాక్సర్ లక్ష్మణరావును కొట్టినట్లు పావాడ హరనాథ్ ఎక్కువగా ప్రచారం చేయడంతో ప్రతీకారం తీర్చుకోవాలని బాక్సర్ సొంటేన లక్ష్మణరావు భావించి, అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇదే క్రమంలో బార్లో మద్యం తాగి మత్తులో బార్ బయట పడిపోయిన హరనాథ్ను గమనించిన సొంటేన లక్ష్మణరావు (30) అతని వర్గానికి చెందిన కుప్పిలి భార్గవ కుమార్ అలియాస్ భార్గవ్ (20), మచ్చ తేజ (20), రేగిడి వాసుదేవ్ అలియాస్ వాసు (26) ఆటోలో హరనాథ్ను పట్టణ శివార్లలోకి తరలించి, అక్కడ రాళ్లతో కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని సిమెంట్ పోల్కు తాళ్లతో కట్టి, ఫ్లెక్సీ కప్పేసి పరారయ్యారు. ఇదే కేవలం ఇరు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో జరిగిన హత్య అని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పావాడ హరనాథ్ను హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు. అంతేకాకుండా, నిందితులకు సహకరించిన మరో జువైనల్ను అదువులోకి తీసుకున్నామని చెప్పారు. సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు పాల్గొన్నారు. -
మూడో రోజుకు చేరిన కేజీబీవీ సిబ్బంది దీక్ష
పార్వతీపురం రూరల్: సాలూరు మండలం కరాసువలస కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) ప్రిన్సిపాల్ సహా ఇతర సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు శిబిరం వద్ద గళమెత్తారు. చిన్నపాటి కారణాలతో మహిళా ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం సరికాదని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించు కోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. బాధితుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి.శ్రీను నాయుడు, ఎం.భాస్కర రావు, పీడీఎస్ఓ కార్యదర్శి కె.సోమేష్, కాంగ్రెస్ నాయకులు తీళ్ల గౌరీ శంకర్ రావు, చొక్కాపు వెంకట రమణ, పట్లా సింగ్ రవికుమార్ పాల్గొన్నారు. వారితో పాటు ఏఐటీయూసీ నేత ఆర్వీఎస్ కుమార్, సీపీఐ (లిబరేషన్న్) సభ్యులు పి.సంగం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథ రావు, పౌర సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసి రావు, బంకురు సూరిబాబు, గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. -
బూజు దులపండి
పాలకొండ: తహసీల్దార్ కార్యాలయంలో ఎక్కడిపడితే అక్కడే చెత్త ఉంది.. నిర్వహణ తీరు బాగులేదు.. గోడలకు ఉన్న బూజును వెంటనే దులపండి.. కార్యాలయం శుభ్రం చేసిన ఫొటోలను పంపించాలంటూ కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పాలకొండ డిప్యూటీ తహసీల్దార్ వెంకటరావును ఆదేశించారు. సీతంపేట పర్యటనకు వెళ్లి తిరుగు ప్రయాణంలో పాలకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేవలపై ఆరా తీశారు. అర్జీలు వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్ రాధాకృష్ణను ఆదేశించారు. పకడ్బందీగా గురుకుల ప్రవేశ పరీక్షలు● కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఆర్ఎస్ క్యాట్ ప్రవేశ పరీక్షలు శుక్రవారం జిల్లాలో పారదర్శకంగా జరిగాయి. పార్వతీపురం మండలం వెంకంపేట, విద్యానగర్లోని సురేష్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, విద్యుత్ దీపాలు, గాలి వంటి మౌలిక వసతులను పర్యవేక్షించారు. నిబంధనల మేరకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో పరీక్షా కేంద్రాల ఇన్చార్జ్ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అంధ విద్యార్థులకు బ్రెయిలీ పుస్తకాలుపార్వతీపురం రూరల్: జిల్లాలోని అంధ విద్యార్థులకు ఉచితంగా బ్రెయిలీ పాఠ్యపుస్తకాలను సరఫరా చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి.దేవరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ మరియు ఎన్జీఓ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు (ఓపీడీఏఎస్సీఏసీ.ఏపీ.జీవోవీ.ఇన్) వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జతపరచాలని, అర్హులైన ప్రతి విద్యార్థికీ త్వరలోనే పుస్తకాలు అందజేస్తామని వివరించారు. జిల్లాలోని అంధ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. 32 మందిపై విరిగిన లాఠీ విజయనగరం క్రైమ్: ఇటీవల విజయనగరం పట్టణంలో జొన్నగుడ్డికి చెందిన పావాడ హరనాథ్ మృతదేహం తీసుకెళ్లే సమయంలో అలజడి సృష్టించిన 32 మందిపై ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం లాఠీ ఝుళిపించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే మృతదేహాన్ని తీసుకెళ్లే సమయంలో ఆర్అండ్బీ నుంచి బాలాజీ కూడలి వరకు ర్యాలీగా హడావిడి చేయడం, బాణసంచా కాల్చడం, రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించడం నగరంలో చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని ఎస్పీ సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు మృతదేహాన్ని తరలించే సమయంలో అలజడి సృష్టించిన వారిని పోలీసులు గుర్తించారు. విజయనగరం వన్టౌన్, టు టౌన్ పోలీసులు జొన్నగుడ్డి, లంకాపట్నం తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 32 మందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎదుట శుక్రవారం హాజరుపర్చారు. తొలుత వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో దురుసుగా ఉన్నవారిపై లాఠీలు ఝుళిపించారు. ఇకపై నగరంలో ఎలాంటి అల్లర్లు, విధ్వంసకాండ సృష్టించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అందరి వివరాలను నమోదు చేసి విడిచిపెట్టారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
జియ్యమ్మ వలస రూరల్: రాష్ట్రంలో అరాచకం, అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతోందని మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పనీపాటాలేని ముగ్గురు మహిళా మంత్రులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై కారు కూతలు కూడయడంపై మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయమని జనం ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్తో కాలంగడిపేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిపేరుతో భూదందాలు చేసి అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని, ఆ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని ప్రశ్నించినందుకు మహిళా మంత్రులతో కారుకూతలు కూయిస్తున్నారని, వీరి వాగుడు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. మంత్రులు మీడియా ముందు గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలైపోవన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని ప్రశ్నిస్తే తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు కుంభకోణం, హనీ ట్రాప్చేసిన సవిత వేదాలను వళ్లించడం హాస్యాస్పదమన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే మీ సైకిల్లో ‘కిల్’ఉంది కదా.. మీది కిల్ (హత్యలు)పార్టీయా అని విమర్శించారు. గిరిజన చిరుద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడంలో మంత్రి సంధ్యారాణి హస్తం ఉందని ఆరోపించారు. అన్నం ఉడకలేదనే కారణంతో ఐదుగురు కేజీబీవి సిబ్బందిని తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేయడం గిరిజన సంక్షేమ మంత్రికి తగదన్నారు. కురుపాం నియోజకవర్గంలో విద్యార్థుల విషయంలో తప్పులు చేసిన వారిపై నాలుగు నెలలో సస్పెన్షన్లు ఎత్తి వేయడం, ఎమ్మెల్యే చుట్టమని క్రమశిక్షణ రాహిత్యంగా పనిచేసిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ ఎత్తివేయడం, ఏకలవ్య గురుకుల పాఠశాలలో శిక్షణ పేరుతో రూ.10 కోట్లు దోచుకోవడం ఇవన్నీ అబద్ధాలా ? అని మండిపడ్డారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఐ విల్ లెర్నింగ్ సొల్యూషన్న్స్ కంపెనీ వారు ఎటువంటి తరగతులు నిర్వహించకుండా రూ.5 కోట్లు స్కామ్ చేయడం అబద్ధమా? నిజమా అన్నది మంత్రి చెప్పాలన్నారు. అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా అబద్ధాలు చెబుతూ కాలంగడిపేస్తున్న నేతలకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఎం.శెశికళ, ఎంపీపీ శెట్టి పద్మావతి, బంకురు శంకరజోగినాయుడు, బలగ వెంకటరమణ, నారాయణరావు, మురళి, కృష్ణ, రమణమ్మ, ఉషారాణి, ఈశ్వరరావు, మన్మథరావు, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు. మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే.. అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని విస్మరించి డైవర్షన్ పాలిటిక్స్కు ప్రాధాన్యం మంత్రుల తీరును విమర్శించిన పుష్పశ్రీవాణి -
వసతులు కరువు
పాలకొండ మండలం తుమరాడ గ్రామంలో కామినాయుడు చెరువు వద్ద 160 మంది వేతనదారులు ఎండలోనే పనులు చేపడుతున్నారు. ఇక్కడ పనులు జరుగుతున్న చోట కనీసం టెంట్లు, షెడ్డులు ఏర్పాటు లేదు. తాగునీరు, పనిముట్లు అందుబాటులో లేవు. రూ.9 లక్షలతో చేపడుతున్న ఈ చెరువు అభివృద్ధి పనుల్లో.. వేతనదారులకు కనీస వసతులు కల్పించడం లేదు. దీనికి తోడు మూడు నెలలుగా వేతన బకాయిలు కొనసాగుతున్నట్లు ఉపాధి వేతనదారులు వాపోతున్నారు. ● మైదాన ప్రాంతంలో ఫేస్యాప్తో ఓ రకమైన సమస్యలు ఉంటే.. సీతంపేట వంటి ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్ దొరక్క యాప్ నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ మండలంలో 53 పంచాయతీలు, 431 గూడల పరిధిలో, 13వేల పై చిలుకు జాబ్ కార్డుదారులు ఉన్నారు. ప్రస్తుతం 12 వేల మంది వరకు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వీరికి సంబంధించి పనులు జరిగే చోట ఫేస్ యాప్లో వేతనదారుని వివరాలు నమోదు చేసేందుకు 436మంది మేట్లు పని చేస్తున్నారు. వీరంతా ఉపాధి పని జరిగే చోట సెల్ సిగ్నల్ ఉండకపోవడంతో సిగ్నల్ వచ్చే ప్రాంతానికి చేరుకొని యాప్ ఇన్స్టాల్చేసి, తిరిగి పని జరిగే ప్రాంతానికి వెళ్లి వస్తూ అవస్థలు పడుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. తలదాచుకొనేందుకు నీడ లేదు. గతంలో టెంట్లు అందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాగునీరు కూడా తెచ్చుకుంటున్నాం. పైగా వేతనాలకు మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలు పరిష్కరించడం లేదు. సాంకేతిక పేరిట ఇక్కట్లు తప్పడం లేదు. వేతన బకాయిలతో పాటు ఎండలో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అలవెన్సులు అందించాలి. – గుమ్మిడి తవిటినాయుడు, ఉపాధి వేతన దారు, తుమరాడ ● -
స ● వి ● వి ● వి
మలేరియా పేరు వినగానే జనం భయపడేవారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎక్కువగా భయపడేవారు. –8లోత్రుటిలో తప్పిన పెను ప్రమాదం భామిని మండలంలోని బత్తిలి సమీపంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు పెనప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. –8లోపనిప్రదేశంలో సదుపాయాలు లేవు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టెంట్లు, మెడికల్ కిట్లు వంటివి లేవు. నెలల తరబడి బిల్లులు చెల్లింపులు జరగడం లేదు. ఫేస్ యాప్ వల్ల ఇబ్బంది అవుతోంది. – గమ్మెల పెంటయ్య, వేతనదారుడు, గంగందొరవలస, పాచిపెంట మండలం గతంలో పని ప్రదేశంలో టెంట్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు, పరికరాలు ఉండేవి. ప్రస్తుతం అవేవీ లేవు. నీడ కోసం చెట్ల కింద కూర్చోవాల్సి వస్తోంది. పైగా ఫేస్యాప్ వల్ల పని ఆలస్యం కావడంతోపాటు.. కొన్ని సార్లు నమోదు కాకపోవడంతో పని చేయకుండానే మండుటెండలో వేచి ఉండి, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. – మోర్చ భాస్కరరావు, వేతనదారుడు, చెరుకుపల్లి గ్రామం, పాచిపెంట మండలం -
గంజాయి నియంత్రణలో ఐవీఆర్ఎస్
పార్వతీపురం: జిల్లాలో గంజాయి నియంత్రణలో ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టే ప్రజా స్పందనలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖతోపాటు సమన్వయ శాఖలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత, బాల్య వివాహాల నిర్మూలన కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు, వసతిగృహాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని, 500మీటర్ల పరిధిలో మత్తు పదార్ధాల విక్రయాలను అరికట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించి, బ్లాక్ స్పాట్ వద్ద హెచ్చరిక బోర్డులు, త్రీడీ పెయింటింగ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రింటింగ్ ప్రెస్లు, కల్యాణ మంటపాల యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వి.మనీషారెడ్డి, సబ్కలెక్టర్ ఆర్. వైశాలితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఓ వైపు ఎండలు మండుతున్నా ఉపాధిహామీ పనుల వద్ద ఎక్కడా టెంట్లు కానరావడం లేదు.. తాగునీరు, మజ్జిగ సరఫరా మాటే లేదు.. రెండుపూటలా పనికి వెళ్లినా మస్తర్ పడుతుందోలేదోనన్న బెంగ.. యాప్లో ఫేస్ పడేవరకు వీడని ఉత్కంఠ.. ఫేస్ నమోదైతే హమ్మయ్య ఈ రోజుకు గండం గట్టెక్కిపోయామన్నంత ఉపశమనం.. ఎంత పైనినైనా చేసేందుకు సిద్ధపడే వేతనదారులు.. కనీస సదుపాయాలు లేక నీరసించిపోతున్నారు. మస్తర్ నమోదులో ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సకాలంలో వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఉపాధిహామీ వేతనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. -
నీడా లేదు.. నీరూ ఉండదు!
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు/గుమ్మలక్ష్మీపురం/పాలకొండ రూరల్/పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉపాధి హామీ పథకం వేతనదారులు ఆపసోపాలు పడుతున్నారు. ఓ వైపు ఎండలు.. మరోవైపు ఫేస్ యాప్ కష్టాలు.. వారికి పరీక్ష పెడుతున్నాయి. వేతనదారులకు పని దొరకడం.. గిట్టుబాటు వేతనం దక్కడం సంగతి పక్కనపెడితే.. అసలు రోజంతా ఎండల్లో నిరీక్షణకే సరిపోతోంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 451 పంచాయతీలు ఉన్నాయి. 2.11 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. ఇందులో సుమారు 1.90 లక్షల కార్డులు యాక్టివ్లో ఉన్నాయి. 3.80 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. ఏప్రిల్లో 1.70 లక్షల మందికి పనుల లక్ష్యం కాగా.. సగం మంది కూడా నమోదు కావడం లేదు. ఎంఎంఎస్(మొబైల్ మానిటరింగు సిస్టం) యాప్లో సాంకేతిక ఇబ్బందుల వల్ల సగం మందికిపైగా పనికి దూరం అవుతున్నారు. ముఖ ఆధారిత హాజరు నమోదు వల్ల.. చాలా మందికి తీసుకోవడం లేదు. దీంతో వారికి మస్తర్లు పడడం లేదు. హాజరుకోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. టెంట్లు ఉండవు.. ప్రథమ చికిత్స కిట్లు కానరావు ఎండల వల్ల ఉదయం 10 గంటలలోపు.. మరలా సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకూ పనులు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిబంధనలు క్షేత్రస్థాయిలో కాగితాలకే పరిమితం అవుతున్నాయి. పనిచేసే చోట కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వేతనదారులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడా టెంట్లు, మజ్జిగ, తాగునీరు, ప్రథమ చికిత్స పెట్టెలు కానరావడం లేదు. గతంలో పనికి వచ్చే వేతనదారులకు పనిముట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు నెలల తరబడి వేతనాల బకాయి ఉంటోంది. పార్వతీపురం మండలంలోని నర్సిపురం, అడ్డాపుశీల, చిన్నబొండపల్లి, కృష్ణపల్లి తదితర పంచాయతీల్లో పనులు చేస్తున్న వేతనదారులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. పని విరామ సమయంలో సేదతీరడానికి కనీసం టెంట్లు కూడా ఎక్కడా లేవు. గట్ల మీద, చెట్ల నీడలో ఆశ్రయం పొందుతున్నారు. మండుతున్న ఎండకు తాళలేక, వడదెబ్బకు గురవుతామని భయపడుతూనే వారు పనులను కొనసాగిస్తున్నారు. పాచిపెంట మండలం పి.కోనవలస పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనుల్లో వేతనదారులకు నీడకోసం టెంట్లు లేవు. దాహార్తిని తీర్చేందుకు నీరు, మజ్జిగ సదుపాయం కల్పన లేదు. ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు ఊసేలేదు. వేతనదారులంతా నీడ కోసం సమీప గట్టు వద్ద ఉన్న చెట్లను ఆశ్రయించడం కనిపించింది. గతంలో గునపం, పార వంటి పనిముట్లు ఇచ్చేవారని.. ఇప్పుడు అవి కూడా లేవని వేతనదారులు వాపోతున్నారు. ఫేస్ యాప్లో సాంకేతిక సమస్యలు అదనం. కొన్నిసార్లు ఫేస్ యాప్లో నమోదు కాకపోవడం వల్ల పనికి వచ్చినా ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోందని వేతనదారులు వాపోతున్నారు. ఉపాధి పనికి వసతుల లేమి.. ఓవైపు ‘యాస్’సోపాలు.. మరోవైపు ఎండలతో ఇక్కట్లు పని చేసే చోట కానరాని టెంట్లు, మజ్జిగ ఉపాధి వడదెబ్బ రోజులో అధిక సమయం నిరీక్షణే.. -
సేదతీరేదెలా?
గుమ్మలక్ష్మీపురం మండలం పరిధిలోని 27 పంచాయతీల్లో 12,808 జాబ్ కార్డులు ఉన్నాయి. శుక్రవారం 8,790 మంది వేతనదారులు ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్నారు. పనులు చేపడుతున్న ప్రదేశాల్లో సేదదీరేందుకు ఎక్కడా టెంట్లు గానీ.. తాగునీరు, పనిముట్లు, ప్రథమ చికిత్స పెట్టెల సదుపాయాలు గానీ కానరావడం లేదు. గతంలో పని ప్రదేశాల వద్ద మెడికల్ కిట్లతో పాటు టెంట్లు, తాగునీరు, పిల్లల్ని చూసుకునేందుకు ఆయాల వంటి సదుపాయాలు ఉండేవని.. ఇప్పుడవేమీ కానరావడం లేదంటూ వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. రోజూ ఫేస్ యాప్ నమోదు చేసుకోవాల్సి ఉండడం, సకాలంలో యాప్లో హాజరు నమోదు కాకపోవడం వల్ల వేతనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎస్.కే పాడులో ఎండలోనే పనులు చేపడుతున్న వేతనదారులు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే ఫేస్ యాప్ ద్వారా హాజరును ఉదయం, సాయంత్రం వేళల్లో వేసుకోవాల్సి వస్తోంది. ముఖ హాజరు సక్రమంగా నమోదు కాకపోవడంతో ఎక్కువ సమయం హాజరు కోసం వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు ఎండ ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో పనులు చేయలేకపోతున్నాం. పాత విధానంలోనే హాజరును నమోదు చేయాలి. – కడ్రక సీతారాం, వేతనదారుడు, నోండ్రుకోన గ్రామం, చినగీసాడ పంచాయతీ


