Parvathipuram manyam District Latest News
-
తోటపల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
పార్వతీపురం టౌన్: తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామమైన పిన్నింటి రామినాయుడువలస గ్రామ సమస్యలు పరిష్కరించాలని తోటపల్లి నిర్వాసితుల సంఘం జిల్లా కన్వీనర్ బంటు దాసు డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణ బిల్లులు చెల్లించాలని కలెక్టర్ శ్యామ్ప్రసాద్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గతేడాది ఏప్రిల్ 28న, ఈ ఏడాది మే 12న నిర్వాసిత గ్రామ ప్రజల సమస్యలను విన్నవించినా ఒక్కటీ పరిష్కరించకపోవడం విచారకరమన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తులసిరామినాయుడువలసలో ఏనుగుల గుంపు గరుగుబిల్లి: మండలంలోని తులసిరామినాయుడువలస గ్రామ సమీపంలో ఏనుగులు సోమవారం సంచరించాయి. వారం రోజులు గా నందివానివలస, సుంకి, సంతోషపురం, గొట్టివలస, తదితర గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తూ పంటలకు నాశనం చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులు తరలించాలని కోరుతున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు ● అసభ్యకర మాటలతో మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తనతోపాటు, ఇద్దరు మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తల దించుకునేలా జుగప్సాకరమైన వ్యాఖ్యలను పత్రికా ముఖంగా చేశారని నియోజకవర్గంలోని పెద బొండపల్లికి చెందిన చుక్క శ్రీదేవమ్మ గ్రామీణ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం విజయనగరంలో నివాసం ఉంటున్నానని.. గతంలో తాను వ్యాపారం నిమిత్తం స్వగ్రామంలో ఏర్పాటు చేసుకున్న పరిశ్రమలను, తోటలను ఎమ్మెల్యే విజయచంద్ర ధ్వంసం చేశారని.. నివాస గృహాన్ని సైతం జేసీబీలతో కూల్చి వేశారని.. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని ఆమె వివరించారు. ఏడాది కాలంలో తనతోపాటు.. మరో ఇద్దరు మహిళలను ఎమ్మెల్యే విజయచంద్ర వేధించారని గత నెల 19న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మీడియా సమావేశంలో ప్రస్తావించారని తెలిపారు. దీనిపై మరుసటి రోజు పార్వతీపురం శాసన సభ్యుడు విజయ చంద్ర మీడియా సమావేశం పెట్టి.. మహిళలని కూడా చూడకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు తమపై చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, మానసిక వేదన కలిగించాయని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే విషయమై శ్రీదేవమ్మ వద్ద ప్రస్తావించగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ తాను ఫిర్యాదు అందజేసినట్లు స్పష్టం చేశారు. -
సిరిమానోత్సవానికి వేళాయె..
పార్వతీపురం టౌన్: పార్వతీపురం గ్రామదేవతలు ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచెమ్మ, బంగారమ్మ అమ్మవార్ల ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మంగళవారం సాయంత్రం నేత్రపర్వంగా జరగనున్న సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది. సుమారు రెండు లక్షల మంది భక్తులు ఉత్సవంలో పాల్గొనవచ్చని పోలీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మేరకు 450 మంది పోలీసులను బందోబస్తు విధులకు నియమించారు. భక్తిశ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం అమ్మవారి సిరిమానోత్సవానికి ముందురోజు సోమవారం నిర్వహించిన తొలేళ్ల ఉత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. పట్టణానికి చెందిన రైతులు విత్తనాలను అమ్మవారి వద్దకు తీసుకురాగా, ముత్యాల ఘటాన్ని తెచ్చిన తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తొలేరు ఉత్సవం నిర్వహించారు. అమ్మవారి వద్ద విత్తనాలను ఉంచి పూజ చేశారు. అనంతరం రైతులకు విత్తనాలు అందజేశారు. వీటిని ఖరీఫ్లో జల్లే విత్తనాల్లో కలిపి సేద్యం చేస్తే పంటలు కలిసివస్తాయన్నది రైతుల నమ్మకం. 5 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సిరమాను తిరిగే ప్రధాన రహదారితో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. స్థానిక బాబూ జగ్జీవన్రామ్ కూడలి నుంచి పాత బస్టాండ్, రాయిగడ కూడలి వరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తామన్నారు. రాకపోకలు ఇలా.. సిరిమానోత్సవ సమయంలో కృష్ణపల్లి గ్రామానికి వెళ్లాల్సిన వారు ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బైపాస్ రోడ్డు, సౌందర్య థియేటర్ రోడ్డులో వెళ్లాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు లారీ, ఆటో తదితర వాహన యూనియన్లు సహకరించాలని కోరారు. సమస్యలు వస్తే తక్షణమే పోలీసులను సంప్రదించాలని సూచించారు. నేడు ముగ్గురు అమ్మవార్ల సిరిమానోత్సవం ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ఘనంగా తొలేళ్ల ఉత్సవం -
ముమ్మరంగా మొక్కజొన్నలు విత్తుతున్న రైతులు
సాలూరు రూరల్: మండలంలోని రైతులు మొక్కజొన్న విత్తనాలు జూన్ మొదటి వారంలోనే నాటుతున్నారు. తొలకరి జల్లులు తొందరగా పలకరించడంతో రైతులో ఆనందం వెల్లివిరుస్తోంది. తొందరగా విత్తులు నాటితే తొందరగా పంట చేతికి వస్తుందన్న ఆశతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇది ఇలా ఉండగా గత ఏడాది ఇలాగే జూన్ తొలి వారంలో ఉడిచిన మొక్కజొన్నలు వర్షాలు లేక ఎండిపోయి చాలావరకు రైతులు మలి విడత విత్తనాలు వేసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో శివరాంపురం గ్రామంలో రైతులు పంట నష్టపోవడంతో వ్యవసాయ అధికారులు మొక్కజొన్నలు జూన్ మూడవ వారంలో నాటాలని రైతులకు సూచించారు. అలా అయితే చీడపీడలు కూడా తక్కువగా ఆశిస్తాయని రైతులకు చెప్పారు. అయితే ఈ ఏడాది రైతులకు ఈ విషయంలో సచివాలయ సిబ్బంది కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులకు తగు సూచనలు సలహాలు ఇవ్వకపోవడంతో రైతులు అదును పోతుందేమోనన్న తొందరపాటులో చిన్నచిన్న పొరపాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో రైతులకు తగు జాగ్రత్తలు వ్యవసాయ అధికారులు సూచించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. -
ప్రజల సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశమందిరంలో కలెక్టర్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 63 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోపు అర్జీదారు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు, పునఃపరిశీలన లేకుండా సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని తెలిపారు. పీజీఆర్ఎస్కు 32 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు వచ్చాయి. జమ్మడుగూడ గ్రామానికి చెందిన సవర కళ్యాణ్ రహదారి మంజూరు చేయాలన్నారు. చిన్నపొల్లకు చెందిన శ్రీలత కుట్టుమిషన్ ఇప్పించాలని కోరారు. మామిడి, జీడి మొక్కలు పంపిణీ చేయాలని కురసింగి గ్రామస్తులు వినతి ఇచ్చారు. కోడిశ గ్రామస్తుడు హెచ్.రవి వన్బి అడంగల్ ఇప్పించాలన్నారు. ట్రాక్టర్ లోన్ మంజూరు చేయాలని పద్మాపురం గ్రామస్తుడు మనోసింగు కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, పీహెచ్వో ఎస్.వి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి పార్వతీపురం రూరల్: ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఉత్తర్వుల మేరకు పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురానా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన నాలుగు ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, అత్తారింటి వేధింపులు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం సమస్యలను సంబంధింత పరిధిలో ఉన్న స్టేషన్ అధికారులకు అప్పగించి వాటిని దర్యాప్తు చేసి తక్షణ చర్యలు చేపట్టి జిల్లా పోలీసుశాఖ కార్యాలయానికి నివేదికను పంపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్కు అందిన విజ్ఞప్తులలో కొన్ని.. ముత్యాల సెంటర్ నుంచి కొత్తం గ్రామం వరకు మెయిన్ రోడ్డు మంజూరు చేయాలని సీతంపేట మండలం కొత్తం గ్రామానికి చెందిన సవర.గంగయ్య అర్జీ అందజేశారు. వీరఘట్టం మండలం అడారు గ్రామానికి చెందిన సీహెచ్. దుర్గమ్మ ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తూ 2022 జూలైలో పదవీ విరమణ పొందియున్నానని, ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ అందలేదని, బెనిఫిట్స్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. పార్వతీపురం మండలం గదబవలస గ్రామానికి చెందిన కె. జగన్నాథం జీవన ఉపాధికోసం ట్రాక్టర్ కొనడానికి ప్రభుత్వం రుణం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. సాలూరు మండలం మావుడి గ్రామానికి చెందిన సీహెచ్ అశోక్(ఎస్టీ కొండదొర) కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎంవీ కరుణాకర్, జిల్లా ప్రణాళిక అధికారి ీపి.వీర్రాజు, డ్వామా పీడీ కె. రామచంద్రరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె. రాబర్ట్ పాల్, ఉద్యానవనశాఖ అధికారి బి.శ్యామల, పశుసంవర్థక శాఖ అధికారి డా.ఎస్.మన్మథరావు, డీఆర్డీఏ ఏపీడీ ఎం.సుధారాణి, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకురాలు ఆర్.కృష్ణవేణి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బండెమ్మ తల్లి హుండీల చోరీ
శృంగవరపుకోట: పధ్నాలుగు ఏళ్ల తర్వాత ఎస్.కోట మండలంలోని సీతంపేట గ్రామంలో వేడుకగా జరిగిన జరిగిన బండెమ్మ తల్లి పండగ భక్తుల్లో కొత్త ఉత్సాహం నింపినా, వారి మనోభావాల్ని మాత్రం దొంగలు దెబ్బకొట్టారు. ఆదివారం రాత్రి అమ్మవారి అనుపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 12గంటల వరకూ అమ్మవారి ఆలయం వద్ద సందడిగానే ఉంది. రాత్రి 12గంటల సమయంలో అనువంశిక అర్చకులు, పెద్దలు అమ్మవారికి చెల్లించాల్సిన కానుకలు, ముడుపులు చెల్లించి ఇళ్లకు వెళ్లారు. అమ్మవారి ఆలయం వద్ద సందడి సద్దుమణగగానే దొంగలు పక్కాగా ప్లాన్ అమలు చేశారు. రాత్రి 12గంటల తర్వాత ఆలయంలో ఉన్న స్టీల్, ఐరన్ హుండీలను ఎత్తుకుపోయారు. స్టీల్ హుండీ పగలగొట్టి పక్కన ఉన్న పశువుల పాకలో పడేశారు. ఇనుప హుండీని మాత్రం పట్టుకుపోయారు. 14 ఏళ్ల తర్వాత పండుగ జరగడంతో అమ్మవారికి ఆదాయం దండిగానే వచ్చింది. సుమారు లక్ష రూపాయలు చోరీకి గురైఉంటాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. చోరీ విషయం తెలుసుకున్న ఎస్.కోట పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటూ ఎస్.కోట పోలీసులు చెబుతున్నారు. -
నేటి నుంచి గ్రామస్థాయి యోగా శిక్షణ
● జాయింట్ కలెక్టర్ డాక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి యోగా శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమవుతుందని దీనికి ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా అధికారులకు జేసీ పలు సూచనలు చేశారు. ప్రతి సచివాలయానికి 9 మంది యోగా శిక్షకులను ఎంపిక చేశామని, వారి ద్వారా 3వ తేదీ నుంచి ఒక్కో బ్యాచ్కు 70 మంది చొప్పున 3 రోజుల యోగా శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. దీని కోసం ఎంపిక ఎంపిక చేసిన ప్రదేశాలను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఐదు రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న వారిని మాత్రమే యోగా శిక్షకులుగా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. ఇలా జూన్ 14 వరకు బ్యాచ్ల వారీగా శిక్షణ జరుగుతుందని గ్రామంలోని దాదాపు అందరికీ యోగా శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. -
ఇంటిపైకి దూసుకెళ్లిన కారు..
● ముగ్గురికి తీవ్రగాయాలు విజయనగరం గంటస్తంభం/క్రైమ్: విజయనగరం సన్స్కూల్ పక్కన రామకృష్ణ నగర్లో నివాసముంటున్న పట్నాన సత్యవతి ఇంటి పైకి డంపింగ్ యార్డు మీదుగా 15 అడుగుల ఎత్తు నుంచి ఓ కారు దూసుకువచ్చింది. ఈ ఘటనలో పట్నాన సత్యవతి(60), గొడ్డు వినయ్(14), పట్నాన వినయ్(12) కారు కింద ఇరుక్కుపోయారు. దీంతో కాలనీ యువకులు హుటాహుటిన ప్రమాద స్ధలానికి చేరుకుని కారును ఎత్తి వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరావు, ఎం.శాంతమూర్తి పరామర్మించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అర్ధరాత్రి మద్యం తాగుతూ కారును నడిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైవోల్టేజ్తో కాలిపోయిన టీవీలువిజయనగరం ఫోర్ట్: పట్టణంలోని జొన్నగుడ్డి రుప్పవీధిలో హైవోల్టేజ్ రావడంతో సోమవారం ఓ ఇంట్లోని ఫ్యాన్లు, టీవీ, కూలర్, లైట్లు కాలిపోయాయి. అలాగే బట్టలతో సహా అన్నీ కాలిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోవడంతో బాధిత కుటుంబం ఆవేదన చెందుతోంది. 25 లీటర్ల సారా పట్టివేతసీతంపేట: మండలంలోని కొత్తకోట జంక్షన్ వద్ద 25 లీటర్ల సారా అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు దోనుబాయి ఎస్సై మస్తాన్ తెలిపారు. వీరఘట్టానికి చెందిన శివయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక ట్రాక్టర్.. బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతినదిలో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం ఆర్డీఓ జేవీవీఎస్ రామ్మోహనారావు అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనుమతులు లేకుండా ఇసుకను తవ్వి తరలిస్తున్నందుకు గాను ట్రాక్టర్ యజమానకి రూ.10వేల జరిమానా విధించామని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. లారీని ఢీకొని ఇద్దరికి గాయాలుగుర్ల: మండలంలోని అచ్యుతాపురం వద్ద సోమవారం ఇద్దరు యువకులు గాయపడ్డారు. మెరకముడిదాం మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన స్వామి, వాసులు ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్తుండగా అచ్యుతాపురం వద్ద విజయనగరం నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తలపై గాయాల య్యా యి. గుర్ల పీహెచ్సీలో ప్రథమ చికిత్స ఆనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డి ల్యాబ్స్ ఉద్యోగిని ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. పడాల పేటలో ఉంటున్న నడిపేన భారతి, పూసపాటిరేగ వద్ద గల రెడ్డి ల్యాబ్స్లో పని చేస్తోంది. వృత్తిలో పర్మినెంట్ కాలేదని కొన్ని రోజుల క్రితం ఆమె కన్నల్లికి చెప్పింది. చేస్తున్న పనిలో ఒత్తిడి కూడా అధికం అవడం, తల్లికి భారమవుతున్నానన్న బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావించి డ్యూటీ నుంచి రాగానే ఇంట్లోని తన గదిలో తలుపేసుకుని ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఈ మేరకు భారతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని చిన్నమరికి గదబవలస గ్రామాల మధ్యలో ఉన్న మలుపు వద్ద సోమవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో జియ్యమ్మవలస మండలం బసంగి గదబవలసకు చెందిన చాట్ల సింహాచలం (33) మృతి చెందినట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పెళ్లి పనుల నిమిత్తం వెళ్లి.. మృతుడిని జియ్యమ్మవలస మండలం బసంగి గదబవలసకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయం సమీపంలో ఉన్న ఐటీడీఏ పార్కులో నిర్వహణ పనుల సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడి అత్తవారు పార్వతీపురం మండలంలోని కొత్తూరు కావడంతో బుధవారం జరగనున్న తన బావమరిది పెళ్లి పనుల నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో మామతో కలిసి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి మూడేళ్ల అబ్బాయి ఉండగా భార్య గర్భిణి కావడంతో డెలివరీ నిమిత్తం కన్నవారింట్లో ఉంది. కుటుంబ పోషణకు పెద్ద దిక్కుగా ఉన్న యజమాని మరణంతో అత్తవారింట, కన్నవారింట విషాదఛాయలు అలుముకున్నాయి. -
యోగాంధ్ర అర్బన్ లెవెల్ పోటీలు
విజయనగరం: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 అర్బన్ స్థాయి పోటీలను విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక రాజీవ్ స్టేడియంలో యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్కు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు అర్బన్ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఈనెల రెండో తేదీ నుంచి ఏడో తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అర్బన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయి పోటీలకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పీడీలు, పీఈటీలు, యోగా శిక్షకులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు. 375 గ్రాముల గంజాయి స్వాధీనం● ఇద్దరి అరెస్ట్ విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గంజాయి విక్రయదారులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పెద్ద చెరువు రామానాయుడు రోడ్డులో కొంతమంది వ్యక్తులు గంజాయి పీలుస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఉడాకాలనీకి చెందిన వజ్జల భరత్ కుమార్, లంకాపట్నానికి చెందిన చిన్న మనోహర్లు గంజాయి పీలుస్తూ, విక్రయాలకు పాల్పడుతుండగా పట్టుకున్నారు.వారి దగ్గర నుంచి 375 గ్రాముల గంజాయి, రూ.350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. గంజాయిని చిన్న మొత్తాల్లో విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
అన్ని వర్గాలకూ చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు : అన్ని వర్గాల ప్రజలకూ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర అన్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లు అమలుకాని హామీలిచ్చి, అరచేతిలో వైకుంఠం చూపారని.. నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలను నిలువునా మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దగా పడిన అన్ని వర్గాల వారికీ అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4న జిల్లాలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు చెప్పారు. సోమవారం సాలూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. తొలుత కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి అబద్ధాలు.. గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రచారం చేసుకున్నారని.. మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలన్నీ ఏమయ్యాయని రాజన్నదొర ప్రశ్నించారు. ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమన్నారు. రండి.. రండి.. నచ్చిన దగ్గరకు వెళ్లండి అని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితమని మంత్రి సంధ్యారాణి శాసనసభలో ప్రకటించారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా మంత్రి మాటలున్నాయి. మహిళలు ఏ మాటలు నమ్మాలి. గత ఆగస్టుకు అమలన్నారు. మళ్లీ ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఇలా ఎన్ని ఆగస్టులు పోవాల’ని విమర్శించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనమన్నారు. ఏడాది గడిచినా ఒక్కరికీ ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. ఎప్పుడిస్తారో తెలియదు. ఇలా మహిళలకు ఇస్తామన్న ఏ పథకమూ అమలు చేయకుండా మన అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి మహిళలకు రూ.18,750 చొప్పున ఇచ్చేవారు. ప్రతి అక్కా ఆలోచించాలి. మీ కోసమే మా నిరసన. ర్యాలీకి తరలివచ్చి మీ గళం వినిపించాలి.’ అని రాజన్నదొర పిలుపునిచ్చారు. ఏడాదిలో యువతకు రూ.36 వేలు బాకీ.. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం.. వారికి వెన్నుపోటు పొడిచిందని రాజన్నదొర విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారని.. ఏడాదవుతున్నా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని నిరుద్యోగులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఏడాది కాలంలో ఒక్కొక్కరికీ రూ.36 వేలు చొప్పున కూటమి ప్రభుత్వం బకాయి పడిందన్నారు. ‘యువతా.. ఆలోచించండి.. ఈ పోరాటం వైఎస్సార్సీపీ కోసం కాదు.. మీ కోసం.. మీ గళం వినిపించడానికి.. ఇందులో మీరంతా భాగస్వామ్యం కావాల’ని పిలుపునిచ్చారు. వీరందరికీ చేసింది వెన్నుపోటు కాదా? ఎస్సీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లు దాటితే పింఛన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసగించారని రాజన్నదొర అన్నారు. కనీసం ఆ ఆలోచన కూడా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేయలేదని గుర్తు చేశారు. కొండ మీద ఉన్న గిరిజనులకు కూడా ఎండీయూ వాహనాల ద్వారా తమ ప్రభుత్వంలో రేషన్ సరుకులు అందజేసేవారమని తెలిపారు. ఇప్పుడు ఎండీయూ వ్యవస్థను ఈ ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తామని చేసిన ప్రకటన.. ఎక్కడా అమలు కాలేదన్నారు. వారంతా సుదూరం నడుచుకుంటూ వెళ్లి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండీయూ వాహనాల పట్ల కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. ఎంతో మంది నిరుద్యోగుల ఉపాధితీసేసిందని తెలిపారు. ‘వలంటీర్ల లేకుండా పింఛన్ ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? వలంటీర్లు ఒక్క సేవకే పరిమితం కాలేదు.. ఇల్లు, రేషన్, ఆధార్, పెన్షన్ ఏది కావాలన్నా.. నీరు లేకపోయినా, శానిటేషన్ బాగోకపోయినా వలంటీర్లకు ప్రజలు చెప్పేవారు. దేశానికే ఈ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. అటువంటి వలంటీర్లకు వెన్నుపోటు పొడిచారు. మీరు అధికారంలోకి వస్తే వారికి రూ.10 వేలు ఇస్తామని చెప్పడం అబద్ధమా?’ అని కూటమి నాయకులను ప్రశ్నించారు. గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా పరిగణిస్తామని, జీఓ 3 అమలు చేస్తామని మాటిచ్చి, ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇలా గిరిజనులకూ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. జగన్ రైతు భరోసా ఇస్తే.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అని మోసగించారని గుర్తు చేశారు. తాము రూ.13,500 రైతుభరోసా కింద ఇస్తే.. కేంద్రం ఇచ్చిన డబ్బులతో కలిపి ఇస్తారా? అని చంద్రబాబు గగ్గోలు పెట్టారని... ఇప్పుడు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం రూ.20 వేలు ఇవ్వగలదా? అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో రైతులకు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ వర్గాన్నీ వెన్నుపోటు పొడిచారని తెలిపారు. హామీలిచ్చి మోసగించారు.. మాట్లాడితే కేసు.. అరెస్టుల ఆంధ్రాగా మార్చారు ప్రజలకు మంచి జరగాలనే మా పోరాటం ఈ నెల 4న ‘వెన్నుపోటు దినం’ను విజయవంతం చేయాలి మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు రాజన్నదొర దగా పడ్డ ప్రజల కోసమే ‘వెన్నుపోటు దినం’ ఇలా అన్ని వర్గాల కోసమే ఈ నిరసన.. వైఎస్సార్సీపీ కోసం కాదని రాజన్నదొర అన్నారు. సాలూరులో ఈ నెల 4న చేపట్టబోయే ర్యాలీలో అన్ని వర్గాలూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ఈ పోరాటమని స్పష్టం చేశారు. అరెస్టుల ఆంధ్రాలో.. మాట్లాడితే కేసు! ‘రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఎవరడిగితే వారిపై కేసు.. ఎవరు మాట్లాడితే వారిపై కేసు. అరెస్టుల ఆంధ్రాగా మార్చేశారు. ఐఏఎస్, ఐపీఎస్లపైనా కేసులు పెడుతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా లేదు. ఎక్కడైనా ఐఏఎస్, ఐపీఎస్లపై ఇటువంటి అరెస్టులు ఉన్నాయా? అధికారులు ఆలోచించాలి. మాకు రెడ్బుక్ లేదు.. కానీ.. మేమూ రాసుకుంటున్నాం. ఏ అధికారి ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నామ’ని రాజన్నదొర వ్యాఖ్యానించారు. తాను ఏనాడూ పోలీసులపైన, ఇతర అధికారులపైన దురుసుగా వ్యవహరించలేదని, ఏ విషయంలోనూ వారిపై ఒత్తిడి తీసుకురాలేదని గుర్తు చేశారు. ‘ఆ రోజు మిమ్మల్ని ఎలా చూసుకున్నామో.. ఈ రోజు మీరు ఎలా పని చేస్తున్నారో ఒకసారి అధికారులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడున్న గిరిజన శాఖ మంత్రి మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు? ఒక్క సాలూరు నియోజకవర్గంలోనే ఎన్నో ఉద్యోగాలు తీసేశారు. సస్పెండ్ చేస్తున్నారు.. బలవంతంగా బదిలీలు చేస్తున్నారు. చివరికి వీఆర్వో, వీఆర్ఏలను కూడా వదలడం లేదు. పాచిపెంట మండలం కేసలి పంచాయతీలోనే పలువురిని విధుల నుంచి తొలగించారు. గతంలో మా ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించండి. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలే జరిగింది గానీ, కీడు తలపెట్టలేదు. పీఆర్సీ కోసం ప్రత్యేక కమిషన్ను జగన్ వేశారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది.. ఐఆర్ లేదు. డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పాత పెన్షన్ విధానం కోసం ఏమైనా మాట్లాడుతున్నారా? బకాయి పడిన డబ్బులిచ్చారా?.. ఇది వెన్నుపోటు కాదా? ’ అని రాజన్నదొర ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే హత్యలు, అత్యాచారాలు, అక్రమకేసులు అధికమయ్యాయని విమర్శించారు. -
పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేద్దాం
పార్వతీపురం టౌన్: పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం క్లాత్బ్యాగ్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. జూన్ 5న వనం మనం కార్యక్రమంను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ శోభిక, డీఆర్వో కె.హేమలత, ఇంజినీర్ కరుణశ్రీ పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్ లేదా క్లాత్ బ్యాగ్లు -
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
విజయనగరం క్రైమ్: సైబర్ మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తతే ప్రతి ఒక్కరి ఆయుధమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని అలాగే 1930 టోల్ ప్రీ నంబర్కు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజల అవగాహన లోపం కారణంగా సైబర్ మోసాలకు గురవుతున్నారన్నారు. సైబర్ మోసగాళ్లు చెప్పే మాయ మాటల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. సైబర్ మోసాల నియంత్రణలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు లాంటి అంశాలను హ్యాకర్లు లేదా సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, వాటి వివరాలను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకులు, అప్లికేషన్లను క్లిక్ చేయవద్దని, ఎవరైనా వ్యక్తిగత సమాచారం ఫోన్ ద్వారా అడిగితే ఇవ్వవద్దని, శంకించ దగిన వెబ్ సైట్లను వినియోగించ వద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశం టోల్ ఫ్రీ నంబర్ 1930 ఎస్పీ వకుల్ జిందల్ సూచన -
జాతీయస్థాయి దివ్యాంగుల పోటీలకు తోషిని ఎంపిక
తెర్లాం: జాతీయస్థాయిలో జరగనున్న దివ్యాంగుల క్రీడల పోటీలకు తెర్లాం మండలకేంద్రానికి చెందిన అడ్డా తోషిని ఎంపికై ంది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన తోషినిని శనివారం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారని తెర్లాం హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు సునీల్ ఆదివారం తెలిపారు. గత నెలలో ఏలూరు జిల్లా ఆరిగిపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పెషల్ ఒలింపిక్స్ భారత్ పోటీల్లో తోషిని బోసిగేమ్లో పాల్గొంది. ఈ ఆటలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించి గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు తోషిని ఎంపికై ంది. తోషిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తెర్లాం హైస్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. సన్మానించిన జిల్లా మంత్రి శ్రీనివాస్ -
నేలబావిలో పడి యువకుడి మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం గ్రామ సమీపంలో వెంకటరాయుడుపేట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ నేలబావిలో పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన 10మంది స్నేహితులు ఈతకు వెళ్లారు. వారిలో పార్వతీపురం పట్టణంలోని తూర్పు వీధికి చెందిన మజ్జి తరుణ్ (23) ప్రమాదవశాత్తు నేలబావిలో మునిగిపోయి మృతిచెందాడు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి పేర్కొన్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఆమె చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
విజయనగరం క్రైమ్: సాలూరుకు చెందిన ఓ పత్రిక విలేకరి కొడుకు విజయనగరంలోని జొన్నవలస రైల్వేట్రాక్పై ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాలూరులో 2019లో సీఐగా పనిచేసిన శ్రీనివాస్ పర్సనల్ ఫోన్ నంబర్కు ఆ విలేకరి ఫోన్ చేసి తన కొడుకు విజయనగరంలో రైల్వేట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో సందేశం పెట్టాడని, తన కొడుకును కాపాడాలంటూ వేడుకున్నారు. దీంతో ప్రస్తుతం విజయనగరం వన్టౌన్ సీఐగా ఉన్న శ్రీనివాస్ విలేకరి ఫోన్ చేయగానే సరాసరి జొన్నవలస రైల్వేగేట్కు వెళ్లారు. అక్కడే కళ్లముందే రైల్వేట్రాక్పై యువకుడు పడుకోవడాన్ని చూసి వెనువెంటనే బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. వివరాలు అడిగితే తాను చనిపోవాలని అనుకుంటున్నానని , ఎందుకో కారణం చెప్పక పోవడంతో వన్టౌన్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం యువకుడి తల్లిదండ్రులను పిలిపించి స్టేషన్లోనే ఆ కుర్రాడికి వన్టౌన్ సీఐ తన బృందంతో కౌన్సెలింగ్ ఇచ్చారు. -
వామ్మో..రేడియేషన్..!
విద్యుదయస్కాంత తరంగాలతో.. సెల్ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల వల్ల గర్భిణులు, చంటి పిల్లలకు చాలా ప్రమాదం ఉంది. గర్భంలో శిశువు ఎదుగుదలకు అడ్డుగా మారి, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం తదితర పరిణామాలు ఉంటాయి. సెల్ టవర్లు ఉన్న ప్రాంతంలో ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్. వై.సతీష్ కుమార్, ఫిజిక్స్ లెక్చరర్విజయనగరం గంటస్తంభం: విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన సెల్ టవర్లతో ప్రజలు రేడియేషన్ బారిన పడుతున్నారు. 3ఎ, 4ఎ, 5ఎ అని సిగ్నల్స్ కోసం వివిధ రకాల మొబైల్ కంపెనీలు విచ్చలవిడిగా జనవాస ప్రాంతాలలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రధానంగా దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ఉన్న ప్రదేశాలకు దూరంగా వాటిని నిర్మించాలనే నిబంధనను తుంగలోకి తొక్కి ఇష్టానుసారం నిర్మిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులకు ఈ రేడియేషన్ చాలా ప్రమాదకరం. మానవ శరీరంలో నిత్యం అనేక కణాలు నూతంగా పుడుతుంటాయి కొన్ని మరణిస్తూ ఉంటాయి. సక్రమంగా కణ విచ్ఛిత్తి జరిగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. గాడి తప్పుతున్న కణ విచ్ఛిత్తి ఈ రేడియేషన్ వల్ల కణ విచ్ఛిత్తి గాడి తప్పి కణాలు ప్రవర్తించడం వల్ల క్యాన్సర్ కణుతులు ఏర్పడి మనిషి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నాయి. ఈ టవర్లు ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమానులు మొబైల్ కంపెనీలు ఇచ్చే అద్దెలకు, వారు ఇచ్చే ఆఫర్లకు ఆశ పడి వాటి వల్ల వచ్చే ప్రమాదాలను ఊహించలేక పోతున్నారు. వైర్లెస్ టెక్నాలజీ పెరిగి మనిషి జీవితం సుఖవంతవుతుందని ఆనందంపడాలో రేడియేషన్ వల్ల వచ్చే వివిధ రకాల భయంకరమైన క్యాన్సర్ తదితర రోగాలతో బాధ పడాలో అర్థం కాని అయోమయ స్ధితిలో నేటి యువతరం ఉంది. రేడియేషన్ వల్ల చర్మ సంబంధ వ్యాధులతో పాటు, కళ్లు ఎర్రబడడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, జుట్టు ఊడిపోవడం, పురుషులకు సంతాన సామర్ధ్యం తగ్గిపోవడం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికో సుగర్ వ్యాధి బాధితులు ఉన్నట్లయితే భవిష్యత్లో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానవులు, వన్యప్రాణులపై మొబైల్ టవర్ల ప్రభావం -
అమ్మో..జూన్..!
అమ్మా..నాన్నా..కొత్త బ్యాగు, కొత్త పుస్తకాలు..కొత్త యూనిఫాం..కొత్త షూస్ కావాలని పిల్లలు ఇంట్లో అడుగుతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతున్నాయి. ఆకాశం వైపు.. పొలంవైపు చూస్తూ..ఈ ఏడాది వరిపంట వేయాలి. సాగుకు పెట్టుబడి సాయం కోసం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మదిలో మెదలగానే అన్నదాతల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏటా జూన్ నెల వచ్చిందంటే చాలు. పిల్లల తల్లిదండ్రులు..అన్నదాతలు..కంటికీ కనిపించని శత్రువుతో మానసిక యుద్ధం చేయాల్సిందే.పార్వతీపురం: జూన్ మాసం వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాలు, రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం..రైతులకు పంటల సాగులో పెట్టుబడుల భారం తప్పడం లేదు. పిల్లలకు ఫీజులు, వసతి ఖర్చులు, తలుచుకుని తల్లిదండ్రులు జూన్ నెల వచ్చేసిందంటూ ఆందోళన చెందడం పరిపాటిగా మారింది. పాఠశాలల ప్రారంభానికి మునుపే ప్రైవేట్ పాఠశాల సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను గాలించారు. ప్రాథమిక పాఠశాల విద్య పూర్తయిన వారిని ఉన్నత పాఠశాలకు, ఉన్నత విద్య పూర్తయిన వారిని తమ కళాశాలలో చేర్పించాలంటూ ఒకటికి రెండుసార్లు ఒత్తిడి తెచ్చి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించుకున్నారు. గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల నుంచి పలువురు విద్యార్థులను సమీపంలోని పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో పాఠశాలకు చెందిన బస్సులు విద్యార్థులను తీసుకువెళ్లేందుకు గ్రామాలకు వస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం రైతులు ఖరీఫ్లో సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడికి రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇటు వ్యవసాయ మదుపులు, అటు కళాశాల, పాఠశాలల ఫీజుల భారంతో సగటు మనిషి ఆర్ధిక ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయంకింద ఏటా రూ.14వేలు అందించి రైతులను ఆదుకోవడంతోపాటు అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు అదించించి తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంకానీ, చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని కానీ అందించలేదు. ఈ కారణంగా రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సాగుకు భారంజిల్లాలోని పదిహేను మండలాల్లో 1.77 లక్షల ఎకరాల్లో 52, 500 మంది రైతులు ఖరీఫ్లో వరిపంటను సాగుచేస్తున్నారు. ఎకరా వరి పంటను సాగుచేయాలంటే రూ.15వేల నుంచి రూ. 20వేలవరకు మదుపు అవుతుంది. ప్రస్తుతం ఆయాగ్రామాల్లో పదుల సంఖ్యలో రైతులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలను సాగుచేసి కుటుంబ పోషణ చేస్తున్నారు. రైతులు ఖరీఫ్కు తమ పంట పొలాలను సాగుకు సిద్ధం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వరిపంటను సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. చేతిలో నగదు లేకపోయినా అప్పులు చేసైనా పంటలు పండించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురవడంతో ఖరీప్ పనులపై ఆశ రైతుల్లో పెరుగుతోంది. తల్లిదండ్రులకు ఫీజుల భారం రైతులకు పంట సాగు పెట్టుబడి ఆందోళనఫీజుల మోత..ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫీజులు, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, యూనిఫాం, బ్యాగుల కొనుగోలుకు వారి నెలవారీ బడ్జెట్ సరిపోవడం లేదు. ఫీజులు, బస్సు రవాణా, పుస్తకాల భారం తడిసి మోపెడవుతోంది. ప్రాథమిక పాఠశాల స్థాయికి రూ.15వేల నుంచి రూ.40వేల వరకు, ఉన్నత పాఠశాల స్థాయికి రూ. 25వేల నుంచి రూ.60వేల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇంటర్మీడియట్కు కార్పొరేట్ కళాశాలల్లో రూ.80 వేల నుంచి రూ.2.50లక్షల వరకు ఖర్చవుతుంది. విద్య ఖర్చులు, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా ఉన్నాయి. అయినా పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అప్పు చేసైనా చదివించేందుకే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం పర్యవేక్షణ కొరవడడం, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల చెల్లింపులను నిఘాపరిధిలో చేర్చకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను క్రమబద్ధీకరించడం, ఫీజుల వసూళ్లపై నిఘా వేయడం, ఇన్కంటాక్స్ దాడులను చేస్తే కొంతవరకై నా ఫీజులమోత తగ్గే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నాలుగు వాహనాలు దగ్ధం
కొత్తవలస: మండలంలోని రాజా థియేటర్ సమీపంలో గల వసంత్విహార్ అపార్ట్మెంట్ సముదాయం బ్లాక్–5లో సెల్లార్ కింద గల నాలుగు వాహనాలు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి దగ్ధమయ్యాయి. పి.లక్ష్మణరావు, కె.వెంకటస్వామిలకు చెందిన ద్విచక్రవాహనాలతో పాటు మరొకరికి చెందిన ఒక ద్విక్రవాహనం, మారుతి–800 కారు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సెల్లార్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ రావడంతో అపార్ట్మెంట్ వాసులు దిగి చూసేసరికి వాహనాలు తగలబడిపోతున్నాయి. ఆర్పేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో కొత్తవలస అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే గల విద్యుత్ మీటర్ల బోర్డుకు ఈ మంటలు వ్యాపించి ఉంటే పెనుప్రమాదం జరిగేదని అపార్ట్మెంట్ వాసులు భయాందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ వాహనాలకు కావాలనే నిప్పు పెట్టారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో అపార్ట్మెంట్ వాసులు -
ముగిసిన బదిలీ ప్రక్రియ
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది బదిలీ ప్రక్రియ గత నెల 29 నుంచి ఆదివారం వరకు ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ నేతృత్వంలో నిర్వహించగా ఆదివారం ఈ ప్రక్రియ ముగిసినట్లు పీఓ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, అలాగే బోధనేతర సిబ్బందికి బదిలీలకు సంబంధించిన పత్రాలను ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ఆయన ఆదివారం అందజేశారు. జీఓ23 అమలు సరికాదు బదిలీలపై యూటీఎఫ్ కార్యదర్శి మురళీమోహన్ మాట్లాడుతూ బోధనేతర సిబ్బందికి సంబంధించిన జీఓ నంబర్ 23ను అనుసరించి బదిలీ ప్రక్రియ నిర్వహించడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు జీఓ నంబర్ 22 మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల తరఫున ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. -
తైక్వాండో ఓవరాల్ చాంప్ మదర్ థెరిసా క్లబ్
విజయనగరం: జిల్లాస్థాయిలో జరిగిన తైక్వాండో బాల, బాలికల పోటీల్లో విజయనగరానికి చెందిన మదర్ థెరిసా క్లబ్ జట్టు సత్తా చాటింది. గత నెల 31న బొబ్బిలి వేదికగా జరిగిన పోటీల్లో పాల్గొన్న జట్టులోని 27 మంది క్రీడాకారులు బంగారు పతకాలు కై వసం చేసుకోవడంతో పాటు ఓవరాల్ చాంపియన్షిప్ను దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈనెల 9,10,11 తేదీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరగనున్న రాష్ట్రస్థాయి బాల, బాలికల తైక్వాండో పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా నిలవడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న మదర్ థెరిసా క్లబ్ క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావులు అభినందించారు. -
మళ్లీ రేషన్ తిప్పలు!
పార్వతీపురం టౌన్: ప్రజలకు 2019కు ముందు మాదిరి రేషన్ తిప్పలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సరుకుల కోసం రేషన్ షాపుల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటకీ గత్యంతరం లేక ప్రజలు వరుసలో ఉండాల్సిన పరిస్థితి. రేషన్ షాపు నుంచి సరుకులు తీసుకుంటున్న లబ్ధిదారులు అష్టకష్టాలు పడి వాటిని ఇంటికి తీసుకువెళ్తున్నారు. రేషన్ షాపులకు కొన్ని గ్రామాల్లో అర కిలోమీటరు, కిలోమీటరు దూరం వెళ్లాల్సిన పరిస్థితి. అయినప్పటకీ గత్యంతరం లేక అక్కడకే ప్రజలు వెళ్లాల్సిన పరిస్థితి. రేషన్ సరుకుల కోసమే ఒక రోజంతా కేటాయించాల్సిన పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) వాహనాలను తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపీణి చేసింది. దీంతో ప్రజలకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేది. వృద్ధులు, నడవలేని వారు ఇంటికే సరుకులు రావడంతో ఎంతో సంతోషించేవారు. ప్రజలకు ఉపయోగకరమైన ఎండీయూ వ్యవస్థను కూటమి సర్కార్ రద్దు చేసి ప్రజలను ఇక్కట్లు తెచ్చి పెట్టింది. దీంతో మళ్లీ రేషన్కు లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. -
ఇప్పల పోలమ్మకు కలెక్టర్ ప్రత్యేక పూజలు
పార్వతీపురం టౌన్: పార్వతీపురం పట్టణ ప్రజల ఇలవేల్పు ఇప్పల పోలమ్మ జాతర సందర్భంగా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండగ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి ఇంటర్ కళాశాలల పునఃప్రారంభం విజయనగరం అర్బన్: జూనియర్ కళాశాలల కు వేసవి సెలవులు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూ నియర్ కళాశాలలు 18, కేజీబీవీలు 26, ఆదర్శ పాఠశాలలు 16 ఉన్నాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు కళాశాలలకు హాజరు కావాలని ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు సూచించారు. రేషన్ పంపిణీ పరిశీలన విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని కేఎల్పురంలో 281098 నంబర్ రేషన్ షాపును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదివారం పరిశీలించా రు. సరుకుల నిల్వపై ఆరా తీశారు. సరుకుల ను సకాలంలో పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట డీఎస్వో మధుసూదన్రావు, సీఎస్డీటీ రామారావు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ విజయనగరం అర్బన్: బోధన నైపుణ్యాలకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక రోజు ఉచిత శిక్షణా తరగతులు స్థానిక యూత్ హాస్టల్లో ఆదివారం నిర్వహించారు. శిక్షకుడు విల్ 2 కెన్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణలో స్పోకెన్ ఇంగ్లిష్ విద్యార్థులకు నేర్పించడంలో ఉపాధ్యాయులు తెలుసుకోవలసిన మెలకువలు వివరించారు. ఈ మెలకువలతో విద్యా ర్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షకుడు రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను పెంపొందించే ఇలాంటి శిక్షణలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులకు జ్ఞాపి కలు, శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ శిక్షణ కళాశాల సీఐ మురళి, ఉపాధ్యాయులు సోమశేఖర్, రెడ్డి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం శృంగవరపుకోట: పట్టణంలోని కేంబ్రిడ్జ్ నారాయణ స్కూల్లో నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ షటిల్ క్యాంప్ ముగింపు వేడుకలు చీఫ్ కోచ్ పి.శ్రీరాములు నేతృత్వంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఎమ్మెల్సీ రఘురాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ.. శిబిరం నిర్వహణకు రూ.1,80,000 లు ఖర్చు కాగా, రఘురాజు గారి మిత్రబృందం ఈ ఖర్చు మొత్తాన్ని భరించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడలతో మానసిక ఆనందంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఏర్పర్చుకోవచ్చన్నారు. దీన్ని గుర్తించి విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన 105 మంది క్రీడాకారులను, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, పట్టణ పెద్దలు హాజరయ్యారు. -
‘వెన్నుపోటు దినం’కు తరలిరండి
సాలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 4న వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని, దీనికి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. పట్టణంలోని తన స్వగృహంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో పాటు గత వైఎస్సార్సీపీ పథకాలను అమలు చేస్తామని ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన తరువాత మోసం చేశారని దుయ్యబట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారిని సైతం ధైర్యంగా ఎదుర్కొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, అభివృద్ధి పనులు చేపట్టిన జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఎన్నడూ మరచిపోరన్నారు. అధికారంలోకి వస్తూనే వలంటీర్లును తొలగించారని, ఇప్పుడు ఎండీయూ ఆపరేటర్లను తొలగించారని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్లు, ఐఆర్లు, డీఏలు ఇవ్వలేని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. ఇందుకు నిరసనగా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 4న వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నిరసన ర్యాలీ బోసు బొమ్మ జంక్షన్ వరకు చేపడతామన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం ఇస్తామన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, బాధిత వలంటీర్లు, ఎండీయూ ఆపరేటర్లు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
● స్కానింగ్ కోసం గర్భిణుల అవస్థలు ● ఘోషా ఆసుపత్రి నుంచి సర్వజన ఆసుపత్రికి తరలింపు ● గంటల తరబడి నిరీక్షణ
విజయనగరం ఫోర్ట్ : ఘోషా ఆసుపత్రిలో ప్రసవం కోసం వెళ్లిన గర్భిణులకు స్కానింగ్ కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ సకాలంలో స్కానింగ్ జరగక గర్భిణులు గంటల తరబడి నిరీక్షించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి స్కానింగ్ కోసం గర్భిణులు ఉండాల్సి రావడంతో కొందరు తీవ్ర అసౌకర్యానికి గురై కన్నీరు పెట్టుకుంటున్నారు. అయినా అధికారులు తగు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘోషా ఆసుపత్రిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రం ఉన్నా.. ఘోషా ఆసుపత్రిలో మాత, శిశువులకు వైద్య సేవలు అందిస్తారు. ఇక్కడ కూడా అల్ట్రా సౌండ్ యంత్రం ఉంది. అయినా రోగులను ప్రతీ రోజు స్కాన్ కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పంపిస్తున్నారు. దీంతో గర్భిణులు అక్కడ నుంచి సర్వజన ఆసుపత్రికి రావడానికి, స్కానింగ్ చేయించుకోవడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుంది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ప్రతీ రోజు పది మంది వరకు గర్భిణులను సర్వజన ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఇది ఒక నిత్య తంతుగా మారిపోయింది. దీనికి పరిష్కారం చూపించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గర్భిణులకు అష్టకష్టాలు తప్పడం లేదు. గర్భిణుల కష్టాలు చూసిన వారు అయ్యో! అంటున్నారు. కానీ అధికారులు స్పందించడం లేదు.రేడియాలిజిస్ట్ లేకే.. ఘోషా ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ లేరు. గైనికాలజిస్ట్లు స్కానింగ్ను చేస్తున్నారు. వారికి ఎంత వర కు సాధ్యమవుతుందో అంతే చేస్తున్నారు. చేయ లేని పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వ సర్వజనఆసుపత్రికి రిఫర్ చేస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రేడియాలజిస్ట్ను ఘోషా ఆసుపత్రికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. రేడి యాలజిస్ట్ వస్తే ఘోషా ఆసుపత్రిలోనే స్కానింగ్ చేస్తాం. – డాక్టర్ అరుణశుభశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్, ఘోషాస్పత్రి -
పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
విజయనగరం అర్బన్: పశువుల అక్రమ రవాణాపై అధికారులు నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని విజయనగరం ఆర్డీవో టి.సవరమ్మ ఆదేశించారు. తన కార్యాలయంలో డివిజన్ జంతు సంక్షేమ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లొట్లపల్లి, మోపాడ జంతువులు మరియు పశువుల సంతల్లో పశువులను హింసాత్మకంగా అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సంతకు లైసెన్స్ లేకపోయిన అక్రమంగా సంత నిర్వహిస్తున్నట్టు దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో పశువధశాల లేకపోయినా పశుమాంస వ్యాపారాలు చేసుకునేందుకు లైసెన్స్లు ఇచ్చిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గో సంరక్షణ క్యాలెండర్ను ఆర్డీవో ఆవిష్కరించారు. సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఆరికతోట మోహనరావు, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మారావు, పి.అనురాధ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.చంద్రశేఖర్రావు, డివిజన్ పరిధిలో మండలాధికారులు, గో సంరక్షణ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం ఆర్డీవో టి.సవరమ్మ -
మలేరియా, డెంగీ నివారణకు చర్యలు : పీవో
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలో మలేరియా, డెంగీ కేసులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ కేసులు ఉండరాదని, వాటి నివారణకు పూర్తి చర్యలు తీసుకోవాలని, అలాగే పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐఎంఆర్, ఎన్ఎంఆర్ మరణాల రేటును తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీవో తేల్చి చెప్పారు. ఈ విషయంలో వైద్యాధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, ఉప జిల్లా వైద్యశాఖాధికారి కేవీఎస్ పద్మావతి, జిల్లా మలేరియా అధికారి వై.మణి, ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎం.వినోద్కుమార్, ఐటీడీఏ పరిధిలో వున్న మండలాల వైద్యాధికారులు పాల్గొన్నారు. -
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.90 లక్షల జరిమానా
విజయనగరం క్రైమ్: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి రూ.10వేల జరిమానా విధిస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 49 మందిపై ఒక్క రోజులోనే కేసులు నమోదు చేసి విజయగరం అడిషనల్ జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఎంఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి ఒకొక్కరికి రూ.10వేల చొప్పున మొత్తం 49 మందికి రూ.4.90 లక్షల జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు. ప్రశాంతంగా ఎస్జీటీల కౌన్సెలింగ్ సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ శనివారం జరిగింది. ఎస్జీటీ 37, ఎల్పీ తెలుగు, ఎల్పీ హిందీ పోస్టులు ముగ్గురికి చొప్పున బదిలీ చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఏపీవో చిన్నబాబు, ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూవో మంగవేణి, ఏఎంవో కోటిబాబు, సీఎంవో చిరంజీవీ, జీసీడీవో రాములమ్మ, హెచ్ఎంలు పి.నారాయుడు, సూర్యం తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి రేషన్ డిపోల వద్ద సరుకులు పార్వతీపురం టౌన్: నేటి నుంచి రేషన్ డిపోల వద్ద సరుకులు పంపిణీ చేయనున్నట్టు జీసీసీ మేనేజరు ఎం.సాంబశివురావు అన్నారు. ఈ మేరకు శనివారం సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జీసీఎంఎస్ బ్రాంచి పరిధిలో 17 డిపోల సేల్స్మెన్స్, గోదాముల సూపర్వైజరు్ల్ ఆదివారం నుంచి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి వుంచాలన్నారు. వినియోగదారులకు ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా పంపిణీ చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరించారు. జీసీఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆటో బోల్తా.. శృంగవరపుకోట: మండలంలోని గిరిశిఖర పంచాయతీ ధారపర్తి పరిధిలో పల్లపు దుంగాడ నుంచి దబ్బగుంటకు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సమయంలో ఆటోలో ప్రయాణికులెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం విజయనగరం క్రైమ్: నగరంలోని పూల్బాగ్ రోడ్డులో అయ్యప్పస్వామి గుడి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తున్న కారు పూల్బాగ్ రోడ్డులో అయ్యప్పస్వామి గుడి వద్ద వెనుక నుంచి వస్తూ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో రావివలస పంచాయతీకి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టు టౌన్ ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘గురుదేవా’లో చోరీ ఇంటిదొంగల పనేనా..?
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటిబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీషబాబు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంటి దొంగలే చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ దొంగతనం జరిగిన ఇంటి పూజాగది, పరిసరాలను శుక్రవారం పరిశీలించారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలతో రెండున్నర గంటల పాటు చర్చించి పలు సూచనలు చేశారు. దొంగతనం జరిగిన ఇంటి ముందు ఉన్న సీసీ కమోరా దొంగతనం జరిగిన రోజు సాయంత్రం 6 గంటలకు ఆగిపోవడం, కెమోరాకు సంబంధించిన వైరు తెగిపోయి ఉండడాన్ని చూసి.. అక్కడ నుంచే దర్యాప్తును ప్రారంభించారు. ట్రస్టులో పని చేస్తున్న ఐదుగురు వ్యక్తులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ జరపగా చోరీ చేసిన తీరును తెలిపినట్టు సమాచారం. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. చోరీ అంతా ట్రస్టులో పనిచేసే ఒక బిగ్బాస్ ఆధ్వర్యంలో జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం శనివారం సాయంత్రం మరింత లోతుగా దర్యాప్తు చేసింది. అసలు చోరీకి గురైన బంగారం ఎంత? జగదీష్బాబు ఇంట్లో జరిగిన చోరీలో ఎంత మొత్తంలో బంగారాన్ని దొంగలు అపహరించుకుపోయారనే విషయంలో స్పష్టతలేదు. పోలీసులు మాత్రం కేవలం 90 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు పోయినట్టు కేసు నమోదు చేశారు. వాస్తవానికి అంతకు 10 రెట్లు బంగారం, పెద్ద మొత్తంలో నగదును దోచుకుపోయారన్న వాదన వినిపిస్తోంది. డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు దర్యాప్తును పర్యవేక్షించడం ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇప్పటికే అదుపులో ఐదుగురు అనుమానితులు -
విక్రంపురంలో గంజాయి కలకలం..!
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ పాఠశాల, మండల పరిషత్ పాఠశాల పరిసరాల్లో మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు కావడంతో మందుబాబులు మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మండల పరిషత్ పాఠశాల వద్ద కొందరు యువకులు మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. సిరిపురం గౌతమ్ అనే యువకుడు తొమ్మిదేళ్ల బాలుడిపై గంజాయి మత్తులో దాడి చేశాడు. బాలుడి కుటుంబ సభ్యులు గౌతమ్ను ప్రశ్నించగా వారిపై ఇటుక రాళ్లతో దాడికి దిగాడు. దీనిపై ఆరా తీయగా ఆ యువకుడు తెల్లవారి నుంచే మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ ఇష్టారాజ్యంగా గ్రామంలో తిరుగుతూ ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడి చేయడం అలవాటైందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ యువకుడితో పాటు గ్రామానికి చెందిన పలువురిని గంజాయికి బానిస చేస్తున్నాడని యువత తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్ ఆగడాలు గ్రామంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా బాలుడి తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తొమ్మిదేళ్ల బాలుడిపై దాడి -
స్కానింగ్ వివరాలపై ప్రతీ నివేదిక అందజేయాలి
విజయనగరం ఫోర్ట్: స్కానింగ్ కేంద్రాల్లో ప్రతి రోజూ ఎన్ని స్కానింగ్లు జరుగుతున్నాయనే అంశంపై ప్రతీ రోజు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శనివారం లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజు వారీగా జరుగుతున్న ప్రసవాలను నమెదు చేసి ఆయా ఆసుపత్రుల నుంచి ప్రతి రోజు సమాచారం సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన గర్భస్రావాల సమాచారం కూడా వెంటనే అందజేయాలన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సమాచారాన్ని వెంటనే ఒక నివేదిక రూపంలో అందజేయాలన్నారు. అన్ని స్కానింగ్ కేంద్రాల్లోనూ లింగ నిర్ధారణ సమాచారం తెలియజేయడం జరగదనే బోర్డులు సందర్శకులకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు ఆయా ఆసుపత్రులు వసూలు చేసే చార్జీల వివరాలతో కూడిన ధరల పట్టికను కూడా బోర్డుల రూపంలో ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలన్నారు. స్కానింగ్ కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో నియంత్రణ ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారులు తనిఖీ చేసిన నివేదిక ఇచ్చిన తర్వాతే వాటికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎల్వో డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సూర్యనారాయణ, ఆర్బీఎస్కే పీవో డాక్టర్ సుబ్రమణ్యం, డీఐవో డాక్టర్ ఆర్, అచ్చుతకుమారి, డీపీహెచ్ఎన్వో సత్యవతి, డెమో చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
● మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన గిరిజనులు పార్వతీపురం రూరల్: మండలంలోని డీకే పట్నం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పీడిక అప్పన్న (55), ఊయక రమేష్ (25) మృతి చెందారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఈ ప్రమాదానికి సంబంధించి పార్వతీపురం రూరల్ ఎస్ఐ బి.సంతోషికుమారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సందివలస గ్రామానికి చెందిన పీడిక అప్పన్న అల్లుడు వరుసైన ఒడిశాలోని కార్లి గ్రామానికి చెందిన రమేష్తో ద్విచక్ర వాహనంపై సంధివలస నుంచి సొంత పనుల నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం డీకే పట్నం సమీపంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలం వద్ద రమేష్ మృతి చెందగా, డోకిశీల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ పీడిక అప్పన్న మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తప్పిన ప్రమాదం వంగర: మండల పరిధి మగ్గూరు కూడలి వద్ద శనివారం పెనుప్రమాదం తప్పింది. వరి నూర్పిడి అనంతరం కళ్లం నుంచి గ్రామంలోకి తీసుకువస్తున్న నూర్పిడి యంత్రం ఒక్కసారిగా బోల్తాపడింది. దీనిపై కూర్చున్న వేతనదారులు ప్రమాదాన్ని అంచనావేసి దూకేయడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించ లేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రోడ్డుపై బోల్తాపడిన నూర్పిడి యంత్రాన్ని జేసీబీ సహాయంతో సరిచేశారు. -
బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు
పార్వతీపురం: బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.కనకదుర్గ అన్నారు. పట్టణంలో సౌందర్య థియేటర్ రోడ్డులో బాల్య వివాహాలను నిర్మూలించడానికి, బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలకు మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రచార రఽథాన్ని శనివారం ఆమె పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ కోసం ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందన్నారు. బాలల హక్కుల రక్షణ మిషన్( ఎన్సీపీసీఆర్), రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్(ఎస్సీపీసీఆర్) గూర్చి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ ప్రచార రథం బాలల హక్కుల రక్షణ కోసం ఒక అవసరమైన సాధనంగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీపీవో అల్లు సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో అంకితభావంతోనే గుర్తింపు : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు శాఖలో ఉన్నతాధికారులు వివిధ రూపాల్లో తమ విధుల్లో నైపుణ్యత చూపి చేసిన సేవలు చిరస్థాయిగా పలువురికి ఆదర్శంగా, ఆచరణీయంగా ఉంటూ పదిలంగా ఉంటాయని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన మెట్ట సుదర్శన వెంకటప్రసాద్ను శనివారం ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 40ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి, శాఖపై ప్రజలకు మరింత భరోసా కల్పించిన వారి గుర్తింపు చిరస్థాయిగా ఉంటుందని ఎస్పీ అన్నారు. పోలీసు శాఖ వారి కుటుంబానికి అవసరమైనపుడు ఆదుకొనేందుకు సిద్ధంగా ఉంటుందని అన్నారు. పదవీ విరమణ పొందిన ఎస్ఐకు ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ఐలు రాంబాబు, నాయుడు, ఎస్పీ ఎస్ఐ దినకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
నిఘా పెంచి మాదక ద్రవ్యాలకు
● క్యూఆర్ కోడ్తో సమాచారం ● జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురం టౌన్: జిల్లాలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిఘా అధికం చేయడం మాత్రమే కాకుండా వాహనాలను ఆకస్మిక తనిఖీలను చేపట్టడం వలన మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో మున్సిపాలిటీలు కనీసం 5వందల సీసీ కెమెరాలు సమకూర్చాలని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు 1972 టోల్ ఫ్రీ నంబరుకు అందించాలని కోరారు. ఆర్టీసీ బస్సులలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి వివరాలతో అవగాహన పోస్టర్లను పెట్టాలన్నారు. అటవీ శాఖ అధికారులు ఆధునిక పరిజ్ఞానంతో అటవీ ప్రాంతంలో జరిగే మాదకద్రవ్యాల నియంత్రణ కార్యక్రమంలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. క్యూఆర్ కోడ్లతో సమాచారం క్యూఆర్ కోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మాదక ద్రవ్యాల సమాచారంపై ప్రజల స్పందన కూడా తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు 21 పోలీస్స్టేషన్ల పరిధిలో 7841 మంది ప్రజలు పాల్గొని స్పందన అందించారన్నారు. డ్రోన్ సర్వేలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు స్వయం రక్షణ పద్ధతులు నేర్పించడం, పాఠశాలల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్బులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. జనవరి నుంచి మే వరకు మాదక ద్రవ్యాలకు సంబంధించి 11 కేసులను నమోదు చేశామని, ఇందులో 1875 కేజీల గంజాయి రవాణా చేయడం జరిగిందన్నారు. రవాణా శాఖ అధికారి ఎం.శశికుమార్ మాట్లాడుతూ రవాణా శాఖ వాహనాల తనిఖీలు నిర్వహిస్తుందని, 199 కేసులను బుక్ చేయడం జరిగిందని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ జిల్లాలో నవోదయం రెండవ దశ పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. 27 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించామన్నారు. సంయుక్తంగా దాడులు ఆంధ్రా – ఒడిశా అధికారులు సంయుక్తంగా దాడులను నిర్వహించడం జరిగిందని, ఇందులో 50 వేల ఐదు వందల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. సారా తయారీకి సహకరిస్తున్న 64 మంది బెల్లం వ్యాపారులను గుర్తించామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, ఏఎస్పీ అంకిత సురాన, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి గయాజుద్దీన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం వినోద్, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
43 అట్రాసిటీ కేసుల్లో పరిహారం చెల్లింపు
పార్వతీపురం టౌన్: జిల్లాలో నమోదైన 43 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు రూ.48.42 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో 40 కేసులకు సంబంధించి రూ.54.50 లక్షల చెల్లింపు పెండింగ్లో ఉందని, ఆరు కేసుల్లో విచారణ కొనసాగుతోందని వివరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే అన్ని వసతి గృహాలు, పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మొదటిరోజు నుంచే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి తగిన పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు కులధ్రువీకరణ పత్రం జారీకి ఆదేశాలు జారీచేశామన్నారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడిన వివాదాల కారణంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తే కేసులకు ముగింపు పలకవచ్చని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో జిల్లా స్థాయి అధికారులను సభ్యులుగా నియమించాలని కోరారు. కులా న్ని అడ్డంగా పెట్టుకుని కేసులకు వాడుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, ఏఎస్పీ అంకిత సురాన, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎండీ గయాజుద్దీన్, జలవనరుల కార్యనిర్వాహక ఇంజినీరు ఆర్. అప్పలనాయుడు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.వినోద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భయం..భయం గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో గరుగుబిల్లి మండలంలోని నందివానివలస, సుంకి, సంతోషపురం, గొట్టివలస గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోడ్లపైన, గ్రామానికి సమీపంలో సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏ ముప్పు తలపెడుతాయోనని భయపడుతున్నారు. తక్షణమే ఏనుగుల తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం ● ప్రభుత్వ తొందరపాటు చర్యలతో వేలమంది జీవితాలపై తీవ్ర ప్రభావం ● రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు ● విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విజయనగరం గంటస్తంభం: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, విద్యారంగాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు దుయ్యబట్టారు. అమర్ భవన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్మి ఎన్.నాగభూషణం మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేశారు. ఎన్నడూలేని విధంగా పరీక్షలు పూర్తయిన 22 రోజులకే ఫలితాలు విడుదల చేశామని విద్యాశాఖమంత్రి గొప్పలు చెప్పు కున్నారు. తీరా ఈ ఫలితాల్లో చాలామంది విద్యార్థులు అసహనం చెందడంతో పాటు మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రచారం ఆర్భాటంలో ఉన్న శ్రద్ధ ఫలితాల విడుదలలో చూపలేదు. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 66,363 మంది విద్యార్ధులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేస్తే.. ఫెయిలైన 11,000 మంది పైచిలుకు విద్యార్థులు పాసయ్యారు. చాలా మందికి సబ్జెక్టు మార్కుల శాతం భారీగా పెరిగాయి. ప్రభుత్వం తప్పుడు ఫలితాలు ఇవ్వడం వల్ల చాలామంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు కూడా కోల్పోయారని వాపోయారు. -
రూ.32.84 కోట్లు
రూ.700 కోట్లు రూ.196.236 కోట్లు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో అధికమందికి వ్యవసాయమే జీవనాధారం. ప్రధానంగా ఖరీఫ్ సీజన్పైనే రైతులు ఆధారపడతారు. సీజన్ ఆరంభంలో విత్తనాల కొనుగోలు, నారుమడుల తయారీకి పెట్టుబడులు అవసరమవుతాయి. రైతు ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అందించింది. ఏటా ఖరీఫ్ పంట వేసే ముందు మే, జూన్ నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబరులో ఖరీఫ్ పంట కోతకై నా, రబీ అవసరాలకై నా ఉపయోగపడేలా రూ.4 వేలు, మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ రూ.2 వేలు చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించేవి. జిల్లాలో ఏడాదికి సగటున 1.45 లక్షల మంది రైతులు సుమారు రూ.196.236 కోట్ల మేర లబ్ధి పొందారు. గత ఎన్నికలకు ముందు ఏటా పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇప్పటికి తనవంతుగా పైసా కూడా విదల్చలేదు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద గత గతేడాది జూన్లో రూ.22.77 కోట్లు, అక్టోబరులో రూ.22.85 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఖరీఫ్ సీజన్ మొదలవ్వబోతోంది. రైతుకు ప్రభుత్వం నుంచి భరోసా అయితే దక్కలేదు. సాగునీటికీ కష్టాలు.. రైతాంగానికి సాగునీటి కష్టాలు తీర్చాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రాజెక్టుల ఆధునికీకరణను గాలికొదిలేసింది. బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేసి చేతులు దులుపుకొంది. ప్రధాన సాగునీటి వనరైన తోటపల్లి ఆధునికీకరణ పనులు జాప్యం వల్ల గత ఖరీఫ్లో శివారు ప్రాంత రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారీ సాగునీరు అందుతున్న నమ్మకం రైతుకు లేదు. ఇటీవల పాలకొండలో రైతులు ధర్నాలు చేపట్టారు. తోటపల్లి మొత్తం పెండింగ్ పనులకు దాదాపు రూ.700 కోట్లు అవసరం కాగా.. 2024–25 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.32.84 కోట్లను మాత్రమే విదిల్చింది. జిల్లాలోని వెంగళరాయ, వట్టిగెడ్డ, పెదంకలాం, జంఝావతి తదితర ప్రధాన ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలను పెంచబోమని చెప్పిన చంద్రబాబు.. వరుస వడ్డనతో ప్రజలపై భారం మోపారు. విద్యుత్తు చార్జీల భారం వల్ల రైతులూ ఆందోళన చెందుతున్నారు. నాడు క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అర్హులైన రైతులకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీ అందజేశారు. రూ.లక్షలోపు రుణాలు తీసుకుని గడువులోగా సక్రమంగా చెల్లించిన వారికి సున్నా వడ్డీ మొత్తాన్ని జమ చేసి, రైతులకు అండగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిలిచింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేది. 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరవుతోపాటు.. 2023–24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపానుతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్క బటన్ నొక్కడం ద్వారా రూ.14.755 లక్షలు అందుకున్నారు. ఇలా ఏటా పంట నష్టపోయిన రైతుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఒక భరోసా లభించేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. రైతుకు సాయమేదీ అందడం లేదు. ఇటీవల అకాల వర్షాలకు రైతులు అరటి, నువ్వులు, మామిడి, జీడి తదితర పంటలను నష్టపోయినా.. నిబంధనల కొర్రీతో ఒక్క ఎకరాకూ పరిహారం దక్కలేదు. ఖరీఫ్ పంటల సాగుకు దుక్కిచేస్తున్న రైతు కూటమి ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో కేటాయించిన మొత్తం గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో వైఎస్సార్ భరోసా కింద ఏడాదికి లబ్ధిపొందే రైతులు (సుమారుగా) 1.45 లక్షల మందికూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతుకు అందజేసిన పెట్టుబడి సాయం తోటపల్లి మొత్తం పెండింగ్ పనులకు అవసరమైన మొత్తం దాదాపు 0 వెన్నుపోటు దినం వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నాయకులు మెరకముడిదాం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా జిల్లాలో చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమ పోస్టర్లను మెరకముడిదాంలో స్థానిక నాయకులతో కలిసి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్బుక్ రాజ్యంగంలో భాగంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. ఏడాది కాలంలో లక్షా 50 వేల కోట్లు అప్పు చేసినప్పటికీ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి పని చేపట్టలేదని, అప్పుచేసిన డబ్బులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. రైతుల పంటల సాగుకు భరోసా లేదు, చదువుతున్న చిన్నారులకు తల్లికి వందనం లేదు.. మహిళలకు ఉచిత బస్సును సైతం తుస్సుమనిపించారని విమర్శించారు. ఒక్కపథకమూ అమలుచేయలేక, ప్రజలకు మోహాలు చూపించలేక నియోజకవర్గాల్లో కూటమి నేతలు తిరగడం మానేశారన్నారు. ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని, కనీసం సమావేశాలకు కూడా రాకుండా మోహంచాటేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల పిల్లల విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిందని, నాడు–నేడు పనులతో పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన కింద ఆర్థిక సాయం అందించిందన్నారు. నేడు పనులు చేసినా బిల్లులు అందడం లేదంటూ కూటమికి చెందిన నాయకులే గగ్గోలు పెడుతున్నారన్నారు. పదోతరగతి ఫలితాల ప్రకటనలో వైఫల్యానికి విద్యాశాఖ మంత్రి లోకేశే కారణమన్నారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసిన ఫెయిలైన 11వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారంటే పరీక్ష పత్రాల మూల్యాంకనంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్కుమార్, పప్పల కృష్ణమూర్తి, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బోనెల గోపి, సత్తారు శ్రీనివాసరావు, టి.వర్మరాజు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ‘మద్దతు’ కంటితుడుపు! గత ఏడాది కాలంలో రైతులకు ప్రభుత్వం నుంచి ‘మద్దతు’ లభించడం లేదు. గత ఖరీఫ్ సీజన్లో సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు దళారులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ రకం క్వింటా మద్దతు ధర ప్రభుత్వం రూ.2,300 ప్రకటించగా.. రైతులు రూ.1,600 నుంచి రూ.1,800 చొప్పున మధ్యవర్తులకు విక్రయించుకున్నారు. దీనికితోడు అదనంగా కిలోలను దళారులు లెక్కగట్టి తీసుకున్న సందర్భాలున్నాయి. మొక్కజొన్న, జీడి రైతులదీ అదే పరిస్థితి. మన్యం జిల్లాలో గత సీజన్లో 14,800 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. పంట కొనుగోలులో సీసీఐ తీవ్ర నిర్లక్ష్యం చూపింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ముచ్చర్లవలసలోని పత్తి జిన్నింగ్ మిల్లు వద్ద కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలోని పత్తి పండించిన ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫలితంగా రైతులు గ్రామాల్లోకి వచ్చిన దళారులనే ఆశ్రయించారు. క్వింటా పత్తి మద్దతు ధర రూ.7,100 నుంచి రూ.7,500 వరకు ఉంటే.. వ్యాపారులు రైతుల వద్ద రూ.6,100కే కొనుగోలు చేశారు. క్వింటా వద్ద రూ.వెయ్యి వరకు రైతు నష్టపోయారు. జిల్లాలో భామిని, పాలకొండ, సీతంపేట ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి సాగులో ఉంది. రైతులను ఆదుకుంటామని అధికారులు చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఆర్థిక లబ్ధి (ఏడాదికి) జెడ్పీచైర్మన్ మజ్జిశ్రీనివాసరావు ధ్వజం రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తప్ప ప్రజలకు చేసినదేమీ లేదు సూపర్సిక్స్ హామీలను గాలికి వదిలేశారు ఏడాదిలో లక్షా 50 వేల కోట్లు అప్పుచేసినా పథకాలు అందజేయని వైనం జూన్ 4న ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ నిర్వహణ -
పార్వతీపురంలో పండగ శోభ
పార్వతీపురంటౌన్: పార్వతీపురానికి పండగ శోభ వచ్చింది. గ్రామదేవతలైన ఇప్పలపోలమ్మ, ఎర్ర కంచమ్మ, బంగారమ్మ గ్రామదేవతల జాతరకు వేళయింది. ఆదివారం నుంచి బుధవారం వరకు నాలుగు రోజుల పాటు సాగే జాతరలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు ఆంధ్రా, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు. మొక్కుబడులు చెల్లిస్తారు. ఏజెన్సీకి ముఖద్వారంగా ఉండే పార్వతీపురంలో జరిగే జాతరలో ఉత్సాహంగా పాల్గొంటారు. జిల్లా ఏర్పడిన తరువాత 2023లో జాతరను వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆ స్థాయి ఏర్పాట్లు కనిపించడం లేదన్నది భక్తుల మాట. తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు పట్టణ ప్రజలకు సవాల్గా మారాయి. విద్యుత్ అలంకరణ పట్టణ ప్రధాన రహదారి సారికి వీధి నుంచి పాత బస్టాండ్ వరకు విద్యుత్ దీపాలను అలంకరించారు. వైకేఎం కాలనీ, బంగారమ్మ కాలనీలో విద్యుత్ అలంకరణ అందరినీ ఆకర్షిస్తోంది. ఉత్సవాలకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసుల కసరత్తు ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అల్లరి మూకలు, సంఘ వ్యతిరేక శక్తులు కదలికలపై నిఘా పెంచారు. ఉత్సవాల విజయవంతానికి ప్రజలు సహకరించాలని కోరారు. సారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఎకై ్సజ్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టింది. పోలీసు శాఖ పట్టణంలో ముమ్మర తనిఖీలతోపాటు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతరలో భాగంగా మంగళవారం ఇప్పలపోలమ్మ, ఎర్రకంచమ్మ గ్రామ దేవతలకు సంబంధించిన రెండు సిరిమానులు తిరుగుతాయి. పార్వతీపురం పట్టణానికి ప్రధాన బైపాస్ రోడ్డు లేకపోవడం, ఉన్న బైపాస్ రహదారిలో కేవలం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ప్రధాన రహదారిపై పాలకొండ, రాయగడ, కూనేరు, కురుపాం, కొమరాడ మండలాలకు వెళ్లే బస్సుల దారి మళ్లింపునకు పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. సిరిమాను తిరిగే సమయంలో ట్రాఫిక్ను అదుపు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. తాగునీరు అందేనా.. పట్టణ ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతున్నా పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు రోజులకోసారి కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. పండగ నాలుగు రోజులు ఇదే ఒరవడి కొనసాగితే తీవ్ర ఇబ్బందులకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్టుకొమ్మలు కొట్టడం వంటి కారణాలతో వారంలో మూడు రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సిరిమానులు తిరిగే సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం సహజమే. ప్రస్తుతం పండగ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, లైన్ క్లియరెన్స్ల పేరిట మూడు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. కనీసం పండగ సమయాల్లోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నేటి నుంచి ఇప్పలపోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మల జాతర నాలుగు రోజులపాటు నిర్వహణ పట్టణ సమస్యల పరిష్కారంలో మున్సివల్ యంత్రాంగం వైఫల్యం వెంటాడుతున్న తాగునీరు, విద్యుత్ సమస్యలు ట్రాఫిక్ మళ్లింపునకు పోలీసుల ఏర్పాట్లు పండగ సాగేదిలా.. జాతర మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉయ్యాల–కంబాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రెండవ రోజు సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం అమ్మవార్ల ఘటాలు, సిరిమాను ఊరేగింపులు సాగుతాయి. బుధవారం ఘటాల అనుపోత్సవం ఉంటుంది. ఉత్సవాల నాలుగు రోజులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి..
ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. రైతులకు ఆ మేరకు మద్దతు దొరకడం లేదు. సాగుసాయం అందడంలేదు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తూ వరికి క్వింటాకు కేవలం రూ.69 పెంచింది. ఈ మాత్రానికే భారీగా పెంచామనడం సమంజసం కాదు. ఇది ఏ మాత్రం సరిపోదు. క్వింటా ధాన్యాన్ని రూ.3 వేలు చేయాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల వలే బోనస్గా రూ.500 ప్రకటించాలి. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని మండలాల్లో రైతులు పంటలను కోల్పోయారు. నిబంధనల పేరుతో పరిహారం కూడా దక్కకుండా చేస్తున్నారు. ఇది అన్యాయం. – బుడితి అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్లక్ష్యం తగదు తోటపల్లి ఆధునికీకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మ వలస మండలాల్లోని సుమారు 30 గ్రామాల పరిధిలోని తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. కాలువల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టడం, సిల్ట్ తీయకపోవడం వల్ల శివారు భూములకు సాగునీరు సరఫరా కావడం లేదు. ఇటీవల బడ్జెట్లో విడుదల చేసిన నిధులు ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోవు. ఈ ఏడాది ఇంతవరకు కాలువల పనులే ప్రారంభించలేదు. అంటే ఈ ఏడాది కూడా నీరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – ఎం.కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ● -
జంఝావతి ఆయకట్టుదారుల గోడు వినండి బాబూ..
కొమరాడ: జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేసి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలని జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు డిమాండ్ చేశారు. ఆయకట్టు రైతులు, సమితి సభ్యులతో కలిసి జంఘావతి రబ్బరు డ్యామ్ వద్ద శుక్రవారం పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై నిరసన తెలిపారు. 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నిర్మాణం పూర్తయిన రబ్బర్డ్యాం వల్ల సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిచేస్తే మరో 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఒడిశాతో ఉన్న వివాదం పరిష్కారం కాక ప్రాజెక్టు పూర్తికావడం లేదన్నారు. ప్రస్తుతం ఒడిశా, ఆంధ్రపదేశ్లో కూటమి ప్రభుత్వమే ఉందని, నాయకులు దృష్టిసారిస్తే ప్రాజెక్టు సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆ దిశగా స్థానిక కూటమి నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం మండలంలోని పలు గ్రామాలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ మరిశర్ల మాలతీకృష్ణమూర్తి నాయుడు, వి.దాలినాయుడు, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు తక్షణమే ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్ -
మంచం పట్టిన మన్యం
సీతంపేట: నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటే వ్యాధులు ముసురుకుంటున్నాయి. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులకు జ్వరపీడితుల తాకిడి పెరిగింది. కొన్ని గ్రామాల్లో వందలాది మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి ఇంటా జ్వరపీడితులు కనిపిస్తున్నారు. భయపెడుతున్న మలేరియా.. జిల్లాలో మలేరియా ప్రభావితమైనవిగా 245 గ్రామాలను వైద్యాధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా మలేరియా నివారణ చర్యలను వైద్యశాఖ చేపడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,12,059 మంది నుంచి రక్త పూతలు సేకరించి పరీక్షించగా 977 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే వారి సంఖ్యను కలిపితే దీనికి రెండింతలు ఏజెన్సీలో జ్వరాల విజృంభణ జిల్లాలో 977 మలేరియా పాజిటివ్ కేసులు 245 హైరిస్క్ గ్రామాలను గుర్తించిన అధికారులు ఆరంభమైన ఎపిడమిక్ సీజన్ అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే ఉంటుందని అంచనా. గతేడాది 1,07,984 మందికి రక్తపూత పరీక్షలు నిర్వహించగా 213 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉన్నాం వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం. హైరిస్క్ గ్రామాల్లో మాస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మిగిలిన గ్రామాల్లో ఎక్కడైనా జ్వరాలు వంటివి ఉంటే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. దోమల నివారణ మందు వంటివి స్ప్రే చేయిస్తున్నాం. ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. – కె.విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్వో, సీతంపేట -
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు
● డీఐఐపీసీ సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు, యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామికవాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఏ శాఖ వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని సూచించారు. పీఎం విశ్వ కర్మ యోజన పథకానికి ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాల పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో ఏపీఐఐసీకి ఇప్పటి వరకు సుమారు 2,400 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ వాటిలో కేవలం 300 పైచిలుకు ఎకరాల ను మాత్రమే వినియోగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భూముల వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జీఎం శ్రీధర్, ఏడీ రామకృష్ణ, విజయనగరం ఆర్డీఓ టి.సవరమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువు
● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్వతీపురం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే అజలంగి జోగారా వు శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. తెనాలిలో ముగ్గురు దళిత, మైనార్టీ యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మానవహక్కులను ఉల్లంఘించిన వైనాన్ని రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. రాష్ట్రంలో ఉండే బడుగు, బలహీన, దళిత వర్గాలకు పూర్తిగా రక్షణ కరువైందన్నా రు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన చంద్రబాబునాయుడు దళిత సంక్షేమానికి రూ.40వేల కో ట్లు అందజేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. దళితులను ఎంత అణిచివేసినా, ఇబ్బంది పెట్టినా, ఎటువంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడినా పోరాటాలు తప్పవని హెచ్చరించా రు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్ ఆదేశాల మేరకే దాడులు చేస్తున్నారన్న విషయం తేటతెల్లమయ్యిందన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వానికి దళితులంతా బుద్ధిచెబుతామని హెచ్చరించారు. 88 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమశాఖ పరిధి లో 88 మంది ఉపాధ్యాయులకు శుక్రవారం ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి సమక్షంలో బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. హెచ్ఎంలు 5, తెలుగు టీచర్లు 12, హిందీ 14, ఆంగ్లం 12. గణితం 10, పీఎస్ 8, బయలాజికల్ సైన్సు 9, సోషల్ 6, పిజికల్ ఎడ్యుకేషన్ 5, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం 5, పీఈటీ (డబ్ల్యూ) 2 పోస్టులతో పాటు హెచ్డబ్ల్యూఓలు నలుగురు, నాల్గో తరగతి సిబ్బందికి కౌన్సెలింగ్ చేశారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూఓ మంగవేణి, ఏఎంఓ కోటిబాబు, హెచ్ఎంలు పి.నారాయుడు, సూర్యం, తదితరులు పాల్గొన్నారు. జీవితంలో యోగా ఒక భాగం కావాలి ● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ గరుగుబిల్లి: ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సూచించారు. యోగాంధ్రలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద శుక్రవారం యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు 1500 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చేనెల 21న నిర్వహించే యోగా డేను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ, సబ్కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఎంఅండ్హెచ్ఓ ఎస్.భాస్కరరావు, పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఒ.ప్రభాకరరావు, డీడీఓ ఎన్.కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.జగన్మోహన్రావు, ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ రఘుకుమార్, తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు సవాల్గా మారిన చోరీ కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో జరిగిన భారీ చోరీ పోలీసులకు సవాల్గా మారింది. ఈ చోరీ మంగళవారం రాత్రి జరిగినప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఎటువంటి జాడ దొరకకపోవడంతో పోలీసులు ముల్లగుల్లాలు పడుతున్నారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ వకుల్జిందాల్ శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు, ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా వెళ్లిపోయారు.. ఎంతమేర చోరీకి గురైయింది తదితర అంశాలను బాధితుడు జగదీష్బాబును అడిగి తెలుసుకున్నారు. దొంగతనం జరిగిన పూజాగదిని పరిశీలించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు, పలువురు ఎస్ఐలతో ఎస్పీ సమావేశమయ్యారు. దర్యాప్తు తీరును తెలుసుకుని పలు సూచనలు చేశారు. దొంగలను తొందరలోనే పట్టుకుంటామని విలేకరులకు వెల్లడించారు. -
నాడు నిశ్చింతగా అమ్మ ఒడి.. నేడు తల్లికి శఠగోపం
కూటమి అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలుంటే.. అందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసిన అమ్మ ఒడి పథకాన్ని రద్దు చేశారు. నాడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పథకం లబ్ధి అందేది. జిల్లాలో ఈ పథకం కింద వేలాది మంది లబ్ధిదారులు గత ప్రభుత్వ హయాంలోనే రూ.493.28 కోట్ల మేర లబ్ధి పొందారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలనే తేడా లేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాన్ని గత ప్రభుత్వం వర్తింపజేసింది. ఆ డబ్బులు పిల్లల ఫీజులు, ఇతర అవసరాలకు ఉపయోగపడేవని తల్లిదండ్రులు చెబుతున్నా రు. ఇదే కాక.. విద్యాదీవెన కింద రూ.23.42 కోట్లు, వసతిదీవెన కింద రూ.15.84 కోట్లు చొప్పున వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఏటా క్రమం తప్పకుండా ఈ నిధులను విడుదల చేస్తూ, వారి చదువుకు ఆటంకం లేకుండా చూసుకునేది. నేడు : తల్లికి వందనం పథకమని చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం పెట్టింది. అందరు బిడ్డలకూ కాదు కదా.. కనీసం ఒక్కరికై నా రూపాయి విదల్చలేదు. ఇదిగో అదిగో అంటూ ఏడాది కాలయాపన చేసేశారు. ఈ విద్యాసంవత్సరంలోనైనా అమలు చేస్తారా? అని జిల్లాలోని దాదాపు 1,80,000 మంది అర్హులైన విద్యార్థుల తల్లులు ఎదురు చూస్తున్నారు. దీవెన డబ్బులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. చాలా పాఠశాలలు/కళాశాలలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విద్యార్థులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. -
పిల్లలకు సున్నం రాసి!
● ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ● నాడు వైఎస్సార్సీపీ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ● నేడు తిరోగమన దిశలో సర్కారు బడులు ● మధ్యలోనే నిలిచిన ‘నాడు–నేడు’ నిర్మాణాలు ● వందనం పేరుతో తల్లికి ఎగ‘నామం’ నాడు : నాడు–నేడుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను గత ప్రభుత్వం మార్చింది. తొలిదశలో 486 పాఠశాలల్లో రూ.130.14 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రెండో విడతలో రూ.144.51 కోట్లతో 535 పాఠశాలల్లో ఆధునికీకరణ పనులు జరిపారు. గోడలపై బొమ్మలు, రంగరంగుల బల్లలు, కుర్చీలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, కిచెన్ షెడ్డు, గ్రీన్చాక్ బోర్డు, ఇంగ్లిష్ ల్యాబ్ వంటివాటితో పాఠశాలలు కళకళలాడేవి. పాఠశాలల్లో డిజిటల్ బోధన కోసం జిల్లాలో ఒక్క ఏడాదిలోనే రూ.35 23 కోట్ల వరకూ వెచ్చించారు. నేడు : ప్రభుత్వం మారడంతోనే ఏడాదిలోనే బడి గతి మారిపోయింది. నాడు–నేడు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అదనపు తరగతి గదుల భవనాలను అసంపూర్తిగానే వదిలేశారు. దీంతో స్థానికులు వాటిని పశువులు కట్టేందుకు వినియోగిస్తున్నారు. పిల్లర్ల దశలో నిలిచిపోయిన మునక్కాయవలస ప్రాథమిక పాఠశాల నిర్మాణం చిత్రంలో పునాదుల దశలో నిలిచిపోయినది పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ పరిధిలోని మునక్కాయవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు రెండో విడతలో విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠశాల భవనాన్ని మంజూరు చేసింది. పునాదుల వరకు నిర్మించింది. ఈ దశలో ప్రభుత్వం మారడంతో ఏడాదిగా కనీసం ఒక్క ఇటుక నిర్మాణం కూడా చేపట్టలేదు. గెంజిగెడ్డు, చినగెంజిగెడ్డ, చింతలవలస, కొయ్యిమెట్టవలస తదితర గ్రామాలకు చెందిన 40 మంది చిన్నారులు అక్కడ నిర్మించిన చిన్న రేకుల షెడ్డులోనే విద్యను అభ్యసిస్తున్నారు. పార్వతీపురం మండలంలోని లక్ష్మీనారాయణపురం ప్రాథమిక పాఠ శా ల, ఎమ్మార్నగ రం జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలల పను లు సైతం అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. – పార్వతీపురం రూరల్ సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రతి ఇంటా విద్యాదీపాలు వెలిగిస్తే.. ఆ కుటుంబాలకు సదరు విద్యార్థులే వెలుగు చూపు తారని గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మ క మార్పులను తీసుకొచ్చారు. నాడు–నేడుతో ప్ర భుత్వ పాఠశాలలను సరికొత్తగా తీర్చిదిద్దారు. రంగురంగుల బల్లలు.. కుర్చీలు, ఏకరూపు దుస్తులు, బూట్లు, బ్యాగులు, డిక్షనరీలు.. బైలింగ్విన్ పుస్తకా లు, ట్యాబ్లు, డిజిటల్ ప్యానల్స్.. ఇలా విద్యార్థికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ కల్పించారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు శుద్ధజలం, రాగిజావ, చిక్కీలు, గుడ్లు వంటివి సమకూర్చారు. ఫలితంగానే పరీక్షల ఫలితాల్లోనూ మన్యం జిల్లా విద్యార్థులు అగ్రస్థానం దక్కించుకున్నారు. నాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ పూర్వ వైభవం దిశగా సాగిన ప్రభుత్వ బడి.. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో సదుపాయాల కల్పనలో చతికిలబడింది. ●నాడు చక్కగా ‘కానుక’ నాడు : ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే పిల్లలకు జగనన్న విద్యాకానుక కిట్లను ఏటా అప్పటి ప్రభుత్వం అందించేది. పాఠశాలలు తెరిచే రోజునే వీటిని సరఫరా చేసేది. ఇందులో మూడు జతల యూనిఫారాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ వంటివి ఉండేవి. జిల్లాలో ఏటా సుమారు 96 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేది. ఇందుకోసం ఏటా రూ.18 కోట్లకుపైగా అప్పటి ప్రభుత్వం వెచ్చించింది. నేడు : గత విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు దాటినా స్టూడెంట్ కిట్ల ను అందించలేకపోయింది. జిల్లాలోని 1,584 పాఠ శాలల్లో 90 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతుండగా.. కొన్ని రోజులు తరగతులు అయిపోయిన తర్వాత తీరిగ్గా సరఫరా చేసింది. అవి కూడా అరకొరగానే. నాడు మిలమిల.. -
సచివాలయానికి తాళం
చిత్రంలో మూసివేసి ఉన్నది కొమరాడ మండలంలోని గిరిశిఖర పంచాయతీ పూడేస్ గ్రామ సచివాలయం. గ్రామంలోని ఓ అద్దె భవనంలో సచివాలయం నిర్వహిస్తున్నారు. అయితే, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండకపోవడంతో పాటు నెట్వర్క్ సమస్యతో ఏ సేవ అందడం లేదు. శుక్రవారం ఒక్క ఉద్యోగి కూడా విధులకు హాజరుకాకపోవడంతో రేషన్కార్డు, కులధ్రువీకరణ పత్రాలు, ఆధార్ వంటి సేవల కోసం వచ్చిన వారు ఆందోళన చేశారు. సిబ్బంది తీరును నిరసిస్తూ తాళం వేశారు. ఉన్నతాధికారులు స్పందించి సచివాలయం సక్రమంగా తెరిచేలా చూడాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ సేవలు సక్రమంగా అందడం లేదని వాపోయారు. – కొమరాడ -
పిడుగుపాటుతో యువకుడి మృతి
వేపాడ: మండలంలోని కృష్ణారాయుడు పేట గ్రామానికి చెందిన సిమ్మ శ్రీనివాసరావు (33) శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి మృతుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పశువులను గ్రామ సమీపంలో ఎర్రబంద వద్ద మేపుతుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి తల్లి కృష్ణమ్మ ఇద్దరి చెల్లెళ్లు భాగ్య, లావణ్య ఉన్నారు. మరో రెండు పాడి ఆవులు.. లక్కవరపుకోట/కొత్తవలస: లక్కవరపుకోట మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగు పడడంతో రెండు పాడిఆవులు మృతిచెందాయి. మార్లాపల్లి గ్రామానికి చెందిన గోగాడ దేముడు, ఖాసాపేట గ్రామానికి చెందిన నెల్లి అప్పలనాయుడుల రెండు పాడి ఆవులు పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతిచెందాయి. -
ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి
పార్వతీపురం రూరల్: మూస పద్ధతికి స్వస్తి పలికి నూతన విధానాలను అవలంబించి క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసి సమర్ధవంతంగా శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీటవేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల పురోగతి ఎస్సీ,ఎస్టీ కేసులు, ప్రయారిటీ పీటీ కేసుల స్థితిగతులు అక్రమ మద్యం, మిస్సింగ్, సైబర్ నేరాలు, నాన్బెయిల్బుల్ వారెంట్లు తదితర కేసులకు సంబంధించిన విషయాలపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించిన ఎస్పీ వాటికి తగిన సూచనలు, సలహాలు, మెలకువలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు పాచిపెంట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురంలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఉంచాలని ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉన్నారో? లేదో? అని ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టి సమాచారం సేకరణ క్షుణ్ణంగా చేసి అక్రమ రవాణాపై దృష్టిసారించాలని ఎస్పీ మాధవరెడ్డి కోరారు. ప్రశంసాపత్రాల అందజేత విధి నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే వార్షిక ఫైరింగ్ శిక్షణలో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన అధికారులు, సిబ్బందికి కూడా ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. సమావేశంలో పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్బీ సీఐ ఆదాం, సోషల్ మీడియా, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్ ఆర్ఐ రాంబాబు, సీఐలు, ఎస్లు, ఎకై ్సజ్ అధికారులు, మెడికల్ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
పొగాకు జోలికి పోకు..!
● ప్రాణాలు తీస్తున్న ధూమపానం ● నోటి, ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ఆస్కారం ● పొగతాగేవారితో పాటు పక్కన పీల్చేవారికి ముప్పు ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంమత్తెక్కించే వగలమారి వయ్యారి నువ్వు తోడైతే జీవితం ఎడారి మండుతూ ఆరోగ్యానికి ఎసరు పెడతావు పొగగా మారుతూ ఊపిరి తీస్తావు బూడిదవుతూ జీవితాలను బూడిద చేస్తావు వినోదం అని నీతో జత కడతారు పిచ్చి జనం వ్యసనంగా మారిపోవును నీతో సహవాసం విషాదంతో బజారు పాలవును కుటుంబం వదులుదాం..కదులుదాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం విజయనగరం ఫోర్ట్: పొగాకు ఉత్పత్తులు తినడం, పొగాకు తాగడం కారణంగా జిల్లాలో గుండెపోటు, కేన్సర్, వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు గురైన ప్రతి ముగ్గురిలో ఒకరు ధూమపానం కారణంగానే ప్రమాదకర పరిస్థితి బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మధుమేహ వ్యాధి అదుపులో లేకపోవడంతో ఆ ప్రభావం కిడ్నీలు, లివర్, కళ్లు వంటి కీలకమైన అవయవాలపై పడుతుంది. సిగరెట్, చుట్ట తాగడం ఫ్యాషన్గా మారిపోతోంది. ఒకరిని చూసి మరొకరు సిగరెట్, చుట్టలు తాగడం అలవాటుగా మార్చుకుంటున్నారు. రోజురోజుకూ పొగతాగే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో పొగతాగే వారి సంఖ్య 30 శాతం వరకు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఒక సిగరెట్ నిమిషం జీవితకాలాన్ని తగ్గించేస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగకూడదన్న నిబఽంధన బుట్టదాఖలవుతోంది. సిగరెట్ తాగిన వారితో పాటు పక్కనున్న వారు ఆ పొగను పీల్చినా వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గతంలో నిరాక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతవాసులు ఎక్కువగా సిగరెట్, చుట్టలు తాగేవారు. కానీ నేడు పల్లె , పట్టణం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పొగతాగుతున్నారు. యువత సిగరెట్ తాగడానికి అలవాటు పడడం ఆందోళన కలిగిస్తున్న అంశం. పొగ తాగడం వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిసినప్పటికీ అలవాటు అయిన వారిలో మార్పు రావడం లేదు. పొగతాగుతున్న వారిలో 8 శాతం మంది యువత ఉండడం గమనార్హం. పొగతాగుతూ స్వయంగా అనారోగ్యం బారినపడడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అనారోగ్యం పాలుచేస్తున్నారు. జిల్లాలో పొగతాగుతున్న వారిలో పురుషులు 20శాతం మంది కాగా మహిళలు 10 శాతం మంది ఉన్నారు. యవత 8శాతం మంది ఉన్నారు. పొగతాగడం వల్ల ప్రాణాంతక వ్యాధులు సిగరెట్, చుట్ట తాగడం, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల్ల ప్రాణంతకమైన కేన్సర్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్, నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆస్తమా, సీఓపీడీ వచ్చే ఆస్కారం ఉంది. వాటితో పాటు క్రానిక్ బ్రాంక్లైటిస్ వ్యాప్తి చెందే పరిస్థితి ఉంది. పొగతాగడం వల్ల నిమోనియా వ్యాధి అధికమవుతుంది. ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి అధికమవుతుంది. పొగాకును కొంతమంది ముక్కువద్ద పీల్చుతుంటారు. మరి కొంతమంది నోటి ద్వారా పీల్చుతుంటారు. పొగ ఎక్కువగా పీల్చడం వల్ల దాని ప్రభావం రక్తనాళాలు, నాడీ వ్యవస్థపై పడుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. దీని వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బారిన రోగులు పడుతున్నారు. పొగ తాగేసి మానివేసినప్పటికీ వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం ఆరోగ్యంపై చూపుతుంది. సిగరెట్ తాగుతున్న వ్యక్తి స్మోకింగ్ వల్ల జీవిత కాలం తగ్గుతుంది సిగరెట్లు, చుట్టలు తాగడం వల్లజీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. అతితక్కువ వయస్సులో (30 నుంచి 35) ఏళ్లకే మొదడు పోటుకు గురయ్యే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు ఉబ్బి ఆస్తమా వంటి వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల కేన్సర్, గొంతు అన్నవాహిక కేన్సర్, మూత్రాశ్రయం, లివర్, వ్యాధులు సోకే అవకాశం ఉంది. పొగతాగడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు మందులు వాడినా పనిచేయని పరిస్థితి. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు మానివేయడం కోసం చూయింగ్ గమ్స్, నికోటిన్ పేచర్స్ వాడుకోవాలి. డాక్టర్ బొత్స సంతోష్కుమార్ పలమనాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఏడాదికి రూ.1.20 కోట్ల వ్యాపారం అన్ని రకాల వర్గాల వారికి సిగరెట్లు, చుట్టలు అంటుబాటులో ఉన్నాయి. ఏడాదికి రూ.1.20 కోట్ల వరకు సిగరెట్లు, చుట్టల కోసం ఖర్చు చేస్తున్నారు. సామన్య ప్రజలు చుట్టలు, తక్కువ రకం సిగరెట్లు తాగుతున్నారు. సంపన్నవర్గాలు వారు ఖరీదైన సిగరెట్లు తాగుతున్నారు .2024 –25లో కేన్సర్ బారిన 299మంది 2024–25 లో జిల్లాలో 299 మంది నోటి, గొంతు కేన్సర్ బారిన పడ్డారు. ఊపిరితిత్తుల కేన్సర్ , ఆస్తమా, సీఓపీడీ వ్యాధుల బారిన జిల్లాలో 5 వేల నుంచి 6 వేల మంది పడుతున్నారు. కేన్సర్ ముదిరినంత వరకు గుర్తించలేకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నారు. కేన్సర్ను ప్రారంభదశలో గుర్తిస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. కానీ ముదిరితే మరణమే శరణ్యం. -
బినామీ మస్తర్లు వేసుకున్న వారికి రికవరీ నోటీసులు
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామంలో ఉపాధిపనుల్లో బినామీ మస్తర్లు వేసుకుని అక్రమాలకు పాల్పడిన విషయాన్ని సాక్ష్యాలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష అభియాన్ లో ఔట్సోర్సింగ్ పద్దతిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సారాది సత్య నారాయణ బినామీ మస్తరు వేసుకోవడంతో అతనికి రూ. 1260 పేమెంట్ జనరేట్ అయింది. అదేవిధంగా సుంకరి సత్యనారాయణ అనే వ్యక్తి విశాఖపట్నం జిల్లా పధ్మనాభం మండలం అనంతవరంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు కూడా పనికి వెళ్లక పోయినా పనికి వెళ్లినట్టు బినామీ మస్తర్ వేయడంతో రూ.3276 పేమెంట్ జనరేట్ అయింది. వీరితో పాటు మరి కొంతమంది గ్రామంలో బినామీ మస్తర్లు వేసుకుని అక్రమాలకు పాల్పడి వేలాది రుపాయిలు కొల్లగొట్టారనే విషయాన్ని సాక్షి బయట పెట్టింది. దీంతో ఉపాధి హామీ అధికారులు, ఎంపీడీఓ ఈ అంశంపై విచారణ చేపట్టారు. వారి విచారణలో బినామీ మస్తర్లు వేసుకోవడం నిజమని తేలింది. దీంతో బినామీ మస్తర్లు వేసుకున్న ఇద్దరికి రికవరీ నోటీసులు ఇస్తున్నట్లు ఎంపీడీఓ ఆర్వీ రమణమూర్తి తెలిపారు. అదేవిధంగా వారిద్దరికి బినామీ మస్తర్లు వేసిన మేట్లు మంగ, లక్ష్మీకాంతానికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు. మేట్లకు షోకాజ్ -
యోగాంధ్రలో వైద్యశాఖ మమేకం
పార్వతీపురంటౌన్: యోగాంధ్ర మాస వేడుకల కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ పాల్గొంటుందని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్. భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యోగాంధ్ర మాస వేడుకల కార్యక్రమం శనివారం పార్వతీపురం లయన్స్ క్లబ్లోను, సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, పాలకొండలోని రామ కళామందిర్ థియేటర్ దగ్గర గల గాయత్రి కల్యాణ మంటపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శారీరక, మానసిక ఉల్లాసం, ఒత్తిడి తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీఎంహెచ్ఓ ఎస్.భాస్కర రావు -
కొఠియా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు విజయనగరం అర్బన్: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కొఠియా గ్రామాల వివాదాన్ని పరిష్కంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు కోరారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం, అటు ఒడిశా బీజేసీ పాలిత రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో కొఠియా గ్రామ సమస్య పరిష్కరానికి ఇదే తగిన సమయమని డాక్టర్ శంకరరావు పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ సమస్యకు రాజకీయ, పరిపాలనా పరమైన పరిష్కారాలు చూడాల్సిన అవసరం ఉందని చెప్పిందని సూచించారు. ఆయా గ్రామాల ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలగకుండా సమస్య పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర గిరిజ న శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎస్టీ కమిష న్ లేఖ రాసినట్లు తెలిపారు. కొఠియా సమస్య పరిష్కారానికి కేంద్రం సారథ్యంలో కమిటీ వే యాలని ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు కొఠియా గ్రామాల సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈవీఎం గొడౌన్ల తనిఖీనెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గొడౌన్లను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించి సెక్యూరిటీపై సమీక్షించారు.అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఇన్చార్జ్ ఆర్డీఓ టి.సవరమ్మ, తహసీల్దార్ రవిశంకర్, కలెక్టరేట్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి పొడిగింపు విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుడు హిమాన్షు శుక్ల గురువారం ఉత్తర్వులు జారీచేశారని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు. ఉత్తర్వుల మేరకు 2025 జూన్ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు పొడిగింపు వర్తిస్తుందన్నారు. 31న జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంపార్వతీపురంటౌన్: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 31న కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరుగుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా విజిలెన్స్ మానిటరింట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల(అత్యాచారాల నివారణ) చట్టం, 1989, నియమాలు, 1995 సమీక్షకు హాజరు కావడానికి కావాల్సిన సమాచారం మొత్తం నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నూతన సభ్యులను ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. -
69 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
● రూ.6.90 లక్షల జరిమానా వసూలు విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీసులు గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో రూ.6.90 లక్షల జరిమానా వసూలు చేశారు. మొత్తం 69 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బాధ్యులను కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే వాహనాలను ఢీ కొట్టి పలు ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఈ తరహా బైక్ రైడ్స్ను కట్టడి చేసి, ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకించి విజువల్ పోలీసింగ్ చేపడుతున్నామన్నారు. విజువల్ పోలీసింగ్లో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తమ సిబ్బంది చేపడుతున్నారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. రైలు కింద పడి ఒడిశా వాసి మృతిదత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం రైల్వేగేట్ సమీపంలో రైలు కింద పడి గురువారం ఉదయం ఒడిశా వాసి మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. ఒడిశాలోని కలహండి జిల్లా జమున్ బహల్ తాలూకా, దాదాపూర్ గ్రామానికి చెందిన జవహర్లాల్ బిశ్వాల్(45)ను వైజాగ్ నుంచి బొబ్బలి వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు చెప్పారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని విజయనగరం సర్వజన ఆస్పత్రిలో ఉంచినట్లు తెలిపారు. -
బడ్డీకొట్టు మాయం..!
● పేదవ్యాపారి కొట్టును లేపేసిన బడావ్యాపారి ● పోలీస్స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు ● నాన్చుడు ధోరణిలో పోలీసులురాజాం: ఓ పేద వ్యాపారి బడ్డీకొట్టుపై బడావ్యాపారి కన్నుపడింది. అంతే..అదే తడవుగిగా అధికారపార్టీ నాయకులను ఆశ్రయించి రాత్రికి రాత్రే చెక్క బడ్డీని అపహరించి, చెరువులో పడవేంచాడు ఆ బడా వ్యాపారి. ఈ తంతు జరిగిన వెంటనే బాధితుడు రాజాం పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేసి నాలుగురోజులు గడిచినా బాధితుడికి న్యాయం జరగలేదు. కేవలం అధికార పార్టీ ఒత్తిళ్లతోనే తనకు అన్యాయం జరుగుతోందని బాధితుడు వాపోతున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం పట్టణంలోని మాధవబజార్లో ప్రభుత్వ పాఠశాల ఎదురుగా పట్టణానికి చెందిన వడ్డి ప్రసాద్ అనే చిరువ్యాపారి గత 30 సంవత్సరాలుగా చెక్క బడ్డీ కొట్టులో ఉల్లిపాయలు, చింతపండు, కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ వ్యాపారంపై వస్తున్న ఆదాయంతో తనతో పాటు భార్యను పోషిస్తూ వస్తున్నాడు. ఈయన బడ్డీకొట్టు వెనుకల బండి లక్ష్మీనారాయణకు చెందిన కిరాణా వ్యాపారికి చెందిన పక్కా షాపు ఉంది. ఆ షాపుకు ఈ చిన్న బడ్డీ కొట్టు అడ్డుగా ఉండడంతో వారిద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష్మీనారాయణ వేధింపులు ఎక్కువయ్యాయి. తన బడ్డీకొట్టు లీజుకు తీసుకున్న దస్తావేజులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండడంతో ప్రసాద్ ఎవరికీ లొంగలేదు. తన వ్యాపారం తాను చేసుకుంటూ కాలంనెట్టుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25 న అర్ధరాత్రి సమయంలో ప్రసాద్కు చెందిన బడ్డీ మాయమైంది. మరుసటిరోజు ఉదయం వ్యాపారం చేసేందుకు వచ్చిన ప్రసాద్ తన బడ్డీ అక్కడ లేకపోవడంతో ఉలిక్కిపడ్డాడు. తన బడ్డీకొట్టు ఎవరో దొంగిలించారని తొలుత ఆందోళన చెందాడు. అనంతరం శ్యాంపురం రోడ్డులో రంగప్ప చెరువులో బడ్డీకొట్టూ పడేసి ఉండడంతో తనతో వివాదాలకు దిగుతున్నవారే ఈ పనిచేసిఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తంచేస్తూ తన బడ్డీకొట్టు వెనుక ఉన్న వ్యాపారిపై రాజాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. నాలుగు రోజులైనా జరగని న్యాయం తన వద్ద అన్నిరకాల డాక్యుమెంట్లు ఉన్నాయని, తన బడ్డీని దొంగిలించినవారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అందులో రూ.1 లక్షకుపైగా ఉన్న సరుకులకు డబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరాడు. ఈ తంతు జరిగిన నాలుగురోజులు గడిచినా ఇంతవరకూ ప్రసాద్కు న్యాయం జరగలేదు. తాను చిరువ్యాపారిని కావడంతోనే తనకు ఎవరూ మద్దతుగా రావడంలేదని, న్యాయం జరగడంలేదని ప్రసాద్ విలేకరుల ఎదుటవాపోతున్నాడు. బండి లక్ష్మీనారాయణ అనే బడా వ్యాపారే కొంతమంది అధికార పార్టీ నేతల మద్దతుతో బలవంతంగా తన బడ్డీ కొట్టూ తొలగించాడని ఆరోపిస్తున్నాడు. పోలీసులు సైతం తనకు న్యాయం చేయడంలేదని లబోదిబోమంటున్నాడు. ఇదిలా ఉండగా ఈ విషయంపై రాజాం పట్టణ సీఐ అశోక్కుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా, బాధితుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, న్యాయం చేస్తామన్నారు. -
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు
బొబ్బిలి: పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సుధాకర్ యాదవ్ తెలిపారు. స్థానికంగా శిక్షణ పొందిన 17 మంది ప్రతిభ గల క్రీడాకారులను ఒడిశా అసోసియేషన్ ఎంపిక చేసినట్లు చెప్పారు. వారు ఈనెల 30 నుంచి మూడు రోజుల పాటు కటక్లోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయిలో తలపడుతున్న బొబ్బిలి క్రీడాకారులు గెలుపొంది పతకాలతో తిరిగి రావాలని సీఐ కె.సతీష్ కుమార్, అభ్యుదయ పాఠశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ చింత శారదలు వారికి గురువారం బెస్టాఫ్ లక్ చెప్పారు. -
జిల్లాలో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. జూన్ 2 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా బాలకార్మికుల పునరావాసం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లా స్థాయి. డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సభ్యులు జిల్లా అంతటా ఒకే సమయంలో దాడులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు ప్రమాదకరమైన సంస్థలు, స్థలాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను రెండు రోజుల్లోగా గుర్తించాలని సూచించారు. ఎక్కడైనా బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే పనిచేయించే యాజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. నెలరోజుల పాటు జిల్లా అంతటా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఒకే సమయంలో దాడులు జరపాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ మురళి, డిప్యూటీ కమిషపర్ ఆఫ్ లేబర్ ప్రసాదరావు, ఐసీడీఎస్ పీడీ రుక్సానా బేగం, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, డీసీపీయూ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
శిథిలావస్థలో కుష్ఠు ఆస్పత్రి
● భయాందోళనలో రోగులు ● వసతిలేక ఇబ్బందులు రాజాం: ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలామందికి పొగిరి లెప్రసీ ఆస్పత్రి పేరు తెలిసే ఉంటుంది. విశాఖపట్నం పరిధిలో కేవలం మూడుచోట్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లెప్రసీ నిర్మూలన ఆస్పత్రులు ఉండేవి. అందులో పొగిరిలో ఒకటి నిర్మించి, సేవలు ప్రారంభించారు. 1962లో ఎంతో అట్టహాసంగా నాలుగు భవనాలతో లెప్రసీ ఆస్పత్రి ఇక్కడ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ అవే భవనాల్లో ఇక్కడ రోగులకు సేవలు అందిస్తున్నారు. స్థలాలు, నిధులు ఉన్నా పక్కా భవనాల నిర్మాణం ఇక్కడ లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం దు. పట్టించుకునేవారేరీ? రాష్ట్రప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టిసారించడం లేదు. కుష్ఠు నిర్మూలన కార్యక్రమాల ప్రారంభం అట్టహాసమే తప్ప వచ్చి తమ రోగాన్ని నిర్మూలించుకోవాలనుకునేవారికి కనీస వసతులు కల్పించలేకపోతున్నారు. రాజాంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, తెర్లాం తదితర ప్రాంతాల్లోని రోగులకు పొగిరి లెప్రసీ ఆస్పత్రి ఆసరాగా ఉంటుంది. ప్రతి నెలా సగటున 20 నుంచి 28 మంది రోగులు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వ్యాధి తగ్గినవారు ఇంటికి వెళ్లిపోతుండగా, కొత్తవారు వచ్చి నయం చేసుకుంటున్నారు. వారికి కనీసం ఇక్కడ భోజనం పెట్టే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించలేదు. రాజాంకు చెందిన పారిశ్రామికవేత్త జీఎంఆర్ ఆర్థిక సాయంతో పాటు కొంతమంది దాతలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. తాగునీటి సమస్యతో పాటు వసతి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, కనీసం దుప్పట్లు, రగ్గులు వంటివి కూడా ఇక్కడ పంపిణీ లేదని పలువురు బాధితులు వాపోతున్నారు.భోజన సదుపాయం లేదుమేం చిన్నచిన్న కుష్ఠు వ్యాధి లక్షణాలతో ఇక్కడ చేరాం. ప్రస్తుతం వ్యాధి తగ్గుముఖం పడుతోంది. ఇంటి వద్ద కుటుంబసభ్యులు వచ్చేయమన్నారు. కానీ మరికొద్ది రోజులు ఉండి వెళ్లాలని అనుకుంటున్నాను. ఇక్కడ సరైన భవనాలు లేవు. దోమలు. విష సర్పాల బెడద ఉంటుంది. భోజనాలు దాతలు సమకూర్చు తున్నారు. కె.రాంబాబు, కుష్ఠువ్యాధి బాధితుడు కొత్త వాటి పంపిణీలేదుఇక్కడ ఆస్పత్రిలో ఎప్పటివో పాతకాలంనాటి దుప్పట్లు, బెడ్షీట్లు ఉన్నాయి. సరైన వస్తుసామగ్రి లేదు. కొత్తవి పంపిణీ చేయడంలేదు. దాతలు ఇచ్చిన రగ్గులు, దుప్పట్లు తప్ప కొత్తవి ప్రభుత్వం నుంచి సరఫరాలేదు. పి.లక్ష్మణరావు, కుష్ఠువ్యాధి బాధితుడు చినుకుపడితే చిత్తడే ఎప్పుడో 62 సంవత్సరాల క్రితం నిర్మించిన రేకులు, పెంకుల భవనాలే ఇప్పటికీ ఆస్పత్రి భవనాలుగా ఉన్నాయి. వాటి రేకులు శిథిలమై నీరు కారుతోంది. ఎండాకాలంలో నేరుగా ఎండ లోపలకు వచ్చేస్తుంది. విషసర్పాలు, దోమలు నేరుగా భవనాల్లోకి వస్తున్నాయి. చలికాలం, వర్షాకాలంలో ఇక్కడ రక్షణలేని పరిస్థితి కనిపిస్తోంది. కిటికీల తలుపులు, ప్రధాన ద్వారబంధాల తలుపులు మొత్తం ఊడిపోయాయి. వాటికి స్థానిక వైద్యులు సొంత డబ్బులతో మరమ్మతులు జరిపిస్తున్నారు. రాజాంకు చెందిన జీఎంఆర్ వీఎఫ్ చిన్నచిన్న మరమ్మతులకు ఆర్థికసాయం అందిస్తోంది. కొత్తగా ఇక్కడ భవనాలు అవసరమున్నప్పటికీ రోగుల సంఖ్య తగ్గడంతో పెద్దగా దృష్టిసారించలేదు. -
హక్కుల పట్ల గిరిజనులకు అవగాహన ఉండాలి
పార్వతీపురంటౌన్: గిరిజనులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా. ఎ. కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనులకు రాజ్యాంగం ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించినట్లు తెలిపారు. గిరిజన హక్కులు పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. సబ్జైల్ ఆకస్మిక తనిఖీ పార్వతీపురం సబ్ జైలును గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి వసతులు పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందుతోందా? లేదా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని జైలు సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జైలు రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌమ్య జోస్పిన్, డీఆర్డీఏ ఏపీడీ సత్యంనాయుడు, లోక్ అదాలత్ సభ్యులు టి.జోగారావు, ఎంఎల్ఎస్సీ సిబ్బంది కె. సునీత, జి.గంగాదేవి, పారాలీగల్ వలంటీర్లు, గిరిజనులు పాల్గొన్నారు. -
టవర్లు పూర్తి చేయాలి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మొబైల్ టవర్ల పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మొబైల్ టవర్లు, గృహ నిర్మాణం పట్టాలపై గురువారం స్ధానిక కలెక్టరేట్లో సంబంధింత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొబైల్ టవర్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలో ఇంకా 16 మొబైల్ టవర్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. గుమలక్ష్మీపురం మండలం వడబాయి, కొమరాడ మండలం ఊటకోసు, వనబడి, సాలూరు మండలం సూరపాడు, చోర గ్రామాల వద్ద రహదారుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేశామని వాటిని త్వరితగతిన పూర్తి చేసి మొబైల్ టవర్ల నిర్మాణం వేగవతం కావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ఆలస్యం చేస్తూ బాధ్యతా రాహితంగా పని చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బత్తిలి, కొమరాడ మండలం ఉలికేసు, బదిలీటీనకు, సాలూరు మండలంలోని భధ్ర పనులకు తక్షణమే అంచనాలు సమర్పించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహాలకు అటవీ అనుమతులు జారీచేసేందుకు నిబంధనలు పరిశీలించాలని అటవీ అనుమతుల జిల్లా స్థాయి కమిటీతో ఇందులో భాగంగా చర్చించామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఎ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఎ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, డ్వామాపీడీ కె. రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
గ్రంథాలయాలతోనే బాలల వికాసం
విజయనగరం: గ్రంథాలయాలు బాలల వికాసానికి తోడ్పడతాయని విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పంచాయతీ స్థాయిలోనూ విద్యార్థులకు అందుబాటులో గ్రంథాలయం ఉండాలన్నారు. పిల్లలను కూర్చోబెట్టి పైకి వినిపించేలా పుస్తక పఠనం చేయిస్తే భాషా ఉచ్చారణ, పఠన సామర్థ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని ఈ విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా శ్రద్ద పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో అసక్తిగా పాల్గొని భారతదేశ చరిత్రతో పాటు, జిల్లాస్థాయి అంశాలపైన విద్యార్థులు ఎంతో హుషారుగా సమాధానాలు చెప్పారు. విజేతలకు పుస్తకాల ను, పతకాలను అందజేశారు. కార్యక్రమంలో మేకా అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకురాలు అనంతలక్ష్మి, ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి సుభద్రా దేవి, మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, సంఘం సలహాదారు కంచర్ల రాజేశ్వరరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గురుదేవాలో చోరీపై ముమ్మరంగా దర్యాప్తు
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ120 శ్రీ210 శ్రీ220కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ మంగళవారం రాత్రి జరిగినపటికీ పోలీసులు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు.ఎట్టకేలకు బుధవారం రాత్రి 11 గంటలకు బాధితుడు రాపర్తి జగదీష్బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సీహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. ఈ చోరీలో కేవలం 90 తులాల బంగారం (కేజీ బంగారం)తో పాటు రూ.5లక్షల నగదు పోయినట్లు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మూడు కేజీలకు పైగా బంగారం, రూ 20లక్షల నగదు దోచుకుపోయారని ట్రస్టు నిర్వాహకుడు చెబుతున్నారు. జగదీష్బాబు ఇంట్లో గల పూజ గదిలో ఆయన తాత ముత్తాతల నుంచి రాజరాజేశ్వరి శక్తి పీఠం ఏర్పాటు చేసుకుని వంశపార్యపరంగా పూజలను నిర్వహిస్తూ వస్తున్నారు. నాటి నుంచి అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు వంశపార్యపరంగా వస్తున్నట్లు బాధితుడు జగదీష్బాబు తెలిపారు. అమ్మవారి అలంకరణలో గల బంగారుపాదాలు, వడ్డాణం,దండ కడియాలు, 108 కాసులహారం, కొబ్బరిపువ్వులను పోలిన బంగారు గొలుసులతో పాటు అతి పురాతన రాజరాజేశ్వర ఉత్సవ విగ్రహాన్ని దోచుకుపోయినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఆభరణాలు సుమారు మూడు కేజీలకు పైగానే ఉంటాయన్నారు. ఇవే కాకుండా తన తల్లి, అక్కకు సంబంధించిన బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. చోరీకి గురైన బంగారు సామగ్రిపై జగదీష్బాబు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ కేసు నమోదు విషయంలో పోలీసులు వెనకంజు వేశారు. బుధవారం రాత్రి 11 గంటల వరకు కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేసిన పిమ్మటే దర్యాప్తు ప్రారంభించారు. కొత్తవలస, ఎస్.కోట సీఐలు షణ్ముఖరావు, వర్రి నారాయణమూర్తిల ఆధ్వర్యంలో ఎల్.కోట, కొత్తవలస, వేపాడ, ఎస్.కోట ఎస్సైలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సీసీ టీవీ పుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం నుంచి ప్రత్యేక క్లూస్టీమ్ వచ్చి ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించింది. రెక్కీ తరువాతే చోరీ తమ ఇంట్లో జరిగిన చోరీ అప్పటికప్పుడు చేసింది కాదని రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్లు బాధితుడు జగదీష్బాబు తెలిపారు. -
యోగాతో జీవనాడులు ఉత్తేజం
పార్వతీపురం టౌన్: యోగాసనాలతో మానవ జీవనాడులు ఉత్తేజమవుతాయని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక వైద్యారోగ్య కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యసిబ్బందికి యోగాసనాలపై యోగా గురువు మోహన్ శిక్షణ ఇచ్చారు. ప్రాణాయామంతో పాటు వివిధ భంగిమల యోగాసనాలను వేయించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు అలవర్చుకునే విధంగా యోగా గురువుతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మానసిక ప్రశాంతత, పని ఒత్తిడిని జయించేందుకు యోగా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కురుపాం, పాలకొండ, సాలూరులలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమశాఖ పీడీ టి.కనక దుర్గ, జిల్లా ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డా. టి.జగన్నాథ రావు, ఐసీడీఎస్ పీఓలు బి.శ్రీనివాసరావు, జి. సుగుణ కుమారి, ఎస్.సుక్కా తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కర రావు -
రోడ్డెక్కిన రైతన్న
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025డీఐఈఓగా నాగేశ్వరరావు పార్వతీపురం టౌన్: డీఐఈఓగా వై.నాగేశ్వరరావు బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా ఆయన పనిచేస్తున్నారు. ఇదివరకు డీఐఈఓగా పనిచేస్తున్న మంజుల వీణ మక్కువ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కళాశాలల సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. డోలీలో నదిని దాటించి.. కొమరాడ: మండలంలోని చోళ్లపదం పంచాయతీ పరిధిలోని వనధార గ్రామనికి చెందిన కొండగొర్రి శ్రీను గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి జర్వం ఎక్కవ కావడంతో కుటుంబ సభ్యులు కారుచీకటిలోనే డోలీలో నాగవళి నది గుండా కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. నాగావళి ఆవల ఉన్న రెబ్బ, వనధార గ్రామాలకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో అధికమంది జ్వరాలతో బాధపడుతున్నారని, వైద్యశిబిరం ఏర్పాటుచేయాలని కోరారు. కదలని ఏనుగులు గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి గ్రామ పరిసరాల్లో మూడు రోజులుగా ఏనుగులు సంచరిస్తూ పంటలు, తోటలను నాశనం చేస్తున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. అరటి, పామాయిల్, మామిడి తోటలను ధ్వంసం చేస్తున్నాయని, ఏనుగులను మళ్లించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త బాధ్యతలు ● విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా దయానంద్ గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా కురుపాం మండల కేంద్రంలో నివసిస్తున్న గుమ్మలక్ష్మీపురం మండలం గొయిపాక గ్రామానికి చెందిన బచ్చల దయానంద నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకొండ రూరల్/గుమ్మలక్ష్మీపురం: గత ఐదేళ్ల పాటు పాలించిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఊరు/వార్డు అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగించింది. పేద, బడుగు వర్గాలకు సంక్షేమ పథకాలతో ఆర్థిక ఊతం కల్పించింది. పల్లెప్రజల పనులకు ఇబ్బంది కలగకుండా ఇంటివద్దకే సేవలందించింది. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పనతోపాటు వ్యయప్రయాసలకు గురికాకుండా ప్రభుత్వ సేవలను అందించింది. మరుగుదొడ్డికి నోచుకోని ఊరిబడిని సకల సదుపాయాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. పేదకుటుంబాల పిల్లలు అంతర్జాతీయ అవకాశాలు అందుకునేలా ఆంగ్లం చదువులను అందుబాటులోకి తెచ్చింది. ఎప్పుడూ ప్రభుత్వ కార్యాలయాన్ని చూడని పల్లెల్లో.. రూ.కోటి ఖర్చుతో సచివాలయం, ఆర్బీకే, విలేజ్హెల్త్క్లినిక్ వంటి భవనాలను నిర్మించింది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల పురోగతికి అవిశ్రాంతంగా కృషిచేసింది. రైతన్న సాగుకు అండగా నిలిచింది. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. రాజకీయాలకు అతీతంగా, అర్హతే కొలమానంగా పథకాలు మంజూరు చేసింది. నేడు అంతా అస్తవ్యస్థం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే సంక్షేమ పథకాలను అటకెక్కించింది. సూపర్ సిక్స్ అంటూనే ప్రజలకు మోసం ఫిక్స్ చేస్తోంది. వలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చెప్పి ఏకంగా ఆ వ్యవస్థనే రద్దుచేసింది. తాజాగా ఎండీయూ వాహన సేవలను నిలిపివేసి నిరుద్యోగుల ఉపాధికి గంటికొట్టింది. ప్రజలకు కష్టాలను షురూ చేసింది. ఏడాదిగా సాగుసాయం కోసం ఎదురుచూస్తున్న రైతుసాగునీటి కోసం.. ● సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ.. అనంతరం ధర్నా పాలకొండ: తోటపల్లి కాలువల ఆధునికీకరణ, కాలువల్లో పూడిక తీత, శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రైతులు రోడ్డెక్కారు. పలుమార్లు వినతులు అందించినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ తోటపల్లి ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, బూర్జ మండలంలోని పలు గ్రామాలకు ఏటా సాగునీరు అందడం లేదని ఆరోపించారు. పెద్ద బుడ్డిడి వద్ద మరమ్మతులకు గురైన సైపూన్ను తక్షణమే బాగుచేయాలని కోరారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాస్ మాట్లాడుతూ కాలువల్లో పూడికలు తొలగించి ఖరీఫ్కు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. గతంలో ఇచ్చిన వినతులపై తీసుకున్న చర్యలు వివరించాలని ఏఓను నిలదీశారు. ఈ సమయంలో అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ ఎం చంద్రమౌళి, ఎస్సై ప్రయోగ మూర్తిలు అక్కడికి చేరుకుని అధికారులతో సంయుక్త సమావేశానికి ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కండాపు ప్రసాదరావు, డి.రమణారావు, ఇ.సింహాద్రి, గంగుల శ్రీనివాసరావు, కారెపు చిట్టిబాబు, ఎల్.నారాయణరావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. న్యూస్రీల్ ఇంటింటి సేవలకు మంగళం భర్తీకాని సచివాలయ ఖాళీ పోస్టులు రేషనలైజేషన్ పేరుతో సచివాలయాలు, ఉద్యోగుల కుదింపు ప్రయత్నాలు రైతన్నకు దూరమైన సాగుసేవలు మసకబారుతున్న గ్రామస్వరాజ్యం తిరోగమనం దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు -
నిబంధనలు పాటించాలి
● జేసీ శోభిక పార్వతీపురం రూరల్: సినిమా థియేటర్ల నిర్వహణలో నిబంధనలు పాటించాల్సిందేనని జేసీ ఎస్.ఎస్.శోభిక యాజమాన్యాన్ని ఆదేశించారు. నర్సిపు రం టీబీఆర్ థియేటర్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఆర్పీ ధరల ప్రకారం తినుబండారాల విక్రయం చేస్తున్నది లేనిది ఆరా తీశారు. ఫుడ్ శాంపిల్స్ను సేకరించాలని ఆహార భద్రత అధి కారి రామయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయలక్ష్మి, వీఆర్ఓ శంకర్ పట్నాయక్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సాలూరులో.. సాలూరు రూరల్: పట్టణంలోని లక్ష్మి, శ్రీలక్ష్మి, రామాథియేటర్లను తహసీల్దార్ ఎన్.వి.రమణమూర్తి పరిశీలించారు. ఫస్ట్షో ప్రదర్శించకపోవడంతో మరోమారు పరిశీలనకు వస్తానని తెలిపారు. పాలకొండలో.. పాలకొండ రూరల్: పాలకొండ పట్టణం, మండల పరిధిలోని నాలుగు సినిమా థియేటర్లను తహసీల్దా ర్ బాలమురళీ కృష్ణ బుధవారం పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ఉన్నతాధికారుల సూచనలతో ఈ పరిశీలన చేపట్టామన్నారు. -
మిమ్మల్నే.. ఓ ఆసనం వేసి పోదురూ!
● యోగా మాసోత్సవంలో జన సమీకరణకు ఆపసోపాలు ● వేలల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటూ ఒత్తిళ్లు ● బలవంతంగా పేర్ల నమోదు.. సచివాలయ సిబ్బందికి టార్గెట్లు సాక్షి, పార్వతీపురం మన్యం: అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హంగామా అధికారులకు తలబొప్పి కట్టిస్తోంది. జూన్ 21వ తేదీ నాటికి అందరికీ యోగాపై సంపూర్ణ అవగాహన ఉండాలంటూ.. నెల రోజుల కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రతి రోజూ గ్రామ, పట్టణ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలను భాగస్వామ్యం చేయాలని సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచాయతీతోపాటు.. సచివాలయాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రహదారులపై యోగా చేయిస్తున్నా రు. ర్యాలీలు చేపడుతున్నారు. మొత్తంగా జిల్లా అధికార యంత్రాంగం దాదాపు కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంటోంది. జూన్ 21వ తేదీ వరకు ఉంటుంది కూడా. మరి.. ఇవన్నీ చేయాలంటే మనుషులు ఉండాలి. అందుకోసం అందుబాటులో ఉన్న ఏ ఒక్కరినీ వదలడం లేదు. అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, వైద్య సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్నారు. వీటిని పక్కా గా అమలు చేసేందుకు గ్రామ, మండల స్థాయి కమిటీలను నియమించారు. యోగాంధ్ర మినహా.. కొద్దిరోజులుగా మిగతా విషయాలను పక్కన పెట్టేసింది. లెక్కల కోసం తిప్పలు.. యోగా మాసంలో భాగంగా వివిధ స్థాయిల్లో పోటీ లు నిర్వహించాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు.. పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెబుతున్నారు. దీంతో లెక్కలు చూపించేందుకు జిల్లా అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయాలని సచివాలయ సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఇందుకోసం యోగా మంత్ యాప్ను సిద్ధం చేశారు. స్వచ్ఛందంగా ప్రజలెవరూ నమోదుకు ముందుకు రాకపోవడంతో సచివాలయ సిబ్బందే.. తమకు తెలిసిన వారి నంబర్లు సేకరించి, వారికి ఓటీపీలు ఇవ్వండంటూ బతిమలాడుతూ, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలా ఎందుకు ఓటీపీలు అడుగుతున్నారో కూడా చాలామందికి తెలియకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. వారి కుటుంబ సభ్యులతోనూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. జిల్లాలో 15 మండలాలు ఉండగా... మండలానికి కనీసం 40 వేల మంది పేర్లనైనా రిజిస్ట్రేషన్ చేయాలని అధి -
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి
పార్వతీపురంటౌన్: అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. జిల్లా, మండల అధికారులతో బుధవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అత్యవసర వేళ ఆదుకునేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్:08963 293046ను ఏర్పాటు చేశామన్నారు. పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. తహసీల్దార్లు, వీఆర్వోలు, సిబ్బంది ప్రధాన కేంద్రాల్లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని తెలిపారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ప్రసవ సమయం దగ్గర పడిన గర్భిణులను వసతి గృహానికి, ఆస్పత్రులకు తరలించాలన్నారు. అవగాహనే ప్రధానం పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను బుధవారం ఆదేశించారు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాలు అమలుచేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం, సీతంపే ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, కెఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
గంజాయి కేసుల్లో త్వరితగతిన అరెస్టులు
పార్వతీపురం రూరల్: విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా బుధవారం సమీక్షించి గంజాయి కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితులను త్వరితగతిన అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల అరెస్టు, నేరాలు పునరావృతం చేసే వారి ఆస్తుల జప్తు, పెండింగ్ నాన్ బెయలబుల్ వారెంట్స్, డీ–అడిక్షన్ కార్యక్రమాలపై రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సమగ్రంగా చర్చించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
సామాజిక అధ్యయనం సర్వే అడ్డగింత
వేపాడ: మారిక గిరిజన గ్రామాన్ని, భూములను అదానీ కంపెనీకి అప్పగించవద్దంటూ 35 రోజులుగా సచివాలయం నుంచి కలెక్టర్ వరకు విన్నపాలు చేసుకున్నప్పటికీ సామాజిక అధ్యయనం సర్వే అధికారులను ప్రభుత్వం పంపడంపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వేపాడ మండలంలోని కరకవలస గిరిశిఖర మారిక గ్రామాన్ని, భూములను సామాజిక అధ్యయనం చేసేందుకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తుతో.. మండలస్థాయి అధికారులు తహసీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ సూర్యనారాయణతో కలిసి వెళ్లిన అధికారులను మారిక పొలిమేరలోనే గిరిజనులు అడ్డుకుని వెనక్కి పంపారు. మా పొలాలను గ్రామాన్ని అదానీ కంపెనీకి ఇచ్చే ప్రసక్తి లేదంటు తెగేసి చెప్పారు. మండలస్థాయి అధికారులు ఎంత నచ్చచెప్పినప్పటికీ గిరిజనులు పట్టు వీడకపోవటంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. కార్యక్రమంలో మారిక గ్రామనాయకులు జలారి వీర్రాజు, బాబూరావు, అప్పలనాయుడు, సోమేష్, శ్రీను ఆసు, శోభన్బాబు, తదితర గిరిజనులు యువత, మహిళలు పాల్గొన్నారు, హెడ్రా పవర్ ప్రాజెక్టు భూసేకరణపై ప్రకటన మండలంలో కరకవలస పంచాయతీ గిరిశిఖర మారిక కొండపై రైవాడ ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ హెడ్రా పవర్ ప్రాజెక్టు భూసేకరణపై ఎస్ఐఏ అధికారుల పర్యవేక్షణకు బుధవారం శ్రీకారం చుట్టామని సామాజిక ప్రభావ అంచనా నివేదిక సామాజిక నిపుణుడు పి.దేవరాజు ఒక ప్రకటనలో పేర్కోన్నారు. బుధవారం సుమారు 8 కి.మీ కాలినడకన మారిక వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినట్లు తెలిపారు. భూసేకరణ చట్టం 2013పై గిరిజనులకు వివరించి సామాజిక ఆర్థిక, సాంఘిక సర్వేకు సహకరించాలని కోరామన్నారు. అయితే ఈ ఇన్స్పెక్షన్లో నిర్వాసితులు, పెద్దలు, ఎస్ఐఏ బృందం సభ్యులు, మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓను అడ్డగించారని తెలిపారు. గిరిజనుల అభిప్రాయాలను తమనివేదికలో కలెక్టర్కు నివేదిస్తామన్నారు. అధికారులను తిప్పి పంపిన గిరిజనులు -
జీడి పిక్కల వ్యాపారి షాప్/ఇంటికి తాళాలు
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్పేట గ్రామానికి చెందిన జీడి పిక్కల వ్యాపారి షాప్, ఇంటికి బుధవారం గిరిజన, దళిత నాయకులు నిమ్మక సింహాచలం, అడ్డాకుల చిన్నారావు, ఎస్.రామారావు తదితరులు తాళాలు వేశారు. ఈమేరకు ఎల్విన్పేట జంక్షన్ వద్ద రవి ఏజెన్సీస్ పేరుతో కొన్నేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న జి.రవికుమార్ జీడిపిక్కలు, ధాన్యం విక్రయించిన వందల మంది రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు స్థానికంగా పలువురి నుంచి రూ.లక్షల్లో అప్పులు చేసి ఏవరికీ ఏమీ చెల్లించకుండా, ఏ సమాచారం ఇవ్వకుండా పరారయ్యాడు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని.. ఐపీ పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడని తమకు రావాల్సిన డబ్బుల సంగతి ఏమిటంటూ పలువురు బాదితులు ఆ వ్యాపారి షాప్ ముందు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. పలువురి నుంచి రూ.2 కోట్లకుపైగా అప్పులు చేశాడని, తన ఇల్లు ,షాప్ను కూడా ఎవరికో రాసిపెట్టి వెళ్లిపోయాడన్న సమాచారం ఉందని, కావునే బాధితులందరికీ న్యాయం జరగాలన్న ఉద్ధేశంతో వ్యాపారి ఇల్లు , షాప్కు తాళం వేసినట్లు నాయకులు తెలియజేశారు. ఈ సంఘటణపై ఎల్విన్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వారంతా పేర్కొన్నారు. -
స్కూటర్ ఢీ కొని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: నగరానికి సమీప గ్రామం చెల్లూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. చెల్లూరు గ్రామానికి చెందిన అప్పలనాయుడు విశాఖ–విజయనగరం హైవేపై రాంగ్ రూట్లో సాయంత్రం 4 గంటలకు రోడ్డు దాటుతుండగా ఎదురుగా స్కూటర్ రావడంతో ఢీ కొనగా అక్కడిక్కడే కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించే లోగానే తుదిశ్వాస విడిచాడు. మృతుడి కుమార్తె రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు.. బొబ్బిలి: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని బలిజిపేట రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనపై సీఐ కె.సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జగ్గునాయుడి పేటకు చెందిన శ్రీనివాసరావు తాపీ, సెంటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శనివారం పట్టణంలోని టీచర్స్కాలనీకి బైక్పై వెళ్తుండగా బలిజిపేట రోడ్డులోని ఇండియన్ బ్యాంకు వద్దకు చేరుకునేసరికి వెనుక నుంచి వస్తున్న శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో బస్సు వెనక చక్రాలకింద పడి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇందిర, పాలిటెక్నిక్ చదివిన పవన్, హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న చంటి అనే ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రమాద వాహనాలను, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. ట్రాఫిక్ ఎస్సై వి.జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ ఇంకొకరు.. గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..ఈనెల 25వతేదీ రాత్రి గంట్యాడ మండలంలోని రామవరం జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని బైక్ పై వస్తూ ఢీకొట్టిన సారిక గ్రామానికి చెందిన కింతాడ మధు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కేజీహెచ్లో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. కుక్క కరిచి వైఎస్సార్సీపీ కార్యకర్త..రామభద్రపురం: మండలంలోని కొండకెంగువలో కుక్క కరిచి వైఎస్సార్సీపీ కార్యకర్త బుధవారం మృతిచెందాడు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్సీపీ కార్యకర్త,గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్గా పనిచేసిన సత్తారు సన్యాసిరావు(34)ఈ నెల 3వ తేదీన కుక్కకాటుకు గురయ్యాడు. దీంతో వెంటనే గ్రామ పరిధిలో ఉన్న ఆరికతోట పీహెచ్సీకి వెళ్లి రేబిస్ టీకా వేసుకున్నాడు. మూడు డోసులు వేసుకోవాల్సి ఉండగా ఇప్పటివరకు రెండు డోసులు వేసుకున్నాడు.వచ్చే నెల ఒకటో తేదీన మూడో డోసు వేసుకోవాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ నెల 27వ తేదీన తలనొప్పి, కుక్క కరిచిన వైపు తిమ్మిర్లు వచ్చాయి. ఆఖరి డోసు రేబిస్ వేసుకుంటే తగ్గిపోతుందన్న ఉద్దేశంతో మిన్నకుండిపోగా బుధవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. -
రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని దేవస్థానం అధికారులు బుధవారం లెక్కించారు. మొత్తం 89 రోజులకు గాను దేవాలయంలో ఉన్న హుండీల ద్వారా రూ.29,76,730 ఆదాయం సమకూరిందని ఈఓ వై శ్రీనివాసరావు తెలిపారు. హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్లు రాజకుమారి, చీపురుపల్లి కనకమహాలక్ష్మి, దేవస్థానం ఈఓ శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షించారు. లెక్కింపులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాకు చెందిన పలువురు శ్రీవారి సేవా భక్తులు హుండీల ఆదాయ లెక్కింపులో పాల్గొన్నారు.సారా కేసుల్లో నలుగురి అరెస్ట్గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్: కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆధ్వర్యంలో బుధవారం జియ్యమ్మవలస మండలం చినమేరంగి, చినదొడిజ గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా కలిగిఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటు సారా వండేందుకు ముడిసరుకులు సరఫరా చేసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. దాడుల్లో భాగంగా చినదొడిజ గ్రామ పరిసరాల్లో 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో ఆయన వెంట ఎ కై ్సజ్ ఎస్సై జె.రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యసాలూరు రూరల్: పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రెడ్డి అప్పలస్వామి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక రామాకాలనీలో నివాసముంటున్న అప్పలస్వామి (58) అనారోగ్య కారణంతో మనస్తాపానికి గురై ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉరివేసుకున్నాడు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ బి.అప్పలనాయుడు తెలిపారు.పురుగు మందు తాగి మహిళ..గుర్ల: మండలంలోని పాలవసలకు చెందిన కోడి సూర్యకాంతం(45) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది, ఆ బాధను భరించలేక మూడు రోజుల క్రితం పురుగు మందు తాగేసింది. అనంతరం అపస్మాకర స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ఏకతాటిపై నడుద్దాం..
● పార్టీ పటిష్టతలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల పాత్ర కీలకం ● పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సమన్వయంతో పని చేయాలి ● పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపు ● పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం ● హాజరైన పార్టీ పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ విజయనగరం: కలిసిగట్టుగా పని చేస్తూ జిల్లాలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేద్దామని విజయనగ రం జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడంలో కార్య కర్తలే కీలకమని, అటువంటి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఉద్ఘాటించారు. పార్టీ సిద్ధాంతాల కు అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కార్యవర్గానికి పలు అంశాలపై దిశానిర్దేశం చే శారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, బూత్ లెవెల్ కమిటీల నియామకం, పార్టీ బలోపేతంతో జిల్లా కార్యవర్గ సభ్యుల పాత్ర తదితర అంశాలను వివరించారు. ఇప్పటి కే జిల్లా స్థాయి కమిటీల నియామకం పూర్తయిందని, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులను ప్రక టించినట్టు తెలిపారు. అనుబంధ, మండల స్థాయి కమిటీలను త్వరితగతిన నియమించాలని జిల్లా కార్యవర్గానికి సూచించారు. బాధ్యతల నిర్వహణే ప్రధానం.. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేందు కు జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధంగా ఉండాలని మజ్జి శ్రీనివాసరావు సూచించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రతినెలా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పార్టీ కమిటీల నియా మకాలను పూర్తిచేయాలన్నారు. త్వరలో జరగను న్న స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి అమలుచేయకుండా పబ్బంగడుపుతోందని, దీనిపై ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో చైతన్యం నింపాలన్నారు. పర్యవేక్షణ ఇలా... ●ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి జిల్లా పార్టీ కార్యాలయానికి ఇన్చార్జిగా బాధ్యత లు నిర్వహించడంతో పాటు ఎస్సీ, ఉపాధ్యాయ, అంగన్వాడీ, మేధావుల, ఉద్యోగులు/పెన్షనర్లు, గ్రీవెన్స్సెల్ అనుబంధ విభాగాలను పర్యవేక్షిస్తారన్నారు. ●ఇప్పిలి అనంత్ పార్టీ కార్యక్రమాలు, బీసీ, రైతు, వలంటీర్, ట్రేడ్యూనియన్, ప్రచార, బూ త్ కమిటీ, పంచాయతీరాజ్ అనుబంధ కమిటీలను పర్యవేక్షిస్తారని చెప్పారు. ●మరో ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు పార్టీ కార్యక్రమాలు, యువజన, మహిళా, క్రిస్టియన్, విద్యార్థి, సోషల్ మీడియా, మైనార్టీ, మున్సిపల్ అనుబంధ కమిటీలను పర్యవేక్షణ చేస్తారన్నారు. ●అల్లాడ సత్యనారాయణ లీగల్సెల్, ఆర్టీఐ, ఐటీ, దివ్యాంగల విభాగాలకు..... ●శంబంగి వేణుగోపాలనాయుడు ఎస్టీ, చేనేత, వాణిజ్య, సంస్కృతిక, డాక్టర్స్ అనుబంధ కమిటీలను పర్యవేక్షిస్తారన్నారు. జూన్ 4న వెన్నుపోటు దినం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్ర మంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామ ని ప్రకటించారు. ఆ రోజున ప్రజలతో కలిసి నిరసనలతో పాటు కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తామన్నారు. -
వైద్య శాఖలో బదిలీ ఫీవర్..!
విజయనగరం ఫోర్ట్: వైద్యవిధాన్ పరిషత్ కార్యాలయంలో ఓ ఉద్యోగి 10 ఏళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్నట్లు సమాచారం. ఒకే చోట పనిచేయడం వల్ల అధికారులను సైతం శాసించే విధంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారిగా ఎవరు వచ్చినా సదరు ఉద్యోగి మాటే చెల్లుబాటవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే శాఖలో మరో ఉద్యోగి కూడా ఐదేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్నాడు. ఇలా వీరిద్దరే కాదు. మరి కొంతమంది ఉద్యోగులు కూడా ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏ శాఖలో అయినా 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి వివరాలు జాబితాను వెల్లడిస్తారు. కానీ వైద్యవిధాన్ పరిషత్ అధికారులు మాత్రం అ శాఖలో 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారి వివరాలు ఇవ్వడానికి అంగీకరించడం లేదు. లోపాలు బయట పడతాయనో, మరో కారణం చేతనో వివరాలు వెల్లడించడం లేదు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారి వివరాలు బయట పడతాయనే ఉద్దేశంతోనే అధికారులు వివరాలు వెల్లడించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యవిధాన్ పరిషత్ పరిధిలో ఆస్పత్రుల వివరాలు వైద్యవిధాన్ పరిషత్ పరిధిలో ఎస్.కోట, గజపతినగరం, చీపురపల్లి, రాజాం ఏరియా ఆస్పత్రులు, బాడంగి, భోగాపురం, బొబ్బిలి, నెల్లిమర్లలో సీహెచ్సీలు ఉన్నాయి. వాటి పరిధిలో వైద్యులు, స్టాఫ్నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ సూపరింటెండెంట్స్, ఎంఎన్ఓ, అటెండర్స్, ఏఓ తదితర కేడర్లలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీర్ఘకాలం ఒకేచోట పని చేస్తే అవినీతికి ఆస్కారం ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేయడం వల్ల అవినీతి, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో నూ ఇటువంటి వారు తమ వారికి ఉద్యోగాలను కట్టబెట్టుకునే అవకాశం ఉందనే విమర్శలు ఉన్నాయి. వైద్యారోగ్యశాఖలోనూ ఇదే పరిస్థితి: వైద్యారోగ్యశాఖలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి కావడంతో ఇక్కడ కూడా ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. వివిధ కేడర్లలో ఉద్యోగులు ఇక్కడ కూడా ఒకే చోట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్లతరబడి ఒకేచోట పనిచేసిన వారిలో గుబులు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితిపారదర్శకంగా బదిలీలు ఐదేళ్లకు పైబడి ఒకే చోట పనిచేసిన వారి వివరా లు వెల్లడించడానికి ఉన్నతాధికారుల పర్మిషన్ అ డిగాం. పర్మిషన్ రాకపోవడంతో వివరాలు వెల్ల డించలేదు. బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం డాక్టర్ ఎన్.పి. పద్మశ్రీరాణి, డీసీహెచ్ఎస్ -
కానిస్టేబుల్ మృతికి సంతాపం
జి.సిగడాం: స్థానిక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న వల్లంశెట్టి లోకేష్(38) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఇతని స్వగ్రా మం విజయనగరం జిల్లా జామి మండలం అట్టాడ. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందారు. లోకేష్కు భార్య అచ్చయ్యమ్మ, కుమారుడు దివిన్, కుమార్తె భవిశ్రీ ఉన్నారు. లోకేష్ మృతి పట్ల రణస్థలం సీఐ అవతారం, ఎస్ఐ వై.మధుసూదనరావు, ఏఎస్ఐలు పొగిరి శంకరరావు, కోరుకొండ రామకృష్ణ, సిబ్బంది సంతాపం తెలిపారు. వెబ్సైట్లో ల్యాబ్టెక్నీషియన్ పోస్టుల జాబితావిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి సంబంధించి ఐదుకేటగిరీలకు చెందిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, పీఈటీ, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్–3 పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాను వెబ్సైట్లో పెట్టారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 28 నుంచి 31 వతేదీ వరకు, 2 వతేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలులోగా తెలియజేయాలని సూచించారు. పైడిమాంబ చిత్రం రెండో షెడ్యూల్కు రెడీవిజయనగరం టౌన్: శ్రీపైడిమాంబ ఆధ్యాత్మిక కళానికేతన్, జ్ఞానభేరి సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న జై పైడిమాంబ చిత్రం రెండో షెడ్యూల్కు సిద్ధమవుతున్నట్లు కళానికేతన్ వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో మంగళవారం చిత్రయూనిట్, స్థానిక పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిషెడ్యల్లో చిత్రం బాగా వచ్చిందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను చిత్ర యూనిట్కు అందజేశారు. కార్యక్రమంలో నటులు రవితేజ, డాక్టర్ మురళీధర్, పెద్దింటి అప్పారావు, డాక్టర్ జక్కు రామకృష్ణ, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పైడితల్లికి మామిడి పండ్ల నివేదన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి మంగళవారం మామిడిపండ్లతో నివేదన చేశారు. అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతా లతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట రావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీ వీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.లారీ ఇంజిన్లో మంటలుపార్వతీపురం రూరల్: విశాఖ నుంచి ఒడిశాలోని రాయగడ ప్రాంతానికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ట్రాఫిక్ కూడలి వద్ద మంగళవారం ఉదయం 7గంటలకు జరిగిన ఈ సంఘటనను గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై లారీని నిలిపివేసి స్థానికుల సహాయంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా లారీ ఇంజిన్లో నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. తల్లి మందలించిందని తనయుడి ఆత్మహత్యరాజాం సిటీ: మద్యం తాగవద్దని తల్లి మందలించిందని మనస్తాపం చెందిన తనయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని బొమ్మినాయుడువలసలో మంగళవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్సై కేవీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొమ్మినాయుడువలస గ్రామానికి చెందిన నరం సురేష్ (33)ను మద్యం తాగవద్దని తల్లి నరసమ్మ మందలించింది. ఆమె మందలించడాన్ని జీర్ణించుకోలేక ఈ నెల 22న మద్యం మత్తులో గడ్డిమందు తాగేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ను స్థానికులు శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడని ఏఎస్సై తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. -
ఖరీఫ్ సీజన్ త్వరగా మొదలు పెట్టాలి
విజయనగరం ఫోర్ట్: ప్రకృతి అనుకూలత వల్ల ఈఏడాది ముందుగానే వర్షాలు మొదలయ్యాయని వీలైనంత వేగంగా విత్తనాలు జల్లి ఖరీఫ్ సీజన్ మొదలుపెట్టాలని కలెక్ట్ బీఆర్ అంబేడ్కర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వ్యవసాయ అధికారులు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆక్టోబర్ లోగా కోతలు పూర్తి చేసేవిధంగా వీలైనంత త్వరగా విత్తనాలు జల్లాలని సూచించారు. దీనివల్ల నవంబర్లో వచ్చే తుఫాన్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయ పడ్డారు. తద్వారా రబీసీజన్ కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టే అవకాశం కలుగుతుందన్నారు. కౌలు రైతులకు రుణాలు జిల్లాలో ఈఏడాది సుమారు 16,500 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేసి, వారికి రూ.150 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలోగా ఈ గుర్తింపు కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కోసం సుమారు 4,89,116 మంది రైతుల వివరాలను తనిఖీ చేసి అర్హుల జాబితా ఎంపిక పక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారుల లాగిన్లో పెండింగ్లో ఉన్న రోజుల్లోనే తనిఖీ పూర్తి చేసి అమోదం తెలపాలని స్పష్టం చేశారు. రైతుల అధార్ కార్డుల సవరణ, మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టాలని సూచించారు. పీజీఆర్ఎస్లో రెవెన్యూకు సంబంధించి 1017 ఆర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వారం రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ ఎక్కువగా ఉన్న తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, ఎల్డీఎం నారాయణమూర్తి, ఏపీ సీడ్స్ డీఎం పద్మ, మార్క్ఫెడ్ డీఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
బెట్టింగ్ మాయలో పడి..!
పోలీసులేమంటున్నారంటే.. ఇదే విషయాన్ని ఎస్సై జి.కళాధర్ వద్ద సాక్షి ప్రస్తావించగా క్రికెట్ బెట్టింగ్లపై నిఘా వేసి బెట్టింగ్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. యువత ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల నడవడికపై దృష్టి సారించి వారిని మంచి మార్గంలో నడిపించేలా చొరవ చూపాలి.● తప్పుదారి పడుతున్న యువత ● బెట్టింగ్ మనీ కోసం అప్పులు, దొంగతనాలు ● ఆర్థికంగా దివాలా తీస్తున్న కుటుంబాలువీరఘట్టం: ఈ సీజన్ ఐపీఎల్ బెట్టింగ్లో ఘోరంగా డబ్బులు పోగొట్టుకున్న వీరఘట్టానికి చెందిన ఓ కుర్రాడు తాను పనిచేస్తున్న ఇంట్లో సుమారు 5 తులాల బంగారు నగలు దొంగిలించాడు. అలాగే ఇంకొందరు యువకులు అధిక వడ్డీలకు అప్పులు కూడా చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటువంటి ఉదంతాలు ఎన్నో కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. బెట్టింగ్ ఉచ్చులో పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకా మేల్కోకపోతే యువత భవిత సర్వనాశనం అవడం ఖాయమని మేధావులు అంటున్నారు. ప్రతి ఏటా జూద క్రీడలకు అలవాటుపడిన కొందరు అలవాటు మానుకోలేక సీజనల్ జూదానికి తెరలేపుతుపున్నారు. ఏడాదిలో 20 శాతం పేకాట, మిగిలిన 80 శాతం క్రికెట్ బెట్టింగ్లతో కాలం వెళ్లబుచ్చుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. యువతను బెట్టింగ్ రొంపిలోకి లాగుతున్నారు. తాజాగా రెండు నెలల క్రితం ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ పోటీలను తిలకిస్తూ బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ మ్యాచ్ల కోసం పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతా ఆన్లైన్లోనే.. ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్ అంతా ఆన్లైన్లోనే దర్జాగా జరుగుతోంది. మీడియేటర్ల ద్వారా పందాలు కాస్తున్నారు. ప్రతి రోజూ వీరఘట్టంలో రూ.50 లక్షల వరకూ బెట్టింగ్లు విచ్చలవిడిగా బహిరంగ ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. వీరఘట్టంలోని అంబేడ్కర్ జంక్షన్లో ఉదయం 7 గంటల నుంచి 9గంటల వరకూ ఇవే చర్చలు. లక్నో టీమ్ నాదంటే, రాజస్థాన్ రాయల్స్ నాది అంటూ వెయ్యి రూపాయలకు రూ.16 వందలకు పందాలు కాస్తూ బెట్టింగ్ బంగార్రాజులు పేట్రేగి పోతున్నారు.చిన్నచిన్న కిరాణాషాపులు, పకోడీబడ్డీలు, పాన్షాపుల వద్ద ఈ తతంగం అంతా జరుగుతోంది. టెస్ట్మ్యాచ్లు, టీ20, వన్డే మ్యాచ్లు అని తేడా లేకుండా క్రికెట్ ఏ తరహాదైనా బెట్టింగ్ మాత్రం అదే తరహాలో కాస్తున్నారు. ఈ బెట్టింగ్లకు అలవాటుపడిన యువత పక్కదోవ బడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి కుదేలవుతున్నారు. మరికొంతమంది ఆర్థిక నేరాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. మాయదారి క్రికెట్ బెట్టింగ్లు వీరఘట్టంలో గడిచిన పదిహేనేళ్ల నుంచి యథేచ్ఛగా జరుగుతున్నా ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. -
గుర్తు తెలియని మృతదేహం
బొబ్బిలి: తాడేపల్లి గూడెం పరిధిలో ట్రైన్ ఢీకొని ఓ గుర్తు తెలియిన వ్యక్తి మృతి చెందాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి వద్ద నూజివీడు నుంచి బొబ్బిలికి కొనుగోలు చేసిన టికెట్ లభ్యం కావడంతో అక్కడి పోలీసులు బొబ్బిలి జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫొటోలను పంపించి ఆచూకీ కనుగొనాలని కోరడంతో స్థానిక జీఆర్పీ సిబ్బంది విలేకరులకు తెలియజేశారు. బొబ్బిలి లేదా పరిసర గ్రామాలకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరైనా మృతుడిని గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీసులను పంప్రదిస్తే ఆ సమాచారి తాడేపల్లి గూడెం పంపించేందుకు అవకాశముంటుందని స్థానిక జీఆర్పీ సిబ్బంది తెలిపారు. -
అనర్హులకు కేటాయించిన ఇళ్ల రద్దు
విజయనగరం అర్బన్: పేదలకు గృహనిర్మాణం కోసం ప్రభుత్వం అదనపు నగదు మంజూరు చేసిందని అయినప్పటికీ గృహ నిర్మాణాల కోసం ముందుకురాని లబ్ధిదారుల స్టేటస్ను వెరిఫై చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. లబ్ధిదారులకు సొంత గృహం ఉండడం వల్లనే గృహ నిర్మాణాలకు ముందుకు రావడం లేదని తెలుస్తోందని అటువంటి వారి జాబితాలను ఇంటింటికీ వెళ్ల వెరిఫై చేసి ఆధారాలతో సహా రెండు రోజుల్లో ఇవ్వాలని వారికి మంజూరైన గృహాలను రద్దు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి అవాజ్ యోజన కింద మంజూరైన 11 వేల గృహాలను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. 11 వేల ఇళ్లకు గాను ఇప్పటి వరకు 41 శాతం మాత్రమే పూర్తయ్యాయని ఇంకనూ 6,924 గృహాలు పూర్తి కావలసి ఉందన్నారు. బొబ్బిలి, విజయనగరం అర్బన్లో తక్కువ గృహాలు పూర్తి కావడంపై వివరణ అడిగారు. నీటి సరఫరా లేదని, వేసిన బోర్లు దొంగతనానికి గురయ్యాయని మున్సిపల్ కమిషనర్లకు లేఖ రాశామని పీడీ మురళి తెలిపారు. రెండు రోజుల్లో బోర్లన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం గతంలో ఇచ్చిన 4,096 దరఖాస్తులను వెరిఫై చేయాలని అలాగే మాన్యువల్గా వచ్చిన మరో 2,500 దరఖాస్తులను కొందరు తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని అర్హతను వెరిఫై చేయాలని స్పష్టం చేశారు. అందరికీ గృహాలు, పీఎంజన్మన్పథకాల కింద మంజూరైన జాబితాలను కూడా వెరిఫై చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ మోహన్, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. 11 వేల గృహప్రవేశాలకు సిద్ధం చేయండి కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
బదిలీల్లో లోపాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లండి
మెరకముడిదాం: ఉపాధ్యాయుల బదిలీల్లో అసంబద్ధమైన విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడిని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆల్తిరాంబాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన విజయనగరంలో ఎమ్మెల్సీ గాదెను ఆయన ఇంటివద్ద కలిసి ఎస్టీటీ ఉపాధ్యాయులు బదిలీల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు. వాటిని వెంటనే కమిషనర్ స్థాయిలో పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో ఎస్జీటీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పీఆర్టీయూ నాయకులు కృష్ణమూర్తి, రామకృష్ణ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కోరిన పీఆర్టీయూ -
స్లీపర్స్ సెల్స్తో పేలుళ్ల కుట్ర!
● ఎన్ఐఏ విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు విజయనగరం క్రైమ్: స్లీపర్ సెల్స్తోనే దేశంలోని ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపేందుకు పథకం రూపొందించినట్టు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారుల విచారణలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్కు చెందిన సమీర్లు వెల్లడించినట్టు సమాచారం. విజయనగరం పీటీసీలో మంగళవారం ఐదో రోజు విచారణ దాదాపు పదకొండు గంటల పాటు సాగినట్టు తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన ఏడురోజుల కస్టడీ గడువులో తొలుత రెండు, మూడు రోజులు నోరుమెదపని సిరాజ్, సమీర్లు నాలుగు, ఐదో రోజు ఉగ్రకుట్ర వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. బాంబుపేలుళ్ల కుట్రకేసులో ప్రధాన సూత్రధారి సిరాజ్గా విచారణలో నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు రాబట్టే పనిలో పడ్డారు. అహీంగ్రూప్లో ఉన్న 20 మంది సభ్యుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆ గ్రూపు సభ్యులతోనే ఏడు చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ప్రశాంతకు మారుపేరుగా ఉన్న విజయనగరం జిల్లాను ధ్వంసం చేసేందుకు సిరాజ్ పథకం వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక విద్యార్థి.. ఏడుగురు సిబ్బంది బొబ్బిలి: స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలను పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రంగా కేటాయించారు. మంగళవా రం జరిగిన సంస్కృతం పరీక్షకు ఒకే విద్యార్థి ని హాజరుకాగా... చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, క్లర్క్, ఓ ఏఎన్ఎం, ఆశ వర్కర్, ఆయాలతో పాటు ఒక ఏఎస్ఐ విధులు నిర్వహించారు. ఒక్కరైనా.. వంద మంది పరీక్ష రాసినా నిబంధనల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించాల్సిందేనని హెచ్ఎం జగదీష్ కుమార్ తెలిపారు. పేర్లు నమోదు చేయండి విజయనగరం అర్బన్: జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వారి పేర్లును యోగాంధ్ర పోర్టల్లో నమోదు చేయాలని జేసీ సేతు మాధనవ్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో 7.8 లక్షల మందిని యోగాంధ్రలో భాగస్వాములుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, ప్రతి రోజూ కనీసం 50 వేల మందిని నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో 5,270 మంది ట్రైనర్లుగా నమోదు చేసుకున్నారని, వీరందరికీ నేటి నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆయా మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించినట్టు వెల్లడించారు. మాస్టర్ ట్రైనర్లు వీరికి శిక్షణ ఇస్తున్నారన్నారు. 29న నాన్ టీచింగ్ పోస్టులకు ఇంటర్వ్యూలు విజయనగరం అర్బన్: జిల్లాలో కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న చౌకీదార్ కుక్, డే వాస్ ఉమెన్/నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్ వంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29న స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సమగ్ర శిక్ష ఏపీబీ డాక్టర్ ఎ.రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు విద్యార్హత ఒరిజినల్, జెరాక్స్ కాపీలతో హాజరుకావాలని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను ‘విజయనగరం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై పెరిగిన దాడులు ● దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయశంకర్ శృంగవరపుకోట: కూటమి ప్రభుత్వ పాలనలో దళిత, మైనార్టీ యువకులపై దాడులు ఎక్కువయ్యాయని దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జయశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే నడి రోడ్డుపై తెనాలిలో ముగ్గురు దళిత యువకులను విచక్షణ రహితంగా కొట్టడం తగదని, పోలీసులపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్.కోట పట్టణంలో మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏవరైనా తప్పు చేస్తే కోర్టులో హాజరుపర్చి తగిన శిక్షపడేలా చేయాలే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తామే న్యాయమూర్తులమని భ్రమించి శిక్షించడం సమంజసం కాదన్నారు. తెనాలి ఘటనపై సమగ్రంగా విచారణ చేసి బాధ్యులైన సీఐలు రాములునాయక్, రమేష్బాబు, కానిస్టేబుల్ చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఉద్యోగికిరిలీవర్రీ!
–8లోబెట్టింగ్ మాయలో పడి..! ఐపీఎల్ బెట్టింగ్లు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఓటమి నుంచి బయటపడేందుకు దొంగలుగా మార్చుతున్నాయి. బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం: ఎట్టకేలకు ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఆ సంతోషం లేదు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ బదిలీల సందడి కనిపిస్తున్నా.. మన్యం జిల్లాకు సంబంధించి ఉద్యోగులు ‘ఓ ప్రయత్నం చేద్దాం..’ అన్న ధోరణిలోనే కనిపిస్తున్నారు. ఇందుకు కారణం ‘రిలీవర్’. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది కొన్ని శాఖల్లోనే బదిలీల ప్రక్రియ చేపట్టగా.. ప్రస్తుతం దాదాపు అన్ని శాఖలకూ సడలింపు ఇచ్చింది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు స్థానచలనం తప్పదని స్పష్టం చేసింది. ఐదేళ్లు సర్వీసు పూర్తికాని వారికీ దరఖాస్తు చేసుకునే వీలుంది. వారి విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని, పరిపాలన సౌలభ్యానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. వచ్చే నెల 2వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. పాపం.. జిల్లా ఉద్యోగులు ఉమ్మడి జిల్లా యూనిట్గా ఆయా శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన విషయం విదితమే. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగుల బదిలీలను ఉమ్మడి జిల్లా యూనిట్గానే పరిగణనలోకి తీసుకోన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లా విభజన జరిగి, కొత్త జిల్లా ఏర్పడి మూడేళ్లకుపైగా అవుతోంది. అప్పట్లో కొత్త జిల్లా ఏర్పాటు కోసమని విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి కొంతమంది ఉద్యోగులను పార్వతీపురం మన్యానికి బలవంతంగా పంపించారు. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా కలెక్టరేట్ సముదాయం ఏర్పడింది. రెవెన్యూ, విద్య, వైద్యం, ట్రెజరీ, వ్యవసాయం, ఐసీడీఎస్, పోలీస్, ఎకై ్సజ్.. ఇలా అన్ని శాఖల జిల్లా కార్యాలయాలూ ఏర్పడ్డాయి. కొత్తగా విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటైంది. జిల్లా కేంద్రంతో పాటు.. నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఇతర జిల్లాల నుంచి వచ్చి పని చేస్తున్న జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. కుటుంబాలతో ఇక్కడికి రాలేక.. పిల్లల చదువు కోసమని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లోనే ఉంటూ, రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా దాదాపు 1,500 మందికిపైగా ఇతర ప్రాంతాల ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారు. బదిలీలకు అవకాశమిస్తే తమ స్వప్రాంతాలకు వెళ్లిపోదామని ఎదురుచూస్తున్నారు. న్యూస్రీల్ రిలీవర్ ఉంటేనే బదిలీ.. సిఫారసు లేఖతోపాటు, ఇక్కడ పని చేసేందుకు ఉద్యోగిని తెచ్చుకోవాల్సిందే.. పార్వతీపురం మన్యం జిల్లాలో వింత పరిస్థితి స్థానచలనం కోసం ఉద్యోగుల ఎదురుచూపు -
రోడ్డున పడుతున్నాం
నాతో పాటు భార్య పేరున అగ్రిగోల్డ్లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాను. రూ.10వేల చొప్పున రెండు సార్లు డబ్బులొచ్చాయి. రూ.20వేల డిపాజిట్ల చెల్లింపు సమయంలో నా ఖాతాలోకి నగదు రాలేదు. ఒకటికి మించి బాండ్లు కలిగిన వారిలో చాలామంది నష్టపోయారు. కూటమి ప్రభుత్వం స్పందించి డిపాజిట్ డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేయాలి. – సిడగం గురునాయుడు, విజయనగరం ఒక బాండుకే డబ్బులు.. రూ.5 లక్షల డిపాజిట్ చేశాను. రూ.10 వేల చొప్పన రెండు సార్లు డబ్బులొచ్చాయి. రూ.50 వేలు, రూ. లక్ష విలువైన బాండ్లకు నేటికీ డబ్బులు ఇవ్వలేదు. కుటుంబాలతో రోడ్డున పడుతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. – జె.ఆదినారాయణ, విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య 1,08,470 చేసిన డిపాజిట్ల మొత్తం విలువ రూ.765కోట్లు (సుమారుగా)రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో అందినది.. ఇద్దరికి చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య 16విజయనగరం గంటస్తంభం: అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఊరూరా గొప్పగా ప్రచారం చూశారు. ఓట్లు దండుకున్నారు. తీరా అధికారం చేపట్టి ఏడాది గడిచినా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పట్టించుకోవడంలేదు. వారి గోడు వినిపించుకోవడం లేదు. 2014–19 మధ్యకాలంలో ఇలాగే మోసపోయామని, మళ్లీ మరోసారి సీఎం చంద్రబాబునాయుడు తమను మోసం చేశారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ● ఆదుకున్న గత ప్రభుత్వం 2014 నుంచి ఐదేళ్లపాటు అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయాలంటూ పోరాటం సాగించారు. అయినా ఫలితం కనిపించలేదు. దాచుకున్న డబ్బులు రావనే బెంగతో జిల్లాలో 16 మంది చనిపోయారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. రూపాయి డబ్బులు చెల్లించే ఏర్పాటుచేయలేదు. 2019 ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ వివాదం ప్రధానాంశంగా మారింది. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు దశలవారీగా డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు రెండు దశల్లో రూ.929.75 కోట్లు చెల్లించారు. మొత్తం 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఆ డబ్బు అందగా, జిల్లాలో 20వేల లోపు డిపాజిట్ చేసిన 70 వేల మందికి రూ.36,97,96,900లు లబ్ధిచేకూరింది. జిల్లా వ్యాప్తంగా 1,08,470 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు సుమారుగా రూ.765 కోట్లు డిపాజిట్ చేశారు. ● న్యాయంచేసేది ఎప్పుడు? అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాని ఊసే లేదు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఏ ఒక్క చర్య కూడా ప్రారంభించలేదు. కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల కాలయాపన తప్ప..11 నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడైనా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు న్యాయం చేకూరే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అగ్రిగోల్డు బాధితులను ఆదుకోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రూపాయి ఇవ్వని వైనం బాధితుల గోడును పట్టించుకోని పాలకులు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.929.75 కోట్ల చెల్లింపు జిల్లాలో 70వేల మంది బాధితులకు లబ్ధి -
ఉగ్రవాదుల అన్వేషణలో కూటమి విఫలం
విజయనగరం అర్బన్: ఉగ్రవాదులను కనిపెట్టడం, వారి కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడంలో కూట మి ప్రభుత్వం విఫలమైందని హిందూ ధర్మ రక్షా సమితి ప్రతినిధులు శ్రీనివాస్, నందివాడ వేణుగోపాలరావు విమర్శించారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతూ విజయనగరం పట్టణంలోని సిరాజ్ కుటుంబం నివసిస్తున్న ఆబాద్వీధి, అంబటి సత్రం, అశోక్ నగర్ ప్రాంతాలవారితో కలిసి కలెక్టర్ అంబేడ్కర్కు కలెక్టరేట్లో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కొంతకాలంగా అంబటి సత్రం, ఆబాద్ వీధిలో మసీదులు, మదర్సాలు పెరిగిపోతున్నాయని, స్థానికులు కాకుండా గుర్తుతెలియన వ్యక్తులు ఇక్కడ నివసిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రభావజాలంతో అరెస్టు అయిన సిరాజ్తో పాటు ఆయన తండ్రి, అన్నయ్యను కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణానికి ఉగ్రముప్పు తప్పించాలని కోరారు. హిందూ ధర్మ రక్షా సమితి -
కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డు
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో కోవిడ్ ఎదుర్కొనే సన్నద్ధత చర్యలు చేపట్టలేదనే అంశంపై ‘కోవిడ్పై సన్నద్ధత శూన్యం..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురించిన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రిలో కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు తెలిపారు. వైద్యపరీక్షల నిర్వహణకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటుచేయడంతో పాటు మాక్ డ్రిల్ నిర్వహించారు. -
ఆదుకోండి ‘బాబూ’..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలికేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.929.75 కోట్లు కేటాయించారు. బాధితులకు కొంతమేర న్యాయం చేశారు. ఇంకొంత మొత్తం రావాల్సి ఉంది. ఇప్పడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికావస్తున్నా అగ్రిగోల్డ్ బాధితులు గురించి ఎటువంటి చర్య తీసుకోకపోవడం విచారకరం. – మజ్జి సూరప్పడు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ అధ్యక్షుడు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం● -
అవగాహన విజయవంతం చేయాలి
పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. జూన్ 15 నుంచి 30 వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాలను త్రికరణ శుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో సేవలు, మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి/క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో అందించేందుకు ఉద్దేశించినట్లు తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్ పీఎం కిసాన్ కార్డులు, జన్ ధన్ ఖాతా, పీఎం జేజీబీవై, పీఎంఎస్ బీవై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధి హామీ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పీఎం ఎంఈవై, ఇమ్యునైజేషన్ తదితర సీ్త్ర శిశు సంక్షేమ ప్రయోజనాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. పోషకాహార ప్రదర్శనల ఏర్పాటు గ్రామస్థాయిలో ఆధార్లో నమోదు కానివారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని ఆదేశించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాల పోషక విలువలు తెలియజేసేందుకు ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాడైన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోను అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయరాదని ఆదేశించారు. రక్తహీనత లేకుండా దృష్టి సారించాలని, ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించాలని చెప్పారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. పుట్టిన బిడ్డకు పాలు పట్టే విధానం తెలియక పోవడం వల్ల కూడా కొన్ని శిశు మరణాలు జరుగుతున్నాయని, పాలు పట్టే విధానం పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. గిరి చైతన్యం డిజిటల్ మీడియా వాహనం ద్వారా కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. -
పైడితల్లమ్మవారికి జెడ్పీ చైర్మన్ ప్రత్యేక పూజలు
● పైడితల్లమ్మకు జెడ్పీ ఛైర్మన్ ప్రత్యేక పూజలు విజయనగరం: కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురి గ్రామంలో వెలసిన పైడితల్లమ్మవారికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు కుటుంబసమేతంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లదనోత్సవంలో భాగంగా సతీమణి ఆయన పుష్పాంజలి, కుమార్తె సిరిసహస్ర, అల్లుడు ప్రదీప్ నాయుడులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చల్లనితల్లి పైడితల్ల మ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ధర్మపురిలో వెలసిన పైడితల్లమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. -
బతుకు బండిని ఆపేసింది!
●గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు ఇంకా 2027 వరకు అంటే 18 నెలల సమయం ఉందని.. ఈలోగా తమ వాహనాలను నిలుపు చేయడం భావ్యం కాదని వాహనదారులు చెబుతున్నారు. ●జిల్లాలో 196 వాహనాలుండగా.. తమతోపాటు, కుటుంబం, హెల్పర్స్, వారి కుటుంబ సభ్యులంతా ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుందని అంటున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని కోరుతున్నారు. ●వాహనం ధర రూ.5,81,190 కాగా.. ఇంకా నెలకు రూ.9వేల వరకు ఈఎంఐ రూపంలో కట్టాలని.. ఆ మొత్తం ఎలా కట్టగలమని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం అడిగితే.. వాహనాలు తమకే ఇచ్చేస్తామని అంటున్నారని.. వాటికి సంబంధించిన ఈఎంఐ, రోడ్డు ట్యాక్స్, బ్రేక్ చేయించే ఖర్చులన్నీ ఎవరు భరిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ జీవనాధారాన్ని నిలుపు చేసిందని.. దీనివల్ల కుటుంబాలతో సహా రోడ్డున పడ్డామని రేషన్ ఎండీయూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులమయ్యామని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వాపోయారు. ఇంటి వద్దకే రేషన్ పథకంలో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టిన విషయం విదితమే. వీటి వల్ల ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే లబ్ధిదారుల ఇళ్ల సమీపంలోకే వాహనాలు వెళ్లి సరకులు అందించేవి. జూన్ 1 నుంచి ఆ వ్యవస్థను నిలిపివేస్తున్నామని కూటమి ప్రభు త్వం ప్రకటించడంతో.. వాటి మీదే ఆధారపడి ఉన్న వాహనదారులు, హెల్పర్లు ఉపాధి కోల్పోయారు. ఈ నెల 18వ తేదీ వరకు షెడూల్ ప్రకారం సరకులి చ్చామని.. 19వ తేదీ నుంచి ఇంక విధుల్లోకి రావద్ద ని ఉన్నఫలంగా అధికారులు చెప్పేశారని వారు చెబుతున్నారు. కనీసం ఎటువంటి ముందస్తు సమాచారమూ ఇవ్వడం లేదని వాపోయారు. కలెక్టరేట్ వద్ద వాహనాలతో నిరసన పార్వతీపురం అర్బన్, మండల పరిధిలోని 24 మంది ఎండీయూ వాహనదారులు తమ వాహనాలతో పాటు సోమవారం కలెక్టరేట్కు వచ్చి గేటు వద్ద నిరసన తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లోనూ ఆయా మండల అధికారులకు తమ ఉపాధి తీయవద్దని వినతిపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో రోడ్డున పడ్డాం ఎండీయూ వాహనదారుల ఆవేదన జిల్లావ్యాప్తంగా అధికారులకు వినతులు కలెక్టరేట్ వద్ద వాహనాలతో నిరసన చాలా అన్యాయం కనీసం ఒక నోటీసైనా ఇవ్వకుండా, రాత్రికి రాత్రే ఎండీ యూ వాహన వ్యవస్థను రద్దుచేస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా అన్యాయం. మా ఉపాధి పోయింది. కుటుంబాలతో సహా వీధిన పడ్డాం. ఇప్పుడు ఎలా బతకాలి. ఈ వయసులో ఇంకేం ఉపాధికి వెళ్లగలం. ఈ వాహనాలనే నడుపుకోవాలని అంటున్నారు. వీటిని పాసింజ ర్ సర్వీసులకై నా నడుపుకోగలమా? – వంగపండు నరేష్, పెదబొండపల్లి వాహన బకాయిలే కట్టాలి.. ఇంకా వాహన బకాయిలే పూర్తిగా తీరలేదు. 2027 వరకు సమయం ఉంది. కనీసం అప్పటివరకైనా ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వాలి. ఉపాధి లేక, వాహన నెలవారీ మొత్తం ఎలా కట్టాలో తెలియడం లేదు. ప్రభుత్వ నిర్ణయం చాలా దారుణం – శంబంగి లక్ష్మునాయుడు, చినబొండపల్లి ప్రజలకూ ఇష్టం లేదు.. ఇప్పుడు మళ్లీ రేషన్ దుకా ణాలకు వెళ్లి సరకులు తీసు కోవాలంటే ప్రజలకే ఇష్టం లేదు. విషయం తెలిసి మమ్మల్ని అడుగుతున్నా రు. మేమేం చేయగలం. మా ఉపాధే పోయింది. ప్రజలకు ఇష్టం లేని నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. – ప్రసాద్, పార్వతీపురం -
30న తోటపల్లిలో యోగాంధ్ర
గరుగుబిల్లి: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 30న తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు కుడిమట్టి కట్ట వద్దనున్న ఐటీడీఏ పార్క్, బోటు షికారు, తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆల య పరిసరాలను ఆయన సోమవారం పరిశీలించా రు. పర్యాటక ప్రాంతాల్లో నిర్వహణలో భాగంగా వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జూన్ 5న సీతంపేటలోని అడ్వెంచర్ పార్క్లోను, 12న మక్కువ మండలం వెంగళరాయసాగర్ వద్ద నున్న ఏనుగు కొండ వద్ద యోగా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. ఆయన వెంట పార్వతీపురం ఐటీడీఏ పీఓ, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్త వ, ఎంపీడీఓ జి.పైడితల్లి ఉన్నారు. -
మరో దారిలేక..
మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025–8లోచందాలతో రోడ్డును బాగుచేసుకుంటున్న కొండబిన్నిడి గ్రామస్తులు అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మిస్తామని కూటమి నేతలు నమ్మబలికారు. అధికారం చేజిక్కించుకుని ఏడాది గడుస్తున్నా గిరిజనుల దారి కష్టాలపై కన్నెత్తి చూడడంలేదు. తమ గోడు వినిపించేందుకు మరో ‘దారి’లేక.. గిరిజనులు శ్రమదానం, చందాలు వేసుకుని రాళ్ల దారులను రాకపోకలకు అనువుగా మార్చుకుంటున్నారు. గిరిజన ప్రజలను చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వం తీరును దుయ్యబడుతూ రోడ్ల పనుల్లో శ్రమదానం చేస్తున్నారు. చందాలతో.. గుమ్మలక్ష్మీపురం మండలంలోని చాపరాయి బిన్నిడి పంచాయతీ కొండబిన్నిడి గ్రామం గిరిశిఖరాన ఉంది. 30 కుటుంబాలు జీవిస్తున్న ఈ గ్రామానికి ఇప్పటి వరకూ రోడ్డు సౌకర్యం లేదు. మూలబిన్నిడి నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే ఈ గ్రామ ప్రజలకు ‘మార్గం’సుగమమవుతుంది. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఒక్కో ఇంటికి రూ.5వేలు చొప్పున చందాలు వేసుకుని జేసీబీ సాయంతో రోడ్డును నిర్మించుకున్నట్టు గ్రామానికి చెందిన ఎం.రంజిత్ కుమార్, ఎం.గణేష్, దొరబాబు, చిన్నారావు తదితరులు తెలిపారు. శ్రమదానంతో.. గుమ్మలక్ష్మీపురం మండలంలోని చినరావికోన గ్రామానికి పాములగీసాడ నుంచి గల 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో రాళ్లు తేలి, గుంతల్లో నిండిన రోడ్డును గ్రామస్తులు శ్రమదానంతో రాకపోకలకు అనువుగా మార్చుకుంటున్నారు. సుమారు 300 మంది జనాభా నివసిస్తున్న గిరిజన గ్రామానికి ప్రభుత్వం తక్షణమే పక్కారోడ్డు నిర్మించాలని గణేష్, శంకారావు, తమ్మన్న, దయానంద్, జమ్మన్న తదితరులు డిమాండ్ చేశారు. –గుమ్మలక్ష్మీపురంన్యూస్రీల్ -
పర్యాటకాభివృద్ధికి చర్యలు
● కలెక్టర్ శ్యాంప్రసాద్ సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ తెలిపారు. సీతంపేటలోని అడ్వంచర్ పార్కును సోమవారం సందర్శించారు. ఇక్కడ నూతన ఈవెంట్లు పెట్టడానికి గల సాధ్యసాధ్యాలను పరిశీలించారు. గిరి గ్రామదర్శిని, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అనువైన స్థలపరిశీలన చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామదర్శిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చిన్నారులు, యువతను ఆకర్షించేలా స్విమ్మింగ్ఫూల్, రెయిన్ డ్యాన్స్, లోస్లైడ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్ర మంలో ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, డ్వామా పీడీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి యోగాంధ్ర పోటీలు పార్వతీపురం టౌన్: యోగాంధ్ర మాసోత్సవంలో భాగంగా గ్రా మ స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభి క తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగా పోటీలు నిర్వహిస్తామని, ఇందులో విజేతలను రాష్ట్ర స్థా యి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. 10 నుంచి 19 సంవత్సరాలు, 20 నుంచి 35 ఏళ్ల మధ్య, 35 సంవత్సరాల పైబడిన వారికి వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. యోగాసన పోటీల్లో ప్రతిభ చూపాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో నియమించిన యోగా శిక్షకుల పేర్లును సంబంధిత పోర్టల్లో నమోదు చేయా లని ఎంపీడీఓలను ఆదేశించారు. ఆధార్ ఇక్కట్లు గుమ్మలక్ష్మీపురం: ఆధార్ కార్డుల అప్డేట్, పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, తదితర వివరాల మార్పుకోసం ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గుమ్మలక్ష్మీపురం మండలంలో ని గుమ్మలక్ష్మీపురం, ఇరిడి, కొండవాడ, బాలే సు గ్రామ సచివాలయాల్లో ఆధార్ సెంటర్లను అధికారులు నిర్వహిస్తున్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో ఆధార్ కార్డుల అప్డేట్లతో పాటు ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కార్డులు చేయించ డం తప్పనిసరైంది. విద్యుత్ సరఫరా అంతరాయం, సర్వర్ పనిచేయకపోవడంతో ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి ఆధార్ నమోదు కేంద్రాల సంఖ్యను పెంచా లని ప్రజలు కోరుతున్నారు. కీచక ఉపాధ్యాయుడిపై దర్యాప్తు రేగిడి: మండలంలోని ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నిర్వాకంపై సోమవారం ఎంఈఓ–2 బి.ఎరకయ్య దర్యాప్తు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గర్భవతిని చేశాడన్న వార్త సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో రావడంతో దర్యాప్తునకు డీఈఓ మాణిక్యంనాయుడు ఆదేశించారు. ఆ పాఠశాల హెచ్ఎంను సోమవారం ఎంఈఓ–2 వెళ్లి కలిసి వివరాలు సేకరించారు. పాఠశాలలో అటువంటి ఘటనలు చోటుచేసుకోలేదని హెచ్ఎం తెలిపారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేసినట్టు ఎరకయ్య తెలిపారు. -
కౌలు రైతులకు రుణాలు అందించాలి
పార్వతీపురంటౌన్: కౌలు రైతులకు రుణాలు అందించాలని కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11 వేల మందికి సీసీఆర్ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా ఉందన్నారు. గత ఏడాది 9,500 వరకు కార్డులు జారీ అయ్యాయని తెలిపారు. కౌలు రైతులను గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకులు నిర్ధారించాలని ఆదేశించారు. సీసీఆర్ కార్డుల జారీ అనంతరం రుణాలు అందించాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ వాస్తవ లబ్ధిదారులకు రుణాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అవసరమైతే జాయింట్ లయబుల్ గ్రూప్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందేనని, 21 రోజుల్లో సంబంధిత విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. సీతంపేట, మక్కువ తదితర మండలాల్లో ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, తక్షణం పూర్తి చేయాలని కోరారు. అన్నదాత సుఖీభవకు ఆధార్ అనుసంధానం కావాలిజూన్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అన్నదాత సుఖీభవకు రైతుల ఆధార్ అనుసంధానం కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వెబ్ల్యాండ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ అనుసంధానం కావాలన్నారు. వీఆర్ఓలు ప్రధాన కేంద్రాల్లో ఉండాలిజిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రధాన కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలను తక్షణం అప్రమత్తం చేయాలని, సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి వెంటనే అందించాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఏ పీఓ, పాలకొండ సబ్కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
సీతంపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ నిర్వహించారు. పీఓ సి.యశ్వంత్కుమార్రెడ్డితో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన 135 అర్జీలను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిష్కారమయ్యే సమస్యలపై అర్జీదారు సంతృప్తి చెందాలని స్పష్టం చేశారు. ఫిర్యాదు దారులు తమ అర్జీలను మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అర్జీదారులకు చెప్పారు. పీజీఆర్ఎస్కు వచ్చిన కొన్ని వినతులు.. ● కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, నడవలేని స్థితిలో ఉన్నానని ఆర్థికసాయం అందజేయాలని మెట్టూరుకు చెందిన బంటు వెంకటరావు వినతిపత్రం అందజేశాడు. ● టీటీడీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో 105 గుడులు మంజూరయ్యాయని ఇప్పుడు అర్ధాంతరంగా నిర్మాణాలు నిలిచిపోయాయని వాటిని పూర్తి చేయాలని ఎంపీపీ ఆదినారాయణ తదితరులు కోరారు. మండల ప్రజాపరిషత్కు నూతన భవనం మంజూరు చేయాలని విన్నవించారు. ● పెండింగ్లో ఉన్న రహదారి పనులు సకాలంలో పూర్తి చేయాలని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు విన్నవించారు. ● సీతంపేటలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ షాపులు పంచాయతీకి అప్పగించాలని సర్పంచ్ ఆరిక కళావతి వినతిపత్రం ఇచ్చారు. పెద్దూరులో మంచినీటి ట్యాంకు ఏర్పాటు చేయాలని సర్పంచ్ ఆదిలక్ష్మి కోరారు. ● రాయిమానుగూడ గ్రామస్తులు నవీన్, బాలకృష్ణ తదితరులు మంచినీటి ట్యాంకు గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరారు. బూర్జమానుగూడకు చెందిన చంద్రరావు పిడుగుపాటుకు గురై మృతిచెందడంతో పరిహారం ఇప్పించాలని కుటుంబసభ్యులు వినతి ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, జిల్లా పరిశ్రమల అధికారి కరుణాకర్, డ్వామా పీడీ రామచంద్రరావు, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్ పాల్, ఉద్యాన వన అధికారి శ్యామల, ట్రైబల్ వెల్ఫేర్ డీడీలు కృష్ణవేణి, అన్నదొర, డీఎంహెచ్వో భాస్కరరావు, ఉపవైద్యాధికారి విజయపార్వతి, డీపీఓ కొండలరావు, ట్రాన్స్కో పర్యవేక్షక ఇంజినీర్ చలపతిరావు, తహసీల్దార్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పీజీఆర్ఎస్కు 135 అర్జీలు -
24 గంటల్లో అర్జీలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను 24 గంటల్లో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన పీజీఆర్ఎస్లో వినతులు స్వీకరించే ముందు అధికా రులతో సమీక్షించారు. ఆన్లైన్లో ఇంకా చూడవలసిన వినతులు 8 ఉన్నాయని గడువు దాటిన వినతులు 2 ఉన్నాయని వినతుల పరిషాకరంలో గడువు దాటినందుకు సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. రీ ఓపెన్ కేసులు లేకుండా చూడాలని జిల్లా ఆడిట్ టీమ్ కూ డా పెండింగ్ లేకుండా ఎప్పటి వినతులు అప్పుడే ఆడిట్ చేయాలని సూచించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 160 వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఇన్చార్జ్ డీఆర్ఓ మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అర్జీలలో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన భూసమస్యలు 82 నమోదయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖ 10, పింఛన్ల మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 21, మున్సిపాలిటీకి 10, జీఎస్డబ్ల్యూకు 1, విద్యాశాఖకు 7, హౌసింగ్కు 1 అందగా వైద్యశాఖకు 2, విద్యుత్ శాఖకు 5 వినతులు అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. కలెక్టరేట్ వద్ద సహాయ కేంద్రం ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అర్జీలను రాయడానికి కలెక్టరేట్ వద్ద సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అర్జీదారుల కోసం షామియానా ఏర్పాటు చేసి కలెక్టరేట్ నుంచి ఆరుగురు సిబ్బందిని నియమించడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఆర్ఓ కార్యాయలం వద్ద మరో ఇద్దరు అర్జీలు రాసే సహకారం అందజేయడంతో మధ్యవర్తుల జాడ కనబడలేదు. నిరక్షరాస్యులైన వారు తమ అర్జీలను రాయడానికి దళారులను ఆశ్రయిస్తున్నారని వారు అర్జీదారులను మభ్య పెట్టి వారి నుంచి డబ్బును తీసుకుని ప్రతివారం కలెక్టరేట్ చుట్లూ తిరిగేలా చేస్తున్నారని ఇకపై కూడా అర్జీదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిరాక్స్ కేంద్రాల్లో రాయించవద్దని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హాయకేంద్రంలో సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బదిలీల ఫైళ్లు ముందుగానే పెట్టండి బదిలీల ఫైళ్లను ఆఖరి తేదీన కాకుండా ముందుగానే పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బదిలీలలో ఎటువంటి సిఫార్సులను ఆమోదించబోనని, నిబంధనల మేరకే చేపడతానని స్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ పీజీఆర్ఎస్కు 32 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక కార్యక్రమాన్ని ఏఎస్పీ సౌమ్యలత నిర్వహించి 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మా ట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్బీ సీఐలు ఆర్వీఆర్కే చౌదరి,లీలారావు డీసీ ఆర్జీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీజీఆర్ఎస్కు 160 వినతులు -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
శృంగవరపుకోట: మండలంలో సంచలనం రేకెత్తించిన తల్లి హత్యకేసును ఎస్.కోట పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను సోమవారం ఎస్.కోట పోలీస్స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ రాత్రి తన తల్లి, చెల్లి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి తన తల్లి ఎర్రాప్రగడ వెంకటలక్ష్మి(35)ని తీసుకుపోయారని చెల్లెలు రుచిత చెప్పిందని వెంకటరమణపేట గ్రామానికి చెందిన ఎర్రాప్రగడ హరీష్ 18వ తేదీ ఉదయం 5గంటలకు ఎస్.కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనుమానాలే ఆధారంగా.. హరీష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా ఘటనాస్థలిలో రక్తపుమరకలు ఉండడంతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టామన్నారు. రుచిత వాదనల్లో సరైన పొంతన లేకపోవడంతో అనుమానంతో గట్టిగా విచారణ చేయడంతో వాస్తవాలు చెప్పింది. తన తల్లిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన స్నేహితులతో కలిసి పథకం ప్రకారం హత్య చేశామని చెప్పింది. శవాన్ని దగ్గరలోని నేలబావిలో రాళ్లు కట్టి పడేసి, కొబ్బరి మట్టలు వేసి కప్పారన్నారు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు డీఎస్పీ చెప్పారు. ప్రేమ వికటించింది గ్రామానికి చెందిన సలాది హరికృష్ణ జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ డ్రైవర్ రుచితతో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించాడు. ఇది నచ్చని రుచిత తల్లి వెంకటలక్ష్మి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయనని చెప్పింది. అప్పటికీ హరికృష్ణ తన తీరు మార్చుకోక పోవడంతో వెంకటలక్ష్మి ఎస్.కోట పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో హరికృష్ణపై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం కేసు ట్రయల్స్కు రావడంతో తనపై కేసు తీసేయాలని, రుచితను తనకిచ్చి పెళ్లి చేయాలని, వెంకటలక్ష్మిని హరికృష్ణ ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో రుచితతో కలిసి హత్యకు పథకం పన్నాడు. బహిర్భూమికి అంటూ రుచితతో చెప్పించి వెంకటలక్ష్మిని బయటకు రప్పించి హరికృష్ణ, రుచితలు మరో బాలుడితో కలిసి, గొంతు కోసి హత్య చేశారు. రుచితను జువైనల్ హోమ్కు తరలించి హత్య చేసి పరారైన హరికృష్ణ కోసం మూడు బృందాలను రంగంలోకి దించారు. సోమవారం అందిన సమాచారంతో ఒడిశా వైపు బైక్పై వెళ్తున్న హరికృష్ణను, హత్యానేరంలో ఉన్న మరో బాలుడిని అరెస్టు చేసి, వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని, వాంగ్మూలం రికార్డు చేసి, కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ వి.నారాయణమూర్తి, ఎస్సైలు చంద్రశేఖర్, గంగరాజు పాల్గొన్నారు. -
తల్లీకొడుకుల అదృశ్యం
సీతానగరం: మండలంలోని అంటిపేట గ్రామానికి చెందిన తల్లీకొడుకులు ఈ నెల 23 నుంచి కనిపించడంలేదు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 23న రాత్రి కుటుంబసభ్యులు ఇంట్లో గొడవ పడ్డారు. ఇంట్లో గొడవ అనంతరం అందరూ గాఢనిద్రలో ఉన్నసమయంలో కొడుకును తీసుకుని తల్లి ఇంటినుంచి వెళ్లిపోయినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. 24న ఉదయం నుంచి తల్లీకొడుకుల ఆచూకీ కోసం గ్రామంలోనే కాకుండా చుట్టాలు, స్నేహితుల ఇళ్లలో వెతికారు. అయినా ఆచూకీ కనిపింక పోవడంతో అదృశ్యమైన మహిళ తల్లి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు.లారీని ఢీకొని యువకుడి మృతిగంట్యాడ: బొండపల్లి మండలం రాళ్లవాక గ్రామానికి చెందిన యువకుడు బొండపల్లి జగన్ (19) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హోరోహోండా గ్లామర్ బైక్పై కింతాడ మధు అనే వ్యక్తితో కలిసి బొండపల్లి జగన్ ఆదివారం రాత్రి విజయనగరం మండలం సారిక గ్రామానికి వెళ్తుండగా రామవరం ఫైఓవర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా బైక్తో ఢీకొట్టాడు. దీంతో జగన్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మధుకు తల, ఎడమ కాలికి తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్కు తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. మామిడి తోట ధ్వంసంగరుగుబిల్లి: ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి గరుగుబిల్లి మండలంలోని తోటపల్లిలో ప్రవేశించి గ్రామానికి చెందిన లోపింటి వెంకయ్య మామిడి తోటను ధ్వంసం చేశాయి. మరో రెండు మూడు రోజుల్లో చేతికి రావాల్సిన పంటను నష్టపరిచాయి. 15ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఎకరా డీ పట్టా భూమిలో మామిడి తోటను వేసుకుని జీవనోపాధి పొందుతున్న వెంకయ్యకు చేతికి అందిన పంట ఏనుగుల రూపంలో నష్టపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటను నష్టపరచడమే కాకుండా కొన్ని చెట్లను కూడా భూమి నుంచి పెకిలించి వేశాయని బాధితుడు వాపోయాడు. ఏనుగుల కారణంగా మామిడి తోటలో సుమారు రూ.50వేల వరకు నష్టం జరిగిందని, అధికారులు స్పందించి జరిగిన పంటనష్టాన్ని అంచనావేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిరాజాం సిటీ: మండల పరిధి గడిముడిదాం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి వెంకటరమణ (40) మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాల మేరకు వెంకటరమణ ద్విచక్రవాహనంపై రాజాం వస్తున్నాడు. గడిముడిదాం–బుచ్చెంపేట గ్రామాల మధ్యకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన ఆటో బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను ఆటోడ్రైవర్ స్థానిక కేర్కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి విశాఖపట్నం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని మేనమామ శంబంగి జగన్మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
కౌలు రైతుల కంటకన్నీరు..!
● అన్నదాత సుఖీభవ లేనట్లేనా అని ఆందోళన ● వైఎస్సార్సీపీ హయాంలో రైతుభరోసా అందజేత కౌలు రైతులకు వర్తించదు అన్నదాత సుఖీభవ పథకం కోసం భూ యాజమానులు, అటవీ భూమి సాగు చేస్తున్న రైతుల వివరాలు వెరిఫికేషన్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. వారికే వెరిఫికేషన్ చేస్తున్నాం. కౌలు రైతులకు ఈ విడతలో అన్నదాత సుఖీభవ వర్తించదు. కౌలు రైతుల గుర్తింపు, రెన్యువల్ జరుగుతుంది. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారివిజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే రైతులందరికీ రైతు భరోసా సాయాన్ని పెంచుతాం. అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పింది. తీరా అధికారంలో వచ్చిన మొదటి ఏడాదే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగ్గొట్టింది. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ ఇస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. ఇందుకోసం రైతుల వివరాలను వెరిఫికేషన్ చేస్తున్నారు. అయితే కౌలు రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ పథకం వర్తించే సూచనలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కౌలు రైతుల గుర్తింపు పక్రియ పూర్తిస్థాయిలో ఇంతవరకు జరగలేదు. దీని వల్ల వారికి అన్నదాత సుఖీభవ సాయం అందడం అనుమానంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కౌలు రైతుల గుర్తింపు లక్ష్యం 16250 2025–26 ఖరీఫ్ సీజన్లో వేలాది మంది కౌలు రైతులను గుర్తించాల్సి ఉంది. కానీ వ్యవసాయ అధికారులు చాలా తక్కువ మందిని గుర్తించారు. ఈ ఏడాది 16,250 మంది కౌలు రైతులను గుర్తించాల్సి ఉండగా ఇంతవరకు గుర్తించింది కేవలం 200 మందిని మాత్రమే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏప్రిల్, మే నెలలోనే కౌలు రైతుల గుర్తింపుపై అవగాహన సదస్సులు నిర్వహించి కౌలు రైతులకు సాగు ఽహక్కు పత్రాలు ఇచ్చేవారు. కానీ ఈఏడాది మే నెల రెండో వారం వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కానట్లు తెలుస్తోంది. భూయాజమానులు, అటవీభూములు సాగు చేసే వారికే.. అన్నదాత సుఖీభవ పథకం కింద అందించే ఆర్థిక సాయానికి భూయాజమానులు, అటవీ భూములు సాగు చేసే వారే అర్హులని ప్రభుత్వం పేర్కొంది. దీన్ని బట్టి కౌలు రైతులకు ఆర్థిక సాయం ఇచ్చే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. జిల్లాలో భూయాజమానులకు, అటవీభూమి సాగు చేసే రైతులకు వ్యవసాయ అధికారులు అన్నదాత సుఖీభవ పథకం కోసం వెరిఫికేషన్ చేస్తున్నారు. జిల్లాలో 4,89,252 మంది రైతులు ఉన్నారు. వారిలో 2,159 మంది అటవీ భూమి సాగుచేసే వారు ఉన్నారు. మొత్తం రైతుల్లో 4,36,744 మంది రైతులకు వెరిఫికేషన్ చేశారు. ఇంకా 50 వేల మందికి పైగా వెరిఫికేషన్ పూర్తి కావాల్సి ఉంది. ఈనెల 25వతేదీతో వెరిఫికేషన్కు గడువు పూర్తవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా సాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూయాజమానులు, అటవీభూమి సాగు చేసే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం కింద సాయం అందజేశారు. దీంతో వారు మిగతా రైతుల మాదిరి వారు సాగు చేసిన పంటలకు పెట్టుబడి పెట్టుకునే వారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే వారు. -
హత్యా..?ఆత్మహత్యా?
● కోనాడలో అనుమానాస్పదంగా యువకుడి మృతి ● కుమారుడి మృతిపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు ● శవాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం చేసిన వైద్యులుపూసపాటిరేగ: మండలంలోని కోనాడ గ్రామంలో యువకుడి మృతిపై పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, గ్రామస్తులు ధ్రువీకరిస్తుండగా తమ కుమారుడిని హత్య చేశారంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతో యువకుడిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేలనుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. కోనాడ గ్రామానికి చెందిన బొడ్డు భూలోక (35), గ్రామానికి చెందిన బడి సూరిబాబుల మధ్య చిన్నపాటి విషయమై వాగ్వాదం జరిగింది. భూలోక తన కుమార్తె హాసినిని దుర్భాష లాడడంతో వరుసకు మేనమామ అయిన సూరిబాబు పిల్లలను ఎందుకు దుర్భాషలాడుతున్నావంటూ భూలోకను మందలించడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. జరిగిన విషయాన్ని సూరిబాబు సమీపంలోని బంధువులకు చెబుతుండగా, మద్యం మత్తులో ఉన్న భూలోక వెనక నుంచి మంచం కోడుతో సూరిబాబు తలపై బలంగా మోదడంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే హుటాహుటిన చికిత్స నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సూరిబాబు బంధువులు బొడ్డు అశోక్, బొడ్డు చినభూలోక, బొడ్డు అప్పలస్వామిలు కోపోద్రిక్తులై రాత్రి 10 గంటల సమయంలో భూలోక ఇంటికి వెళ్లి చేయిచేసుకున్నారు. అకారణంగా సూరిబాబును ఎందుకు కొట్టావంటూ కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన భూలోక నిమిషాల వ్యవధిలో రెండుసార్లు ఉరివేసుకోవడానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు వారించి అడ్డుకున్నారు. అ తరువాత అర్ధరాత్రి 2 గంటల సయంలో భూలోక, తండ్రి అప్పన్నతో కలిసి మద్యం తాగాడు. సీతంపేటలో రంపం పనికోసం ఆదివారం తెల్లవారు జామున నూకరాజు అనే కాంట్రాక్టర్ ఇంటికి వచ్చి భూలోకను పిలుస్తుండగా తలుపులు తీయకపోవడంతో గదిలో చూడగా ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో భూలోక మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం శ్మశానంలో పూడ్చిపెట్టారు. అంత్యక్రియల అనంతరం ఇంటికి వెళ్లిన మృతుడి తండ్రి అప్పన్న తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని, హత్య చేశారని పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్లు కోనాడ శ్మశానానికి వెళ్లి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని గ్రామస్తుల సహకారంతో బయటకు తీయించి వైద్యులతో మ్మశానంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతో బొడ్డు భూలోకది హత్యా? లేక ఆత్మహత్యా? అనే విషయం తేలనుంది.అనాథలైన పిల్లలు మృతుడు భూలోక భార్య భూలోకమ్మ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తాజాగా భూలోక మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. వారికి హాసిని, రజిని అనేకుమార్తెలు, అక్షియవర్ధన్ అనే కుమారుడు ఉన్నారు. అనుకోని ప్రమాదంలో తల్లి భూలోకమ్మ, తండ్రి భూలోకలు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. సంఘటనా స్థలానికి వచ్చిన వారంతా దేవుడా ముగ్గురు పిల్లలకు దిక్కెవరంటూ కన్నీరు పెట్టుకున్నారు. బొడ్డు భూలోక మృతిపై ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ రవాణాకు మార్గం!
అక్రమ రవాణాపై మరింత నిఘా..మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై మరింత నిఘా మండల బోర్డర్లో ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ రాష్ట్రాలు ఉడడం వల్ల మండలం మీదుగా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు, స్థానిక బైపాస్ రోడ్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశాం. ఏ విధమైన అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం. వి ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురంరామభద్రపురం: మండలకేంద్రంలోని జాతీయ రహదారి మీదుగా నిషేధిత వస్తువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా రూ.96 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లను రామభద్రపురం పంచాయతీ కార్యాయం వద్ద స్థానిక పోలీసులతో పాటు విజిలెన్స్, వాణిజ్యపనుల శాఖాధికారులు శనివారం పట్టుకున్న విషయం విదితమే. రామభద్రపురం మండల కేంద్రం అంతరరాష్ట్ర కూడలి కావడంతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాలకు బోర్డర్లో ఉన్నందున ఈ మండల కేంద్రం మీదుగా గంజాయి, ఖైనీ గుట్కా, నల్లమందు వంటి మాదక ద్రవ్యాలతో నిషేధిత వస్తువులు అక్రమ రవాణా సులభతరమవుతోంది. పదినెలల్లో అక్రమ రవాణా జరిగిన కొన్ని సంఘటనలు.. గతేడాది జూన్ 16వ తేదీన స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఒడిశా రాష్ట్రం కొరాపుట్ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి విజయవాడకు అక్రమ రవాణా చేస్తున్న కిలోన్నర గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ● గతేడాది ఆగస్టు 16వ తేదీన కొట్టక్కి చెక్ పోస్టు వద్ద అక్రమంగా ఒడిశా నుంచి తరలిస్తున్న రెండున్న కిలోల గంజాయి పట్టుకున్నారు. ● గతేడాది అక్టోబరు 7న మండలంలోని ముచ్చర్లవలస పరిధిలో గల పెట్రోల్ బంకు సమీపంలో గల రాజస్థాన్ డాబా వద్ద ఎస్సై వి. ప్రసాదరావు సిబ్బందితో కలిసి నల్లమందు పట్టుకున్నారు ● గతేడాది డిసెంబర్ 12న కొట్టక్కి చెక్ పోస్టు వద్ద ఒడిశా నుంచి సాలూరు, రామభద్రపురం మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న 800 కిలోల గంజాయి పట్టుకున్నారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 10న 150 కిలోల గంజాయి కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు వద్ద పట్టుబడింది. కూటమి ప్రభుత్వం వచ్చాకే అధికంగా అక్రమ రవాణా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాదక ద్రవ్యాలతో పాటు పలు నాసిక రకం వస్తువుల అక్రమ రవాణాకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రామభద్రపురం మీదుగా నిషేధిత వస్తువుల రవాణా -
బురదలో కూరుకుని బాలుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని లుంబేసు పంచాయతీ మూలజమ్ము గ్రామంలో బురదలో కూరుకుపోయి ఓ బాలుడు మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బిడ్డిక చిరంజీవి, నీరజల కుమారుడు అశోక్ (7) స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో ఆడుకునేందుకు శుక్రవారం వెళ్లాడు. కాసేపు చెరువులో ఉన్న నీటిలో ఆడుకున్నారు. అంతలో ఇంకొంచెం చెరువు మధ్యలోకి వెళ్లిన అశోక్ బురదలో కూరుకుపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్నేహితులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో అంతా వచ్చి చెరువులో వెదికారు. చాలా సేపటి తర్వాత బురదలో కూరుకుపోయిన అశోక్ శవమై కనిపించాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
● 10న ఉపాధి హామీ సిబ్బందితో రాష్ట్రస్థాయి కార్యక్రమం ● కొనసాగుతున్న యోగా శిక్షణవిజయనగరం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి, వారి చేత యోగాసనాలను అభ్యసింపజేసే ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన వందమంది మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ రెండో రోజు ఆదివారం రాజీవ్ఇండోర్ స్టేడియంలో కొనసాగింది. జిల్లా కేంద్రంలో ప్రత్యక్షంగా, హాజరుకాని వారికి ఆన్లైన్ ద్వారా శిక్షణ నిర్వహించారు. యోగా గురువులు, టీవోటీలు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొన్నారు. నాలుగు ప్రాంతాల్లో ప్రదర్శనలు జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 30న రామనారాయణం, జూన్ 6న చింతపల్లి బీచ్ వద్ద, 12న రామతీర్థం వద్ద, 19న శ్రీ గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ వద్ద యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్కర్లతో జూన్ 10న యోగా ప్రదర్శన నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలో 10 ప్రాంతాల్లో.. జిల్లా కేంద్రం విజయనగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పది యోగా వీధులను ఎంపిక చేశారు. రెండు రోజులకు ఒకసారి పట్టణంలోని ఏదో ఒక ప్రధాన మార్గంలో ఉదయాన్నే యోగాసన ప్రదర్శన నిర్వహిస్తారు. శిక్షణ పొందినవారితో పాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కు వచ్చి ఆసనాలను అభ్యాసం చేయవచ్చు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. -
వైభవంగా ఆదిత్యహృదయ హోమం
నెల్లిమర్ల రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం, గాయత్రి రామాయణం, ఆదిత్య హృదయ హోమాలను వైభవంగా జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహాచార్యులు, కిరణ్, వరప్రసాద్, రామగోపాల్ పాల్గొన్నారు. -
కమ్మవీధిలో అగ్నిప్రమాదం
● రూ. 5.50 లక్షల ఆస్తినష్టం విజయనగరం క్రైమ్: నగరంలోని కమ్మవీధిలో ఆదివారం మధ్యాహ్న 1 గంట ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వీధిలోని ఒక గృహిణి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెడుతుండగా ఒక్కసారిగా అగ్గిపుల్ల పక్కకు ఒరిగి ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ అధికారులు సంతోష్, మహేష్ బృందం ఫైర్ ఇంజిన్తో కమ్మవీధిలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సూబట్ల సూర్యారావు ఇంట్లో ఈ ప్రమాదం సంభవించగా రూ.లక్ష నగదు, బంగారం, ఇంట్లో ఉన్న టీవీ, బీరువా దగ్ధమయ్యాయి. అలాగే ఆ ఇంటిని ఆనుకుని ఉన్న సూబట్ల రాజు, సూబట్ల లక్ష్మణరావుల ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పిడుగుపాటుకు రెండు ఆవుల మృతిబలిజిపేట: మండలంలోని పెద్దింపేటలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెద్దింపేటలో మధ్యాహ్నం వర్షం కురిసి ఆగిపోయిన తరువాత రైతులు ఆవులను మేతకు విప్పి గ్రామం శివారుకు వెళ్తున్న సమయంలో పిడుగులు పడడంతో ఆవులు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మజ్జి కృష్ణమూర్తి, టి.సూర్యనారాయణలకు చెందిన రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. కృష్ణమూర్తి ఆవు రూ.30వేలు, సూర్యనారాయణ ఆవు రూ.40వేలు ఖరీదు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. కుక్క కాటుతో మరో రెండు ఆవులు పాలకొండ రూరల్: మండలంలోని అట్టలి గ్రామంలో నివసిస్తున్న శిర్లి తౌడమ్మ చెందిన రెండు పాడి ఆవులు పిచ్చికుక్క కాటుకు గురై ఆదివారం మృతి చెందాయి. దీంతో బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబ పోషణలో భాగమైన ఆవులను కుక్క కరిచేయడంతో అవి మృతి చెందినట్లు బాధితురాలు భోరుమంది. ఇటీవల మండలంలోని రుద్రిపేట గ్రామంలో కుక్కకాటుకు గురై ఓ లేగ దూడ మరణించిన ఘటన మరువక ముందే మరో ఆవులు చనిపోయాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలపై దృష్టి పెట్టాలని అయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు. 31న జిల్లా స్థాయి తైక్వాండో పోటీలుబొబ్బిలి: ఈనెల 31న పట్టణంలో 18వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు బొబ్బిలి తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం దీనికి సంబంధించిన బ్యానర్ను ఆవిష్కరించారు. క్టబ్ కార్యదర్శి చెలికాని వేణుగోపాల రావు ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు జిల్లావ్యాప్తంగా 200 మంది హాజరై జూనియర్,సబ్ జూనియర్, జూనియన్ క్యాడెట్, సీనియర్ విభాగాల్లో జరిగే పోటీల్లో తలపడతారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే నెల 9 నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. -
రెండు లారీలు ఢీ కొని బిహార్ వాసి మృతి
రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై రెండు లారీలు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో బిహార్ వాసి ఒకరు ఆదివారం మృతిచెందారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్లోని పాట్నా జిల్లాకు చెందిన సైలేస్ సాహు(40) జీవనోపాధి నిమిత్తం గడిచిన మూడేళ్లుగా హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీలోని కొండకెంగువ వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు–1లో పనిచేస్తున్నాడు. అయితే పనినిమిత్తం పాచిపెంట వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు–2కు వెళ్లి పని ముగించుకుని తిరిగి క్యాంప్–1కు లారీలో వస్తుండగా హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీ నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆ హైవేకు సంబంధించిన మరో లారీ ఎదురుగా వస్తూ ఢీ కొంది. దీంతో సాహు ప్రయాణిస్తున్న లారీ తలుపు తెరుచుకుని కిందపడడంతో లారీ చక్రాలు, రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ మధ్య నలిగి ముద్దయ్యాడు. అదే లారీలో ఉన్న డ్రైవర్ శివ ఠాకూర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు వీలు లేనంతగా ముద్దవడంతో బాడంగి సీహెచ్సీ వైద్యాధికారి ఆధ్వర్యంలో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.డ్రైవర్ శివ ఠాకూర్ ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడు సాహుకు భార్య, పాప, బాబు ఉన్నారు.రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు గజపతినగరం: మండల కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో ట్రైన్లో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. గజపతినగరం రైల్వే స్టేషన్ మీదుగా విశాఖ వెళ్తున్న పాసింజర్ ట్రైన్లో నుంచి విజయవర్మ అనే వ్యక్తి జారి పడి తీవ్రగాయాల పాలు కావడంతో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. -
గోపాలకృష్ణ మాస్టారుకు అవార్డు ఆనందదాయకం
రేగిడి: మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు పుర్లి గోపాల కృష్ణంనాయుడికి తెలుగు వెలుగు సాహితీవేదిక నంది అవార్డు రావడం ఆనందదాయకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్లు అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని అంబకండి గ్రామంలో గోపాలకృష్ణంనాయుడు మాస్టారును దుశ్శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్ల ఉపాధ్యాయుడు అయినప్పటికీ తెలుగుభాషపై ఉన్న మక్కువతో విద్య, సాంస్కృతిక సేవా రంగంలో విశిష్టమైన కృషిచేసి అవార్డు పొందడంతో ఈ ప్రాంతానికే మంచి పేరు వచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, ఎంపీటీసీ పుర్లి సత్యవతి, లావేటి గణపతిరావునాయుడు, లావేటి శ్రీహరిరావు, లావేటి వెంకట వేణుగోపాలనాయుడు, ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
డిజిటల్ దెబ్బ..దొంగల అబ్బా..!
చీపురుపల్లి: ఎంత నైపుణ్యం కలిగిన దొంగలైనా ప్రస్తుత రోజుల్లో డిజిటలైజేషన్ ముందు తలొగ్గాల్సిందే. విరివిగా దొంగతనాలు జరుగుతు న్నప్పటికీ పోలీస్శాఖలో పెరిగిన డిజిటలైజేషన్ కారణంగా ఆ చోరీలను ఛేదించడం సునాయాసమైంది. అందులో భాగంగానే చీపురుపల్లి పట్టణంలోని మెయిన్రోడ్లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన చోరీతో పాటు వృద్ధులను గాయపరిచిన దుండగులు డిజిటలైజేషన్ పుణ్యమాని అతికొద్ది గంటల్లోనే పట్టుబడ్డారు. శుక్రవారం అర్థరాత్రి పట్టణంలోని మెయిన్రోడ్లో వారణాశి సురేష్ నివాసంలో 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులను తీవ్రంగా గాయపరిచిన సంఘటన తెలిసిందే. శనివారం ఉదయానికి ఈ సంఘటన పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ఎస్.రాఘవులు నేతృత్వంలోని పోలీస్ అధికారులు డిజిటలైజేషన్ సహకారంతో దుండగులను పట్టుకున్నట్లు సమాచారం. చీపురుపల్లిలో చోరీకి పాల్పడిన దొంగలను తెనాలిలో పట్టుకుని జిల్లాకు తీసుకుంచ్చినట్లు తెలిసింది. డిజిటలైజేషన్దే కీలకపాత్ర దొంగలను పట్టించడంలో డిజిటలైజేషన్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చోరీ జరిగిన ఇంటికి సమీపంలోని సెల్టవర్ పరిధిలో సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలిసింది. చోరీ జరిగిన సమయంలో ఆన్లో ఉన్న ఫోన్ నంబర్లను సేకరించారు. దీంతో పాటు క్లూస్ బృందాలు సేకరించిన ఫింగర్ ప్రింట్స్తో మేచ్ అవడంతో తెనాలికి చెందిన ముఠాగా దుండగులను గుర్తించారు. వెంటనే గుంటూరు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో తెనాలి పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే చీపురుపల్లిలో చోరీకి పాల్పడిన దుండగులు విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి జన్మభూమి రైలులో తెనాలి వెళ్లినట్లు తెలిసింది. రెక్కీ చేసిన మహిళ కోసం.. ఇదిలా ఉండగా చీపురుపల్లిలో జరిగిన ఉదంతానికి ప్రధాన సూత్రధారిగా ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. చోరీ జరగడానికి మూడు రోజుల ముందే ఆ మహిళ చీపురుపల్లి చేరుకుని రెక్కీ నిర్వహించి ఇక్కడి ఇల్లు, పరిసరాల ఫొటోలు దుండగులకు పంపించినట్లు తెలిసింది. ఆ మహిళ వేసిన స్కెచ్ ప్రకారమే చోరీ అమలు చేసినట్లు సమాచారం. అయితే తెనాలిలో ఇద్దరు దుండగులు మాత్రమే పట్టుబడిన నేపథ్యంలో ఆ మహిళతో పాటు మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. సెల్టవర్ లొకేషన్, ఫింగర్ ప్రింట్స్ ద్వారా నిందితుల గుర్తింపు వైజాగ్ నుంచి జన్మభూమి రైలులో ప్రయాణించిన దుండగులు రెక్కీ నిర్వహించిన మహిళ కోసం గాలింపు తెనాలిలో ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు వారితో పాటు మరికొంత మంది ఉన్నట్లు సమాచారం -
ఐఈఆర్పీల ఇంటింటి సర్వే
దివ్యాంగ చిన్నారుల కోసంప్రతి ఒక్కరినీ గుర్తించేందుకే.. ప్రతి ఒక్కరినీ ఈ పథకం కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో సర్వే నిర్వహిస్తున్నాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను అందిస్తాం. భవిత కేంద్రాలకు రాని వారికి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషను అందిస్తున్నాం. భవిత కేంద్రాల పరిధిలో విద్యతో పాటుగా అవసరమైన సేవలు అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. ప్రతి చిన్నారిని గుర్తించి, భవిత కేంద్రాల్లో చేర్చిస్తాం. ఇంతవరకు జిల్లాలో 18మందిని గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రాలు, భవిత కేంద్రాలలో చేర్పించాం. – పి.భానుమూర్తి, సహిత విద్య కోఆర్డినేటర్, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం: దివ్యాంగ చిన్నారులను గుర్తించేందుకు సహిత విద్య ఐఈఆర్పీ(ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లు ఇంటింటి సర్వే ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఇంటికి పరిమితం కాకుండా వారిని శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల పరిధిలో ఈ గుర్తింపునకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలు మిగిలిన పిల్లల మాదిరిగానే అన్ని అవకాశాలను అంది పుచ్చుకునే విధంగా ప్రతి మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసి సహిత విద్యను అమలు చేస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున 15 భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మిగిలిన పిల్లలతో సమానంగా విద్యను అందించడంతో పాటు వారికి అవసరమైన పరికరాలను ఆందిస్తున్నారు. సమాజంలో ఇంకా మిగిలి వున్న ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించడానికి జిల్లా విద్యాశాఖాధికారి, అడిషనల్ ప్రోజెక్టు కోఆర్డినేటర్, సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో భవిత కేంద్రాల ఐఈఆర్పీలు సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగ పిల్లలందరికీ అవసరమైన విద్యను అందించడం, ప్రతి చిన్నారిని వారి వయసుకు తగ్గట్టుగా పాఠశాలలో చేర్చించడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే దివ్యాంగ పిల్లల విద్యను డిజిటలైజేషన్ చేసి, టాబ్స్ను అందజేస్తున్నారు. ప్రత్యేక సేవలు మానసిక దివ్యాంగుల్లో విద్యార్థి దశలో ఉన్న వారికి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు ప్రతీ వారం పిజియోథెరపీ సేవలను అందజేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు గల వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం, పాఠశాలలకు రప్పించేలా భవిత కేంద్రంలోని ఐఈఆర్పీలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి మండలంలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను గుర్తించేందుకు ఐఈఆర్పీలు ప్రత్యేక సర్వే చేపట్టారు. జిల్లాలో 1,749 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. వీరిలో 1738 మంది భవిత కేంద్రాలలో విద్యనభ్యసించగా, మిగిలిన 11మందిని వారి ఇళ్ల వద్దనే ప్రత్యేకంగా విద్యనందిస్తున్నారు. వీరు కాకుండా, గతేడాది జూన్లో నిర్వహించిన సర్వేలో పాఠశాలలకు రాకుండా ఇంటి వద్ద ఉన్న 286 మందిని గుర్తించారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వే అనంతరం గుర్తించిన వారిని అంగన్వాడీ కేంద్రంలోగానీ ప్రాథమిక పాఠశాలల్లోగానీ చేర్పిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా సెలవు రోజుల్లోనే సర్వే చేయాలని అధికారులు ఐఈఆర్పీలను ఆదేశించారు. స్థానిక అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ల సహాయంతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇంతవరకు జిల్లాలో 18మందిని గుర్తించారు. ప్రత్యేక వైద్య శిబిరాలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో మెడికల్ అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించారు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన ఉపకరణాలను గుర్తించి, వాటి కోసం దరఖాస్తులు స్వీకరించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని గుర్తించి, మెంటల్లీ రిటార్డెడ్ (ఎంఆర్), హియరింగ్ ఇంపైర్డ్(హెచ్ఐ), విజువల్లీ ఇంపైర్డ్(వీఐ), సెరిబ్రల్ పాలసీ కింద నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ క్యాంపులకు పాఠశాలలకు రాకుండా ఇంటి వద్ద ఉండేవారు కూడా వచ్చారు. నాలుగు రకాల అలవెన్స్లు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాలుగు రకాల అలవెన్స్లను ప్రభుత్వం అందజేస్తోంది. ఎస్కార్ట్, ట్రాన్స్ఫోర్టు్, హోమ్ బేస్డ్, రీడర్ అలవెన్సును అందజేస్తున్నారు. అంధులకు రీడర్ అలవెన్స్గా 10 నెలలకు రూ.2,000 అందజేస్తున్నారు. బడికి వచ్చే వారికి ఎస్కార్ట్ అలవెన్స్ కింద ఒక్కో విద్యార్థికి పది నెలలకు రూ.3,000 అందిస్తున్నారు. ట్రాన్స్పోర్టు అలవెన్స్ పది నెలలకు రూ.3,000 ఇస్తున్నారు. గర్ల్ చైల్డ్ అలవెన్స్ 10 నెలలకు రూ.2,000 అందజేస్తున్నారు. హోమ్ బేస్డ్ అలవెన్స్ పది నెలలకు రూ.3,000 అందజేస్తున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన సర్వే దివ్యాంగులకు నాలుగు రకాల అలవెన్సులు గుర్తించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు -
అభివృద్ధికి దూరం..!
తాగునీటి సమస్యకు పరిష్కారం లేదా... పట్టణంలోని తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే బురద నీరు.. వేసవి కాలం వస్తే నాలుగు రోజులకొకసారి తాగునీటి సరఫరా చేయడంతో పట్టణ వాసులు దాహంతో అల్లాడుతున్నారు. కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో మూడు రోజులకొకసారి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు గత ప్రభుత్వం రూ.65కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. వాటిని పునఃప్రారంభించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు. -
జిల్లా కేంద్రం..
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల పునర్విభజన చేపట్టారు. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తూ గిరిజన ప్రాంతాలను, జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, మున్సిపల్ పార్క్, తోటపల్లి ఐటీడీఏ పార్క్ ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. నేడు పీజీఆర్ఎస్కు హాజరు కానున్న జిల్లా కలెక్టర్ సీతంపేట: సీతంపేటలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ హాజరు కానున్నారని ఐటీడీఏ అధికార వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చన్నారు. 1143 పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించాలి సీతంపేట: గిరిజన గురుకులాల్లో భర్తీ చేయనున్న 1143 టీచర్ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ట్రైబుల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్కు ఆదేశించినట్టు గిరిజన జేఏసీ నాయకుడు బి.ఉమామహేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన గురుకులాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న టీచర్లు జాతీయ ఎస్టీ కమిషన్కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఇటీవల వచ్చిన కమిషన్ సభ్యులను యూనియన్ నాయకులు కలిశారు. అంతకు ముందు ఢిల్లీలో పలుమార్లు కలిసి సమస్యలను వివరించారు. స్పందించిన కమిషన్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో పోస్టులు డీఎస్సీలో చూపించలేదని, గిరిజన గురుకులం అధికారులు గురుకుల పాఠశాలల్లో ఖాళీలు ఎందుకు చూపించారని ప్రశ్నించారు. గురుకులం బైలాస్కు విరుద్ధంగా అవుట్ సోర్సింగ్లో టీచర్స్ అండ్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేసినందుకు అందరిని సీఆర్టీలుగా మార్పు చేయాలన్నారు. మూడు రోజుల్లో ఇది అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. ఇది తుది తీర్పు అన్నారు. లేదంటే కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. కమిషన్ తీర్పుతో గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ జేఏసీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కీచక ఉపాధ్యాయుడు! రేగిడి: మండలంలోని ఓ జెడ్పీ ఉన్నత పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడి రాసలీలలు ఆలస్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఆదివారం వెలుగులోకి వచ్చాయి. జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు పాఠశాల పని చేసే రోజుల్లో కన్నేశాడు. మాయమాటలు చెప్పి లొంగదీసుకొని గర్భవతిని చేసినట్టు విశ్వసనీయ సమాచారం. బాలిక తండ్రి గతంలో మృతి చెందగా.. తల్లి వేరే చోట పనులకు వలసబాటు పట్టింది. దీంతో బాలిక తాత గారి ఇంటి వద్ద ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటుంది. పాఠశాలకు వేసవి సెలవులిచ్చిన తరువాత బాలిక తల్లి వద్దకు వెళ్లింది. తల్లి తన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గుర్తించింది. వెంటనే వైద్యులను సంప్రదించగా బాలిక గర్భం దాల్చినట్టు ఉందని చెప్పినట్టు సమాచారం. కుటుంబ పరువుకు సంబంధించిన విషయం కావడంతో బయటకు రానివ్వకుండా గోప్యం పాటించినట్టు సమాచారం. పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని జిల్లా కేంద్రంలో అమలు చేయకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చినుకు పడితే జిల్లా కేంద్రంలోని ప్రజల కష్టాలు అన్నీఇన్నీ కావు. పట్టణ నడిబొడ్డు డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం సాధ్యమేనా.. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డును గత ప్రభుత్వం ఆర్కె.బట్టివలస గ్రామ సమీపంలో తరలించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించింది. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కాలేదు. డంపింగ్ యార్డును తరలిస్తామని కూటమి ఎమ్మెల్యే విజయచంద్ర హామీ ఇచ్చి రెండు నెలల్లో పరిష్కారం చూపుతామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా పట్టణ ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డుకు పరిష్కారం చూపకపోవడంతో పట్టణ వాసుల్లో నిరుత్సాహం నెలకొంది. గెడ్డ వర్షం వస్తే చాలు పట్టణంలో పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఎన్నికల ముందు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే విజయచంద్ర కనీసం పట్టించుకోవడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితే చాలు పట్టణంలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా ముంపు ప్రాంతాలైన బైపాస్ కాలనీ వాసులు భయబ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వరహాల గెడ్డ ఆక్రమణలు, పూడికలు తీయకపోవడంతో మండలంలో కురిసిన వర్షానికి పట్టణంలో పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కావస్తున్నా వరహాల గెడ్డలో పూడికలు తీయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిపై చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. తూతూ మంత్రంగా ‘స్వచ్ఛ పార్వతీపురం’ పట్టణంలోని పలు వార్డుల్లో పూడికలు తీయకపోవడం, చెత్త ఎక్కువగా పేరుకుపోవడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నట్టు పట్టణ వాసులు వాపోతున్నారు. పట్టణంలోని కొత్తవలస, వైకెఎం కాలనీ, గూడ్స్షెడ్ రోడ్డు, ఇందిరా కాలనీ, శాశ్వత పరిష్కారం చూపాలి పట్టణంలోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రస్తుత వేసవి కాలంలో నాలుగైదు రోజులకొకసారి కుళాయి ద్వారా తాగునీటిని విడుదల చేస్తున్నారు. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి శాశ్వత పరిష్కారం చూపాలి. – సూర్ల ఉమామహేశ్వరి, గూడ్స్షెడ్ రోడ్డు, పార్వతీపురం ముంపు నుంచి తప్పించాలి మాది బైపాస్ కాలనీ, మా కాలనీలో వర్షం పడితే చాలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా వరహాలగెడ్డ పూడికలు తీయించేవారు. ఏడాది గడుస్తున్నా గెడ్డలో పూడికలు తీయడం లేదు. వర్షం పడితే మా కాలనీలోని ఇళ్లలో వర్షపు నీరు చేరుతుంది. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలి. – ఎన్.మహేశ్వరరావు, బైపాస్ కాలనీ జగన్నాథపురం కాలనీల కాలువల్లో పూడికలు పేరుకుపోయి దోమల బెడద పెరిగిందని ఆ కాలనీవాసులు వాపోతున్నారు. వార్డుల్లో కాలువలు తీసి రోగాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. డంపింగ్ యార్డుకు పరిష్కారం చూపాలి పార్వతీపురం పట్టణ ప్రధాన సమస్య అయిన డంపింగ్ యార్డును తరలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా పట్టించుకొనే నాధుడే కరువయ్యారు. గతంలో ప్రతిపాదించిన విధంగా డంపింగ్ యార్డును పట్టణం నుంచి దూర ప్రాంతాలకు తరలించి చెత్త నుంచి పట్టణానికి విముక్తి కల్పించాలి. – ఎస్.అనిల్, పార్వతీపురం పట్టణం నుంచి వెళ్లే వరహాల గెడ్డ సమస్యకు పరిష్కారం లేదు. తాగునీటి కష్టాలు తప్పడం లేదు. పారిశుధ్య చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. డంపింగ్ యార్డు తరలింపు లేదు. ఈ సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే నేడు ఏడాదవుతున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వరహాల గెడ్డకు మోక్షమెప్పుడో.. జిల్లా కేంద్రం నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాల ● కొండంత కష్టం! ఈ చిత్రంలో కొండ రహదారుల్లో ఉన్న ఓ ఖానాపై అనారోగ్యంతో దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్న యువతి పేరు సవర విజయశాంతి. వారం రోజుల కిందట సీతంపేట మండలం గుమ్మడ గ్రామం నుంచి బంధువుల ఇంటికి రేగుమానుగూడ వచ్చింది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. ఆదివారం చలి జ్వరం తీవ్రం కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 108కి కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే గ్రామ రహదారి పూర్తిగా రాళ్లు తేలి ఉండడంతో 108 వాహనం గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో విజయశాంతిని బంధువులు గ్రామం నుంచి కొంత దూరం తీసుకువచ్చి ఇలా ఖానాపై పడుకోబెట్టారు. 108 వాహనం వచ్చే వరకు సపర్యలు చేశారు. కాసేపటికి 108 వాహనం రావడంతో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. – సీతంపేట న్యూస్రీల్నాడు... నేడు... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా జిల్లాను అభివృద్ధి చేసే దాఖలాలు కన్పించడం లేదు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పట్టణానికి దశాబ్దాల కాలం నాటి సమస్య అయిన డంపింగ్ యార్డు తరలిస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి దాదాపు 12 నెలలు కావస్తున్నా హామీ ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల నాటి హామీలు విస్మరించారని, పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి కూపంలా వరహాలగెడ్డ వర్షం కురిస్తే రహదారులు, ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయం బైపాస్ కాలనీ వాసులకు తప్పని అవస్థలు దశాబ్దాల డంపింగ్ యార్డు తరలింపు ఉత్తిదేనా! -
ప్రతీ ఒక్కరిని యోగాంధ్రలో భాగస్వాములు చేయాలి
పార్వతీపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా జూన్ 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న యోగాంధ్రా కార్యక్రమాల్లో ప్రతీ ఒక్కరిని భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరూ పని ఒత్తిడిలో ఆరోగ్యం పట్ల సరైన దృష్టి సారించడం లేదని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలన్నారు. అయితే యోగాను శిక్షకుల ద్వారా వారి సమక్షంలో మాత్రమే చేయాలని, ఇందుకోసం మాస్టర్ ట్రైనీలను సిద్ధం చేసినట్టు తెలిపారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించేలా షెడ్యూల్ను అధికారులకు పంపామన్నారు. షెడ్యూల్లో సూచించిన మేరకు కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. నెల రోజల పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా స్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు తదితరులు అందరూ పాల్గొనేలా చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
‘ఉగ్ర’ విచారణలో విస్తుపోయే నిజాలు!
● మూడో రోజూ కొనసాగిన విచారణ విజయనగరం క్రైమ్: బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసుల కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్లను మూడో రోజు ఆదివారం కూడా విచారించారు. ఇందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్టు భోగట్టా. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ అధికారుల నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న విజయనగరం పోలీసులు స్థానిక పీటీసీలో మూడో రోజు కూడా విచారణ కొనసాగించారు. రెండో రోజు శనివారం రాత్రి సిరాజ్ కాస్త అస్వస్తతకు గురవడంతో సర్వజన ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రత్యేక వైద్యాధికారులను రప్పించి పీటీసీలోనే చికిత్స చేయించినట్టు సమాచారం. తొలి రెండు రోజులు కాస్త నెమ్మదిగా దర్యాప్తు సాగించిన దర్యాప్తు బృందం అధికారులు మూడో రోజు తమదైన కోణంలో విచారణ సాగించినట్టు తెలిసింది. ముఖ్యంగా గడిచిన ఆరు నెలలుగా హైదరాబాద్లోనే సమీర్తో ఉన్న విజయనగరం వాసి సిరాజ్ అక్కడే బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నినట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. మానవ బాంబుగా సిద్ధమైన సిరాజ్, సమీర్లు ముస్లిమేతరులే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా పేలుళ్లకు పథక రచన చేసినట్టు తెలిసింది. వరంగల్ ఫర్హాన్, ఢిల్లీ బాదర్ నుంచి వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్టు సమాచారం. మూడో రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ సాగినట్టు భోగట్టా. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి వరకు కొనసాగినట్టు తెలిసింది. -
రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్గా సేతుమాధవన్
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ ఇండోర్ స్టేడి యంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నువ్వా..నేనా అనే విధంగా ఏడు రౌండ్లలో క్రీడాకారులు పోటీపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో శ్రీకాకుళంకు చెందిన ఫిడే మాష్టర్ వేలుమహంతి సేతుమాధవన్ ఆరున్నర పాయింట్లు సాధించి రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్గా నిలిచాడు. అలాగే విశాఖపట్నంకు చెందిన అభిరామ్ ఆరు పాయింట్లతో ద్వితీయ, విజయవాడకు చెందిన సీనియర్ క్రీడాకారుడు మల్లేశ్వరరావు తృతీయ స్థానంలో నిలిచారు. ఎస్.కోటకు చెందిన వినీల్కార్తీక్ నాలుగో స్థానం, విశాఖపట్నంకు చెంది న జయనాగరాజు ఐదవ స్థానంలో నిలిచారు. ఓపెన్లో పది మందికి, అండర్–17 విభాగంలో పది మందికి, వివిధ కేటగిరీల్లో మొత్తం 30 మంది క్రీడాకారులకు రూ.1.30 లక్షలు నగదు బహుమతి తో పాటు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు జీఎంఆర్ ఐటీ తరఫున అందించారు. ఈ టోర్నమెంట్కు చీఫ్ ఆర్బిటార్గా కేవీ జ్వాలాముఖి వ్యవహరించగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.అరుణ్కుమార్ వ్యవహ రించారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్య అతిథిగా హాజరైన జీఎంఆర్ ఐటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపాల్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు. -
కార్పొరేషన్ రుణాలకు బ్రేక్
● దరఖాస్తు దారుల్లో ఆందోళన పార్వతీపురం టౌన్: వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరు చేస్తాం.. యువత స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నామంటూ హడావిడి చేసిన కూటమి ప్రభుత్వం మాట మార్చింది. రుణాల మంజూరుకు బ్రేక్ వేసింది. దీంతో దరఖాస్తు చేసుకుని, రుణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న బీసీ, ఎస్సీ, ఈబీసీ, కావు సామాజిక వర్గాల లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. జిల్లాలో 266 బీసీ, 266 ఎస్సీ యూనిట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. బీసీ లబ్ధిదారులకు రూ.35 కోట్లు, ఎస్సీ లబ్ధిదారులకు రూ. 11.53కోట్లు విడుదల చేస్తామని మహాత్మాజ్యోతిబాపూలే జయంతి సాక్షిగా మంత్రి సంధ్యారాణి ఆర్భాంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన నమూనా చెక్కును విడుదలచేశారు. అయితే, రుణాల మంజూరుకు తాజాగా బ్రేక్ వేశారు. ఎంపిక జాబితాలను నిలిపివేయాలని, దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నార ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్..! విజయనగరం క్రైమ్: బాంబు పేలుళ్ల కుట్ర కేసులో అరైస్టె.. పోలీస్ కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్లను విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులకు విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ నేతలు, ఆలయాలను దర్శించుకునే భక్తులే టార్గెట్గా పేలుళ్లు జరపాలని నిర్ణయించినట్టు భోగట్టా. విజయనగరం జిల్లాలో అధికమంది భక్తుల ప్రాణాలు తీసేలా ఐదుచోట్ల బాంబులు పేల్చేందుకు ఇమ్రాన్, బలుజిస్తాన్ అనే వ్యక్తులతో కలిసి పథక రచన చేసినట్టు సిరాజ్ తెలిపినట్టు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ క్రియేట్చేసి చాటింగ్ చేసినట్టు తెలిసింది. అవసరమైతే మానవబాంబుగా మారేందుకు కూడా సిద్ధపడినట్టు విచారణలో సిరాజ్ వెల్లడించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఆధారాల ఆధారంగా యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. విజయనగరం పీటీసీలో రెండోరోజు సిరాజ్, సమీర్లను ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందం విచారణ జరిపింది. తొలుత వీరిద్దరూ నోరుమెదిపేందుకు ఇష్టపడకపోవడంతో వేర్వేరుగా విచారణ జరిపారు. విజయనగరం ఆబాద్వీధికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ల మధ్య కుదిరిన స్నేహం, ఇద్దరు సౌదీ, అక్కడ నుంచి ఉమెన్ దేశానికి ఎలా వెళ్లారు అన్న కోణంలో దర్యాప్తు సాగించినట్టు తెలుస్తోంది. సిరాజ్ కాల్ డేటా ఆధారంగా లోతుగా విచారణ జరుపుతున్నారు. బీఏలో బిజిలీ ఫస్ట్ బొబ్బిలి: ఆంధ్రా యూనివర్సిటీ 2024–25 సంవత్సరంలో నిర్వహించిన బీఏ ఫైనల్ ఇయర్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇందులో బొబ్బిలికి చెందిన యడ్ల బిజిలీ 9.04 పాయింట్లతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థినిని బొబ్బిలివాసులతో పాటు కళాశాల సిబ్బంది అభినందించారు. తప్పిన ముప్పు దత్తిరాజేరు: వైజాగ్ నుంచి బీహర్ రాష్ట్రం ధన్బాద్ వెళ్తున్న ధన్బాద్ ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం పెదమానాపురం రైల్వే గేట్ వద్దకు వచ్చే సరికి చక్రాల నుంచి పొగలు వచ్చాయి. గేట్మన్ గమనించి కోమటిపల్లి స్టేషన్ మాస్టర్కు సమచారం అందించారు. రైలును అక్కడ కాసేపు నిలిపారు. రైలులో వస్తున్న పొగలు చూసి ప్రయాణికులు కంగారుపడ్డారు. స్వల్ప సాంకేతిక లోపంతో రైలు చక్రాలు వేడెక్కడంతో పొగలు వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలును కాసేపు నిలిపిన తర్వాత కదలడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
సజావుగా ఇంటర్మీడియట్ ప్రవేశాల కౌన్సెలింగ్
సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు శనివారం సీతంపేట బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్ సజావుగా సాగింది. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సీటు కేటాయిస్తూ ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి ప్రవేశపత్రం అందజేశారు. బాలికల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో 40 సీట్లు చొప్పున భర్తీ చేశారు. వృత్తివిద్యాకోర్సు అయిన ఎఅండ్టీ (అకౌంటింగ్ అండ్ ట్యాక్సిషేన్)లో 20 సీట్లలో విద్యార్థినులను జాయిన్ చేసుకున్నారు. 507 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా 450 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. బాలుర కళాశాలలో ఎంపీసీలో 40కి గాను 36 సీట్లు భర్తీ అయ్యాయి. బైపీసీలో 40కి 38, హెచ్ఈసీలో 38 సీట్లలో విద్యార్థులు ప్రేవేశాలు పొందారు. సీజీఏ 30కి 30, ఏఅండ్టీ 20కి 20 సీట్లు భర్తీ చేశారు. మొత్తం 170కి గాను 162 భర్తీ అయ్యాయి. 263 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 200ల మంది హాజరయ్యారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, గురుకులం సెల్ ఇన్చార్జి వెంకటరమణ, ప్రిన్సిపాళ్లు కృష్ణమోహన్, పి.సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. -
దొంగ బిల్లుల బాగోతం
‘తోటపల్లి’ సాక్షిగా...వీరఘట్టం: తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని కాలువల ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయి. రానున్న ఖరీఫ్కు సాగునీరు సక్రమంగా సరఫరా చేసేందుకు వీలుగా పాత ఆయకట్టు కాలువలను బాగుచేసేందుకు రాష్ట్ర విపత్తు ఉపశమననిధి (ఎస్డీఎంఎఫ్) కింద రూ.30.80 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో కాలువలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, పూడికలు తొలగించాలి. జలవనరులశాఖలో ఉన్న కొందరు అధికారులు ఎడమ కాలువలో గుర్తించిన 8 పనుల్లో ఏడు పనులు చేయకుండానే పనులు చేసినట్లు బిల్లులు సృష్టించారు. ఈ పనులకు సంబంధించిన ఫైల్ను క్వాలీటీ అధికారులకు నివేదించారు. వారు కనీసం పనులు జరిగాయా లేదా అని పరిశీలన చేయకుండా పనులు నాణ్యతా ప్రమాణాలతో చేసినట్టు నిర్ధారిస్తూ క్వాలిటీ నివేదిక సైతం ఇచ్చేశారు. ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు జరగని పనులకు జరిగినట్లుగా బిల్లులు సిద్ధం చేసి రూ.23.54 లక్షలు కాజేసేందుకు ఎత్తుగడ వేశారు. ప్రస్తుతం ఈ బిల్లుల ఫైల్ రాష్ట్ర జలవనరులశాఖ కార్యాలయంలో మంజూరుకు సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇంతలో ఈ దొంగ బిల్లుల వ్యవహారం వెలుగుచూడడంతో రైతన్నలు విస్మయం చెందుతున్నారు. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ పనులు ఆరంభమయ్యాయి. కాలువల్లో నీరు చేరింది.. ఇదే అదునుగా పనులు చేయకుండానే చేసినట్టు చూపించి బిల్లులు కాజేసేందుకు అధికారులు స్కెచ్ వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆందోళనలో రైతన్నలు... ఓ పక్క తోటపల్లి ఆధునికీకరణ పనులు ఆగిపోయాయి. ఈ ఏడాది ఖరీఫ్కు సాగునీరు వస్తుందా, రాదా అనే ఆందోళనలో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తరుణంలో కాలువలో పూడికలు తొలగించి సకాలంలో సాగునీరు అందించాల్సిన జలవనరులశాఖ అధికారులు ఇటువంటి పనులు చేపట్టడం అన్యాయమని రైతులు మండిపడుతున్నారు. ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకేమీ తెలీదంటున్న క్వాలిటీ అధికారులు... ఎడమకాలువలో ఎస్డీఎంఎఫ్ నిధులతో చేపట్టాల్సిన పనులు చేయకుండానే వాటికి క్వాలిటీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని క్వాలీటీ కంట్రోల్ డీఈఈ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మా వద్ద కు ఎన్నో వర్కులు వస్తుంటాయని, అందులో మీరు అడిగిన వర్కులు వచ్చాయో లేదో అని దాటవేస్తూ సమాధానం ఇచ్చారు. ●తురకనాయుడువలస నుంచి 1వ బ్రాంచ్ కాలువలో రెండు చోట్ల రూ.3.80 లక్షలతో రెండు పనులు, తోటపల్లి ఎడమ ప్రధాన కాలువలో రూ.4 లక్షలతో, మరో చోట మరో రూ.4.74 లక్షలతో, ఎడమకాలువ పరిధిలో ఉన్న చలివేంద్రి బ్రాంచ్ కాలువలో మట్టి తీయించేందుకు రూ.1.50 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ వర్కులన్నీ పూర్తి చేసినట్లు జలవనరులశాఖ అధికారులు తప్పుడు బిల్లులు సృష్టించారు. ఎడమ కాలువ పరిధిలోని మొత్తం ఏడు పనులను రూ.23.54 లక్షలో చేపట్టినట్లు బిల్లులు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జలవనరులశాఖ డివిజనల్ కార్యాలయంలో ఈ పనులకు సంబంధించిన ఎమ్ బుక్లు, క్వాలిటీ సర్టిఫికెట్లు పేమెంట్ కోసం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అసలు పని చేయనేలేదు.. రూ.23.54 లక్షలకు బిల్లు పెట్టేశారు. ఆ పనులు నాణ్యతతో చేసినట్టు క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా ధ్రువీకరించేశారు. కింది నుంచి పై స్థాయి వరకు ప్రజాధనం దోచుకునేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఇది కాస్త బహిర్గతమయ్యేసరికి తడుముకుంటున్నారు. తోటపల్లి కాలువల సాక్షిగా జలవనరుల శాఖలో సాగుతున్న అవినీతి తంతుపై రైతాంగం గుర్రుమంటోంది. పనులు చేయకుండానే బిల్లుల నమోదు రూ.23.54 లక్షల ఎస్డీఎంఎఫ్ నిధులు కాజేసేందుకు స్కెచ్! చేయని పనులకు నాణ్యతతో చేసినట్టు ధ్రువీకరించిన క్వాలిటీకంట్రోల్ అధికారులు కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పనులు జరిగినట్టు సంతకాలు ఒకటిరెండు రోజుల్లో బిల్లులు మంజూరయ్యే అవకాశం వెలుగుచూసిన జలవనరుశాఖలో అవినీతి పర్వం రెండు రోజుల్లో పనులు చేపడతాం ఎడమకాలువలో ఎస్డీఎంఎఫ్ నిధులతో చేపట్టాల్సిన పనుల కాల పరమితి మార్చితో పూర్తయింది. అందుకే ఆ నిధులు వెనుకకు వెళ్లిపోతాయని ముందుగా బిల్లులు సిద్ధంచేశాం. అంతే తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు. రెండు రోజుల్లో కాలువలో పనులు చేపడతాం. – డి.వి.రమణ, ఏఈ, జలవనరులశాఖ, వీరఘట్టం ఇది తోటపల్లి ఎడమకాలువలోని 1వ బ్రాంచ్లోని కెల్ల చానల్. ఈ కాలువలో మట్టి పనులు చేసేందుకు రూ.5 లక్షల ఎస్డీఎంఎఫ్ నిధులు మంజూరు చేశారు. అయితే జలవనరులశాఖ అధికారులు మాత్రం ఈ కాలువలో ఎలాంటి పనులు చేయలేదు. ఒక్క పిచ్చిమొక్కకూడా తొలగించలేదు. కానీ, రూ.5 లక్షలు వెచ్చించి పనులు చేసినట్టు ఎమ్ బుక్లో రికార్డు చేసేశారు. ఇక్కడ చేపట్టిన పనులు ఎంతో నాణ్యతతో ఉన్నట్లు క్వాలిటీ అధికారులు ధ్రువీకరించి క్వాలిటీ సర్టిఫికెట్ కూడా ఇచ్చేయడం గమనార్హం. ఇది తోటపల్లి ఎడమకాలువలోని 2వ బ్రాంచ్ కాలువ. ఈ కాలువలో మట్టి పనులు చేసేందుకు రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి. ఇక్కడ కూడా పనులు చేపట్టినట్లు అధికారులు తప్పుడు పత్రాలు సిద్ధం చేశారు. పనులు చేపట్టకుండా బిల్లులు పెట్టకూడదు ఏ పనులైనా చేపట్టకుండా బిల్లులు పెట్టకూడదు. తోటపల్లి కాలువలో ఎస్డీఎంఎఫ్ నిధులతో మంజూరైన పనుల బిల్లులు ఇంకా రాలేదు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. అవసరమైతే ఫీల్డ్కు వెళ్లి తనిఖీలు చేస్తాను. – పి.సుధాకరరావు, ఈఈ, జలవనరులశాఖ, శ్రీకాకుళం -
చంపావతిపై చిన్నచూపు
గజపతినగరం రూరల్: ఆండ్ర కొండల నడుమ పుట్టిన చంపావతి నది జిల్లాలో 64 కిలోమీటర్ల మేర ప్రవహించి పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. వేలాది ఎకరాలకు సాగునీరు, తీర గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చుతోంది. వర్షాకాలంలో నాడు గోదావరిలో కనిపించే నది నేడు పిచ్చిమొక్కలు, ఆక్రమణల చెరలో చిక్కుకుంది. కొన్నిచోట్ల నది అడవిని తలపిస్తోంది. ఇసుక అక్రమ తవ్వకాలతో రూపుకోల్పోయింది. నది పరిరక్షణపై కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం రైతులు, తీర గ్రామాల ప్రజలను ఆవేదనకు గురిచేస్తోంది. -
అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లు స్వాధీనం
రామభద్రపురం: నకిలీ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లు, గిన్నెలు తోమే సబ్బులను విజయనగరం జిల్లా రామభద్రపురం వద్ద వాణిజ్యపన్నుల శాఖ స్వాధీనం చేసుకుంది. గుంటూరు ఎంబీ ఎంటర్ప్రైజెస్ పేరిట నకిలీ ఇన్వాయిస్ సృష్టించి బీహార్ నుంచి సరుకు రవాణా అవుతున్నట్టు విచారణలో తేలిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చీఫ్ టాక్స్ కమిషనర్ ఎ. బాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.96 లక్షల విలువైన సిగరెట్లు, రూ.2.53 లక్షల డిష్వాష్లను సీజ్ చేశామన్నారు. -
లింగ నిర్ధారణ వెల్లడిస్తే క్రిమినల్ చర్యలు
విజయనగరం ఫోర్ట్: గర్బస్థ పిండ పరిస్థితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించవలసిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గర్బస్థ పిండ పక్రియ చట్టం 1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. పోగ్రామ్ అధికారులు స్కానింగ్ సెంటర్లను విధిగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని ఫెర్టిలిటి కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఎల్వో డాక్టర్ కె.రాణి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అచ్చుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సూర్యనారాయణ, ఘోషాస్పత్రి గైనికాలజిస్టు డాక్టర్ జె.సుధ, పిల్లల వైద్యులు డాక్టర్ కిషోర్కుమార్, డీపీఆర్వో జానకమ్మ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి -
ఎన్సీడీ – ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారిగా జగన్మోహనరావు
పార్వతీపురం టౌన్: ఎన్సీడీ – ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ టి.జగన్మోహనరావును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులను డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు అందజేశారు. కమిషనర్, ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం నుంచి పొరుగు సేవల ప్రాతిపదికన డాక్టర్ జగన్మోహనరావును ఎన్సీడీ – ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయని డీఎంహెచ్వో తెలిపారు. గతంలో డీఐవో, డీఎంవో, ఇంచార్జ్ డిప్యూటీ డీఎంహెచ్వోగా, పలు ఆరోగ్య కార్యక్రమాలకు ప్రోగ్రాం అధికారిగా జగన్మోహనరావు జిల్లాలో పని చేశారు. గంజాయి పట్టివేత వేపాడ: మండలంలోని పాటూరు జంక్షన్ సమీపంలో కారులో రవాణా చేస్తున్న రెండు కేజీల గంజాయి పట్టుకున్నట్టు వల్లంపూడి ఎస్ఐ ఎస్.సుదర్శన్ తెలిపారు. శనివారం ఎస్.కోట – కొత్తవలస ప్రధాన రహదారిలో పాటూరు వద్ద ఎస్ఐతో పాటు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా అరకు నుంచి విశాఖ వైపు వెళ్తున్న మారుతీ సుజుకి తెలంగాణకు చెందిన కారులో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్టు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన గంజాయితీఓ పాటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు చెప్పారు. తనిఖీల్లో తహసీల్దార్ జె.రాములమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. పోక్సో కేసులో ఒకరి అరెస్టు భామిని: మండలంలోని కోసలికి చెందిన కరణం తిరుపతిరావును పోక్సో చట్టం కింద శనివారం అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరు పరిచినట్టు బత్తిలి ఎస్ఐ జి.అప్పారావు తెలిపారు. ఈ నెల 22న కోసలికి చెందిన పదేళ్ల చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఉడుమును పట్టుకున్న వ్యక్తి అరెస్టు విజయనగరం గంటస్తంభం: జొన్నాడ జంక్షన్ వద్ద ఈ నెల 19వ తేదీన గణేష్నగర్కు చెందిన వనము తాతా అనే వ్యక్తి ఉడుమును పట్టుకుని సంచరిస్తుండగా డీఎఫ్వో బి.శ్రీనివాసరావు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఉడుమును చంపడం నేరమని, వన్యప్రాణులను చంపినా, వాటిని కొనుగోలు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఉడుమును పట్టుకున్న వనము తాతాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దరఖాస్తుల ఆహ్వానం సాలూరు: సాలూరు ఆర్టీసీ డిపోలో రోజు వారి వేతనంపై తాత్కాలికంగా డ్రైవర్గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 18 నెలలు గడువు నిండి ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు డిపోలో అధికారులను సంప్రదించాలని సూచించారు. అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తికి రిమాండ్ కొత్తవలస : మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడు అప్పన్న(32)కు రిమాండ్ విదించినట్టు సీఐ షణ్ముఖరావు శనివారం తెలిపారు. దీనికి సంబంధించి సీఐ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నిందితుడు బాలికపై ఈ నెల 21వ తేదీన అత్యాచార యత్నానికి పాల్పడినట్టు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. శనివారం నిందితుడిని తుమ్మికాపల్లి జంక్షన్ సమీపంలో మాటు కాసి పట్టుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు కొత్తవలస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో ఎస్.కోట సబ్ జైలుకు తరలించినట్టు చెప్పారు. -
బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాల స్వీకరణ
విజయనగరం: విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో రూపొందించిన బృహత్తర ప్రణాళికపై ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు కోరుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య శనివారం తెలిపారు. 2021లోనే బృహత్తర ప్రణాళికను ఆమోదించడం జరిగిందని, ప్రస్తుతం వీఎంఆర్డీఏ పరిధిలోని పట్టణాలు, గ్రామాలకు రూపొందించిన బృహత్తర ప్రణాళిక–2041 ఆమోదం కోసం ప్రచారం చేయడం జరుగుతోందన్నారు. వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అందించిన వివరాల ప్రకారం 2041 బృహత్తర ప్రణాళికపై పునఃపరిశీలనకు సదరు ప్లాన్ పై అభ్యంతరాలు ఉంటే నిస్సందేహంగా తెలపవచ్చన్నారు. మే 22 నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైందని, జూన్ 21 వ తేదీ వరకు ప్రజలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా గానీ పోస్టు ద్వారా తెలియజేయవచ్చన్నారు. -
మహిళలను తిట్టడమేనా..
ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2025● ప్రజాప్రతినిధిగా ఇదేనా సంస్కారం ● ఎమ్మెల్యే విజయ చంద్ర వ్యాఖ్యలు బాధించాయి.. ● కమిషనర్ తీరు ఆక్షేపణీయం ● ఆవేదన వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి, వైఎస్సార్ సీపీ మహిళా కౌన్సిలర్లు ● ఎస్పీకి ఫిర్యాదు పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, కమిషనర్ వెంకటేశ్వరులపై ఎస్పీ మాధవ్రెడ్డికి ఫిర్యాదుచేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: మొన్న ఒక మండల మేజిస్ట్రేట్, మహిళా తహసీల్దార్పై అసభ్య పదజాలంతో బెదిరింపు, మీడియా సమావేశంలోనూ రాయలేని మాటలతో ఆ అధికారిణిపై దుర్భాషలు... నిన్న పార్వతీపురం పట్టణ ప్రథమ పౌరురాలు పట్ల అనుచిత వ్యాఖ్యలు.. మరి రేపు? పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహార శైలితో బాధితులుగా మారుతున్న మహిళల ఆవేదన ఇది. ఇప్పటికే ఇద్దరు అబలలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల కిందట పార్వతీపురం మండల తహసీల్దార్ పోలీసులకు రాసినట్లు ఒక ఫిర్యాదు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్అయ్యింది. ఇప్పుడు మరో బీసీ మహిళ.. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మహిళలు అంటే తనకు ఎంతో గౌరవమని తానుగా ప్రకటించుకున్న ఎమ్మెల్యే... వారిని అగౌరవ పరచడమే గౌరవించడమా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై ఏకంగా నలుగురు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇంత అన్యాయం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం, టీడీపీ అధిష్టానం కూడా స్పందించకపోవడంపై వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇది మహిళాలోకానికి అవమానకరమని చెబుతున్నారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన చైర్పర్సన్ ఈ నెల 23న జరిగిన పార్వతీపురం పురపాలక సంఘ బడ్జెట్, సాధారణ సమావేశంలో పట్టణ ప్రథమ పౌరురాలైన తనపై పోలీసుల సమక్షంలోనే కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసభ్య పదజాలంతో దూషణకు దిగారని మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని.. తమ సభ్యులపై టీడీపీ వారు దౌర్జన్యానికి దిగినా నవ్వుతూ ఉండిపోయారని జిల్లా ఎస్పీ మాధవ్రెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు. కూటమి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచనలతోనే ఇదంతా జరిగిందన్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగితే.. ఒక్క వైఎస్సార్సీపీ సభ్యులనే పోలీసులు బలవంతంగా నెట్టుకుంటూ బయటకు పంపేశారని తెలిపారు. ఎమ్మెల్యే సైగలు చేయడంతోనే తమ పార్టీ కౌన్సిలర్లు రణభేరి బంగారు నాయుడు, నిమ్మకాయల సుధీర్లను బయటకు నెట్టేశారని వివరించారు. కనీసం మహిళ అని చూడకుండా తనపై ఎమ్మెల్యే విజయచంద్ర అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తనను సైకోగా మీడియా ఎదుటే కించపరిచారని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయన్నారు. న్యూస్రీల్మున్సిపల్ కమిషనర్ తీరుపైనా ఫిర్యాదు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తీరుపైనా ఆమె ఫిర్యాదు చేశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇంటికి సిబ్బందిని సంతకాల కోసం పంపిస్తున్నారని.. ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఒక మహిళ పట్ల ఇలాగేనా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ మహిళా ఉద్యోగులు సైతం ఆయన తీరుతో తీవ్ర మనోవేదనకు, భయబ్రాంతులకు గురవుతున్నట్లు వివరించారు. న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. -
జనావాసాల నడుమ కూలిన విద్యుత్ స్తంభాలు
సంతకవిటి మండలంలోని కృష్ణంవలస గ్రామంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇటుకలతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి దిగువ వీధిలోని మట్ట దుర్గారావు ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ తాకిడికి అదే వీధిలోని మరో రెండు విద్యుత్ స్తంభాలు ఉన్న ఫలంగా విరిగి కింది పడ్డాయి. వీటితో పాటు మరో స్తంభం వాలిపోయింది. విద్యుత్ వైర్లు ఇళ్లను తాకుతూ వీధుల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామస్తులు అప్రమత్తమై ట్రాన్స్ఫార్మర్ నుంచి సరఫరాను నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పరిణామంతో వీధుల్లోని ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న విదు్య్త్ శాఖాధికారులు గ్రామాన్ని సందర్శించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. – సంతకవిటి -
రైల్వేస్టేషన్లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్
● చాకచక్యంగా పట్టుకున్న రైల్వే, ఫైర్ సిబ్బంది కొత్తవలస : మతి స్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి కొత్తవలస రైల్వేస్టేషన్లో శనివారం విద్యుత్ వైర్లు పట్టుకొని చనిపోతానని హల్చల్ చేశాడు. సుమారు రెండు గంటలు శ్రమించి రైల్వే సిబ్బంది, ఫైర్ పోలీస్లు ఆయనను చాకచక్యంగా పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మతి స్థిమితం లేని ఒక యువకుడు స్థానికులపై రాళ్లు రువ్వి బెదిరించాడు. సమీపంలో గల రైల్వేస్టేషన్లోకి వెళ్లి విద్యుత్ లైన్ల సమీపంలో గల రేకుల షెడ్పైకి ఎక్కి వైర్లు దగ్గరకు వెళ్లాడు. ప్రమాదం దిగిపో.. అంటూ స్థానికులు, రైల్వే సిబ్బంది సూచించినా కనీసం పట్టించుకోలేదు. ఎవరైనా దగ్గరకు వస్లే వైర్లు పట్టుకొని చనిపోతానని బెదిరించాడు. రైల్వే అధికారులు అప్రమత్తమై విశాఖపట్నం ప్రధాన రైల్వేస్టేషన్కు పోన్ చేసి ప్రధాన లైన్కు సంబంధించి విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని రైల్వే సిబ్బందితో కలిసి ఆ యువకుడిని తాళ్లతో బంధించి కిందకు దించారు. అనంతరం విశాఖపట్నం తరలించారు. వడదెబ్బకు రైతు మృతి వీరఘట్టం: మండలంలోని విక్రమపురం గ్రామానికి చెందిన శ్రీరాములదొర(74) అనే రైతు వడదెబ్బకు శనివారం గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం వీరఘట్టం మార్కెట్కు సామగ్రి తేవడానికి వెళ్లి మధ్యాహ్న 12.30 గంటలకు శ్రీరాములదొర ఇంటికి వచ్చాడు. ఇంట్లో మంచంపై కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ముందస్తు జాగ్రత్తలతో చోరీలకు అడ్డుకట్ట
పార్వతీపురం రూరల్: ప్రజలు తీర్థ యాత్రలు, వేసవి విహార యాత్రలకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలకు అడ్డుకట్ట వేయొచ్చని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పలు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు, ప్రయాణికులకు పోలీసు శాఖ ద్వారా శనివారం అవగాహన కల్పించారు. ఇళ్లల్లో వృద్ధులు, చిన్నారులను విడిచిపెట్టి బయటకు వెళ్లడం వల్ల మాటు వేసిన దొంగలు గమనించి చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దీన్ని గుర్తించి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. చోరీల నియంత్రణకు పలు సూచనలు చేశారు. ఇళ్లకు తాళం వేసి సొంత గ్రామాలకు లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచి వెళ్లకూడదు. పరిసరాల్లో, వీధుల్లో కచ్చితంగా నిఘా కెమేరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లల్లో వృద్ధులను, చిన్న పిల్లలను విడిచిపెట్టి వెళ్లకూడదు. అత్యవసరమైతే ఇరుగు, పొరుగు వారిని గమనిస్తూ ఉండమని చెప్పాలి. బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో సీసీ కెమేరాలతో పాటు 24/7 సెక్యూరిటీ గార్డులతో రాత్రి వేళల్లో రెస్కీని ఏర్పాటు చేసుకోవాలి. ఉక్కబోత దృష్టిలో ఇంటి బయట, మిద్దెలపై పడుకొనేటప్పుడు ఇంట్లో వున్న విలువైన వస్తువులపై తగు భద్రత చర్యలు తీసుకోవాలి. ఇళ్లకు నాసిరకం తాళాలు వాడకుండా, తాళం వేసినట్లు కనబడకుండా కర్టెన్స్ ద్వారా జాగ్రత్తలు తీసుకొని ఇళ్లకు సంబంధించిన ప్రధాన గేట్లుకు లోపల భాగం ద్వారా లాక్ చేసుకొని వెళ్లాలి. అశ్రద్ధతో ఊళ్లకు వెళ్లే సమయంలో తాళాలను పూల కుండీల్లో, మ్యాట్స్ కింద, చెప్పుల స్టాండ్ల్లో పెట్టకూడదు. వాహనాలు పార్క్ చేసేటప్పుడు వీలైనంత మేరకు నిఘా ఉన్నచోట పార్క్ చేసేందుకు ఏర్పాటు చేసుకొని కచ్చితంగా హ్యాండిల్ లాక్ చేసి వెళ్లాలి. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్టు గుర్తిస్తే తక్షణమే సమీపంలో వున్న పోలీసుస్టేషన్కు లేదా డయల్ 100/112 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. కచ్చితంగా జాగ్రత్తలు పాటించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ మేరకు ఎస్పీ ఆదేశాలతో సీసీఎస్ సీఐ అప్పారావు, క్రైమ్ ఎస్ఐ సూర్యారావు తదితర సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్, పలు బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఎస్పీ మాధవ్రెడ్డి -
సాగుకు ముందస్తు సన్నద్ధం!
ప్రభుత్వానికి రైతుల విన్నపంరైతులు అప్రమత్తంగా ఉండాలి రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో ముందుగా ఆర్ఎస్కేలలో లభించని విత్తనాలను ప్రభుత్వం గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. కొద్దిపాటి విత్తనాలను మొలకెత్తించాలి. 80 శాతం పైగా విత్తనాల మొలకల్లో తేడా వస్తే తక్షణమే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి. ప్రతీ రైతు తాను కొనుగోలు చేసిన విత్తనాల షాపు యజమాని నుంచి రశీదు తీసుకోవాలి. కల్తీ విత్తనాలతో మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. నష్టపోయిన రైతులు పరిహారం అందుకోవడానికి ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. వరి విత్తనాలు తెచ్చిన సంచులు జాగ్రత్తగా వుంచాలి. పంట చేతికి వచ్చే వరకు రైతులు విత్తనాలకు సంబందించిన అన్నీ ఆధారాలు భద్రంగా ఉంచడం రైతులకు మేలు. – వీటీ రామారావు, వ్యవసాయ శాఖ జేడీ, విజయనగరం ● కల్తీ విత్తనాలతో తస్మాత్.. ● ప్రభుత్వ లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి ● రైతులకు వ్యవసాయాధికారుల సూచనలు రామభద్రపురం: ఖరీఫ్కు రైతులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సీజన్ ప్రారంభంలోనే విత్తు పడితే సిరుల పంట పండుతుందని రైతుల నమ్మకం. జిల్లాలో ప్రధానంగా వరి 91,214 హెక్టార్లు, మొక్కజొన్న 12,386 హెక్టార్లు, పత్తి 2142 హెక్టార్లు, చెరకు 4,720 హెక్టార్లు, వేరుశనగ 369 హెక్టార్లు, వివిధ రకాల కూరగాయలు 350 హెక్టార్లలో సాగు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిపాటి అకాల వర్షాలు పడడం వల్ల రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. పొలాలకు ఎరువులు తీసుకువెళ్లడం, దుక్కులు దున్నడం లాంటి పనులు చేస్తున్నారు. ఎప్పుడైతే వర్షాలు సమృద్ధిగా పడతాయో ఆ క్షణమే పొలంలో విత్తనాలు విత్తేందుకు వీలుగా పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే విత్తనాలు తీసుకొని, ఇక్కడ అందుబాటులో లేని విత్తనాలను రైతులు ప్రైవేటు దుకాణాలపై ఆధారపడుతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు తమ వద్ద లభిస్తాయంటూ కొందరు వ్యాపారులు రైతులను మభ్య పెడుతున్నారు. కల్తీ విత్తనాల బారిన పడి రైతులు ప్రతీ ఏడాది నష్టపోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాలను ముందే గుర్తించకపోతే నష్టపోక తప్పదని వ్యవసాయ శాఖాధికారులు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం జరిగినా ఆ తర్వాత సంబంధిత కంపెనీల నుంచి పరిహారం పొందవచ్చు. రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలు రైతు భరోసా కేంద్రాల్లో లభించని విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. కొన్నిచోట్ల ప్రభుత్వం అనుమతి లేకపోయినప్పటికీ అనధికారంగా కల్తీ విత్తనాలు తెల్ల సంచుల్లో విక్రయించే అవకాశం ఉంది. అలా విక్రయించే వారి సమాచారాన్ని తక్షణమే వ్యవసాయ శాఖాధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల నుంచే సర్టిఫైడ్ విత్తనాలు తీసుకోవాలి. విత్తనాలతో పాటు బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు సాగు చేసే రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారులు విత్తనాలు విక్రయించే డీలర్లకు, వ్యవసాధికారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో దుకాణాలు యజమానులు విచ్చలవిడిగా విత్తనాలను విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు మండలంలోని నాయుడువలస గ్రామానికి చెందిన రైతులు. వీరు ఏమంటున్నారంటే.. గత ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కలిపి రైతులకు ఏటా రూ.13,500లు మూడు దఫాలుగా అందించేది. దీని వలన ఖరీఫ్లో పంట పెట్టుబడికి వెసులుబాటు ఉండేది. తొలి విడతగా మే నెలలోనే రూ.7,500లు రైతు ఖాతాల్లో జమ చేసేది. దీని వలన చిన్న సన్నకారు, పేద రైతులకు ఖరీఫ్లో పెట్టుబడి చాలా వరకు కలిసి వచ్చేది. మే నెలతో పాటు అక్టోబరు, జనవరి నెలల్లో నిధులు రైతుల ఖాతాల్లో పడేవి. వైఎస్సార్ రైతుభరోసా తొలి విడతగా రూ.5500లు, రెండవ విడత అక్టోబరు నెలలో రూ.2 వేలు చొప్పున్న అందించేవారు. కేంద్రం పీఎం కిసాన్ నిధిగా రూ.6 వేలను మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున్న ఇచ్చేవారు. ఈ ఏడాది మే నెల దాటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 వేలకు సంబంధించి ఇప్పటి వరకు జీవో అతిగతీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం తమకు పెట్టుబడి సాయం అందించాలని రైతులు కోరుతున్నారు. -
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
రేగిడి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన నడుపుతోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మాజీ ముఖ్యమంత్రిపై ఉన్న అక్కసుతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసి ప్రజలను, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రేగిడి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇంటి వద్దే అందించిన రేషన్ బళ్లును రద్దు చేసి మళ్లీ రేషన్ దుకాణాల వద్దకే సరుకులు తీసుకునేందుకు ప్రజలను పంపించేందుకు నిర్ణయం తీసుకోవడం హేయమైన చర్యన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు దూరం చేయడానికే ఎండీయూ వాహనాల రద్దు నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేషన్ సరఫరా కోసం ఎండీయూ వాహనాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి నేరుగా సరుకులు సరఫరా చేసేవారన్నారు. ఇప్పుడు ఆ వాహనాలు రద్దు చేయడం వలన ప్రజలు ప్రభుత్వ సేవలకు దూరం అవుతారని పేర్కొన్నారు. జిల్లాలో 370 వాహనాలు రద్దు చేయడం వలన వాహన నిర్వాహకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీ అమలు చేయకపోగా రాష్ట్రంలో ఈ వాహనాల రద్దుతో మరికొంతమందిని నిరుద్యోగులను చేసిందన్నారు. జిల్లాలో 1249 రేషన్ డిపోల్లో మళ్లీ పాత పద్ధతినే కొనసాగిస్తుండడంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికి వచ్చి సరుకులు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడంతో ఇటువంటి వారికి సరుకులను ఎలా అందజేస్తారని అన్నారు. ఎండీయూ వాహనాల రద్దుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెనాయుడు, మండల పార్టీ కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
ప్రణాళిక ప్రకారం వచ్చి.. వివాదం చేసి!
ఉదయం 11 గంటల సమయంలో మున్సిపల్ సమావేశం ప్రారంభమైంది. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక, అక్కడ సిబ్బంది సైతం నిర్ఘాంతపోయారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన కౌన్సిలర్ మంత్రి రవి మైకు తీసుకున్నారు. రౌడీ షీటర్లు ఇక్కడ ఉండొచ్చా.. వారికి ఇక్కడ కూర్చొనే అర్హత ఉందా? అంటూ వివాదం రాజేశారు. దీనికి స్పందించిన 25వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఎన్.సుధీర్.. దళితుడినైన తనపై అన్యాయంగా కూటమి ప్రభుత్వం వారే కేసు పెట్టించారని తెలిపారు. ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో వాచ్మన్గా పని చేసిన వ్యక్తి కౌన్సిల్ సభ్యుడిగా ఉండవచ్చా? దీనికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని మంత్రి రవిని ఉద్దేశిస్తూ, అధికారులను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంగా ఊగిపోయిన కౌన్సిలర్ రవి.. వివాదానికి దిగా రు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదన పెరిగింది. తోపులాటకు దారి తీసింది. పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అక్కడే ఉన్నప్పటికీ వారించే ప్రయత్నం చేయలేదు. కమిషనర్ వెంకటేశ్వర్లు అక్కడే ఉన్న పోలీసులకు సైగ చేశారు. దీంతో పోలీసులు కేవలం వైఎస్సార్సీపీకి చెందిన 25, ఒకటో వార్డు కౌన్సిలర్లు సుధీర్, ఆర్.బంగారునాయుడులను తోసుకుంటూ, నెట్టు కొంటూ బయటకు తరిమేశారు. ఎమ్మెల్యే, పోలీసుల వైఖరిని వైఎస్సార్సీపీ సభ్యులు తప్పుపట్టారు. ఏదో వివాదం చేద్దామనే ఉద్దేశంతోనే కూటమి సభ్యులు ఇక్కడికి వచ్చినట్లు అర్థమవుతోందని.. బడ్జెట్కు తాను ఆమోదం తెలుపుతున్నామని చెబుతూ చైర్పర్సన్ గౌరీశ్వరి సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. ఆమె వెంటే వైఎస్సార్సీపీ సభ్యులు కూడా వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే, కమిషనర్, పోలీసుల వైఖరిని నిరసిస్తూ కార్యాలయం గేటు వద్ద ధర్నా చేపట్టారు. -
● విజయనగరం విధ్వంసానికి పథక రచన ● తవ్వేకొద్దీ బయటకొస్తున్న సిరాజ్ కుట్రకోణం ● మతోన్మాద శక్తులతో స్నేహం ● ప్రత్యేక యాప్లో సంభాషణలు ● పేలుళ్లకు పథకం ● కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ల నుంచి వివరాలు రాబడుతున్న పోలీసులు
జూన్ 10 నాటికి గృహ నిర్మాణాలు పూర్తికావాలి ● హౌసింగ్ జీఎం వెంకటరమణ పార్వతీపురం రూరల్: పేదలకోసం నిర్మించే గృహాలను జూన్ 10 నాటికి పూర్తిచేయాలని గృహ నిర్మాణ శాఖ జీఎం, మూడు జిల్లాల హౌసింగ్ ప్రత్యేకాధికారి వెంకటరమణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మండ లం నర్సిపురం లే అవుట్ను శుక్రవారం సందర్శించారు. గృహనిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో హౌసింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్, ఇతర సామగ్రికి కొరత లేదన్నారు. నీటి సౌలభ్యం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్, హౌసింగ్ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు. జీకేఆర్ పురం నుంచి జపాన్కు.. బాడంగి: మండలంలోని జీకేఆర్ పురం గ్రామానికి చెందిన ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృందానికి జపాన్ నుంచి పిలుపు అందింది. జపాన్ లో తప్పెటగుళ్ల ప్రదర్శన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అవకా శం కల్పించింది. ఇక్కడ నుంచి ఆయనతో పాటు ఆరుగురు కళాకారులు శనివా రం జపాన్ చేరుకుంటారు. అక్కడ మన దేశం తరఫున ప్రదర్శన ఇవ్వనున్నారు. జపాన్లో ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల్లో తప్పెటగుళ్ల కళను ప్రదర్శిస్తామని సత్యం తెలిపారు. ఇతర దేశాలకు తమ కళను పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు. మతోన్మాద శక్తులతో చేతులు కలిపి... విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను అందరిలాంటి విద్యార్థిగానే ఆ వీధివాసులు భావించారు. పోటీ పరీక్షలకు చదువుతుంటే మంచి విద్యార్థిగానే నమ్మారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నెల 16న అరెస్టు చేశాక ఆయనలోని ఉగ్రవాద భావజాలం తెలిసి నిశ్చేష్టులయ్యారు. జన్మనిచ్చిన స్థలం, ప్రశాంతతకు నిలయం.. అన్నిమతాల వారు ఆనందంగా జీవించేందుకు అనువైన.. కళలకు కాణాచిగా ఉన్న విజయనగరాన్ని ధ్వంసం చేసేందుకు పథక రచన చేశాడన్న వార్తతో ఉలిక్కిపడ్డారు. పోలీసుల రిమాండ్ నివేదికలో ఆయన అంగీకరించిన అంశాలను తెలుసుకుని అమ్మో అంటున్నారు. మతోన్మాద శక్తులతో కలిసి సిరాజ్, సమీర్ల ఉగ్రకోణంపై ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు కూపీలాగుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి శుక్రవారం కస్టడీకి తీసుకున్న పోలీసులు సౌదీతో వారికి ఉన్న సంబంధాలు, ప్రత్యేక యాప్లో చేసిన చాటింగ్లపై ఆరా తీసున్నారు. ఆరేళ్లుగా దేశంలోని ముంబయి, ఉత్తరప్రదేశ్ తదితర చోట్ల జరిగిన మత సమ్మేళనాలకు వీరిద్దరూ హాజరై అక్కడ కలిసిన వ్యక్తుల వివరాలను రాబడుతున్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచేందుకు మజ్వా–ఇ–హింద్ స్థాపించాలని నిర్ణయించడం, దేశం మొత్తం అలజడు లు సృష్టించేందుకు పథకరచన చేయడంపై ఆరా తీస్తున్నారు. ఇద్దరి ఉగ్రవాద కుట్రకోణా లను వారం రోజుల్లో సేకరించే దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు సమాచారం. -
ఎల్ఎంసీ పోస్టు... రూ.10 లక్షలు!
● విద్యుత్ శాఖలో రూ.38 లక్షలకు నాలుగు పోస్టుల బేరం? ● ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరక కలగని మోక్షం సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యుత్ శాఖలో లోడ్ మోనటరింగ్ సెల్ (ఎల్ఎంసీ) విభాగంలో పాలిటెక్నికల్ విద్యార్హతతో భర్తీచేసే నాలు గు పోస్టులకు భారీ ‘ధర’ పలికినట్టు సమాచారం. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులను టెండరు ద్వారా కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. కొత్త సర్కిల్ కార్యాలయం కావడంతో ఈ నాలుగు పోస్టులతో పాటు.. మూడు స్వీపర్ పోస్టులు మంజూరయ్యాయి. ఎల్ఎంసీ విభాగ పోస్టులకు గత నెలలోనే టెండర్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరు విధుల్లో చేరిపోవాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ.25 వేలు వేతనం చొప్పున టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరే నేరుగా వారికి చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే కేవలం ప్రజాప్రతినిధుల సిఫారసులతో నియామక ప్రక్రియ పూర్తి చేసేశారు. మొత్తం నాలుగు ఖాళీల్లో ఒకటి కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఒక అధికారి తమ వారి పేరును సిఫారసు చేసుకోగా.. మిగిలిన మూడు పోస్టులూ జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకూ రూ.10 లక్షల వరకు బేరం పె ట్టి, అమ్ముకున్నట్లు ఆ శాఖలోనే వినిపిస్తోంది. మొత్తంగా నాలుగు పోస్టులకూ రూ.38 లక్షల వరకు పలికినట్లు సమాచారం. పార్వతీపురం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధికి విషయం తెలిసి, తనకు తెలియకుండా ఎలా వేసుకుంటారని అభ్యంతరం పెట్టడంతో వివాదం రేగినట్లు తెలిసింది. మొత్తం ప్రక్రియలో ఈపీడీసీఎల్ పార్వతీపురం సర్కిల్ ఎస్ఈ పాత్ర కూడా నామమాత్రమైపోయిందని కార్యాలయ వర్గాల భోగట్టా. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య పోస్టు ల పంపకంలో వివాదం రేగడం వల్లే నేటికీ వారు విధుల్లో చేరకుండా ఉండిపోయారు. అంత మొత్తంలో వసూలా? లోడ్ మోనటరింగ్ సెల్ విభాగంలో భర్తీ చేస్తు న్న ఈ నాలుగు పోస్టులూ కేవలం కాంట్రాక్టు పద్ధతిలోనివే. ఏటా కాంట్రాక్టును పొడిగించా ల్సి ఉంటుంది. విద్యుత్ సరఫరా పరిస్థితిని ఎ ప్పటికప్పుడు గమనిస్తూ.. రీడింగ్ ఎంత తగ్గింది, ఏ మేరకు వచ్చింది అన్న వివరాలు పరిశీలిస్తూ. పైకి పంపడం వీరి ప్రధాన విధి. ఈ పోస్టు కోసం రూ.10 లక్షలు చొప్పున లంచంగా తీసుకోవడం.. నిరుద్యోగులు ఇవ్వడంపైనా ఆ శాఖలోని ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు. -
పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు శంబర కృష్ణ, సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ పరిధిలోని వన్ స్టాఫ్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి కలెక్టరేట్లో శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. మల్టీ పర్పస్ స్టాఫ్ కమ్ కుక్ ఫోస్టు –1, పారా లీగల్ పర్సనల్ పోస్టు – 1కి ఇంటర్వ్యూలు నిర్వహించారు. పారా లీగల్ పోస్టుకు ముగ్గురు, మల్టీపర్పస్ స్టాఫ్కు 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అయిన సివిల్ సప్లయిస్ డీఎం బి.శాంతి, డీపీవో టి.వెంకటేశ్వరావు, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సూర్యనారాయణ, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరసింహమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. కొత్తవలస సమీపంలో ఏనుగులు కొమరాడ: మండల కేంద్రం సమీపంలోని కొత్తవలస గ్రామ పరిసరాల్లో ఏనుగులు సంచారిస్తూ కనిపించాయి. దీంతో చినఖేర్జిల, నయా బంజుకుప్పు, బూర్జివలస తదితర గ్రామాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖాధికారులు సూచించారు. కొమరాడ నుంచి ఖేర్జిల వైపు వెళ్లే ప్రయాణికులు ఏనుగుల సమాచారాన్ని తెలుసుకుని వెళ్లాలని కోరారు. ఏనుగుల సంచార గ్రామాల్లో ప్రజల బయటకు రావొద్దని సూచించారు. వడదెబ్బకు వ్యక్తి మృతిసంతకవిటి : మండలంలో మందరాడ గ్రామానికి చెందిన బురావెల్లి అప్పారావు(58) ఉపాధి వేతనదారుడు పనులు వద్ద వడదెబ్బకు గురై మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న మందరాడలోని పెద్దచెరువులో ఉపాధి పనులు నిమిత్తం వెళ్లిన ఆయన మధ్యాహ్నం 5 గంటల సమయంలో అస్వస్తతకు గురయ్యాడు. ఒంట్లో అలసటగా ఉండడంతో తన భార్య ఆదమ్మకు చెప్పి అక్కడే కూర్చుండిపోయాడు. వెంటనే ఆమె తన భర్తకు ప్రాథమిక చికిత్స నిమిత్తం అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి ఆర్ఎంపీ వైద్యున్ని తీసుకొచ్చింది. ఇంతలోనే అప్పారావు మృతి చెందాడు. ఆరోగ్యంగా తిరిగాడే తన భర్త మృతి చెందడంతో ఆదమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. పొట్ట కూటి కోసం ఉపాధి పనులకు వెళ్తే వడదెబ్బకు తన భర్త గురయ్యాడని రోదిస్తుంది. అప్పారావు ఉపాధి పనులకు వచ్చి అస్వస్తతకు గురయ్యాడని, ఆ కుటుంబానికి ఉపాధి పథకం ద్వారా సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుంటే స్థలాల స్వాధీనం
విజయనగరం అర్బన్: గృహ నిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి చేయని లబ్ధిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వెంకటరమణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు సహాయాన్ని వినియోగించుకొని ఆయా లబ్ధిదారులంతా తమకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని లేని పక్షంలో ఆ ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించే నిమిత్తం గృహ నిర్మాణ సంస్థ జీఎం శుక్రవారం పలు మండలాల్లో పర్యటించారు. నెలిమర్ల మండలం సీతారాంపేట, బొంపల్లి మండలం గొట్లాం, బొబ్బిలి మండలం పారాదిలో ఇళ్ల కాలనీలను సందర్శించి ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఈఈ, డీఈలతో గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్మాణాలకు ఈ సీజన్ అనుకూలంగా ఉన్నందున లబ్ధిదారులతో అధికారులు నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించాలని సూచించారు. జిల్లాలో 11,648 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 4,649 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన 6,999 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట గృహనిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.మురళీమోహన్ తదితర అధికారులు ఉన్నారు. గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక అధికారి వెంకటరమణ -
కోటిపాం వంతెనపై వినూత్న నిరసన
కొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారి పూర్తిగా గోతులు మయం అయింది. వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలు తరచూ మరమ్మతుల కు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. 1933లో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి నిరసనగా సీపీఎం నాయకు డు కొల్లు సాంభమూర్తి వంతెనపై గోతుల్లో చేరిన వర్షపునీటిలో శుక్రవారం స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మూడు రాష్ట్రాల ప్రజ లు, వాహనాల రాకపోకలకు ఆధారమైన కోటి పాం వంతెన కూలేపోయే దశలో ఉన్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. పాలకులు, అధికా రులు కళ్లుతెరిచి చూడాలని కోరారు. కనీసం గోతులను పూడ్చాలని డిమాండ్ చేశారు. -
ప్రజాగ్రహానికి రాజకీయ రంగు!
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230సాలూరు: సాలూరులో శ్యామలాంబ పండగ అంగరంగ వైభవంగా చేసేందుకు పట్టణ ప్రజలతో పాటు లక్షలాది మంది భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు స్నేహితులు, బంధువులను పిలిచి మూడు రోజుల పాటు పండగ వైభవంగా చేసేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నట్టు అంతా జరిగింది..వైఫల్యమంతా విద్యుత్ అంతరాయంలోనే కనిపించింది. మరోవైపు అంజలి రథ చక్రం విరిగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పట్టణ వాసులతో పాటు వచ్చిన భక్తులకు విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం చుక్కలు చూపించింది. మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతోనే సరిపోయింది. ఒకనొక సమయంలో స్థానికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పండగ పూర్తయిన తరువాత కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో పాలకులు, అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో రోడ్లపైనే ప్రజలు విద్యుత్ సమస్యపై అర్ధరాత్రి వరకు బైఠాయించారు. అయినా అధికార పార్టీ నేతలు, అధికారుల్లో వీసమంతా చలనం లేకపోయింది. తీరా చూస్తే ఇప్పుడు దీనికి కూడా టీడీపీ శ్రేణులు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ప్రజా సమస్యలకు రాజకీయ రంగు పట్టణ ప్రజలు నాలుగు రోజుల పాటు కరెంట్ లేక ఇబ్బందులు పడి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడితే దీన్ని ఓ పార్టీకి ఆపాదించే కుట్రలు పన్నుతున్నారు అధికార పార్టీ నేతలు. పండగ నేపథ్యంలో ప్రజలు రూ.కోట్లు ఖర్చు చేసి పండగను చేసుకున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడ్డారు. సమస్య ఆందోళనకు దారితీసే పరిస్థితులు వచ్చిన ఇటు పాలకులు కనీసం దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు సరికదా.. ఇదంతా రాజకీయమంటూ చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రాన్స్ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు పండగ కోసం సుమారు కోటి 24 లక్షల రూపాయిలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అధికారుల మాటలను నమ్మి ఓ అడుగు ముందుకు వేసిన మంత్రి సంధ్యారాణి ఈ విషయమై ఉత్సాహంతో పండగ ఏర్పాట్లు చేసుకోండని పిలుపునిచ్చారు. తీరా చూస్తే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ కాలిపోయాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరా అయిన ప్రాంతాల్లో లో, హై ఓల్టేజీలు తరచూ రావడంతో ఇళ్లల్లో గృహోపకరణాలు పాడయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పండగ నేపథ్యంలో విద్యుద్దీకరణ పనుల్లో కొందరికి ముడుపులు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే పండగ సమయంలో ఇంతగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పండగ సమయంలో మూడు రోజుల పాటు తలెత్తిన విద్యుత్ సమస్య నేటికీ చర్చనీయాంశంగానే ఉంది. పండగ ఏర్పాట్లలో వైఫల్యం రాజకీయాలు చేస్తున్న టీడీపీ శ్రేణులు -
స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు
బొబ్బిలి: పట్టణంలోని గ్రోత్సెంటర్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న పెళ్లి కారు రాయగడ రోడ్డులోని గ్రోత్ సెంటర్లో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వేగానికి పక్కనే ఉన్న కాలువలోకి పక్కకి ఒరిగి పోయింది. ఈ సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు కారులోని పెళ్లి బృందాన్ని బయటకు తీశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం, కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు బలగ సాయికృష్ణ కుమార్తె పెళ్లి అనంతరం జరిగిన ఈ ఘటనలో కారులో సాయికృష్ణతో పాటు నలుగురు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ఘటన సంగతి తెలుసుకున్న బొబ్బిలి సీఐ కె.సతీష్కుమార్ తన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి ప్రయాణికుల క్షేమ సమాచారాలను కనుగొన్నారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బాలల ప్రతిభకు వేదిక బాలభవన్
● వేసవిలో ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన ● పలు కళల్లో తర్ఫీదు పొందుతున్న 550 మందికి పైగా చిన్నారులు ● 32 సంవత్సరాలుగా సేవలు ● వేసవి శిక్షణకూ ఇతర జిల్లాల విద్యార్థుల హాజరురాజాం : రాజాంలోని మెంతిపేటలో ఉన్న బాలభవన్ బాలల ప్రతిభను వెలికితీసే వేదికగా మారింది. పలు కళా రంగాల్లో మక్కువ ఉన్న చిన్నారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా పేరు తెచ్చుకుంటుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ జవహర్ బాలభవన్ను ఇక్కడ 1993 జూన్ 4న ప్రారంభించారు. అప్పట్లో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించిన ఈ కేంద్రం ఇప్పుడు సొంత భవనాలతో పాటు ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. మ్యూజిక్, డ్యాన్స్ రంగాల్లో కేంద్రం ప్రారంభంలో ఇక్కడ శిక్షణ ఉండేది. ఇప్పుడు 16కి పైగా కళా రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు వేసవిలో రాజాం వచ్చే ఇతర ప్రాంతాల విద్యార్థులకు మంచి వేదికగా ఇక్కడ బాలభవన్ వేసవి శిక్షణా తరగతులు నిలుస్తున్నాయి. ఏమి నేర్పుతున్నారంటే.. గత నెల 24న బాలభవన్లో వేసవి శిక్షణా శిబిరాన్ని రాజాంకు చెందిన పలువురు ప్రముఖుల చేతులు మీదుగా డైరెక్టర్ సుంకరి రమేష్ ప్రారంభించారు. ఈ వేసవిలో ఉచితంగా చిన్నారులకు మ్యూజిక్, డ్యాన్స్, తబలా, నాట్యం, సంగీతం, ఆర్ట్స్, టైలరింగ్ వంటి విద్యలలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. శిక్షణ నిమిత్తం 550 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ చేరారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు నృత్యం, సంగీతం శిక్షణలో ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 200లకు పైగా బాలభవన్లు, 47 బాల కేంద్రాలు పని చేస్తుండగా, రాజాం బాలభవన్కు ప్రత్యేకత ఉంటుంది. మొత్తం 16 మంది ఉపాధ్యాయులు ఈ వేసవిలో ఇక్కడ చిన్నారులకు తర్పీదునిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.. రాజాంతో పాటు చీపురుపల్లిలో జవహర్ బాలభవన్ కేంద్రాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి ఈ కేంద్రాలను నిలబెట్టాం. రాజాం బాలభవన్కు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన చిన్నారులు టీవీ షోల్లో సంగీతం, నృత్యం వంటి రంగాల్లో పాల్గొనే అవకాశం పొందారు. కొంతమంది ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ రాణిస్తున్నారు. వేసవిలో చిన్నారులు సమయాన్ని వృథా చేసుకోకుండా కాలాన్ని ఆహ్లాదకరంగా సద్వినియోగం చేసుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ సుంకరి రమేష్, డైరెక్టర్, బాలభవన్ 550 మందికి పైగా విద్యార్థులు రాజాం బాలభవన్ వేసవి శిక్షణలో అనూహ్య స్పందన కనిపిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు రకాల వినోద ప్రదర్శనల్లో తన సత్తాను చాటుతున్నారు. బాలభవన్ జాతీయ వేడుకల్లో ఇక్కడ బాలభవన్ గత 2018 నుంచి మూడు పర్యాయాలు ప్రథమ స్ధానాన్ని సాంస్కృతిక కళా రంగాల ప్రదర్శనలో నిలిచింది. దీంతో వేసవి శిక్షణ కార్యక్రమాల్లో ఇక్కడకు ఎక్కువగా విద్యార్థులు వస్తుంటారు. రాజాంలో ఉన్నవారే కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న చిన్నారులు సెలవులు కారణంగా రాజాం రావడంతో వారంతా ఈ శిక్షణలో పాల్గొని పలు కళారంగాల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. -
చిట్టిబాబుకు జాతీయ అవార్డు
విజయనగరం టౌన్: భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వ్యవస్థాపకుడు, భారతరత్న సి.సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డును జిల్లాకు చెందిన దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు శుక్రవారం న్యూఢిల్లీలోని ఇండియన్ హేబిటేట్సెంటర్లో అందుకున్నారు. ఛీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సత్యానంద మిశ్రా, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా డైరెక్టర్ బిరాజ్ పట్నాయక్, ఎన్సీడీహెచ్ఆర్ నేషనల్ జనరల్ సెక్రటరీ బీనాపలికల్ తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమాజ మార్పునకు కృషిచేసే 14 మందిని గుర్తించి జాతీయ అవార్డు అందించారని, అందులో తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. -
కళల పరిరక్షణ అందరి బాధ్యత
● మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ అనురాధ ● ముగిసిన వాగ్దేవీ బాల సంస్కార శిక్షణ తరగతులువిజయనగరం టౌన్: కళలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ బురిడి అనురాధ పరశురామ్ పేర్కొన్నారు. స్థానిక గురజాడ స్వగృహంలో వాగ్దేవీ సమారాధనం సంస్థ, తెలుగు భాషా పరిరక్షణ సమితితో కలిసి పది రోజుల పాటూ నిర్వహించిన వాగ్దేవీ బాల సంస్కార శిక్షణా శిబిరాల ముగింపు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాన్ని పరిచయం చేసేందుకు, వాటిని పరిరక్షించాలనే లక్ష్యంతో వాగ్దేవీ సమారాధనం సంస్థ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంతో పాటూ భగవద్గీత సారాంశాన్ని పది రోజుల పాటూ వివరించామన్నారు. శతక పద్యాలపై అవగాహన పెంపొందించగలిగామన్నారు. ఈ సందర్భంగా పది రోజుల పాటూ ఉచిత రీతిన విద్యార్థులను సుశిక్షితులను చేసిన గురువులను సత్కరించి, ప్రశంసపత్రం, జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులకు బహుమతులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ జి.ఎరుకునాయుడు, డాక్టర్ జక్కు రామకృష్ణ, అమ్మాజమ్మ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు, గురజాడ ఇందిర, మానాప్రగడ సాహితీ, కొంకెపూడి అనూరాధ, చెళ్లపిళ్ల శ్యామల, గిరిజా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
కోవిడ్పై తస్మాత్..
విజయనగరం ఫోర్ట్: యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. కోవిడ్ పేరు చెబితే ఇప్పటికీ జనం హడలిపోతున్నారు. మొదటి, రెండు కోవిడ్ల్లో కోవిడ్ బారిన ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది సకాలంలో చికిత్స చేయించుకుని ప్రాణాలతో భయపడ్డారు. రెండేళ్లు పాటు ప్రజలు కోవిడ్ కారణంగా బిక్కుబిక్కుమంటూ జీవించారు. గత కొన్నేళ్లుగా వ్యాప్తి లేకపోవడంతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ప్రపంచలోని పలు దేశాలతో పాటు మన దేశంలో కూడా కోవిడ్ కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. పొరుగున ఉన్న విశాఖలో కూడా కోవిడ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్ బారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి సూచించారు. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్క కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరేచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సామూహిక ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్లు వాడాలన్నారు. భౌతిక దూరం పాటించాలని, హ్యాండ్ వాష్ తదితర వాటితో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆందోళన అవసరం లేదు.. డీఎంహెచ్వో డాక్టర్ జీవనరాణి -
సత్వర వైద్యంతో మలేరియా నివారణ
గుమ్మలక్ష్మీపురం: మలేరియా బాధితులకు సత్వరమే మెరుగైన వైద్యసేవలు అందించాలని మలేరియా నివారణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖల్లు పీహెచ్సీ పరిధిలోని జర్న గ్రామంలో మలేరియాతో బాధపడుతూ చికిత్స పొందిన వారిని శుక్రవారం కలిశారు. వైద్యసేవలపై ఆరా తీశారు. పీహెచ్సీలోని ల్యాబ్ను తనిఖీ చేశారు. ల్యాబ్లో చేపడుతున్న పరీక్షలతో పాటు జ్వరాల అదుపునకు చేపడుతున్న చర్యలపై వైద్యాధికారి ప్రవీణ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేగిడి పీహెచ్సీ పరిధిలోని పెంగవ గ్రామాన్ని సందర్శించారు. దోమల లార్వా ప్రదేశాలను గుర్తించి ఫ్రైడే డ్రైడే ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. రేగిడి పీహెచ్సీ వైద్యులు, వైద్య సిబ్బందితో మాట్లాడుతూ జ్వరంతో వచ్చే ప్రతిరోగికి మలేరియా పరీక్షలు నిర్వహించాలని, నిర్థారణ అయితే సత్వరమే మందులను అందజేసి, పర్యవేక్షణతో కూడిన వైద్య సేవలను అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి వై.మణి, సహాయ అధికారి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన గురుకులాల్లో.. ఇంటర్ చదువుకు ఆసక్తి
● జిల్లాలో 1030 సీట్లకు 2,500కు పైగా దరఖాస్తులు ● సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకే ఒక బాలికల కళాశాల ● ఇక్కడ 140 సీట్లకు 507 దరఖాస్తులు ● పదోతరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ● నేడు నోడల్ కళాశాలల్లో కౌన్సెలింగ్ సీతంపేట: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంట ర్మీడియట్ ఇంగ్లిష్ మీడియం చదువుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 8 గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్లో 1030 సీట్లకు 2,500 మంది దరఖాస్తు చేశారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న నోడల్ గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపీసీ, బైపీసీ,హెచ్ఈసీ, సీఈసీ, ఒకేషనల్ ఎఅండ్టీ, సీజీఏ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో సుమారు 3 వేల మంది విద్యార్థులు పదోతరగతి పాసయ్యారు. అధిక మార్కులు సాధించిన వారికే గురుకులాల్లో సీట్లు లభించనున్నాయి. సదుపాయాలతో కూడిన విద్యాబోధన గిరిజన గురుకులాల్లో చేరే విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు వైద్య సదుపాయాలు, యూనిఫారం, పుస్తకాలు, ఇతర మెటీరియల్ను ప్రభుత్వం సమకూర్చుతుంది. ఈ కళాశాలల్లో సీటు లభించిందంటే కార్పొరేట్ కళాశాలల్లో సీటు లభించినంత ఫలితం ఉంటుంది. సీతంపేట ఐటీడీ ఏ పరిధిలో సీతంపేట బాలికల గురుకుల జూనియ ర్ కళాశాల ఒక్కటే ఉండడంతో ప్రవేశాలకు అధిక డిమాండ్ ఉంది. 140 సీట్లకు 507 మంది బాలికలు దరఖాస్తు చేశారు. ఇందులో బైపీసీ గ్రూపునకు 362 మంది దరఖాస్తు చేయడం గమనార్హం. సీట్ల కేటాయింపు ఇలా... జనరల్ గ్రూపులు ప్రతీ గ్రూపుకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీలకు 36, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈక్యూ (ఏజెన్సీ ఎంప్లాయ్ కోటా) ఒక్కో సీటు చొప్పున భర్తీ చేస్తారు. ఒకేషనల్ ఎఅండ్టీ 20, సీజీఏ గ్రూపులో 30 సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించారు. కౌన్సెలింగ్కు అభ్యర్థులు తీసుకురావాల్సినవి... టీసీ, స్టడీ సర్టిఫికెట్ ( 6 నుంచి 10వ తరగతి వరకు), మార్కుల జాబితా, కులధ్రువీకరణ పత్రం (ఒరిజనల్), తల్లి,దండ్రులు, విద్యార్థి ఆధార్ జిరాక్స్లు, బ్యాంకు ఖాతా జిరాక్స్ (తల్లి, విద్యార్థి), 6 పాస్ఫొటోలు, అన్ని సర్టిఫికె ట్లు 3 సెట్ల జిరాక్స్ కాపీలు. -
శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025
● రణరంగానికి వచ్చినట్లుగా కౌన్సిల్ సమావేశానికి.. ● ముందస్తు ప్రణాళిక అన్నట్లుగా పోలీసుల మోహరింపు ● ప్రారంభానికి ముందే బాహాబాహీ ● రౌడీ షీటర్లంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ను రెచ్చగొట్టిన ఫిరాయింపు కౌన్సిలర్ ● సైకో చైర్పర్సన్ అంటూ మరోసారి ఓ మహిళపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ● పక్కా టీడీపీ కార్యకర్తల మాదిరి వ్యవహరించిన ఖాకీలు ● వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను నెట్టుకొంటూ బయటకు పంపించిన వైనం సాక్షి, పార్వతీపురం మన్యం: ●ఒక మున్సిపల్ సమావేశానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం ఎప్పుడైనా చూశామా.. పోనీ, పాలకవర్గమేమైనా తమకు రక్షణ కల్పించాలని కోరిందా.. ఇంతకుముందు ఎన్నడైనా పెద్ద స్థాయిలో ఘర్షణలు జరిగాయా? మరి ఎవరి డైరెక్షన్లో పోలీసులు పార్వతీపురం మున్సిపల్ సమావేశానికి వచ్చినట్లు.. ఎవరి డైరెక్షన్లో సమావేశం ప్రారంభంలోనే లోపలికి ప్రవేశించినట్లు..!! ●●●ఇరువురు ఘర్షణ పడితే.. ఇద్దరికీ సర్దిచెప్పి, అక్కడ నుంచి పంపించేయడానికి ప్రయత్నించడం, రాజీ కుదర్చడం ధర్మం. అలా అని ఒకరిని వదిలి.. రెండో వ్యక్తిని నెట్టుకొంటూ, తోసుకుంటూ.. కలబడుతూ బయటకు లాక్కెళ్లడం.. అదీ ధర్మం కోసం పని చేసే ఒక పోలీస్ అలా చేయడం న్యాయమేనా? పోలీసులు ఎవరి కనుసన్నల్లో పని చేస్తున్నట్లు? ● ●దాదాపు అయిదు నెలల తర్వాత శుక్రవారం జరిగిన పార్వతీపురం మున్సిపల్ బడ్జెట్ సమావేశం పట్టుమని 20 నిమిషాలైనా నడవకుండానే ముగిసిపోయింది. బడ్జెట్, సాధారణ సమావేశాలు నిర్వహించాలని.. మున్సిపల్ అభివృద్ధిపై చర్చ జరపాలని పట్టుబట్టి, పోరాటం చేసి మరీ పాలకవర్గ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వైఎస్సార్సీపీ సభ్యులు దానిని సాధిస్తే... అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో కూటమి సభ్యులు పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చి, సమావేశాన్ని రచ్చచేసి వెనుదిరిగారు. అక్కడ జరగబోతోంది రణరంగమా అన్నట్లు.. పెద్ద ఎత్తున పోలీసులను వెంటబెట్టుకుని మరీ వివాదం చేయడం పట్టణ ప్రజలను విస్మయపరిచింది. ●న్యూస్రీల్ -
●ఏ అంశాలూ చర్చించనీయలేదు..
సమావేశమంతటినీ కూటమి ఎమ్మెల్యే, నాయకులు వారి కనుసన్నల్లోనే జరగాలని చూశారు. అజెండా లో రెండు అంశాలు వద్దని చెప్పాను. వినలేదు. సమావేశం ప్రారంభం కాగానే వివాదానికి తెర తీ శారు. కొద్దిరోజుల్లో పండగ రానుంది. నీరు, శానిటేషన్, జనరేటర్ల కోసం అజెండాలో పెట్టారు. పార్వతీపురం ప్రజల కోసం ఆ అంశాలనైనా చర్చిస్తే బాగుండేది. పోలీసులను పెట్టి, మా సభ్యులను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లిపోయారు. మొన్న తహసీల్దార్ మాదిరి ఇప్పుడు నాపైనా సంతకం కోసం ఒత్తిడి చేశారు. – బోను గౌరీశ్వరి, మున్సిపల్ చైర్పర్సన్ -
శ్యామలాంబ హుండీ ఆదాయం రూ.8.19 లక్షలు
సాలూరు: సాలూరు శ్యామలాంబ అమ్మవారి హుండీ ఆదాయం 8,19,900 రుపాయిలు వచ్చినట్లు ఎండోమెంట్ అధికారి రమేష్ గురువారం తెలిపారు. శ్యామలాంబ పండగ నేపథ్యంలో అమ్మవారి గుడికి భక్తులు పోటెత్తారు. హుండీ ఆదాయాన్ని ఆలయంలోనే లెక్కింపు చేపట్టారు. ప్రీ ఎక్లాంప్సియాపై అవగాహన పార్వతీపురం టౌన్: గర్భిణుల్లో ప్రీ ఎక్లాంప్సియా ఒక ప్రమాదకర సూచికని, సకాలంలో లక్షాణాలు గుర్తించాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.భాస్కరరావు సూచించారు. ప్రపంచ ప్రీ ఎక్లాంప్సియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు హైరిస్క్ సమస్యలు ముందస్తుగా గుర్తించాలన్నారు. బీపీ అధికంగా ఉండడం, తీవ్రమైన తలనొప్పి, దృష్టి సమస్య, ముఖం,చేతులు, కాళ్లు ఉబ్బడం, మూత్ర విసర్జన తగ్గడం తదితర లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, పీఎల్ రఘుకుమార్, డీపీహెచ్ఎన్వో ఉషారాణి, డీపీవో లీలారాణి, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, డీసీఎం విజయలత, సీసీ శ్రీనివాసరావు, వైద్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారి హుండీల్లో చోరీసాలూరు: పట్టణంలోని పలు ఆలయాల్లో హుండీల్లో చోరీలు జరిగాయి. పట్టణంలోని నూకాలమ్మ తల్లి, సత్తమ్మ తల్లి, దేశమ్మ తల్లి ఆలయాల్లో హుండీలను దుండగలు పగులగొట్టి నగదు, కానుకలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్ వేగాన్ని పెంచాలి ● ఏపీ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ పార్వతీపురం టౌన్: రాష్ట్రంలో మొట్టమొదటిసారి బదిలీల చట్టాన్ని అనుసరించి జరుగుతున్న బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన స్థానికంగా మాట్లాడారు. బదిలీలకు దరఖాస్తు చేయడంలో సర్వరు యొక్క వేగాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఏఏ పాఠశాలల్లో ఏఏ పోస్టులు అదనంగా ఉన్నాయో ఈ జాబితాల ద్వారా తెలుస్తుందని తద్వారా సంబంధిత ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని పేర్కొన్నారు. కావున ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయుల రీఅపోర్షన్మెంట్ వివరాలు వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నామన్నారు. న్యాయస్థానాల ఉత్తర్వులను అనుసరించి బెంచి మార్క్ వ్యాధులు గల ఉపాధ్యాయులకు ఈ బదిలీ నియమాలు వర్తించవనీ, అయితే సంబంధిత వ్యక్తులు వారికి అంగీకారం అయితే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
భూ సమస్యలు తలెత్తకూడదు..: జేసీ
గజపతినగరం : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతన్నలకు భూ సమస్యలు వస్తే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి సమస్యలను పరిష్కారం చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. గజపతినగరం మండల కేంద్రం పురిటిపెంట పాల్తేరు వారి కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన ఐదు మండలాల రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతులు సమస్యలతో కార్యాలయాలకు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి వారి సమస్యలను సంపూర్ణంగా అడిగి తెలుసుకొని పరిష్కరించేలా ఉండాలని సిబ్బందికి సూచించారు. భూ సమస్యల పరిష్కారం విషయంలో రీసర్వే అయిన తరువాత వచ్చిన ఎల్పీఎం నంబర్లు, సర్వే నంబర్లు టాలీ చేసుకొని తప్పులు దొర్లకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. బొబ్బిలి ఆర్డీవో జెవిఎస్ఎస్.రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీలాగాంధీ, ఈడీ ఎస్సీ సొసైటి ఇంచార్జ్ ఆర్డీవో వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్ధార్ బి.రత్నకుమార్తో పాటు ఐదు మండలాల తహసీల్లార్లు, సర్వేయర్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు. -
ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన
విజయనగరం ఫోర్ట్: ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర సమైఖ్య ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఎండీయూ వాహనాలతో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో 27 వేల మంది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. రేషన్కు బదులు నగదు బదిలీ అమలు కోసం కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థపై దాడి చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చు వేతనాలతో వాహన సర్వీసు, పెట్రోల్, రేషన్ తరలింపు ఖర్చు భరించి ప్రజలకు ఇంటింటికి సకాలంలో పంపిణీ చేస్తున్న వ్యవస్థను రద్దు చేయటం ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు సిహెచ్.వెంకటరావు, పవన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాడ లేని సంక్షేమం..!
ఆదుకునే పథకాలేవీ? రోజూ ఉదయాన్నే విజయనగరం గణేష్ గుడి మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి. – సత్యం, తాపీ మేసీ్త్ర, విజయనగరం ఆగిన ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పాటు చేసింది. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెయింటింగ్, ఉడ్వర్క్స్, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? –కృష్ణ అప్పారావు, పెయింటర్, విజయనగరం కార్మికుల పొట్ట కొట్టారు.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న పైసా కూడా ఇవ్వలేదు. కార్మికులకు తీరని అన్యాయం చేసింది. విజయనగరం జిల్లా పరిధిలో చాలా మంది కార్మికులకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ ఏడాదిలో ఒక్క క్లెయిమ్ చెల్లించలేదు. ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయడం లేదు. భవన నిర్మాణ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. –బి.రమణ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కార్మిక బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇసుకఽ కొరత లేకపోయినా పనుల్లేకుండా పోయాయి. భవన కార్మికుల సంక్షేమ బోర్డును రద్దును పునరుద్ధిరస్తానన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే లేదు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. –మజ్జి ఆదినారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ● అర్థాకలితో నిర్మాణ రంగ కార్మికులు ● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన 1590 క్లెయిమ్స్ ● కార్మికుల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం ● ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయి? విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టకొట్టింది. కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను దారి మళ్లించారు. కనీసం మరణ క్లెయిమ్స్, ప్రసూతి క్లెయిమ్స్, స్కాలర్షిప్ క్లెయిమ్స్, అనారోగ్య క్లెయిమ్స్ కూడా అందకుండా చేశారు. ఫలితంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సుమారు 1590 క్లెయిమ్స్ ఇప్పుడు వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి. భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 2లక్షల పైగా మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని వేలల్లో ఉంటారు. ఇప్పుడు వరకు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులు 91,528 మంది. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. సాధికార సంస్ధ ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. పేరు మార్పు తప్ప సాయం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ఉత్తివిగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు 11వేల కుటుంబాలకు రూ.118 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సాయం ఇలా.. వైఎస్సార్ కల్యాణమస్తు కింద భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.20వేలు చొప్పున అందించారు. వైఎస్సార్ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. రిజిస్టర్ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. అసంఘటిత రంగ కా ర్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు. -
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ (32) అప్పులు బాధ భరించలేక పురుగులు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కెల్లకు చెందిన సువ్వాడ గాంధీ తన అవసరాల నిమిత్తం అప్పులు ఎక్కువగా తీసుకున్నాడు. అప్పులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి రావడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అందుతుండగా గురువారం ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతునికి భార్య మంగ, కుమారుడు రుషివర్ధన్, కుమార్తె లహరి ఉన్నారు. గుర్ల ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి వేతనదారు మృతి బాడంగి: మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు చెలపురెడ్డి తవుడమ్మ(68) పని చేస్తున్న ప్రదేశంలో గురువారం మృతి చెందినట్టు ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు మరియదాస్ తెలిపారు. గ్రామంలో జగ్గన్న చెరువు పూడిక పనులు చేస్తుండగా చద్దన్నం తిని చేతులు కడుగుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఏపీవో సాయిరాం, టీఏ శ్రీనివాసరావు ఎంపీడీవో ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంపీడీవో వేతనదారు మృతి పట్ల సంతాపం తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి నెల్లిమర్ల రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మండలంలోని సారిపల్లి గ్రామానికి చెందిన యువకుడు నడిపేన పురుషోత్తం(27) గురువారం మృతి చెందాడు. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బద్రీనాధ్ యాత్ర నిమిత్తం యాత్రికులను తీసుకువెళ్లేందుకు బస్సు డ్రైవర్లుగా సారిపల్లికి చెందిన పురుషోత్తం, శ్రీనివాసరావు ఈ నెల 15న వెళ్లారు. 17వ తేదీ అర్ధరాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గడ ప్రాంతంలో బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో క్యాబిన్లో కూర్చున్న పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు చికిత్స నిమిత్తం ప్రైవేటు అంబులెన్సులో విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు వైద్యులు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ పురుషోత్తం ప్రాణాలు విడిచాడు. మృతుడికి తల్లిదండ్రులు, అన్నయ్య ఉన్నారు. పురుషోత్తం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై.. టీడీపీ వర్గీయుల దాడి
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230బాడంగి: మండలంలోని పినపెంకి గ్రామంలో అమ్మవారి పండగ ముగింపు రోజు బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రజకుల ఇళ్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన బెవర కులస్తులు దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులతో పాటు కర్రలతో దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. ఈ దాడిలో గాయపడిన వాడాడ పోలమ్మ, వెంపడాపు రమేష్, నందిగాం సీత, చోడవరపు అరుణలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుప్ప సింహాచలం స్థానిక సీహెచ్సీకి ఆటోపై తరలించారు. వీరిలో పోలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరిలో అరుణ బాలింత కావడంతో ప్రధమ చికిత్స చేసి ఇంటికి పంపినట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయమై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య మంగళవారం నాడే తగాదా జరిగింది. టీడీపీ వర్గీయులు ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడతారోనని రజకులు ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు సింహాచలం ఆరోపించారు. -
నిర్మాణాలు వేగవంతం చేయాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: మన్యం జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం పార్వతీపురం మండలంలోని చప్పవానివలస గ్రామంలో కలెక్టర్ పర్యటించి వివిధ దశల్లో ఉన్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను ఆయన నేరుగా స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. గృహ నిర్మాణాలు జాప్యానికి గల కారణాలను అధికారులను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన రెండవ విడత బిల్లులు మరి కొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్ ఎంతమేరకు అందుబాటులో ఉందో అధికారులను ఆరా తీశారు. గృహ నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా అవసరమైన మెటీరియల్ను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి జి.సోమేశ్వరరావు, చిరంజీవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పీఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వివాహ వేడుకకు వచ్చి.. మృత్యు ఒడిలోకి...
తెర్లాం: వివాహ వేడుకలకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న తల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట తెర్లాం మండలంలోని రాజయ్యపేట గ్రామానికి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ యువకుడు బుధవారం రాత్రి జరిగిన ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ సాగర్బాబు, కుటుంబ సభ్యులు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన గెడ్డ రామకృష్ణ(24) తెర్లాంలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల వద్ద బుధవారం రాత్రి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మరణించాడు. తెర్లాం మండలం రాజయ్యపేట గ్రామంలో జరగనున్న వివాహ వేడుకలో పాల్గొనేందుకు తన మేనమామ ఇంటికి నాలుగు రోజుల క్రితం రామకృష్ణ వచ్చాడు. అక్కడ జరిగిన వివాహ వేడుకలో పాల్గొని అందరితో సరదాగా గడిపాడు. బుధవారం రాత్రి తెర్లాం మండలం ఎం.ఆర్ అగ్రహారంలో జరుగుతున్న స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రామకృష్ణ తన చినమేనమామతో కలిసి ఆటోలో వెళ్లాడు. వివాహ వేడుకలో పాల్గొని అక్కడ భోజనం చేసి తిరిగి రాజయ్యపేట గ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. ఆటోను తన చినమేనమామ నడుపుతుండగా అతని పక్కన రామకృష్ణ కూర్చొన్నాడు. తెర్లాం వెంకటేశ్వర కళాశాల వద్దకు వచ్చే సరికి ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. దీంతో రామకృష్ణ కింద పడిపోగా, ఆటో అతనిపై పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు రామకృష్ణను బయటకు తీశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేసేటప్పటికే రామకృష్ణ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారని ఎస్ఐ చెప్పారు. మృతుని సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించినట్టు ఎస్ఐ సాగర్బాబు తెలిపారు. బైక్ మెకానిక్గా పనిచేస్తూ.. రామకృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. రామకృష్ణ తండ్రి వెంకటరమణ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి రామకృష్ణ బైక్ మెకానిక్గా పని చేస్తూ తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తల్లి, తమ్ముడిని పోషిస్తున్నాడు. వివాహ వేడుకకు మేనమామ ఊరు వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకున్న రామకృష్ణ తల్లి, తమ్ముడు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.