breaking news
Parvathipuram manyam District Latest News
-
బొద్దాం చోరీ కేసుపై డీఎస్పీ విచారణ
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో సోమవారం పట్టపగలు జనపరెడ్డి వెంకటరమణ ఇంటిలో జరిగిన దొంగతనం కేసుపై ఇన్చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు గ్రామంలో విచారణ చేశారు. చోరీ విషయంపై పలువురు స్థానికులను ఆరా తీశారు. డీఎస్పీతో పాటు ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్.కోట ఎస్సై నారాయణ మూర్తి బొద్దాంలో చోరీకి గురైన గృహాన్ని, పరిసరాలు పరిశీలించి దర్యాప్తు నిర్వహించారు. 20 లీటర్ల సారాతో నిందితుడి అరెస్టుకురుపాం: మండలంలోని పూతికవలస గ్రామ పరిసరాల్లో ద్విచక్రవాహనంపై 20 లీటర్ల సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ కన్నపుదొరవలస గ్రామానికి చెందిన బొత్స ప్రవీణ్ ద్విచక్రవాహనంపై సారా తరలిస్తుండగా పూతికవలస వద్ద దాడులు నిర్వహించి సారాను సీజ్చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం, సారా తరలించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. 838 లీటర్ల సారా ధ్వంసంజియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 21 కేసుల్లో పట్టుబడిన 838 లీటర్ల సారాను ధ్వంసం చేశామని చినమేరంగి ఎస్సై పి.అనీష్ తెలిపారు. అలాగే నాలుగు కేసుల్లో పట్టుబడిన 85 మద్యం సీసాలను కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సమక్షంలో దాడులు నిర్వహించామన్నారు. 4.45క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్బొబ్బిలి రూరల్: మండలంలోని పారాదిలో పసుమర్తి నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పౌరసరఫరాల ఉప తహసీల్దార్ రెడ్డి సాయికృష్ణ తెలిపారు. మంగళవారం ఉదయం అక్రమ బియ్యం వ్యవహారానికి సంబంధించిన సీఎస్డీటీకి సమాచారం రాగానే సిబ్బందితో కలిసి వెళ్లి ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యాన్ని మరో డీలర్కు అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఎస్డీటీ చెప్పారు. కోడి పందాలపై పోలీసుల దాడిలక్కవరపుకోట: మండలంలోని దాసుళ్లపాలెం గ్రామం సమీప తోటల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై ఎస్సై నవీన్పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందాలు ఆడుతున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12,600 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం● చైర్మన్గా తాడ్డి గోవింద్ విజయనగరం అర్బన్: ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీ 2026–29 పదవీకాలానికి సంబంధించిన ఎన్నికలు మంగళవారం స్థానిక రెవెన్యూ హోమ్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా చైర్మన్గా తాడ్డి గోవింద, అసోసియేట్ చైర్మన్గా ఎస్.రామకృష్ణ, వైస్చైర్మన్–1గా బాల మహేశ్, వైస్ చైర్మన్–2గా ఎ.అప్పలనాయుడు, వైస్చైర్మన్–3గా పి.చంద్రశేఖర్రాజు, వైస్చైర్మన్ 4 గా డాక్టర్ డి.సురేష్, ప్రధాన కార్యదర్శిగా పి.భానుమూర్తి, సెక్రటరీ–1గా కె.సురేష్, సెక్రటరీ–2గా వి.సత్యనారాయణ, సెక్రటరీ–3గా వై.గోవిందరావు, సెక్రటరీ–4గా ఎం.నాగేశ్ కుమార్, కోశాధికారిగా సీహెచ్వీ అప్పారావు ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. -
దాగుడుమూతలు..!
సాక్షి, పార్వతీపురం మన్యం: దాగుడుమూతా దండాకోర్ ఆటలా ఉంది జిల్లా కేంద్రంలోని అధికార యంత్రాంగం, ఆక్రమణ దారుల తీరు. చేసిందే కోట్ల రూపాయల విలువైన వరహాల గెడ్డ ఆక్రమణ..చేయించుకున్నదే తప్పుడు రిజిస్ట్రేషన్..ఆపై దర్జాగా విశాఖకు చెందిన వ్యాపారికి విక్రయం..ఇది చాలదన్నట్లు భయం, బెరుకు లేకుండా హెచ్చరిక బోర్డుల తొలగింపు. కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు బోర్డులు పాతుతున్న అధికారులు..ఆక్రమణదారులను సుతిమెత్తగా మందలిస్తున్నారు. ‘అబ్బో..ఆపాటి గౌరవం మేమెందుకెవ్వం?’ అంటూ నాలుగు రోజులు ఆగి, వేసిన బోర్డును పీకేస్తున్నారు ఆక్రమణ దారులు. వరహాలగెడ్డ విషయంలో అధికారులు, ఆక్రమణదారుల తీరు హెచ్చరిక బోర్డు’ పెట్టి సుతిమెత్తగా మందలిస్తున్న అధికారులు నాలుగు రోజులు ఊరుకుని.. పీకి పడేస్తున్న ఆక్రమణదారులు -
రాజాంలో చోరీపై ముమ్మర దర్యాప్తు
రాజాం: రాజాంలోని జీఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో ఆదివారం రాత్రి జరిగిన కిలోన్నర బంగారం, కిలో వెండి చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. జీఎంఆర్ఐటీ సమీపంలోని గ్రామాల్లో మంగళవారం ఆరాతీశారు. ఐటీ సమీపంలో బుచ్చింపేట రోడ్డులో ఓ వ్యక్తికి చెందిన పల్సర్ బైక్ చోరీ జరిగిన రాత్రి అపహరణకు గురికావడంపై కేసు నమోదుచేశారు. ఆ బైక్ దొంగతనానికి, ఈ చోరీకి మద్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు పది బృందాలు గాలిస్తున్నట్టు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర తెలిపారు. చోరీకి గురైన బైక్ను గుర్తించినవారికి పారితోషకం ఇస్తామని ప్రకటించారు. భద్రతలో వైఫల్యమా... పెద్దపెద్ద సెమినార్లు, కాన్వొకేషన్లు జరిగినప్పుడు కూడా బయట వ్యక్తులకు లోపలకు రానివ్వని జీఎంఆర్ఐటీ ప్రాంగణంలో ఇంత పెద్ద దొంగతనం ఎలా జరిగిందని ప్రస్తుతం మిస్టరీగా మారింది. సీసీ కెమెరాల నిఘా ఏమైంది.. సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతున్నారా అన్న చర్చ జోరందుకుంది. జీఎంఆర్ ఐటీ ప్రాంగణం 30 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. అక్కడే జీఎంఆర్ కేర్ డాక్టర్లకు, ఇటు జీఎంఆర్ ఐటీ ప్రొఫెసర్లకు క్వార్టర్స్ ఇచ్చారు. ఈ క్వార్టర్స్, కాలేజీలోకి వెళ్లాలంటే అడుగడుగునా జీఎంఆర్ ప్రైవేట్ సెక్యూరిటీ నిఘా ఉంటుంది. అయితే, తక్కువ ఎత్తులో ఉన్న ప్రహరీని దూకి క్వార్టర్స్లోకి దొంగలు ప్రవేశించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలేవీ? జీఎంఆర్ కేర్ ఆస్పత్రితో పాటు ఐటీ కాలేజీలు వద్ద సీసీ కెమెరాలు నిఘా ఉంది. ఈ క్వార్టర్స్ వద్ద ఈ సీసీ కెమెరాలు లేవు. రెండు ప్లాట్లులో చోరీ జరగగా ఒక ప్లాట్ వద్ద మాత్రమే సీసీ కెమెరా ఉంది. అందులో ముసుగుతో ఉన్నట్లు దొంగలు కనిపించారు. భారీగా బంగారం చోరీ జరిగిన రస క్వార్టర్స్ వద్ద మాత్రం ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఆ క్వార్టర్సే కాకుండా చుట్టు పక్కల కూడా సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. సెక్యూరిటీ ఏమైంది? జీఎంఆర్ ఐటీ మెయిన్ గేట్, కాలేజీ బ్లాకులు, హా స్టల్స్, డీఏవీ స్కూల్స్ వద్ద జీఎంఆర్ రక్షా సెక్యూరిటీ ఉంటుంది. ఈ క్వార్టర్స్ వద్ద ఆ సెక్యూరిటీ గార్డులు ఉన్నారా? లేదా? అన్నది బయటకు రానివ్వలేదు. సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉండి ఉంటే ఇంతటి చోరీ జరిగేదికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో క్వార్టర్లో 20 వరకూ గదులు ఉన్నా యి. ఈ గదులు అన్నీ ఒకదానికి ఒకటి ఆనుకుని ఉంటాయి. వీటిలో మనుషులు లేని ఇండ్లను దొంగలు ఎలా గుర్తించారు... అక్కడే ఎలా దొంగతనానికి దిగారు... గుప్చప్గా ఎలా మాయమయ్యారన్నది పోలీసులకు సైతం అంతుచిక్కడంలేదు. ఇక్కడే గంజాయి విక్రయాలు.. జీఎంఆర్ ఐటీ సమీపంలోని బుచ్చింపేట రోడ్డులో గంజాయి విక్రయాలు జోరుగా జరిగేవి. ప్రధాన రహదారులపై గంజాయి బ్యాచ్లు గొడవలు వంటివి చోటుచేసుకున్నాయి. ఈ సమీపంలోనే ఇప్పుడు పెద్దచోరీ జరుగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో చిన్నచిన్న దొంగతనాలకే భయబ్రాంతులకు గురయ్యే పట్టణవాసులు ఇప్పుడు ఈ భారీ చోరీని తలుచుకుని ఆందోళనచెందుతున్నారు. -
కానిస్టేబుల్ సతీమణికి కారుణ్య నియామకం
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జి.పోలిరాజు సతీమణి స్వాతికి మంగళవారం కారుణ్య నియామక ఉత్తర్వులను ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి అందజేశారు. ప్రభుత్వం ఆమెను పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (టైపిస్ట్)గా నియమించింది. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ..మృతి చెందిన సిబ్బంది కుటుంబానికి రావాల్సిన శాఖాపరమైన ప్రయోజనాలు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐ నాయుడు పాల్గొన్నారు. -
విద్యార్థి నేతల కిడ్నాప్ దారుణం
● మోహన్బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి ● విద్యార్థి సంఘాల డిమాండ్విజయనగరం గంటస్తంభం: విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన ఘటనలో సినీనటుడు మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, మోహన్బాబు యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట నిర్వహించిన నిరసనలో మోహన్బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలోని మోహన్బాబు యూనివర్సిటీలో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేసినందుకు గతంలో రూ.26 కోట్లను తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని, రూ.16 లక్షల జరిమానా విధించినా యాజమాన్యం దోపిడీ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఫీజుల దోపిడీకీ వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతలను బౌన్సర్లతో కిడ్నాప్ చేయించడం సిగ్గుచేటని పేర్కొంటూ, తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్థాయి కళాపోటీలు ప్రారంభం
విజయనగరం అర్బన్: స్థానిక యూత్ హాస్టల్లో మంగళవారం విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్ధులకు జిల్లా స్థాయి కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు ప్రారంభమ య్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలకు ముఖ్యఅఽతిధిగా హాజరైన సమగ్రశిక్ష ఏపీపీ డాక్టర్ ఎ.రామారావు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో పరస్పరం పోటీ పడి, మంచి ఇతివృత్తంతో కూడిన చిత్రాలను రూపొందించడం అభినందనీయమన్నారు. తొలిరోజు పోటీ ప్రదర్శనలో కళాంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి పర్యవేక్షణలో జరిగిన సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు, సిబ్బంది, 70 మంది దివ్యాంగ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, సహిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తూనికల్లో వర్తకుల మోసం
● జీసీసీ మేనేజర్ రాములుసాలూరు రూరల్: గిరిజనుల ఉత్పత్తుల కొనుగోలులో వర్తకులు తూనికల్లో మోసం చేస్తారని జీసీసీ మేనేజర్ సిహ్.ఆములు అన్నారు. ఈ మేరకు సాలూరు మండలంలోని నేరెళ్ల వలస వారపు సంతలో మంగళవారం ఆయన గిరిజనులకు జీసీసీ కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతపండును కిలో రూ.36కు జీసీసీ కొనుగోలు చేస్తుందన్నారు. వర్తకులు ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపుతారని గిరిజనులు వర్తకులకు చింతపండు అమ్మకాలు చేసి మోసపోవద్దని సూచించారు. అలాగే ఎవరైనా గిరిజనులను మోసం చేసి చింతపండు కొనుగోలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్దతు ధర రూ.50 చేస్తే మంచిది చింతపండు మద్దతు ధర రూ.50 జీసీసీ చెల్లిస్తే బాగుంటుందని నేరెళ్ల వలసకు చెందిన వంతల గోపాల్తో పాటు ఎగువ సెంబి, దిగువసెంబి, కుంబిమడకు చెందిన గిరిజనులు కోరారు. వర్తకులు కిలోకి రూ.50 చెల్లిస్తున్నారని ప్రభుత్వం గమనించి చింతపండు మద్దతు ధర పెంచాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక కొనుగోలు కేంద్రం ఇన్చార్జి రమేష్కుమార్ జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు షణ్ముఖ రావు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల అథ్లెటిక్స్ పోటీలకు విజయనగరానికి చెందిన ఎం.షణ్ముఖరావు ఎంపికయ్యాడు. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 800 మీటర్ల పరుగుపందెంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించాడు. ప్రస్తుతం డిప్లమో విద్యనభ్యసిస్తున్న షణ్ముఖ్ మార్చి నెలలో కేరళలో జరగనున్న ఆలిండియా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధుల పోటీలకు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనరబచడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుడితో పాటు విజ్జి స్టేడియంలో శిక్షణ ఇచ్చిన కోచ్ ఎ.నర్సింగరావును జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్ కిషోర్లు అభినందించారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. చదురుగుడి వద్దనున్న బాలాలయంలోనూ, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారిని పుష్పాలతో లంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. ఇంటి వివాదంలో ఒకరిపై దాడి పార్వతీపురం రూరల్: ఇంటి కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అరసాడ ఆనందరావు మూడేళ్ల క్రితం సవర కుమార్ వద్ద ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి ముందున్న దుకాణాన్ని తొలగించే విషయంలో గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా, సంక్రాంతి తర్వాత ఖాళీ చేస్తానని కుమార్ అంగీకరించాడు. అయితే గడువు ముగిసినా దుకాణం తొలగించకపోవడంతో మంగళవారం ఉదయం ఇంటిలో సామాన్లు సర్దుతున్న ఆనందరావు, కుమార్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుమార్, అతని భార్య లక్ష్మమ్మ కలిసి కర్రతో దాడి చేయడంతో ఆనందరావు తల, దవడ భాగాల్లో గాయాలయ్యాయి. బాధితుడు ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ప్రాజెక్టుల భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి
● రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశంవిజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రాజెక్టుల భూసేకరణపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరామ తీర్థసాగర్, తోటపల్లి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మూడో రైల్వేలైన్, కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర కీలం ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని, ప్రతి ప్రాజెక్టుకు భూసేకరణ దశలను పూర్తి చేయడానికి నిర్ణీత గడువు విధించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుల రహదారి, ఎస్టీపీల నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, మామహామాయ పరిశ్రమ విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ఈ అన్ని పనులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత శాఖల అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్ఓ ఈ.మురళి, ఆర్డీఓలు డి.కీర్తి, రామ్మోహన్, ఎస్డీసీలు కళావతి, ప్రమీలాగాంధీ, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్తో పాటు ఇరిగేషన్, జాతీయ రహదారులు, రైల్వే ఖాఖ అధికారులు, తహసీల్దార్లు, మున్సిల్ కమిషనర్లు, ఎల్ఏ యూనిట్ల డీటీలు పాల్గొన్నారు. -
పోలీసు బలగాలకు ‘పునశ్చరణ’
● ఆయుధాల వినియోగం, ● సైబర్ నేరాలపై అవగాహనపార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు సాయుధ బలగాలకు 15 రోజుల పునశ్చరణ (మొబిలైజేషన్) తరగతులు మంగళవారం కొనసాగాయి. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బందికి శారీరక దారుఢ్యం, ఆయుధాల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళ వ్యాయామాలు, రన్నింగ్, ఫిట్నెస్ డ్రిల్స్తో పాటు 9ఎంఎం పిస్టల్ వంటి ఆయుధాలను క్లిష్ట సమయాల్లో వేగంగా, సురక్షితంగా ఉపయోగించే విధానంపై మెలకువలు నేర్పిస్తున్నారు. అనంతరం సైబర్ సెల్ ఎస్సై రవీంద్ర రాజు డిజిటల్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆనన్లైన్ మోసాలు, ఫిషింగ్, సోషల్ మీడియా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పోర్టల్ను ఎలా వినియోగించాలో వివరించారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి మాట్లాడుతూ..సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నాయుడు, ఆర్ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
● బంగారు కొండలు
● రాష్ట్రస్థాయి పోటీల్లో 15మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ● అభినందించిన హెచ్ఎం, సిబ్బందిచీపురుపల్లి: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ పోటీల్లో మండలంలోని మెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మెట్టపల్లి విద్యార్థులు 15 మంది బంగారు పతకాలు సాధించారు. దీంతో మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎం విజ య్కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో మదర్ థెరీసా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీలకు మెట్టపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు వెళ్లినట్లు చెప్పారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో బంగారు పతకాలు సాధించగా ఒక విద్యార్థి క్రాఫ్ట్ విభాగంలో బంగారు పతకం సాధించినట్లు చెప్పారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను మిగిలిన వారు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ ఎ.కుమార్, క్రాఫ్ట్ టీచర్ పి.వేదలక్ష్మిలను అభినందించారు. -
పోలీసులపై డీఆర్ఓకు ఫిర్యాదు
విజయనగరం క్రైమ్: నా భర్తపై అక్రమంగా గంజాయి కేసు నమోదు చేసి పోలీసులు ఇబ్బందులకు పెట్టారంటూ విజయనగరంలోని పూల్బాగ్కు చెందిన సన్యాసిరావు భార్య మంగళవారం వాపోయింది. ఈ మేరకు బంధువులతో కలిసి కలెక్టరేట్ ముందు మంగళవారం ఆందోళన చేసిన ఆమె ఫిర్యాదు చేసేందుకు డీఆర్ఓను కలవగా కోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమని ఆయన చెప్పడంతో నిశ్చేష్టురాలైంది. అన్యాయంగా తన భర్త సన్యాసిరావుపై కేజీన్నర గంజాయి తరలిస్తున్నాడంటూ తప్పుడు కేసు పెట్టి ఇంట్లో ఉన్న ఆయనను రూరల్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొంది.నాలుగు రోజుల పాటు తన భర్త సన్యాసిరావు కోసం స్టేషన్ చుట్టూ తిరిగానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలతో ఉన్న తమ కుటుంబంపై అన్యాయంగా పోలీసులు ముద్ర వేశారని పేర్కొంది. బంధువులు, స్నేహితుల సాయంతో తన భర్త బెయిల్పై వచ్చాడని తనకు న్యాయం కావాలని డిమాండ్ చేసింది. -
మురిపించిన మారుజాతర
● పోలమాంబ దర్శనానికి బారులు మక్కువ: జై..పోలమాంబ..జైజై పోలమాంబ అంటూ భక్తులు చేసిన నినాదాలతో శంబర పులకించింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మారుజాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామునుంచి ఇతర జిల్లాలు, మండలాల నుంచి వేలాదిమంది భక్తులు శంబర గ్రామానికి చేరుకోగా దారులన్నీ రద్దీగా మారాయి. చదురుగుడిలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారిని, వనంగుడిలో కొలువైన పెదపోలమాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయం వెనుకున ఉన్న వేపచెట్టు వద్ద భక్తులు దీప,ధూప నైవేద్యాలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించిన భక్తులు చదురుగుడి, వనంగుడి, గోముఖి నది ఒడ్డున భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు, చీరలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. చిన్నారులు తలనీలాలు సమర్పించుకున్నారు. పలువురు భక్తులు చీపుళ్లతో రహదారులను శుభ్రపరుస్తూ మొక్కుబడులు చెల్లించుకోగా, మరికొంతమంది భక్తులు ఘటాలను అమ్మవారికి సమర్పించుకున్నారు. ఎండలో అమ్మదర్శనానికి వేచి ఉన్న భక్తులు పోలమాంబ అమ్మవారి దర్శనానికి వేలాదిమంది భక్తులు ఉదయం 10గంటల తరువాత ఒక్కసారిగా చేరుకోవడంతో, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆరుబయట ఎండలో భక్తులు వేచిచూశారు. రద్దీ ఎక్కువగా ఉన్న కారణంతో, భక్తులు అత్యధికంగా రూ.100 దర్శనం టిక్కెట్ క్యూ వద్దకు చేరుకోవడంతో, స్వల్ప తోపులాటల మధ్య భక్తులు అమ్మదర్శనానికి చేరుకున్నారు. సాలూరు సీఐ రామకృష్ణ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులను దర్శనానికి పంపించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అమ్మవారి దర్శనానికి రావడంతో, సుమారు అరగంటపాటు భక్తులు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలోని ప్రధానరహదారి వద్దనున్న సిరిమాను కర్రకు భక్తులు పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా మురపాక గ్రామానికి చెందిన భజనబృందం సభ్యులు చదురుగుడి క్యూ వద్ద భజనకీర్తనలు ఆలపించారు. అమ్మ సేవకులు క్యూల వద్ద భక్తులుకు మంచినీటిని సరఫరా చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు పాలు, ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. జాతరకొచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఐ రామకృష్ణ, ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు చైర్మన్ నైధాన చినతిరుపతి, కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. -
రెండు రోజుల్లో స్థలం మొత్తం కొలతలు వేస్తాం
వీరఘట్టం పట్టణంలోని గాసీవీధికి మేధరివీధి మధ్యలో ఉన్న స్థలం వద్ద గత కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. తమ సిబ్బందిని పంపించి స్థలాన్ని పరిశీలించాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 304లో 2.06 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అది గతంలో శ్మశానవాటిక స్థలం. ప్రస్తుతం ఇక్కడ వెల్నెస్ సెంటర్ కడుతున్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కొలతలు వేసి ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తిస్తాం. ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం. ఇక్కడ ప్రవేటు వ్యక్తులు ఎవరికీ సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఇక్కడ స్థలాన్ని ఎవరైనా అమ్మాలని చూసినా, కొనాలని చూసినా శిక్షార్హులు అవుతారు. దళారుల మాయమాటలు నమ్మవద్దు. – ఏ.ఎస్.కామేశ్వరరావు, తహసీల్దార్, వీరఘట్టం ● -
రోగులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
సీతంపేట: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి.. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రోగులు క్యూలో నిల్చోకుండా బెంచీలు ఏర్పాటు చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వారికి సాయం అందించడానికి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవకుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్, ఏపీఓ చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, తహసీల్దార్ డి.శ్రీకన్య, సూపరిండెంటెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డి.వి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చెత్తరువు..!
–8లోదాగుడుమూతలు..! దాగుడుమూతా దండాకోర్ ఆటలా ఉంది పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అధికార యంత్రాంగం, ఆక్రమణ దారుల తీరు.బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026జాక్టో నాయకుల ఢిల్లీ పయనం● ఈనెల 5న పార్లమెంట్ మార్చ్ వీరఘట్టం: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(జాక్టో) పిలుపునిచ్చింది. ఈమేరకు ఈనెల 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించి పలు డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన 40 మంది జాక్టో నాయకులు మంగళవారం ఢిల్లీ బయల్దేరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే జాక్టో లక్ష్యమని,తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వినిపించేందుకు తామంతా హస్తినకు పయనమయ్యామని జాక్టో నాయకులు తెలిపారు. కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభంపార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి చూపు సమస్యలను దూరం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కళ్లజోళ్ల పంపిణీ చేపట్టింది. గతంలో నిర్వహించిన పరీక్షల్లో దృష్టి లోపం ఉన్నట్లు తేలిన 2,134 మంది విద్యార్థులకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఉచితంగా కళ్లజోళ్లను అందజేస్తున్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా విద్యార్థులందరికీ కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు వాటిని వినియోగించుకుని కంటిచూపును కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా.సూర్య కౌశిక్, వైద్య సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 32 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులుసీతంపేట: బయోమెట్రిక్ హాజరు వేయని 32 మంది గ్రామ సచివాలయం సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు మండల ప్రత్యేకాధికారి జి.చిన్నబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బయోమెట్రిక్ హాజరు వేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకేంద్రంలోని డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర పదేపదే చెబుతూ వచ్చారు. చెత్తశుద్ధి నిర్వహణ అంటూ కొన్నాళ్లు హడావిడి చేసినా..‘చెత్త’ కథ మళ్లీ మొదటికే వస్తోంది. అసంపూర్తి నిర్ణయాల వల్ల ఈ దుస్థితి దాపురించింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 25 టన్నుల చెత్త సేకరణ జిల్లా కేంద్రం పార్వతీపురంలో 30 వార్డులున్నాయి. సుమారు 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దాదాపు 13 వేల నివాస గృహాలుండగా.. ఆవాసాలు, వ్యాపార సంస్థల నుంచి రోజుకు 25 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డులోనే దీన్ని పారబోస్తున్నారు. డంపింగ్యార్డు 1.5 ఎకరాల్లోనే ఉంది. చెత్తను యార్డుకు తరలించాలని పట్టణ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే విజయ్చంద్ర దాన్ని నెరవేర్చలేకపోయారు. గతంలో పార్వతీపురం పట్టణంలోని చెత్తశుద్ధి నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంస్థ తరుణి ఏజెన్సీకి పనులు అప్పగించింది. ఆ మేరకు కొన్నాళ్ల క్రితం డంపింగ్ యార్డు సమీపంలోనే పనులు ప్రారంభించారు. ఇక్కడ చెత్తను నాలుగు భాగాలు విభజిస్తారు. ప్లాస్టిక్, మట్టిరాళ్లు, రబ్బరు, గాజు వ్యర్థాలను వేర్వేరు యంత్రాలతో విభజించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ను విక్రయానికి తరలించి, మిగిలిన పనికిరాని వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపేస్తారు. ఇలా పట్టణంలో 12 వేల టన్నుల వరకు వ్యర్థాలను విభజించాలి. ప్రస్తుతం సేకరిస్తున్న చెత్తలో 20 శాతమే(ప్లాస్టిక్ వంటివి) తిరిగి ఉపయోగానికి పనికి వస్తున్నాయి. మిగిలిన 80 శాతం మళ్లీ భూమిలో కలిపేయాల్సి వస్తోంది. మిగిలిన వ్యర్థాలన్నీ మళ్లీ అక్కడే.. ఇప్పటికే డంపింగ్యార్డు సమస్య చాలా కాలంగా ఉంది. పట్టణ శివారు రాయగడ రోడ్డు పక్కనే గుట్టల మాదిరి చెత్త పోగవుతోంది. రహదారిపైకే వస్తోంది. డంపింగ్ యార్డు సమీప స్థలంలోనే చెత్తశుద్ధి నిర్వహణ యంత్రాలున్నాయి. శుద్ధి చేయగా మిగిలిన 80 శాతం వ్యర్థాలను రహదారికి మరోవైపునే కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పడేస్తున్నారు. దీంతో అదో పెద్ద కొండ మాదిరి తయారై..అటుగా ప్రధాన రహదారిపైకి వస్తోంది. రెండు వ్యర్థాలూ కలిసి అటుగా ప్రయాణించే వారికి నరకం చూపుతున్నాయి. ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్లు.. చెత్తశుద్ధి నిర్వహణ తర్వాత మిగిలిన వ్యర్థాలను పట్టణంలోని నెల్లి చెరువులో కలిపేయడానికి నిశ్చయించుకున్నారు. ఇప్పటికే నెల్లి చెరువు దురాక్రమణలో ఉంది. జిల్లా కేంద్రం నడిబొడ్డున 11.54 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ చెరువు ఆక్రమణల తర్వాత బక్కచిక్కి ఐదెకరాలకే పరిమితమైంది. ఇప్పటికీ ఆక్రమణలు ఆగడం లేదు. ఇప్పుడు చెత్తశుద్ధి వ్యర్థాలన్నింటినీ నెల్లి చెరువులో కలిపేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల చెరువు పూర్తిగా చదును అయిపోతుందని, నామరూపాలు లేకుండా పోతుందని.. ఆక్రమణలు మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో కానరాని చెత్తశుద్ధి రహదారిపైనే వ్యర్థాల ‘డంపింగ్ పార్వతీపురం–రాయగడ రోడ్డులో పేరుకుపోతున్న గుట్టలు జిల్లా కేంద్రంలోని నెల్లి చెరువులోనూ పారబోసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న స్థానికులు బెదిరింపులకు దిగిన అధికారులు -
ఉన్నది 50 సెంట్లు
రికార్డుల్లో 2.06 ఎకరాలు..● వీరఘట్టంలో ప్రభుత్వ భూమి కబ్జా ● ఆక్రమణలు తొలగించేందుకు యంత్రాంగం సన్నద్ధం ఈ చిత్రంలో కనిపిస్తున్నది వీరఘట్టం మేజర్ పంచాయతీలోని గాసీవీధికి–మేదరి వీధికి మధ్యలో సర్వే నంబర్ 304లో ఉన్న ప్రభుత్వ స్థలం. పూర్వకాలంలో ఇది శ్మశాన వాటిక. 2.06 ఎకరాల్లో ఈ భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. ప్రస్తుతం ఇక్కడ అంత భూమి లేదు. 50 సెంట్లు మాత్రమే ఉంటుంది. ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీరఘట్టం: వీరఘట్టం మేజర్ పంచాయతీలోని సర్వే నంబర్ 304లో ఉన్న స్థలంలో పలు ప్రభుత్వ భవనాలను నిర్మించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలాలను కేటాయించారు. వెల్నెస్ సెంటర్కు మంజూరైన రూ.36లక్షలతో భవన నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. ఇదే అదునుగా ఆ స్థలం తమదంటే తమదంటూ కొందరు చదును చేయడం ప్రారంభించారు. రూ.కోట్లు విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది దళారులు పావులు కదుపుతున్నారు. గతంలో ఈ స్థలాన్ని తమకు ఇచ్చేశారంటూ పలు సామాజిక వర్గాల వారు తగాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని మంగళవారం పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 304లో 2.06 ఎకరాల్లో శ్మశానవాటిక ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 50 సెంట్లు భూమి మాత్రమే ఉంది. మిగిలిన భూమిని కొత్తగా వేసిన రియల్ ఎస్టేట్లో కలిపేశారా... లేదంటే స్థలం పక్క ఉన్నవారు కలిపేశారా అన్న కోణంలో రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తు న్నారు. ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టంచేశారు. -
భారీగా బంగారం చోరీ
రాజాం: రాజాంలోని జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో ఆదివారం రాత్రి భారీగా బంగారం చోరీ జరిగింది. ప్రొఫెషనల్ దొంగలు ఈ చోరీకి పాల్పడి రెండిళ్లలోని బంగారం, వెండి పట్టుకుపోయారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పడడంతో ఈ దొంగతనం ప్రొఫెషనల్ దొంగల ముఠాదిగా పోలీసులు భావిస్తున్నారు. ఒకచోట 1250 గ్రాములు, మరో చోట 291 గ్రాముల బంగారంతో పాటు కిలో వెండిని అపహరించుకుపోయారు. ఈ చోరీలపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఇంట్లో.. రాజాం జీఎంఆర్కేర్ ఆస్పత్రిలో చిల్ట్రన్ స్పెషలిస్ట్గా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ వీడీ నగేష్ జీఎంఆర్ఐటీ కాలేజీలోని రస బ్లాక్లోని క్వార్టర్స్లో ఉంటున్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నం వెళ్లి సోమవారం ఉదయం తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తెరుస్తుండగా అప్పటికే తలుపు తెరిచి ఉండడంతో అనుమానంతో వెంటనే బెడ్రూమ్లోని బీరువాను చూడగా, బీరువా తెరిచి ఉండడంతో పాటు పలురకాల వస్తుసామగ్రి చెల్లాచెదురుగా పడిఉండడంతో ఇంట్లో దొంగలుపడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర, సంతకవిటి ఎస్సై గోపాలరావులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీశారు. తన బీరువాలో భద్రపరిచిన 1250 గ్రాముల బంగారం(106 తులాలు)తో పాటు కిలో వెండి దొంగతనానికి గురైనట్లు డాక్టర్ వీడీ నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం నుంచి డాగ్ స్క్వాడ్తో పాటు ఫింగర్ ఫ్రింట్ సీఐ మురళీమోన్, క్లూస్ టీం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ నమోదుచేయడంతో పాటు క్వార్టర్స్లో పనిచేస్తున్న సిబ్బందిని, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగితెలుసుకున్నారు. డాక్టర్ నగేష్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఆ ఇంట్లో రూ. 2 కోట్లు విలువచేసే 1250 గ్రాముల బంగారంతో పాటు రూ. 50 లక్షలు విలువచేసే కిలో వెండి పోయినట్లు గుర్తించి కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో మరో చోరీ ఫిర్యాదు.. డాక్టర్ నగేష్ ఇంటి వద్ద దొంగతనానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించకముందే పక్కనే ఉన్న లయ బ్లాక్లో కూడా చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదువచ్చింది. ఆ బ్లాక్లో నివాసముంటున్న జీఎంఆర్ఐటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.మాధవకృష్ణారెడ్డి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. తాను ఆదివారం పాలకొండ వెళ్లానని, పక్క బ్లాక్లో దొంగతనం జరిగిందని తెలిసి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు గుర్తించానని వెల్లడించారు. తన బీరువాలో భద్రపరిచిన 291 గ్రాముల బంగారాన్ని(25 తులాలు) దొంగలు పట్టుకుపోయినట్లు బాధితుడు ఫిర్యాదుచేశాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఈ విషయం ఎస్పీ ఏఆర్ దామోదర్కు తెలియడంతో ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. ప్రొఫెసర్ ఇంటి బ్లాక్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ కెమెరాల్లో ముగ్గురు దొంగలు చోరీకి వచ్చినట్లు గుర్తించారు. ఈ బ్లాక్ల పక్కనే ఉన్న ప్రహరీ నుంచి వారు లోపలకు చొరబడి చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రొఫెషనల్స్గా అనుమానిస్తున్నాం.. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లో జరిగిన చోరీకి సంబంధించి దొంగలు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తపడ్డారన్నారు. చేతులకు గ్లౌజులు పెట్టి చోరీకి పాల్పడ్డారని, ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పాటించారని వెల్లడించారు. గతంలో దొంగతనాలకు పాల్పడి తెలివిగా తప్పించుకునే దొంగలముఠాకు చెందినవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారన్నారు. వారు ఎక్కడ ఉన్నా పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. జీఎంఆర్ఐటీ క్వార్టర్స్లోని రెండిళ్లలో బంగారం అపహరణ ఒకచోట 1,250 గ్రాములు, మరో చోట 291 గ్రాముల బంగారం, కిలో వెండి కూడా మాయం సీసీఫుటేజీల్లో దొంగల జాడ రూ.3 కోట్ల మేర నష్టం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ దామోదర్ -
ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభం
సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రిలో సోమవారం నుంచి కిడ్నీ రోగులకు డయాలసి స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైన ఈ సేవలను డీసీహెచ్ఎస్ నాగభూషణ్, డీఎంహెచ్ఓ భాస్కరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇది మూడో డయాలిసిస్ కేంద్రం అన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం పార్వతీపురం, పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఈ సేవలు రోగులకు అందుతున్నాయన్నారు. ఇక్కడకు ఇప్పటి వరకు ఆరుగురు పేషెంట్లు పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి ఐదుబెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ పార్వతి, సూపరిండెంటెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డీవీ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం: జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్జర్వేటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో రుణాలు అందించాలన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ముద్రా రుణ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సోమశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యాంకుల సీడీ రేషి యో సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రాధాన్య త రంగాలకు రుణాలు అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉన్నాయని వివరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఈ నెల 15వ తేదీలోగా క్లియర్ చేస్తామన్నారు. పార్వతీపురం: జంతువుల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పశువులను నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో కిక్కిరిసి తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచాలన్నారు. జంతుహింస నివారణ చట్టం–1960పై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అనాథగా తిరుగుతున్న, గాయపడిన జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్ హోమ్లను ఏర్పాటు చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పశు సంవర్థకశాఖ అధికారి మన్మథరావు, తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సోమవారం పుష్పార్చన సేవను వైభవంగా నిర్వహించారు. శ్రీరామచంద్రస్వామిని వివిధ రకాల పుష్ఫాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక మండపంలో ఉత్సవ విగ్రహాలను ఆసీనులుచేసి పుష్పాలతో అర్చనలు చేశారు. ద్వాదశ ఆరాధన, సప్తావరణ సేవ జరిపించారు. -
పోలమాంబ మారుజాతరకు పూర్తికావచ్చిన ఏర్పాట్లు
● 15వేలు లడ్డూ ప్రసాదం తయారీ ● 30మంది దేవాదాయసిబ్బంది ● 170మందితో పోలీస్ బందోబస్తుమక్కువ: ఉత్తరాంఽధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మారుజాతర నేడు జరగనుంది. జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. జాతరలో భక్తుల అవసరార్థం 15వేల లడ్డూప్రసాదాన్ని దేవాదాయశాఖ తయారుచేయించింది. అవసరమైన మేరకు పులిహోర భక్తులకు అందించనున్నట్లు ఈవో తెలిపారు. జాతరకొచ్చే భక్తులకు సేవలందించేందుకు 30మంది దేవాదాయశాఖ సిబ్బంది శంబర గ్రామానికి చేరుకున్నారు. హెల్మెట్ ధరించి జాతరకు రావాలి ద్విచక్రవాహనాలపై జాతరకు చేరుకునే భక్తులు తప్పక హెల్మెట్ ధరించాలని సీఐ రామకృష్ణ భక్తులకు విజ్ఞప్తి చేశారు. జాతరలో 170మంది పోలీస్బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యంతాగి ఆలయానికి రావద్దన్నారు. ఎటువంటి గొడవలకు తావివ్వకుండా, ఆధ్యాత్మిక భావనతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శించుకోవాలని సూచించారు. -
వృద్ధుడి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: స్థానిక ఇందిరా నగర్ లో ఏడు పదుల వయస్సున్న ఓ వృద్ధుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విజయనగరం వన్ టౌన్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఇందిరానగర్ లో ఆర్కే సదన్ అపార్టెమెంట్ వాచ్మన్గా పనిచేస్తున్న అల్లు త్రినాథ్ (70) భార్య భవానీతో ఉంటున్నాడు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన త్రినాథ్ ఆదివారం రాత్రి యాసిడ్ తాగేశాడు. గమనించిన భార్య హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.లైంగిక దాడి కేసులో ముద్దాయికి 14 ఏళ్ల జైలు శిక్షవిజయనగరం క్రైమ్: 2021వ సంవత్సరంలో రామభద్రపురం పీఎస్ లో లైంగికదాడికి పాల్పడినట్లు నమోదైన కేసులో పాతరేగకు చెందిన ముద్దాయి గునపు సింహాద్రికి విజయనగరం మహిళా కోర్టు, 5వ ఏడీజే కోర్టు జడ్జి ఎన్.పద్మావతి 14 ఏళ్ల కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే పాతరేగకు చెందిన గునపు సింహాద్రి అదే గ్రామానికి చెందిన ఒక మహిళపై బలవంతంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రామభద్రపురం పోలీస్స్టేషన్ లో 2021లో అప్పటి ఎస్సై ఎస్.కృష్ణమూర్తి కేసు నమోదు చేశారు. అప్పటి సాలూరు రూరల్ సీఐ ఎల్.అప్పల నాయుడు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టులో నిందితుడు గునపు సింహాద్రి నేరానికి పాల్పడినట్లు సాక్ష్యాలు నిరూపితం కావడంతో విజయనగరం మహిళా కోర్టు పై విధంగా తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరికి గాయాలుపార్వతీపురం రూరల్: గరుగుబిల్లి మండలంలోని నందివానివలస సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామం నుంచి తమ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై రైతులు పొలం పనులకు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. 2,407 లీటర్ల సారా ధ్వంసంపార్వతీపురం రూరల్: వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు 2,407.95 లీటర్ల సారాను స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో, మధ్యవర్తుల సమక్షంలో ఈ సారాను పారబోసి నిర్వీర్యం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ కుమార్, ఎకై ్సజ్ సీఐ ఎస్.శిరీష, తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ విజయనగరం గంటస్తంభం: నగరంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారు సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పీ4 కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబాన్ని ఫౌండేషన్ దత్తత తీసుకుని, వారి బాగోగులు చూసుకుంటుండడం గమనార్హం. ప్రతినెలా ఇలాగే ఆ కుటుంబానికి అవసరమైన బియ్యం, నూనె, పప్పుదినుసులు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు సాయికుమార్ తెలిపారు. ప్రత్యేక ఆధార్ కేంద్రాల ఏర్పాటు విజయనగరం టౌన్: ప్రజల సౌకర్యార్థం ఎంపిక చేసిన పలు ప్రదేశాల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందించడం జరుగుతోందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో సోమవారం కోరారు. ఈ నెల 4వ తేదీ వరకు కంటోన్మెంట్ పరిధిలోని గీతాంజలి పాఠశాల, సిక్కుల గుడి వద్ద, 5 నుంచి 7వ తేదీ వరకు మయూరి జంక్షన్, ఆర్కే జూనియర్ కళాశాలల వద్ద, 9 నుంచి 11వ తేదీ వరకు కామాక్షి నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ వద్ద ఆధార్ శిబిరాలు అందుబాటులో ఉంటాయన్నారు. కొత్త ఆధార్ కార్డులు కావాలన్నా, పాత ఆధార్ కార్డుల్లో తప్పులు సవరణ చేయాలన్నా ఆయా శిబిరాలను సంప్రదించాలన్నారు. -
కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు!
ఈ వ్యక్తి పేరు చప్ప గంగరాజు. బలిజిపేట మండ లం అజ్జాడ గ్రామం. ఏడాదిన్నర కింద ట అనారోగ్య సమ స్య కారణంగా కుడి కాలు తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి పనులకు వెళ్లడం కష్టంగా మారింది. భార్య కూలి పని చేస్తూ, కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు పింఛన్ ఇస్తే ఆ మొత్తం కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అధికారులకు అభ్యర్థించాడు. సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: ఎటువంటి ఆధారమూ లేక.. బతుకు సాగక.. ప్రభుత్వ సాయం కోసం పలువురు విధివంచితులు కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. పీజీఆర్ఎస్లో అధికారులను కలిస్తే న్యాయం జరుగుతుందని ఆశిస్తూ, వినతిపత్రాలు అందిస్తున్నారు. ప్రధానంగా పింఛన్ కోసమే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. పార్వతీపురం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన కొంతమంది బాధితుల ఆవేదన ఇదీ.. కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన పాత గౌరీశంకరరావు సికిల్సెల్ ఎనీమియాతో బాధ పడుతున్నాడు. ఆయన పెద్ద కుమార్తె జశ్విత(7) కూడా పక్షవాతం, సికిల్సెల్, మాటలు రాకపోవడం వంటి సమస్యలతోనూ.. రెండో కుమార్తె రుచిత సికిల్సెల్ ట్రయిట్ అనే వ్యాధితోనూ బాధ పడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈయనకు ఎటువంటి ఆధార మూ లేదు. వైద్యం కోసం చాలా ఖర్చు చేయా ల్సి వస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. కనీసం రుణం ఇప్పించి, స్వయం ఉపాధి కి మార్గం చూపాలని పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించాడు. ఈమె పేరు గౌరమ్మ. జియ్యమ్మవ లస మండలం పిప్పలభద్ర గ్రామం. భర్త ఆదినాయుడు 2024 సంవత్సరంలో మృతి చెందారు. అప్పటి నుంచి జీవనాధారం లేని ఆమె.. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉంది. నేటికీ మంజూరు కాకపోవడంతో.. జీవనం దుర్భరంగా ఉందని, అధికారులు దయ తలచాలని వేడుకుంటోంది. జియ్యమ్మవలస గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి అప్పలనాయుడు పదేళ్లుగా కేన్సర్తో పోరాడుతున్నాడు. చికిత్స నిమి త్తం చాలా వరకు ఖర్చయింది. తనకు పెన్షన్ ఇస్తే.. కాస్తయినా చేదోడుగా ఉంటుందని ఆశిస్తున్నాడు. అధికారులు కనికరం చూపి, పింఛన్ వచ్చే మార్గం చూడాలని వేడుకుంటున్నాడు. ఈ చిత్రంలోని అక్కాతమ్ముళ పేర్లు భోగి వెంకటరత్నం, శ్రీకాంత్. ఇద్దరూ దివ్యాంగులే. 90 శాతం వరకు వికలాంగత్వం ఉంది. స్వతహా గా ఏ పనులూ చేసుకోలేరు. మరొకరి తోడు ఉంటే గానీ బయటకు రాలేరు. తమ్ముడు భోగి శ్రీకాంత్.. అధిక బరువు కారణంగా నలుగురు పట్టుకుని ఎత్తితే గానీ అవ్వదు. వీరికి రూ.6 వేల పింఛన్ వస్తోంది. వైద్యశాఖ అందించే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. విశాఖ కేజీహెచ్కు వెళ్లి సర్టిఫికెట్ తీసుకురావాలని చెబుతున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని, మొత్తం పెంచా లని వేడుకుంటున్నారు. -
ఎవరిదీ పాపం..?
పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ ఏరియాల్లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో ఈ హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీనిపై పేరు, ఊరు ముద్రించనప్పటికీ.. కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ నాయకుల పనేనని ప్రజలంతా అనుమానిస్తున్నారు. జన సంచారం అధికంగా ఉన్న రద్దీ కూడళ్లలో.. మున్సిపల్ అధికారులకు తెలియకుండా, ప్రజలను రెచ్చగొట్టేలా భారీ స్థాయిలో హోర్డింగులు ఏర్పాటు చేసే ధైర్యం ఎవరికి ఉంటుందని.. అధికార పార్టీ అండతోనే ఇవి వెలిశాయని అంటున్నారు. కోట్లాది మంది మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ విషయంలో విష ప్రచారం చేస్తూ.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వెలిసిన ఈ హోర్డింగులపై మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం. -
సీతం కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్
విజయనగరం అర్బన్: పట్టణంలోని సీతం కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభించింది. ఈ గౌరవప్రదమైన సర్టిఫికెట్ను సోమవారం జేఎన్టీయూ జీవీ ప్రొఫెసర్ వీవీసుబ్బారావు చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వైస్ప్రిన్సిపాల్ సీహెచ్వెంకటలక్ష్మి అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సీతం కళాశాల మరిన్న విజయాలను సాధించి, మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా కళాశాల పనిచేస్తున్నట్లు ఇది సానుకూల సూచన అని డేటా సమగ్రత, నిజాయితీ, నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం కళాశాల బలమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ విజయాన్ని సాధించిన కళాశాల బృందాన్ని డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు అభినందించారు. -
వేంకటేశ్వర ఆలయ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు
పార్వతీపురం: బెలగాంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్న ట్టు ఆలయ కమిటీ సభ్యులు యిండుపూరు గున్నేశ్వరరావు, పి.అప్పారావు తెలిపారు. ఆలయ ప్రాంగ ణంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవస్థానం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు వేదపండితుల ఆధ్వ ర్యంలో ఉత్సవాలు జరుపుతామన్నారు. ఇందులో భాగంగా 23, 24 తేదీల్లో చినజీయర్ స్వామి, 29న చాగంటి కోటేశ్వరరావు, 30న గరికిపాటి నర్సింహరావు, మే 1న పరిపూర్ణానంద స్వామి విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యు లు జగన్నాథం, కేవీఆర్ కృష్ణారావు, సీహెచ్ బాల గంగాదర్ తిలక్ రాయ్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమా?
● ప్రభుత్వతీరుపై సచివాలయ ఉద్యోగుల ఆందోళన విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిమితిలేని పని గంటలు అప్పగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు ఉద్యోగులు వాపోయారు. సచివాలయాల్లో పనిఒత్తిడిని తట్టుకోలేక, ఇతర కారణాలతో బలవంతపు మరణాలకు గురైన ఉద్యోగులను స్మరిస్తూ ఏపీఎన్జీఓ హోమ్లో సోమవారం కొవ్వొ త్తులు వెలిగించి నివాళులర్పించారు. మృతికి కారణమైన ప్రభుత్వ విధానాలపై డీయూ సేవ (డిస్ట్రిక్ అర్బన్ సచివాలయం ఎంప్లాయీస్ విజయనగరం అసోసియేషన్) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ సర్వేలు, ప్రత్యేక డ్యూటీలు, సంబంధం లేని శాఖల పనులు, మొబైల్ యాప్స్ భారం వల్ల సచివాలయ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారన్నారు. ఉద్యోగుల సమ యం పూర్తయిన తరువాత కూడా పనిచేయాల్సి రావడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొందని, ఈ ఒత్తిడి కారణంగా హార్ట్ స్ట్రోక్లు, మానసిక రుగ్మతలకు ఉద్యోగులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో మరణించిన సచివాలయ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ లేకపోవడం అత్యంత అమానుషమన్నారు. జీవించే హక్కు మాకు ఉందని, ఛిదిమేసే హక్కు మీకు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలవంతపు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ లక్ష్యం
● వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శృంగవరపుకోట: రాష్ట్రంలో మూత్రపిండ వ్యాధి గ్రస్థులకు ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎస్.కోటలో 100పడకల ప్రభుత్వాస్పత్రి అదనపు భవనాలను, డయాలసిస్ కేంద్రాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లలితకుమారిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డయాలసిస్ రోగులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందివ్వడం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సీహెచ్సీలో పూర్తిస్థాయి వైద్యం అందివ్వాలని ఆరు నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం పనిచేసిందన్నారు. మెరుగైన ఆరోగ్యసేవలు ఇవ్వాలని ఎన్సీడీ హెల్త్ కాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ తన అభ్యర్థనను మన్నించిన ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రి పూర్తికావడానికి సహకారం అందించారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఆర్డీవో కీర్తి, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, జనసేన ఇన్చార్జ్ ఒబ్బిన సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ సీహెచ్.మల్లునాయుడు, బీజేపీ నేత రాకేష్ వర్మ, రెడ్డి పావని, డోకుల అచ్చింనాయుడు, కె.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ జీఎస్.నాయుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.శ్రీలక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్లు ఎన్.రమణాజీ, జి.బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
శివరాత్రి ఉత్సవాలకు క్యూలు పటిష్టంగా ఉండాలి
● దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) కె.శోభారాణి ఆదేశించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎటువంటి తోపులాటలకు ఆస్కారం ఉండకూడదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు దర్శనానికి వెళ్లే మార్గంతో పాటు దర్శనం అనంతరం వచ్చే మార్గం వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎటువంటి తాత్కాలిక షాపులు లేకుండా చూసుకోవాలని, అడ్డుగా ఉండే వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండాలని కోరారు. భక్తుల రద్దీ ఒకే చోట ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి రన్నింగ్ వాటర్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఈఓలు వై.శ్రీనివాసరావు, ప్రసాదరావు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం
విజయనగరం క్రైమ్: శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం కావాలని, యూనిఫాం ధరించిన తరువాత ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకే పునరంకితం కావాలని ఏఆర్ పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఏఆర్ సిబ్బంది బలమైన శక్తిగా, మాతృశాఖకు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ప్రారంభించిన పోలీస్ పునశ్చరణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విధులను నిష్పక్షపాతంగా, అంకిత భావంతో నిర్వర్తించాలన్నారు. శారీరక దారుఢ్యం పెంచేందుకు, వివిధ ఆయుధాల ఉపయోగాలను, ముఖ్యమైన బందోబస్తులలో విధులను ఏవిధంగా నిర్వహించాలో శిక్షణ ఇస్తామన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్, బాంబు స్క్వాడ్, మస్కట్రీ శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్పై ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్టు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పాల్గొన్నారు. -
81.90 కేజీల గంజాయి స్వాధీనం
చికెన్పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో 81.90 కేజీలు గంజాయి, మూడు కార్లు, ఒక కంటైనర్ను సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని సిమిలిగూడ నుంచి ఏడు బస్తాల్లో 81.90 కిలోలు గంజాయిని కంటైనర్లో తరలిస్తుండగా పోలీసులు వెంబడిస్తున్నారనే సమాచారంతో గోవిందపురం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో కంటైనర్ నుంచి కారులోకి గంజాయిని ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలి జిల్లాకు చెందిన అక్రమ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాకు చెందిన రాహుల్కుమార్, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేడబోయిన తులసీదాస్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.4.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కార్యక్రమంలో ఎస్సై ఐ.దుర్గాప్రసాద్, ఏఎస్సై సురేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు. మూడు కార్లు, ఒక లారీ సీజ్ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కంటైనర్ నుంచి కారులోకి గంజాయి బస్తాలు మారుస్తుండగా పట్టివేత -
దేవుడా.. నీతోనే ఆటలా!
సాక్షి, పార్వతీపురం మన్యం: కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం.. కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చేస్తున్న దుష్ప్రచారం పరాకాష్టకు చేరింది. కూటమి నాయకులు ఆరోపించినట్లుగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆనవాళ్లు లేవని సిట్ నిర్ధారించినప్పటికీ.. విష ప్రచారం ఆగడం లేదు. పార్వతీపురం జిల్లాకూ ఈ సంస్కృతి పాకింది. ఇన్నాళ్లూ నోటిమాట ద్వారానే తిరుమల లడ్డూకు అపఖ్యాతి ని తెచ్చారు. ఇప్పుడు మరో ముందుడుగు వేసి పార్వతీపురం పట్టణంలోని పలు రద్దీ కూడళ్లలో, భామిని వంటి మండల కేంద్రాల్లో సైతం పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, మత విద్వేషాలను రెచ్చ గొట్టేలా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం. శ్రీనివాసుని లడ్డూ ప్రసాదంపై ఉన్న కళంకాన్ని పోగొట్టేలా ఇటీవల వైఎస్సార్సీపీ నాయకులు ‘పాప పరిహార పూజలు’ పేరిట వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే. ఆ రెండు రోజులకే దీనికి కౌంటర్గా అన్నట్లు పార్వతీపురం పట్టణంలో హోర్డింగులు వెలిశాయి. ‘మహా పాపం నిజం.. అది నెయ్యే కాదు.. పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల ఫొటోలను ముద్రించి తప్పుడు ప్రచారంతో ఈ హోర్డింగులు వెలిశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా హోర్డింగులు వెలియడం వెనుక.. పెద్ద ఎత్తున దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. హిందువుల ఇష్టదైవం శ్రీనివాసుడు. స్వామి వారి లడ్డూ ప్రసాదం ఒక్కటి దొరికినా చాలు.. జన్మ ధన్యమని, మహా పుణ్యమని చాలా మంది భావిస్తారు. ఈ ప్రసాదం విషయంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విషప్రచారం చేస్తున్న విషయం విదితమే. అదే నిజమని భ్రమించేలా ఇప్పుడు ఏకంగా పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అల్లర్లు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ హోర్డింగులను కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని వ్యాపింపజేస్తుండడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అతి పవిత్రమైన తిరుమల లడ్డూ నెయ్యి అంశం పట్ల వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారాలు, అపవాదులతో కూడిన ఫ్లెక్సీల ప్రచారాన్ని పోలీసు అధికారులు అడ్డుకోవాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. పట్టణంలో వెలసిన హోర్డింగులపై తక్షణం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ.. పార్వతీపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జిషీట్కు వ్యతిరేకంగా.. జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి ఫొటోలతో తప్పుడు పోస్టర్లను ఏర్పాటు చేశారని వివరించారు. ప్రజలను రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు భంగం కలిగేలా వాటిని సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 18 నెలలుగా వంద కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే కాక, ఈ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులను నిందితులుగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, సిట్ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను పరిశీలిస్తే.. పేర్కొన్న వ్యక్తులపై ఎలాంటి నేరారోపణలు, పాత్ర నిర్ధారణ, బాధ్యత విధింపు లేనట్లు స్పష్టమవుతోందని చెప్పారు. సిట్ దర్యాప్తు పూర్తిగా ల్యాబ్ నివేదికలు, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, పత్రాలు, చట్టబద్ధమైన సాక్ష్యాలపైనే సాగిందని తెలిపారు. రాజకీయ పార్టీలు, వ్యక్తుల ప్రమేయం ఉందని ఎక్కడా నిర్ధారించలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నాయకులు భారత న్యాయ సమితి చట్టాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పోలీసుశాఖ అడ్డుకోవాలని కోరారు. ఫ్లెక్సీలను తొలగించి, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
మహిళలు, చిన్నారుల సంరక్షణకు చర్యలు
పార్వతీపురం: బాల్యవివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు మహిళా సంరక్షణ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్ల్లాలోని అన్ని సచివాలయాల మహిళా పోలీసులకు సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోని మహిళలు, చిన్నారుల భద్రతను పర్యవేక్షించాలన్నారు. మహిళలపై వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు అండగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బాలికల సంరక్షణ విషయంలో రాజీపడకుండా మహిళా పోలీసులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ఏఎస్పీ వి.మనీషారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
● 380 వినతుల స్వీకరణ ● వినతులు సకాలంలో పరిష్కరించాలి ● జేసీ సేతు మాధవన్విజయనగరం అర్బన్: ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్), ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు భారీ స్పందన లభించినప్పటికీ, రెవెన్యూ శాఖ వైఫల్యాలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ ఫిర్యాదులు, వినతులు సమర్పించారు. కలెక్టరేట్ ప్రాంగణం అంతా అర్జీదారులతో కిటకిటలాడింది. ఇది ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి, సమస్యల పరిష్కారంలో జాప్యం ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తోంది. మొత్తం 380 వినతులు అందగా వాటిలో అత్యధికంగా దాదాపు 50 శాతం 188 వినతులు రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయి. భూముల మ్యుటేషన్లు, అడంగల్, వన్–బీ సర్టిఫికెట్లు, పట్టాదార్ పాస్బుక్లు, భూమి రికార్డుల సరిదిద్దులు వంటి సాధారణ రెవెన్యూ సమస్యలే ఈ వినతుల్లో ఎక్కువ భాగం ఆక్రమించాయి. మరో వైపు వాటిలో రీఓపెన్ వినతులు కూడా అధికంగానే ఉన్నాయి. అదేవిధంగా ఐటీ పార్కులు, పరిశ్రమలు అంటూ ఇష్టాను సారం భారీ విస్తీర్ణంలో భూముల సేకరణను వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి వినతులున్నాయి. ఈ పరిస్థితి రెవెన్యూ విభాగంలోని పనితీరు, సమస్యల పరిష్కార వేగంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్ని శాఖలు ఈపీటీఎస్ పద్ధతిలో తమ రికార్డులు, ప్రొసీడింగ్స్, సర్క్యులర్లు, కోర్టు తీర్పులు, నోటీఫికేషన్లు, ప్రగతి సమాచారం వంటివి ప్రతిరోజూ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వినతులు కూడా గణనీయంగా ఉన్నాయని, గ్రామ సచివాలయ శాఖకు 53, డీఆర్డీఏకు 48, పంచాయితీరాజ్కు 25 వినతులు అందాయి. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చిన కాల్స్పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయం రిపోర్టులో నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వినతులు స్వీకరణ ప్రక్రియలో డీఆర్ఓ ఈ.మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, శాంతి, ఆర్డీఓలు దాట్ల కీర్తి, సత్యవాణి, రామ్మోహనరావు, సీసీఓ పీ.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్జీదారులు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు పెండింగ్లో ఉండకూడదని, గడువు ముగియక ముందే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఒకవేళ వినతులను తిరస్కరించాల్సి వస్తే, అందుకు గల సరైన కారణాలను బాధితులకు లిఖితపూర్వక సమాచారం ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 143 దరఖాస్తులు అందగా, అందులో 91 రెవెన్యూ విభాగానికి చెందినవి కాగా, 52 సాధారణ దరఖాస్తులు ఉన్నాయి. వీరఘట్టం మండలం కూరాకుల వీధి అంగనన్వాడీ కేంద్రంలో విధులకు ఆటంకం, మెనూ అమలులో వైఫల్యంపై బాలింతలు ఫిర్యాదు చేయగా..కురుపాం గ్రీన్ అంబాసిడర్లు తమ 11 నెలల బకాయి వేతనాల కోసం విన్నవించుకున్నారు. ఉపాధి అవకాశాలు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, లోన్ల మంజూరుతో పాటు తోటపల్లి బ్యారేజీ నిర్వాసితుల నష్టపరిహారం, భూ ఆక్రమణలు, రీ–సర్వేలో తప్పుల సవరణపై పలువురు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాధితులకు భరోసా..సమస్యలకు పరిష్కారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ బాధితులకు కొండంత అండగా నిలిచింది. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, వేధింపులు, అలాగే ఆన్లైన్ మోసాలకు సంబంధించి మొత్తం 16 ఫిర్యాదులు అందాయి. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల పూర్వాపరాలను ఆరా తీసి, బాధితులకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ గోడును నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు వివరించేందుకు ఈ వేదిక ఒక చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు. -
36 తులాల బంగారం చోరీ
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో ఆదివారం పట్టపగలే బంగారం అపహరించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకటరమణ, ముత్యాలమ్మలు ఉదయం పొలంలో పెసర మొక్కలు తీయడానికి వెళ్లారు. 11గంటల సమయంలో వెంకటరమణ కళ్లంలో అవును శాలలో కట్టడానికి వచ్చి కళ్లం పక్కనే ఉన్న తన ఇంటికి దాహం తీర్చుకోవడానికి వెళ్లేసరికి ఇంటి తలుపులు తీసి ఉండడంతో అవాకై ్క ఇంట్లోకి వెళ్లి చూడగా తన గోడబీరువా (కప్బోర్డు) పగులగొట్టి అందులో ఉన్న బంగారం దోచుకున్నట్లు గుర్తించి. భార్యకు కబురుపెట్టగా ముత్యాలమ్మ ఇంటికి వచ్చి లబోదిబోమంది. బీరువాలో పెట్టిన నెక్లెస్, చైన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్, చెవులరింగులు, ఎత్తుగొలుసు, నల్లపూసలు, హారంతోపాటు బంగారం కడ్డీ (సుమారు 3 తులాలు) కాసులు 1 తులంతోపాటు మొత్తం 36 తులాలు దుండగులు దోచుకున్నారు. బాధితులు ఈ విషయమై వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో ఆయన సంఘటానాస్థలానికి చేరుకుని బాధితులనుంచి వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్కు సమాచారం అందించగా వారు వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. -
వ్యవసాయానికి నిధులు
వ్యవసాయరంగానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అన్నదాత–సుఖీభవ పథకం ద్వారా కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేంద్రం ఇచ్చిన పెట్టుబడి సాయం నిధులే రైతుకు దిక్కవుతున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయింపు ఉండడం వల్ల మరోసారి కేంద్ర సాయమే రైతును ఆదుకోనుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి రూ.155.32 కోట్లు కేటాయించారు. జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం వంటి ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. నిధులు విడుదలైతే మరింత సాగుకు ఊతమిచ్చినట్లవుతుంది. జీడిపప్పు ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. జిల్లాలోని సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో జీడి చెట్ల పెంపకంపైనే గిరిజన రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. సరైన ప్రోత్సాహకం, మద్దతు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. జీడి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కలగానే మిగులుతోంది. -
నేరడిలోకి ఏనుగులు
భామిని: మండలంలో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి భామిని మండలం నేరడి–బి లోకి ఏనుగులు ప్రవేశించి అల్లకల్లోలం నృష్టించాయి. ఏనుగుల తాకిడితో పాడి పశువులు పరుగులు తీశాయి. కళ్లాల్లోని కోత యంత్రాలు, ట్రాక్టర్లపై ఏనుగులు దాడి చేస్తాయని భయపడి రాత్రికి రాత్రి బయటకు తీసుకువచ్చారు. ఆదివారం పగలంతా బిల్లుమడ–నేరడి గ్రామాల మధ్య పొలాల్లో ఏనుగులు తచ్చాడాయి. కానీ అటవిశాఖాధికారుల జాడ లేకుండా పోయింది. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయొద్దు పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు, ముట్టడి వంటి కార్యక్రమాలు చేయకూడదని స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా, శాంతికి విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, ద్వేషపూరిత సందేశాలపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనల్లో పాల్గొన్నా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించి, జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం
విజయనగరం టౌన్: తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని ఆ శాఖ ఆలిండియా జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి శివాజీ అన్నారు. నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్, ఎంటీఎస్, గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ల ఆధ్వర్యంలో స్థానిక జగన్నాథం కన్వెన్షన్ హాల్లో 31వ ద్వైవార్షిక మహాసభ ఆదివారం నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో చోటుచేసుకున్న మార్పులు, ఉనికి, ఉద్యోగుల సమస్యలు రానున్న రోజుల్లో డిపార్ట్మెంట్లో ఉద్యోగుల స్థితిగతులు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, జీడీఎస్ వేతన సంఘం, ప్రమోషన్లు, 8వ వేతన సంఘానికి సమర్పించిన ప్రతిపాదనలపై పోరాటం చేస్తామన్నారు. అందుకు ఉద్యోగులు చేయాల్సిన విధివిధానాలను వివరించారు. కార్యక్రమంలో సర్కిల్ సెక్రటరీ సీహెచ్ లక్ష్మీనారాయణ, యూనియన్ల డివిజనల్ అధ్యక్షులు వి.కిరణ్కుమార్, ఎస్.రమేష్, పి.ఆర్.నాయుడు, కార్యదర్శులు ఎస్.సంతోష్కుమార్, పి.సూరిబాబు, ఎన్.పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
15 నుంచి గ్రామీణ యూత్ ఫెస్టివల్
సీతంపేట: ఈనెల 15 నుంచి 19 వరకు సీతంపేట మండలంలోని సీదిగ్రామంలో మీటదుర్గ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలో గ్రామీణ యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మన్యం ప్రగతి సంస్థ చైర్మన్ గేదెల రవి తెలిపారు. ఈ మేరకు పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. యూత్ ఫెస్టివల్లో వాలీబాల్, షటిల్, చెస్, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. పోటీల్లో విజేతలకు ఆకర్షణీయమైన నగదు పురస్కారాలు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9866181612, 7075689035, 7093440359 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మన్యం ప్రగతి సంస్థ కార్యదర్శి గేదెల జనార్దనరావు, మీనక ఉమామహేశ్వరరావు, గేదెల వినయ్, మూటక శశికర్, నిమ్మక సాయి, ఆరిక కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీ కోసం వెబ్ సైట్లో అర్జీల నమోదు పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సెల్లార్లో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేశామని చెప్పారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులను విద్యేతర పనుల నుంచి పూర్తిగా తప్పించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల భానుమూర్తి డిమాండ్ చేశారు. స్థానిక ఏపీ ఎన్జీఓ భవనంలో ఆదివారం జరిగిన జిల్లా శాఖ విస్తృత కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులపై అనవసర భారం మోపడం వల్ల విద్యాబోధన దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి దవళి సరస్వతి మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ఉన్న ఒత్తిడిని తగ్గించి విద్యాబోధనకు తగిన సమయం కల్పించాలని ఉపా ధ్యాయులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో జి ల్లా అధ్యక్షులుగా మజ్జి మదన్మోహన్, ప్రధా న కార్యదర్శిగా పాల్తేరు శ్రీనివాస్ ఎన్నికై నట్టు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా లంక రామకృష్ణ, వై.సీతంనాయుడు, కేవీఏ సత్యనారాయణ, ఎన్.శ్రీనివాసరాజు, బొత్స పద్మావతి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా మర్రాపు శ్రీనివాసరావు, వై.భాస్కరరావు, దాసరి మహేష్, శెట్టి శివరావు, బి.త్రినాధ్, కె.నాగమణి, కె.సింహాచ లం ఎన్నికై నట్టు తెలిపారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా షేక్ బుఖారిబాబు, కర్రి రవి, ఏబీ శ్రీధర్నాయుడు, బి.రాజేశ్వరి ఎన్నికయ్యారు. అనంత రం నూతన కమిటీ సభ్యులు ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలను పురష్కరించుకుని చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు ఆదివారం వైభవంగా జరిపించారు. వేకువజామున ప్రాతః కాలార్చన పూజలనంతరం ఐదు రోజుల నుంచి జరుగుతున్న హవనాలకు యాగశాలలో పూర్ణాహుతిని కనులపండువగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఊరేగింపుగా భాస్కర పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి శ్రీ చక్ర పెరుమాళ్లకు చక్రస్నానం జరిపించారు. అనంతరం స్వామివారికి బాలభోగం, గ్రామ బలిహరణ నిర్వహించారు. సాయంత్రం ధ్వజా అవరోహణం చేప ట్టి తిరుక్కల్యాణ ఉత్సవాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, దేవస్థాన అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడులను కాపాడుకుందాం
● ఉత్తరాంధ్ర వర్క్షాప్లో యూటీఎఫ్ పిలుపు విజయనగరం అర్బన్: ప్రభుత్వ బడులను కాపాడుకుందామని యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల నాయకత్వంతో స్థానిక ఏపీఎన్జీఓ కార్యాలయంలోలో ‘ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం’ అనే అంశంపై ఆదివారం నిర్వహించిన వర్క్షాప్లో పలువురు పేర్కొన్నారు. వర్క్షాప్ను ప్రారంభించిన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ఊరిబడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులను రక్షించుకోవడం కోసం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు, ప్రజల సహకారం తప్పనిసరి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించేందుకు ముందుకు రావాలని ఆ దిశగా యూటీఎఫ్ ఉద్యమం చేయల్సిన అవసరం ఉందన్నారు. విద్య లక్ష్యం సమాజంలోని వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు సుభవంతమైన జీవితం అందించడమేనన్నారు. సమాజంలో ఇంకా ఉన్న అంటరానితనం, అసమానతలను తొలగించి సమానత్వ భావనను పెంపొందించడమే విద్య ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రశ్నలు లేని, పరిశోధనలేని విద్యా విధానం అమలవుతుండడం ఆందోళనకరమని, దీనికి ప్రత్యామ్నాయంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విద్యా విధానం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులపై బాధ్యత ప్రభుత్వ వ్యయంతో విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయులుగా మారిన మనం అదే సమాజం కోసం పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. పిల్లలు లేకుండా ఉపాధ్యాయ వృత్తి ఉండదని విద్యార్థులే కేంద్రంగా అన్ని కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ వర్క్షాప్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై ఆరు జిల్లాల నాయకత్వం చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. అనంతరం ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు ఎస్.కిషోర్కుమార్, ఎస్.మురళీమోహన్, వి.శ్రీలక్ష్మి, సీనియర్ నాయకులు డి.రాము, నాగమణి, చౌదరి రవీంద్రతో పాటు ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల యూటీఎఫ్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!
● నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్ల వల ● ఉమ్మడి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ నియామకాల మాయాజాలం ● గతేడాది 15 కేసులు నమోదు పార్వతీపురం రూరల్: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను ఎరగా వేసి సైబర్ నేరగాళ్లు సరికొత్త మాయాజాలానికి తెరలేపారు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుడి నుంచి, ఉన్నత చదువులు చదివి కొలువు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న యువత వరకు అందరినీ ఈ ’డిజిటల్ దగా’ నిలువునా ముంచేస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రస్తుతం ఈ సైబర్ మోసాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అడ్డదారుల్లో సొమ్ము చేసుకునే ముఠాలు సోషల్ మీడియా వేదికగా మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. కలల కొలువు..కన్నీళ్ల బతుకు కురుపాం మండలానికి చెందిన ఓ యువకుడి కథ వింటే సైబర్ నేరగాళ్ల బరితెగింపు అర్థమవుతుంది. సూపర్వైజర్ ఉద్యోగమంటూ నమ్మబలికిన ఓ మోసగాడు, ఏకంగా లక్ష రూపాయలతో పాటు పదో తరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లను గుంజేసుకున్నాడు. తీరా ఉద్యోగం ఏదని నిలదీస్తే..ఎదురు తిరిగి పోలీసు కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఇది ఒక్క కురుపాం బాధితుడి వ్యధే కాదు, విజయనగరం జిల్లాకు చెందిన మరో ముగ్గురు యువకుల పరిస్థితి మరీ దారుణం. ఇన్స్ట్రాగామ్ ప్రకటన చూసి మురిసిపోయిన వారిని మయన్మార్ దాటించి, అక్కడ బందీలుగా మార్చి, చిత్రహింసలు పెట్టి బలవంతంగా సైబర్ నేరాలు చేయించడం సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో వారు ఎలాగోలా స్వదేశం చేరడంతో ఆ ముఠా క్రూరత్వం వెలుగులోకి వచ్చింది. వర్క్ ఫ్రం హోమంటూ వంచన ‘ఇంటి నుంచే పని..హోటళ్లకు రేటింగ్ ఇస్తే చాలు కమీషన్ల వర్షం‘ అంటూ వచ్చే ప్రకటనలు నిరుద్యోగులను ఉచ్చులోకి లాగుతున్నాయి. విజయనగరం గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి తొలుత రూ.5 వేలు ఇచ్చి ఎర వేసిన నేరగాళ్లు, క్రమక్రమంగా అతడి నుంచి రూ.1.82 లక్షలు కాజేయడం గమనార్హం. లాభాలు ఆశ చూపడం, ఆపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టించి చేతులు ఎత్తేయడం వారి నైజం. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ ద్వారా సంప్రదించి, నకిలీ యాప్ లింకులు పంపి సెల్ ఫోన్లలోని రహస్య సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. రాష్ట్రాలు దాటిస్తున్న రాక్షస వ్యూహం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి యువతను జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ రహస్య స్థావరాల్లో వారిని ఉంచి, స్థానిక భాషలు తెలిసిన వారితోనే ఇతరులకు ఫోన్ చేయించి బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ ఖాతాల ద్వారా నగదు మళ్లింపులు, ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మహిళలను మోసగించడం ఇప్పుడు నిత్యకృత్యమైంది. కేవలం ఉద్యోగాలే కాకుండా, ఆస్తి పత్రాలు తాకట్టు పెడితే రుణాలు ఇస్తామని, పార్సిల్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలంటూ ఓటీపీలు అడిగి ఖాతాలు ఖాళీ చేసే ’కొరియర్ మోసాలు’ కూడా పెచ్చుమీరుతున్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లాలోనే ఉద్యోగాల పేరిట 15 ప్రధాన కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం బయటపడిన గణాంకాలు మాత్రమే. పరువు పోతుందనో, భయపడో ఫిర్యాదు చేయని బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల ఆవేదనను నగదుగా మార్చుకుంటున్న ఈ సైబర్ రాబందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు సర్టిఫికెట్లు, నగదు, ఓటీపీలు ఇచ్చి ’బలి’ కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.Fake JOB Offersనకిలీ యాప్లు, మాయా లింకులతో మీ బ్యాంకు ఖాతాలనే కాకుండా, మీ వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్న సైబర్ నయవంచకుల పట్ల అవగాహనపరమైన జాగ్రత్తలతో ఉండాలి. తెలియని వ్యక్తులకు ఓటీపీలు వంటివి చెప్పకూడదు . ఏదైనా అనుమానం వస్తే వెనుకాడకుండా వెంటనే 1930కు సమాచారం అందించండి. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి, పార్వతీపురం మన్యంజాగ్రత్తగా ఉండాలి -
దౌర్జన్య పాలనకు స్వస్తి పలకాలి..
జియ్యమ్మవలస రూరల్: తిరుపతి శ్రీనివాసునితో ఆడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు పార్టీ కార్యాలయం విధ్వంసాలకు పాల్పడ్డ చర్యలకు నిరసనగా ఆదివారం చినమేరంగి పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించేందుకు ప్రయత్నించగా చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో జియ్యమ్మవలస, చినమేరంగి ఎస్సై, పోలీసు సిబ్బందితో ముట్టడించి నిరసన కార్యక్రమాన్ని కనీసం గ్రామంలోకి రాకుండా నిర్బంధించారు. ఈ సందర్భంగా పరీక్షిత్ రాజు మాట్లాడుతూ..తిరుపతి లడ్డూ అంశంపై కోర్టు తీర్పు ఇచ్చినా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయకుండా వైఎస్సార్సీపీపై ఈ పాపాన్ని అపాదించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండగా అంబటి రాంబాబు దీన్ని వ్యతిరేకించినందుకు ఆయనపై టీడీపీ మహిళా కార్యకర్తలతో దుర్భాషలాడించి పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి రాక్షస పాలన చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను అక్రమ అరెస్టులు చేసి ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసనలు తెలిపి చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
రాష్ట్రంలో జంగిల్ రాజా పరిపాలన
● మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరసాలూరు రూరల్: రాష్ట్రంలో జంగిల్ రాజా పరిపాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అనివార్యమయ్యే పరిస్థితి అవసరం ఉంది. రాష్ట్రంలోని పరిస్థితులపై రాష్ట్రపతికి గవర్నర్ తెలియజేయాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆయన కుటుంబంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడి హత్యాయత్నానికి పాల్పడే విధంగా ఉందని దీనిపై పోలీసులు స్పందించిన తీరు దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్లు చెబితే పోలీసులు కేసులు కట్టేస్తారా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వీడియోలు స్పష్టంగా ఉన్నప్పటికీ నిందితులపై పోలీసులు కనీసం ఒక్క కేసుకూడా నమోదు చేయలేదన్నారు. స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఆవేశంలో కొన్ని మాటలు దొర్లుతాయని అలాంటి సందర్భాల్లో సరిచేసుకున్నప్పుడు ఆ మాటలను వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. అలా అయితే గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి ని అన్న మాటలకు ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు. రాష్టంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు లోకేష్ రాజ్యాంగం నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రూ.450 కోట్లతో 15 రైల్వేస్టేషన్ల అభివృద్ధి
● పర్లాకిమిడి రైల్వేస్టేషన్ త్వరలో ప్రారంభం ● వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్బోహ్రాకొత్తవలస: అమృత్భారత్ పథకంలో భాగంగా వాల్తేరు డివిజన్లో రూ.450 కోట్లతో 15 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించనున్నట్లు డీఆర్ఎం లలిత్బోహ్రా తెలిపారు. ఈ మేరకు కొత్తవలస రైల్వేస్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న అమృత్భారత్ పనులు, రైల్వేట్రాక్ వెల్డింగ్ పనులను ఆయన రైల్వే అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నిర్వహణపై అధికారులకు తగు చూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్భారత్ పథకంలో పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేసిన పర్లాకిమిడి రైల్వేస్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మార్చి నెలాఖరుకు మరో నాలుగు స్టేషన్లు, జూన్ చివరి నాటికి కొత్తవలస రైల్వేస్టేషన్లో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే 2047 నాటికి దేశంలోనే పూర్తిస్థాయిలో వందేభారత్ రైళ్లు నడిపేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
రీ సర్వే సవరణలో తప్పని తిప్పలు
విజయనగరం అర్బన్: కూటమి ప్రభుత్వం ‘రీసర్వే 2.0’ కార్యక్రమంగా గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ జిల్లాలో ఆ ప్రక్రియ వైఫల్యం చెందింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ అవుతున్న పట్టాదారు పాస్పుస్తకాల్లోని తప్పులను సవరణ చేయించుకోవడంలో తిప్పలు తప్పడం లేదు. రైతుల పేర్లు, తండ్రుల పేర్లు, సర్వే నంబర్లు, భూవిస్తీర్ణం, ఎల్పీఎంలు ఇలా అన్నీ తప్పులతో కూడిన పాస్పుస్తకాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. నిజానికి ఈ తప్పులు కేవలం క్షేత్రస్థాయి అజాగ్రత్తతో వచ్చినవి కావని ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం క్రమబద్ధమైన నిర్లక్ష్యం, అసమర్థత, బాధ్యతారాహిత్యం వల్ల జరిగినట్లు తెలుస్తోంది. వాటిలో 50 శాతానికి పైగా వ్యక్తిగత వివరాల్లో అధిక తప్పులున్నాయని అధికారులే ఒప్పుకున్నారు. దీంతో వాటి సవరణ కోసం రైతులు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ముందు గంటల తరబడి నిలబడి, డాక్యుమెంట్లతో తిరుగుతున్నారు. ఇది రీ సర్వే సవరణ కాడు రైతుల జీవితాలపై జరిగిన క్రమబద్ధమైన ద్రోహమని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 2,26,009 మంది రైతులకు పాస్పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 423 గ్రామాల్లో 1,89,343 మందికి మాత్రమే అందజేశారు. ఇంకా 37 వేలు పంపిణీకి పెండింగ్లోనే ఉన్నాయి. సొంతంగా తీసుకున్నవి కేవలం 85,102 మాత్రమే. మిగిలినవి కుటుంబ సభ్యుల ద్వారా అంటే చాలామంది రైతులు ఇంకా తమ పాస్పుస్తకాలు చూడలేదు. చూసినవారు పుస్తకాల్లో ఉన్న తప్పులు గుర్తించి షాక్కు గురవుతున్నారు. తప్పుల సవరణకు జేసీ అనుమతి తప్పులు సరిచేయడానికి ఆరు కేటగిరీలు పెట్టి, తహసీల్దార్ లాగిన్, ఆర్డీవో అనుమతి, జేసీ అప్రూవల్, సచివాలయంలో అర్జీలు, డాక్యుమెంట్ల పరిశీలన ఇలా ప్రతి చోటా బ్యూరోక్రాటిక్ జల్లెడ పెట్టే పరిస్థితులు ఉంటాయి. పాత సర్వే నంబర్లకు కొత్త ఎల్పీఎం కొర్లేషన్ సరిగా జరగలేదు. భూములు అమ్ముకున్నా వారసులు మారినా ఇప్పటికీ ముత్తాతల పేర్లే ఉన్నాయి. ప్రభుత్వ భూముల కేటగిరీలో తప్పలు సరిచేయడానికి జేసీ అనుమతి అవసరమని చెప్పడం ఇది ఎంత పెద్ద అసంబద్ధత? అదే విధంగా మ్యుటేషన్లకు సచివాలయాల్లో అర్జీలు, కరెక్షన్స్కు తహసీల్దార్కు దరఖాస్తు, ఆ తర్వాత ఆర్డీవో దగ్గరకు నెలల తరబడి తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు పంపిణీ చేస్తామని గ్రామసభల్లో ఈ కేవైసీ తీసుకుని ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం. ఎంపిక చేసిన 12 గ్రామాల్లో తప్పులు సరిచేసి ఫిబ్రవరిలో పంపిణీ చేస్తామని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కేవలం 3,896 పాస్పుస్తకాలు మాత్రమే సరిచేశారు. మొత్తం 2.26 లక్షల్లో ఇది ఏమాత్రం కాదు. జిల్లా రెవెన్యూ అధికారి ఈ.మురళి చెప్పిన వివరాలు ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో బట్టబయలు చేస్తున్నాయి. ఈ రీసర్వే వైఫల్యం వల్ల రైతులు బ్యాంకు రుణాలు పొందలేక, రాయితీలు రాకుండా భూములు అమ్మలేక, కోర్టు కేసుల్లో చిక్కుకుంటున్నారు. భూమి వివాదాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇది అభివృద్ధి కాదు రైతుల జీవితాలను నాశనం చేసే క్రమబద్దమైన దుర్మార్గం. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు బాధ్యత తీసుకోకపోతే విజయనగరం జిల్లా రైతులు మరింత దారిద్య్రంలోకి జారిపోతారు. ఇవి కేవలం తప్పులుకాదు తమ పట్ల జరిగిన ద్రోహంగా రైతులు భావిస్తున్నారు. -
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కేంద్ర బడ్జెట్ 2026–27 అంకెల గారడీతో వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లింది. ఆకాశాన్ని తాకుతున్న ధరల వేళ.. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు లేకపోవడం కొండంత ఆశకు గోరంత ఊరట లభించిన చందంగా ఉంది. ఎనిమిదివ వేతన సంఘం ఊసే లేకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. మన్యం వంటి వెనుకబడిన ప్రాంతాల్లోని గిరిజన పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు లేకపోవడం అక్షరానికి అన్యాయం చేయడమే. – బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బడ్జెట్లో సామాన్యులకు సంతోషం కనిపించడం లేదు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆదాయ పన్ను శ్లాబ్లో మార్పు లేకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రమైన ఏపీకి.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యం కూడా లేదు. జిల్లాకు పూర్తిగా కేటాయింపులు లేకపోవడం బాధాకరం. – వంగల దాలినాయుడు, డీసీసీ అధ్యక్షుడు సాక్షి, పార్వతీపురం మన్యం: వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో జిల్లాకు పెద్దగా ఒనగూరింది ఏమీ లేదు. ప్రత్యేకించి కేటాయింపులు లేకపోవడం అన్ని వర్గాల వారికి నిరాశ కలిగించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన బడ్జెట్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధి, గిరిజన విద్యాసంస్థల ప్రకటన లేకపోవడం జిల్లావాసులను నిరుత్సాహానికి గురిచేసింది. – పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు విద్యాపరంగా కీలకమైన గిరిజన యూనివర్సిటీకి గతంలో కూడా నిధులు కేటాయించారు. ఈ సారి ప్రస్తావన లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన విశ్వవిద్యాలయం పనులు జోరందుకున్నాయి. మెంటాడ–దత్తిరాజేరు మండలాల పరిధిలో సుమారు 550 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ భవనం పనులు ప్రారంభమైనప్పటికీ.. నిధుల లేమి కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 228 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. విజయనగరం సమీపంలోని తాత్కాలిక భవనంలోనే వారికి తరగతులు కొనసాగుతున్నాయి. ఈ బడ్జెట్లోనూ నిధులు లేకపోవడం నిర్మాణ పురోగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. వెనుకబడిన పార్వతీపురం మన్యం జిల్లాకు, ఇక్కడి గిరిజనుల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థల ప్రకటన ఏమీ లేకపోవడం నిరాశ కలిగించేదే. ప్రతి జిల్లాలో బాలికల వసతిగృహం ఏర్పాటు చేస్తామనడం విద్యార్థినులకు కాస్త ఊరటనిచ్చిన అంశం. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో ఆరుగురు అరెస్టు
టెక్కలి రూరల్: ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీకి పాల్పడిన ఆరుగురిని కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం కోటబొమ్మాళి పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం.రాము, మారేడుపాలెం గ్రామానికి చెందిన ఎం.నాగరాజు, పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన ఎన్.మోహన్రావు, పి.శ్రీను, ఎం.శ్రీనివాస్, ఎన్.రఘుబాబులు స్నేహితులు. వీరంతా మద్యానికి బానిసయ్యారు. ఎం.రాము తనకు ఎలక్ట్రికల్ వర్క్ తెలుసని, ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లు చోరీ చేసి అమ్మితే బాగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో అందరూ కలిసి చోరీ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 2023 నుంచి లావేరు, జలుమూరు, టెక్కలి, నందిగాం, ఎచ్చెర్ల, కవిటి, జె.ఆర్.పురం, మందస, పాతపట్నం, కోటబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల్లో శివారున ఉన్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యం చేసుకున్నారు. పక్కా ప్లాన్తో రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడే వారు. దీనిలో భాగంగా ఆదివారం సైతం ట్రాన్స్ఫార్మర్ల కోసం రెక్కీ చేసేందుకు రాగా వారిపై అనుమానంతో కోటబొమ్మాళి పోలీసులు జర్జంగి జంక్షన్ వద్ద పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.8లక్షల15వేల100 విలువైన 607 కేజీల కాపర్ వైర్, 20 కేజీల అల్యూమినియం వైర్లు, ఆటో, బైక్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
● నిరాశ మిగిల్చిన నిర్మలమ్మ పద్దు
● మన్యంలో రైల్వే సమస్యలకు పరిష్కారం చూపుతారని ఆశించిన ప్రజలకు మరోసారి ఉత్తిచేయి చూపారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతులు, ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు ఊసు లేకపోయింది. బడ్జెట్లో కేటాయించిన నిధులతో కొత్త లైన్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందో, లేదో చూడాలి. గుణుపూర్ నుంచి సాలూరు మీదుగా నర్సీపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు ఈసారీ ఎర్రజెండానే పడింది. గుణుపూర్ నుంచి జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాచిపెంట మీదుగా అరకు వెళ్లే రైలు రోడ్డు వేయాలని ఎప్పటినుంచో కోరుతున్నా ప్రయోజనం లేకపోయింది. సాలూరు–విశాఖ ప్రత్యేక రైలు ఆశలు కూడా నీరుగారిపోయాయి. పార్వతీపురం పట్టణ రైల్వేస్టేషన్(కొత్తవలస) ఆధునికీకరణకు హామీ లభించలేదు. బెలగాం, కొమరాడ ప్రాంతాల్లోని రైల్వే గేటుల వద్ద నిత్యం ట్రాఫిక్తో ఇబ్బంది ఎదురవుతోంది. ఇక్కడ ఆర్ఓబీలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి డిమాండ్ ఈసారి నెరవేరేలా లేదు.● జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం కరువైంది. గతంలో ఏఐబీపీ స్కీమ్ కింద తోటపల్లి ప్రాజెక్టుకు సుమారు రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆ తరహా గ్రాంట్ను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల తోటపల్లి, జంఝావతి వంటి ప్రాజెక్టులకు కేంద్రం తరఫున ఒక్క రూపాయి కూడా అందని పరిస్థితి. ఇటు కేంద్రం పట్టించుకోకపోవడం.. అటు రాష్ట్రంలోనూ చంద్రబాబు ప్రభుత్వం కూడా దృష్టి సారించకపోవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయి. ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన స్పెషల్ ప్యాకేజీ ఊసు లేదు. దీనివల్ల వెనుకబడిన గిరిజన ప్రాంతమైన మన్యం జిల్లాకు రిక్తహస్తమే మిగులుతోంది. జిల్లాలో జాతీయ రహదారి పరిధి తక్కువ. కేవలం రాజాపులోవ నుంచి విజయనగరం, రామభద్రపురం, సాలూరు మీదుగా జైపూర్ వెళ్లే జాతీయ రహదారిని పూర్తి చేయగలిగారు. అంతర్రాష్ట్ర రహదారి అయినప్పటికీ.. పార్వతీపురం, పాలకొండవైపు జాతీయ రహదారి ప్రకటన లేకపోవడం జిల్లావాసులను నిరాశకు గురి చేసింది. శ్రీకాకుళంలోని చిలకపాలెం జాతీయ రహదారి నుంచి రాజాం, రామభద్రపురం మీదుగా బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లినా బుట్టదాఖలే అయ్యాయి. -
గిరిజనం చీకూచింత
ఆరంభమైన చింతపండు సీజన్ ● కాపుకొచ్చిన చెట్లు ● పెరగని దిగుబడులు ● జీసీసీ మద్దతు ధర రూ.36కాపు కాయక, దిగుబడి రాక, మద్దతు ధర లేక, దళారులకు అమ్ముకోలేక గిరిజనం తీరని వేదన అనుభవిస్తున్నారు. ఏటా ప్రకృతి ఫలసాయాలను సేకరించి మార్కెట్కు తీసుకువచ్చి విక్రయించి జీవనం సాగించే గిరిజనులను వారి ఫలసాయాలకు వచ్చే దిగుబడులు ఉసూరుమనిపిస్తున్నాయి. ఈ ఏడాది చింతపండు సీజన్ ఆరంభమైంది. దిగుబడి తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఏజెన్సీ గిరిజనం ఆందోళన చెందుతున్నారు.సీతంపేట: మన్యం జిల్లా చింతపండు మార్కెట్లోకి త్వరలో రానుంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చింతకాయలు అరకొరగా పక్వానికి వచ్చాయని గిరిజనులు తెలిపారు. ధరలు పెరిగినా చింతపండు దిగుబడి లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి చింతపండు దిగుబడి అవుతుంది. గిరిజనులు కొండకోనల్లో ఉన్న చెట్లు ఎక్కి చింతపండు బొట్లను సేకరించి కిందికి దించి వలిచి వాటిని సంతలకు కావిళ్లలో తీసుకువచ్చి విక్రయిస్తారు. గడిచిన మూడేళ్లుగా చింత చెట్ల కాపు పెద్దగా లేకపోవడం, చింతపంట ధరలు పడి పోవడంతో సరైన ఆదాయమార్గాలు గిరిజనులకు లేవు. గతేడాది కొన్ని చోట్ల పండిన చింతపండును కావిళ్ల వంతున రూ.1800 వరకు విక్రయించారు. కావిడలో దాదాపు 25 నుంచి 30 కిలోల చింత పండు ఉంటుంది. అంటే కిలో సరాసరి రూ.80 వరకు ధర పలికింది. ఏజెన్సీలో సుమారు 30 వేల వరకు చింత చెట్లు ఉంటాయి. వావీటిలో సగానికి పైగా చెట్లు కాయని పరిస్థితి ఉంది. ప్రతి ఏటా 50 టన్నుల వరకు ఉత్పత్తి అయ్యేది. గడిచిన రెండేళ్లుగా పదిటన్నుల లోపే దిగుబడి వస్తోంది. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని అంచనా. ప్రస్తుతం కావిడ రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. జీసీసీ కిలో రూ.36 మద్దతు ధర.. గిరిజన సహకార సంస్థ ప్రతి ఏటా ఈ సీజన్లో మద్దతు ధరలు ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కిలో చింతపండు రూ.36గా ప్రకటించింది. గతసంవత్సరం రూ.34.20 పైసలు ఉండగా ఈసంవత్సరం రెండు రూపాయలు పెంచి కొనుగోలుకు సన్నద్ధమవుతోంది. మన్యంలో దొరికే చింతపండును సేకరించి గ్రేడింగ్ చేసి ప్యాకెట్ల రూపంలో తయారు చేసి కిలోల వంతున మార్కెట్లో జీసీసీ విక్రయిస్తుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతి గృహాలకు ఈ చింతపండును సరఫరా చేస్తుంది. కాగా జీసీసీ మద్దతు ధరలు తక్కువగా ఉన్నాయంటూ మైదాన ప్రాంతాల వ్యాపారులకు గిరిజనులు చింతపండు విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి చింతపండు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది గ్రామాల్లో అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేసిన పరిస్థితులున్నాయి. ఈ ఏడాది కూడా దిగుబడి తగ్గినప్పటికీ అరకొరగా చింతపండును మైదాన వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. మార్కెట్లోకి మంచి నాణ్యత గల చింతపండు తీసుకువస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంతల్లో కాటాలు ప్రతివారం వేస్తాం. మహాశివరాత్రి తరువాత మార్కెట్కు చింతపండు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమ సంస్థకూడా ఈ ఏడాది మద్దతు ధరలు పెంచింది. ఆ ప్రకారం కొనుగోలు చేయనున్నాం. –దాసరి కృష్ణ, జీసీసీ మేనేజర్, సీతంపేట చింతపండు దిగుబడి తగ్గింది. ధరలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో ఎక్కువగా చింతపండును మార్కెట్లో విక్రయించే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. చింతచెట్లు ముదిరిపోయి పాడయ్యాయి. ఎక్కడో ఉంటే మాకు ఏడాది పొడవునా సొంతానికి వాడుకోవడానికి సరిపోతాయి. ఒక వేళ మిగిలితే విక్రయిస్తాం. –ఎస్.షోడంగ, చింతాడ -
ఘనంగా శ్రీ చక్రతీర్థ స్నానం
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీపద్మావతి, భూదేవి సహిత స్వామివారికి శ్రీచక్రతీర్థస్నానం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉదయం సుప్రభాతసేవ, మంగళాశాసనం, విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కలశారాధన, చూర్ణోక్రతం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి నాగావళి నదీ తీరం వరకు స్వామివారి ఉత్సవ మూర్తులకు తిరువీధి నిర్వహించారు. పిమ్మట నాగావళినదీ తీరంలో చూర్ణంతో అమ్మవారికి, స్వామివారికి సంప్రోక్షణ తదితర పూజలను నిర్వహించారు. అలాగే పవిత్ర నాగావళినదిలో స్వామివారికి భక్తులు పంచామృతాభిషేకం, గంధాభిషేకం, సుగంధద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామికి విశేషపూజలు చేసిన అనంతరం భక్తులు నాగావళినదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు వీవీ అప్పలాచార్యులు మాట్లాడుతూ లోక శాంతికోసం నదుల్లో, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించాలన్నారు. స్వామివారికి కల్యాణం, అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు నదుల్లో స్నానమాచరిస్తే వెయ్యి నదుల్లో స్నానం చేసిన పుణ్యం సిద్ధిస్తుందన్నారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, టీటీడీఎస్ సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కనికరమాత యాత్ర
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● ముగిసిన నవీనా ప్రార్థనలు కొత్తవలస: మండలంలోని కొండడాబాల వద్ద ఉన్న వ్యాకులమాత యాత్ర మహోత్సవం ఆదివారం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయానికి 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏటా ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం నిర్వహించే ఈ యాత్రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ చర్చిలో 1914వ సంవత్సరంలో ఫారిస్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించిన వ్యాకులమాత ప్రతిమను కుల మతాలకు అతీతంగా ఆరాధించడం ఇక్కడ ప్రత్యేకత. ముగిసిన ప్రార్థనలు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కొండపై గడిచిన తొమ్మిది రోజులుగా ఫాదర్ గొంగాడ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రార్థనలు శనివారం రాత్రి ముగిశాయి. కనికరమాతను ప్రత్యేక పల్లకిలో ఉంచి క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. విశాఖపట్నంలోని జ్ఞానాపురం అతిమేత్రాణులు డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ఆధ్వర్యంలో పలువురు విచారణ కర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు యాత్రకు వేలాది మంది తరలి రావడంతో ఎటువంటి లవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో సీఐ సీహెచ్.షణ్ముఖరావు పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. అలాగే భక్తుల రాకపోకలకు సింహాచలం, మద్దిలపాలెం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యే సర్వీసులు నడిపారు. -
కన్నీటి వేళ.. కారుణ్య హస్తం
పార్వతీపురం రూరల్ : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు అసువులు బాసిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి భరోసానిచ్చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన సాలూరు హెడ్ కానిస్టేబుల్ డి.ఆనందరావు, రోడ్డు ప్రమాదంలో మరణించిన వీరఘట్టం కానిస్టేబుల్ పి.రవి కుటుంబాలకు విడో ఫండ్, ఫ్లాగ్ ఫండ్ కింద మంజూరైన రూ.75,000 (ఒక్కొక్కరికి) చొప్పున చెక్కులను మృతుల భార్యలు అనిత, లలితలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కష్టకాలంలో పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని, అధైర్యపడకుండా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. మృతుల కుటుంబాలకు అందాల్సిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి కృషి
విజయనగరం టౌన్: దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లోని ఉప పథకం కింద అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన పథకం అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీలో ఉన్న కార్యాలయం ఆవరణలో లబ్దిదారులకు, సంఘ ప్రతినిధులకు దీనిపై శనివారం అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడం, ఎస్హెచ్జీ సభ్యులు తమ ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు తరలించడానికి సహాయపడటం పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రజా సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. సెర్ప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరెడ్డి, భాస్కరరావు, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు మాధవి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన డీపీఎంలు, ఏపీఎంలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ‘ఏకలవ్య’లో విద్యార్థుల మధ్య ఘర్షణ గుమ్మలక్ష్మీపురం: స్థానిక ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ విద్యార్థి తలకు తీవ్రమైన గాయమైంది. పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ధనుష్ కార్తీక్ను అదే తరగతికి చెందిన మరో విద్యార్థి మణికంఠ గాయపరిచాడు. పాఠశాల ఉపాధ్యాయులు, ఎల్విన్పేట పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం ముందస్తుగానే తరగతి గదిలోకి వెళ్లిన వీరిద్దరు క్రికెట్ బంతి కోసం వాదులాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు పుస్తకాలు విసురుకున్నారు. ఆగ్రహించిన మణికంఠ తన దగ్గరున్న అట్టను విసిరేయడంతో ధనుష్కార్తీక్ తలకు గాయమైంది. సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి కార్తీక్ను తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా వారం కిందట ఇదే పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి కూర్చునే చోట మరో విద్యార్థి పెన్ను పెట్టడంతో ప్రైవేటు భాగంలో గుచ్చుకొని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఏటా 960 మంది మృతి
● బాధిత కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం : కలెక్టర్ విజయనగరం అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా సగటున 960 మంది ప్రాణాలు కోల్పోతున్నారని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే అతని జీవితం అక్కడితో ముగిసిపోతుందని కానీ ఆ కుటుంబం ఎదుర్కొనే ఆవేదనను జీవితాంతం భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, భార్యా పిల్లలు పడే బాధ మాటల్లో చెప్పలేనిదన్నారు. కలెక్టరేట్లో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రి పాలైనప్పుడు అయ్యే వైద్య ఖర్చులు ఆయా కుటుంబాలపై తీరని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతుండగా ప్రమాదాల్లో మరణించిన వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని ఉద్దాటించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి తన కుటుంబాన్నే ప్రమాదంలోకి నెట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు ఒక వారం లేదా ఒక నెలతో ముగిసేవి కాదని, ఇది నిరంతర ప్రక్రియ కావాలన్నారు. జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు రవాణా, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని గోల్టెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5 వేలు నగదు పారితోషికం అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రహదారి భద్రతా మాసోత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన రోడ్ సేఫ్టీ ఎన్డీఓ అధ్యక్షులు మజ్జి అప్పారావు, డాక్టర్ సాయికుమార్లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందించారు. వివిధ పాఠశాలల్లో రోడ్డు భద్రతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలు పద్మిక, మురళీచరణ్, హేమతేజ, సాయి, హర్హవర్ధన్లకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలను సక్రమంగా నడుపుతున్న కలెక్టర్ డ్రైవర్ కృష్ణ, ఎస్పీ డ్రైవర్ ఆనందరావు, వివిధ శాఖల జిల్లా అధికారుల డ్రైవర్లు ప్రతాప్ వర్మ, సాయి, నరేంద్ర ఆలీలను అభినందించారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ మణికుమార్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రహదారుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కాంతిమణి, అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాలల విద్యార్ధులు పాల్గొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం
విజయనగరం టౌన్: స్థానిక బాబామెట్టలో ఉన్న హజరత్ ఖాదర్వలీబాబా 67వ సుగంధ మహోత్సవాలు మూడో రోజు శనివారం అంగరంగ వైభవంగా ముగిశాయి. కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు. దర్గా, దర్బార్ ముతవల్లి డాక్టర్ ఖలీలుల్లా షరీప్ దర్బార్ సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఉరుసు సందర్భంగా బాబా సన్నిధిలో ఏర్పాటు చేసిన పరమ పవిత్ర అన్న సమారాధనను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబా సన్నిధిలో నిత్య అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆకలితో వచ్చే వారికి ఇక్కడ నిరంతరం భోజనం లభించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇటువంటి ఉత్సవాలు సమాజంలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో దర్గా ముతవల్లి డాక్టర్ ఖలీల్బాబు, గుర్ల మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సన్యాసినాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైహింద్కుమార్, దర్గా కమిటీ సభ్యులు, వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
డైరీల ఆవిష్కరణ
విజయనగరం ఫోర్ట్: కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం 2026 డైరీని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వ్యవసాయ అధికారులకు తమ విధి నిర్వహణలో ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు కె.ప్రకాష్, సెక్రటరీ మజ్జి శ్యాంసుందర్, సంఘం కోశాధికారి బి.శ్యామ్కుమార్, వ్యవసాయ అధికారులు సుధ, మాధవి పాల్గొన్నారు. డైరీని ఆవిష్కరించిన కమాండెంట్ రవిశంకర్రెడ్డి డెంకాడ: రాష్ట్ర పోలీస్ అసోషియేషన్ డైరీని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి ఆవిష్కరించారు. బెటాలియన్లోని కమాండెంట్ కార్యాయలంలో శనివారం జరిగిన కార్యక్రమంలో డైరీని ఆయన ఆవిస్కరించారు. కార్యక్రమంలో అడిషినల్ కమాండెంట్ సి.రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు ప్రభాకర్, లక్ష్మీనారాయణ, బాపూజీ, గోపాలకృష్ణ, ఆర్ఐలు రవీంద్ర, గణేష్, రామజోగినాయుడు, శ్రీను, చంద్రశేఖర్, సమర్పణరావు, సుధాకర్బాబు, బెటాలియన్ అసోషియేషన్ అధ్యక్షుడు మిత్తిరెడ్డి అప్పలనాయుడు, ట్రెజరర్ పీవీఆర్ మూర్తి, జాయింట్ సెక్రెటరీ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కొండడాబాల యాత్ర
● జ్ఞానాపురం నుంచి వేలాది మంది భక్తుల పాదయాత్ర ● ముగిసిన నవదిన పూజలుకొత్తవలస: మండలంలోని కొండడాబాల వ్యాకులమాత యాత్ర శనివారం వైభవంగా ప్రారభమైంది. విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రగా కొండడాబాలకు చేరుకున్నారు. కనికరమాతను ప్రత్యేక వాహనంపై అలకంరించి తోడ్కుని వచ్చారు. ఎంతో చరిత్ర గల ఈ యాత్రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటూ ఒడిశా, చత్తీస్ఘడ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. ఆదివారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి యాత్ర ముగుస్తుందని కొండడాబాల విచారణ కర్త గొంగాడ రాజు తెలిపారు. ముగిసిన నవదిన ప్రార్ధనలు వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో గడిచిన తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న నవదిన ప్రార్ధనలు శనివారం రాత్రితో ముగిశాయి. యాత్ర ప్రారంభం కావడంతో కొండడాబాల ప్రాంతం అంతా పోలీస్ల ఆధీనంలోకి తీసుకున్నారు. 147 మంది సిబ్బంది, ఆరుగురు ఎస్ఐలు, ఇద్దరు సీఐలతో స్థానిక సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు ఎక్కడా అంతరాయం లేకుండా తగ జాగ్రత్తలను తీసుకున్నారు. వాహనాల పార్కింగ్ ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. -
ప్రయోగ పరీక్షలకు వేళాయె..
రాజాం సిటీ: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులతో పాటు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో అధికారులు ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్, సైన్స్ అధ్యాపకులను సన్నద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జనరల్ సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రాన్ని ఆర్ఐఓ నేతృత్వంలో డెక్ మెంబర్లు పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఆన్లైన్లో మార్కులు పోస్టింగ్ గత విధానంలో లోపాలను సవరించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులు రాసే పరీక్షలకు సంబంధించి మార్కులను ఆన్లైన్లో పోస్టింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. మార్కులను పరీక్ష అయిన వెంటనే కంప్యూటరీకరించేలా సూచనలు చేశారు. నేటి నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు సీసీ కెమెరా నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో హాజరుకానున్న 19697 మంది విద్యార్థులు 98 కేంద్రాల్లో జనరల్ ప్రయోగ పరీక్షలు -
కురుపాంలో దొంగల హల్చల్
● ఒకే రాత్రి రెండిళ్లలో చోరీ ● మరో ఇంట్లో చోరీకి ప్రయత్నం ● ఉలిక్కిపడిన కురుపాంకురుపాం: కురుపాంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం పోలీస్స్టేషన్ ముందు, భారతీయ స్టేట్ బ్యాంకు ఎదురుగా ఉన్న రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కొత్తకోట మల్లికార్జునరావు ఇంటి ముందు గేటు తీసి ఇంటి సేఫ్టీ గేటు తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన దొంగలు చెక్క తలుపులు తాళం తీయలేకపోయారు. తరువాత మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్న జామి దేవీప్రసాద్ ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి అందులో నగదు, నగలు దోచుకున్నారు. అలాగే ప్యాలెస్రోడ్డులో ఉన్న కందుల శ్రీనివాసరావు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలో నగలన్నీ దోచుకోపోయారు. బాధితులు కురుపాంలో అందుబాటులో లేకపోవడంతో ఎంత విలువైన బంగారు నగలు, వెండి, నగదు దోచుకుపోయిందీ తెలియరాలేదు. కురుపాం ఎస్ఐ పి.నారాయణరావు, ఎల్విన్పేట సీఐ హరి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారంతో కురుపాం చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఆధారాలు సేకరిస్తున్నామని సమగ్ర దర్యాప్తు చేస్తామని సీఐ హరి తెలిపారు. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ మరియు థియరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు డీవీఈఓ ఎస్.తవిటినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 15,370 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలో 98 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్తో పాటు సంబంధిత ప్రాక్టీకల్ ఎగ్జామినర్లను నియమించామని వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించినట్టు తెలిపారు. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 39,037 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. మొదటి సంవత్సరం మొత్తం 19,759 మందిలో జనరల్ 17,421 మంది, ఒకేషనల్ 2,334 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం మొత్తం 19,278 మందిలో జనరల్ 16,811 మంది, ఓకేషనల్ 2,467 మంది ఉన్నారు. ఇందుకోసం జిల్లాలో 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు తావులేకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి నిఘాలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి కమిషనర్గా వ్యవహరించనున్నారు. -
అప్రమత్తతే భద్రతకు శ్రీరామరక్ష
పార్వతీపురం రూరల్: డ్రైవర్ల అప్రమత్తతతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రయాణంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని డ్రైవర్లు తమ బాధ్యతాయుత డ్రైవింగ్తో నిలబెట్టుకోవాలని సూచించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల మృతుల సంఖ్య 2024లో 65 ఉండగా, 2025లో 105కు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోందన్నారు. విమానాల్లో మాదిరిగా బస్సుల్లోనూ అత్యవసర ద్వారాల (ఎమర్జెన్సీ ఎగ్జిట్) వినియోగంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రమాదాల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బట్టే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రమాదరహితంగా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, జిల్లా రవాణాధికారి టి.దుర్గాప్రసాద్, సీఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
–8లో
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026బాబామెట్టలో ఉన్న హజరత్ ఖాదర్వలీబాబా 67వ సుగంధ మహోత్సవాలు మూడో రోజు శనివారం అంగరంగ వైభవంగా ముగిశాయి.కురుపాంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. సాక్షి, పార్వతీపురం మన్యం: ‘తిరుమల లడ్డూ ప్రసాదానికి చంద్రబాబు చేసింది ఘోర అపచారం. ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు తప్పులు చేశారు.. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారు. చంద్రబాబు కుట్రల కారణంగా కలిగిన అపచారాల వల్ల రాష్ట్ర ప్రజలకు కష్టం, నష్టం రాకూడదు. అందుకే పాప పరిహార పూజలు చేస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. 2024 సెప్టెంబర్ 18న కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో.. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటన ఒక మహాపాతకం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడటమే ఈ కుట్రకు పునాదిరాయి. అదే రోజు రాష్ట్రంలో ఈ విష రాజకీయం ఆరంభమైంది. ఇప్పుడు దీనిపై సిట్ స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ల్యాబ్లలో చేసిన పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతువుల కొవ్వు కూడా ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని తేలిపోవడం అందరికీ చాలా సంతోషాన్ని, ఊరటనిచ్చిందని తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో జరిగిన అపచారంపై వైఎస్సార్సీపీ జాతీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాప పరిహార పూజలు చేశారు. పాలకొండలో కార్గిల్ జంక్షన్ సమీపంలో ఉన్న శ్రీ వేకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో పూజలు జరిపారు. సాలూరులో పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలోను, కురుపాంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేపట్టారు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ శ్రేణులతో కలిసి శాంతియుత ర్యాలీ చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులతో రోడ్డుపైనే జోగారావు బైఠాయించారు. పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంక్షల నడుమ బెలగాం వేంకటేశ్వర స్వామి ఆలయంలో జోగారావు ప్రత్యేక పూజలు జరిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని.. వేంకటేశ్వర స్వామి ఈ కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్ సీపీ నాయకులు కోరారు. ప్లకార్డు ప్రదర్శన హిందువుల మనోభావాలతో ఆటలా? చంద్రబాబు, పవన్ కల్యాణ్ బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి తిరుమల లడ్డూ వివాదంపై సిట్ స్పష్టతనిచ్చింది స్వామి వారి ప్రసాదానికి చంద్రబాబు చేసింది ఘోర అపచారం రాష్ట్ర ప్రజలకు కష్టం, నష్టం రాకూడదనే పాప పరిహార పూజలు జిల్లాలో వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు పార్వతీపురంలో శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు -
రథంపై ఊరేగిన రాములోరు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శనివారం శ్రీరామనామస్మరణతో మార్మోగింది. సీతాసమేత శ్రీరామచంద్రస్వామి వారి రథయాత్ర మహోత్సవం కనులపండువగా సాగింది. ఏటా స్వామివారి తిరుక్కల్యాణం అనంతరం మూడోరోజు నిర్వహిస్తున్న రథయాత్రను కనులారా తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ బలిహరణం చేపట్టి శ్రీరాముడి సన్నిధిలో శ్రీమద్రామాయణ పారాయణ, వేద పఠనం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపించారు. వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటలకు వేద పండితులంతా పండిత పరిషత్ నిర్వహించి నాలుగు వేదాలను భక్తి శ్రద్ధలతో పఠించారు. అనంతరం పండిత పరిషత్ ఎంతో వైభవంగా జరిగింది. ఈ పరిషత్లో సీతారాముల గుణగణాలను వివరించేందుకు వేద పండితుల పోటీపడిన సన్నివేశం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం వేద పండితులను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు. రథంపై తిరువీధుల్లో ఊరేగిన రాములోరు... స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలనంతరం మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షణ చేశారు. అనంతరం స్వామివారిని రథంపై ఆసీనులను చేసి విశేష అర్చనలు జరిపారు. రాత్రి 10 గంటలకు వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల జయజయ ధ్వానాల మధ్య సీతారామ లక్ష్మణులు రామతీర్థం పురవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన రథయాత్రతో రామతీర్థం పులకించింది. ఆలయ ప్రతిష్ట జరిగిన నాటి నుంచి ఆనవాయతీగా వస్తోన్న సీతారామునిపేట, జగ్గరాజుపేట, గొర్లిపేట గ్రామస్తులు రథాన్ని లాగి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఆలయం సమీపంలోని ప్రధాన రహదారి వద్ద ప్రారంభమైన రథయాత్ర కుమ్మరిఖానా, బ్రాహ్మణ వీఽధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయంలోకి తీసుకువెళ్లి వెండి మండపంలో ఆసీనులు చేశారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రమూర్తి రథయాత్ర స్వామివారి సన్నిధిలో వైభవంగా పండిత పరిషత్తు కనులారా తిలకించి భక్తజనం -
హెల్త్ వర్కర్ల నిరసన
● బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ పార్వతీపురం రూరల్ : గతేడాది సెప్టెంబర్ నుంచి నిలిచిపోయిన తమ బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కలెక్టరేట్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. అందని వేతనం.. ఆగని ఆవేదన అన్న చందంగా తమ పరిస్థితి మారిందని, నెలల తరబడి వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆశ యూనియన్ నేతలు ఇందిర, గౌరీశ్వరి, శివాని పేర్కొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓలకు అందజేశారు. బకాయిలు చెల్లించడంతో పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా గుర్తించి, వారికి యూనిఫాం, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని యూనియన్ ప్రతినిధులు బృందావతి, రజిని, మహాలక్ష్మి కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి జి.వెంకటరమణ, ప్రతినిధులు సూరిబాబు, గంగ శైలజ, వెంకటలక్ష్మి, లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు. -
9న కలెక్టరేట్ వద్ద ధర్నా
● సాగునీటి సాధనకు.. రైతన్న సమరం పార్వతీపురం రూరల్ : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సాధించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 9న పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకటించింది. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బంటు దాసు మాట్లాడుతూ.. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ సహా జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని కోరారు. ‘ప్రాజెక్టుల సాధన–రైతన్నల వేదన’ ముగియాలంటే పోరాటమే మార్గమని పేర్కొన్న ఆయన ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాలో రైతులు, కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి రమణమూర్తి, నాయకులు బి.అప్పారావు, ఇ.గౌరమ్మ, కరణం రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కుశ జలపాతానికి ప్రత్యేక బస్సు సర్వీసు గుమ్మలక్ష్మీపురం: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కుశ గ్రామ పరిసరాల్లో రూపుదిద్దుకున్న జలపాతాన్ని పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా ప్రత్యేక బస్సుసర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శనివారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ప్రతీ శని, ఆదివారం కుశలోయ జలపాతానికి బస్సును నడుపుతున్నట్లు వెల్లడించారు. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు పార్వతీపురం రూరల్ : జిల్లా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. దాడుల్లో రికార్డుల్లేని భారీ గుట్కా, ఖైనీ నిల్వలు వెలుగు చూశాయి. పట్టణంలోని షిర్డీ ఎంటర్ప్రైజెస్లో రూ.15లక్షల విలువైన ఆరు రకాల ఉత్పత్తులను తనిఖీ చేయగా.. కేవలం రెండింటికే బిల్లులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పట్టణ శివారులోని వ్యాపారి దుంప శ్రీనివాసరావు వద్ద లభించిన పది రకాల నిల్వలకు అసలు బిల్లులే లేకపోవడం గమనార్హం. నిబంధనలు గాలికొదిలేసిన ఈ అక్రమ నిల్వలపై పంచనామా నిర్వహించి, జీఎస్టీ అధికారులకు నివేదిస్తా మని విజిలెన్స్ సీఐ సింహాచలం తెలిపారు. దాడుల్లో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నాంబిక, అసిస్టెంట్ కమిషనర్ మహేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశా వర్కర్లు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు
● కలెక్టర్ హెచ్చరిక పార్వతీపురం: ఆశా వర్కర్లు విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరింలో వైద్యాధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఒక్క జ్వరం కేసు నమోదైనా ఆశాలపై చర్యలు తప్పవన్నారు. దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, దోమల ద్వారా మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర వ్యాధులు నమోదైతే సహించేది లేదన్నారు. జ్వరాల నివారణకు అవసరమైన శిక్షణను ఆశా వర్కర్లకు ఇవ్వాలన్నారు. దోమల వ్యాప్తి ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి, వాటిని నివారించే వరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, జిల్లా మలేరియా అధికారి వై.మణి, జిల్లా ప్రొగ్రాం మేనేజర్లు డా.ఎం.వినోద్కుమార్, డా.టి.జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
నిరక్షరాస్యులను అఽక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి..: కలెక్టర్
గుమ్మలక్ష్మీపురం: గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అక్షరాస్యత కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మండ గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాస్యత కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వయోజనులకు చదువు ప్రాముఖ్యతను, కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలని, చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని, చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక శ్రధ్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో మండ సర్పంచ్ హైమావతి, మండల మహిళా సమాఖ్య ఏపీఎం సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు. సేవ గుణం పెంపొందించుకోవాలి విద్యార్థి దశ నుంచే సేవ గుణాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శనివారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా మానవతా ధృక్పధంతో సేవలందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థలో ప్రతీ ఒక్కరూ సభ్యులుగా చేరాలని కోరారు. అనంతరం రెడ్క్రాస్ సొసైటీ సమకూర్చిన దుప్పట్లను పలువురు నిరుపేదలకు, అవసరార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఎం.శ్రీరామమూర్తి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ప్రిన్సిపాల్ టి.శ్రీవరం, వైస్ ప్రిన్సిపాల్ డి.రామయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చెరకు రైతుకు ప్రోత్సాహకాలు అందించాలి
● చెరకు రైతులు, కర్మాగార ప్రతినిధుల సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: రైతులు చెరకు సాగుపై మక్కువ చూపేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేయాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. చెరకు రైతుకు అన్ని రాష్ట్రాల్లోనూ రవాణా చార్జీల రూపంలో ప్రోత్సాహక నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో టన్నుకు రూ.450 వరకు ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా ప్రోత్సాహక ప్రతిపాదనలు అమలు చేస్తున్నారని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘చెరకు సాగు, రైతుల పరిస్థితుల’పై సంకిలి చెక్కర కర్మాగారం ప్రతినిధులు, చెరకు సాగుచేసే ప్రాంతాల ప్రజాప్రతినిధులు, రైతులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చెరకు రైతుకు, కర్మాగారానికి రెండింటికీ లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. పంటల మార్పిడి దిశగా రైతులను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో సుమారు 4 వేల హెక్టార్లలో చెరకు సాగు జరుగుతుండగా దాన్ని కనీసం 10 వేల హెక్టార్లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ గతంలో జిల్లాలో చెరకు విరివిగా పండేదని, చెక్కర కర్మాగారాలు పనిచేసిన కాలంలో రైతులు ఆ పంటవైపు మొగ్గు చూపేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్థితిని తిరిగి తీసుకురావాలని, రైతులకు చెరకు సాగు లాభాదాయకమనే భరోసా కల్పిస్తే వారు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. సంకిలి చక్కెర కార్మగారం ఈ ఏడాది మూసివేస్తారనే వదంతులు వ్యాప్తి చెందాయని, అది ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టమని విమర్శించారు. ఈ ఏడాది కర్మాగారానికి కనీసం 4 లక్షల టన్నుల చెరకు సరఫరా అయ్యేలా రైతులకు అవగాహన కల్పిస్తామని కర్మాగారం నుంచి అవసరమైన ఇన్పుట్స్ అందించే విషయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సంకిలి కర్మాగారం ప్రతినిధులు మాట్లాడుతూ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చెరకు సాగు క్రమంగా తగ్గిపోతోందని వివరించారు. చెరకు నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండడం, చెల్లింపులు ఆలస్యంగా జరగడం వల్ల రైతులు మొక్కజొన్న, ఆయిల్పామ్ వంటి ఇతర పంటల వైపు మళ్లుతున్నారని తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ రైతు, కర్మాగారం ఇద్దరికీ లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, పంటల మార్పిడిని పోత్రహిస్తూనే చెరకు సాగును పెంచాలని సూచించారు. ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), కోండ్రు మురళీమోహన్ (రాజాం), బేబీ నాయన (బొబ్బలి) మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించాలని, సకాలంలో కటింగ్, మంచి సీడ్, ఆర్థిక సహాయం అందించాలని కర్మాగార ప్రతినిధులను కోరారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, శ్రీకాకుళం, మన్యం జేసీలు వర్చువల్గా పాల్గొన్నారు. మూడు జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలు రామారావు, అన్నపూర్ణ, త్రినాథస్వామి, కేన్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు ‘పునశ్చరణ’
● 15 రోజుల పాటు సాయుధ దళాలకు ప్రత్యేక శిక్షణ ● ప్రారంభించిన ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్ : జిల్లా పోలీసు వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆర్మడ్ రిజర్వు (ఏఆర్) పోలీసుల వృత్తి నైపుణ్యానికి పదును పెట్టేందుకు మొబిలైజేషన్ (పునశ్చరణ) తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఈ శిక్షణా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు 15 రోజుల పాటు సాగే ఈ శిబిరంలో సిబ్బందికి సర్వతోముఖాభివృద్ధిపై తర్ఫీదు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. క్రమశిక్షణకు డ్రిల్ ప్రాణవాయువు వంటిది అని పేర్కొంటూ, విధుల్లో చురుకుదనం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడమే ఈ మొబిలైజేషన్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. వివిధ రకాల ఆయుధాల వినియోగం, ఫైరింగ్ ప్రాక్టీస్, బాంబు స్క్వాడ్ పనితీరు మరియు బందోబస్తు విధుల్లో మెలకువలపై ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం వృత్తిపరమైన అంశాలే కాకుండా, పోలీసుల వ్యక్తిగత సంక్షేమంపై కూడా ఈసారి దృష్టి సారించారు. విధుల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, సర్వీసు నిబంధనల పట్ల సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్.ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
సుజుకీ ఈ యాక్సిస్ స్కూటీ ఆవిష్కరణ
విజయనగరం: ద్విచక్ర వాహన రంగంలో వినియోగదారుల అవసరాలగా అనుగుణంగా ముందడుగు వేసే సుజుకీ మోటారు సైకిల్ సరికొత్త ఎలక్రిక్ట్ స్కూటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సుజుకీ ఈ యాక్సిస్ పేరిట మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటీ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది. విజయనగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా గల సుజుకీ షోరూంలో నూతన సుజుకీ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సురేష్బాబు, చీఫ్ మేనేజర్ ప్రధాన్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో సుజుకీ సంస్థ నూతన సంస్కరణలు వినియోగదారుల మన్ననలు పొందుతాయని ఆకాంక్షించారు. సుజుకీ కంపెనీ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ సురేంద్ర మాట్లాడుతూ సుజుకీ ఈ యాక్సిస్ స్కూటీ వైట్, బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉంటాయన్నారు. వాహనాన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, వాహనం కొనుగోలు చేసిన 3 సంవత్సరాల్లో తిరిగి విక్రయించే వారికి బై బ్యాక్ ఆఫర్లో 60 శాతం మొత్తం చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా గుంటూరులో ఈ నూతన స్కూటీ అందుబాటులోకి రాగా... విజయనగరంలో మాత్రమే విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సుజుకీ షోరూం ఎండీ అభిరామ్, జనరల్ మేనేజర్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల కొంగు బంగారం వ్యాకులమాత
● కొండడాబాల వ్యాకులమాత యాత్ర రేపు ● భారీ బందోబస్తు ● దేశంలోనే ఎత్తైన గొర్రెల కాపరి క్రీస్తు స్వరూపంకొత్తవలస : మండలంలోని కొండడాబాల వ్యాకులమాత పుణ్యక్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన పుణ్యక్షేత్రం ఇది. దీన్ని 1817 సంవత్సరంలో ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడ రోమన్ కేథలిక్ మిషనరీ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఏటా ఫిబ్రవరి నెలలో వచ్చే మొదటి ఆదివారం మహా యాత్రను నిర్వహిస్తుంటారు. పుణ్యక్షేత్రం చరిత్ర ఈస్టిండియా కంపెనీ పాలనలో 1876లో సంభవించిన భారీ తుఫాన్ వల్ల విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం దగ్గర గల చర్చిలు దెబ్బతిన్నాయి. అక్కడి క్రైస్తవ భక్తులు తమ సొంత గ్రామమైన లక్కవరపుకోట మండలం గనివాడ, నిడిగట్టు గ్రామాలకు చేరుకున్నారు. 1877లో ఫాదర్ అలిక్స్రీకాగా సాయంతో కొత్తవలస మండలం గొల్లలపాలెం సమీపంలో గల కొండపై పెద్ద కమ్మలశాలను ఏర్పాటు చేసి అప్పట్లో చర్చి నిర్వహించారు.1890లో కొండను చదును చేసి బిషప్ జేఎం టిస్సో చేతుల మీదుగా గ్రీకు ప్రాంకోశైలిలో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించి వ్యాకులమాతగా నామకరణం చేశారు. కొండపై పెద్ద డాబాలను నిర్మించారు. నాటి నుంచి కొత్తవలసను కొండడాబాలుగా పిలుస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి తెచ్చిన మేరీమాత విగ్రహం ప్రతిష్ట 1914వ సంవత్సరంలో ఫాదర రోస్పియోన్ సుమారు రూ.6వేలు వెచ్చించి ఫ్రాన్స్ దేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మేరీమాత విగ్రహాన్ని ప్రతి ష్ఠించారు. తల్లి ఒడిలో బిడ్డ పార్ధీవదేహాన్ని పెట్టుకొని మనోవేదనను తన గుండెల్లో దాచుకున్న వ్యాకులమాత(కనికరమాత)గా ఇక్కడి స్వరూపం ప్రత్యేకత. కొండడాబాల వ్యాకులమాత చర్చిని అన్ని వసతులతో పూర్తి స్థాయిలో నిర్మించి 2020 నాటికి 130 సంవత్సరాలైంది. ఇందుకు గుర్తుగా భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భారీ గొర్రెలకాపరి క్రీస్తు స్వరూపం ఏర్పాటు చేశారు. క్రీస్తు జీవించిన కాలం ఆధారంగా 331/2 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఇది ఈ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం యాత్ర ఇక్కడ ఏటా ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం యాత్రను నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల ముందు నుంచి నవదిన పూజా ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఒడిశా, తెలంగాణ, చత్తీస్ఘడ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఆంధ్రాలోనే అతిపెద్ద బోర్డింగ్ పాఠశాల రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి 1913వ సంవత్సరంలో తొలిసారిగా బోర్డింగ్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఫాదర్స్ శిక్షణ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తి కొండడాబాలు వ్యాకులమాత యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నాలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. – డాక్టర్ గొండాడ రాజు, కొండడాబాల విచారణకర్త భారీ బందోబస్తు వ్యాకులమాత యాత్ర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 16 మంది ఎస్ఐలు, 220 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఇక్కడకు వచ్చే వాహనాలు కొత్తవలస జంక్షన్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి కింద నుంచి రాజపాత్రునిపాలెం మీదుగా వెళ్లి తిరుగు ప్రయాణం కొత్తగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా నరపాం, తుమ్మికాపల్లి మీదుగా వెళ్లాలి. – సీహెచ్ షణ్ముఖరావు, సీఐ, కొత్తవలస -
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దాష్టీకం
● వడ్డీ కోసం విచక్షణారహితంగా దాడి ● సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు అనిల్ అఘాయిత్వం ● ఆస్పత్రి పాలైన బాధితురాలు సుజాత పార్వతీపురం రూరల్: అధికార బలంతో పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అనుచరుడు అనిల్ ఒంటరి మహిళపై రెచ్చిపోయాడు. రాయలేని పదాలతో దూషించాడు. విచక్షణారహితంగా దాడిచేశాడు. సభ్యసమాజం తలదించుకునేలా జుత్తుపట్టుకుని రోడ్డంతా ఈడ్చేశాడు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శగురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆయన రౌడీయిజం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో టీడీపీ కార్యకర్త ఆరాచకంపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం ఇందిరా కాలనీ (12వ వార్డు)కి చెందిన ఒంటిరి మహిళ సారిక సుజాత కుటుంబ పోషణ కోసం స్థానికంగా చిన్న టిఫిన్ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తోంది. కుమార్తె వివాహం నిమిత్తం అదే కాలనీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే విజయచంద్ర అనుచరుడు పాలకొండ అనిల్ వద్ద మూడేళ్ల కిందట రూ.50 వేలు అప్పు తీసుకుంది. తన తల్లికి వచ్చే పింఛన్ డబ్బులను తాకట్టుగా పెట్టి నెలకు రూ.3వేలు చొప్పున వడ్డీ చెల్లిస్తోంది. గత నెల వడ్డీ ఇవ్వలేదు. గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అనిల్ బాధితురాలు సుజాత ఇంటికి వెళ్లి వడ్డీ డబ్బులు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని, ఫిబ్రవరిలో రెండు నెలల వడ్డీ చెల్లిస్తానని సుజాత బతిమిలాడింది. వినిపించుకోకుండా ఆమైపె కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ గుండైపె, ఎడమ చెంపపై పిడిగుద్దులు కురిపించి రాక్షసంగా ప్రవర్తించాడు. స్థానికులు అనీల్ను అడ్డుకుని గాయపడిన సుజాతను ఆటోలో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ‘నాకు దిక్కు ఎవరూ లేరని తెలిసి, ఎమ్మెల్యే మనిషినన్న అహంకారంతో నన్ను చావబాదాడు‘అంటూ సుజాత పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది. -
బాలల సంరక్షణ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
పార్వతీపురం: బాలల సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్న సంస్థలు.. జువైనల్ జస్టిస్ 2016 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలల సంరక్షణ కోసం ఏదైనా చట్టం కింద లైసెన్సు తీసుకున్నప్పటికీ జువైనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం–2015) ప్రకారం.. సెక్షన్–41 కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. నిర్దేశించిన ప్రొ ఫార్మాలో ఫిబ్రవరి 13లోగా డైరెక్టర్ బాలల సంక్షేమం, సంస్కరణలో సేవలు అండ్ వీధి బాలల సంక్షేమశాఖ, రోటరీనగర్, విద్యాధరపురం, విజయవాడ 520012 కార్యాలయానికి దరఖాస్తు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 94403 32581 నంబర్ను సంప్రదించాలన్నారు. ముగిసిన భద్రతా మాసోత్సవాలు ● ప్రమాద రహిత డ్రైవర్లకు సత్కారం విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించిన ‘రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026’ శుక్రవారంతో ముగిశాయి. డీపో ప్రాంగణంలో జరిగిన ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ ఏఆర్దామోదర్ మాట్లాడుతూ రవాణా నియమాలు పాటించడమే ప్రమాదాల నివారణకు మార్గ మని అన్నారు. ప్రమాద రహితంగా విధులు నర్వహించిన విజయనగరం, ఎస్.కోట డిపో డ్రైవర్లను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ హెచ్.దివ్య, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ డైరీనే కీలకం విజయనగరం క్రైమ్: విజయనగరం గోకపేటలో నివసిస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో రెండో రోజు శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమ్య అధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు, భూ పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తనవల్ల లబ్ధిపొందిన అధికారుల ఫోన్నంబర్లు, లబ్ధి వివరాలు ఉన్నట్టు సమాచారం. ఎక్కువగా రిజిస్ట్రార్ల పేర్లు, ఫోన్ నంబర్లు ఉన్నట్టు తెలిసింది. రాములోరి రథయాత్ర నేడు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామచంద్రస్వామి రథయాత్ర మహోత్సవం శనివారం కనులపండువగా జరగనుంది. దీనికోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా కల్యాణోత్సవం అనంతరం రామతీర్థంలో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శనివారం వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో విశేష హోమాలు జరిపిస్తారు. ఉదయం 8 గంటలకు శ్రీ మద్రామాయణ పారాయణం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపిస్తారు. సాయంత్రం 6 గంటలకు పండిత సదస్సు నిర్వహించి పలువురు వేద పండితులకు సన్మాన మహోత్సవం జరిపిస్తారు. అనంతరం సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రమూర్తిని ఊరేగింపుగా ఉత్తర రాజగోపురం సమీపంలో ఏర్పాటు చేసిన రథంపై ఆసీనులు చేస్తారు. రథంపై విశేష పూజలు నిర్వహించిన తరువాత రాత్రి 10 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆలయం నుంచి కుమ్మరి ఖానా మీదుగా తిరిగి దేవస్థానం తూర్పు రాజగోపురం వద్దకు స్వామివారి రథాన్ని తీసుకువస్తారు. సమీప గ్రామాలైన జగ్గరాజుపేట, సీతారామునిపేట, గొర్లిపేట గ్రామాలకు చెందిన భక్తులు ఎప్పటిలాగే రథాన్ని ముందుకు నడిపిస్తారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 40 మంది పోలీసులతో ఆ శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉత్సవ విజయవంతానికి భక్తులు సహకరించాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026
వీరఘట్టం: శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు.. క్రైస్తవుల సహాయమాత మేరీమాత మహోత్సవం శుక్రవారం కనులపండువగా జరిగింది. వీరఘట్టం మండలం యు.వెంకమ్మపేట వద్ద ఉన్న మరియగిరి కొండపై వెలసిన మరియమ్మ దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. టెంకాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయరాల విజయకుమార్ ఆధ్వర్యంలో సాగిన ప్రత్యేక దివ్యపూజల్లో పాల్గొన్నారు. మేరిమాతకు వందనం.. అభివందనం.. మానవాళికి నీవే తల్లివంటూ కీర్తించారు. ఏసు శాంతి సందేశాలను వినిపించారు. మరియగిరి వద్ద నూతనంగా నిర్మించిన సింహద్వారాన్ని, మేరిమాత విగ్రహాన్ని విజయ్కుమార్తో కలిసి విశాఖపట్నం బిషప్ ఉడుమల బాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు బిషప్లను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 50 వేలమంది భక్తులు దివ్యపూజలో పాల్గొన్నారు. మరియగిరి యాత్ర సందర్భంగా వీరఘట్టం, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస తదితర గురుమండలాల్లో ఇటీవల నిర్వహించిన బైబిల్, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం బిషప్లు బహుమతులు ప్రదానం చేశారు. యాత్రకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో పాలకొండ సీఐ ఎ.ప్రసాదరావు, వీరఘట్టం ఎస్ఐ ఎస్.షణ్ముఖరావు, సీతంపేట, దోనుబాయి, చినమేరంగి ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం డిపోల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలి మరియగిరి కొండపై వెలసిన మేరీమాతను పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి దర్శించుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలందరినీ చల్లగా చూడు తల్లీ అంటూ ప్రార్థన చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, టెంకాయ కొట్టి మొక్క తీర్చుకున్నారు. ఆమెతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, వండువ సర్పంచ్ మిడితాన కళ్యాణి మేరిమాతను దర్శించుకున్నారు. కనుల పండువగా మరియగిరి యాత్ర మేరీమాత దర్శనానికి తరలివచ్చిన భక్తులు దివ్యపూజల్లో పాల్గొన్న భక్తలోకం -
ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో బోల్తా
● గర్భిణితో పాటు ఏడుగురికి గాయాలు ● పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి కురుపాం: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడింది. గర్భిణితో పాటు మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం పెదరావికోన గ్రామానికి చెందిన గర్భిణి తోయక లక్ష్మికి గురువారం అర్ధరాత్రి నొప్పులు వచ్చాయి. ఆమెను కుటుంబ సభ్యులు ఆటోలో రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తుండగా రేగిడి సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గర్భిణి లక్ష్మి, అమరావతి అనే యువతికి చేతులు విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పీహెచ్సీకి తరలించారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వెంటనే అక్కడి వైద్యులు చికిత్స అందించగా... ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
సంపూర్ణ అభియాన్ 2.0 ప్రారంభోత్సవం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని కుశ గ్రామంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోనే ఎంతో అందమైన కుశ ప్రాంతంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి, ఐటీడీఏ పీఓ జగన్నాథ్, ఐసీడీఎస్ పి.డి కనకదుర్గ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
గోవులను తరలిస్తున్న వాహనం సీజ్
సాలూరు: గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టణ పరిధిలో శుక్రవారం సీజ్ చేసినట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ శివారులో వాహన తనిఖీలు చేపట్టగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నామని చెప్పారు. 27 గోవులను ఒక లారీలో తరలిస్తుండగా చట్టబద్దమైన పత్రాలు లేకపోవడంతో సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గోవులను సురక్షిత సంరక్షణ కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. ముగ్గురు గంజాయి స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు పార్వతీపురం రూరల్ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులకు విజయనగరం ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2024 ఆగస్టు 23న పాచిపెంట మండలం రోడ్డవలస జంక్షన్ వద్ద 10.2 కిలోల గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ప్రవీణ్కుమార్, శక్తి మురగన్ పననివేల్, నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లంగారి సురేష్లను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదైన ఐదు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి పక్కా ఆధారాలు సమర్పించడంతో న్యాయమూర్తి ఎం.మీనాదేవి శుక్రవారం ఈ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. గంజాయి సాగు, విక్రయం లేదా రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. గర్భిణులకు ‘అభా’ నమోదు తప్పనిసరి పార్వతీపురం రూరల్ : మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా జిల్లాలో వైద్య సేవలు అందాలని జిల్లా ఏసీడీ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. ఆరోగ్య కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆశా నోడల్ సిబ్బంది సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతీ గర్భిణీకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) నమోదు తప్పనిసరని స్పష్టం చేశారు. ఇ–ఆశా యాప్ ద్వారా సేవల నమోదును పర్యవేక్షించాలని, గడువులోగా టీకాలు వేయాలని ఆదేశించారు. ఆర్బీఎస్కే ద్వారా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కేన్సర్, కుష్టు వ్యాధి లక్షణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ‘స్పర్శ’ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో పలువురు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు పాచిపెంట: మండలంలోని తంగలాం గ్రామానికి చెందిన గెమ్మెల సురేష్ ఇంటికి విద్యుత్ పనుల నిమిత్తం అరకు వ్యాలీ కందులగుడా గ్రామానికి చెందిన వంతల రాజారావు ఈ నెల 28న వెళ్లాడు. ఈ నెల 29న సురేష్ ఇంటి ముందే రాజారావు మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సురేష్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న రాజారావు కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ అర్జున్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెచ్సీ కృపారావు తెలిపారు. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ నెల్లిమర్ల రూరల్: చండీఘర్లో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మండలంలోని గరికిపేట గ్రామానికి చెందిన సీనియర్ వెయిట్లిఫ్టర్ బెల్లాన నాని సత్తా చాటింది. 77 కేజీల విభాగంలో శుక్రవారం పోటీల్లో పాల్గొన్న ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. -
ఉత్తరాంధ్ర నృత్య పోటీలకు ఆహ్వానం
రాజాం సిటీ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరను పురష్కరించుకుని సలాది వెంకటరమణ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయి సాంప్రదాయ నృత్య పోటీలు నిర్వహించనున్నామని కళాపరిషత్ అధ్యక్షులు సలాది తులసీదాస్ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 22 నుంచి జరగనున్న జాతరను పురష్కరించుకుని 22 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నామ న్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ పోటీలకు సంబంధించి ఫిబ్రవరి 10లోగా ఎంట్రీలు పంపించాలని అన్నారు. ఆర్నెపల్లి వెంకటనాయుడు, కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి, అమ్మవారికాలనీ, రాజాం పేరిట ఎంట్రీలు పంపించాలని కోరారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నామని తెలిపారు. వివరాలకు 6303215996 నంబరును సంప్రదించాలని సూచించారు. సమావేశంలో మక్క అప్పలనాయుడు, బీవీ అచ్యుత్కుమార్, గట్టి పాపారావు, పెంకి గౌరీశ్వరరావు, ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
తెర్లాం: యూరియా కోసం తెర్లాం మండలంలోని విజయరాంపురం గ్రామ రైతులు రోడ్డెక్కారు. ఖరీఫ్ సీజన్ నుంచి ఇంతవరకు రైతుకు కేవలం ఒకబస్తా యూరియా మాత్రమే వ్యవసాయ అధికారులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. పంటల సాగుకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేని చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోశారు. తెర్లాం వ్యవసాయ కార్యాలయం వద్ద ప్లకార్డులతో శుక్రవారం నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు, రైతులు మాట్లాడుతూ విజయరాంపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని నెమలాం ఆర్ఎస్కేలో ప్రభుత్వం విలీనం చేసిందన్నారు. విజయరాంపురం గ్రామానికి చెందిన భూములు సుందరాడ, నెమలాం ఆర్ఎస్కేల పరిధిలో ఉన్నాయని తెలిపారు. అక్కడకు యూరి యా వచ్చినా విజయరాంపురం రైతులకు అందజేయడం లేదని, అక్కడి టీడీపీ నేతలు తమ అనుచరులకు పంపిణీ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఏఓని కలిసి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, మండల సర్వసభ్య సమావేశంలో మండలాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాల వద్ద అధిక ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా అందజేయాలంటూ తహసీల్దార్ జి.హేమంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఏడాదిగా రైతుకు ఒక బస్తా యూరియా సరఫరాపై మండిపాటు తెర్లాంలో విజయరాంపురం రైతుల ధర్నా ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోసిన రైతులు -
అక్రమ సస్పెన్షన్పై ఎస్డబ్ల్యూఎఫ్ ఆందోళన
విజయనగరం అర్బన్/గంటస్తంభం: ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిపై విధించిన అక్రమ సస్పెన్షన్ను తక్షణమే రద్దు చేయాలని ఆ సంఘం జిల్లా రాష్ట్ర కార్యదర్శి వి.రాములు డిమాండ్ చేశారు. స్థానిక ఎల్పీజీ భవనంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. అక్రమ సస్పెన్ష్న్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈ నెల 17న విజయవాడలో మాస్ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించింది. ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను సంఘం పిలుపునిచ్చింది. ఎలాంటి విధులు కేటాయించనప్పటికీ పెట్రోల్ బంకుకు సంబంధించిన అవకతవకల కేసులో అసలు బాధ్యులను వదిలేసి కక్ష సాధింపు ధోరణితో అక్రమంగా సస్పెండ్ చేశారని సంఘం ఆరోపించింది. ఆయన పని చేసే స్థలం వేరైనా డిపోలో విధులు నిర్వహిస్తున్నట్టు కాపీ పేస్టు విధానంలో సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయడం న్యాయ ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది. అక్రమ, చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ఈ సస్పెన్షన్ను బేషరతుగా రద్దు చేసే వరకు దశలవారీ ఉద్యమాలు కొనసాగిస్తామని జిల్లా కమిటీ ప్రకటిందించి. కార్యక్రమంలో వివిధ ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు బి.లక్ష్మి, పి.భూషణరావు, ఎ.జగన్మోహన్, వి.రాము, సీహెచ్.వెంకటరావు, ఎస్కె.రోటి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 17న విజయవాడలో మాస్ ధర్నా -
సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం పీహెచ్సీ వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్యులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మందులు కొరత లేకుండా చూడాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులు సంతృప్తి చెందే విధంగా సేవలు మెరుగు పడాలని తెలిపారు. మాతృ, శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యంపై నిఘా ఉంచాలని తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తదితరులు పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
చికెన్● ఘనంగా సూఫీ సుగంధ ఉరుసు మహోత్సవం ● ఖాదర్బాబా చిత్రపటంతో పురవీధుల్లో భారీ ఊరేగింపు ● ఖాదర్బాబాను దర్శించుకున్న ప్రముఖులు విజయనగరం టౌన్: ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. బాబామెట్ట భక్తిభావంతో నిండిపోయింది. జన సందోహంతో కోలాహలంగా మారింది. సూఫీ ఆధ్యాత్మిక ధృవతార హజరత్ బాబా సయ్యద్ ఖాదర్ అవులియా 67వ ఉరుసు మహోత్సవాల వేడుకలలో భాగంగా రెండో రోజు బాబాను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో బాబామెట్ట జనసందోహంగా మారిపోయింది. శుక్రవారం వేకువజాము నుంచి ఖాదర్బాబా శయన మందిరం దర్గాలో ఖురాన్ పఠనం నిర్వహించారు. హజరత్ ఖాదర్బాబా ప్రియశిష్యులు, అలుపెరగని అన్నదాత హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాగ్దాదీ బాబా కుమారులు, సూఫీ పరంపర అభిషక్తులైన విజయనగరం ఖాదర్బాబా దర్గా, దర్బార్ షరీఫ్ ధర్మకర్త ముతవల్లి డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ సాబిరీ (ఖలీల్బాబు) నేత్రత్వంలో ఉత్సవాలను సందడిగా నిర్వహించారు. బాబా జీవించిన కాలం నుంచే అనాదిగా వస్తున్న చిత్రపటాన్ని రథంపై ఎక్కించి సందల్ (ఊరేగింపు) నిర్వహించారు. భాజాభజంత్రీలతో, మేళతాళాలతో, ఫకీరు కవ్వాళీలతో విజయనగరం బాబామెట్ట నుంచి ప్రారంభమైన ఊరేగింపు నల్లచెరువు, కాటవీధి, ఆబాద్వీధుల మీదుగా అంబటిసత్రం, ప్రెస్క్లబ్, మూడులాంతర్లు, మెయిన్రోడ్డు, గంటస్తంభం, బాలాజీకూడలి, కోట జంక్షన్, అయ్యకోనేరు గట్టు, రింగురోడ్డు రైతు బజార్, బాబామెట్ట ఏడుకోవెళ్లు మీదుగా తిరిగి ఖాదర్బాబా దర్గాకు చేరుకుంది. అనంతరం మెట్టపై ఉన్న దర్గాలో ఖాదర్బాబాకు నూతన సుగంధ, చాదర్ సమర్పించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్ర పూజలు నిర్వహించారు. దర్గా కింద ఉన్న దర్బార్ లంగర్ ఖానాలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రభుత్వ, రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, సామాజిక సేవా ప్రముఖులు, ఖాదర్బాబా దర్శనార్ధం దర్గా, దర్బార్కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్బార్ సంప్రదాయం ప్రకారం ముతవల్లి డాక్టర్ ఖలీల్బాబు వారికి స్వాగతం పలికారు. వేలాది మంది భక్తులు బాబాను దర్శించి, తరించారు. -
రామఫలాల సీజన్ ప్రారంభం
● దిగుబడులు అంతంతమాత్రమే ● ఒక్కోగుత్తి రూ.70 నుంచి రూ.80కి విక్రయం ● వచ్చేనెల వరకు సీజన్ సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో రామఫలాల సీజన్ ఆరంభమైంది. గుత్తుల లెక్కన రామఫలాలను గిరిజనులు విక్రయిస్తున్నారు. ఒక్కోగుత్తిలో 20 నుంచి 40 వరకు రామఫలాలుండగా రూ.70 నుంచి రూ.80 వరకు గిరిజనులు అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కోపండు సరాసరి రూ.3 వరకు గిరిజనులు విక్రయిస్తున్నారు. వచ్చేనెల వరకు ఈ ఫలాల సీజన్ ఉంటుంది. రామానగరం, దేవనాపురం గూడలు, అక్కన్నగూడ, రాజన్నగూడ, మొగదార, కారెం కొత్తగూడ తదితర ప్రాంతాల రైతులు సోమవారం జరిగే సీతంపేట సంతలోను, కుశిమి, కోడిశ, శంభాం ప్రాంత వాసులు శనివారం జరిగే కుశిమిసంతలోను, మర్రిపాడు, పూతికవలస, చిన్నబగ్గ, కీసరజోడు పంచాయతీ వాసులు మర్రిపాడులో బుధవారం జరిగే సంతలోను, పొల్ల, టిటుకుపాయి రైతులు దోనుబాయిలో గురువారం జరిగే సంతలో రామఫలాలు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ గుత్తులు లెక్కన కొనుగోలుచేసి పట్టణ ప్రాంతాల్లో కిలోల లెక్కన రూ.100 నుంచి 150 వరకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అంతగా పెట్టుబడులు లేకుండా కొండపోడు వ్యవసాయంలో ప్రధానంగా పండే ఈ పంట ఏజెన్సీలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. సేకరణ కష్టమే అయినా ఆదాయం వస్తుందని గిరిజనులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెబుతున్నారు. కొండపోడు వ్యవసాయంలో పండే రామఫలాల సేకరణ కష్టమే. ఎంతకాలం నిల్వ ఉండవు. మైదాన వ్యాపారులు అడిగిన ధరకే పంటను విక్రయిస్తున్నాం. – చిన్నకడాయి, బొండిగూడ గత రెండేళ్లుగా అన్ని పంటల్లో నష్టపోతున్నాం. లాభాలు వస్తాయనుకుంటే అవీ రాలేదు. కొండలపైన సేకరించిన అటవీ ఫలసాయాలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. – ఎస్.జగ్గారావు, పొంజాడ వారపు సంతకు రామఫలాలు తీసుకు వస్తున్న యువతి -
జిల్లాలో మీడియా అక్రిడిటేషన్ కార్డులకు ఆమోదం
విజయనగరం అర్బన్: జిల్లాలోని పెద్ద, చిన్న, దిన, మాస పత్రికలు, శాటిలైట్ టీవీ ఛానళ్లు, కేబుల్, ఫైబర్ నెట్, ప్రభుత్వ మీడియాకు చెందిన మొత్తం 407 మందికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయించింది. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి కన్వీనర్గా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు వ్యవహరించారు. కమిటీ సభ్యులు సమావేశంలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఎక్స్ ఆఫీసియో సభ్యులు, సీపీఓ పి.బాలాజీ, కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరావు, పీఎస్ఎస్ఎస్వీ ప్రసాదరావు, టి.రాధాకృష్ణ, కె.రమేష్నాయుడు, మహాపాత్రో వెంకటేశ్వర, బీజీఆర్ పాత్రో, ఎం.శివకుమార్, పంచాది అప్పారావు, బూరాడ శ్రీనివాసరావు, బి.నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెప్రసీ అండ్ టీబీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ కె.రాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీపీఈఓ జె.శ్రీనివాసరావు, కార్మిక శాఖ ఏసీ జి.ఎల్లాజీరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్.జానకమ్మ, సహాయ కార్య నిర్వహక సమాచార ఇంజినీర్ పి.మల్లేశ్వరరావు, ఏపీఆర్ఓ సీహెచ్ ప్రభుదాస్ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు సత్కరించారు. -
కుష్ఠుపై దృష్టి అవసరం
● వ్యాధిని త్వరగా గుర్తిస్తే దరిచేరని అంగవైకల్యం ● జిల్లాలో 248 కేసులు ● నేడు కుష్ఠు నివారణ దినోత్సవంకుష్ఠు వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా రెవెన్యూ అధికారి ఈ. మురళి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఈనెల 30 నుంచి పిబ్రవరి 13 వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వివక్షను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడడం అనే నినాదంతో లెప్రసీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కుష్ఠు వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా అంగవైకల్యం రాకుండా చూడవచ్చన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే సమీప పీహెచ్సీలో వైద్యుడి వద్ద చూపించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు, చికిత్స అందించనున్నట్లు తెలిపారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మం, చెవులు, వీపుపై మెడపై బొడిపెలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, వంటి లక్షణాలు ఉన్నా చల్లని, వేడి వస్తువులను గుర్తించకపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం తెలియకుండానే కాళ్లు బొబ్బలు రావడం, చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగ వైకల్యం పొందడం వంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీవనరాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. విజయనగరం ఫోర్ట్: కుష్ఠు వ్యాధిగ్రస్తులను గతంలో వివక్షతో చూసేవారు. వారివైపు కూడా వెళ్లడానికి ఇష్టపడేవారుకాదు. సొంత కుటుంబసభ్యులు కూడా వారికి సపర్యలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. వారికి ప్రత్యేకంచి తినడానికి ప్లేట్లు, గ్లాసులు పెట్టేవారు. అయితే ప్రస్తుతం సమాజంలో మార్పు వచ్చింది. కుష్ఠు వ్యాధి సోకినప్పటికీ వైద్యుల సలహా ప్రకారం చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవడంతో వ్యాధి సోకిన వారు చికిత్స తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కుటుంబసభ్యులు కూడా వారికి చికిత్స చేయిస్తున్నారు. కుష్ఠు వ్యాధి తగ్గిందని అందరూ భావించారు. అయితే వ్యాధి మాత్రం ఇంకా సమాజాన్ని పీడిస్తూనే ఉంది. జిల్లాలో కేసులు నమోదవుతునే ఉన్నాయి. చాప కింద నీరులా వ్యాధి వ్యాపిస్తోంది. కుష్ఠు వ్యాధి మచ్చలు ఉన్నప్పటికీ అవి సాధారణ మచ్చలు అనుకుని చాలా మంది పట్టించుకోవడం లేదు. దీని వల్ల కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి పట్ల అప్రమత్తం కుష్ఠు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్పర్శ, నొప్పి లేని మచ్చలు కుష్ఠు వ్యాధి లక్షణాలుగా గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే అంగవైకల్యం బారిన పడకుండా కాపాడవచ్చు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుష్ఠులో రెండు రకాలు కుష్ఠు వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. పాసిబాసిలరీ(పీబీ), మల్టీ బాసిలరీ(ఎంబీ) ఉన్నాయి. ఐదు మచ్చల కంటే తక్కువగా ఉంటే పీబీ కుష్ఠు వ్యాధి అంటారు. దీనికి 6 నెలల పాటు మల్టీ డ్రగ్ థెరపీ(ఎండీపీ) మందులు వాడాల్సి ఉంటుంది. ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే ఎంబీ కుష్ఠు వ్యాధిగా పరిగణిస్తారు. దీనికి 12 నెలల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. మందులు పూర్తి స్థాయిలో వాడితే వ్యాధి నయం అవుతుంది. 248 కేసుల నమోదు జిల్లాలో 2025–26 సంవత్సరంలో 248 కుష్ఠు వ్యాధి కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎంబీ కేసులు 122 కాగా పీబీ కేసులు 126 ఉన్నాయి. బాధితుల్లో మగవారు131 మంది కాగా, 112 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వ్యాధిపై అవగాహన కల్పిస్తాం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వతేదీ వరకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించనున్నాం. కుష్ఠు వ్యాధిని ఎండీటీ చికిత్స ద్వారా పూర్తి స్థాయిలో నివారించవచ్చు. మందులు పూర్తి స్థాయిలో రోగులు వాడాలి. మధ్యలో మానివేయకూడదు. వ్యాధి లక్షణాలు ఉన్న వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ కె.రాణి, జిల్లా కుష్ఠు నివారణ అధికారి -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
పార్వతీపురం: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం డైరీని, ప్రకృతి వ్యవసాయ విభాగానికి సంబంధించిన లిటరేచర్ సంక్షిప్త మార్గదర్శిని, ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ సాగు, ప్రయోజనాలు, పెరటి తోటల పెంపకం, ప్రకృతి వ్యవసాయంకోసం తొమ్మిది సార్వత్రిక సూత్రాల పుస్తకాన్ని, పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన రహిత పద్ధతుల్లో పంటలను సాగు చేసే ప్రకృతి వ్యవసాయంవల్ల రైతుల ఆర్థికాభివృద్ధికి, ప్రజల ఆరోగ్య రక్షణకు, పర్యావరణ సమతుల్యతకు దోహదపడు తుందన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల నేల ఉత్పత్తి శక్తి తగ్గిపోతుందని, దానిని తిరిగి పునరుద్ధరించడానికి జీవామృతం, బీజామృతంవంటి సహజ పద్ధతులు అనుసరించడం అవసరమని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్వీ.మాధవ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ, సంఘం ప్రెసిడెంట్ కె.రత్న కుమారితోపాటు సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి -
కరుణించు మేరీమాత..!
వీరఘట్టం: వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద గల మరియగిరి కొండపై వెలసిన శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమ్మ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఏటా జనవరి 30న మరియగిరి యాత్ర ఆనవాయితీగా జరుగుతోంది. కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున గతంలో కంటే వైభవంగా మహోత్సవాన్ని జరిపేందుకు మరియగిరి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తులు మరియమ్మను దర్శించుకునేందుకు కొండపైన క్యూలు ఏర్పాటు చేశారు. కొండ దిగువన శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయిరాల విజయకుమార్ ఆధ్వర్యంలో జరగనున్న దివ్యపూజకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ప్రార్థనా మందిరాన్ని సిద్ధం చేశారు. యాత్ర ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. 33 ఏళ్లుగా శ్రీకాకుళం మేత్రాసనం ఆధ్వర్యంలో.. పూర్వకాలం నుంచి మరియగిరి యాత్ర ఇక్కడ జరిగేది. అయితే గడిచిన 33 ఏళ్ల నుంచి శ్రీకాకుళం మేత్రాసనం ఆధ్వర్యంలో మరియగిరి యాత్ర జరుగుతోంది. ఈ ఏడాది మరియగిరి యాత్రను అత్యంత వైభవంగా నిర్వహించడానకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన మరియగిరి ముఖద్వారాన్ని బిషప్ శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇప్పటికే పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు చర్చిల ఫాదర్లు, మఠకన్యలు హాజరై ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 120 మంది పోలీస్ సిబ్బంది.. మరియగిరి యాత్రకు ఏడుగురు ఎస్సైలు, ఒక సీఐతో పాటు 120 మంది పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నట్లు పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పాలకొండ సీఐ ఎ.ప్రసాదరావు, వీరఘట్టం ఎస్సై ఎస్.షణ్ముఖరావుతో కలిసి మరియగిరి ప్రాంగణాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు బృందాలను నియమించారు. వాహనదారులు, ముఖ్యంగా ఆటోలు నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాలు చేయాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పార్కింగ్ స్ధలాల్లో మాత్రమే వాహనాలను నిలుపుదల చేయాలని కోరారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారు. వారి కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం ఆర్టీసీ డిపోల నుంచి ప్రతి 10 నిమిషాలకు మరియగిరి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. సుమారు 50 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. నేడు మరియగిరి యాత్ర ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి 120 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులుగట్టి బందోబస్తు ఏర్పాటు చేయండి: సబ్ కలెక్టర్ వీరఘట్టం: మరియగిరి వద్ద శుక్రవారం జరగనున్న మేరీమాత ఉత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన యాత్ర ప్రాంగణాన్ని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఎస్సై షణ్ముఖరావుతో మాట్లాడారు.యాత్రకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మరియగిరి ఫాదర్స్కు సూచించారు. భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు.మరియమ్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లుమేరీమాత దర్శనం కోసం కొండపైకి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశాం. కొండ దిగువన, కొండపైన టెంకాయలు కొట్టేందుకు, కొవ్వొత్తులు వెలిగించి ఆరాధన చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి మఠకన్యలు, ఫాదర్లు మరియగిరి వద్దకు చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా మేరీమాతను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. భక్తులు కూడా సహకరించాలి. ఫాదర్ విజయ్రెడ్డి, మరియగిరి -
బాల్య వివాహలు చేస్తే ఖబడ్దార్..!
పార్వతీపురం: బాల్యవివాహాలు చేస్తే క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశమందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వివాహనికి తహసీల్దార్ అనుమతి తీసుకోవాలన్నారు. పెళ్లికి సంబంధించి అనుబంధసంస్థల యజమానులతో సమావేశం నిర్వహించి బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని కోరారు. వివాహనికి వయస్సు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాన్ని తయారుచేయాలని ఐసీడీఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ ఎస్వీ.మాధవరెడ్డి, జేసీ సి.యశ్వంత్కుమార్రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. బాలకార్మిక నిర్మూలన మనందరి బాధ్యత బాలకార్మికుల నిర్మూలన మనందరి బాధ్యత అని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. బాలకార్మిక నియంత్రణ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను పనిలో చేర్చుకోవడం నేరమన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు మండలస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్స్టేషన్ ఆవరణలో బాలకార్మిక వ్యవస్థ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రహదారి భద్రత నియమాలు పాటించాలి రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రహదారి భద్రతపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన పెంపొందించాలన్నారు. నెలరోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలను వినియోగించుకుని రహదారి భద్రత ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. కుష్ఠువ్యాధి నివారణకు అవగాహన కుష్ఠు వ్యాధి నిర్మూలనపై గురువారం నుంచి ఫిబ్రవరి 13వ తేదీవరకు జిల్లాలోని ప్రతి పంచాయతీ కార్యాలయం, పాఠశాల, వసతి గృమాల వద్ద సర్పంచ్ల అధ్యక్షతన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కుష్ఠువ్యాధిపై అవగాహన కార్యక్రమాల వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ హెచ్చరిక -
బాల్య వివాహం చేస్తే రెండేళ్ల జైలుశిక్ష
విజయనగరం ఫోర్ట్: బాల్య వివాహం చేసినా, ప్రోత్సహించినా బాధ్యులకు 2 సంవత్సరాల జైలుశిక్ష, లక్ష రుపాయల జరిమానా విధించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిలుపుదలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీసీపీయూ లక్ష్మి, యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ పీడీ ప్రసాదరావు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు, వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేట ర్ పి.సాయి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి -
మాజీ సైనికోద్యోగులకు న్యాయ అవగాహన సదస్సు
విజయనగరంలీగల్: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణ ప్రసాద్ విజయనగరంలో ఉన్న జిల్లా సైనిక సంక్షేమ శాఖ లో మాజీ సైనికుకోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ సైనికోద్యోగులకు అలాగే సైనికోద్యోగుల కోసం ప్రత్యేకంగా న్యాయ సేవల శిబిరాన్ని జిల్లా సైనిక సంక్షేమ బోర్డులో ఏర్పాటు చేశారని, ఈ న్యాయ సేవల ముఖ్య ఉద్దేశం సైనికులకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు న్యాయ సేవను అందించడమేనని తెలియజేశారు. ఈ సేవల శిబిరంలో ఒక ప్యానల్ లాయర్ను, ఒక పారా లీగల్ వలంటీర్ను నియమించామని ఎవరికై నా న్యాయ సలహాలు సేవలు అవసరమైతే ప్యానల్ లాయర్ను సంప్రదించవచ్చని తెలియజేశారు, వారికి ఏ విధమైన న్యాయ అవసరాలు ఉన్నా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన మాజీ సైనికోద్యోగులతో ముఖాముఖి చర్చించి వారికి తగిన న్యాయ సలహాలను సూచనలు అందజేశారు. కార్యక్రమంలో పానల్ లాయర్ పి.ధనుంజయ్ రావు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాద్ మాజీ సైనికోద్యోగుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
సూఫీ సుగంధ మహోత్సవాలు ప్రారంభం
● వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ ● ఖాదర్బాబా చిత్రపటంతో భారీ ఊరేగింపు నేడువిజయనగరం టౌన్: బాబామెట్టలో ఉన్న ఆధ్యాత్మిక సూఫీ చక్రవర్తి హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్వలీ బాబా 67వ సూఫీ సుగంధ ఉరుసు మహోత్సవాలను గురువారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. దర్బార్ నిర్వాహకులు ముతవల్లి డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్, సూఫీ ీపీఠాధిపతి ఖ్వాజా మొహియుద్దీన్ల ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో దర్గాలో ఖురాన్ పఠనంతో ఉరుసు ఉత్సవాలను ప్రారంభించారు. రాత్రి బాబావారికి శుద్ధిస్నానం (గుషుల్) నిర్వహించారు. లంగర్ ఖానాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా దర్బార్ నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవాల మూడురోజుల పాటు అన్నసమారాధన నిర్విరామంగా కొనసాగుతుందని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన సందల్ అంటే బాబా చిత్రపటంతో ఊరేగింపు నగరవీధుల్లో సందడిగా జరుగుతుందన్నారు. ఊరేగింపు తర్వాత దర్గాపై బాబావారికి సుగంధ, చాదర్, పరిమళ ద్రవ్యాల సమర్పణ చేస్తామని చెప్పారు. మూడురోజుల పాటు భక్తులందరికీ బాబా వారి శేష వస్త్రాలు, తబురుక్ (ప్రసాదం) పంపిణీ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. -
8 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు
● గుర్ల పోలీసులను అభినందించిన సీఐ శంకరరావు గుర్ల: తల్లిదండ్రులు చూసిన వివాహం ఇష్టం లేక గుర్ల మండలంలోని చింతలపేటకు చెందిన పాలూరి పైడిరాజు ఏనిమిదేళ్ల క్రితం పెళ్లి ముందురోజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ పైడిరాజు తల్లిదండ్రులు రమణ, రామయ్యమ్మలు కుమారుడి కోసం వెతకని ప్రదేశం లేదు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మిస్సింగ్ కేసుల వివరాలు మళ్లీ ప్రయత్నించగా కొత్తగా వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చికుని సీ–ట్రేస్, గూగుల్ మ్యాప్ ద్వారా పైడిరాజు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజ మండల కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గుర్ల పోలీసులు అక్కడికి వెళ్లి పైడిరాజును గుర్ల పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి కుటుంబసభ్యులకు గురువారం అప్పగించారు. ఎనిమిదేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వ్యక్తిని పట్టుకుని గుర్ల పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్సై పి.నారాయణరావు, కానిస్టేబుల్ ఎం.మురళి, మీసాల సురేష్కు పైడిరాజు కుటుంబసభ్యులలు ధన్యావాదాలు తెలియజేశారు. మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని సీఐ శంకరరావు అభినందించారు. ట్రాక్టర్ తొట్టెల దొంగ అరెస్టుశృంగవరపుకోట: ట్రాక్టర్ తొట్టెలు, వాటర్ ట్యాంకులు మాయం చేస్తున్న దొంగను ఎస్.కోట పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ మేరకు సీఐ వి.నారాయణమూర్తి చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన ఎస్.కన్నారావు తన ట్రాక్టర్ తొట్టె, వాటర్ ట్యాంక్ను దొంగిలించారని ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్.కోట పోలీసులు దర్యాప్తు చేపట్టగా గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన ఎం.ఎర్నాయుడు చోరీలకు పాల్పడినట్లు ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది గుర్తించారు. దీంతో ఎర్నాయుడును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. ఎర్నాయుడు గతంలో మోటార్ సైకిల్స్ చోరీ చేసేవాడు. వేర్వేరు పోలీస్స్టేషన్లలో 7కేసులు నమోదయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసి రెండు ట్రాక్టర్ తొట్టెలు, ఒక వాటర్ ట్యాంక్ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచగా, మెజిస్ట్రేట్ రిమాండ్ నిమిత్తం సబ్జైలుకు పంపుతూ తీర్పు ఇచ్చారని సీఐ తెలిపారు. ధాన్యం నిల్వల పరిశీలనసీతానగరం: జిల్లాలోని రైస్మిల్లుల్లో ఇప్పటివరకూ ఉన్న ధాన్యం నిల్వలు, పౌరసరఫరాల శాఖ ఎఫ్సీఐ గోదాంలకు పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన రికార్డులు సమగ్రమైన సమాచారంతో ఉండాలని పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి బండి అశోక్ అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని పాపమ్మవలస, అప్పయ్యపేట, లక్ష్మీపురం గ్రామాల్లో గల రైస్మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల రికార్డులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పయ్యపేటలోని సత్యమోడరన్ బాయిల్డ్ అండ్ రా రైస్మిల్లును పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో 112 రైస్మిల్లులున్నాయని ఆయా మిల్లుల యాజమాన్యాలు పీఏసీఎస్ల ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ చేసినట్లు చెప్పారు. నిర్దేశించిన గడువులోగా ఈ క్రాప్ చేసిన రైతుల నుంచి ధాన్యం సేకరించామన్నారు. మిల్లర్లు నిబంధనల ప్రకారం ఎప్సీఐ గోదాంలకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నిత్యావసర సరుకులు, రేషన్ డిపోలద్వారా బియ్యం పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, రైస్మిల్లు యాజమాన్య ప్రతినిధి మున్నా, ఆర్ఎస్డీటీ పైడిరాజు, ఆర్ఐ ఎన్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పరీక్షల భయం వీడండి
● విద్యార్థులకు ఎస్పీ దిశానిర్దేశంపార్వతీపురం రూరల్: విద్యార్థులు లక్ష్యమే దిక్సూచిగా, క్రమశిక్షణే ఆయుధంగా ముందుకు సాగి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు ‘స్పూర్తి – విజయానికి సోపానం’ పేరుతో గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ..సహనం, సాధన, క్రమశిక్షణలే విజయానికి రాజమార్గాలు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా, ప్రణాళికాబద్ధంగా చదివి ప్రతిభను చాటాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను గౌరవిస్తూ, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని హిత వు పలికారు. మత్తు పదార్థాలకు, సైబర్ మోసాలకు దూరంగా ఉంటూ సాంకేతికతను కేవలం జ్ఞాన సముపార్జనకే వినియోగించుకోవాలని కోరారు. అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏఎస్పీ మనీషా రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు అని, విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకోవాలని సూచించారు. మోటివేషనల్ స్పీకర్లు చంద్రశేఖర్, ఉదయ్కుమార్ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. అనంతరం ప్రతిభ కనబరిచి న విద్యార్థులకు బహుమతులు అందజేసి, అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నాగేశ్వరరావు, సీఐ వెంకట్రావు, ఎస్సైలు, వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ వినియోగంపై సమాచారమిస్తే ప్రోత్సాహం
పార్వతీపురం: జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుపుతున్న, వినియోగిస్తున్న వారి సమాచారమిస్తే, వారికి నగదు ప్రోత్సాహమిస్తామని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని ఉక్కు పాదంతో అరికట్టడానికి చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వాడుతున్నట్టు సమాచారం ఉంటే వారి వివరాలను 1972 కి ఫోన్ చేసి చెప్పాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి మంచి నగదు బహుమతి అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టాలన్నారు. పోలీసులు, ఫారెస్టు, ఎకై ్సజ్శాఖలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలను సేకరించాలని డి–అడిక్షన్ సెంటర్ అధికారిని ఆదేశించారు. మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కలెక్టర్ నేతృత్వంలో యాక్షన్ ప్లాన్ తయారుచేసి అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో గంజాయ్, డ్రగ్స్ను నిర్మూలించనున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, ఏఎస్పీ మనీషా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పావని, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఒడిశా పోలీసులపై గిరిజనం తిరుగుబాటు
సాలూరు రూరల్: ఆంధ్రా, ఒడిశా వివాదాస్ప ద కొఠియా గ్రామాల్లో నిత్యం ఒడిశా అధికారులు ఆంధ్రా ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగుతు న్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం అధికారులకు అండగా ఒక్క పోలీసును కూడా పంపించిన డాఖలాలు లేకపోవడంతో అక్కడి గిరిజనులే ఒడిశా పోలీసులపై గురువారం తిరగబడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గురువారం సచివాలయ సిబ్బంది యూఎస్ఎఫ్ సర్వే చేసేందుకు కొఠియా గ్రామాలకు వెళ్లగా ఒడిశా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో సచి వాలయ సిబ్బందికి అండగా అక్కడి గిరిజనులు నిలబడి ఒడిశా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో చేసేది లేక ఒడిశా పోలీసులు వెనుదిరిగారు. అనంతరం గంజాయిభద్ర వెల్ఫేర్ అసిస్టెంట్ మధుబాల, ఏఎన్ఎం కవిత తమ సర్వేను నిర్వహించారు. ఇదిలా ఉండగా అంధ్రా అధికారులను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న ఒడిశా అధికారుల తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్కడి గిరిజనుల్లో అభద్రతా భావం కలుగుతోందని పలు గిరిజన సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై నా వివాదాస్పద గ్రామాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్లయం తీసుకోవాలని స్దానిక గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సీతానగరం: ఏనుగుల గుంపు బక్కుపేట మెట్ట (కొండపై)పై గురువారం సంచరించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగులను కవ్వించవద్దని ప్రజలకు సూచించారు. ఏనుగు ల గుంపును ఎప్పటి కప్పుడు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. డ్రైవర్లకు కంటిచూపు పరీక్షలు తప్పనిసరి ● ఉపరవాణా కమిషనర్ డి.మణికుమార్ విజయనగరం టౌన్: వాహనాలు నడిపే డ్రైవర్లందరూ తప్పనిసరిగా కంటిచూపు పరీక్షలు చేయించుకోవాలని ఉపరవాణా కమిషనర్ డి.మణికుమార్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో డ్రైవర్లకు ఆరోగ్య, కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు యు.దుర్గాప్రసాద్, ఎం.శశికుమార్, శ్రావ్య, రమేష్కుమార్, నవీన్ కుమార్, ఐశ్వర్య, ప్రభుత్వాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. -
గిరిజన గురుకులాలకు ఆహ్వానం
● ఐదు, ఆరు తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ● ఏకలవ్య, గిరిజన గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ ● వచ్చేనెలాఖరు వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● ఏప్రిల్ 4న ప్రవేశపరీక్ష సీతంపేట: గిరిజన గురుకులాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గిరిజన గురుకులాల కార్యదర్శి మణికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన గురుకులాల్లో ఐదోతరగతి, ఏకలవ్యమోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలు నిర్వహించనున్నారు. రాతపరీక్ష ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. పార్వతీపు రం ఐటీడీఏ పరిధిలో భద్రగిరి, పి.కోనవలస, కొమరాడ, కురుపాం గురుకుల పాఠశాలలో ఐదోతరగతిలో 320 సీట్లు భర్తీ చేయనున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో పెద్దమడి, సీతంపేట బాలురు, బాలికల పాఠశాలల్లో 80 సీట్లు చొప్పున మొత్తం 240 సీట్లు భర్తీ చేయనున్నారు. వాటిలో ఒక్కో పాఠశాలలో ఐదవ తరగతిలో 80 సీట్లకు గాను ఎస్టీకి 78 శాతం, ఓసీకి 2 శాతం, ఎస్సీ 12 శాతం, బీసీ 5 శాతం, ఏఈక్యూ (ఏజెన్సీ ఎంప్లాయికోటా) 3 శాతం సీట్లు కేటాయించారు. ఏకలవ్య పాఠశాలల్లో ఇలా.. ఏకలవ్యపాఠశాలల్లో మెళియాపుట్టి, భామిని,అనసభద్ర, కొటికపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం కోఎడ్యుకేషన్లో బాలురు 30, బాలికలు 30 ఒక్కో పాఠశాలకు 60 సీట్లు చొప్పున ఆరు పాఠశాలల్లో 360 సీట్లు భర్తీ చేయనున్నారు. రాతపరీక్షలో ప్రతి భావంతులైన వారికి, వారి మార్కులు రిజర్వేషన్ ప్రకారం ప్రవేశం కల్పించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి... విద్యార్థులు ఆన్లైన్లో డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. ఏపీటీడబ్ల్యూగురుకులం.ఏపీ.గవ్.ఇన్లో దరఖాస్తు చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు. ఐదోతరగతిలో ప్రవేశానికి 4 వతరగతిని ప్రభుత్వ పాఠశాలలు, రికగై్న్జ్డ్ స్కూల్స్లో చదివి ఉండాలి.ఆరోతరగతిలో ప్రవేశానికి ప్రభుత్వపాఠశాలలు, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి 2025–26లో పాసై ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 5.2.2026 దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది: 28.2.26 హాల్టిక్కెట్ డౌన్లోడింగ్: 10.3.26 ప్రవేశపరీక్ష తేదీ: 4.4.2026 మెరిట్ జాబితా తయారీ : 24.4.2026 విద్యార్థికి సమాచారం ఇచ్చేతేదీ: 29.4.26 మొదటి కౌన్సెలింగ్ తేదీ : 9.5.26 రెండో విడత కౌన్సెలింగ్: 24.5.26 మూడో కౌన్సెలింగ్: 10.6.26 -
వైభవంగా గోవిందుడి కల్యాణం
గరుగుబిల్లి: పవిత్ర నాగావళినదీ తీరాన స్వయంభూగా వెలసిన తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు పద్మావతి, భూదేవి సహిత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా, కనుల పండువగా నిర్వహించారు. కల్యాణం తిలకించేందుకు పరిసర గ్రామాలనుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి (భీష్మఏకాదశి)ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, ధ్వజారోహణం, వాస్తు–యోగీశ్వరహోమం, విశేషహోమం, శాత్తుమురై తదితర క్రతువులను నిర్వహించిన అనంతరం ఎదురు సన్నాహోత్సవం, తిరువీధి మహోత్సవం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ జొన్నాడ భట్టరు హరికృష్ణమాచార్యులు, రేజేటి పార్థసారథి ఆచార్యులు, వీవీ.అప్పలాచార్యులతో శ్రీవేంకటేశ్వరస్వామి, ఉభయ దేవేరుల అంకురార్పణ, మహసంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణ, పాణిగ్రహణ మహోత్సవం వంటి శాస్త్రోక్తమైన ఘట్టాలతో స్వామివారి కల్యాణం వేడుకగా నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు కంకణాలను, స్వామివారి పూజసామగ్రిని అర్చకులు అందించారు. పార్వతీపురం, గరుగుబిల్లి, కురుపాం, సాలూరు, వీరఘట్టం తదితర ప్రాంతాలనుంచి దంపతులు స్వామివారి కల్యాణంలో పాల్గొని ఘనంగా జరిపించారు. కల్యాణం సందర్భంగా ఏర్పాటుచేసిన కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కల్యాణంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి దంపతులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు దంపతులు, ఎంపీపీ ఉరిటి రామారావు దంపతులు, స్థానిక సర్పంచ్ ఆవాల సింహచలమమ్మ దంపతులు, నాయకులు అంబటి తవిటినాయుడు, అక్కేన మధుసూదనరావుతోపాటు పలువురు పాల్గొన్నారు. కల్యాణంలో పూజల్లో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈఓ బి.శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, ధర్మకర్తలమండలి సభ్యులు, టీటీడీఎస్ సభ్యులు, సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు. -
కనికరించండి సారూ..!
● ఆదరించి ఆటస్థలం ఇప్పించండి ● కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న విద్యార్థులు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని గరుగుబిల్లి మండల కేంద్రంలో విద్యార్థులు తమ పాఠశాల ఆటస్థలం కోసం కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ‘ఆట స్థలం మా హక్కు‘ అంటూ చిన్నపాటి పోరాటమే చేస్తున్నారు. ఈ మేరకు గురువారం తమ మండలంలో పర్యటనకు వచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి కాళ్ల మీద విద్యార్థులంతా పడి వేడుకోవడం..జిల్లాలోని ప్రస్తుత విద్యావ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. తమ పాఠశాలలను మరో చోటకు తరలించవద్దని గత విద్యాసంవత్సరం మొదట్లో పలు పాఠశాలల విద్యార్థులు అధికారుల చుట్టూ తిరిగిన విషయం విదితమే. ఇప్పుడు ఆటస్థలం కోసం మరో పాఠశాల విద్యార్థులు ప్రాధేయపడడం గమనార్హం. గరుగుబిల్లి గ్రామపంచాయతీలో ఉన్న ఎంపీపీ మోడల్ పాఠశాలలో 64 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఎంఆర్సీ భవనం ఉండేది. అది శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం మంజూరైంది. ఈ నూతన భవనం పాత దాని కంటే విశాలంగా ఉంది. ఎంఆర్సీ భవనం ఎంపీపీ స్కూల్ వద్ద నిర్మించడం వల్ల ఇక్కడ పిల్లలకు ప్రార్థన చేయడానికి, ఆడుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి. ఇదే విషయమై పాఠశాల చైర్మన్ తుమ్మగుంట శంకరరావు, గ్రామ పెద్దలు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు చర్చించి..గత డిసెంబరు 15న కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సంబంధిత తహసీల్దార్ విచారణ జరిపి, గరుగుబిల్లి పంచాయతీ హిక్కింవలస రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 10–2ఏలో సుమారు ఐదు సెంట్ల స్థలాన్ని ఎంఆర్సీ భవన నిర్మాణానికి ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి ఈ స్థలంలో ఈ నెల ఆరో తేదీన శంకుస్థాపన కూడా చేశారు. మధ్యలో ఏం జరిగిందో గానీ..సంబంధిత కాంట్రాక్టర్ ఎంపీపీ స్కూల్ వద్దే భవన నిర్మాణానికి కొలతలు కొలిచారు. దీంతో పాఠశాల విద్యార్థులు రెండు రోజుల క్రితం మరోసారి నిరసన వ్యక్తం చేశారు. గురువారం మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ను విద్యార్థులు చుట్టుముట్టి, ఏకంగా ఆయన కాళ్ల మీద పడి ప్రాధేయపడడం చర్చనీయాంశమైంది. మమ్మల్ని ఆడుకోనీయండి సారూ..అని వేడుకున్నారు. ఒకవైపు జిల్లా యంత్రాంగం..ఆటలకు ప్రాధాన్యమిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. మరోవైపు పిల్లలకు ఉన్న క్రీడా స్థలాన్ని ధారాదత్తం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అధికారులే అవాక్కయ్యేలా...
విజయనగరం క్రైమ్/గుర్ల: ఆయన చేసేది హోంగార్డు ఉద్యోగం... సంపాదించింది రూ.20 కోట్లు పైబడి. ఆయన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. ఇళ్లు, స్థలాల డాక్యుమెంట్లను చూసి బిత్తరపోయారు. విజయనగరం గోకపేటలోని లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టాను గురువారం జరిపిన దాడుల్లో బహిర్గతం చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం ఏసీబీ విభాగంలో సుమారు పదిహేనేళ్ల కిందట నెట్టి శ్రీనివాసరావు హోంగార్డుగా విధుల్లో చేరారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే సంబంధిత అధికారులు, ఉద్యోగులకు చేరవేసేవారు. ఇలా వాళ్లను సేఫ్ జోన్లోకి నెట్టి.. ఆ వ్యక్తుల నుంచి రూ.వేలు, రూ.లక్షల్లో నగదు, వివిధ ఆస్తుల రూపంలో లబ్ధిపొందినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందితో లోపాయికారి ఒప్పందంతో సంబంధాలు నెరిపేవాడు. ఆయన వైఖరిపై అనుమానం వచ్చిన అధికారులు ఏడాదిన్నర కిందట ఎస్పీ ఆఫీస్కు బదిలీ చేయించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు విజయనగరంలోని శ్రీనివాసరావు ఇల్లు, గుర్ల మండలం నడుపూరు, విశాఖపట్నంలోని బంధువుల ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలోని అధికార బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఆయన అక్రమాస్తులను గుర్తించాయి. రెండు ప్లాట్లు, ఒక ఆర్సీసీ బిల్డింగ్, నాలుగు ఇళ్ల స్థలాలు, 166 గ్రాముల బంగారం, రూ.60వేల నగదు, రూ.7.07 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, ఒక కారు, బైక్ తదితర ఆస్తులను సీజ్చేశాయి. ఆయనను అరెస్టు చేశామని, విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. హోంగార్డు అక్రమ సంపాదన రూ.20 కోట్ల విలువైన ఆస్తులు పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు విలాసవంతమైన జీవనం -
కల్యాణ వైభోగమే..
నెల్లిమర్ల రూరల్: మంగళవాయిద్యాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. భక్తుల జయజయ ధ్వా నాల నడుమ రామతీర్థం పుణ్యక్షేత్రంలో సీతారామస్వామి వారి వార్షిక కల్యాణం గురువారం రాత్రి కమనీయంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రఘురాముని కల్యాణ వేడుకను కనులారా తిలకించి పరవశించిపోయారు. పవిత్ర దినమైన భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని సీతారామస్వామి వారి తిరుక్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే... రామతీర్థం సీతారామస్వామి ఆలయంలో వేకువజాము నుంచే కల్యాణ మహోత్సవ సందడి ప్రారంభమైంది. రామకోనేరు పవిత్ర జలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. ఉదయం 8 గంటలకు శ్రీమద్రామాయణ పారాయణం, వేద పఠనం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. సాయంత్రం 5 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, గ్రామ బలిహరణం నిర్వహించారు. సరిగ్గా రాత్రి 8.30 గంటలకి అర్చకుల వేదమంత్రాలు, మంగల వాయిద్యాల నడుమ సీతమ్మ వారి శిరస్సుపైన జీలకర్ర బెల్లం పెట్టించి సీతారాముల తిరుక్కల్యాణాన్ని వైభవోపేతంగా జరిపించారు. -
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు తోటపల్లి
● నేడు స్వామివారి కల్యాణం ● పూర్తయిన ఏర్పాట్లు గరుగుబిల్లి: ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా నిలిచింది. పవిత్ర నాగావళి నదీ తీరంలో వెలసిన ఐదున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకునేందుకు పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర జిల్లాలతోపాటు ఒడిశా రాష్ట్రంనుంచి వేలాదిమంది భక్తులు నిత్యంవచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. 1968–69లో తోటపల్లిలో ఆలయం నిర్మాణానికి భూమి పూజచేసి కమిటీగా ఏర్పడి దేవాలయ నిర్మాణం పూర్తిచేసి 1972లో ప్రతిష్టించి భక్తులకు స్వామిదర్శనం కల్పించారు. ఆలయంలో పలు నిర్మాణాలను చేపట్టాలనే లక్ష్యంతో తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ ట్రస్టు ఏర్పడి ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది 2025 ఫిబ్రవరిలో ఆలయాన్ని పునఃప్రతిష్ట చేశారు. దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధికంగా తరలివస్తున్నారు. నేడు కల్యాణం తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా ఈనెల 29న గురువారం సాయంత్రం 5 గంటలనుంచి శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని జొన్నాడ భట్టరు హరికృష్ణమాచార్యులు, రేజేటి పార్థసారథి ఆచార్యులు, వీవీ. అప్పలాచార్యులతో నిర్వహించనున్నారు. ఈ మేరకు కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న శనివారం పవిత్ర నాగావళినదిలో స్వామివారికి శ్రీ చూర్ణోత్సవం శ్రీచక్ర తీర్థస్నానం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.500 చెల్లించి తమ గోత్రనామాలతో పూజలు చేయించుకోవాలని కోరుతున్నారు. కల్యాణ ఉత్సవాల్లో భాగంగా శ్రీలీలా పార్వతి నాదస్వరం పార్టీతో దక్షిణాది సన్నాయి మేళం, కిచ్చాడవారితో నాదస్వరం కచేరి, రెడ్డి శీతంనాయుడు ఆధ్వర్యంలో గాన కచేరీ ఏర్పాటుచేశారు. భక్తులు, దాతల సహకారాలతో నిర్వహించే ఈ కల్యానంలో భక్తులు అధికంగా పాల్గొనాలని ఈఓ బి.శ్రీనివాస్ కోరుతున్నారు. -
కొండంత కష్టం.. కుమిలిపోతున్న కుసుమం..!
పార్వతీపురం రూరల్: ఓ చిన్నారి బతుకు అగమ్యగోచరంగా మారింది. తీరని వ్యాధితో ఆ ఎనిమిదో తరగతి విద్యార్థిని విలవిల్లాడుతోంది. జిల్లాలో గల సీతంపేట మండలంలోని దిగువ దారబ గ్రామానికి చెందిన సవర ప్రియ అనే బాలిక మెడపై గత రెండు నెలలుగా తలెత్తిన పెద్ద గడ్డ (వాపు) ఆమెను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. సీతంపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఈ చిన్నారి, శోషరస గ్రంథుల ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. గతంలో శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో, నిరుపేద తల్లిదండ్రులు సిమ్మయ్య దంపతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రైవేటు వైద్యం చేయించే స్తోమత లేక, బుధవారం కలెక్టరేట్లో డీఆర్ఓ కె.హేమలతను కలిసి తమ బిడ్డను ఆదుకోవాలని కన్నీటితో వేడుకున్నారు. మెరుగైన వైద్యం అందించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని ఆ నిరుపేద కుటుంబం ఆశగా ఎదురు చూస్తోంది. -
గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా
రాజాం: గ్రూపు–2 ఫలితాల్లో రాజాం మండలంలోని గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన తుర్ల దుర్గారావు ఏపీ సెక్రటరీయేట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణత చెందిన ఈ యువకుడు సివిల్స్కు సన్నద్ధమయ్యాడు. గత రెండేళ్లుగా సివిల్స్పై దృష్టిసారించిన యువకుడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు తుర్ల సూరమ్మ, అప్పన్నలు వ్యవసాయ కూలీలు. రైతు కుటుంబానికి చెందిన దుర్గారావు సివిల్స్ సాధించడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు.మెంటాడ మండలంలో నలుగురు మెంటాడ: మండలానికి చెందిన నలుగురు అభ్యర్థులు గ్రూప్ 2 లో విజయం సాధించారు. పిట్టాడగ్రామానికి చెందిన సిరిపురం రేణుక డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికై ంది. ఆమె గతంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేసింది, జీటీపేటకు చెందిన కెల్ల సత్యవతి ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా ఆమె గతంలో జగనన్న ప్రభుత్వంలో వలంటీర్గా పని చేసింది. మీసాలపేటకు చెందిన లెంక అరుణ కుమారి డీజీపీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించింది. ఆమె ఇంటర్ అయ్యాక ఆర్థిక ఇబ్బందులతో మూడు సంవత్సరాలు చదువు ఆపేసింది. అన్న బంగారు నాయుడు ప్రోత్సాహంతో డిగ్రీ చదివి ఉద్యోగం సాధించింది. అలాగే కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయిస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా చింతలవలసకు చెందిన పిన్నింటి శ్రీపతి ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు ప్రజలు, నాయకులు వారిని అభినందించారు. -
ఓరిని.. డ్యామ్లనూ వదలరా..!
● ఆక్రమణల చెరలో సాగునీటి కాలువలు ● పంటలకు నీరందక రైతులు అవస్థలు ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నీటిపారుదల శాఖ పాలకొండ: పాలకొండ, బూర్జ మండలాల్లోని పంట పొలా లకు సాగునీరు అందించే ఓని గెడ్డ వద్ద చెక్ డ్యామ్ ఆక్రమణల చెరలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతంలో కొందరు పూర్తిగా ఆక్రమించడంతో నీరు నిల్వ ఉండడం లేదు. కాలువలను కూడా కబ్జా చేయడంతో సాగునీరు అందక ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 13 వేల ఎకరాలకు నీరు.. ఓని పంచాయతీ విజయరాంపురం గ్రామ సమీపంలో ఓని గెడ్డపై బ్రిటీష్ కాలంలో చెక్డ్యామ్ నిర్మించారు. దీనిద్వారా పాలకొండ మండలంలోని 5 వేల ఎకరాలు, బూర్జ మండలంలోని 8 వేల ఎకరాలకు నీరందించే అవకాశం కల్పించారు. ఈ చెక్ డ్యామ్ నుంచి ఒక కాలువ ద్వారా హరపురం, పల్లాపురం ప్రాంతాల నుంచి బూర్జ మండలం ఎగువ ప్రాంతాలకు సాగునీరు వస్తుంది. మరో కాలువ నుంచి పాలకొండ ప్రాంతంలోని వెలగవాడ, సింగన్నవలస, పరశురాంపురం తదితర గ్రామాలకు సాగునీరు అందాల్సి ఉంది. సీతంపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలోని కొండల నుంచి నేరుగా చెక్డ్యామ్లో నీరు చేరడం వల్ల వేసవిలో కూడా సాగునీటికి డోకా ఉండదు. ఆక్రమణలతో బక్కచిక్కి.. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణం ఉన్న ఓని చెక్ డ్యా మ్ ప్రాంతం ప్రస్తుతం పూర్తిగా ఆక్రమణల చెరలో బక్కచిక్కింది. కొండల నుంచి వచ్చిన సారవంతమైన మట్టి ఇక్కడ మేట వేసింది. ఏళ్ల కొద్దీ నిర్వహ ణ లేకపోవడంతో పూర్తిగా దిబ్బలుగా మారింది. దీంతో కొంతమంది పంట పొలాలుగా మార్చుకున్నారు. చెక్డ్యామ్ ఎగువ భాగం సాగులో ఉండడంతో దీనికి ఉన్న గేట్లు తీసివేసి నీరు నిల్వ ఉండకుండా తొలగిస్తున్నారు. దీనికి తోడు చెక్డ్యామ్ రాతికట్టుకు ఎటువంటి మరమ్మతులు చేయకపోవడంతో నీరు లీకుల ద్వారా కిందకు వృథాగా పోతుంది. కాలువల గట్లుదీ అదే పరిస్థితి.. నీటిపారుదల శాఖ అధికారులు కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పక్కన ఉన్న రైతులు కాలువలను పూర్తిగా అక్రమించుకుంటున్నారు. గట్టును పొలాల్లో కలుపుకొని సాగు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కాలువ గట్టుపై పిచ్చి మొక్కలు పెరిగిపోయి కనీసం నడిచేందుకు కూడా అవకాశం లేకుండా ఉంది. ఓని గెడ్డ చెక్డ్యామ్ సహజసిద్ధంగా సాగునీరు అందించే వనరు. ఏళ్ల తరబడి సాగునీరు పుష్కలంగా రైతులకు అందేది. బూర్జ మండలంలో ఎక్కువగా రైతులకు ఈ డ్యామ్ నీరు ఆధారం. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాటు రైతుల ఆక్రమణలతో ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి. – కండాపు ప్రసాదరావు, అభ్యుదయ రైతు, రుద్రిపేటచెక్డ్యామ్కు నిధులు మంజూరు చేస్తే రైతులకు ఉపయోగ పడుతుంది. నీటిపా రుదల శాఖ అధికారులు నిధుల లేవని చేతులు ఎత్తేస్తున్నారు. ఆక్రమణలు తొలగించి నీరు నిల్వ ఉంచితే వేసవిలో కూడా రైతులకు సాగునీరు అందుతుంది. – కమిడి త్రిపురాంతకరావు, ఆయకట్టు రైతు -
మక్కువ మండలంలో ఇద్దరు
మక్కువ: మండలంలోని శంబర గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రూప్–2 ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన ఆర్నిపల్లి సంతోష్కుమార్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించడంతో గ్రామానికి చెందిన ఉద్యోగసంఘం సభ్యులు స్వీట్లు తినిపించి, అభినందనలు తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన గంట భానుప్రసాద్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించడంతో, ఆయన తల్లిదండ్రులను గ్రామానికి చెందిన ఉద్యోగసంఘం సభ్యులు దుశ్శాలువాతో సన్మానించారు.కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ జగన్నాథ లేఅవుట్ లో గల సాయిసంపత్ అపార్ట్మెంట్లో రాజుపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వానపల్లి సోమేశ్వరరావు (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సోమేశ్వర రావు గాజువాక సమీపంలో గల ఒక టైర్ల షాపులో పనిచేస్తూ రోజు ఇంటి నుంచే రాకపోకలు సాగిస్తుంటాడు. మంగళవారం తన తల్లి దగ్గర డబ్బులు తీసుకుని బస్ పాస్ చేయించుకునేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. కాగా మంగళవారం రాత్రి తన తల్లికి ఫోన్ చేసి తన మిత్రుడు కె.ఆశోక్కుమార్ అపార్ట్మెంట్లో నిద్రిస్తానని చెప్పి అపార్ట్మెంట్కు వెళ్లిపోయాడు. కాగా ఉదయం మిత్రుడు లేపేందుకు ప్రయత్నించగా కదలిక లేకపోవడంతో చెంతనే గల ఆర్ఎంపీ డాక్టర్కు చూపించగా అప్పటికే మృతి చెందినట్లు ఆర్ఎంపీ ధ్రువీకరించాడు. సోమేశ్వరారావు మృతి అనుమానంగా ఉందని మృతుడి తల్లిదండ్రులు, సోదరులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షన్ముఖరావు తెలిపారు. గజపతినగరం: మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన మజ్జి పెంటయ్య (75)ఆయాసం, బీపీ, సుగర్, కీళ్ల నొప్పులు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర మానసిక ఒత్తడికి గురై 2నెల 26న పురుగు మందు తాగేశాడు. దీంతో పెంటయ్యను కుటుంబసభ్యులు విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. పెంటయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలాగే సాలిపేట గ్రామానికి చెందిన కొడిసి ఆదినారాయణ (46) ఈనెల 26న చింత చెట్టు ఎక్కి చింతబొట్లు రాలుస్తూ ప్రమాదవశాత్తు చెట్టునుంచి కిందకు జారి పడడంతో నడుమ వద్ద తీవ్ర గాయం కాగా కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. దత్తిరాజేరు మండలంలో ఇద్దరు..దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన సుంకరి సురేష్ గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సురేష్ తండ్రి అప్పన్న ఇటీవల మృతి చెందిగా తల్లి లక్ష్మితో కలిసి కోమటిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అలాగే ఎస్.చింతలవలస గ్రామానికి చెందిన అల్తివాసు డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వాసును తల్లి రామలమ్మ కష్టపడి చదివించడంతో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. 2019లో కానిస్టేబుల్, 2022లో రైల్వేలో ఉద్యోగాలు సాధించి తొలి ప్రయత్నంలోనే వచ్చిన ఉద్యోగాలను వదులుకుని మరింత పట్టుదలతో చదవడంతో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. -
నెల్లిమర్ల మండలంలో..
నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట (లక్ష్మీదేవిపేట)కు చెందిన విసినిగిరి గౌరీ శంకర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా ఎంపిక య్యాడు. ప్రాథమిక విద్య ఉన్నత పాఠశాల విద్య జరజాపుపేట లో పూర్తి చేసిన గౌరీ శంకర్ ఏలూరులో ఇంటర్ విద్య పూర్తి చేశాడు. అనంతరం 2003లో ఎయిర్ఫోర్స్ ఉద్యోగానికి ఎంపికై 2023లో ఉద్యోగ విరమణ చేశాడు. తాజాగా గ్రూప్ 2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గౌరీ శంకర్ తండ్రి విసినిగిరి అప్పలనాయుడు నెల్లిమర్ల జూట్ కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి లక్ష్మి గృహిణి. -
గజపతినగరంలో ఇద్దరు..
గజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన గుంట్రోతు విశ్వేశ్వరరావుకు గ్రూప్–2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం వచ్చినట్లు స్థానిక సర్పంచ్ బెల్లాన త్రినాథరావు, కుటుంబసభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు సూర్యనారాయణ, పైడిరాజులు వ్యవసాయం చేస్తూ తనని చదివించారని వాకి కృషి వల్ల ఈఉద్యోగం సాదించినట్లు విశ్వేశ్వరరావు చెప్పాడు. ఎకై ్సజ్ ఎస్సై ఉద్యోగం సాధించిన టీచర్గజపతినగరం మండలంలోని వేమలి గ్రామానికి చెందిన కొప్పల లక్ష్మణరావు ఎకై ్సజ్ ఎస్సైగా గ్రూప్–2 ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. లక్ష్మణరావు ఇటీవల మెగా డీఎస్సీలో మూడు టీచర్ పోస్టులు సాధించగా ప్రస్తుతం పులిగెడ్డ గురుకుల పాఠశాలలో పీజీటీ గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. -
డిప్యూటీ తహసీల్దార్గా రాంమనోహర్
బొబ్బిలి రూరల్: మండలంలోని కారాడ గ్రామానికి చెందిన పీవీఎస్ రాంమనోహర్ గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. రాంమనోహర్ బాడంగి ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న పి లక్ష్మణదొర కుమారుడు. ఏఎస్ఓగా రాంబాబు పాలకొండ రూరల్: మండలంలోని వాటపాగు గ్రామానికి చెందిన గొర్లె రాంబాబు గ్రూప్–2 ఫలితాల్లో ఏపీ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. రాంబాలు తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబీకులు. తన విజయంలో ఇద్దరు అన్నదమ్ములతో పాటు భార్య మహాలక్ష్మి ఎంతగానో ప్రోత్సహించినట్లు రాంబాబు తెలిపారు. -
ఎల్.కోట మండలంలో ఒకరు
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన గనివాడ సతీష్ బుధవారం విడుదలైన గ్రూప్–2 పరీక్షా ఫలితాల్లో ఎంపికయాడు. సతీష్ ఇంటర్ తరువాత బీఫామ్ చేసి ప్రస్తుతం ఒక కళాశాలలో ప్రైవేట్గా లెక్చరర్గా పనిచేస్తున్నారు. సతీష్ తండ్రి సూరిదేముడు విశ్రాంత ఉపాధ్యాయుడు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2కి ఎంపికై న సతీస్కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఏఎస్ఓగా పతివాడ మనీష్ విజయనగరం అర్బన్: ఏపీ గ్రూప్–2 పోస్టుల ఎంపికలో అరుంధతి నగర్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పతివాడ మనీష్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా ఎంపికయ్యారు. తండ్రి గోవిందరావు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి గృహిణి. ఏఎస్ఓగా టీచర్ ఎంపిక చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలం కుమరాం పాలవలస గ్రామానికి చెందిన గదుల సాయమ్మ గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. ఆమె ప్రస్తుతం నెల్లిమర్ల మండలం పారసాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. 17 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆమె భర్త గదుల వెంకటరమణ కూడా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్గా జగదీశ్వర రావు రేగిడి: మండల పరిధిలోని మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన నెల్లి జగదీశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి నెల్లి సూర్యనారాయణ మెడికల్ ప్రాక్టీస్నర్. డిప్యూటీ తహసీల్దార్గా ఆదివాసీ యువకుడు భామిని: మండలంలోని మనుమకొండకు చెందిన ఆదివాసీగిరిజన యువకుడు కుంబిరిక జయప్రకాష్ గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడంపై సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది. నిరుపేద ఆదివాసీ దంపతులు కుంబిరిక రమణ, సైంబీర్ల వ్యవసాయ కూలీలు వారి తనయుడు శ్రమించి చదివి ఉద్యోగం సాధించాడు. -
అర్జీలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు
గరుగుబిల్లి: ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు నాణ్య మైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మండలంలో బుధవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు పలు గ్రామాల నుంచి 83 వినతులు వచ్చాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించి అధిక వినతులు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల సమస్యలను గడువులోగా పరిష్కరించకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, తహసీల్దా ర్ పి.బాల, ఎంపీడీఓ జి.పైడితల్లితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి కొమరాడ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరె డ్డి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ను బుధవారం నిర్వహించారు. ఎమ్మె ల్యే జగదీశ్వరి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి వినతులు స్వీకరించారు. మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అజిత్ పవార్ మృతికి సంతాపం
విజయనగరం రూరల్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం పట్ల జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం పట్ల జెడ్పీ చైర్మన్ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, ఆయన మరణం ఆ రాష్ట్రానికే కాకుండా దేశ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈవీఎం గొడౌన్ తనిఖీపార్వతీపురం రూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని ఈవీఎం గోదామును కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాము సీళ్లను, భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించి, పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. భద్రత విధులపై పోలీసులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి తదితరులు పాల్గొన్నారు.గొంతుకోసుకున్న వ్యక్తివిజయనగరం క్రైమ్: నగరంలోని అంబటిసత్రానికి చెందిన సంతోష్ (40) బుధవారం గొంతు కోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హటాహుటిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టూటౌన్ పీఎస్లో కేసు నమోదు కాగా ఎస్సై కృష్ణమూర్తి విచారణ చేస్తున్నారు. మతిస్థిమితం లేని కారణంగా సంతోష్ కత్తితో గొంతుకోసుకున్నట్లు అందిన ప్రాథమిక సమాచారమని సీఐ శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆటో దగ్ధంపార్వతీపురం రూరల్: కష్టార్జితంతో కొనుక్కున్న ఆటోయే కొండంత అండ. కానీ దుండగుల దుశ్చర్య ఆ బతుకు బండిని బుగ్గిపాలు చేసింది. పట్టణంలోని 17వ వార్డు బెలగాం రైల్వేగేట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భద్రగిరి సత్తిబాబు అనే వ్యక్తికి చెందిన ఆటోను తగులబెట్టారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సత్తిబాబు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సొంత ఇల్లు కూడా లేని తనకు, జీవనాధారమైన బండి అగ్నికి ఆహుతి కావడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
నేడు వీరఘట్టంలో కలెక్టర్ పీజీఆర్ఎస్
వీరఘట్టం: వీరఘట్టం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టర్ ప్రభాకరరెడ్డి పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారని డిప్యూటీ ఎంపీడీఓ సి.హెచ్.శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. మండలంలోని అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానం మరో వేడుకకు ముస్తాబైంది. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, దీక్షాధారణ, అంకురారోపణం, అగ్ని ప్రతిష్టాపన, బలిహరణ, తదితర కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామి కల్యాణ ఘట్టంలో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం జరిపించారు. వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపైకి గరుత్మంతుడి చిత్రపఠాన్ని ఎగుర వేసి సమస్త దేవతా మూర్తులను స్వామి కల్యాణానికి ఆహ్వానం పలికారు. నేడు స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవం స్వామి సన్నిధిలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం గురువారం వైభవంగా జరగనుంది. ఉదయం 8 గంటలకు ఆలయంలో శ్రీమద్రామాయణ పారాయణం, వేద పఠనం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి మూడు వాహనాలు(హంస, హస్వ, గరుడ) వాహనాల్లో స్వామి వారు రామతీర్థం పుర వీధుల్లో ఊరేగనున్నారు. కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ వీధిలో ఎదుర సన్నాహా మహోత్సవాన్ని జరిపిస్తారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను దేవాలయానికి తీసుకువచ్చి స్వామి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభిస్తారు. సరిగ్గా రాత్రి 10 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చి దిద్దారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై గణేష్ బుధవారం తెలిపారు. ● ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థాన అధికారులు ● స్వామి కల్యాణానికి వైభవంగా ధ్వజారోహణం -
లక్ష్యం సాధించారు..!
● అభినందిస్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు● ఉద్యోగాలు సాధించిన పలువురు యువత● గ్రూపు–2లో సత్తా చాటిన జిల్లా అభ్యర్థులుసాక్షి నెట్వ ర్క్:జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యం ఏర్పరుచుకుని కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించిన పలువురు జిల్లా అభ్యర్థులు ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటి ఉద్యోగాలు సాధించాచు. చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన టొంపల రాంబాబు గ్రూప్–2లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం రాంబాబు ఇదే మండలంలోని నిమ్మలవలసలో బీపీఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాంబాబు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ చదివించారు. అలాగే మండలంలోని దేవరపొదిలాం గ్రామానికి చెందిన గుణిదపు సురేష్ గ్రూప్–2లో ప్రతిభ చూపి డిప్యూటీ తహసీల్దార్ పోస్టు సాధించాడు. సురేష్ తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సింహాచలం రైతుకూలీలు. అన్నయ్యలు వేణు, భాస్కర్లు ఒకరు ఫార్మా కంపెనీలో, మరొకరు గ్రామ సచివాలయంలో పని చేస్తున్నారు. బొండపల్లిలో ఎకై ్సజ్ ఎస్సైలుగా ముగ్గురు బొండపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్2 ఫలితాల్లో బొండపల్లి మండలంలోని మూడు గ్రామాలకు చెందిన ముగ్గురు యువత ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్ ఎస్సైలుగా ఎంపికయ్యారు. మండలంలోని బిల్లలవలస గ్రామానికి చెందిన చందక ఇందు తొలి ప్రయత్నంలోనే గ్రూప్2 ఎగ్జామ్స్ రాసి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై ంది. ఆమె తల్లిదండ్రులు చందక రాజ్యలక్ష్మి, మృత్యుంజయరావులు వంట పని చేస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివించగా కుటుంబంతో పాటు గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిందని పలువురు అభినందిచారు. అలాగే మండలంలోని ముద్దూరు గ్రామానికి చెందిన బాలి సత్యనారాయణతో పాటు, నెలివాడ గ్రామానికి చెందిన కొమ్మ అనూరాధ ఎకై ్సజ్ ఎస్సైలుగా పోస్టులు సాధించారు. మండలంలోని ముగ్గురు ఎకై ్సజ్ ఎస్సైలుగా ఎంపిక కావడంతో అయా గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. -
హతవిధీ..
సాక్షి, పార్వతీపురం మన్యం: మక్కువ మండలం శంబర పోలమాంబ సిరిమాను ఉత్సవంలో మరుగుదొడ్ల వద్ద, వాహన పార్కింగ్ దగ్గర ఫీజులు వసూలు చేసే బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఉత్సవం సందర్భంగా ఏర్పాటైన దుకాణాల వద్దకు వెళ్లి ఆసీ లు వసూలు చేసే పని కూడా వారిదే. గ్రామ స్వరాజ్య స్థాపన.. ప్రజల ముంగిటకే పరిపాలనను చేరు వ చేయాలన్న సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సచివాలయ వ్యవస్థను.. నేడు చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయి కి తీసుకొచ్చిందో చెప్పేందుకు ఈ ఉదంతాలు నిదర్శనం. ఎందుకంత చులకన? గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారంతా ఉన్నత విద్యావంతులే. పీజీ, ఎంటెక్, బీటెక్, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి చదువు లు చదువుకున్నారు. సర్కారు కొలువు.. ఉన్న ఊరి లోనే ఉద్యోగమన్న ఆశతో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన సచివాలయాలకు పెద్దఎత్తున దరఖా స్తు చేసుకున్నారు. వేలాది ఉద్యోగాలను గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భర్తీ చేయడంతో.. చాలా మందికి కొలువులు లభించాయి. సచివాలయాల్లో ప్రజలకు అవసరమైన సుమారు 400 రకాలకు పైగా సేవలను వీరు అందించేవారు. సుమారు 13 విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో నే పరిస్థితి మారిపోయింది. నాడు గౌరవంగా పని చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు.. నేడు నిత్యం ఆత్మక్షోభను అనుభవిస్తూ పని చేస్తున్నారు. అందుకు కారణం.. వారి చదువుకు, చేయా ల్సిన విధులకు సంబంధం లేని పనులు అప్పగించడమే. విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రం, ఓబీసీ, రైతులకు రిజిస్ట్రేషన్ సేవలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పుల, చేర్పులు, ఆధార్ సేవలు, పింఛన్ల నమోదు, రేషన్ కార్డుల నమోదు, జారీ వంటి సేవలు అందించడం వీరి ప్రధాన విధు లు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తున్నారు. ఉన్న సిబ్బందిని డిప్యుటేషన్పై ఇతర విభాగాలకు పంపిస్తున్నారు. మిగిలిన వారికి సైతం వివిధ సర్వేలు అప్పగిస్తూ.. నిత్యం వీధుల్లోనే ఉంచుతున్నారు. దీంతో ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండటం అరుదుగా మారింది. ప్రజలకు సేవలు అందడం లేదు. పీ4 కార్యక్రమ బాధ్యతలు, వాట్సప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేలా డోర్ టు డోర్ వెళ్లి చెప్పడం, డ్రైడే –ఫ్రైడే, కుటుంబ సభ్యుల సర్వే, ఆధార్ ఆప్డేట్ ఈకేవైసీ, ఆధార్ సీడింగ్–వాహన్ డేటా(కొత్త వాహనం కొనుగోలు చేసిన వారికి ఆధార్ లింకు చేయడం), బయోమెట్రిక్ సర్వే, జీఎస్టీ అవగాహ న, పింఛన్ల పంపిణీ.. ఇలా లెక్కకు మించి బాధ్యత లు అప్పగించి.. బయటకు పంపేస్తున్నారు. తాజాగా జనగణనకు సైతం వీరి సేవలనే వినియోగించుకోనున్నారు. ఇప్పుడు శంబర జాతరలో మరో అడుగు ముందుకేసి ఏకంగా మరుగుదొడ్ల వద్ద, పార్కింగు స్థలాల చోట కాపలా ఉంచి, ఫీజు వసూలు చేసే బాధ్యత అప్పగించడంపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ పనిని ఆలయ కమిటీ చూసుకునేది. పాటల ద్వారా బయట వ్యక్తులకు అప్పగించేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకపోయింది. పెద్ద ఎత్తున ఆదాయం పొందాలన్న ఉద్దేశంతో పాటలన్నీ రద్దు చేసి.. సచివాలయ ఉద్యోగులనే వాహనా ల పార్కింగు వద్ద ఉంచి, టోకెన్లు ఇచ్చి, ఫీజు వసూలు చేసే బాధ్యత అప్పగించారు. మరుగుదొడ్లు, దుకాణాల వద్ద ఆసీల వసూలుకు కూడా వీరినే నియమించడంపై విస్మయం వ్యక్తమైంది. అంతేకాక.. విధుల్లో ఉన్నట్లు ఫొటోలు కూడా తీసి గ్రూపుల్లో అప్లోడు చేయాలని ఆదేశాలివ్వడంపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుని, ఏం పని చేస్తున్నామో అర్థం కావ డం లేదని వారంతా వాపోయారు. సచివాల య వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగానే ఇటువంటి విధానాలను ప్రభుత్వం అవలంబిస్తుందా? అని ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. -
వేడుకగా పోలమాంబ అనుపోత్సవం
మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, భక్తుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారి అనుపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 3.35 నిమిషాలకు జన్నివారి ఇంటి వద్ద పూజలందుకున్న అమ్మవా రి ఘటాలు తిరువీధి కార్యక్రమానికి బయలు దేరి గిరిడ వారింటికి, పూడి, కుప్పిలి వారిళ్లకు వె ళ్లి తొలి పూజలందుకొని అనంతరం గ్రామంలో అన్ని వీధులలో ఊరేగించారు. తిరిగి మంగళవారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో ప్రధాన రహదారి వద్ద అమ్మవారి గద్దెకు ఘటాలు చేరుకున్నాయి. కాసేపు అమ్మవారు సేదతీరి తిరిగి తిరువీధికి బయలుదేరి, బుధవారం ఉదయం 10 గంటలకు అమ్మవారి ఘటాలు ప్రధానాలయం సమీపంలో ఉన్న యాత్రా స్థలానికి చేరుకున్నాయి. అమ్మవారి గద్దె వద్ద పూజలు నిర్వహించి, భక్తుల మధ్య అమ్మవారికి ఉయ్యాలు కంబాలు కార్యక్రమం నిర్వహించారు. అక్కడ నుంచి వనంగుడికి బయలు దేరిన అమ్మవారి ఘటాలకు అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలికారు. యాత్రా స్థలం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వనంగుడికి కాలినడకన అమ్మవారి ఘటాలు బయలుదేరగా, వెనుకన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. యువత కేరింతలు, మేళతాళాలు, తప్పెడుగుళ్లు భక్తులను ఆకట్టుకున్నాయి. వనంగుడి వద్దకు చేరుకున్న ఘటాలను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణలు చేసిన అనంతరం వనంగుడిలో ఉంచారు. అనంతరం పూజారి జన్ని పేకాపు భాస్కరరావు, అలియాస్ జగదీశ్వరరావు ఆలయం చుట్టూ మూడుసార్లు తిరిగి కట్టువేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని, ఘటాలకు పూజలు చేశారు. సిరిమానోత్స వం కార్యక్రమం అనంతరం చదురుగుడి సమీపంలో నేలపై తిరగేసిన సిరిమాను బండికి భక్తు లు పూజలు జరిపారు. వచ్చే నెల 3వ తేదీన పోలమాంబ అమ్మవారు మారుజాతర కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలమాంబను దర్శించుకున్న రాజన్నదొర పోలమాంబ అమ్మవారిని బుధవారం మాజీ డిప్యూటీ సీం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు పీడి క రాజన్నదొర దర్శించుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో రాజన్నదొరను ఈఓ బి.శ్రీనివాస్ స్వాగతించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించా రు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు దుశ్శాలువతో సత్కరించారు. మక్కువ, సాలూరు, పాచిపెంట వైఎస్సార్సీపీ నాయకులు అల్లు వెంకటరమణ, జర్జాపు శ్రీను, ముదరాపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముత్యాలమ్మ పండగకు హాజరైన రాజన్నదొర కవిరిపల్లి గ్రామదేవత ముత్యాలమ్మ పండగకు, గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పెంట సంజీవునాయుడు ఆహ్వానం మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర హాజరయ్యారు. ఆయన వెంట పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు, బూత్ కమిటీ ఇన్చార్జ్ మావుడి తిరుపతినాయుడు తదితరులు ఉన్నారు. -
తెర్లాంలో చోరీ
తెర్లాం: మండల కేంద్రం తెర్లాంలోని ఓ ఇంటిలో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్బాబు మంగళవారం తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కందుల పైడిరాజు కుటుంబంతో కలిసి ఈనెల 25న తన అత్తవారింటికి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి తలుపులు తీయగా బీరువా తెరిచి ఉండడం, అందులో ఉంచిన రూ.50వేలు నగదు లేకపోవడంతో దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చి లబోదిబోమని విలపించాడు. దొంగలు ఇంటి వెనుక భాగంలో ఉన్న కిటికీ అద్దాలు పగలగొట్టి, గ్రిల్స్ తీసి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చిందరవందర చేసి చివరకు బీరువా పగలగొట్టి అందులో ఉన్న నగదు తీసుకుని వెళ్లిపోయారు. ఇదే విషయమై స్థానిక పోలీస్స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ను రప్పించి తనిఖీ చేయించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రహదారి భద్రత నియమాలు పాటించండి
విజయనగరం క్రైమ్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్పీ దామోదర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయనగరంలోని రింగ్ రోడ్లో గల పీఎస్ఆర్ స్కూల్లోని యోగా సెంటర్లో యోగా భారత్ అధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ఏఆర్.దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఆందోళన, మానసిక ఒత్తిడి మధ్య ధ్యానం ఒక శక్తివంతమైన సాధనంగా నిలుస్తుందన్నారు. నిత్యం చేస్తున్న యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, భావోద్వేగం సమతుల్యమై, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరికీ ధ్యానం సమానంగా ఉపయోగకరమని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించి, శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవరుచుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, రిటైర్ అయిన వారిని, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చేసే బెదింరింపు కాల్స్ కు భయపడవద్దన్నారు. ఇటువంటి నేరగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోన్ చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ పోస్టర్ను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యోగా టీచర్ ఎస్.వి.కృష్ణారెడ్డి, జాతీయ స్వచ్ఛ భారత్ అవార్డు గ్రహీత ఎం.రామ్మోహన్, ఉపాధ్యాయులు రవి, సత్యనారాయణ, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, డాక్టర్ రమణ గార్లు, విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సీహెచ్.సురినాయుడు పాల్గొన్నారు. -
తప్పులు లేని పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీకి శ్రీకారం
● భూ సమస్యల పరిష్కారానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్విజయనగరం అర్బన్: జిల్లాలో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు నిర్వహించిన భూ రీ–సర్వేలో వచ్చిన తప్పులను సరిదిద్దడం, తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించడం, అర్హులైన రైతులందరికీ కచ్చితమైన పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత పారదర్శకంగా తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించాలని సిబ్బందిని ఆదేశించారు. రికార్డులను జిల్లా స్థాయిలో సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకుని కచ్చితమైన వివరాలతో రికార్డులను తయారు చేయాలని సూచించారు. రీ సర్వే పూర్తయిన భూముల సంబంధిత రికార్డులను అప్డేట్ చేసి అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో రీ సర్వే పూర్తయిన 432 గ్రామాల్లో సుమారు 2.03 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ వరకు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందని, నెలవారీ లక్ష్యాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెలకు 12 గ్రామాల్లో 7,993 ఖాతాలను పరిశీలించాల్సి ఉందని ఏప్రిల్ నెలకు 14 గ్రామాలు ఎంపిక చేశామని చెప్పారు. రెవెన్యూ క్లినిక్లకు పదే పదే వినతులు వస్తున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్ఓ ఈ.మురళి, ఆర్డఓ దాట్ల కీర్తి, సర్వే శాఖ ఎ.డి విజయకుమార్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీపై దాడి
● దశల వారీ పోరాటాలకు సీపీఎం పిలుపు విజయనగరం గంటస్తంభం: ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దశల వారీ పోరాటాలు చేపడుతున్నామని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎల్బీజీ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోరాటాల షెడ్యూల్ను విడుదల చేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని మోదీ ప్రభుత్వం పథకంగా మార్చి కోట్లాది మంది కూలీల ఉపాధిని దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. గ్రామాల్లో సర్వేలకు వెళ్లే సిబ్బందిని ప్రజలే నిలదీస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ఈనెల 30న గాంధీ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమాలు, ఫిబ్రవరి 2న సచివాలయాల వద్ద నిరసనలు, వినతులు, 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మార్చిలో చలో లోక్ భవన్ చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఉపాధి హామీ వంటి ప్రజల సమస్యలను విస్మరించి సీఎం దావోస్ వెళ్లడంపై తమ్మినేని ప్రశ్నించారు. నిజంగా పెట్టుబడులు రావాలంటే ప్రజలకు పనికల్పించి వారి ఆదాయాలు పెంచాలన్నారు. -
ప్రజల్లోకి టీడీపీ వైఫల్యాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఎన్నికల సమయంలో హామీలిచ్చి..అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు గరివిడిలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయి రాజకీయ పరిణామాలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వారి కష్టాలను తెలుసుకోవాలనే ఆలోచనతో గ్రామస్థాయిలో కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలనేదే జగన్మోహన్రెడ్డి ఆలోచన అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం స్థాయిలో సమావేశాలు జరుగుతాయని, ముందుగా చీపురుపల్లి నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేశామని, సమర్థవంతంగా గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. నియోజకవర్గంలో 27 క్లస్టర్లు ఏర్పాటు చేశామని, వీరితో పాటు రెండు గ్రామాలకు ఇద్దరు చొప్పున 69 మంది క్లస్టర్ ఇన్చార్జ్లు ఉంటారని, వారంతా ముందుండి పార్టీని నడిపిస్తారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తోటపల్లి సాగునీరు వస్తోందా? లేదా? అని ప్రశ్నించగా ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉన్నందున నీరు వచ్చిందని, సాధారణంగా తోటపల్లి సాగునీరు వచ్చే పరిస్థితి లేదని నాయకులు ఆయనకు తెలియజేయగా ఇలాంటి సమస్యలపై రైతులతో మాట్లాడాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారనే విషయం అందరీకి తెలిసిందేనన్నారు. గ్రామంలోకి వెళ్లినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఫీజు రియింబర్స్ మెంట్ ప్రభుత్వం ఇస్తోందా? లేదా అని అడిగి తెలుసుకోవాలి. అదే విధంగా ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయా? ఉపాధి బిల్లులు వస్తున్నాయా? లేదా? ఇలా అన్ని సమస్యలపై స్థానిక ప్రజలతో మాట్లాడాలని సూచించారు. ప్రజల మేలు కోసం వైఎస్సార్సీపీ తరఫున ప్రజల సమస్యలను ప్రశ్నిస్తేనే మంచి జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలతో మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం జగన్మోహన్రెడ్డిలో ఉందని, తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి కమిటీల నియామకం సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ దిశానిర్దేశం మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే క్లస్టర్ ఏర్పాటు, గ్రామస్థాయి కమిటీల నియామకం జరుగుతోందన్నారు. గ్రామస్థాయిలో అన్ని విభాగాల వారీగా కమిటీల నియామకం కావాలన్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీలో ఉత్సాహంగా ఉన్న వారిని ఎంపిక చేసి ప్రాధాన్యం కల్పిస్తే పార్టీ మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకురాలు బొత్స అనూష, వైఎస్సార్సీపీ గరివిడి మండల అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొణిశ కృష్ణంనాయుడు, వైఎస్సార్సీపీ చీపురుపల్లి మండల అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచారవిబాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనువాసులు నాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్వీ.రమణరాజు, పార్టీ మండల అధ్యక్షుడు తాడ్డి వేణు, మాజీ జెడ్పీటీసీ కోట్ల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సీర అప్పలనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, నాలుగు మండలాల పీఏసీఎస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సమర్థంగా గ్రామస్థాయి కమిటీల నిర్వహణ గ్రామస్థాయిలోనే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు ప్రశ్నలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గరివిడిలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం -
పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు
సీతానగరం: మండలంలోని వివిధ గ్రామాల పొలాల్లో ఐదు రోజులుగా 8 ఏనుగుల గుంపు సంచరిస్తున్నందున ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రామవరం, ఆర్.వెంకంపేట గ్రామాల్లోని పొలాల్లో పగటిపూట ఏనుగులు సంచరించాయి.రబీ సీజన్లో రైతులు సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేయడంతో కళ్లాల్లో రైతులు గడ్డి వాముల్లో భధ్రపర్చుకున్న ధాన్యం బస్తాలను పసిగట్టి తినేస్తున్నాయి. మిగతా ధాన్యం చిందరవందర చేస్తున్నాయి. ఏనుగుల గుంపును పసిగట్టేందుకు వచ్చిన అటవీశాఖ, పోలీస్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా ఏనుగుల రాకపోకలను గమనిస్తూ ఆయాగ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
సచివాలయ ఉద్యోగులకు..
● శంబర పోలమాంబ జాతరలో ఉద్యోగులను అవమానపరిచే ఘటన పార్కింగ్ ఫీజు వసూలు బాధ్యత సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ: సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అవమానించింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ సిరిమానోత్సవంలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల వద్ద, వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు, షాపుల ఆసీల వసూలు విధులు అప్పగించడంపై వివాదం నెలకొంది. ఏటా శంబర పోలమాంబ ఉత్సవ సమయంలో ఆలయ కమిటీ.. గ్రామ పంచాయతీ దుకాణాల వద్ద ఆసీలు, పార్కింగ్ ఫీజు, మరుగుదొడ్ల నిర్వహణ ఫీజు వసూలు చేసేది. ఈ ఏడాది ప్రజాప్రతినిధులు, అధికారులు భిన్నంగా వ్యవహరించారు. ఉన్నత విద్యావంతులైన గ్రామ సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా పార్కింగుల వద్ద టోకెన్ ఇవ్వడం, దుకాణాల ఆసీల వసూలు బాధ్యతలను అప్పగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఏపీ ప్రభుత్వ గ్రామ సచివాలయ శాఖ గుర్తింపు కార్డులు వేసుకుని మరీ ఉద్యోగులు అక్కడ విధులు నిర్వర్తిస్తుంటే.. జాతరకు వచ్చిన భక్తులు విస్తుపోయారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరందరికీ గౌరవ ప్రదమైన ఉద్యోగాలిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వారి స్థాయిని దిగజార్చేలా అవమానిస్తోందని చర్చించుకోవడం కనిపించింది. మక్కువ మండలంలోని 11 గ్రామ సచివాలయాల నుంచి సుమారు వంద మంది ఉద్యోగులను విధులకు వినియోగించారు. వీరిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. -
మార్కెట్ భూమ్
● ఫిబ్రవరి 1 నుంచి పొలాలకు కొత్త ధర ● గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం ● ప్రాంతాన్ని బట్టి మారనున్న రేట్లు వీరఘట్టం/పాలకొండ: భూముల మార్కెట్ విలువ పెంపునకు రిజిస్టేషన్ శాఖ ప్రతిపాదనలు సిధ్ధం చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పాలకొండ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎల్.ఎన్.పేట, బూర్జ, రేగిడి, సంతకవిటి, పాలకొండ, వీరఘట్టం, భామిని మండలాలు ఉన్నాయి.ఈ ఏడు మండలాలకు సంబంధించి 350 రెవెన్యూ గ్రామాలున్నాయి.ఈ గ్రామాల్లో సుమారు 20 శాతం వరకు భూముల మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతనంగా సవరించనున్న మార్కెట్ విలువ ప్రకారం పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రూ.35 కోట్ల వరకు అదనంగా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిపాదన ఇలా.. ప్రస్తుతం పాలకొండ నగర పంచాయతీలో ఎకరా భూమి మార్కెట్ ధర రూ.17 లక్షలు ఉంది. కొత్త నిబంధనల ప్రకారం 20 శాతం పెరుగుతుంది. అంటే ఎకరాకు అదనంగా రూ.3.40 లక్షలు పెరుగుతుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి పాలకొండ నగర పంచాయతీలో భూమి ఎకరా మార్కెట్ ధర 20.40 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఇలా అన్ని మండలాల్లో ఉన్న భూముల మార్కెట్ ధరలు ప్రభుత్వ లెక్కల ప్రకారం పెరగనున్నాయి.అయితే ప్రాంతాన్ని బట్టి ఈ భూముల మార్కెట్ ధరలు మారుతాయి. పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు.. ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్కు భూమి ధరలో 7.5 శాతం వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు భూమి ధర రూ.1 లక్ష ఉంటే 7.5 శాతం రిజిస్ట్రేషన్ అంటే రూ.7,500లు చెల్లించాలి. ఫిబ్రవరి 1 నుంచి 20 శాతం భూమి ధర పెరుగుతుంది.అంటే మార్కెట్ ధర రూ.1.20 లక్షలు అవుతుంది. దీనికి 7.5 శాత రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.9వేలు చెల్లించాలి. అదనంగా మరో రూ.1500 రిజిస్ట్రేషన్ చార్జీ భారం ప్రజలపై పడనుంది.భూముల ధరలు పెంచేసి రిజిస్ట్రేషన్ ఫీజుల భారం ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సవరణ పనులిలా.. భూముల మార్కెట్ ధరలు పెంచేందుకు ఈ నెల 23న మార్కెట్ విలువల సవరణ నమూనాను నోటీసు బోర్డులో ప్రదర్శించారు.ఈనెల 24న సంబఽంధిత కమిటీల ద్వారా తాత్కాలిక అనుమతులు, 25న వెబ్సైట్లో డేటా ప్రదర్శించారు. ఈనెల 27 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు,సూచనలు కోరడం, 29న డేటా ఎంట్రీ పూర్తి, చెక్ లిస్ట్ జనరేషన్, ఫారం–1, 4 పరిశీలన, 30న అభ్యంతరాల పరిష్కారం, 31న మార్కెట్ విలువల సవరణ కమిటీల ద్వారా తుది అనుమతులు, పిబ్రవరి 1న పెరిగిన విలువ అమల్లోకి తీసుకురానున్నట్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పేర్కొంది.ప్రణాళిక సిధ్ధంభూముల మార్కెట్ విలువలను సవరించి వచ్చే నెల 1 నుంచి అమలు చేస్తారు. దీనిపై ఇప్పటికే సవరణకు సంబంధించి ప్రక్రియ చేపట్టాం.మా కార్యాలయం పరిధిలోని మండలాలు, గ్రామాలు, రుడా పరిధిలో ఉన్న దృష్ట్యా అక్కడ కూడా భూముల మార్కెట్ విలువ పెరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.దీనికి సంబంధించిన ప్రణాళిక సిధ్ధం చేశాం. కె.శ్రీరామమూర్తి, సబ్ రిజిస్ట్రార్, పాలకొండ -
వైభవంగా ఉమాసదాశివుని కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమా సదాశివ స్వామి ఆలయంలో శివ పార్వతుల వార్షిక కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ముందుగా గణపతి ఆరాధన అనంతరం, ఉమా సదాశివస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. వివిధ రకాల పుష్ఫాలు, స్వర్ణాభరణాలతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయానికి తీసుకువచ్చి వేద మంత్రోచ్చారణ నడుమ శివ పార్వతుల కల్యాణాన్ని కనుల పండువగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఫలించిన అధికారుల కృషి
–8లోదారులన్నీ జనసంద్రమే.. ఎటు చూసినా కనుచూపు మేర ‘శంబర’మే. చల్లని తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. గిరిజనుల కొంగుబంగారం పోలమాంబ... వనాన్ని వీడి, జనంలోకి వచ్చింది. తన భక్తజనం జేజేలు చూసి మురిసింది. 30 అడుగుల సిరిమానుపై పూజారి రూపంలో ఠీవీగా ఆసీనులై, పురవీధుల్లో ఊరేగింది. చల్లని చూపుతో ఆశీర్వచనాలు అందజేసింది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా తిలకించిన భక్తకోటి ఆనందంతో పులకించిపోయింది. బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, పార్వతీపురంమన్యం/మక్కువ/పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్రుల కల్పవల్లి, చల్లనితల్లి శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను చూసి తరించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు పొరుగున్న ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసిన పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలిరాగా.. భక్తులు జయజయధ్వానాల నడుమ శంబర గ్రామం పులకించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సిరిమానోత్సవాన్ని ప్రారంభించాలని భావించిన అధికారులు.. అనుకున్న సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా చేయలేకపోయారు. గ్రామపెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపించడంతో ఘటాలను తీసుకురావడంలో జాప్యమైంది. సాయంత్రం 4.20 నిమిషాలకు పూజారి జన్నిపేకాపు భాస్కరరావు అలియాస్ జగదీశ్వరరావు సిరిమానును అధిరోహించారు. దీంతో ఏటా నిర్వహించిన సమయం కంటే సుమారు గంట సమయం ఆలస్యంగా ఈ ఏడాది ఉత్సవం మొదలైంది. పురవీధుల్లో ఊరేగిన అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రధానాలయం సమీపంలోకి సిరిమాను చేరుకుంది. ముందుగా జన్నివారి ఇంటి నుంచి ఘటాలను అమ్మవారి ఆలయంలోకి తీసుకొచ్చి, పూజలు నిర్వహించారు. అనంతరం సిరిమాను ఉండే ప్రదేశానికి తీసుకువచ్చారు. ప్రధానాలయం నుంచి అమ్మవారు వచ్చే మార్గంలో నేలపై చీరలను పరిచి.. వాటిపై చిన్నారులను పడుకోబెట్టారు. వారిపై అమ్మవారి ఘటాలు దాటుతూ వెళ్లడంతో భక్తులు పులకించిపోయారు. జన్నివారి ఇంటి నుంచి అమ్మవారి ఘటాలను గిరడ వారింటికి, ఆ తర్వాత మునసబు, కరణం ఇళ్లకు తీసుకువెళ్లి పూజలు జరిపించారు. రాత్రంతా అమ్మవారి ఘటాలు గ్రామంలో తిరువీధి చేసి, బుధవారం ఉదయం 10 గంటల సమయానికి ప్రధాన రహదారి వద్ద అమ్మవారి గద్దెకు చేరుకుంటాయి. ఆ ప్రదేశంలో అమ్మవారి ఘటాలకు ఉయ్యాల కంబాల కార్యక్రమం నిర్వహించి, అనుపోత్సవంలో భాగంగా అమ్మవారి ఘటాలను వనంగుడికి తీసుకువెళ్తారు. అమ్మవారి జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఎస్పీ మాధవ్రెడ్డి పర్యవేక్షణలో 683 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు వినియోగించారు. రోప్ పార్టీ, స్పెషల్ పార్టీ, క్రైమ్ పార్టీలు ఎవరికి వారిగా విధులు కేటాయించారు. డ్రోన్ కెమెరాలతో పాటు.. 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిరిమాను వద్ద రోప్ పార్టీ.. భక్తుల తోపులాటలు జరగకుండా నివారించగలిగింది. పోలమాంబ అమ్మవారికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతించి, ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్, వైఎస్సార్సీపీ పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, సాలూరు ఏఎంసీ చైర్పర్సన్ దండి అనంతకుమారి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. పోలమాంబకు సమర్పించేందుకు పట్టువస్త్రాలు తీసుకుని వస్తున్న మంత్రి సంధ్యారాణి సంప్రదాయం ప్రకారం ఘటాలకు పూజలుతల్లీ.. కరుణించమ్మా..గతం మాదిరిగానే ఈ ఏడాది కూడా అధికారులు సమన్వయంతో పనిచేసి క్యూలైన్లు ఏర్పాటు, బస్సుల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు వంటి చర్యలు పక్కాగా అమలు చేశారు. ఉదయం 9.30 గంటల తర్వాత భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూలైన్లు సరిపడక భక్తులు ఎండలో బారులు తీరడం కనిపించింది. భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని అధికారులు ముందే ఊహించి, తగిన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు సఫలీకతమయ్యారు. మొత్తంగా 220 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటేశ్వరావు, సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఏఎస్పీ వి.మనీషారెడ్డి ఆద్యంతం పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు చేశారు. క్యూలైన్లకు సమీపంలో తలనీలాలు సమర్పించే శిబిరం, అక్కడకు కొద్దిదూరంలోనే కోళ్లు, గొర్రెలు మొక్కులు తీర్చుకొనే ప్రదేశాన్ని కేటాయించారు. పులకించిన భక్త జనం ఉత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రంలోని నలుమూలలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గతేడాది కంటే.. ఈ సారి అధికారుల అంచనాలను మించి భక్తుల తాకిడి పెరిగింది. 10 వారాల వరకు అమ్మవారి జాతర జరగనున్నప్పటికీ.. ఉచిత బస్సు కారణంతో తొలివారం బాగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారు జాము నుంచి ఉదయం 9.30 గంటల వరకు భక్తుల తాకిడి తక్కువగా కనిపించింది. తర్వాత ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో శంబర గ్రామం కిటకిటలాడింది. గ్రామంలోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రం కనిపించింది. పటిష్ట పోలీసు బందోబస్తు అంబరాన్నంటిన..సిరిమాను శంబరం గంట ఆలస్యంగా ప్రారంభమైన సిరిమానోత్సవం కనుల పండువగా పోలమాంబ సిరిమానోత్సవం శంబర జాతరకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తజనం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సంధ్యారాణి శంబరలో సిరిమాను తిరువీధి (ఇన్సెట్లో) సిరిమాను అధిరోహించిన పూజారి భాస్కరరావు -
వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలి
● బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ ● జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీవిజయనగరం అర్బన్: ఇండియన్ బ్యాంకింగ్ పరిశ్రమలో వారానికి ఐదు పనిదినాల విధానాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం బ్యాంకులకు సెలవులుగా ఉన్న రెండవ, నాల్గవ శనివారాలతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మంగళవారం చేపట్టిన ఒకరోజు సమ్మెలో భాగంగా జిల్లాలోని 400కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సిబ్బంది పట్టణంలోని కోట వద్ద ఎస్బీఐ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కోట జంక్షన్ నుంచి మూడులాంతర్ల కూడలి, గంటస్తంభం జంక్షన్ మీదుగా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కూడలి వరకు భారీ ల్యారీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) సిఫార్సుల ఆధారంగా ఐబీఏ–యూఎఫ్బీయూ మధ్య 2023 డిసెంబర్ 2న కుదిరిన అవగాహన ఒప్పందం, 2024 మార్చి 8న కుదిరిన సెటిల్మెంట్/జాయింట్ నోట్ ప్రకారం ఈ డిమాండ్ అమలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆర్బీఐ, సెబీ, ఎల్ఐసీ, ఐఆర్డీఏ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో వారానికి ఐదు పని దినాల విధానం అమలులో ఉందని అదే విధానాన్ని బ్యాంకింగ్ రంగంలో కూడా అమలు చేయాలని కోరారు. స్తంభించిన రూ.500కోట్ల లావాదేవీలు సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. జిల్లాలోని 400కు పైగా ఉన్న పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ల కార్యాలయాలలో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించకపోవడం వల్ల దాదాపు రూ.500 కోట్ల లావాదేవీలు జరగలేదని ఆయా బ్యాంకింగ్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో యూఎఫ్బీఐ కన్వీనర్ మురళీశ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శి (ఎస్బీఐఎస్యూఏసీ, ఎన్సీబీఈ) ఎం.రమేష్కుమార్, జిల్లా బ్యాంక్స్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బి.ప్రసాద్, ఎస్బీఐఓఏ విజయనగరం రీజియన్కు చెందిన డి.మృదుల, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పెన్షన్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ అరసాడ వెంకటరావు, జాయింట్ సెక్రటరీ కొండపల్లి సురేష్, యూవీమురళీవెంకట కృష్ణ, కొప్పిలి వెంకట శ్రీనివాసరావుతోపాటు వివిధ బ్యాంక్ల సిబ్బంది ఐవీరమణమూర్తి, శ్రావణ్, భానోజీ, చంద్రశేఖర్, సంతోష్, బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు అమ్మవారికి కుంకుమార్చన జరిపించారు. మూడులాంతర్లు వద్దనున్న బాలాలయంలోను, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారికి మహిళలు పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం సులభం● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని, వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లా న్యాయవాదులను శిక్షణ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణను అందిస్తున్న మాస్టర్ ట్రైనీస్తో మాట్లాడి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, ట్రైనీ మీడియేటర్స్ పాల్గొన్నారు. రైతన్నకు యూరియా కష్టాలువంగర: మండల పరిధి అరసాడ మన గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం రైతులు మంగళవారం బారులు తీరారు. ఈ సెంటర్కు 12టన్నుల (266 బస్తాలు) యూరియా మంజూరైంది. రెండు రోజుల పాటు అరసాడ, బాగెంపేట, నీలయ్యవలస గ్రామాలతో పాటు రేగిడి మండలంలోని ఉణుకూరు, ఒప్పంగి, కోడిశ, కొండవలస గ్రామాల్లోని రైతులకు ఒక పాస్పుస్తకానికి ఒక యూరియా బస్తా చొప్పున మండల వ్యవసాయాధికారులు రెండు రోజులుగా టోకెన్లు జారీ చేశారు. అయితే వచ్చిన యూరియా తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఆయా గ్రామాల అన్నదాతలు మన గ్రోమోర్ సెంటర్ వద్ద క్యూ కట్టారు. వెయ్యి బస్తాల యూరియా డిమాండ్ ఉన్నప్పటికీ 266 బస్తాలు మంజూరు చేయడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం యూరియా సమస్య పట్ల నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏవో తట్టికోట కన్నబాబు వద్ద సాక్షి వివరణ కోరగా అవసరం మేరకు యూరియాను తెప్పించి సరఫరా చేస్తామని వెల్లడించారు. -
ఆకట్టుకున్న వర్ణచిత్రం
గరుగుబిల్లి: దేశభక్తిని ప్రబోధించే జాతీయ జెండాలో భారతమాత వర్ణచిత్రం పలువురిని ఆకట్టుకుంది. సోమవారం 77వ గణతంత్ర దినో త్సవాన్ని పురస్కరించుకుని గరుగుబిల్లి మండలంలోని నాగూరుకు చెందిన ప్రముఖ నఖ చిత్రకారుడు పల్ల పరిశినాయుడు రూపొందించిన జాతీయజెండాలో భారతమాత వర్ణచిత్రం పలువురు దేశభక్తి ప్రియులను ఆకర్షించింది. ఆయన ప్రత్యేక పర్వదినాల్లో నఖచిత్రాలు, వర్ణచిత్రాలు వేస్తుంటారు. పాలకొండ రూరల్: దేశభక్తిని చాటుకునే విధా నం గుండెల్లోనే కాదు.. గుడిలో కూడా అని చాటుకున్నారు పాలకొండ వాసులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక నక్కలపే ట మరకత లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అర్చకుడు పర్రి శరత్కుమా ర్ మరకత లింగాన్ని త్రివర్ణ పతాకంలో అలంకరించారు. గుమ్మలక్ష్మీపురం: పంటలకు సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కురుపాం మండలం ఊసకొండ పంచాయతీలోని పనసభద్ర గిరిజన రైతులు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని కోరారు. గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రొయ్యలగుమ్మి చెక్డ్యాం పాడైందని గుర్తుచేశారు. చెక్డ్యాం నుంచి సాగునీటిని పంట పొలాలకు మళ్లించేందుకు కాలువను నిర్మించాలని కోరారు. -
సీఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని కన్నెపు దొర వలస గ్రామానికి చెందిన సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్, జాగాన కిరణ్ కుమార్(41) బెంగళూరు ఎయిర్ పోర్ట్లో పనిచేస్తున్నాడు. ఏం కష్టమొచ్చిందో తెలియదుగానీ ఆదివారం సాయంత్రం సుమారు ఐదున్నర గంటల సమయంలో బెంగళూరు రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన 2009 నుంచి హెడ్ కానిస్టేబుల్గా బెంగళూరు ఎయిర్ పోర్ట్లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. కానిస్టేబుల్గా దృఢమైన సంకల్పంతో పది మందికీ ఆదర్శంగా ఉన్న కిరణ్ గ్రామంలో ఏ మంచి కార్యక్రమం జరిగిన తనవంతు సహాయ సహకారలందించి అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్కు భార్య పావని ఇద్దరు కుమారులు యశ్వంత్నాయుడు సుస్మిత నాయుడు ఉన్నారు. సోదరుడు గంగు నాయుడు కుటుంబ సభ్యులతో తిరుపతి దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో సమాచారం తెలియడంతో అక్కడి నుంచి అలాగే బెంగళూ రు వెళ్లినట్లు తెలిపారు. ఈ వార్త విన్న తండ్రి జాగాన గుంపు స్వామి. తల్లి విజయమ్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాని కి బెంగళూరులో పోస్టుమార్టం అనంతరం కన్నపుదొరవలకు పంపిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. -
జీఆర్పీ అదుపులో సెల్ఫోన్ల చోరీ నిందితుడు
విజయనగరం క్రైమ్: రైల్వే ప్లాట్ఫాంలలో, స్టేషన్లలో, రైళ్లలో సెల్ఫోన్ లను దొంగిలించే నిందితుడ్ని విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్సై బాలాజీరావు సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని కటక్కు చెందిన పియ్యాల భిషాల్ ప్రయాణికుల మాదిరిగానే రైల్వే స్టేషన్ లకు వెళ్తూ..ట్రైన్లలో, స్టేషన్లో ప్లాట్ ఫాం లవద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికుల సెల్ ఫోన్ లను అపహరిస్తూ ఉండేవాడు. ఇటీవల స్టేషన్ లో సెల్ఫోన్ పోయిందని ఓ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన జీఆర్పీ సిబ్బంది ఎట్టకేలకు బిషాల్ ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువ చేసే మూడు 3 మొబైల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రైల్వేకోర్టులో ప్రవేశ పెట్టినట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీరావు వివరించారు. రాజుపేటలో ఏనుగుల సంచారం● మొక్కజొన్న పంట ధ్వంసం బొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ పరిధి రాజుపేట గ్రామంలో ఏనుగులగుంపు సంచరించి ఆందోళన సృష్టించింది. సీతానగరం మండలం బక్కుపేట నుంచి ఆదివారం రాత్రి రాజుపేట గ్రామానికి చేరుకున్న ఎనిమిది ఏనుగుల గుంపు మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయగా, అపరాలు, చెరకు పంటలను నాశనం చేశాయి.రాజుపేట గ్రామానికి చెందిన కర్రి మన్మధరావు, అప్పలనాయుడుల రెండున్నర ఎకరాల మొక్కజొన్న పంటను, కళ్లాల్లో ఉన్న రైతుల ధాన్యం నిల్వలను ధ్వంసం చేశాయి. సోమవారం ఉదయం రాజుపేట నుంచి సీతయ్యపేట గ్రామానికి చేరుకుని గ్రామ శివారులోని కళ్లాల్లో ఏనుగులు తిష్ఠవేశాయి. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది వాటిని పర్యవేక్షిస్తున్నారు.ఏనుగుల గుంపు వద్దకు ఎవరూ వెళ్లకుండా గ్రామస్తులను హెచ్చరిస్తున్నారు. ఏనుగులు మళ్లీ తిరిగి వెళ్లేవరకు ఆయా గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగుల గుంపునుంచి ప్రజలకు హాని జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అలరించిన బండ్ల వేషాలు ● ఎనిమిది గ్రామాలకు సంబంధించి బల్లంకి తీర్థం ● అమ్మవారిని దర్శించుకున్న భక్తులువేపాడ: మండలంలో ప్రసిద్ధి చెందిన బల్లంకి గ్రామదేవత మరిడిమాంబ అమ్మవారి తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన బండి ప్రభలు పలువురిని ఆకట్టుకున్నాయి. 26,27,28 మూడురోజులపాటు ఈ తీర్థమహోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం తీర్థంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం మహిషాసుర మర్దిని తులసీ జలంధర, ప్రమీలార్జునీయం, కురుక్షేత్రం, ద్రౌపది వస్త్రాపమరణ, శ్రీరామపట్టాభిషేకం, హానుమద్రామ సంగ్రామం, గరుడ గర్వభంగం తదితర బండ్ల వేషాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అలాగే మహిళాకోలాటం, పులివేషాలు, కోయడ్యాన్సులు, డప్పువాయిద్యాలు రెల్లివేషధారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తీర్థం బల్లంకి, బానాది, ఎం.శింగవరం, భర్తవానిపాలెం, నీలకంఠరాజపురం, పెదగుడిపాల జమ్మాదేవిపేట తదితర గ్రామాలకు సంబంధించి తీర్థం కావడంతో జనసందోహంగా తీర్థం జరిగింది. తీర్థంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వల్లంపూడి ఎస్సై సుదర్శన్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. ఈ నెల 28న ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీసభ్యులు తెలిపారు. -
రారండోయ్.. అమ్మ జాతర చూసొద్దాం..
● సంబరానికి సిద్ధం ● నేడు పోలమాంబ సిరిమానోత్సవం ● పూర్తికావచ్చిన ఏర్పాట్లు మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి సిరిమాను సంబరం మంగళవారం జరగనుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. జాతరకు ఇతర జిల్లాలతోపాటు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు, జిల్లా నలుమూలల నుంచి సుమారు 3లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనావేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి సిరిమాను, సిరిమాను బండిని సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3గంటల ప్రాంతంలో పూజారి జన్నిపేకాపు భాస్కరరావు సిరిమానును అధిరోహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామానికి సర్కస్లు, వినోదకార్యక్రమాలు చేరుకున్నాయి. జాతర బందోబస్తు వివరించిన అడిషనల్ ఎస్పీ జాతరలో పోలీసులు ఎక్కడెక్కడ విధులు నిర్వహించాలో సిబ్బందికి అడిషనల్ ఎస్పీ మహేశ్వరరావు, ఏఎస్పీ వి.మనీషారెడ్డి సూచించారు. జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పనిచేయాలని చెప్పారు. సీసీకెమెరాలు ముఖ్యమైన ప్రదేశాలలో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పోలీస్ కంట్రోల్రూమ్ నుంచి జాతర పర్యవేక్షించనున్నట్లు వివరించారు. దేవాదాయశాఖ ఏర్పాట్లుపూర్తి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో ఆలయ ఈవో బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానాలయం, వనంగుడి వద్ద ఉచితం, రూ.20, రూ.100 టికెట్ ద్వారా భక్తులు దర్శనం చేసుకునేందుకు క్యూలు ఏర్పాటుచేశారు. భక్తులుకు ఎండ తగలకుండా ఉండేందుకు క్యూల పైన పెండాల్స్, తాటాకుల పందిరి ఏ ర్పాటు చేశారు. క్యూల వద్ద చిన్నపిల్లలుకు అందించే విధంగా 50లీటర్ల పాలు ఏర్పాటుచేశారు. అలాగే 20వేల లడ్డూప్రసాదాన్ని తయారుచేశారు. భక్తులకు అవసరమైనంత వీలుగా పులిహోర ప్రసాదాన్ని తయారుచేయించారు. గ్రామంలోని వనంగుడి, చదురుగుడి క్యూల పక్కన, అవుట్గేట్ వద్ద, వైఎస్సార్ విగ్రహం వద్ద ప్రసాదం విక్రయా నికి నాలుగుచోట్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల ఏర్పాటువచ్చిన భక్తులు కాలకత్యాలను తీర్చుకునేందుకు వీలుగా శాశ్వత మరుగుదొడ్లు 56, బయోటాయిలెట్లు 18 ఏర్పాటుచేశారు. రెండు చోట్ల మహిళల వస్త్ర మార్పిడి గదులు ఏర్పాటుచేశారు. కూల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించారు. 683మంది పోలీసుల బందోబస్తు భక్తులు ఇబ్బందులు పడకుండా 683మంది పోలీసులు ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిహించనున్నారు. ముగ్గురు డీఎస్పీలతోపాటు, 17మంది సీఐలు, 48మంది ఎస్సైలు, ఏఎస్సైలు,హెచ్సీలు, కానిస్టేబుల్స్, మహిళాపోలీసులు, హోంగార్డులు, ఆర్డ్డ్ ఫోర్స్తో పాటు, ఎస్టీఎఫ్ జాతరలో విదులు నిర్వహించనున్నారు. ఐదు చోట్ల వైద్యశిబిరాలు గ్రామంలోని వనంగుడి, క్యూలు, అంగన్వాడీకేంద్రం, పీహెచ్సీ, రామమందిరం వద్ద ఐదు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్యశిబిరాల వద్ద ఏడుగురు వైద్యాధికారులతోపాటు, సుమారు 50మంది పారామెడికల్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. చురుగ్గా పారిశుద్ధ్య పనులుఃజాతరలో 200మంది పారిశుద్ద్య కార్మికులుతో పారిశుద్ద్య పనులు జరిస్తున్నారు. జాతరలో నెలకొన్న పారిశుధ్య లోపాన్ని యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు డీపీవో ఎన్.కొండలరావు చర్యలు చేపట్టారు. అయిదుచోట్ల పార్కింగ్ ఏర్పాటుశంబర గ్రామానికి చేరుకునే వాహనాలకు ఐదు చోట్ల పార్కింగ్స్థలాలు ఏర్పాటు చేశారు. జాతరకు 222 బస్సులు పార్వతీపురం, సాలూరు, విజయనగరం, శ్రీకాకుళం, ఎస్.కోట, పాలకొండ డిపోల నుంచి సుమారు 222బస్సులను జాతర సందర్భంగా ఆర్టీసీ అధికారులు నడుపనున్నారు. సిరిమాను అధిరోహించడం గొప్ప అదష్టం సిరిమానును అధిరోహించడం గొప్ప అదష్టమని పూజారి జన్ని పేకాపు భాస్కరరావు, అలియాస్ జగదీశ్వరరావు తెలిపారు. గతేడాది భాస్కరరావు చిన్నాన్న జన్ని పేకాపు రామారావు సిరిమానును అధిరోహించగా, ఈఏడాది సిరిమానును భాస్కరరావు అధిరోహించనున్నారు. జాతరకు వాహనాల్లో ఇలా చేరుకోవాలి చినభోగిలి నుంచి మక్కువమీదుగా శంబర, బొబ్బిలి నుంచి కన్నంపేట, వయా మక్కువ మీదుగా శంబర సాలూరు నుంచి మామిడిపల్లి మీదుగా శంబర, సాలూరు నుంచి మావుడి మీదుగా శంబర భక్తులు చేరుకునే విధంగా సీఐ రామకృష్ణ చర్యలు చేపట్టారు. -
వైభవంగా తొలేళ్ల పండగ
భక్తులు అమ్మవారి మార్గాన్ని చీపుర్లతో తుడిచి మొక్కు చెల్లించారు. అధికారుల పర్యవేక్షణ తొలేళ్ల ఉత్సవాన్ని పార్వతీపురం సబ్కలెక్టర్ వైశాలి, ఏఎస్పీ వి.మనీషారెడ్డి, డీపీఓ ఎన్.కొండలరావు, ఈఓ బి.శ్రీనివాస్, ట్రస్టుబోర్డు చైర్మన్ ఎన్.తిరుపతిరావు పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సీఐ రామకృష్ణను ఆదేశించారు. అనంతరం పార్కింగ్ స్థలాలు, సీసీకెమెరాల ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు. మంగళవారం జరగనున్న సరిమానోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. సిరిమాను బండిని ఆర్అండ్బీ, అటవీశాఖ అధికారులు పరిశీలించారు. బుగ్గిరేగకుండా... మక్కువ, బొబ్బిలి, సాలూరు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పెద్దపెద్ద గోతులు, రాళ్లు తేలడంతో వాహనాలు వెళ్లే సమయంలో బుగ్గిరేగుతోంది. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆర్అండ్బీ అధికారులు స్పందించి వాటర్ ట్యాంకర్లతో రోడ్లను తడుపుతున్నారు. రోడ్లు బాగుచేయకుండా తూతూమంత్రం పనులు జరపడంపై భక్తులు మండిపడుతున్నారు. మక్కువ: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. అమ్మవారి ఘటాలను ప్రధానవీధిలోని అమ్మవారి గద్దె వద్దకు ఆదివారం రాత్రి చేర్చారు. అనంతరం కారుగేద, మహిషాసురుడు, పోతురాజు వేషధారాణలు నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులు ఉపవాసాలుతో ఉండి సోమవా రం రాత్రి ఏరుత్సోవం నిర్వహించారు. గ్రామపెద్దలంతా జన్నివారి ఇంటికి వెళ్లి జన్నివారిని పిలిచి ఏరోత్సవం నిర్వహించారు. జన్నివారి, గిరిడవారి ఇంటివద్ద నుంచి తెచ్చిన విత్తనాలను అమ్మవారి వద్ద ఉంచి పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. అనంతరం రైతులు తలోపిడికెడు విత్తనాల ను ఇంటికి తీసుకెళ్లారు. పంటలు సాగుచేసిన సమయంలో ఈ విత్తనాలను వారివద్ద ఉన్న విత్తనాల్లో కలిపి విత్తితే పంట కలిసి వస్తుందన్నది రైతుల నమ్మకం. తగ్గిన భక్తుల రద్దీ తొలేళ్ల ఉత్సవానికి గతేడాది కంటే ఈ ఏడాది భక్తు లు రద్దీ తగ్గింది. ప్రధానాలయం వెనుక భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచితం, రూ.20, రూ.100 క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి. భక్తులు ప్రధానాలయంలో ఉన్న అమ్మ వారిని, వనంగడిలో కొలువైన పెద పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. వనంగుడి వెనుకన ఉన్న వేపచెట్టుకు పూజలు చేశారు. కోళ్లు, చీరలు, తలనీలాలు, ఘటాలు సమర్పించారు. కొందరు -
● అభివృద్ధి, సంక్షేమంలో అన్ని వర్గాల ప్రజలకూ సమున్నత స్థానం ● అట్టహాసంగా 77వ గణతంత్ర వేడుకలు ● జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి ● అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
సాక్షి, పార్వతీపురం మన్యం: గణతంత్ర దినోత్సవం వేళ మన్యంలో మువ్వన్నెల జెండా మెరిసిమురిసింది. వందే మాతర గేయాలాపనలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీసుల కవాతు, జాగిలాల విన్యాసాలు, వివిధ శాఖల స్టాల్స్, ప్రగతిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శనల నడుమ పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వ హించిన 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా సాగాయి. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని పోలీసు ద ళం కలెక్టర్కు సెల్యూట్ సమర్పించగా, బ్యాండ్ బృందం జాతీయగీతాన్ని ఆలపించింది. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను సభావేదిక నుంచి కలెక్టర్ వినిపించారు. వినూత్న కార్యక్రమాలు అమలు చేయడం వల్ల పార్వతీపురం మన్యం జిల్లా ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందజేశామని చెప్పారు. సమ్మిళిత విధానాలతో అన్ని వర్గాల ప్రయోజనాలకూ పెద్దపీట వేశామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తన సందేశంలో తెలిపారు. ●రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపా లనే ఉద్దేశంతో జిల్లాలో రెవెన్యూ క్లినిక్ను ప్రారంభించామన్నారు. వీటిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జిల్లాకే గర్వకారణమన్నారు. భూవివాదాలు లేకుండా ప్రతి రైతుకూ స్పష్టమైన భూహక్కును కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పటివరకు 354 గ్రామాల్లో రీసర్వే చేపట్టి, 280 గ్రామాలకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. ●2,27,495 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.522 కోట్లను 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లాలోని ప్రతి ఎకరా కు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ●విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించేలా శ్రీకారం చుట్టిన ముస్తాబు కార్య క్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలైన సంగతిని గుర్తుచేశారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఆనందలహరి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ●గిరిజన మారుమూల ప్రాంతాల్లో డోలీ మోతల కు స్వస్తి పలికేలా 225 రోడ్ల నిర్మాణానికి రూ.88 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించా రు. వాటితో పాటు రూ. 760 లక్షల అంచనా విలు వతో కొత్తగా మంజూరు చేసిన 140 సిమెంట్ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. వివిధ పథకాల కింద రూ.272.80 కోట్ల అంచనాల తో 75 రోడ్ల పనులు మంజూరైనట్టు తెలిపారు. సీతానగ రం వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు వినియో గంలోకి తీసుకువస్తామన్నారు. ●రాష్ట్రీయ గ్రామ స్వరా జ్ అభియాన్ పథకం కింద డీపీఆర్సీ భవన నిర్మాణా న్ని రూ.200 శాసీ్త్రయ నృత్య ప్రదర్శన -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వేపాడ: మండలంలోని అరిగిపాలెం సమీపంలో ఆటో నుంచి జారిపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వల్లంపూడి పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడకు చెందిన గొట్టిపాటి నాగరాజు ఆదివారం సోంపురం జంక్షన్ నుంచి వేపాడ వస్తుండగా అరిగిపాలెం సమీపంలో ఆటో నుంచి జారి రోడ్డుపై పడడంతో తలకు త్రీవమైన గాయం కాగా విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం కుటుంబసభ్యులు తరలించిన విషయం విదితమే. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందడంతో మృతుడి కుమారుడు తాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై నాగేశ్వర్రావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ కేజీహెచ్లో పోస్ట్మార్ట అనతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. -
ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శన
వేపాడ: మండలంలోని జాకేరు గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. గ్రామంలో పైడమ్మ చిన్నమ్మ పేరంటాలు, వీరాంజనేయస్వామీ తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శనలో విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన 15 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో సింగపూర్ సత్యనారాయణ దేవర గుర్రం ప్రథమస్థానం, రెండోస్థానంలో ఎస్.సత్యనారాయణ శక్తి గుర్రం, మూడో స్థానంలో ధీర అప్పలనాయుడి గుర్రం, నాల్గోస్దానంలో వైజాగ్కు చెందిన అమర్ ఓజీర్ గుర్రం, ఐదోస్థానంలో వైజాగ్కు చెందిన దీక్షిత్ గుర్రం, ఆరో స్థానంలో జామికి చెందిన డెడ్ లైన్గుర్రాలు నిలిచి వరుసగా రూ.12వేలు, రూ.పదివేలు, రూ.ఎనిమిదివేలు, రూ.ఆరువేలు, రూ.నాలుగువేలు, రూ.రెండువేలు చొప్పున నగదు బహుమతులు సాధించాయి. -
సేవలకు గుర్తింపు
● 549 మందికి పురస్కారాలు ● ప్రశంసాపత్రాలు అందజేసి కలెక్టర్, జేసీ, ఎస్పీసుధారాణి, డీఆర్డీఏ పీడీ వి. రాధాకృష్ణ, జిల్లా మైక్రో ఇరిగేషన్ డా. జి. నాగ భూషణరావు, డీసీహెచ్సీ టి. కనకదుర్గ, పీడీ ఐసీడీఎస్ కె. హేమలత, జిల్లా రెవెన్యూ అధికారిదిలీప్ చక్రవర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వ్యవసాయ–ఉద్యానవన శాఖలు: హరి ఎ.పి, నడుకూరు సంపత్ బాబు, బత్తుల ధనలక్ష్మి, పి. సతీష్ కుమార్, ఆర్థిక నిలయ, కోకోట తులసి ప్రసాద్, వనియక సూర్యనారాయణ, ఎస్.శివగణేష్, కె.శిరీష, వై. సూర్యనారాయణ, హిమబిందు, మంత్రి మానస, కె.బిలిన రేఖ, ఎ.సాయి కుమార్, టి.జ్యోత్స్న, జె.జగదీష్, జి.గణేష్, సి. రేణుక, కె.అప్పలకొండ, పి.అనసూయ (సెరికల్చర్). పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి: ఎస్.ఎస్.కె. శ్రీనివాస్, జి. భానుప్రకాష్, ఎల్. శ్రీనివాస రావు, ఎ.శశిభూషణ రావు, కె.భీమయ్య, ఎం.చంద్రశేఖర్, వంగపండు వెంకట నాయుడు, ఎస్.శ్రీనురావు, పి.శిరీష, సి.జోగేశ్వరరావు, సురేష్ ఎస్, జె.పైడిరాజు, ఎన్. గౌరీవెంకట నాయుడు, కె. శ్రీనివాసరావు, దొర, ఎ.గణపతి, పత్తిక శివకుమార్, సి. కామేశ్వర రావు, పి.తిరుపతి, పెదంట తిరుపతి, డబ్ల్యూవీఎస్ఎస్. శర్మ, జి. శంకరరావు, ఎస్. సతీష్ కుమార్, ఎ.దిలీప్. విద్యాశాఖ: కె. ఝాన్సీ, పంది గౌరి కుమార్, సి. జీవన్ కుమార్, శంకరరావు కిమిడి, ఎస్. శ్రీనివాస రావు, ఎల్. సత్యనారాయణ, ఎ. దివాకర్, కె. నరేష్ కుమార్, ఎ. మాధవి, కె. సీత, జి. వెంకటేశ్వర రావు, దేవాజీ, ఎస్. గౌరీశ్వరి, షావుకారి హారిక, వమరవల్లి మురళీసాయి, చంగల శ్యామల రాణి, జి. బాబు రావు, ఎస్. అనూరాధ, జి. మోహన్ రావు. అగ్నిమాపక శాఖ: ఎం. భాస్కరరావు, టి. త్రినాథరావు, ఎం. సురేష్ కుమార్, యు.మురళీ హరినాథ్, జె.సత్యేశ్వర రావు, కె. దుర్గారావు, ఆర్.సింహాచలం, సి.హరిప్రకాష్, కె. తిరుపతి రావు. ఇతర శాఖలు: (సర్వే, ఎకై ్సజ్, ట్రాన్న్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ) టి. జగదీశ్వరరావు, యు.సునీత, పి.శ్రావణి, జె.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్, కె. సుమంత్ కుమార్, ఎస్. ప్రశాంతి, ఎస్. రామచంద్రరావు, ఐవీఎస్ జగన్నాథ రావు, టి. గౌరీకుమార్, వి.నర్సింగరావు, ఎస్.హరీష్, కె.రాజేష్, అంబటి ప్రదీప్ సాగర్, జీవీ రవికుమార్, అకుల రాజు, ఆకాశపు అభయ, పూటపాటి నైమిష, శాసల శర్మిల, కె.లక్ష్మి దీప్లేశ్వరి, బారికి భావ్య, అలుగు గౌరి వాణి, వి. రాఘవేంద్రరావు, జె. చైతన్య, పి. విద్యా సాగర్, అంబటి పుణ్యవతి ఎస్. శ్రీదేవి, డా. సి. చక్రధర్, డా. పి. చైతన్య శంకర్, డా. ఆర్.జి. జయ శంకర రావు, డా. కె. ప్రభాకర రావు, డా. కె. శైలజ, జి. సుధారాణి, ఎస్. మౌనిక, వై. వెంకట పావని, పి. చిన్నబాబు, కె. చంద్రశేఖర్, టి. అప్పలరాజు, బీహెచ్. బాలకృష్ణ, బీఎల్. శ్రీనివాస నాయుడు, బి.కృష్ణారావు, ఎం.విజయలక్ష్మి, బూరడి నాయుడు, రెడ్డి అశ్విని కుమారి, ఎం. సాంబశివరావు, ఐ. జ్యోతి, జి. మురళి, వై.క్రాంతి కుమార్, కె. శంకరరావు, టి. శ్రీనివాస రావు, పి. నాగమణి రెడ్డి, జి. స్వాతి కుమారి, డాక్టర్ పీవీ యశ్వంత్, సి.శాంతి స్వరూప్, పి.శ్రీ గిరిజ, సివల షర్మిల, జెర్లపు అనిల్ కుమార్, ఎంవీ రమణ, కె.ఈశ్వర రావు, ఎ. సందీప్ కుమార్, కె.దుర్గాప్రసాద్, ఎం.కల్యాణ్, కె.రామారావు, జి. గంగా దేవి, పి.ఎస్.ఎస్. సాయిబాబు, పి. వెంకటరావు, ఎన్. సందీప్ కుమార్, కె. గణపతి, వై. ప్రసన్న లక్ష్మి, సి. ప్రసన్న కుమార్, ఎన్. విజయలక్ష్మి, కె.కార్తీక్, ఎం.జయశ్రీ, పి. కామరాజు, ఎం.ఆదయ్య, కమల కుమారి పంతుల, ఆర్. మోహన్ కుమార్, గంట శ్రీనురావు, జి.కృష్ణవేణి, కె. సునీత, పి. సతీష్, ఎ. జయమ్మ, కె. సతీష్, సి. సూర్యనారాయణ, పి. శ్రీనివాసరావు, అశ్విని వత్స, యు.నాగరాజు, వై.పురుషోత్తం, ఎం.రాజేంద్రప్రసాద్, జి.శ్రీనివాసం, కేవీ కృష్ణారావు, జి. లక్ష్మణ రావు, కె. శిరీష కుసుమ, సబ్బువరపు ప్రదీప్ చంద్ర, నత్తల అజయ్ కుమార్, కె. రాజ్యలక్ష్మి, కేఎస్ఎస్ రామరాజు, బి. విజయ లక్ష్మి, కె.ఆదిలక్ష్మి, షేక్ మహబూబ్ నీసా, రాయపల్లి సత్యవతి, సీహెచ్. ప్రదీప్ కుమార్, జి.శాంతికుమారి, ఎల్. ప్రసాదరావు, కె. రుక్మిణమ్మ, జె.రాజశేఖర్, ఎం.జగన్నాథం, ఎం.శ్రీవాణి, ఎం.నారాయణ, పి.శ్రీ. వెంకట, ఎంఎం కృష్ణ, ఆర్.ప్రకాశం, ఆర్.తిరుపతి రావు, పి.రాజు, సీకే మూర్తి, సి. జ్ఞాన ప్రసూనాంబ, పి.మహేష్, గొర్లె కేశవరావు, కె.ధర్మారావు, ఎం.ఎల్.ఎన్. ప్రసాద్, సి. గౌరీశంకరరావు, టి. శ్రీనివాస రావు, జి. రామ పరదేశినాయుడు, పి. వేణు భారతి, కె. రమాదేవి, ఎం.సరళ, వీఆర్వీఎస్. ప్రసాద రాజు, సురేష్ కుమార్, వై. నాగరాజు, కె. శ్రీకాంతి, ఎల్.మనోహర్, పీకే చక్రవర్తి, సీవీ అచ్యుత రావు, గౌరవ మోహన్ గాంధీ. సాంస్కృతిక– ఇతర విభాగాలు: కుమారి ఎం.బాల సరస్వతి, పి. శ్రీ ఆధార్ కార్తీని, కె.సందీప్ కుమార్, ఎ.చంద్రశేఖర్, జగదీష్, వై. రామస్వామి, జి. మహేష్, ఎం. అనూష, యు.వెంకట రమణ, సి. తిరుమల రావు, కె. సూర్యారావు, జీఎల్.ప్రశాంతి, క్యూ.వీణా కుమారి (జలపాతాలు బృందం), జిమ్మక శ్రీను (కోలాటం), పువ్వల బిట్టు (మిమిక్రీ), కె. నాగభూషణరావు, మండంగి మల్లేష్, ఎస్. రామకృష్ణ, సి. వెంకట రావు, బచ్చల పాల్, షేక్ బాషా, పి. భరత్ జి,వై.నాగేశ్వర రావు, ఆర్. తేజేశ్వరరావు, బలగం వైకేశ్వర రావు, ఎం. రత్నశ్రావణి, గొంటెడ గౌరినాయుడు, సిరికి స్వామినాయుడు, మరడాన శంకర రావు.పార్వతీపురం రూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి జిల్లా యంత్రాంగం పురస్కారాలను అందజేసింది. ఈ మేరకు సోమవారం పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో వారికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కూమర్ రెడ్డి, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. శాఖల వారీగా ఎంపికై న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా స్థాయి ముఖ్య అధికారులు: సి.యశ్వంత్ కుమార్ రెడ్డి (జాయింట్ కలెక్టర్), ఆర్.వైశాలి (సబ్ కలెక్టర్–పార్వతీపురం), స్వప్నిల్ పవార్ జగన్నాథ్ (సబ్ కలెక్టర్–పాలకొండ), మనీషా రెడ్డి (ఏఎస్పీ, పార్వతీపురం), కె. హేమలత (డీఆర్ఓ), డా.పి.ధర్మ చంద్రా రెడ్డి (ఇన్చార్జ్), ఎం. సుధారాణి (పీడీ, డీఆర్డీఏ), ఎస్. దిలీప్ చక్రవర్తి (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్), ఎం.వెంకటేశ్వరరావు (అడిషనల్ ఎస్పీ), కె. రామ చంద్ర రావు (పీడీ, డ్వామా), ఆర్.అన్నపూర్ణ (వ్యవసాయం), డా.ఎస్.మన్మథరావు (పశుసంవర్థక), పి. సింహాచలం (అగ్నిమాపక), వి.రాధాకృష్ణ (ఏపీఎంఐపీ), డీఆర్ఆర్ యేసు రాజు (మార్కెటింగ్), కె. శ్రీనివాసరావు (సివిల్ సప్ల్టైస్), బి.అశోక్ (డీఎస్ఓ), టి.సంతోష్ కుమార్ (మత్స్యశాఖ), డి.రమణ మూర్తి (భూగర్భ జలాలు), పి. సీతారాం (పరిశ్రమలు), డా.జి.నాగభూషణ్ రావు (డీసీహెచ్ఎస్), డా.వై.మణి (మలేరియా), ఎ.శ్రీనివాస రావు (గనులు), డి. కృష్ణారావు (మెప్మా), వీఎస్ఎన్ నాగేష్ బాబు (పీఆర్ ఇంజినీరింగ్), ఎం.శ్యామల (ఎస్సీ వెల్ఫేర్), కె. సాయి కృష్ణ చైతన్య (స్కిల్ డెవలప్మెంట్), టి. దుర్గాప్రసాద్ రెడ్డి (రవాణా), ఎ.విజయశాంతి (గిరిజన సంక్షేమం), టి.కనక (ఐసీడీఎస్), ఎం.వినోద్ కుమార్ (ఫుడ్సేఫ్టీ), వై.విమల (మార్క్ఫెడ్), ఐ.గజలక్ష్మి (వాణిజ్య పన్నులు), టీటీ రత్న కుమార్ (మున్సిపల్ కమిషనర్), ఎ.సంతోష్ (ఎకై ్సజ్). కలెక్టరేట్ విభాగం: ఎన్. చిన్నా రావు (ఏఓ), జి. శ్రీరామ మూర్తి, పీఎస్.లక్ష్మి కుమార్, కె.చంద్రమౌళి, బి.శివ జగన్ మోహన్, వి.గణేష్, పి. చిట్టెమ్మ, సీహెచ్. రాజేష్, ఎం.మంజూష, కె.స్వాతి, పి.ప్రదీప్ కుమార్, పి.పద్మ, కె. సాయి మనోజ్ కుమార్, పి.దేవమ్మ, పి. సౌజన్య, కె.శంకర్ రావు, ఎం.ప్రజ్ఞ, జె.కల్యాణ్ కుమార్, బి. మనోజ్ కుమార్, కె.సందీప్ (ఈడీఎం), ఎ.అనంత్ మూర్తి, జి. హరీష్, కె. కార్తీక్, కె. కనకరాజు, ఎ. హరీష్, వి. వెంకట మహేష్, కె. చినరాజు, కె. రవి, డి. అప్పయ్య, ఎన్. మెర్సీ, టి. వీరాచారి, ఎ. ఉమ, బి.అనిల్, ఎ.అనిల్, డి. వెంకటరమణ, జి. నాగేంద్ర ప్రసాద్, జి. తిరుమల రావు, సీహెచ్. అప్పల నాయుడు, టి.రమేష్, కె. సురేష్, టి.అప్పలస్వామి, ఎం. రమణ, వై.బాబూరావు, మౌళి, పి.శ్రీను సాగర్, ఎస్.ఈశ్వర రావు, ఎం.ప్రియ, వై.స్నేహ, సి.గణపతి, సి.ఆరాధన, టి. శ్రీనివాస రావు, వై.గౌరి, ఆర్.అశ్వని, సి.మధుసూదన రావు, వై. రామకృష్ణ, ఎ.షణ్ముఖరావు, టి.లక్ష్మణ రావు, పి.నారాయణ రావు, పి.అనిల్ కుమార్, కె. త్రినాథ రావు, నాయుడు సాయికుమార్, కె.హరిత, పి.తులసి, జె.రజని, వై.చంద్ర రెవెన్యూ శాఖ: ఎం.సావిత్రి, పి.బాల, సి.రాధాకృష్ణ మూర్తి, వై.సురేష్ కుమార్, వై.అప్పారావు, కె.శ్రీనివాస రావు, ఎం.రాజేంద్ర, ఆర్.నరేష్ బాబు, వై.ఆర్కే సురేష్ కుమార్, కె.శ్రీవిద్య, కె. జయప్రకాష్, ఎస్. ధనుంజయ రావు, కె.ప్రవీణ్, ఎస్. గంగరాజు, ఎ.ప్రేమ్ కుమార్, వై. శంకరరావు, సీహెచ్. మంగమ్మ, ఎం.తిరుపతి రావు, ఎం.రాజేష్, టి.అరుణ కుమారి, సీహెచ్. గౌరీశ్వర రావు, హేమ, ఆర్.మురళి, పరమేసు, బాలబాబు, జీఎస్ఎండి. మౌలానా, ఎ. శ్రీనివాసరావు, సి.విజయ కుమార్, ఎస్. శ్రీనివాసరావు, తులసి ప్రసాద్, కడగ అసురిని, ఎం.సూర్య కళ, జి.ఉపేంద్ర, ఎన్. పవన్ కుమార్, అల్లు రమేష్, ఎస్.వెంకటేష్, ఎన్. ఆశ, ఎన్. రాంబాబు, ఎన్.లక్ష్మీనాయుడు, మండంగి దివాకర్ రావు, మండంగి ఉష, ఆర్. మనోహర్, సి. సూర్యప్రకాష్, కామేశ్వరి, ఆర్. ఆదిలక్ష్మి, కొండపల్లి దుర్లేశ్వర అశ్వని, సి.హెచ్. ప్రమీల, కె. రమేష్, పాలక రవి కుమార్, కిమిడి ప్రసాద రావు, చిరంజీవి, ఎ. నిర్మల, పి. మణి ప్రభ, గెల్లంకి వెంకటరమణ గిరిజన సంక్షేమం (ఐటీడీఏ)–ఇంజినీరింగ్: జె.రామారావు, ఎల్.రజని, జి. శివకుమార్, ఎం.యుగంధర్, వి.స్వాతి, ఎన్. సరస్వతి, ఎం. శ్రీను రావు, కె. విజయలక్ష్మి, పి. కొండల రావు, ఎస్.ఎల్. అప్పల వర్మ, డాక్టర్ పి. ప్రవీణ్ కుమార్, డాక్టర్ జగదీష్, నూకాలమ్మ, అలక రమణమ్మ, ఎస్. నీలకంఠు, ఎ. సంజీవమ్మ, ఎస్. వెంకట గణేష్, జి. కామేషు, టి. ఆదినారాయణ మూర్తి, సి. సునీత, కె. విజయపార్వతి, సి. పవన్ కుమార్, కె. నాగభూషణ్, వి. బాలాజీ, టి. వసంతలక్ష్మి, పి. శివకుమార్, పి. రమణమూర్తి, కె. శ్రీనివాసరావు, ఎ. భాస్కరరావు, ఎస్.టి. సంక్షేమ అధికారి, టి. రమణ మూర్తి, పి. హేమ బిందు, సి. రాజేశ్వరి, జి. రామ గోవింద, అరక గోవిందరావు, సి. ప్రశాంతి, రేగడ శ్రీనివాస్, ఎ. ప్రసన్న గణేష్, వై. సింధుజ, పి. గంగాధర్. పోలీసు శాఖ: ఎల్.చిన్నారావు, పి.ఉమామహేశ్వరరావు, అరినాన శ్రీనివాసరావు , పి. రామకృష్ణ పాలూరు, టి.శారద, కె. రమేష్, సి. విజయ భాస్కర రావు, పి.లావణ్య, పి. గోవర్ధన్ కుమార్, వి. గణపతి, పి. శ్రీను, ఎం. రాంబాబు, కె. భీమసేన రెడ్డి, బి. రమణ మూర్తి, కె. వి.జయ రమేష్ కుమార్, ఎం.అప్పారావు, వై.సుధాకర్, ఎ.ప్రసాద రావు, ఎస్. శ్రీనివాస రావు, సీపీ దినకర్, ఎం.వెంకట రమణ, ఎం.పాపయ్య, ఎ.నీలకంఠ రావు, కె. ప్రయోగ మూర్తి, జి. అప్పారావు, వి.రమణ రాజు, సి. రవీంద్రరాజు, ఎల్పీసీ నాయుడు, పి.శ్రీనివాసరావు, జి.ఝాన్సీ బాయి, కె.శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, ఎస్.మురళి, ఎం.రామారావు, బి.మధుసూదన రావు, ఎస్. దామోదర రావు, జి.కిశోర్, సీహెచ్. ప్రసాద్, ఎల్.సూర్యనారాయణ, కె. జగదీశ్వర రావు, డి.నర్సింగ రావు, ఎ.సరస్వతి, ఎన్. వెంకటరమణ, బి.అశోక్, ఎ.బాలకృష్ణ, డి.శేఖర్, జి.కుమార్ అనిల్, ఎం.సింహాచలం, పి.ఉదయ భాస్కర బాబు, ఎం. అశోక్ చక్రవర్తి, వి.శంకర రావు, డి.వసంత కుమార్, జి. భూషణ రావు, ఎ.జయ రావు, బి.ఆనంద మోహన్, బి.నరేష్ కుమార్, బి.రాజారావు, ఎల్.దామోదర రావు, బి.జయ రావు, ఎం.బలరాం, జి.రత్న కుమార్, ఎస్.చిరంజీవి, ఆర్. శంకరరావు, ఎస్.అప్పారావు, కె.సంతోష్ కుమార్, వి.ఉమా మహేశ్వర రావు, టి.మహేశ్వర రావు, వి.మురళీమోహన్ రావు, పి.మురళీకృష్ణ, టి.రవి, కె.రామకృష్ణ, టి.మాధురి కుమారి, జి. సుగుణమణి, ఎం.మాధవి (ఏపీపీ), ఎం.శ్రీధర్, సీహెచ్. శేషగిరిరావు, సీహెచ్. తిరుపతి రావు, పొత్తూరు అరుణ కుమారి, జి. అచ్చయమ్మ వైద్య ఆరోగ్య శాఖ–ఆయుష్: డా. వై. నాగ శివ జ్యోతి, డా.ఐ.వాణి, డా. ఎల్.ఆర్.ఎస్.గిరినాథ్, డా.సీఎస్. చక్రవర్తి, డా.సి.గణేష్ చైతన్య, జి. సూర్యకుమారి, సాయికుమారి, గౌతమి, పృథ్వీ, ఆర్.రమణమ్మ, డాక్టర్ శ్రీనివాస రావు, చామర్ల గాయత్రి, డాక్టర్ ఆర్. మీనాక్షి, పరిమళ, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ కడ్రక సందీప్, దీన, డాక్టర్ ఆర్.ఆర్.కె. చైతన్య, డాక్టర్ వై. విజయమోహన్, డాక్టర్ కె.ఎస్.ఎస్. కీర్తి, డాక్టర్ ఎస్. తనూజ, డాక్టర్ బీఎస్.ఎస్. స్వాతి, బి. నూకనాయుడు, పి. శిరీష, ఆర్.ఎస్.ఎస్. ఏకనాథ్, కె. పెంటమ్మ, జి. నాగమణి, కె.సి.ఎల్. ప్రసాద్, ఎల్. సుగుణ, హెచ్. జ్యోతి, కె. దుర్గా ప్రదీప, ఆర్. తేజస్విని మణి, అలక పద్మావతి, సి.స్వర్ణలత, ఆర్. రాజేశ్వరి, పి. వెంకటరమణ, డా. టి. హేమాక్షి, పానుగంటి రాజశేఖర్, వనియక రమేష్, గడబంతి శ్రీకాంతి, కిలపర్తి సునీత. -
గజరాజుల విధ్వంసం
సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో గజరాజులు గడిచిన నాలుగు రోజులుగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. తామరఖండి, బగ్గందొరవలస, బల్లకృష్ణాపురం, బక్కుపేట, ఆర్.వెంకంపేట గ్రామాల్లో ఎనిమిది గజరాజుల గుంపు సంచరిస్తూ పంట పొలాలను, పలు తోటలను, విద్యుత్ పరికరాలను, ధాన్యం బస్తాలను ధ్వంసం చేస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. శనివారం రాత్రి బక్కుపేటలోని పలువురు రైతులకు చెందిన 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పామాయిల్ తోటల్లో మొక్కలను ఐదెకరాల్లో ధ్వంసం చేశాయి. విద్యుత్ మోటార్లకు సంబంధించి పైపులైన్లు పీకేశాయి. ఆదివారం వేకువజామున ఆర్.వెంకంపేట గ్రామంలో కల్లాల్లో ఉన్న ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు గొల్లుమంటున్నారు. తమకు ఎన్నాళ్లీ కష్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఎప్పటికీ వీటిని తరలిస్తారని.. ఎన్నాళ్లీలా నష్టపోవాలని బోరుమంటున్నారు. – సీతానగరం -
స్క్రాప్ కలెక్షన్ పాయింట్లో అగ్నిప్రమాదం
రాజాం సిటీ: మండల పరిధిలోని వీఆర్అగ్రహారం గ్రామసమీపంలో పొగిరి గ్రామానికి చెందిన సిరిపురపు నాగరాజుకు చెందిన స్క్రాప్ కలెక్షన్ పాయింట్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీయడంతోపాటు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అగ్రిమాపక కేంద్రం సిబ్బంది మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో పాలిథిన్ సంచులతోపాటు, 50 ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతైనట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందని పేర్కొన్నారు. కొత్తకంచరాంలో గడ్డివాము.. మండల పరిధి కొత్తకంచరాం గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో బోడసింగి రామకృష్ణకు చెందిన నాలుగు ఎకరాల గడ్డి వాములు దగ్ధమయ్యాయి. మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
ఎల్లారమ్మ జాతర కమిటీలో వివాదం
చికెన్● ఇరు వర్గాల మధ్య ఘర్షణ ● ఎండోమెంట్ ఆధ్వర్యంలో జాతర నిర్వహణ అని స్పష్టం చేసిన ఈఓజామి: జామి ఎల్లారమ్మ జాతర మూహూర్తం తేదీల ఖరారు అనంతరం నిర్వహణ కమిటీ విషయంలో అమ్మవారి జాతర కమిటీ రెండు వర్గాల (వైఎస్సార్సీపీ, టీడీపీ) మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవ్సరాల కాలపరిమితికి ఉత్సవ కమిటీ నియామకం చేసింది. ఆ కమిటీ సమయం 2026 మార్చి 6వరకు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవల మళ్లీ ఇటీవల టీడీపీ వర్గీయులకు ఉత్సవ కమిటీ పేరున మరో కమిటీని ఎండోమెంట్ శాఖ నియమించింది. దీంతో ఈ విషయం తీవ్ర గందరగోళానికి దారితీసింది. జాతర ఏ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఎండోమెంట్ ఈఓ ప్రసాద్రావును ఆదివారం రెండు కమిటీల సభ్యులు నిలదీశారు. గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి అల్లర్లు సృష్టించడానికి ఎండోమెంట్ అధికారులు కారణమని గ్రామ సర్పంచ్ చిప్పాడ లక్ష్మి, ఉప సర్పంచ్ అల్లు పద్మ, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్ తదితరులు నిలదీశారు. ఇంకా పాత కమిటీకి నిర్వహణ సమయం ఉందని అలాంటప్పుడు కొత్తగా ఉత్సవ కమిటీ నియామకం ఎలా చేశారని నిలదీశారు. దీంతో టీడీపీ వర్గీయులు అధికారంలో మా ప్రభుత్వం ఉందని మేము నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ కూడా వేశారని తెలపడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత సమయం తోపులాట జరిగింది. ఎండోమెంట్ ఈఓ దీనికి పరిష్కారం చెప్పాలని నిలదీయడంతో ఎండోమెంట్ ఈఓ ప్రసాదరావు స్పందిస్తూ ఈ ఏడాది జాతరను ఎండోమెంట్ నిర్వహిస్తుందని తేల్చిచెప్పారు. రెండు కమిటీల వారు జాతర సజావుగా సాగేవిధంగా సహాయసహకారాలు అందించాలని తేల్చి చెప్పడంతో వివాదం సద్గుమణిగింది. -
ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
సీతంపేట: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు కుండంగి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు ఆదివారం సీతంపేటలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల పీఈటీ, పండిట్స్ పదోన్నతులు సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వాలన్నారు. మిగిలిన అన్ని కేడర్ పోస్టులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. మండల యూటీఎఫ్ అధ్యక్షుడు కె.ఆనందరావు మాట్లాడుతూ డీఏ ఎరియర్లు, సర్సీస్ రిజిస్టర్ల వార్షిక ఇంక్రిమెంట్లను ఎంఈవోలు అప్డేట్ చేయాలన్నారు. మండల ప్రధాన కార్యదర్శి బి.ఫకీర్ మాట్లాడుతూ ఐఆర్ 30 శాతం, పీఆర్సీ కమిటీని వెంటనే ప్రభుత్వం నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎ.ప్రకాశం, కె.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. డీపీటీసీ ఎస్సై విక్రమరావుకు ఎంఎంఎస్ అవార్డ్● ప్రకటించిన కేంద్ర హోం శాఖ విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కె.విక్రమరావుకు 2026 మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్(ఎంఎంఎస్) అవార్డును ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఘోష్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రం నుంచి ఎంపికై న 15 మందిలో ఎస్సై విక్రమ రావు తొలిస్థానంలో ఉన్నారు. -
మాఘమాసం ఎప్పుడొస్తుందో..!
రాజాం/పార్వతీపురం రూరల్: హిందూ ధర్మంలోని పదహారు సంస్కారాల్లో వివాహం ప్రధానమైనది. అందుకే వివాహాలు చేసే సమయాల్లో మంచి ముహూర్తాలు చూస్తుంటారు. తిథులు, నక్షత్రాలు, రాశులు, ఫలాలు..ఇలా అన్నీ కలిసివచ్చే ముహూర్తం కోసం ఎదురుచూస్తారు. ఇలాంటివన్నీ కలిసివచ్చే రోజులు మాఘమాసం నుంచి ప్రారంభమవుతాయి. గడిచిన మూడునెలల గ్యాప్ తరువాత పెళ్లిళ్లకు మంచి రోజులు వస్తుండడంతో ఒక్కటవ్వాలనుకునే జంటలు సిద్ధమవుతున్నాయి. ముందుగా పెళ్లి చూపులకు అనువైన రోజులు చూస్తున్నారు. వరుసగా ఆరు నెలలు ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభం నుంచే మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. జూలైవరకూ అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయని పంచాంగాలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో 5, 6, 8,10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో మంచి ఘడియలు ఉండగా, మార్చి నెలలో 1, 2, 3, 4, 7, 8, 9, 11,12 తేదీల వరకూ పెళ్లి ముహూర్తాలే. ఏప్రిల్ నెలలో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు వివాహాలు చేసుకునేందుకు అనుకూల రోజులు ఉన్నాయి. మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీలు మంచి రోజులు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 వరకూ ఽశుభముహూర్తాలే ఉన్నాయి. జూలై 1, 6, 7, 11 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పలువురు పురోహితులు వెల్లడిస్తున్నారు. 25 రంగాలకు ఊరట ఓ వైపు సంక్షేమ పథకాలు లేక, మరో వైపు రాయితీ పెట్టుబడి రుణాలు లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాల్లో చిన్న, సన్నకారు వేతనదారులకు, సంస్థల నిర్వాహకులకు ఈ మంచి రోజులు కలిసిరానున్నాయి. వేలాది జంటలు ఒక్కటవుతున్నవేళ ఈ రంగాలకు పనిదొరకనుంది. 25 రంగాలకు చెందిన వందలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ ఆరు నెలల్లో సగానికి పైగా రోజుల్లో వివాహాలకు ముందస్తుగా కల్యాణ మంటపాలు బక్ అయ్యాయి. వేలాది వివాహాలు జరుగనున్న నేపథ్యంలో పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్లకు డిమాండ్ ఉంటుంది. క్యాటరింగ్, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు కళకళలాడనున్నాయి. అలంకరణ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్లు, డీజేలు, టెంట్హౌస్లకు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. పెళ్లి బాజాలకు వేళాయె వరుసగా ఆరు నెలల పాటు పెళ్లి ముహుర్తాలు శుభకార్యక్రమాలకు మంచిరోజులు ఫిబ్రవరి 5 నుంచి మంచి తిథులు ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 రంగాలకు ఉపాధి ఒక్కటికానున్న జంటలుమంచి ఘడియలుమకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం కావడం వల్ల మాఘాది పంచకం అంటారు. అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మంచి రోజులు కావడంతో ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో వేలమందికి ఉపాధి లభిస్తుంది. అంపోలు ఉమారుద్రకోటేశ్వరశర్మ(కోటిబాబు), పురోహితుడు, ఖండ్యాం, రేగిడి మండలం -
నేడు ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర
సీతంపేట: ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర సోమవారం జరగనుందని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావు తెలిపారు. మల్లిలో ఆదివారం జరిగిన యాక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాత్ర కుశిమి జంక్షన్ వద్ద ప్రారంభమై వయా మల్లి, కుశిమి, శంబాం, కిట్టాలపాడు, సీతంపేట, దేవనాపురం, మొగదార దోనుబాయి మీదుగా యాత్ర కొనసాగుతుందన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు బి.ఉమామహేశ్వరరావు, కె.భాస్కరరావు, రామ్మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎడ్లు పరుగు పోటీల్లో వల్లంపూడి ఫస్ట్
వేపాడ: మండలంలో వల్లంపూడి లో సాంబమూర్తి తీర్థమహోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పోటీల్లో అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన 12 జతలు ఎడ్లు పాల్గొన్నాయి. వాటిలో వల్లంపూడి ఏడువాక సత్తిబాబు ఎడ్లు ప్రథమ స్థానం సాధించి రూ.15వేలు, దేవరాపల్లి జైవీరాంజనేయ ఎడ్లు రెండోస్థానంలో నిలిచి రూ.12 వేలు, మూడోస్థానంలో నిలిచిన వావిలపాడు ఎడ్లు రూ.పదివేలు నగదు బహుమతులు అందుకున్నారు. తీర్థం సందర్భంగా సాంబమూర్తి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. విజేతలకు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. -
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి
● ఏఐసీసీ సభ్యురాలు వైరిచర్ల శ్రుతీదేవి పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏఐసీసీ సభ్యురాలు, సుప్రీంకోర్టు న్యాయవాది వైరిచర్ల శ్రుతీదేవి ఆదివారం ప్రారంభించారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతిదేవి మాట్లాడుతూ..ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై పోరాడేందుకు ఈ కార్యాలయం వేదిక కానుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్న్చార్జ్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీల అమలు కోసం ఎస్టీయూ పోరుబాట
● ఈ నెల 30 నుంచి వివిధ దశల్లో ఉద్యమాలువిజయనగరం అర్బన్: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) పిలుపు ఇచ్చిందని కమిటీ జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎంఆర్ సంస్కృత పాఠశాలలో ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో పోరుబాట షెడ్యూల్ను ప్రకటించారు. ఈ నెల 30న మండల కేంద్రాల్లో వినతిపత్రాలను అధికారులకు అందజేయాలని, వచ్చే నెల 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 25న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు గడిచినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యాం మాట్లాడుతూ వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని పీఆర్సీ కమిషన్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు దీర్ఘకాలంగా చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సెలింగ్ సభ్యుడు గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్దొర, అప్పలనాయుడు, ఎ.వెంకటఅప్పారావు, ఎస్.మస్తాన్ నాయుడు, డీఎస్బాబాజీ, ఎస్.ఉమామశేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026–IIలో● ఘనంగా కారుగేద వాలకం ● పశువులేర్లుతో గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర నేటి తొలేళ్ల సంబరానికి మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల ముద్దుబిడ్డ శంబర పోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న తొలేళ్ల ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతరకు ఇతర జిల్లాలతో పాటు, ఒడిశా, చత్తీస్ఘడ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. జాతరకొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ ఎం.మహేశ్వరరావు, సబ్ కలెక్టర్ వై.వైశాలి, ఏఎస్పీ వి.మనీషారెడ్డి, ఈఓ బి.శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఘనంగా కారుగేద వాలకం శంబర గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామస్తులంతా ఘనంగా కారుగేద వాలకం నిర్వహించారు. గ్రామానికి చెందిన చెల్లూరి రాములు ఉదయం నుంచి ఉపవాసం ఆచరించి, ఆరిక గడ్డితో శరీరమంతా కప్పుకొని, ప్రధానవీధి వద్ద అమ్మవారి గద్దె వద్దకు చేరుకున్నారు. అక్కడ కాసేపు నృత్యం చేసి, కింద పడిపోయారు. సీ్త్ర వేషాధారణలో ఓ వ్యక్తి వచ్చి, రాములును లేపి యాదవవీధికి చేరుకున్న అమ్మవారి ఘటాల వద్దకు తీసుకెళ్లి, పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి రాములును ఇంటికి తీసుకువెళ్లడం ఆనవాయితీ. పారిశుధ్య పనులు గ్రామంలో అన్ని వీధుల్లో డీపీఓ కొండలరావు ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈ పనుల్లో 200 మంది కార్మికులు పాల్గొన్నారు. గ్రామంలో ప్లాస్టిక్ను నిషేధించారు. మరోవైపు జాతరకొచ్చే భక్తులకు వినోదాన్ని పంచే సర్కస్లు ఇప్పటికే గ్రామానికి చేరుకున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారులు శంబర గ్రామానికి చేరుకుని దుకాణాలు ఏర్పాటు చేశారు. 683 మందితో పోలీస్ బందోబస్తు జాతరలో 683 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 40 సీసీ కెమెరాలు, డ్లోన్లుతో పోలీస్ ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచి జాతర పర్యవేక్షించనున్నారు. 20వేల లడ్డూలు సిద్ధం శంబర పోలమాంబ అమ్మవారి జాతర 10 వారాల పాటు జరుగుతుంది. తొలి జాతరకు వచ్చే భక్తులకు 20వేల లడ్డూ ప్రసాదం, అవసరమైన మేరకు పులిహోరా ప్రసాదాన్ని ఈఓ బి.శ్రీనివాస్ తయారు చేయించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతరలో దేవదాయ శాఖ సిబ్బంది 70మంది వరకు విధులు నిర్వహించనున్నారు. భక్తులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు, దుస్తులు మార్పిడి గదులు నిర్మించారు. క్యూలైన్లు వద్ద చిన్నారులకు పాలు అందించనున్నారు. మంచినీరు అందుబాటులో ఉంచారు. ఆరు చోట్ల పార్కింగ్ ప్రదేశాలు శంబర గ్రామానికి చేరుకునే వాహనదారులకు ఆరు చోట్ల పార్కింగ్ ప్రదేశాలను కేటాయించారు. సన్యాసిరాజపురం, కవిరిపల్లి, తోటవలస గ్రామాలలో ముత్యాలమ్మ పండగ జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు బంధువులు చేరుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గ్రామం నుంచి స్థానికులు ఇతర ప్రాంతాలకు వెళ్లి, తిరిగి గ్రామంలోకి రావాలంటే తమ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంది. ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్లు అమ్మవారి జాతర ఏర్పాట్లును పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు వైశాలి, స్వప్నిల్ పవార్ ఆదివారం పరిశీలించారు. చదురుగుడి, వనంగుడి క్యూలైన్లను, తాగునీటి కల్పన, సిరిమాను తిరిగే వీధులను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అమ్మవారి ఘటాలకు పూజలు చదురుగుడిలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం 3.30గంటల సమయంలో చదురుగుడి నుంచి అమ్మవారి ఘటాలు గ్రామంలోకి తిరువీధికి బయలుదేరగా, భక్తులు అమ్మవారి ఘటాలకు, పాలధారకు పూజలు నిర్వహించారు. చదురుగుడిలో పోలమాంబ అమ్మవారు గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కార్యక్రమానికి అవసరమైన సిరిమాను, గుజ్జుమాను కర్రలను రైతులు పశువులేర్లుతో గ్రామానికి ఆదివారం తీసుకు వచ్చారు. సాలూరు మండలం సోమడవలస గ్రామానికి చెందిన చింతల అప్పలనాయుడు పొలంలో సిరిమాను కర్రను గుర్తించారు. సుమారు 30 అడుగులు పొడువు సిరిమాను కర్రను తీసుకువచ్చారు. -
మరియగిరి యాత్రకు ముమ్మర ఏర్పాట్లు
వీరఘట్టం: శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమ్మ ఉత్సవం ఈ నెల 30న జరగనుంది. వరప్రసాదాలకు నిలయమైన మేరీమాత స్వస్థతతకు, ప్రశాంతతకు, పరిశుద్ధతకు ఆలవాలం. క్రైస్తవ భక్తుల ఆరాధ్య దేవత మరియమ్మ వీరఘట్టం సమీపంలోని వెంకమ్మ చెరువుకు ఆనుకొని ఉన్న కొండపై వెలిసి ఉన్నారు. మేరీమాత ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు మరియగిరి కార్యనిర్వహణ కమిటీ సభ్యులు చేస్తున్నారు. ప్రారంభమైన నవదిన పూజలు మరియగిరి మహోత్సవానికి తొమ్మిది రోజుల ముందు చేపట్టే నవదిన పూజలు ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజుల పాటు కొండపై జపమాల, దివ్వ పూజలు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. వీరఘట్టం, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస గురుమండలాల పీఠాధిపతులు నవదిన పూజల్లో పాల్గొంటున్నారు. 30వ తేదీ ఉదయం నడుకూరు ఆర్సీఎం చర్చి నుంచి మరియగిరి శిఖరం వరకు మేరీమాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి, దివ్వ పూజను చేపట్టనున్నారు. ఈ నెల 30న జరగనున్న మేరీమాత ఉత్సవం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. మేరిమాత దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నడకదారిలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఈ నెల 29 వరకు నవదిన పూజలు జరుగుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి కూడా భక్తులు రానున్నారు. – ఫాదర్ విజయ్రెడ్డి, మరియగిరి కొండపై ప్రారంభమైన నవదిన పూజలు ఈ నెల 30న మేరీమాత ఉత్సవం -
సూర్యనారాయణమూర్తి దేవాలయంలో హైకోర్టు జడ్జి పూజలు
కొమరాడ: మండలంలోని శివిని పంచాయతీ సూర్యాపీఠం వద్ద ఉన్న సూర్యనారాయణమూర్తి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా పీఠాధిపతులు నరహరశాస్త్రి ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచే కాక ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. హైకోర్టు జడ్జి సీహెచ్ మానవేంద్రనాధ్రాయ్ స్వామివారిని దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు నరహరిశాస్త్రి శిష్య బృందం సాదర స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఓటు వజ్రాయుధం ● ప్రజాస్వామ్యానికి ప్రాణం..: కలెక్టర్ పార్వతీపురం రూరల్ : ప్రజాస్వామ్య సౌధానికి ఓటు హక్కు పునాది వంటిదని, పటిష్ట భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ‘ఓటు మన హక్కు కాదు – బాధ్యత‘, ‘నిజాయితీగా ఓటు వేద్దాం – ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం‘ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు పట్టణ వీధుల్లో చైతన్యాన్ని నింపాయి. అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటును అమ్ముకోకుండా ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను విద్యార్థులు భుజానికెత్తుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కనీసం ఒక్క కుటుంబానికైనా ఓటు విలువను వివరించాలని హితవు పలికారు. అనంతరం సీనియర్ సిటిజన్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. కొత్త ఓటర్ల నమోదులో విశేష సేవలందించిన బీఎల్ఓలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలను బహూకరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థి నులు ప్రదర్శించిన నాటిక, విద్యార్థినులు వాసవి, మోనికా వైష్ణవి ప్రసంగాలు ఓటు హక్కు ప్రాముఖ్యతను కళ్లకు కట్టాయి. పార్వతీపురం పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్, డీఆర్ఓ కె.హేమలత, వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్ సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హామీల అమలుకు ఎస్టీయూ పోరుబాట సీతంపేట: కూటమి ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావస్తున్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందిందని ఎస్టీయూ రాష్ట్ర గిరిజన విభాగం కో కన్వీనర్ కుండంగి ప్రమోద్కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలక పురుషోత్తం, మజ్జి మురళీబాబు ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. హామీల అమలుకు పోరుబాట పట్టనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో ఈ నెల 30న తహసీల్దార్లకు వినతిపత్రాలు, రెండో దశలో ఫిబ్రవరి 10న జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా, మూడో దశలో వచ్చే నెల ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. మెడికల్ రీయింబర్స్మెంట్, పీఎఫ్లు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి సరఫరా పెంపు వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా రబీ పంటల సేద్యానికి అధికారులు సాగునీటి సరఫరా పెంపుదల చేశారు. ఆయకట్టు పరిధిలో సాగునీటి అవసరం దృష్ట్యా ఆదివారం మరో 50 క్యూసెక్కులు పెంచి 450 క్యూసెక్కుల సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద 64.48 మీటర్లు లెవెల్ నీటి నిల్వ ఉందని, ఆయకట్టు పరిధిలో జిల్లాలోని వంగర 996 ఎకరాలు, రేగిడి ఆమదాలవలస 6777 ఎకరాలు, సంతకవిటిలో 6599 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 3029 ఎకరాలు, పొందూరులో 99 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. -
మహిళ ప్రాణం కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
వీరఘట్టం: మండలంలోని చలివేంద్రి గ్రామానికి చెందిన గొట్టాపు లావణ్య మానసిక వేదనతో బాధపడుతోంది. శనివారం రాత్రి ఆమె సమీపంలో ఉన్న బావిలోకి దూకడంతో విషయం తెలుసుకున్న పాలకొండ ఫైర్ ఆఫీసర్ జామి సర్వేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళ ప్రాణాలను కాపాడారు. చాలా ఏళ్లుగా ఆమె మానసిక వేదనతో బాధపడుతోంది. గతేడాది కూడా ఇదే విధంగా ఆమె ఈ బావిలోకి దూకినప్పుడు పాలకొండ ఫైర్ సిబ్బంది ఆమెను కాపాడారు. మళ్లీ రెండోసారి శనివారం కూడా ఆమెను ప్రాణాలతో కాపాడిన ఫైర్ సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. రెండు గడ్డివాములు దగ్ధంబొండపల్లి: మండలంలోని దేవుపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన పడాల వెంకటరావు రెండు గడ్డి వాములు అగ్ని ప్రమాదానికి గురి కాగా సమాచారం అందడంతో అగ్నిమాపక వాహనంతో వెళ్లి మంటలు అదుపు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 వేల ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిపారు. మంటలు ఇతర గడ్డి వాములుతో పాటు, పశువుల పాకలకు వ్యాపించకుండా అదుపు చేసినట్లు తెలిపారు. గంజాయి పీలుస్తున్న ఐదుగురి అరెస్టుశృంగవరపుకోట: మండలంలోని బొడ్డవర పరిధిలో రైల్వేస్టేషన్ వద్ద డొంకల్లో గంజాయి పీలుస్తున్న ఐదుగురు వ్యక్తులను ఎస్కోట పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం పట్టుబడిన వారిని ఎస్.కోట గ్రామానికి చెందిన గణేష్, మహ్మద్, వినోద్కుమార్తో పాటు ధర్మవరం గ్రామానికి చెందిన రాజ్కుమార్, అనకాపల్లికి చెందిన పూర్ణకుమార్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం వారిని ఎస్.కోట జుడిషియల్ కోర్టులో హాజరు పరచగా కోర్టు వారిని రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించింది. వారిపై గతంలో ఎస్కోట పోలీస్స్టేషన్, విశాఖ సిటీ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎస్కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు. డబ్బుల కోసం గొడవలో వ్యక్తి మృతిరామభద్రపురం: మండలంలోని పాతరేగ గ్రామంలో శనివారం డబ్బుల కోసం ఇద్దరు వ్యక్తుం మధ్య జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాసర్ల సింహాచలం (70), పెద్దింటి తిరుపతిల మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవలో చేతులతో కొట్టుకుంటున్న సమయంలో వృద్ధుడు సింహాచలాన్ని తిరుపతి గట్టిగా తోసేశాడు. దీంతో కింద పడిన సింహాచంల తల అక్కడే ఉన్న కొళాయి దిమ్మకు తగిలింది. దెబ్బచిన్నదే కదా అనుకుని ఎవరూ పట్టించుకోకపోవడంతో అదే రోజు రాత్రి సింహాచలం మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేశారు. సోమవారం విజయనగరం నుంచి క్లూస్టీం తెప్పి దర్యాప్తు చేయనున్నారు.


