breaking news
Parvathipuram manyam District Latest News
-
ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రం
● ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్ డెంకాడ: ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రమని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో శుక్రవారం జాతీయ జెండాను కమాండెంట్ మలికా గార్గ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ బానిసత్వం నుంచి భారతదేశం 1947 సంవత్సరం ఆగస్టు 15న విముక్తి పొందిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వృథా కానివ్వరాదన్నారు. ఉత్తమ సేవలు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రసంశా పత్రాలను అందేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు జి.లక్ష్మీనారాయణ, ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి కొమరాడ: కొమరాడ మండలం విక్రంపురం గ్రామానికి చెందిన వుబ్బిశెట్టి చిట్టిబాబు(62) విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్ఐ నీలకంఠం తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు.. వుబ్బిశెట్టి చిట్టిబాబు తాపీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం వర్షం కారణంగా పనిలేక వెళ్లలేదు. తన ఇంటి బయట విద్యుత్ వైర్ వేలాడుతుండగా ప్రమాదవశాత్తు తగిలి షాక్ గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య వీరఘట్టం: ఆర్థిక సమస్యలతో కె. రామకృష్ణ తోటపల్లి డ్యామ్లో దూ కి ఆత్యహత్య చేసుకున్నట్టు ఎస్.ఐ జి.కళాధర్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు గ్రామానికి చెందిన రామకృష్ణ కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందుల తో భాద పడుతున్నాడు. వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్నట్టు అతని భార్య సంతోషి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు. ఈ నెల 11న తోటపల్లి డ్యామ్లో దూకిన రామకృష్ణ శుక్రవారం ఉదయం తోటపల్లి ఎడమ కాలువలో ఒకటవ బ్రాంచ్లో కడకెల్ల సమీపంలో మృతదేహామై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. -
అనుమానాస్పదంగా ఎలక్ట్రీషియన్ మృతి
పెందుర్తి: భార్యతో గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. సీఐ కేవీ సతీష్కుమార్ తెలిపిన వివరాలు.. పెందుర్తి నటరాజ్ థియేటర్ సమీపంలోని నేల బావిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సీఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతుడు విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లికి చెందిన రావురు ప్రసాద్(25)గా గుర్తించినట్లు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు కొన్నాళ్లుగా భార్యతో వివాదాల కారణంగా తల్లితో స్వగ్రామంలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ప్రసాద్ మూడు రోజుల క్రితం పని మీద వెళుతున్నానని తల్లికి చెప్పి, తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ క్రమంలో ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? మరేదైనా కారణంతో మృతి చెందాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
కొత్తవలసను ముంచెత్తిన వాన
కొత్తవలస : మండలంలోని శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇంత పెద్ద వర్షం గతంలో ఎన్నడు కురవలేదని స్థానికులు పేర్కొన్నారు. ఏకధాటిగా రెండు గంటలకు పైగా వర్షం కుండపోతగా కురవడంతో రైల్వే అండర్ బ్రిడ్జీలు, కొత్తవలస జంక్షన్ జలమయమమయ్యాయి. ముఖ్యంగా కొత్తవలస జంక్షన్ సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. ఈ వరద నీటిని అరికట్టేందుకు ఇటీవల సుమారు రూ 3.కోట్లతో నిర్మించిన పై కప్పు నిరుపయోగంగా మారింది. బ్రిడ్జి నీటితో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అలాగే కొత్తవలస – విజయనగరం, కొత్తవలస – విశాఖపట్నం రోడ్డు పూర్తిగా వర్షం నీటితో నిండిపోయాయి. కొత్తవలస రైల్వే స్టేషన్ను సైతం వర్షం నీరు ముంచేసింది. జలమయమైన రైల్వే అండర్ బ్రిడ్జీలు కొత్తవలస జంక్షన్ జలమయం -
ఎకై ్సజ్ అధికారులకు ప్రశంసాపత్రాలు
విజయనగరం టౌన్: ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ఎకై ్స జ్ అధికారులు, సిబ్బంది అమరావతిలో శుక్రవారం జరిగిన జెండాపండగలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. వారిలో విజయనగరం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు, సూపరింటెండెంట్ జీవన్ కిశోర్, రాజాం హౌస్ ఆఫీసర్ ఆర్.జైభీమ్, విజయనగరం ఎకై ్సజ్ ఎస్ఐ సీహెచ్ రాజశ్రీ, నెల్లిమర్ల కానిస్టేబుల్ సీహెచ్.సంతోష్ పార్వతీపురం టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ పి.పావని ఉన్నారు. వీరికి జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాలూరు: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి బదులుగా మంత్రి నారా లోకేశ్ రచించిన అప్రజాస్యామిక రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన గృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఓ వైపు స్వాతంత్య్రదినోత్సవం చేసుకుంటున్న సమయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు, అధికారుల సాక్షిగా కూ టమి నేతలు రిగ్గింగ్కు పాల్పడిన చిత్రాలు పత్రిక లు, సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయన్నా రు. ఓటుహక్కు వినియోగించుకోనివ్వండని పోలీసుల కాలు పట్టుకున్నా, మహిళలందరూ తమను ఓటువేయనివ్వడం లేదని వాపోయినా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు కొత్త భాష్యం చెప్పినట్లయిందన్నారు. ఎన్నిల తీరు మారకపోతే రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడు గు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని వాపోయారు. డబ్బు, అధికారబలం ఉన్నవారి కే పదవులు వరిస్తాయని, ప్రజాశీస్సులు ఉన్నవారికి పదవులు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే ఈవీఎంల వినియోగంపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి ఎన్నికల నిర్వహణ తీరువల్ల భవిష్యత్లో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఆంధ్రాలో సాగుతున్న అప్రజాస్వామ్య ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టులు దృష్టిసారించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి రిగ్గింగ్ ఎన్నికలు నిర్వహించే బదులు జెడ్పీటీసీ పదవులను సైతం నామినేటెడ్ పదవుల వలే తమ పార్టీవారికి కట్టబెడితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికలు రద్దు చేయాలి అప్రజాస్వామికంగా సాగిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను తక్షణమే రద్దుచేయాలని రాజన్నదొర డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పింఛన్, రేషన్ను లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఇచ్చేవారని గుర్తుచేశారు. నేడు నిత్యావసర సరుకులు కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి డిపోలకు వచ్చి సరుకులు మోసుకుని వెళ్లాల్సివస్తోందన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. పింఛన్ల పంపిణీలో టీడీపీ నాయకులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రతినెలా పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులతో పాటు వారెందుకు పాల్గొంటున్నారో చెప్పాలన్నారు. -
బీసీ మహిళా నేతకు అవమానం!
● చైర్పర్సన్ లేకుండానే జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సాక్షి, పార్వతీపురం మన్యం: ఓ వైపు మహిళోద్ధరణ కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూనే.. సీ్త్ర శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమని అంటూనే.. స్వాతంత్ర దినోత్సవం రోజున ఓ మహిళా బీసీ నాయకురాలికి కూటమి నాయ కులు తీవ్ర అవమానం కలిగించారు. పట్టణ ప్రథమ పౌరురాలైన పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి లేకుండానే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేపట్టారు. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం చేపట్టిన జెండా ఆవిష్కరణకు ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాసరాజు ఆమెను పిలిచినట్లే పిలిచి అవమానించారనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత ఉదయం 7.30 గంటల సమయానికి రావాలని ఒకసారి, మరలా తొమ్మిది గంటలకు రావాలని మరోసారి మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరికి అధికారులు సమాచారం అందించారు. చెప్పిన ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రావాలంటూ.. జెండా ఆవిష్కరణ చేయకుండా సుమారు గంటకు పైగా ఆమెను వేచి ఉండేలా చేశారు. తర్వాత ఆమె లేని సమయంలో ఎమ్మెల్యేతో ఆవిష్కరణ చేయించారు. కమిషనర్ నిర్దేశించిన సమయానికి జెండా ఆవిష్కరణ చేయకుండా జాప్యం చేయడంతో చైర్ పర్సన్ గౌరీశ్వరి గంటన్నర పాటు నిరీక్షించి వెనుదిరిగారు. నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జెండా ఆవిష్కరణ చేయాల్సి ఉంది. తనను పిలిచి అవమానించిన ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాసరాజుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చైర్పర్సన్ గౌరీశ్వరి తెలిపారు. -
వివాహేతర సంబంధమే కారణం..
బొండపల్లి: మండలంలోని కెరటం గ్రామంలో ఈ నెల 9వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి మృతికి గల కారణం ఆయన భార్యకు వేరే వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమేనని గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. ఇదే కేసు వివరాలను బొండపల్లి పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం వెల్లడించారు. మృతుడు నీడిగేటి కృష్ణను నారపాటి సాయి ఈ నెల 9న మద్యం తాగుదామని పిలిచి గ్రామం బయటకు తీసుకుని వెళ్లి అక్కడ అతడి పీక నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సాయి కాగా మృతుడి భార్య రాజు రెండవ నిందితురాలని, మృతుని కొడుకు మైనర్ కూడా హత్యలో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాయిని బిళ్లలవలస వద్ద గురువారం సాయంత్రం పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు ముక్కలు.. ఆరు ఆటలు!
● పేకాట స్థావరంగా మన్యం ● పార్వతీపురం మండలంలో మరోసారి పోలీసుల దాడులు ● రూ.2.23 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే గంజాయి, నాటు సారా రవాణా, వినియోగం జోరుగా సాగుతున్న విషయం విదితమే. మరోవైపు పెద్ద ఎత్తున జూద స్థావరాలు కూడా వెలుస్తుండటం గమనార్హం. ఇందులో సామాన్యులు కాక.. పెద్ద తలకాయలే ఉండటం విశేషం. ఇటీవల పార్వతీపురం సమీపంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య కార్యకర్తలు పేకాడుతూ దొరికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పేకాట స్థావరాలపై జిల్లా పోలీసులు మెరుపు దాడులు చేశారు. పలువురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామ శివారు ప్రాంతం జీడి తోటలో గ్రామీణ ఎస్సై సంతోషి, స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పట్టుకొని.. వారి వద్ద నుంచి రూ. 2,23,130లు నగదును, రెండు కార్లను, నాలుగు ద్విచక్ర వాహనాలను, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. సరదాగా కాలక్షేపం కోసం జూదం ఆడేవారి పందాలు రూ.వందలు.. రూ.వేలలోనే ఉంటాయి. ఇక్కడ రూ.లక్షల్లో నగదు లభ్యం కావడం గమనార్హం. కార్లలో వచ్చి శివారు తోటలను స్థావరంగా మలుచుకుంటున్నారు. ఎక్కువగా మారుమూల గ్రామాలు, ప్రాంతాల్లోనే పేకాట జోరుగా సాగుతోందని తెలుస్తోంది. కొంతమంది స్థానికుల సహకారంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడ జూదం ఆడుతున్నట్లు సమాచారం. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఇందులో ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారిని విడిచిపెట్టాలని పోలీసులకు సైతం ఒత్తిళ్లు ఉంటున్నాయి. సీతానగరం శివారులో.. సీతానగరం మండలం, రామవరం గ్రామం శివారు ప్రాంతం లో పేకాట ఆడుతున్న వారిపై సీతానగరం ఎస్సై రాజేష్, సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కలిసి గురువారం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 2,330లు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. -
ఇదే మా పాఠశాల..!
చిత్రంలో కనిపిస్తున్న చిన్నరేకుల షెడ్డులోనే సాలూరు మండలం తోణాం పంచాయతీ బొర్రమామిడివలస ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు. గతంలో భవనం మంజూరైనా నిర్మాణం పూర్తి చేయలేదు. శ్లాబ్ లెవెల్లో పిల్లర్స్తో దర్శనమిస్తోంది. చేసేది లేక ఇక్కడ ఒకటి, రెండు తరగుతులు చదువుతున్న 13 మంది విద్యార్థులకు రేకుషెడ్డులోనే బోధన సాగిస్తున్నట్టు ఉపాధ్యాయుడు తెలిపారు. వర్షం కురిస్తే కారిపోతోందని, విషసర్పాల భయం వెంటాడుతోందని, భవన నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో పాటు ఉపాధ్యాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. – సాలూరు రూరల్ -
కార్మికుల జీవితాల్లో కారు చీకట్లు
వీరఘట్టం: కార్మికుల జీవితాల్లో కారుచీకట్లు అలుముకున్నాయి. వారికి ఇచ్చిన ఏ హామీ అమలుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో వారంతా అయోమయంలో పడిపోయారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. ఎన్నికల సమయంలో హామీలివ్వడం..గెలిచాక ఏదో సాకుతో దానిని అమలు చేయకుండా కాలయాపన చేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటుగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు వందలకు పైగా హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఆయనది. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఏ ఒక్క హామీ అమలుపై కూడా మాట్లాడని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు ఫైల్పై పెడతామని హామీ ఇచ్చారు. అలాగే పెండింగ్లోని 42 వేల క్లెయిమ్ల పరిష్కారం, ఉచిత ఇసుకతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం ప్రకారం అన్నీ అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. కార్మికుల పిల్లల చదువుకు రూ.20 వేలు, ఇన్సూరెన్స్ సదుపాయం, గర్భిణుల డెలివరీ ఖర్చులు, ఇప్పటివరకు సహజ మరణానికి చెల్లిస్తున్న రూ.లక్షను రూ.5 లక్షలకు పెంచుతాం, ప్రమాద మరణం బీమాను రూ.6 నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఇవన్నీ నమ్మి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపిమేసీ్త్రలు, తాపి పనివారు, రాడ్బెండర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, మార్బుల్ వర్కర్స్, టైల్స్ వర్కర్స్, రోజువారీ కూలీలు ఇలా అందరూ ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 80 వేల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు గడిచినా తమకు ఇచ్చిన హామీల అమలుపై కూటమి సర్కారు నోరు మెదపకపోవడం పట్ల కార్మికులు పెదవి విరుస్తున్నారు. కార్మికుల ఆశలపై నీళ్లు.. కలగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ఎన్నికల ప్రచారంలో బోర్డును పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ బోర్డు ఏర్పాటుకు రూ.కోటి ఇస్తానని తాడేపల్లి సభలో పవన్ ప్రకటన అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు శూన్యం ప్రభుత్వ తీరుపై కార్మికుల మండిపాటుఎన్నికల ప్రచారం సమయంలో తాడేపల్లిలో జరిగిన సభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు తనవంతు సాయంగా కోటి రూపాయలు ఇస్తానని పవన్కల్యాణ్ ప్రకటించారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుసున్నా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఆయన ఇస్తానన్న కోటి రూపాయలు ఇంకా జమ కాలేదు. భవన నిర్మాణ కార్మికులకు చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని కార్మికులు మండిపడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారం, ఇన్సూరెన్స్, నష్ట పరిహారంపై ప్రకటన కోసం కార్మికులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల అమలుతో పాటు డిమాండ్ల సాధనకు కార్మికలు గతేడాది నవంబర్ 11న ధర్నాకు దిగి నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దురదృష్టకరమని, వారి హామీలు నమ్మి మోసపోయామని కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
సాగునీటి సరఫరాలో జాప్యం
● డీఆర్సీలో ప్రశ్నించిన జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: ప్రణాళికలు లేని పాలనవల్లే ఖరీఫ్ సాగుకు సకాలంలో సాగునీటిని అందజేయలేకపోయారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం (డీఆర్సీ) గురువారం నిర్వహించారు. తొలుత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోని తోటపల్లి ప్రాజెక్టుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో జూన్ నెలలోనే సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టులో నీరున్నా ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని అధికారులను నిలదీశారు. కాలవల పూడిక తీత పనులు చేపట్టామని అఽధికారులు చెప్పగా ముందుగా ప్రణాళిక వేసుకోలేదా అని ప్రశ్నించారు. ఇన్చార్జి మంత్రి అనిత కలుగుచేసుకొని మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాలతో మాట్లాడుకోవాల్సి ఉంటుందని సమాధానం ఇచ్చారు. రైతులకు నీరివ్వడంలో ఈ ఏడాది 15 రోజులు ఆలస్యమైందని అంగీకరించారు. ● డీసీసీబీ చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఎత్తిపోతల పథకం నుంచి రాజాం, చీపురుపల్లి ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు. బాడంగి మండలం వాడాడ గ్రామం పరిధిలోని 860 హెక్టార్ల సాగుభూమి కోసం గత ప్రభుత్వ హయాంలో ఈ ఎత్తిపోతల పథకం వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. దీనిపై పూర్తినివేదిక ఇవ్వాలని హోంమంత్రి ఆధికారులను ఆదేశించారు. ● వ్యవసాయ శాఖ సమీక్షలో 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉన్నట్లు కలెక్టర్ బహిరంగంగానే చెప్పడం, గతంలోనే డిమాండ్ చేసినప్పటికీ ఇంకా పూర్తి సరఫరా జరగలేదని జెడ్పీ చైర్మన్ విమర్శించారు. నానో యూరియా వినియోగంపై ప్రచారం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రైతుల్లో సందేహాలు తొలగడంలేదన్నారు. ● పరిశ్రమల సమీక్షలో జిల్లాలో మూతపడిన పరిశ్రమల జాబితాలు ఇవ్వాలని మంత్రి అనిత చెప్పడం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి స్తబ్దతను తెలియజేసింది. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం సీ్త్ర శక్తి బస్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పినా జిల్లాలో 160 బస్సులకు కేవలం 137 బస్సులు మాత్రమే సిద్ధం కావడం, వాటిలో సీసీటీవీ అమలు వంటి పనులు ఇంకా పూర్తికాలేదని తెలియజేశారు. సమావేశంలో వైద్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖలపై సమీక్షించారు. ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, డాక్టర గాదె శ్రీనివాసులనాయుడు, ఎంపీ అప్పలనాయుడు, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, సీపీఓ పీ.బాలాజీ, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఏ దాట్ల కీర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక్కరు మినహా ఎమ్మెల్యేలందరూ డుమ్మా ప్రజల సమస్యలను జిల్లా స్థాయిలో పాలకులను చెప్పుకొనే అవకాశం ఉన్న వేదిక డీఆర్సీ. ప్రతి మూడునెలకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై జిల్లా అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సమస్యల పరిష్కారాలు చేపడతారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నెల్లిమర్ల ఎమ్మెల్లే లోకం నాగ మాధవి మినహా మిగిలిన వారంతా గైర్హాజరుకావడం గమనార్హం. -
మువ్వన్నెల పండగకు ఏర్పాట్లు పూర్తి
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవం(మువ్వన్నెల పండగ) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ గురువారం తెలిపారు. ఆగస్టు 15వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ ప్రదర్శన, ప్రగతిపై సందేశం, పోలీస్ దళాల మార్చ్ఫాస్ట్, రిట్రీట్, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల బహూకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమ వీక్షణకు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లు కూడా చేశామని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఏర్పాట్లు చేశామన్నారు. 589 మందికి ప్రశంసా పత్రాలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని పలు శాఖలు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న 589 మంది ప్రశంసా పత్రాలు అందజేస్తామని కలెక్టరేట్ వర్గాలు ప్రకటించాయి. -
కళతప్పిన కొప్పెర్ల గురుకులం
పూసపాటిరేగ: కొప్పెర్ల బీఆర్ అంబేడ్కర్ గురుకులం... రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉన్న విద్యాలయం. 1983 జాతీయ రహదారిని ఆనుకొని సుమారు 20 ఎకరాలు విశాలమైన స్థలంలో ఏర్పాటైంది. ఇక్కడ సీటు సాధించేందుకు పోటీ పడాల్సి వచ్చేది. ఈ విద్యాలయంలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, ఎస్ఐలుగా, రాజకీయనాయకులుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం గురుకులం కళతప్పింది. ఇక్కడ భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకునేవారే కరువయ్యారు. సరైన వసతిలేక పోవడంతో తరగతి గదుల్లో విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు నివాసం ఉంటున్నారు. తరగతి గదులు, డార్మిటరీ అధ్వానంగా తయారయ్యాయి. చాలా తరగతి గదులకు డోర్లు లేవు. గు రుకులం ప్రిన్సిపాల్ చొరవతో ఉపాధ్యాయులు చందాలు వేసుకుని ఇటీవల డోర్లును ఏర్పాటుచేశారు. సీట్లు ఖాళీ.. కొప్పెర్ల గురుకులంలో సీటు సాధిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని భావించేవారు. నేడు అదే విద్యాలయంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గురుకులంలో 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 620 సీట్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయి అధికారుల అనుమతితో మరో 50 సీట్లలో ప్రవేశాలు కల్పించవచ్చు. అయితే, ప్రస్తుతం 420 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. సుమారు 200 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా గురుకులంలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిచూపడంలేదు. ఎస్ఎంఎస్ పరిశ్రమ సహకారంతో కొన్ని తరగతి గదులు నిర్మించారు. మైలాన్ పరిశ్రమ సహకారంతో డార్మిటరీ నిర్మాణ పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం శిథిల భవనాల మరమ్మత్తులకు ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గురుకులంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. శిథిలావస్థలో భవనాలు ప్రారంభానికి నోచుకోని డార్మిటరీ గురుకులంలో చేరేందుకు విద్యార్థులు అనాసక్తి మొత్తంగా 200 సీట్లు ఖాళీఉన్నతాధికారులకు నివేదించాం కొప్పెర్ల గురుకులంలో శిథిల భవనాల మరమ్మతుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. గురుకులంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. శిథిల భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. – అప్పారావు, ప్రిన్సిపాల్, కొప్పెర్ల గురుకులం -
నేటి స్వాతంత్య్రం
నాటి పోరాట ఫలితం.. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో సాలూరుకు చెందిన యోధులు అలుపెరగని పోరాటం చేశారు. వారిలో కూనిశెట్టి వెంకటనారాయణదొర, బెంజిమన్ ఫ్రాంక్లిన్, దారాముక్కల యగ్నేశ్వరశర్మ తదితరులు ఉన్నారు. కూనిశెట్టి వెంకటనారాయణ దొర వందేమాతర నినాదాలు వినిస్తూ బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురయ్యారు. బరంపురం సి–క్లాసు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ ప్రాంతంలో నారాయణదొర నాయకత్వం వహించారు. స్వాతంత్య్రం వచ్చాక నారాయణదొరను స్థానికులు ఊరంతా గుర్రంపై ఊరేగించారు. సాలూరు గాంధీగా పిలుచుకున్నారు. సాలూరులో జాతీయజెండాను ఎగురవేసి భారత స్వాత్రంత్య సంగ్రామంలో సాలూరు ఖ్యాతిని ఆయన చాటి చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. -
మా భూములు మాకు ఇప్పించండి
శృంగవరపుకోట: మండలంలోని బొడ్డవారలో జిందాల్ నిర్వాసితులు నిర్వహిస్తున్న శాంతియుత నిరసన గురువారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. మా భూములు మాకు ఇప్పించాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను కోరుతూ బ్యానర్ ప్రదర్శించారు. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ కంపెనీకి ఇచ్చిన భూముల వద్ద మీరు(పవన్ కల్యాణ్) వెళ్లి, విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేసి రైతులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో తమకు కూడా న్యాయం చేయాలని తమ భూములు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో కూడా ఓసారి పర్యటించి, తమ బాధలు వినాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, పాలకులు తమను పట్టించుకోవడం లేదని మీరే న్యాయం చేయగలరని నమ్ముతున్నామని, మీరే రావాలని మా సమస్యలు ఆలకించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
పంద్రాగస్టు కవాతు సాధన
విజయనగరం క్రైమ్: స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణలో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల కవాతు సాధన గురువారం జరిగింది. ఎస్పీ వకుల్ జిందల్ వారి పరేడ్ పరిశీలనకు వెళ్లగా, వారు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో మరింత ఉత్సాహంగా కవాతు చేసి, చూపరులను ఆకట్టుకునేలా ప్రదర్శన ఉండాలని ఆ దిశగా సాధన చేయాలని తెలిపారు. వేడుక చూసిన వారిలో దేశభక్తి, జాతీయ భావం పెంపొందేలా కార్యక్రమం ఉండాలన్నారు. వేడుకల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు దివ్యవాణి మెంటాడ: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మెంటాడ మండలం, గుర్లతమ్మిరాజుపేట విద్యార్థిని అల్లు దివ్యవాణి ఎంపికై ంది. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బాపట్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్ 20 విభాగంలో జరిగిన 100 మీటర్లు, 200 మీటర్లు పరుగుపందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ మేరకు దివ్యవాణికి ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, చొక్కాపు సన్యాసినాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు తదితరులు అభినందనలు తెలిపారు. త్రుటిలో తప్పిన ప్రమాదం రాజాం సిటీ: స్థానిక పాలకొండ రోడ్డులోని జీఎంఆర్ ఐటీ సమీపంలో గురువారం త్రుటిలో ఓ ప్రమాదం తప్పింది. రేగిడి మండలం, సరసనాపల్లికి చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి స్వగ్రామం వెళుతున్నారు. రోడ్డుపై పెద్దగోతులు ఉండడంతో ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో రాజాం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవరు ఈ ఘటనను చూసి షడన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అప్రమత్తమై పడిపోయిన వృద్ధ దంపతులను పక్కకు తీసుకువెళ్లి సపర్యలు చేశారు. ఈ విషయం తెలుసుకన్న ఆర్అండ్బీ అధికారులు అప్రమత్తమై రోడ్డుపై గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. సారాబట్టీలపై పోలీసుల దాడులు గుమ్మలక్ష్మీపురం: మండలంలోని చెముడుగూడ పంచాయతీ, మంగన్నగూడ పరిసరాల్లో నిర్వహిస్తున్న సారాబట్టీలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎల్విన్పేట ఎస్ఐ బి.శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన 1400 లీటర్ల బెల్లంఊటను గుర్తించి, దానిని బయటకు పారబోశారు. అనంతరం సారా తయారీకి వినియోగిస్తున్న డ్రమ్ములను స్వాధీనం చేసుకుని వాటిని కాల్చివేశారు. ఎక్కడైనా సారా తయారు చేసినా తరలించినా సమాచారం ఇవ్వాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పార్వతీపురం రూరల్: మండలంలోని తాళ్లబురిడి గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం రూరల్ ఎస్ఐ బి.సంతోషికుమారి గురువారం తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. -
●మహాత్ముని పిలుపుతో..
మహాత్మా గాంధీ పిలుపు మేరకు భామిని మండలం బత్తిలికి చెందిన దివంగత శాసనపురి వాసుదేవరావు దేశ స్వాతంత్య్రోద్యమంలో ఉత్సాహంగా పాల్గొ న్నారు. పార్వతీపురం కుట్ర కేసులో బ్రిటిష్ పోలీస్లు అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపారు. సర్దార్ గౌతు లచ్చన్నలతో పాటు, కురుపాం చిన్నరాజు, పార్వతీపురానికి చెందిన వల్లూరు సాంబమూర్తి, వల్లభరావులతో కలిసి జైలు జీవితం అనుభవించారు. ఆమదాలవలస రైల్వే స్టేషన్లో మహాత్మా గాంధీ ప్రేరణతో విదేశీ వస్తువుల బహిష్కరిస్తూ స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చాక ఎమ్మెల్సీ పదవిని సైతం వాసుదేవరావు తిరిస్కరించారు. ఆయన 1994 జనవరి 2న తుది శ్వాస విడిచారు. -
ఆటోడ్రైవర్ల నిరసన
మక్కువ: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు నిరసనగా ఆటోడ్రైవర్లు మక్కువ ప్రధాన రోడ్డుపై గురువారం ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వాహనమిత్ర పథకాన్ని అమలు చేయాలని, ప్రతి ఆటోడ్రైవర్కు రూ.25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల మెడకు ఉరి తాడు లాంటి జీఓ నంబర్ 21ను రద్దు చేయా లని కోరారు. అనతరం తహసీల్దార్ భరత్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మక్కువ ఆటో డ్రైవర్లు యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వై.నాయుడు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం అమలుతో ఆటోరంగం తీవ్రంగా దెబ్బతింటుందని, ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కార్యక్రమంలో చినబోగిలి, బొబ్బిలి, కోన, చెముడు, దుగ్గేరు, శంబర ఆటో స్టాండ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, గిరిజన సంఘం నాయకులు టి.ప్రభాకరరావు, సీఐటీయూ నాయకులు కష్ణారావు పాల్గొన్నారు. అచ్యుతాపురం రూరల్: వివాహిత ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం, ఎస్టీబీఎల్లో చోటుచేసుకుంది. అక్కడే అద్దెకు నివాసముంటున్న కొండల గాయత్రి(21) బుధవారం ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సీఐ నమ్మి గణేష్ తెలిపిన వివరాల ప్రకారం మన్యం జిల్లా, వీరఘట్టం మండలానికి చెందిన మృతురాలు గాయత్రికి 2024 మార్చి నెలలో శంకరరావుతో వివాహమైంది. గాయత్రి భర్త అచ్యుతాపురం ఎంఎస్ఎంఈలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. భర్త ఉదయం 9.30 గంటలకు విధులకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి గాయత్రి వంటగదిలో చున్నీతో ఉరివేసుకుని మృతి చెందడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు గర్భం పోవడంతో పలుమార్లు ఇరుగుపొరుగు వారితో తన గర్భం పోయిందని చెబుతూ ఆవేదన చెందినట్టు విచారణలో తెలిసిందన్నారు. క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే ఆమె ఉరి వేసుకుని మృతి చెందినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కేసు నమోదు చేసి, ఇతర కారణాలపైనా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
● రేషన్ అవస్థలు
రేషన్ బియ్యం పంపిణీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..గిరిజనుల పాలిట శాపంగా మారింది. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత విధానంలోనే రేషన్ షాపుల వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గిరిజనులకు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని కిలోమీటర్ల మేర కొండలు, వాగులు, వంకలు దాటుకుని కాలినడకన రేషన్ షాపు వద్దకు చేరుకుని, అక్కడ కొన్ని గంటల పాటు వేచి ఉండగా వచ్చిన రేషన్ను మళ్లీ నెత్తిన పెట్టుకుని కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని, జగనన్న హయాంలోనే బాగుండేదని ఎండీయూ వ్యాన్ ద్వారా గ్రామంలోకి రేషన్ వచ్చేదని అంటున్నారు. అదే విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. –సాలూరు రూరల్ -
● డోలీలతో నిరసన
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ శృంగవరపుకోట మండలంలోని దారపర్తి గెడ్డ వద్ద గిరిజనులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. డోలీలు చూపిస్తూ ఇక్కడి గెడ్డను దాటాలంటే నీటి ప్రవాహంలో గెడ్డను దాటలేని చిన్నారులు, వృద్ధులను ఇలా డోలీలో మోసుకుని వెళ్లాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. దారపర్తి, మారిక డి.కెపర్తి, మూలబొడ్డవార పంచాయతీల్లోని గిరిశిఖర గ్రామాలకు నేటికీ రోడ్డు సదుపాయం లేదని, గెడ్డలపై వంతెనలు కూడా లేవని దీంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పాలకులు మారుతున్నా తమ బాధలు మాత్రం తీరడం లేదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్లు, వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – శృంగవరపుకోట -
ఐదు రోజులూ అప్రమత్తం
సాక్షి, పార్వతీపురం మన్యం: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా, మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రానున్న ఐదు రోజులు వర్ష ప్రభావం ఉంటుందన్న విపత్తుల శాఖ సూచనలతో జిల్లా యంత్రాంగం ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఐదు రోజులు సెలవులు రద్దు చేస్తున్నట్లు జిల్లా, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరైనా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలూ జరగకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అత్యవసర వేళ కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ఫోన్: 08963 293046ను ఆశ్రయించాలన్నారు. కొండవాలు, నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను, పాడైన గృహాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజన సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో బుధవారం జిల్లాలో 19 మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా జియ్యమ్మవలసలో 48.8, పార్వతీపురంలో 42.8, బలిజిపేటలో 42.4 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది. గురువారం కాస్త తెరిపిచ్చింది. భారీగా కురిసిన వర్షానికి పార్వతీపురం జిల్లా కేంద్రం జలమయం అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు ముంచెత్తింది. బైపాస్ రోడ్డులో ఉన్న సాయిబాబా ఆలయంలోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. వర్షపు నీరుతో కలెక్టరేట్ ప్రాంగణమంతా చిన్నపాటి నీటి కొలనును తలపించింది. అందులోనే కొంతమంది వాహనదారులు తమ వాహనాలను శుభ్రం చేసుకోవడం గమనార్హం. -
సందడిగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
–IIలోపార్వతీపురంటౌన్: పార్వతీపురంలో 250 మీటర్ల జాతీయ జెండాతో ఆర్సీఎం పాఠశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీ దేశభక్తిని చాటింది. ర్యాలీలో కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగాలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మనందరం భరతమాత ముద్దుబిడ్డలమని, భరతమాత గర్వించేలా నడుచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఇతర జిల్లా అధికారులు, వివిధ కళాశాలలు, పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆటల్లో సత్తా చాటిన పాఠశాలలకు పురస్కారాలు
● ఈ నెల 18 లోగా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ● జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 పాఠశాలలకు దక్కనున్న అవార్డులు ● స్కూల్ గేమ్స్ క్రీడలో ప్రతిభ చూపిన వారికి అవకాశంవిజయనగరం: ఆటల్లో మేటిగా నిలిచే క్రీడాకారులున్న పాఠశాలలకు పురస్కారాల పంట పండనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలకు క్రీడా ప్రతిభా పురస్కారాలు అందజేయాలని, ఆ మేరకు దరఖాస్తులు ఆహ్వానించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. 19న దరఖాస్తుల పరిశీలన, 20న అభ్యంతరాల స్వీకరణ, 21న తుది జాబితా ప్రకటిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహం.. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పాఠశాలలకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది హాకీ క్రీడాకారుడు ధ్యానచంద్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఆ రోజు అన్ని పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నారు. క్రీడా ఫలితాల ఆధారంగా.. ఉత్తమ పాఠశాలల ఎంపికకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమించనున్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో ఐదు మంది సభ్యులుగా ఉంటారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి అత్యధిక విజయాలు సాధించిన పాఠశాలల్లో ఐదింటిని కమిటీ గుర్తిస్తుంది. ఇందుకు ప్రతి క్రీడలో అత్యధిక స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. 2024 – 2025కు సంబంధించిన క్రీడా ఫలితాల ఆధారంగా జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రదర్శనలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని అన్ని బడుల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ సంతకంతో క్రీడాకారులు సాధించిన ధ్రువపత్రాల నకళ్లతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న పాఠశాలలకు 29న జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేస్తారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు తెలిపారు. -
అదుపు తప్పి బోల్తా పడిన పొక్లెయినర్
మెంటాడ: మండలంలో వాణిజి గ్రామం నుంచి అనంతగిరి మండలం బూరుగ గ్రామానికి రోడ్డు వేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం పనులు పూర్తయిన తరువాత పొక్లెయినర్ను ట్రాలీపైకి ఎక్కిస్తుండగా అదుపు తప్పి లైటింగ్ చూపిస్తున్న బీహార్కు చెందిన ట్రాలీ డ్రైవర్ ప్రమోద్కుమార్, మెంటాడకు చెందిన తాడ్డి రాంబాబులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్ ప్రమోద్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, తాడ్డి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి ఎస్ఐ సీతారాం చేరుకుని గాయాల పాలైన రాంబాబును జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతి చెందిన ప్రమోద్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సీతారాం తెలిపారు. ఒకరి మృతి -
రాష్ట్ర స్థాయి పోటీలకు గంగుబూడి విద్యార్థులు
లక్కవరపుకోట : మండలంలోని గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల లక్కవరపుకోట మండల కేంద్రం ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జరిగిన ఎంపికలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు పాఠశాల పీడి గాడి రవికుమార్ బుధవారం తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో గొర్లె పూర్ణచందు, జూనియర్స్ విభాగంలో వానపల్లి మనోజ్ ఎంపికై నట్టు పేర్కొన్నారు. వీరు ఈ నెల 29 నుంచి 31వ తేది వరకు ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు నుంచి ఆడుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు శారదాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వి.వి.జి.మంగరాజు తదితరులు అభినందించారు. మారెడుబాకలో ఇరు వర్గాల కొట్లాట రాజాం సిటీ: మండల పరిధి మారెడుబాక గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఇరువర్గాల కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సీఐ కె.అశోక్కుమార్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జరజాన కోటేశ్వరరావు, వర్రి రామకృష్ణల మధ్య చెలరేగిన స్థల వివాదం కొట్లాటకు దారితీసింది. వర్రి రామకృష్ణతో పాటు మరో తొమ్మిది మంది జరిపిన దాడిలో జరజాన కోటేశ్వరరావుతో పాటు సునీత, లత, కుంచి నిర్మల, రాయ లక్ష్మి గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు వీరిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రేమ పేరుతో మోసగించిన యువకుడు అరెస్టు తెర్లాం: ఓ యువతిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసుకు సంబంధించి యువకుడిని అరెస్టు చేసినట్టు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు బుధవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గొలుగువలస గ్రామానికి చెందిన సిరిపురపు వెంకటరమణ, అదే గ్రామానికి చెందిన యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ యువకుడు తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకోమని కోరినప్పుడు పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించాడని, వేరొక యువతిని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ప్రేమించిన యువతి తాను మోసపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకునిపై నమ్మించి మోసం చేసినట్టుగా తెర్లాం ఎస్ఐ బి.సాగర్బాబు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన బొబ్బిలి రూరల్ సీఐ యువతిని ప్రేమించి, మోసగించిన యువకుడిని అరెస్టు చేసి బొబ్బిలి కోర్టులో హాజరుపరచినట్టు తెలిపారు. సెప్టెంబర్ 14న పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్ర స్థాయిలో పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించనున్నట్టు శ్రీ వాణి ఆర్ట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ పీజే నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం పట్టణంలో గల లయన్స్ కల్యాణ మండపం వేదికగా సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు పోటీలలో పాల్గొనేందుకు ఆగస్టు 25లోగా ప్రవేశ రుసుము రూ.200 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు ప్రత్యేక స్థానాలుగా గుర్తించి ప్రతిభ కనబరిచిన కళాకారులకు జ్ఞాపకతో పాటు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా నమోదు చేసుకునేందుకు 8186076044, 9849833439, 9948128766 నంబర్లను సంప్రదించాలని కోరారు. శ్రీ వాణి ఆర్ట్స్ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
రెండు తులాల బంగారం కోసం చిన్నాన్నని చంపేశాడు..
● నాటు తుపాకీతో హత్య చేసిన వ్యక్తి అరెస్టు ● వివరాలు వెల్లడించిన విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావుకొత్తవలస : కేవలం రెండు తులాల బంగారం కోసం జరిగిన వివాదం వరసకు చిన్నాన్న అయిన సిమ్మ అప్పారావును నాటు తుపాకీతో కాల్చి చంపడానికి దారి తీసిందని విజయగనరం డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(70)ను తన మేనకోడలు భర్త అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(36) ఈ నెల 5వ తేదీన అతి సమీపం నుంచి నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ మేరకు గ్రామానికి చెందిన సిమ్మ శివకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సిహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిందితుడు సిమ్మ అప్పారావును కోటపాడు రోడ్డు సీతంపేట గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక విలేకరుల ముందు నిందితుడిని హాజరుపరిచి వివరాలను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. నిందితుడు అప్పారావు భార్య ఏడాదిన్నర క్రితం మృతి చెందింది. ఆమెకు సంబంధించిన బంగారం, భూమి ఇతర ఆస్తులు మేనమామ అయిన మృతుడు సిమ్మ అప్పారావు వద్ద ఉన్నట్టు తెలిపారు. సదరు బంగారం, భూమి ఇవ్వాలని నిందితుడు అప్పారావు మృతుడు అప్పారావుని పలుమార్లు అడిగాడు. అయినా బంగారం ఇవ్వకపోవడంతో ఈ నెల 5న నిందితుడు తన స్వంత ఆటోలో ముసిరాం వచ్చి మరోసారి బంగారం ఇవ్వమని అడిగాడు. ఆయన నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో గుండైపె కాల్చడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడని తెలిపారు. సీతంపేట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తుపాకీ కోసం విచారించగా పాతవలస సమీపంలో వుంచినట్లు తెలపగా తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన సీఐ సిహెచ్.షణ్ముఖరావు, ఎస్ఐ పి.ప్రసాద్రావు, పీసీ లు ఎల్.రమేష్, దేముడు తదితరులను అభినందించారు. రివార్డులకు సిఫార్స్ చేస్తామని తెలిపారు. -
19న ఐద్వా మహాసభలు
విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఈ నెల 19న జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 9వ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.రమణమ్మ కోరారు. ఈ మేరకు బుధవారం స్ధానిక రామకృష్ణ నగర్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో విలేకర్లతో ఆమె మాట్లాడారు. మహిళా హక్కులు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మహిళలపై జరిగే దాడులు, హత్యలు, ఆత్యాధారాలు, లైంగిక, వరకట్న వేధింపులు, సీ్త్ర వివక్ష, డ్వాక్రా మహిళల సమస్యలు, మైక్రోఫైనాన్స్, మద్యం, గంజాయి, డ్రగ్స్, అశ్లీలత మొదలైన సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు ఐద్వా నిర్వహిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జాప్యం చేయడం సరైంది కాదని వెంటనే ప్రతి మహిళకు రూ.1500 పథకం అమలు చేయాలన్నారు. అన్ని సర్వీసుల్లో రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా నాయకులు ఎం.జగదాంబ, కె.రమణమ్మ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
డెంకాడ: మండలంలోని చింతలవలస వద్ద ఆర్అండ్బీ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలంలోని ధర్మపురి గ్రామానికి చెందిన వలిపల్లి సుధాకర్(37) దివీస్ కంపెనీలో కెమిస్ట్గా పని చేస్తున్నాడు. బి షిప్ట్ కావడంతో బుధవారం మధ్యాహ్నం ధర్మపురి నుంచి తగరపువలస సమీపంలో ఉన్న దివీస్ కంపెనీకి వెళ్తుండగా.. చింతలవలస గ్రామం వద్ద ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీనిలో వలిపల్లి సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సుధాకర్ను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు. -
గంజాయితో సంపాదించిన ఆస్తులు ఫ్రీజ్ : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారి నగేష్ అలియాస్ బాలరాజుకు చెందిన రూ.56 లక్షల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. జిల్లాలోని ఎస్.కోట పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు అయిన నగేష్ ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పంత్లున్గా పంచాయత్ నందాపూర్ మండలం భాకాపుట్ గ్రామానికి చెందిన వాడని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాతో సంపాదించిన సుమారు రూ.56 లక్షల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. గంజాయి వ్యాపారుల నుంచి అతని భార్య జమున బ్యాంకు ఖాతాకు పలుమార్లు రూ.6.53 లక్షల నగదు జమ అయినట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడు సంపాదించిన అక్రమ ఆస్తులను ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ఫ్రీజ్ చేసినట్టు నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కొల్కత్తాలోని కాంపిటెంట్ అధారిటీ పరిధిలోకి వెళ్లాయని, సదరు ఆస్తులను ఎవరు కొనుగోలు చేసినా చెల్లనేరవని ప్రజలు దీన్ని గుర్తించాలని ఎసీ కోరారు. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్.కోట ఇన్స్పెక్టర్ వి.నారాయణమూర్తి ఇతర పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. -
దేవుడితో కూటమి ఆటలు
● ట్రస్టుబోర్డు నియామకంలో కుంపట్లు ● వంశపారంపర్య, వ్యవస్థాపక ధర్మకర్తలకు మొండిచేయి ● నిన్న నవదుర్గామాత ఆలయం.. ● నేడు పోలిపల్లిపైడితల్లి ఆలయంరాజాం: దేవుడితోను..దేవస్థానాలతోను కూటమి ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. చోటా మోటా కార్యకర్తలు, నాయకుల మాటలకు దేవదాయశాఖ తల ఊపుతోంది. నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాలు చేస్తోంది. దేవాలయాల ట్రస్టు బోర్డు నియామకంలో సిఫార్సులకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాజకీయాలు చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోంది. హైందవ ధర్మాన్ని అటకెక్కించే పనిలో పడింది. రాజాంలో నిన్న నవదుర్గామాత ఆలయ ట్రస్టుబోర్డు కమిటీ నియామకంలో నిబంధనలు ఉల్లంఘించిన దేవదాయశాఖ, ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన పోలిపల్లి పైడితల్లి ఆలయం ట్రస్టు బోర్డు నియామకంలో కూడా వివాదాలకు తావిచ్చి ంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఆలయ ట్రస్టు బోర్డులు, అభివృద్ధి కమిటీల ఏర్పాటులో గత ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అలా కాకుండా కూటమి కుంపటి పెడుతోంది. రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గామాత ఆలయ ట్రస్టు బోర్డు ఎంపిక పక్షం రోజుల క్రితం జరిగింది. ఆ బోర్డులో ఆలయ వ్యవస్థాపక ఽకుటుంబానికి చెందిన ధర్మకర్తను చైర్మన్గా ఉంచాల్సి ఉండగా, ఆయనను తొలగించి, రాజాం పట్టణ పరిధిలోని సారథి గ్రామానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త పేరును ప్రకటించింది. దీంతో ఇక్కడ పెద్దస్థాయిలో వివాదం చెలరేగడంతో పాటు వ్యవస్థాపక ధర్మకర్తలు ఈ నియామకాన్ని తిరస్కరించడంతో ప్రస్తుతం ఈ బోర్డు ఎంపిక వివాదాస్పదంగా మారి గాలిలో ఉంది. గతంలో ఈ బోర్డు ఎంపికలో ఇటువంటి ఇబ్బందులు రాలేదని, వ్యవస్థాపక ధర్మకర్త వానపల్లి తమ్మయ్య గురువు కుమారుడు వానపల్లి నర్సింగరావు తెలిపారు. ధర్మకర్త కుటుంబానికి చెందిన చైర్మన్గా ఉంటారని, మిగిలిన సభ్యులను దేవదాయశాఖ నియమించాల్సి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ విధానంలోనే చైర్మన్గా ధర్మకర్తను కొనసాగించి, ఆలయ అభివృద్ధికి సహకరించిన మిగిలిన భక్తులకు కమిటీలో చోటు కల్పించేవారని వెల్లడించారు. ఈ దఫా ఈ నిబంధనలు అటకెక్కించి, ఆలయానికి రానివారిని, ఆలయం అంటే తెలియని వారిని సభ్యలుగా పెట్టిన పరిస్థితి ఉందన్నారు. తాజాగా మరో వివాదం ఇదిలా ఉండగా ఇప్పుడు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు ఎంపికకు దేవదాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ట్రస్టు చైర్మన్ పదవిని ఖాళీ ఉంచి, మిగిలిన కమిటీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాకాకుండా మొత్తం కమిటీకి దరఖాస్తులు ఆహ్వానించడంతో వివాదం ప్రారంభమైంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్గా ఆలయ ధర్మకర్త కుటుంబానికి చెందిన వాకచర్ల కుటుంబీకులే వ్యవహరిస్తున్నారు. గతేడాది వరకూ ధర్మకర్త కుమారుడైన వాకచర్ల దుర్గాప్రసాద్ చైర్మన్గా వ్యవహరించారు. పైడితల్లి అమ్మవారి ఆలయానికి సంబంధించి అన్ని ఉత్సవాల్లో వారి భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి ధర్మకర్త కుటుంబాన్ని పక్కన పెట్టి, కొత్తవారికోసం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇక్కడ వివాదం ప్రారంభమై, దేవదాయశాఖ తీరుతో పాటు కూటమి ప్రభుత్వ తీరుపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఇంతటి దురదృష్టకర పాలనను ఇంతకు ముందు చూడలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ కమిటీ ఎన్నిక ఎలా జరుగుతుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు.నిబంధనలు మారాయి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు కమిటీ ఎంపిక నోటిఫికేషన్ ఉన్నతాధికారుల నుంచి వచ్చింది. గతంలో వంశపారంపర్య ధర్మకర్తలే చైర్మన్లుగా ఉండేవారు. ఇప్పుడు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక్కడ పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకే నియామకం ఉంటుంది. నా చేతిలో ఏమీలేదు. బీవీ మాధవరావు, దేవాదాయశాఖ రాజాం మేనేజర్ -
జర్మన్ భాషపై ఆన్లైన్లో ఉచిత శిక్షణ
పార్వతీపురం టౌన్: జర్మనీ దేశంలో అసిస్టెంట్ నర్సు ఉద్యోగాలు పొందేందుకు జిల్లాలోని జి.ఎన్.ఎమ్ చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓంకాప్, టి.ఎన్.ఏ.ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఆన్లైన్లో శిక్షణ ఉంటుందని వివరించారు. తప్పనిసరిగా జి.ఎన్.ఎమ్ పూర్తి చేసి ఏడాది పాటు సాధారణ ఆసుపత్రుల్లో అనుభవం కలిగి 39 ఏళ్లలోపు వయసున్న వారు జర్మన్ భాష నేర్చుకోవడానికి అర్హులని తెలిపారు. శిక్షణ రోజుకు 2 నుంచి 3 గంటల పాటు సుమారు 8 నెలల వరకు ఉంటుందని అన్నారు. ఇందులో ఏ1, బీ2 లాంగ్వేజ్లపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రూ.30,000లు సెక్యూరిటీ డిపాజిట్ చేసి, జర్మనీ వెళ్లేందుకు విమాన చార్జీలు, బీ2 పరీక్ష ఫీజు, వీసా చార్జెస్ చెల్లించాలన్నారు. శిక్షణ పూర్తి చేసి బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు రూ.2 లక్షల నుంచి 2,50,000ల వరకు జీతం చెల్లిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 7032060773 నంబరును సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య -
కళాశాల విద్యార్థుల మధ్య కొట్లాట
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ కొట్లాటకు దారితీసింది. ఈ నెల 18న నిర్వహించనున్న ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి సంబంధించి ఎంట్రీ పాస్ను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి పోగొట్టుకోవడంతో రెండో ఏడాది ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు వారికి మధ్య ఘర్షణ జరగడంతో ఆ ఘర్షణ కాస్త కొట్లాటకు దారి తీసిందిసింది. కళాశాల అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ అనంతరం కొట్లాటకు దారి తీయడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గాయాలైన విద్యార్థులు చేరినట్టు ఈ మేరకు ఔట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది వివరాలు సేకరించినట్టు తెలిపారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పుర్తి వివరాలను విద్యార్థుల నుంచి సేకరించి కేసు నమోదు చేస్తున్నట్టు పట్టణ ఎస్ఐ గోవింద తెలిపారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
పార్వతీపురం రూరల్ : మూడవసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ రైతుకు ద్రోహం చేస్తున్నదని పలు రైతు సంక్షేమ, రైతుకూలి, ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతు, కార్మిక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ రంగంలోకి ‘కార్పొరేట్’ సంస్థలను తీసుకువచ్చే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు పండే భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇవ్వడం సరికాదన్నారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ బంటు దాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఈవీ నాయుడు, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు పి.శ్రీనునాయుడు, కృష్ణ వేణి, ఎం.భాస్కరరావు, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు పి.సంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిన మోహన్, గేదెల రామకృష్ణ, వంగల దాలినాయుడు, ఏఐటీయూసీ నాయకులు ఆర్వీఎస్ కుమార్, దుర్గారావు, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్కుమార్, తాడంగి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి మృతి
పూసపాటిరేగ : మండలంలోని ఎస్ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి విధి నిర్వహణలో వుండగా అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాసరావు (26) ఎస్ఎంఎస్ పరిశ్రమలో కెమిస్ట్గా పని చేస్తున్నాడు. ఆదివారం ఏ షిప్టుకు హాజరైన శ్రీను విధులు నిర్వహిస్తుండగా ఆకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. సొమ్మసిల్లిన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం విజయనగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పరిశ్రమ ఉద్యోగి మృతి చెందడంతో గ్రామస్తులు, మృతుని బంధువులతో మృతదేహం అంబులెన్సులో వుంచి పరిశ్రమ గేటు ఎదురుగా ఆందోళనకు దిగారు. దీనిపై యాజమాన్య ప్రతినిధులు స్పందిస్తూ పరిశ్రమలో ఎటువంటి ప్రమాదం జరగలేదని, అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు తెలిపారు. దీంతో పరిశ్రమ ఉద్యోగికి న్యాయం చేయాలని గ్రామస్తులు, మృతుని బంధువులు పట్టుబట్టడంతో యాజమాన్య ప్రతినిధులు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం ఎస్ఐలు ఐ.దుర్గాప్రసాదు, ఎ.సన్యాసినాయుడు, పాపారావు సిబ్బందితో పాటు గేటు వద్ద బందోబస్తు నిర్వహించారు. అంబులెన్స్లో మృతదేహంతో గేటు ఎదుట నిరసన పరిశ్రమ యాజమాన్యంతో ప్రజాప్రతినిధులు చర్చలు రూ.20లక్షలు పరిహారం ప్రకటించిన యాజమాన్యం -
రెడ్బుక్ రాజ్యాంగం మాకొద్దు
గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ చర్యలు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయి. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలపై ప్రశ్నించే విద్యార్థి సంఘాలను నియంత్రించి, వారి గొంతును అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలల్లోకి రాజకీయ పార్టీల, విద్యార్థి సంఘాల నాయకులకు ప్రవేశాన్ని నిషేధిస్తూ జీఓ విడుదలచేయడం దుర్మార్గం. రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంకెళ్లువేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోంది. ఈ రెడ్బుక్ రాజ్యాంగం పాలన మాకొద్దంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చడం, వసతి గృహల్లో నాసిరకమైన వసతులు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు కోసం అధిక ఫీజు వసూళ్లు, అధిక ధరలకు పుస్తకాలు అమ్మడం, బకాయిపడిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వానికి భయంపట్టుకుందన్నారు. అందుకే నిషేధ ఉత్తర్వులతో సంకెళ్లు వేయాలని చూస్తోందన్నారు. ఉత్తర్వులు రద్దు చేయాలి పాఠశాలలు, కళాశాలల ఆవరణలోకి విద్యార్థి సంఘాలకు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల హక్కులను కాలరాసేదిగా ఉంది. ప్రైవేటు విద్యను ప్రోత్సాహించేలా.. విద్యార్థి సంఘాల గొంతు నులిపేలా ఉన్న ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయాలి. – బిడ్డిక అనీల్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి, కురుపాం ఆంక్షలు దుర్మార్గం ప్రభుత్వ బడుల్లో, సంక్షేమ హాస్టళ్లలు/ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారమయ్యేందుకు విద్యార్థి సంఘాలు అనేక రకాల ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుంటాయి. ఆంక్షల పేరుతో విద్యా సంస్థల్లోకి అనుమతులు లేకుండా జీఓలు జారీ చేయడం దుర్మార్గం. సమస్యలు వెలుగులోకి రాకూడదనే ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహారిస్తోంది. – ఎ.గంగారావు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి, గుమ్మలక్ష్మీపురం ● కూటమి పాలనపై విద్యార్థి సంఘాల ఆగ్రహం -
ఎలిఫెంట్ డే పోస్టర్ ఆవిష్కరణ
పార్వతీపురం రూరల్: ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా అటవీశాఖాధికారి ప్రసూనతో కలిసి వరల్డ్ ఎలిఫెండ్ డే పోస్టర్లను మంగళవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఏనుగుల పర్యవేక్షణ అధికారి మణికంఠేష్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఎం.మనోజ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.పాత మార్కొండపుట్టిలో గజరాజులుకొమరాడ: తోటపల్లి ముంపు ప్రాంతమైన పాత మార్కొండపుట్టి గ్రామ పరిసరాల్లో మంగళవారం ఏనుగులు సంచరించాయి. వరి, పత్తి, కూరగాయలు, అరటి పంటలను నష్టపరుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఎరువుల బాధ్యత ఏఓలదే : కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖాధికారులపై ఉందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాలో అవసరమైన పరిమాణంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎరువుల పర్యవేక్షణపై జా యింట్ కలెక్టర్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల కొరతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న విషయం రైతులకు వివరించాలన్నారు. మండలాల వారీగా అధికారులు పర్యవేక్షించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎరువుల దుకాణాలపై పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించిన చర్యలు తీసుకుని అవసరమైతే సీజ్చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలే లక్ష్యం: సబ్కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్పాలకొండ: ప్రజలకు రెవెన్యూ సేవలు సక్రమంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని సబ్కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. పాలకొండ సబ్కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడారు. సివిల్స్ శిక్షణ అనంతరం మొదటిసారిగా ఇక్కడ బాధ్యతలు చేపట్టినట్టు వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థపై పూర్తి అవగాహన పెంచుకుని ప్రజలకు మంచి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.చదువులో ప్రతిభ చూపుతూ...స్వప్నిల్ జగన్నాథ్ది మహారాష్ట్రలోని నాసిక్. సామాన్య కుటుంబం. తండ్రి జగన్నాఽథ్ పవార్ ఆటోడ్రైవర్. తల్లి కల్పన గృహిణి. సోదరి పూజకు వివాహం అయింది. పూనేలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన స్వప్నిల్ చదువులో రాణిస్తూ మొదటి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్, మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. 2023 ఐఏఎస్ బ్యాచ్లో ఆయన శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇదే బ్యాచ్కు చెందిన వైశాలిని 2025లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె పార్వతీపురం సబ్ కలెక్టర్గా విధుల్లో చేరారు.డీఎస్సీలో రాణించిన తాళ్లడుమ్మ యువకుడుజియ్యమ్మవలస: మండలంలోని తాళ్లడుమ్మ గ్రామానికి చెందిన తుమరాడ దుర్గాప్రసాదరావు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)లో 89.62 మార్కులు సాధించాడు. పీజీటీ (తెలుగు)లో 84.5, టీజీటీ (తెలుగు) 77.67 మార్కులు వచ్చాయి. డీఎస్సీలో కుమారుడు ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు పద్మావతి, వెంకటరమణ సంతోషపడుతున్నారు. -
ఆల్బెండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలి
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్న సీ్త్ర శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పరిమితంగానే లబ్ధి కలిగించనుంది. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు మాత్రమే వర్తించనుంది. దీనికితోడు.. జిల్లా నుంచి అటు పాలకొండ, ఇటు సాలూరు, కురుపాం, గుమ్మలక్ష్మీపురం వైపు మార్గాల్లో అధిక శాతం పల్లె వెలుగులే ఉన్నాయి. విజయనగరం వెళ్లే ఎక్స్ ప్రెస్ సర్వీసులు కూడా తక్కువే. దీంతోపాటు చాలా మారుమూల, ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులే నడవవు. ఉన్నా కూడా.. కేవలం నిర్దిష్ట సమయంలోనే. దీంతో చాలా మంది ప్రయాణికులు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఈ రూట్లలో ఉచిత ప్రయాణం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు దాదాపుగా డీలక్స్ బస్సులనే ఆశ్రయిస్తారు. పల్లె వెలుగు ఎక్కితే.. విజయనగరానికే 3.30 గంటల సమయం పడుతుంది. మధ్యలో వంతెనల దగ్గర ట్రాఫిక్ జామ్, మానాపురం గేటు వంటివి పడితే వెళ్లే సమయాన్ని అంచనా వేయడం కష్టమే. అందుకే చాలా మంది ప్రయాణికులు ఈ మార్గంలో రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల పరిధిలో నిత్యం 60 వేల మందికిపైగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణిస్తున్న మహిళలు 30 వేల మందికిపైగా ఉంటారని అంచనా. ప్రస్తుతం జిల్లాలో సూపర్ లగ్జరీ 10, అల్ట్రా డీలక్స్ 54, ఎక్స్ ప్రెస్ సర్వీసులు 45, అల్ట్రా పల్లె వెలుగు 33, పల్లె వెలుగు 203 బస్సులు చొప్పున ఉన్నాయి. పథకం అమలు కోసం 200 వరకూ సర్వీసులను కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మారుమూల గ్రామాలకు వెళ్లే వాటిలో కాలం చెల్లిన బస్సులే అధికం. ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగితే.. వీటి సామర్థ్యం సరిపోతుందా? అని ఉద్యోగులు సంశయిస్తున్నారు. న్యూస్రీల్ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, విజయనగరం మార్గాల్లో నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. నిల్చొని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. కొన్ని మార్గాల్లో చాలా సమయం వేచి చూస్తేనే గానీ.. బస్సు ఎక్కలేని, సీటు దొరకని సందర్భాలు ఉంటాయి. ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంటుంది. దీనివల్ల టికెట్ తీసుకుని ప్రయాణించే సామాన్య ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉండటం కష్టమే. అదనపు సర్వీసులను నడిపితేనే గానీ.. రద్దీని నియంత్రించలేమని ఉద్యోగులు అంటున్నారు. కొన్ని సర్వీసులకే అవకాశం అదనపు బస్సులు నడపకుంటే కష్టమే.. -
పరీక్షలు ఉపాధ్యాయులకా? విద్యార్థులకా?
పాత పద్ధతే మేలు ఎఫ్ఏ–1, 2, 3, 4 తో పాటు ఎస్ఏ–1, 2 పరీక్షల ఫలితాలను ప్రశ్నపత్రం మాదిరిగా మూల్యాంకన పుస్తకంలో నమోదుచేయడంతో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అదనంగా పాఠశాలలో సమయం కేటాయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ పరీక్షల విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే నిర్వహించాలి. – బోశెట్టి రామారావు, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి, వీరఘట్టం మండలం పని ఒత్తిడి ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా తీసుకువచ్చిన మూల్యాంకన పుస్తక విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులపై మూల్యాంక పుస్తకాలు ఇచ్చి అదనపు భారం మోపడం పద్ధతికాదు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ విధానాన్ని రద్దు చేయాలి. – మజ్జి పైడిరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అడ్డుగోలు నిర్ణయాలు విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే క్లస్టర్ విధానం, పాఠశాలల విలీనంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. చాలాచోట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పరీక్షల్లో అసెస్మెంట్ పుస్తకాల విధానం అటు విద్యార్థులు, ఇటు గురువులను అయోమయానికి గురిచేస్తోంది. మూల్యాంకన భారం గురువులపై పడుతుండగా, విద్యార్థులు గతంలో రాసిన సమాధానాలే మళ్లీ చూసి రాసేలా తెచ్చిన విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఈ పరీక్షలు ఉపాధ్యాయులుకా? లేదంటే విద్యార్థులకా? అంటూ ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నాయి. గతంలో పరీక్షల సమయంలో కాగితాలపై జవాబులు రాస్తే ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి దిద్దేవారు. ఇప్పుడు మూల్యాంకన పుస్తకాలను విద్యార్థులకు అందించారు. ఇదీ పరిస్థితి.... జిల్లాలో 1504 సర్కారు బడులు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది సుమారు 62 వేల మంది విద్యా ర్థులు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపు కోసం ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహి స్తారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ప్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1,2,3,4గా నిర్ణయించారు. 2025–26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మొదటి పరీక్షను ఈనెల 11న నిర్వహించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాల లు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ పరీక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. అసెస్మెంట్ బుక్ లెట్స్ పాఠశాలలకు చేరుకోవడం అలస్యం కావడంతో సోమవారం నుంచి నిర్వహిస్తున్నారు. జూన్, జూలై సిలబస్కు సంబంధించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై పరీక్షలు పెట్టారు. ఏడాది మొత్తం ఇవే పుస్తకాల్లో సమాధానాలు రాయాలి సర్కారు బడుల్లో నిర్వహించే త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షలను ఎఫ్ఏ–1,2,3,4లుగా, ఎస్ఏ–1,2లుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను విద్యార్థులు మూల్యాంకన పుస్తకాలలో రాసేందుకు వీలుగా 1, 2వ తరగతులకు మూడు పుస్తకాలు, 3, 4, 5 తరగతులకు నాలుగు పుస్తకాలు చొప్పున, 6, 7వ తరగతులకు ఆరు పుస్తకాల చొప్పున, 8, 9,10వ తరగతులకు ఏడు పుస్తకాల చొప్పున అందజేశారు. ఏడాదిలో జరిగే అన్ని పరీక్షల వివరాలను ఈ మూల్యాంకన పుస్తకంలో నమోదు చేసేందుకు ఏడాదంతా ఈ పుస్తకాన్ని ఉపాధ్యాయులు భద్రంగా ఉంచాలి. అయి తే, గతంలో తెలుపు కాగితాలపై పరీక్షలు రాస్తే ఇంటికి తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారు. మార్కులు నమోదుతో పని పూర్తయ్యేది. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. వీటిని భద్రపరచడం తలకుమించిన భారమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విద్యావ్యవస్థ గాడితప్పుతోందని విమర్శిస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత ... మూల్యాంకన పుస్తకాలపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకనం పుస్తకాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆరు నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఆరు మూల్యాంకన పుస్తకాలు అందాయి. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులు రాయాలి. పరీక్షలు రాసిన తర్వాత వాటిని దిద్ది అందులోనే ఉన్న ఓఎమ్మార్ షీట్లో మార్కులు వేయడంతో పాటు ఓఎమ్మార్ షీట్ను విద్యాశాఖ ఇచ్చిన యాప్లో ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాలి. పరీక్షల సంస్కరణ పేరిట మూల్యాంకనం పుస్తకాల పంపిణీ సమయం సరిపోదంటున్న ఉపాధ్యాయులు -
సీతంపేట ఐటీడీఏ పీఓ ఎవరు?
సీతంపేట: సీతంపేట సమగ్ర గిరిజనాభ్యుదయ సంస్థకు (ఐటీడీఏ) ప్రాజెక్టుఅధికారి ఎవరనేది స్పష్టత లేదు. పాలకొండ సబ్కలెక్టర్గా విధులు నిర్వహించిన సి.యశ్వంత్కుమార్ రెడ్డి ఇంతవరకు ఇన్చార్జ్ పీఓగా విధులు నిర్వహించారు. ఆయన బదిలీ అయ్యారు. పాలకొండకు కొత్త సబ్కలెక్టర్గా పవర స్వప్నిల్ జగన్నాఽథ్ను నియమించారు. ఇప్పటికే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఐటీడీఏ పీఓగా ఆయనకు ఎటువంటి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించలేదు. మూడు రోజులు కావస్తున్నా ఐటీడీఏ పీఓ ఎవరనేది స్పష్టత లేదు. ఎటువంటి ఇన్చార్జిలు లేకుండా ఐటీడీఏ పీఓను శాశ్వతంగా నియమిస్తారా?, స్వప్నిల్ జగన్నాఽథ్కు ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు ఇస్తారా అనేది చర్చనీయంశమైంది. సీతంపేట ఐటీడీఏకు పీఓ ఎవరనేదానిపై పూర్తిస్థాయిలో ఎవరికీ క్లారిటీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు ఐటీడీఏకు శాశ్వతంగా పీఓను నియమించలేదు. ఇంచార్చిలతోనే నెట్టుకొస్తోంది. బాధ్యత ఎవరు వహిస్తారు? సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ప్లాన్ మండలాలు ఉన్నాయి. నాలుగు మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండగా, మరో 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. సీతంపేట, కొత్తూరు, భామిని, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాలు ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (టీపీఎంయూ) విభాగంలో ఉన్నాయి. మొత్తం 1250కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. 2 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, క్షేత్రస్థాయిలో పథకాలు అమలు వంటివి చూడాల్సిన బాధ్యత ఐటీడీఏ పీఓపై ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో ఐటీడీఏ పీఓలను నియమించి పాలనా పరమైన ఇబ్బందులు లేకుండా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎటువంటి పాలకవర్గ సమావేశాలు సైతం నిర్వహించిన దాఖలాలు లేవు. ఐటీడీఏలను నిర్వీర్యమైపోయే స్థాయికి వచ్చాయని పలువురు గిరిజన నాయకులే ఆరోపిస్తున్నారు. చివరకు సీతంపేట ఐటీడీఏకు ఐటీడీఏ చైర్మన్ ఎవరనేది కూడా స్పష్టత లేదు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, పార్వతీపురం మన్యం కలెక్టర్ వీరిద్దరిలో ఎవరనే సందిగ్దం అధికారుల్లోనే ఉండడం కొసమెరుపు. -
పాముకాటుతో మహిళ మృతి
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి పట్టణంలోని బీపీ(బద్రీప్రసాద్)కాలనీకి చెందిన వరదా సత్యవతి(65) పాము కాటుతో మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు సత్యవతి ఆదివారం రాత్రి ఇంటిలో మంచంపై పడుకున్న సమయంలో పాటు కాటు వేసింది. విషయం తెలుసుకున్న వెంటనే బాధితురాలిని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నామని ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు. గంజాయి కేసులో నిందితులకు రెండేళ్లు జైలువిజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీసు స్టేషన్లో 2024లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు ముద్దాయిలకు రెండేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటవ ఏడీజే జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్ల డించారని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..విజయనగరం టూటౌన్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గతేడాది ఆగస్టు 25న స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్లో కోమటి చెరువు వద్ద ఇద్దరు వ్యక్తులు ఉమ్మంది ఎల్లయ్య (26) యూసఫ్ (25) పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకుని వారి నుంచి 3.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్ సీఐ టి.శ్రీనివాస రావు రిమాండ్కు తరలించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్లో నిందితులపై నేరారోపణలు రుజువుకావడంతో ముద్దాయిలకు పై విధంగా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. గేదెను ఢీకొట్టి యువకుడి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొట్లాం హైవేపై ఆదివారం రాత్రి కెరటాం గ్రామానికి చెందిన బర్ల సాయి(21) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై అశోక్ కుమార్ సోమవారం తెలిపారు. సాయి తన పల్సర్ బైక్పై గొట్లాం హైవే మీదుగా వెళ్తుండగా గుంకలాం చెరువు వద్ద ఆకస్మాత్తుగా గేదె అడ్డు రావడంతో బైక్ను అదుపు చేయలేక గేదెను ఢీ కొట్టాడు. బైక్పై ఉన్న బర్ల సాయి కిందపడడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రూరల్ ఎస్సై ఆశోక్కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు. ప్రైవేట్ కళాశాల బస్సు, ఆర్టీసీ బస్సు ఢీ● 8 మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలు ● విషమంగా ఒకరి పరిస్థితికొత్తవలస: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో చింతలపాలెం జంక్షన్ సమీపంలో ఎదురు ఎదురుగా వస్తున్న పైవేట్ కళాశాల బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 8 మంది విద్యార్థినులు గాయాల పాలయ్యారు. వారిలో ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖపట్నం ఎండాడ ఐటీ సెక్టార్కు వెళ్తున్న సింహాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామం సమీపంలో గల బెహరా పాల్టెక్నిక్ కళాశాలకు చెందిన బస్సు పెందుర్తి నుంచి విద్యార్థులు, బోధన సిబ్బందిని ఎక్కించుకుని తీసుకొస్తుండగా ఎదురెదు రుగా ఢీకొన్నాయి. దీంతో జరిగిన ఈ ప్రమాదంలో బెహరా కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థినులు గాయాల పాలయ్యారు. వారిని వెంటనే గోపాలపట్నం సమీపంలో గల బెహరా ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. కాగా గాయ పడిని వారిలో విద్యార్థిని కృతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమదం వార్త తెలుసుకున్న కొత్తవలస పోలీస్లు రెండు బస్సులను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చీడిమానుగూడలో వైద్యశిబిరం
సీతంపేట: మండలంలోని చీడిమానుగూడలో సోమవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సవర ఓబిగోల్కు వైద్యసేవలు అందించారు. ‘తప్పనిడోలీ కష్టాలు’ శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మర్రిపాడు పీహెచ్సీ వైద్యాధికారి సత్యవేణి, మలేరియా సబ్యూనిట్ ఆఫీసర్ జె.మోహన్రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఐఆర్ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని పిచికారీ చేయించారు. రోగులకు మందులు అందజేశారు. అత్యవసర సమయంలో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నామని, గ్రామానికి సీహెచ్డబ్ల్యూను నియమించాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ సావిత్రి, హెల్త్ అసిస్టెంట్లు తోటయ్య, మహింద్ర తదితరులు పాల్గొన్నారు. -
50వేల బంగారు కుటుంబాల దత్తత
విజయనగరం అర్బన్: ఆగస్టు 15 నాటికి 50వేల బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. పీ4 కార్యక్రమం, హర్ ఘర్ తిరంగా, సీజనల్ వ్యాధులు, భారీ వర్షాలు తదితర అంశాలపై ఆన్లైన్లో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొదట 67,066 బంగారు కుటుంబాలను గుర్తించగా, వడపోతల అనంతరం ఆ సంఖ్య 60,612 కు తగ్గిందని కలెక్టర్ చెప్పారు. ఇంకా ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 15 నాటికి జిల్లాలో 50వేల బంగారు కుటుంబాల దత్తతను పూర్తిచేయాల్సి ఉందని, మార్గదర్శులను గుర్తించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, సీపీఓ పి.బాలాజీ, జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
అన్నదాతకు అనర్హులు!
పీఎం కిసాన్ అర్హులు.. ఈ చిత్రంలోని మహిళ పేరు సీతమ్మ. పార్వతీపురం మన్యం జిల్లా. ఆమె భర్త చనిపోయారు. పాస్ పుస్తకం ఆయన పేరు ఉండిపోవడంతో మార్పు చేయాలని అనేక సార్లు అధికారులను కలిసి వేడుకుంది. ఇప్పుడు ఇదే కారణంతో అన్నదాత సుఖీభవ నిధులు కూడా ఆమెకు జమ కాలేదు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు గెమ్మల శంకరరావు. పాచిపెంట మండలం గరిసిగుడ్డి గ్రామం. అన్ని విధాలా అర్హులమైనప్పటికీ తమకు అన్నదాత సుఖీభవ నిధులు ఇప్పటి వరకు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కలెక్టరేట్కు సోమవారం వచ్చి అధికారులను కలిసి వేడుకున్నాడు. సాక్షి, పార్వతీపురం మన్యం: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందిస్తామన్న కూటమి ప్రభుత్వం... వివిధ కారణాలు చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఈ ఏడాదికి తొలివిడతగా కేంద్ర సాయం రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలను రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఆ మేరకు లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఒక్కో మొత్తంలో నగదు జమకావడంతో ఆశ్చర్యపోవడం రైతుల వంతైంది. జిల్లాలో ఈ–పంటను ప్రామాణికంగా తీసుకుని అన్నదాత సుఖీభవ పథకానికి 1,22,260 మంది రైతులు అర్హులుగా గుర్తించారు. లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించి, అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వారందరికీ ఈ నెల 2వ తేదీన రూ.7 వేలు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చాలామందికి ఆ రోజు పీఎం కిసాన్ వాటా రూ.2 వేలే బ్యాంకు ఖాతాకు జమైంది. రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.5 వేలు అందకపోవడంతో అధికారులను సంప్రదించారు. రాత్రికో, రేపో జమవుతుందని తొలుత అధికారులు బదులిచ్చారు. పది రోజులు దాటినా నేటికీ ఆ మొత్తం లేదు. జాబితాలో పరిశీలిస్తే.. వివిధ కారణాలతో లబ్ధికి దూరమైనట్లు చూపుతోంది. దీంతో పీఎం కిసాన్కు అర్హులైన తాము.. అన్నదాత సుఖీభవకు ఎందుకు అనర్హులవుతామంటూ వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో అన్ని సంవత్సరాలూ రైతుభరోసా నిధులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం కింద ఏడాదికి 1.45 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ 20 వేల మందినిపైగా కుదించింది. ఇప్పుడు వారంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్లో సోమ వారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇదే విషయమై అధిక శాతం వినతులు వచ్చాయి. ఆధార్ నమోదు సక్రమంగా లేకపోవడం, భూమికి వేరే ఆధార్తో లింకు కావడం, పాస్ పుస్తకంలో పేరు మారకపోవడం, మ్యుటేషన్, వెబ్ల్యాండ్లో సమస్యలతో కొంతమంది పథకానికి దూరమయ్యారు. వీరంతా సాలూరు మండలానికి చెందినవారు. ఎస్టీ కుటుంబాలకు చెందిన రైతులు. వీరికి ప్రభుత్వం ఇచ్చిన సాగు పట్టాలు ఉన్నాయి. వాటి ఆధారంగా గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా పథకం వర్తించింది. ఏడాదికి రూ.13,500 చొప్పున వారి ఖాతాల్లో జమైంది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద రూ.2000 మాత్రమే వారి ఖాతాలకు పడింది. అన్నదాత సుఖీభవ వర్తించలేదు. ఆన్లైన్లో వన్బీలు చూపించడం లేదన్న కారణంతో పథకానికి దూరం చేసినట్టు అధికారులు చెబుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరించి పథకం వర్తింజేయాలని కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో అధికారులకు గోడు వినిపించారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల విచిత్ర పరిస్థితి కేంద్రం వాటా నిధులు రూ.2 వేలే ఖాతాలోకి.. నేటికీ జమ కాని రాష్ట్ర వాటా రూ.5 వేలు అధిక శాతం మందికి ఇదే పరిస్థితి -
ఫ్రీ బస్సు మీద కస్సుబుస్సు
● రోడ్డున పడిన ఆటోడ్రైవర్లు ● ఆందోళనలో సుమారు 28వేల కుటుంబాలు ● తమ పరిస్థితి ఏమిటని ఆవేదన ● వాహనమిత్ర అమలు చేయాలని భారీ ర్యాలీ ● కలెక్టరేట్ వద్ద ఆందోళనమా గోడు వినండి .. ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయడానికి నిర్ణయించిన మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల స్వయం ఉపాధి రంగంగా జీవనం సాగిస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారు. కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు నేటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ చెల్లించుకుంటూ మరోవైపు ప్రభుత్వనికి చెల్లించాల్సిన రోడ్, గ్రీన్ టాక్స్, రెన్యువల్, పొల్యూషన్ వంటి పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో కార్పొరేట్ సంస్థలైన రాపిడో, ఉబర్, ఓలా వంటి కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింది. వ్యక్తిగత వాహనాలపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిర్వహించకూడదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలకు అనుమతులను ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి హామీ గాలికొదిలేసింది. – కె.సురేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శివాహనమిత్ర అమలు చేయాలి.. కూటమి ప్రభుత్వం వాహనమిత్ర కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జీవో నం 21 రద్దు చేసి అపరాధ రుసుం భారం తగ్గిస్తామని చెప్పింది. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, వాహన కొనుగోలుకు సంబంధించి వడ్డీపై సబ్సిడీ అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదైనా నేటీకీ అవేమీ అమలు కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో అంత కంటే ముందు వాహనమిత్ర అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేసే వరకు పోరాడతాం. – ఆటో కార్మికుడు, జి.కూర్మారావు, విజయనగరంవిజయనగరం గంటస్తంభం: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ హామీ కాకరేపుతోంది. ఆ హామీ అమలు చేసి తమ పొట్ట కొట్టొదంటూ ఆటోడ్రైవర్లు ర్యాలీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించొద్దంటూ విజయనగరంలో ఆటోడ్రైవర్లు రోడ్డెక్కారు. చలో కలెక్టరేట్ నినాదంతో ర్యాలీ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో తమకు ఉపాధి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు నడిపే ముందు తమ వ్యవహారం చూడాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఎక్కడికక్కడ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే తమకు ఉపాధి అవకాశాలు దెబ్బ తింటాయని విజయనగరం ఆటో కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో చక్రం కదిలితేనే బతుకు బండి సాగేది దశాబ్దాలుగా వారి జీవనాధారం ఆటోలే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 28వేల మంది ఆటో, క్యాబ్ కార్మికులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్ర భుత్వం హయాంలో వారికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఏటా అమలయ్యేది. ప్రతి ఒక్కరికీ ఈ పథ కం వర్తింపజేయడం ద్వారా లబ్ధి చేకూరేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాహన మిత్ర కింద రూ.15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి విస్తృత ప్రచారం కల్పించారు. దాన్ని నమ్మి వారంతా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఇప్పుడు మోసపోయామని గుర్తించి ఆందోళన చెందుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఏటా వాహనమిత్ర పథకం తమకు అందేదని ఇప్పుడు దాన్ని కూటమి పాలకులు పక్కన పెట్టారని వాపోతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఆందోళన.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహన మిత్ర పథకం కింద ఇస్తామన్న రూ. 15వేలు నేటికీ ఇవ్వలేదు. ఆ ఊసే ఎత్తడం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్లు సంక్షేమం కోసం రూ. 400 కో ట్లు బడ్జెట్ కేటాయించి నాడు అర్హులందరికీ రూ. 10వేలు చొప్పున అందించారు. కూటమి ప్రభుత్వం ఆ మాదిరిగానే ఇస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఇదే సమయంలో సీ్త్రశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకువస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన క్రమంలో తమ బతుకు బండి సంగతేంటని వారంతా ఆందోళన చెందుతున్నారు. హమీల అమలుకు ర్యాలీ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాహనమిత్ర హామీతో పాటు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డ్రైవర్లు, మోటారు కార్మికులు డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అమలు చేసేలోపు వాహనమిత్ర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో సోమవారం డ్రైవర్లు, కార్మికులు విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. -
కొత్తవలసలో మరో చోరీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టులో సుమారు 5 కేజీల బంగారం, పెద్ద మొత్తంలో నగదును దొంగలు దోచుకుపోయిన విషయం మరవక ముందే మరో ఇంటిలో పడి పెద్ద ఎత్తున బంగారం, వెండి, నగదును దోచుకుపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో వరుస దొంగతనాలు కొత్తవలస పోలీసులకు తలనొప్పిగా మారింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్స్టేషన్ సమీప బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మోపాడ కృష్ణంనాయుడి ఇంటిలో శనివారం రాత్రి దొంగలు పడి 15 తులాల బంగారం, 50 తులాల వివిధ రకాల వెండిసామగ్రి, ఆయన కుమారుడి కళాశాల ఫీజు కట్టేందుకు దాచుకున్న రూ.లక్షా 50వేల నగదు దోచుకుపోయారు. కృష్ణంనాయుడు శనివారం రాఖీ పండగ సందర్భంగా ఎస్.కోటలో గల తన స్వగ్రామానికి కుటుంబంతో సహా వెళ్లారు.అదే రోజు సమీప బంధువైన ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొని శనివారం రాత్రి ఎస్.కోటలోనే ఉండిపోయారు. మరుసటి రోజు ఆదివారం సాయంత్రం కొత్తవలసలో గల ఇంటికి కుటుంబంతో సహా వచ్చేసరికి ఇంటి ఇనుప కటకటాలకు సబంధించిన గడియలను కోసి ఇంటిలోకి దొంగలు చొరబడి ఇంట్లోని సామాన్లు, బీరువాలో బట్టలను చిందర వదంగా పడేశారు. అన్నీ పరిశీలించగా బంగారం, వెండి, నగదు పోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం విజయనగరం నుంచి క్లూస్టీమ్ వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. బాధితుడు కృష్ణంనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 15 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.లక్షా 50వేల నగదు దోచుకున్న దొంగలు పోలీసులకు తలనొప్పిగా మారిన వరుస దొంగతనాలు -
మేనమామను కడతేర్చిన మేనల్లుడు
బొండపల్లి: మండలంలోని కెరటాం గ్రామానికి చెందిన వ్యక్తిని సొంత మేనల్లుడు చంపి ఆ తరువాత సహజంగానే చనిపోయినట్లు అందరినీ నమ్మించి దహనసంస్కారాలు నిర్వహించాడు. ఈ విషయంపై 100కు సమాచారం అందడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమవారం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నీడిగేటి అప్పల కృష్ణ (42), మేనల్లుడు నారపాటి సాయి శనివారం మద్యం తాగడానికి గ్రామం బయటకు వెళ్లారు. అక్కడే మద్యం మత్తులో మేనమామ కృష్ణను సాయి హత్య చేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. మేనమామ ఏడని, ఇద్దరు కలిసి వెళ్లి ఒక్కడివే వచ్చావని మృతుడి భార్య అడగ్గా మద్యం ఎక్కువై పడుకున్నాడని సమాధానం చెప్పాడు. కొద్దిసేపటి తరువాత మృతుడు కృష్ణను సాయి బైక్పై తీసుకు వచ్చి చలనం లేదని, చనిపోయి ఉంటాడని అందరిరినీ నమ్మించే ప్రయత్నం చేసి మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. శవాన్ని వారి ఆచారం ప్రకారం పూడ్చిపెట్టారు. కార్యక్రమం అనంతరం సాయి విశాఖపట్నంలోని గోపాలపట్నం వెళ్లి పోయాడు. మృతుడు కృష్ణ సొంత చెల్లెలి కొడుకు సాయి కాగా కొంతకాలంగా వారు గోపాలపట్నంలో ఉంటున్నారు. తరచూ సాయి మేనమామ ఇంటికి వస్తూ పోతుంటాడు. ఈ క్రమంలోనే శనివారం వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ చనిపోవడం పట్ల పోలీసులకు 100కాల్ రావడంతో సోమవారం రంగంలోకి దిగారు. శవాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి తహసీల్దార్ డోలా రాజేశ్వరావుతో పాటు ఎస్సై యు.మహేష్ వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం విజయనగరంలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమా? మృతుడి భార్య రాజుతో మేనల్లుడు సాయికి కొన్ని సంవత్సరాలనుంచి వివాహేతర సంబంధం ఉందని ఈ విషయంపై మేనమామతో సాయికి గొడవ జరిగి హత్యకు దారి తీసిఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉండగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. -
పోక్సోకేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్: జిల్లాలోని గుర్ల పోలీస్ స్టేషన్లో 2022 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు గుషిడి సూర్యనారాయణ (23)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 3,000లు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్జిందల్ సోమవారం తెలిపా రు. కేసు వివరాలను వెల్లడించారు. గుర్ల మండలానికి చెందిన ఇంటర్మీడియట్ బాలిక కనిపించడంలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై గుర్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు. బాలిక ఆచూకీని కనిపెట్టారు. విచారణలో నిందితుడు ప్రేమపేరుతో లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారయత్నానికి పాల్పడినట్టుగా తెలప డంతో అప్పటి ఎస్సీఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు పోక్సోకేసుగా మార్పుచేసి దర్యాప్తు చేశారు. మహిళా పీఎస్ డీఎస్పీ టి.త్రినాథ్ నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ముద్దాయి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా నేరం రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. కేసులో బాధితురాలికి రూ.2 లక్షల పరిహారాన్ని అందజేయా లని తీర్పులో పేర్కొన్నారు. కేసులో ముద్దాయికి నేరం నిరూపణయ్యేలా పోక్సో కోర్టు ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఖజానారావు వాదనలు వినిపించగా, గుర్ల ఎస్ఐ పి.నారాయణరావు, చీపురుపల్లి సీఐ శంకరరావు పర్యవేక్షణలో ఏఎస్ఐ వై.రమణమ్మ, సీఎంఎస్ హెచ్సీ రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారు. -
విద్యార్థుల హక్కులను హరిస్తే ఊరుకోం
గుమ్మలక్ష్మీపురం: పాఠశాలలు, కళాశాలల ఆవరణలోకి విద్యార్థి సంఘాలకు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.అనీల్, మండల కార్యదర్శి ఎ.గంగారావు, యూటీఎఫ్ మండల కార్యదర్శులు శంకరరావు, చలపతి, గిరిజన సంఘం జిల్లా కోశాధికారి ఎం.రమణ, సీఐటీయూ మండల సభ్యులు ఎం.సన్యాసిరావు డిమాండ్ చేశారు. గుమ్మలక్ష్మీపురం గిరిజన సంఘం కార్యాలయం వద్ద సోమవారం రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోకి విద్యార్థి సంఘాల నాయకులకు అనుమతి లేదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల హక్కులను కాలరాసేదిగా ఉందన్నారు. విద్యార్థి సంఘాలు విద్యార్థుల హక్కులకై మాత్రమే నినదిస్తాయని, ప్రైవేటు విద్యను ప్రోత్సాహించేందుకు, విద్యార్థి సంఘాల గొంతునులిపేందుకు తీసుకొచ్చిన ఉత్తర్వులను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు. -
‘హర్ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్లో సోమవారం మాట్లాడారు. వివిధ రకాల పోటీలు, ర్యాలీలు, మానవహారాలు, జాతీయ జెండా ప్రదర్శనలను హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నేడు డీవార్మింగ్ డే డీవార్మింగ్ డేను సంబంధిత అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు భోజనం అనంతరం నిర్దేశించిన మోతాదులో ఆల్బెండ్జోల్ మాత్రను నమిలి మింగించాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ ఎస్.ఎస్.శోభిక, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ సుధారాణి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీఓ కొండలరావు, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, జిల్లా ప్రణాళిక అధికారి పట్నాయక్, విద్యుత్ కార్యనిర్వహణ ఇంజినీర్ వేణుగోపాలనాయుడు, డివిజనల్ అభివృద్ధి అధికారి రమేష్రామన్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
హైకోర్టు జడ్జిని కలిసిన ఎమ్మెల్సీ
పాలకొండ: ఇటీవల హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన గేదెల తుహిన్కుమార్ను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సోమవారం విజయవాడలో మర్యాద పూర్వకంగా కలిశారు. వీరఘట్టం ప్రాంతానికి చెందిన తుహిన్కుమార్ జడ్జిగా నియమితులు కావడంతో ఆయన కలిసి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు మండల కన్వీనర్ కనపాక సూర్యప్రకాశరావు ఉన్నారు. బాధ్యతల స్వీకరణ పార్వతీపురం రూరల్/పాలకొండ: జిల్లాలో పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లుగా ఆర్. వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్లు సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరూ 2023 సివిల్స్ బ్యాచ్కు చెందిన అధికారులు. ముందుగా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి కలెక్టర్తో పాటు ఎస్పీ అభినందనలు తెలిపారు. ఇంతవరకు ఇక్కడ సబ్ కలెక్టర్లుగా పనిచేసిన అశుతోష్ శ్రీవాస్తవ, యశ్వంత్కుమార్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. జీతాలు అడిగితే కేసులా... ఇదెక్కడి అన్యాయం బాబూ.. పార్వతీపురం రూరల్: మక్కువ మండలం డి.శిర్లాం వద్ద ఉన్న తాగునీటి పథకం నుంచి పార్వతీపురం మండలంలోని 66 గ్రామాలకు తాగునీటి సరఫరాలో కీలకభూమిక పోషిస్తున్న ఆపరేటర్లకు ఏడునెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు విన్నవించినా ఫలితం లేదని స్థానిక విలేకరుల వద్ద సోమవారం వాపోయారు. జీతాలు అందకపోవడంతో 23 మంది ఆపరేటర్ల కుటుంబాలు పస్తులతో గడపాల్సి వస్తోందని, తమ సమస్యను అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు. జీతం బకాయిలు చెల్లించకుండా, తిరిగి విధులకు హాజరుకోకాపోతే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇదెక్కడి అన్యాయమన్నారు. తక్షణమే జీతాల చెల్లింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడండి గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం రూరల్: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాల్లో గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని నియమించి గిరిజన విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు పాలక రంజిత్కుమార్, పల్ల సురేష్, ఆరిక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారంతా సోమ వారం అమరావతి సచివాలయంలో గిరిజన సంక్షేమ ముఖ్యకార్యదర్శి ఎం.ఎం.నాయక్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గురుకుల, ఏకలవ్య, కేజీబీవీ, జ్యోతిరావుపూలే విద్యాసంస్థల్లో ఏఎన్ఎంలు ఉన్నారని, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో వైద్య సిబ్బంది లేకపోవడంతో సేవలు అందడంలేదన్న విషయాన్ని కార్యదర్శికి తెలియజేశామన్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలను కొనసాగించాలని, పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి గిరిజన సంక్షేమ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. కార్యదర్శిని కలిసిన వారిలో సంఘాల నాయకులు గణేష్, శ్రీరంజని, సుభాషిని, నిర్మల, సత్యవతి, సంతోషి ఉన్నారు. -
ఉచిత బస్సుపేరుతో కార్మికుల పొట్ట కొట్టొద్దు
● కలెక్టరేట్ ఎదుల ఆటో డ్రైవర్ల ఆందోళనపార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పలు మండలాలకు చెందిన వందలాదిమంది ఆటో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా పట్టణ ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తే ఆటో కార్మికులలో 60శాతం మందికి ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రభావం వల్ల ఎంతమంది నష్టపోతారో ఆలోచన చేసి పరిశీలించి శాసీ్త్రయంగా నష్టపరిహారాన్ని, ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక విధాలుగా ఉపాధిలేక అవస్థలు పడుతున్న ఆటో కార్మికుల పరిస్థితి ఈ ఉచిత బస్సుతో మరింత దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పింఛన్లు వంటివి చెల్లించి వాహన మిత్ర తరహాలో పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్కు ఏడాదికి రూ. 25వేలు పరిహారం చెల్లించాలని, అలాగే ఇప్పటికే తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రభుత్వం రూపొందించకపోతే ఆటో, ట్యాక్సీ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి వై.మన్మథరావు, బీవీ రమణ, కోశాధికారి జి.వెంకటరమణ, కె.గంగునాయుడు, సాంబమూర్తి, ఉమామహేశ్వరరావు, ఆటో యూని యన్ నాయకులు శంభాన చిన్న, డి. రాము, క్రాంతి, నారాయణ, సత్యనారాయణ, శ్రీను, శంకరరావు , పోలినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
గడువు దాటినా పరిష్కరించకపోతే చర్యలు
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిషార వేదికకు వచ్చే వినతులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించని జిల్లా అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుంచి 149 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజూ లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించడానికే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పుడు చూసినా పరిష్కారాల నమోదు సున్నా కనబడాలని తెలియజేశారు. ప్రతి రీ ఓపెన్ కేసును పూర్తిగా విచారణ జరిపి పరిష్కార మార్గం చూడాలని సూచించారు. గడువులోగానే వినతులకు సమాధానాలు పంపాలని అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అర్జీల స్వీకరణలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, విజయనగరం డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీల గాంధీ పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 37 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని,వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 37 ఫిర్యాదులను స్వీకరించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీజీఆర్ఎస్కు 149 వినతులు -
ఉత్తమ పాఠశాలగా వంగర కేజీబీవీ
వంగర: రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాల అవార్డుకు వంగర కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఎంపికై ంది. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 అన్ని యాజమాన్య పాఠశాలల్లో టాప్–10 పాఠశాలలను ఎంపిక చేయగా అందులో వంగర కేజీబీవీ ఉందన్నారు. కేజీబీవీలలో విద్యార్థుల హాజరు, విద్యాప్రమాణాలు, విద్యార్థుల సరాసరి మార్కులు, ఉత్తీర్ణత శాతం, గత ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణత శాతం, గరిష్ఠంగా వచ్చిన గణాంకాలు ఆధారంగా ఎంపిక చేశారు. ఆగస్టు 15 పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రిన్సిపాల్ బౌరోతు రోహిణి, సిబ్బంది అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్ర స్థాయిలో కేజీబీవీకి ఉత్తమ అవార్డు లభించడం పట్ల కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హర్షం వ్యక్తంచేశారు. డీఈఓ యు.ముత్యాలునాయుడు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఎ.రామారావు, స్పెషల్ ఆఫీసర్ బౌరోతు రోహణి, సిబ్బందిని అభినందించారు. గతంలో కూడా వంగర కేజీబీవీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికై ంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవార్డును ప్రదానం చేశారు. ఆనందంగా ఉంది కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నాం. ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఈ ఏడాది కూడా ఉపాధ్యాయులు కష్టపడి పని చేశారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించినందుకు అవార్డు దక్కింది. అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. కలెక్టర్, డీఈఓ, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తకు కృతజ్ఞతలు. ఈ ఏడాది కూడా మంచి ఫలితాల సాధనకు కృషిచేస్తాం. – బౌరోతు రోహిణి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, వంగర ఆగస్టు 15న సీఎం చేతుల మీదుగా అవార్డు ప్రదానం ప్రకటించిన కలెక్టర్ అంబేడ్కర్ -
కొఠియా పల్లెల్లో నోటీసుల అలజడి
సాలూరు: రాజ్యాంగం కల్పించిన భావస్చేచ్ఛ హక్కును వినియోగించుకోవడమే వారు చేసిన తప్పు. తామంతా ఆంధ్రావైపు ఉంటామని పదేపదే పునరుద్ఘాటిస్తుండడమే వారు చేసిన నేరం. వీరిపై ఒడిశా పోలీసులు, అధికారులు కన్నెర్ర చేశారు. కేసులున్నాయంటూ ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాల్లోని పలువురు గిరిజనులు, నాయకులకు నోటీసులిచ్చి ఆందోళనకు గురిచేస్తున్నారు. మూడు రోజుల కిందట కొంతమందికి నోటీసులిచ్చిన ఒడిశా పోలీసులు సోమవారం మరికొందరికి అందజేశారు. తాము ఏం తప్పుచేశాం.. ఎందుకు నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించగా గతంలో కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. కేసులు ఎప్పుడు నమోదయ్యాయన్న ప్రశ్నకు ఒడిశా పోలీసుల వద్ద సమాధానం లేదు. తామంతా ఆంధ్రాకు అనుకూలంగా ఉంటున్నామని ఈ విధంగా తమపై తప్పుడు కేసులు నమోదుచేసి, నోటీసులతో ఇబ్బందులుకు గురిచేస్తున్నారంటూ కొఠియా గ్రూపు గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. ఆంధ్రా పాలకులు, అధికారులు స్పందించి అండగా ఉండాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొఠియా గ్రూపు గ్రామాల ప్రజలను పట్టించుకోవడలేదని, తరచూ ఒడిశా అధికారులు దాడులు చేస్తున్నా కనీసం స్పందించడంలేదని వాపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాల బోర్డులు పీకేయడం, సామగ్రిని తీసుకెళ్లిపోవడం, జల్జీవన్ మిషన్ పథకం సామగ్రిని స్టేషన్కు తరలించడం వంటి ఘటనలు పరిపాటిగా మారాయి. ఆంధ్రా, ఒడిశాలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొఠియా సమస్య పరిష్కారానికి చొరవచూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులున్నాయంటూ పలువురికి నోటీసులు జారీచేసిన ఒడిశా పోలీసులు ఆంధ్రాకు అనుకూలంగా ఉండడమే కారణమని వాపోతున్న గిరిజనులు -
అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో ప్రతిభ
పాచిపెంట: ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చీరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ 2025 అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పాచిపెంట మండల కేంద్రానికి చెందిన యువత ప్రతిభ కనబరిచారు. 10000, 5000 మీటర్ల పరుగు పందెంలో బొడ్డు సాయి మొదటి స్థానం సాధించగా, వాడాడ సతీష్ ద్వితీయ స్థానం సాధించాడు. 3000, 1500 మీటర్ల పరుగు పందెంలో ముల్లు హరీష్ మొదటి స్థానం సాధించాడు, అలాగే 5000 మీటర్ల రేస్వాక్ లో బుగత హరీష్ రెండవ స్థానం సాధించగా అండర్ 18 బాలికల విభాగంలో..ఉత్తరావల్లి మహాలక్ష్మి 1000 మీటర్ల పరుగు పందెంలో మూడవ స్థానం సాధించింది. మొత్తంగా..6బంగారు, 2రజత, 1కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విజేతలకు కోచ్ నేతేటి శేఖర్తో పాటు పలువురు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. -
అర్జీదారుల ఆకలి తీరుతోంది
పార్వతీపురం రూరల్: కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చి తమ సమస్యల పరిష్కారానికి సొంత గ్రామాల్లో ఉదయం బయలు దేరి 10గంటల సమయానికి కలెక్టరేట్కు అర్జీదారులు చేరుకుంటారు. అయితే చార్జీలు భరించి వ్యయ ప్రయాసాలతో సామాన్యులు, దివ్యాంగులు తమ సమస్య పరిష్కారం కావాలనే ఆశతో వచ్చిన వారికి అర్జీలు అందజేసిన అనంతరం ఉచితంగా కలెక్టరేట్ ఆవరణలో భోజనం చేసేందుకు ఇటీవల కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్ ఆలోచన మేరకు భోజన సదుయాపం కల్పించారు. ఎంతోమంది అర్జీదారులు ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంతమంచి ఆలోచన చేసిన కలెక్టర్కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 44 మంది ఎంపికవిజయనగరం అర్బన్: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జిల్లాలోని 44 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.శశిభూషణరావు తెలిపారు. స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్షిప్ –2025 పోటీల్లో పాల్గొన్న 100 మంది నుంచి ఈ ఎంపిక జరిగిందన్నారు. ఈ పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన 44 మంది త్వరలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారన్నారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. న్యాయనిర్ణేతలుగా జుట్టాడ ప్రీతి, ఎ.నారాయణ, రమేష్, హర్ష, భాస్కర్, కరుణ వ్యవహరించారు. -
రాష్ట్ర పోటీలకు గుణుపూరుపేట విద్యార్థినులు
డెంకాడ: రాష్ట్ర సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గుణుపూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలోని చెవ్వూరులో జరగనున్న పోటీలకు గుణుపూరుపేట ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థినులు ఆబోతుల తేజస్విని, గేదెల మానస ఎంపికయ్యారు. అలాగే వచ్చే నెల అనంతపురంలో జరగబోయే జూనియర్ బాల్ బాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలకు పదవ తరగతి విద్యార్థినులు సీహెచ్ రోహిణి, కెల్ల నవ్య, కెల్ల రేష్మ ఎంపికయ్యారు. వారిని పాఠశాల హెచ్ఎం సీహెచ్ అరుణ, వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీశంకర్ తదితరులు అభినందించారు. -
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిచుకోవాలి
పార్వతీపురం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆ పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి డిమాండ్ చేశారు. భోజన పథకం యూనియన్ జిల్లా రెండో మహాసభలు జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వరలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ పథకంలో దేశంలో 25 లక్షల మంది, రాష్ట్రంలో 85 వేల మంది సిబ్బంది నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలే అన్న విషయం పాలకులు గుర్తించాలన్నారు. ఇందులో ఎక్కువగా వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారని వెల్లడించారు. మహిళ సాధికారత కోసం జపించే పాలకులు 11 సంవత్సరాలుగా భోజన కార్మికుల వేతనాలు పెంచకపోవడం బాధాకరమన్నారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి.సుధారాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పారు. విద్యార్థికి కనీసం రూ.20 మెనూ చార్జీలు ఇవ్వాలని, జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రమణారావు, వై.మన్మధరావు, జిల్లా ఉపాధ్యక్షులు వి.రామలక్ష్మి, జిల్లా కోశాధికారి వెంకటరమణ, అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక అనంతరం జిల్లా యూనియన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జి.తులసి, ప్రధాన కార్యదర్శిగా వై.శాంతికుమారి, కోశాధికారిగా కె.మీనాకుమారి, జిల్లా కమిటీ సభ్యులుగా యు.లక్ష్మి, కె.ఉష, పావణి, కళ్యాణి, సుశీల, గౌరమ్మ, రజని, సావిత్రమ్మ, షబానా ఎన్నికయ్యారు. భోజన పథకం కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి -
కోటదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం అభివృద్ధికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఏన్నో ఏళ్లుగా ఆలయానికి ఆనుకుని ఉన్న స్థలం అమ్మవారి ఆలయానికి కేటాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంత మేరకు ఫలించాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలం అమ్మవారి ఆలయానికి ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఆలయ పరిసరాల్లో జేసీబీలతో చదును చేస్తున్నారు. వాస్తవానికి కోటదుర్గమ్మ ఆలయం సమీపంలో పశువుల ఆసుపత్రి ఉంది. ఈ స్థలం ఆలయానికి అందించి, అందుకు దేవదాయ శాఖకు చెందిన స్థలం మరో చోట అందించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన ఇంతవరకు పూర్తి కాలేదు. ఇదే సమయంలో ఆలయం పక్కనే ఉన్న కళాభారతి భవనాల స్థలం పట్టణానికి చెందిన పైడి కృష్ణప్రసాద్ ఆలయానికి అందించారు. దీంతో కొంత స్థల సమస్య తీరింది. పశువుల ఆసుపత్రి స్థలం కూడా ఆలయానికి అందిస్తే అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది. రూ.10లక్షలతో పనులు ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో రూ.10లక్షల మేర ఖర్చు చేసి స్థలం చదును చేసేందుకు పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త పల్లా కొండలరావు ముందుకు వచ్చారు. గత నాలుగు రోజులుగా జేసీబీలతో పనులు చేయిస్తున్నారు. దసరా ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ పనులు పూర్తి చేస్తున్నారు. -
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, తలే రాజేష్వంగర: రైతు సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలే రాజేష్ అన్నారు. పంటలు సాగుచేసేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం మండల పరిధి కె.కొత్తవలసలో వారు విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా తోటపల్లి కుడిప్రధాన కాలువ ద్వారా వంగర మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరందలేదని, దమ్ములు చేసేందుకు సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తోటపల్లి శివారు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా కాలువల్లో పనులు చేసుకుని సాగునీటిని మళ్లించుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఎరువులు లేవని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో పుష్కలంగా కావలసినన్ని ఎరువులు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అన్నదాత సుఖీభవ పథకంలో అధిక సంఖ్యలో పేర్లు గల్లంతయ్యాయని, అర్హులైన రైతులకు పథకం వర్తింపజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో, డాక్టర్ నరేంద్ర, ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ముఖర్జీ, సర్పంచ్లు పోలిరెడ్డి రమేష్, గర్భాపు నారాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు బొక్కేల వెంకటప్పలనాయుడు, కనగల పారినాయుడు, యలకల వాసునాయుడు, పెంకి గౌరునాయుడు, పెంకి లక్ష్మునాయుడు, పెంకి జంగంనాయుడు, వంజరాపు గోవిందరావు, పెంకి గౌరీశ్వరరావు, బెవర రామకృష్ణ, పొదిలాపు నారాయణరావు, పారిశర్ల రామకృష్ణ ఉన్నారు. -
రిమ్స్లో అరుదైన చికిత్స
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగికి చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఇలాంటి క్లిష్టమైన చికిత్స జరగలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... జూలై 8వ తేదీన సీతంపేటకు చెందిన సిద్ధమంగుల బారికి అనే 58 ఏళ్ల గిరిజన వృద్ధుడు తీవ్రమైన ఆయాసం, తలనొప్పితో పాటు చర్మం, నాలుక నీలం రంగులోనికి మారి రిమ్స్లో చేరాడు. అప్పటికే అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో రిమ్స్ వైద్యులు రోగికి వెంటిలేటర్ను అమర్చి ఆక్సిజన్ అందిస్తూ చికిత్స ప్రారంభించారు. రోగిని అప్పటికే చాలా ఆస్పత్రుల్లో చూపించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో రిమ్స్కు తీసుకువచ్చారు. అతనికి అప్పటికి రక్తంలో ఆక్సిజన్ శాతం 53 మాత్రమే ఉంది. రిమ్స్లోని వైద్యులు ఐసీయూలో ఉంచి మందులు ఇస్తూ ప్రయత్నం చేశారు. ఓ దశలో రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతం 87కు చేరినప్పటికీ, అది ఎక్కువ రోజులు నిలబడలేదు. అప్పుడు రక్తాన్ని పరీక్ష నిమిత్తం విశాఖపట్నం పంపించారు. అక్కడ పరీక్షల్లో అతనికి ఉన్న వ్యాధి ‘మెథెమోగ్లోబినిమియా’గా నిర్ధారణ అయింది. అయితే అప్పటికే అతని పరిస్థితి కష్టతరంగా మారడంతో రిమ్స్లోని ఐదు విభాగాల వైద్యులు పరస్పరం చర్చించుకున్నారు. రోగికి శరీరంలో ఉన్న రక్తమంతా తీసి వేస్తూ, మరో వంక కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా రోగి ప్రాణాన్ని రక్షించవచ్చునని భావించారు. అయితే ఈ సమయంలో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉండే అవకాశాలు ఉండడంతో, రోగి బంధువులతో మాట్లాడారు. పరిస్థితిని వారికి వివరించారు. ఏ రకమైన చికిత్స చేయకపోయినా వారం పది రోజుల్లో మృతి చెందే అవకాశం ఉండడంతో, బంధువులు చికిత్స జరపాలని వైద్యులను కోరారు. దీంతో వైద్యులు రంగంలోకి దిగి ఓ పక్క రక్తం ఎక్కిస్తూనే మరో వంక శరీరంలో ఉన్న రక్తాన్ని తొలగిస్తూ వచ్చారు. సుమారు 17 యూనిట్ల రక్తం అంటే 4.2 లీటర్ల రక్తాన్ని ఎక్కించారు. అదే స్థాయిలో పాత రక్తాన్ని తొలగించారు. అటు తర్వాత రక్తంలో ఆక్సిజన్ శాతం పరీక్షించగా 97 శాతం చేరుకోవడం అది నిలకడగా ఉండడంతో, క్రమేపి వెంటిలేటర్ను అటు తర్వాత ఆక్సిజన్ తొలగించి పరీక్షించారు. అప్పుడు కూడా ఆక్సిజన్ శాతం తగ్గకపోవడంతో పూర్తిగా ఆక్సిజన్ తీసివేశారు. మళ్లీ పరీక్షించగా రక్తంలో ఆక్సిజన్ శాతం 97 ఉండడం పల్స్, బీపీ రేటు నిలకడగా ఉండటంతో జూలై 24న రోగిని డిశ్చార్జ్ చేశారు. జూలై చివరివారంలో రోగిని మరోసారి రప్పించి పరీక్షలు చేయగా అప్పుడు కూడా నిలకడగానే ఉండడంతో మళ్లీ ఇంటికి పంపించేశారు. ఈ నెల 5వ తేదీన మళ్లీ తనిఖీ చేయగా అతను ఆరోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ 15 రోజుల తర్వాత తనిఖీలకు రావాలని చెప్పి పంపించేశారు. రోగి మృతి చెందుతాడని భావించగా రిమ్స్ వైద్యులు విశేష సేవలు అందించి ప్రాణం నిలబెట్టారని వారికి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోగికి వైద్య సేవలు అందించి ప్రాణం నిలబెట్టిన ఎమర్జెన్సీ విభాగం పేథాలజీ విభాగం, నెఫ్రాలజీ విభాగం జనరల్ మెడిసిన్ విభాగం, బ్లడ్ బ్యాంక్ విభాగం వైద్యులను పలువురు అభినందించారు. ఐదు విభాగాల వైద్యుల కృషితో నిలబడిన ప్రాణం -
శ్రీనిధిలో మెరుగైన వైద్య సేవలు
● ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవాదృక్పథంతో వైద్య సేవలు అందించాలని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలోని ఐనాక్స్ థియేటర్ వెనుక నూతనంగా నిర్మించిన శ్రీనిధి మెడికేర్, క్రిటికల్ కేర్, మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని వినియోగించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలో అన్ని రకాల వైద్య సేవలతో కూడిన శ్రీనిధి మెడికేర్, క్రిటికల్ కేర్ ఆస్పత్రి అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవల కోసం గతంలో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పడు జిల్లా కేంద్రంలో అందుతున్నాయన్నారు. ఆస్పత్రి ఎం.డి డాక్టర్ వి. నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ఐసీయూ, జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, పలమనాలజీ సేవలు అందిస్తామన్నారు. డయాలసిస్, ఎక్స్రే, ల్యాబొరేటరీ, సిటిస్కాన్, ఫిజియోథెరపీ, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, మాడ్యులర్, లామినర్ ఆపరేషన్ థియేటర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జయచంద్రనాయుడు పాల్గొన్నారు. -
బాల్బ్యాడ్మింటన్ సెలక్షన్కు స్పందన కరువు
లక్కవరపుకోట: మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్లో బాల్బాడ్మింటన్ జిల్లా జట్టుకు సంబంధించి 10వ సబ్ జూనియర్స్, 11వ సీనియర్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలకు క్రీడాకారుల నుంచి స్పందన కరువైంది. ఈ ఎంపికలకు క్రీడాకారులు అనుకున్న మొత్తంలో రాకపోవడంతో వచ్చిన వారిని తప్పని పరిస్థితిలో జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కాగా ఈ ఎంపిక పోటీలను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలతోనే ఉజ్వలభవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.శ్రీనివాస్రావు, కార్యదర్శి జి.లక్ష్మణరావులు మాట్లాడుతూ నేడు ఎంపిక చేసిన క్రీడాకారులు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చెవ్వూరులో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా ఎంపికకు వచ్చిన అతి కొద్ది మంది క్రీడాకారులకు సైతం నిర్వాహకులు కనీసం భోజనం, మంచినీటిసౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. తూతూమంత్రంగా ఎంపికలను నిర్వహించి మమ అనిపించారు.కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గాడి రవికుమార్, జి.సింహాచలం,ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. తప్పని పరిస్థితిలో సెలక్షన్కు వచ్చిన వారి ఎంపిక -
సచివాలయ వ్యవస్థపై నిర్లక్ష్యం
● ఆధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా పట్టించుకోని వైనం ● వినియోగంలోకి తేవాలని ప్రజల విజ్ఞప్తిసాలూరు రూరల్: ఎంతో ప్రతిష్టాత్మకంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ప్రవేసపెట్టి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరా జ్యం అన్న నినాదానికి తగ్గట్లు సేవలు అందించిన సచివాలయ భవన నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం సీతకన్ను వేసిందనే చెప్పవచ్చు. సాలూరు మండలంలోని 29 పంచాయతీల్లో 22 సచివాలయ భవనాలు మంజూరు చేసిన గత ప్రభుత్వం దాదా పు 15 సచివాలయాలు పూర్తిచేయడమే కాకుండా మరికొన్నింటికి శ్లాబులు వేసి ఉన్నాయి. కొన్ని పారంభానికి సిద్దంగా ఉన్న భవనాలు కూడా రంగులు వేసి ప్రజలకు సేవలంచేందుకు సిద్ధం చేయాల్సి న కూటమి ప్రభుత్వం కనీసం ఏడాది పూర్తయినా వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా పంచాయతీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు గ్రామాల్లో ఉంటే ప్రజలకు దగ్గరగా సేవలు అందుతాయని నమ్ముతున్నారు. ఇంటింటికీ సేవలందించే సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయాలని మేధావులతో పాటు పలు పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. -
10 మంది జూదరుల అరెస్టు
● రూ 42,300 నగదు స్వాదీనం ● 6 ద్విచక్రవాహనాలు సీజ్లక్కవరపుకోట: మండలంలోని తామరాపల్లి గ్రామం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కాయిన్ ఆటపై ఎస్సై నవీన్పడాల్ తన సిబ్బందితో ఆదివారం సాయంత్రం దాడి చేశారు. కాయిన్ ఆట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ 42,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జూదరులకు సంబంధించిన 6 ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పట్టుబడితే ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఎస్సై హెచ్ఛరించారు.కార్యక్రమంలో హెచ్సీ పాపారావు, కానిస్టేబుల్స్ గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. కోడి పందాల రాయుళ్లు.. బొండపల్లి: మండలం లోని కొత్త పాలెం గ్రామం పరిధిలో ఆదివారం కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పందెంలో పాల్గొన్న ఏడుగురితో పాటు, 5పందెం కోళ్లు, రూ.7,140 నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
● తప్పని డోలీ కష్టాలు..!
ఈ చిత్రంలో డోలీలో మోస్తున్న బాలిక పేరు సవర ఒబిగోల్. ఈమెది కొండాడ పంచాయతీ పరిధి చీడిమానుగూడ గ్రామం. కొద్ది రోజులుగా టైఫాయిడ్, మలేరియా, కడుపు నొప్పితో బాధపడుతుండగా గ్రామం నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. రోడ్డుపై రాళ్లు తేలడంతో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక చీడిమానుగూడ నుంచి కొండాడ వరకు బాలికను ఇలా శనివారం మధ్యాహ్నం మూడు కిలోమీటర్ల దూరం మేర డోలీలో మోసుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి ఆటోలో పాలకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. – సీతంపేట -
మాజీ ఎంపీపీకి పరామర్శ
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని గెడ్డపువలస గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొణిసి కృష్ణంనాయుడిని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావులు ఆదివారం పరామర్శించారు. ఇటీవల వారం రోజుల క్రితం మాజీ ఎంపీపీ కృష్ణంనాయుడు గుండెపోటుకు గురై విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాయకులిద్దరూ గెడ్డపువలస గ్రామానికి వెళ్లి కృష్ణంనాయుడిని పరిమర్శించి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, ఆరోగ్యం కుదుటపడేంత వరకు కూడా ఎలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎలాంటి ఒత్తిడికి లోనవ్వద్దని సూచించారు. కార్యక్రమంలో గరివిడి వైఎస్సార్సీపీ నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తీక్, కడుమల రాంబాబు, గుడివాడ తమ్మినాయుడు, యల్లంటి పోలీస్నాయుడు, వలిరెడ్డి లక్ష్మణ, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు తదితరులు ఉన్నారు. -
ధర లేదు...!
కళ తప్పిన చంపావతి గజపతినగరం:ప్రతి ఏటా ఇదే సీజన్లో నీటి తో నిండుగా దర్శనమిచ్చే చంపావతి నది నేడు నీరు లేక పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. వర్షాలు కురవకపోవడంతో నదిలో పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. మరోవైపు ఇసుకాసురులు ఎక్కడికక్కడ గోతులు తవ్వేసి ఇసుకను ఎత్తుకెళ్లడంతో మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఆగస్టు నాటికి నీటితో నిండుగా ఉండాల్సిన చంపావతి నేడు జల కళ తప్పి బోసిపోయింది. ఈ పరిస్థితుల్లో దీని ఆయకట్టు రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు. గజపతినగరంలో నీరు లేక పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న చంపావతి నది దిగుబడి పెరిగినా.. గిరిజన ఉత్పత్తులకు సరైన ధర ఏ సీజన్లోనూ రాక రైతులు నష్టపోతున్నారు. ఏజెన్సీలో పండే ప్రతి ఉత్పత్తిని జీసీసీ కొనుగోలు చేసి గిరిజనులకు మేలు చేయాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం లేకుండా పోయింది. సీజన్ వారీగా మార్కెట్లోకి వచ్చే పండ్ల దిగుబడి బాగున్నా... ధర లేకుండా పోవడంతో గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. పంట దిగుబడులు విక్రయించే సమయానికి వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను తగ్గించేసి వారు మాత్రం లాభాలు పొందుతున్నారు. ఏజెన్సీలో తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యాపారులు మైదాన ప్రాంతాలకు తరలించి అక్కడ లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో గిరిజన రైతులు ఏ సీజన్లోనూ లాభపడే పరిస్థితులు కనిపించడం లేదు. సీతంపేట: ప్రస్తుత సీజన్లో ఏజెన్సీలో పండించిన కొన్ని రకాల పండ్లకు ధరలు ఉన్నా.. మరికొన్ని రకాల పంటలకు మద్దతు ధరలు లేవని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఆ కోవకే వస్తుంది విస్తృతంగా పండే పుట్టదబ్బ. ఏజెన్సీలో ఈ ఏడాది పుట్టదబ్బ దిగుబడి పెరిగినా ధరలు అంతగా అనుకూలించడం లేదు. ఫలితంగా గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోయినప్పటికి భామిని, సీతంపేట ఏజెన్సీలో ఈ పంటను కొండ పోడు వ్యవసాయంలో భాగంగా గిరిజన రైతులు పండిస్తారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుందని గిరిజన రైతులు వాపోతున్నారు. కావిడ దబ్బ ధర రూ 300 – 400ల మధ్య విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదే సీజన్లో ఒక్కో కావిడి రూ.500 వరకు విక్రయించే వారమని గిరిజనులు చెబుతున్నారు. హడ్డుబంగి, సోమగండి, గొయిది, శంబాం, కుశిమి, పెదరామ తదితర పంచాయతీల పరిధిలో దబ్బ ఎక్కువగా సాగు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో డిమాండ్ ఒక్కో పుల్ల దబ్బ ఏజెన్సీలో రూ.4లకు కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో రూ.10ల వరకు విడిగా విక్రయిస్తారు. కారుచౌకగా కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో అధికంగా విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ఎక్కువగా ఇవి పచ్చళ్లు తయారు చేసే చిన్నతరహా కంపెనీలకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. గిరిజన రైతులు చెప్పిన ధరలు కాకుండా వ్యాపారులు సిండికేట్గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారీ వ్యాపారుల నుంచి అడ్వాన్స్లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులకు ఇస్తారు. ఇలా కూడా గిరిజనులు నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఏజెన్సీలో పుట్టదబ్బ పరిస్థితి కావిడ దబ్బ రూ.300 నుంచి 400 ఒక్కో పుట్టదబ్బ రేటు ఏజెన్సీలో రూ.4లు మైదాన ప్రాంతాల్లో రూ.10లు ఆందోళనలో గిరిజన రైతులు దబ్బకు మద్దతు ధర కల్పించాలి కొండపోడు వ్యవసాయంలో పండిస్తాం కాబట్టి సేకరణ కష్టంగా ఉంటుంది. పోడు వ్యవసాయంలో అక్కడక్కడ చెట్లు ఉంటాయి. తెల్లారే సరికి కొండకు వెళ్లి సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తాం. గత కొన్నేళ్లుగా ఇవే ధరలు ఉంటున్నాయి. – ఎస్.మోజేషు, లంబగూడ శ్రమకు తగ్గ ఫలితం లేదు.. పైనాపిల్, సీతాఫలం తర్వాత ఆదాయాన్ని ఇచ్చేది పుట్టదబ్బ పంట. శ్రమకు తగ్గ ఫలితం లేదు. కావిడలు మోసుకొని తీసుకువస్తాం. తీరా వీటిని తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుంది. ప్రత్యేక మద్దతు ధరలు లేవు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేస్తున్నాం. – ఎస్.బంగారయ్య, కొత్తగూడ -
అటకెక్కిన వాహనమిత్ర
హామీల అమలుకు ర్యాలీ ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాహనమిత్ర హామీతో పాటు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డ్రైవర్లు, మోటారు కార్మికులు డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అమలు చేసే లోపు వాహనమిత్ర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం డ్రైవర్లు, కార్మికులు సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో వందల సంఖ్యలో డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు. సాలూరు: చక్రం కదిలితేనే వారి బతుకు బండి సాగేది. దశాబ్దాలుగా వారి జీవనాధారం ఆటోలే.. సాలూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు వందల సంఖ్యలో ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఏటా అమలయ్యేది. ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేయడం ద్వారా రూ.వేల లబ్ధి చేకూరేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాహన మిత్ర కింద రూ.15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరచి విస్తృత ప్రచారం కల్పించారు. దాన్ని నమ్మి వీరంతా కూటమికి ఓటేశారు. ఇప్పుడు మోసపోయామని గుర్తించారు. ఆందోళన చెందుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఏటా వాహన మిత్ర పథకం తమకు అందేదని ఇప్పుడు దాన్ని కూటమి పాలకులు పక్కన పెట్టారని వాపోతున్నారు. డ్రైవర్ల ఆందోళన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహన మిత్ర పథకం కింద ఇస్తామన్న రూ.15వేలు నేటికీ ఇవ్వలేదు. ఆ ఊసేత్తడం లేదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం రూ.400 కోట్లు బడ్జెట్ కేటాయించి నాడు అర్హులందరికీ రూ.పది వేల చొప్పున అందించారు. కూటమి ప్రభుత్వం ఆ మాదిరిగానే ఇస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఇదే సమయంలో సీ్త్రశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన క్రమంలో తమ బతుకు బండి సంగతేంటని వారంతా ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం ఆటో, ట్యాక్సీ వాలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పథకానికి తాము వ్యతిరేకం కాదని తమను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. వాహన మిత్ర అమలు చేయాలి కూటమి ప్రభుత్వం వాహనమిత్ర కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జీవో 21 రద్దు చేసి అపరాధ రుసుం భారం తగ్గిస్తామని చెప్పారు. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, వాహన కొనుగోలుకు సంబంధించి వడ్డీపై సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదైనా నేటికీ అవేమి అమలు కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చెబుతున్నారు.. ఈ క్రమంలో అంతకంటే ముందు వాహనమిత్ర అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడుతాం. – ఎన్వై నాయుడు, ఆటో, మ్యాక్సీ, క్యాబ్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డ్రైవర్లకు కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఇలా.. ఎన్నికల సమయంలో కూటమి నేతలు డ్రైవర్లకు అమలు కాని హామీలు ఇచ్చారు. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తామని, వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, డ్రైవర్లను యజమానులను చేసే లక్ష్యంతో వాహన కొనుగోలుకు రూ.4 లక్షల వరకు పొందే రుణాలపై ఐదు శాతం పైబడిన వడ్డీ సబ్సిడీ అందిస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. మేనిఫెస్టోలో హామీనిచ్చి మరిచారు నిరాశలో ఆటో డ్రైవర్లు మహిళలకు ఉచిత బస్సు అమలైతే.. తమ పరిస్థితి ఏంటని ఆందోళన సాలూరులో వందల మంది ఆటో డ్రైవర్లు వాహనమిత్ర అమలు చేయాలని భారీ ర్యాలీ -
అర్జీల వివరాల కోసం టోల్ ఫ్రీ 1100 : కలెక్టర్
పార్వతీపురం రూరల్: పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల వివరాలను టోల్ ఫ్రీ 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చ ని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఆన్లైన్లో నమోదు చేసుకొనేందుకు మీకోసం వెబ్ సైట్ (మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్)లోనూ సమస్యలపై ప్రజలు అర్జీలు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలపై ప్రతీ సోమవారం వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు ప్రజల వినతులు స్వీకరించడానికి సెల్లార్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని తెలిపారు. నేడు ఐటీడీఏలో పీజీఆర్ఎస్ సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ చీపురుపల్లి: ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్పై నిష్ణాతులైన వారితో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ రెవెన్యూ డివిజినల్ కోఆర్డినేటర్ బివి.గోవిందరాజులు చెప్పారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న రెడ్క్రాస్ సంస్థకు చెందిన బ్లడ్ బ్యాంక్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికీ చివరి క్షణాల్లో గోల్డెన్ పీరియడ్ ఉంటుందని ఆ సమయంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకా శం ఉంటుందన్నారు. అలాంటి బేసిక్ ఫస్ట్ ఎయిడ్పై వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని కోసం రెడ్క్రాస్ సంస్థ జిల్లా చైర్మ న్ కెఆర్డి.ప్రసాద్ ఆదేశాల మేరకు అబోతుల రమణ అనే నిష్ణాతులైన ఉద్యోగిని నియమించినట్టు తెలిపారు. రమణ ఆధ్వర్యంలో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఎవరైనా మృతి చెందినప్పుడు నేత్ర దానం, అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తే తక్షణమే రెడ్క్రాస్ 89192 649 93, 9247818604 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అవయవ దానం చేయడం ద్వారా వారికి సంపూర్ణ జీవితం ఇచ్చిన వారవుతారని పేర్కొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్ : మండలంలోని జమ్ములో నివాసముంటున్న కొమ్మురు పార్వతీశ్వరరావు(32) తన ఇంట్లోనే బ్లేడ్తో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్కుమార్ శనివారం తెలిపిన వివరాలు.. భోగాపురానికి చెందిన పార్వతీశ్వరరావు అదే గ్రామానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. జమ్ములో ఉంటున్న పార్వతీశ్వరరావు భార్య వద్దే రూ.14లక్షలు తీసుకున్నాడు. అడిగితే ఇదిగో.. అదిగో అంటూ దాట వేయసాగాడు. ఈసారి డబ్బులు అడిగితే చనిపోతానని బెదిరించేవాడు. అయినా మళ్లీ భార్య డబ్బులు అడగ్గా కోపంతో రగిలిపోయిన పార్వతీశ్వరరావు తన భార్య, తల్లిని గదిలో బంధించి బయట గడియపెట్టి బ్లేడ్తో మెడపై కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పశువుల మాంసం వ్యాన్ సీజ్
బొండపల్లి: బొండపల్లి మండల కేంద్రం మీదుగా శనివారం ఉదయం మూడు టన్నుల పశువుల మాంసం లోడుతో అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ను పట్టుకుని సీజ్ చేసినట్టు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ మాంసం సాలూరు నుంచి రాజమండ్రికి అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిపారు. వ్యాన్ను సీజ్ చేసి స్టేషన్కు తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో పైడితల్లి చండీయాగం విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కల్పివల్లి శ్రీపైడితల్లిని ఆరాధిస్తూ స్థానిక రైల్వేస్టేషన్ దగ్గరున్న వనంగుడి, చదురుగుడి ఆవరణల్లో చండీయాగం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, రాజేష్, సాయిలు శాస్త్రోక్తంగా పూజలు చేసి, యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలు, కండువాలు అందజేశారు. -
కూల్ డ్రింక్స్ వద్దు.. ఆరోగ్యమే ముద్దు
విజయనగరం గంటస్తంభం: కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని, ఆరోగ్యానికి హాని కలిగించే కూల్డ్రింక్స్ విడిచిపెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముద్దని జనవిజ్ఞాన వేదిక జాతీయ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఏవీ రాజశేఖర్ అన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో శనివారం క్విట్ కూల్ డ్రింక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. కూల్ డ్రింక్స్లో కార్బన్డయాకై ్సడ్, ఆల్కహాల్, ఎరువులు తదితర ప్రమాదకరమైన పదార్ధాలు కలుపుతారని, ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయని అన్నారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్ మాట్లాడుతూ.. కోకో కోల, పెప్సీ వంటి విదేశీ కూల్ కూల్ డ్రింక్స్ను విడిచిపెట్టి మన ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మన ఇంటికి వచ్చే బంధువులకు కూల్ డ్రింక్స్ను ఇవ్వకుండా దాని స్థానంలో మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు వంటి పానీయాలను ఇవ్వాలని విజ్ఞాప్తి చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి షిణగం శివాజీ, గురజాడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూడి శేఖర్, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సకల భాషలకు తల్లి సంస్కృతం
విజయనగరం టౌన్: సకల భాషలకు మూలం, తల్లి వంటిది సంస్కృత భాష అని వాగ్దేవి సమారాధనమ్ సంస్థ వ్యవస్థాపకురాలు, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి అన్నారు. సంస్కృత భాషా దినోత్సవం పురస్కరించుకుని, నగరంలోని మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలో సంస్కృత భాషా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కర్రి సంతోషిలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, డాక్టర్ గోటేటి హిమబిందులు మాట్లాడుతూ నేడు మానవులు మాట్లాడుతున్నటు వంటి భాషాపదాల్లో 80 శాతం సంస్కృత పదాలేనని తెలిపారు. సంస్కృతం లేకుంటే మానవ జీవన గమనం కష్టమని రామాయణం, మహాభారతం, భాగవతాలు కూడా తొలుత సంస్కృతంలోనే లభ్యమయ్యాయన్నారు. -
పశు ఆరోగ్య సంచార వాహనాల్లో
● మందులు లేకుండానే గ్రామాలకు వెళ్తున్న వాహనాలు ● జిల్లాలో 13 సంచార పశు ఆరోగ్య వాహనాలు ● రోజుకు ఒకటి రెండు గ్రామాల్లోనే వైద్య శిబిరాలు ● గతంలో 1962 నంబరుకు ఫోన్ రాగానే సంబంధిత గ్రామానికి వెళ్లి సేవలు ● ఏవీ నాటి సేవలు నేడు... విజయనగరం ఫోర్ట్: పశు ఆరోగ్య సంచార వాహనాలు అలంకార ప్రాయంగా గ్రామాలకు వెళ్తున్నాయనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. పశువుల చికిత్సకు అవసరమైన మందులు లేకుండానే గ్రామాలకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాడి రైతులు పశువుల వైద్యానికి ప్రైవేటు మందుల దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. గతానికి భిన్నంగా పశు సంచార ఆరోగ్య వాహనాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. పశువుల వైద్యానికి సేవలు అందించేందుకు 1962 ట్రోల్ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గానికి రెండు వాహనాలు ఉంచారు. రెండు మండలాలకు ఒక వాహనం చొప్పన వైద్య సేవలు అందించేవారు. 1962 ట్రోల్ ప్రీ నంబరుకు ఫోన్ రాగానే సంబంధిత గ్రామానికి వెళ్లి పశువులకు అవసరమైన వైద్యాన్ని వాహనం వద్దే అందించేవారు. శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే దగ్గరలో ఉన్న ప్రాంతీయ పశు వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స అందించి అనంతరం గ్రామానికి పంపించేవారు. విజయనగరం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు రెండు చొప్పన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు 13 ఉన్నాయి. వాహనాల వివరాలు గజపతినగరం నియోజకవర్గంలో – 2, చీపురుపల్లి నియోజకవర్గంలో – 2, బొబ్బిలిలో – 2, నెల్లిమర్లలో – 2, ఎస్.కోటలో – 2, విజయనగరంలో –1, రాజాంలో –2 చొప్పన పశు ఆరోగ్య సేవ వాహనాలు ఉన్నాయి. మూగ జీవాలకు మందులు లేకుండానే.. మూగ జీవాల చికిత్స కోసం వచ్చిన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు మందులు లేకుండానే గ్రామాలకు వెళ్తున్నాయని పాడి రైతులు అంటున్నారు. మందులు లేకుండా గ్రామాలకు వెళ్లడంతో రైతులు పశు వైద్యుడు చెప్పిన మందులు ప్రైవేటు మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో రైతులకు చేతి చమురు వదులుతుంది. సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను గతంలో జీవీకే సంస్థ అందించేంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భవ్య హెల్త్ ప్రొవైడర్స్ సంస్థకు అప్పగించింది. గతానికి భిన్నంగా.. సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల వివరాలను గతానికి భిన్నంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నెలకు 8 వేల నుంచి 9 వేల కిలోమీటర్ల వరకు ఒక్కో వాహనం సేవలు అందించేవి. ఇప్పడు వాహనాలు నెలకు 3 వేల కిలోమీటర్లు కూడా తిరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా రోజుకు రెండు మూడు గ్రామాల్లో వాహనం పెట్టి సేవలు అందిస్తున్నారు. ఒకే చోట వాహనాలను పెట్టడం వల్ల ఎక్కువసార్లు కేసుల కోసం తిరగాల్సిన పని తప్పుతుంది. అంతేకాకుండా కొన్ని వాహనాలు గ్రామాలకు వెళ్లడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గంట్యాడ సంచార పశు ఆరోగ్య సేవ వాహనంజిల్లాలో 4,75,805 పశువులు జిల్లాలో 4,75,805 పాడి పశువులు ఉన్నాయి. ఇందులో 3,77,960 ఆవులు, 97,845 గేదెలు ఉన్నాయి. అదే విధంగా గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. పందులు 2,585, కోళ్లు 51,26,764 ఉన్నాయి. మందులు వచ్చాయి.. సంచార పశువైద్యశాలల్లో మందుల కొరత ఉంది. అయితే ప్రస్తుతం మందులు వచ్చాయి. వాటిని సంచార పశు వైద్యశాలలకు అందజేస్తాం. ఇకపై ఇబ్బంది ఉండదు. – డాక్టర్ దామోదర్రావు,జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు -
వట్టిగెడ్డ నీరు విడుదల
జియ్యమ్మవలస: మండలంలోని రావాడ వట్టిగెడ్డ నీటిని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం విడుదల చేశారు. నీటిని విడుదల చేయడంతో వ్యవసాయ పంపుసెట్లు లేని రైతులు ఆనందిస్తున్నారు. ఉభాలు చాలా గ్రామాలలో ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉభాలు అవుతాయని రైతు లు అంటున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొంగు సురేష్, నీటి సంఘం అధ్యక్షులు ఎం. సత్యంనాయుడు, నాయకులు డొంకాడ రామకృష్ణ, జోగి భుజంగరావు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం ఫోర్ట్: రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాఽధికారిత అధికారి టి.విమలారాణి శనివారం తెలిపారు. విద్యా, విజ్ఞానం, కళలు, ఆటలు ఇతర రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐదు సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు వారు తాము సాధించిన వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు, పత్రికల్లో ప్రచురింపబడిన క్లిప్పింగ్లు తదితర వాటితో అవార్డ్.జిఓవి.ఇన్ వెబ్సైట్లో అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎట్టకేలకు చిక్కిన నిందితుడు! కొత్తవలస : మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును తన మేనకోడల భర్తయిన అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు ఈ నెల 5న నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు కశింకోట సమీపంలో పోలీసులకు శనివారం చిక్కినట్టు సమాచారం హత్య జరిగిన మరుసటి రోజు నుంచి అప్పారావు మకాం మార్చుతూ రాజమండ్రి, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. నిందితుడు తన ఫోన్ను ఘటనా స్థలంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే పాతవలస గ్రామంలోని తన ప్రియురాలికి నిందితుడు తరచూ ఫోన్ చేస్తుండడంతో ఆమె ఫోన్పై పోలీసులు నిఘా పెట్టారు. సంబంధిత సిగ్నల్ ఆధారంగా నిందితుడు కదలికలను పోలీసులు గుర్తించారు. చివరికి అనకాపల్లి జిల్లా కశింకోట సమీపంలో శనివారం ఉదయం టిఫిన్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఆదివారం కోర్టును హాజరు పర్చనున్నట్టు తెలిసింది. మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి.. పెందుర్తి : అనారోగ్యంతో మరణించిన వృద్ధురాలి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తాడివానిపాలెం అంబేడ్కర్కాలనీకి చెందిన రాజాన అచ్చియ్యమ్మ(90) ఆరోగ్యం క్షీణించి శనివారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్, స్థానిక పెద్ద ఎం.సింహాచలం మృతురాలి కుటుంబ సభ్యులను నేత్రదానానికి ఒప్పించారు. కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఎల్వీ ప్రసాద్ సారధ్యంలోని మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు అచ్చియ్యమ్మ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జామి: వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం, శ్రావణ పౌర్ణమి, శనివారం సందర్భంగా భీమసింగి సుగర్ఫ్యాక్టరీ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు వరప్రసాద్ ఆచార్యులు ఆద్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణగావించి, విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాద వితరణ గావించారు. అన్నంరాజుపేట పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. -
పెద్ద గెడ్డ కాలువలో మృతదేహం లభ్యం
పాచిపెంట : పెద్దగెడ్డ జలాశయం కాలువలో ఓ వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైనట్టు పాచిపెంట ఎస్ఐ వెంకట్ సురేష్ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు పట్టణంలో గలగొడ వీధికి చెందిన ముంజేటి నాగేంద్రబాబు (40) ప్లాస్టిక్ కవర్లు సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. శనివారం కాలువలో శవమై కనిపించాడు. మృతునికి మద్యం అలవాటు ఉందని మద్యం మత్తులో బహిర్భూమి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని భార్య ముంజేటి ఖరీస్మా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. వైభవంగా విఖనసస్వామి జయంతి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానంలో కొలువైన విఖనసస్వామి జయంతి శనివారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సీతారామస్వామి వారికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించినానంతరం యాగశాలలో విశేష హోమాలు చేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తుల వద్ద స్వామివారికి నూతన యజ్ఞోపవీతధారణ చేశారు. అనంతరం వెండి మండపం వద్ద సీతారాముల నిత్యకల్యాణం కనుల పండువగా చేశారు. విఖనసస్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫలరసాలతో అభిషేకం చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు. -
అధికారుల బదిలీలపై ఆగ్రహం
గుమ్మలక్ష్మీపురం: పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ సిన్హ, పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీ వాస్తవకు చేపట్టిన బదిలీలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని గిరిజన జేఏసీ నాయకులు కోలక లక్ష్మణమూర్తి, మండంగి రమణ, నిమ్మక సింహాచలం, బి.గౌరీశంకరరావు, బిడ్డిక పద్మ, తిరుపతిరావు, అడ్డాకుల చిన్నారావు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు గుమ్మలక్ష్మీపురంలో వారి బదిలీలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ కలెక్టర్గా యశ్వంత్ కుమార్ సిన్హ, పీవోగా అశుతోష్ శ్రీ వాస్తవ ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలోనూ, నిరుద్యోగ విద్యార్థుల ఉన్నత అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిని బదిలీ చేయడం వలన ఇప్పటి వరకు గిరిజన గ్రామాల్లో జరిగిన అభివృధ్ధి ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం దీన్ని గుర్తించి వీరి బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని, లేకుంటే గిరిజనులంతా ఏకమై ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. సబ్ కలెక్టర్, పీవో బదిలీలను నిలుపుదల చేయాలి గిరిజన జేఏసీ నాయకుల డిమాండ్ -
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న యోగా పోటీలకు జిల్లా జట్లు సిద్ధమయ్యాయి. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని తోటపాలెం గాయత్రీ విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ఎంపిక పోటీలకు అనూహ్య స్పందన లభించింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో మొత్తం 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరికి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్, అల్లు నరేంద్ర, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు సమక్షంలో ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 35 మంది క్రీడాకారులను వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో తాడేపల్లిగూడేంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.సన్యాసిరావు, ఎస్.రవివర్మ, ఎన్.పైడిరాజు, ఎం.గౌతమి, జి.సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ చైర్మన్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు
విజయనగరం: ఉమ్మడి విజయగనరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు నివాసంలో శనివారం రక్షాబంధన్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో జరిగిన వేడుకల్లో మజ్జి శ్రీనివాసరావు సోదరీమణులు ఎం.అమృతవల్లి, ఎ.రమాదేవి, బి.పద్మలు ఆయనకు రాఖీలు కట్టి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు సోదరీమణులను కానుకలు అందించి గౌరవించారు. ఆ భగవంతుని చల్లనిదీవెనెలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సతీమణి పుష్పాంజలి పాల్గొన్నారు. -
గిరిజన నాయకులను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్
సీతంపేట/పార్వతీపురంరూరల్: జిల్లాలోని సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, వేషధారణలు, డప్పువాయిద్యాలు అలరించాయి. ముందుగా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డితో పాటు అధికారులు, నాయకులు సీతంపేట అడ్వంచర్ పార్కు నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ చేశారు. ఐటీడీఏ ముఖద్వారం వద్ద ఉన్న అడవితల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వివిధ ప్రభు త్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనుల కోసం నిరంతరం పోరాడి అమరులైన గిరిజన నాయకులు బిర్సాముండా, అల్లూరి సీతారామరాజు, కొమరంబీమ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీవితంలో ఉన్నస్థాయికి ఎదగాలంటే విద్యార్థులంతా బాగా చదువుకోవాలన్నారు. సీతంపేట ఐటీడీఏ నుంచి టెన్త్ విద్యార్థినికి స్టేట్ఫస్ట్ రావడం ఎంతో ఆనందంగా ఉందాన్నరు. గిరిజనులు ఆరోగ్యం పట్లశ్రద్ధ వహించాలన్నారు. నాటుమందుల జోలికి పోవద్దన్నారు. ప్రసవానికి ముందే గర్భిణులు వైటీసీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక హాస్టల్కు చేరుకోవాలన్నారు. ఏడాది పొడవునా దిగుబడి వచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. అనంతరం టెన్త్, ఇంటర్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే క్రీడలు, నృత్యాలు చేసిన వారిని అభినందించారు. కార్యక్రమంలో పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి, ఏపీఓ చిన్నబాబు, డీఎంఅండ్హెచ్ఓ భాస్కరరావు, ఎంపీపీ బి.ఆదినారాయణ, మార్కెట్కమిటీ చైర్మెన్ సంధ్యారాణి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పి.భూదేవి, గిరిజన నాయకులు కె.సుబ్బారావు, ఎం.రవికుమార్, ప్రమోద్, ఎం.భాస్కరరావు, కె.కాంతారావు, స్పోర్ట్స్ ఇన్చార్జి జాకాబ్దయానంద్, ఏఎంఓ కోటిబాబు, జీసీడీఓ రాములమ్మ పాల్గొన్నారు.ఆదివాసీ వారసత్వాన్ని కాపాడుకోవాలిపార్వతీపురం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ ఆదావాసీ దినోత్సవంలో పీఓ అశుతోష్ శ్రీవాత్సవతో పాటు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, కురుపాం ఎమ్మెల్యే టి.జగదీశ్వరీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఆదివాసీ వారసత్వాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వసతిగృహాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందని, 10, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రగతి రాష్ట్రంలో మొదటి వరుసలో ఉందంటే ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల కృషి ఫలితమేనన్నారు. ఎస్పీ మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం ఎంతో సంప్రదాయంగా ఉంటుందని, అమాయకపు గిరిజనులు కొంతమంది అత్యాసపరుల మాటలు విని సారా, గంజాయి వంటి అక్రమ రవాణాల్లో భాగస్వాములై కటకటాలపాలవుతున్నారన్నారు. మాదకద్రవ్యాల రవాణాకు దూరంగా ఉండాలని సూచించారు. -
3
కోట్లా.. రూ. వెంకటేశా..! అమ్మకానికి ఉద్యోగాలు..? ● టీడీపీ నాయకులకు 30 శాతం కమీషన్ ● అమరావతి నుంచి కిందస్థాయి అధికారుల వరకు కుమ్మక్కు? ● బయట పడిన ఇద్దరు టీడీపీ నాయకుల ఆడియో సంభాషణ ● పోస్టులు అమ్మేస్తే.. చదువుకునేవారికి ఇంకెలా ఉద్యోగాలు వస్తాయంటూ నిరుద్యోగుల నిట్టూర్పు సాక్షి, పార్వతీపురం మన్యం: ఆమె: 3 సీఆర్ (రూ.3కోట్లు) రెడీగా ఉంది. ఎరేంజ్మెంట్ చేయమనండి. మన దగ్గర ఉండడం ప్రమాదం. నేను సాయంత్రం వారి దగ్గరికి వెళ్లి మీకు ఫోన్ చేస్తాను. మీరు మాట్లాడితే చాలు. అతను: నేను ఏం మాట్లాడాలో చెప్పు... వారిని డబ్బులు పట్టుకుని ఉండమను. ఆమె : ఏం మాట్లాడతారు.. పర్సంటేజీ. డబ్బులు మన దగ్గరే ఉన్నాయి.. 3 సీఆర్! అతను: పర్సంటేజ్ 30 అని చెప్పాను.. వీరికి 15.. మనకు 15 ఉంటుంది. ఆమె : రెండు, మూడు రోజుల్లో పార్వతీపురం నుంచి క్యాష్ పట్టుకెళ్లమనండి. మనం అయితే అంత పట్టుకెళ్లలేం. మీకు అర్థం కావడం లేదు. ఆమె : ఇప్పుడే ఆమెకు ఫోన్ చేశాను. అమ్మా ఈ జాబ్ ఎవరు వేయిస్తున్నారని అడుగుతున్నారు. ‘సూపరింటెండెంట్ గారా.. వెంకటేష్ గారా.. నువ్వా..‘ అని అడిగారు. నేను సైలెంట్గా ఉన్నాను. ఇదీ.. టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్ సంభాషణ. చిన్నచిన్న కాంట్రాక్టుల నుంచి ఉద్యోగాల వరకూ.. అవకాశం ఉన్న ఏ దారినీ వదలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. పలు ఉద్యోగాల భర్తీ విషయంలో రూ.3 కోట్లకు బేరం పెట్టినట్లు ఆ ఫోన్ సంభాషణలో స్పష్టంగా ఉంది. అవి ఏ పోస్టులు? ఇది ఎప్పుడు జరిగిందన్న విషయాలు వారి సంభాషణలో స్పష్టంగా తెలియనప్పటికీ.. అంత పెద్ద మొత్తంలో ఇచ్చే పోస్టులు ఏమై ఉంటుంది.. అన్నది తెలియాల్సి ఉంది. ఆ సంభాషణలో ఉన్న మహిళ గతంలోనూ పలువురిని మోసం చేసి, కేసులు ఎదుర్కోవడం గమనార్హం. పోస్టులను పార్వతీపురం మన్యం జిల్లాలోని యువకుడికి ఇప్పించడంలో ముగ్గురు వ్యక్తులు కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్.. వెంకటేశ్ అనే పేర్లను ప్రస్తావించగా... ఆ మొత్తం అందరికీ పంచాలని, అమరావతిలో పై స్థాయి నుంచి చేయించుకుని వచ్చామని మహిళతో మరో వ్యక్తి చెప్పడం విశేషం. సదరు యువకుడి తల్లి.. ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్లు అర్ధం అవుతోంది. ఆనుకున్న మొత్తం సర్దుబాటు కాలేదని, తర్వాత అందజేస్తానని సూపరింటెండెంట్కు ఫోన్ చేసి.. ఆ మహిళ (డబ్బులిచ్చే పార్టీ) అడిగితే ఏం చేద్దాం అని టీడీపీకి చెందిన మహిళ అనుమానం వ్యక్తం చేయగా.. ఇలాంటి విషయాలు ఫోన్లో అధికారులతో మాట్లాడవద్దని, వారికి ఇబ్బందులు ఉంటాయని చెప్పాలని రెండో వ్యక్తి బదులిచ్చాడు. లేకుంటే.. పోస్టుమన్కి చెప్పి ఆ లెటర్ (అపాయింట్మెంట్ ఆర్డర్) ఆపించేద్దామా? అని ఆమె అంటే.. వద్దని ఆయన తెలిపాడు. అంగట్లో పోస్టులు కూటమి ప్రభుత్వం హయాంలో పోస్టులన్నీ అంగట్లో వస్తువులుగా మారాయి. గతంలో అంగన్వాడీ వర్కర్ పోస్టును రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ విక్రయించుకున్నారని పలువురు బాధితులు పీజీఆర్ఎస్లో వినతి పత్రాలు అందించారు. రేషన్ డీలర్లు, విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పోస్టులు, పలు విభాగాలలో తాత్కాలిక పోస్టులకు రేటు కట్టేసి.. తమ వారికి కట్టబెట్టారు. ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులు, చివరికి పాఠశాలల్లో భోజన పథక కార్మికులు, ఆయాలను సైతం వదలలేదు. ఉద్యోగుల బదిలీల్లోనూ ప్రజాప్రతినిధుల సిఫార్సులెటర్లకు సొమ్ము చేతులు మారిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్లకు ప్రభుత్వ ఉద్యోగాలను బేరం పెట్టారు అంటే.. అవి ఎంత పెద్దపోస్టులు? ఆ స్థాయిలో పోస్టులు అప్పనంగా ఎలా కట్టబెడుతున్నారు? అలాగైతే నిజాయితీగా ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం రాత్రీపగలు చదువుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏమిటన్న వాదన వినిపిస్తోంది. పార్వతీపురం మన్యం వంటి మారుమూల ఉన్న జిల్లా నుంచి రూ.3కోట్ల తరలింపునకు, అది కూడా ట్రస్టులు, వ్యాపార సంస్థల పేరుమీద మళ్లించే మాస్టర్మైండ్ ఏర్పాట్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు దృష్టిసారిస్తే ఈ ఉద్యోగాల వెనుక ఉన్నవారు ఎవురు, వారి అవినీతి తంతు బయటపడుతుందని, ఉద్యోగాల అమ్మకానికి చెక్ పెట్టడంతో పాటు నిరుద్యోగులకు మేలు జరుగుతోందన్న అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. అధికారబలానికి భయపడి ఈ అవినీతి తంతును విడిచిపెడతారా... లేదంటే నిజాయితీగా దర్యాప్తుచేసి అవినీతిపరులకు కళ్లెంవేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే. -
కూలిన ఆడలి వ్యూ పాయింట్ సైడ్ వాల్
సీతంపేట: నిత్యం సందర్శకులతో కళకళలాడే ఆడలి వ్యూపాయింట్ వద్ద సైడ్ వాల్ శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కుప్పకూలింది. గోడ రాళ్లు, మట్టి క్యాంటీన్కు కొద్ది దూరంలో జారిపడ్డాయి. క్యాంటీన్లో నిదిరిస్తున్న యువకులు భయాందోళనతో పరుగుతీశారు. గోడరాళ్లు క్యాంటీన్పై పడితే ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు. టికెట్లు ఇచ్చే గేటు నుంచి పైకి వెళ్లే మార్గంలో గోడ ఉంది. అక్కడ నుంచి మరికొద్ది దూరంలో కిందన క్యాంటీన్, ఇంకాస్త కిందన వ్యూపాయింట్ ఉంది. ప్రస్తుతం కూలినగోడ వద్ద నుంచి నిల్చుని చూస్తే వ్యూపాయింట్ కనిపిస్తుంది. అదృష్టవశాత్తు రాత్రి సమయం కావడం, పర్యాటకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరిగాయి. నాణ్యతలోపం వల్లే సైడ్వాల్ కూలిందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆడలికి వెళ్లే మార్గంలో ద్విచక్రవాహనాలు, ఆటోలతో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. త్రుటిలో తప్పిన ప్రమాదం భారీ వర్షానికి క్యాంటీన్పై జారిపడిన రాళ్లు నాణ్యతాలోపమే కారణమా? -
వీఆర్ఏల వేతనాలు పెంచాలి
● 18న ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ధర్నాకు పిలుపు విజయనగరం గంటస్తంభం: వీఆర్ఏల వేతనాలు పెంచాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి డిమాండ్ చేశారు. ఏన్పీఆర్ శ్రామిక భవన్ సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బి.సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్మి ఎ.జగన్మోహన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత ఎనిమిదేళ్లుగా వీఆర్ఏలకు జీతాలు పెంచకపోవడం దారుణమన్నారు. వీఆర్ఏలను రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని, అర్హులైన వారికి నాలుగో తరగతి ఉద్యోగులుగా పదోన్నతులు ఇవ్వాలని, జాబ్ చార్ట్లో లేని పనుల నుంచి వీఆర్ఏలను మినహాయించాలని, 010 జీఓ కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న ఉదయం 10 గంటలకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీఆర్ఏ జిల్లా సంఘం నాయకులు రాంబాబు, రమణ, లక్ష్మణరావు, చంద్రరావు, రమణ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
10న జిల్లా స్థాయి యోగా పోటీలు
విజయనగరం అర్బన్: జిల్లా స్థాయి యోగా పోటీలను ఈ నెల 10న స్థానిక మెసానిక్ టెంపుల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మజ్జి శశిభూషణరావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. పోటీల షెడ్యూల్ బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. జిల్లాలో ప్రతిభ చూపిన విజేతలు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతారని పేర్కొన్నారు. పోటీలు 10 నియోజకవర్గాల్లో, 10 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళల కేటగిరిల్లో ఉంటాయని తెలిపారు. పోటీలు ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల పూర్తి వివరాల కోసం ఫోన్ 7702134568నంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వడ్లమాని నరసింహమూర్తి, కోశాధికారి పి.సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ డి.శివ తదితరులు ఉన్నారు. -
టిడ్కో గృహాలకు గ్రహణం
● కూటమి పాలనలో ముందుకు సాగని ఇళ్ల నిర్మాణం ● రాజన్నదొర కృషితో సాలూరులో తొలిసారిగా.. టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలుసాలూరు: గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో సొంత ఇల్లు అంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చాలా కష్టమైన పని. అటువంటి పేదవాడి సొంతింటి కలను సాలూరు పట్టణంలో సాకారం చేసిన అంశంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెరగని ముద్ర వేసుకున్నారు. ఓ వైపు టిడ్కో ఇళ్లతో పాటు మరోవైపు నెలిపర్తి, గుమడాం తదితర ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు మంజూరు చేయించి పేదవాడికి సొంత గూడుకు తనవంతు భగీరథ ప్రయత్నం చేశారు. గతం ఘనం–నేడు దైన్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో శరవేగంగా జరిగిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు తుది దశ మౌలిక వసతుల పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమలు కావడంతో పనులు నిలిచిపోయాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో టిడ్కో గృహాల నిర్మాణాల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోందని ప్రజలు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పాలనలో టిడ్కో గృహాల నిర్మాణాలపై పాలకులు, అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేకపోవడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఉమ్మడి విజయనగరంలో జిల్లాలోనే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందించి గృహప్రవేశాలు జరిగింది సాలూరు నియోజకవర్గంలోనే కావడం విశేషం. రూ.82.85 కోట్లతో ఇళ్ల నిర్మాణం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు రూ.82.85 కోట్లతో పూర్తయ్యాయి. ఇందులో 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వంలో పునాదులు అంతకన్నా తక్కువ దశలో నిర్మాణాలు చేసి వదిలేయగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.70.28 కోట్లు ఖర్చు పెట్టి ఇళ్లతో పాటు మౌలిక వసతులు కల్పించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా కేవలం పునాదులు అంతకంటే తక్కువ స్థాయి దశలో నిర్మాణంతో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం విడిచిపెట్టిన సాలూరు టిడ్కో ఇళ్లకు గత వైఎస్సార్సిపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ జరిగింది.1 చదరపు అడుగుకు నాటి టీడీపీ ప్రభుత్వం రూ.2,200లకు టెండర్లు పిలవగా, రివర్స్ టెండరింగ్ ద్వారా గత జగన్మోహన్రెడ్డి పాలనలో రూ.1,700లకే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టారు. ఒక్కక్కరి తలపై రూ.7లక్షల అప్పు గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల లబ్ధిదారుల తలపై సుమారు రూ.7లక్షలు అప్పు పెట్టాలని చూస్తే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి సుమారు రూ.10 లక్షల విలువైన మౌలిక వసతులతో కూడిన ఇళ్లను ఉచితంగా అందించారని పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. పనులు పూర్తి చేయాలి కూటమి ప్రభుత్వంలో నేటికీ పనులు పూర్తిచేయలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉన్నాయని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దాదాపు పూర్తయిన ఈ టిడ్కో గృహాలకు మౌలిక వసతులు పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు. -
గిరిజన ప్రాంతాల్లో నాటు తుపాకీల వినియోగం
నాటు తుపాకీతో కాల్చడంతో ప్రాణాలు విడిచిన కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(ఫైల్)●వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన గొర్లె ఈశ్వరరావు ఇంట్లో ఇటీవల పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. నాటు తుపాకీ లభ్యమైంది. గుడివాడ గ్రామానికి చెందిన రొంగలి బంగారయ్య వద్ద రూ.4,500కు ఈ తుపాకీని కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీంతో ఇద్దరినీ ఎస్.కోట గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు.●ఇటీవల పార్వతీపురం మండలం రావికోన పంచాయతీ కొత్తవలస గ్రామంలో గ్రామీణ స్టేషన్ పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో కొర్ర సీతారాం అనే వ్యక్తి ఇంటి గడపలో నాటుతుపాకీని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.●బాడంగి మండలంలోని రావివలస, గదబవలస గ్రామాల్లో గతంలో నాటుతుపాకీతో దాడులకు పాల్పడడంతో బొబ్బిలి గ్రామీణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తుపాకుల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు.●ఈనెల 5వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిఎస్.అప్పారావు నాటు తుపాకీతో కాల్చేశాడు. దీంతో సిమ్మ అప్పారావు అక్కడికక్కడే మరణించాడు. ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా వివాదం ఉంది. ఆ కోపంతోనే కాల్పులు జరిగాయి.●గత నెల 28న ఎస్.కోట మండలం మూలబొడ్డవర గిరిజన పంచాయతీ శివారు చిట్టెంపాడు గిరిజన గ్రామానికి చెందిన సీదిరి రామును అదే గ్రామానికి చెందిన నాగరాజు నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ హత్య చోటు చేసుకుంది.●కొన్నాళ్ల కిందట ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ పరిధి అడ్డతీగ గిరిజన గ్రామం వద్ద నాటు తుపాకీతో అడవిపందిని చంపే ప్రయత్నంలో తూటా తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. బాడంగి: మండలంలోని అల్లవానివలస పంచా యతీ శివారు గ్రామమైన రావివలసలో నాటు తుపాకీలున్నాయన్న సమాచారంతో బొబ్బిలి రూర ల్ సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో పోటీలసు లు శుక్రవారం ఇంటింటా సోదాలు జరిపారు. గతంలో రావివలసలోని ఎస్.టి.దొర లు, ఎరుకలవారు అడవిమృగాల నుంచి రక్షణ కోసం నాటు తు పాకులు వినియోగించేవారు. ఆ మేరకు గ్రామంలో సోదాలు చేశారు. అయితే, పోలీసులకు ఎలాంటి నాటుతుపాకీలు దొరకలేదు. గ్రామస్తులకు నాటుతుపాకీ కలిగి ఉండడం వల్ల కలిగే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్య లపై సీఐ అవగాహన కల్పించారు. ఈ సోదాలో సీఐతో పాటు బాడంగి, తెర్లాం, రామభద్రపురం ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.\సాక్షి, పార్వతీపురం మన్యం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాటు తుపాకీల వినియోగం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వాటితో ప్రత్యర్థుల ప్రాణాలు తీస్తుండడం సామాన్య ప్రజానీకంతో పాటు పోలీస్ వర్గాలను కలవరపెడుతోంది. గతంలో పంటలను కాపాడుకోవడానికి.. అడవి జంతువుల నుంచి రక్షణకు ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు వీటిని అనధికారికంగా వాడేవారు. కొన్నాళ్లుగా వీటి జాడ లేదు అనుకుంటున్న సమయంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు నాటు తుపాకీ కాల్పులకు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. అనుమతులు లేకుండా వీటిని వాడడం చట్ట విరుద్ధం అయినప్పటికీ.. కొందరు చట్టాన్ని విస్మరిస్తున్నారు.నాడు రక్షణకు.. నేడు ప్రతీకారానికి!విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో అడవి పందుల నుంచి పంటలను కాపాడుకోవడానికి.. వాటిని వేటాడేందుకు నాటు తుపాకులు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కొన్ని మైదాన ప్రాంతాల్లో కూడా ఇవి లభ్యమవుతుండడం గమనార్హం. గంజాయి, సారా తరలింపు సమయంలో వన్య ప్రాణుల నుంచి రక్షణ కోసం నాటు తుపాకులను వెంట ఉంచుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు అక్రమ వ్యాపారానికి ఎవరూ అడ్డు రాకుండా ఆయుధాలను కూడా సమకూర్చుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు పచ్చని పల్లెల్లో పగలు, ప్రతీకారాలకు వీటిని వాడుతుండడం ఆందోళన కలిగించే అంశం. మందుగుండుకు ఉపయోగించే సామగ్రిని తుపాకీ గుళ్లుగా వాడుతున్నారు. తయారీలో సీసా పెంకులు, ఇతర పేలుడు పదార్థాలను వినియోగిస్తుండటం వల్ల మనిషికి తగిలిన వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు.ఎన్నికల సమయంలోనే స్వాధీనంప్రస్తుతం అధికారులు నాటు తుపాకీలకు అనుమతులు ఇవ్వడం మానేశారు. సార్వత్రిక, స్థానిక ఎన్నికల సమయంలో లైసెన్సుడు తుపాకీలను పోలీస్ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఆ సమయంలో నాటు తుపాకీల మీద కూడా నిఘా ఉంచేది. తాజా గా జరుగుతున్న కాల్పులతో పోలీసు శాఖ ఉలిక్కి పడింది.రెండు జిల్లాల్లో ముమ్మరంగా కార్డన్ సెర్చ్నాటు తుపాకులు, గంజాయి, సారా కట్టడికి అటు విజయనగరం, ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఎస్.కోట, వేపాడ, బాడంగి, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. వేపాడ, పార్వతీపురం ప్రాంతాల్లో కొన్ని చోట్ల అనధికారికంగా కలిగి ఉన్న నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.స్వచ్ఛందంగా అప్పగించాలి..నాటు తుపాకుల ఏరివేత, సారా, గంజాయి కట్టడి లక్ష్యంగా గుర్తించిన ఏజెన్సీ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. నాటు తుపాకులు కలిగి ఉండడం, వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గిరిజనులకు అవగాహన కల్పించాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశించాం. తుపాకులు కలిగి ఉండడం ఇండియన్ ఆర్మీ యాక్టు ప్రకారం తీవ్రమైన నేరం. ఎవరి వద్దనైనా ఉన్నట్లయితే స్వచ్ఛందంగా అప్పగించాలి.– వకుల్ జిందల్/ఎస్.వి.మాధవ్ రెడ్డి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు -
సర్వజన ఆస్పత్రిలో ఫార్మసిస్టుల కొరత..!
● ఏడాదిన్నరగా పోస్టులు ఖాళీ ● భర్తీ చేయని ప్రభుత్వం ● ప్రస్తుతం ఉన్నది 10 మంది ● మరో 15 మంది అవసరంవిజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫార్మసిస్టులు (ఫార్మసీ ఆఫీసర్లు) పూర్తిస్థాయిలో లేక పోవడంతో రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్న వారిపైనే అధిక భారం పడుతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఆస్పత్రి నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారిన నేపథ్యంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పెరిగాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగింది. రోగులకు చికిత్స అందించే వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం ఫార్మసిస్టులకు ఉంది. వైద్యులు రాసి ఇచ్చిన మందులు అందించేంది ఫార్మసిస్టులే. అయితే వారి సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. రోగుల సంఖ్యకు తగ్గట్టు ఫార్మసిస్టులను నియమించడంలో కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరగా భర్తీ కాని ఖాళీలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 11 మంది ఫార్మసిస్టులు ఉండేవారు. వారిలో ఒకరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఏడాదిన్నరగా అపోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. మరో 15మంది అవసరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుతం 10 మంది ఫార్మసిస్టులు ఉన్నారు. ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి ఇంకా 15 మంది వరకు ఫార్మసిస్టులు అవసరం. జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి 500 నుంచి 600 వరకు ఓపీ వచ్చేది. ఇప్పడు 1200 నుంచి 1400 వరకు ఓపీ వస్తోంది. 24 గంటల పాటు ఫార్మసిస్టులు సేవలు అందించాల్సి ఉంటుంది. మూడు షిఫ్టుల్లో ఫార్మసిస్టులు సేవలు అందిస్తారు. సర్వజన ఆస్పత్రిలో ఓపీ వివరాలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎన్సీడీ, ఈఎన్టీ, డెంటల్, పలమనాలజీ, న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, ఎముకలు, చర్మ, మానసిక, ఏఆర్టీ, అంకాలజీ, కంటి విభాగాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో వెకెన్సీ ద్వారా పోస్టుల భర్తీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోస్టులను ఎప్పటికప్పడు భర్తీ చేశారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో 50 వేలకు పైగా పోస్టుల భర్తీ జరిగింది. పీహెచ్సీ నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ఏ ఆస్పత్రిలో నైనా పోస్టు ఖాళీ అయితే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేవారు. కాని ఇప్పడా పరిస్థితి లేదు. పోస్టు ఖాళీ అయితే ఏడాదిన్నర అయినా భర్తీ చేసిన దాఖలాలు లేవు. -
గురువు బాధ్యత..
విద్యార్ధికి జీవితాన్ని నేర్పించేది గురువే. పోటీ ప్రపంచంలో గట్టెక్కేవాడు విజేత.ఆ దిశగా విద్యార్ధిని తీర్చిదిద్దడంలో గురువుదే బాధ్యత.మూస పద్ధతిలో కాకుండా సబ్జెక్టులతో పాటు సమాజం గురించి వినూత్న రీతిలో బోధించాలి.ప్రతి విద్యార్ధిపైనా దృష్టిపెట్టాలి.సమకాలీన ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని వారు ఔపోసన పట్టాలి.వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవితకు దిక్సూచి కాగలరు. –యు మాణిక్యంనాయుడు, డిఈవో, విజయనగరం● -
పాత గుణానపురంలో గజరాజులు
కొమరాడ: మండలంలోని పాతగుణానపురం పరిసరాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు శుక్రవా రం సంచరించింది. కళ్లికోట, దుగ్గి, గుణానపు రం గ్రామాల్లో కూరగాయల పంటలుచేతికందే వేళ ఏనుగుల సంచారంతో పంట నష్టం జరు గుతోందంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. గజరాజులు తరలించేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు. దుగ్గి, గుణానపురం, కళ్లికోట రోడ్డుపైకి ఏనుగులు వచ్చే అవకాశం ఉందని, రాత్రిపూట ఎవరూ ప్రయాణించరాదని అటవీశాఖ సిబ్బంది సూచించారు. కొటియాలో పర్యటించిన ఒడిశా డిప్యూటీ సీఎం సాలూరు: వివాదాస్పద ఆంధ్రా–ఒడిశా సరిహద్దు కొటియా గ్రామంలో ఒడిశా రాష్ట్ర డిప్యూటీ సీఎం, సీ్త్ర శిశు, టూరిజం శాఖల మంత్రి పార్వ తిపరిద శుక్రవారం పర్యటించారు. ప్రగతి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. విద్య, గిరిజనాభివృద్ధి, తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఒడిశా రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
6 తులాల బంగారు ఆభరణాల అప్పగింత
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేష్న్ క్రైమ్ పార్టీ సిబ్బంది ఫిర్యాదు అందిన కొద్ది గంటల వ్యవధిలోనే పోయిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి శుక్రవారం అప్పగించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలోని కామాక్షి నగర్ కు చెందిన పిల్ల పద్మ సొంత పని నిమిత్తం ఈనెల 7న సాయంత్రం కామాక్షినగర్ వద్ద ఆటో ఎక్కి నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద దిగింది. ఆటోలో బ్యాగు మర్చిపోయినట్లు గుర్తించి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆదేశాలతో స్టేషన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, సిబ్బంది శ్రీను, రమణలు ఆటోను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ట్రేస్ చేశారు. ఆటో వెనక సీటు భాగంలో బ్యాగ్ ను గుర్తించడంతో పాటు అందులో ఆరు తులాల బంగారు ఆభరణాలను ఫిర్యాదురాలైన పిల్ల పద్మకు అప్పగించారు. బ్యాగును, విలువైన బంగారు ఆభరణాలను అప్పగించడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్పై సురేంద్ర నాయుడు, సిబ్బందిని సీఐ చౌదరి అభినందించారు. -
బీసీలపై టీడీపీ గూండాగిరి
పార్వతీపురం రూరల్: టీడీపీ మూకలు బీసీలపై గూండాగిరి చేయడంపై బీసీ నాయకులు మండిపడ్డారు. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని ఖండించారు. దీనికి నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఎస్ఎన్పీ కాలనీ వద్ద ఉన్న మహత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. అనంతరం జ్యోతిబాపూలే విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, జిల్లాలో ఉన్న బీసీ అనుబంధ విభాగాల నాయకులు మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగవిరుద్ధ పాలన సాగిస్తున్నారన్నారు. పులివెందులలో ఓటమి భయంతో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఓటర్లను భయపెట్టేందుకు దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ గూండాలు కిరాతకంగా వ్యవహరిస్తూ చట్టసభల్లో ఉన్న నాయకులపై రాక్షసత్వంగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకులపై గత 14 నెలల్లో చంద్రబాబు హయాంలో అనేక దాడులు జరిగాయని, రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకు చూస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు బహిరంగంగా ఈ దాడికి సంబంధించి బీసీలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు మాధవరావు, వైఎస్సార్సీపీ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, పాత గౌరీశంకరరావు, బొమ్మి రమేష్, నాగేశ్వరరావు, కాగాన ప్రకాష్, దేవులపల్లి నాగరాజు, కోరాడ శేఖర్, కోల సుధాకర్, షేక్ జలాల్, బడే శ్రీరాంజన్, ఏగిరెడ్డి రమణ, నేతాజీ, సుంకర అనిల్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రమేష్యాదవ్పై దాడి విచారకరం తక్షణమే టీడీపీ నేతలు బీసీలందరికీ క్షమాపణ చెప్పాలి బీసీలపై దాడిని నిరసిస్తూ జ్యోతిరావుపూలే విగ్రహానికి వినతి -
వంగర తహసీల్దార్ సస్పెన్షన్
● విచారణ అధికారిగా కేఆర్సీ ఎస్డీసీ ● ఇన్చార్జ్గా రాజాం తహసీల్దార్కు అదనపు బాధ్యతలువిజయనగరం అర్బన్/వంగర: వంగర ఇన్చార్జ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్.రమణారావుపై సస్పెన్షన్ విధిస్తూ కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమణారావు విధి నిర్వహణలో ఉండగా కార్యాలయంలోనే మద్యం తాగినట్లు వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో కలెక్టర్ ఈ ఆదేశాలను జారీ చేశారు. వంగర మండలానికి ఇన్చార్జ్ తహసీల్దార్గా రాజాం తహసీల్దార్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. అదే విధంగా ఈ వ్యవహారంపై విచారణాధికారిగా కేఆర్సీ ఎస్డీసీ మురళిని నియమిస్తూ ఆదేశాల్లో కలెక్టర్ పేర్కొన్నారు. రహదారి భద్రతకు ప్రత్యేక డ్రైవ్● ఎస్పీ వకుల్ జిందల్ విజయనగరం క్రైమ్: రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకుని, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్జిందల్ శుక్రవారం తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధారణ, బ్లాక్ స్పాట్స్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేసేందుకు, ఈ చలానాలు విధించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో రహదారి భద్రతకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. -
ఉచిత బియ్యానికి రూ.200 ఖర్చు
చిత్రంలో జీపు దిగి వస్తున్నవారంతా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాల గిరిజనులు. రేషన్ తీసుకోవాలంటే కొండలపై నుంచి దిగి దండిగాం, నేరళ్లవలస, కురుకూటి డిపోలకు రావాల్సిందే. దీనికోసం ప్రయాణ ఖర్చుల కింద రూ.100, బియ్యం మూటకు రూ.100 చెల్లిస్తున్నట్టు లబ్ధిదారులు వాపోయారు. ఎండీయూ వాహనాలతో సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం రద్దుచేయడంతో డిపోల్లో ఇచ్చే ఉచి త బియ్యం తీసుకెళ్లేందుకు ప్రతినెలా రూ.200 ఖర్చు అవుతోందని, ఒక రోజంతా పనిపోతోందని వాపోయారు. – సాలూరు రూరల్ -
అమ్మ పాత్ర..
వ్యక్తిత్వ నిర్మాణంలో అమ్మపాత్ర కీలకం.ఉదయమే నిద్రలేపడం,పిల్లలకు ఇస్టమైన మెనూ సిద్ధం చేయడం,పుస్తకాలు సర్ధి పాఠశాలకు పంపడం వరకు క్షణం తీరికలేనిది.ఇది రొటీన్గా మారకుండా చిన్నారుల్ని చదువులో మమేకం చేసేందుకు వీలున్న అంశాలపై తల్లులు అవగాహన పెంచుకోవాలి.పాఠశాల నిబంధనలు మేరకు పెన్సిళ్లు,పెన్నులు,స్కేళ్లు రబ్బర్లు చూడడానికి ఇవి చిన్నవే అన్నట్లు కనిపిస్తాయి.ఇందులో ఏ ఒక్కటి లేకున్నా తరగతి గదిలో పిల్లలు ఇబ్బంది పడక తప్పదు. వాటిని తప్పకుండా బ్యాగులో ఉంచాలి.ఉన్నత తరగతికి వెళ్తున్నారు కదా అని సరిపెట్టుకోకుండా పాత పుస్తకాల్లోని అంశాలను పిల్లల చేత ఒకసారి పునశ్చరణ చేయించాలి. – ఎం.దీప, కేజీబీవీ ప్రిన్సిపాల్, బూసాయవలస ● -
రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమ గ్రావెల్
పూసపాటిరేగ: రియల్ ఎస్టేట్ యజమానులు తమ వెంచర్లకు అనుమతిలేని అక్రమ క్వారీయింగ్ గ్రావెల్ను యథేచ్ఛగా తరలిస్తున్నారు. లక్షలాది రుపాయిలు విలువ చేసిన భూగర్భ ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోంది. నిత్యం వందలాది ట్రాక్టర్లు గ్రావెల్ను అనుమతి లేకుండా తవ్వకాలు చేసి తరలిస్తున్న సంఘటన కొల్లయివలస రెవెన్యూ పరిధిలో కొండను ఆనుకొని జరుగుతోంది. కొండను ఆనుకొని విలువైన గ్రావెల్ నిత్యం తరలించుకుపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, నూతనంగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు ఇక్కడ నుంచే గ్రావెల్ను తరలిస్తున్నారు. భారీ స్థాయిలో గ్రావెల్ తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సంబంధిత భూగర్భ గనుల శాఖ అధికారులు వున్నారా.. లేరా.. అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. భూగర్భ గనుల శాఖ అధికారులకు అక్రమ క్వారీయింగ్పై ఎవరైనా ఫిర్యాదు చేసినా సంబంధిత అక్రమార్కులకు క్షణాలలో సమాచారం వెళ్తుందనే ఆరోపణలు వున్నాయి. ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. ప్రభుత్వ సహజ వనరులును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై వుంది. కానీ ఇక్కడ మాత్రం వింత పరిస్థితి నెలకొంది. గత కొంత కాలంగా కొల్లాయివలస కొండ నుంచి గుంపాం సమీపంలో రియల్ వెంచర్కు దర్జాగా గ్రావెల్ అనుమతి లేకుండానే తరలిపోతుంది. అక్రమ క్వారీయింగ్ దందా జరుగుతున్నా సంబంధిత అధికారుల కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకొని సహజ వనరులను కాపాడాలని సామాజిక వేత్తలు, ప్రజలు కోరుతున్నారు. -
ఆదివాసీల జీవనోపాధికి సమష్టిగా కృషిచేద్దాం
పార్వతీపురం: ఆదివాసీల జీవనోపాధికి సమష్టిగా కృషిచేద్దామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీడీఏలోని ఆదితల్లి విగ్రహానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా తొలిపూజ చేశారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ అడవితల్లికి సారెను సమర్పించారు. గిరిజన సంఘాల నాయకులు, అధికారులతో కలిసి జలాభిషేకం, పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు జరిపారు. డప్పువాయిద్యాల సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మనమంతా భూమాత బిడ్డలమనే భావన కలుగుతుందన్నారు. గిరిజనుల జీవనం ప్రకృతితో కొనసాగుతుందన్నారు. పీఓ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ గిరిజన పూజలు, నృత్యాలు, వారి కట్టు, బొట్టు అంతా చరిత్రను గుర్తుచేసేలా ఉంటుందన్నారు. కలెక్టర్, పీఓలు గిరిజనులతో కలిసి డప్పువాయిస్తూ నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఏపీఓ ఎ.మురళీధర్, డీడీ కృష్ణవేణి, డీఐఓ డాక్టర్ పి.జగన్మోహన్రావు, గిరిజన సంఘం నాయకులు పి.రంజిత్కుమార్, పి.సురేష్, ఎ.చంద్రశేఖర్, ఐ.రామకృష్ణ, బి.తమ్మయ్య, డి.సీతారాం, మంచాల పారమ్మ, కోలక గౌరమ్మ, బి.గౌరీశంకరరావు, ఆర్.లోవరాజు, ఎ.విప్లవకుమార్, జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం జిల్లాలో ప్రపంచ ఆదివాసి దినోత్సవంను శనివారం ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాంగణం, సీతంపేటలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. ● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం
● చూడముచ్చటగా కట్టూబొట్టు, ఆచారాలు ● కొండపోడే ఆధారంగా జీవనం ● మౌలికవసతులు అంతంతమాత్రమే ● ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు సీతంపేట: నవ్యసమాజానికి దూరంగా కొండకోనల్లో జీవనం సాగించే వారే గిరిపుత్రులు. కొండకోనల్లో ప్రత్యేక భాష, సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఆదివాసీల జీవనం వైవిధ్యంగా సాగుతోంది. కాయకష్టం చేసి జీవించడం వారి జీవన విధానం. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు గిరిజనుల సొంతం. కొండల్లో తమ సంప్రదాయ వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనుల ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టుల్లో మార్పులేదు. అటవీఉత్పత్తుల సేకరణ, పోడుపంటలు, వ్యవసాయ పంటల దిగుబడులు వచ్చినప్పుడు గిరిజనులు ప్రత్యేక పండగలు జరుపుకోవడం ఆనవాయితీ. విభిన్నం–వైవిధ్యం.. సంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎంతో వైవిధ్యం కనబరిచే గిరిజనులు అటవీ సంస్కృతికి ప్రతీకలు. ఘన చరిత్రకు వారసులు. వారి ఆధ్యాత్మిక చింతన వినూత్నం.వారి కట్టూ బొట్టూ చూడముచ్చటగా ఉంటాయి. తెల్లారితే కొండపోడు వ్యవసాయం, అటవీఉత్పత్తుల సేకరణతోనే వారి జీవనం సాగుతుంది. ప్రతి మూడు నెలలకు ఒక్కో అటవీ ఉత్పత్తుల సీజన్ ఆరంభమవుతుంది. పైనాపిల్, సీతాఫలం, పసుపు, జీడి, కందులు, నిమ్మ, బత్తాయి, పెండలం ఇలా అటవీ ఉత్పత్తులతోనే వారి జీవనం ముడిపడి ఉంది. వారం వారం జరిగే వారపు సంతలకు వెళ్లి వారి ఉత్పత్తులు విక్రయించి వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుంటారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 819 కిలోమీటర్ల మేర ఏజెన్సీ విస్తరించి ఉంది. 42 వేల 246 గిరిజన కుటుంబాల్లో 2లక్షల 62వేల మంది కుటుంబ సభ్యులున్నారు. మొత్తం 1187 గిరిజన గూడలుండగా వాటిలో ఆదిమ గిరిజనులు నివసించే గూడలు 467 ఉన్నాయి. గిరిజనుల్లో ప్రధానంగా కొండ సవర, జాతాపు, కాపు సవర తెగలున్నాయి. వివాహాలు, పండగలు, వ్యవసాయం తదితర సందర్భాల్లో ప్రత్యేక పండగలు నిర్వహించుకోవడం ఎంతో వైవిధ్యం. భార్యకు కట్నం ఇచ్చి వివాహం చేసుకునే ‘మొగనాలి’ ఇప్పటికీ కొన్ని చోట్ల అమల్లో ఉంది. అభివృద్ధికి ఆమడదూరంలో.. మన్యంలో గిరిజనుల అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. గిరిజనులకు మౌలికవసతులు లేక అల్లాడుతున్నారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు చాలా గ్రామాలకు లేవు. రక్షిత మంచీనీటి వ్యవస్థ అందుబాటులో లేదు. అనాదిగా గిరిజనులు ప్రకృతి ఆధారంగానే జీవన మనుగడ సాగిస్తున్నారు. సుమారు 120కి పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం ఇప్పటికీ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతంతమాత్రంగా వైద్యసేవలుఎపిడమిక్ సీజన్లో ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తుంది. పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటి వరకు దోమతెరల పంపిణీ లేదు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్యసేవల కోసం ఇంతవరకు హెల్త్ వలంటీర్లను నియమించలేదు. పాఠశాలల్లో కనీస మౌలికవసతులైన మరుగుదొడ్లు, అదనపు తరగతుల గదుల సమస్యలు వేధిస్తున్నాయి. గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. అన్ని అటవీ ఉత్పత్తులు జీసీసీ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రేషన్ కొండలపైకి మోసుకుని తీసుకువెళ్తూ గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.అక్షరాలే ఆరాధ్యదేవతలు–లిపివారిప్రాణం.. శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మరో వైవిధ్యముంది. ఇక్కడ అక్షరాలను ఆరాధ్యదేవతలుగా గిరిజనులు పూజిస్తారు. ఏ దేవతకై నా పూజలు చేసినా నైవేద్యంగా సారా పెట్టి పూజ అనంతరం పూటుగా తాగుతారు. జీలుగు సారా వంటివి చెట్టునుంచి దించితే ముందుగా తెడ్డులతో సేవిస్తారు. వారి పండగలు, సంప్రదాయాలను బొమ్మల రూపంలో వేయడంలో వారికి వీరేసాటి. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. అక్కడి గిరిజనులు ప్రతి గురువారం పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆగం పండగ వంటివి చేస్తుంటారు. సవర లిపి ద్వారా కొంతమంది ఆదిమ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వారు వేసే లిపికి మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు.ఆదివాసీ దినోత్సవం నిర్వహణ ఎందుకంటే.. ఆదివాసీల జీవన స్థితిగతులను ప్రపంచానికి తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి 1194 ఆగస్టు 9న జెనీవాలో ప్రపంచ ఆదివాసీ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్ ఆదివాసీలపై అధ్యయనం చేసి ప్రపంచ దేశాల్లో ఆదివాసీల సమస్యలన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయని గుర్తించింది. దీంతో ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని యూఎన్వో ప్రకటించింది.కొండపోడే ఆధారం.. పోడు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా కుటుంబాలతో ఆనందంగా జీవిస్తారు. భూ ఉపరితలానికి అత్యంత ఎత్తైన భాగంలో గూడల్లో నివసిస్తూ భయమంటే తెలియదన్నట్లు క్రూరమృగాల నడుమ, విష సర్పాల పడగ నీడలో సాహస జీవితం గడుపుతుంటారు. జిల్లాలోని అటవీ ప్రాంతమంతా ప్రకృతి సోయగాలతో అలరారుతుంది. -
ముర్రుపాలు అమూల్యం
విజయనగరం ఫోర్ట్: బిడ్డ పుట్టిన ఐదు నిమషాల లోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఆ పాలలో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని, అవి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళకు దీని గురించి వివరించాలన్నారు. మహిళలు బిడ్డకు పాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, కలెక్టరేట్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్నట్లయితే వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ తల్లి కావడమే గొప్ప అదృష్టమన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే పాలు అందించడం తల్లి బిడ్డలిద్దరికీ శ్రేయస్కరమన్నారు. ఆ తర్వాత గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ 5వ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ శాంతికుమారి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎల్ఓ డాక్టర్ రాణి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి అన్నపూర్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి శ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, నేచర్ సంస్థ డైరెక్టర్ వికాస్ బాలరాజ్, ఘోషా ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
సహాయక చర్యలందక వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట పరిధిలో బుధవారం ప్రమాదవశాత్తు కింద పడిపోయిన వ్యక్తికి సకాలంలో సహాయక చర్యలందకపోవడంతో మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నాయుడువలస పంచాయతీ మధుర గ్రామం కొండపాలవలసకు చెందిన లెంక ధనుంజయ(33)ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. రోజులాగానే బుధవారం కూడా ట్రాక్టర్ తోలడానికి వెళ్లిపోయి అదే మండలం ఆరికతోట గ్రామ పొలంలో మొక్కజొన్న కంకులు రెండు లోడులు పెరిగాడు. మూడో లోడుకు వెళ్లకుండా పొలంలో ట్రాక్టర్ వదిలేసి చెట్ల నీడకు వెళ్దామన్న ఉద్దేశంతో అక్కడికి కొద్ది దూరంలో ఉన్న నీలగిరి తోటలోకి వెళ్తుండగా తోటలో గతంలో నరికిన చెట్ల మొదళ్లు తన్నుకుని కంకర రోడ్డులో బోర్లా పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పాటు ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో వెంటనే సహాయక చర్యలందక మృతిచెందాడు. బుధవారం రాత్రికి కూడా ధనుంజయ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. మద్యం తాగే అలవాటు ఉన్నోడు కదా ఏదో టైమ్లో ఇంటికి వచ్చేస్తాడులే అన్న ఉద్దేశంతో అలా వదిలేశారు. ట్రాక్టర్ ఓనర్ కూడా వెతికి తన ట్రాక్టర్ను తీసుకెళ్లిపోయాడు. గురువారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ట్రాక్టర్ వదిలేసిన పరిసరాల్లో మళ్లీ వెతికారు. అయినా కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్న సమయంలో ఆరికతోట గ్రామానికి చెందిన ఓ రైతు గడ్డిమోపు పట్టుకుని కనిపించి నీలగిరి తోటలో ఎవరో పడి ఉన్నారని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి అప్పటికే మృతిచెంది ఉన్న ధనంజయను చూసి అవాక్కయ్యారు. బోర్లా పడి ఉన్న మృతదేహం ముఖంపై రక్తం మరకలు ఉండడం చూసి ఎలా మృతి చెంది ఉంటాడు? ఎవరైనా చంపి పడేశారా? మృతుడికి ఎవరూ శత్రువులు లేరే అని అలోచించి అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై వి. ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ను రప్పించి సాధారణ మృతా? లేక హత్యా? అని పరిశీలించి సాధారణ మృతిగా నిర్ధారించారు.కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య గౌరీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య గౌరీశ్వరి, పాప, బాబు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వెంపడాం విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని వెంపడాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 3 వతేదీన విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల ఎంపికలలో పాఠశాలకు చెందిన పి.వెంకటలక్ష్మి (లాంగ్జంప్), వి.కల్యాణి (హైజంప్), పి.శ్రీను (100 మీటర్లు, 200 మీటర్లు రన్నింగ్)లు ఎంపికయ్యారు. దీంతో ఈనెల 9,10 తేదీలలో రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా చీరాలలో జరగబోయే అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో పాఠశాల హెచ్ఎం పి.లచ్చన్న, పీడీ గణేష్కుమార్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. జాతీయ పోటీల్లో దివ్యాంగ విజేతకు అభినందనలువిజయనగరం అర్బన్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో మేధోవైకల్యం గల ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇటీవల జరిగిన జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ బేస్బాల్లో కాంస్యపతక విజేత అయిన తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తోషినిని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు అభినందించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయాలకు వచ్చి అధికారులను తోషిని కలిసింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సాధారణ విద్యార్థుల మాదిరిగానే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కూడా ప్రతిభ చూపడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అనంతరం విజేతను, కోచ్లుగా వ్యవహరించిన పి.సునీల్, ఎస్.బంగారునాయుడిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి, తెర్లాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎస్ఎం రమేష్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాటుతుపాకీతో ఇద్దరి అరెస్ట్వేపాడ: మండలంలోని సోంపురం గ్రామంలో నాటుతుపాకీ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీ చేయడంతో నాటుతుపాకీ పట్టుబడినట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. సోంపురం గ్రామానికి చెందిన గొర్లె ఈశ్వర్రావు ఇంటిలో తనిఖీలు నిర్వహించగా నాటుతుపాకీ పట్టుబడినట్లు చెప్పారు. తుపాకీపై ఆరాతీయడంతో గుడివాడ గ్రామానికి చెందిన రొంగలి బంగారయ్య వద్ద రూ.4500కు కొనుగోలు చేసినట్లు ఈశ్వర్రావు తెలిపాడని చెప్పారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులులేకుండా తుపాకీ కలిగి ఉన్నందున ఈశ్వర్రావును, నాటు తుపాకీ అమ్మడం చట్ట రీత్యా నేరమైనందున విక్రయించిన బంగారయ్యను ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు. ఆర్టీసీ డార్మిటరీలో వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం ఆర్టీసీ డార్మిటరీలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై వన్ టౌన్ పోలీసులకు గురువారం అందిన ఫిర్యాదు మేరకు స్టేషన్ హెచ్సీ ఆవాల రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా తగరపు వలసకు చెందిన సబ్బిశెట్టి కృష్ణమూర్తి(54) శశికాలేజీలో కుక్గా పని చేస్తున్నాడు. మందుల కోసం విజయనగరం వచ్చి రాత్రి కావడంతో ఆర్టీసీ డార్మిటరీలో రూమ్ తీసుకుని ఉండిపోయాడు. నిద్ర సమయంలోనే గుండె పోటు రావడంతో మృతి చెంది ఉండవచ్చని మృతుడి అల్లుడు మక్కడపల్లి శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి
● రహదారులపై అక్రమణలు తొలగించాలి ● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్విజయనగరం అర్బన్: రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రహదారులపై అక్రమణలు తొలగించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రహదారిపై ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలు తీసుకోవడమే కాకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. రహదారులు, జంక్షన్లు, బ్లాక్ స్పాట్స్, పాఠశాలల వద్ద ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఐఆర్ఏడీ యాప్లో రోడ్డు ప్రమాద వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఐఆర్ఏడీ యాప్పై అన్ని శాఖల అవగాహన కోసం జూమ్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. రోడ్లు భవనాలు, పోలీసు, రవాణా, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త బృందాలు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత సమావేశం నుంచి ఇప్పటివరకు పెండింగ్ ఉన్న కేసులను తక్షణమే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.కాంతిమతి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఎంవీఐ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
శాఖాపరంగా సిబ్బంది సమస్యల పరిష్కారం
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కార్యాలయంలో జూమ్ సమావేశం ద్వారా పోలీస్ వెల్ఫేర్డే (గ్రీవెన్స్డే)కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు పోలీస్శాఖ ప్రధాన కార్యాలయాలు, స్టేషన్ల అధికారులతో ఒక్కొక్కరి జూమ్ సమావేశం ద్వారా సమస్యలను తెలుసుకుని వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని త్వరితగతిన పరి ష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీ సీఐ రంగనాథం, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రమేష్, ఏఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఏఓ సతీష్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, శంకరరావు, సీసీ సంతోష్, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
అర్ధరాత్రి ఈదురుగాలులు
● విద్యుత్ వైర్లపై పడిన చెట్టుకొమ్మలువీరఘట్టం: మండల వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి భారీగా ఈదురుగాలులు వీచాయి. అయితే వర్షం పడుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఈదురుగాలుల ధాటికి స్థానిక దుర్గగుడి సమీపంలో ఉన్న ఓ భారీ వృక్షం చెట్టుకొమ్మలు బుధవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో విరిగి పడ్డాయి.ఈ చెట్టుకొమ్మలు విరిగి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ వైర్లు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి.రెండు విద్యుత్ స్తంభాలు పాక్షికంగా వాలిపోయాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.వెంటనే ఏఈ అనిల్కుమార్, లైన్మెన్ సింహాచలం, రవి, పవన్, సురేష్లు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం చెట్టు కొమ్మలు తొలగించి వీరఘట్టం మండలకేంద్రానికి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే చెట్టుకొమ్మలు పడడంతో విద్యుత్ వైర్లు తెగిపడి వాటి పరిధిలో ఉన్న పోలీసుస్టేషన్, కొత్త బస్టాండ్, దుర్గపేట, మెయిన్రోడ్డులో కొన్ని గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి రెండు కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వైర్లు సరిచేసి గురువారం సాయంత్రం 5 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వీరఘట్టం టౌన్కు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
జిల్లాకు 2,13,000 ఆల్బెండజోల్ మాత్రల సరఫరా
పార్వతీపురం టౌన్: జిల్లాకు 2,13,000 ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 1,96,612 మంది అంగన్వాడీ, పాఠశాల, కళాశాల పిల్లలు, విద్యార్థుల లక్ష్యంగా ఆల్బెండజోల్400 మి.గ్రా మాత్రలు వేయించనున్నామని తెలిపారు. ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న డీవార్మింగ్ కార్యక్రమానికి జిల్లాకు సరఫరా చేసిన ఆల్బెండజోల్ మాత్రలను ఆయా వైద్యాధికారులు, సిబ్బందికి పంపిణీ చేశామని తెలిపారు. ఈ నెల 12న మాత్రలు వేసుకోని వారికి ఈనెల 20న మాప్అప్ కార్యక్రమంలో మాత్రలు వేసేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఉచిత కేన్సర్ స్క్రీనింగ్పార్వతీపురం టౌన్: మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్–రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారి సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రిలో మెగా ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి జి.నాగభూషణ రావు మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రి, పార్వతీపురం మెడికల్ సూపరింటెండెంట్ డా.వై.నాగశివ జ్యోతి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 176 మందికి పరీక్షలు నిర్వహించి వారిలో 65 మందికి ఓరల్ కేన్సర్ స్క్రీనింగ్ చేశారు. వారిలో 4 అనుమానిత కేసులుగా, 1 నాలుకకు సంబంధించిన కేన్సర్గా నిర్ధారణ చేశారు. బ్రెస్ట్ కేన్సర్ పరీక్షలను 91 మందికి నిర్వహించి వారిలో 20 మందిని అనుమనితులుగా గుర్తించి డిజిటల్ మెమోగ్రఫీ పరీక్ష చేశారు. దీని ద్వారా వారిలో ఎవరికీ కేన్సర్ లేదని నిర్ధారించారు. 20 మందికి గర్భసంచి ముఖద్వారం కేన్సర్ పరీక్షలు నిర్వహించి వారిలో 10 మందిని అనుమానితులుగా గుర్తించి పరీక్షలు చేశారు. వాటి రిపోర్టులను వారం రోజులలో అందించనున్నారు. కార్యక్రమంలో డా.హారిక, డా.కె.పాల్, మెమోగ్రఫీ టెక్నిషియన్స్ లక్ష్మి, జి.సుమన్, జిల్లా ఆస్పత్రి దంత వైద్యసిబ్బంది డా.ఎం.దినేష్ కుమార్, డా.ఆర్.శ్యామల పాల్గొన్నారు. గాయత్రీమాతకు పసుపు కొమ్ములతో అలంకరణ రాజాం సిటీ: రాజాం గాయత్రికాలనీలో వెలసి న గాయత్రిమాతను పసుపు కొమ్ములతో ఆల య ధర్మకర్త కొండవేటి వివేకానంద, ఆలయ అర్చకులు వాస జగదీశ్వరరావు గురువారం అలంకరించారు. శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారాన్ని పురస్కరించుని అమ్మవారిని అలంకరించినట్టు అర్చకులు తెలిపారు. సీసీ కెమెరాలతో నిఘా విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం కొత్తగా 16 సీసీ కెమెరాలను అమర్చారు. నేర నియంత్రణలో భాగంగా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు వైఎస్సార్ నగర్, మెడికల్ కాలేజ్, కాటవీధి, డబుల్ కాలనీ తదితర చోట్ల సీసీ కెమెరాలు పెట్టామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీటి సాయంతో నేర ప్రవృత్తికలిగిన వ్యక్తుల కదలికలపై నిఘావేస్తామన్నారు. -
నాటు తుపాకులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం
పార్వతీపురం రూరల్: నాటు తుపాకులు కలిగి ఉండడం వాటిని వినియోగించడం చట్టరీత్యా నేరమని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజల రక్షణ, భద్రత ప్రామాణికంగా, నేరాలు, అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ ను సంబంధిత స్టేషన్ల అధికారులు నిర్వహించారు. ఈ క్రమంలో పార్వతీపురం మండలం రావికోన పంచాయతీ కొత్తవలస గ్రామంలో పార్వతీపురం రూరల్ పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా కొర్ర సీతారాం ఇంటి గడపలో నాటు తుపాకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్స్ లేకుండా తుపాకులు వినియోగించడం చట్టరీత్యా నేరం అన్న విషయాన్ని గ్రామస్తులకు అర్థమయ్యే రీతిలో సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
భక్తులను ఆకర్షించేలా తోటపల్లి ఆలయ నిర్మాణం
గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం భక్తులకు ఆధ్యాత్మిక చింతన మరింత చేరువ చేసి ఆకర్షించేలా ఆలయాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వాన ప్రస్త్రాశమం, అన్నప్రసాద సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటపల్లిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రభావం ఈ ప్రాంతంపై ఎంతో ఉందన్నారు.భక్తుల ఇలవేల్పుగా, ఈ ప్రాంతానికి చిన తిరుపతిగా తోటపలి దేవస్థానాన్ని కొనియాడుతున్నారన్నారు. ఆలయ నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారంతా ఒక్కటై ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆలయ పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నారని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరగడంతో ఆలయానికి కొత్త శోభ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధి పనులకు సహకరించిన పలువురు దాతలను కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్ను దుశ్శాలువతో సన్మానించి, వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ట్రస్ట్ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీవీ సూర్యనారాయణ, సర్పంచ్ ఆవాల సింహాచలమమ్మ, ఎంపీటీసీ ఎం.సింహాచలం నాయుడు, ట్రస్ట్ సభ్యులు డి. పారినాయుడు, డి.ధనుంజయరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
వట్టిగెడ్డ నీరు.. ఒట్టిదేనా!
జియ్యమ్మవలస రూరల్: కురుపాం. జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో దాదాపు 16,500 ఎకరాలకు సాగునీటిని అందించే వట్టిగెడ్డ.. ఇంకా రైతులకు ఎదురు చూపులే మిగులుస్తోంది. జియ్య మ్మవలస మండలంలోని ప్రధాన సాగునీటి వనరు వట్టిగెడ్డ జలాశయం. ఏటా ఖరీఫ్లో సాగునీరు విడుదల చేస్తారు. ఆగస్టు రెండు, మూడు తేదీల్లోనే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. కుడి, ఎడమ కాలువలు వరుసగా 9.75, 8.047 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వట్టిగెడ్డ నుంచి కుడి కాలువ ద్వారా 13,324 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 3,360 ఎకరాలకు సాగుకు నీరు అందించాల్సిఉంది. ఆగస్టు 8వ తేదీ వచ్చినా నేటికి నీటి విడుదల జాడ లేదు. నీటి విడుదల లేక ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాలుగు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. నాట్లు పడక నారు మడులు, వరి వెదలు ఎండిపోతున్నాయి. వట్టిగెడ్డ రిజర్వాయర్ పరిధిలో ఒకసారే వరి పంట రైతులు పండిస్తున్నారు. ఈ సంవత్సరం సాగునీరు సకాలంలో అందకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రాజెక్టు నిర్వహణ సిబ్బంది కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. కాలువ లకు ప్రతీ 5 కిలోమీటర్లకు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద 1500 ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున లస్కర్లు ఉండాలి. మొత్తం 23 మంది అవసరం. కానీ ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఈ నెల ఆరో తేదీన స్థానిక కూటమి ఎమ్మెల్యే జగదీశ్వరి వట్టిగెడ్డ నుంచి సాగునీటిని విడుదల చేస్తారని కూటమి నాయకులు ప్రకటించారు. తేదీ గడిచినా సాగునీరు మాత్రం విడుదల చేయలేదు. ఇటు ఎమ్మెల్యే జాడ కూడా కానరావడం లేదు. రైతుల కోసం కనీసం ఆలోచించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వట్టిగెడ్డ.. జియ్యమ్మవలస మండలంలోని మూడు మండలాల్లోని పంట భూములకు సాగునీటి ఆదరువు. వరినాట్లు ముమ్మరంగా జరిగే ఆశ్లేషకార్తె వచ్చినా జలాశయం నుంచి చుక్కనీరు రావడం లేదు. కనీసం నీరు విడిచిపెట్టాలన్న ధ్యాస స్థానిక ఎమ్మెల్యేకు లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. వరి నారుమడులు, వెదలు ఎండిపోతున్నాయని, ఇంకెప్పుడు నీరు విడిచిపెడతారని ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు వచ్చినా అందని సాగునీరు ఆయకట్టు రైతుల్లో ఆందోళన ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లు? సాగునీటిని వెంటనే విడిచిపెట్టాలి రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ సాగునీటిని వెంటనే కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా విడిచిపెట్టాలని జియ్యమ్మవలస మండల వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చినమేరంగిలోని శత్రుచర్ల కోటలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఏటా ఈ సమయానికే సాగునీటిని ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు విడిచిపెట్టేవారని, నేడు ఏడవ తేదీ అవుతున్నా విడుదల చేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. నీరు లేక ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు అధికారులకు కనించడం లేదా? అని ప్రశ్నించారు. తక్షణమే నీరు విడుదల చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కోట రమేష్, వైస్ ఎంపీపీ గుడివాడ సంపత్ కుమార్, బలగ వెంకటరమణ, లోలుగు నారాయణరావు, పోల గోవిందరావు, తాడేల మన్మధరావు, బెజ్జిపొరపు మురళి పాల్గొన్నారు. -
సరైన రీతిలో బోధించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన రీతిలో ఉపాధ్యాయులు బోధన చేసి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారిలో జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచవచ్చునని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అందుకు తగిన ప్రణాళికలు జిల్లా విద్యాశాఖ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో మార్పులు రావాలని, ఈ మేరకు ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు బోధించేందుకు లాంగ్వేజ్ పండిట్లను నియమించాలని, అలాగే విద్యార్థులకు అందించే విద్యాబోధనతో పాటు వారి ఆరోగ్యంపై కూడా దృష్టిసారించడం ముఖ్యమని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఈఓ రాజ్కుమార్, ఏపీసీ తేజేశ్వరావు, ఎస్జీటీ వనజాక్షి, మరికొంతమంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పలు కార్యక్రమాలపై సమీక్ష రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ గురువారం తన కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలని పీ4, డాక్యుమెంటేషన్ అప్లోడ్, మౌలిక సదుపాయాల కల్పన, ఎరువుల పంపిణీ ప్రక్రియ వంటి కార్యక్రమాపై సమీక్షించాలని, అలాగే ఎరువుల విషయంలో అవసరాలను ముందుగా గుర్తించి చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్నదాత సుఖీభవ–పీఎంకిసాన్ యాక్టివ్, ఇన్యాక్టివ్ ఖాతాలను పరిశీలించాలని తెలియజేసినట్లు తెలిపారు. పీ4లో మార్గదర్శి, బంగారు కుటుంబాలు అనుసంధానం సర్వే తదితర అంశాలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, డీఆర్ఓ కె. హేమలత, డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తి, డ్వామా పీడీ కె. రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ఆర్బీఎస్కే జిల్లా అధికారి జగన్మోహన్రావు, జిల్లా సర్వే అధికారి లక్ష్మణరావు, ప్రకృతి వ్యవసాయం డీఎం శ్యామ్ కుమార్, డీపీఓ కొండలరావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
పి.ఆమిటిలో ఆదివాసీ దినోత్సవం
గుమ్మలక్ష్మీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఈ నెల 9)ను పురస్కరించుకొని గుమ్మలక్ష్మీపురం మండలంలోని పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆ పాఠశాల హెచ్ఎం బిడ్డిక లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థినులంతా గిరిజన సంప్రదాయ వేషధారణలతో అలరించారు. సంప్రదాయ పూజలు, నృత్యాలతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టీచర్ ఎం.రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. పి.ఆమిటి పాఠశాలలో ఆదివాసీ దినోత్సవంలో బాలికల సందడి -
మన్యం ప్రజల
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025● అధ్వానంగా గిరిజన గ్రామాల రోడ్లు ● రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఇబ్బందులే.. ● అటవీ ఉత్పత్తులు తరలించేందుకు అగచాట్లు ● సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు 120 గ్రామాల ప్రజలకు రోడ్డు కష్టాలు చిత్రంలో కనిపిస్తున్నది ఏదో నీరు ప్రవహించిన తర్వాత ఎండిన గెడ్డ అనుకుంటే పొరపాటే. ఇది సీతంపేట మండలంలోని ఎగువదరబ రోడ్డు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాళ్లుతేలిపోయింది. దీనిపై ప్రయాణించేందుకు ఈ ప్రాంత గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడిచివెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. రోడ్డు బాగుచేయాలని పాలకులు, అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. న్యూస్రీల్ -
నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రాస్పత్రిలో గురువారం క్యాన్సర్కు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసా ద్ తెలిపారు. విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో జిల్లా ఆస్పత్రి లో ఉచిత స్క్రీనింగ్ను ఏర్పాటు చేశామని పేర్కొంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత స్క్రీనింగ్ జరుగుతుందని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీ్త్ర, పురుషులకు విభాగాల్లో నిర్వహిస్తారని ముఖ్యంగా, సీ్త్రలకు గైనిక్, రొమ్ము, గర్భాశయ, ఇతర క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయనున్నారని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూముల పరిశీలన కొమరాడ: మండలంలోని చోళపదం, ఉలిపిరి గ్రామాల్లోని అగ్రిగోల్డ్ భూములను పార్వతీపు రం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ సంబంధి త కమిటీ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. కొమరాడ తహసీల్దార్ సత్యనారా యణ భూముల పరిస్థితిని వివరించారు. మూ డు ఎల్పీఎంలలో దాదాపు తొమ్మిది వందల చెట్లను లెక్కించామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మ్యుటేషన్, చెట్లగణన త్వరగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సరెండర్ సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపు రం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లుపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మేనేజ ర్ హోదా గల ఆయన.. కూటమి నేతలతో ఉన్న సాన్నిహిత్యం కార ణంగా పుర కమిషనర్గా చలామణి అవుతున్న విషయం విదితమే. కూటమి ప్రభుత్వంపై స్వామి భక్తి చాటుకోవడమే కాక.. అవినీతి అధికారిగానూ ముద్ర పడ్డారు. పుర పాలకవర్గం విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకూ ఆహ్వానించక, కౌన్సిల్ సమావేశాల్లో కూటమి నేతలకు అనుకూలంగా ఉంటూ, ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు.. ప్రతి పనికీ ఒక రేటు కట్టేశారని, సొంత ఉద్యోగులను సైతం వదలకుండా ఇబ్బంది పెట్టేవారిని బహిరంగంగానే విమర్శలు వచ్చా యి. కొన్నాళ్లుగా కమిషనర్ వెంకటేశ్వర్లుకు.. మున్సిపల్ ఉద్యోగులకు మధ్య యుద్ధమే సాగింది. దీనిపై ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే తో పాటు, కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఇటీవల కార్యాలయానికి వచ్చిన మున్సిపల్ ఆర్డీకి కూడా పురపాలక సంఘం చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వైఎస్సార్సీపీ సభ్యులతో పాటు పలువురు పట్టణ వాసులు కమిషనర్ తీరుపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయనను సరెండర్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. తదుపరి పోస్టింగ్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కార్యాలయానికి నివేదించాలని ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. 133 కేజీల గంజాయి పట్టివేత● ఇద్దరి అరెస్టు సాలూరు రూరల్: గ్రీన్ఫీల్డ్ రహదారిలో బుధవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 133 కేజీల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. ఈ మేరకు ఆమె సాలూరు రూరల్ పోలీస్ స్టేన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. పాచి పెంట మండలం మాతుమూరు సమీపంలో వేటగాని వలస గ్రామం గ్రీన్ఫీల్డ్ జంక్షన్ వద్ద పోలీసులు గంజాయితో పాటు నిందితులను పట్టున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఆటోతోపాటు ఇద్దరు నిందితులు కొర్ర డానియల్, జన్ని దివారకర్లను అరెస్టు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో రూరల్ ఎస్సై నరసింహమూర్తి, పాచిపెంట ఎస్సై పాల్గొన్నారు. -
● మద్యం జోరు.. జనం బేజారు!
ఇప్పుడు ఏ పల్లె, పట్టణం, వీధిలో అయినా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. బహిరంగ మద్యపానం యథేచ్ఛగా సాగుతోంది. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. వివాదాలకు కారణంగా మారుతోంది. వీటిని కట్టడిచేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. బొబ్బిలి సీఐ కె.సతీష్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించగా టీబీఆర్ థియేటర్ ప్రాంతంలో కాలువ గట్టుపై బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించారు. వెంటనే పోలీసులను పంపించి వారిని పట్టుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం సేవించి వాహనాలను నడిపినా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. – బొబ్బిలి -
దారిద్య్రం
సీతంపేట: మన్యం ప్రజలను ‘దారి’ద్య్రం వెంటాడుతోంది. సరైన ‘మార్గం’ చూపేవారు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తు లు తరలించేందుకు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1250కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో పూర్తిగా రహదారులు లేని గ్రామాలు 120కి పైగా ఉన్నాయి. అలాగే ఛిద్రమైన దారులు 100కు పైగా ఉంటాయ ని అంచనా. అటవీశాఖ అభ్యంతరాలతో కొన్ని గ్రామాలకు రో డ్లు వేయలేని పరిస్థితి. ఏజెన్సీలో ఉన్న రోడ్లు అధ్వా నంగా మారడం, కొత్తరోడ్లు వేసేందుకు కూటమి ప్రభుత్వం చొరవచూపకపోవడంతో రాకపోకలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో 108 వాహన సేవలు అందక డోలీలోనే రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తిచేయాలని ప్రాథేయపడుతున్నా పట్టించుకోకపోవ డంపై గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడైన రోడ్లపై ప్రయాణ కష్టాలు.. ●కోపువలస నుంచి సందిగూడ వయా వంబరెల్లికు కొత్త రోడ్డు నిర్మాణానికి ఉపాధిహామీ పథకం నిధులు రూ.3 కోట్లు మంజూరైనా పనులు మాత్రం జరగలేదు. ఆ ప్రాంత ప్రజలకు రోడ్డు కష్టాలు తప్పడంలేదు. ●కోదులవీరఘట్టం, దాసుపరం, అంబలగండి గ్రామాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. గుడ్డిమీద గూడ మీదుగా కడగండి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ●కొఠారింగు–తాళ్లబద్రకు రహదారిలేకపోవడంతో రెండు రోజుల కిందట ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు గిరిజనులు అష్టకష్టాలు ఎదుర్కొన్నా రు. గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చి న అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. స్థానికు ల సాయంతో అతికష్టం మీద అంబులెన్స్ను తీశారు. ●తుంబలి, చావిడివలస తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడయ్యాయి. ముకుందాపురం రోడ్డు పనులు ప్రారంభించి వదిలేశారు. ఎగువద్వారబంధం గ్రామానికి వేసిన రోడ్డు నాణ్యతలేక వర్షాలకు కొట్టుకుపోయిందని గిరిజనులు వాపోతున్నారు. పొంజాడ–ఆడలి రహదారిదీ ఇదే పరిస్థితి. శిలిగా నుంచి ఈతమానుగూడ రోడ్డుపై రాళ్లుతేలాయి. దబర నుంచి దబరగూడకు రోడ్డు నిర్మాణమే జరగలేదు. రోడ్ల పనుల్లో అలసత్వం తగదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్ల పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పూర్తిచేయలేదు. సీతంపేట ఏజెన్సీలో 10 రోడ్ల నిర్మాణానికి ఏడాదిన్నర కిందట రూ.13.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అంతకముందు మరో 20 రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరైనా వాటి పనులు ఇప్పటికీ పూర్తిచేయలేదు. కొత్త రోడ్లు మంజూరు ఎలాగూలేదు. కనీసం అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తిచేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే -
ఇన్స్పైర్ మనక్లో భాగస్వామ్యం కావాలి
పార్వతీపురం టౌన్: ఇన్స్పైర్ మనక్లో జిల్లాలోని అన్ని పాఠశాలలు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖధికారి బి.రాజకుమార్ తెలియజేశారు. ఇన్స్పైర్ మనక్ 2025–26కు గాను డివిజనల్ లెవెల్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం స్థానిక డీవీఎంఎం ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఇన్స్పైర్ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలు వెలికితీయవచ్చని, నిజజీవిత సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులు నామినేషన్ అయ్యేలా అందరు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జాతీయస్థాయికి వెళ్లేలా ప్రాజెక్టులు సిద్ధం చేయించాలన్నారు. ఇన్స్పైర్ ప్రాజెక్ట్ల నామినేషన్లకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని అంతకు ముందుగానే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలని సాంకేతిక సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు, డివిజన్లో అన్ని మేనేజ్మెంట్ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పెంట రామకృష్ణ, స్థానిక పాఠశాల హెచ్ఎం భాస్కర్, ఏఎస్ఓ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నూతనంగా ఎన్నికైన రెడ్క్రాస్ కార్యవర్గ సభ్యులు చిత్తశుద్ధితో తమ సేవలను ప్రజలకు అందించాలని రెడ్క్రాస్ అధ్యక్షుడు, కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్ ిపీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్క్రాస్ నూతన అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సేవలు విస్తరింపజేయాలన్నారు. ప్రతి మండలంలోనూ సభ్యత్వ నమోదుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో మలేరియా, ఎనీమియా, సికిల్సెల్ బాధితుల వివరాలు నమోదు చేయాలని, వారికి అవసరమైన మందులు, బలవర్ధకమైన ఆహారం రెడ్క్రాస్ నుంచి అందేలా చూడాలన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం, చదువుకునే పిల్లలకు రెడ్క్రాస్ సంస్థ తరఫున సాయం అందించాలని సూచించారు. జిల్లాలో రక్తం నిల్వలు పెంచేందుకు కృషిచేయాలని కోరారు. రెడ్క్రాస్ సంస్థకు నగరంలో ప్రభుత్వ భవనం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో రెడ్క్రాస్ కమిటీ ఉండాలని, నెల లేదా మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యవర్గం ఇదే.. రెడ్క్రాస్ చైర్మన్గా డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు, కార్యదర్శిగా బి.నాగభూషణరావు, కోశాధికారిగా పెంటపాటి సూర్యారావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ కోఆర్డినేటర్ జనార్దనరావు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం ఎన్నిక -
ఎన్నడైనా చూశామా?
● కలెక్టర్ల పనితీరుపై సర్వే ● కొద్దిరోజులుగా మోత మోగుతున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ● అధికారులు, రాజకీయ నాయకులు ఒకటేనా? అని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలు సాక్షి, పార్వతీపురం మన్యం: గత ఎన్నికలకు ముందు.. ‘మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తున్నారు’ అంటూ ఓ సర్వే... వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన.. అనే ఆప్షన్లు! కూటమి అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.. అంటూ ఇంకో సర్వే.. ఓ మూడు, నాలుగు పేర్లు! ఎన్నికల్లో గెలిచిన తర్వాత, నామినేటెడ్ పదవుల భర్తీ నిమిత్తం.. ‘మీ ప్రాంతంలో పార్టీ కోసం బాగా కష్టపడుతున్న వ్యక్తి ఎవరు?’ అని మరో సర్వే!! అభ్యర్థుల గెలుపోటములు, ఎంపికలు, విజయావకాశాలు... సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఇలా వివిధ సర్వేలను రాజకీయ పార్టీలు నిర్వహించడం సాధారణం అయిపోయింది. ఇందుకు భిన్నంగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం మరో సర్వే చేపడుతోంది. ‘మీ కలెక్టర్ పని తీరు ఎలా ఉందంటూ’.. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ కాల్స్ మోత మోగుతున్నాయి. మీ కలెక్టర్ పని తీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా? అంటూ రికార్డెడ్ కాల్ వాయిస్ వస్తోంది. కొద్దిరోజులుగా కలెక్టర్ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి సర్వే నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్లు.. రాజకీయ నాయకులు ఒక్కటేనా? జిల్లా కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయ్యింది. ఇదే సమయంలో ఆయన బదిలీపై త్వరలో వెళ్లిపోనున్నారన్న ప్రచారం ఉంది. సాధారణంగా ఏ జిల్లాలో అయినా కలెక్టర్లు రెండేళ్లు మించి పని చేయరు. ప్రభుత్వాలు మారినప్పుడు తమకు అనుకూలమైన ఐఏఎస్లను తెచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేగానీ.. రాజకీయ నాయకుల మాదిరిగా సర్వేల ద్వారా కలెక్టర్ల పనితీరును తెలుసుకోవడం మునుపెన్నడూ లేదు. దేశంలోనే అత్యున్నత సర్వీసు అయిన కలెక్టర్ పోస్టు అంటే అందరికీ గౌరవమే. జిల్లా మేజిస్ట్రేట్గా, ఆ జిల్లాకు ఉన్నత అధికారిగా అన్ని అధికారాలూ ఉంటాయి. అటువంటి వారిని తప్పు పట్టేలా, చిన్నబుచ్చుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి విధానాన్ని ఎప్పుడూ చూడలేదని ఉద్యోగవర్గాలు అంటున్నాయి. ఏ చదువూ అర్హత లేని రాజకీయ నాయకుడు.. ఉన్నత చదువులు చదివిన కలెక్టర్ ఒక్కటేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీరుపై ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. తమకు ఇస్తామన్న బకాయిలు ఏవీ చెల్లించడం లేదు సరికదా.. వివిధ సర్వేలు, ఇతర పనులు అంటూ పని భారం మోపుతున్నాయన్న ఆవేదనలో ఉన్నారు. దీనికి తోడు బంగారు కుటుంబాలు అని కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఇలా ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఆయా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మొండిగానే ముందుకు వెళ్తోంది. కలెక్టర్ల పనితీరుపై సర్వేకు ఈ ఫోన్ నంబర్తోనే వస్తున్న కాల్స్ -
గిరిజన రైతుల హక్కులు కాలరాస్తే సహించం
● సాగుచేసిన భూములు వారి స్వాధీనంలోనే ఉండాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ● మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ● కాకర్లవలస, కారేడువలసలో భూముల పరిశీలనరామభద్రపురం: ఎన్నోఏళ్లుగా సాగులో ఉన్న భూములపై సర్వ హక్కులు గిరిజన రైతులవేనని వారి హక్కులను కాలరాస్తే సహించేది లేదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు హెచ్చరించారు. ఈ మేరకు రామభద్రపురం మండలంలోని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతులు చాలా రోజులుగా భూసమస్యలపై పోరాడుతున్న సమాచారం తెలుసుకున్న వారు బుధవారం ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులతో కలిిసి ఆయా భూములను పరిశీలించారు.ఈ భూముల్లో ఎప్పటి నుంచి సాగులో ఉన్నారు? మీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మీకు నోటీసులు ఇచ్చారా లేదా? అని ఆరా తీస్తూ గిరిజన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీఐఐసీ అధికారులు, ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కోసం పేదల పొట్టగొడుతూ మేము ఎన్నో ఏళ్లుగా కష్టపడి సాగుచేసుకుంటున్న పంటలు సైతం దౌర్జన్యంగా నాశనం చేయడంతో పాటు లాక్కుంటున్నారని గిరిజన రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు.అలాగే దశాబ్దాల కాలంగా మేము సాగులో ఉన్న ఇవే భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తే రెవెన్యూ అధికారులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారని వారి వద్ద గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉపయోగించి పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా చేసి గిరిజనులను భయపెట్టడం సమంజసం కాదన్నారు. ఆరుగాలం కష్టపడి పెంచుకుంటున్న మామిడి తోటలు, జీడి తోటలు, మొక్కజొన్న, పత్తి పంటలు ధ్వంసం చేయడానికి ఏపీఐఐసీ అధికారులకు మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రజాప్రయోజనాల కోసమో సాగుభూముల్లో పనులు చేస్తే పద్ధతిని పాటిస్తూ ముందుకెళ్లాలన్నారు. పాలన ఇలాగేనా? ఇక్కడ పంచాయతీ సర్పంచ్కు గాని, గిరిజన రైతులకు కానీ కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని,గిరిజన ప్రజలకు మంచి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఇలాగేనా పాలించేది అని ప్రశ్నించారు. 2009లో వనసంరక్షణ కింద అప్పటి కలెక్టర్ వీర బ్రహ్మయ్య గిరిజనులకు పట్టాలు ఇచ్చారని,అప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి బీడు భూములను బాగు చేసుకుని గిరిజన రైతులు సాగులో ఉంటే ఇప్పుడు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గిరిజన రైతులేమీ దొంగతనంగా ఆక్రమించుకోలేదన్నారు. దౌర్జన్యంగా ధ్వంసం చేసిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గిరిజన రైతులకు కొండ ప్రాంతంలో కాకుండా ఈ భూములకే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ మజ్జి రాంబాబు, మండల జేసీఎస్ కన్వీనర్ చింతల సింహాచలం నాయుడు, మండల యూత్ అధ్యక్షుడు పత్తిగుళ్ల ఏక్నాథ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిర్ల చంద్రశేఖర్ సీఐటీయూ నాయకుడు బలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పాము కాటుతో రైతు మృతి
అయిన వారు వదులుకున్నారు,.108 సిబ్బంది ఆదుకున్నారుకొత్తవలస: కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించిన వ్యక్తి అవసరం తీరిపోవడంతో అయిన వారు వదులుకున్నారు. అయితే ఆ వ్యక్తిని 108 సిబ్బంది ఆదుకున్నారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడని స్థానికులు 108 వాహనం సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో 108 వాహసం సిబ్బంది టెక్నీషయన్ సీహెచ్.సన్యాసినాయుడు, పైలెట్ విజయ్కుమార్లు 108 వాహనంలో వచ్చి పరిశీలించగా ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు.అక్కడికి వెళ్లేసరికి సంబంధిత వ్యక్తికి మెలకువ రావడంతో వివరాలు అడగ్గా తాను ఉప్పల వెంకటరావును. కారు డ్రైవర్నని తెలిపాడు. భార్య,ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారని, పిల్లలకు పెళ్లిళ్లు జరిపించినట్లు తెలిపాడు. తాను ఆనారోగ్యం పాలుకావడంతో కుటుంబసభ్యులు చిన్నచూపు చూడడంతో అక్కడక్కడ తింటూ రోడ్డుపైనే కాలక్షాపం చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన బంధువులకు సమాచారం అందించామని 108 సిబ్బంది తెలిపారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం నంబర్ 5పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం జీఆర్పీ సిబ్బంది గమనించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఉంటుందని సుమారు ఆరడుగుల ఎత్తు, సిమెంట్ రంగు షర్ట్ , నీలిరంగు ఫ్యాంట్ ధరించిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నామని జీఆర్పీ హెచ్సీ అశోక్ తెలిపారు. మృతుడి కుడి చేతికి ఎర్రటి తాడు ఉందని సదరు వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ 9490617089, 6301365605 నంబర్లకు కానీ ల్యాండ్ లైన్ 08912883218 నంబర్కు కానీ ఫోన్ చేయాలని హెచ్సీ అశోక్ తెలిపారు. -
పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్లు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● జిల్లాలో మొత్తం పీఏసీఎస్లు 42 ● 18 సొసైటీలకు గతంలో త్రీమెన్ కమిటీ నియామకం ● మిగిలిన 24 సొసైటీల్లో కొలిక్కిరాని కమిటీలు ● 24 సొసైటీలకు పర్సన్ ఇన్చార్జ్ల నియామకంవీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఏసీఎస్లలో నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు చోట్ల సొసైటీల్లో త్రీమెన్ కమిటీ నియామకాలకు కూటమిలో ఏర్పడిన కుమ్ములాటలతో పీఏసీఎస్లో చైర్మన్ కుర్చీలు ఖాళీగా మిగిలాయి. ముఖ్యంగా జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం డివిజన్లలో ఈ నియామకాలు ఆగిపోయాయి. మిగిలిన చోట్ల నెల రోజుల క్రితమే త్రీమెన్ కమిటీలను ఎమ్మెల్యేల సిఫార్సులతో నియమించారు. చైర్మన్ కుర్చీలు ఖాళీగా ఉన్న చోట ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 1న ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జ్లను ఈ సొసైటీలకు నియమించింది. ఆరు నెలల పాటు 2026 జనవరి 30 వరకు పర్సన్ ఇన్చార్జ్లు ఇక్కడ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో చాలా రోజులుగా పీఏసీఎస్లలో చైర్మన్ పదవి వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదీ పరిస్థితి..జిల్లాలో 42 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)లు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఏసీఎస్లలో నియమించిన త్రీమెన్ కమిటీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూన్ 28న స్వచ్ఛందంగా తప్పుకున్నారు.దీంతో గత 14 నెలలుగా పీఏసీఎస్లలో త్రీమెన్ కమిటీలు లేక పాలన గాడి తప్పుతోంది. ఈ క్రమంలో గతేడాది అన్ని సొసైటీలకు ఆరు నెలల పాటు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. తొలుత పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేసిన ప్రభుత్వం తర్వాత నామినేటెడ్ పద్ధతిలో త్రీమెన్ కమిటీలను నియమించాలని ఆలోచన చేసింది. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులతో 18 పీఏసీఎస్లకు నెలరోజుల క్రితం త్రీమెన్ కమిటీలు నియమించారు. చైర్మన్ పదవి కోసం అటు టీడీపీ, ఇటు జనసేన నేతల మధ్య పోటీ ఏర్పడడంతో జిల్లాలో 24 పీఏసీఎస్లలో త్రీమెన్ కమిటీ నియామకాల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు కుస్తీ పడుతున్నారు. ఇంతలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రత్యేకాధికారులను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆశావహులు కంగుతిన్నారు. 24 పీఏసీఎస్లకు ప్రత్యేధికారులు..పాలకొండ నియోజకవర్గంలో 8 పీఏసీఎస్లు ఉండగా ఇక్కడ ఏ ఒక్క సొసైటీలో కూడా త్రీమెన్ కమిటీలను నియమించలేకపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు, టీడీపీ ఇన్చార్జ్ భూదేవిల మద్య సయోద్య కుదరకపోవడంతో సొసైటీల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేకపోయారని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలోని భామిని, బత్తిలి, అర్ధలి, బాసూరు, పాలకొండ, ఆర్బీఆర్.పేట, తంపటాపల్లి, వీరఘట్టంలో త్రీమెన్ కమిటీలు వేయలేదు. అలాగే పార్వతీపురం డివిజన్లోని గరుగుబిల్లి, చినమేరంగి, కృష్ణపల్లి, పలగర, గలావిల్లి, అజ్జాడ, బూర్జ, సీతానగరం, కాశీపేట, గెడ్డలుప్పి, పార్వతీపురం, తామరఖండి, అంటిపేట, ఆర్.వెంకమ్మపేట, మరిపివలస, పాపమ్మవలస సొసైటీలకు కూటమి నాయకులు త్రీమెన్ కమిటీలను వేయకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.ప్రత్యేకాధికారులను నియమించారు జిల్లాలో త్రీమెన్ కమిటీలు లేని 24 సొసైటీలకు ప్రభుత్వం పర్సన్ ఇన్చార్జ్లను నియమించింది.వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఇన్చార్జ్లు ఉంటారు.ఒక వేళ ఇంతలో త్రీమెన్ కమిటీలు వస్తే పర్సన్ ఇన్చార్జ్లు మరి ఉండరు. పి.శ్రీరామమూర్తి, జిల్లా కోపరేటివ్ అధికారి -
దేశ రాజధాని పెద్దల దృష్టికి జిందాల్ సమస్య
శృంగవరపుకోట: భూములు కోల్పోయి ఉపాధి కరువై రోడ్డున పడిన జిందాల్ పరిశ్రమ నిర్వాసితుల గోడును దేశరాజధానికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు. ఈ మేరకు బుధవారం బొడ్డవరలో ఆయన తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45రోజులు రైతులు రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రాష్ట్ర సర్కారులో కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, ఢిల్లీలో జాతీయ మానవహక్కుల సంఘం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ల చైర్మన్లను కలిసి జిందాల్ రైతాంగ సమస్యలు వివరించామన్నారు. ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే 15 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టర్ను కలిసి ఆర్అండ్ఆర్ అమలులో జరిగిన లోపాలు, చెల్లింపుల్లో తప్పిదాలను వివరించామన్నారు. జిందాల్ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
జాతీయలోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
విజయనగరం లీగల్: జాతీయ లోక్ అదాలత్ను చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు, జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో ప్రముఖ చిట్ఫండ్ కంపెనీల బ్యాంక్ మేనేజర్లు, బ్యాంకులకు సంబంధించిన అధికారులు, కంపెనీ న్యాయవాదులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిట్ కంపెనీలకు, బ్యాంక్కు సంబంధించిన కేసులను సెప్టెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్లో ఉన్న బ్యాంకు దావాలను ఎక్కువ కేసులను రాజీ చేయాలని కంపెనీలకు సంబంధించిన బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యా య సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్, మార్గదర్శి చిట్ఫండ్స్, కపిల్ చిట్ఫండ్స్ శ్రీరామ్ చిట్ఫండ్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. -
నిందితుడి కోసం తీవ్ర గాలింపు
కొత్తవలస: మండలంలోని ముసిరాం గ్రామంలో నాటు తుపాకీతో తన సమీప బంధువును మంగళవారం సాయంత్రం కాల్చి పరారైన నిందితుడు సిమ్మ అప్పారావు (35) ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలసకు చెందిన సిమ్మ అప్పారావు మంగళవారం తుపాకీతో కాల్చి చంపిన విషయం పాఠకులకు విదితమే. నిందితుడు అప్పారావు తుపాకీతో కాల్చి తోటల్లోంచి పరెగెత్తుకుంటూ పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పరుగెత్తుకుంటూ అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం గొట్లాం గ్రామం రోడ్డువరకు ద్విచక్రవాహనంపై వెళ్లి అక్కడ బండి దిగి ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును తుపాకీతో కాల్చి చంపేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని నిందితుడి చినాన్న తెలిపాడు. కాగా తోటల్లోంచి వచ్చిన సమయంలో నిందితుడి వద్ద తుపాకీ లేదని తెలిపాడు. తుపాకీని తోటలోనే ఎక్కడో పడేశాడని పోలీసులు అంచనాకు వచ్చి వెతికేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఉదయం నుంచి గ్రామం సమీపంలో గల జీడి, మామిడితోటల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. పలు గ్రామాల్లో గల నిందితుడి బంధువుల ఇళ్లల్లోను తనిఖీ చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. కాగా నిందితుడికి హెవీ వెహికల్ డ్రైవర్గా పని చేసిన అనుభవం ఉండడంతో గొట్లాం జంక్షన్ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లి పోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు మాత్రం ఈ కేసు సవాల్గా మారింది. కాగా మృతుడు సిమ్మ అప్పారావు కుమారుడు అంజి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని సీఐ షన్ముఖరావు తెలిపారు. సవాల్గా తీసుకున్న పోలీసులు -
●రోడ్ల నిర్మాణానికి చర్యలు
రోడ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లు లేని పలు గ్రామాలకు కొత్తగా రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – కుమార్, ఈఈ, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్శాఖ ●ప్రయాణించేందుకు భయపడుతున్నాం వీలైనంత తొందరగా రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి. రాళ్లుతేలిన, గోతులమయమైన రోడ్లపై ప్రయాణానికి ప్రతి నిత్యం భయపడుతున్నాం. కష్టాలు అనుభవిస్తున్నాం. మేడ ఒబ్బంగికి వెళ్లాల న్నా, రావాలన్నా నరకం చూస్తున్నాం. కొండశిఖర గ్రామాలకు రోడ్లు నిర్మించాలి. – ఎస్.ముకుందరావు, సర్పంచ్, కొండాడ -
వృద్ధుడి అదృశ్యం
విజయనగరం క్రైమ్ : నగరంలోని ఇందిరానగర్ లో నివాసముంటున్న పతివాడ కాశయ్య (69) అదృశ్యమైనట్లు బుధవారం విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కాశయ్య కొడుకు తిలక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్ హెచ్సీ అప్పలనాయుడు కేసు నమోదు చేయగా సీఐ ఆర్వీకే చౌదరి దర్యాప్తు ప్రారంభించారు.గత నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయిన కాశయ్య ఇప్పటివరకు ఇంటికి తిరిగాలేదని కొడుకు తిలక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా కాస్త మతిస్థిమితం లేదని ఇంట్లో గొడవపడి గత నెలలోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడన్నారు. క్రైమ్ పార్టీ కాశయ్య కోసం వెతుకులాట చేపట్టారని సీఐ చౌదరి ఈ సందర్భంగా చెప్పారు -
హెచ్సీ కుటుంబానికి ఆర్థిక సహాయం
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో మరణించిన చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కోరాడ రామునాయుడు కుటుంబానికి పోలీస్ వాట్సాప్గ్రూప్ సభ్యులు రూ.లక్షా 50వేల 662ల ఆర్థిక సహాయం చేశారు. ఏపీ పోలీస్ వాట్సాప్ గ్రూపులోని సభ్యులు వితరణగా ఇచ్చిన మొత్తాన్ని మృతుడు హెచ్సీ రామునాయుడు కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో గ్రూపు సభ్యులు లెంక రాము, మిత్తిరెడ్డి అప్పలనాయుడు, శీర గణేష్, అక్కుపల్లి గోవింద, మజ్జి కూర్మారావు, గొర్లె శ్రావణ్కుమార్, మీసాల చంద్రమౌళి, కల్యాణపు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.16న రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలుకొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా 16వ తేదీన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలను నిర్వహించ నున్నట్లు ఉత్తరాంధ్ర క్విజ్ మాస్టర్ కర్రి రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు 16వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు.అన్ని రకాల పోటీ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు . ఆరుగురు అభ్యర్థులు ఒక గ్రూప్గా ఏర్పండి పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. హైటెక్ విజయరహస్యం–2025 మ్యాగజైన్, ఇంగ్లీష్, కరెంట్ అఫెర్స్ తదితర అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన గ్రూప్లకు వరుసగా రూ.5వేలు, రూ.4వేలు, రూ 3వేలు, రూ.2వేలు నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.ఈ పోటీలు గ్రామ మాజీ సర్పంచ్ తిక్కాన చిన్నదేముడు ఆర్థిక సహాయంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. 9న జిల్లా స్థాయి యోగా పోటీలువిజయనగరం: జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల తోటపాలెం గాయత్రి టెక్నో స్కూల్లో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సబ్జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో 8 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను 8వ తేదీ సాయంత్రం లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో నిర్వహించే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు, మైసూర్ (కర్ణాటక)లో నిర్వహించే జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని వివరించారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు ఫోన్ 8374904262,7993696087 నంబర్లను సంప్రదించాలని సూచించారు. చెక్బౌన్స్ కేసులో రెండేళ్ల జైలుశిక్షగజపతినగరం రూరల్: మిహిరా చిట్స్ యజమాని మక్కువ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం పట్టణానికి చెందిన కింతాడ అప్పారావుకు చెక్బౌన్స్ కేసులో రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.రెండు లక్షలు నష్టపరిహారం విధిస్తూ గజపతినగరం జుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ విజయ్రాజ్కుమార్ తీర్పునిచ్చారు. మిహిరా చిట్ కంపెనీకి అప్పారావు సకాలంలో చిట్ నగదు చెల్లించకపోవడం వల్ల ముద్దాయికి ఈ శిక్ష వేసినట్లు మెజిస్ట్రేట్ తీర్పులో పేర్కొన్నారు. గిరిజన బాలుడి మృతిగుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్పేట పంచాయతీ ఎస్.కోటపాడు గ్రామానికి చెందిన కడ్రక అభిరాం(13)అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందాడు. కొత్తగూడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన అభిరాం టీబీ తదితర వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కారణంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలకు వెళ్లలేదు. తల్లి మాలతి, తండ్రి మహేష్ అభిరాంను వైద్యం నిమిత్తం పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్య సేవలు అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. -
పల్లెనిద్రతో ప్రజలకు భరోసా
విజయనగరం క్రైమ్: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ప్రతి నెలలో రెండు గ్రామాల్లో ’పల్లె నిద్ర’ చేయాలని ఎస్సైలు, సీఐలను ఆదేశించామని ఎస్పీ అన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, వివిధ నేరాలు, చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోగల గ్రామం లేదా వార్డులో ఎస్సై లేదా సీఐ స్థాయి అధికారులు, దత్తత గ్రామాల కానిస్టేబుల్స్ ‘పల్లె నిద్ర’ చేపట్టే విధంగా అధికారులను ఇప్పటికే ఆదేశించామని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ‘పల్లె నిద్ర’ కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడమే ‘పల్లె నిద్ర’ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో ‘వల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 300 గ్రామాల్లో పోలీసు అధికారులు కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఎస్పీ వకుల్ జిందల్ -
జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు
పార్వతీపురం రూరల్: ఈనెల 10వరకు డ్రంకెన్ డ్రైవ్, 11 తేదీ నుంచి 17వ తేదీ వరకు అతివేగం, 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎీస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు డీజీపీ ఉత్తర్వుల మేరకు ఈ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్టేషన్ల పరిధిలో ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రదేశాల వద్ద, బ్లాక్స్పాట్ల వద్ద రోజూ వాహన తనిఖీలు చేపడుతూ ప్రతి వాహనాన్ని ఆపి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేసి నిర్ధారణ అయితే కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు చోట్ల వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు పోలీసులు నిర్వహించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
19న పీ4 కార్యక్రమం
పార్వతీపురం రూరల్: ఈనెల 19న పీ4 కార్యక్రమం ప్రారంభానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. 2029 నాటికి బంగారు కుటుంబాలను పీ4 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసి ఆర్థిక అసమానతలను తొలగించేలా తొలి అడుగు వేయబోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 2047 నాటికి ఆర్థిక సమానత్వం సాధించాలని సీఎం పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఉప కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, డ్వామా పీడీ కె. రామచంద్రరావు, జిల్లా ప్రణాళిక అధికారి ఆర్కె పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలి
విజయనగరం అర్బన్: విజ్ఞాన శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాలని ఆ దిశగా వారిలోని ఆలోచనలతో కూడిన ప్రాజెక్టుల రూపకల్పనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ యు.మాణిక్యం నాయుడు అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రచైతన్యాన్ని పెంపొందించడం, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం లక్ష్యంగా ‘ఇన్స్పైర్–మనక్’ కార్యక్రమం నిర్వహణలో భాగంగా సైన్స్ ఉపాధ్యాయుల కోసం స్థానిక పీఎస్ఆర్ఈఎం స్కూల్లో మంగళవారం చేపట్టిన ఒక రోజు ఓరియంటేషన్ తరగతిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు ప్రాజెక్టులు తప్పనిసరిగా ఆన్లైన్లో ఆప్లోడ్ చేయాలని ఆదేశించారు. డీసీఈబీ సెక్రటరీ టి.సన్యాసిరాజు మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక, పరిసరాలకు అనుగుణంగా సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు రూపకల్పన చేయాలని సూచించారు. అనంతరం ఇన్స్పైర్ పోస్టర్, ఏపీఓఎస్ఎస్ ఓపెన్ స్కూల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రిసోర్స్ పర్సన్లుగా ఎ.భానుప్రకాష్, అరసాడ సురేంద్రనాథ్, ఎస్.ఉమామహేశ్వరరావు, ఎన్జీసీ కోఆర్డినేటర్ బూరి వేణుగోపాల్రావు వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ కేవీరమణ, జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ జి.సన్యాసినాయుడు, డివిజన్ పరిధిలోని సైన్స్ టీచర్లు పాల్గొన్నారు. డీఈఓ యూ.మాణిక్యంనాయుడు -
పోలీసు కుటుంబానికి ‘చేయూత’
● మృతిని భార్యకు రూ.1,48,600 చెక్కు అందజేత విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేసి, ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన నర్సింహ పట్నాయక్ కుటుంబానికి పోలీస్ సిబ్బంది ‘చేయూత‘ కింద రూ.1,48,600 చెక్కును ఆయన సతీమణి స్వర్ణలత పట్నాయక్కు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ‘చేయూత ‘పథకం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. శాఖలో ప్రతి సిబ్బంది కొంత నగదును పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం ఎప్పటినుంచో వస్తోందని ఈ తరహా పని చాలా అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ105 శ్రీ180 శ్రీ190పుష్పాలంకరణలో పైడితల్లివిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు చెల్లించారు. ఆలయం వెనుక వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోండివిజయనగరం లీగల్: ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో మోటారు ప్రమాద బీమా కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన అధికారులు మోటారు ప్రమాద బీమా కంపెనీల అధికారులు లోక్ అదాలత్లో పాల్గొని పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అఽధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓలు కీలకంగా వ్యవహరించాలి● జెడ్పీ సీఈఓ సత్యనారాయణ పార్వతీపురం రూరల్: ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఎంపీడీఓలు కీలకంగా వ్యవహరించాలని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో ఎస్డబ్ల్యూపీసీ(చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం) లో ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలతో పాటు ఇన్చార్జ్ ఎంపీడీఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల కార్యాచరణ ప్రతి పంచాయతీలో కచ్చితంగా అమలు కావాలన్నారు. నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, ఈ మేరకు నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఎస్డబ్ల్యూపీసీ ఆవశ్యకతను వివరించాలని కోరారు. ఈ శిక్షణలో డీపీఓ కొండలరావుతో పాటు డీఎల్పీఓ తదితరులు పాల్గొన్నారు. నలుగురికి తీవ్ర గాయాలుపార్వతీపురం రూరల్: పట్టణ ప్రారంభంలో అంతర్రాష్ట్ర రహదారిపై స్వీట్ దుకాణం సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సాయంతో హుటాహుటిన జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. గాయాలైన వారిలో అనిల్, శిల్లా రవికుమార్, కె. శంకరరావు, డి.రాంబాబు ఉన్నారు. -
పది చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
పార్వతీపురం రూరల్: పది చోరీ కేసులకు సంబంధించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ సీఐ గోవిందరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సమావేశలో మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామానికి చెందిన తామడ సంతోష్ రాత్రి వేళల్లో బయట పడుకునేవారి ఇళ్లల్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడ్ని బలిజిపేటలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడి నుంచి 10తులాల బంగారు ఆభరణాలు, రూ.13వేల నగదుతో పాటు బొబ్బిలి ప్రాంతానికి చెందిన ద్విచక్ర వాహనదారుడిని మోసం చేసి బైక్తో పరారైన కేసులో ఆ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు పురోగతికి సహకరించిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా సీఐ అభినందించారు. సమావేశంలో సీసీఎస్ పోలీసు అధికారులతో పాటు బలిజిపేట, కొమరాడ, సీతానగరం, పార్వతీపురం రూరల్ ఎస్సైలు, సీసీఎస్ సిబ్బంది ఉన్నారు. వివరాలు తెలిపిన రూరల్ సీఐ గోవిందరావు -
ఘనంగా గిరిజన వర్సిటీ 7వ వ్యవస్థాపక దినోత్సవం
విజయనగరం అర్బన్: పట్టణంలోని కేంద్రియ గిరిజనయూనివర్సిటీ 7వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలను ప్రారంభించిన యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉత్తమ బోధనల కోసం యూనివర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కృషిని ప్రశంసించారు. యూనివర్సిటీ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భువనేశ్వర్కు చెందిన రాజకీయ విశ్లేషకుడు, మాజీ అధ్యాపకుడు డాక్టర్ అభిరాం బిశ్వాల్ మాట్లాడుతూ యూనివర్సిటీ స్థిరమైన అభివృద్ధి కోసం అనుసరించాల్సిన అంశాలు, ప్రగతి శీల విధానాలు, విద్యా ప్రమాణాల పరిరక్షణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా మార్గదర్శక సూత్రాలను పాటించాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా యూనివర్సిటీ గణాంకాలను ప్రస్తావిస్తూ మౌలిక వసతులతో కూడిన శాశ్వత క్యాంపస్కు విద్యార్థులను త్వరలో తరలిస్తామన్నారు. అనంతరం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను ముఖ్యఅతిథి అందజేశారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ బొంతు కోటయ్య సమన్వయకర్తగా వ్యవహరించిన కార్యక్రమంలో డీన్ ఆఫ్ సోషల్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ ప్రొఫెసర్ శరత్చంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ దీపక్ మోహన్రావు షిండే, లైబ్రేరియన్ డాక్టర్ శంకర్రెడ్డి కొల్లే, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
గిరిజన మహిళంటే చిన్నచూపా..?
● సర్పంచ్కు ప్రోటోకాల్ ఉండదా.. ● పింఛన్ల పంపిణీకి హాజరు కావద్దా ● అనారోగ్యమని తెలిసీ అవహేళన ● గిరిజన మహిళా సర్పంచ్ ఆవేదనశృంగవరపుకోట: ప్రజాస్వామ్య వ్యవస్థలో గిరిజన ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ వర్తించదా? గిరిజన మహిళనని చిన్నచూపా? అంటూ మండలంలోని మూలబొడ్డవర గ్రామ గిరిజన మహిళా సర్పంచ్ దేవాపురపు మీనా మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామసచివాలయంలో పలువురు గ్రామస్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త పింఛన్ల పంపిణీని కనీసం తనకు చెప్పకుండా చేశారని, ప్రోటోకాల్ గిరిజన సర్పంచ్లకు ఉండదా? అని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి తనను ఎస్టీ మహిళనని లోకువగా చూస్తున్నారని, ఉద్యోగం వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి ఆగిపోయి, గ్రామంలో విభేదాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని ఏర్పాటు చేయాలి. పాతికకు పైగా గిరిశిఖర గ్రామాలున్న రెండు పెద్ద గిరిజన పంచాయతీలైన ధారపర్తి, బొడ్డవరలకు ఒక్క కార్యదర్శిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గిరిజన పంచాయతీలన్న చిన్నచూపుతోనే అధికారులు ఇలా చేస్తున్నారన్నారు. రెండు పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి కావడంతో అక్కడ, ఇక్కడ ఉన్నామని చెబుతూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. సర్పంచ్ ఆచూకీ చెబితే బహుమతి ఇస్తామని వాట్సాప్ గ్రూప్స్లో ఎవరో పంపిన మెసేజ్లు ఎంపీటీసీ ఫార్వర్డ్ చేయడం సరికాదని, తప్పు చేస్తే జనం మధ్యనే నిలదీయాలన్నారు. ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్లానని తెలిసీ ఎంపీటీసీ తనను హేళన చేయడం అత్యంత బాధాకరమన్నారు. రెగ్యులర్ సెక్రటరీని నియమించాలి ఈ సందర్భంగా సచివాలయం నుంచి కార్యదర్శికి సర్పంచ్ మీనా ఫోన్ చేసి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగితే కార్యదర్శి కాల్ కట్ చేయడంతో ఇదీ మా కార్యదర్శి పనితీరు చూశారుగా అన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశామని, అధికారులు చర్యలు తీసుకుని, బొడ్డవర పంచాయతీకి రెగ్యులర్ సెక్రటరీని నియమించాలని కోరారు. సమావేశంలో గ్రామపెద్ద డి.సన్యాసినాయుడు మాట్లాడుతూ ఆర్నెలలుగా సర్పంచ్ పని చేయకపోతే ఎంపీటీసీ చేశారా? జనం మధ్య తేల్చండి. మేము పనిచేయలేదని, అందుబాటులో లేమని చెబితే ఇప్పుడే సర్పంచ్తో రాజీనామా చేయిస్తానన్నారు. పనులకు సర్పంచ్ కావాలి కానీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ప్రోటోకాల్ అవసరం లేదా? గిరిజనులం అని చులకన చేస్తున్నారని వాపోయారు. 90శాతం ఓటర్లు గిరిజనులు, దళితులు, బీసీలు ఉన్నా ఇక్కడ రాజరికం చేయాలనుకోవడం, అధికారులను బెదిరించి గిరిజన నేతలను ఇబ్బందులు పెట్టడం సరికాదని గిరిజన సంఘం నేత జె.గౌరీష్ అన్నారు. -
స్మార్ట్ మీటర్లపై.. లోకేష్ నోరు మూగబోయిందా?
● వామపక్ష, ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతల ఆగ్రహంవిజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ ప్రజలను విద్యుత్ చార్జీలు, అదానీ స్మార్ట్ మీటర్లతో నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల ప్రజా వేదిక నేతృత్వంలో దశల వారీ పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, తమ్మినేని సూర్యనారాయణలు తెలిపారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ..ప్రతిపక్షంలో చంద్రబాబు ఉండి బాదుడే బాదుడు అనే కార్యక్రమాలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమని ఇప్పటికే భారంగా ఉన్న చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చి నేడు ఆ హామీని విస్మరించడం అంటే ఒడ్డు చేరాక తెప్ప తగలేసిన చందాన ఉందని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ ఆనాడు పిలిపునిచ్చారని నేడు అదే స్మార్ట్ మీటర్లు ఇంటింటికి వచ్చి బిగిస్తుంటే లోకేష్ నోరు మెదపకుండా ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి పాలకులు పూనుకుంటున్నారన్నారు. అదానీ స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు, ట్రూ అప్ చార్జీల విధానాన్ని తొలగించి, అదనపు భారాలు తగ్గించేవరకు, సెకీ ఒప్పందాలు రద్దు చేసే వరకు దశల వారీ పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ప్రజలందరూ సహకరించి ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, బూర వాసు, రెడ్డి శంకరరావు, పి.రమణమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లను రద్దుచేయాలి పార్వతీపురం: ప్రజాభిప్రాయానికి భిన్నంగా బిగిస్తున్న అదానీ స్మార్ట్మీటర్లను వెంటనే రద్దుచేయాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ సుంకాల రూపంలో రూ.12,717కోట్ల బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో శాశ్వత దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అదానీ స్మార్ట్మీటర్లు, సోలార్, విద్యుత్ ఒప్పందాలతో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలతో భారం మోయలేక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు నత్తనడకన సాగుతుండగా, ప్రజలపై భారాలు వేగంగా మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టీడీపీ నేడు స్మార్ట్మీటర్లను ఎలా బిగిస్తుందని ప్రశ్నించారు. స్మార్ట్మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి అని స్వయంగా నారా లోకేష్ పిలుపునిచ్చారని, నేడు అందుకు విరుద్ధంగా బిగిస్తున్నారని దుయ్యబట్టారు. స్మార్ట్మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని నిలుపుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.వెంకటరమణ, కె.మన్మథరావు, రైతు కూలీ సంఘ నాయకుడు డి.వర్మ, పి.ఈశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, బి.దాసు, పి.సంగం, పి. శ్రీనునాయుడు, బాషా సూరిబాబు, బి.లక్ష్మి, జి.సర్వేశ్వరరావు, రాము, బలరాం, పి.రంజిత్ కుమార్, ఈవీనాయుడు, జి.తులసి, ఎం. గౌరి, బి.జయమ్మ, పి.సన్యాసిరావు, ఎస్.ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ దినోత్సవానికి పక్కాఏర్పాట్లు
సీతంపేట: సీతంపేట, పాతపట్నంలలో ఈ నెల 9న నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఉత్సవాలకు వచ్చే గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. భోజన ఏర్పాట్లు బాగుండాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, సీఐ చంద్రమౌళి, డీడీ అన్నదొర, ఎస్ఐ అమ్మన్నరావు, పీహెచ్ఓ గణేష్, ఐటీడీఏ పరిపాలనాధికారి సునీల్, డిప్యూటీ ఈఓ రామ్మోహనరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి, ఏఎంఓ కోటిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు
● డా.డీవీజీ శంకరరావు పార్వతీపురం రూరల్: ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా తనకు అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ డీవీజీ శంకరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కలిసి ముచ్చటించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్గా అందించిన సేవలపై జగన్మోహన్ రెడ్డి తనను అభినందించినట్లు డీవీజీ శంకరరావు తెలిపారు. సెల్టవర్ల ఏర్పాటుకు ఆదేశం ● కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పార్వతీపురం రూరల్: జిల్లాలో సెల్టవర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జియో, బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుపై ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం సమీక్షించారు. ఇప్పటికే ప్రగతిలో ఉన్న టవర్ల పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధానమైన రోడ్ల పనులను గుర్తించి నిధులు మంజూరు చేయాలని డ్వామా పీడిని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాత్సవ, సి.యశ్వంత్కుమార్ రెడ్డి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఎఫ్ఓ జీఏపీ ప్రసూన, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి టీడీపీ ఫ్లెక్సీ జియ్యమ్మవలస రూరల్: కూటమి నేతలు బరితెగించారనేందుకు ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. జియ్యమ్మవలస ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ నేతల చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని కట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇది ప్రభుత్వ కార్యాలయమా? లేదా టీడీపీ కార్యాలయమా అంటూ వివిధ పనులపై ఎంపీడీఓ కార్యాలయానికి వస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు. ఏం కష్టమొచ్చిందో ఏమో..? పార్వతీపురం రూరల్: ఆ కుటుంబానికి ఏం కష్టమొచ్చిందో ఏమో? ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు బెలగాం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై మంగళవారం నిలబడ్డారు. వీరిని గమనించిన రైల్వేపోలీసులు వెంటనే అప్రమత్తమై మందలిస్తూ ప్లాట్ఫాంపైకి తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ చేశారు. వారి ఆవేదన విన్నారు. జీవితంలో ప్రతీ ఒక్కరికీ కష్టాలు తప్పవని, వాటిని అధిగమిస్తేనే మంచి జీవితం సొంతమవుతుందని నచ్చజెప్పారు. అనంతరం సివిల్ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసులను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. -
రైతన్నకు సాగు భరోసా ఏదీ?
సాలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నకు సాగుభరోసా కరువైందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు పట్టణంలో స్థానిక విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు 2024 జూన్ నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుచేస్తామని మేనిఫెస్టోలో పేర్కొని 2025లో అమలుచేశారన్నారు. అదికూడా రూ.20 వేలు ఇస్తామని చెప్పి తొలివిడతగా కేవలం రూ.5వేలు మాత్రమే వేశారన్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద 53లక్షల58 వేల మందికి లబ్ధి చేకూరితే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అన్నదాత సుఖీభవ కింద 46.85 లక్షల మంది రైతులకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. మిగిలిన 6.73 లక్షల మంది రైతులు ఏమయ్యారని, సాగు విడిచి వలస వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. చాలామంది రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం ఇంకా పడలేదన్నారు. నాడు విమర్శించిన మీరు నేడు ఏం చేస్తున్నారు? గత సీఎం జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కింద ఏడాదికి రూ.13,500 అందిస్తే... రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇవ్వాలని నాడు విమర్శించిన చంద్రబాబు నేడు అన్నదాత సుఖీభవ కింద ఎందుకు రూ. 20 వేలు ఇవ్వడంలేదని రాజన్నదొర ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుకు సిగ్గులేదని అనాలా అంటూ విమర్శించారు. గత ప్రభుత్వం ఏడాదికి రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి మరో రూ.1000 పెంచి రూ.13,500 అందజేసిందన్నారు. ఉచిత పంటల బీమా పథకంతో రైతాంగాన్ని ఆదుకుందన్నారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసిందన్నారు. యూరియా కోసం రైతులును రోడ్డెక్కించిన ఘనత ఎవరిది? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు ఎరువుల కొరత లేదని, ఆర్బీకేల వద్ద ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేవని రాజన్నదొర తెలిపారు. నేటి కూటమి పాలనలో రైతులకు ఎరువుల దొరకక ధర్నాలు చేయాల్సి వస్తోందన్నారు. యూరియా కోసం రైతులను రోడ్డెక్కించిన ఘనత ఎవరిదో రైతులే చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
స్పందించిన అధికారులు
జియ్యమ్మవలస రూరల్: ఈ నెల 5న కొండసిరిపి పాఠశాల ఉపాధ్యాయురాలు విధులకు గైర్హాజరు కావడంపై విచారణ జరుపుతామని గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఆర్.కృష్ణవేణి తెలిపారు. ‘మా టీచర్ బడికి రాలేదు’ శీర్షికకు మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు జియ్యమ్మవలస ఎంఈఓ, ఆర్ఆర్బీపురం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కొండసిరిపి పాఠశాలను సందర్శించారు. కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో హుటాహుటిన సెలవుపై వెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా వెళ్లినందుకు ఆమెకు మెమో జారీచేసి సంజాయిషీ కోరగా, ఇకపై ఇటువంటివి పునరావృతం కావని ఆమె తెలియజేసినట్టు వివరించారు. -
బాబూ.. మేము మోసపోయాం
బాబూ.. నీ మాయ మాటలు నమ్మి మోసపోయాం... సంక్షేమ పథకాలకు దూరమయ్యాం.. ఇక ఎన్నడూ నీ మాటలు నమ్మి మోసపోబోమంటూ జియ్యమ్మవలస మండలం గవరంపేట పంచాయతీ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కోట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో అధికమంది పాల్గొన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడం వల్ల ఏ మేరకు నష్టపోయామన్నది తెలియజేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడి్డ్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతీ పథకంలోనూ కోతపెడుతూ.. ఇబ్బందులకు గురిచేస్తూ పేదలకు సంక్షేమాన్ని దూరం చేస్తున్నారని వాపోయారు. – జియ్యమ్మవలస రూరల్ -
పరిమళించిన మానవత్వం
రాజాం సిటీ: మానవతా సంస్థ సభ్యుల్లో మానవత్వం పరిమళించింది. రోడ్డు పక్కన గాయాలతో బాధపడుతున్న అనాథ మహిళకు వైద్యసేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఆర్సీఎం చర్చి సమీపంలో అనాథ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఓ మూలన ఉన్న మహిళను స్థానికులు గుర్తించి మానవతా సంస్థ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే సభ్యులు ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, రెడ్క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య, కిరణ్లు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత అనాథ మహిళను ప్రత్యేక వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. అయితే ఆమె తీవ్రంగా గాయపడడంతో శస్త్రచికిత్స పడుతుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వైద్యులు తెలిపారని మానవతా సంస్థ సభ్యులు తెలిపారు. దీంతో పలువురు పట్టణవాసులు వారి సేవలను కొనియాడారు. -
ఏకలవ్య పాఠశాలను సందర్శించిన నోడల్ అధికారి
మక్కువ: మండలంలోని అనసభద్ర గ్రామం సమీపంలోని ఏకలవ్య పాఠశాలను నోడల్ అధికారి, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.సూర్యనారాయణ సోమవారం సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులు తరగతి గదులను, విద్యార్థులు హాజరు, భోజనమెనూ, పాఠశాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే మరుగుదొడ్లు అసంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉందన్నారు. ఆర్వో తాగునీరు అవసరమని, పాఠశాల ఆవరణ చదును చేయాల్సి ఉందని, ఇన్వర్టర్లు, జనరేటర్ అవసరమున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణ గుర్తించారు. పై సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన తెలిపారు.రాష్ట్ర స్థాయి పోటీలకు పార్వతీపురం యోగా సాధకులుపార్వతీపురం రూరల్: జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు ముగిశాయి. ఈ మేరకు పది నుంచి ఏబై ఏళ్ల వయస్సు గల క్రీడాకారులు ప్రతిభ చూపించారు. ఈ సందర్భంగా వారికి సోమవరం ప్రశంసాపత్రాలు, పతాకాలు అందించారు. ఈ సందర్భంగా పోటీల పరిశీలకుడు భాస్కరరావు మాట్లాడుతూ గెలుపొందిన విజేతలకు ఈ నెల 21నుంచి 24 వరకు తాడేపల్లె గూడెంలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. గంజాయి నిందితుడి అరెస్టుశృంగవరపుకోట: గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని కేరళ రాష్ట్రంలో పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో కేరళ రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు 117కిలోల గంజాయితో పట్టుబడ్డారన్నారు. ఈ కేసులో కేరళ నుంచి వాహనాన్ని పంపి గంజాయి తెమ్మని చెప్పిన కేరళ రాష్ట్రం, త్రిశూర్ జిల్లా కట్టూర్ పట్టణానికి చెందిన శ్రీజిత్ను కేరళ పోలీసుల సహకారంతో పట్టుకుని అరెస్టు చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు ఎస్.కోట తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో కేవలం పట్టుబడిన నిందితులపైనే కాకుండా, ప్రోత్సహిస్తున్న మూలాలను వెదికి పట్టుకుని కేసులు పెడుతున్నామన్నారు. మృతుడి ఆచూకీ లభ్యంవేపాడ: మండలంలోని నీలకంఠరాజపురం గ్రామంలో రైవాడ కల్వర్టు వద్ద గుర్తుతెలియని వాహానం ఢీకొనడంతో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినట్లు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఆర్దరాత్రి రైవాడ కాలువ కల్వర్టువద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన విషయం విదితమే. ఈ సంఘటనపై పలు పత్రికల్లో వచ్చిన వార్తలతో కుటుంబసభ్యులు గుర్తించి వల్లంపూడి స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతినగరానికి చెందిన పీలా శివశంకర్ (41) ప్రమాదంలో మృతిచెందినట్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న శివశంకర్ భార్య పార్వతి స్టేషన్కు వచ్చినట్లు తెలిపారు. మృతిచెందిన శివశంకర్ విశాఖలోని మధురవాడలో ఆయుష్ డిపార్ట్మెంట్లో వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. రెండోతేదీన ఎస్.కోట వివేకానంద కాలేజీలో ఇంటర్ చదువుతున్న కుమార్తెను చూడడానికి వెళ్లి తిరిగి వస్తుండగా నీలకంఠరాజపురం రైవాడ కల్వర్టు వద్ద ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు శివశంకర్కు భార్య పార్వతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పార్వతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఢీ కొన్న గుర్తుతెలియన వాహనంపై బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మీరిచ్చిన హామీలు గుర్తు చేయడం తప్పా..?
సాలూరు: టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేయడం తప్పా? మీరిచ్చిన హామీలను గుర్తుచేస్తున్న మాపై తప్పుడు విమర్శలు చేస్తారా? అంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మండిపడ్డారు. ఈ మేరకు సాలూరు పట్టణంలోని 2,4,5 వార్డుల్లో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటి కార్యక్రమంలో రాజన్నదొర పాల్గొన్నారు. ఈ క్రమంలో వార్డుల్లో తిరిగిన ఆయనకు అడుగడుగునా స్థానిక మహిళలు, ప్రజలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయలేదని వాపోతూ , తమ సమస్యలను ప్రజలు రాజన్నదొర ముందు ఏకరువు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మీకు ఈ పాంప్లెట్ల ద్వారా ఇస్తున్నామని, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినా అవి వస్తాయని ప్రజలకు రాజన్నదొర తెలిపారు. ఆడబిడ్డ నిధి అమలు చేసేదెప్పుడు? 2024 ఎన్నికల్లో సుమారు 2 కోట్ల 10 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిసిందని అందులో 60 ఏళ్లు పైబడిన వారు సుమారు 60 వేల మందిని తీసేసినా కనీసం కోటి 50 లక్షల మంది మహిళలకు అడబిడ్డ నిధి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నేడు ఆ హామీని అమలుచేయకుండా ప్రజలను మోసం చేసే పద్ధతి సరైంది కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏ అన్యాయం జరిగినా, ఏ కష్టమొచ్చినా, ఓ సోదరుడిగా, మీ ఇంటి పెద్దకొడుకుగా అండగా నేను ఉంటానని రాజన్నదొర పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 5 వ వార్డులో అంబేడ్కర్ విగ్రహానికి రాజన్నదొర పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గిరిరఘు, సింగారపు ఈశ్వరరావు, గులిపల్లినాగ, నిమ్మకాయల సువర్ణమ్మ, తాడ్డి లక్ష్మి, శంకరరావు, యశోదకృష్ణ, రౌతు చిన్నయ్య, శ్రీను, చిన్నారావు, పిరిడిరామకృష్ణ, మజ్జి అప్పారావు, కాకి పాండురంగారావు, కొల్లి వెంకటరమణ, హరిబాలాజీ తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
మా టీచర్ రాలేదు..
చిత్రంలో పాఠశాల గేటు ఎక్కి ప్రమాదకర స్థితిలో ఆడుకుంటున్నది జియ్యమ్మవలస మండలం కొండసిరిపి జీపీఎస్ విద్యార్థులు. పాఠశాల సమయంలో అడుకుంటున్నారేమిటని చిన్నారులను ప్రశ్నిస్తే టీచర్ రాలేదంటూ సమాధానమిచ్చారు. సీఆర్టీ సోమవారం పాఠశాలకు రాకపోవడంతో చిన్నారులు ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఆడుకుంటూ ఇంటిబాట పట్టారు. వాస్తవంగా సీఆర్టీ సెలవు పెడితే ఎంఈఓ మరొక టీచర్ను పాఠశాలకు పంపించాలి. ఇక్కడ ఆ నిబంధన అమలు కావడం లేదు. టీచర్ సెలవుపెట్టినప్పుడు తరగతులు సాగడంలేదని, ఎప్పడు తరగతులు ఉంటాయో లేదో తెలియడంలేదని, చిన్నారుకు బోధన సాగడంలేదని గ్రామస్తులు తెలిపారు. – జియ్యమ్మవలస రూరల్ -
ఆనకట్టవద్ద గోతిలో పడి వ్యక్తి మృతి
జామి: మండలంలో జామి ఆనకట్టవద్ద గోతిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆనందపురం మండలం బొడ్డుపాలెం గ్రామానికి చెందిన సాడి లక్ష్మణరెడ్డి(38) తన స్నేహితులతో కలిసి స్నేహితుల దినోత్సవం సందర్భంగా జాగరం గెడ్డనీరు జామి గోస్తనినదిలో కలిసే ప్రాంతం వద్దకు ఆదివారం సాయంత్రం వచ్చి సరదాగా గడిపాడు. ఈ క్రమంలో బహిర్భుమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి ఆనకట్టవద్ద ఉన్న గోతిలో పడిపోయాడు. స్ధానికులు, రెస్క్యూ బృందం గాలించగా సోమవారం ఉదయం లక్ష్మణరెడ్డి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై మృతుడి భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జామి ఎస్సై వీరజనార్దన్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..భోగాపురం: మండలంలోని రావాడ గ్రామానికి చెందిన బుగత ఈశ్వరరావు(47) తగరపువలసలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించినట్లు ఎస్సై పాపారావు తెలిపారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావాడ గ్రామానికి చెందిన ఈశ్వరరావుకు భార్య గోవిందమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమధ్య కాలంలో తల్లికి వందనం ద్వారా భార్య బ్యాంకు ఖతాలో డబ్బులు పడ్డాయి. అందులో నుంచి కొంత డబ్బులు ఇవ్వమని భర్త ఈశ్వరరావు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఈశ్వరరావు నెల 2వ తేదీన గ్రామానికి సమీపంలో ఉన్న భాష్యం లేఅవుట్లోకి వెళ్లి పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే తగరపువలస ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై పాపారావు కేసు నమోదు చేశారు. -
అర్జీల పరిష్కారానికి శ్రద్ధ తీసుకోవాలి
పార్వతీపురం రూరల్: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం 138 అర్జీలను కలెక్టర్తో పాటు పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె. హేమలత కేఆర్సీ ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి స్వీకరించారు. నిర్దేశించిన గడువులోనే పెండింగ్లు లేకుండా అర్జీలను పరిష్కరించాలని అధికారుకు ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లాలోని పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.వేగంగా సమస్యల పరిష్కారం సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశమని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై ఫకృద్దీన్ తదితర సిబ్బంది ఉన్నారు. ఐవీఆర్ఎస్ సంతృప్తికరంగా ఉండాలిప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలపై అర్జీదారుల సంతృప్తిస్థాయి పెరగాల్సి ఉందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కార విషయమై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం చేసే సర్వేలో శతశాతం సంతృప్తికరంగా ఉన్నట్లు అర్జీదారుల స్పందన ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సర్వేలో శతశాతం సంతృప్తి చెందకపోతే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్, పీ4, పీఎం సూర్యఘర్, ఈపీటీఎస్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓలు అశుతోష్శ్రీవాత్సవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీలు పి. ధర్మచంద్రారెడ్డి, ఎస్. దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి, డీఈఓ బి. రాజ్కుమార్, డీఐఈఓ వై. నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్. తేజేశ్వరరావు, ఈపీడీసీఎల్ ఎస్ఈకె మల్లికార్జునరావు, డీఎంఅండ్హెచ్ఓ డా. భాస్కరరావు, డీఏ హెచ్ఓ డా. మన్మధరావు, డీబీసీ డబ్ల్యూఓ అప్పన్న, డీఆర్డబ్ల్యూఎస్ఈఓ ప్రభాకరరావు, సీడీపీఓ శాంతి భవాని, వివిధ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ -
క్రీడాకారులతో ఆటలు..!
● జిల్లా క్రికెట్లో చక్రం తిప్పుతున్న సెలక్షన్ కమిటీ సభ్యుడు ● పొరుగు జిల్లాలు, రాష్ట్రాల క్రీడాకారులకు పెద్దపీట ● డమ్మీగా మారిన చైర్మన్, కార్యదర్శులు ● అసోసియేషన్ సభ్యులను ఖాతరు చేయని సెలెక్టర్ ● జిల్లా క్రీడాకారులకు న్యాయం చేయాలంటూ మంత్రికి మొరపెట్టుకున్న తల్లిదండ్రులు ● నిమ్మకునీరెత్తినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ విజయనగరం: జిల్లా క్రికెట్లో ఉమ్మడి విజయనగరం జిల్లా క్రీడాకారుల ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. జిల్లా జట్ల ఎంపికలో సెలక్షన్ కమిటీ సభ్యుడి ఒంటెత్తు పోకడలతో జిల్లా క్రీడాకారులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఇదే తరహా వ్యవహారం నడుస్తున్నప్పటికీ, ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జిల్లా క్రీడాకారులకు న్యాయం చేస్తామంటూ ప్రకటనలు చేశారు. సంబంధిత శాఖాధికారులతో పాటు, అసోసియేషన్ ప్రతినిధులతో స్థానిక ఎమ్మెల్యే సమీక్ష చేశారు. అయితే ఏడాది కాలమైనా అదే పరిస్థితి కొనసాగడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా క్రికెట్లో కీలక స్థానంలో ఉన్న కార్యదర్శితో తనకున్న స్నేహాన్ని ఉపయోగించుకుని జట్ల ఎంపికలో తన మాటే చెల్లుబాటయ్యేలా సెలక్షన్ కమిటీ సభ్యుడు వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తల్లిదండ్రులు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వద్ద ఏకరువు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికై నా దేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయనగరం క్రికెటర్ సర్ విజ్జి నడయాడిన జిల్లాలో స్థానిక క్రీడాకారులకే చోటు కల్పించాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కృషి చేయాలని స్థానిక క్రీడాకారులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అన్నీ వట్టి మాటలేనా? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరేడు నెలలకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. చైర్మన్గా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కార్యదర్శిగా పి.సీతారామరాజు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అయితే నూతన కార్యవర్గం ఏర్పడిన సమయంలో సభ్యులు, అసోసియేషన్ పెద్దలు స్థానిక క్రీడాకారులకే ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పిన మాటలు వట్టి మాటలు గానే మిగిలిపోయాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025లో అన్ని విభాగాల జట్ల ఎంపికలో స్థానికేతర క్రీడాకారులకే తగిన ప్రాధాన్యం దక్కినట్లు తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల అండర్–16 జట్టుకు ఎంపికై న 18 మంది జిల్లా జట్టు క్రీడాకారుల్లో సుమారు 13 మంది పొరుగు జిల్లాలకు చెందిన క్రీడాకారులే ఉన్నారంటే ఇతర జిల్లాల క్రీడాకారుల హవా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అలాగే అండర్ –19, అండర్– 23, సీనియర్ విభాగంలోనూ వారి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. గుర్రుగా అసోసియేషన్ సభ్యులు జిల్లా సెలక్షన్ కమిటీ సభ్యుల తీరుపై అసోసియేషన్ లోని కొంతమంది సభ్యులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ ఒంటెత్తు పోకడలతో విసుగు చెందిన అసోసియేషన్ సభ్యులు సైతం తల్లిదండ్రులతో పాటు మంత్రి వద్దకు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.విజయనగరం కాదు.. విశాఖ ‘బి’ జట్టు పేరు సార్థకం విజయనగరం జిల్లా జట్టులో ఒకప్పుడు క్రికెట్ ఆడే క్రీడాకారులు లేక పొరుగు జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చి జిల్లా తరఫున ఆడేవారు. నాటి నుంచి క్రికెట్ వర్గాల్లో విజయనగరం జిల్లా జట్టును విశాఖ బి జట్టుగా పిలిచేవారు. అయితే జిల్లా క్రీడాకారులకు క్రికెట్పై అవగాహన పెరగడంతో ఎక్కువ సంఖ్యలో జిల్లా క్రీడాకారులు ఎక్కువమంది క్రికెట్ ను ప్రొఫొషన్గా తీసుకున్నారు. దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధిక సంఖ్యలో క్రీడాకారులు తయారయ్యారు. అయినా గడిచిన మూడు, నాలుగేళ్లుగా విజయనగరం జిల్లా జట్టులో వలస పక్షుల ప్రాతినిధ్యం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ప్రతి ఏటా అండర్–12, అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–23, సీనియర్స్ విభాగాల్లో ఎంపికలు జరిగితే ప్రతి విభాగంలో సగానికి పైగా పొరుగు జిల్లా క్రీడాకారులకే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.దర్జాగా వస్తారు.. జట్టులో చోటు ఎగరేసుకు పోతారు పొరుగు జిల్లాల క్రీడాకారులు ఇక్కడ వారి సలహాతోనే జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలో చేరుతారు. వారందించే స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా సదరు సెలెక్టర్ వారిని జట్టుకు ఎంపిక చేస్తారు. అయితే వారు పాఠశాలకు వచ్చింది లేదు..వెళ్లిందీ లేదు. ఎందుకంటే ఇక్కడికి ప్రతిరోజు పాఠశాలకు గాని, కళాశాలకు గానీ వస్తే, జిల్లా కేంద్రంలోని విజ్జి స్టేడియంలో ప్రతిరోజు నిర్వహించే ప్రాక్టీస్ సెషనన్కు ఎందుకు రారని స్థానిక క్రీడాకారులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్థానికేతర క్రీడాకారుల తల్లిదండ్రులు ఆధార్ ఇతరత్రా సర్టిఫికెట్లు పొరుగు జిల్లాలోనే ఉంటాయి. వీరివి మాత్రం అన్ని సర్టిఫికెట్లు ఇక్కడే ఉన్నట్లు సెలక్షన్ సమయంలో అందిస్తుంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పాటిస్తున్నాం:జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి జట్టు ఎంపికల్లో నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాం. మూడేళ్ల పాటు జిల్లా పరిధిలో చదివే వారికి అవకాశం కల్పిస్తున్నాం. క్రీడాకారుడి స్టడీ సర్టిఫికెట్, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నాం. వాటి ప్రకారమే ఎంపికలకు అనుమతిస్తున్నాం. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవినీతికి తావులేకుండా చూస్తున్నాం. – పి.సీతారామరాజు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, విజయనగరం. -
కలెక్టర్ వద్దకు మున్సిపల్ పంచాయితీ!
● కమిషనర్ వర్సెస్ ఉద్యోగులు ● చోద్యం చూస్తున్న ‘పెద్దన్న’లు ● రోజురోజుకూ జఠిలమవుతున్న వివాదం సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘంలో కమిషన ర్ వెంకటేశ్వర్లు, ఉద్యోగుల మధ్య వివాదం రోజురోజుకూ జఠిలమవుతోంది. ఇప్పటికే పలు దఫాలు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ తీరును ఎండగట్టారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ వెంకటేశ్వర్లు తమను ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నదీ వివరించారు. ప్రతి పనికీ రే టు కట్టేసి.. ప్రజల నుంచే కాక, స్వయంగా సిబ్బంది వద్ద కూడా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చి న మొత్తంలో ఎమ్మెల్యేకు, ఉన్నతాధికారులకు ఇవ్వాలని బహిరంగంగానే కమిషనర్ చెబుతున్న ట్లు సాక్షాత్తు శాసనసభ్యులు విజయ్చంద్ర వద్దే ప్రస్తావించారు. కొన్ని నెలలుగా కమిషనర్ వెంకటేశ్వర్లు తీరుతో ఎంతోమంది విసుగు చెందుతున్నా.. సయోధ్యకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. పాలకవర్గానికీ కమిషనర్ తీరుతో ఇబ్బందులు పార్వతీపురం పురపాలక సంఘం కమిషనర్ వెంకటేశ్వర్లు తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గాన్నీ లెక్క చేయక, ప్రోటోకాల్ పాటించక పక్కా టీడీపీ కార్యకర్త మాదిరి పని చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, సభ్యులే లక్ష్యంగా.. వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై పాలకవర్గ సభ్యులు ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులు ఆ శాఖ ఆర్డీ కూడా విచారణ జరిపారు. ఆ సమయంలోనూ వివిధ వర్గాల నుంచి కమిషనర్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెళ్లాయి. నలిగిపోతున్న ఉద్యోగులు మరోవైపు కమిషనర్ తీరుతో కార్యాలయ ఉద్యోగులూ నలిగిపోతున్నారు. కార్యాలయం దగ్గర పలుమార్లు ఆందోళన చేశారు. పెన్డౌన్ చేపట్టారు. చైర్పర్సన్ గౌరీశ్వరికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కు మొర పెట్టుకున్నారు. చివరికి సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ అవినీతిని, తమ పట్ల ఆయన వైఖరిని ఎండగట్టారు. కమిషనర్కు ఎమ్మెల్యే అండ? మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు స్థానిక ఎమ్మెల్యే అండ పుష్కలంగా ఉందన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే ఆయనను ఇక్కడ నియమించారని చెబుతుంటారు. అందువల్లే ఎవరెన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఆయనపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కనీసం ఇరువర్గాల మధ్య సయోధ్యకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. ఈ ప్రభావం మున్సిపాలిటీ అభివృద్ధి మీద పడుతున్నా.. వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కలెక్టర్ అయినా జోక్యం చేసుకుని, దీనికి పరిష్కారం చూపుతారో, లేదో చూడాలి.