breaking news
Parvathipuram manyam District Latest News
-
ఎస్ఐ న్యాయం చేయడం లేదు...
చీపురుపల్లి: తమ కుమారుడిని యజమానే హత్య చేశాడని, ఆయనకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీస్స్టేషన్లో ఎస్ఐకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని మండలంలోని పత్తికాయవలసకు చెందిన మృతుడు యలకల రాము తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్కు వచ్చిన మృతుని తల్లిదండ్రులు యలకల రమేష్, సింహాచలం, చెల్లి రమ, మేనమామలు ముగిది పైడితల్లి, ముగిది గొల్ల, మేనత్తలు ముగిది సత్యవతి, రాధ మాట్లాడారు. కొడుకును పోగొట్టుకుని ఉన్న తమకు న్యాయం జరగడం లేదన్నారు. తమ కుమారుడు రామును సంబంధిత యజమాని వండాన సన్యాసి హత్య చేశాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ పట్టించుకోవడం లేదన్నారు. ఎస్ఐకు జేసీబీ యజమాని వండాన సన్యాసికి బంధుత్వం ఉండడంతోనే హత్య కేసును నీరుగార్చే కుట్ర పన్నుతున్నారనే భయం కలుగుతోందన్నారు. అందుకనే తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఐదారు రోజులు క్రితమే తమ కుమారుడును జేసీబీ యజమాని వండాన సన్యాసి హత్య చేశాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. ఇంతవరకు కనీసం గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించలేదని పేర్కొన్నారు. అందుకే తమకు న్యాయం జరగదని భయం పెరిగిందన్నారు. కూలి పనులు చేసుకునే తమకు ఎలాంటి అండదండలు లేవని పోలీసులు కూడా న్యాయం చేయకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. జేసీబీ యజమాని సన్యాసి మొబైల్లో అక్టోబర్ 7 నుంచి 12 వరకు కాల్ లిస్ట్ వెల్లడించాలని పోలీసులను కోరామన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. హత్య చేశాడని ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టలేదు.. జేసీబీ యజమానికి ఎస్ఐకు బంధుత్వం ఉండడమే కారణం మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన -
దివ్యాంగులకు మళ్లీ వైద్య పరీక్షలు!
విజయనగరం ఫోర్ట్: ఏళ్ల తరబడి పింఛన్ పొందుతున్న దివ్యాంగులకు కూటమి సర్కార్ అఽధికారంలోకి రాగానే పెద్ద షాక్ ఇచ్చింది. దివ్యాంగ పింఛన్ పొందుతున్న ప్రతీ దివ్యాంగుడు రీ అసెస్మెంట్ చేయించుకోవాలని కూటమి సర్కార్ నోటీసులు అందించింది. సచివాలయాల పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా వారికి ఏ ఆస్పత్రికి ఏ సమయానికి వెళ్లాలి అనే దానిపై నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి నెలలో రీ అసెస్మెంట్ కార్యక్రమం వైద్య విధాన్ పరిషత్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఆగస్టు నెల వరకు నిర్వహించారు. పింఛన్ పునః పరిశీలన మాత్రమే, ఏ ఒక్క దివ్యాంగుడి పింఛన్ తొలగించబోమని అప్పట్లో కూటమి ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆగస్టు నెలలో పింఛన్లు తొలగిస్తామని నోటీసులు ఆగస్టు నెలలో రీ అసెస్మెంట్ 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని చెప్పి జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు నోటీసులు ఇచ్చారు. దీంతో తమకు అర్హత ఉందని చెిప్పి జిల్లాలో 5,159 మంది దివ్యాంగులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ పరీక్షలు.. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు మళ్లీ వైద్యులు పరీక్షలు చేయనున్నారు. నాలుగు వైద్య విధాన్ పరిషత్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు దివ్యాంగులకు సచివాలయం ఉద్యోగులు నోటీసులు కూడా అందించారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, గజపతినగరం ఏరియా ఆస్పత్రి, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి, రాజాం ఏరియా ఆస్పత్రి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్థో విభాగానికి చెందిన దివ్యాంగులు 3600 మందికి, కంటికి సంబంధించి దివ్యాంగులు 1038మందికి, చెవుడు, మూగకు సంబంధించిన దివ్యాంగులు 465మందికి, మెంటల్ డిజార్డర్కు సంబంధించి దివ్యాంగులు 42 మందికి, మెంటల్ ఇల్నెస్కు సంబంధించిన దివ్యాంగులు 14 మందికి పరీక్షలు చేయనున్నారు. పింఛన్లు తొలగించేందుకే.. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతున్నట్టు కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. ఈ చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి ఆ చేత్తో లాగేసికొన్నట్టు కూటమి సర్కార్ దివ్యాంగులకు పింఛన్ పెంచి ఆ భారాన్ని తగ్గించుకునే కుట్ర చేస్తుందని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. పింఛన్ పెంచడం వల్ల కోట్లాది రుపాయిల భారం పడుతుందనే దురుద్దేశంతో కూటమి సర్కార్ పింఛన్ తొలగించడానికే దివ్యాంగులకు రీ అసెస్మెంట్ పేరుతో పరీక్షలు చేయిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆందోళనకు గురవుతున్న దివ్యాంగులు 5,159 మందికి వైకల్య పరీక్షలకు మళ్లీ రావాలని నోటీసులు ఏపీవీపీ, జీజీహెచ్లో పరీక్షలు చేయనున్న వైద్యులు ఫించను తొలగిస్తామని ఆగస్టులో నోటీసులు ఇచ్చిన కూటమి సర్కార్ మాకు అర్హత ఉందని దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులువైకల్య పరీక్షలు దివ్యాంగ పింఛన్కు తమకు అర్హత ఉందని జిల్లాలో 5,159 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి సచివాలయాల ద్వారా ఏ ఆస్పత్రికి, ఏ సమయానికి వెళ్లాలో నోటీసులు వెళ్లాయి. ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు దివ్యాంగులకు పరీ క్షలు చేసి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయనున్నారు. –డాక్టర్ ఎన్.పద్మశ్రీరాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి -
న్యాయం కోసం.. ఆత్మహత్యా యత్నం..
● తాకట్టు బంగారం కోసం జ్యువెలరీ షాపు వద్ద కుటుంబం నిరసన ● పెట్రోల్ డబ్బాతో బాధితుడి హల్చల్ పార్వతీపురం రూరల్: తాకట్టు పెట్టిన బంగారం తిరిగివ్వాలని కోరుతూ ఓ కుటుంబం బంగారం దుకాణం వద్ద ఆందోళనకు దిగిన ఘటన పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో, బాధితుడు ఏకంగా పురుగుల మందు తాగి, పెట్రోల్తో అఘాయిత్యానికి యత్నించడం కలకలం రేపింది. బాధితుడు కోట విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన ఆయన, 2019లో తన అవసరాల నిమిత్తం శ్రీస్వామి జ్యువెలరీ యజమాని గెంబలి శంకరరావు వద్ద 30 తులాల బంగారం తాకట్టు పెట్టారు. కొన్నాళ్లకు శంకర్రావు కరోనాతో మరణించగా, ఆయన కుమారులు పృథ్వీ, విజయ్ కుమార్లను సంప్రదించినట్టు బాధితుడు విజయ్ తెలిపారు. అప్పటి నుంచి రెండేళ్లుగా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ వారు కాలయాపన చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా, 15 తులాలకు లెక్క తేల్చాలని చూశారని, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడా న్యాయం జరగకపోవడంతో విసిగిపోయిన విజయ్, చివరకు పట్టణ పోలీస్స్టేషన్న్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు సైతం చేతులు దులుపుకొన్నారని, తమకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని బాధితుడు ఆరోపించాడు. పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో శనివారం నేరుగా జ్యువెలర్ షాపు వద్దకు చేరుకున్నాడు. షాపులోకి వెళ్లి పురుగుల మందు తాగేందుకు, పెట్రోల్తో ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు శ్రీదేవి, సాయిరూప అడ్డుకున్నారు. అనంతరం షాపు గేట్లు మూసివేసి నడిరోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్ఐ జగదీష్నాయుడు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా బాధితులు వెనక్కి తగ్గలేదు. అనంతరం సీఐ మురళీధర్ సైతం అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించినప్పటికీ, బాధితుల ఆందోళన మాత్రం చల్లారలేదు. పోలీసుల జోక్యం చేసుకున్నప్పటికీ ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. శనివారం సాయంత్రం పట్టణానికి చెందిన ఓ తెలుగుదేశం నాయకుడి ఆధ్వర్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్టు బాధితులు వాపోయారు. సోమవారం నాటికి చెల్లింపులు జరిపేలా సయోధ్య కుదిరిందని బాధితులు తెలపడంతో ఆందోళన విరమించారు. చట్టపరంగా, పోలీస్స్టేషన్ ద్వారా తేలాల్సిన వివాదం, చివరకు రాజకీయ నాయకుడి పంచాయతీతో తాత్కాలికంగా రాజీ అయినట్టు బాధితుల తెలిపిన వివరాల మేరకు స్పష్టమైంది -
‘రియల్’గా మోసం..!
చీపురుపల్లి: వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా.. అనే సామెతలా ఏం చేసినా చర్యలు తీసుకోని అధికార యంత్రాంగం ఉండగా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రియల్టర్లు రెచ్చిపోతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా పెద్ద పెద్ద వెంచర్లు వేసి దూర ప్రాంతాల్లో ఉండే కొనుగోలుదారులను మోసం చేసి యథేచ్ఛగా అమ్మకాలు జరిపేస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్టే వదిలేస్తున్నారు. దీని వెనుక రియల్టర్లతో అధికార యంత్రాంగానికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమనే చర్చ జరుగుతోంది. దీనికి మండలంలోని చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో వెలిసిన 69 ఎకరాల మెగా వెంచర్ చక్కని అద్దం పడుతోంది. ఈ మెగా వెంచర్కు ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్గా కొనుగోలుదారులను మోసం చేసి అమ్మకాలు జరుపుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్లో ప్లాట్ నంబర్లు వేసి మరీ దర్జాగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. చిననడిపల్లి రెవెన్యూలో 69 ఎకరాల మెగా వెంచర్ మండలంలోని శివారు పంచాయతీ చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో మండల సర్వేయర్ తెలిపిన సర్వే నంబర్లు ప్రకారం సర్వే నంబర్ 73, 94, 93, 92ల్లో దాదాపు 69 ఎకరాల వ్యవసాయ భూమిని చదును చేసి మెగా రియల్ వెంచర్ను సిద్ధం చేశారు. అందు లో స్థలాలను ప్లాట్లుగా విభజించి రోడ్లు వేసి సిద్ధం చేశారు. ప్రస్తుతం సర్వే నంబర్ 73కు చెందిన ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. చిననడిపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని కమ్మసిగడాం వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ మెగా వెంచర్లో ఇప్పటికే ప్లాట్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ, ఉడా అనుమతులు లేకుండానే.. సాధారణంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ల్యాండ్ కన్వర్షన్ ఫీజు రెవెన్యూ శాఖ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ల్యాండ్ కన్వర్షన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదట. అంతేకాకుండా కనీసం పంచాయతీ తీర్మానం ద్వారా అనుమతులు, ఉడా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. మోసపోతున్న కొనుగోలుదారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడి మెగా వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ఎంతో మంది కొనుగోలుదారులు మోసపోతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పంచాయతీ, ఉడా అనుమతులు లేని ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోవాలన్నా బ్యాంకు రుణాలు కూడా రావు. అంతేకాకుండా పంచాయతీ ఇంటి నిర్మాణ ప్లాన్ అనుమతులు కూడా ఇవ్వదు. ఇవన్నీ తెలియకుండానే కొనుగోలుదారుకు ఏవో మాయ మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు ప్లాట్లు అంటగడుతున్నట్టు చర్చ జరుగుతోంది. మండలంలోని పత్తికాయవలస సమీపంలో గతంలో ఇలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్ను ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్మకాలు జరిపారు. ఇప్పుడు ఆ వెంచర్లో రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలుస్తోంది. 69 ఎకరాల్లో అనధికారికంగా వెంచర్ పంచాయతీ, ఉడా అనుమతులు లేకుండానే.. ప్లాట్ నంబర్లతో దర్జాగా రిజిస్ట్రేషన్లు చూసీ చూడనట్టు వదిలేస్తున్న అధికారులు అనుమతులు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చు.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి పంచాయతీ, ఉడా అనుమతులు లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయొచ్చు. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 73లో మెగా వెంచర్లో ప్లాట్ నంబర్లతో సహా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. – లక్ష్మణరావు, సబ్ రిజిస్టార్, చీపురుపల్లి చర్యలు తీసుకుంటాం.. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో సిద్ధమైన మెగా వెంచర్ తమ దృష్టికి ఇంతవరకు రాలేదు. ఇంతవరకు ఎలాంటి వెంచర్లకు అనుమతులు ఇవ్వలేదు. తక్షణమే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. – ఐ.సురేష్, ఎంపీడీఓ, చీపురుపల్లి -
సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు యూనివర్సిటీ జట్టులో స్థానం
విజయనగరం అర్బన్: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ కళాశాల కబడ్డీ టోర్నమెంట్ – 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు నలుగురు యూనివర్సిటీ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. వీరు రాబోయే దక్షణ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ తరఫున పోటీపడనున్నారు. ఎంపికై న విద్యార్థులలో శ్రీవల్లి, రమ్య, నీలిమ, వరలక్ష్మి ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయి దేవ మణి తెలిపారు. అలాగే జూడే విభాగంలో జరిగిన అంతర్ కళాశాల పోటీల్లో ప్రధమ స్థానం సాధించిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి హేమంత్ సౌత్ జోన్ జూడో చాంపియన్షిప్కు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శిశభూషణరావు, ఫిజికల్ డైరెక్టర్ ఎస్హెచ్ ప్రసాద్ అభినందించారు. -
విద్యార్థులను పరామర్శించిన డీడీ
సాలూరు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులను ఐటీడీఏ డీడీ విజయశాంతి, ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి వేర్వేరుగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ, సాలూరు మండలం మామిడిపల్లి, మక్కువ మండలం ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులపై మరణాలకు సంబంధించి ఆ పాఠశాలల హెచ్ఎమ్ సీతారాం, పుష్పనాధం, మామిడిపల్లి వార్డెన్ విజయలను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయులకు ఆ బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. అనంతరం ఐటీడీఏ డీడీ విజయశాంతి పట్టణంలో బంగారమ్మ కాలనీలో ఉన్న బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : జేసీ పార్వతీపురం రూరల్: స్వచ్ఛ పార్వతీపురం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల స్వచ్ఛమైన గాలి నినాదంలో భాగంగా జాయింట్ కలెక్టర్తో పాటు డీఆర్వో కె.హేమలత, రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి మొక్కల వల్లే సాధ్యం, ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని కోరారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజా రవాణా వినియోగించాలని, సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలని సూచించారు. నిత్యం కొంత సమయం పరిశుభ్రతకు కేటాయించి, దానిని అలవాటుగా మార్చుకున్నప్పుడే స్వచ్ఛ పార్వతీపురం రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో స్వచ్ఛతపై జేసీ ప్రతిజ్ఞ చేయించారు. నేడు జూనియర్స్ తైక్వాండో క్రీడాకారుల ఎంపికలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్, క్యాడెట్ తైక్వాండో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 19న ఆదివారం నిర్వహించనున్నట్టు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు డివి.చారిప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో విజయనగరం వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, గ్రేడింగ్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని సూచించారు. వివరాలకు 7793950599 నంబరును సంప్రదించాలని కోరారు. నేడు పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లును పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష శనివారం తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి స్తపన కార్యక్రమాన్ని నిర్వహించి, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో విశిష్ట పూజలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పైడితల్లి అమ్మవారి దీక్షాపరులతో కలశ జ్యోతులు పట్టుకుని ఉత్సవ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు వనంగుడి నుంచి బయలుదేరుతుందని, దీక్షాపరులు కలశజ్యోతులు చేతపట్టుకుని జై పైడిమాంబ నినాదాలతో గాడీఖానా, వైఎస్ఆర్ సర్కిల్, ఎన్సీఎస్ థియేటర్ రోడ్డు, కన్యకపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా చదురుగుడికి చేరుకుని అక్కడ అమ్మవారికి జ్యోతులు సమర్పిస్తారని తెలిపారు. అనంతరం చదురుగుడి వద్ద భారీ ఎత్తున మెట్ల పూజను దీక్షాపరుల ఆదిపీఠం ఆధ్వర్యంలో నిర్వహించన్నుట్టు పేర్కొన్నారు. భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. -
23న పీడీఎస్వో జిల్లా మహాసభలు
పార్వతీపురం: పీడీఎస్వో జిల్లా మహసభలు ఈ నెల 23న పార్వతీపురంలో నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షులు కె.సోమేష్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మహాసభలకు సంబంధించి పోస్టర్ను సోమేష్తో కలిసి సంఘ సభ్యులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా రంగంలో వున్న సమస్యలను పరిష్కరించాలని, గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. సభలలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బాలకృష్ణ, ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు, పీడీఎస్వో రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కరరావు, ఎన్వైఎస్ జిల్లా నాయకులు పీడిక అసిరి తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
రోగులకు మెరుగైన సేవలందించాలి : డీఎంఈ
విజయనగరం ఫోర్ట్: రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంఈ (వైద్య విద్యా సంచాలకులు) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ విభాగాన్ని, క్యాజువాలటీ, ల్యాబొరేటరీ, ఫిమేల్ శస్త్రచికిత్సల వార్డు, పురుషల మెడికల్ వార్డును, ఎక్సరే, స్కానింగ్లను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. రోగులకు అవసరమైన చికిత్స, మందులు అందజేయాలన్నారు. శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రిలో చేరిన వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి శస్త్రచికిత్స సకాలంలో చేయాలన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడి వారికి అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం ఎండోస్కోప్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంఈని వైద్యులు సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ రమణి, డాక్టర్ శివశ్రీధర్, ఎముకలు, మత్తు, న్యూరోసర్జరీ, డెర్మాటాలజీ హెచ్వోడీలు డాక్టర్ లోక్నాధ్, డాక్టర్ జయధీర్బాబు, డాక్టర్ ప్రహ్లాదరెడ్డి, డాక్టర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. -
● పక్కపక్కనే...
చిత్రంలో కనిపిస్తున్నవి ఆంధ్రా–ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిపై బొబ్బిలి ఫ్లై ఓవర్కు వందమీటర్ల లోపల ఏర్పాటుచేసిన బాణ సంచా విక్రయ దుకాణాలు. వీటికి సమీపంలో ఆస్పత్రులు, ఆలయాలు, పాఠశాలలు ఉన్నాయి. ఇంకా అధికారులు అనుమతులు ఇవ్వకుండా... దుకాణాల మధ్య కనీస దూరం (20 అడుగులు) పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అధికారుల నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. – బొబ్బిలి -
ప్రజాస్వామ్యం.. అపహాస్యం
–IIలో● అక్షరంపై ఆంక్షలు.. సిగ్గు సిగ్గు! ● ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసుల వేధింపులు ఆపాలి పార్వతీపురం రూరల్: ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, పలువురు జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మేధావులు, ప్రజా, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు తప్పుబట్టారు. ప్రజల గొంతుకను వినిపిస్తున్న పత్రికల గొంతునొక్కే నిరంకుశ చర్యలపై మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, నకిలీ మద్యం కుంభకోణాన్ని ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చినందుకే ‘సాక్షి’పై కక్ష కట్టారని, ఇది భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు. అక్షరానికి సంకెళ్లు వేసే దుశ్చర్యలను తక్షణమే విరమించుకోవాలని, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కుంభకోణాలను, అక్రమాలను ఆధారాలతో సహా ప్రచురిస్తున్న పత్రికలపై ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. ఇది వాస్తవాలను సమాధి చేయాలనే దుష్ట పన్నాగం. వాస్తవాలను నిర్భయంగా రాస్తున్న సంపాదకులపై, పాత్రికేయులపై వేధింపులకు పాల్పడడం అంటే... భావప్రకటనా స్వేచ్ఛను బందీ చేయడమే. ప్రశ్నించే తత్వాన్ని, నిజాలను నిగ్గుతేల్చే మేధో స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ద్వారా ప్రభుత్వం విద్యార్థి లోకానికి ఏం సందేశం ఇస్తోంది? రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, నిజాన్ని నిర్బంధించాలనుకోవడం పాలకుల ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనం. – బి.రవికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా అవినీతి, కుంభకోణాలను, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పత్రికల గొంతు నొక్కాలని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడడం అత్యంత హేయమైన చర్య. ప్రభుత్వ నిర్వాకంతో అవస్థలు పడుతున్న ప్రజల గొంతుకగా నిలుస్తున్న పత్రికలపైనే ప్రభుత్వం కత్తిగట్టడం దారుణం. ఇది కేవలం పత్రికా స్వేచ్ఛపై దాడి కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడే గొంతుకపై జరిగిన దాడి. అధికార పాలకుల నిరంకుశ ధోరణికి అద్దం పడుతోంది. ఏదైనా వార్తా కథనం వచ్చేటప్పుడు వాటికి వివరణ అయినా ఇవ్వాలి. లేదా ఖండిస్తున్నాం అని తెలియజేయాలి, అంతేకానీ పత్రిక గొంతు నొక్కేలా కేసులు బనాయించడం సమంజసం కాదు. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న పత్రికలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణం. ఇది కేవలం పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావించరాదు. ఇది సమస్యలపై ఎత్తిచూపే గొంతు నొక్కే కుట్ర. అక్షరానికి సంకెళ్లు వేయడం, రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం కూటమి ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట. ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించే ఈ చర్యలను కార్మిక లోకం తీవ్రంగా గర్హిస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమంగా బనాయించిన కేసులను తక్షణమే రద్దు చేయాలి. – ఆర్వీఎస్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడం, వార్తలు రాసినందుకే సంపాదకులపై కేసులు బనాయించడం అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికా రంగంపై ప్రభుత్వమే ఉక్కుపాదం మోపడం దారుణం. ఇది కేవలం ఒక పత్రికపై జరిగిన దాడి కాదు. ఇది యావత్ జర్నలిస్టు లోకాన్ని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర. వాస్తవాలను వెలికితీసే ప్రతి కలాన్నీ విచ్ఛిన్నం చేసే దురాలోచన ఇది. భావప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును ఇంత నిర్లక్ష్యంగా కాలరాయడాన్ని సహించలేము. ఈ కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. – అల్లువాడ కిషోర్, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ● -
‘ఆది కర్మయోగి’ పురస్కారం
పార్వతీపురం రూరల్: ‘ఆది కర్మయోగి’ కార్యక్రమంలో జిల్లాలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టడం, ప్రత్యేక చొరవకు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. గిరిజన సంక్షేమం, సాధికారత, సమ్మిళిత అభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ‘ఉత్తమ ప్రదర్శన అవార్డు’కు ఎంపికై ంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో పాలన, విద్యా, ఆరోగ్య రంగాల బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, పౌర సౌకర్యాల అభివృద్ధి వంటి రంగాల్లో జిల్లా యంత్రాంగం కనబరిచిన ఆదర్శప్రాయమైన పనితీరును కేంద్ర ప్రభు త్వం గుర్తించి ఈ పురస్కారాన్ని అందించింది. ఫైర్ సిబ్బందిపై ఎస్పీ ఫైర్ ● బాణ సంచా క్రయవిక్రయాలను తనిఖీ చేసిన ఎస్పీ విజయనగరం క్రైమ్: బాణసంచా విక్రయాలు జరుగుతున్న ప్రదేశంలో ఫైర్ ఇంజిన్లు లేకపోవడంపై ఎస్పీ దామోదర్ అగ్నిమాపక శాఖ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. నగరంలోని కె.ఎల్.పురం వద్ద తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణాలను ఎస్పీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అగ్నిమాపక వాహనాలు లేకపోవడం చూసి అసహనం వ్యక్తంచేశారు. వన్టౌన్ సీఐకు చెప్పి అగ్నిమాపక శాఖ అధికారులతో రెండు ఫైరింజన్లను ఏర్పాటుచేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాణసంచా విక్రయాలు జరిపేందుకు తాత్కాలిక అనుమతులు పొందిన వ్యాపారులు గడువు కాలం ముగిసిన వెంటనే క్రయవిక్రయాలు నిలిపివేయాలన్నారు. మిగిలి పోయిన బాణసంచా నిల్వలను సురక్షితమైన గొడౌన్లలో భద్రపరుచుకోవాలన్నారు. షాపుల మధ్య విధిగా 15 మీటర్ల దూరం ఉండాలన్నారు. ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణ నివారణ చర్యల్లో భాగంగా షాపులవద్ద ఇసుక బస్తాలు, నీటి టబ్లు, ఫైర్ నియంత్రీకరణను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా ప్రదేశాల్లో ట్రాఫిక్జామ్ కాకుండా వెహికల్స్ను సుదూర ప్రాంతంలో పార్కింగ్ చేసేలా పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించని పక్షంలో దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్పీ సౌమ్యలత, ఇన్చార్జి డీఎస్పీ గోవిందరావు, ఎస్బీ సీఐ లీలారావు, వన్టౌన్ సీఐ ఆర్వీకే చౌదరి, టుటౌన్ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సూరినా యుడు ఉన్నారు. బాడంగి: స్థానిక హైస్కూల్ ఆవరణలోని కేజీబీవీ–4 టైప్ బాలికల వసతిగృహానికి అవసరమైన సిబ్బందిని త్వరలో నియమించి అందుబాటులోకి తెస్తామని ఈడీఓ మాణిక్యాలనాయుడు సమాచారం ఇచ్చారని హెచ్ఎం డి.సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 16వ తేదీన ‘ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు డీఈఓ స్పందించారన్నారు. హాస్టల్లో చేరిన బాలికలతో త్వరలోనే వసతి కల్పిస్తామని చెప్పారన్నారు. దీపావళిది ప్రత్యేక స్థానం విజయనగరం అర్బన్: దీపావళికి.. వెలుగుల పండగగా చెడుపై మేలును ప్రతిబింబించే మహోత్సవంగా దేశ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కలెక్టర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండగ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఇంటిలో ఆనందం, సౌభాగ్యం, సుఖశాంతులు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టపాసులు కాల్చే సందర్భంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణ హితంగా పండగ జరుపుకోవాలని కోరారు. ఈ దీపావళి ప్రతి కుటుంబానికి కొత్త ఆశలు, వెలుగులు, విజయాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రేపటి పీజీఆర్ఎస్ రద్దు దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 20న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. తదుపరి వారం నుంచి పీజీఆర్ఎస్ యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈ వారం పీజీఆర్ఎస్ రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్కు రావద్దని సూచించారు. -
మన్యంపై జ్వరాల పంజా
మన్యంపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. జ్వరాలు, కామెర్ల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మలేరియాతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రికి రిఫరల్స్ అధికమవుతున్నాయి. ప్రధానంగా జిల్లా ఆస్పత్రిలో వార్డులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. వీరిలో వివిధ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల నుంచి వస్తున్న పిల్లలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రధానంగా అన్నిచోట్లా దసరా సెలవుల అనంతరం ఇళ్లకు వెళ్లి వచ్చిన విద్యార్థులు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నీరు మారడం ఇందుకు కారణమని ఉపాధ్యాయులు అంటున్నారు. సాలూరు సీహెచ్సీలో 21 మందికిపైగా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వీరిలో పచ్చకామెర్లు, మలేరియా, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్న వారు ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఎర్రసామంతవలస, మామిడిపల్లి విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. సాలూరు మండలంలోని బొడ్డవలస బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పచ్చకామెర్లతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో కురుపాం ఆశ్రమ, ఏకలవ్య పాఠశాలతో పాటు.. కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, ఇతర ప్రాంతాల గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు ప్రతి రోజూ చేరుతూనే ఉన్నారు. ఇందులో కురుపాం విద్యార్థులే 24 మంది వరకు ఉన్నారు. ఓవైపు డిశ్చార్జిలు అవుతున్నా.. మరోవైపు ఆస్పత్రుల్లో చేరుతున్న వారూ అధికంగా ఉంటున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం రోజురోజుకూ పెరుగుతున్న జ్వర పీడితులు మలేరియా, కామెర్ల బారిన చిన్నారులు కిటకిటలాడుతున్న ఆస్పత్రులు -
ఖైదీలపట్ల వివక్ష కూడదు
● జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్విజయనగరం ఫోర్ట్: ఖైదీల పట్ల సిబ్బందిగాని, తోటి ఖైదీలు గాని వివక్ష చూపకూడదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. స్థానిక సబ్జైలును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఖైదీల పట్ల వివక్ష చూపిన ఎడల కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తిని విడనాడాలని కోరారు. జైల్లో ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్తవ్యమని తెలిపారు. జైల్లో ఉన్న సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను తనిఖీ చేశారు. అనంతరం జువైనల్ జస్టిస్ హోమ్ను సందర్శించి అక్కడ ఉన్న ప్యానల్ న్యాయవాదులతో బాల నేరస్తుల పట్ల నమోదు చేస్తున్న కేసులను వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత వన్స్టాప్ సెంటర్ను పరిశీలించి సెంటర్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వన్స్టాప్ సెంటర్ పోలీస్ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నాయకుల కబ్జా
● కో–అపరేటివ్ బ్యాంకు స్థలం అక్రమణ ● ఫిర్యాదు చేసిన ఎంపీపీ, సర్పంచ్ కొమరాడ: మండలంలోని మాదలింగి పంచాయతీ అధీనంలో ఉన్న స్థలంపై కూటమి నాయకుల కన్ను పడింది. అదును చూసి చదును చేసి తమ అనచరులకు పప్పు బెల్లంలా పంచి పెట్టేశారు. అధికార బలంతో కూటమి నాయకులు చేస్తున్న అక్రమణలపై ఎంపీపీ శెట్టి. శ్యామల, సర్పంచ్ తుమరాడ కళావతి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. 40 ఏళ్ల క్రితం ప్రాథమిక సహకర కో–అపరేటివ్ భవనం నిర్మాణం చేసి ఆ ప్రాంత రైతులకు బ్యాంకు సేవలు అందించేవారు. కొన్నాళ్ల క్రితం ఆ సొసైటీ బ్యాంకును కొమరాడ పీఏసీఎస్లో విలీనం చేయడంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పాడైన భవనాన్ని కూలగొట్టి చదును చేశారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆక్రమణదారులను తొలగించి ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కాకుండా కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, రామగోపాలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నంపార్వతీపురం రూరల్: మండలంలోని సంగంవలస గ్రామానికి చెందిన వివాహిత వర్రి జానకి శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న క్రమంలో నొప్పిని తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొంతుతున్నట్లు కేంద్రాస్పత్రి అవుట్ పోస్ట్ పోలీస్ అధికారి ఎన్. భాస్కరరావు తెలిపారు. -
ఫెన్సింగ్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్ జూనియర్స్ బాల, బాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని విజ్జి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోటీల్లో 14 సంవత్సరాలలోపు వయస్సు గల బాల, బాలికలకు అవకాశం కల్పించగా.. జిల్లా నలుమూలల నుంచి 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారికి పోటీలు నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పడగల కనిష్(ఫైల్), ఎం.డి షేక్ అహ్మద్ (ఫైల్), జె.శ్యాం శశాంక్ (ఫైల్), ఎన్ఎం జితేంద్ర (ఫైల్), బి .హర్షవర్ధన్ (ఇప్పి), బి.ఆదిత్య వర్ధన్ (సేబర్), పి.శారద (ఫైల్), బి.హన్సి శ్రీవల్లి (సేబర్) విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18న కాకినాడలో జరగనున్న పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు చీఫ్ కోచ్ డీవీ చారి తెలిపారు. ఈ ఎంపికపోటీలను అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సుంకర సతీష్కుమార్, వ్యాయామ అధ్యాపకురాలు సౌదామిని ,ఎన్ఐఎస్ కోచ్ అప్పలరాజులు పర్యవేక్షించారు. -
దివ్యాంగ ఉద్యోగిని చూసి చలించిన కలెక్టర్
విజయనగరం అర్బన్: కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఎంప్లాయీస్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో ఒక దివ్యాంగ యువతిని చూసి ఆత్మీయంగా పలకరించి, ఆమె సమస్యను తెలుసుకున్నారు. ఎస్.కోట మండలానికి చెందిన తానవరపు రూపశ్రీ దివ్యాంగురాలు. సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపిక కాగా కురుపాం మండలానికి పోస్టు కేటాయించారు. దూరప్రాంతం కావడంతో తన శారీరక పరిస్థితుల దృష్ట్యా అక్కడ విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని ఆమె కలెక్టర్కు వివరించింది. ఆమె బాధ విన్న కలెక్టర్ రామ్సుందర్రెడ్డి మానవత్వంతో స్పందించి మాట్లాడుతూ నీ సమస్యను ప్రభుత్వానికి పంపించి మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మొత్తం 27 ఫిర్యాదులు అందగా గత నెలలో వచ్చిన 40 ఫిర్యాదులలో ఎక్కువ శాతం పరిష్కారమయ్యాయని కలెక్టర్ తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ వంటి విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్శ్రీనివాసమూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సానుభూతితో సమస్య పరిష్కారానికి హామీ -
గంజాయి కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో 2022 లో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన ముద్దాయి (ఎ1) ఆకాష్ ఖూడా (22)కు మూడేళ్లు కఠిన కారాగార శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో 2022 సెప్టెంబర్ 19 వ తేదీన ఒక లాడ్జిలో ముగ్గురు వ్యక్తులు మూడు బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. మూడేళ్ల తర్వాత కోర్టు విచారణలో నిందితుడు ఆకాష్ ఖూడా (22)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష రూ.లక్ష జరిమానా విధించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులపై నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్ లో ఉన్నాయని ఎస్పీ తెలియజేశారు. -
నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు
● అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చౌదరివిజయనగరం రూరల్: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 225 దుకాణాలు, 26 బార్ అండ్ రెస్టారెంట్లలో కల్తీ మద్యం విక్రయాలు జరగకుండా విస్తృత తనిఖీలు నిర్వహించామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై. శ్రీనివాస చౌదరి శుక్రవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఎక్కడ నకిలీ మద్యం దాఖలాలు కనిపించ లేదన్నారు. లైసెన్న్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాలు, బార్లు, ఇన్ హౌస్ సంస్థల కార్యకలాపాలను, అలాగే నాణ్యమైన, సురక్షితమైన మద్యం మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో నిర్ధారణకాని, అక్రమంగా తయారైన మద్యం చలామణి జరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం ఆదేశాల మేరకు నకిలీ మద్యంపై విస్తృత తనిఖీలు చేపట్టి మద్యం దుకాణాల్లో సహకరించిన నమూనాలను ల్యాబ్ లకు పంపించి నిర్ధారణ చేసుకోనున్నామన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. శ్రీనాథుడు, తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొని విద్యార్థి మృతి
విశాఖపట్నం: స్థానిక బీఆర్టీఎస్ రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని విజయనగరానికి చెందిన చిలకలపల్లి విశాల్ (21)గా గుర్తించారు. విశాల్ గీతం విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ పెందుర్తి ప్రాంతంలోని పురుషోత్తమపురంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. గురువారం సాయంత్రం విశాల్ తన స్నేహితుడు సూర్యతో కలిసి కళాశాల నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి హనుమంతవాక మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్తున్న క్రమంలో.. శ్రీకృష్ణాపురం సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన విశాల్ గుండెకు తీవ్ర గాయం తగిలి అంతర్గత రక్తస్రావం జరిగింది. సూర్యకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విశాల్ను స్థానికులు.. ఆరిలోవ పోలీసుల సహాయంతో విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల ఆరోగ్య బాధ్యత గురువులదే
పార్వతీపురం రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులదేనని, అనారోగ్యంతో వసతిగృహాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో అడుగుపెట్టేంతవరకు అన్నీతామై వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వసతిగృహ వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. బాలికల్లో హిమోగ్లోబిన్ 10 శాతం కంటే తగ్గకుండా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని వసతిగృహాల వివరాలు అందిస్తే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల నుంచి మంజూరు చేయిస్తామని చెప్పారు. ఈఎంఆర్ఎస్, గురుకులాల్లో తాగునీరు, ప్రహరీల, కిటికీలకు మెస్లు వంటి పనులకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఎ.విజయశాంతి, ఉప వైద్యాధికారి కె.ఎస్.పద్మావతి పాల్గొన్నారు. ● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: రుణాల మంజూరుతోపాటు రికవరీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాల రికవరీ సక్రమంగా ఉంటేనే మరిన్ని రుణాలు మంజూరుకు బ్యాంకులకు అవకాశముంటుందని చెప్పారు. పీఎంఈజీపీ, పీఎంవిశ్వకర్మ, ముద్ర, నాబార్డు రుణాల మంజూరుపై సమీక్షించారు. -
పార్వతీపురం మన్యం
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 20259పాలకొండ/పాలకొండరూరల్/కురుపాం/విజయనగరం అర్బన్: ప్రజాపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనా యించడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది భావప్రకటన, పత్రికా స్వేచ్ఛను నెరిపే ప్రయత్నమని పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారీ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి మీడియాపై అక్కసు ఎందుకు ‘బాబూ’ అంటూ ప్రశ్నించారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డికి పదేపదే నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాపక్షంగా నిలిచే పత్రికల గొంతు నొక్కేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. వార్త లు సహేతుకంగా లేవని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రజాస్వామ్య పద్ధతి అని, ప్రభు త్వం ఆ మార్గాన్ని పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టి మీడియాపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో జర్నలిస్టులమంతా సంఘటితమై అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తేయాలని కోరుతూ విజయనగరంలోని జర్నలిస్టులు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. సాక్షి బ్యూరో చీఫ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నా యకులు పీవీ శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో, సీనియర్ జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు. ●కూటమి ప్రభుత్వం ప్రజాసామ్యంపై దాడిచేస్తోందని పత్రిక, ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. నకిలీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన సాక్షి పత్రిక ఎడిటర్, రిపోర్టర్లపై కేసు లు బనాయించడంపై నిరసన తెలిపారు. పాలకొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ధ ధర్నాచేశారు. జర్నలిస్టులకు నోటీసులు జారీ చేయడాన్ని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, ప్రెస్ క్లబ్ సభ్యుడు బత్తుల వెంకటరమణ, జొన్నగడ్డల కామేశ్వరావు, ఆటో యూనియ న్ నాయకుల కాద రాములు తప్పుబట్టారు. అనంతరం తహసీల్దార్ రాధాకృష్ణమూర్తికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రతినిధి తిర్లంగి ఉపేంద్రకుమార్, ప్రెస్క్లబ్ నాయ కులు శివకుమార్, కె.వి.రమణ, కల్యాణ్కుమార్, ఈశ్వరరావు, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ●పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ తహసీల్దార్ జయకు కురుపాం నియోజకవర్గానికి చెందిన పాత్రికేయులు కె.చంద్రమౌళి, ఢిల్లేశ్వరరావు, జి.పెంటయ్య, ఫృధ్వి, లక్ష్మణరావు, రంగనాథం తదితరులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రభుత్వానికి తగదన్నారు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమ కేసులను వెనుకకు తీసుకోవాలని, లేదంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నిరసిస్తూ జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కురుపాంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు -
బాధిత కుటుంబాలకు.. వైఎస్సార్సీపీ భరోసా
సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం/గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పచ్చకామెర్లతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిరిజన బాలికలకు వైఎస్సార్ సీపీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. కురుపాం మండలం దండుసూర గ్రామానికి వెళ్లి వారి కుటుంబాలను శుక్రవారం ఓదార్చి, ధైర్యం చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల ప్రకారం.. పార్టీ తరఫున తోయక కల్పన, అంజలి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అందజేశారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులను మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగా రావు, విశ్వాసరాయి కళావతి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తదితరులతో కలిసి బొత్స పరామర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై తల్లిదండ్రులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా నయమైన తర్వాతనే డిశ్చార్జి చేయాలని వైద్యులకు సూచించారు. వార్డులో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లిన నాయకులు.. త్వరగా తగ్గిపోతుందని ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శకు వస్తు న్నారన్న సమాచారంతో.. ఎవరి ఆదేశాల ప్రకా రమో గానీ, ఆస్పత్రి వైద్యులు గురువారం రాత్రి, శుక్రవారం పలువురు పిల్లలను డిశ్చార్జి చేశారు. ముందు రోజు రాత్రి వరకు ఒక గదిలో ఉంచి, చికిత్స అందించిన పిల్లలందరినీ.. అక్క డ నుంచి హడావిడిగా ఖాళీ చేయించి, ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సర్దేశారు. దీంతో పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. -
●తప్పుడు కేసులు సరికాదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు. పత్రికా ప్రతినిధులపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడమంటే పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించి, కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది. – బి.వి.రమణ, పాలకొండ ప్రెస్క్లబ్ సభ్యుడు కూటమి ప్రభుత్వం పోలీసుల అండతో పత్రి కా స్వేచ్ఛను హరిస్తోంది. అజమాయిషీ చెలాయిస్తోంది. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే పత్రికలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. ఇది అమానుషం. – జె కామేశ్వరరావు, పాలకొండ ప్రెస్క్లబ్ గౌరవాధ్యక్షుడు కూటమి ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం పోలీసులను పావులుగా వాడుతోంది. ప్రజాస్వామ్యంలో అక్రమాలను వెలికితీసే బాధ్యత, హక్కు పత్రికలకు ఉంది. ‘సాక్షి’పై జరుగుతున్న దాడుల ను వెంటనే నిలిపివేయాలి. –డి.రమణారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికితీయడం తప్పా?. వాస్తవాలు రాస్తే భయమెందుకు?. పత్రికలపై దాడిచేయడం తగదు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. – కె.సూర్యప్రకాష్రావు, న్యాయవాది -
తప్పుడు ప్రచారం చేశారు
పచ్చకమెర్లతో విద్యార్థిను లు మృతిచెందితే సరైన వైద్యం చేయించుకోలేదని, నాటువైద్యం చేయించుకోవ డం వల్ల మృతిచెందారంటూ అధికారులతో తప్పుడు ప్రచారం చేయించడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల పాలనా కాలంలో 15 మంది విద్యార్థులు మృతిచెందారు. అందులో నెలరోజుల వ్యవధిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత మండలంలో ముగ్గురు విద్యార్థులు, సొంత నియోజకవర్గానికి చెందిన మరో ఇరువురు విద్యార్థులు కలి పి ఐదుగురు మృతిచెందారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కళ్లు తెరవాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలి. –పీడిక రాజన్నదొర, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి -
గిరిజన శాఖ మంత్రి బాధ్యత వహించాలి
సాలూరు: మంచి చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి ఎదిగి తమ కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తారని కోటి ఆశలతో బిడ్డలను పాఠశాలలకు పంపగా అక్కడ సరైన సదుపాయాలు లేక అనారోగ్యాలకు గురై అమాయక గిరిజన బిడ్డలు మరణస్తున్నారు. ఆ బిడ్డల తల్లిదండ్రులకు సంబంధిత శాఖ మంత్రి, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి గురై మరణించిన విద్యార్థులు, దివంగత మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పువ్వలనాగేశ్వరరావులకు నివాళులు అర్పించి కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల ప్రాణాలు రక్షించడంలో గిరిజనసంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని, ఫలితంగా గిరిజన విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని గిరిజన విద్యార్థులు మరణిస్తుంటే గిరిజనశాఖ మంత్రికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మంది విద్యార్థులు మృతిచెందారని, సాలూరు నియోజకవర్గంలో ఇద్దరు మృతిచెందారన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 175 మంది పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా సంబంధిత గిరిజన సంక్షేమశాఖమంత్రికి, ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేశాంవిద్యార్థులు పచ్చకామెర్లతో చరిపోతున్నా,సెరిబ్రల్ మలేరియా, జ్వరంతో చనిపోతున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల మరణాలపై జాతీయమానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్కు ఢిల్లీలో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇంతమంది విద్యార్థులు మృతిచెందడం వల్ల జిల్లా మంత్రిగా ఆమె విఫలమయ్యారని, ఈ శాఖలో మరణాలపై సదరు మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు
పాచిపెంట: మండలంలోని పలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. అ భివృద్ధి చేస్తే ‘అరుకుకు దీటుగా అందాలు‘ శీర్షికన గత నెల 29వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. మండలంలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని వెలుగు డీపీఎం శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పజెప్పారు. అందులో భాగంగా ధారగెడ్డకు వెళ్లే దారిలో ఉన్న తుప్పలు డొంకలు గురువారం తొలగించారు. ఈ పనులు పర్యవేక్షిస్తున్న వెలుగు ఏపీఎం శ్రీరాములు ‘సాక్షి‘ తో మాట్లాడుతూ త్వరలో రహదారి నిర్మాణం చేపట్టనున్నామని, వాటితోపాటు ప్రత్యక్షంగా పర్యాటకులతో మాట్లాడి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే వెలుగు మహిళా సంఘాల సభ్యులకు లోన్ రూపంలో డబ్బులు మంజూరు చేసి పర్యాటక ప్రదేశాల్లో షాపులు ఏర్పాటు చేయించి పర్యాటకులకు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
నెల్లిమర్ల: స్థానిక చంపావతినదిలో బుధవారం గల్లంతైన కనకల అప్పారావు(46) మృతదేహం లభ్యమైంది. జరజాపుపేటకు చెందిన కనకల అప్పారావు థామస్పేట వద్ద చంపావతినదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోయి గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపకసిబ్బంది గాలింపు చేపట్టగా కొండపేట వెళ్లే రహదారిలో జూట్మిల్లు వద్ద మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి–చీపురుపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని శ్రీకాకుళం జీఆర్పీ హెచ్సీ ఎస్.మధుసూదనరావు తెలిపారు. పాండిచ్చేరి నుంచి హౌరా వెళ్లే రైలు ఢీకొట్టగా మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహం ఉంటుందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోన్ 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి.. గుర్ల: మండలంలోని తెట్టంగి శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబర్తికి చెందిన తాడేల అచ్యుతరావు (35) మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..దీపావళి సందర్భంగా బాణ సంచా కొనుగోలు చేయడానికి పెనుబర్తి నుంచి గవిడి పేట వెళ్తుండగా తెట్టంగి దాటిన తర్వాత బైక్ ఆదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో జరిగిన ప్రమాదంలో అచ్యుతరావు అక్కడికక్కడే మృతిచెందాడు. అదే బైక్పై వెళ్తున్న గుషిడి నారాయణ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు వసంత్ కుమార్, తరుణ్ ఉన్నారు. -
గిరిజనం గుండెఘోష పట్టదా..?
● ప్రజాసంఘాల నాయకులు ● కలెక్టరేట్ ఎదుట నిరసన పార్వతీపురం రూరల్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల వరుస మరణాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఇంకెంతమంది విద్యార్థులను నిర్లక్ష్యంతో బలిచేస్తారంటూ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్లు మాట్లాడుతూ గిరిజన విద్యాసంస్థలు విద్యార్థుల పాలిట నిర్లక్ష్యంతో వారి ప్రాణాలను బలిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పసిమొగ్గలు పిట్టల్లా రాలిపోతున్నాయని ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేశారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. వసతిగృహాల్లో మెరుగైన సదుపాయాలు, వైద్యసేవలు అందించాలి. మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే విద్యార్థుల మరణాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని సురక్షితమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఇటీవల మృతిచెందిన విద్యార్థుల ఫొటోలు చూపిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వికాస్, బుచ్చి, కార్తీక్, చరణ్, గణేష్, మల్లేష్, చందు, గౌరీశ్వరి, చిన్నారావు, కొందరు తల్లిదండ్రులు, పలు పార్టీల నాయకులు శివప్రసాద్, గౌరీశంకరరావు, ఈవీనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం
విజయనగరం టౌన్: జీఎస్టీ శ్లాబ్ను రెండుకు తగ్గించడం వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ జంక్షన్, సంతకాల వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఉప రవాణాధికారి డి.మణికుమార్, ఆర్టీఓ విమల, సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు దుర్గాప్రసాద్, రవిశంకర్ ప్రసాద్, శివరాంగోపాల్, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆనందం వెంబడి అంధకారం
● బాణసంచా పేల్చడంలో జాగ్రత్తలు పాటించాలి ● పెద్దలు వెంట ఉంటే ఆనందం మీ వెంటేరామభద్రపురం: జాతి, కుల, మత,వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ దివ్య దీపావళి. చీకటిని పారదోలి వెలుగులు నింపే పండగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకోవడం ఆనవాయతీ. అయితే దీపావళిని వేడుకగా జరుపుకునే క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. టపాసులు పేల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బాణసంచాలోని రసాయనాలతో కళ్లు దెబ్బతింటాయి. సల్ఫర్, గన్పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీరు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. ఒక్కోసారి కళ్లు పూర్తిగా కనబడకుండా పోతాయి. నిఘాతోనే అక్రమానికి అడ్డు కట్ట రూ.లక్షల విలువైన సరుకును ఎలాంటి అనుమతులు లేకుండా దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుతున్నారు.పండగ రోజు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొదరైతే ఏకంగా నివాస ప్రాంతాల మధ్య నిబంధనలు పాటించకుండా నిల్వ చేస్తున్నారు. అలాగే తాత్కాలికంగా అనుమతులు తీసుకున్న దుకాణాల వ్యాపారులు మిగిలిన సరుకును కొన్న చోటకే తిరిగి పంపాల్సి ఉంటుంది. కానీ కొందరు అలా చేయడం లేదు.పలు చోట్ల గుట్టుగా నిల్వ చేసి ఇతర సమయాల్లోనూ అమ్మేస్తున్నారు.కొందరైతే ఎలాంటి అనుమతులు లేకపోయినా పొరుగు ప్రాంతాల నుంచి పేలుడు పదార్థాలు తెప్పించి ఇళ్లలోనే టపాసులు తయారు చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి తనిఖీలు చేయకపోతే అనుమతి లేని వారు విక్రయాలతో పాటు చేసే నిల్వలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.సొంత వైద్యం వద్దు టపాసులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కొందరు సొంత వైద్యం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించాలి. ప్రథమ చికిత్స చేసే ముందు కాలిన గాయంపై చల్లని నీరు పోయాలి. అంతేగానీ ఐస్ముక్కలతో రుద్దకూడదు. వెన్న గ్రీజ్, ఇతర పౌడర్లు వంటివి రాయకూడదు. వాటివల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. దిలీప్కుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ, రామభద్రపురం కాల్చే ముందు అప్రమత్తం పెద్దవాళ్ల పర్యవేక్షణలోనే చిన్నారులు బాణసంచా కాల్చడం ఉత్తమం. టపాసులు కాల్చేటప్పుడు నీళ్లు దగ్గర పెట్టుకోవాలి.ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఉదయం 6 నుంచి 8 వరకు,రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి.దీపావళి పండుగ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఏ విధమైన అనుమతులు లేకుండా బాణ సంచా విక్రయిస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. వి.ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురంప్రమాద నివారణ, జాగ్రత్తలు ఇలా.. టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా జరగాలి పేలని టపాసులపై వంగి చూడడం మంచిది కాదు కంటికి రక్షణగా ప్లెయిన్ అద్దాలు వాడడం మంచిది పేరున్న సంస్థలు తయారు చేసిన టపాసులనే ఎంపిక చేసుకోవాలి పిల్లలు, యువకులు, మహిళలు ఇలా ఎవరు ఏ రకం టపాసులు కాల్చాలో ముందే నిర్ణయించుకుని ప్రణాళిక మేరకే కొనాలి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలి బాణసంచాను కిచెన్, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు బాణసంచా కాల్చేటప్పుడు వదులుగా ఉన్న దుస్తులు ధరిస్తే అవి వేలాడుతూ అంటుకునే ప్రమాదం ఉంది. కొద్దిగా బిగుతైన కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి చిన్న పిల్లలను ఎత్తుకుని బాణసంచా కాల్చకూడదు.పెద్ద వారి సహాయం లేకుండా పిల్లలు వారంతట వారే బాణసంచా కాల్చరాదు అప్పుడే పుట్టిన చిన్నారులు, గర్భిణులు, వృద్ధులపై బాణసంచా శబ్దాలు ఎక్కువ ప్రమాదం చూపుతాయి. ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవులను రక్షించుకోవడానికి ఇయర్ ప్లగ్స్ కొంత మేరకు ఉపయోగపడతాయి. పెద్ద శబ్దాలతో పేలే టపాసులు కాకుండా చాలా తక్కువ శబ్ధంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, పెన్సిళ్లు, భూచక్రాలు వంటివి కాల్చడం మంచిది.భూ చక్రాలు, ఔట్లు కూడా ఒక్కోసారి పేలే ప్రమాదం ఉంది. వాటిని అగ్గిపుల్లలతో కాకుండా కాకర పువ్తొత్తులతో కాల్చడం మంచిది. -
పూరిల్లు దగ్ధం
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామానికి చెందిన బొమ్మరిల్లు రాజారావు పూరిల్లు గురువారం అగ్నికి ఆహుతైంది. సమాచారం మేరకు పొందూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.1.5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాక సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదన్నారు. ఇల్లు కాలిపోవడంతో కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రాజారావు కోరుతున్నాడు. హెచ్ఐవీ రొగులకు శస్త్ర చికిత్సలు● స్పందించిన సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు విజయనగరంఫోర్ట్: హెచ్ఐవీ రోగులకు శస్త్రచికిత్సలు చేయడం లేదనే అంశంపై సాక్షిలో ఈనెల 14వతేదీన హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష శీర్షికన ప్రచురించిన కథనానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రిలో హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజీ రోగులకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. ఒక వేళ ఎవరైనా శస్త్రచికిత్సలు చేయడానికి నిరాకరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి...
దత్తిరాజేరు: మండల కేంద్రమైన దత్తిరాజేరులో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పువ్వల శ్రీనివాసరావుతో పాటు పది కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మహదేవ్ ఫణీంద్రుడు, మజ్జి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గతంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేవని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల సంక్షేమం కుంటుపడిందని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
2.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
వీరఘట్టం: ఈ ఏడాది ఖరీఫ్లో 2.58 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా చేసుకున్నామని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎం.బాలసరస్వతి తెలిపారు. ఈ మేరకు గురువారం వీరఘ ట్టం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 356 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయని, వాటి పరిధిలో 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించామన్నారు. ఇప్పటికే 104 మంది మిల్లర్లు ధాన్యం మర పట్టించేందుకు సముఖత చూపారని తెలిపారు. ధాన్యం కొనుగోలు పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కొద్ది రో జుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాటు చేయాలి పార్వతీపురం రూరల్: ఖరీఫ్ సీజన్లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ రవాణా, గోనెసంచులు వంటివి సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,369, గ్రేడ్ ఎ రకానికి రూ. 2,389 మద్దతు ధర ప్రకటించిందని, 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -
పర్యాటక ప్రాంతాలుగా సహజ సిద్ధ జలపాతాలు
● కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిగుమ్మలక్ష్మీపురం: జిల్లాలో ఉన్న సహజ సిద్ధ జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ గ్రామ సమీపంలో గల మొగనాళి జలపాతాన్ని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిలతో కలిసి పర్యాటకుల సందర్శనార్థం కలెక్టర్ గురువారం ప్రారంభించారు. అంతేకాకుండా పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన టీ/ కాఫీ స్టాట్, ఫాస్ట్ఫుడ్ స్టాల్ను ప్రారంభించారు. జలపాతానికి పూజలు చేసి హారతి ఇచ్చారు. అలాగే జలపాతం సందర్శనకు కేటాయించిన తొలి టికెట్ను కలెక్టర్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ జలపాతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా త్వరలో అడ్వెంచర్ స్పోర్ట్స్, క్లైంబింగ్ రాక్ను ఏర్పాటు చేస్తామని, ఈత కొట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఇలాంటి జలపాతాలు అనేకం ఉన్నాయని, వాటనన్నింటినీ అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తద్వారా స్థానిక యువత, ఎస్హెచ్జీ మెంబర్లకు ఉపాధి అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాడికొండ గ్రామానికి వచ్చి మొగనాళి గెడ్డ జలపాతానికి వెళ్లాలనుకునే వారిని అక్కడికి చేర్చేందుకు మళ్లీ తీసుకువచ్చేందుకు సాధారణ ఖర్చులతో బైకర్స్ను కూడా గుర్తించామని, జిల్లా వెబ్సైట్లో ఈ బైకర్స్ వివరాలన్నీ ఉంటాయన్నారు. ఎవరికీ ఇబ్బంది వచ్చినా కాల్ చేసేందుకు వీలుగా ఒక టూరిజం కంట్రోల్ పాయింట్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సుధారాణి, తహసీల్దార్ ఎన్.శేఖర్, ఎంఈఓ బి.చంద్రశేఖర్, వెలుగు ఏపీఎం సతీష్, ఏఎంసీ చైర్మన్ కె.కళావతి, తాడికొండ సర్పంచ్ ఎం.జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. -
టిడ్కో గృహాల పరిశీలన
సాలూరు: పట్టణంలోని టిడ్కో గృహాలను హౌసింగ్ పీడీ డా.ధర్మచంద్రారెడ్డి గురువారం పరిశీలించారు. టిడ్కో గృహాల నిర్మాణాల ప్రగ తి, అక్కడ వసతులు, సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సాలూరు రూరల్: మండలంలోని బొడ్డవలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశ్రమపాఠశాల విద్యార్థులు నాలుగురోజుల క్రితం పచ్చకామెర్లతో విశాఖలోని కేజీహెచ్లో చేరారు. ఈ మేర కు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరా ల ప్రకారం దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వై.ఆకాష్ (9వతరగతి) కె.భార్గవ రావు(8వ తరగతి), జె.పార్థసారథి(8వ తరగతి) కె.సాత్విక్ (6వ తరగతి) సెలవులు ముగిసినా హాస్టల్కు రాకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులను సంప్రదించారు. దీంతో వారు సమాధానమిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పడంతో పాఠశాల ఉపాధ్యాయుడు యూసఫ్ పిల్లల ఆరోగ్య పరి స్థితిని తెలుసుకునేందుకు కేజీహెచ్కు వెళ్లారు. ప్రస్తుతం విధ్యార్థుల ఆరోగ్య పరిస్దితి నిలకడగా ఉందని పాఠవాల ప్రిన్సిపాల్ పి.మూర్తి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖపట్నంలో పనులు చేసుకుంటుండడంతో సెలవులకు వెళ్లిన విద్యార్థులు కేజీహెచ్లో చేరినట్లు తెలిపారు. పాచిపెంట: రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణులను, అస్వస్థతకు గురైన బాలింతలను, ఇలా ఏ రోగం వచ్చినా ఆస్పత్రి కి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడంలేదని గిరిజనులు వాపోతున్నారు. పాచిపెంట మండలంలోని కేరంగి పంచాయతీ కోదులమడ గ్రామానికి చెందిన చోడిపల్లి పూలో అనే గిరిజన వద్ధుడు అనారో గ్యంతో గురువారం త్రీవ్ర అస్వస్థతకు గురయ్యాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబసభ్యులు డోలీలో సుమారు 5 కిలోమీటర్ల దూరం నందేడవలస వరకు మోసుకువెళ్లి అక్కడినుంచి ఫీడర్ అంబులెన్స్లో గురువునాయుడుపేట పీహెచ్సీకి తరలించారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో తమకు డోలీలే శరణ్యమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దలు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని స్థానిక సర్పంచ్ సోములు లచ్చయ్య కోరారు. బొబ్బిలి: దైవానుగ్రహంతోనే లోక కల్యాణం సాధ్యమని త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జియర్, బృందావన రామానుజ జియర్లు అన్నారు. బొబ్బిలి కంచర వీధిలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ప్రవచనాలు, మంగళా శాసనాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పురోహితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి వనంగుడి హుండీల ఆదాయాన్ని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయ ఆవరణలో గురువారం లెక్కించారు. 42 రోజులకు రూ.12లక్షల 52వేల 606 నగదు లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. రామతీర్థం ఈఓ వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సాగిన ఆదాయం లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు పద్మావతి, కుమారి, తామేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం..!
● ఇదెక్కడి తీరు ‘నాయనా’..! ● విద్యార్థులకు అక్కరకు రాని హాస్టల్ భవనం ● ఇంటివద్ద నుంచే రాకపోకలు బాడంగి: విద్యార్థుల వసతి కోసం హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. దానిని ఇప్పటిరకు అందుబాటులోకి తేలేదు. విద్యార్థులకు వసతి కల్పించలేదు. ఫలితం.. భవనం ప్రారంభించినా ఫలితం లేకపోతోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదెక్క తీరు ‘నాయనా’ అని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... బాడంగి హైస్కూల్కు అనుబంధంగా కేజీబీ టైప్–4 హాస్టల్ నూతన భవనాన్ని హడావిడిగా సెప్టెంబర్ 9న ఎమ్మెల్యే బేబీ నాయన చేతులమీదుగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఆ భవనం నిర్వహణకు నోచుకోలేదు. వసతి సదుపాయం ఉంటుందన్న ఆశతో సాలూరు, పాచిపెంట తదితర దూరప్రాంతాలనుంచి హైస్కుల్లో చేరిన బాలికల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఇక్కడకు వచ్చి ఉండేందుకు వసతిలేక ఇంటివద్దనే ఉండిపోతున్నారు. చదువుకు దూరమవుతున్నారు. ఇదే విషయంపై బాడంగి హైస్కూల్ హెచ్ఎం సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా వార్డెన్, ట్యూటర్ను ఇచ్చారని, ఇంకా వంటమనిషి, వాచ్మన్, శానిటేషన్ వర్కర్లు, స్వీపర్లను నియమించాల్సి ఉందన్నారు. సిబ్బంది నియామకం అయితే వసతిగృహం అందుబాటులోకి వస్తుందన్నారు. హాస్టల్ సౌకర్యం ఉంటుందని మా పిల్లల్ని జె డ్పీ హైస్కూల్లో చేర్పించాం. జూన్ నెల నుంచి నాలుగునెలుగా చదువుకు దూరంగా గడుపుతున్నారు. ఇలా అయితే పదోతరగతిలో ఉత్తీర్ణులు ఎలా అవుతారు. త్వరితగతిన వసతిగృహాన్ని ప్రారంభించాలి. – గొర్కాకుమారి, దళాయి సత్యవతి, బాలికల తల్లులు, సాలూరు -
ఈ చావుల పాపం
సాలూరు: గిరిజన విద్యార్థులకు ఆరోగ్య భద్రత కల్పించడంలోను, ప్రాణాలు రక్షించడంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న తాడంగి చిన్నారి బుధవారం మృతిచెందిన విషయం తెలుసుకుని దిగ్బ్రాంతికి లోనయ్యారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి విద్యార్థి మృతికి ఐదు నిమిషాల పాటు మౌనంపాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు మరణిస్తుంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జిల్లాలో ఇప్పటివరకు 15 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణించినా మంత్రికి పట్టకపోవడం విచారకరమన్నారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 175 మంది పచ్చకామెర్లతో బాధపడుతూ కురుపాం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా సంబంధిత గిరిజన సంక్షేమశాఖ మంత్రికి, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులు పచ్చకామెర్లతో చరిపోతున్నా, సెరిబ్రల్ మలేరియాతో చనిపోతున్నారని చూపిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల మరణాలపై జాతీయమానవహక్కుల సంఘానికి, జాతీయ ఎస్టీ కమిషన్కు ఢిల్లీలో ఫిర్యాదుచేశామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సాలూరు మండలం కరాసవలసలో సుమారు పదిమంది చనిపోతే నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏమిచేయలేని పరిస్థితిలో నేను నా ఎమ్మెల్యే పదవికి రాజినామా చేస్తానని ప్రకటించానని గుర్తుచేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం పోస్టుల భర్తీచేస్తామని తొలి సంతకం పెట్టారని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలుచేయలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మంత్రిగా తొలిసంతకమే అమలుచేయలేని వ్యక్తి, మంత్రి పదవికి అర్హురాలా అని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో వసతులు, బోధన ప్రమాణాలు, విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకోవాలని, సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. పత్తిక దినేష్ (ఫైల్) నిమ్మక నితిన్ (ఫైల్) -
ధాన్యం రైతుకు ‘మద్దతు’ కరువు..!
రైతు కంటే వ్యాపారులకే లాభం ఏటా వ్యవసాయం చేసే రైతు కంటే పంటను కొనుగోలు చేసే వ్యాపారులే లాభం పొందుతున్నారు. సాగులో ఎదురయ్యే కష్టనష్టాలతో పాటు మార్కెట్లో ఏర్పడే ఒడుదుడుకులన్నింటినీ భరించేది అన్నదాతలే. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దళారులకే తక్కువ ధరకు పంటను విక్రయించాల్సి వస్తోంది. – వావిలపల్లి హరిబాబు, రైతు, దశుమంతపురం, వీరఘట్టం మండలంఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ వరి సాగు 1.75 లక్షల ఎకరాలు దిగుబడి అంచనా 3.58 లక్షల మెట్రిక్ టన్నులువీరఘట్టం: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. పంట చేతికందే సమయంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తోంది. మద్దతు ధర అందకుండా చేస్తోంది. పరోక్షంగా వ్యాపారులకు పంటను దోచిపెట్టేలా వ్యవహరిస్తూ రైతన్నకు నష్టాన్ని మిగుల్చుతోంది. ధాన్యం సీజన్ ఆరంభమైనా... జిల్లాలోని ప్రధాన సాగునీటి వనరులైన తోటపల్లి జలాశయంతో పాటు, వెంగళరాయసాగర్, వట్టి గెడ్డ, పెద్దగెడ్డ, జంఝావతి, పెదంకలాం ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు వర్షాధార భూములు 1,75,065 ఎకరాల్లో రైతులు ఈ ఏడాది ఖరీఫ్లో వరిపంటను సాగుచేశారు. 3.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. అధికశాతం మంది రైతులు తక్కువ కాలవ్యవధిలో దిగుబడి వచ్చే సన్నరకాలు సాగుచేశారు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. యంత్రాలతో కోతలు, నూర్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఎకరాకు 28 నుంచి 30 బస్తాల (80 కిలోల బస్తాలు) వరకు దిగుబడి వస్తోంది. అయితే, ధాన్యం విక్రయిద్దామంటే జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకుంది. గతేడాది 80 కిలోల ధాన్యంను రూ.1550 నుంచి రూ.1600కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు రూ.1390కు కొనుగోలు చేస్తున్నారు. తూకంలో కూడా ఐదు కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారు. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల వరి కోతలు ప్రారంభం ఎకరాకు 28–30 బస్తాల దిగుబడి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని ప్రభుత్వం ఇదే అదునుగా ధర తగ్గించేసిన వ్యాపారులు గతేడాది ఖరీఫ్లో బస్తాకు రూ.1550 పలికిన ధర నేడు రూ.1390లు మాత్రమే చెల్లింపు -
గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజీనామా చేయాలి
పార్వతీపురం: వరుసగా అనారోగ్యంతో విద్యార్థులు మరణిస్తున్నా పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తాడంగి చిన్నారిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఈనెల 13న సాలూరు ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరం, విశాఖ కేజిహెచ్కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అలాగే, సాలూరు మండల మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహం 7వ తరగతి చదువుతున్న తాడంగి పల్లవి ఈనెల 11న విశాఖపట్నం తరలించినప్పటికీ సెలిబ్రల్ మలేరియాతో మృతి చెందిందన్నారు. కురుపాంలో కలుషిత నీరు కారణంగా సుమారు 224 మంది విద్యార్థులు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతుండగా ఇద్దరు మృతి చెందారన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి వారికి కష్టమొస్తే పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తక్షణమే విద్యార్థుల మృతికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం
● ఈ నెల 17న ఆర్థిక సాయం అందజేస్తాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజుజియ్యమ్మవలస: కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధితో ఇద్దరు బాలికలు మృతిచెందారని, వారి కుటుంబాలకు ఈ నెల 17వ తేదీన వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ పార్వీతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు చేతుల మీదుగా అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం పార్వతీపురం ఆస్పత్రిలో హెపటైటిస్–ఏతో బాధపడుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, అలజంగి జోగారావు పాల్గొంటారని తెలిపారు. -
వైద్యవిద్య వ్యాపారం కాదు!
విజయనగరం గంటస్తంభం: ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ బాధ్యతలు వదిలేసి వైద్యవిద్యా వ్యవస్థను వ్యాపారుల చేతుల్లోకి నెట్టొద్దని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు బుధవారం జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు యూ.ఎస్. రవికుమార్ అధ్యక్షతన ప్రజా సంఘాల ప్రతినిధులు, వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య రంగాన్ని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం పేద విద్యార్థులకు, ప్రజారోగ్యానికి భారీ దెబ్బ పడుతుందని పేర్కొన్నారు. వైద్యవిద్య ఫీజులు ఆకాశాన్నంటుతాయని, పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కల దూరమవుతుందని, రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని విమర్మించారు. గ్రామీణ పీహెచ్సీ వైద్యులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కార్యక్రమంలో రెడ్డి శంకరరావు, నాగమనోహర్, ఫైజల్, సురేష్ బాబు, రాజగోపాల్, వెంకటరావు, దివాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘శౌర్యం స్మృతి’ బ్రోచర్ల ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవం సందర్భంగా, విజయనగరం జిల్లా పోలీసు డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘శౌర్యం‘ (తెలుగు) ‘స్మృతి‘ (ఆంగ్లం) పేరుతో రూపొందించిన అమరవీరుల స్మారక బ్రోచర్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘అమరవీరుల సేవా తపస్సుకు ఈ సాహిత్య నివాళి ప్రతి పోలీసు సిబ్బందిలో ధైర్యస్ఫూర్తిని నూరిపోస్తుందన్నారు. అమరవీరుల కుటుంబాలకు గౌరవాన్ని చాటుతుందని చెప్పారు. ఈ ప్రయత్నం రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాస్థాయి పోలీసు విభాగం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభం కావడం విశేషమన్నారు.. భవిష్యత్లో ఇది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రేరణారూపంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ప్రముఖ యాంకర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
గంట్యాడ: మండలంలోని చంద్రంపేట, వసంత గ్రామాల మధ్య ఉన్న గెడ్డలో కొట్టుకుపోయిన ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు(54) మృతదేహం బుధవారం లభ్యమైంది. విజయనగరంలోని పీడబ్ల్యూ మార్కెట్లో కిరాణా హోల్సేల్ దుకాణంలో విధులు ముగించుకుని సోమవారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వసంత గ్రామానికి సోమరాజు వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత గెడ్డ దాటుతూ కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి మంగళవారం గాలింపు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా అచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గెడ్డలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. -
మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది:
గతంలో మత్తు వైద్యులకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. తెరవెనుకనే వారి పాత్ర ఉండేది. కోవిడ్ రోగులకు సేవలు అందించిన తర్వాత మత్తు వైద్యులకు ప్రాధాన్యం, గుర్తింపు వచ్చింది. గతంలో మత్తు వైద్యులుగా చేయడానికి చాలా మంది వెనుకాడేవారు. రోగికి ఏదైనా అయితే నిందిస్తారేమోనని ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పడు మంచి పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల మత్తు వైద్యుల పని సులభతరమైంది. మత్తు ఇవ్వడం కష్టతరమైన పని అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడామనే సంతృప్తి ఉంటుంది. డాక్టర్ డి.జయధీర్బాబు, ప్రొఫెసర్, మత్తు విభాగం అధిపతి , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
మత్తులో ఉంచి వైద్యం
● వైద్యరంగంలో అధిక ప్రాధాన్యం ● ఏడాదిలో లక్ష మంది వరకు రోగులకు ఎనస్థీషియా ● నేడు ప్రపంచ మత్తు వైద్యుల దినోత్సవం విజయనగరం ఫోర్ట్: వైద్యరంగంలో కొన్నేళ్ల క్రితం వరకు మత్తు వైద్యుల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. కోవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడడంతో మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది. సమాజంలో మత్తు వైద్యులు అంటూ ఉన్నారన్న విషయం అందరికీ తెలిసింది. గురువారం ప్రపంచ మత్తు వైద్య దినోత్సవం (వరల్డ్ ఎనస్థీషియా డే) సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. పూర్వ కాలంలో తలమీద, ముక్క దగ్గర మూలికలు పెట్టి మత్తు వచ్చేలా చేసి చికిత్స అందించేవారు. గతంలో మత్తు వైద్యవిద్యను అభ్యసించడానికి పెద్దగా అసక్తి చూపేవారు కాదు. మత్తు వైద్యులు కూడా చాలా తక్కువగా ఉండేవారు. మత్తు విభాగంలో ఆధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల మత్తు వైద్యవిద్యను అభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. మత్తు వైద్యులకు ప్రాధాన్యం పెరిగింది. ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలు నిలబెట్టడంలో మత్తు వైద్యులు కీలక పాత్ర పోషిస్తారు. శస్త్రచికిత్సలో కీలక పాత్ర ఏదైనా వ్యాధికి శస్త్రచికిత్స చేయాలంటే మత్తు వైద్యులదే కీలక పాత్ర. సంబంధిత వ్యాధికి ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలో అంతే మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. మోతాదుకు మించి మత్తు ఇచ్చినట్లయితే రోగి ప్రాణాల మీదకు వస్తుంది. ఎముకల సంబంధిత, ఈఎన్టీ, గైనిక్, డెంటల్ శస్త్రచికిత్సలకు, కడుపునొప్పి, అపెండిసైటిస్, పేగుఒరుపు, హెర్నియా, హైడ్రాసిల్, పైల్స్, కేన్సర్, న్యూరోసర్జరీ, గుండె సంబంధిత శస్త్రచికిత్సలకు మత్తు ఇస్తారు. ముఖ్యంగా గుండె మార్పిడి, కాలేయం మార్పిడి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో మత్తు వైద్యుల పాత్ర అత్యంత కీలకం. ఈ శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ప్రతి సెకెను గుండె ప్రతి స్పందనను గమనిస్తూ మత్తు వైద్యులు ఉండాలి. అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి, పురుగు మందు తాగి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వారికి కూడా మత్తు వైద్యులు మత్తు ఇచ్చి చికిత్స అందిస్తారు. వెంటిలేటర్పై ఉన్న రోగులకు, ఐసీయూ నిర్వహణ కూడా మత్తు వైద్యులే చూస్తారు. జిల్లాలో విధుల్లో 100 మంది వైద్యులు గతంలో మత్తు వైద్యులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో 100 మంది వరకు మత్తు వైద్యులు ఉన్నారు. వారిలో 70 నుంచి 80 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్వజన ఆస్పత్రిలోనే ఏడాదికి 12 వేల మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. జిల్లావ్యాప్తంగా ఏడాదికి లక్ష మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. -
మద్యంమత్తులో పోలీస్ స్టేషన్పై దాడి
● 17 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగించేలా కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో విధ్వంసం సృష్టించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్స్టేషన్పైనే ఆకతాయిలు మద్యం మత్తులో దాడికి తెగబడడం, విధుల్లో ఉన్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం, పోలీస్ సిబ్బంది కాలర్ పట్టుకుని, కత్తులతో బెదిరించే స్థాయికి చిల్లర మూకలు చెలరేగిపోయాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఘర్షణతో మొదలై..ఫిర్యాదుకు వచ్చి..విధ్వంసం.. పార్వతీపురం పట్టణంలో మంగళవారం రాత్రి దేశాలమ్మ తల్లి వారాల పండగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇందిరా కాలనీ, లింగం వీధికి చెందిన యువకుల మధ్య ఘర్షణ, కొట్లాట తలెత్తాయి. ఈ గొడవపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు లింగం వీధి వాసులు ప్రయత్నించారు. అయితే, అత్యవసర సేవలకు కేటాయించిన ‘డయల్ 100’కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ కలవకపోవడంతో మద్యం మత్తులో ఉన్న కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల నుంచి స్పందన లేదని ఆరోపిస్తూ, అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగం వీధికి చెందిన కొందరు స్థానికులు, యువకులు మద్యం మత్తులో పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు, ఆవేశంతో ఊగిపోతూ స్టేషన్ గేట్లను బలంగా తన్నారు. విధుల్లో ఉన్న సెంట్రీ సిబ్బందిని దుర్భాషలాడుతూ, వారిపైకి దూసుకెళ్లారు. స్టేషనన్లోని కంప్యూటర్ టేబుల్పై ఉన్న అద్దాన్ని ముక్కలు చేసి విధ్వంసం సృష్టించారు. అంతటితో ఆగకుండా, విధి నిర్వహణలో ఉన్న ఒక సిబ్బంది కాలర్ పట్టుకుని లాగి, రైటర్ కుర్చీలో కూర్చుని వీరంగం సృష్టించారు. వారిలో ఒక యువకుడు ఏకంగా కత్తిని చేతబట్టి స్టేషన్లోని సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పట్టణ పోలీసులు, దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని, 17 మందిపై కేసు నమోదు చేశారు. ’డయల్ 100’ సేవలు అందుబాటులో లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే అయినప్పటికీ, దానిని సాకుగా చూపి ఏకంగా పోలీస్ స్టేషనన్పైనే దాడి చేయడం సమంజసం కాదని, లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా అమలు చేసి, శాంతిభద్రతలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఆర్టీసీ ఈడీ దృష్టికి ఉద్యోగుల సమస్యలు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి దృష్టికి విజయనగరం జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కమిటీ తీసుకెళ్లింది. ఈ మేరకు బుధవారం సంఘం ప్రతినిధులు స్థానిక జోనల్ ట్రైనింగ్ కాలేజీ సమావేశ మందిరంలో ఆయనను కలిసి తమ సమస్యల పత్రాన్ని అందజేశారు. జోన్ పరిధిలోని 6 జిల్లాలు, 19 డిపోలు, జోనల్ వర్క్షాప్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జోన్లో ప్రమోషన్లు ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని, రన్నింగ్ టైమ్ తగినవిధంగా లేవని, రికవరీలు, రెస్ట్ రూమ్లు, డ్యూటీ చార్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు డిపోలో నివాస గృహాల అద్దె సమస్య, టీమ్ రికవరీలు, రెస్ట్ రూమ్లు, డ్యూటీ చార్డులు వంటి పలు సమస్యలు ఉన్నాయిని వినతిపత్రంలో తెలియజేశారు. కొన్ని జిల్లాల్లో అక్రమంగా ఇస్తున్న ఓడీలు, ఉద్యోగుల సీనియార్టీలో తేడాలు, రూట్ సర్వేలు, మంచినీటి సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లభించకపోవడం వంటి 30కు పైగా సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఈడీని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి వెంకటరావు, జోనల్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి బీకేమూర్తి, జోనల్ కోశాధికారి కేఎస్ఎస్మూర్తి, జిల్లా కార్యదర్శి రవికాంత్ ఉన్నారు. -
రహదారులపై చెత్త కనిపించరాదు
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి పార్వతీపురం రూరల్: పార్వతీపురం, సాలూరు పట్టణంలోని రహదారులు శుభ్రంగా ఉండాలని, ఎక్కడా చెత్త కనిపించరాదని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వార్డులో పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేయాలని, పరిపాలనలో పూర్తిస్థాయి ‘ఈ–ఆఫీసు’ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఆదా కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, రోడ్లపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ● జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ విజయనగరం ఫోర్ట్: అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించే సీపీఆర్ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం సీపీఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం, శ్వాస ఆగిపోయినప్పడు అతని ప్రాణాలు రక్షించడానికి సీపీఆర్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మత్తు విభాగం అధిపతి డాక్టర్ జయధీర్బాబు, అత్యవసర విభాగం హెచ్వోడీ డాక్టర్ శివప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలి
విజయనగరం అర్బన్: పీఎంఏవై పథకం కింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పీఎంఏవై కింద జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1,386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్లో సొంత స్థలాలు ఉన్న వారి గృహాలను పూర్తి చేయాలన్నారు. రూఫ్ లెవెల్లో ఆర్సీ స్థాయిలో ఉన్నవి పూర్తి కావాలని ఇకపై ప్రతి వారం సమీక్షించనున్నట్లు తెలిపారు. కాలనీలలో నిర్మాణాలకు అనువుగా ఉన్న వాటిని గుర్తించి అందుకు ఎంతమేరకు భూమి అవసరం అవుతుందో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ ప్రసాద్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
బుల్లెట్ బైకులే టార్గెట్
● ముగ్గురు బైక్ దొంగల అరెస్టు ● రూ.14 లక్షలు విలువ చేసే ఏడు బుల్లెట్ బైక్లు చోరీ ● వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ శ్రీనివాసరావు శ్రీకాకుళం రూరల్: జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలని మార్గాలు వెతికారు. బైక్ హ్యాండిల్ లాక్లను అన్లాక్ చేయడం నేర్చుకున్నారు. బైక్లను దొంగిలించి తక్కువ ధరకు అమ్మడం అలవాటు చేసుకున్నారు. ఆఖరకు పోలీసుల చేతికి చిక్కారు. బుధవారం రూరల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ( క్రైం) శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిసర ప్రాంతంలో 5 బుల్లెట్ బైక్లు, ఆమదాలవలస ప్రాంతంలో 2 బుల్లెట్ బైక్లు పోయినట్లు రూరల్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. రెండు రోజుల కిందట రాగోలు దూసి ప్రాంతంలో రూరల్ ఎస్ఐ రాము వాహనాలు తనిఖీలు చేస్తుండుగా రెండు బుల్లెట్లపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆరా తీశామని, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఖరీదైన వాహనాలే ఆదాయ వనరులు.. బుల్లెట్ దొంగతనాలకు పాల్పడిన ఎ–1 దండు రిషివర్ధన్ స్వస్థలం విశాఖపట్నం. విశాఖ కమిషనరేట్లో పీఎం పాలెం పోలీస్స్టేషన్లో ఓ వివాహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు. పార్వతీపురం రూరల్ పోలీస్టేషన్లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఎ–2 రాయిపల్లి వినోద్ స్వస్థలం సాలూరు కాగా.. అక్కడి పోలీస్స్టేషన్లో ఐదు సారా కేసులు, సాలూరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్తో పాటు గంట్యాడ పోలీస్స్టేషన్లో ఒక డెకాయిటీ కేసు, అలాగే పార్వతీపురం రూరల్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసులతో పాటు ఏడు కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేశారు. జైలులో పరిచయం.. దండు రిషివర్దన్, రాయిపల్లి వినోద్లు ఇద్దరూ జైలులో ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. విలువైన బైక్లు దొంగతనం చేసి నంబర్ మారిస్తే ఎవరూ పట్టుకోలేరని ప్లాన్లు గీశారు. గడిచిన మూడు నెలలుగా ఏడు బైక్లు దొంగిలించారు. దొంగిలించిన బైక్లను మూడో నిందితుడు, బైక్ మెకానిక్ కొత్తూరుకు చెందిన చిట్టి సంతోష్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వాహకుడి సాయంతో విక్రయించారు. వీరి వద్ద నుంచి ఏడు బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు బాబురావు, నారాయణరావు, సురేష్, కృష్ణ కానిస్టేబుల్స్కు ఎస్పీ మహేశ్వరరెడ్డి చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ పైడపు నాయుడు, ఎస్ఐ రాము పాల్గొన్నారు. -
ఇంటి ముందు పుర్రె
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధి ఊడికిలపేట గ్రామంలోని పి.పైడమ్మ ఇంటి ముందు కుంకుమ, పసుపు రాసిన పుర్రెను గుర్తు తెలియని దుండగులు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబధించిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి పి.పైడమ్మ, కుటుంబసభ్యులు ఇంటిలో నిద్రించారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిలో నుంచి బయటకు వస్తుండగా ఇంటి ముందు మనిషి పుర్రె పెట్టి, దాని చుట్టూ కుంకుమ,పసుపు చల్లి ఉండడాన్ని గమనించిన వారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. -
నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి
● మృతుడు తాడేపల్లి గూడెం వాసి వీరఘట్టం: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్ వ్యాన్తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్ రాజు వ్యాన్ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు తలకిందులుగా వ్యాన్ బాడీకి రేడియేటర్కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్సీలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డు చేసి పోస్ట్మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్ బాడీకి–క్యాబిన్కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్ యజమానికి ఫోన్లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్ విజయవాడ నుంచి ఈ వ్యాన్ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సంతకవిటి: మండలంలోని సిరిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడలకు ఎంపికై నట్లు హెచ్ఎం వి.వెంకటరావు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన క్రీడల్లో పరుగుపందెలో అండర్ 19 విభాగంలో కె.దిలీప్కుమార్, జి.సంతోష్, ఎం.అరుణ్కుమార్, జి.జ్యోత్స్న, పి.కుసుమ, ఎస్.కల్పన, ఎ.జాన్సీలు, ఖో–ఖో క్రీడలో పి.లిఖిత్, అండర్ 17 బేస్బాల్ విభాగంలో కె.రాజేంద్ర మంచి ప్రతిభ చూపించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వారిని మంగళవారం పాఠశాలలో హెచ్ ఆధ్వర్యంలో మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీడీ కె.సూర్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి
● గాలింపు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్గంట్యాడ: మండలంలోని చంద్రంపేట గెడ్డలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు విజయనగరం పీడబ్ల్యూ మార్కెట్లోని ఓ కిరాణా హోల్సేల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై గ్రామానికి వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత వసంత గ్రామానికి ముందు ఉన్న గెడ్డలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. రాత్రి 12 గంటలైనా సోమరాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామ స్తులతో కలిసి వెతకసాగారు. తెల్లవార్లూ వెతికినా అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సాయికృష్ణ, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి గాలింపు చేపట్టారు. గల్లంతైన సోమరాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గెడ్డపై ఇప్పటికై నా పాలకులు వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని రెండు గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
పోటెత్తిన భక్తులు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కల్పవల్లిగా పేరొందిన శ్రీపైడితల్లి దర్శనానికి భక్తులు మంగళవారం పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని అమ్మవారి ఆలయానికి పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తజనం క్యూలైన్లలో ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి వేచి ఉండి దైవదర్శనం చేసుకున్నారు. అయితే భక్తులు వేచి ఉన్న చోట ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. టికెట్ కౌంటర్ వద్ద కూడా తమ ఫోన్పేలకు డబ్బు లు పంపించుకుని టికెట్లు ఇవ్వకుండా దర్శనానికి పంపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు. -
ఏనుగుల బీభత్సం
● ధ్వంసమైన పంటలు ● వాపోతున్న రైతులుపార్వతీపురం రూరల్: Ð]l$…yýl-ÌS…ÌZ Mö°² ÆøkË$V> ç³Ë$ {´ë…™éÌZÏ H¯]l$-VýS$ÌS VýS$…ç³# OòÜÓÆý‡-ÑàÆý‡… ^ólçÜ*¢ OÆð‡™èl$ÌS iÑ™éÌS-™ø ^ðlÌS-V>rÐ]l*-yýl$-™èl$-¯é²Æ‡$$. MýS…sìæMìS Æð‡ç³µ-Ìê M>´ë-yýl$-MýS$…r$¯]l² ç³…rÌS¯]l$ VýSfÆ>kË$ ¯éÔèæ¯]l… ^ólçÜ$¢…sôæ, AÇMýS-rtyýl…-ÌZ MýS*rÑ$ {糿¶æ$-™èlÓ… òœ*Æý‡…-V> ÑçœÌS-OÐðl$…-§ýl° OÆð‡™èl$-Ë$, Ý린MýS$-Ë$ ¡{Ð]l B{VýS-çßæ… Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. ™égêV> Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ÐólMýS$-Ð]l-gêÐ]l¬ ¯]l$…_ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$…yýl-ÌS…ÌZ° Æ>ÑMø¯]l ç³…^éĶæ$¡ AyŠæ-{yýl*-ిÐ]l-ÌSçÜ, íßæ…§ýl*-ç³#Æý‡… {V>Ð]l*-ÌS-ÌZ H¯]l$-VýS$ÌS VýS$…ç³# ç³…rÌS¯]l$ «§ýlÓ…çÜ… ^ólçÜ*¢ ½¿ýæ-™èlÞ… çÜ–íÙt…^鯇$$. రెండు గ్రామాల్లో అపార నష్టం అడ్డూరివలస గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే రైతు కష్టమంతా ఏనుగుల పాలైంది. ఏపుగా పెరిగి పూత దశకు కొద్ది రోజుల్లో వచ్చే దాదాపు 200 కొబ్బరి మొక్కలను గజరాజుల గుంపు నేలమట్టం చేసింది. కాయకొచ్చిన కోకో తోటలను సైతం వదలకుండా నాశనం చేశాయి. సేకరించి ఉంచిన కోకో కాయలను ధ్వంసం చేసి తినేశాయి. అంతటితో ఆగకుండా, పొలంలోని మోటార్ను ధ్వంసం చేశాయి. అలాగే, మండలంలోని హిందూపురం గ్రామంలో గుణ అనే రైతుకు చెందిన కొబ్బరి మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏనుగుల గుంపు సంచరిస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిద్ర వీడాలి ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని రైతులు, స్థానికులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, ఏనుగుల దాడులను అరికట్టేందుకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కేవలం హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిష్కార చర్యలూ తీసుకోవడం లేదని ఆరో పిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులను ఈ విధంగా నష్టపెట్టకుండా, తమ పంటలను ప్రాణాలను గజరాజుల బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు. లోవగూడలో ఏనుగులు భామిని: మండలంలోని లోవగూడ సమీపంలోకి మంగళవారం ఏనుగుల గుంపు చేరుకుంది. మొక్కజొన్న, వరి పంటలను తినివేస్తూ పాడు చేస్తున్నాయని గిరిజన రైతులు వాపోతున్నారు. ఏనుగులు సమీపంలోని మెట్టపై మకాం వేసినట్లు ఫారెస్ట్ అదికారులు తెలిపారు. -
మన ఆరోగ్యం మన చేతుల్లోనే
● చేతుల శుభ్రతతో రోగాలు దూరం ● నేడు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంప్రతి ఒక్కరికీ అవసరమే చేతుల శుభ్రత ప్రతి ఒక్కరికీ అవసరమే. ముఖ్యంగా భోజనం చేసే ముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. చిన్నపిల్లల తల్లిదండ్రులు గమనించి ఏదైనా తినే వస్తువులు ఇచ్చే ముందు చేతులను పరిశీలించి శుభ్రం చేసి ఇవ్వాలి. లేదంటే అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. వాటర్ బోర్న్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్వో, ఐటీడీఏ, సీతంపేట సీతంపేట: ఆరోగ్యమంతా చేతుల పరిశుభ్రతతోనే ఉంటుంది. చేతులు శుభ్రంగా ఉంటే మూడొంతులు వ్యాధులు దరిచేరవు. ఈ నేపథ్యంలో 2008 నుంచి ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వచ్ఛత పేరిట వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. చేతుల శుభ్రతతో సూక్ష్మజీవులు దూరం.. చేతుల ద్వారానే వ్యాధి కారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా జలుబు, శ్వాసకోస, జీర్ణసమస్యలు, జ్వరం, అతిసార వ్యాధులు చేతుల పరిశుభ్రత లేకపోవడం వల్లే వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మల, మూత్ర విసర్జన తర్వాత ఆహారం తినే ముందు పిల్లలకు ఆహారం తినిపించే ముందు, అనారోగ్యంతో ఉన్న వారికి భోజనం పెట్టే ముందు, మందులను ఇచ్చే ముందు గాయాలైన చర్మాన్ని తాకినప్పుడు, దగ్గు, తుమ్ములు, ముక్కు చీదినప్పుడు, పెపుడు జంతువులు, పచ్చిమాంసాన్ని తాకినప్పుడు పిల్లలు మట్టిలో ఆడినప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. గోళ్ల కిందిభాగంలో మట్టి చేరి క్రిములు పుట్టుకొస్తాయి. అందుకే గోళ్లను కత్తిరించుకోవాలి. ఏమేం వాడాలి.. నీళ్లు, సబ్బు, శానిటైజర్లు వాడాలి. శానిటైజర్ల వాడకంతో బ్యాక్టీరియా, క్రిములను 60 శాతం వరకు తొలగించే అవకాశం ఉంది. ఒకటి రెండు శానిటైజర్ చుక్కలను చేతులపై వేసుకుని వేళ్లసందున మధ్యలో అంటుకునేలా చూడాలి. కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. రసాయనాలు లేని సబ్బులు వినియోగించడం మేలు, సున్నిపిండి, పుసుపు, నిమ్మకాయ రసం మిశ్రమంతో కలబంద, తేయాకు, పొద్దుతిరుగుడు నూనెలతో తయారైన శానిటైజర్లు ఎంతో మేలు కలిగిస్తాయి. చేతులు ఇలా శుభ్రం చేసుకోవాలి నీటిని చేతులతో తడపాలి చేతులకు సబ్బు లేదా లిక్విడ్ను రుద్దకోవాలి రెండు చేతుల మధ్య గట్టిగా రుద్దుతూ శుభ్ర పరుచుకోవాలి చేతుల వెనుక బాగాలు, చేతి వేళ్ల మధ్యలో, గోళ్ల సందుల మధ్య ప్రతి వేలును శుభ్రం చేయాలి. అరచేతులను వేళ్లతో రుద్దుతూ మణికట్టు భాగం నుంచి సబ్బుపోయేంత వరకు నీటిని పోస్తూ శుభ్రం చేయాలి. 20 సెకెన్లపాటు అయిదు పర్యాయాలు శుభ్రం చేసుకోవాలి. తరువాత మెత్తటి ఉతికిన వస్త్రంతో తుడుచుకోవాలి. లేదా చేతులను విదిలించాలి. పిల్లలకు అలవాటుగా మారుస్తున్నాం ప్రతిరోసూ చేతులు శుభ్రపరుచుకోవాలనేది విద్యార్థులకు వివరిస్తున్నాం. దీన్ని ఒక అలవాటుగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం ఈ పద్ధతిని పాటిస్తే రోగాలు దరిచేరవు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – బి.ఉమావాణి, హెచ్ఎం, హడ్డుబంగి ఆశ్రమపాఠశాల -
వైభవంగా పునర్వసు పట్టాభిషేకం
● సీతారామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలునెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ అర్చకులు మంగళవారం వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవన హోమం జరిపించారు. అనంతరం స్వామి వెండి మంటపంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి..ఉత్సవమూర్తులకు రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పునర్వసు పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, వర ప్రసాద్, రామ గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
సుజుకి నూతన షోరూం ప్రారంభం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డులో వేణుగోపాల్ సుజుకి సంస్థ తమ రెండవ షోరూమ్ను ప్రారంభించింది. మంగళవారం ఈ కొత్త శాఖను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హెడ్ అభిషేక్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుజుకి సంస్థ దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిందని, ఉత్తమమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వేణుగోపాల్ సుజుకి సంస్థ విజయనగరంలో ఇప్పటికే ఒక శాఖను విజయవంతంగా నిర్వహిస్తోందని, వినియోగదారుల మద్దతుతో రెండో షోరూం ప్రారంభించడం ఆనందకరమ న్నారు. కార్యక్రమంలో బెస్ట్ వాల్యూ ఎస్ఎంఐపీఎల్ ఆపరేషన్స్ హెడ్ వీఎస్.యాస్ పాల్, వేణుగోపాల్ సుజుకి ఎండి జి.అభిరామ్, జీఎం సీహెచ్.ప్రవీణ్ కుమార్, సర్వీస్ మేనేజర్ సంతోష్ వర్మ, ఏరియా సేల్స్ మేనేజర్ ఎన్.సురేంద్ర, ఏరియా సర్వీస్ మేనేజర్ వి.సాయి కౌటిన్య తదితరులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. 19న జిల్లా స్థాయి యోగాసనాల పోటీలునెల్లిమర్ల: స్థానిక మిమ్స్ సమీపంలోని శ్రీరామకృష్ణ ధ్యాన మందిరంలో ఈ నెల 19వ తేదీన జిల్లా స్థాయి యోగసనాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా క్రీడా సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. మొత్తం ఏడు విభాగాల్లో పోటీలు ఉంటాయని, విజేతలను 25, 26వ తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు తమ పేర్లను 17వ తేదీలోగా ఫోన్ నంబర్లు 8374904262, 8465954998 సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. -
ఎక్కడ?
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, పార్వతీపురం మన్యం: కొద్ది రోజుల కిందట తమ బడిని మరోచోటకు తరలించవద్దని.. తల్లిదండ్రులతో కలసి కొంతమంది పిల్లలు పార్వతీపురం మన్యం కలెక్టరేట్కు వచ్చారు. అక్కడ ధర్నా నిర్వహించి, అధికారులకు మొర పెట్టుకుని, ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. దురదృష్టవశాత్తు నర్సిపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీన్ని రాజకీయం చేస్తూ, వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఓ టీడీపీ కార్యకర్త.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో వెంటనే ఆయన.. సదరు వ్యక్తి ఆరోపణలను సమర్దిస్తూ, పిల్లలతో రాజకీయం చేయడమేమిటని.. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ట్వీట్ చేశారు. విద్యార్థుల పట్ల విద్యాశాఖ మంత్రిగా ఆ సమయంలో లోకేశ్ స్పందించవచ్చు. ఇప్పుడు కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు పచ్చకామెర్లతో మృతి చెందారు. 180 మందికిపైగా వ్యాధి బారిన పడి, జిల్లా ఆస్పత్రిలోనూ, విశాఖ కేజీహెచ్లోనూ చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నుంచి ఒక ప్రకటన లేదు. విశాఖ వచ్చినా.. కేజీహెచ్కు వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన దాఖలాలు లేవు. విద్యార్థులు అనారోగ్యం పాలైన పది రోజుల తర్వాత గానీ.. స్వయాన జిల్లాకు చెందిన గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గానీ.. ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడుగానీ పిల్లలను పర్యామర్శించిన పరిస్థితి లేదు. విద్యార్థులను పరామర్శించడానికి వస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాడ.. ఇప్పటి వరకూ కానరాలేదు. ఇదీ.. కూటమి ప్రభుత్వానికి గిరిజన విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ప్రజా, విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు గిరిజన విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజా, గిరిజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు పాలకులు, అధికారులు విలువ ఇవ్వాలని... విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనులకు కష్టమొస్తే.. గిరిజన ఆడబిడ్డగా మంత్రి సంధ్యారాణి స్పందించడం ఇలానేనా? అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రెండో రోజు రిలే నిరాహారదీక్షలల్లో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ద పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వారణాశి శ్రీహరి, చుక్క చంద్రరావు, ఏపీ రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి ఇ.వి.నాయిడు, కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం మండలాధ్యక్షుడు టి.గౌరీశంకర్ రావు, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, గిరిజన సంక్షేమ నిరుద్యోగ సంక్షేమ సంఘం నాయకులు అల్లు చందు, గౌరీశ్వరీ, రజిని, అమల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. అనారోగ్యంతో సాలూరు మండలంలోని మామిడిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తాడంగి పల్లవి(12) మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మొత్తం 14 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇందులో గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలోనే మరణించిన విద్యార్థుల సంఖ్య మూడుకు చేరడం గమనార్హం. ఇప్పటికే నియోజకవర్గంలో మక్కువ మండలం నంద గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన (17), పాచిపెంట మండలంలో మూడో తరగతి విద్యార్థిని శాంత ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు.. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంల్లోనూ గిరిజన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతున్నా.. కూటమి ప్రభుత్వం మానవతాదృక్పథంతోనైనా స్పందించిన దాఖలాలు లేవు. కురుపాం ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటననూ చిన్నదిగా చూపించేందుకు మంత్రులు ప్రయత్నించారు. విద్యార్థులు ఇళ్ల వద్దే మరణించారని.. ప్రభుత్వానికి ఏం సంబంధమని స్వయంగా ఆ శాఖ మంత్రి సంధ్యారాణి చెప్పడం గమనార్హం. పరిహారం సంగతి తర్వాత చూస్తామని.. మట్టి ఖర్చులే ఇవ్వగలమని చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ.. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి గానీ ఇప్పటి వరకూ దీనిపై సమీక్ష కూడా చేయకపోవడం గమనార్హం. విద్యార్థులు వ్యాధి బారిన పడటానికి గల కారణాలు సైతం ఇప్పటి వరకూ బయట పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు గిరిజన విద్యార్థులు మరణించినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.. కనీసం వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదు. మానవతాదృక్పథంతోనైనా స్పందించని కూటమి ప్రభుత్వం నాడు విద్యార్థులకు ఆటో ప్రమాదం జరిగితే రాజకీయంగా ట్వీట్ చేసిన మంత్రి లోకేశ్ నేడు ఇద్దరు పిల్లలు మృతి చెంది, వందలమంది ఆస్పత్రి పాలైనా కనీస ప్రకటన శూన్యం గిరిజన బాలల మృతిపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ విద్యార్థుల మృతిని వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణం స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు గిరిజన విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఆ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. కురుపాం గురుకుల పాఠశాలే కాకుండా పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులకు కూడా ఇన్ఫెక్షన్ సోకినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆర్టికల్ 21(మానవ హక్కుల ఉల్లంఘన) కింద ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం దిల్లీలో కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ను కలిసి కురుపాం బాలికల పాఠశాలలో కలుషిత నీటి ఘటనను వివరించారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యకూ ఈ ఘటనను వివరించారు. గిరిజన బాలలకు న్యాయం జరిగేలా అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ జి.మాధవి, జీసీసీ మాజీ చైర్పర్సన్ స్వాతిరాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు దిల్లీకి వెళ్లి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య సైతం చలించిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు. -
చంద్రబాబు చేసింది శూన్యం
చీపురుపల్లి(గరివిడి): రాష్ట్ర భవిష్యత్, ప్రజల ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసినది దివంగత మహానేత వైఎస్సార్ తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. గరివిడిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ చీపురుపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించాలని, పేదలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్యవిద్య అందుబాటులోకి రావాలని 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే అప్పటికే ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. 2019లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి సవాల్ విసిరిందన్నారు. అయినప్పటికీ కరోనా బారి నుంచి ప్రజలను రక్షించి, మరణాలు రేటు తగ్గించడంలో జగన్మోహన్రెడ్డి పరిపాలన దోహదపడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల మంజూరుకు కృషిచేశారన్నారు. కేవలం మూడేళ్లలోనే 5 కళాశాలల నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. వీటి కోసం రూ.8 వేల కోట్లు అవసరం కాగా రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్ల కాలంలో 17 వైద్య కళాశాలలు మంజూరు చేయడం సాధ్యమైతే 2014లో విభజన సమయంలో రాష్ట్రానికి మంజూరైన ఎయిమ్స్ కళాశాల ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. 2014లో రూ.1.19 వేల కోట్లతో డిజైన్ చేసిన అమరావతి 2019 వరకు ఎంత మేర పనులు జరిగాయని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూట మి ప్రభుత్వం 19 నెలలు కాలంలో రూ.2 లక్షలు కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పా లని డిమాండ్ చేశారు. వైద్యకళాశాల ప్రైవేటీ కరణకు నిరసనగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేద్దామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. రూ.1.19 వేల కోట్లతో డిజైన్చేసిన అమరావతి ఎక్కడుంది? 2014లో మంజూరైన ఎయిమ్స్ కళాశాల పరిస్థితి ఏంటి? వైద్యకళాశాలల ప్రైవేటీకరణ దారుణం కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేద్దాం శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ -
విద్యార్థులే దేశానికి బలమైన పునాది
● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను విద్యావంతులుగానే కాకుండా, దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా. ఎన్ ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం విద్య, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడాతూ విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు మంచి చెడుల విచక్షణ, నైతిక విలువలు నేర్పించడం ద్వారా బలమైన తరాన్ని నిర్మించవచ్చన్నారు. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా పిల్లల కోసం అద్దం, దువ్వెన, సబ్బు, టవల్ వంటివి ఏర్పాటు చేసి వారిని నిత్యం శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఈఓ రాజ్ కుమార్ , ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడ ‘బాబూ’? విజయనగరం గంటస్తంభం: నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్మి పరుచూరి రాజేంద్రబాబు అన్నారు. విజయనగరంలోని డీఎన్ఆర్ అమర్ భవన్లో మంగళవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నెలలు కూటమి పాలనలో నిరుద్యోగ భృతి గల్లంతయ్యిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వలంటీర్లు, రేషన్ సిబ్బందిని తొలగించారని విమర్శించారు. రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా, విజయనగరం జిల్లాలోనే 4.68 లక్షల మంది ఉన్నారన్నారు. నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించకుండా కార్పొరేట్లకు సీఈఓలా ఉన్నారని విమర్శించారు. వైద్య కళాశాలలు, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు. నవంబర్ చివరి వారం నుంచి హిందూపురం–ఇచ్ఛా పురం వరకు నిరుద్యోగుల ఆవేదన యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి కోన శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, జిల్లా నాయకులు వాసు, అప్పన్న, కిరణ్, గోపినాయుడు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విజయనగరం: విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమం ప్రారంభమై 59 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను విజయనగరంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, దళిత సామాజికవర్గానికి చెందిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే తమనంపల్లి అమృతరావు స్ఫూర్తిని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొనసాగిస్తూ ప్రైవేటీకరణను విరమించుకోవాలని హితవుపలికారు. 2025 ఆగస్టు 16న విశాఖ స్టీల్ప్లాంట్లోని 32 విభాగాలను ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం, అదే రోజున ప్యాకేజీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో సాకారమై, నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.భానుమూర్తి, ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, ధారాన వెంకటేష్, డోల కోటేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
సాలూరు రూరల్: మండలంలోని మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బొబ్బిలి మండలం కృపావలస గ్రామానికి చెందిన చెందిన విద్యార్థిని తాడంగి పల్లవి (12) మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్లివి దసరా సెలవుల కోసం స్వగ్రామానికి వెళ్లింది. అనారోగ్యంతో బొబ్బిలి ఆస్పత్రిలో ఈ నెల 6వ తేదీన చేరగా అక్కడ నుంచి 8వ తేదీన విజయనగరం ఘోషా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 11వ తేదీన విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లగా ఈ నెల 12వ తేదీన మృతిచెందింది. మెదడు వాపు వ్యాధితో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు గిరిజన సంక్షేమ సహాయ అధికారి కృష్ణవేణి తెలిపారు. -
హంసవాహనంపై సిరుల తల్లి
విజయనగరం టౌన్: మంగళవాయిద్యాలు... బాణసంచా వెలుగులు.. భక్తుల జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ హంస వాహనంపై పసిడి కాంతుల పైడితల్లి విజయనగరం పెద్ద చెరువులో మంగళవారం సాయంత్రం జలవిహారం చేశారు. భక్తులకు చల్లని ఆశీస్సులు అందించారు. అమ్మవారి జలవిహారాన్ని చూసేందుకు సున్నంబట్టీ వీధి సమీపంలోని చెరువు గట్టు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారు సాక్షాత్కరించిన చెరువులో మూడుసార్లు జలవిహారం చేస్తుంటే.. గట్టుపై ఉండి కళ్లార్పకుండా తిలకించారు. పైడితల్లమ్మా.. చల్లంగా చూడమ్మా అంటూ స్మరించారు. చల్లని తల్లి కరుణాకటాక్షాలను అందుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు సాగిన తెప్పోత్సవానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా, ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు. ● వనంగుడిలో వేదస్వస్తి వనంగుడిలో ముందుగా వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి, అధికార భాషా సంఘం పూర్వపు సభ్యులు డాక్టర్ ఎ.గోపాలరావు వ్యాఖ్యానం చేశారు. వేదస్వస్తి చెప్పిన బ్రాహ్మణులకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష దుశ్సాలువ, నగదు బహుమతితో సత్కరించారు. అనంతరం అమ్మవారికి పారాయణం, ఆధ్యాత్మిక అంశాలను, పైడితల్లి అమ్మవారి భజనలను వినిపించారు. ● పైడితల్లికి స్నపనం తెప్పోత్సవానికి ముందు పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వనంగుడిలో ఆలయ అధికారులు, పైడితల్లి దీక్షాపరులు స్నపన కార్యక్రమం నిర్వహించారు. వేదమంత్రాల సాక్షిగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి ఆలయం చుట్టూ మూడుమూర్లు ప్రదిక్షణ జరిపారు. అనంతరం పల్లకిలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి, భాజాభజంత్రీలు, మేళతాళాలతో భారీ ఊరేగింపుగా సున్నంబట్టివీధి మీదుగా పెద్దచెరువు వద్దకు తెప్పోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న హంసవాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి జలవిహారం జరిపించారు. ఉత్సవంలో ఆలయ సిరిమాను అర్చకులు బంటుపల్లి వెంకటరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఉత్సవ ప్రత్యేకాధికారి మూర్తి, దీక్షాపరులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. కనులపండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు వనంగుడిలో పైడితల్లికి స్నపనం పెద్దచెరువులో మూడుసార్లు జలవిహారం కనిపించని ప్రజాప్రతినిధులు పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం ఈఓ, సిరిమాను పూజారికే ఈ ఏడాది ఉత్సవం మిగిలింది. ఏటా కనీసం ఐదారుగురైనా అధికారులు ఉత్సవంలో పాల్గొని, అమ్మ ఆశీస్సులందుకుంటుంటారు. ఈ ఏడాది అన్నింటికీ మించి తెప్పోత్సవం ఎవరికీ పట్టకుండా పోయింది. అయినప్పటికీ పైడితల్లి అమ్మవారికి శాస్త్రోక్తంగా చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని భక్తిశ్రద్ధలతో ఆలయ అధికారులు నిర్వహించడం విశేషం. -
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు అవార్డు
● గుజరాత్లో మంత్రి చేతుల మీదుగా అందుకున్న సుమతివంగర: మండల పరిధి తలగాం గ్రామానికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కిమిడి సుమతికి ధైర్య సాహస అవార్డు దక్కింది. ఐదేళ్ల కిందట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో కానిస్టేబుల్గా వెస్ట్ బెంగాల్లోని మెచేడా రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఆ వ్యక్తిని రక్షించింది. అలాగే రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత పట్ల ఆమె చూపించిన ధైర్యసాహసాలను సంబంధిత శాఖ గుర్తించింది. ఈ మేరకు గుజరాత్లోని వలా్స్ద్ ఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులమీదుగా సుమతి సోమవారం అవార్డు అందుకుంది. ఈ మేరకు సుమతిని పలువురు అభినందించారు. -
సత్తా చాటిన జిల్లా స్విమ్మర్స్
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏలూరు వేదికగా నిర్వహించిన 7వ రాష్ట్ర పారా స్విమ్మింగ్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచారని అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఏలూరులోని బిశ్వనాథ్ ఈత కొలనులో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ మెన్ కేటగిరీలో జాగరణ సత్యనారాయణ 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ పోటీల్లో సిల్వర్ మెడల్.. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడని తెలిపారు. సబ్ జూనియర్ ఉమెన్ విభాగంలో ప్రియాంకదాస్ బెస్ట్ స్ట్రోక్లో.. మౌనిక 50 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో సిల్వర్ మెడల్స్ సాధించారన్నారు. ఈ మేరకు విజేతలను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. రామస్వామిలతో కలిసి సోమవారం ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
సత్వరమే పరిష్కరించాలి..
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యలను సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో తిరిగి వెళ్లాలన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 112 మంది అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌరసరఫరాల సేవలు, గృహాల మంజూరు, పింఛన్లు, సర్వే, ఉపాధి, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవర్ స్విప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ హేమలత, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో పారదర్శకత
● కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకత పాటించాలని కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు మండల, మున్సిపల్ స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లేదా జూమ్ లింక్ ద్వారా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఫిర్యాదుల రీ ఓపెనింగ్ ఎక్కువగా ఉంటున్నాయని, రెండు వారాల్లో వాటిని తగ్గించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుడికీ సక్రమమైన ఎండార్స్మెంట్ ఇవ్వడం, అందులో సంబంధిత రూల్ పొజిషన్ స్పష్టంగా పేర్కొనడం తప్పనిసరన్నారు. ఎండార్స్మెంట్లు నిర్లక్ష్యంగా ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ కనీసం 60 కాల్స్ చేసి ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణలో కొత్త విధానం.. పీజీఆర్ఎస్ వినతుల స్వీకరణలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఫిర్యాదులు అధికంగా వస్తున్న విద్యాశాఖ, డీఆర్డీఏ, వైద్యారోగ్య శాఖకు చెందిన బాధ్యతలను కలెక్టర్, జేసీ, డీఆర్ఓలతో పాటు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు తీసుకున్నారు. ప్రవేశ ద్వారంలోనే వినతులకు సంబంఽధించిన ప్రభుత్వ శాఖను తెలుసుకుని.. ఆ ఆధికారి వద్దకు నేరుగా అర్జీదారులను పంపే విధానాన్ని సోమవారం నుంచి అమలులోకి తెచ్చారు. పీజీఆర్ఎస్కు 184 వినతులు.. పీజీఆర్ఎస్కు జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి 184 ఫిర్యాదులు స్వీరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులు 69 వచ్చాయి. డీఆర్డీఏకి చెందినవి 28, డీపీఓకు సంబంధించినవి 13, మున్సిపాలిటీలకు సంబంధించి మరో 13, జీఎస్డీడబ్ల్యూస్కు 21, ఇతర శాఖలతో కలిపి 184 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు మురళీ, వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీలాగాంధీ, రాజేశ్వరి, కళావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.40 ఫిర్యాదుల స్వీకరణ.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు 40 వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శ్రద్ధగా విని, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ తగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలవి 5, మోసాలవి 4, నగదు వ్యవహారాలకు సంబంధించినవి ఒకటి, ఇతర అంశాలకు సంబంధించినవి 22 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
యజమానే మా కొడుకును చంపేశాడు..
● మృతుడు యలకల రాము తల్లిదండ్రులుచీపురుపల్లి: తండ్రిలా చూసుకోవాల్సిన యజమానే తమ కొడుకును కిరాతకంగా హత్య చేసాడని మండలంలోని పత్తికాయవలస గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన యలకల రాము తల్లిదండ్రులు సింహాచలం, రమేష్ ఆరోపించారు. తమ కుమారుడిని యజమానే హత్య చేసాడని ఆలస్యంగా తెలుసుకున్న వారు సోమవారం ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా మృతుని తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్స్టేషన్ వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ కుమారుడు నాలుగు సంవత్సరాలుగా తమ గ్రామానికి చెందిన వండాన సన్యాసి వద్ద జేసీబీ డ్రైవర్గా పని చేస్తున్నాడని చెప్పారు. అయితే సకాలంలో జీతాలు కూడా ఇచ్చేవాడు కాదని.. అయినప్పటికీ ఒకే ఊరు కావడంతో ఆయన వద్దనే పని చేస్తుండేవాడని తెలిపారు. ఈ నెల 8న ఇంటి నుంచి విధులకు వెళ్లిన తమ కొడుకు రాము తిరిగి ఇంటికి చేరుకోలేదన్నారు. ఫోన్ చేసినా అవ్వకపోవడంతో యజమాని సన్యాసికి ఫోన్ చేసి చెప్పగా.. అప్పటికే విధులు ముగించుకుని వెళ్లిపోయాడని తెలిపాడని చెప్పారు. మరుచటి రోజు యజమాని సన్యాసి గ్రామంలో వేరేవారికి ఫోన్ చేసి రాము అలిగి వెళ్లిపోయాడని.. పదో తేదీన మరి కొంతమందితో భోగాపురం విమానాశ్రయం పనికి వెళ్లిపోయాడని పొంతన లేని సమాధానాలు చెప్పాడన్నారు. ఇంతలో 11వ తేదీన పుర్రేయవలస ఇటుక బట్టీల వద్ద ఉన్న బావిలో తమ కుమారుడు శవమై కనిపించాడని కన్నీరుమున్నీరయ్యారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే సన్యాసి తమ కుమారుడ్ని హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని శిక్షించాలని కోరారు. -
నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కు లావణ్య
చీపురుపల్లి: సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం (బీకాం) చదువుతున్న డి.లావణ్య ఎంపికై ంది. ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ఏయూ ఇంటర్ కాలేజ్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే ఈ పోటీల్లో అద్భుతంగా రాణించిన లావణ్యను సౌత్ జోన్ నేషనల్ యూనివర్సిటీ గేమ్స్కు ఎంపిక చేశారు. దీంతో లావణ్యను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ కృష్ణాజీ, వైస్ ప్రిన్సిపాల్ ఎం.రమేష్కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కె.జ్వాలాముఖి, సిబ్బంది అభినందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డేటా ఏంట్రీ ఆపరేటర్ పోస్టులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పది పోస్టులకు గాను 250 మంది హాజరుకాగా..ఆస్పత్రి ఆఫీస్ సూపరింటిండెంట్ నారాయణరావు, ఇతర సిబ్బంది ఇంటర్వ్యూలు చేపట్టారు. -
జిల్లాలో అభివృద్ధి శూన్యం..
● పూర్తికాని ప్రాజెక్ట్లు ● కానరాని అభివృద్ధి పనులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వంవిజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నో హామీలిచ్చినా నేటికీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. సాగునీటి ప్రాజెక్ట్ల ఊసే ఎత్తకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రెండుసార్లు వచ్చినా హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో చేసి చూపించలేకపోయారు. జెకా నిధులపై నిర్లక్ష్యం... 2014 సంవత్సరం నుంచి జైకా నిధులపైనా నిర్లక్ష్యం కొనసాగుతోంది. వట్టిగెడ్డకు రూ.38 కోట్ల జైకా నిధులు విడుదలయ్యాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కోట్ల రూపాయల విలువైన పనులు చేసిన తర్వాత కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వెంగళరాయ సాగర్కు రూ.64 కోట్లతో టెండర్లు ఆమోదించారు. ఈ పనులు కూడా మధ్యలో నిలిచిపోయాయి. అలాగే పెదంకలాం, ఆండ్ర ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. శిథిలావస్థలో నారాయణపురం ఆనకట్ట .. సంతకవిటి మండలం రంగారాయపురం, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం సమీపంలో నాగావళి నదిపై 1959 – 63 మధ్య నారాయణపురం ఆనకట్టను నిర్మించారు. సంతకవిటితో పాటు శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 38 వేల ఎకరాలకు ఈ ఆనకట్ట సాగునీరు అందిస్తూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యం కనబరచడంతో షట్టర్లు, రెగ్యులేటర్లు, స్పిల్వే వ్యవస్థలతో పాటు కాలువలు, గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా జిల్లాలో అభివృద్ధి రూపురేఖలు కనిపించడం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాజెక్ట్లు నిలిచిపోయాయి. పతంజలి వంటి సంస్థల పరిశ్రమలు కూడా ఊసులకే పరిమితమయ్యాయి. అంతేకాదు, పదిహేను సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను తొలగించడం, మౌలిక సదుపాయాల కేటాయింపులో జాప్యం వంటి చర్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూతబడిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ.. చెరకు రైతులకు అండగా నిలబడడంతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ మూతబడింది. ముడి సరుకు కొరత, విద్యుత్ చార్జీల పెరుగుదల, ప్రభుత్వ రాయితీలు కల్పించకపోవడం వంటి కారణాలతో ఫ్యాక్టరీని మూసి వేయాల్సి వచ్చింది. -
తెర్లాం ఉపాధ్యాయుడికి గుర్తింపు
● వరించిన అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతెర్లాం: అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తికాయల సునీల్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ (సోలిట్) ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇండియా – అమెరికా సంయుక్త రాష్ట్రాలు విద్యా, సాంకేతికతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాదికి సంబంధించి తెర్లాం హైస్కూల్లో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బోధిస్తున్న సునీల్కు అవార్డు వరించింది.ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కరరావు, అనువాద ఏఐ సీఈఓ డాక్టర్ బి.చంద్రశేఖర్, ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ రీసెర్చ్ నిపుణుడు డాక్టర్ జి.పూర్ణచంద్ర నాగరాజు, యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఎట్ బర్మింగ్హామ్ (అమెరికా) చేతుల మీదుగా సునీల్ అవార్డు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 80కి అవార్డులు రాగా.. అందులో ఒకరు జిల్లా వాసి కావడం గర్వకారణమని ఎంఈఓ త్రినాథరావు, తెర్లాం హైస్కూల్ హెచ్ఎం రమేష్, తదితరులు ప్రశంసించారు. -
గడువులోగా రీ సర్వే పూర్తి చేస్తాం..
● జిల్లా సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఎ.డి లక్ష్మణరావు సీతానగరం: జిల్లాలో జరుగుతున్న థర్డ్ ఫేజ్ రీ సర్వే పనులు 30 రోజుల్లో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఏడీ పి. లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం డీడీ, మూడు జిల్లాల ప్రత్యేక అధికారి కె. సూర్యనారాయణతో సమావేశమై రీ సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా ఎ.డి లక్ష్మణరావు మాట్లాడుతూ.. థర్డ్ ఫేజ్ కింద 43 గ్రామాలకు గాను 27,380 ఎకరాల్లో రీ సర్వే చేయాలని నిర్ధారించామని, అందులో ప్రైవేట్ భూమి 18,788 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. విప్యూటీ డైరెక్టర్ కె. సూర్యనారాయణ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియ నిర్దేశిత సమయానికి పూర్తి చేసేలా అధికారులకు అవగాహన కల్పించామన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో సర్వే పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, ఇందులో భాగంగానే ఇప్పలవలసలో చేపడుతున్న సర్వేను పరిశీలించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగిరెడ్డి శ్రీనివాసరావు, మండల సర్వేయర్ చంద్రశేఖర్, స్థానిక సర్వేయర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
● జీతాలందక అవస్థలు
● కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆరోగ్యమిత్రలువిజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీతాలు ఇప్పించాలని పలువురు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రామసుందర్ రెడ్డిని సోమవారం గ్రీవెన్స్ సెల్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మిత్రల సంఘ జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్ మాట్లాడుతూ.. రెండు నెలలుగా జీతాలు అందక పోవడంతో సిబ్బంది కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నారన్నారు. వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పైడపునాయుడు, మహేష్, బంగారునాయు డు, జగదీష్, రాజప్పడు, తదితరులు పాల్గొన్నారు. -
పంపమంటూనే.. పొగ పెట్టేసింది!
గత పదేళ్లుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు బోధన పరమై న సేవలందించాం. నోటిఫికేషన్ ద్వారా మెరిట్ ఆధారంగానే సీఆర్టీ ఉద్యోగాలకు ఎంపికయ్యాం. ఈ ఉద్యోగమే ఆధారంగా మా జీవితాలను నెట్టుకొస్తున్నాం. అయితే, మా పోస్టులను డీఎస్సీలో కలుపుతున్నారని సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు, పాలకులకు విన్న వించాం. భయపడాల్సిన అవసరం లేదని, కేవ లం అదనంగా ఉన్న పోస్టులను మాత్రమే భర్తీ చేస్తారని మా ఉద్యోగాలకు డోకా ఏమీ లేదని అభయ హస్తం ఇచ్చారు. చివరకు రోడ్డున పడేశారు. – మూడడ్ల స్వాతి, జియ్యమ్మవలస గిరిజన ఆశ్రమ పాఠశాల సీఆర్టీ తమ పోస్టులను డీఎస్సీలో చేర్చవద్దంటూ విన్నవించి నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డీఎస్సీలో చేర్చి ఇప్పుడు నియామకాల పేరుతో సీఆర్టీల ను తొలగించడం అన్యాయం. ఇది వారి జీవితా లతో చెలగాటం అడడమే. న్యాయస్థానంలో స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాటతప్పడం దారుణం. కొత్త నియామకాలతో సీఆర్టీలను తొలగించే ప్రక్రియను వెంటనే ఆపి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. లేకుంటే సీఆర్టీల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన పోరాటాలు, ఉద్యమాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. – భాస్కరరావు, యూటీఎఫ్, జిల్లా జనరల్ సెక్రటరీ సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కోల్పోయి.. రోడ్డున పడిన వారి జాబితాలో ఇప్పుడు సీఆర్టీలు చేరారు. ఐటీడీఏ పరిధిలో ని ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలలలో దాదాపు పదేళ్లకు పైగా పొరుగు సేవలు, కాంట్రాక్టు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపింది. రెగ్యులర్ ఉపాధ్యాయుల తో సమానంగా పనిచేస్తూ.. చాలీచాలని వేతనాల తో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. ఏనాటికై నా తమకు రెగ్యులర్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో వీరి పోస్టులను కూడా కలిపేయడంతో ఆందోళన చెంది పలుమార్లు ఉద్యో గ భద్రత కోసం నిరసనలు కూడా చేశారు. గతంలో ఇదే విషయమై దాదాపు 40 రోజులపాటు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల వద్ద రిలే దీక్షలు చేపట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఏ ఒక్కరికీ అన్యాయం చేయబోమని జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా హామీ ఇచ్చా రు. వారి పోరాటం వృథా అయ్యింది.. ప్రజా ప్రతి నిధులు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటి వరకూ వీరు పనిచేస్తున్న పోస్టుల్లో సోమవా రం డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు విధుల్లో చేరిపోయారు. దీంతో వీరంతా రోడ్డున పడ్డారు. ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని.. ఉమ్మడి జిల్లా పరిధిలో 280 మంది సీఆర్టీలు పని చేసేవారు. ఒక్క పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 55 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీరిలో చాలామంది సుమారు తొమ్మిదేళ్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల్లో అందరూ క్వాలిఫైడ్ లే. పీజీ, బీఈడీ, ఎంఫిల్ వంటి ఉన్నత విద్య పూర్తి చేసిన వారున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభు త్వం వీరి పొట్ట కొట్టింది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 204 మంది పని చేస్తుండగా.. 137 మందిని డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. ఇందులో పాఠశాల సహాయకులు(ఎస్ఏ) 77 మంది, ఎస్జీటీలు 60 మంది ఉన్నారు. వీరంతా సోమవారం విధుల్లో చేరారు. దీంతో రెండు ఐటీడీఏల పరిధిలో 200 మందికిపైగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారంతా ప్రాథేయపడినా కూటమి ప్రభుత్వం కనికరం చూపలేదు. నిర్దాక్షిణ్యంగా ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది. కూటమి ప్రభుత్వం తీరును యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ భాస్కరరావు, గిరిజన విద్యా సంఘం, సీఅర్టీల సంఘం నాయకులు పల్లా సురేష్, ఆరిక వెంకటరావు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ, జీపీఎస్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం అధ్య క్షుడు కె.చంద్రశేఖర్ తదితరులు తీవ్రంగా ఖండించారు. సీఅర్టీలకు అన్యాయం చేస్తే సహించబోమని.. వారికి ఉద్యోగ భద్రత కల్పించే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న మంత్రుల సైతం మా ఉద్యోగాలకు ఇబ్బంది ఏమీ లేదంటూ స్పష్టమైన హామీ ఇచ్చా రు. అన్యాయంగా మా పో స్టులను డీఎస్సీలో చేర్చారు. ఇప్పుడు ఉన్నట్లుండి డీఎస్సీ ద్వారా ఎంపికై న కొత్తవారిని మా స్థానాల్లో నియమించారు. మా పరిస్థితి ఏంటో అర్ధంకాని దుస్థితిలో ఉన్నాం. మా కుటుంబాలతో మేము ఏం కావాలో అర్ధం కావడం లేదు. దశాబ్ధకాలం ప్రభుత్వ పాఠశాలకే అంకితమైన మా జీవితాలను అంధకారంలోకి నెట్టవద్దని ప్రాథేయపడుతున్నాం. – లక్ష్మి, టి.కె.జమ్ము, గిరిజన ఆశ్రమ పాఠశాల, సీఆర్టీ -
హెచ్ఐవీ రోగులపై వివక్ష..!
‘విజయనగరం పట్టణానికి చెందిన ఓ హెచ్ఐవీ బాధితురాలికి గైనిక్ సమస్య రావడంతో ఆమె ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించింది. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు గుర్తించారు. హెచ్ఐవీ ఉండడంతో శస్త్రచికిత్స చేయలేమని చెప్పేశారు. చేసేదిలేక విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 60 వేలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుంది.’ ‘చీపురపల్లి ప్రాంతానికి చెందిన ఓ హెచ్ఐవీ రోగికి కడుపునొప్పి రావడంతో విజయనగరంలో ఉన్న ప్రభుతాస్పత్రిలోని వైద్యు డిని ఆశ్రయించారు. వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ ఉందని తేలడంతో వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయలేదు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ.50 వేలు ఖర్చుచేసి శస్త్రచికిత్స చేసుకున్నారు.’ విజయనగరం ఫోర్ట్: వీరిద్దరికే కాదు అనేక మంది హెచ్ఐవీ రోగులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ బాధితులకు వైద్యసేవలు అందడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదని, ఆప్యాయత చూపాలంటూ ప్రజాప్రతినిధులు దగ్గర నుంచి అధికారుల వరకు ఉపన్యాసాలు చెబుతున్నా.. వైద్యులే సేవలందించేందుకు ససేమిరా అంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏదైనా అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయిస్తే వైద్యసేవలు ఆందించేందుకు వైద్యులు, సిబ్బంది ఇష్టపడడం లేదని హెచ్ఐవీ బాధితులే వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, గైనిక్ సమస్య ఉన్న మహిళలకు, కడుపునొప్పి, పేగు వరపు, హెర్నియా, హైడ్రోసిల్, ఈఎన్టీ సర్జరీ, ఎముకలు, నరాల సంబంధిత శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఎస్.కోట, రాజాం, గజపతినగరం, చీపురుపల్లి ఏరియా ఆస్పత్రులు, బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, భోగాపురం సీహెచ్సీలు, ఘోషా ఆస్పత్రిలో హెచ్ఐవీ బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సలు, చికిత్స అందించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు... జిల్లాలో 6,670 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. వీరిలో పురుషులు 2,755 మంది, మహిళలు 3,646 మంది, పిల్లలు 269 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందక పలువురు హెచ్ఐవీ బాధితులు ఆపదవేళ శస్త్రచికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హైడ్రోసిల్, ఫైల్స్ శస్త్రచికిత్సకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు, గైనిక్ సర్జరీలకు రూ.60 వేల నుంచి రూ. 70 వేలు వరకు వసూలు చేస్తున్నారు. హెర్నియా, కడుపు నొప్పి వంటి శస్త్రచికిత్సలకు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆదేశాలిచ్చాం.. హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి ప్రభుత్వాస్పత్రుల్లో హెచ్ఐవీ రోగులకు జరగని శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం పొందుతున్న హెచ్ఐవీ రోగులు జిల్లాలో 6,610 మంది హెచ్ఐవీ బాధితులు వీరిలో మహిళలే 3,646 మంది -
కాస్త పెరిగిన తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: నాగావళి నదిలో తోటపల్లి ప్రాజె క్టు వద్ద నీటి ప్రవాహం కాస్త పెరిగింది. సోమ వారం సాయంత్రానికి 105 మీటర్లకు 104.2 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 6,953 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తివేసి 4,939 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నట్టు అధికారులు తెలిపా రు. కాలువలకు 1300 క్యూసెక్కులు నీటిని విడిచిపెడుతున్నామన్నారు. పార్వతీపురం రూరల్: జిల్లాను ఓ వైపు జలపా తాల ఖిల్లాగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తూనే, మరోవైపు గిరిజన గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న డోలీ మోతలకు శాశ్వతంగా చరమ గీతం పాడాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతీ జలపాతాన్ని గుర్తించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలన్నా రు. అదే సమయంలో ప్రతీ మారుమూల గ్రామానికి అంబులెన్స్ వెళ్లేలా రోడ్ల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్వో కె. హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ వీసీ బాధ్యతల స్వీకరణ ● విద్యాప్రమాణాల మెరుగుకు కృషిచేస్తా: వీసీ వి.వి.సుబ్బారావు విజయనగరం రూరల్: జేఎన్టీయూ–గురజాడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (వీసీ) వి.వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జేఎన్టీయూ కాకినాడ రెక్టార్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై వీసీగా నియమిస్తూ ఈ నెల 8న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన వర్సిటీ అధికారులు, ఆచార్యుల సమక్షంలో తాజాగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు చర్యలు తీసుకుంటానన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాల పెంపు, బోధన సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, అధికారుల సహకారంతో వర్సిటీ పురోగతికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహారాణిపేట (విశాఖ): కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 21 మంది పచ్చ కామెర్ల బాధితులను సోమవారం కేజీహెచ్ నుంచి పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థులకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని, వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్ (గ్యాస్ట్రో ఎంటాలజీ), డాక్టర్ శివకళ్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవి లత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు) సహా ఐదుగురు వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థుల తరలింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు పలు విడతల్లో మొత్తం 44 మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు సూపరింటెండెంట్ వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 50 మంది విద్యార్థినులు పచ్చ కామెర్ల బారిన పడ్డారు. వీరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న తోయక కల్పన, పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. -
బంగారం చోరీ
గంట్యాడ: మండలంలోని కరకవలస పరిధి జగదాంబ నగర్లో తులం ముప్పావు బంగారం చోరికి గురైంది. జగదాంబనగర్లో నివాసముంటున్న కుప్పిలి శ్రీరామమూర్తి ఇంట్లో శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న ఒక్కటిన్నర తులాల గొలుసు, పావు తులం ఉంగరం ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి. సాయి కృష్ణ తెలిపారు. ఇద్దరు యువతుల అదృశ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అమ్మాయిలు ఆదివారం అదృశ్యమయ్యారు. ఇందుకు సంబంధించి ఏఎస్సై రామలక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అయ్యన్నపేటకు చెందిన అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు (23) శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. డిగ్రీ చదివిన ఇద్దరూ స్నేహితుల వద్దకు వెళ్లిఉంటారని వారి తల్లిదండ్రులు ఆదివారం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అమ్మాయిలిద్దరూ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అన్నదమ్ములిద్దరూ వన్టౌన్ పోలీస్ స్టేషన్ వకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ఆర్వీఆర్కే.చౌదరి ఆదేశాలతో ఏఎస్సై రామలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్షాక్తో విద్యార్థినికి గాయాలుపాలకొండ రూరల్: స్థానిక ఎన్కే.రాజపురం ప్రాంతానికి చెందిన టి.యామిని అనే విద్యార్థిని పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన ఆ విద్యార్థిని తిరిగి ఇంటికి వె వెళ్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై గాయాలపాలైంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరయ్యేందుకు పాఠశాలకు ఆమె చేరుకోగా ఆ సమయంలో సహ విద్యార్థులు రాకపోవడంతో తిరిగి ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలో పాఠశాల రహదారిలో ఎదురుగా వస్తున్న వాహనం నుంచి తప్పుకోబోతున్న క్రమంలో అక్కడి ప్రహరీ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగలడంతో షాక్కు గురైంది. ఈ క్రమంలో స్థానికులు గమనించి విద్యార్థినిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. షాక్ కారణంగా గాయాలు కావడంతో వైద్యు ప్రథమ చికిత్స అందించటంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్ధిని అందించిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్యలక్కవరపుకోట: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారం కావడంతో మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన కొటాన సంతోష్(26) మనస్తాపం చెందిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఎస్సై నవీన్పడాల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్ విశాఖపట్నంలోని ఒక సంస్థలో ఆవుట్సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. తనకు వచ్చిన జీతం సరిపోక కుటుంబాన్ని పోషించుకోవడం భారమవడంతో శనివారం సాయంత్రం తన ఇంటి వద్ద గడ్డిమందు తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సంతోష్ను కుటుంబసభ్యులు గుర్తించి ఎస్.కోట సీహెచ్సీకి, అక్కడి నుంచి విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.ఈ మేరకు మృతుడు తండి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు
● గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి కరువు పార్వతీపురం రూరల్: భవిష్యత్ భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బడులు, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు నరక కూపాలుగా మారుతున్నాయి. గిరిజన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు, నేడు కనీస సౌకర్యాలకు నోచుకోక వారి పాలిట శాపాలుగా పరిణమించాయి. పార్వతీపురం మండలంలోని రావికోన గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులే ఇందుకు నిలువుటద్దం. సుమారు 150 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో, చదువుకోవాలన్నా, పడుకోవాలన్నా, భోజనం చేయాలన్నా అన్నీ ఒకే చోట కావడం వారి దుస్థితికి అద్దం పడుతోంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేకపోవడం పెను సమస్యగా మారింది. ఉన్న కొద్దిపాటి గదులనే తరగతులకు, భోజనశాలకు, శయన మందిరానికి వినియోగిస్తున్నారు. పగలు ఎక్కడైతే అక్షరాలు దిద్దుతారో, రాత్రి అక్కడే పక్కలు వేసుకుని నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ గదులు కూడా విద్యార్థులందరికీ సరిపోకపోవడంతో, అనేకమంది చలికి, దోమల బెడదకు ఓర్చుకుంటూ వరండాలలోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. తమ బట్టలు, పుస్తకాలు దాచుకునే పెట్టెలను మెట్ల కింద పెట్టుకుని, అక్కడే ఒరిగిపోతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. మంచి నీటికి మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, రావికోన పాఠశాలలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ తాగే నీటికి, ఇతర అవసరాలకు ఒకే ట్యాంక్ నీటిని వినియోగించాల్సి వస్తుండడం విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించడంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం గిరిజన విద్యార్థుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం, సంబంధిత శాఖ పరమైన అధికారులు తక్షణమే స్పందించి రావికోన ఆశ్రమ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని, సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు అందించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
‘బుచ్చి అప్పారావు’ విగ్రహం ఏర్పాటులో రాజకీయం..!
విజయనగరం అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరుతో గంట్యాడ మండలంలోని తాడిపూడి రిజర్వాయర్ ప్రాంతంలో సోమవారం జరుగనున్న విగ్రహ ఆవిష్కరణ రాజకీయ రంగుదాల్చింది. తూర్పు కాపు–కొప్పుల వెలమ సంఘాల మధ్య విభేదాలు, పాత ప్రభుత్వాల నిర్ణయాలపై కొత్త పాలకుల వైఖరి, చందాల వసూళ్ల వివాదం ఈ కార్యక్రమాన్ని చర్చనీయాంశంగా మర్చాయి. స్వాతంత్య్ర సమరయోధుడి స్ఫూర్తి చుట్టూ రాజకీయ లెక్కలు, సంఘాల విఽభేదాలు, చందాల వసూళ్లు వెరసి ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేశాయి.వైఎస్సార్సీపీ పాలనలో మొదలైన ప్రణాళికవైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో తాడిపూడి రిజర్వాయర్కు గొర్రిపాటి బుబ్బి అప్పారావు పేరు పెట్టాలన్న ప్రతిపాదన కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు సమర్పించగా ఆ వినతిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆమోదించి ప్రత్యేక జీఓ జారీ చేసింది. సంఘం జిల్లా కమిటీ కోరిన మేరకు మాజీ ఎమ్మెల్సీ బొత్స అప్పలనరసయ్య ఆర్థిక సహకారంతో దాదాపు రూ.10 లక్షల వ్యయంతో బుచ్చి అప్పారావు విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహానికి స్థలాన్ని కూడా గత ప్రభుత్వం ఎంపిక చేసి ఇచ్చింది. ఆ స్థలంలో సంఘం ప్రతినిధులు శంకుస్థాపన పూర్తి చేశారు. ఎన్నికల అనంతరం పాలకపక్షం మారింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ కాపు నేతలు విగ్రహస్థాపన ప్రయత్నాన్ని జరగనీయలేదు సరికదా ఆ జీఓను రద్దు చేయించారు. కొప్పుల వెలమ సంఘం గత నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పాలనలో పలుమార్లు వినతులు సమర్పించినా ఏనాడూ స్పందన రాలేదు. అదే కులానికి చెందిన అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ డిమాండ్ పట్టించుకోలేదని సంఘం నాయకులు చెబుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో జిల్లా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఎదుర్కోలేక చివరికి కూటమి ప్రభుత్వానికి మళ్లీ కొత్త జీఓ జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఇప్పుడు మరో విగ్రహం–మరో కథకూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ వ్యవహారంలో కలుగచేసుకుని కొత్త విగ్రహం తయారు చేయించే ప్రతిపాదన తెచ్చారు. అయితే తొలి నుంచి తమ కులానికి చెందిన సమరయోధుడిగా ఆరాధిస్తూ తాడిపూడి రిజర్యాయర్కు ఆయన పేరు పెట్టాలని పట్టుపడుతూ ఆయన విగ్రహాన్ని పెట్టాలని కృషి చేసిన కొప్పుల వెలమ సంక్షేమ సంఘాన్ని పక్కను పెట్టి తెలుగుదేశం పార్టీలో స్థానిక మరో కులం తూర్పుకాపు నాయకుల కార్యక్రమంగా తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కొత్త విగ్రహం పేరుతో చందాల వసూలుకొప్పుల వెలమ సంఘం రూ.10 లక్షల వ్యయంతో సిద్ధం చేసిన విగ్రహాన్ని కాదని కొత్త విగ్రహం ఆవిష్కరణ పేరుతో ప్రజల నుంచి వసూళ్ల దందాకు తెరలేపారు. తాడిపూడి రిజర్వాయర్ పరిధిలోని గంట్యాడ, జామి మండలాల గ్రామ ప్రజలు, ఉద్యోగుల నుంచి భారీగా చందాలను బహిరంగంగానే వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల వారీగా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలు టార్గెట్ ఇచ్చి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు గ్రామాల్లో ఈ వసూళ్లపై ప్రజల నుంచి ఆగ్రహం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. -
ప్రమాదానికి నిలయంగా ఆర్వోబీ
సీతానగరం: మండలంలోని వాహన చోదకులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిపై నిరంతరం పార్వతీపురం, బొబ్బిలి మీదుగా రోజూ వందలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మార్గమధ్యంలో రోడ్డు, వంతెనపై భారీ స్థాయిలో గోతులు ఏర్పడడంతో నెల రోజులుగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతుల్లో వాహనాలతో జరుగుతున్న ప్రమాదాల్లో నిండు ప్రాణాలు పోతున్నా ఇంతవరకూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్డు ప్రమాదాలను చూస్తున్న పోలీసులు కొంతమేర గోతులు పూడ్చుతున్నా వర్షాలు, భారీ వాహనాలు వందల సంఖ్యలో మరమ్మతుల సమయంలో తిరుగాడడం వల్ల ఫలితం లేక పోతోంది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉపాధిహామీలో ఇంజినీర్ల పాత్ర కీలకం
● పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శివిజయనగరం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల పాత్ర కీలకమని పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్లో ఇంజినీరింగ్ విభాగం పాత్రను మరింత బలోపేతం చేయడం, విజిలెన్స్ ఆండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎదురవుతున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది సర్వీస్ రూల్స్ రూపకల్పన, సవరణలకు సంబంధించిన సూచనలు, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించడమే అసోసియేషన్ లక్ష్యమన్నారు. గౌరవాధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని, ప్రతి సభ్యుడు సమాజ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జి.వెంకటరెడ్డి, విజయనగరం జిల్లా అధ్యక్షుడు యు.సోములు, కార్యదర్శి కె.ప్రసాద్, కోశాధికారి వి.నీరజ, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిహామీ పనుల్లో అవకతవకల గుర్తింపు
సీతానగరం: మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులు, బిల్లుల చెల్లింపు, మస్తరు వేయడంలో అవకతవకలు జరుగుతున్నాయా? లేదా? అనే అంశంపై సామాజిక తనిఖీ సిబ్బంది గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినంకలాంలో రామమందిరం వద్ద సర్పంచ్ పి.తిరుపతిరావు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసభ జరిగింది. మధ్యాహ్నం గ్రామసభ ప్రశాంతంగా ప్రారంభించినప్పటికీ క్షేత్ర సహాయకుడు బి. సత్యనారాయణ సమక్షంలో జాబ్ కార్డులు, ఉపాధి పనులుకల్పిం చడం, బిల్లుల చెల్లింపులపై వేతనదారులను సామాజిక తనిఖీ బృందం అడిగి తెలుసుకున్న సమయంలో వివిధ రకాల అభియోగాలు బయటపడ్డాయి. దీర్ఘ కాలంగా గ్రామాంతరం వెళ్లిన వారికి పనుల్లో పాల్గొనక పోయినా మస్తరు వేశారని, గర్భిణులు ప్రసవ సమయంలో పనుల్లో పాల్గొనక పోయినా, ప్రభుత్వం వద్ద గౌరవ వేతనం తీసుకుంటున్న వారికి, అనారోగ్యానికి గురైన వృద్ధులు ఏళ్ల తరబడి మంచాన పట్టిన వారికి, ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు వేర్వేరు జాబ్కార్డులు పొంది వేతనాలు పొందినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. సామాజిక తనిఖీ సిబ్బంది గ్రామసభ నిర్వహించే సమయంలో గ్రామస్తులు ఒకరిపై ఒకరు అభియోగాలు చేసుకోవడం గొడవలకు దారితీసింది. దీంతో గ్రామంలోని రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. ఈ విషయమై డీఆర్పీ గుంపస్వామి వద్ద ప్రస్తావించగా విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి తదితర దూర ప్రాంతాల్లో ఉన్నవారికి, వృద్ధులకు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు పొందుతున్న వారికి ఉపాధిహామీ బిల్లులు చెల్లించినట్లు గ్రామసభలో గుర్తించామన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయనున్నట్లు చెప్పారు. -
నేడు పీజీఆర్ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. పింఛన్దారుల సమావేశం నేడుపార్వతీపురం: పట్టణంలోని రైతు బజారు పక్కన వున్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం పింఛన్దారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గంట జగన్నాధంనాయుడు, కార్యదర్శి గణపతిరావు ఆదివారం తెలిపారు. సమావేశంలో మండల యూనిట్లు నిర్వాహణ, భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. పింఛన్దారులు హాజరు కావాలని కోరారు. విజయనగరం టౌన్: హంస వాహనంపై పైడితల్లి అమ్మవారు విహరించేందుకు తెప్పోత్సవ ఏర్పాట్లను ఆలయ అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం పెద్ద చెరువులో తెప్పోత్సవం ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష తెలిపారు. 30 మంది గజ ఈతగాళ్లతో, హంస వా హనం, రెండు పక్క బోట్లుతో పాటూ అగ్నిమాపక అధికారుల బోట్లు ఉంటాయన్నారు. హంస వాహనిపై విహరించే పైడితల్లి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చే అశేష భక్త జనావళికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. ఆర్అండ్బీ అధికారుల సాయంతో వేసిన గ్రిల్స్ వరకూ వచ్చి తెప్పోత్సవాన్ని చూసే అవకాశం కల్పించామన్నారు. పెద్దచెరు వు అవతలి గట్టు నుంచి కోటశక్తి ఆలయం వర కూ తెప్పోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉందన్నారు. మూడుసార్లు అమ్మవారు పెద్ద చెరువు లో హంస వాహనంపై విహరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారని తెలిపారు. ట్రయల్ రన్ సుమా రు 50 మందితో నిర్విహిస్తామని, కానీ ఉత్సవానికి మాత్రం 20 మంది వరకే అనుమతి ఉందన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంట ల నుంచి నిర్వహించనున్న తెప్పోత్సవాన్ని భక్తులందరూ వీక్షించి తరించాలని కోరారు. వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద 4 వేల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఆదివారం నమోదైంది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 4వేల క్యూ సెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు వద్ద 64.12 మీటర్లు లెవెల్ నీటిమట్టం నమోదైంది. వచ్చిన నీటిని రెండు గేట్ల ద్వారా దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. విజయనగరం ఫోర్ట్: సమాజంలో ఎప్పటికప్ప డు వచ్చే అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని వైద్యు లు తెలుసుకోవాలని ఐఎంఏ సీజీపీ డీన్ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ అన్నారు. ముంబాయిలోని ఐటీసీ హోటల్లో నిర్వహించిన వెస్ట్ జోన్ జాతీయ వైద్యుల సమ్మేళనంలో విజయనగరానికి చెందిన ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. సేవాదృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ జాతీ య అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుపాళి, ఉపా ధ్యక్షుడు కపాడియా, కోశాధికారి పీయూష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కపట నాటకం!
కౌలు రైతులపై...పార్వతీపురం రూరల్: ఎన్నికల ముందు ఓట్ల కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. గద్దెనెక్కిన తర్వాత హామీలను గాలికొదిలేయడం కూటమి పాలకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్న కడుపు మాడుతున్నా... ఈ సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదు. ముఖ్యంగా సాగు భూమిలో సింహభాగం వాటా కలిగిన కౌలు రైతుల కష్టాలు అరణ్యరోదనగా మారుతున్నాయి. ఖరీఫ్ పంట చేతికొచ్చే దశకు చేరుకుంటున్నా, వారికి ఇస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి, రైతులపై చూపిస్తున్న వివక్షకు నిలువుటద్దం పడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కౌలు రైతుల కన్నీటి గాథలే ఇందుకు సజీవ సాక్ష్యం. కార్డుల జారీలో కపట నాటకం! జిల్లాలో 30 వేలకు పైగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంటే, ప్రభుత్వ లెక్కలు మాత్రం వారిని వెక్కిరిస్తున్నాయి. కేవలం 11 వేల మందికి మాత్రమే కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం వెనుక ఉన్న కుట్ర ఏమిటో అర్థం కావడం లేదని రైతులోకం ప్రశ్నిస్తోంది. క్షేత్ర స్థాయి వాస్తవాలను గాలికి వదిలేసి, ఏసీ గదుల్లో కాగితాలపై లక్ష్యాలు నిర్దేశించి చేతులు దులుపుకునే ధోరణిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 9,345 మందికే కార్డులు జారీ చేశామని అధికారులు గొప్పగా చెబుతున్నప్పటికీ, ఆ ప్రక్రియలో జరుగుతున్న భాగోతం అంతా ఇంతా కాదు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న వారికే కార్డుల పందేరం జరుగుతోందని, అసలైన కష్టజీవులకు అన్యాయం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. పైగా, జారీ చేసిన కార్డులలో సైతం అక్షర దోషాలు, తప్పుడు వివరాలతో అవి పనికిరాని కాగితపు ముక్కలుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతున్న మాటలు నీటి మీద రాతలనే తలపిస్తున్నాయి. పంట చేతికొచ్చాక పెట్టుబడా..? రైతన్నను దగా చేసేందుకే ఈ ఎత్తుగడ...! సాగుకు అత్యంత కీలకమైన పెట్టుబడి కోసం రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సమయంలో ఆదుకోవాల్సింది పోయి, పంట కోతకు వచ్చాక సాయం అందిస్తామనడం కౌలు రైతులను దగా చేయడానికేనని రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. కౌలు కార్డుల జారీ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, దానిని సాకుగా చూపి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈ పన్నాగం పన్నిందని స్పష్టమవుతోంది. నవంబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెబుతున్నా, అప్పటికై నా ఈ అన్నదాతల ఆకలి కేకలు ప్రభుత్వ చెవికి ఎక్కుతాయో లేదో వేచి చూడాలి. తక్షణమే ప్రభుత్వం కళ్లు తెరిచి, అర్హులైన ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డులు అందించి, అన్నదాత సుఖీభవ సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో, రైతుల ఆగ్రహ జ్వాలలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాయి. కౌలు రైతులకు ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కౌలు రైతుకు సీఆర్సీ కార్డులు చట్ట ప్రకారం ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు మూడో వంతు కూడా ఇవ్వలేదు. గుర్తింపు కార్డు లేనిదే కౌలుదారుకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు. గుర్తింపు కార్డు లేక కౌలుదారుకు సబ్సిడీ ఎరువులు కూడా ఇవ్వలేదు. మొన్న వర్షానికి, గాలికి పంట నష్టపోయినా కౌలుదారికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం సేకరించే పంటలకు ఈ క్రాప్ చేయాలి. గుర్తింపు కార్డు లేనందున కౌలుదారు పేరున ఈ క్రాప్ చేయడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కౌలుదారులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి, ఈ క్రాప్ చేసి పంట రుణాలు, నష్టపరిహారం ఇవ్వాలి. – ఎం.కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాలో 30 వేల మంది కౌలు రైతులు 11 వేల మందికే గుర్తింపు కార్డులు 70 శాతం సాగు వారిదే అయినా.. సాయంలో సున్నా.. చెమటోడ్చే కౌలు రైతుకు కూటమి సర్కార్ మొండి చేయి పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకే కౌలు కార్డుల జారీలో జాప్యం -
పోరుబాట
సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కూటమి అరాచక పాలనపై విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై, దురాగతాలపై పోరాటం చేయనున్నట్టు విజయగనరం జిల్లా పరిషత్ ౖచైర్మన్, వైఎస్సా ర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీ య అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపడుతున్న పోరాటాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు పోరాట కార్యాచరణ ప్రకటించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ తీవ్ర ంగా వ్యతిరేకిస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేయటం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించిన అనంతరం, 12న జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఆశయాలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ప్రభుత్వాలే విద్య, వైద్యం అందించాలని ఆకాంక్షిస్తే ప్రస్తుత కూటమి సర్కారు ప్రైవేటీకరణ చేయటం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను నిర్మించాలని జగన్మోహన్రెడ్డి సంకల్పించగా, అందులో 7 కాలేజీలను పూర్తి చేయ గా... 5 కాలేజీల్లో తరగతులు జరుగుతున్నాయన్నా రు. మిగిలిన కాలేజీల నిర్మాణానికి రూ.5000 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని చెప్పారు. 16 నెలల కాలంలో రూ.2లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేకపోవటంతోనే కురుపాంలో పచ్చకామెర్ల బారిన పడిన విద్యార్థులను 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖలో ని కేజీహెచ్కు తరలించి చికిత్స అందించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. విజయనగరంలో ప్రైవేటుగా నిర్వహిస్తున్న మిమ్స్ ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏ అధికారంతో చందాలు వసూలు చేశారు..? విజయనగరం ఉత్సవాల పేరిట జిల్లా అధికార యంత్రాంగం ఏ అధికారంతో చందాలు వసూలు చేశారో చెప్పాలని మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించా రు. విజయనగరం ఉత్సవం అనేది ప్రభుత్వంతో సంబంధం లేదని, అటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా అకౌంట్లు పెట్టి బలవంతపు వసూళ్లు చేయటాన్ని తప్పుపడుతున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిధులు సేకరించి ఉత్సవాలు నిర్వహించే వారని ఈ ఏడాది అందుకు భిన్నంగా అధికార యంత్రాంగంతో చందాలు వసూలు చేయించటం దారుణమన్నారు. ఉత్సవాల పేరిట ఎంత మొత్తంలో చందాలు వసూలు చేశారు..? ఎంత ఖర్చు చేశారన్న లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబా బు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారు చేసి నేరుగా షాపుల్లో విక్రయించటం దారుణమని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ మద్యం మాఫియాకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 13న సోమవారం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు పార్టీ సమన్వయకర్తలు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం కల్తీ మద్యం తయారీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎకై ్సజ్ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. కల్తీ మద్యం తయారీని ఓ కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసినట్టు వెలుగులోకి రావటం, వాటిని టీడీపీ నేతల అనుచరులే నిర్వహిస్తున్నట్టు తేటతెల్లమైందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇటువంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదని ప్రభుత్వ ఆధ్వర్యంలో పారదర్శకంగా విక్రయాలు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటు వ్యాపారులకు అప్పగించి కల్తీ మద్యం మాఫియాను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఇప్పటి వరకు కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 35 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. కృష్ణ, ఏలూరు, పరవాడ తదితర ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారీ చేసి విక్రయించడంపై ప్రభుత్వం, ఎౖక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం నటిస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా ఆడబిడ్డల తాళిబొట్లు తెంచిన పాపానికి ఒడిగడుతున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా వేలాది మంది కిడ్నీ, లివర్లు పాడై అనారోగ్యాల బారిన పడుతున్నారని.. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తక్షణమే కల్తీ మద్యం తయారీని పూర్తి స్థాయిలో కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ముగిసిన జేవీవీ కళాజాతా శిక్షణ
విజయనగరం అర్బన్: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయిలో స్థానిక గురజాడ స్కూల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళాజాతా శిక్షణ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ నెలలో కర్నూలులో, అక్టోబర్ నెలలో విజయనగరంలో నిర్వహించిన శిక్షణ తరగతులు లక్ష్యాన్ని నెరవేర్చాయన్నారు. గుంటూరులో నవంబర్లో నిర్వహించనున్న శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ప్రధానంగా పాటల శిక్షణ, డప్పు శిక్షణ, మ్యూజిక్పై శిక్షణ పొందిన వారు, తర్వాత రోజులలో పాఠశాలలు, కాలేజీలలో చదువుతున్న విద్యార్థులతో సమావేశాలు జరపాలన్నారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎ.ఫృధ్వీ, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గండ్రేటి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు గండ్రేటి లక్షణరావు, గండ్రేటి అప్పలనాయుడు, డాక్టర్ ఏవీ రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్.కృష్ణారావు, కోశాధికారి ఎస్.శివాజీ, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, పార్వతీపుం మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా!
కురుపాం: గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాము పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, ఏకలవ్య పాఠశాలను ఆమె ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు స్పందించకపోవడం వలనే తోయక కల్ప, అంజలి గురుకుల విద్యార్థినులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలలో 170 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడడం ఘోరమని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో తాగునీటి కలుషితం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఒకే తాగునీటి బోరు ద్వారా గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాలకు నీటి సరఫరా అవుతుందని అప్రమత్తంగా ఉండాలని తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఒకటో తేదీనే ఏకలవ్య పాఠశాలకు చెందిన విద్యార్థులకు కామెర్లు సోకినట్టు గుర్తించినా ఆరో తేదీ వరకు కూడా విద్యార్థులకు స్క్రీనింగ్ చేయలేదన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఇంతటి తీవ్రమైన సమస్య వెలుగులోకి తీసుకొచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆదివారం వెళ్లగా జనరల్ ఫిజీషియన్ లేరని, ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నారని ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. హెపటైటిస్ ఏ ఎంతో ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారని అయినా పాలకులకు ఇంత నిర్లక్ష్యం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. మలం కలిసిన నీటి కలుషితం కావడం వల్లే హెపటైటిస్ ఏ వ్యాప్తి చెందిందని నివేదికలు చెబుతున్నాయని, అయినా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు పర్యవేక్షణ లోపంపై హ్యూమన్ రైట్స్కు, జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఆమె వెంట ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ గొర్లి సుజాత, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు. సరైన వైద్యం అందకే ఇద్దరు విద్యార్థినుల మృతి ఒకే స్కూల్లో 170 మంది పచ్చకామెర్ల బారిన పడడం ఘోరం పెరుగుతున్న హెపటైటిస్ ఏ కేసులు చోద్యం చూస్తున్న ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హ్యూమన్ రైట్స్, జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం.. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి -
వైద్యవిద్యా వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి
● ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలి ● పౌరవేదిక సంఘం డిమాండ్ విజయనగరం గంటస్తంభం: పేదలకు అందుబాటులో వైద్యవిద్య అందాలంటే వైద్యవిద్య. ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్యరంగాన్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇది ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా, అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమైనట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే వైద్యవిద్య పేదలకు అందని ద్రాక్ష అవుతుంది. ఫీజులు భారీగా పెరిగి పేద విద్యార్థులు వెనుకబడిపోతారు. అదేవిధంగా వైద్యం కూడా మరింత ఖరీదుగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీహెచ్సీ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం 20 రోజులుగా సమ్మెలో ఉన్నారని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈనెల 15తేదీన విజయనగరంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వాల్పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో యూఎస్.రవికుమార్, సుధీర్, సతీష్ పాల్గొన్నారు. -
చేపల దొంగలపై చర్యలు తీసుకోవాలి
● జిల్లా మత్య్సకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న గంట్యాడ: మండలంలోని పెంట శ్రీరాంపురం గ్రామంలోని నల్ల చెరువులో దొంగతనంగా చేపలు పట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా మత్య్సకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న డిమాండ్ చేశారు. పెంట శ్రీరాం పురం గ్రామంలో అక్కివరం, గొడ్డు పాలెం గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు చేపలు పడుతుండగా గ్రామానికి చెందిన మత్య్సకార సహకార సంఘం సభ్యులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దొంగతనంగా చేపలు పట్టిన వారిపై కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని లేని ఎడల మత్య్సకార సహకార సంఘాల నాయకులం రోడ్డెక్కి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చెరువుల్లో దొంగతనంగా చేపలు పడుతున్న విషయంపై గత నెలలో కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినప్పటికీ సరైన చర్యలు తీసుకోక పోవడం వల్ల మత్య్సకారులకు చెందిన చేపలు చోరీకి గురై ఆర్థికంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి రైల్వేస్టేషన్ సమీపంలో గరివిడి పట్టణంలో రైలు ఢీకొన్న సంఘటనలో గుర్తు తెలియని వృద్ధుడు శనివారం మృతిచెందాడు. విశాఖపట్నం నుంచి పలాస వైపు సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో వెళ్తున్న రైలు ఢీకొనడంతో 70 ఏళ్ల వయస్సు గల వృద్ధుడు మృతిచెందాడు. -
యువతి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరంలోని అయ్యకోనేరు చెరువులో శనివారం సాయంత్రం 6.30 గంటలకు టూటౌన్ పోలీసులు ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బాబామెట్టకు చెందిన బెహరా ఈశ్వరరావు దంపతులకు ఇద్దరు పిల్ల లు. కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా, కూతురు రమ్య స్థానికంగా చదువుతోంది. ఈశ్వరరావు భార్య నగరంలోని మహరాణిపేటలో బీవీకే స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి సైకిల్పై వెళ్లిన రమ్య మరుసటి రోజు వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే అందుబాటులో లేదని వచ్చింది. దీంతో శనివారం ఉదయం తండ్రి బెహరా ఈశ్వరరావు టుటౌన్ పోలీసు స్టేషన్కు వచ్చి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. సాయంత్రం అయ్యేసరికి అయ్యకోనేరు చెరువులో మృతదేహం కనిపించింది. ఇంటి నుంచి వెళ్లి పోయిన రమ్యకు పెళ్లి చేసేందుకు కన్నవారు యత్నించారు. అయితే తనకు ఆ పెళ్లి ఇష్టంలేదని గడిచిన కొద్దిరోజుల నుంచి కన్నవారితో రమ్య గొడవపడుతూనే ఉంది. దీంతో ఎవరితో మాట్లాడకుండా ఉండడం, గదిలోకి వెళ్లి ఒంటరిగా ఉండడం వంటి పనులు చేయసాగింది. శుక్రవారం ఫ్రెండ్ దగ్గరకు వెళ్తానని చెప్పి సైకిల్ తీసుకుని వెళ్లి చివరకు తిరిగి రాని లోకాలకు వెళ్లి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసినా మృతదేహం లభించడంతో బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
విద్య, ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలి
గుమ్మలక్ష్మీపురం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందివ్వడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఈమేరకు శనివారం ఆయన గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖల్లు, దొరజమ్ము, టిక్కబాయి గ్రామాల్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలతో పాటు రేగిడి, పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా పాఠశాలల్లోని తాగునీటిని, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పాఠశాల ఆవరణ, వసతి గృహల ఆవరణను పరిశీలించారు. పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లును ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని, భోజనంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా ఆకు, కూరగాయలు, గుడ్లను ఇవ్వాలని, అనారోగ్యానికి గురైనట్లు గుర్తించిన వెంటనే వైద్య సదుపాయాలు కల్పించాలని హెచ్ఎంలు, డిఫ్యూటీ వార్డెన్లకు సూచించారు. తన పర్యటనలో భాగంగా కురుపాంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను కూడా సందర్శించారు. ఆయన వెంట గుమ్మలక్ష్మీపురం ఎంఈఓ బి.చంద్రశేఖర్, తహసీల్దార్ ఎన్.శేఖర్ ఉన్నారు. -
డీఎస్డీఓగా వెంకటేశ్వరరావు
● శ్రీధర్రావుకు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ విజయనగరం: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి (డీఎస్డీఓ)గా ఎస్.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. విశాఖ జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనను విజయనగరం జిల్లాకు బదిలీ చేస్తూ శాప్ ఎం.డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కె.శ్రీధర్రావును పార్వతీపురం మన్యం జిల్లాకు చేస్తూ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా హాకీ కోచ్గా విధులు నిర్వహిస్తున్న ఎ.మహేష్బాబుకు శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. తాజా బదిలీ ఉత్తర్వుల మేరకు సంబంధిత అధికారులు వెనువెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిగా నియామకమైన వెంకటేశ్వరరావుకు గతంలో జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది. ఇసుక అక్రమ తరలింపు అడ్డగింతబొబ్బిలి రూరల్: మండలంలోని అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలించేందుకు సిద్ధం చేసిన ట్రాక్టర్లను తహసీల్దార్ ఎం.శ్రీను శనివారం పట్టుకున్నారు. రెవెన్యూ, పోలీసులతో కలిసి ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించారు. శని,ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అధికారులెవరూ విధుల్లో ఉండరని భావించిన ట్రాక్టర్ యజమానులు శనివారం ఉదయం ఆరు గంటలకే ఇసుక తవ్వకాలకు జేసీబీనీ సిద్ధం చేసుకుని వరుస క్రమంలో జేసీబీతో నదిలో ఇసుకను తోడుతున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో దాడిచేసే సమయానికి జేసీబీ, కొన్ని ట్రాక్టర్లు తప్పించుకోగా ఇసుకను లోడు చేసేందుకు సిధ్దంగా ఉన్న ఏడు ఖాళీ ట్రాక్టర్లను తహసీల్దార్ అదుపులోకి తీసుకున్నారు. యజమానులను పిలిపించి హెచ్చరించారు. ట్రాక్టర్ల నంబర్లు తీసుకుని అక్రమ ఇసుక రవాణాతో దొరికితే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించి విడిచిపెట్టారు. ట్రాక్టర్ యజమానుల సంఘం ప్రతినిధులతో మాట్లాడుతూ ఇది చివరి అవకాశమని మరో మారు దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంతకవిటి: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన గొర్లె దమయంతి (50) పాముకాటుకు గురై మృతిచెందింది. దీనిపై ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10న దమయంతి తన పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఆమె నీరు పెడుతున్న సమయంలో గుర్తుతెలియని పాము కాటు వేసింది. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న భర్త తారకేశ్వరరావుకు ఫోన్లో తెలియజేయగా వెంటనే స్థానికులు డోల రామారావు, చిత్తిరి సూర్యనారాయణలను తీసుకుని పొలానికి వస్తున్న భర్తకు ఎదురుగా వచ్చిన దమయంతి పాము కాటువేసిన గాయాన్ని చూపి స్పృహకోల్పోయింది. హుటాహుటిన అప్రమత్తమైన భర్తతోపాటు గ్రామస్తులు పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. మృతురాలి భర్త తారకేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెల్లడించారు. రేగిడి: మండల పరిధిలో ని రెడ్డిపేట గ్రామానికి చెందిన కొబగాన నా యుడు (45) శనివారం పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం నాయుడు ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ తనకున్న కొద్దిపాటి పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగానే జొన్న పిక్కలను సాయంత్రం 4 గంటల సమయంలో తన పొలంలోనే శ్మశానవాటిక వద్ద ఆరబెడుతున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరమడంతో దగ్గర్లోనే పిడుగుపడి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. దగ్గర ప్రాంతంలో ఉన్న రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో వారంతా వచ్చి భోరున విలపించారు. మృతుడికి భార్య సుగుణ, ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె రాధికకు వివాహం చేశారు. లాకిని అనే రెండో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. భార్య సుగుణ, తల్లిదండ్రులు రామినాయుడు, జయమ్మలు నాయుడు మృతితో భోరున విలపించారు. ఈ సమాచారం తెలుసుకున్న వీఆర్వో కె.ఈశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి గోపాలనాయుడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాలకృష్ణ సిబ్బందితో కలిసి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రాజాం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
కాలం చెల్లిన కందిపప్పు
రామభద్రపురం: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలకు ఆరోగ్యం, పౌష్టికాహారం, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదు. నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పురుగులు పట్టిన, నాసిరకానిదే కాకుండా కాలం చెల్లిన కందిపప్పును గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్నారు. అలాగే ఈ కాలం చెల్లిన కందిపప్పునే అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు వండిపెడుతున్నారు. ఇందుకు నిదర్శనం ఈ నెల 9వ తేదీన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్రెడ్డి రామభద్రపురం మండలకేంద్రంలోని అంగన్వాడీ సెంటర్–5ను అకస్మికంగా తనిఖీ చేసి 8 ప్యాకెట్లు కాలం చెల్లిన కందిపప్పు ఉన్నట్లు గుర్తించి కంగుతిన్నారు. ఇలాంటి కందిపప్పు తిన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఏదైనా అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా వాటి పరిధిలో మెయిన్, మినీ మొత్తం కలిపి 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు సివిల్ సప్లయిస్ గోదాముల నుంచి రేషన్ డీలర్లకు, వారి నుంచి అంగన్వాడీ సెటర్లకు సరుకులు సరఫరా చేస్తారు. అయితే సరుకు తయారైన మూడు నెలలకు గోదాంకు చేరుతుందని అధికార సమాచారం. గోదాముకు చేరిన సరుకును ఈ కందిపప్పులో పురుగులు ఉన్నాయో? లేక నాసిరకంగా ఉందో సంబంధిత అధికారులు కనీసం పరిశీలించకుండా వచ్చిన సరుకు వచ్చినట్లు గానే ఒక నెల తర్వాత రేషన్ డీలర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అయితే తయారైన కందిపప్పు అక్కడే సుమారు మూడు నెలల తర్వాత కేంద్రాలకు చేరుతుంది.ఆ పప్పు కాలపరిమితి ఆరు నెలలు. సెంటర్లలో టీచర్లు నిర్లక్ష్యంగా పక్కన పడేస్తూ ఆ పప్పునే కేంద్రాలకు వచ్చిన చిన్నారులకు వండి పెట్టడంతో పాటు గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. అయితే గడువు ఉండగానే పంపిణీ చేస్తున్నామని గోదాము అధికారులు చెబుతుండగా, తక్కువ కాలం ఉన్న కందిపప్పు ప్యాకెట్లు సరఫరా అవుతున్నాయని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడం, మరో వైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. పర్యవేక్షణ కరువు..జిల్లా ఉన్నతాధికారుల గోదాముల పర్యవేణలేకపోవడంతో సరుకుల సరఫరా దారులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారని,అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించిన సీ్త్ర సంక్షేమాధికారులు కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని పలువురు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకస్మిక తనిఖీలో గుర్తించిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గర్భిణులు, బాలింతలు కాల పరిమితి ఉన్న కందిపప్పు సరఫరా మా గోదాముకు మార్చి నెలలో వచ్చిన కందిపప్పును రామభద్రపురం అంగన్వాడీ కేంద్రం–5కు డీలర్ ద్వారా జూలై నెలలో పంపిణీ చేశాం. ఆ పప్పు ఆగస్టు నెలతో కాలం చెల్లుతుంది. అయితే ఆ పప్పు ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా వదిలేయడం అంగన్వాడీ నిర్వాహకుల తప్పిదం. కాట్రాక్టర్ నుంచి నేరుగా గోదాంకు కందిపప్పు ప్యాకెట్లుతో ఉన్న బస్తాలు చేరుతాయి. వాటిని అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తాం. సూర్యప్రకాష్, గోదాం ఇన్చార్జి, బొబ్బిలి సూపర్వైజర్, టీచర్కు మెమోలు రామభద్రపురం అంగన్వాడీ సెంటర్–5లో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్రెడ్డి 8 కాలం చెల్లిన కందిపప్పు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఐసీడీఎస్ ఆదేశాల మేరకు సంబంధిత సూపర్వైజర్తో పాటు టీచర్కు మెమోలు జారీ చేస్తున్నాం. ఎం.వరహాలమ్మ, సీడీపీవో బాడంగి -
పురుగు మందు తాగి యువతి మృతి
సీతానగరం: మండలంలోని పెదభోగిలి–1 సచివాలయంలో ఎంఎల్హెచ్పీ గా ఉద్యోగం చేస్తున్న చింతాడ సంధ్య(25 ) విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పెదంకలాం గ్రామానికి చెందిన చింతాడ సంధ్య ఎంఎల్ఎచ్పీగా విధులు నిర్వహిస్తోంది. సంధ్యకు వివాహం చేయాలన్న సంకల్పంతో వివాహానికి సంబంధించిన చర్చలు ఇంట్లో రావడంతో తాను పెళ్లిచేసు కోనని ఆమె నిరాకరించగా కుటుంబంలో వచ్చిన మనస్పర్థలతో మనస్తాపం చెంది సంధ్య అక్టోబరు 7వ తేదీన సీతానగరం రైల్వే గేటువద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యసేవల నిమిత్తం విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతురాలి తల్లి చింతాడ మరియమ్మ(మీరమ్మ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు. -
పువ్వల నాగేశ్వరరావు మృతి
● దిగ్బ్రాంతి వ్యక్తంచేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ● నివాళులర్పించిన ఎమ్మెల్సీ బొత్స, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావుసాలూరు: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, సాలూరు పట్టణ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పువ్వలనాగేశ్వరరావు మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాగేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం లక్ష్మి థియేటర్ వద్ద ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. నాగేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితర ప్రముఖులు సాలూరు వచ్చి నాగేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నాగేశ్వరరావు సేవలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. నాగేశ్వరరావు సతీమణి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కుమారుడు శ్రీనువాసరావు, కుమార్తె, కుటుంబీకులు, బంధువులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల విషన్నవదనాల మధ్య నాగేశ్వరరావు అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. -
చీపురుపల్లిలో భారీ చోరీ
చికెన్● 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు అపహరణ ● బాధితుడి ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు చీపురుపల్లి: పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మెయిన్రోడ్లో ఇద్దరు వృద్ధులను గాయపరిచి భారీ మొత్తంలో బంగారం దోచుకెళ్లిన ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పట్టణంలోని ఆంజనేయపురంలోని విజయకృష్ణ అపార్ట్మెంట్ రోడ్లో నివాసం ఉంటున్న ఒమ్మి సురేష్ అనే ఉపాధ్యాయుడి ఇంటిలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరగడం స్థానికంగా ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు పోయినట్లు ఉపాధ్యాయుడు సురేష్ తెలిపారు. దొంగలు ఇంటిలోని రెండు బెడ్ రూమ్లలో ఉన్న బీరువాలు, కప్బోర్డులు మొత్తం వెతికి, సామగ్రి చిందర వందరగా పడేశారు. బీరువాల్లో చీరలు, బట్టలు ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోకుండా బంగారం, వెండి, నగదుపైనే దుండగులు దృష్టి సారించారు. ఇదే ఇంటికి పక్కనే ఉన్న విజయకృష్ణ అపార్ట్మెంట్లో రెండేళ్ల క్రితం గంగాధర్ నివాసంలో పడిన దొంగలు 25 తులాల బంగారం అపహరించుకుపోయారు. మళ్లీ అక్కడే పక్క ఇంటిలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి కిటికి గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పొడవాటి స్క్రూడ్రైవర్, మూడు అడుగుల రాడ్డుతో ఇంట్లో ఉన్న బీరువాలను తెరిచారు. బీరువాల్లో లాకర్లు తెరిచి 10 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2.5 లక్షలు నగదు దోచుకెళ్లారు. అయితే చోరీకి తీసుకొచ్చిన స్క్రూ డ్రైవర్, రాడ్డు బెడ్ రూమ్లోని మంచంపైనే వదిలి పెట్టి వెళ్లిపోయారు. పెళ్లికి వెళ్లి వచ్చిన బాధితులు ఉపాధ్యాయుడు సురేష్ భార్యతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం రాజాం పట్టణానికి ఓ వివాహ వేడుకకు వెళ్లారు. వేడుక ముగించుకుని తిరిగి రాత్రి 1.30గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముఖద్వారం తాళం తెరిచి లోపలికి వెళ్లి ప్రధాన హాలు తలుపు తీసేందుకు ప్రయత్నించగా రావడం లేదు. లోపల గడియ పెట్టి ఉండడాన్ని గమనించి ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు. తెలిసిన వారికి ఫోన్లు చేసి రప్పించి పోలీసులకు సమాచారం ఇస్తున్న సమయంలో ఇంటి లోపల ఉన్న దొంగలు వెనుక డోర్ నుంచి పారిపోయారు. ఆధారాల సేకరణ విషయం తెలుసుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. చోరీకి వినియోగించిన పరికరాలు, కిటికీ గ్రిల్పై వేలిముద్రలు సేకరించారు. బాధితుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఆ హెచ్ఎం మాకొద్దు
వీరఘట్టం: తరచూ పాఠశాలకు డుమ్మాకొడుతూ.. పాఠ్యాంశాలు బోధించని ప్రధానోపాధ్యాయుడు మాకొద్దంటూ వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామస్తులు నినదించారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నాగరాజు శనివారం ఉదయం పాఠశాలకు వచ్చి 9.30 గంటలకు బయోమెట్రిక్ హాజరు వేసుకొని వెంటనే బయటకు వెళ్లిపోయారు. దీనిని గుర్తించిన స్కూల్ కమిటీ చైర్మన్ రవిప్రసాద్, కొందరు తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి నాగరాజు మాస్టారు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. బయటకు వెళ్లి వస్తానని చెప్పారని చిన్నారులు సమాధానం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలు అయినా హెచ్ఎం పాఠశాలకు తిరిగి రాకపోవడంతో విద్యాశాఖాధికారులకు తెలియజేశారు. అనంతరం విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించేసి పాఠశాలకు తాళం వేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో వీర ఘట్టం వెళ్లి ఎంఈఓలు డి.గౌరినాయుడు, ఆర్.ఆనందరావుకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. హెచ్ఎం నాగరాజుతో పాటు మరో ఉపాధ్యాయుడు మోహన్కృష్ణ ఇక్కడ పనిచేస్తున్నారు. మోహన్కృష్ణ శుక్రవారం నుంచి సెలవులో ఉన్నారు. ఆ పరిస్థితిలో విధిగా హెచ్ఎం పాఠశాలలో ఉండాలి. అయితే, ఆనారోగ్యంగా ఉందని, సెలవు ఇచ్చి ఎవరినైనా పాఠశాలకు డిప్యుటేషన్పై పంపించాలని ఎంఈఓ గౌరినాయుడుకు ఫోన్లో హెచ్ఎం నాగరాజు కోరారు. దానికి ఎంఈఓ స్పందిస్తూ మధ్యాహ్నం 12 గంటల వరకు డ్యూటీ చేయాలని, తర్వాత పక్క గ్రామం నడిమికెల్ల స్కూల్ నుంచి డిప్యుటేషన్పై ఒక ఉపాధ్యాయుడిని పంపిస్తానని తెలిపారు. అయితే, నాగరాజు పాఠశాలకు వచ్చిన కొద్ది నిమషాలలోనే బయోమెట్రిక్ హాజరు వేసి వెళ్లిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై నాగరాజు మాట్లాడుతూ దగ్గు ఎక్కువ కావడం, ఆరోగ్య పరిస్థితి బాగులేకపోవడంతో శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్లాలని, విషయం ఎంఈఓకు తెలియజేశానని, సెలవు పత్రం కూడా పాఠశాలలో ఉంచినట్టు తెలిపారు. కావాలని వెళ్లిపోలేదన్నారు. తన పరిస్థితిని గ్రామస్తులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇదే విషయంపై ఎంఈఓ గౌరినాయుడు మాట్లాడుతూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కడకెల్ల హెచ్ఎం తీరుపై గ్రామస్తుల ఆగ్రహం పాఠశాలకు డుమ్మాకొడుతున్న హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఈఓకు ఫిర్యాదు -
ఫలితం ఉంటుందా?
సాక్షి, పార్వతీపురం మన్యం: కురుపాం గురుకుల సంక్షేమ బాలికల పాఠశాలలో పచ్చకామెర్ల కలకలం.. ఇద్దరు విద్యార్థుల మృతి ఘటన.. జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో లోపాలను మరోమారు ఎత్తిచూపింది. కొంతకాలంగా ఈ పాఠశాలల్లోనే విద్యార్థులు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నా... మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకుంటున్నా.. సరిదిద్దడంలో ఐటీడీఏ అధికారులు పూర్తి నిర్లక్ష్యం చూపారు. ఇప్పటికే చాలా నష్టం జరిగాక.. జిల్లా యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన వెంటనే కురుపాం పాఠశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశారు. వాస్తవానికి ఈ ప్రిన్సిపాల్ కూడా సుమారు నెలన్నర క్రితమే అక్కడ విధుల్లో చేరారు. అప్పటికే ఇక్కడ పచ్చకామెర్ల వ్యాధి కాచుకొని ఉంది. ఈ విషయంలో ఆమె తప్పులేకున్నా.. తొలుత యంత్రాంగం ప్రిన్సిపాల్ను బలిపశువును చేసింది. తాజాగా పార్వతీపురం ఐటీడీఏ డీడీ కృష్ణవేణిని విధుల నుంచి తప్పించారు. అసలు తొలి నుంచి కృష్ణవేణి నియామకంపైనే విమర్శలున్నాయి. కురుపాం నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి భార్య కావడంతోనే... సాలూరు సహాయ సంక్షేమాధికారిగా ఉంటున్న ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించి.. డీడీ పోస్టులో కూర్చోబెట్టారని గిరిజన సంఘాలు గగ్గోలు పెట్టాయి. రెగ్యులర్ పీవో లేకపోవడం.. డీడీ సైతం ఇన్చార్జి కావడంతో గిరిజన సంక్షేమ విభాగం పూర్తిగా గాడి తప్పింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల పర్యవేక్షణ అటకెక్కింది. విద్యార్థుల సంక్షేమాన్ని మరిచారు. సౌకర్యాల కల్పనకు పాతరేశారు. కురుపాం ఘటన తర్వాత వేళ్లన్నీ ఐటీడీఏ వైపే చూపడంతో.. డీడీని అనివార్య పరిస్థితుల్లోనైనా తప్పించాల్సి వచ్చింది. ఆమెను తిరిగి సాలూరు సహాయ సంక్షేమాధికారిగా కొనసాగిస్తూ.. డీడీ బాధ్యతలను ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పని చేస్తున్న ఎ.విజయశాంతికి అప్పగించారు. ఇప్పుడు కూడా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఎన్టీఆర్ జిల్లా.. పార్వతీపురం మన్యం జిల్లా ఎక్కడ.. అదనపు బాధ్యతలతో పూర్తి పర్యవేక్షణ సాధ్యమేనా? అని గిరిజన సంఘ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
15 నుంచి నిరవధిక సమ్మె
● విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మణ్విజయనగరం ఫోర్ట్: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ట్రాన్స్కో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలింభిస్తోందని, దీనికి నిరసనగా ఈనెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సురగాల లక్ష్మణ్ తెలిపారు. విజయనగరం జేఏసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన చలో విజయవాడ మహాధర్నాకు విజయవాడ, పార్వతీపురం మన్యం సర్కిల్ నుంచి వందలాది మంది సామూహిక సెలవులు పెట్టి బయలు దేరుతున్నట్టు వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించడంలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో 14వ తేదీన వర్క్ టు రూల్, 15న సమ్మెకు సిద్ధమవుతున్నట్టు స్పష్టంచేశారు. సమావేశంలో విద్యుత్ జేఏసీ నాయకులు బంగారు రాజేష్కుమార్, పప్పల అప్పలస్వామినాయుడు, నిర్మలమూర్తి, ఆర్.అప్పలనాయుడు, సత్యనారాయణ, సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు. మేకల కాపరి హత్య● పంట పొలంలో మేకలు దిగాయని కాపరిపై కర్రతో దాడి ● ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కాపరి మృతికురుపాం: వరి పంట పొలంలోకి మేకలు దిగాయన్న కోపంతో ఓ వ్యక్తి మేకల కాపరి తలవెనుక భాగంపై కర్రతో కొట్టగా కాపరి మృతి చెందిన ఘటన కురుపాం మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం హుకుంపేట సమీపంలో రాయగడ నల్లన్నదొరకు చెందిన వరి పంట పొలం ఉంది. పంట పొలం గట్ల మీదకు మేదరవీధికి చెందిన పిల్లి రాములు(58) మేకలు ప్రవేశించాయి. వెంటనే మేకల కాపరి రాములు వాటిని బయటకు తరలించేలోపే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో చేతిలో ఉన్న కర్రతో రాయగడ నల్లన్నదొర కాపరి రాములు తల వెనుకభాగంలో గట్టిగా కొట్టాడు. దీంతో రాములు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే సైకిల్పై రాములును స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కురుపాం ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏకలవ్యలో కామెర్ల కలకలం
● ఆందోళనలో తల్లిదండ్రులుకురుపాం: కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను పట్టిపీడిస్తున్న పచ్చకామెర్ల వ్యాధి ఇప్పుడు ఏకలవ్య స్కూల్ విద్యార్థులకు పాకింది. వారిని ఆస్పత్రుల పాలచేసింది. సుమారు 30 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారినపడి పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతున్నారు. వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ పిల్లలకు పచ్చకామెర్లా.. లేదంటే వైరల్ జ్వరాలో తెలియక పోవడం, వైద్య ఆరోగ్యశాఖ సరైన సమాచారం కూడా ఇవ్వక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. కామెర్ల వ్యాధి ముదిరితే తమ పిల్లల పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు. మరి కొద్ది రోజుల్లో తరగతులు పునఃప్రారంభం కానున్న తరుణంలో గురుకులం, ఏకలవ్య పాఠశాలల్లో సమస్య పునరావృతం కాకుండా తాగునీరు, డ్రైనేజ్ వాటర్, మరుగుదొడ్ల నీరు వెళ్లే పైపులైన్స్ను మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ పిల్లలను పాఠశాలలకు పంపేదే లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు తేల్చిచెబుతున్నారు.నా కొడుకు కామెర్లతో బాధపడుతున్నాడు నా కొడుకు మండంగి గౌతం ఏకలవ్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. పచ్చకామెర్ల లక్షణాలు ఉండడంతో వైద్య సిబ్బంది కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కోసం చేర్పించారు. కామెర్ల శాతం 2.75 పాయింట్స్ ఉన్నాయని తెలిపారు. చికిత్స అందిస్తున్నారు. – మండంగి కుమారి, గుల్లలంక గిరిజన గ్రామం, జి.ఎల్.పురం మండలం -
ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
నెల్లిమర్ల రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లిమర్ల మండలంలోని మొయిద గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై ఎస్సై గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కవల కనకలక్ష్మి (42) గుర్ల మండలంలోని పెనుబర్తి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి పక్షవాతం సమస్యతో ఆమె బాధపడుతున్న నేపథ్యంలో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బయటకు పొగలు రావడంతో గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా కుర్చీలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించి 108కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త నక్కిన శ్రీనివాసరావు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగానే పనిచేస్తున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేష్ శుక్రవారం తెలిపారు. -
విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
● ఏఐఎస్ఎఫ్ డిమాండ్పార్వతీపురం టౌన్: ఎగ్జామ్స్ పేరుతో ఫీజుల దోపిడీకి పాల్పడితే, ఆ విద్యా సంస్థల యాజమాన్యాల పై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయిలో ల్యాబ్ సౌకర్యం లేని విద్యాసంస్థల్లో ఆచరణాత్మక పరీక్షల సెంటర్లను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి వై నాగేశ్వరరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎగ్జామ్స్ పేరుతో విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు చరణ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘వైద్యవిద్య’ ప్రైవేటీకరణపై సమర శంఖం
● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపార్వతీపురం రూరల్: ప్రభుత్వ వైద్య విద్యను పేదలకు దూరం చేసే కుట్రలను ప్రజల మద్దతుతో కూటమి ప్రభుత్వ దుర్మార్గమైన చర్యను ఎండగడుతూ అడ్డుకుంటామని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్పష్టం చేశారు. జిల్లాలో రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్యకళాశాల భవనాలను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించినట్లు జోగారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 50వేల సంతకాల సేకరణ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలంలోని గోపాలపురం, అడ్డాపుశీల గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ హామీలను అరకొరగా కూడా అమలు చేయక ప్రజలను మోసం చేస్తుందని ప్రజావ్యతిరేక విధానాలతో వారి బతుకులతో చెలగాటం అడుతోందని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ దుష్ట ఆలోచన మారేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకునేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ పరిశీలకుడు మావుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉద్యమ పోస్టర్ విడుదల ఈ కార్యక్రమానికి ముందుగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన క్యాంపు కార్యాలయంలో పార్వతీపురం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలసి మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, అధికార ప్రతినిధి మువ్వల సత్యంనాయుడు, ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మి రమేష్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ, పలు విభాగాల ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం మహిళపై దాడి
పార్వతీపురం రూరల్: ఆస్తి కోసం వ్యక్తి రాక్షసుడిలా మారాడు. ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ డ్రైవరే, కన్నతల్లిలా ఆదరించిన తన భార్య మేనత్తపై సుత్తితో దాడి చేసి హతమార్చబోయాడు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల కొత్తవలసలోని మొండి వీధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ అమానుషం జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కొత్తవలసకు చెందిన రంకిరెడ్డి రాధకు జియ్యమ్మవలస మండలానికి చెందిన శ్రీనివాసరావుతో 2004లో వివాహమైంది. ఇల్ల రికం వచ్చిన శ్రీనివాసరావు, ఇటీవల అత్తింటి ఆస్తిని తన పేరిట రాయాలని భార్యను తీవ్రంగా వేధించసాగాడు. అతని వేధింపులపై గత జూన్న్లో రాధ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం భార్య రాధ ఇంట్లో లేని సమయం చూసి నిందితుడు శ్రీనివాసరావు సుత్తితో సహా అక్కడికి చేరుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య మేనత్త ఆర్. అన్నపూర్ణపై విరుచుకుపడి, ఆమెను తాళ్లతో కట్టేసి సుత్తితో భుజాలపై పాశవికంగా కొట్టాడు. అదే సమయానికి ఇంటికి వచ్చిన రాధ ఈ ఘోరాన్ని చూసి కేకలు వేయగా, ఆమెను ఓ గదిలో బంధించాడు. వారి అరుపులు విన్న స్థానికులు పరుగున రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తాళ్లతో ఊపిరి ఆడని స్థితిలో గాయాలపాలైన అన్నపూర్ణను కట్లు విప్పి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వివరాలు సేకరించినట్లు పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రి అవుట్పోస్ట్ పోలీసులు తెలిపారు. -
తండ్రిని చంపిన కేసులో తనయుడి అరెస్టు
బాడంగి: మండలంలో సంచలనం రేపిన తండ్రిని చంపిన తనయుడి హత్యకేసును పోలీసులు ఛేదించారు. తండ్రి హత్యకు కారణమైన కుమారుడు బోనుగిరి లక్ష్మణరావును శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్ నిమిత్తం బొబ్బిలి కోర్టుకు తరలించారు. దీ నికి సంబంధించిన వివరాలను డీఎస్పీ భవ్యరెడ్డి వి లేకరులకు వెల్లడించారు. మద్యానికి బానిసగా మారి డబ్బులకోసం తరచూ తండ్రితో లక్ష్మణరావు గొడవ పడుతుండేవాడని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం రాత్రినుంచి కీచులాట పెట్టుకున్నా ససేమిరా డబ్బులిచ్చేది లేదని తండ్రి చెప్పడంతో చెప్పుల మేకులు చెరిచే గూటంతో గురువారం తెల్ల వారు జామున తండ్రి రాజేశ్వరరావు కుడి చెవిపై బలంగా కొట్టడంతో రక్తస్రావం జరిగి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. నిందితుడిని పిన్నవలస జంక్షన్లో పట్టుకుని ఆరెస్టు చేశామని తెలిపారు. బొబ్బిలిరూరల్ సీఐ. నారాయణరావు, ఎస్సైతారకేశ్వరరావుల కృషిని ఆమె అభినందించారు. -
బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
పార్వతీపురం: బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ టి. కనకదుర్గ అన్నారు. శుక్రవారం ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో బాలికలకు సమానత్వం, భాగస్వామ్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, తదితర పోటీల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్ అధికారి పి. శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని పది ప్రాజెక్టు పరిధిలోని 350 సచివాలయాల పరిధిలో ప్రపంచ బాలల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలకొండ, సీతంపేట, భామిని, కురుపాం, భద్రగిరి ప్రాజెక్టుల పరిధిలోని పాఠశాలల్లో బాలికలకు వ్యాసరచన, స్పోర్ట్స్ తదితర పోటీలను నిర్వహించామన్నారు. బాలికలను రక్షిద్దాం–బాలికలకు చదివిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బాల్య వివాహాలను నివారించడం, లైంగిక దాడులను నివారించడం, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేలా అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తం
● సీఐ కె.మురళీధర్పార్వతీపురం రూరల్: ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం పట్టణ సీఐ కె.మురళీధర్ సూచించారు. ఈ మేరకు స్థానిక పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ట్రాఫిక్ ఎస్సై పాపారావు ఆధ్వర్యంలో వాహన చోదకులకు, స్థానికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఓటీపీ, సీవీవీ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని గుర్తుతెలియని లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఆన్లైన్ లాటరీలు, బహుమతుల వంటి మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్తలు వహించాలని హితవు పలికారు. కార్యక్రమంలో వాహన చోదకులు, స్థానికులు ఉన్నారు. -
చిన్నా...లే నాన్నా..
గ్రామంలో ఎస్సీ కాలనీకు తాగునీరు అందించేందుకు మినీ రక్షిత మంచినీటి పథ కం ఏర్పాటుచేశారు. తాగునీరు సరఫరా చేసేందుకు పాఠశాల ప్రహరీకి అమర్చిన ప్యానల్ బోర్డు కింద వైరు పాడవ్వడంతో ప్యానల్ బోర్డుకు విద్యుత్ సరఫరా అవుతోంది. కాలనీ వాసులు నిత్యం కర్రలతో స్విచ్ ఆన్, ఆఫ్ చేసి తాగునీరు పట్టుకుంటున్నారు. ఈ విషయం పలుమార్లు పంచాయతీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. బాలుడు అఖీరా విద్యుత్ షాక్తో మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ స్తంభంపై ఉన్న వైరును తొలగించి, వారిపై ఎటువంటి అపనింద పడకుండా చేసిన ప్రయత్నాలను కాలనీ వాసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమదానికి గల కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదుచేసి, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మక్కువ: చిన్నా.. లే నాన్నా... ఆడుకుని వస్తానని చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయావా... అప్పుడే నూరే ళ్లు నిండిపోయాయా.. మాతో ఎవరు ఆడుకుంటారు... వేగంగా వచ్చేస్తానన్నావు... మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయావా అంటూ చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. అన్నం పెట్టమ్మా.. కాసేపు ఆడుకొని వచ్చేస్తానంటూ బయటకు వెళ్లిన చిన్నారి విద్యుదాఘాతంతో మృతిచెందడం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మక్కువ మండలం ఎస్.పెద్దవలస ఎస్సీ కాలనీకు చెందిన కల్లుకోట రమ్య, చందుల కుమారుడు అఖీరా(4) శుక్రవారం ఉదయం ఆడుకునేందుకు మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. రెండు గంటల సమయం దాటినా ఇంటికి చేరుకోకపోవడంతో త ల్లి రమ్య వెతకసాగింది. అఖీరాతో ఆడుకునేందుకు వెళ్లిన మరో బాలుడిని బిడ్డ ఆచూకీ కోసం ఆరా తీసింది. పాఠశాల వైపు వెళ్లాడని ఆ బాలుడు సమాధానం చెప్పడంతో అటువైపుగా వెళ్లిన ఆ తల్లి పాఠశాల ప్రహరీ పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. కేకలు వేస్తూ బిడ్డను హత్తుకునే ప్రయత్నంలో ఆమెకు కూడా విద్యుత్షాక్ తగలడంతో కాలనీ వాసులు రక్షించారు. లేదంటే తల్లి కూడా బిడ్డతో పాటు మృతిచెందేది. కాలనీకి తాగునీరు సరఫరా చేసే రక్షిత మంచినీటి పథకం విద్యుత్ ప్యానల్ బోర్డును పాఠశాల ప్రహరీకి అమర్చారు. దాని పక్కనే జామిచెట్టు ఉంది. చెటు ్టకాయలు తెంపేందుకు చిన్నారి వెళ్లాడా? లేదంటే అక్కడ ఆడుకుంటుండగా విద్యుత్షాక్ తగిలిందో తెలియదు.. విగతజీవిగా కనిపించాడు. కొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న తండ్రి చందు విశాఖపట్టణం నుంచి హుటాహుటిన చేరుకున్నాడు. నాన్న, చిన్నా లేవరా.. నాతో ఎవరు ఆడుకుంటారు.. లే..నాన్న అంటూ తండ్రి రోదన అందరి కంట కన్నీరు తెప్పించింది. పోస్టుమార్టం కోసం ఆటోలో తరలిస్తున్న కుమారుడిని పట్టుకొని కన్నీరుమున్నీరయ్యారు. -
ఇప్పటికిప్పుడే దిద్దుబాటు చర్యలు
గిరిజన గురుకులంలో పరిస్థితి చేయిదాటిపోవడంతో అధికారులు ఇప్పటికిప్పుడు ఎకాఎకిన దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. చేతులు కాలికా ఆకులు పట్టుకున్నట్లుగా పిల్లలు ప్రాణాలు పోయాక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని చెబుతున్నారు. స్కూల్ ప్రాంగణంలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలను ఉపాధి హామీ వేతనదారులతో తొలగిస్తున్నారు. పాడై పోయి నిరూపయోగంగా మారిన మరుగుదొడ్లను బాగు చేయిస్తున్నారు. ఈ తాత్కాలిక ఉపశమన చర్యలు తప్పితే శాశ్వతమైన పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టిసారించడం లేదని గిరిజన సంఘాల నాయకులు, పిల్లలు ఆరోపిస్తున్నారు. -
ప్రజా ఉద్యమం
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరు మరింత తీవ్రం కానుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేసే లా సుదీర్ఘ ఉద్యమ కార్యాచరణకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. గ్రామగ్రామానికి వెళ్లి దాదాపు 45 రోజు లపాటు కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్య క్రమాలను ఆ పార్టీ నేతలు చేపట్టనున్నారు. నాలుగు నియోజక వర్గాల్లోనూ కార్యక్రమాలు పేదలకు నాణ్యమైన వైద్యం, విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న సదుద్దేశంతో గత వైఎస్సా ర్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేశారు. అందులో ఐదు కళాశాలలు నిర్మాణాలు కూడా పూర్తి చేసుకుని తరగతులను సైతం ప్రారంభించాయి. వెనుకబడిన ప్రాంతం, గిరిజన జనాభా అధికంగా ఉండే పార్వతీపురం మన్యం వంటి జిల్లాకూ మలి విడతలో కళాశాలను ప్రారంభించాల్సి ఉంది. రూ. 600 కోట్లతో పరిపాలన అనుమతులు కూడా ఇచ్చా రు. అనుబంధంగా పార్వతీపురం, సీతంపేటల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలోనే శరవేగంగా నిర్మాణాలు జరిగా యి. ప్రభుత్వం మారడంతో ఆ పనులు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. జిల్లాకు వైద్య కళాశాల అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు పీపీపీ విధానంలో ప్రైవేటుకు కట్టబెడుతోంది. ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీతో పాటు.. పలు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసు కెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నా యి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను శుక్రవా రం నియోజక వర్గాల్లో ఆయా నాయకులు ఆవిష్కరించారు. నవంబర్ 22వ తేదీ వరకు ‘రచ్చబండ’ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈనెల 28న నియోజకవర్గాల్లోనూ, నవంబర్ 12న జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేపట్టనున్నారు. మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలను సమన్వ యం చేసుకుంటూ 45 రోజుల పాటు కోటి సంతకా లు సేకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 25న జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలను అందజేయనున్నారు. ప్రజా ఉద్యమంలో అన్ని వర్గాలూ భాగస్వామ్యం కావాలని పార్టీ నాయకులు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి కోరారు. పాలకొండ: వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పాలకొండ నియోజకవర్గం పరిధిలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కనపాక సూర్యప్రకాష్రావు, వెలమల మన్మథరావు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు
కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయుష్మాన్ భవన్ మందిర్ కార్యాలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కురుపాం ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయష్మాన్ భవన్ కార్యాలయంలో గల కంప్యూటర్ల పరికరాలైన సీపీయూ, కీబోర్డులు చోరీకి గురైనట్లు సంబంధిత సిబ్బంది బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా గుమ్మ గ్రామ సమీపంలో చిట్టిగెడ్డ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న బర్లి చందు, సింగమహంతి అవినాష్లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారన్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. చోరీ చేసిన కంప్యూటర్ పరికరాల విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. దర్యాప్తులో ఏఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్ శేఖర్మధు పాల్గొన్నట్లు చెప్పారు. -
రహదారుల కోసం సర్వే చేశాం..
పార్వతీపురం రూరల్: జిల్లాలోని 142 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేలా సమగ్ర సర్వే చేసి అంచనాలు తయారు చేశామని జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి వీఎస్ నగేష్బాబు గురువారం తెలిపారు. అంచనాల ప్రతిపాదనలను కలెక్టర్కు సమర్పించామని, అవి ఆమోదం పొందిన వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల 9న సాక్షి దినపత్రికలో గిరిసీమకు దారేది శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని రహదారులు లేని గ్రామాలకు కనీ సం అంబులెన్స్ వెళ్లే విధంగా రహదారులు వేయడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు అంచ నాలు తయారు చేశామన్నారు. కలెక్టర్ ఆమోదం పొందిన తక్షణమే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్కుగాను 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, పంట కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పంట రకం, దిగుబడి వచ్చే సమయం, సేకరణపై మండల స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. మద్దతు ధర, ట్రక్ షీట్ విధానం తదితర అంశాలపై విసృత్తంగా ప్రచారం చేయాలని సూచించారు. పౌర సరఫరా అధికారి మిల్లులను ట్యాగ్ చేయడం, బ్యాంకు గ్యారంటీను తీసుకోవడం, అన్ని మిల్లుల పని చేస్తున్నదీ.. లేనిదీ.. తనిఖీ చేయడం, సీఎస్డీటీలకు శిక్షణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన సామగ్రిని సరఫరా చేయాలన్నారు. వర్షాలు పడితే టార్పాలిన్లు సరఫరా చేయడానికి మండల కేంద్రాల్లో సిద్ధం చేయాలని మార్కెటింగ్ ఏడీ రవికిరణ్కు సూచించారు. పీఏసీఎస్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడానికి 57 సోసైటీలు సిద్ధంగా ఉన్నాయని వాటికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ బొడ్డేపల్లి శాంతి, ఆర్డీవోలు కీర్తీ, రాంమోహన్, జిల్లా వ్యవసాయ అఽధికారి, జిల్లా సహకార అధికారి రమేష్ పాల్గొన్నారు. -
మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత‘
విజయనగరం క్రైమ్: జిల్లాలోని తెర్లాం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బి.నాగభూషణరావు కుటుంబానికి ‘చేయూత’ సహాయం ద్వారా రూ.1,48,600ల చెక్కును ఆయన భార్య ధనలక్ష్మికి ఎస్పీ ఏఆర్ దామోదర్ తన చాంబర్లో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు సిద్ధగా ఉన్నామన్నారు. ఇందుకోసం ప్రతి సిబ్బంది స్వచ్ఛదంగా ముందుకు వచ్చి వారి నెలవారి జీతంలోకొంత నగదు పోగు చేసి ఇస్తుండడం స్ఫూర్తిదాయకమని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ తరహా చర్యలు పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెంచడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా కల్పించడమేనన్నారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు సంక్షేమ సంఘం అడహాక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.పిడుగుపాటుతో ఇద్దరికి అస్వస్థతబొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామంలో గురువారం సాయంత్రం ఇంటిడాబాపై పని చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటు బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన సింగవరపు సీతారాం, సీహెచ్.ఆదినారాయణలు ఇంటి డాబాపై పని చేస్తుండగా సాయంత్రం ఉరుములు, మొరుపులతో భారీ వర్షం కురవడంతో పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రసుత్తం ఇద్దరి పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. షిప్యార్డ్లో ఉద్యోగాలకు శిక్షణపార్వతీపురంటౌన్: విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్యార్డ్ కంపెనీలో ఉద్యోగాల కోసం 3 నెలల నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్లో ఐటీఐ అభ్యర్థులకు 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చి షిప్ యార్డులో ఉద్యోగం కల్పిస్తున్నట్లు వివరించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఫోన్ 9676965949 నంబర్ను సంప్రదించాలని ఆయన ప్రకటనలో కోరారు. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి నెల్లిమర్ల రూరల్: విద్యార్థులు, యువత నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఎన్సీసీ గ్రూప్ కమాండింగ్ అధికారి సుమంత్ రాయ్ సూచించారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఎన్సీసీలో చేరాలన్నారు. అనంతరం బీహార్కు బదిలీపై వెళ్తున్న ఎన్సీసీ కమాడింగ్ అధికారి కల్నల్ తపస్ మండల్ను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. అలాగే కొత్త కమాండింగ్ అధికారి సుమంత్రాయ్కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు, వైస్ చాన్సలర్ ప్రశాంత్కుమార్ మహంతి, రిజిస్ట్రార్ పల్లవి తదితరులు పాల్గొన్నారు. గడ్డి మందు తాగి ఆటోడ్రైవర్ ఆత్మహత్యవీరఘట్టం: మండలంలోని చిదిమి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బౌరోతు సాయి(23) బుధవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై జి.కళాధర్ తెలిపిన వివరాల ప్రకారం ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇలా ఉన్నాయి. కాంచన అనే ఆమెతో ఏడాది క్రితం సాయికి వివాహం జరిగింది. బార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు మోహనరావు, విజయల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అట్రాసిటీ బాధితురాలికి పెన్షన్ బకాయిల మంజూరు : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లాలోని పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన గండిపల్లి అచ్చమ్మకు రూ.1,81,236 పెన్షన్ బకాయిలను మంజూరు చేస్తూ కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హత్యకు గురైన ఆమె భర్త గండిపల్లి తౌడు తరఫున ఈ పరిహారం అందుకోనున్నారని తెలిపారు. 2023 మే నెల నుంచి 2025 ఆగస్టు నెల వరకు రావల్సిన పెన్షన్, కరువు భత్యంతో కలిపి ఈ మొత్తాన్ని మరికొద్ది రోజుల్లో నేరుగా ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి ఆలయానికి దసరా ఉత్సవాల సందర్భంగా రూ.32,93,397 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో సూర్యనారాయణ గురువారం తెలిపారు. ఇందులో హుండీల ద్వారా రూ.17,98,058 ద్వారా వచ్చిందని తెలిపారు. కుంకుమార్చనల టికెట్ల ద్వారా రూ.2,61,650, అంతరాలయం టికెట్ల ద్వారా రూ.1920, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వా రా రూ.3,01,400, శ్రీఘ్ర దర్శన టికెట్ల ద్వారా రూ.4,71,240ల ఆదాయం వచ్చిందని తెలిపా రు. పూజలు, ఘటాలు, కేశ ఖండన తదితర ఇతర టికెట్ల ద్వారా రూ. 4,62,609 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు రూ. 24,47,839లు సమకూరిందని వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.8,45,558 ఆదాయం అధికంగా వచ్చిందని తెలిపారు. పార్వతీపురం రూరల్: కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాతావర ణ మార్పుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ఈ నెల 8న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 15 మండలాల పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాల్లో 65 చోట్ల నీటి నమూనాలను పరీక్షించినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు అన్ని తాగునీటి ట్యాంకుల్లో ప్రతీ రోజు క్లోరినేషన్ చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
కురుపాం: సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీలకు వచ్చిన రోగులతో ఆసుపత్రి రద్దీగా ఉండగా కలెక్టర్ అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షల కోసం రోగులు బారులు తీరడంతో ఇకపై రోగుల సౌకర్యార్ధం ఆసుపత్రి బయట ఆవరణలో రక్త పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అక్కడ చికిత్స పొందుతున్న గురుకులం, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. విధి నిర్వహణపై ఆరా తీశారు. ఎంపీడీవో ఉమామహేశ్వరితో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే మృతి చెందిన కురుపాం గురుకుల విద్యార్థిని తోయక కల్పన స్వగ్రామమైన దండుసూర గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పారిశుధ్య పనులు, వైద్య శిబిరాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎంహెచ్వో భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా నివారణకు చర్యలు పార్వతీపురం రూరల్: జిల్లాలో మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించి, యాంటీ లార్వా పిచికారీ చేయాలన్నారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, రాత్రి పూట దోమతెరల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అనుమానితులకు రక్త పరీక్షలు చేసి, పాజిటివ్ వస్తే వెంటనే మందులు అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్వో హేమలత, డీఎంహెచ్వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
● మరో టెంట్..
ఇదిలా ఉండగా దశాబ్దాల నాటి నుంచి తెలుగుదేశానికి సిరిమానోత్సవం వేళ వీక్షించేందుకు ఒకే ఒక్క టెంటు ఉంటూ వస్తుంది. అశోక్గజపతిరాజుగానీ, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతరత్రా నాయకులంతా కూడా అశోక్ కూర్చునే కోట బురుజు మీదకు వెళ్లి ఆయనతో పాటు కూర్చుని సిరిమానును వీక్షించేవారు. అంతేగానీ టీడీపీకి ఎంత ఎక్కువ మంది నాయకులున్నా.. ఇంకో టెంట్ అనేది వేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. అంతేకాకుండా అశోక్ను కాదని వేరే టెంట్ కింద నిలబడేందుకు కూడా టీడీపీ కార్యకర్తలకు ధైర్యం లేదు. నాగార్జునకు ఆ ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆత్మగౌరవం పేరిట నాగార్జున కొత్తగా టెంట్ వేసి అశోక్గజపతికి ఎదురుగా కూర్చుని జనానికి విక్టరీ సింబల్ చూపిస్తూ నిలబడడం ఆయన కేరీర్ పాలిట పెనుముప్పు అని ఆ పార్టీ వారే గుసగుసలాడుకుంటున్నారు. నాగార్జున కూడా కోట పైకెక్కి అశోక్గజపతి కుర్చీ వెనకాల కూర్చుని సిరిమానును చూస్తే అయిపోయేది కదా.. కొద్ది గంటల కార్యక్రమం కోసం నాగార్జున ఏకంగా అశోక్ గజపతి కళ్లలో ఎందుకు పడాలి.. సొంతంగా ఎందుకు టెంట్ వేయాలి.. ఇదంతా ఆయన రాజకీయ భవిష్యత్కు ఇబ్బంది కాదా.. అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున కూర్చున్న డీసీసీబీ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరత్రా నాయకులంతా అశోక్గజపతి వెనకాల కూర్చుని సిరిమాను చూశారు. మచ్చుకై నా ఒక్క ఎమ్మెల్యే కూడా నాగార్జున దగ్గర కూర్చుని కాసేపైనా ఉన్నారా... అంటే అదీ లేదు. నాగార్జున, కొద్ది మంది పీఏసీఎస్ డైరెక్టర్లు.. కొందరు చోటా నేతలు తప్ప ఆయన దగ్గర ఎవరూ లేరు. ఇదంతా చూస్తుంటే నాగార్జున సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? అని కొందరు ఆ పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమిటో నాగార్జున చేసిన పని చూస్తుంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్టుగా ఉందని కొందరు లోలోన గుసగుసలాడుతున్నారు. ఇంకో చిత్రం ఏమంటే... -
పాడి రైతులపై దాడి
గంట్యాడ: కూటమి సర్కార్ అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో కూటమి నేతలు మరింతగా రెచ్చి పోతున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై నిన్న, మొన్నటి వరకు తమ ప్రతాపాన్ని చూపించిన కూటమి నేతలు తాజాగా పాడి రైతులపై కూడా అరాచకానికి తెరలేపారు. దీంతో కడుపు మండిన రైతులు తీవ్రస్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులను ప్రతిఘటించారు. పశువుల శాలలు తొలగించే ప్రయత్నం నీలావతి గ్రామంలో పాడి రైతులకు చెందిన పశువుల శాలలను తొలగించేందుకు గురువారం ప్రయత్నించారు. ఈ మేరకు ఉదయం 7 గంటలకే భారీగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో సహా గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత గ్రామంలో ఉన్న 25 మంది పశువుల శాలలను తొలగించాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు దారు అధికార పార్టీ వ్యక్తి కావడంతో అధికారులు కూడా పశువులు శాలలు తొలగించేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిన విధంగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువుల శాలలను రెవెన్యూ అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. మరో వైపు జేసీబీతో శాలను తొలగించేందుకు దించుతుండగా మహిళలు, రైతులు జేసీబీని అడ్డుకున్నారు. పశువులకు, మాకు గోతులు తీసి అందులో పాతిపెట్టిన తర్వాత మీరు పశువుల శాలలను తొలగించుకోండి. మా లాంటి పేదవారి ఉసురు కచ్చితంగా మీకు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. తీవ్రప్రయత్నం చేసిన అధికారులు పశువుల శాలలను ఏవిధంగా నైనా తొలగించేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకవైపు రెవెన్యూ సిబ్బంది పశువుల శాలలకు చెందిన చెక్కలు, కర్రలు, కమ్మలు తొలగించడంతో రైతులు అడ్డుకోగా మరోవైపు జేసీబీతో శాలలను తొలగించేప్రయత్నం చేశారు. ఉదయం7గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వర్షాకాలం ఉన్న పళంగా వెళ్లిపోమంటే పశువులను ఎక్కడ కట్టాలి. వట్టి గడ్డిని ఎక్కడ వేయాలి. మాకు నెలరోజులు సమయం ఇవ్వండని రైతులు తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిని కోరారు. నా చేతిలో ఏమి లేదు, నేను ఏమీ చేయలేనని ఆయన అనడంతో అయితే మాపీకలు కోసేసి మీరు శాలలు తీసుకోండని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. నీలావతి గ్రామంలో పశువుల శాలల తొలగింపు యత్నం తీవ్రంగా ప్రతిఘటించిన రైతులు జేసీబీల అడ్డగింత వెనుదిరిగిన పోలీస్, రెవెన్యూ అధికారులు -
నేటి నుంచి బోధనేతర పనుల బహిష్కరణ
వీరఘట్టం: మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన బోధనా సమయం హరించుకుపోతున్నదని, ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గిపోయే విధంగా బోధనేతర కార్యక్రమాలు పెరిపోయాయని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోనందున ఈ నెల 10 (శుక్రవారం) నుంచి బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో నాయకు లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎంఈవో డి.గౌరినాయుడుకు మెమొరాండం అందజేశారు. పాఠాలు చెబుతాం, పిల్లలకు భోజనం పెడతాం, విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరిస్తాం, జీఎస్టీ 2.0 వంటి రాజకీయ కార్యక్రమాలు పాఠశాలలో జరగనివ్వమని తీర్మాన పత్రంలో పేర్కొన్నారు. సీపీఎస్ పై సరైన నిర్ణయం చేయకుంటే మరో ఉద్యమానికి సై అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే 12వ పీఆర్సీ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాల ని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో పోరుబాట చేపట్టేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎంఈవోను కలిసిన వారి లో ఫ్యాప్టో నాయకులు ఎం.పైడిరాజు, ఎం.మురళి, బి.రామారావు, ఆర్.ధనుంజయనాయుడు, బి.దుర్గాప్రసాద్, ఎం.నరహరి, కె.సింహాచలం ఉన్నారు. -
బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు
విజయనగరం అర్బన్: జిల్లాలో అనుమతి లేకుండా బాణసంచా విక్రయాలు లేదా తయారీ జరుగుతున్న చోట కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రామ్సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, తయారీ పరిస్థితులపై పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ విభాగాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో మొత్తం ముగ్గురు తయారీదారులు, 15 మంది హోల్సేల్ విక్రేతలు ఉన్నారని తెలియజేశారు. ఆర్డీఓలు డి.కీర్తి, మోహనరావు, ఆశయ్య తమ పరిధిలో జరుగుతున్న విక్రయాలపై వివరాలు సమర్పించారు.కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాణసంచా విక్రయం ఏ స్థాయిలోనైనా నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్సేల్ షాపులపై పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో జరిగే విక్రయాలను వీఆర్ఓలు పర్యవేక్షించాలని సూచించారు. అనుమతి పొందిన విక్రేతలు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నీరు అందుబాటులో ఉంచాలి. ఫైర్ సిలిండర్ లభ్యతను నిర్ధారించాలని కలెక్టర్ చెప్పారు. తాత్కాలిక విక్రయాల ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్ వెళ్ళేందుకు తగిన ఖాళీ ఉంచాలని, టెంట్లకు బదులు రేకులతో షెడ్లు నిర్మించాలని సూచించారు. విక్రేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలు వివరించాలని ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్, డీఎస్పీ వీర్కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
గోడకూలి మహిళ..
● మరో ఇద్దరికి తీవ్రగాయాలు బొబ్బిలి: పట్టణంలోని గొల్లవీధి జంక్షన్లో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఎరుకల వీధికి చెందిన తోనంగి అప్పయ్యమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందగా కూలీలు రామలక్ష్మి, పొందూరు లక్ష్మణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎస్సై రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి నిర్మాణ పనులకు వెళ్తున్న వారు ముగ్గురు ఎప్పటిలాగానే లక్కోజు శ్రీనివాసరావు ఇంటి పనులు చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటుకల గోడ నానిపోయి పనిచేస్తున్న వారిపై పడగా అప్పయ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామలక్ష్మి, లక్ష్మణ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు, అప్పయ్యమ్మ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.అప్పయ్యమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
● భార్యకు తీవ్ర గాయాలు పార్వతీపురం రూరల్: సీతానగరం మండలంలోని అప్పయ్యపేట గ్రామానికి చెందిన దంపతులు గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురి కాగా భర్త అంబటి సుధాకర్ మృతిచెందాడు. భార్య కల్యాణి తీవ్ర గాయాలపాలైంది. ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. భార్య కల్యాణితో కలిసి సుధాకర్ గురువారం స్కూటీపై అంటిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ సీతానగరంలో ఇంటికి కావాల్సిన సరుకులు కోనుగోలు చేసి తిరిగి వారి గ్రామానికి వెళ్తున్న క్రమంలో సీతానగరం వంతెనపై వారి స్కూటీని విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో సుధాకర్ (47) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భార్య కల్యాణిని 108 వాహనంలో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం తరలించారు. సుధాకర్ గతంలో ఎంపీటీసీగా పనిచేసి, ప్రస్తుతం సీతానగరంలో రేషన్ డీలర్గా పనిచేస్తున్నారు. వారికి పాప, బాబు ఉన్నారు. ఈ మేరకు వివరాలు సేకరించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రి అవుట్పోస్ట్ పోలీసులు తెలిపారు. సుధాకర్ అకాల మరణంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో పడి పూజారి మృతి
గరుగుబిల్లి: చెరువులో స్నానానికి దిగిన ఓ పూజారి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. గరుగుబిల్లి మండలంలో గురువారం జరిగిన సంఘటనపై స్థానిక ఎస్సై ఫకృద్ధీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రావుపల్లిలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన తెలగవీధిలోని రామమందిరం ఆలయ పూజారిగా పనిచేస్తున్న సంగం చంద్రశేఖర్ (53) స్నానానికి బోటువాని చెరువులో దిగుతున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. కొద్ది సమయం తరువాత చెరువులో చంద్రశేఖర్ మునిగిపోయినట్లు స్థానికులు గుర్తించి స్థానిక ఎస్సైకి సమాచారం అందించడంతో ఆయన సిబ్బందితో వచ్చి మృతదేహం కోసం స్థానికుల సహయంతో గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు గ్రామంలో సర్పంచ్ బొంతాడ మహేశ్వరరరావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికిచ మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆలయ పూజారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వేపాడ: మండలంలోని బానాది గ్రామానికి చెందిన సంపర్తి ఆంజనేయులు (32) కోనేరులో జారిపడి గురువారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సంపర్తి ఆంజనేయులు తల్లి ఎర్రయ్యమ్మచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లింది. బట్టలు మూటకడుతుండగా మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆంజనేయులు కాలుజారి కోనేరులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు మృతుడి తల్లి ఎర్రయ్యమ్మ ఫిర్యాదుపై వల్లంపూడి హెచ్సీ శివకేశవరావు కేసు నమోదుచేసి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. -
4జీ టవర్ల ఏర్పాటు వేగవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను వేగంగా అందించేందుకు టవర్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ తొలిదశలో భాగంగా వాహనాలు వెళ్లే సౌకర్యం ఉన్న కొమరాడ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పది గ్రామాల్లో వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు ఉపాధిహామీ పథకం కింద రోడ్లు నిర్మించి, పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ ఇంటర్ నెట్తో ముడిపడి ఉన్నందున ఏ గ్రామంలోనూ సిగ్నల్ సమస్యలు ఉండరాదని ఆయన తెలిపారు. టవర్ల ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా లేకపోతే ప్రత్యామ్నాయాలు చూడాలని ఇప్పటికే ఉన్న టవర్ల సిగ్నల్ సమస్యలను కూడా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్సప్నిల్ జగన్నాథ్, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, దిలీప్చక్రవర్తి, డీఎంజీఓ శ్రీనివాసరావు, పలు మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి -
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్లో విజేతలుగా నిలవాలి
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మిలు ఆకాంక్షించారు. ఈనెల 10 నుంచి 12 వరకు పశ్చిమగోదావరి జిల్లా రాజమండ్రిలో అండర్ 14,17 బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు, ఈ నెల 10 నుంచి 12 వరకు బాపట్ల జిల్లా రేపల్లెలో జరగబోయే అండర్ 14 తైక్వాండో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు గురువారం పయనమయ్యారు. వారికి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు పలు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ క్రీడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వర్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తండ్రిని చంపిన తనయుడు
బాడంగి: వ్యసనాలకు బానిసైన కొడుకు మద్యం కోసం డబ్బు లివ్వలేదని కన్నతండ్రినే హతమార్చాడు. బాడంగిలో జరిగిన ఈ విషాదకర సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలోని సినిమా కాలనీలో నివాసముంటున్న బలిజిపేటకు చెందిన బోనుగిరి రాజేశ్వరరావు(70)ను చిన్నకుమారుడు లక్ష్మణరావు చెప్పులు కుట్టుకునే గూటంతో కొట్టి హతమార్చాడు. మద్యం కొనుగోలుకోసం డబ్బులిమ్మని అడగ్గా తండ్రీకొడుకుల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఆవేశపరుడైన కుమారుడు చెప్పులు కుట్టే గూటంతో తండ్రి చెవిపైన బలంగా కొట్టగా తండ్రి రాజేశ్వర రావు స్పృహకోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలాడు. గురువారం తెల్లవారుజామువరకు ఈవిషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడి సాధారణ మరణంగా నమ్మబలికే ప్రయత్నం చేశారు. కుమారుడే కాలయముడన్న విషయం చుట్టుపక్కల వారికి తెలిసిపోవడంతో చేసేదిలేక హతుడి భార్య ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ముగ్గురు పిల్లలు కాగా పెద్దకుమారుడు గతంలో రైలు ప్రమాదంలో చనిపోగా కుమార్తెకు వివాహంచేసి అత్తవారింటికి పంపారు. చిన్నకుమారుడు లక్ష్మణరావు సిమెంట్పని, పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ వ్యసనాలకు బానిసగా మారి తరచూ తల్లిదండ్రులతో తగాదాలు పడుతుంటాడని ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు తెలిసింది. హత్య సంఘటనపై సమాచారం అందుకున్న బొబ్బిలి రూరల్ సీఐ నారాయణ రావు, ఎస్సై తారకేశ్వరరావు, డీఎఎస్పీ భవ్యరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్ల సత్తా
● సాఫ్ట్బాల్లో బాలురు, బాలికలకు ప్రథమస్థానం తెర్లాం: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర, బాలికల జట్లు సత్తా చాటాయి. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర, బాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. అండర్–14 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలు విశాఖపట్నం జిల్లా గొలుగుగొండ మండలం కృష్ణదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 4 నుంచి జరిగాయి. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు పాల్గొని మొదటి నుంచి మంచి ప్రతిభ కనబరచిన జిల్లా జట్లు ఫైనల్ పోటీలకు చేరాయి. ఫైనల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు జట్టు గుంటూరు జిల్లా జట్టుతో పోటీపడి విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అలాగే జిల్లాకు చెందిన బాలికల జట్టు చిత్తూరు జిల్లా జట్టుతో ఫైనల్ పోటీలో తలపడింది. ఈ పోటీల్లో విజయనగరం బాలికల జట్టు విజయం సాధించి ప్రథమస్థానాన్ని సొంతం చేసుకుంది. జిల్లాకు చెందిన రెండు జట్లు అత్యుత్తమ ఆటతీరును కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్తోపాటు షీల్డ్లను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుజట్ల క్రీడాకారులను జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు, కోచ్లు అభినందించారు. రానున్న మరిన్ని పోటీల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. -
గిరిసీమకు దారేదీ?
పార్వతీపురం రూరల్: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, ఆధునిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని అనేక గిరిజన గ్రామాలకు నేటికీ కనీస రహదారి సౌకర్యం కలగానే మిగిలిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 226 గ్రామాలకు సరైన దారి లేక అక్కడి ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వాగులు, వంకలు, కొండలు, గుట్టలే వారికి శ్రీరామరక్షగా మారాయి. ప్రభుత్వ పాలకుల హామీలు నీటి మీద రాతల్లా మిగులుతున్నాయే తప్ప, వారి తలరాతలు మాత్రం మారడం లేదని గిరిజనం కన్నీటి పర్యంతమవుతోంది. అడుగు బయటపెడితే అష్టకష్టాలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల దుస్థితికి అద్దం పట్టే గ్రామాలు కోకొల్లలు. ప్రధానంగా 63.30 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించా ల్సి ఉన్నప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నా యి. మరీ ముఖ్యంగా, 52 గ్రామాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే, వాటికి కనీసం కాలిబాట కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వ ర్షాకాలం వస్తే ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అత్యవసర వైద్యం అవసరమైతే డోలీలే వారికి అంబులెన్సులు. చదువుకోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాల న్నా, కిలోమీటర్ల కొద్దీ బురద, రాళ్ల మధ్య ప్రాణాల ను పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సిందే. గ్రామాల వారీగా గణాంకాలు అధికారిక లెక్కల ప్రకారం, కురుపాం, మక్కువ, జియ్యమ్మవలస, పాచిపెంట, సాలూరు మండలాల పరిధిలో 25 గ్రామాలకు రోడ్లు లేవు. సాలూరు మండలంలోని గంజాయిభద్ర, నేరెళ్ల వలస, కొదమ, సారిక వంటి పంచాయతీలలోని 14 గ్రామాలకు రహదారి నిర్మాణం అత్యవసరం. పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, పార్వతీపురం వంటి అనేక మండలాల్లోని గిరిజన గ్రామాలది కూడా ఇదే దుస్థితి. ప్రతి ఏటా అధికారులు సర్వేలు చేయడం, ప్రతిపాదనలు పంపడం సాధారణ ప్రక్రియగా మారిందే తప్ప, ఆచరణలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. నిధుల కొరతో, అటవీ అనుమతుల జాప్యమో కారణం ఏదైనా, శిక్ష అనుభవిస్తున్నది మాత్రం అమాయక గిరిజనులు. ఇటీవల బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాలతో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ దఫా అయినా పనులు చేస్తారా? లేదా ఎప్పటిలాగానే చేసిన సర్వే లేక్కలు కాగితాలకే పరిమితమవుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి. పాలకుల ప్రగల్భాలు.. సంక్షేమ రాజ్యమని, సుపరిపాలన అందిస్తున్నామని ఊదరగొట్టే పాలకుల మాటలకు, గిరిజన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా, జిల్లాలోని 226 ఆదివాసీ గ్రామాలకు కనీసం కాలిబాటను కూడా నిర్మించలేని ఈ ప్రభుత్వానికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అంటూ గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. గిరిజనుల బతుకులు కన్నీటి సుడుల్లో చిక్కుకుంటే, పాలకులు మాత్రం ప్రగల్భాలు పలుకుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడుతున్నారు. రహదారి సౌకర్యం లేని 226 గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధం నిత్యం నరకం చూస్తున్న ప్రజానీకం వైద్యం అవసరమైతే డోలీలే అంబులెన్సులుగిరిజనుల గోడు పట్టదా? ఎవరికై నా జ్వరం వచ్చినా, గర్భిణికి పురిటినొప్పులొచ్చినా ప్రాణాల మీద ఆశ వదులుకని డో లీలో ప్రయాణించాల్సిందే. వర్షాకాలం వస్తే మ రింత దారుణమైన పరిస్థితి. గిరిజనులు పిల్లల చదువులు, అరకొర అందించే రేషన్ అన్నీ ఆగిపోతాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చిన కుటమి నాయకులు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసే హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. ఇటీవల కలక్టర్ ఆదేశంతో సర్వే చేసిన గిరిజన గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధన కార్యదర్శి -
చెట్టు మీద పడి పోడు రైతు మృతి
పార్వతీపురం రూరల్/కొమరాడ: కొమరాడ మండలంలో బుధవారం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ రైతు మీద మామిడి చెట్టు పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడాతలేసు పంచాయతీ పరిధి తీలేసు గ్రామానికి చెందిన పువ్వుల రామారావు(47) కొండపోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. రోజులాగానే బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా పెనుగాలి వీయడంతో ఓ భారీ మామిడి చెట్టు రామారావుపై పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా గమనించిన స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రామారావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, డిగ్రీ పూర్తి చేసిన చిన్న కుమార్తె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. రామారావు ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామానికి సమీపంలో గల పెట్రోల్ బంకు దరి బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం నుంచి విజయనగరం వెళ్తున్న బైక్ను విజయనగరం నుంచి జక్కువ వెళ్తున్న అర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తి తనది ఎస్.కోట అని చెప్పి కోమాలోకి వెళ్లిపోవడంతో తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మహేష్ తెలియజేశారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. కారు ఢీకొని మరో వ్యక్తికి.. బొండపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. . పార్వతీపురం నుంచి బొండపల్లి మండలంలోని బి.రాజేరు గ్రామానికి పైల ఈశ్వర్రావు తన బైక్పై భార్య, ఇద్దరు కుమార్తెలతో వస్తుండగా విజయనగరం నుంచి గజపతినగరం వస్తున్న కారు ఢీకొనడంతో బైక్ నడుపుత్నున ఈశ్వరరావుకు గాయాలయ్యాయి. గాయపడిన ఈశ్వర్రావును గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. -
వీఎల్ఎస్ఐ కిట్ల విరాళం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి, సింథటిక్ ప్రొఫెసర్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న డ్రీమ్ చివ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నాలుగు వీఎల్ఎస్ఐ డిజైన్ కిట్లు విరాళంగా అందించింది. ఈ సందర్భంగా డ్రీమ్ చిప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బులుసు గోపీకుమార్ బుధవారం మాట్లాడుతూ ఈ కిట్లు ఎఫ్పీజీఏ ఆధారిత చిప్ డిజైన్, పరిశీలన కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక మద్దతుతో రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఎంబెడెడ్ ఏఐ చిప్ డిజైన్, కన్జూమర్ టెక్నాలజీ చిప్ డిజైన్ ఇండస్ట్రీయల్ కంట్రోల్ చిప్ డిజైన్, డ్రోన్ చిప్ డిజైన్, మెడికల్ టెక్ చిప్ డిజైన్, అటోమోటివ్ చిప్ డిజైన్, ఫిన్టెక్ చిప్ డిజైన్ వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఈ కిట్లకు డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ సంస్థ నుంచి ఈ మెయిల్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ వీఎల్ఎస్ఐ డిజైన్ కిట్లు తమిళనాడులోని చైన్నెలో రూపొందించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆంధ్ర మెడ్ టెక్ జోన్లో డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తయారుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బులుసు మురళి, జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ బబులు, ఈసీ విభాగాఽధిపతి ప్రొఫెసర్ కేసీబీ రావు, ఇతర బోధకులు పాల్గొన్నారు. -
నదిలో దూకిన వ్యక్తి మృతదేహం లభ్యం
వంగర: మండల పరిధి రుషింగి వంతెన పై నుంచి నాగావళి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన కళ్లేపల్లి జగదీష్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ నెల 7వ తేదీన గరుగుబిల్లి మండలం రావివలస వద్ద చేపల వ్యాపారం ముగించుకుని అదే మండలం మగ్గూరు గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో భార్యాభర్తల మద్య తగాదా రావడంతో జగదీష్ వంతెనపై నుంచి దూకేసిన విషయం పాఠకులకు విదితమే. స్థానిక హెచ్సీ దూసి రాములు ఆధ్వర్యంలో పోలీసులు, గజ ఈతగాళ్లు రుషింగి, తలగాం, శివ్వాం తదితర ప్రాంతాల వద్ద నాగావళి నదీతీరంలో గాలింపు చేపట్టారు. చివరికి వీరఘట్టం మండలం మొట్ట–వంగర మండలం సంగాం గ్రామాల సమీపంలో నాగావళి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలిస్తున్నట్లు హెచ్సీ దూసి రాములు తెలిపారు. -
ముందుచూపు అవసరం
● కళ్లను పరిరక్షించుకోవాలి ● కంటిచూపు లేకపోతే జీవితం అంధకారమే ● నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం విజయనగరం ఫోర్ట్: మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి కళ్లు, కంటి చూపు కోల్పోతే జీవితం అంధకారమే. ప్రకృతి అందాలను సైతం చూడలేని పరిస్థితి. అందువల్ల నేత్రాల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వివిధ రకాల కంటి సమస్యల బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లు అధికంగా చూడడం వల్ల చాలా మందికి దృష్టి లోపం సమస్య వస్తోంది. ప్రపంచంలో ప్రతి ఒక సెకెనుకు ఒక వ్యక్తి దృష్టి కోల్పోతున్నాడు. వివిధ కారణాలతో ప్రతి ఒక నిమిషానికి ఒక చిన్నారి దృష్టి కోల్పోతున్నాడు. 2022వ సంవత్సరంలో నిర్వహించిన సర్వే అధారంగా భారత దేశంలో 49 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. అదేవిధంగా 3.50కోట్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారిలో 80 శాతం మంది సకాలంలో నేత్ర పరీక్షలు చేసుకోవడం ద్వారా దృష్టి లోపాన్ని నివారించగలిగారు. ఒక వ్యక్తి అంధత్వం బారిన పడడం వల్ల తలసరి స్థూల జాతీయ ఆదాయం రూ.1,70, 624 నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. కంటి వెలుగు ద్వారా ఎంతో మందికి చూపు కంటి ప్రాధాన్యతను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంతో మందిని అంధత్వం బారిన పడకుండా సకాలంలో కంటి పరీక్షలు నిర్వహించి వారికి చూపును ప్రసాదించింది. కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి చేయించింది. అదేవిధంగా కంటి అద్దాలు అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటి వెలుగు కార్యక్రమానికి మంగళం పాడేసింది. 2,92,462 మంది విద్యార్థులకు తొలివిడతలో పరీక్షలు డా.వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా తొలివిడతలో 3357 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2,92,462 మంది విద్యార్ధులకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రెండోవిడతలో13,109 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3844 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించి కంటి అద్దాలు అందించారు. మెల్ల కన్ను శస్త్రచికిత్సలు 18 మందికి, కంటి శుక్లం శస్త్రచికిత్సలు ఐదుగురికి, రెప్పవాలడం శస్త్రచికిత్సలు 20 మందికి నిర్వహించారు. కంటివెలుగు మూడో విడతలో1, 79, 890 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 28, 213 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరం కాగా చేశారు. 43,938 మంది అవ్వాతాతలకు కళ్లజోళ్లు అందించారు.కంటిసమస్యల పట్ల నిర్లక్ష్యం కూడదు కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది కంటి సమస్యలకు పసర మందులు, నాటు వైద్యులను అశ్రయిస్తుంటారు. దీని వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కంటి సమస్యలు వచ్చినప్పడు దగ్గరలో ఉన్న కంటి వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా కంటి సమస్యలకు సొంత వైద్యం చేయకూడదు. -
జేసీబీతో ఇసుక అక్రమ తవ్వకాలు
బొబ్బిలిరూరల్: ఇసుక తరలింపులో యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అర్ధరాత్రిపూట ఇసుక దందా కొనసాగిస్తున్నారు.విషయం తెలిసినా అధికార పార్టీ నాయకులు కావడంతో అధినేత ఆగ్రహానికి గురికాకూడదని అధికారులు సైతం మౌనముద్ర వహిస్తున్నారు. దీంతో ఏకంగా నదిలో జేసీబీని వినియోగించి పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో మంగళవారం ఆర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో తరలించారు. దాదాపు 80 ఇసుక ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను జేసీబీతో తవ్వి తీసి కొంతమేర పట్టణంలోని కాంట్రాక్టర్లకు అమ్ముకోగా మరికొన్ని ఇసుక లోడ్లు గ్రామంలోని కొత్తకాలనీలో రహదారిపై వేశారు. అడిగితే గ్రామంలోని రహదారులేకనని నమ్మించే ప్రయత్నం చేయగా గ్రామంలో కొంతమంది ప్రతిరోజూ అలజంగిలో జరుగుతున్న ఇసుక దందాపై ఇతరులకో నీతి,అధికార పార్టీనాయకులకో నీతి అంటూ చర్చించుకుంటున్నారు. పరిశ్రమలకు రాత్రిపూట తరలింపు ఇదిలా ఉండగా గ్రోత్సెంటర్లో ఫెర్రోపరిశ్రమలకు సైతం రాత్రి వేళల్లో ఇసుక అక్ర తరలింపు జరుగుతోంది. స్టాక్ పాయింట్ నుంచి తీసుకోవాల్సిన ఇసుకను ట్రాక్టర్ల యజమానులను సంప్రదించి పెంట వద్ద వేగావతి నది నుంచి రాత్రి 11 గంటలనుంచి తెల్లావార్లూ ఇసుక అక్రమరవాణా జరుగుతోందని, రోడ్లు కొట్టుకు పోతున్నాయని సాక్షాత్తు ఆయా గ్రామాల ప్రజలు తహసీల్దార్ ముందు వాపోయారు. అయినా అధినేత అంక్షలతో చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. నా దృష్టికి రాలేదు అలజంగి గ్రామంలోని వేగావతి నదిలో మంగళవారం రాత్రి ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. -
ఇతర సమస్యలతో మరణాలు
పార్వతీపురంటౌన్: జిల్లాలో నిమ్మక సుమన్, నిమ్మక ప్రశాంత్లు పచ్చకామెర్ల వల్ల కాదని ఇతర సమస్యలతో మృతి చెందారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన తన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నివాసి నిమ్మక సుమన్ (23) సెప్టెంబర్ 14వ తేదీన గుమ్మలక్ష్మీపురల మండలం బాలేసు గ్రామానికి వచ్చాడన్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఆయన గత నెల రోజులుగా నెల్లూరులో స్టోర్ కీపర్ గా పని చేస్తున్నాడని, సెప్టెంబర్ 30న ఒడిశా రాష్ట్రం లోని దుర్గపాడు జలపాతాన్ని సందర్శించి, అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చాడన్నారు. అక్టోబర్ 4న జ్వరం, రెండు సార్లు విరేచనాలు, వాంతులు, పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ ఉదయం 11 గంటలకు కురుపాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు రాగా వైద్యుడు పరిశీలించి అక్టోబర్ 5న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయడంతో చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో చేర్చిన సమయానికి రోగి స్థిరంగా,చురుగ్గా ఉన్నాడని, దురదృష్టవశాత్తు అక్టోబర్ 6న అర్ధరాత్రి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో ఎన్సెఫలోపతి కారణంగా మరణించాడని చెప్పారు. అదేవిధంగా నిమ్మక ప్రశాంత్ (31) జియ్యమ్మవలస మండలం చినడోడిజ గ్రామంలో అక్టోబర్ 5న తీవ్రమైన కడుపునొప్పితో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారన్నారు. అయితే అప్పటికే దీర్ఘకాలంగా మద్యపానం అలవాటు వల్ల మల్టిపుల్ ఆర్గానన్స్ పెయిల్యూర్ కావడంతో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్తో అక్టోబర్ 5 తేదీన రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ మరణాలు ఇతర సమస్యల కారణంగా జరిగినవే తప్ప , పచ్చకామెర్ల వల్ల కాదని స్పష్టం చేశారు. డీఎంహెచ్ఓ డా. ఎస్.భాస్కరరావు -
జీవో 13ను తక్షణమే రద్దు చేయాలి
సాలూరు: కార్పొరేటర్లకు అడవులను అప్పగించే జీవో నంబరు 13ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పలువురు నాయకులు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పాచిపెంట మండలంలో గుమ్మకోట జంక్షన్ నుంచి శతాబి వరకు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గిరిజనులు విల్లంబులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర, రాష్ట్ర నాయకులు బాలదేవ్, సీపీఎం మన్యం జిల్లా కార్యదర్శి గంగునాయుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను అదాని, అంబానీ, నవయుగ వంటి కార్పొరేటర్లకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వాలు పని చేస్తున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే అనంతగిరి, పాచిపెంట మండలాలను ముంపునకు గురి చేస్తూ గిరిజనులకు తీవ్ర ద్రోహం చేసేందుకు జీవో 13 విడుదల చేసిందన్నారు. దీని ద్వారా నవయుగ సంస్థకు ఈ ప్రాంత ప్రజలను బలి చేసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. దీనిపై గిరిజనులంతా సమష్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పక్షం దాటాక.. పరామర్శలా..!
సాలూరు: జిల్లాలో కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. పట్టణంలోని తన గృహంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థినులు అనారోగ్యంతో మరణిస్తుంటే సంబంధిత మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సంధ్యారాణిపై నిప్పులు చెరిగారు. విద్యార్థినులు మరణించిన పక్షం రోజుల తరువాత తీరుబడి చూసుకుని మంత్రి సంధ్యారాణి విశాఖపట్నం కేజీహెచ్కు, కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లడం చూస్తుంటే గిరిజనుల పట్ల మంత్రికి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుందని మండిపడ్డారు. విద్యార్థిని చనిపోయిందని తెలిసే సమయానికి మంత్రి స్థానికంగా సాలూరులోనే ఉన్నారని అయినా ఆమె పరామర్శకు వెళ్లలేదని పేర్కొన్నారు. సీఎం స్పందించారని తెలుసుకుని తీరుబడిగా కేజీహెచ్కు, తరువాత ఇన్చార్జి మంత్రిని తీసుకుని కురుపాం పాఠశాలకు వెళ్లారని చెప్పారు. విద్యార్థినుల మరణాలతో రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి సంధ్యారాణి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడైనా మరణాలు సంభవిస్తే ఇవి ప్రభుత్వ హత్యలని, ప్రభుత్వ చేతగానితనమే కారణమని నాడు సంధ్యారాణి గగ్గోలు పెట్టేవారని, నేడు ఈ మరణాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు సంబంధించి పాడేరు ఐటీడీఏ పీవో డబ్బులివ్వకపోవడంతో కేజీహెచ్ ట్రైబల్సెల్ వారు ఆ విద్యార్థులను కేజీహెచ్ నుంచి తీసుకువెళ్లిపోతున్న సంఘటనలు దురదృష్టకరమన్నారు. ఏఎన్ఎంల నియామకంపై మంత్రిగా సంధ్యారాణి తొలి సంతకం చేసి ఏడాదిన్నరైనా నేటికీ ఆ హామీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. సాలూరు మండలం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల భోజన విషయంలో వార్డెన్, పీవీటీ గిరిజనురాలైన స్పెషలాఫీసరును మంత్రి దగ్గరుండి తొలగించారని, మరి మంత్రి సొంత జిల్లాలో 11 మంది మరణించారని, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ గిరిజన విద్యార్థులు మరణించారని వీటికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు బాధ్యత వహించరని ప్రశ్నించారు. మంత్రి సంధ్యారాణిని ఎందుకు తప్పించకూడదని నిలదీశారు. బాధిత విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతం కాదని పాలకులు గుర్తించాలని సూచించారు. జగన్మోహన్రెడ్డిపై విమర్శలా? విద్యార్థినుల మరణాలపై దిగ్భ్రాంతి చెందిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చలించి మానవత్వంతో స్పందించి ఒక్కో విద్యార్థిని కుటుంబానికి రూ.2లక్షలు సాయం ప్రకటించి ఇచ్చారని ఇది ఆయన మానవత్వానికి, మంచితనానికి నిదర్శనమన్నారు. అటువంటి వ్యక్తిపై, తనపై మంత్రి సంధ్యారాణి అభ్యంతరకర పదజాలాలతో విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. గిరిజన విద్యార్థినుల మృతికి మంత్రి సంధ్యారాణి బాధ్యత వహించాలి బాధిత కుటుంబాలకు మానవత్వంతో స్పందించి రూ.2 లక్షలిచ్చిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శించడమా? మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
● ఆ పార్టీ కార్యకర్తల కోసమేనా..
పండగ మొత్తం తెలుగుదేశం కార్యకర్తల కోసమే చేసినట్టుగా ప్రజల భావించాల్సిన పరిస్థితి నెలకొంది. వీధి, వార్డు స్థాయి కార్యకర్త కూడా రాష్ట్ర స్థాయి ప్రొటోకాల్ ఉన్నట్లుగా భావిస్తూ రొమ్ము విరుచుకుంటూ గుడి పరిసరాల్లో తిరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకొని పోలీసులు సాధారణ భక్తులను మాత్రం ఈడ్చి పారేశారు. అదేమిటో... దేవుళ్లు కూడా పెద్దలు.. డబ్బున్నవాళ్లనే కరుణిస్తాడు.. తప్ప పేదలను కనీసం కనికరించరు. దీంతో చాలా మంది భక్తులు బయట నుంచి అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మా ఈ ఒక్క దండాన్ని కోటి దండాలుగా భావించుకో అని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. -
కలుషిత జలం.. వ్యాధులకు గాలం!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కురుపాం గిరిజన విద్యార్థుల మరణాల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా కలు షిత నీటి వల్లే పచ్చకామెర్లు సంభవించాయన్న ఒక వాదన ఉంది. మరోవైపు జిల్లా కేంద్రంలోనే తీవ్ర తాగునీటి కష్టాలు పుర వాసులకు ఎదురవుతున్నాయి. రోజుల తరబడి ఇవ్వకపోవడం.. కుళాయిల ద్వారా అప్పుడప్పుడు వదిలినా.. బురదనీరే రావడం పరిపాటిగా మారింది. ఎండగట్టేయడం.. లేదంటే బురద నీరు అంటగట్టేయడం దాదాపు రెండు వారాలుగా మున్సిపల్ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో ఉన్న 30 మురికివాడల ప్రజలతో పాటు పార్వతీపురంలో దాదాపు 80 శాతం మందికి మున్సిపల్ కుళాయిలే ఆధారం. రెండు వారాలుగా నీటి సరఫరా కాకపోవడంతో వారంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బయట ప్లాంట్లలో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. బుధవారం నీటి సరఫరా అయినా.. ఎర్ర నీరే దర్శనమిచ్చింది. బకెట్లు, బిందెలతో పట్టుకున్నా.. అడుగంతా బురదే ఉంటోందని మహిళలు వాపోతున్నారు. తాగేందుకే కాదు.. వినియోగానికీ పనికిరావని చెబుతున్నారు. ఈ నీటిని తాగితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి రోగాలు వస్తున్నాయని వాపోతున్నారు. వేసవొచ్చినా.. వానొచ్చినా ఇదే గతి వేసవి, వర్షాకాలం వచ్చిందంటే.. మున్సిపల్ వాసులకు ఈ బురదనీరే గతి అవుతోంది. నాగావళి నది నుంచి పట్టణానికి నీరు సరఫరా అవుతుంది. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. వర్షాకాలంలో వరద నీరు కారణంగా బురద నీరు తప్పడం లేదు. పార్వతీపురం పట్టణంలో 30 వార్డులున్నాయి. 65 వేల మంది జనాభాకు 8,700 కుళాయిల ద్వారా.. అయిదు రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా అవుతోంది. తోటపల్లి వద్దనున్న నాగావళి నదిలో ఇన్ఫిల్ట్రేషన్ బావులున్నాయి. అక్కడ నుంచి మోటార్ల ద్వారా నీరు బూస్టర్ పంప్ హౌస్కు చేరి, అక్కడ శుద్ధి చేశాక, రిజర్వాయర్లకు పంపిస్తుంటారు. ప్రస్తుతం శుద్ధి ప్రక్రియ ఎక్కడా జరగడం లేదు. మున్సిపల్ అధికారులు రాజకీయాల మీద వహించే శ్రద్ధ.. ప్రజలకు తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించడంలో చూపడం లేదని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కౌన్సిలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కమిషనర్ వద్ద మొర పెట్టుకున్నా.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ‘వరదొస్తే నేనేం చేస్తా.. నేను ఎక్కడి నుంచి తేగలను. మంచినీరు వస్తే ఇవ్వగలను..’ అంటూ బాధ్యాతారాహిత్యంగా సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నీరు తాగితే పచ్చ కామెర్లే కాదు.. ఏ వ్యాదైనా రావచ్చు! జిల్లా కేంద్రంలో 10 రోజులుగా తాగునీటి సరఫరా బంద్ వదిలినా.. బురద నీరే గతి -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థుల మరణాలు
● మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలపై రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ధ్వజంపార్వతీపురం రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనిపై మంత్రి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మంగళవారం తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు ఇళ్ల వద్ద చనిపోయారంటూ ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడటం దారుణమన్నారు. ప్రభుత్వం సరైన వసతులు కల్పించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. గిరిజన విద్యార్థుల బాగోగులను ప్రభుత్వం సరిగా పర్యవేక్షించి ఉంటే 120 మందికి పచ్చకామెర్లు ఎలా వచ్చాయి? పది నెలల్లో 11 మంది ఎలా చనిపోయారు? అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కలుషిత నీరు, అపరిశుభ్రతే ఈ అనర్థాలకు మూలమని, ఏళ్ల తరబడి ఏఎన్ఎంలను నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్లో వెంటనే ఏఎన్ఎంను నియమించి, సురక్షిత నీరు, పౌష్టికాహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
కేజీహెచ్ నుంచి 8 మంది విద్యార్థినుల డిశ్చార్జి
● పార్వతీపురం పీహెచ్సీకి తరలింపు ● ఆస్పత్రిలో చేరిన మరో ఏడుగురు విద్యార్థినులు మహారాణిపేట: పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థినులను మంగళవారం పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విద్యార్థినులకు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో, వైద్యుల నివేదికల ప్రకారం తరలించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్ (గ్యాస్ట్రో ఎంట్రాలజీ), డాక్టర్ శివ కల్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవీలత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు)లతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం సమర్పించిన నివేదికల ఆధారంగా విద్యార్థులను తరలించినట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 129 మంది విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. -
మరణంలోనూ వీడని బంధం!
పెంచిన మమకారం...తండ్రితో ఉన్న అనుబంధం ఆ కొడుకును నిలవనీయలేదు.. జన్మ కారకుడైన తండ్రి ఇక లేడనే విషాదం ఆ కొడుకు గుండె తట్టుకోలేకపోయింది. తండ్రి మృతిని తలుచుకుంటూ శ్మశాన వాటిక నుంచి ఇంటికి వస్తూనే కుమిలిపోసాగాడు. ఆ బాధను ఆ గుండె తట్టుకోలేకపోయింది. అటు తండ్రి చితి ఆరక ముందే తనువు చాలించాడు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే... రాజాం సిటీ: తండ్రి చితి ఆరక ముందే కుమారుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన మండల పరిధి బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రీకొడుకు 24 గంటల వ్యవధిలో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన కొన్న బాలకృష్ణ (65) ఈ నెల 6వ తేదీన వేకువజామున గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈయన డోలక్ వాయిద్యంలో ప్రసిద్ధిగాంచిన కళాకారుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. పౌరాణిక, సాంఘిక నాటకాలకు డోలక్ వాయిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కనకరాజు తెలంగాణాలో పోలీసుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు అప్పలరాజు ఇంటి వద్దే ఉంటూ పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు సాయికృష్ణ ఉపాధ్యాయునిగా స్థిరపడ్డాడు. తండ్రి చితి ఆరక ముందే.. కొన్న బాలకృష్ణ మృతి చెందిన 24గంటలు గడవక ముందే తన రెండో కుమారుడు అప్పలరాజు (32) మృతి చెందాడు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ దహన సంస్కారాల అనంతరం ఇంటికి చేరిన కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు, సహచరులు హుటాహుటిన రాజాం ఆస్పత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 6న అర్థరాత్రి దాటిన తరువాత మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈయనకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. 24 గంటల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తండ్రి చితి ఆరక ముందే కొడుకు మృతి తండ్రి మృతిని తట్టుకోలేక 24 గంటలు గడవక ముందే తనువు చాలించిన కుమారుడు బొద్దాంలో హృదయ విదారక ఘటన -
నాగావళిలో దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం
వంగర: మండల పరిధి రుషింగి వంతెన పైనుంచి నాగావళి నదిలో దూకి ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వీరఘట్టం మండలం బిటివాడ గ్రామానికి చెందిన కళ్లేపల్లి జగదీష్ (33) వంగర మండలం మగ్గూరు గ్రామానికి చెందిన పార్వతిని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేపల వ్యాపారం రీత్యా గరుగుబిల్లి మండలం రావివలసలో స్థిరపడ్డారు. చేపల వ్యాపారం ముగించుకుని మగ్గూరు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న రుషింగి వంతెన సమీపం వచ్చే సరికి వ్యాపార నిమిత్తం భార్యాభర్తలు ఇరువురు తగాదా పడ్డారు. ఈ క్రమంలో వంతెన వద్దే బండిని నిలిపివేసి భార్య ముంగిటే నదిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కిమ్మి, రుషింగి గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడకు చేరుకుని గాలించినా ప్రయత్నం లేకపోయింది. భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నదిలో గల్లంతైన జగదీష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని హెచ్సీ దూసి రాములు తెలిపారు. -
రాత్రి వేళ కానరాని ఆర్టీసీ పండగ సర్వీసులు
విజయనగరం అర్బన్: పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు మంగళవారం రాత్రి వేళ కనిపించలేదు. వర్షం కారణంగా సిరిమానోత్సవం షెడ్యూల్ రెండు గంటల పాటు జాప్యం జరిగిన నేపథ్యంలో భక్తుల తిరుగు ప్రయాణం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. అయితే ఆర్టీసీ ప్రత్యేక సేవలను సాయంత్రం 7 గంటలకే ఆపేయడం వల్ల జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తులు ఇళ్లకు చేరడానికి ఇబ్బంది పడ్డారు. నిజానికి ప్రత్యేక సర్వీసుల షెడ్యూల్ ప్రకారం పండగ రెండవ రోజు మంగళవారం 80 బస్సులను ఏర్పాటు చేయాలి. సిరిమానోత్సవం జరిగేది సాయంత్రం 3 గంటలకు కాబట్టి ఆ తర్వాత ఎక్కువ సర్వీసులు వేయాలి, కానీ వేయకపోడం వల్ల జిల్లా కేంద్రం నుంచి విశాఖ, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల రూట్లలో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
పచ్చకామెర్లతో గిరిజన యువకుడు మృతి
● ఆలస్యంగా వెలుగులోకి.. గుమ్మలక్ష్మీపురం: పచ్చకామెర్ల వ్యాధితో కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు పువ్వల అంజలి, తోయక కల్పన మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ పాఠశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పచ్చకామెర్లతో బాధపడుతూ విశాఖపట్నంలోని కేజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని బాలేసు గ్రామానికి చెందిన గిరిజన యువకుడు నిమ్మక సుమన్ (21) పచ్చకామెర్ల వ్యాధితో పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిగ్రీ వరకూ చదువుకున్న సుమన్ ప్రయోజకుడై తమను పోషిస్తాడని ఆశించిన తల్లిదండ్రులు సుమన్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
సమాజానికి వాల్మీకి ఆలోచనలు ఆదర్శనీయం
●ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి పార్వతీపురం రూరల్: ఆదికవి, మహర్షి వాల్మీకి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని కలెక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి అన్నారు. కలెక్టర్, పోలీస్ కార్యాలయాల్లో మంగళవారం వాల్మీకి జయంతిని నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి బోధించిన సత్యం, ధర్మం, మానవతా విలువలను ప్రతీఒక్కరు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన ధర్మ పఽథం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సీఐలు రమణమూర్తి, శ్రీనివాసరావు, ఆర్ఐలు రాంబాబు, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
● కురుపాం బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ కురుపాం: స్థానిక బాలికల గురుకులంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అన్నారు. పాఠశాలను మంగళవారం సందర్శించారు. గురుకులంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్ను పరిశీలించారు. కిచెన్ గదులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యంతోపాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. బాలికలతో మాట్లాడి సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులు, కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి, సబ్కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి మధ్యాహ్నం సహపంక్తి భోజనం చేశారు. ఆయన వెంట డీడీ కృష్ణవేణి, గిరిజన సంఘం నాయకులు నిమ్మక జయరాజ్ , పాఠశాల సిబ్బంది ఉన్నారు.