breaking news
Parvathipuram manyam District Latest News
-
పట్టణాలకు రోగుల పరుగు..!
● నాడు ఇళ్లవద్దకే వైద్యసేవలు ● నేడు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ● గిరిజన ఆరోగ్యంపై సర్కారు చిన్నచూపువైద్యశిబిరాల నిర్వహణకు ప్రణాళికలు జిల్లాలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నందున వైద్యశిబిరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ప్రస్తుతం 104 సంచార వాహనాల ద్వారా వైద్యసేవలందిస్తున్నాం. వైద్యశిబిరాల నిర్వహణకు సంబంధించి వైద్యులను అందుబాటులో ఉంచాం. అతి త్వరలో గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించి గిరిజన, మైదాన ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తాం. – ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్ఓ, పార్వతీపురం మన్యంపార్వతీపురంటౌన్: అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు, విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంది. గిరిజన, గిరిశిఖర గ్రామాల్లో విషజ్వరాలు విలయతాండవం చేస్తున్నాయి. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన ప్రభుత్వం, యంత్రాంగం గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఇంటికో జ్వరపీడితుడు ఉన్నా తూతూ మంత్రంగానే వైద్యసేవలు అందుతున్నాయి తప్ప తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని గిరిజనులు వాపోతున్నారు. గ్రామాల్లో సరిగ్గా వైద్యసేవలు అందక, పీహెచ్సీల్లో సరైన వైద్యం అందక పట్టణాల్లో గల ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీసి వైద్యం చేయించుకోవల్సిన దుస్థితి గిరిజనులకు ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గిరిజన, మైదాన ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించి గ్రామాల్లోనే సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో వైద్యశిబిరాలను నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సల నిమిత్తం కార్పొరేట్ వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకువచ్చారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్య సమస్య తలెత్తరాదనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో నెలకు రెండుసార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇళ్లవద్దనే పరీక్షలు నిర్వహించి గ్రామాల్లోనే 105 రకాల మందులను అందజేసి గిరిజనుల ఆరోగ్యానికి భద్రత కల్పించారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని, గిరిజనులంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. నాడు 1,42,191 మందికి గ్రామాల్లోనే వైద్యసేవలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గిరిజన, మైదాన గ్రామాల్లో కార్పొరేట్ వైద్యులతో వైద్యశిబిరాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 364 వైద్యశిబిరాలు నిర్వహించి 1,42,191 మందికి వైద్యసేవలు అందించారు. అందులో 91,178మందికి బీపీ, 4,571మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించి చికిత్స, వారికి అవసరమైన మందులను అందజేశారు. 2,547మందిని వివిధ రోగాల నిమిత్తం వారిని గుర్తించి మెరుగైన వైద్యసేవల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి రిఫర్చేయగా 2,316 మందికి చికిత్స పొందారు. 18,773 మందికి కంటివైద్యపరీక్షలు నిర్వహించి 1260మందికి కేటరాక్ట్ సమస్య గుర్తించి 232మందికి శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఈ శిబిరాల్లోనే 1,229మందికి కళ్లజోళ్లను అందజేశారు. ఫ్యామిలీ డాక్టర్తో ఇళ్లవద్దకే వైద్యసేవలు దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతిరోజూ గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం వైద్యసేవలు అందించింది. గిరిజన గ్రామాల్లో మంచాన పడి ఉన్న గర్భిణులు, వృద్ధుల ఇళ్లవద్దకే వెళ్లి ఉదయం సమయంలో వైద్యసేవలు అందించి మధ్యాహ్న సమయంలో గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి వైద్యసేవలను అందించేవారు. గ్రామాల్లోనే రక్తపరీక్షలు నిర్వహించి రోగాలను గుర్తించి మందులను అందించేవారు. పట్టణాలకువెళ్లే పరిస్థితి లేకుండా గ్రామాల్లోనే 105 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. ఆ పరిస్థితి కానరాదు గ్రామాల్లో గతంలో మాదిరి వైద్యసేవలు అందే పరిస్థితి ప్రస్తుతం లేదు. తూతూ మంత్రంగానే 104 వాహనాల ద్వారా వైద్యసేవలు అందించి మమ అనిపిస్తున్నారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు, మారుమూల గ్రామస్తులు వేడుకుంటున్నారు. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ దూరప్రాంతాలకు ప్రయాణం చేసి ఆస్పత్రుల వద్ద లైన్లో నిలబడి వైద్యం పొందాల్సిన దుస్థితి ఉందని ప్రభుత్వం, యంత్రాంగం ఇప్పటికై నా స్పందించి గ్రామాల్లో వైద్యసేవలు, రక్తపరీక్షలు, మందులు, వైద్యశిబిరాలు అందుబాటులోకి తీసుకువచ్చి గిరిజన ఆరోగ్యానికి భద్రత కల్పించాలని ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. -
జనసేన మండల అధ్యక్షుడిపై పిర్యాదు
సీతంపేట: సోషల్ మీడియా వేదికగా సర్పంచ్లను దుర్భాషలాడినందుకు జనసేన పార్టీ సీతంపేట మండల అద్యక్షుడు మండంగి విశ్వనాథంపై కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓలకు ఫిర్యాదు చేసినట్లు మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు సోమవారం తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 73వ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 243 ప్రకారం రాజ్యాంగం 11వ భాగం ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ఎన్నికై గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వ్యవస్థపై అసభ్యపదజాలం, పోస్టింగ్లతో కించపరిచే విధంగా సోషల్మీడియాలో పోస్టులు పెట్టిన విశ్వనాథంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నికై న తాము ఏనాడు పార్టీల పరంగా భేదాభిప్రాయాలు తలెత్తేలా నడుచుకోలేదన్నారు. ఇప్పుడు జనసేన నాయకుడు సర్పంచ్లను దొంగనాకొడుకులు అంటూ అసభ్యంగా పెట్టిన పోస్టులు తమ మనోభావాలు పూర్తిగా దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. శాంతిభద్రతలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన విశ్వనాథంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, సర్పంచ్లు ఎన్.తిరుపతిరావు, కె.వెంకునాయుడు, ఎస్.బాపయ్య, హెచ్.ఆదిలక్ష్మి, జె.సుందరమ్మ, బి.తిరుపతిరావు, ఎస్.ప్రవీణ్, ఇసోని, రాజయ్య, జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు ఎస్.లక్ష్మి, ఎంపీటీసీలు ఎస్.చంద్రశేఖర్, ఎస్.మంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి స్వస్థ్ నారీ సశక్త్పరివార్ అభియాన్
● జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం రూరల్: జిల్లాలో ఈనెల 17వ తేదీ బుధవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లను సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, వీఆర్ఓ హేమలత, ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డా.జి. నాగభూషణరావు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి జగన్మోహన్రావు లతో కలిసి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పారామెడికల్ సిబ్బంది ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాలు వైద్య నిపుణులతో నిర్వహించనున్నందున అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు, గర్భిణులు, బాలింతలు ఈ శిబిరాలకు తీసుకురావాలని ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశవర్కర్లు మాత్రమే కాకుండా జిల్లా, మండల గ్రామస్థాయిలో వైద్యశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖతోపాటు స్థానిక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించి వైద్య శిబిరాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, మరికొంతమంది జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
17న జిల్లా ఆస్పత్రిలో వైద్య శిబిరం
● జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి నాగభూషణరావు పార్వతీపురంటౌన్: స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి జి.నాగభూషణరావు సోమవారం తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా ఆస్పత్రిలో నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంపులో మహిళలకు ఎన్సీడీల స్క్రీనింగ్ సేవలు అందిస్తామని తెలిపారు. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, స్థన క్యాన్సర్, గర్భాశయ ముఖ క్యాన్సర్, క్షయవ్యాధి స్క్రీనింగ్, రక్తహీనత స్క్రీనింగ్లు ఉంటాయన్నారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మోక్షగుండంను ఆదర్శంగా తీసుకోవాలి విజయనగరం అర్బన్: ఇంజినీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి కోరారు. మోక్షగుండం జయంతిని పురస్కరించుకుని వర్సిటీలో సోమవారం ఇంజినీరిండ్ డేను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ ఇంజినీర్లు ప్రొఫెషనల్గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనాలని కోరారు. దేశాభివృద్ధికి మోక్షగుండం చేసిన కృషిని కొనియాడారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.ఉమాశంకర్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జీజే నాగరాజు, సివిల్ విభాగాధిపతి డాక్టర్ జి.అప్పలనాయుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.జగన్మోహన్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న మొక్షగుండం నఖచిత్రం గరుగుబిల్లి: మండలంలోని నాగూరుకు చెందిన నఖచిత్రకారుడు పల్ల పరిశినాయుడు ఇంజనీర్స్ డే సందర్భంగా వేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నఖచిత్రం పలువురిని ఆకట్టుకొంది. రేపటి నుంచి వాహన మిత్ర దరఖాస్తుల స్వీకరణ ● కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం రూరల్: వాహన మిత్ర పథకం కోసం బుధవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. అక్టోబర్ 1న వాహనమిత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సొంత ఆటో కలిగిన డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలానాలు ఉండరాదని, మూడెకరాల మాగాని, మెట్టభూమి అయితే పదెకరాల లోపు ఉండేవారు పథకానికి అర్హులని తెలిపారు. నేరాల నియంత్రణే లక్ష్యం ● ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్ విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. -
స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీలకు 37 మంది ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్గేమ్స్ బాల, బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఎంపికలు నిర్వహించారు. అండర్–14 విభాగంలో బాలురకు, అండర్–17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించిన పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 200మందికి పైగా క్రీడాకారులు హాజరై పోటీ పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ బరువుల కేటగిరీల వారీగా ఎంపికలు నిర్వహించగా రెండు విభాగాల్లో మొత్తం 37 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు అర్హత సాధించినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు తెలిపారు. పోటీలను బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల మన్మథకుమార్ ప్రారంభించగా..శాప్ కోచ్ బి.ఈశ్వరరావు, ఖేలో ఇండియా కోచ్ సీతారామంజనేయులు పర్యవేక్షించారు. పోటీలకు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. -
జూనియర్స్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
● 23 నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో పోటీలువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్క్రీడామైదానం ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 120 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. బాల, బాలికల విభాగాల్లో నిర్వహించిన ఎంపికలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ ఎంపికల్లో బాలుర విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులు, బాలికల విభాగంలో మెరుగైన ఆట తీరు కనబరిచిన 14 మంది క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23 నుంచి 26వరకు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరగనున్న అంతర్ జిల్లాల జూనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఎంపిక పోటీలను అసోసియేషన్ కోశాధికారి బి.శివప్రసాద్, ప్రధానోపాధ్యాయులు నగేష్కుమార్, కొవ్వాడ శేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు తౌడుబాబు, గోపాల్, మీసాల.శ్రీనివాసరావు, మజ్జి తిరుపతిరావు, సారిపల్లి గౌరీశంకర్, సౌదామిని, పి.ఆదినారాయణలు పర్యవేక్షించారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
● జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సమర్పించే అర్జీదారుల వినతులకు సత్వరమే పరిష్కారం చూపాలపి పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన అధ్యక్షతన జరిగిన పీజీఆర్ఎస్లో సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్ఓ కె.హేమలత, సబ్కలెక్టర్ ధర్మచంద్రారెడ్డిలు అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో కొమరాడ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన ధాత్రిశ్రీ తల్లికి వందనం డబ్బులు జమకాలేదని, జిల్లా కేంద్రంలోని కొత్తవలసకు చెందిన రౌతు పారినాయుడుకు పింఛన్ మంజూరు చేయాలని, వెంకటసాగరం ఆయకట్టులో 40 ఎకరాలకు సక్రమంగా నీరు అందించాలని సీతానగరం మండలం అంకలాం రైతులు కోరారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులకు పరిష్కారం చూపండి పార్వతీపురం రూరల్: ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధిత పోలీసుశాఖ అధికారులు జవాబుదారిగా వ్యవహరించి పరిష్కారం చూపాలని ఏఎస్పీ అంకితా సురానా అన్నారు. అలాగే నిర్దేశించిన సమయంలోనే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వచ్చిన 10 ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 42 అర్జీలు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. ముగడపేటకు చెందిన రమణమ్మ హౌసింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి అందజేసింది. యోగా టీచర్ పోస్టు ఇప్పించాలని మండ గ్రామానికి చెందిన సవర శ్రీను, కొండపోడు పట్టాలు ఇప్పించాలని బంజారుపేట గిరిజనులు కోరారు. జీజీవలస గ్రామస్తులు శ్మశానవాటికకు సీసీ రోడ్డు, ప్రహరీని నిర్మించాలని వినతులు అందజేశారు. పెద్దగూడకు చెందిన సవర మంగయ్య బ్యాటరీ స్ప్రేయర్ ఇప్పించాలని, కమ్యూనిటీహాల్ మంజూరు చేయాలని కరడంగివలస గ్రామస్తులు కోరారు. పీజీఆర్ఎస్లో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈవో రామ్మోహన్రావు, ఉపవైద్యాధికారి విజయపార్వతి, ఏపీడీ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు.. వదంతులు నమ్మవద్దు
● రూరల్ సీఐ రంగనాథంపార్వతీపురం రూరల్: మండలంలోని బాలగుడబ గ్రామ సమీపంలో గల నేలబావి వద్ద ఉన్న దుర్గాదేవి ఆలయంలో విగ్రహం ధ్వంసం జరిగిందన్న ఘటనపై పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై సంతోషికుమారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరిగిన ఘటనపై వివరించారు. కొన్నేళ్ల క్రితం అమ్మవారి విగ్రహంలో ఎడమచేయి శిథిలమవడంతో మరమ్మతులు చేసి స్థానిక భక్తులు ఏర్పాటు చేశారని ఈ మేరకు క్రమేణా మళ్లీ అదే చోట శిథిలమైనట్లు తమకు సమాచారం వచ్చిన వెంటనే క్లూస్టీం ద్వారా పరిశీలించి, అ స్థానిక గ్రామ పెద్దలు, భక్తులతో మాట్లాడి విచారించిన అనంతరం ఎలాంటి విధ్వంస చర్యలు జరగలేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఎవరూ ఆందోళన చెందనవసరంలేదని, అలాగే ఇలాంటి సున్నితమైన విషయాలు, వదంతాలు స్పష్టత లేకుండా నమ్మవద్దని తెలిపారు. -
● ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తలపెట్టిన నిరసన వారంలో భాగంగా రాజాం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేశారు. నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి మెమో 57ను అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, యాప్లను, అసెస్మెంట్ బుక్లెట్ విధానాలను రద్దుచేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి మధన్మోహన్, విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు లంక రామకృష్ణ, ఎలకల భాస్కరరావు, నల్ల రవికుమార్, ఎందువ సీతంనాయుడు పాల్గొన్నారు. –రాజాం సిటీవినతుల వెల్లువ -
● పశువుల కంటైనర్ బోల్తా
బొండపల్లి: మండలంలోని నెలివాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారి26పై గజపతినగరం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న పశువుల కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. సోమవారం వేకువ జామున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. పశువులను రవాణా చేస్తుండగా కంటైనర్ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడి పోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు పశువులకు ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ హుటాహుటిన లారీ యాజమాన్యంతో పాటు పశువులను రవాణా చేస్తున్న వారు భారీ క్రేన్లు తీసుకువచ్చి లారీని బయటకు తీసి, అలాగే లారీలో రవాణా చేస్తూ ప్రమాదంలో చెల్లాచెదురైన పశువులను బయటకు తీసి వాటిని వేరే వాహనంలో గుట్టుచప్పడు కాకుండా పోలీసులకు తెలియకుండా తరలించారు. -
జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు నలుగురి ఎంపిక
● అక్టోబర్ 8 నుంచి నోయిడాలోపోటీలుచీపురుపల్లి: జాతీయస్థాయిలో జరగనున్న టెన్నికాయిట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఆడేందుకు జిల్లాకు చెందిన నలుగురు ప్రధాన క్రీడాకారులు, ఇద్దరు అదనపు క్రీడాకారులు ఎంపికయ్యారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ప్రధాన క్రీడాకారుల్లో ముగ్గురు మహిళల విభాగం నుంచి కాగా ఒకరు పురుషుల విభాగం నుంచి ఎంపికయ్యారు. ఈ నెల 13, 14 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో నిర్వహించిన 49వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ టెన్నికాయిట్ ఛాంపియన్షిప్లో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఆ పోటీల్లో జిల్లాలోని గరివిడి మండలం కేఎల్.పురానికి చెందిన ఆర్.మౌనిక ప్రథమ స్థానంలో నిలవగా పి.రేణుక తృతీయస్థానం, జి.శ్రావణి నాల్గవ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఈ ముగ్గురిది ఒకే గ్రామం కావడం విశేషం. అలాగే చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన కె.ఇందు అదనపు క్రీడాకారిణిగా ఎంపికై ంది. అలాగే పురుషుల విభాగంలో పార్వతీపురానికి చెందిన ఎస్.రాహుల్ నాల్గవ స్థానంలో నిలిచి ప్రధాన క్రీడాకారుడిగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అంతేకాకుండా పురుషుల విభాగంలో విజయనగరానికి చెందిన కె.చంద్రమౌళిని అదనపు క్రీడాకారుడిగా ఎంపిక చేశారు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 8 నుంచి 13 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పట్టణంలో గల ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో జరగనున్న జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో వీరు రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన టెన్నికాయిట్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఎం.రామారావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభ కనపరిచి రాష్ట్రంతో బాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. -
● ప్రాణాలతో చెలగాటం
ఈ చిత్రం చూశారా.. అనారోగ్యంతో వైద్యం కోసం సంచి వైద్యుడి దగ్గరకు వస్తే... కుర్చీలో కూర్చోబెట్టి సిలైన్ పెట్టేశాడు. ఒకరికి కాదు.. ముగ్గురు రోగులకు ఇదే తరహాలో సిలైన్లు పెట్టడాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. సీతంపేటలో ప్రతి సోమవారం వారపు సంత జరుగుతుంది. వారపుసంతకు వచ్చే సమయంలో అనారోగ్యంగా ఉన్నా, జ్వరం వచ్చినా ఏరియా ఆస్పత్రికి వెళ్లకుండా సంతోలో ఉండే సంచి వైద్యులను, క్లినిక్లను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో సంతకు సమీపంలో కొత్తూరు మండలానికి చెందిన ఓ ప్రైవేటు సంచి వైద్యుడు ఇదిగో ఇలా ఆరుబయటే మందులు పెట్టేసి నాలుగు కుర్చీలు వేసి వైద్యసేవలు అందించాడు. ప్రతివారం ఇదే తరహాలో వైద్యసేవలు అందజేస్తారని రోగులు చెబుతున్నారు. – సీతంపేట -
ఎవరి దారి వారిదే..!
ఐటీడీఏ.. సీతంపేట: జిల్లా కలెక్టరేట్ తర్వాత రెండో కలెక్టరేట్ ఐటీడీఏ అనే నానుడి ఉంది. అలాంటి ఐటీడీఏకు ఏడాదిన్నరగా పూర్తి స్థాయిలో పీవోను నియమించకుండా కూటమి సర్కార్ దోబూచులాడుతుంది. ఇన్చార్జ్ పీవోలతో నెట్టుకొస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా ఐటీడీఏకు పీవోలను శాశ్వతంగా నియమించింది. ఇన్చార్జ్లతో నడిపించిన దాఖలాలు లేవు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ప్లాన్ మండలాలు ఉన్నాయి. 1250 వరకు గిరిజన గ్రామాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 16, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. 2లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 13కు పైగా ప్రభుత్వ శాఖలు పని చేస్తున్నాయి. ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమ శాఖ, వైద్య శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సహకార సంస్థ వంటివి నిర్వహించబడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నప్పటకీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జనరల్ బాడీ సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో ఏ శాఖ దారి వారిదే అన్నట్టు ఉంది. పాలకవర్గ సమావేశాలు ద్వారా గిరిజనులకు ఏఏ పథకాలు అవసరం, ఉన్న పథకాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయని, క్షేత్ర స్థాయిలో పథకాల పని తీరు మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించడానికి వీలుంటుంది. గవర్నింగ్ బాడీ సమావేశం కూడా ఇంతవరకు నిర్వహించకపోవడం గమనార్హం. గిరిజన విద్యా సంస్థల్లో హెల్త్ వలంటీర్లు లేరు.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లు లేరు. ఐటీడీఏ పరిధిలో 60 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించే ఏఎన్ఎంలు లేరు. అత్యవసర సమయాల్లో జ్వరం, ఇతర వ్యాధులు వస్తే విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కనీసం ప్రాధమిక చికిత్స చేసే వారు లేకపోవడంతో దీనావస్థలో ఉన్నారు. ఏడాదిన్నర కిందట ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదు. కాగా పాఠశాలలు పర్యవేక్షించే ఏటీడబ్ల్యూవో పోస్టులు కూడా రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఇన్చార్జ్లతోనే నెట్టుకువస్తున్నారు. విద్యార్థులకు వండి వడ్డించే వంట సిబ్బంది కొరత కూడా ఉంది. పడకేసిన ఉద్యానవనాలు ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖల ద్వారా రైతులకు మేలు చేసే యంత్ర సామగ్రి గతంలో పంపిణీ చేసేవారు. ఇప్పుడు సబ్సిడీపై ఎటువంటి పంపిణీ లేదు. పవర్ టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్వీడర్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. కేవలం మారిషస్ ఫైనాపిల్ సక్కర్లు మాత్రమే పంపిణీ చేసి ఉద్యానవన శాఖ చేతులు దులుపుకుంది. కాగా మరో ముఖ్యమైన గిరిజన సహకార సంస్థ అటవీ ఉత్పత్తులు నామమాత్రంగానే కొనుగోలు చేస్తుంది. కొండచీపుర్లు, ఇతర అటవీ ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలు లేకపోవడంతో గిరిజనుల ఇళ్ల వద్దే అటవీ ఉత్పత్తులు విక్రయించకుండా ఉండిపోతున్నాయి. వెలుగు ద్వారా నిర్వహిస్తున్న వీడీవీకేలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. 54కు పైగా వీడీవీకేలకుగాను మూడు, నాలుగు తప్ప ఎక్కడా నిర్వహించడం లేదు. జీడి, కొండచీపుర్లు తయారీ, పసుపు, చింతపండు ప్రోసెసింగ్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసినా ఇవి మూలనపడ్డాయి. గిరిజన ప్రాంతాల్లో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఐటీడీఏకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనేది లేదు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పథకాలు అమలు కాని పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొండపోడు పట్టాలతో పాటు, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ, మాజీ ఎమ్మెల్యే ఏడాదిన్నరగా శాశ్వత పీవో లేని దుస్థితి నిధుల్లేవు... విధుల్లేవు.. శాఖలది అదే తీరు పట్టించుకోని గిరిజనాభివృద్ధి కూటమి పాలకుల నిర్లక్ష్యం గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా రహదారులు, భవనాలు నిర్మించాల్సి ఉంది. 120కు పైగా గ్రామాలకు పూర్తి స్థాయిలో కనెక్టివిటీ దారులు లేవు. మరికొన్ని చోట్ల ఉన్న రోడ్లు నాణ్యతా లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. చేసిన పనులకు సైతం బిల్లులు లేవంటూ సంబంధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రహదారి సౌకర్యాలు లేక అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించాలన్నా, మార్కెట్కు అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్లాలన్నా.. గిరిజనుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఇంకా వరద గోడలు, మల్టీపర్పస్ భవనాల నిర్మాణాలు పూర్తిగా లేవు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల పనులు పూర్తి కాలేదు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలి
● సీఐటీయూ రాష్ట్ర నాయకులు ● ముగిసిన మహాసభలుపాలకొండ: ప్రజాసమస్యల పరిష్కారమే కార్మిక సంఘాల లక్ష్యం కావాలని విప్లవవాది, సినీనటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. రెండు రోజులుగా పాలకొండ పట్టణంలో నిర్విహిస్తున్న సీఐటీయూ 11వ జిల్లా మహసభలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశంలో నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకు అని తెలిపారు. సమసమాజ స్థాపన కోసం కార్మిక నాయకులు పోరాటాలు చేయక తప్పదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పోరాటాలపై నిర్బంధాలు విధిస్తున్నాయని మండిపడ్డారు. పోరాటాలతోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. కార్మికులు, ఉద్యోగులు, చివరికి అధికారులపైన కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులు చేపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం ఎమ్మెల్యే కార్మికులపై ఉక్కుపాదం మోపే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. అణిచివేత ధోరణితో ప్రభుత్వం పాలన సాగిస్తోందని, పోలీసులను పావులుగా వాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ మహాసభల్లో చూపించిన స్ఫూర్తితో పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం 47 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. ఈ సమావేశాల్లో పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు దావాల రమణారావు, మన్మథరావు, ఎం.కృష్ణమూర్తి, కె.రామస్వామి, తిరుపతిరావు పాల్గొన్నారు. -
నేడు పీజీఆర్ఎస్
సీతంపేట: ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. నేడు పింఛన్దారుల సమావేశం పార్వతీపురం: పట్టణంలోని రైతు బజారు పక్కన వున్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో పింఛన్దారులతో సోమవారం సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు గంట జగన్నాధంనాయుడు ఆదివారం తెలిపారు. సమావేశంలో ఇన్కంటాక్స్ రిటర్న్స్, ఈ–ఫైలింగ్, భవిష్యత్ ప్రణాళిక గూర్చి చర్చించనున్నట్టు పేర్కొన్నారు. పింఛన్దారులు హాజరు కావాలని కోరారు. మీ కోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల వివరాల నమోదుకు అవకాశం పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ిపీజీఆర్ఎస్)లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్లో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అర్జీదారులు (మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీడాట్ ఇన్)వెబ్సైట్లోలో అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులోకి 3200 క్యూసెక్కుల ఇన్ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. సువర్ణ ముఖి, వేగావతి నదుల నుంచి నీరు వచ్చి చేరడంతో 64.45 మీటర్లు లెవెల్ నీటిమట్టం ప్రాజెక్టు వద్ద నమోదైంది. దీంతో ఒక గేటు ఎత్తి 2080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ ఆదివారం తెలిపారు. విజయనగరం అర్బన్: యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని, వీటిలో ఇప్పటికే 50 పార్కులకు శంకుస్థాపన చేశామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం తన కాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువతను దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 11 పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు కూడా జరుగుతోందని అన్నారు. రక్షణ రంగం, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ సమ్మిట్లో మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. తద్వారా యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగను మునుపటి ఏడాది మాదిరిగానే భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పండగలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. -
విద్యార్థులతో చెలగాటం..!
పార్వతీపురం రూరల్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు దాదాపు 10 ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై నేటికి ఐదు నెలలు కావస్తున్నా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు నేటికీ అడ్మిషన్లు కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ ప్రవేశాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఏడాదిలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా సెప్టెంబర్ 3వ వారం వచ్చినా అడ్మిషన్లు జరగక తరగతులు ప్రారంభం కాక విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విడతల వారీగా చేపట్టిన ప్రవేశాలు ఇప్పటికే పూర్తయి తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పట్ల విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా వాయిదా దాదాపు 30వేలమంది విద్యార్థులు ప్రతి ఏడాది వివిధ కోర్సుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న సుమారు 191 డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరట డబుల్ మేజర్ విధానం తెచ్చేందుకు మూడు నెలల క్రితం దానికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చి కళాశాలల ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అయితే ప్రక్రియ అంతా ముగిసిన వెంటనే మళ్లీ పాత విధానం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మళ్లీ కళాశాలల యాజమాన్యాలను కొత్తగా కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని హడావిడి చేశారు. ఈ పక్రియ కూడా పూర్తయ్యాక గత నెల 20న ఆన్లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగస్టులో 20 నుంచి 26వరకు ప్రవేశాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఆగస్టు 24 నుంచి 28 వరకు వెబ్ అప్షన్లకు గడువు ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 1 నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెబ్సైట్లో సాంకేతిక లోపంతో సకాలంలో తెరుచుకోకపోవడంతో ఈనెల 3వ తేదీవరకు ప్రవేశాలకు, 4వ తేదీవరకు ఆప్షన్లు పెట్టుకోవడానికి గడువు పొడిగించారు. ఈనెల 8వ తేదీన సీట్ల కేటాయింపు, కళాశాలల్లో విద్యార్థుల రిపోర్టింగ్కు గడువు ఇచ్చారు. ఈనెల 9న ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతుల నిర్వహణ ప్రారంభమవుతుందని మరోసారి తాజాగా ఇచ్చిన షెడ్యూల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే గడువు పూర్తయినప్పటికీ నేటివరకు విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తి కాలేదు. సోమవారం జరిగే అవకాశం ఉంటుందని వారికొచ్చిన సమాచారం మేరకు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మొదటి విడత సీట్ల కేటాయింపుపై ఇంతవరకు స్పష్టత లేక కాకపోవడంతో రెండు, మూడు విడతలకు సంబంధించి అలాగే స్పాట్, యాజమాన్య కోటా ప్రవేశాలు జరగడానికి మరికొంత జాప్యం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వం చేసిన ఈ జాప్యం కారణంగా మొదటి ఏడాది సిలబస్, సబ్జెక్టు క్రెడిట్లో మార్పులు చేశారు. ప్రవేశాలు పూర్తయ్యి తరగతులు ప్రారంభమయ్యే సమయానికి మార్కెట్లో పుస్తకాలు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన కూడా విద్యార్థులను పీడిస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ ప్రవేశాల్లో భారీగా తగ్గుదల ఉంటుందని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఆందోళన చెందుతున్నాయి. డిగ్రీ ప్రవేశాల్లో గందరగోళం ఇప్పటికే సీట్లు ఖరారై పలుమార్లు వాయిదా ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 30వేలమంది ఎదురు చూపు తరగతులు నిర్వహిస్తున్నా అడ్మిషన్లు కాకపోవడంతో ఆందోళన ఇంటర్ ఫలితాలు విడుదలైనా ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం సగం విద్యాసంవత్సరం గడిచింది గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యంతో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ తీవ్ర జాప్యం నెలకొంది. కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే దీనికి కారణం. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం కూడా గడిచిపోయింది. మిగిలిన తరగతుల విద్యార్థులంతా త్వరలో సెమిస్టర్ పరీక్షలు రాయనున్నారు. కానీ డిగ్రీ మొదటి సంవత్సరం సిలబస్ ఎప్పుడు పూర్తి చేస్తారో, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ ఫలితాలు విడుదలై ఐదునెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాలు చేపట్టకపోవడం ముమ్మాటికీ కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం ఈ విధంగా డిగ్రీ విద్యార్థులతో ఆటలాడుకోవడం సరికాదు. ఇంకా ఆలస్యం చేస్తే భవిష్యత్లో విద్యార్థుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. బోను రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, అఖిల భారత విద్యార్థి సమాఖ్య -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
పాలకొండ రూరల్: ఈనెల 24 నుంచి 28 వరకూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సంబంఽధించిన జిల్లా జట్టు ఎంపిక ఆదివారం పాలకొండలో జరిగింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో జరిగిన ఈ ఎంపిక పోటీలకు జిల్లా పరిధిలో 15 మండలాలకు చెందిన 20 ఏళ్ల లోపు ఔత్సాహికులు హాజరయ్యారు. జూనియర్ విభాగానికి చెందిన ఎంపికలో బాలురు 70 మంది, బాలికలు 50 మంది ప్రతిభ కనబర్చారు. తుది జట్టులో 14 మంది వంతున రెండు జట్లను బాల,బాలికల నుంచి ఎంపిక చేశారు. అత్యంత ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ సంఘం గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు, అధ్యక్షుడు కోడి సుదర్శనరావు, కార్యదర్శి వెన్నపు చంద్రరావు(శేఖర్) తదితరులు తెలిపారు. -
కొనసాగుతున్న రెస్క్యూ
పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో వంతెనపై నుంచి నాగావళి నదిలో శనివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మహిళ దూకిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అటు విజయగరం జిల్లా రేగిడి, ఇటు మన్యం జిల్లా పాలకొండ సివిల్ పోలీసులతో పాటు స్థానిక అగ్నిమాపక అధికారులు వెతుకులాట చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అనుభవజ్ఞులైన ఈతగాళ్లతోపాటు డ్రోన్ సాయంలో కొంత మేరా శోధించారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేనట్లు స్థానిక ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. కేవలం వంతెనపై లభించిన పాదరక్షలు మినహా ఎటువంటి క్లూ గాని, మహిళను సజీవంగా, నిర్జీవంగా గుర్తించలేదన్నారు. తీరం వెంబడి గ్రామాలకు సమాచారం అందించామని, ఇరు జిల్లాల పరిధిలో ఎక్కడా మిస్సింగ్ కేసులు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. -
క్రైస్తవ విశ్వాసులు లోకానికి వెలుగునివ్వాలి
● ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక వేత్త బెన్నీ ప్రసాద్ ● ముగిసిన సిమ్స్ బాప్టిస్ట్ చర్చి 150వసంతాల వేడుకవిజయనగరం టౌన్: క్రైస్తవ విశ్వాసులు లోకానికి వెలుగై ఉన్నారని, అటువంటి క్రైస్తవులందరూ దీపంలా అనేకులకు వెలుగునివ్వాలని ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక వేత్త బెన్నీ ప్రసాద్ (బెంగళూరు) పేర్కొన్నారు. సిమ్స్ బాప్టిస్ట్ చర్చి 150వసంతాల వేడుకల్లో చివరిరోజు ఆదివారం చర్చి ఆవరణలో నిర్వహించిన ఆధ్యాత్మిక సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పాటూ జిల్లాలోని ఆధ్యాత్మిక క్రీస్తు సహోదరులకు ఆయన దైవసందేశాన్ని అందజేశారు. ఆయన ఆంగ్లభాషలో చెప్పిన దేవుని వాక్యాలను పాస్టర్ యబ్బోజు చౌదరి తెలుగులోకి అనువదించి భక్తులకు వివరించారు. విశ్వాసంతో, ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుని రక్షణ పొందగలమన్నారు. అద్భుతమైన గిటార్ వాయిద్య సహకారంతో దేవుని కీర్తనాలాపన చేస్తూ, ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ మాట్లాడుతూ సిమ్స్ చర్చి 150వసంతాల వేడుకలను పెద్దలందరి సహాయ, సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోగలిగామన్నారు. ఐదురోజుల పాటు నిర్వహించిన క్రైస్తవ మహాసభలకు హాజరై ఆధ్యాత్మిక దైవసందేశాన్నిచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిమ్స్ జూబ్లీ కమిటీ చైర్మన్ ఎం.ఎ.నాయుడు, కార్యదర్శి తాలాడ ఆనందరావు, వై.ప్రభాకర్, ఆశాజాన్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలు గగనమే...
వైద్య సేవలు గగనం అవుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తుంది. కొన్ని పీహెచ్సీల్లో ఒక్కో డాక్టర్తోనే నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు సక్రమంగా జరగడం లేదు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో జ్వర పీడితుల సంఖ్య తగ్గడం లేదు. ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీల పరిధిలో ఓపీ రోజురోజుకు పెరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 250కి పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అవగతమౌతుంది. గత నాలుగేళ్లుగా పోల్చితే ఇప్పుడు రోగుల సంఖ్య పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2లక్షలకు పైగా దోమ తెరలను గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేశారు. అటు తర్వాత పంపిణీ లేదు. -
కొనసాగిన ఉపాధ్యాయుల నిరసన వారం
విజయనగరం అర్బన్: ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న నిరసన వారం కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట ఉపాధ్యాయులు నిరసన నినాదా ల కార్యక్రమం చేపట్టారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇంతవరకు పెండింగ్లో ఉన్న 4 డీడీలు విడుదల చేయాలి. సీపీఎస్ రద్దు, ఐఆర్ (ఐఆర్) ప్రకటన, బకాయిల చెల్లింపు హెల్త్ కార్డు పరిమితి పెంపు, అసెస్మెంట్ బుక్లెట్ విధానం రద్దు తదితర డిమాండ్లు పరిష్కరించాలని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ కర్రి రవి, జిల్లా అధ్యక్షుడు షేక్ బుకారీ బాబూ, ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్ కర్రి రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మజ్జి రమేష్, మార్రాపు శ్రీనివాస్, కె.వెంకునాయుడు, టి.శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, సుగుణాకరరావు, పి.సత్యన్నారాయణ కె.వెంకటరావు పాల్గొన్నారు. మంత్రి కొండపల్లికి వినతి -
అర్ధరాత్రి ఇంట్లో దోపిడీ
● హడలిపోయిన కుటుంబ సభ్యులు కొత్తవలస: మండలంలోని చింతలపాలెం సమీపంలో గల శీరంశెట్టివానిపాలెం గ్రామంలో ఒక ఇంటిలో అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టి తీయగానే ఇంటిలోకి ప్రవేశించి కుటుంబసభ్యులను బంధించి బంగారం, నగదును దుండగులు దోచుకుపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మీసాల రవిప్రకాష్ గ్రామానికి కొంతదూరంలో ఇల్లు కట్టుకుని కుటుంబంతో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి రవిప్రకాష్ కేటరింగ్ పని నిమిత్తం గాజువాక వెళ్లాడు. ఇంట్లో భార్య సత్యవతి, మామ, అత్త, ఇద్దరు పిల్లలు తలుపులు గడియలు పెట్టి నిద్రపోయారు. ఈ క్రమంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టడంతో రవిప్రకాష్ మామ తలుపు తెరిచాడు. సదరు దుండగుడు ఒక్క సారిగా ఆయనపై విరుచుకుపడి స్క్రూడ్రైవర్తో చెవిభాగంలో పొడిచి లోనికి ప్రవేశించాడు.ఇంతలో మరో ఐదుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు తొడుక్కుని ఇంటిలోకి ప్రవేశించారు. అత్త, మామను ఒక గదిలోను, భార్య సత్యవతి, ఇద్దరు పిల్లలను మరో గదిలో బంధించి బంగారం, డబ్బు ఎక్కడ ఉందో చెప్పాలని భయభ్రాంతులకు గురిచేశారు. గొడవ చేసి అరిస్తే చంపేస్తాం అంటూ హిందీ, తెలుగు బాషల్లో భయపెట్టారు. పరిశీలించిన పోలీసులు బలవంతంగా బీరువా తెరిచి అందులో గల బంగారం తాడు, ఉంగరం, శతమానాలు తదితర వస్తువులు రెండున్నర తులాల బంగారం, కొంత వెండి, రూ 24వేల నగదు దోచుకున్నారు.రవిప్రకాష్ అత్త చేతులకు ఉన్న గాజులు, చెవిదిద్దులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవి ఇత్తడి వస్తువులు అని చెప్పినా వినకుండా వాటిని సైతం లాక్కుని పోయారు. మొత్తం ఆరుగురు దుండగులు చేతికి అందింది దోచుకుని బయటకు వెళ్లి తలుపు గడియ పెట్టి వెళ్లిపోయారు. దీంతో రవిప్రకాష్ అత్తయ్య వద్ద గల ఫోన్లో గాజువాకలో గల రవిప్రకాష్కు జరిగిన విషయం తెలియపరచగా ఆయన పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. అందరూ వచ్చి తలుపులు తీయగా కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. బాధితుడు రవిప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, స్థానిక ఎస్సై ఎన్.జోగారావుతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విజయనగరం నుంచి ప్రత్యేక క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జోగారావు తెలిపారు. -
గురజాడ నివాసాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి
విజయనగరం గంటస్తంభం: సాహిత్య కారుడు, మహాకవి గురజాడ అప్పారావు నివాసాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామారావు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక మయూరి జంక్షన్ నుంచి గురజాడ అప్పారావు నివాసం వరకూ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సమాజంలోని అసమానతలను బటయపెట్టారన్నారు. ప్రభుత్వం గురజాడ నివాసాన్ని స్వాధీనం చేసుకుని, స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు ప్రజలు అందరూ గౌరవంతో దర్శించుకునే విధంగా గురజాడ గృహాన్ని పునఃనిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురజాడ అప్పారావు జయంతి, వర్ధంతిలను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సూచించారు. ఆయన పేరు మీద సాంస్కృతిక విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పారు. సైన్స్వాక్లో పాల్గొన్న కళాకారులు గురజాడ గేయాలను ఆలపించి, గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకులు, మహాసభ ప్రతినిధులు, కవులు, విద్యావేత్తలు,మేధావులు, కళాకారులు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక డిమాండ్ -
విలేకరుల సమావేశం కవర్ చేస్తే కేసులు పెడతారా?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ గొంతునొక్కేందుకు చూస్తోంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను జర్నలిస్టు వార్తగా రాస్తే కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రం హక్కు అమలులో ఉందా?లేదా? అనే ఆందోళన కలుగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సమంజసం కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కూటమి పాలకుల తీరును గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలి. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం కలంపై కక్షసాధింపు తగదు ప్రశ్నించే కలంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు తగదు. రాజ్యాంగంలో పత్రికా రంగం నాలుగో స్తంభం. ఒక పత్రికపై అక్కసు వెళ్లగక్కితే మరన్ని పత్రికలు ప్రశ్నిస్తాయి. లోపభూయిష్ట పాలనపై వ్యతిరేక వార్తలు రావడం సహజం. వాటిలో లోపాలను గుర్తించి, వాటిని సరిచేసుకుని సర్కారు ముందుకు వెళ్లాలి. విలేకరుల సమావేశంలో ఓ రాజకీయ నాయకుడి ప్రసంగాన్ని ప్రచురిస్తే కేసు పెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటికై నా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కూడా ప్రస్తుత ప్రజా ప్రతినిధులు అవినీతిపై వార్తలు వచ్చాయి. అంతమాత్రాన వారిపై కూడా కేసులు పెట్టారా...పెడతారా..?. సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే -
మెడికల్ సీట్లు అమ్మకం సిగ్గుచేటు?
జియ్యమ్మవలస రూరల్: ఆదాయం కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరంచేసి సీట్లు అమ్ముకోవడం సిగ్గుచేటని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. చినమేరంగిలో తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్య, పేద కుటుంబాల్లో విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న సదుద్దేశంతో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారన్నారు. అందులో ఐదు మెడికల్ కళాశాలల పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించగా, మరో రెండు కళాశాలల్లో కూడా తరగతులు కొనసాగుతున్నాయన్నారు. ఇవి ప్రభుత్వానికి కనిపించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర హోం మంత్రి ఎప్పుడో తీసిన చిత్రాలను చూపించి మెడికల్ కళాశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉందని అబద్ధపు మాటలు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, ఘోర కృత్యాలు, లైంగిక వేధింపులపై స్పందించకుండా కళాశాలలపై అబద్ధపు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఆమెకు విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, కడపలో ఉన్న ఏడు వైద్య కళాశాలలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇవి కూటమి నాయకులు చూపిస్తున్న అమరావతి గ్రాఫిక్ చిత్రం కాదని, ఇక్కడ కళాశాలలు ఉన్నా యా? లేదా?, తరగతులు జరుగుతున్నాయా? లేదా? అనేది ఒకసారి కళ్లుతెరచి చూస్తే కనిపిస్తాయన్నారు. మెడికల్ కళాశాలలో సీట్లు సంపాదించి చదివిన వారికి ఆ సీటు విలువేంటో తెలుస్తుందన్నారు. ఎంతో ముందు చూపుతో గత ప్రభుత్వం ఒక్కో వైద్య కళాశాలకు రూ.600 కోట్లు వెచ్చించి మంజూరు చేసిందన్నారు. ఆ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేసేందుకు క్యాబినెట్లో ఆమోదంచేశారంటే పేద, మద్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఉసురు తప్పక తగులుందన్నారు. దీనిపై ఉద్యమం సాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను తానే తెచ్చానని చెబుతుంటే... అదే కేబినేట్లో మంత్రిగా ఉన్న పార్థసారథి గత ప్రభుత్వంలో 15 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని, 7 మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని చెబుతున్నా ఇవేవీ బాబు చెవికి ఎక్కడం లేదని ఎద్దేవా చేశారు. 1923లో విశాఖలో కింగ్జార్జ్ ఆస్పత్రి ఏర్పాటుచేశారని, వందేళ్ల పైబడి సూపర్స్పెషాల్టీ సేవలు అందిస్తోందన్నారు. అదే మాదిరిగా పార్వతీపురంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి 90 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్న జిల్లాకు ఒక సూపర్స్పెషాల్టీ మెడికల్ కళాశాలను మంజూరుచేసే అలోచన ఈ వందేళ్లలో ఏ ఒక్క నాయకుడికి లేదని, అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందన్నారు. అలాంటి మెడికల్ కళాశాలలను నేడు ప్రైవేటీ కరణ చేస్తామంటే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. 2022లో జిల్లాల ఏర్పాటు సమయంలోనే పార్వతీపురానికి మెడికల్ కళాశాల మంజూరు చేసి ఉల్లిభద్ర వద్ద స్థల సేకరణ జరిగిన సంగతిని కూటమి నాయకులు గుర్తుచేసుకోవాలన్నారు. పేద, మద్య తరగతి కుటుంబాలు విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి, ఆ పాపాన్ని ఆపాదించుకోవద్దని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కోట రమేష్నాయుడు, లోలుగు నారాయణరావు, శెట్టి పద్మావతి, సుజాత, సింహాచలంనాయుడు, సత్యంనాయుడు, కళ్యాణ్, రామ కృష్ణ, ఎస్.కె.నిషాన్, తదితరులు పాల్గొన్నారు. పీపీపీ విధానాన్ని రద్దుచేయకుంటే పోరాటం చేస్తాం వైద్యవిద్యను అభ్యసించాలనుకునే పేదకుటుంబాల విద్యార్థులకు ద్రోహం చేయొద్దు మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి -
పది లారీలు సీజ్
కొత్తవలస : పరిమితికి మించి అధిక బరువులను రవాణా చేస్తున్న పది లారీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం ఆధ్వర్యంలో శనివారం సీజ్ చేశారు. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిలో రోడ్డు రవాణ శాఖ అధికారులు, విజిలెన్స్ అదికారులు సంయుక్తగా దాడులు నిర్వహించారు.అధిక బరువుతో రవాణా చేస్తున్న పది లారీలను గుర్తించి సీజ్ చేసి రూ 6.80 లక్షలు జరిమానా విధించారు. సీజ్ చేసిన లారీలను స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. దాడుల్లో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రమేష్కుర్, ఐశ్వర్యలక్ష్మి, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
సులభమైన భాష
హిందీ భాష చాలా సులభతరమైన భాష. నిరుద్యోగులు చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. పది, ఇంటర్ తరువాత హిందీ సబ్జెక్ట్గా తీసుకుని డిగ్రీ చేయడం, తర్వాత హిందీ పండిట్ శిక్షణ పొందడం, గ్రూప్ – 1, 2 వంటి ఉద్యోగులు సంపాదించడం చాలా తేలిక. కె.మధుసూధనరావు, హిందీ ప్రచారక్, రాజాం బాగా కష్టపడితే హిందీ భాషలో చదువుకుని బాగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. పదో తరగతి తరువాత ఇంటి వద్దే ఉండి ఉన్నత చదువులు చదువుకోవాలంటే హిందీ ప్రచార సభలు చాలా ఉపయోగపడుతున్నాయి. బి.ఎల్.నాయుడు, హిందీ భాషోపాధ్యాయులు, రాజాం -
గుడి దొంగల అరెస్టు
పూసపాటిరేగ : మండలంలోని కనిమెల్ల గ్రామంలో దొంగతనం చేసిన నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్ఐ ఐ.దుర్గాప్రసాదు శనివారం తెలిపారు. పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. కనిమెల్ల గ్రామంలోని గుడిలో ఇద్దరు నిందితులు దొంగతనం చేసినట్టు తేలడంతో సొత్తు రికవరీ చేసినట్టు తెలిపారు. పేరాపురం, కోనాడ గ్రామాలలో ఇదే వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షల జరిమానా విజయనగరం క్రైమ్: మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన 85 మంది వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషి యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 85 కేసులు నమోదు చేశారు. అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం 85 మందికి రూ.8.50 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు. 15 నుంచి స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. 15న రాజీవ్ స్టేడియంలో బాక్సింగ్ పోటీలు, కొండవెలగాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెజ్లింగ్ క్రీడాంశంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 16న విజయనగరం విజ్జీ స్టేడియంలో తైక్వాండో, స్కేటింగ్, సైక్లింగ్ పోటీలు, మరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రగ్బీ పోటీలు నిర్వహిస్తామన్నారు. 17న విజయనగరంలో ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ క్రీడాంశంలో, బూర్జ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్చరీ క్రీడాంశంలో ఎంపికలు జరుగుతాయన్నారు. అండర్ – 14, 17 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా రోగి పట్ల రేడియోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన! ● సర్వజన ఆసుపత్రిలో ఘటన ● ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు విజయనగరం ఫోర్ట్: ఎక్సరే కోసం వెళ్లిన ఓ మహిళ పట్ల సర్వజన ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ రేడియోగ్రాఫర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. గజపతినగరం మండలానికి చెందిన ఓ మహిళ ఫైల్స్ వ్యాధితో సర్వజన ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని ఆసుపత్రిలో ఇన్పేషంట్గా చేర్చారు. శనివారం ఎక్సరే తీయించాలని వైద్యులు చీటి రాసి ఇవ్వడంతో అది పట్టుకుని మహిళ ఎక్సరే విభాగానికి వెళ్లింది. ఎక్సరే గదిలోకి వెళ్లిన మహిళ పట్ల ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఓ రేడియాగ్రాఫర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చేసింది. గది బయట ఉన్న తన భర్తకు విషయం చెప్పడంతో సదరు ఉద్యోగిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉద్యోగికి ఆసుపత్రి అధికారులు మెమో జారీ చేసినట్టు తెలిసింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మహిళ ఆత్మహత్య విజయనగరం క్రైమ్ : నగరంలోని వీటీ అగ్రహారం మహిళా ప్రాంగణంలో ఓ మహిళ శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలు... కొత్తవలసకు చెందిన భారతి గుజరాత్కు చెందిన షిండేను వివాహం చేసుకుంది. షిండే మోసగాడని తెలిసి విబేధించి అతనకు దూరంగా ఉంటుంది. ఈ విషయం కొత్తవలస పోలీసులకు తెలిసి ఆమెను విజయనగరంలోని వీటీ అగ్రహారం మహిళా ప్రాంగణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఉన్న హోమ్కు తరలించారు. ఇక్కడ చేరిన తరువాత భారతి శనివారం బాత్రూమ్కని వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. హోం సిబ్బంది అనుమానంతో తలుపు పగలగొట్టి చూడగా బాత్రూమ్లోని కిటికీకి చున్నీతో కట్టి ఆత్మహత్య చేసుకుంది. హోం ఉద్యోగి భవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
విజయనగరం లీగల్: రాజీయే రాజ మార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎం.బబిత అన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్లను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు వృథా కాకూడదన్నారు. జాతీయ లోక్ అదాలత్లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లోని విజయనగరం పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 6852 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. వాటిలో సివిల్ కేసులు 280, క్రిమినల్ కేసులు 6505, ప్రీ లిటిగేషన్ కేసులు 67 పరిష్కరించినట్టు తెలిపారు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 37 లక్షల 50 వేల రూపాయలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, ఫ్యామిలీ కోర్ట్ జడ్జి కె.విజయ కళ్యాణి, బి.అప్పలస్వామి, నాలుగవ శ్రేణి న్యాయమూర్తి, ఎన్.పద్మావతి, మహిళా మరియు ఐదవ జిల్లా న్యాయమూర్తి కె.నాగమణి, ఫోక్స్ న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయమూర్తి ఎ.కృష్ణప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కోర్ట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, ఎక్కువ సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 460 కేసుల రాజీ
పార్వతీపురం టౌన్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 460 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేసినట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. కేసులను రాజీ చేసుకోవడమే ఉత్తమ మార్గమని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమైతే కోర్టుకు మొదట చెల్లించిన రుసుమును కక్షిదారులకు కోర్టు తిరిగి చెల్లిస్తుందన్నారు. లోక్ అదాలత్లో బాధితులకు న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్లో ఎక్కువగా క్రిమినల్ కేసులను రాజీ చేయడం జరిగిందని వివరించారు. సివిల్ కేసులు – 23, క్రిమినల్ కేసులు – 431, మోటారు యాక్సిడెంట్ – 7 కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని పేర్కొన్నా రు. అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్ఫిన్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.చంద్రకుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసరావు లోక్ అదాలత్ సభ్యులు, అధిక సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. -
ప్రజలతో మమేకమవుతా..
సాక్షి, పార్వతీపురం మన్యం: అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన ఆయన శనివారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలపై అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటు.. వెనుకబడిన ప్రాంతమైన మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమాభివృద్ధికి, విద్య, వైద్య రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై త్వరగా పట్టుసాధిస్తానని, ప్రజాప్రతి నిధులు, అధికారులతో కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తానని స్పష్టం చేశారు. గతంలో కంటే మన్యం జిల్లాలో అభివృద్ధి పనులు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకొని దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. సమస్యలను అధ్యయనం చేసి, పరిష్కారానికి కృషిచేస్తా అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలో నడపడమే ధ్యేయం మన్యం జిల్లాకు రావడం ఆనందంగా ఉంది నూతన కలెక్టర్ ప్రభాకర రెడ్డి -
ఐదుగురికి నక్క కాటు
● చివరకు నక్కను చంపేసిన బాధితుడు సంతకవిటి: మండలంలోని అక్కరాపల్లి గ్రామానికి చెందిన ఎమ్.లక్ష్మి, కె.సూరయ్య, వి.లచ్చమ్మ, బూ రాడపేట గ్రామానికి చెందిన బంటుపల్లి చిన్నోడు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామానికి చెందిన కె.జగన్మోహన్లకు నక్క కాటేసింది. వీరు సంతకవిటి పీహెచ్సీకి రావడంతో వేక్సినేషన్ వేసినట్టు వైద్యాధికారి యు. నాగేంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. కె.జగన్మోహన్ రాజాం స్కూటిపై వెళ్తుండగా సంతకవిటి సమీపంలో నక్క దాడి చేసి కాటు వేసింది. అక్కరాపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు సంతకవిటి నుంచి అక్కరాపల్లి వెళ్తుండగా సంతకవిటి సమీపంలోనే అకస్మాత్తుగా దాడి చేసి గాయపరిచింది. నక్కతో పోరాటం బూరాడపేట గ్రామానికి చెందిన బంటుపల్లి చిన్నోడుకు సంతకవిటిలోని భాను ఫిల్లింగ్ స్టేషన్ వద్ద అకస్మాత్తుగా నక్క దాడి చేసి దాదాపు 30 నిమిషాలు కాలును పట్టేయడంతో నక్కపై కూర్చొని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. స్థానికులు కూడా చూసి భయపడి కాసేపట్లో తేరుకుని నక్కను చంపడంతో చిన్నోడుకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం చిన్నోడు పీహెచ్సీకి వెళ్లి వేక్సినేషన్ వేసుకున్నారు. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
● కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పార్వతీపురం టౌన్: ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిసరాలను, వార్డులను పరిశీలించి వైద్యాధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలను జారీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని రోగులు, బాలింతలతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ, సమస్యలపై ఆరా తీశారు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి వార్డులను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం ఏర్పాటు చేయాలని, ఇందుకు ఆసుపత్రిలోనే ఒక క్యాంటీన్ పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పడకలతో పాటు అదనపు పడకలను పెంచడానికి, పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ పనులు నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యపై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ సిజేరియన్ల సంఖ్యను తగ్గించి, సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. సిజేరియన్ రేటు ఎక్కువగా ఉన్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్, డీఎంహెచ్వోలను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి.. షెడ్యూలు కులాల సంక్షేమ బాలికల వసతిగృహాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడి విద్యార్థినులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, విద్యను అందించాలని ఆదేశించారు. ఎల్లవేళల వసతిగృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వారికి రక్తహీనత లేకుండా చూడాలని అన్నారు. పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా. ఎం.వినోద్ కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
తాగిన మైకంలో యువకుడి ఆత్మహత్య
పార్వతీపురం రూరల్/గుమ్మలక్ష్మీపురం: మద్యం తాగి ఆ మైకంలో తనకు తానే పదునైన చాక్తో తోయక చంద్రశేఖర్(32) అనే యువకుడు తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక తాడికొండ పీహెచ్సీకి తరలించారు. ప్రాధమిక వైద్యసేవలు అనంతరం భద్రగిరి సీహెచ్సీకు తరలించి వైద్యుల సూచన మేరకు పార్వతీపురం కేంద్ర ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ మృతి చెందినట్టు పార్వతీపురం కేంద్ర ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టికతోనే వినికిడి, మూగ సమస్యలతో దివ్యాంగుడైన చంద్రశేఖర్ తాగుడుకు బానిస అయ్యాడు. అప్పుడప్పుడు మద్యం మత్తులో మతి భ్రమించినట్టు ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కురుపాం మండలంలోని తెన్నుఖర్జలో తన చెల్లి ఇంటికి వెళ్లి తాగి మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్ను మందలించడంతో తన స్వగ్రామమైన ఎగువతాడికొండకు మూడు రోజుల క్రితం వచ్చి ఎప్పటిలాగే శుక్రవారం మద్యం సేవించి శనివారం వేకువజామున 3గంటల ప్రాంతంలో గొంతుకోసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యసేవలకు తరలించామన్నారు. మృతుడు తల్లితండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా సోదరుడు కిశోర్తో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. ● ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో నాగావళి నదిపై గల వంతెనపై నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో గుర్తు తెలియని ఓ మహిళ దూకి ఆత్మహత్యా యత్నం చేసినట్టు అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నదీ తీరం పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లా పరిధిలో గల రేగిడి ఆమదాలవలసకు అనుసంధానంగా ఉంది. ఈ క్రమంలో రెండు జిల్లాలకు చెందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయంత్రం సమయంలో దాదాపు 30 ఏళ్ల మహిళ వంతెన పైనుంచి ఆత్మహత్యకు పాల్పడే క్రమంలో నదిలో దూకింది. అక్కడకు సమీపంలో ఉన్న కొందరితో పాటు పాలకొండ వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా ఈ ఘటనను గుర్తించారు. ఇటీవల కురుస్తున్న వర్ష ప్రభావంతో నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో క్షణాల వ్యవధిలో ఆ మహిళ నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ పోయినట్టు చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెండు జిల్లాల పోలీసులు, పాలకొండ అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెతుకులాట చేపట్టారు. ఫలితం లేకపోటం, చీకటి పడటంతో అంతా వెనుగిరిగారు. నదిలో దూకిన మహిళ వివరాలు తెలియరాలేదని, ఎటువంటి ఫిర్యాదు అందలేదని, వంతెన వద్ద చెప్పులు మాత్రమే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
సమన్వయంతో పనిచేద్దాం.. ప్రగతి సాధిద్దాం
పార్వతీపురం రూరల్: జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశమందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారుల అనుభవాలు జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని, సూపర్విజన్తో జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేలా అన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రగతిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలు సాధించిన పురోగతిని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు డా.ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత, డిప్యూటీ కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కె.రాబర్ట్పాల్, ఉద్యాన వన శాఖాధికారి వై.క్రాంతికుమార్ పాల్గొన్నారు. బాడంగి: విజయనగరం జిల్లా బాడంగి మండలం కోడూరులో వెలసిన కోడూరుమాత యాత్రోత్సవం శనివారం కనులపండువగా జరిగింది. వేలాదిమంది క్రైస్తవ, క్రైస్తవేతర భక్తులు మరియమ్మను దర్శించుకున్నారు. టెంకాయలు కొట్టారు. తలనీలాలు సమర్పించారు. విశాఖ అగ్రీపీఠాధిపతి బాల, ఫాదర్లు చెప్పిన బైబిల్ వాక్యాలను శ్రద్ధగా విన్నారు. బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సీఐ నారాయణరావు, బాడంగి, రామభద్రాపురం, తెర్లాం ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక పార్వతీపురం రూరల్: కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కలెక్టరేట్ యూనిట్, పార్వతీపురం డివిజన్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వ హించారు. కార్యవర్గ సభ్యులు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల నిర్వాహకులు ఎం.రాజేంద్ర, ఎం.ఎన్.ప్రసాద్ తెలిపారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి, మెంబర్లుగా కలెక్టరేట్ యూనిట్కు సంబంధించి 12 మందిని, పార్వతీపురం డివిజన్కు సంబంధించి 12మందిని ఏకగ్రీంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. కలెక్టరేట్ యూనిట్ కార్యవర్గం ఇదే.. అధక్షుడిగా కె.చంద్రమౌళి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎ.చిన్నారావు, ఉపాధ్యక్షులులుగా ఎం.మంజూస, కె.సుధీర్బాబు, సెక్రటరీగా సీహె చ్ రాజేష్, జాయింట్ సెక్రటరీలుగా కె.సూర్యారావు, బి.మనోజ్కుమార్, బి.శ్రీనివాసరావు, ట్రెజరర్గా టి.వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పి.మోహన్కృష్ణ, కె.సన్యాసిరావు ఎన్నికయ్యారు. పార్వతీపురం డివిజన్ యూనిట్ కార్యవర్గం ఇదే.. అధ్యక్షుడిగా బాలమురళీకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.కిరీటి, ఉపాధ్యక్షులుగా ఎం. జగదీశ్వరరావు, పి.తిరుమలరావు, ఎన్.సునీత, సెక్రటరీగా పి.రమేష్నాయుడు, జాయింట్ సెక్రటరీలుగా జి.శ్రీనివాసరావు, టి.రమేష్, వై.విజయకుమార్, ట్రెజరర్గా ఎం.రాజేంద్ర, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎం.రమణమూర్తి, సీహెచ్ పద్మిని సువర్ణ ఎన్నికయ్యారు. విజయనగరం ఎస్పీగా దామోదర్ విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కొత్త ఎస్పీగా ఎం.ఆర్.దామోదర్ నియామకమయ్యారు. ఈయన 2013 బ్యాచ్కు చెందినవారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. ఆయన 2019లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇంతవరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన వకుల్జింద్ల్కు గుంటూరు జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యింది. -
కూటమి తీరుపై గర్జించిన ఎర్రదండు
● ప్రజల సంపదను పెట్టుబడిదారులకు కట్టబెతున్నారు ● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకొండ: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ఎర్రదండు గర్జించింది. శ్రమ జీవులను దోచుకుని, ప్రజల సంపదను పెట్టుబడి దారులకు కట్టబెడుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు ధ్వజమెత్తారు. పాలకొండలోని ఓ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లా మహసభలను శనివారం ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో నర్సింగరావు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లను మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. విశాఖలోని భూములు పెట్టుబడి దారులకు కట్టబెతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎన్నికల ముందు కథలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడంలేదని ప్రశ్నించారు. కాంట్రాక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ కార్మికుల పొట్టేకొడుతున్న కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు కొనసాగిస్తామని తెలిపారు. కార్మిక వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, సీనియర్ నాయకులు ఎం.తిరుపతిరావు, మన్మథరావు మాట్లాడారు. జిల్లాలోని పలు కార్మిక యూనియన్లకు చెందిన నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అవస్థల ప్రయాణం..!
పార్వతీపురంటౌన్: సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళాసంక్షేమ పథకాలను పక్కన పెట్టి సీ్త్రశక్తి ఉచిత బస్సు అమలు చేసి మమ అనిపించింది. ఆగస్టు 15న సీ్త్రశక్తి పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తున్నప్పటికీ, జిల్లాలో సరిపడా బస్సులు లేకపోయినప్పటికీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని గ్రామాలకు సర్వీసులు నడిపే పరిస్థితి లేకపోయింది. మన్యం జిల్లాలో ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ప్రయాణం అవస్థల ప్రయాణంగా సాగుతోంది. ఆక్యుపెన్సీ లేని కొన్ని గ్రామాలకు, రోడ్డు బాగాలేని కొన్ని గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు రద్దుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మేరకు ట్రిప్లు కుదించారు. జిల్లాపరిధిలోగల సాలూరు, పాలకొండ, పార్వతీపురం డిపోలలో బస్సుల కొరత ఉంది. ఉన్న బస్సుల కండిషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించకుండా ఉచిత బస్సు పథకంతో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే.. జిల్లా వ్యాప్తంగా మూడు డిపోల పరిధిలో 237 బస్సులు ఉంటే అందులో పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కలిపి మొత్తం 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో కేవలం 50 బస్సులు మాత్రమే సాధారణ సర్వీసులు నడుపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గిరిజన, మారుమూల మైదాన ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సులు సరిగ్గా లేక ప్రయాణ అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పథకానికి బస్సులు వేయడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. గంటల తరబడి వేచి చూడాల్సిందే జిల్లాలో మూడు డిపోల పరిధి నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు రహదారులు గుంతలమయం కావడంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడడం, డిపోలకు సమయానికి బస్సులు రాకపోవడం, కాజ్వేలు, వంతెనలు మరమ్మతులకు గురవడం వంటి సమస్యలతో బస్సులు సమయానికి దొరకక వేచిచూడాల్సిన పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. జిల్లాలో బస్సుల సంఖ్యను పెంచి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అటు ప్రయాణికులు, ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. సీట్ల కోసం రోజూ గొడవలే.. అసలే అరకొర బస్సులతో బస్సులకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ అవుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు సీట్లు సరిగా దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా మేము రుమాలు వేశామని ఒకరు..మేము టవల్ వేశామని మరొకరు ఇలా ఒక్కో సాకుతో ప్రతిరోజూ బస్సుల్లో గొడవలు పడుతున్న సందర్భాలు అనేకం. బస్సుల్లో పురుషులు ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. డిపోల నుంచి బయలు దేరిన కొన్ని బస్సుల్లో పురుషులపై మహిళలు దాడికి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి.. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే బస్సుల సంఖ్య పెంచి సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.ఓ వైపు చాలీచాలని బస్సులు..మరో వైపు పాడైపోయిన రహదారులతో సమయానికి రాని బస్సులు..ఇంకో వైపు సీ్త్ర శక్తి పథకానికి కేటాయించిన బస్సుల్లో అధిక రద్దీతో గొడవలు..వెరసి సాధారణ ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేందుకు సతమవుతున్నారు. బస్సుల సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు. అరకొరగా బస్సులు ఉచిత బస్సుల్లో రద్దీ ఇబ్బందులు ఆక్యుపెన్సీ లేదని కొన్ని గ్రామాలకు బస్సుల రద్దు జిల్లాలో మూడు డిపోల పరిధిలో 237 ఆర్టీసీ బస్సులు వాటిలో 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే తీవ్ర ఇక్కట్లు పడుతున్న సాధారణ ప్రయాణికులు -
14న జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడకారుల ఎంపిక పోటీలు ఈనెల 14న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్క్రీడామైదానంలో ఎంపిక పోటీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంపిక పోటీల్లో 2006 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించి, బాలురు 75 కేజీల లోపు, బాలికలు 65 కేజీల లోపు బరువు కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు కృష్ణా జిల్లా గొల్లపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఏపీలో ఉత్తమ రిసార్ట్స్గా సన్రేభోగాపురం: భోగాపురంలోని ఎ.రావివలస సమీపంలో ఉన్న సన్రే విలేజ్ రిసార్ట్స్ ఏపీ ఉత్తమ టీం బేస్ట్ రిసార్ట్గా గుర్తింపు పొందడం సంతోషించ దగ్గ విషయమని మేనేజింగ్ డైరెక్టర్ ఇందుకూరి రాజాబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, భరత్ చేతులమీదుగా ఏపీ ఉత్తమ టీం రిసార్ట్ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ పురస్కారంతో వరుసగా ఏడోసారి గౌరవం దక్కినందుకు సంతోషిస్తున్నానని రాజాబాబు పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఉద్యోగి కృషికి ఆయన అభినందనలు తెలియజేశారు. -
ద్విచక్రవాహనాల నుంచి పెట్రోల్ చోరీ
పార్వతీపురం రూరల్: రాత్రివేళ ఇళ్ల వెలుపల వీధుల్లో ఉంచే ద్విచక్ర వాహనాల నుంచి గుర్తుతెలియని దుండగులు పెట్రోలు దోచేస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనదారులు వెలుపల తమ వాహనాలను ఉంచేందుకు భయాందోళన చెందుతున్నారు. గురువారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని కొత్తవలస ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వెంకట్రావు అనే వ్యక్తి షాపు, ఇంటి ముందు ఉంచిన ద్విచక్రవాహనాల నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి రాత్రి 1:40 గంటల సమయంలో పెట్రోలును గుట్టుచప్పుడు కాకుండా సేకరిస్తున్న దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. శుక్రవారం ఉదయం బయటకు వెళ్లేందుకు వాహనాన్ని తీసే క్రమంలో పెట్రోల్ దొంగిలించినట్లు అనుమానంతో సీసీ కెమెరాలు పరిశీలించి తెలుసుకున్నట్లు తెలిపారు. అలాగే కొత్తవలస పరిసరప్రాంతాల్లో ఇదే తరహాలో ద్విచక్ర వాహనాలనుంచి పెట్రోల్ దొంగిలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తమ వీధుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు పలువురు వాపోతున్నారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు -
అనాథ బాలికలకు 100 సైకిళ్ల పంపిణీ
బాడంగి: విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తల్లితండ్రులు లేని అనాథబాలికలకు సుమారు రూ.4లక్షల విలువైన 100సైకిళ్లను పంపిణీ చేశారు. బాడంగి హైస్కూల్లో హెచ్ఎం సత్యనారాయణ అధ్యక్షతన బొబ్బిలి డిప్యూటీ డీఈఓ మోహన్రావు ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం సైకిళ్లను పంపిణీ చేశారు. బెంగళూరుకు చెందిన వసుధైక కుటుంబం, కేజీబ్రీసంస్థ, కెనరాబ్యాంకువారి సౌజన్యంతో సైకిల్స్ సమకూర్చగా కనీసం పాఠశాలలకు రెండుకిలోమీటర్ల దూరం, 85శాతం మార్కులు సాధించిన అనాథబాలికలకు అందజేశారు. అదేవిధంగా హైస్కూల్లో చదువుతున్న 50 మంది అనాథబాలికలకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున రూ.50వేలు అందజేశారు. కార్యక్రమంలో వీకేపౌండేషన్ ప్రతినిధి ప్రతాప్, కెనరాబ్యాంకు డీజీఎం అనంతపద్మనాభం, రీజనల్మేనేజర్ వినోద్, సీనియర్ మేనేజర్ రాజ్యలక్ష్మి, ఎంఈఓ. లక్ష్మణదొర, జెడ్పీటీసీ పెద్దింటిరామారావు, ఎంపీటీసీ డి.శ్రీనివాస రావు, సర్పంచ్ కండి రమేష్, ఎస్ఎంసీ చైర్మన్ భారతి, మూడు జిల్లాలనుంచి హాజరైన బాలికలు, తల్లిడండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు కొల్లి ఈశ్వరరావు నిర్వహించారు. -
మలేరియా మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య
కురుపాం: మండలంలోని ఏగులవాడ పంచాయతీ ఈతమానుగూడ గిరిజన గ్రామానికి చెందిన మండంగి సూరమ్మి (30) మలేరియా మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కురుపాం ఎస్సై నారాయణరావు అందించిన వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి భర్త మండంగి సురేష్ను భార్య సూరమ్మి మద్యం తాగవద్దని మందంలించగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సూరమ్మి ఇంట్లో ఉన్న 8 మలేరియా మాత్రలను మింగి అపస్మారక స్థితిలోకి జారుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం మొండెంఖల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కోడూరుమాత యాత్రోత్సవం నేడు
బాడంగి: మండలంలోని కోడూరు మరియమాత యాత్రోత్సవం శనివారం జరగనుంది. ఈ యాత్రలో సుమారు 20వేలమంది క్రైస్తవ, ఇతర మతస్తులైన యాత్రికులు పాల్గొనున్నారు. ఈ యాత్రకు సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం డిపోలనుంచి ఆర్టీసీవారు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.ఉదయం నుంచే దివ్యబలిపూజలు నిర్వహించనున్నారు.మూడవపూజకు విశాఖ అగ్రపీఠాధిపతులు హాజరుకానున్నారు.భక్తులు మాతను దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటయ్యాయి. బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, రూరల్ సీఐ నారాయణ రావుతోపాటు ఎస్సై సిబ్బంది శుక్రవారం యాత్ర స్థలాన్ని సందర్శించి యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందో బస్తు ఏర్పాట్లు చేయనున్నారు. ఆర్టీసీబస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వన్వే ట్రాఫిక్ను పాటిస్తూ బాడంగిలోని పిన్నవలస జంక్షన్ వద్ద ప్రవేశించి కోడూరునుంచి రామచంద్రపురం మీదుగా బయటకు వెళ్లనున్నాయి. కాలినడకన పలువురు భక్తులు రానున్నారు. మహిళ మెడలో గొలుసు అపహరణవేపాడ: మండలంలోని నీలకంఠరాజపురం సమీపంలో రైవాడ కాలువ గట్టుపై గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో గొలుసును తెంపుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నీలకంఠరాజపురం గ్రామానికి చెందిన నెక్కల లక్ష్మి తన తల్లితో పశువులకు గడ్డి కోసుకుని వస్తుండగా గ్రామసమీపంలోని రైవాడ కాలువగట్టుపై ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చి వెంకటలక్ష్మి మెడలో గొలుసు తెంపుకుని పారిపోయాడు. దీంతో వెంకటలక్ష్మి వల్లంపూడి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను అరా తీశారు. గుర్తుతెలియని వ్యక్తి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు పోలీసు బృందాలతో విచారణ చేయిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్/తెర్లాం: ఈ ఏడాది ఫిబ్రబరి నెలలో నమోదైన పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు కిరణ్ (36)కు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చారని ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. కేసు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తెర్లాంకు చెందిన ఓ బాలిక (12) నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కంకణాల కిరణ్ వెనక నుంచి వచ్చి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో, దగ్గరలో ఉన్న కొంత మంది వచ్చేసరికి నిందితుడు పారిపోయాడు. ఆ బాలిక ఇంటికెళ్లి కన్నవారికి చెప్పగా బాలిక తల్లి తెర్లాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ బి.సాగర్ బాబు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు నమోదైన 7 నెలల కాలంలోనే ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగా తెర్లాం ఎస్సై బి.సాగర్ బాబు చర్యలు చేపట్టారని ఎస్పీ తెలిపారు. కోర్టులో నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష, బాధితురాలికి పరిహారంగా రూ.25,000 ఇవ్వాలని పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు. 115 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.11.50 లక్షల జరిమానా మద్యం తాగి వాహనాలు నడిపి, పట్టుబడిన 115 మంది వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 115 కేసులు నమోదు చేసి విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా వారందరికీ రూ.11.50 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు. -
గంజాయి రవాణా అరికట్టేందుకు చర్యలు
విశాఖ సిటీ/పార్వతీపురం రూరల్/విజయనగరం క్రైమ్: గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రేంజ్ పరిధిలోని అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో డీఐజీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు రూ.10,04,89,621 స్వాధీనం చేసుకోవడాన్ని అభినందించారు. ఇప్పటి వరకు 1,119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరిచినట్లు చెప్పారు. అలాగే 51 మంది నిందితులపై పీడీ చట్టం, 80 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం అమలుకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది, అలాగే గంజాయితో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మందిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాలు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా 341 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 కేసుల్లో 33 మంది నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. వీరిలో 24 మందికి 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. విశాఖపట్నం రేంజ్ పోలీసులు స్టే సేఫ్, నిదాన్, కాజ్, నాట్ గ్రిడ్ యాప్స్ ద్వారా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో కృషిని అభినందించారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, మహిళ మిస్సింగ్ కేసులపై సమీక్షించారు. ఇటువంటి కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చెప్పారు. రేంజ్ పరిధిలోని శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు. భవిష్యత్తు కోసం తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి -
గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం
● జిల్లా ప్రజా రవాణా అధికారి ● డయల్ యువర్ డీపీటీఓకు 26 వినతులుపార్వతీపురంటౌన్: జిల్లాలోని పల్లెలు, గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రజా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమానికి 26 వినతులు ఫోన్ ద్వారా వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకూ పల్లెలకు, శివారు గ్రామాలకు బస్సు సౌకర్యం అలాగే స్టాపుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
సిరులతల్లి ఉత్సవానికి శ్రీకారం
● ప్రత్యేక అలంకరణలో పైడితల్లి ● చదురుగుడి, వనంగుడిల వద్ద పందిరిరాట ● మండల దీక్షలు చేపట్టిన భక్తులు చదురుగుడి వద్ద పందిరిరాట ఉత్సవంవిజయనగరం టౌన్: సిరులతల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు పందిరిరాటతో శుక్రవారం శ్రీకారంచుట్టారు. ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష నేతృత్వంలో వేకువజామునుంచి అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. ముహూర్తం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి వద్ద, ఉదయం 10.30 గంటలకు రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి వద్ద పందిరిరాట ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదురుగుడి వద్ద నిర్వహించిన పందిరిరాట కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఆమెకు అర్చకులు వేదాశీస్సులు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పైడితల్లి ఆలయ విస్తరణ పనులను ఈ ఏడాది పండగ పూర్తయిన తర్వాత రూ.కోటి 80లక్షల ఖర్చుతో పూర్తిచేస్తామన్నారు. అమ్మవారి పండగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. పందిరిరాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ పూజారులు, అధికారులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి మండల దీక్షలు ప్రారంభం పైడితల్లి అమ్మవారి పందిరిరాట మహోత్సవం రోజున ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష ఆధ్వర్యంలో అమ్మవారి దీక్షాపరులు మండల దీక్షలను సన్నిధానంలో తీసుకున్నారు. దీక్షధారులకు దీక్షావస్త్రాలను ఈఓ అందజేశారు. కార్యక్రమంలో పైడిమాంబ దీక్షాపీఠం వ్యవస్థాపకులు ఆర్.సూర్యపాత్రో, ఎస్.అచ్చిరెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
అడ్డాకుల గూడలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని అడ్డాకుల గూడలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు శుక్రవారం ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ‘అడ్డాకులగూడను వణికిస్తున్న కిడ్నీ భూతం’ శీర్షికన జూలై 24న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైద్య, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అదే నెల 25న గ్రామాన్ని సందర్శించారు. వైద్య తనిఖీలతో పాటు నీటి పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆస్పత్రికి చెందిన నెఫ్రాలిజిస్ట్ డాక్టర్ గిరి, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి, కుశిమి పీహెచ్సీ వైద్యాధికారి చాందినిలతో కూడిన వైద్యబృందం వైద్యశిబిరం నిర్వహించి రక్తపరీక్షలు చేశారు. వీరిలో కిడ్నీవ్యాధితో బాధపడుతున్న 8 మందిని గుర్తించి శనివారం ప్రత్యేక వాహనంలో జెమ్స్కు తరలిస్తామని వైద్యాధికారి చాందిని తెలిపారు. అక్కడ ఉచితంగా కిడ్నీ పరీక్షలు చేయనున్నారు. వ్యాధి నిర్ధారణ అనంతరం ప్రత్యేక వైద్యసేవలు అందిస్తామని వైద్యాధికారులు చెప్పారు. జెమ్స్ నెఫ్రాలిజిస్టులతో వైద్య పరీక్షలు 8 మంది రోగుల గుర్తింపు ఉచిత వైద్యసేవల కోసం జెమ్స్కు తరలింపు -
రూ.4 వేల పారితోషికం.. నెలల తరబడి పెండింగ్..!
పార్వతీపురంటౌన్: వారంతా ఎండ, వానను లెక్కచేయకుండా మారుమూల గిరిశిఖర, గిరిజన ప్రాంతంలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యకార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో కీలకభూమిక పోషిస్తున్నారు. వీరి సేవలకు ప్రభుత్వం కేవలం నెలకు రూ.4వేలు పారితోషికం అందజేస్తోంది. అదికూడా నెలల తరబడి అందజేయకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్నారు. సేవలు ఇలా.. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1190 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 375 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. వారంతా ఆశ వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు పెంచలేదు. కనీసం ఆశవర్కర్లుగా మార్పుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదు. ● సీహెచ్ డబ్ల్యూలను ఆశ వర్కర్లుగా మార్పు చేయాలి. ● పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో నాలుగు నెలల పారితోషికం బకాయిలను వెంటనే చెల్లించాలి. ● యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ● సీహెచ్డబ్ల్యూలకు అధికార్లతో జూయింట్ మీంటింగ్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి. ● ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ● 2018 సంవత్సరం కాలంలో 970 మందికి అందజేయాల్సిన 21 నెలలు పారితోషికాన్ని తక్షణమే చెల్లించాలి. అన్నవరం పీహెచ్సీ పరిధిలో గత పదేళ్లుగా కమ్యూ నిటీ హెల్త్ వర్కర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. గిరిశిఖర గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆశ వర్కర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా పారితో షికం పెంచడంలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – ఆరిక భూలక్ష్మి, సీహెచ్డబ్ల్యూ, అన్నవరం ప్రభుత్వ పాలకులు స్పందించాలి. రూ.4వేలుతో ఎలా బతకగలమో గుర్తించాలి. పెరిగిన ధరలు, కుటుంబాల అవసరాలకు పారితోషికం సరిపోవడం లేదు. ఆశ వర్కర్లుగా గుర్తించి వేతనం పెంచాలి. – తోయక భాగ్యలక్ష్మి, సీహెచ్డబ్ల్యూ, వాడబాయి సీహెచ్డబ్ల్యూఓలకు పారితోషికం బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఆశ వర్కర్లుగా మార్పుచేయాలి. ప్రజాసంక్షేమ పథకాలు అందజేయాలి. లేదంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం. – గొర్లి వెంకటరమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి, పార్వతీపురం ఆర్థిక ఇబ్బందుల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశవర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ జిల్లా వ్యాప్తంగా 1565 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు -
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరించడం తగదు. ఓ నాయకుడి ప్రెస్మీట్ వార్తను యథాతథంగా ప్రచురించినా కేసులు పెట్టడం విచాకరం. పోలీస్ వ్యవస్థలో పదోన్నతుల విషయంలో జరిగిన అక్రమాలపై వార్తను ప్రచురించిన ‘సాక్షి’పై కక్ష కట్టడం ఎంతవరకు సమంజసం. ఎడిటర్, బ్యూరో ఇన్చార్జిలపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో వేధించడం సరి కాదు. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వమూ చేపట్టని తీరు ఇది. పత్రికా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం సంకెళ్లువేయాలని చూస్తోంది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల్లో అభ్యంతరాలుంటే తెలియజేయాలే తప్ప పోలీస్ కేసులు పెట్టడం సరికాదు. – బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ -
కొలిక్కి వచ్చిన భూ సమస్య
వీరఘట్టం/జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చినగోర రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 17లో ఉన్న 20 ఎకరాల భూ సమస్యకు శుక్రవారం రెవెన్యూ, పోలీస్ అధికారులు శాశ్వత పరిష్కారం చూపారు. ఆక్రమణకు గురైన సుమారు 20 ఎకరాల భూమి వీరఘట్టం మండలం చినగోర రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే నంబర్ 17లో ఉన్న 151 ఎకరాల భూమిని 18 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం వీరఘట్టం మండలం సంతనర్సిపురంలో ఉన్న భూమిలేని పేదలకు ఎకరా చొప్పున కేటాయించింది. అందరికీ డీ పట్టాలు ఇచ్చింది. అయితే, భూమి అప్పగించలేదు. చినగోర రెవెన్యూ గ్రామానికి పక్కనే ఉన్న జియ్యమ్మమవలస మండలం గడసింగుపురం, ఏనుగులగూడకు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిలో సుమారు 20 ఎకరాలను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. ఈ భూమిపై హక్కు కల్పించాలని జియ్యమ్మవలస మండలాలనికి చెందిన వారు కూడా అధికారులపై ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో సంత–నర్శిపురం లబ్ధిదారులకు, భూములు సాగు చేస్తున్న జియ్యమ్మవలస మండలానికి చెందిన వారికి కొన్నేళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ భూమిని వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల తహసీల్దార్లు ఎ.ఎస్.కామేశ్వరరావు వై.జయలక్ష్మి, సర్వే అధికారులు చినమేరంగి సీఐ టి.తిరుపతిరావు, వీరఘట్టం, జియ్యమ్మవలస ఎస్ఐలు జి.కళాధర్, ప్రశాంత్కుమార్ల సమక్షంలో పరిశీలించారు. ప్రస్తుతం జియ్యమ్మవలస మండలం వారు సాగుచేస్తున్న 20 ఎకరాల భూములు వీరఘట్టం మండలంలో ఉన్నట్లు గుర్తించారు. సోమవారం నాటికి ఈ భూములను లబ్ధిదారులకు అప్పగిస్తామని స్పష్టంచేశారు. -
వామ్మో.. విషసర్పాలు!
● మన్యం ప్రజలకు పాముల భయం ● కొద్దినెలల్లో 85 మందికి పాముకాటు పార్వతీపురం రూరల్: ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను పాముల భయం వెంటాడుతోంది. కలుపుతీత పనులు, ఎరువులు జల్లేందుకు ఏమరుపాటుగా వెళ్లిన రైతులు పాము కాటుకుగురవుతున్నారు. పాములకు చెవులు లేనప్పటికీ వాటి శరీరం కింద భాగంలో ఉండే ప్రత్యేక పొలుసు ద్వారా శబ్ధ ప్రకంపనలను గ్రహిస్తాయి. వేడి రక్తం ప్రవహించే జంతువులు, మనుషులు సమీపంలోకి వచ్చినప్పుడు అవి వెంటనే వాటిని గుర్తించి కాటు వేస్తాయి. పాములు ఏకాంతానికి భంగం కలిగినప్పుడు, ప్రాణభయం ఉన్నప్పుడు, ఎవరైనా అకస్మాత్తుగా తొక్కినప్పుడు మాత్రమే అవి కాటు వేస్తాయని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి.. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో తిరిగే వారితో పాటు పొలాల దగ్గర నిద్రించే రైతులు, కూలీలు జాగ్రత్తలు పాటించాలి. పాములు కిరోసిన్, పెట్రోలు, డీజిల్ వాసన భరించలేవు. ఎక్కువగా ఉన్నచోట వీటిని ఉపయోగించడం మంచిది. రైతులు, కూలీలు రాత్రి వేళల్లో తిరిగే సమయంలో మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు వేసుకోవడం ఉత్తమం. పాము కాటుకు గురైన వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రికి వస్తే యాంటీ స్నేక్వీనం మందు ఎక్కిస్తాం. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ యాంటీ స్నేక్ వీనం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కాటువేసిన పామును గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. పాము విషపూరితమా?కాదా? అన్నది నిర్ధారణ చేయొచ్చు. – డాక్టర్ పి.రవికుమార్, సివిల్ సర్జిన్, జిల్లా కేంద్రాస్పత్రి పాము కాటు వేసిన పై భాగంలో వెంటనే రక్త ప్రసరణ జరగకుండా తాడుతో గట్టిగా కట్టాలి. కాటు వేసిన శరీర భాగంలో బ్లేడుతో గాయంచేసి రక్తం కారనివ్వాలి. పాము కాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండాలి. పక్కన వ్యక్తి ఉంటే బాధితుడికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాలి. కాటువేసిన పాము అంతకు ముందు ఆహారం తీసుకున్నా.. మరో జీవికి కాటు వేసినా విషం తీవ్రత తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పాము కాటువేసిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోను ఆహారం ఇవ్వకూడదు. నడిపించడంతో పాటు పరుగెత్తించకూడదు. నాటు మందు, మాత్రలు అని కాలయాపన చేయకుండా వెంటనే దగ్గర్లోని వైద్యశాలకు తరలించాలి. పాము కాటుకు గురైన వ్యక్తిని నిద్ర పోకుండా చూసుకుని, కదలించకుండా ఆస్పత్రిలో చేర్చాలి. -
కూటమి తీరుపై గురువుల నిరసన
డిమాండ్లు పరిష్కరించాలంటూ సాలూరు డబ్బివీధి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల నిరసన కూటమి ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలపై ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువులు గురువారం నిరసన తెలిపారు. వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా తొలిరోజు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తక్షణమే పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ విధానం రద్దుచేయాలని, 57 మెమోను అమలుచేయాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలంటూ డిమాండ్ చేశారు. మధ్యాహ్నభోజన విరామ సమయంలో పాఠశాలల ముందు ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్దస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. –పాలకొండ/కురుపాం/సాలూరు -
సర్వేల భారం!
పార్వతీపురం టౌన్: ప్రభుత్వం మారింది. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ సేవల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బండెడు చాకిరీ చేయాల్సిన పరిస్థితి ఉందంటూ సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఇటు శాఖాపరమైన విధులు, అటు సచివాలయ విధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, వివిధ రకాల ప్రభుత్వ సర్వేలతో సతమతం అవుతున్నామంటూ వాపోతున్నారు. అధిక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వివక్ష తగదు... సచివాలయ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందన్నది సంఘ నాయకుల వాదన. ఏడాదిన్నరలో ప్రభుత్వ పరిధిలో కొందరు సీనియర్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వివక్ష చూపుతున్నారు. గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఎక్కడ ఏ పని ఉన్నా సచివాలయ ఉద్యోగులకే అప్పగిస్తున్నారు. పండగలు, సెలవుల సమయంలో కూడా వివిధ సర్వేల పేరుతో ఒత్తిడికి గురిచేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శికి కార్యదర్శి విధులతో పాటు ఇతర అనుబంధ ఉద్యోగులైన వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వీఆర్ఓ, మహిళా పోలీస్లకు వారి శాఖాపరమైన విధులతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలు, సర్వేలు, ప్రభుత్వ కార్యక్రమాల పనులను అప్పగిస్తున్నారు. ఈ పనులతో తీవ్ర గందరగోళం, ఒత్తిడికి గురవుతున్నామని, మరోవైపు స్పెషల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటి డిమాండ్లను పరిష్కరించడం లేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు సర్వేలకు స్వచ్ఛందంగానే హాజరవుతున్నారు. ఉద్యోగులు ఇబ్బందులకు గురికాకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేలకు పంపుతున్నాం. – రామచంద్రరావు, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి పార్వతీపురం మన్యం పని ఒత్తిడితో సతమతం నిర్ధిష్టమైన జాబ్చార్ట్ లేకపోవడంతో ఇబ్బందులు మాతృశాఖలో చేర్చాలంటున్న ఉద్యోగులు ఇంక్రిమెంట్లు లేకపోవడంతో ఆందోళన పీ–4 సర్వే చేయలేమంటూ నిరసన -
కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా ఎన్.ప్రభాకర్ రెడ్డిని నియమించింది. ఆయన ప్రస్తుతం సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో సహాయ కమిషనర్గా, స్పోర్ట్స్ అథారిటీ నిర్వహణ డైరెక్టర్గా, నెల్లూరు సంయుక్త కలెక్టర్గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా బదిలీ కావడం సంతోషంగా ఉందని, జిల్లా అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానన్నారు. కొద్దిరోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఎ.శ్యామ్ప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. జేసీగా యశ్వంత్కుమార్ రెడ్డి బాధ్యతల స్వీకరణ పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్గా సి.యశ్వంత్ కుమార్రెడ్డి గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు డీఆర్ఓ కె.హేమలత పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం రెవెన్యూ సేవలకు సంబంధించిన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న పలు విభాగాల అధికారులు, సిబ్బంది జేసీకి పుష్పగుచ్ఛాలు అందజేశారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు సంబంధించిన కరపత్రాలను అధికారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన యశ్వంత్కుమార్ రెడ్డి ఇటీవల పాలకొండ సబ్కలెక్టర్గా, సీతంపేట ఐటీడీఏ పీఓగా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీ అయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులతో జేసీగా వచ్చారు. ఐటీడీఏ పీఓగా పూర్తి అదనపు బాధ్యతలు యశ్వంత్ కుమార్రెడ్డి జేసీగా, పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పార్వతీపురం సబ్కలెక్టర్ ఆర్.వైశాలి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛం అందజేశారు. నేడు డయల్ యువర్ డీపీటీఓ పార్వతీపురంటౌన్: జిల్లా పరిధిలోని ప్రజారవాణా సమస్యలను తెలియజేసేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా ప్రజా రవాణాశాఖాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ 12వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజా రవాణాలో తమ సమస్యలు, సలహాలు, సూచనలు చేయాలనుకునే వారు సెల్: 99592 25605 నంబర్కు ఫోన్చేసి తెలియజేయాలని కోరారు. కోడూరు మరియమాత యాత్రకు సర్వం సిద్ధం బాడంగి: కోడూరు మరియమాత యాత్రకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 13న జరగనున్న దివ్యబలిపూజలు, ప్రార్థనలకు వీలుగా టెంట్లు, వరుస క్రమంలో వెళ్లి మాతను దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. తలనీలాలు సమర్పించుకునే భక్తుల కోసం ఆర్సీఎం పాఠశాల భవనం వద్ద ప్రత్యేక కాంప్లెక్స్ను నిర్మించారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుచ్చి అప్పారావు జలాశయం నీరు విడుదల గంట్యాడ: గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నీటి మట్టం పెరుగడంతో జలాశయం నుంచి గురువారం రాత్రి నీటిని విడుదల చేశారు. జలాశయం నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 295.500కు చేరింది. జలాశయం నుంచి 100 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదలచేశారు. -
చెరువుకు గండికొట్టి మా పొట్ట కొట్టారు..
● టీడీపీ నేతల అండతో జేసీబీతో చెరువుకు గండి ● వైఎస్సార్సీపీ సానుభూతిపరులమనే కక్ష గజపతినగరం : పిడిశీల గ్రామానికి చెందిన తాము పుష్కర కాలంగా చెరువు ద్వారా పంట పొలాలకు సాగునీరు వాడుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే తాము వైఎస్సార్సీపీ సానుభూతిపరులమనే కక్షతో టీడీపీ నేతల అండతో చెరువులకు జేసీబీతో గండికొట్టి తమ పొట్ట కొట్టారని సర్పంచ్ పాండ్రంకి సూర్యమాధవి గురువారం తెలిపారు. గతంలో ఓ వ్యక్తికి చెరువు లీజుకు ఇవ్వడంతో ఇందులో చికెన్ వ్యర్థాలు వేసి హాని తలపెట్టడంతో గత జూలై నెలలో గ్రీవెన్స్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీ చేసి తాత్కాలికంగా చెరువు లైసెన్స్ అధికారులు నిలుపు చేశారని పేర్కొన్నారు. తరువాత చెరువులను క్లోరినేషన్ చేయించి మళ్లీ రీఓపెనింగ్ పెట్టుకోవాలని సూచించారని తెలిపారు. దీనికి ఫిషరీస్కు సంబంధించి పర్మినెంట్ లైసెన్సు ఉండడంతో దాన్ని గ్రీవెన్స్లో పెట్టామని పేర్కొన్నారు. తరువాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ కొన్ని సూచనలు చేసి సంతకాలతో కూడిన స్టేట్మెంట్ను తీసుకున్నారని తెలిపారు. తరువాత చెరువు వినియోగానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇంతలో టీడీపీ మంత్రి జోక్యం చేసుకుని కలెక్టర్ ద్వారా ఏడాది పాటు చెరువులను తెరవకుండా లైసెన్స్ను నిలిపివేశారని పేర్కొన్నారు. చివరకు మంత్రి ఆదేశాలతో రాజకీయ కక్షతో చెరువును జేసీబీతో తవ్వేశారని పాండ్రంకి సూర్యప్రకాష్ దంపతులు విలేకరుల వద్ద తమ గోడు వెలిబుచ్చారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో రెవెన్యూ, ఫిషరీస్, పోలీసు అధికారులు మూకుమ్మడిగా వచ్చి తమ చెరువు ఖాళీ చేయించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారుల వద్ద సాక్షి ప్రస్తావించగా చెరువు లైసెన్స్ తాత్కాలికంగా నిలుపుదల చేశామని, క్లియరెన్స్ చేసుకుంటే మళ్లీ అనుమతులు ఇస్తామని తెలిపారు. -
పైడితల్లి పండగకు నేడు పందిరిరాట
● వనంగుడి, చదురుగుడిల వద్ద ప్రత్యేక పూజలు ● మండల దీక్షలు ప్రారంభం విజయనగరం టౌన్: సిరులతల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు శుక్రవారం పందిరి రాట మహోత్సవంతో అర్చకులు, ఆలయ అధికారులు అంకురార్పణ చేయనున్నారు. చదురుగుడి, వనంగుడి వద్ద పందిరిరాట వేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. పైడితల్లి అమ్మవారి మండల దీక్షలను భక్తులు స్వీకరించనున్నారు. ఈ అపురూపమైన ఘట్టాలను తిలకించేందుకు భక్తులు తరలిరానున్నారు. మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి ఆలయ ఆవరణలో భాద్రపద బహుళ పంచమిని పురస్కరించుకుని ఉదయం మండల దీక్షలు ప్రారంభిస్తారు. 9.30 గంటలకు పందిరి రాట వేయనున్నారు. వనంగుడి వద్ద 11 గంటలకు ముహూర్తం ప్రకారం పందిరి రాట, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూజా కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష మాట్లాడుతూ అక్టోబర్ 6న సోమవారం తొలేళ్ల మహోత్సవం, అక్టోబర్ 7న మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులందరి సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేదిశాగా సాగుతున్నామన్నారు. అక్టోబర్ 14న మంగళవారం తెప్పోత్సవం, 19న ఆదివారం కలశ జ్యోతి ఊరేగింపు, 21న ఉయ్యాలకంబాల మహోత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతి వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. చండీహోమం, పూర్ణాహుతితో ఉత్సవాలు పూర్తవుతాయని పేర్కొన్నారు. భక్తులందరూ నెలరోజుల పాటు నిర్వహించే పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ప్రతీరోజూ పర్వదినమేనని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. -
13, 14 తేదీల్లో జేవీవీ రాష్ట్ర మహాసభలు
చికెన్విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న జన విజ్ఞాన వేదిక (జేవీవీ) 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, నాయకులు వి.రాజ్గోపాల్, చీకటి దివాకర్, జి.నిర్మల పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం పేర్కొన్న శాసీ్త్రయ దృక్పథాన్ని ప్రజల్లో నాటేందుకు జేవీవీ కృషి చేస్తోందని చెప్పారు. మహాసభ ప్రారంభ సమావేశానికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెవీవీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్, చెకుముకి పత్రిక పూర్వ సంపాదకులు ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య, పూర్వ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
● స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలకు స్పందన ● ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్బాల్ జట్ల ఎంపిక పూర్తి విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని మూడు ప్రాంతాల్లో ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, పుట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహించగా... వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. హాజరైన క్రీడాకారులకు అండర్ – 14, 17 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. నగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన ఫుట్బాల్ జట్ల ఎంపికలకు 500 మంది క్రీడాకారులు హాజరుకాగా... పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 72 మంది క్రీడాకారులు బాల, బాలికల విభాగాల్లో జిల్లా జట్లకు ఎంపికయ్యారు. విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఫెన్సింగ్ పోటీలకు 120 మంది క్రీడాకారులు హాజరుకాగా.. 48 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు. అండర్ – 17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 16 మంది క్రీడాకారులు అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో రాష్ట్ర స్థాయిలో జరగబోయే స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి పాత్రినిధ్యం వహించనున్నట్టు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మి తెలిపారు. ఎంపిక పోటీలను వ్యాయామ అధ్యాపకులు బంగార్రాజు, పివిఎస్ఎన్.రాజు, సౌదామణి, మాధవ్, ఆదిలక్ష్మి, నాయుడు, శ్రీనివాసరావు, తిరుపతిరావు, శివకుమార్, అనురాధ తదితరులు పర్యవేక్షించారు. -
మందుగుండు నిల్వలు సీజ్
కొమరాడ: మండలంలోని శివిని గ్రామ సమీపంలో దీపావళి మందుగుండు సామాగ్రి అక్రమ నిల్వలు గురువారం పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ కె.నీలకంఠం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివిని గ్రామానికి చెందిన సేనాపతి రాజేష్ రానున్న దసరా, దీపావళి పండగలు నేపథ్యంలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వలు ఉంచారు. తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి ఈ సామగ్రి తీసుకుని వచ్చి అనుమతులు లేకుండా భద్రపరిచారు. దీనిపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేశాం. రూ.2లక్షల విలువ గల మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకుని పోలీస్ష్టేషన్కు తరలించాం. రాజేష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
పార్వతీపురం రూరల్: నవోదయం 2.0 కింద సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారిణి కె.హేమలత అన్నారు. సంబంధిత శాఖాపరమైన అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో తనిఖీలను మరింత విస్తృతం చేయాలన్నారు. సారా తయారీ, విక్రయాలపై పీడీ యాక్ట్లను పటిష్టంగా అమలు చేయాలన్నారు. నవోదయం 2.0తో సారా తయారీ దారుల్లో మార్పు రావాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి డీఆర్డీఏ ద్వారా చేయూతను అందించి వారిలో మార్పు తేవాలన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎకై ్సజ్ అధికారులు మాట్లాడుతూ 137 గ్రామాలను జిల్లాలో ఏ, బీ, సీలుగా వర్గీకరించి సదరు గ్రామాలకు దత్తత అధికారులను నియమించి సారా సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్ఫ్రీ నంబరు 14405 పై ప్రచారం చేస్తున్నామన్నారు. అవగాహన మేరకు పలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. గత నాలుగు నెలల్లో 22 కేసులు పెట్టి 337మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 9090 లీటర్ల సారాను, 35,740 లీటర్ల పులియబెట్టిన నల్లబెల్లాన్ని ధ్వంసం చేసినట్టు లిపారు. 38 వాహనాలను కూడా సీజ్ చేశామన్నారు. ఏవోబీ ప్రాంతాల సమీప గ్రామాల్లో చెక్పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఆర్.కృష్ణవేణి, ఎకై ్సజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డీఆర్వో కె.హేమలత -
16 నుంచి రామతీర్థంలో పవిత్రోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని దేవస్థాన ఈవో వై.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పవిత్రోత్సవాలకు అంకురారోపణం చేస్తామన్నారు. 17న మంగళాశాసనం, తీర్థ గోష్ఠి, యాగశాలలో ప్రత్యేక హోమాలు జరుగుతాయన్నారు. అదే రోజు మధ్యాహ్నం అకల్మష హోమాలు, పవిత్ర శుద్ధి ఉంటుందని, 18న పారయణాలు, జపములు, హవనాలు, అష్టకలశ స్నపన మహోత్సవం జరిపించి శ్రీరామచంద్రస్వామికి అర్చకులు పవిత్ర సమర్పణ చేస్తారన్నారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రారంభమైన కళా ఉత్సవ్ పోటీలు నెల్లిమర్ల: స్థానిక వేణుగోపాలపురంలో ప్రభుత్వ డైట్ కళాశాలలో కళా ఉత్సవ్–2025 జిల్లా స్థాయి పోటీలు గురువారం సందడిగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలిరోజు నృత్యం, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం తదితర అంశాలపై వ్యక్తిగత, బృంద పోటీలు నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ప్రిన్సిపాల్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి వున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళాఉత్సవ్ పోటీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. కా ర్యక్రమంలో శ్రీనివాసరావు,ఉ త్సవాల నోడల్ అధికారి వి.చిన్నంనాయుడు, అధ్యాపకులు కాళ్ల అప్పారావు, సూరిబాబు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, మురళి తదితరులు పాల్గొన్నారు. ● పీఎంపీ వైద్యుడి నిర్వాకం ● ఆందోళనకు దిగిన బంధువులు భామిని: మండలంలోని ఘనసర గ్రామానికి చెందిన కిల్లారి తేజాలు(58) కొత్తూరుకు చెందిన శ్రీసాయి ప్రజావైద్యశాలలో వైద్యానికి వెళ్లి మృతి చెందింది. తేజాలు మృతికి పీఎంపీ వైద్యుడు వై.నాగేశ్వరరావు నిర్లక్ష్యమే కారణమని బంధువులు ప్రజా వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. చివరకు కొత్తూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు మృతురాలి బంధువులకు నచ్చజెప్పి మృతదేహాన్ని తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఘనసర గ్రామానికి చెందిన తేజాలు కాళ్లు, చేతులు పీకుతున్నాయని భర్త తవిటినాయుడుతో కలిసి కొత్తూరులోని శ్రీసాయి ప్రజా వైద్యశాలకు గురువారం వెళ్లింది. అక్కడ పీఎంపీ వైద్యుడు నాగేశ్వరరావు రెండు ఇంజక్షన్లు వేసే సమయానికి తేజాలు అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందిందని భర్త తెలిపాడు. విషయం తెలుసుకున్న తేజాలు బంధులు ప్రజా వైద్యశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కొత్తూరు ఎస్ఐ అక్కడకు చేరుకొని మృతురాలి బంధువులను శాంతింపజేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. -
హోటల్ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం..
● ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు విజయనగరం: రాష్ట్రంలో హోటల్ అసోసియేషన్ రంగాన్ని రానున్న కాలంలో మరింత బలోపేతం చేస్తామని, హోటల్ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని మెట్రో కన్వెన్షన్లో గురువారం జరిగిన ఏపీహెచ్ఏ రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షునిగా విజయనగరం పట్టణానికి జి.శ్రీనివాసరావు, కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు చెందిన కలమెడి రమణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన ఎదపాటి కొండయ్య, కోశాధికారిగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన బైల లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల పరిశీలకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం రాష్ట్రంలో హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే హోటల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. హోటల్ రంగం ఒక ఇండస్ట్రీగా పని చేస్తుందన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే హోటల్ రంగం నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు పర్యాటకంగా అనేక సేవలను అందించడం జరుగుతుందన్నారు. త్వరలోనే అసోసియేషన్ తరఫున ప్రభుత్వ పెద్దలను కలిసి మా యొక్క సమస్యలను విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, హోటల్స్ యజమానులు పాల్గొన్నారు. -
మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు : డీఎంహెచ్వో
విజయనగరం ఫోర్ట్: మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం మాతృ, శిశు మరణాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రక్తహీనత ఉన్న గర్భిణులకు ఐరన్ మాత్రలు అందించాలన్నారు. రక్తం అవసరమైన వారికి రక్తం ఎక్కించాలని తెలిపారు. ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్ధాలు ప్రతీ రోజు భోజనంలో ఉండేటట్టు చూడాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే ఆసుపత్రిలో చేర్పించి ప్రసవం అయ్యే వరకు పర్యవేక్షణ చేయాలన్నారు. మాతృ, శిశు మరణాలు పునరావృతం అయితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి.శ్రీనివాస్, డాక్టర్ సుజాత, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్
సాలూరు:ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సంపూర్ణంగా అమలుచేయకుండా మరోసారి ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో గురువారం మాట్లాడారు. 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. పింఛన్ తీసుకున్న భర్త చనిపోతే భార్యకు స్పౌజ్ పింఛన్ ఇస్తున్నారే తప్ప కొత్త పింఛన్ ఒక్కటి కూడా మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు. కూటమి పాలనా వైఫల్యానికి ఇదొక నిదర్శనమన్నారు. అరకొర బస్సులు ఉండడం వల్ల ఉచిత బస్సు పథకం మహిళలకు అక్కరకు రాలేదన్నారు. వైఎస్సార్సీపీ పోరుబాటతోనే సీ్త్రశక్తి పథకాన్ని అమలుచేశారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి సుమారు కోటి 50లక్షల మందిని మోసం చేశారన్నారు. రాష్ట్రంలో 8లక్షల ఉద్యోగాలంటూ యాడ్లు ఇస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డ నిఽధి ఇచ్చారా? 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారన్నారు. సుమారు కోటి 50 లక్షల మందికి ఆడబిడ్డ నిధి అందజేయకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆటో, ట్యాక్సీ, లారి డ్రైవర్లకు కూడా వాహనమిత్ర కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు లబ్ధిచేకూర్చలేదని విమర్శించారు. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు పూర్తిస్థాయిలో అమలుకాలేదని, ఇప్పటికీ చాలామంది లబ్ధిదారులు పథక లబ్ధికోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధిచెబుతారన్నారు. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలుచేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీల అమలు ఊసేలేదు కనీసం రైతుకు కావాల్సిన యూరియా అందించలేని దుస్థితి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
దోపిడీకి అడ్డాగా వారపు సంతలు
● తూనికల్లో వ్యత్యాసం ● కల్తీ సరుకులదే రాజ్యం ● సంతల ద్వారానే ఏజెన్సీలకు ఖైనీ, గుట్కా సరఫరా ● మోసపోతున్న గిరిజనం కురుపాం: ఏజెన్సీలో వ్యాపారుల దోపిడీకి అడ్డాగా వారపు సంతలు నిలుస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జరుగుతున్న వారపు సంతల్లో కల్తీ సరుకులు రాజ్యమేలుతున్నాయి. నిత్యావసర సరుకులైన పప్పులు, నూనెలు, కారం, పసుపు, సబ్బులు, వంట దినుసులు సైతం కల్తీలే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ప్రతీ గురువారం కురుపాం మండల కేంద్రంలో జరిగే వారపు సంతకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ ఒక్క రోజే ఈ సంతలో రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ వారపు సంతపైనే నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన గిరిజనులు ఆధార పడుతుంటారు. గిరిజనులు పండించే ఫల సాయాలను వారపు సంతకు తెచ్చి వస్తు మార్పిడి ద్వారాగానీ, విక్రయించగా వచ్చిన డబ్బులతో తమకు అవసరమైన నిత్యావసర సరుకులను స్థానికంగా ఉన్న వ్యాపారుల వద్ద, వారపు సంతలో కొనుగోలు చేస్తారు. దోపిడీకి అడ్డాగా.. కురుపాం నియోజకవర్గంలో ఉన్న గిరిజన మండలాల్లో ప్రతీ వారం వారపు సంతలు నిర్వహిస్తున్నప్పటికీ వీటన్నిటిలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రాల్లో జరిగే వారపు సంతల్లోనే రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ వారపు సంతల్లో వ్యాపారుల తూకంలో భారీ వ్యత్యాసం కూడా ఉంటుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చిన నుంచి మరింత దోపిడీ ఎక్కువైందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ కాటాల్లో వ్యాపారులు చేతివాటం (మైనస్ నంబర్ ఫీడింగ్) వలన గిరిజనులు మోసానికి గురవుతున్నారు. గిరిజన రైతులు తెచ్చే అల్లం, పసుపు, చిరుధాన్యాలు, కాయగూరలు, చింతపండు వంటి వస్తువులను ఇంటి వద్ద ఉన్న వారి కాటాల్లో గిరిజనులు సక్రమంగానే తూచి స్థానిక మార్కెట్లోకి, వారపు సంతల్లో విక్రయించేందుకు తీసుకొని రాగా 3 కేజీల నుంచి 5 కేజీల వరకు తక్కువ వ్యాపారులు చూపిస్తూ తమను మోసం చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఖైనీ, గుట్కా విక్రయాలు జోరు.. వారపు సంతల ద్వారానే ఏజెన్సీలోని గ్రామాలకు ఖైనీ, గుట్కా వంటివి వారపు సంతల్లో వ్యాపారుల ద్వారానే ఏజెన్సీలోని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. విచ్చలవిడిగా విక్రయాలు జోరందుకోవడంతో చాలా వరకు గిరిజన యువత కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు, తూనికలు కొలతల శాఖ, నకిలీ వస్తువులు, నిత్యావసర సరుకులపై దృష్టి సారించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. వారపు సంతల్లోనే.. దశాబ్దాలుగా తామ పండించిన చింత, జీడి, పసుపు, అల్లం వంటి ఫల సహాయాలను వారపు సంతల్లోనే వ్యాపారులకు విక్రయిస్తుంటాం. తద్వారా మాకు అవసరమైన నిత్యావసర సరుకులను తమ వెంట తీసుకువెళ్తాం. అవి నాణ్యమైనవో లేక నాణ్యత లేనివో తెలియదు. తూకంలో కూడా వ్యత్యాసాలు ఉంటున్నాయి. – తోయక బాబూరావు, దురుబిలి గ్రామం, కురుపాం మండలం అధికారులు దృష్టి సారించాలి వారపు సంతల్లో వస్తువులు, ఎలక్ట్రానిక్ కాటాలపైన సంబంధిత అధికారులు దృష్టి సారించాలి. అవగాహన లేని గిరిజనులకు తూనికలు కొలతల్లో మోసం జరుగుతుంది. దీంతో అమాయక గిరిజనం నష్టపోతున్నారు. మోసం చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి. – ఇంటికుప్పల రామకృష్ణ, ట్రైబల్ రైట్ ఫొరం, జిల్లా అధ్యక్షుడు -
వైద్యం.. దయనీయం!
పల్లె పండగ పేరుతో రోడ్లన్నీ బాగుచేస్తామన్నారు.. గిరిజన ప్రాంతాల్లోని రాళ్లదారులన్నింటినీ అద్దంలా మెరిసిపోయేలా నిర్మిస్తామన్నారు.. రాకపోకలకు కష్టాలు లేకుండా చేస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా గిరిజన ప్రాంతాల్లో రాళ్లదారులే దర్శనమిస్తున్నాయి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు విద్య, వైద్య కష్టాలు షరా మామూలుగా మారాయి. అత్యవసర వేళ రాళ్లదారుల్లో కిలోమీటర్ల మేర డోలీలోనే రోగులను తరలించాల్సిన దుస్థితి. గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్ సేవలు నిలిచిపోయాక గిరిజన గూడల్లో వైద్య కష్టాలు అధికమయ్యాయి. డోలీమోతలు నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇటీవల వైద్యం కోసం గిరిజనుల పాట్లే నిలువెత్తు నిదర్శనం.కొమరాడ: మండలంలోని పూడేస్, కుంతేస్, మసిమండ, పెదశాఖ, గుణదతీలేస్, చోళ్లప దం తదితర పంచాయతీల్లోని పలు గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. గిరిజనలు ఆనారోగ్యానికి గురైతే డోలీ మోతలే శరణ్యం. నాలుగు రోజుల కింద పా లేం పంచాయతీ పరిధి కుస్తూరు గ్రామానికి చెందిన తాడింగి సురేష్ అస్వస్థతకు గురైతే డోలీలో రాళ్లదారిలో 4 కిలోమీటర్ల దూరంలోని పూజారిగూడ వర కు మోసుకొచ్చి అక్కడ నుంచి ఆటోలో కురుపాం పీహెచ్సీకి తరలించారు. అనంతరం 108లో కేజీహెచ్కు తీసుకెళ్లారు.పొలం గట్లపై మూడు కిలోమీటర్లు... బొబ్బిలిరూరల్: మండలంలోని గోపాలరా యుడుపేట పంచాయతీ పరిధిలోని మోసేవల స గ్రామానికి చెందిన చోడిపల్లి ఆశమ్మ క్యాన్స ర్ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందిన ఆమె గ్రామానికి చేరుకుంది. మలివిడత చికిత్స కోసం బుధవా రం డోలీలో పొలంగట్లపై నుంచి మూడు కిలోమీటర్లమేర మోసుకుంటూ ఆమె బంధువులు నారశింహునిపేట వద్దకు చేర్చారు. అక్కడి నుంచి వాహనంలో విశాఖపట్నం తీసుకెళ్లారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా యాతన తప్పడం లేదంటూ గ్రామస్తులు వాపోయారు. కనీసం రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు. -
ఒకే రైతుకు 50 బస్తాల యూరియా విక్రయం
● విచారణ చేసిన విజిలెన్స్, వ్యవసాయ అధికారులు ● ఎరువుల దుకాణ డీలర్పై చర్యలకు సిఫార్సుతెర్లాం: మండలంలోని సుందరాడ గ్రామంలోని ఎరువుల దుకాణ డీలర్పై చర్యలకు విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సిపార్సు చేశారు. దీనికి సంబంధించి మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎరువుల దుకాణ డీలర్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒకే రైతుకు 50 యూరియా బస్తాలు విక్రయించినట్లు ఈపోస్ యంత్రంలో నమోదు చేశాడు. దీనిని గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఎరువుల డీలర్పై దర్యాప్తు నిమిత్తం వచ్చారు. ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్–1985 ప్రకారం ఒక రైతుకు ఎక్కువ యూరియా బస్తాలు విక్రయించడం నేరం కావడంతో దీనిపై మండల వ్యవసాయ అధికారి బొత్స శ్రీనివాసరావు, విజిలెన్స్ కానిస్టేబుల్ తిరుపతిరావు, సుందరాడ వీఏఏ దేముడు గ్రామానికి వచ్చి ఎరువుల దుకాణ డీలర్ వద్ద ఉన్న రికార్డులను గ్రామ పెద్దలు, రైతుల సమక్షంలో తనిఖీ చేశారు. ఎరువుల దుకాణ డీలర్ ఒక రైతుకు 50బస్తాల యూరియా విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు కావడంపై అతనిపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్, వ్యవసాయ అధికారులు తెలిపారు. -
ఇంజినీరింగ్ కళాశాలకు గ్రహణం..!
● కూటమి అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన పనులు ● ప్రభుత్వం స్పందించాలని గిరిజన సంఘాల డిమాండ్ గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకు మోక్షం కలగడం లేదు. గత ప్రభుత్వం కళాశాల మంజూరు చేసిన తరువాత దాదాపు 80 శాతం పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పూర్తి చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టిందని పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రజలు, పలుగిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుపాం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టినా నేటివరకు కురుపాంలో మంజూరైన గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు పూర్తి కాకుండా నిలిచిపోయాయని ఆదివాసీ గిరిజనులు వాపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యంగా అప్పటి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పట్టుబట్టి గిరిజన ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయించగా వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కురుపాం నియోజకవర్గ కేంద్రం సమీపంలో టేకరఖండి గ్రామం వద్ద 105 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.153.853 కోట్ల అంచనా విలువతో పనులకు నిధులు మంజూచేసింది. కళాశాల పూర్తి నిర్వహణ బాధ్యతలను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూకే)కి ప్రభుత్వం అప్పగించింది. త్వరితగతిన కళాశాల పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. అప్పటినుంచి పనులు చురుగ్గా జరిగినా తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్ధాంతరంగా నిలిచిపోయాయి. జేఎన్టీయూకే నాలుగో క్యాంపస్గా కురుపాం కళాశాల జేఎన్టీయూకే పరిధిలో ఇప్పటికే కాకినాడ, విజయనగరం, నర్సారావుపేటలో మూడు క్యాంపస్లు ఉండగా కురుపాం క్యాంపస్ నాలగవదిగా ఉంటుంది. కురుపాం క్యాంపస్లో గిరిజన విద్యార్థులకు ఐదు బ్రాంచిలైన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులను అందించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్రాంచికి 60 సీట్లు చొప్పున మొత్తం 300 సీట్లు ఉంటాయి. కురుపాం, పార్వతీపురం ప్రాంతాల గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టారు. కురుపాం ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం పూర్తయి తరగతులు ప్రారంభమైతే మన్యం జిల్లాలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కళాశాల ఎంతో ఉపయోగ పడుతుంది. కాంట్రాక్టర్కు రూ.8 కోట్ల బకాయి గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు నిలిచిపోయి రెండేళ్లవుతోంది. అలాగే కాంట్రాక్టర్కు కూడా సుమారు రూ.8 కోట్ల వరకు బకాయిలు ఉండిపోయాయి. దాదాపు 80 శాతం వరకు పనులు పూర్తి కాగా చివరి దశలో పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దృష్టి సారించలేదని ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని మన్యం జిల్లా ప్రాంత ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడితే నిరుపేద గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవకాశం ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కూటమి విద్యావ్యతిరేక విధానాలపై...టీచర్ల తిరుగుబాటు
వీరఘట్టం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలపై ఉపాధ్యాయలోకం తిరుగుబాటుకు సిద్ధమైంది. అడ్డదిడ్డంగా ఉన్న క్లస్టర్ విధానం, అశాసీ్త్రయ విద్యానిర్ణయాలు, బోధనేతర పనులు, అసెస్మెంట్ విధానంలో మూల్యాంకనం, తదితర సమస్యల నుంచి విముక్తికి పోరాటమే సరైన మార్గమని ఏపీటీఎఫ్ (ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) భావించింది. ఈ నెల 11 నుంచి నిరసన వారం కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు ఉద్యమకార్యాచారణ ప్రణాళికను అమలుచేయనుంది.ఇదీ కార్యాచరణఈ నెల 11న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం, 15న డివిజన్ కేంద్రాల్లో నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న సీఎం, సీఎస్లకు వాట్సాప్, ఈమెయిల్లో వినతులు అందజేయనున్నారు.డిమాండ్లు ఇవీ..ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలి.సీపీఎస్ రద్దు చేయాలి. మెమో నెం.57ను తక్షణమే అమలు చేయాలి.12వ పీఆర్సీ కమిషన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలి.అన్ని రకాల బకాయిలు చెల్లించాలి. ఈహెచ్ఎస్ బకాయిలు రూ.25 లక్షలకు పెంచాలి. యాప్లను, అసెస్మెంట్ బుక్లెట్ విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి.విజయవంతం చేయండిఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి 17 వరకు చేపట్టనున్న నిరసన వారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఉపాధ్యాయులను చైతన్యవంతం చేయడం, భవిష్యత్లో జరగబోయే పోరాటాలకు సన్నద్ధం చేసేందుకు ఏపీటీఎఫ్ ఈ నిరసన వారం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టనుంది. – మర్రాపు మహేష్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం -
మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్
కురుపాం: మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అనధికార అమ్మకాలు (బెల్ట్ షాపులు) నిర్వహిస్తున్న వారి కోసం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై ఐదు రోజుల పాటు స్పెషల్డ్రైవ్ నిర్వహించి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేసినా, గొలుసు దుకాణాల నిర్వహణకు వేలం పాట నిర్వహిస్తున్నా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎకై ్సజ్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై జె.రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. నలుగురి అరెస్టు -
ఒక రైతుకు 15 కేజీల యూరియా మాత్రమే..!
● ముగ్గురు రైతులకు ఒక బస్తా చొప్పున పంపిణీ ● ఆవేదన వ్యక్తంచేసిన పెదమరికి రైతులుఇదే మొదటిసారి తీసుకోవడం పెదమరికి గ్రామ సమీపంలో శివందొరవలస గ్రామం మాది. ఎరువు ఉందంటూ చెప్పారు. టోకెన్లు ఇచ్చారు. తీరా ఎరువుకోసం వెళ్తే ముగ్గురు రైతులు ఒక బస్తా ఎరువు పంచుకోవాలని చెప్పారు. 15 కేజీల యూరియాను ఏం చేయాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. – అడ్డాకుల శంకరరావు, గిరిజన రైతు -
గంజాయి కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు
● ప్రాసిక్యూషన్ జరుగుతుండగా మరో నిందితుడి మృతి విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఎస్.కోట పోలీస్స్టేషన్లో 2018లో నమోదైన గంజాయి కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటవ ఏడీజే ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించారని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఎస్కోట స్టేషన్ పరిధి బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద సిబ్బందికి వచ్చిన కచ్చితమైన సమాచారంతో 2018 ఫిబ్రవరి 19 న వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వ్యాన్ లో పశ్చిమ బెంగాల్ కు చెందిన సంతు ముజిందార్ (36), ఏఎస్ఆర్ జిల్లా జీకే వీధి మండలం దుప్పలవాడకు చెందిన పంగి ధనుంజయ్ (24) గంజాయి రవాణా చేస్తూ పట్టుబడగా వారి నుంచి 66.2 కిలోల గంజాయిని ఎస్.కోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్.కోట సీఐ వై.రవికుమార్ నిందితులను రిమాండ్కు తరలించి, న్యాయస్థానంలో నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్లో నిందితుడు (ఎ2) పంగి ధనుంజయ్ పై నేరారోపణలు రుజువు కావడంతో పైవిధంగా శిక్ష విధిస్తూ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఎ1) సంతు ముజిందార్ ప్రాసిక్యూషన్ సమయంలో మరణించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నిందితుడు (ఎ2) పంగి ధనుంజయ్కు శిక్ష పడేలా చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీపీని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు. జిల్లాలోని కొత్తవలస కుమ్మరివీధిలో ఉంటున్న ఒక మహిళపై 2023లో దాడికి పాల్పడి, బంగారు వస్తువులను దోపిడీ చేసిన ఎల్.కోట మండలం జమ్మాదేవి పేటకు చెందిన నిందితుడు మడబత్తుల కృష్ణ (34)కు విజయనగరం 5వ ఏడీజే కోర్టు జడ్జి ఎన్.పద్మావతి జీవిత ఖైదు , రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కొత్తవలస కుమ్మరివీధిలో మడబత్తుల సూర్యకాంతం తన కొడుకుతో కలిసి నివాసం ఉంటోంది. 2023 ఏప్రిల్ 15వతేదీన గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోనికి చొరబడి, ఆమె తలపై కొట్టి, కంట్లో కారం జల్లి, మెడలో బంగారు పుస్తెల తాడు, చెవిదిద్దులను అపహరించికుని పారిపోయాడు. గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించగా మృతిచెందినట్లు ఆమె అన్నయ్య సూడా అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదుపై దోపిడీ చేసి, హత్యకు పాల్పడినట్లు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టిన అప్పటి కొత్తవలస సీఐ బాల సూర్యారావు విచారణ చేసి, నిందితుడు కృష్ణను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో జడ్జి ఎన్.పద్మావతి పైవిధంగా తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. -
అటవీశాఖ రేంజ్ ఆఫీసర్గా రామ్నరేష్
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ రేంజ్ ఆఫీసర్గా బి.రామ్నరేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ బి.అప్పలరాజు ఉద్యోగవిరమణ పొందడంతో ఆయన స్థానంలో విధుల్లో చేరారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ డీఎఫ్ఓ, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అటవీశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, నాణ్యమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఫారెస్టు రేంజర్గా మణికంఠేష్పార్వతీపురం: పార్వతీపురం ఫారెస్టు కార్యాలయంలో ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ (ఈఎంయూ)లో పనిచేస్తున్న మణికంఠేష్కు ఫారెస్టు రేంజర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు బుధవారం ఆయన ఫారెస్టు కార్యాలయంలో రేంజర్గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో రేంజర్గా పనిచేసిన టి.రామ్నరేష్కు విజయనగరం అటవీశాఖ కార్యాలయానికి బదిలీ కావడంతో మణికంఠేష్కు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు. ● మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ పార్వతీపురంటౌన్: జిల్లాలోని మైనార్టీ వర్గాలకు చెందిన వివిధ చేతి వృత్తిదారులను ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు షేక్ మహబూబ్ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన మైనారిటీ వర్గాల్లోని ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు 18 రకాల వృత్తి పని చేసుకునే వారు ఈ పథకానికి అర్హులన్నారు. సంప్రదాయ కులవృత్తులైన వడ్రంగి, బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు, శిల్పాలు, విగ్రహాలు తయారుచేసే వారు, బుట్టలు, చాపలు, మట్టిపాత్రలు తయారుచేసే కుమ్మరులు, చీపుళ్ల తయారీదారులు, దోబీ, టైలర్, చేపల వలలు తయారు చేయువారు, చెప్పులు కుట్టేవారు, తాపీ కార్మికులు క్షవర వత్తిదారులు, సంప్రదాయ బొమ్మలు, పూలదండలు, పడవల తయారీదారులు, ఇంటి తాళాల తయారీదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుంచి ఎలాంటి రుణాలు తీసుకుని ఉండరాదని, కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి, అర్హత గల వృత్తిదారులు తమ ధ్రువీకరణ పత్రాలతో మీ సేవ, సీఎస్సీ కేంద్రాల్లో www. pmvishwakarma.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం తప్పనిసరిగా కలిగి ఉండాలని, ఇతర వివరాల కోసం కార్యనిర్వాహక సంచాలకుడు, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, విజయనగరం వారిని సంప్రదించవచ్చని సూచించారు. -
స్కూల్గేమ్స్ పోటీల్లో సత్తా చాటాలి
● డిప్యూటీ డీఈఓ కె.వెంకటరమణ ● రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక ప్రారంభంవిజయనగరం: రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరగబోయే స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభతో సత్తా చాటాలని డిప్యూటీ డీఈఓ కె.వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్కూల్గేమ్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలను బుధవారం ఆయన నగరంలోని పీఎస్ఆర్ స్కూల్లో ప్రారంభించారు. టేబుల్ టెన్నిస్, మాల్కంబ క్రీడాంశాల్లో అండర్–14,17 విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో టేబుల్టెన్నిస్ క్రీడాంశంలో 20 మంది, మాల్కంబ క్రీడాంశంలో 16 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తాయన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక పోటీలను టేబుల్టెన్నిస్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, విజయనగరం డివిజన్ ఇన్చార్జి తవిటయ్య, రత్నకిషోర్, శ్రీను, రవి, ప్రవీణ్, శ్రీకాంత్లు పర్యవేక్షించారు. సెపక్తక్రా పోటీల్లో 20 మంది ఎంపిక నెల్లిమర్ల మండలం అలుగోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన సెపక్తక్రా అండర్–14,17 బాల, బాలికల ఎంపిక పోటీల్లో 20 మంది జిల్లా జట్టుకు అర్హత సాధించారు. ఎంపిక పోటీల్లో మొత్తం 50 మంది క్రీడాకారులు పాల్గొనగా..పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ధర్మారావు పర్యవేక్షణలో ఎంపికలు జరిగాయి. జిల్లా జట్టుకు అర్హత సాధించిన క్రీడాకారులు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లనున్నారు. ఎంపిక పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు సూర్యారావు తదితరులు పర్యవేక్షించారు. -
జాతీయ లోక్అదాలత్ను విజయవంతం చేయండి
విజయనగరం లీగల్: జిల్లాలో ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయలోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీఅయ్యేలా చూడాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ, ఎకై ్సజ్, భూ సంబంధిత కేసులు, కుటుంబ తగాదాలు, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరువర్గాల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.పద్మావతి, పోక్సో కోర్టు జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.దుర్గయ్య, ఎ.కృష్ణప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులు పాల్గొన్నారు.కలెక్టరేట్లో కాల్ సెంటర్పార్వతీపురం రూరల్: జిల్లాలో యూరియా, ఎరువుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కాల్ సెంటర్ను ఏర్పాటుచేసినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ బుధవారం తెలిపారు. ఎరువులు, యూరియాకు చెందిన ఏవైనా సూచనలు, మార్గదర్శకాలు, సమాచారం కోసం కార్యాలయ పనివేళల్లో (సెలవు రోజు మినహా ) ఫోన్: 089633 59853 నంబర్కు ఫోన్చేసి తెలుసుకోవచ్చన్నారు. ఎనీమియా నివారణపై ప్రత్యేక శ్రద్ధ పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎనీమియా ఎక్కువగా ఉందని, దీని నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. ఐసీడీఎస్ లక్ష్యాలపై బుధవారం సమీక్షించారు. ఐసీడీఎస్ నుంచి రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలన్నారు. గర్భిణులు 21 రకాలు కలిగిన అదనపు పౌష్టికాహార కిట్లను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రక్తహీనత నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పథక సంచాలకులు టి.కనకదుర్గ, సీడీపీఓలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. శృంగవరపుకోట: జిందాల్ నిర్వాసితులు తమ పోరుబాటను కొనసాగిస్తున్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి బుధవారం ధర్నా చేయగా, స్థానికంగా ఉన్నవారు బొడ్డవరలో యథావిధిగా తమ ఆందోళన కొనసాగించారు. కూటమి నేతలు కొర్పొరేట్ శక్తులకు దాసోహమయ్యారంటూ విమర్శించారు. జిందాల్కు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చివేయాలంటూ నినదించారు. -
పత్రికలపై కక్షసాధింపు హక్కుల హననమే...
దినపత్రిక సంపాదకునిపై అక్రమ కేసులు పెట్టడం అంటే రాజ్యాంగ హక్కులను హననం చేయడమే. పత్రికలో వచ్చిన వార్త విషయంలో పోలీసులు ఏకంగా ఎడిటర్పై పొలీసు కేసు నమోదు చేయడాన్ని ప్రజాసామ్యవాదులెవరైనా ఖండించాల్సిందే. ప్రజాప్రతినిధి ఆరోపణల వ్యాఖ్యలను ప్రచురించిన విషయంలో అభ్యంతరాలుంటే అదే పత్రికా ముఖంగా ఖండించాలేగానీ పోలీసు కేసులు పెట్టడం సమంజసం కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదు. – జేఏవీఆర్కే ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
నేటి నుంచి సిమ్స్ బాప్టిస్ట్ చర్చి 150 వసంతాల వేడుకలు
● సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్.జాన్ విజయనగరం టౌన్: మత సామరస్యానికి నెలవైన విజయనగరంలో అతిపెద్ద క్రైస్తవ సమాజంగా పేరుపొందిన సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి 150 వసంతాల వేడుకలను ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు సిమ్స్ చర్చి సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్.జాన్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సిమ్స్ చర్చిలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 150 వసంతాల చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం సిమ్స్ చర్చి కెనడా మేరీ టైమ్ బాప్టిస్ట్ మహాసభకు చెందిన డాక్టర్ సేన్ ఫోర్ట్ భీమిలి నుంచి ఇక్కడికి వచ్చి 1875 నవంబర్లో ఇక్కడ సంఘాన్ని స్థాపించి యాభై ఏళ్ల పాటు క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. తర్వాత కాలంలో దీనికి సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిగా నామకరణం చేసినట్లు తెలిపారు. అలా సిమ్స్ స్థాపితమై నేటికి 150 వసంతాలు పూర్తిచేసుకుని, 151 వ వసంతంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలను విజయనగరం క్రైస్తవ సమాజానికి తలమానికంగా అత్యంత ఘనంగా నిర్వహించ తలపెట్టామని, అందులో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ వేడుకలు ప్రారంభిస్తారన్నారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఐదు రోజుల పాటు విజయనగరంలో క్రైస్తవ మహాసభలు నిర్వహిస్తామన్నారు. క్రైస్తవమహాసభలకు ప్రముఖ దైవజనులైన రాజమండ్రి జాన్ వెస్లీ, మదనపల్లి రాజశేఖర్, పలమనేరు వేద నాయకం, బెంగుళూరు బెన్నీ ప్రసాద్, తిరుపతి హేమలత ప్రభ, హైదరాబాద్ వడ్డే నవీన్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో సౌత్ ఇండియా యూత్ కన్వెన్షన్ పేరుతో బైబిల్ రిఫరెన్స్, బైబిల్ క్విజ్, గ్రూప్ సింగింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దైవజనులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ● పార్వతీపురంలో మారథాన్ 5కె రెడ్రన్ పార్వతీపురం టౌన్/రూరల్: జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. హెచ్ఐవీ/ఎయిడ్స్, మాదక ద్రవ్య దుర్వినియోగంపట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్ఫెస్ట్–2025 ఐఈసీ మారధాన్ 5కె రెడ్రన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ ఎ. శ్యామ్ప్రసాద్, ఎస్వీడీ డిగ్రీ కళాశాల వద్ద జెండాను ఊపి రెడ్రన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు నాలుగురోడ్ల కూడలి మీదుగా రన్ ర్యాలీ కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం కలెక్టర్ హెచ్ఐవీపై, రక్షణ లేని లైంగిక సంబంధాలు, రక్తమార్పిడి, వాడిన చిరంజీల వినియోగం వంటి తదితర వ్యాప్తి చెందే సందర్భాలపై అవగాహన కల్పించారు. అనంతరం మారధాన్ రెడ్ రన్లో మహిళలు, పురుషుల విభాగంలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. గెలుపొందిన వారిలో మహిళా విభాగంలో పి.అరుణ, ప్రథమ, బి.స్పందన ద్వితీయ స్థానాలను సాధించగా పురుషుల విభాగంలో బి.సాయి ప్రథమ, ఎం.అజయ్లు ద్వితీయ స్థానం గెలుచుకున్నారు. అలాగే ట్రాన్స్జెండర్ విభాగంలో బి.చిన్ని ప్రథమ, బి.ప్రశాంత్ ద్వితీయ స్థానం గెలుపొందారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7వేలు కలెక్టర్ అందించారు. అలాగే క్విజ్ కాంపిటేషన్లో ప్రథమ స్థానం విజేతలు మౌనిక, వైష్ణవి, వాసు ద్వితీయ స్థానంలో భువనేశ్వరి, కుమారి తృతీయ స్థానంలో మామిలి, భవ్యశ్రీలకు కూడా కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్కుమార్, ఏఆర్టీ అధికారి డా. ఫణీంద్ర, దిశ సీపీఎం కేవీఆర్. శైలజ, డీఎస్డీఓ డా.శ్రీధర్, దిశ టీం జి.అమ్మినాయుడు, జి.కోటేశ్వరరావు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్జీఓలు, ఎన్ఎస్పీ ఫెసిలిటీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేద్దాం
● రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్వెస్లీపార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు క్రిస్టియన్ మైనార్టీలంతా కృషిచేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీసెల్ అధ్యక్షుడు జాన్ వె వెస్లీ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమానికి కృషిచేస్తూ పార్వతీపురం మన్యంజిల్లాలో మైనార్టీల అభివృద్ధి కోసం పేద, వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కా రానికి కృషిచేస్తామన్నారు. క్రైస్తువులంతా ఏకమై వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కుల, మత, ప్రాంత, పార్టీల భేదం లేకుండా ఇళ్లకే పథకాలందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అఽధికారంలోకి తెచ్చుకు నేందుకు ముందస్తు ప్రణాళికలతో క్రైస్తవ సోదరులంతా ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అనేక వర్గాల వారిని అవస్థలకు కూటమి ప్రభుత్వం గురిచేస్తోందన్నారు. అనంతరం ఆయన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జిల్లావ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీ నాయకులకు తదుపరి కార్యాచరణపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ లక్ష్మణరావు, సాలూరు, కురుపాం మైనార్టీసెల్ అధ్యక్షులు సువార్త రాజు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్శాఖలో హోంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎంవీ కృష్ణారావుకు ‘చేయూత‘ అందించేందుకు సిబ్బంది పోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు రూ.3,22,340/ల చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన లేదా ఉద్యోగ విరమణ చేసిన హోగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు హోంగార్డ్స్’ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీస్ ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇద్దరు మైనర్ల ఫేక్ బాంబ్ కాల్..!
● స్టేషన్కు పిలిపించి మందలించిన సీఐ విజయనగరం క్రైమ్: చదువుకుంటున్న ఇద్దరు మైనర్లు ఫేక్ బాంబ్ కాల్ చేసి అటు స్కూల్ యజమాన్యాన్ని, ఇటు పోలీసులను పరుగులు పెట్టించారు. దీనిపై టుటౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల, భోగాపురానికి చెందిన మైనర్ల అత్త విజయనగరంలోని డబుల్ కాలనీలో ఉన్న కేజీబీవీలో పనిచేస్తోంది. ఈ మైనర్లు రెండు రోజుల క్రితం ఫంక్షన్కు వెళ్లిన సమయంలో తమ అత్త ఇంకా రాలేదన్న అక్కసుతో ఫేక్బాంబ్ కాల్ నాటకా నికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5 గంటలకు కేజీబీవీకి ఫోన్ చేసి బాంబ్ ఉందని చెప్పి ఫోన్ కట్ చేశారు. స్కూల్ నుంచి సమాచారం అందుకున్న టుటౌన్ సీఐ తన సిబ్బందితో హుటాహుటిన ఆరోజు రాత్రే కేజీబీవీకి వెళ్లి అణువణువూ గాలించారు. సీఐ శ్రీనివాస్ ఫోన్ నంబర్లను వెరిఫై చేయగా నెల్లిమర్ల లోకేషన్ చూపించడంతో క్రైమ్ పార్టీతో వెళ్లి ఇద్దరు మైనర్లను పట్టుకుని విచారణ చేయగా అది ఫేక్ కాల్ అని తెలింది. మైనర్ల తండ్రులు ఆర్టీసీలో ఒకరు, సెక్యూరిటీగా మరొకరు పనిచేస్తున్నారు. పోలీసులనే హడలెత్తించిన మైనర్లను సీఐ శ్రీనివాస్ మంగళవారం స్టేషన్కు పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలోనే సున్నితంగా హెచ్చరించారు. జైలు జీవితం వద్దని, ఇటువంటి ఫేక్ కాల్స్ ఆలోచన రావొద్దని చెబుతూ జీడీలో ఇద్దరి పేర్లను రాయించి ఇంటికి పంపించారు. ఈ విషయమై సీఐ మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారో కన్నవారు నిరంతరం కనిపెడుతూ ఉండాలన్నారు. కాలేజీ స్టూడెంట్స్ భవిష్యత్తు దృష్ట్యా కన్నవారిని పిలిచి మందలించామని సీఐ తెలిపారు. -
తూనికల్లో తేడాలొస్తే చర్యలు
రాజాం సిటీ: తూనికల్లో తేడాలొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి, శ్రీకాకుళం లీగల్మెట్రాలజీ అధికారులు ఉమాసుందరి, బలరాంకృష్ణలు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాజాంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. పండ్ల దుకాణాలు, వ్యాపార సంస్థల్లో వినియోగిస్తున్న కాటాలను పరిశీలించారు. ఈ సందర్భంగా 300 నుంచి 400 గ్రాముల వరకు తూకంలో తేడాలు గుర్తించారు. మొత్తం 40 మందిపై కేసులు నమోదుచేయడంతో పాటు కాటాలను, సీల్ లేని ఇనుపగుండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూనికల్లో తేడాలు లేకుండా విక్రయాలు జరపాలని, అలాగే ఎంఆర్పీ కంటే అధికంగా విక్రయాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కువగా పండ్ల దుకాణాల్లో మోసాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, మరోసారి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొంతమందికే ఇంటింటికీ రేషన్
● ఈ కింది ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం విజయనగరం పట్టణంలోని గోకపేటలోనిది. గోకపేట రేషన్ డిపో నుంచి బియ్యాన్ని సైకిల్ పై వేరే మహిళ సహాయంతో వృద్ధురాలు ఇంటికి తీసుకుని వెళ్తోంది.వృద్ధుల ఇంటికి సరుకులు ఇవ్వాలి 65 ఏళ్లు దాటిన వృద్ధుల ఇంటికి వెళ్లి సంబంధిత రేషన్ డీలర్ రేషన్న్సరుకులు ఇవ్వాలి. ఎక్కడైనా ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం. – మురళీనాథ్, జిల్లా పౌరసరఫరాల అధికారివిజయనగరంఫోర్ట్:ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలోని అనేక మంది వృద్ధులకు ఎదురువుతున్న దుస్థితి. ఇంటింటికీ వెళ్లి రేషన్ అందించే పక్రియకు కూటమి సర్కార్ స్వస్తి పలికింది. దీంతో ప్రజలకు కష్టాలు మొదలుయ్యాయి. అయితే 65 ఏళ్లు దాటిన వృద్ధుల ఇంటికే రేషన్ సరుకులు అందిస్తామని కూటమి సర్కార్ చెప్పింది. అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమందికే రేషన్ అందిస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. జిల్లాలో రైస్ కార్డులు 5,74,137 జిల్లాలో రైస్ కార్డులు 5,71,137 ఉన్నాయి. వారందరికీ ప్రతి నెల రేషన్ డిపోల ద్వారా సరుకులు అందించాల్సి ఉంది. వారిలో 65 ఏళ్లు దాటినవారు 69,246 మంది ఉన్నారు. వారందరికీ ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందించాల్సి ఉంది. కానీ వారికి పూర్తిస్థాయిలో ఇంటికి రేషన్ సరుకులు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైస్ కార్డు దా రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు అందించారు. అన్ని వర్గాల ప్రజల ఇంటికే వెళ్లి రేషన్ అందించడం వల్ల వారికి ఇబ్బందులు తప్పాయి. గంటల తరబడి రేషన్ సరుకుల కోసం నిరీక్షించాల్సిన పని ఉండేది కాదు. దీని వల్ల పనులు మానుకుని ఉండాల్సి వచ్చేది కాదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారు, రేషన్ డిపో దూరంగా ఉన్నవారు 2,3 కిలోమీటర్లు నడిచి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అటువంటి వారికి ఇంటికి వెళ్లి సరుకులు అందించేవారు. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గేవి. కానీ కూటమి సర్కార్ పాలనలో రేషన్ సరుకుల కోసం వాగులు, వంకలు, దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికీ వెళ్లే ఆసక్తి లేదనే ఆరోపణలు 65 ఏళ్లు నిండిన వారి ఇంటికి రేషన్ సరుకులు ఇవ్వడానికి డీలర్లు అసక్తి చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల వృద్ధులు రేషన్ డిపోలకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నదే అయినప్పటికీ తప్పని పరిస్థితి. పూర్తిస్థాయిలో వృద్ధుల ఇంటికి చేరని బియ్యం జిల్లాలో రైస్ కార్డులు 5,73,137 వాటిలో 65 ఏళ్లు దాటిన వారు 69,246 మంది -
మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్ప రథం’తో ప్రచారం
విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించి, వారిని ఆ అలవాటుకు దూరం చేసేందుకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు ’సంకల్ప రథం’తో ప్రచారం చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. యువతతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ఈ ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రథాన్ని ప్రారంభించామన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ’సంకల్ప రథం’ రూపొందించామన్నారు. ప్రతిరోజూ ఒక మండలాన్ని సందర్శించి, స్థానిక పోలీస్స్టేషన్ అధికారి, సిబ్బంది సహకారంతో ఉదయం కళాశాలల్లో వాహనాన్ని నిలిపి, విద్యార్ధులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నామన్నారు. అదే విధంగా సాయంత్రం సమయాల్లో మండలంలోని ముఖ్య ప్రాంతం లేదా కూడలిలో వాహనాన్ని నిలిపి, ప్రజలు, యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వారిలో చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ’సంకల్ప రధం’తో అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. మూడో విడతగా ప్రచార కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి ఆగస్టు 16 వరకు నిర్వహించినట్లు తెలిపారు. కొత్తగా ఒక షెడ్యూల్ను రూపొందించి ఆ ప్రకారం స్థానిక పోలీస్అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఒక మండలంలోని ఒక కళాశాల, ముఖ్య కూడలిలో వాహనాన్ని నిలిపి, మాదక ద్రవాలవల్ల కలిగే దుష్ప్రభావాలపై వీడియోలు ప్రదర్శించి, వివరించామని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలను సంకల్ప రథం సందర్శించే విధంగా షెడ్యూల్ రూపొందించామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. -
నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరు
● మాజీ ఎమ్మెల్యే కళావతి వీరఘట్టం: నిర్బంధాలతో వైఎస్సార్సీపీ పోరాటాలను ఆపలేరని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పోలీసులు గృహనిర్బంధం చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. రైతుల కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం భగ్నంచేయాలని చూడడం వారి అవివేకమన్నారు. ప్రజాపోరాటాలతో కూటమి ప్రభుత్వం త్వరలో కనుమరుగవ్వడం ఖాయమన్నారు. ఎరువుల పంపిణీ పరిశీలన వీరఘట్టం: స్థానిక మార్కెట్ యార్డులో యూరియా పంపిణీని ఏడీఏ రత్నకుమారి, ఏఓ సౌజన్యతో కలిసి జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్పాల్ మంగళవారం పరిశీలించారు. రైతులకు అవసరమైన ఎరువును త్వరలో సమకూర్చుతామని తెలిపారు. ముందుగా వరి పంట సాగు చేసే రైతులకు యూరి యా పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాకు 22,500 టన్నుల యూరియా అవసరంకాగా, ఇంత వరకు 16,303 టన్నులు తెచ్చామని, ఆర్ఎస్కేలు, సొసైటీలు, ప్రైవేటు డీలర్ల ద్వారా 15,478 టన్నుల యూరియా సరఫరా చేసినట్టు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం లాభదాయకం కురుపాం: ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని, సాగు పద్ధతులపై గిరిజన రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ రైతులకు పిలుపునిచ్చారు. కురుపాం మండలంలోని ఉదయపురం గ్రామాన్ని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మంగళవారం సందర్శించారు. అక్కడి గిరిజన రైతులతో మాట్లాడారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగం వల్ల పంటకు, ఆరోగ్యానికి హానికరమన్నారు. యూరియా వినియోగానికి బదులుగా నానో, ఇతర జీవన ఎరువులను వినియోగంచుకోవాలన్నారు. అనంతరం రైతులకు నానో యూరి యా, డీఏపీని పంపిణీ చేశారు. టీచర్గా కలెక్టర్.. ఉదయపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టి కాహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, హెచ్ఐవీ, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.వినోద్కుమార్, ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.జగదీశ్వరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు. వంగర: మండలంలోని సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామిని కేరళకు చెందిన రామానందభారతిస్వామి మంగళవారం దర్శించుకున్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గర్భగుడిలో చేరిన నీటిని ఇంజిన్ల సాయంతో తోడించారు. అనంతరం స్వామీజీ పూజలు జరిపారు. ఆయన వెంట అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకుడు సిద్ధాంతం గణపతిశర్మ ఉన్నారు. -
రైతులకు రూ.85 లక్షల టోకరా!
● రైతులకు తప్పుడు రశీదులు ● సభ్యులందరికీ నోటీసులిచ్చి విచారణ జరుపుతాం గరుగుబిల్లి: గరుగుబిల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో (పీఏసీఎస్) అక్రమాలు జరిగాయి. రైతులకు తప్పుడు రశీదులు ఇచ్చి సుమారు రూ.85 లక్షలకు టోకరా పెట్టినట్టు ప్రాథమిక సమాచారం. పీఏసీఎస్లలో కంప్యూటరీకరణతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గరుగుబిల్లి పీఏసీఎస్ పరిధిలోని 12 గ్రామాలకు చెందిన 1400 మంది రైతులు ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరిలో చాలామంది రుణాలు తీసుకున్నారు. పీఏసీఎస్ సీఈఓ ఈ ఏడాది ఏప్రిల్ 2న అకాలమరణం పొందారు. ఇక్కడ జరిగిన అక్రమాలపై విజయనగరం డీసీసీబీ చీఫ్ మేనేజర్ సంతోష్కుమార్ ప్రాథమిక దర్యాప్తును నిర్వహించగా 31 మంది రైతుల పేరున రూ.85 లక్షల వరకు కాజేసినట్టు నిర్ధారించారు. మరింత లోతైన దర్యాప్తునకు విచా రణాధికారిగా జిల్లా సహకారశాఖాధికారిని నియమించి, రెండు నెలల్లో దర్యాప్తును పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు పీఏసీఎస్లో ఆగస్టు 22 నుంచి రైతులకు నోటీసులను జారీచేసి కార్యాలయంలోనే విచారణ చేపడుతున్నారు. రశీదులతోనే... సొసైటీ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో ఒక రశీదు రైతుకు, బ్యాంకునకు ఒక రశీదు సమర్పించాలి. మూడో రశీదు కార్యాలయంలో ఉంటుంది. ఈ రశీదుల జారీలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పుతీసుకున్న రైతుకు ఒక రశీదు ఇచ్చి, మిగిలిన రశీదులు బ్యాంకులకు సమ ర్పించ లేదు. రైతు అప్పునకు సంబంధించి రశీదుతో పాటు ఆ రుణానికి సంబంధించిన వివరాల నమోదుకు అప్పటి సీఈఓ చెల్లుచీటీ ఇచ్చారు. రుణం తీరిపోయిందని రైతులు భావించారు. వాస్తవానికి రైతు చెల్లించిన డబ్బులు బ్యాంకుకు జమచేయలేదు. దీంతో రైతు రుణం చెల్లించనట్టుగా సంస్థ లెక్కలలో ఉంది. రెండు రశీదు పుస్తకాలు మాయం సంస్థ జారీ చేసిన రెండు రశీదు పుస్తకాలు మాయమయ్యాయి. ఆ రెండు రశీదు పుస్తకా లతో రైతులతో అప్పటి సీఈఓ ఆర్థిక లావాదేవీలు నెరిపినట్టు అధికారులు గుర్తించారు. రశీదు పుస్తకాల నంబర్లు 112500 నుంచి 112550 వరకు, 112651 నుంచి 112700 వరకు రశీదుల లావాదేవీలు పీఏసీఎస్లో లేవు. సొసైటీలో సభ్యత్వం తీసుకొన్న రైతులందరికీ నోటీసులు జారీ చేస్తాం. ఇంత వరకు 181 మంది రైతులకు నోటీసులు జారీచేయగా 60 మందిని విచారణ చేపట్టాం. రెండు రశీదు పుస్తకాలు కార్యాలయంలో కనిపించడం లేదు. ఆ రెండు రశీదు పుస్తకాలద్వారానే రైతుల రుణానికి సంబంధించి రశీదులను జారీచేశారు. నోటీసులు రాకపోయినా సభ్యత్వం ఉన్న రైతులు వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. – ఆర్.రమణమూర్తి, డీసీఓ, పార్వతీపురం -
వినతులకు పరిష్కారం చూపండి
పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో మొత్తం 133 వినతులు స్వీకరించారు. వినతుల స్వీకరణలో కలెక్టర్తోపాటు డీఆర్ఓ హేమలత, ఉప కలెక్టర్ పి. ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినతులను సంబంధిత అధికారులే స్వయంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసిన అనంతరం పరిష్కారం చూపాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై వచ్చిన ప్రజలు అర్జీలను అందజేశారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలి గిరిజన విద్యార్థులు, ఉపాధ్యాయులపై వివక్ష చూపుతున్న జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం, ఆదివాసీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో పి.రంజిత్ కుమార్, పల్లా సురేష్, ఆరిక చంద్రశేఖర్, మరికొంతమంది నాయకులు నిరసన తెలుపుతూ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పదోతరగతి ప్రతిభా అవార్డులలో గిరిజన విద్యార్థులను కానీ, ఉపాధ్యాయ దినోత్సవంలో గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానీ, కేటాయింపు చేయకుండా వివక్షతో డీఈఓ వ్యవహరిస్తున్నారని, ఈ మేరకు ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్దేశించిన సమయంలో ఫిర్యాదుల పరిష్కారం ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు నిర్దేశించిన సమయంలోనే చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించు కోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్లో స్వయంగా మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 12 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 41 వినతులు సీతంపేట: ఐటీడీఏలో సోమవారం ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 41 వినతులు వచ్చాయి. ఎరువులు ఇప్పించాలని పాలిష్కోట రైతులు అర్జీ ఇచ్చారు. సీసీ రోడ్డు పూర్తి చేయాలని మూర్తిగాడి గూడకు చెందిన సవర రవికుమార్ కోరారు. కొండపోడు పట్టా ఇప్పించాలని శుబలయకు చెందిన పొట్నూరు గౌరికుమారి విన్నవించారు. పెద్దగూడకు చెందిన సవర ఆదమ్మ మోటార్ ఇంజిన్కు రుణం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. కొత్తగూడలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వినతిఇచ్చారు. లాడలో సెల్ టవర్ పెట్టాలని ఆరిక ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, పీహెచ్వో ఎస్వీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు శాఖకు జాగిలాల కేటాయింపు
పార్వతీపురం రూరల్: పోలీసుశాఖలో కీలకంగా వ్యవహరించి పేలుడు పదార్థాల కేసుల ఛేదింపు, నేరస్తులను గుర్తించడంలో ఉపయోగపడే జాగిలాలను జిల్లా పోలీసు శాఖకు రెండింటిని కేటాయించారు. ఈ మేరకు సోమవారం నూతన జాగిలాలు జూలీ, చార్లీతో పాటు హేండర్స్ ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రెండు జాగిలాలు విజయవాడ మంగళగిరి హెడ్క్వార్టర్స్ 6వ బెటాలియన్లో సీటీసీలో శిక్షణ పొందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ వాటి హేండర్లైన పార్వతీశం, లక్ష్మణరావు, ఆనంద్మోహన్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు రాంబాబు, నాయుడు, డాగ్ హేండర్లు తదితరులు పాల్గొన్నారు. -
గడువు దాటక ముందే పరిష్కరించాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ● పీజీఆర్ఎస్కు 167 వినతులువిజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని ఇంకనూ చూడవలసిన కాలమ్లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజూ లాగిన్ అయిన అధికారులు వినతులను చూడాలని అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ చేసి ముగించాలని తెలిపారు. గడువులోగా వినతులకు సమాధానాలు పంపాలని లేని ఎడల సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ, మురళి ప్రజల నుంచి వినతులు 167 వినతులు స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 20 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 20 ఫిర్యాదులు వచ్చాయి. కార్యాలయానికి ఫిర్యాదుతో వచ్చిన ప్రతి బాధితుడి ఆవేదనను ఎస్పీ వకుల్ జిందల్ అడిగి తెలుసుకున్నారు. వారి ముందే సంబంధిత స్టేషన్ హౌన్ ఆఫీసర్కు ఎస్పీ ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత ఎస్హెచ్ఓలకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీలీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
మృతుల స్వగ్రామాల్లో విషాదఛాయలు
జామి: మండలంలోని అలమండ గ్రామం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరికిపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బోని సాగర్, గుల్లిపల్లి సురేష్ అక్కడికక్కడే మృతిచెందారు. భీమాళి గ్రామానికి చెందిన మిడతాన సూర్యప్రకాష్ విజయనగరం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన గణేష్, సత్యవతి దంపతుల కుమారుడు సూర్యప్రకాష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు యువకులు, చేతికి అందివచ్చిన తరుణంలో మృత్యువాత పడడంతో మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యక్తిపై కేసు నమోదుసంతకవిటి: మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన కంఠ రామలక్ష్మిని అదే గ్రామానికి చెందిన టొంపల రాజు మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రామలక్ష్మి భర్త జీవనోపాధి నిమిత్తం విజయవాడ తరచూ వెళ్తుంటాడు. భర్త లేని సమయంలో రాజు ఆమెను మానసికంగా వేధిస్తుండగా భర్త ఇంటికి రావడంతో ఆమె ఈ విషయం తెలపడంతో సోమవారం స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
దత్తిరాజేరు: మండలంలోని మరడాం వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం లారీ ఢీకొనడంతో మర్రివలస గ్రామానికి చెందిన కోరాడ లక్షణరావు(42)అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్.బూర్జవలస ఏఎస్సై రమణ తెలిపారు. ఈ మేరకు స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..రామభద్రపురం నుంచి గజపతినగరం వెళ్తున్న లారీ బస్సు కోసం ఉన్న లక్షణరావు వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కొన్నాళ్లు క్రితం భార్యతో తెగతెంపులు అవగా కూలి పనులు చేసుకుంటూ అన్నదమ్ముల వద్ద ఉంటున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చెప్పారు. ఎన్ఎంఎంఎస్కు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం టౌన్: డిసెంబర్ 7న జరగనున్న ఎన్ఎంఎంఎస్ పరీక్షకు జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి. రాజ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలు రాయడానికి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుని కుటుంబ సంవత్సరాదాయం రూ.:3.5లక్షలు మించకూడదని తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు పార్వతీపురంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పని దినాల్లో సంప్రదించాలని ప్రకటనలో కోరారు. జాతీయస్థాయి పోటీలకు రాజాం క్రీడాకారులురాజాం సిటీ: ఈ నెల 26 నుంచి 29 వరకు జమ్ము కశ్మీర్లో జరగనున్న పికిల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రాజాం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 6, 7తేదీలలో విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగ్గా రాజాంకు చెందిన పీవీజీకే రాజు, డాక్టర్ బీహెచ్ అరుణ్కుమార్, డాక్టర్ ఎం.పురుషోత్తం, సీహెచ్ రామకృష్ణంరాజు, బి.శాంతిస్వరూప్, ఆర్.విజయకృష్ణలు చక్కని ప్రతిభకనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం ఎంపిక జాబితా వచ్చిందని క్రీడాకారులు తెలిపారు. వారి ఎంపికపట్ల రాజాంకు చెందిన పలువురు అభినందనలు తెలియజేశారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యసంతకవిటి: మండలంలోని తాలాడ గ్రామానికి చెందిన బింగి లక్ష్మణరావు సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అప్పుల బాధ తాళలేక లక్ష్మణరావు తన కళ్లలంలోని రేకుల షెడ్లో ఉరి వేసుకున్నట్లు భార్య గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
దాడికారణంగానే వాచ్మన్ మృతి
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామానికి చెందిన వాచ్మన్ కోడూరు ముత్యాలనాయుడిపై లారీ డ్రైవర్లు చేసిన దాడి కారణంగానే మృతిచెందాడని రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముత్యాలనాయుడు మృతికి కారకులైన ఇద్దరు లారీ డ్రైవర్లను అరెస్టుచేశామని తెలిపారు. స్థానిక పాలకొండ రోడ్డులోని లక్ష్మీనారాయణ రైస్మిల్లు వద్ద ముత్యాలునాయుడు వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 14 మిల్లు వద్దకు లారీ డ్రైవర్లు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం చిర్లుపాలెం గ్రామానికి చెందిన బూర్లె నాగరాజు, కోరాడ చిన్నప్పడులు రెండు లారీల ఊక ఎత్తుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ మద్యం తాగుతుండగా వారించిన వాచ్మన్పై విచక్షణా రహితంగా డ్రైవర్లు దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడడంతో వాచ్మన్ తొడ ఎముక విరిగిపోయిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని చెప్పారు. కార్యక్రమంలో సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు, సిబ్బంది ఉన్నారు. -
సతివాడ ఘటనలో 72 మందిపై కేసుల నమోదు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో ఇటీవల జరిగిన గణనాథుడి ఊరేగింపులో తలెత్తిన ఉద్రిక్తత ఘటనలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మొత్తం 72 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ సోమవారం తెలిపారు. ఎస్సీ కాలనీ గణేష్ నిమజ్జనం ఊరేగింపులో బీసీ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్తులు తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. దళితులమనే అక్కసుతోనే తమ గణేష్ ఊరేగింపును అడ్డగించారని, కులం పేరిట దూషించారని, బీసీ సామాజిక వర్గానికి చెందిన 36 మందిపై ఉత్సవ నిర్వాహుకులు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా..ఫిర్యాదులో పేర్కొన్న 36 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే ఘటనలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు బీసీ మహిళలపై దాడి చేశారని, అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వారు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన 36 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో మొత్తం 72 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని ఎస్సై గణేష్ స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా పోలీస్ పికెట్ గ్రామంలో కొనసాగిస్తున్నామన్నారు. -
ఒక్క బస్తా ఇస్తే ఒట్టు..
వీరఘట్టం: వీరఘట్టంలోని మన గ్రోమోర్ సెంటర్ కు వచ్చిన 400 బస్తాల యూరియాను సోమవారం పంపిణీ చేస్తామని వ్యవసాయాధికారులు ప్రకటించారు. దీనికోసం సచివాలయం–4 వద్ద టోకెన్లు ఇస్తామని చెప్పారు. ఈ సమాచారంతో పెద్దఎత్తున రైతులు సచివాలయం వద్దకు చేరుకున్నారు. స్థలం ఇరుకుగా ఉండడం, వందలాది మంది రైతులు చేరుకోవడంతో తోపులాట జరిగింది. వ్యవసాయాధికారులు టోకెన్ల పంపిణీని నిలిపివేస్తూ సచివాలయం తలుపులు బలవంతంగా యూసేయడంతో తలుపుల మధ్యన సన్యాసిరావు అనే రైతు చేతివేళ్లు ఉండిపోయి నలిగిపోయాయి. ఆయనను స్థానిక పీహెచ్సీకి తరలించారు. తర్వాత మార్కెట్యార్డు వద్ద టోకెన్ల పంపిణీని ప్రారంభించినా రైతులను కంట్రోల్ చేయలేక మంగళవారం పంపిణీ చేస్తామని ప్రకటించి ఏఓ సౌజన్యతో పాటు పోలీసులు వెళ్లిపోయారు. ఉదయం నుంచి ఒక్క బస్తా ఎరువు కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. కూటమి ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. -
యూరియా.. ఏదయా!
●భామిని మండలంలో ఖరీఫ్ సాగు సాధారణ విస్తీర్ణం సుమారు 13 వేల ఎకరాలు కాగా పదివేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మొత్తం సాగు విస్తీర్ణానికి 1,600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. రైతు సేవా కేంద్రాల ద్వారా 240 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా సుమారు 1,500 మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశారు. వాస్తవ సాగుకు కావాల్సిన ఎరువులు మండలానికి వచ్చినప్పటికీ.. ప్రైవేటు డీలర్లు ఇతర మండలాలు, బయట ప్రాంతాలకు ఎక్కువ ధరకు అమ్ముకోవడంతో స్థానిక రైతులు సకాలంలో పంటలకు ఎరువు అందించలేకపోతున్నారు. ●ఇటీవల పాలకొండలో ప్రైవేట్ డీలరు దుకాణంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. దుకాణంలో అమ్మకాలకు సంబంధించి రికార్డులు నిర్వహించడం లేదని గుర్తించారు. అనుమతులు లేకుండా గోదాముల్లో నిల్వలను గుర్తించి, సీజ్ చేశారు. 127 బస్తాల యూరియా, 15 బస్తాల డీఏపీని పట్టుకోగా.. వీటి విలువ రూ.3.25 లక్షలు. పార్వతీపురం మండలం వెంకంపేట రెవెన్యూ పరిధిలో సాగు చేస్తున్న రైతులు యూరియా దొరక్క అమ్మోనియా, దుబ్బు గుళికలు కలిపి చేలకు చల్లుకునే దుస్థితి ఏర్పడింది. సరఫరా చేసిన అరకొర యూరియా పలుకుబడి ఉన్నవారికే దొరుకుతుందని.. తామైతే నల్లబజారులో బస్తాకు రూ.200 అదనంగా ఇచ్చి ఒకట్రెండు బస్తాలు తెచ్చుకోగలిగామని ఇక్కడి రైతులు చెబుతున్నారు. సీతానగరం మండలంలో రైతులకు ఎరువులు దొరకడం లేదు. ఇటీవల తామరకండి, రామవరం పరిధిలో యూరియా ఇవ్వడంతో వందలసంఖ్యలో గుమికూడారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు చేరుకుని.. 250 మందికి.. ఒక్కొక్కరికి బస్తా చొప్పున దగ్గరుండి పంపిణీ చేయించారు. సోమవారం జిల్లావ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు గంటలకొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. వీరఘట్టంలో ఓ రైతు చేతికి గాయాలయ్యాయి. కొద్ది రోజుల కిందట సాలూరు మండలంలోని మామిడిపల్లిలో పలు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పోలమాంబ రైతు డిపోలో ఈ–పాస్ యంత్రంలో చూపిన నిల్వల కంటే గోదాములో రూ.4 లక్షల విలువ చేసే ఎరువులు అధికంగా ఉన్నట్లు గుర్తించి, సీజ్ చేశారు. మక్కువ మండలంలోనూ ప్రైవేట్ వర్తకుల వద్ద పెద్ద ఎత్తున అనధికార నిల్వలను గుర్తించారు. ఇటీవల పాచిపెంట మండలంలో పీఏసీఎస్ అధ్యక్షుడే స్వయంగా ఆటోతో లోడును తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. -
తెరచాటుకు కోటదుర్గమ్మ
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారు సోమవారం నుంచి తెరచాటుకు వెళ్లారు. దసరా ఉత్సవాలు ఈ నెల 22 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకా రం అమ్మవారి విగ్రహానికి తెరవేశారు. ఈ 14 రోజులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మాత్ర మే భక్తుల దర్శనార్థం ఉంచుతారు. గ్రహణ సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి గర్భగుడికి తెరవేశారు. తిరి గి ఈ నెల 22న అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్శర్మ తెలిపారు. సీతానగరం: ప్రజల సమస్యలను నేరుగా తెలుకుని పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. సూరంపేట గ్రామ రామమందిరం వద్ద సోమవారం రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించా రు. రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, తొందరపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దన్నారు. రైతులకు సీసీఆర్సీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్పాల్, తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఏఓ ఎస్.అవినాష్, వ్యవసాయ సహాయకులు, సూ రంపేట, చిన్నారాయుడు, మరిపివలస గ్రామాల రైతులు పాల్గొన్నారు. వీరఘట్టం: యూరియా కోసం రైతులు ఆందోళ న చెందవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాబర్ట్పాల్ అన్నారు. వీరఘట్టం కూరాకులవీధికి వెళ్లి రైతులతో మాట్లాడారు. యూరియా పంపిణీలో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం గ్రోమోర్ సెంటర్లో ఉన్న యూరియాను మంగళవారం అందజేస్తామన్నారు. సీతంపేట: సుమారు 18 అడుగుల పొడవు ఉన్న కింగ్కోబ్రా సీతంపేటలో ని ఓ ప్రైవేటు నర్సరీ పంప్ షెడ్ గదిలో తిష్టవేసింది. సామగ్రి తీసేందుకు గదిలోకి వెళ్లిన నర్సరీ యజమాని భుజంగరావు పామును చూసి భయపడ్డారు. వెంట నే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. శ్రీకాకుళం నుంచి స్నేక్క్యాచర్స్ ఖాన్, అశోక్ వచ్చి కింగ్కోబ్రాను పట్టుకున్నారు. కొత్తూరు–బత్తిలి రిజర్వ్ ఫారెస్టు పరిధిలో విడిచిపెట్టినట్టు ఎఫ్బీఓ దాలినాయుడు తెలిపారు. ఇది విషపూరితమైన పాముగా పేర్కొన్నారు. -
రాళ్లదారిలో 4 కిలోమీటర్లు..
కొమరాడ: మండలంలోని పాలెం పంచాయతీ పరిధి కుస్తూరు గ్రామానికి చెందిన తాడింగి సురేష్ సోమవారం త్రీవ అస్వస్థతకు గురయ్యాడు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో రాళ్ల దారిలో 4 కిలోమీటర్ల దూరంలోని పూజారి గూడ గ్రామం వరకు తీసుకొచ్చి ఆటోలో కురుపాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధిని విస్మరించిందని, రోడ్ల సదుపాయం కల్పనకు కనీస చర్యలు తీసుకోవడంలేదని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. తరచూ డోలీ కష్టాలు ఎదురవుతున్నా పట్టించుకోవడంలేదంటూ వాపోయారు. తక్షణమే గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే జగదీశ్వరి స్పందించి కుస్తూరు గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు. -
పైడితల్లి ఆలయంలో సమస్యల కొలువు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 12 నుంచి పందిరిరాట, మండల దీక్షలతో ప్రారంభంకానున్నాయి. చదురుగుడి అభివృద్ధి కోసం ఇరువైపులా ఉన్న షాపులను పూర్తిగా నేలమట్టం చేయడంతో గత కొన్నాళ్లుగా ఆలయ గోడలు శిథిలావస్థకు చేరాయి. వర్షం కురిస్తే కారిపోతోంది. ఆలయమంతా నీటితో నిండిపోతోంది. అసలే చిన్న ఆలయం కావడంతో పక్కన రేకులను కప్పి మమ అనిపించేశారు. వర్షం కురిసినప్పుడు ప్రధాన ఆలయం కారిపోతుండడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న ఆలయానికి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేని స్థితిలో అధికారులున్నారా ? అని ప్రశ్నిస్తున్నారు. పండగ పూట వర్షం కురిస్తే కారిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలయానికి పటిష్టమైన భద్రత లేకపోవడం వల్ల ఎప్పుడు ఏ చోరీ జరుగుతుందోనన్న భయం అటు సిబ్బంది, ఇటు భక్తుల్లో నెలకొంది. ఇదే విషయంపై ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష స్పందిస్తూ ఉత్సవాల తర్వాత ఆలయ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. -
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఖేలో ఇండియా అస్మిత వెయిట్ లిఫ్టింగ్ లీగ్ పోటీల్లో శ్రీపాద శ్రీజ ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు, మరో విద్యార్ధిని మౌనిక రెండు స్వర్ణపతకాలు దక్కించుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు, చాన్స్లర్ జీఎస్ఎన్ రాజు, వైస్ చాన్స్లర్ పీకే మహంతి, తదితరులు అభినందిచారు. 55 మద్యం సీసాల పట్టివేతరాజాం: రాజాం ప్రొహిభిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అనధికారిక మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్శాఖ రాజాం సీఐ ఆర్.జైభీమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో మూడురోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురు వ్యాపారులపై కేసులు నమోదుచేసి 55 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశామని చెప్పారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. -
గణనాథుడి ఊరేగింపులో ఘర్షణ
● ఇరువర్గాల మధ్య వివాదం ● భారీగా మోహరించిన పోలీసులు ● గ్రామంలో కొనసాగుతున్న పోలీస్ పికెట్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో శనివారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గణనాథుడి ఊరేగింపు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఎస్సీ కాలనీ ప్రజలు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి శనివారం రాత్రి శ్రీకారం చుట్టారు. ఊరేగింపులో భాగంగా గ్రామ ప్రధాన రహదారి నుంచి వెళ్లేందుకు యత్నించగా బీసీ వర్గాలు అడ్డుకున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువత తమ పట్ల, తమ ఆడబిడ్డల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బీసీ వర్గానికి చెందిన మహిళలు అర్ధరాత్రి రోడ్డుపై భైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇళ్ల ముందు నుంచి ఊరేగింపు చేయడానికి వీలులేదంటూ అడ్డుకున్నారు. ఈ సమాచారం పోలీసులకు చేరడంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ..సుమారు 20 మంది సిబ్బందితో గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తగాదా పెరగకుండా నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాన్ని పోలీసులే చేపట్టారు. ఇదిలా ఉండగా దళితులమనే అక్కసుతోనే తమ గణనాథుడి నిమజ్జనానికి అడ్డు తగిలారంటూ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు చెబుతున్నారు. వివక్ష చూపిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ రామకృష్ణను వివరణ కోరగా ఘటన వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ను కొనసాగిస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన సుమారు 30 మందిపై చర్యలు తీసుకోవాలని దళిత వర్గానికి చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారని వారి ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెప్పారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
భోగాపురం: మండలంలోని సవరవిల్లి పంచాయతీ బుగతపేట గ్రామానికి చెందిన బుగత లక్ష్మణ్(42) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుగతపేట గ్రామానికి చెందిన బుగత లక్ష్మణ్ కొబ్బరి తోటల్లో కొబ్బరి కాయలు తీసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆయన అనా రోగ్యంతో బాధపడుతుండడంతో ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో అతనికి ఏదో గాలి పట్టిందని అందువల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడని కుటుంబసభ్యులు భావించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ బహిర్భూమికి వెళ్తానని చెప్పి శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఆదివారం మధ్యాహ్నం రాజ్కమల్ పౌల్ట్రీ సమీపంలో ఉన్న చెరువులో లక్ష్మణ్ శవమై తేలాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్సీకి తరలించారు. మృతుని తమ్ము డు యరకయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యకుమారి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీతానగరం: మండలంలో విశాఖ–రాయగడ రైల్వేలైన్లో సీతానగరం మండలం మరిపివలస వద్ద గేటు దాటుతుండగా ఆదివారం సాయంత్రం రైలు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పార్వతీపురం రైల్వే పోలీస్ రత్నకుమార్ తెలిపిన వివరాలిల మేరకు ట్రైన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు వచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టు పక్కల గ్రామాలకు తెలియజేయగా మృతుడిని మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన పప్పల సూర్యనారాయణ(58)గా గుర్తించారన్నారు. మృతదేహాన్ని పార్వతీపురం ప్రభుత్వ జిల్లాకేంద్రాస్పత్రికి తరలించినట్లు తెలియజేశారు. -
లోక్ అదాలత్లో కేసులు పరిష్కారమవ్వాలి
విజయనగరం క్రైమ్: ఈ నెల 13న జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఆదేశించారు. పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాద కేసులు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలన్నారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఇందుకుగాను పోలీసు స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిరోజూ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. లోక్ అదాలత్ విజయవంతమయ్యేందుకు సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కోరారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా వారిని ప్రోత్సహించాలన్నారు. సమన్వయంతో పని చేస్తే త్వరగా కేసులు సానుకూలంగా రాజీ అయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులను ప్రతిరోజూ ఆయా సబ్ డివిజన్లకు చెందిన డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
పార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంటు) నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
విజయనగరం టౌన్: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా కేకే జగన్నాథ్, ఉపాధ్యక్షులుగా సాగి జానకీరామ్రాజు, డాక్టర్ పైల రమేష్ కుమార్, కార్యదర్శిగా కరణం భాస్కరరావు, సహ కార్యదర్శులుగా కాళ్ల లీలా ప్రసాదరావు, సంభాన శ్రీధర్, కోశాధికారిగా బైరెడ్డి సన్యాసినాయుడు, మెంబర్లుగా జి.లక్ష్మీ గాయత్రి దేవి, ఎల్.రమ, డి.రమేష్, ఎన్.పద్మావతి, ఎంజేవీఎస్ఎన్.తాడిరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిటర్నింగ్ అధికారింగా ఎం.పీటర్ మార్టిన్ వ్యవహరించి కొత్త కార్యవర్గసభ్యులను ఎంపిక చేశారు. ఎంపికై న సభ్యులందరినీ అసోసియేషన్ అభినందించింది. -
వీఓఏలకు కాలపరిమితి రద్దు చేయాలి
పార్వతీపురం టౌన్: వెలుగు వీవోఏ లకు మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కిల్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ ప్రకటించాలని వీవోఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో వీవోఏల జిల్లా మహాసభ కె.కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీవోఏల 3 సంవత్సరాల కాల పరిమితి సర్కిల్ రద్దు చేయాలని కోరారు. మెప్మాలో ఈ సర్క్యులర్ను రద్దు చేశారు అదే రకంగా వెలుగు సెల్ఫ్లో కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రకరకాల పనులు ఇవ్వడం ద్వారా ఐకేపీ వీవోఏ పని భారం పెరుగుతోందన్నారు. పలు యాప్లు లాగిన్ చేయడం ద్వారా వీవోఏలు అనారోగ్యం పాలవుతున్నారని, రాజకీయంగా వేధిస్తూ జిల్లాలో 19 మంది వీవోఏలను తొలగించడం అన్యాయమన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెరగడం లేదని విమర్శించారు. ఇస్తున్న వేతనాలు ఆరు, మూడు నెలలకు ఒకసారి చెల్లించడం దారుణమైన విషయమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తొలగింపులు, వేధింపుల నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీవోఏల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా వీవోఏలు ఐక్యమై ఉద్యమించాలని కోరారు. నూతన కార్యవర్గం ఎన్నిక జిల్లాలోని 15 మండలాల నుంచి హాజరైన వీవోఏల సంఘం నూతన జిల్లా అధ్యక్షరాలిగా కె. శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా కె.ధర్మరాజు, కోశాధికారిగా కె.కుమారి. సహ కార్యదర్శులుగా సుందరరావు, దేవి, ఉపాధ్యక్షుడిగా డి.అరుణ విజయ్ కుమార్లను మరో ఏడుగురు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వి రామలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, జిల్లా కోశాధికారి గొర్లె వెంకటరమణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
కల్వర్టుల నిర్మాణం కలేనా?
● జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన 44 కల్వర్టులు ● రెండింటికి మాత్రమే మంజూరైన నిధులుపార్వతీపురం రూరల్: రహదారులపై అధ్వానంగా భారీ గుంతలు ఏర్పడి వాహన చోదకులను ప్రమాదాలకు గురిచేస్తుంటే ఇంకోపక్క రహదారిపై ఉన్న కల్వర్టులు శిథిలావస్థకు చేరి, కుంగిపోయి మరింత భయాందోళనకు వాహనచోదకులను గురిచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రహదారులపై 44 కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి. వాటి నిర్మాణాల నిమిత్తం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు, అంచనా విలువలు అధికారులు పంపించారు. అయితే ప్రస్తుతం రెండు కల్వర్టులకు సంబంధించి మాత్రమే నిధులు మాత్రమే మంజూరయ్యాయని, మరో 133 కల్వర్టులకు మరమ్మతులు చేసేందుకు కూడా నివేదికలు పంపామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రహదారులు దారుణంగా గోతులమయమై వాహనాల రాకపోకలకు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రహదారుల్లో కనీస స్థాయిలో మరమ్మతులు సైతం సక్రమంగా నిర్వహించడం లేదు. జిల్లా కేంద్రం నుంచి కొరాపుట్కు వెళ్లేందుకు ఉన్న రహదారిపై మరమ్మతులు ప్రారంభించి కొన్ని భారీ గుంతలు మాత్రమే పూడ్చి పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రహదారిపై అక్కడకక్కడ ఏర్పడిన గుంతల్లో రాళ్లు తేలి మరమ్మతులకు నోచుకోకపోవడంతో సమస్యకు పూర్తి పరిష్కారం కాలేదని వాహన చోదకులు, ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం ఎప్పుడో? రహదారి నిర్మాణం, మరమ్మతులకు సంబంధించిన 97పనులకు నిధులు మంజూరు కాగా 324 కిలోమీటర్ల రహదారి పనులను ప్రారంభించి 295 కిలోమీటర్లు పనులు పూర్తిచేశామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికీ దారుణమైన గుంతలతో రహదారులు దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 324 కిలోమీటర్ల పరిధిలో పనులు చేశామని ఆర్అండ్బీ పరిధిలో మరో 150 కిలోమీటర్ల రోడ్ల పనులకు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా చాలా ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన రహదారుల పనులపై ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో స్పష్టత ఇవ్వడం లేదు. అంచనాలు వేస్తున్నామంటూ దాటవేస్తున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో బైపాస్రోడ్డు, పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి, లక్ష్మీనారాయణపురం, సంగంవలస, సీతంపేట తదితర గ్రామాల రోడ్లు గుంతలతో నేటికీ అధ్వానంగా ఉన్నాయి. మరి ఈ రోడ్డు పనులు ఎప్పుడు నిర్వహిస్తారో? ప్రభుత్వం నిధులు మంజూరు చేసేదెప్పుడో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు రోజూ కళ్లారా చూస్తూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్న రహదారులపై ముఖం చాటేస్తూ దాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య వాహన చోదకులు అధికారులు, పాలకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.నివేదికలు సిద్దం చేస్తున్నాం ఆర్అండ్బీ పరిధిలో గత అక్టోబర్లో మంజూరైన నిధుల మేరకు 324 కిలోమీటర్ల రహదారి పనులు ప్రారంభించి 295 కిలోమీటర్ల పనులు పూర్తి చేశాం. అలాగే కల్వర్టులకు సంబంధించి 44చోట్ల పునర్నిర్మాణాల కోసం, 133 కల్వర్టుల మరమ్మతులకు సంబంధించి అంచనాలతో కూడిన నివేదికలను పంపించాం. అయితే రెండు కల్వర్టుల పునర్నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరయ్యాయి. మిగతా వాటికి మంజూరు కావాల్సి ఉంది. రహదారులపై అవసరమైన చోట తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాం. రాధాకృష్ణ, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పార్వతీపురం, మన్యం జిల్లా -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
● వాచ్మన్ మృతిపై కుటుంబసభ్యుల ఆందోళనరాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పాలకొండ రోడ్డులోని లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లులో పనిచేస్తున్న వాచమన్ కోడూరు ముత్యాలనాయుడు (70) ఈ నెల 6న మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు మిల్లు యాజమాన్యంతోపాటు పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే వాచ్మన్ మృతిచెందాడంటూ పెద్ద ఎత్తున ఆదివారం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. పొనుగుటివలస గ్రామానికి చెందిన కోడూరు ముత్యాలు నాయుడు ఏడాది నుంచి రైస్మిల్లులో వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 14న రాత్రి యథావిధిగా విధులకు హాజరయ్యాడు. ఆ రోజు రాత్రి మిల్లు వద్ద ఊక కోసం రెండు లారీలు వచ్చాయి. లారీలో వచ్చిన కొంతమందిని అక్కడ మద్యం తాగవద్దని వాచ్మన్ అడ్డుకోగా దాడికి దిగారు. దీంతో వాచ్మన్ ముఖంతోపాటు పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. మరుసటి రోజు విషయం తెలుసుకున్న కుమారుడు లక్ష్మునాయుడు తండ్రిని ఆస్పత్రిలో చేర్పించడంతో పాటు సంతకవిటి పోలీసులకు, మిల్లర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వూండ్ సర్టిఫికెట్లేదని కేసు కట్టలేమని ఎస్సై గోపాలరావు తెలిపారని బాధితులు వాపోయారు. మరోవైపు రూ.15వేలు, రూ.25వేలు ఇప్పిస్తామని ఎస్సై రాజీ ప్రయత్నాలు చేసినట్లు ఫిర్యాదులో బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఆందోళన ముత్యాలనాయుడు మృతిని జీర్ణించుకోలేక అటు కుటుంబసభ్యులతో బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చి మిల్లు ఎదుట నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ ఉపేంద్రతోపాటు రేగిడి, వంగర, సంతకవిటి ఎస్సైలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనను అదుపుచేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. మృతుని కుమారుడి ఫిర్యాదుతో హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని సీఐ ఉపేంద్ర వెల్లడించారు. -
డీలా..!
ఆటోవాలా..● మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో స్టాండ్ దాటని ఆటోలు ● జిల్లాలో 12వేల పైచిలుకు ఆటోవాలాలపై ప్రభావం పాలకొండ రూరల్: మహిళలకు సీ్త్రశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పించిన కూటమి సర్కారు ఆ పథకం అమలుతో బతుకు భరోసా కోల్పోతున్న ఆటోవాలాల జీవనంపై దృష్టి సారించడం లేదు. దీంతో ఆటోలు స్టాండ్ దాటక ఆటోవాలాల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఎన్నికల సమయంలో తమకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఇప్పటికే రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు తాజాగా ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కోల్పోతున్న జీవన ప్రమాణాలు మెరుగుపరచాలంటూ రోడ్డెక్కుతున్నారు. అయినా కూటమి పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో ఆటో వాలాలు కూటమి పాలనపై నిప్పులు చిమ్ముతున్నారు. ఎన్నికల వేళ అధికారం కోసం తమకు అనేక హామీలు ఇచ్చిందని, నేడు వాటిని నెరవేర్చమంటే ముఖం చాటేస్తుందని పేర్కొంటున్నారు. జిల్లాలో 12 వేలకు పైగా ఆటోలు నిత్యం తిరిగాడేవని ఒక అనాధికారిక లెక్క. ఈ ఆటోవాలాల కుటుంబ సభ్యులు దాదాపు 36వేల పైచిలుకు ఉన్నారని యూనియన్ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఆటో, ట్యాక్సీ లైసెన్సులు కలిగిన డ్రైవర్లకు సూపర్ సిక్స్తో పాటు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తరువాత తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ బతుకు బండికి సీ్త్రశక్తి పథకంతో చెక్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఖర్చులు ఆటో నిర్వహణకు సాధారణంగా ఖర్చులుంటాయి. ప్రస్తుతం పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ఆటో కార్మికులకు రోజంతా కష్టపడితే కనీసం రూ.300 నుంచి రూ.400 వరకు కూడా మిగలని పరిస్థితి. ప్రతి సంవత్సరం ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం దాదాపు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు తనిఖీల పేరుతో పోలీసులు రవాణా శాఖ అధికారులు దాడులు చేసి వేల రూపాయలు జరిమానాలు విధిస్తున్నారు. ఆటో కొనుగోలు కోసం తీసుకున్న రుణాలకు నెలవారి వాయిదాలు కట్టుకోలేక తమ బతుకులు, దినదిన గండంగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న ప్రభుత్వ హయాంలో.. గత జగనన్న ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్ కేటాయించేది. అర్హులైన ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి వాహన మిత్ర పేరిట రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో పాటు వాహన డ్రైవర్ ప్రమాదవశాత్తు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల బీమా అందించేవారు. అలాగే రవాణా వాహనం కొనుగోలుకు బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే డ్రైవర్లకు రూ.3 లక్షల వరకు వడ్డీ రాయితీ అందించి భరోసా కల్పించేవారని ఆటోడ్రైవర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా కూటమి సర్కారు ఆటోవాలాల అభ్యున్నతికి కృషి చేయాలంటూ ఆయా సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆదుకోకుంటే మరణమే శరణ్యం అన్నట్లుంది మా పరిస్థితి. శాంతియుతంగా మా సమస్యలను అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. అయినా ఫలితం లేదు. – ఐ.ప్రసాద్, ఆటోడ్రైవర్, పాలకొండ ప్రభుత్వం స్పందించకుంటే పోరాటమే శరణ్యం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆటోవాలాలు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. అయినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో ఆర్థిక సాయంతో పాటు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అవేమీ కార్యరూపం దాల్చలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. – దావాల రమణారావు, సీఐటీయూ జిల్లా నాయకుడు రోజంతా కష్టించి ఆటో నడిపితేనే కుటుంబాన్ని పోషించగలం. ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా గిరాకీ లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంపాదన లేకపోవడంతో ఆటోలను నమ్ముకున్న మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికల హామీలను అమలు చేయాలి. – కాద రాము, ఆటో యూనియన్ నాయకులు, పాలకొండ -
నేడు ఐటీడీఏలో పీజీఆర్ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నారు. ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ హాజరు కానున్నారు. సమస్యలను గిరిజనులు వినతుల రూపంలో ఇవ్వవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శన సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భోజన పదార్థాలు పరిశీలించారు. అన్నం, కూరలు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. బాలికల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. జ్వరం, ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిచెన్ గార్డెన్, మరుగుదొడ్లు, డార్మెటరీ పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట హెచ్డబ్ల్యూవో పాలక అమల తదితరులు ఉన్నారు. 13న ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నిక పార్వతీపురం రూరల్: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా యూనిట్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో దీంతో పాటు కలెక్టరేట్ యూనిట్, పార్వతీపురం, పాలకొండ డివిజన్ల యూనిట్లకు ఈ నెల 13న రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించినట్టు ఆ అసోసియేషన్ అధ్యక్ష, కోశాధికారులు గొట్టాపు శ్రీరామ్మూర్తి, పీఎస్ఎల్ కుమార్ ఆదివారం తెలిపారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులను సైతం నియమించినట్టు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ఎన్నికల్లో ఉద్యోగులు పాల్గొని సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ప్రతి యూనిట్లో ఒక అధ్యక్ష, సహాధ్యక్షులతో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు, ఒక కార్యదర్శి, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు, ఒక కోశాధికారితో పాటు మరో 14 మంది సభ్యులను ఎన్నుకుంటామని తెలిపారు. విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలని, ఒత్తిడి లేకుండా పని చేసే వాతావరణం కల్పించాలన్న డిమాండ్తో రణభేరి కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని యూటీఎఫ్ జిల్లా కమిటీ ప్రకటించింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సంఘం మధ్యంతర కౌన్సిల్లో ఈ మేరకు పేర్కొన్నారు. తొలిత రణభేరి షెడ్యూల్ ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోహన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రణభేరి కార్యక్రమంలో భాగంగా 3వ రోజున 100 బైక్లతో బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, విజయనగరం, గంట్యాడ మీదుగా ఎస్.కోట వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బయలుదేరాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్కే ఈశ్వరరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జేఆర్సీపట్నాయక్, గౌరవాధ్యక్షులు మీసాల అప్పలనాయుడు, కె.విజయగౌరి పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏలు, పీఎఫ్ ఇతర ఆర్థ్ధిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసుల నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక పీఆర్టీ యూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సంఘం జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటించడానికి ఆలస్యమైన కారణంగా ఐఆర్ ఇవ్వాలని ప్రభు త్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు యాప్ల వినియోగం వంటి బోధనేతర పనుల ఒత్తిడి తో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగి న సమావేశంలో సంఘం నాయకులు వి.రవీంద్రనాయుడు, రాంబాబు పాల్గొన్నారు. -
రైతన్న ఎరువు సమస్యపై కూటమి మొద్దునిద్ర
● పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తీవ్రమైన ఎరువు కొరతతో రైతులు సమస్యల్లో ఉంటే కూటమి సర్కార్ మొద్దు నిద్ర వీడడంలేదని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. స్థానిక నాయకులతో కలిసి తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ‘ఎరువుల బ్లాక్మార్కెట్పై అన్నదాత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 9న పార్వతీపురం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న కార్యక్రమానికి రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్వతీపుం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సత్యనారాయణ, అధికార ప్రతినిధి ఎం.సత్యంనాయుడు, పార్టీ నాయకులు ఎస్. శ్రీనివాసరావు, షేక్షఫీ, బి.రవికుమార్, మజ్జి శేఖర్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎస్.లావణ్య, టి.బోదయ్య, వై.త్రినాథ, వి.నేతాజీ, నాగరాజు, కోరాడ చిట్టి పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద ఓ మహిళ పసిపాపతో రిక్షాలో వెళ్తున్న క్రమంలో రిక్షాను వెనకనుంచి లారీ ఢీకొట్టడంతో రిక్షా చక్రం రహదారిపై ఉన్న గుంతలో ఒక్కసారిగా దిగిపోయింది. దీంతో రిక్షా ఒక్కసారిగా పక్కకు వాలిపోవడంతో రిక్షాలో ఉన్న మహిళ, పసిపాప రోడ్డుపై పడి తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రిక్షాకు ఉన్న చక్రం గుంతలో దిగి ధ్వంసమైంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులంతా భావించారు.రిక్షాను పక్కకు తీసేందుకు సాయం చేస్తున్న స్థానికులు -
మళ్లీ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన 15 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోన్–1 మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోడానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా మహిళలను నిట్టనిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియాను సరఫరా చేసినప్పటికీ వాటిని టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ తరలించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడి చేసేసిందని విమర్శించారు. 80 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని, పర్మిట్ రూమ్లకు కూడా అనుమతులు ఇచ్చేశారని తెలిపారు. మద్యం కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, గంజాయిని హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పండిస్తున్నారని వివరించారు. వాటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్లీ దేవుడు రావాలని ప్రార్థిస్తున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రానున్న మూడేళ్లు ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి పాలనపై 15 నెలల్లో ప్రజా వ్యతిరేకత సూపర్ సిక్స్ పేరుతో నయవంచన యూరియా కోసం రైతులు రోడ్లెక్కడం దారుణం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, గంజాయితో అఘాయిత్యాలు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణిప్రజలకు రూ.81 వేల కోట్ల బకాయి కూటమి ప్రభుత్వం రైతులకు మొదటి ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చెప్పి ఒక్కో మహిళకు రూ.22,500 బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేల కింద ఇప్పటి వరకు రూ.45 వేలు బకాయి ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక్కరికి పింఛన్ గానీ, రేషన్ కార్డు గానీ మంజూరు చేయలేదన్నారు. పైగా రాష్ట్రంలో 3 లక్షల మంది అర్హులైన వారి పెన్షన్ తొలగించిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రూ.81వేల కోట్లు బాకీ పడిందని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 16 రకాల బస్సులు ఉంటే.. కేవలం 5 రకాల బస్సుల్లో అవకాశం కల్పించారన్నారు. అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. -
అన్నదాత ఉసురు తగులుతుంది
కొమరాడ: మండలంలోని గిరిశిఖర గ్రామాలైన కుంతేస్, పూడేస్, పెదశాఖ, నయా తదితర గ్రామాల రైతుల యూరియా కోసం ఉదయం 7 గంటలకే ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాసినా ఎరువు దొరకని పరిస్థితి నెలకొందని, రైతుల ఉసురు కూటమి ప్రభుత్వానికి తగులుతుందని సీపీఎం నాయకులు కొల్లు సాంభమూర్తి, గిరిజన సంఘ నాయకుడు చోడి ఆనంద్ అన్నారు. కొమరాడ గ్రోమోర్ సెంటర్ వద్ద ఎరువు కోసం పడిగాపులు కాసినా చాలా మంది రైతులకు ఎరువు లభించకపోవడంతో ఆందోళన వ్యక్తంచేశారు. కొమరాడలో యూరియా కోసం వేచిఉన్న గిరిజనులు -
ముగిసిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్మీట్
రాజాం: స్థానిక జీఎంఆర్ వరలక్ష్మి డీఏవీ స్కూల్లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. జీఎంఆర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె.గిరీష్, సీఏఓ సుప్రియోభట్టాచార్య తదితరులు ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి 22 డీఏవీ పాఠశాలలకు చెందిన 561 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వారిలో విజేతలకు పాఠశాల ఆవరణలో జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీఎంఆర్ఐటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ డీన్ రాంబాబు, జీసీఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. పురుషోత్తమరావు, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
కేంద్రాస్పత్రిలో సౌకర్యాల కల్పనకు ఆమోదం
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రాస్పత్రిలో తాగునీరు, ప్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, పెయింటింగ్స్, లిఫ్ట్ నిర్వహణ, మరమ్మతు పనులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఆమోదం తెలిపింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్రాస్పత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆస్పత్రిలో నీటికొరత లేకుండా చూడాలని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శివనాగజ్యోతి మాట్లాడుతూ ఆస్పత్రికి అవసరమైన పరికరాలు, వసతులు కల్పించాలని కోరారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, డీసీహెచ్ జి.నాగభూషణరావు, డీఎంహెచ్ఓ ఎస్. భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. గృహనిర్మాణాలు పూర్తిచేయాలి పార్వతీపురం రూరల్: గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పార్వతీపురం మండలంలోని హెచ్ కారాడవలస, పార్వతీపురం మున్సిపాల్టీకి సంబంధించిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను ఆయన శనివారం పరిశీలించారు. 181 గృహాల్లో కొన్నిమాత్రమే పూర్తిచేయడంపై అధికారులను ప్రశ్నించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు వేగంగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఆయన వెంట గృహ నిర్మాణ సంస్థ ఇన్చార్జి పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరాజు ఉన్నారు. -
గుట్టుగా బాల్య వివాహాలు..!
విజయనగరం ఫోర్ట్: ఈ ఏడాది జనవరి నెలలో బొండపల్లి మండలంలో 16 ఏళ్ల బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని చైల్డ్లైన్ ట్రోల్ఫ్రీ నంబర్ 1098కు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో చైల్డ్లైన్, బాలల సంరక్షణ, పోలీసులు సంబంధిత గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు. అలాగే విజయనగరం మండలంలో 17 ఏళ్ల బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈవిషయాన్ని చైల్డ్ లైన్ ట్రోల్ఫ్రీ నంబర్ 1098కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో అధికారులు సంబంధిత గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు. ఈ రెండు చోట్లే కాదు. జిల్లాలో అనేక చోట్ల బాల్య వివాహాలు గుట్టుగా జరిగిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల దృష్టికి వచ్చినవి చాలా తక్కువే. అధికారుల దృష్టికి రాకుండా రహస్యంగా బాల్యవివాహాలు జరిగిపోతున్నట్లు సమాచారం. బాల్య వివాహాలకు అధికారులు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశం కాని కమిటీలు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బాల్యవివాహ నిషేధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి పంచాయతీ సర్పంచ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో బాల్య వివాహాల నిరోధక అధికారులుగా వ్యవహరిస్తారు. అయితే ఈ కమిటీ సమావేశాలు ఎక్కడా కానరావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాల్యవివాహం చేయడానికి అస్కారం ఉండే వారిని వీరు గుర్తించి వారిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అనాథ బాలికలు, ఇంట్లో వృద్ధాప్యం బారిన పడిన తాతయ్యలు, మామ్మలు ఉండేచోట బాల్య వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి చోట్ల బాల్య వివాహాలు చేయకుండా వారికి అవగాహన కల్పించాలి. కాని ఎక్కడా ఈ చర్యలు కానరావడం లేదు. 10 మండలాల్లో ప్రయత్నాలు జిల్లాలోని 10 మండలాల్లో బాల్యవివాహాలు చేయడానికి బాలికల తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ 10 మండలాల్లో జనవరి నెల నుంచి ఇప్పటివరకు అధికారులు 23 చోట్ల బాల్య వివాహాలను నిలుపుదల చేశారు. నిలిపివేస్తామని చెప్పి వివాహాలు అధికారుల సమక్షంలో బాల్య వివాహాన్ని నిలుపుదల చేసినట్లు ఇరువైపులా తల్లిదండ్రులు చెబుతున్నారు. లఖిత పూర్వకంగా రాసి ఇస్తున్నారు. అంతటితోనే అధికారులు ఆగిపోతున్నారు. తర్వాత వారు నిజంగానే బాల్య వివాహలు నిలుపుదల చేశారా? లేదా ఎక్కడైనా వివాహం చేసేశారా అని ఫాలోఅప్ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల అధికారుల ముందు బాల్య వివాహం నిలుపుదల చేసిన తల్లిదండ్రులు మళ్లీ వివాహం జరిపించేస్తున్నారు. రెండేళ్ల జైలు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు చేసిన, ప్రోత్సహించిన వారిపై కేసులు నమోదు చేసి రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక్కోసారి జైలు, జరిమానా విడివిడిగా పడే అవకాశం ఉంది. ఈఏడాది 23 నిలుపుదల గ్రామాల్లో కానరాని నిషేధ కమిటీ సమావేశాలు అనధికారికంగా అధిక సంఖ్యలో జరిగిపోతున్నట్లు ఆరోపణలు -
టీడీపీ నేత ఇంటికి ఎరువులు
● పీఏసీఎస్ నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుపడిన సొసైటీ అధ్యక్షుడు ● తొలుత సొంతానివంటూ బుకాయింపు ● నకిలీ బిల్లులతో మభ్యపెట్టే ప్రయత్నం సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి నేతల ఇళ్లకు ఎరువులు తరలిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా.. అధికార యంత్రాంగం స్పందించిన దాఖలాలు లేవు. సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెబుతున్న అధికార యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలిసి కూడా మిన్నుకుంటోంది. ఏకంగా పీఏసీఎస్ నుంచి సొసైటీ అధ్యక్షుడే యూరియా, ఎరువులను అక్రమంగా తరలిస్తూ, పట్టుపడిన ఘటన స్వయంగా రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నియోజకవర్గంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఆటోలో తరలింపు.. తొలుత బుకాయింపు పాచిపెంట పీఏసీఎస్ సొసైటీ నుంచి సాలూరు వైపుగా ఆటోలో 11 యూరియా, 3 పొటాష్ ఎరువు బస్తాలను శనివారం తరలిస్తుండగా పి.కోనవలస చెక్పోస్టు సమీపంలో విజిలెన్న్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఎరువులు కేసలి పీఏసీఎస్ అధ్యక్షుడు మాదిరెడ్డి మజ్జారావుకు చెందినవిగా గుర్తించారు. తాను సాలూరు సమీపంలో సుమారు 11 ఎకరాల పామాయిల్ తోటను సాగు చేస్తున్నానని, అక్కడికి తీసుకెళ్తున్నట్లు ఆయన చెబుతూ, బిల్లులను చూపించారు. వాటిని పరిశీలించి.. అవి సరైనవి కాదని విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. టీడీపీ నాయకుడు మజ్జారావుపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎరువు బస్తాలను పి.కోనవలస రైతు సేవా కేంద్రంలో భద్రపరిచినట్లు విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పీఏసీఎస్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం కేసలి పీఏసీఎస్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని అధికారులు గుర్తించారు. 154 బస్తాల పొటాష్ అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాధారణ రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేసినా పీఏసీఎస్ ద్వారా కేవలం ఒకట్రెండు బస్తాలు ఇచ్చి పంపించేస్తున్నారని.. ఇలాంటి నాయకులు మాత్రం లోడ్లు తరలించుకుపోతున్నా రని స్థానికంగా కర్షకులు ఆవేదన చెందుతున్నారు. -
ఇన్ని కష్టాలా బాబూ..!
యూరియా కోసం యూరియా కోసం రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. పొలం పని మానుకుని పీఏసీఎస్లు, ప్రైవేటు దుకాణాలు, ఆర్ఎస్కేలకు పరుగుతీస్తున్నారు. రోజంతా మండుటెండలో నిరీక్షిస్తున్నారు. పస్తులతో ఎరువు కోసం పాట్లు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నల ఎరువు కష్టం చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది. కూటమి ప్రభుత్వ తీరును దుయ్యబడుతోంది. డబ్బులిచ్చి కొనుగోలు చేసే ఎరువు కోసం ప్రైవేటు దుకాణాల వద్ద పడిగా పులు కాయడాన్ని చూసి నివ్వెరపోతోంది. ఎరువుకోసం రైతన్నలకు ఇన్నికష్టాలా ‘బాబూ’ అంటూ నిట్టూర్చుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో రైతన్న ఎరువు పాట్లుకు శనివారం కనిపించిన ఈ దృశ్యాలే సజీవసాక్ష్యం. -
వ్యాన్ బోల్తా: డ్రైవర్కు గాయాలు
వేపాడ: మండలకేంద్రం వేపాడ సమీపంలో కళ్లాల్లో పంచదారతో వెళ్తున్న వ్యాన్ శనివారం బోల్తా పడడంతో డ్రైవర్ గాయాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడవరం నుంచి ఆనందపురం వేపాడ మీదుగా ఎస్.కోటకు పంచదారతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి వేపాడ కళ్లాలవద్ద రోడ్డుపై బోల్తాపడింది. దీంతో డ్రైవర్ కృష్ణకు గాయాలు కాగా స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి హెచ్సి శేషాద్రి, కానిస్టేబుల్ కిషోర్ 108 వాహానంలో తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డెంగీతో వివాహిత మృతిభోగాపురం: మండలంలోని చిన కవులవాడ (యాతపేట) గ్రామానికి చెందిన వివాహిత మైనపు మంగ (28) డెంగీ వ్యాధి సోకి శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మంగను కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి డెంగీ వ్యాధి సోకి మెదడుకు వ్యాపించిదని నిర్థారించారు. ఇంతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంగ పిచ్చి పిచ్చి పేలాపనలు, వాగడం మొదలు పెట్టింది. దీంతో వ్యాధి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో కొన్ని రోజులు ఉంచి వైద్యం అందించాలని వెద్యులు సూచించినప్పటికీ కుటంబసభ్యులు వినకుండా ఆమెకు దెయ్యం పట్టిందనే అనుమానంతో ఇంటికి తీసుకువచ్చేశారు. దీంతో ఆమెకు వైద్యం అందక చనిపోయింది. మృతురాలికి భర్త నరసింహులుతో పాటు ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. గూడ్స్ ఢీకొని వ్యక్తి మృతిలక్కవరపుకోట: మండలంలోని సంతపేట గ్రామం సమీపంలో కొత్తవలస–కిరండోల్ (కేకే లైన్) రైల్వే ట్రాక్ దాటుతుండగా మార్లాపల్లి గ్రామానికి చెందిన గేదెల దేముడుబాబు (48) గూడ్స్ ఢీకొట్టడంతో శనివారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేముడుబాబు సంతపేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నసమారాధనకు రైల్వే ట్రాక్ దాటి వెళ్తుండగా కిరండోల్ నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రెండు కాళ్లు తెగిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి కొన ఊపిరితో ఉన్న దేముడుబాబును ఎస్కోట సీహెచ్సీకి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసునమోదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యబొబ్బిలి: రాష్ట్రంలో యువత అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడంతో యువత ఆత్మహత్యల బాట పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని రైతు కూలీ కుటుంబానికి చెందిన బలగ మధు(23)అనే యువకుడు బొబ్బిలి సమీపంలోని గున్నతోటవలస సమీపంలోని రైలు కింద పడి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై రైల్వే పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బలగ శంకరరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మధుసూదన రావు ట్రిపుల్ ఐటీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. చిన్న కుమారుడు ఐటీఐ చదువుతున్నాడు. మధు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రాకపోవడంతో తరచూ కలత చెందేవాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఉద్యోగం రాకపోతే పోయింది. మా శక్తి ఉన్నంత వరకూ పెంచుతాం. తరువాత ఎప్పుడైనా ఉద్యోగం రాకపోతుందా?మమ్మల్ని అప్పుడు పెంచుతావుకదా? ఇంత ఘోరానికి ఒడిగట్టావా నాయనా అంటూ తల్లి దండ్రులు మృత దేహంపై పడి రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. మధు మృతి వార్తతో కృష్ణాపురంలో విషాద ఛాయలు అముకున్నాయి. మృతదేహాన్ని బొబ్బిలి ఆస్పత్రికి తరలించిన రైల్వే పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
మండుటెండలో నిలబడాలా?
ఎరువుల కోసంపార్వతీపురం రూరల్: కూటమి ప్రభుత్వ హయాంలో రైతన్నకు కష్టకాలం దాపురించిందని, ఎరువు కోసం మండుటెండలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి రావడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. ప్రభుత్వం సకాలంలో సక్రమంగా ఎరువులు పంపిణీ చేయకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని వాపోయారు. పార్వతీపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే ‘ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు’కు సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పార్టీ నాయకులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు రైతులకు ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, చివరకు రైతులు అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా అమరావతిలో వర్షాల కారణంగా వచ్చిన వరదనీటిని తోడే పనిలో కూటమి నాయకులంతా నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు నిరీక్షించే పరిస్థితి ఏ రోజు కనిపించలేదన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ 9న రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎన్.శరత్, ఎస్.శ్రీనివాసరావు, పి.సత్యనారాయణ, మల్లిబాబు, ఎం.శేఖర్, రవికుమార్, షఫీ, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. రైతన్న ఎరువు కష్టాలు ప్రభుత్వానికి పట్టడంలేదు రైతుల పక్షాన ఈ నెల 9న వైఎస్సార్సీపీ పోరుబాట విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పరీక్షిత్రాజు పిలుపు -
దుష్ట సంప్రదాయానికి పరాకాష్ఠ
● జెడ్పీచైర్మన్ ప్లెక్సీలు చించివేసిన దుండగులపై ఫిర్యాదు బొబ్బిలి: పట్టణంలో కొత్త దుర్మార్గానికి తెరతీశారు గుర్తు తెలియని దుండగులు. ఇటీవల జెడ్పీ చైర్మన్ మజ్జిశ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా బొబ్బిలి పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బ్లేడ్, చాకుతో కోసినట్టు చించేశారు. అభిమానంగా పెట్టుకున్న ఫ్లెక్సీలకు కూడా రాజకీయ దుర్భుద్ధితో ఇలా చించడం సరికాదంటూ చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే సంప్రదాయం కొనసాగించే అవకాశం ఉందని దీనిని కొనసాగించకుండా అడ్డుకోవాలని ఆలోచించిన వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్ నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్ రామకృష్ణ, పాలవలస ఉమా శంకర్, ఇంటి గోవిందరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి దుండగులను గుర్తించాలని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. -
జేసీ శోభిక సేవలు ప్రశంసనీయం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లాకు జాయింట్ కలెక్టర్గా ఎస్ఎస్ శోభిక అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆమెకు కలెక్టరేట్లో జిల్లా అధికారులు, రెవె న్యూ అధికారులు శనివారం వీడ్కోలు పలికా రు. ఆమెను దుశ్శాలువలు, జ్ఞాపికలతో సత్క రించారు. ఎన్నికల నిర్వహణ, ధాన్యం సేకరణలో ఆమె ప్రతిభను కలెక్టర్ ప్రశింసించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి మాట్లా డుతూ శోభిక పరిపాలనలో మంచి సహాయ సహకారాలు అందించారన్నారు. శోభిక మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం సంతృప్తినిచ్చిందని, అనుభవాలను నేర్పిందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డిప్యూటీ కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి, దిలీప్చక్రవర్తి పాల్గొన్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ హెచ్చరించారు. జిల్లాలో ప్ర స్తుతం 783 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభు త్వ, ప్రైవేట్ దుకాణాల్లో నిల్వ ఉందన్నారు. ఖైదీల ప్రవర్తన గమనించాలి పాలకొండ రూరల్: రిమాండ్ ఖైదీల ప్రవర్తనను జైలు అఽధికారులు, సిబ్బంది గమనించాలని ఆ శాఖ జిల్లా అధికారి కె.మోహనరావు సూచించారు. పాలకొండ సబ్ జైలును స్థానిక డీఎస్పీ ఎం.రాంబాబుతో కలిసి శనివారం సందర్శించారు. ఖైదీల ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీశారు. డీఎస్పీ మాట్లాడుతూ జైలు పరిసరాల్లో ఎటువంటి మారణాయుధాలు ఉండకుండా చూడాలని సూపరింటెండెంట్ బి.జోగులకు సూచించారు. వారి వెంట హెడ్వార్డర్ రమణ, ఏఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది నాగరాజు, హేమసుందర్, సత్యారావు, నాయుడు, హరికృష్ణ ఉన్నారు. రాజ్యలక్ష్మికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు విజయనగరం అర్బన్: జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూని వర్సిటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మికి ప్రతిష్టాత్మక ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ అకడమిక్ లీడర్షిప్’లభించింది. కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కంపెటెన్సీస్ (సీఎసీసీ ఇండియా) సంస్థ ఈ అవార్డును ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదానం చేసినట్టు శనివారం ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. ఆమెకు వర్సిటీ సిబ్బంది అభినందనలు తెలిపారు. ఏపీపీఎస్సీ పరీక్ష కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు విజయనగరం అర్బన్: జిల్లాలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష కోసం అభ్యర్థులకు సహాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ నంబర్ 08922– 236947ను సంప్రదించాలని కోరారు. ముగిసిన నవోదయ స్కూల్ టీచర్ల ఇంటర్వ్యూ విజయనగరం అర్బన్: జిల్లాలోని జవహర్ నవోదయ స్కూల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసింది. జేసీ సేతుమాధవన్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ప్రక్రియలో పీజీటీ ఇంగ్లిష్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, లెక్కలు రెండు పోస్టుల కోసం ఇంటర్వ్యూలు చేపట్టారు. ఏడాది కాలానికి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాడానికి ఎంపికలు నిర్వహించారు. మెరిట్ అభ్యర్థులను నియమిస్తామని జేసీ తెలిపారు. -
ఎరువుల బాధ్యత ప్రభుత్వానిదే
సాలూరు రూరల్: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే అందించాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, యంత్రపరికరాలు సిద్ధం చేసి రైతులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అన్నంపెట్టే రైతును ఆదుకుంటేనే అందరి కడుపులు నిండుతాయి. అలాంటిది సెప్టెంబర్ నెల వచ్చినా ఇంకా ఎరువుల కోసం రైతు క్యూలో కాలం వెళ్ల దీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కచ్చితంగా ప్రభుత్వం అన్నదాతపై చూపిస్తున్న నిర్లక్ష్యమేనని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు బాంధవుడినని చెప్పుకుంటారని, ప్రస్తుతం రైతులు యూరియా కోసం పడుతున్న తిప్పలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రైతుపై ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. పలు సందర్భాల్లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాలతో స్పష్టం చేస్తున్నారన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి? రోడ్డు మీదకి వచ్చి రైతు ఎరువుకోసం ఎన్ని పాట్లు పడుతున్నాడో చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం యూరియా పూర్తిస్థాయిలో ఇచ్చేస్తున్నామని చెబుతున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడికి ఆ యూరియా ఎక్కడికి పోతోందో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల్లో సేవలు గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాల్లో రైతుకు సీజన్ ప్రారంభంలోనే ఎరువులు, విత్తనాలు ఏమేరకు అవసరమో సిద్ధం చేసి ఉండేవన్నారు. ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలను కొన్ని చోట్ల అద్దెలకు ఇచ్చేస్తున్నట్లు పత్రికల్లో చూస్తున్నామన్నారు. ఫేక్న్యూస్లైతే అనుకూల పత్రికలపై కేసులు పెట్టండి పత్రికల్లో ఎరువుల కోసం వచ్చిన వార్తలు అన్ని అబద్ధాలేనని కొట్టిపారేస్తున్న మంత్రులు ప్రభుత్వ అనుకూల పత్రికల్లో దారిమళ్లిన ఎరువులు అని బ్యానర్ వార్తలు రాసిన పత్రికలపై ముందు కేసులు పెట్టాలన్నారు. మీకు అనుకూల పత్రికల్లో కూడా వైఎస్సీర్సీపీ నాయకులే రాయించేశారా? అని రాజన్నదొర ప్రశ్నించారు సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరి రఘు, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
చర్చలకు రానప్పుడు అసత్య ఆరోపణలు ఎందుకు?
● టీడీపీ నాయకులపై గిరిజన ప్రజా ప్రతినిధుల మండిపాటు పాచిపెంట: అభివృద్ధిపై చర్చలకు రానప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన ప్రజా ప్రతినిధులు సోములు లచ్చయ్య, మాదల సింహాచలం, డోనేరు లచ్చయ్యలు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, సభలు సమావేశాలు, ప్రచార మాధ్యమాలలో గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధిని విస్మరించిందని, ఒక్క అభివద్ధి పని కూడా చేయలేదని మాట్లాడుతున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసరగా, కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ సవాల్ స్వీకరించి, మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు చర్చకు వస్తామని తెలియజేశారన్నారు. అయితే తాము చర్చ ప్రదేశానికి వెళ్లగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ రాలేదన్నారు, స్వయంగా మేమే మళ్లీ వారికి ఫోన్ చేసి మాట్లాడగా శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు వస్తానని తెలియజేశారని శనివారం కూడా రాలేదన్నారు. చర్చించే ధైర్యం లేనప్పుడు సవాళ్లు ఎందుకు స్వీకరిస్తారని ఎందుకు అసత్యఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా అభివృద్ధిపై చర్చకు వస్తామంటే తాము ఎప్పుడూ ఆధారాలతో సిద్ధంగా ఉంటామని పత్రికా ముఖంగా మరోసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేశారు. -
రాణికట్ వ్యాధితోనే లక్షలాది కోళ్ల మృతి
● పశువర్థకశాఖ ఎ.డి కన్నంనాయుడుకొత్తవలస: ఇటీవల కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో అంతుచిక్కని వ్యాధితో లక్షలాది కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కోళ్లు రాణికట్ వ్యాధితోనే చనిపోతున్నాయని ఈ మేరకు విజయవాడ సెంట్రల్ లేబొరేటరీ నుంచి నివేదికలు అందాయని పశువర్ధకశాఖ కొత్తవలస ఎ.డి కన్నంనాయుడు శనివారం తెలిపారు. కోళ్ల మృతికి బర్డ్ప్లూ కారణం కావని నిర్ధారణ జరిగినట్లు చెప్పారు. లక్షలాది కోళ్ల మృతికి కారణం రాణికట్ వ్యాధే కారణమని స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజార్యోగానికి ఎటువంటి ముప్పులేదన్నారు. కాగా మరోపక్క కోళ్ల మృతులు మాత్రం ఆగడం లేదు. పౌల్ట్రీ కోళ్ల కన్నా దేశవాళీ కోళ్లే అధిక సంఖ్యలో మృతి చెందుతున్నాయి. లక్షలాది కోళ్ల మృతికి కారణం బర్డ్ప్లూ కారణమని ప్రభుత్వం ప్రకటిస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని, అందుకే ఆ వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించ లేదని కొంతమంది పౌల్ట్రీ రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గడిచిన 20 రోజులుగా కోళ్లు మృతిచెందినా అధికారులు పట్టించుకోక ప్రస్తుతం కొత్తరకం రాణికట్ ఆనే వ్యాధిని తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం బర్డ్ప్లూ వ్యాధి ఉందని ఆ వైరసే మన పౌల్ట్రీలకు సోకిందని రైతులు వాపోతున్నారు. మరోపక్క కోళ్ల మృతులు ఆగక పోవడంతో పదుల సంఖ్యలో పౌల్ట్రీలు ఖాళీ అవుతున్నాయి. రైతుల ఆరోపణపై ఎ.డి కన్నంనాయుడిని వివరణ కోరగా లేబొరేటరీలో పరీక్షల అనంతరం రాణికట్ వ్యాధిగా నిర్ధారణ అయిందన్నారు. రైతుల ఆరోపణలో వాస్తవం లేదన్నారు. వైరస్ తగ్గు ముఖం పట్టిన వెంటనే వ్యాక్సిన్ వేస్తామన్నారు. -
కాకినాడ టు ఒడిశా వయా మన్యం
సాక్షి, పార్వతీపురం మన్యం/పాచిపెంట: పీడీఎస్ బియ్యం యథేచ్ఛగా తరలిపోతోంది. కాకినాడ కేంద్రంగా కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున రవాణా అవుతున్న విషయం విదితమే. అక్కడ నుంచి ఒడిశాకు కూడా తరలిస్తుండడం విశేషం. విజయనగరం, పార్వతీపురం మన్యం మీదుగా శనివారం ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా లారీలో తరలిస్తున్న 220 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పాచిపెంట మండలం పి.కోనవలస చెక్పోస్టు సమీపంలో శనివారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కాకినాడ జిల్లా కోట నందిగాం మండలం అల్లంపూడి నుంచి ఒడిశాలోని నౌగాంకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. చెక్పోస్టు వద్ద విజిలెన్స్ సీఐ సింహాచలం సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. విచారణ అనంతరం స్థానిక సీఎస్డీటీ హేమలతకు అప్పగించారు. బియ్యాన్ని మంచాడవలస జీసీసీ గోదాంలో భద్రపరిచారు. పట్టుకున్న సరకు విలువ సుమారు రూ.11.53 లక్షలు ఉంటుందని అంచనా. తనిఖీల్లో విజిలెన్స్ ఎస్సై రామారావు, హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు, కానిస్టేబుల్ తిరుపతిరావు ఉన్నారు. లారీపై ‘జనసేన’ గుర్తులు బియ్యాన్ని తరలిస్తున్న లారీపై పెద్ద అక్షరాలతో జనసేన పేరుతో పాటు, ఆ పార్టీ గుర్తులు ఉన్నాయి. జనసేనకు చెందిన నాయకుడి వాహనంగా తెలుస్తోంది. ఆ బియ్యం తరలింపులో పార్టీ వారి పాత్ర ఉందా? లేకుంటే కేవలం లారీనే ఇచ్చారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలింపు పాచిపెంట వద్ద పట్టుకున్న విజిలెన్స్ అధికారులు తరలిస్తున్న లారీపై ‘జనసేన’ పేరు, పార్టీ గుర్తులు -
ఈ చెరువు ఎవరి సొంతం..?
● తనదే అంటున్న గ్రామస్తుడు, కాదంటున్న ప్రజలు ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ● తహసీల్దార్ కార్యాలయంలో నేడు విచారణనెల్లిమర్ల రూరల్: మండలంలోని తంగుడుబిల్లి కాలనీ వద్ద ఉన్న ఓ చెరువు పొలిటికల్ హీట్ను పెంచుతోంది. నెల్లిమర్ల – రణస్థలం ప్రధాన రహదారి పక్కన సర్వే నంబర్–72లో 2.40 ఎకరాల స్థలం పూర్వం నుంచి ఓ చెరువును పోలి ఉండేది. మూడేళ్ల కిందట వరకు ఆ చెరువు ఖాళీగానే ఉండేది. అప్పట్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెరువు తనదేనంటూ చదును చేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పటి తహసీల్దార్ రాము సైతం చెరువుపై ఎవరికీ యాజమాన్య హక్కు లేదని ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల గ్రామస్తులు ఇంటికి కొంత నగదు సేకరిచి చెరువును బాగు చేసుకున్నారు. దీంతో మళ్లీ సదరు వ్యక్తి ఆ స్థలం తనదని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అనంతరం గ్రామస్తులు చెరువు ఆక్రమణ అడ్డుకోవాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి కూడా తనదే ఆ స్థలం అంటూ అధికారులను ఆశ్రయించాడు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఆ స్థలం జిరాయితీ భూమిగా ఉందని ప్రస్తుత తహసీల్దార్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయం కాస్తా పీజీఆర్ఎస్కు చేరడంతో చెరువు అంశం ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సదరు వ్యక్తి తరఫున కొంత మంది టీడీపీ అగ్రనాయకులు రంగ ప్రవేశం చేసి కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ తగాదాపై అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఇరువర్గాలకు సమాచారం అందించామని తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఈ చెరువు ఎవరి సొంతమో పంచాయితీలో తేలిపోనుంది. -
గణేష్ నిమజ్జనంలో అపశృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని అలుగోలు గ్రామంలో గురువారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ చెరువులో పడి కొంచాడ గణపతి (45) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై గణేష్, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. విగ్రహాన్ని గ్రామ శివారులో ఉన్న గుండాల చెరువులో నిమజ్జనం చేసేందుకు యువకులంతా తీసుకెళ్తుండగా.. గ్రామానికి చెందిన కొంచాడ గణపతి తన ఫోన్ను చెరువు గట్టుపై ఉన్న నీలా కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి చెరువులో దిగి కూరుకుపోయాడు. అయితే ఈ సంఘటనను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఎంతకీ గణపతి రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయి ఉంటాడని భావించిన కుమార్ మొబైల్ను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకుని వెతకగా.. గణపతి మృతిదేహం కనిపించింది. మృతుడికి భార్య పావని, ఇద్దరు కుమార్తెలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయ్యన్నపేటలో ఒకరు.. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని అయ్యన్నపేటకు చెందిన రాజు (34) అనే యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. సీఐ ఆర్వీకే చౌదరి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడ్ని గురువారం రాత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సహచర స్నేహితులతో కలిసి రాజు నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసే క్రమంలో అందరితో పాటే చెరువులో దిగాడు. అయితే అందరూ పైకి వచ్చినా రాజు జాడ కనిపించలేదు. దీంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చి అందరూ వెతికారు. సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్, పోలీసులు శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకుని సుమారు 12 గంటలు గాలింపు చేపట్టగా రాజు మృతదేహం లభించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చౌదరి తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి -
రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
బొండపల్లి: మండలంలోని బొండపల్లి – గరుడబిల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పై హెచ్సీ బి. ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు పట్టాలపై వెళ్లి చూడగా సుమారు 30 సంవత్సరాల యువకుడి తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాడని చెప్పారు. మృతుడు పసుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు ఫ్యాంట్ ధరించాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించామని, వివరాలు తెలిసిన వారు 94906 17089, 94918 13163 నంబర్లను సంప్రదించాలని కోరారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొని మరొకరు.. బొండపల్లి: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు సమీపంలో గుర్తు తెలియని వాహనం ట్రాలీ రిక్షాను ఢీ కొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై యు. మహేష్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శిర నాగరాజు (42) బొండపల్లి మండలంలోని బోడిసింగిపేటలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవానికి ట్రాలీ తీసుకెళ్లాడు. నిమజ్జనం అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా..బొండపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో వెనుకనుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం రిక్షాను ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజును జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొదుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య గౌరి, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. చీపురుపల్లి: కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడిన పట్టణంలోని హడ్కో కాలనీకి చెందిన నాదెళ్ల శ్రీనివాసరావు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆగస్టు 29న శ్రీనివాసరావు తన స్నేహితుడు మదీనాతో కలిసి తన ఫొటో స్టూడియో నుంచి హడ్కో కాలనీలోని ఇంటికి వెళ్తుండగా.. గరివిడి నుంచి చీపురుపల్లి వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టాడు. దీంతో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు కన్నుమూశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితుల అరెస్ట్ ● డీఎస్పీ భవ్యారెడ్డి గజపతినగరం రూరల్: మండలంలోని కొత్తబగ్గాం గ్రామంలో ఈనెల 2వ తేదీన జరిగిన హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన పసుపురెడ్డి శ్రీను, పసుపురెడ్డి చంటితో పాటు మరో ఇద్దరు మండల పరిధి కొణిశ గ్రామంలోని మద్యం దుకాణం వద్ద ఈ నెల 2వ తేదీన వాదులాడుకున్నారన్నారు. వాగ్వాదం అనంతరం పసుపురెడ్డి చంటి తన అన్నయ్య పసుపురెడ్డి శ్రీనును ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకుని ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన చీకట్లో మాటువేశాడని తెలిపారు. ఇంతలో శ్రీను ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. వెంటనే ఆపి పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి పసుపురెడ్డి చంటికి అతని మిత్రుడు గుమ్మడి రామచంద్రుడు సహకరించడంతో ఇద్దరినీ గజపతినగరం రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ రమణ, ఎస్సై కిరణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. వంగర: మండల పరిధి మడ్డువలస పంచాయతీ జగన్నాథవలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గంధం చిన్నకు ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన సాయితో వివాహం జరిగింది. అయితే తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. అనంతరం జి.సిగడాం పోలీస్స్టేషన్లో భర్తపై ఫిర్యాదు కూడా చేసింది. ఈక్రమంలో పెద్దలు జోక్యం చేసుకుని భార్యాభర్తలకు సర్దిచెప్పారు. దీంతో వారిద్దరూ జగన్నాథవలసలో ఉంటుండగా.. తాజాగా తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో మాట్లాడాడని అనుమానిస్తూ సాయి శుక్రవారం ఉదయం గడ్డి మందు తాగేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త చిన్న కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి వారిద్దరినీ రాజాం సీహెచ్సీకి తరలించారు. ఏఎస్సై సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోగులకు తప్పని ఇక్కట్లు..
విజయనగరం ఫోర్ట్: పక్క ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బి.సూర్యకుమారి. ఈమెది భోగాపురం ప్రాంతం. చర్మ సంబంధిత సమస్యతో శుక్రవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చింది. ఇక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని ఆస్పత్రిలోని లేబరేటరీ వద్దకు ఆమె వెళ్లగా..ఇక్కడ థైరాయిడ్ పరీక్ష జరగడం లేదని సిబ్బంది బదులిచ్చారు. బయట ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకోవాలని సూచించారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో థైరాయిడ్ నిర్థారణ పరీక్షలు చేయక పోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. ఇదే అదునుగా ల్యాబ్ నిర్వాహకులు ఒక్కో రోగి నుంచి రూ. 500 నుంచి 800 రూపాయల వరకు వసూల చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంపై పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రోజుకు15 నుంచి 20 మంది వరకు .. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, డెంటల్, డెర్మాటాలజీ, పలమనాలజీ, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం , న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, ఈఎన్టీ, నెప్రాలజీ, యురాలజీ, తదితర విభాగాలున్నాయి. ఓపీ విభాగాల్లో రోగులను పరీక్షించిన వైద్యులు థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి పరీక్ష చేయించుకోవాలని చీటీలు రాసి ల్యాబ్కు పంపిస్తారు. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది రోగులకు థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరమవుతాయి. రెండు వారాలుగా థైరాయిడ్ పరీక్షలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యకుమారి సర్వజన ఆస్పత్రిలో అందుబాటులో లేని థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్లకు పరుగు రోగులకు వదులుతున్న చేతిచమురుచర్యలు తీసుకుంటా.. నేను ఈ రోజే బాధ్యతలు స్వీకరించాను. ఎందువల్ల థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు జరగడం లేదో తెలుసుకుంటాను. రెగ్యులర్గా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటాను. – అల్లు పద్మజ, సూపరింటిండెంట్ , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
టీడీపీలో వర్గపోరు..
జామి: టీడీపీలోని వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నికల సమయంలో తమను వాడుకుని తీరా అధికారం వచ్చాక కరివేపాకులా తీసి పడేశారని జామి మండల అధ్యక్షుడు లగుడు రవికుమార్, తదితరులు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీరుపై మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మండలంలోని అలమండలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు గొంప కృష్ణ ఎమ్మెల్యే టికెట్కు ప్రయత్నించగా.. ఆయనకు మద్దతు తెలిపామనే కక్షతో ఎమ్మెల్యే కోళ్ల తమను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలితకుమారిని ప్రకటించినప్పుడు.. విశాఖ ఎంపీ భరత్, తదితర పెద్దలు కోళ్ల గెలుపుకోసం కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో తాము ఎంతో కష్టపడి పార్టీ గెలుపుకోసం పనిచేసినట్లు చెప్పారు. అనుకున్న ప్రకారం ఎన్నికల్లో కోళ్ల లలితకుమారి గెలిచిందని.. అయితే తమను మాత్రం పూర్తిగా పక్కనబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మండలంలో వేరే వర్గాన్ని తయారు చేసి ప్రోత్సహిస్తున్నారన్నారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన తమను కాదని.. వేరే వారిని ప్రోత్సహంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అలమండలో మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు లలితకుమారి హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలెక్టర్ను కలిసి కొన్ని పనులు మంజూరు చేయించుకుంటే ఎమ్మెల్యే వాటిని అడ్డుకున్నారని వాపోయారు. మండలంలో ఏ కార్యక్రమం జరిగినా తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. తన తండ్రి లగుడు సింహాద్రి జెడ్పీ చైర్మన్గా పనిచేసినా 2021లో జరిగిన మహానాడులో కనీసం అతని పేరు ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పాక వెంకట త్రివేణి, నాయుడుబాబు, బి.స్వామినాయుడు, బి.అప్పలనాయుడు, చిప్పాడ నాగరాజు, జాగరపు శ్రీను, రామకృష్ణ, డి.చినసత్యం, ఎర్ర శ్రీను, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. తమకు గుర్తింపు లేదన్న టీడీపీ మండల అధ్యక్షుడు రవికుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అలమండలో సమావేశం ఎమ్మెల్యే కోళ్ల తీరుపై నిరసన పార్టీ అధిష్టానం దృష్టికి సమస్యలుమండల కమిటీ ఇదే.. సమావేశం అనంతరం పార్టీ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్. రవికుమార్, ఉపాధ్యక్షుడిగా వేండ్రపు నాయుడుబాబు, జనరల్ సెక్రటరీగా బండారు పెదబాబు, ఆర్గ్నైజింగ్ సెక్రటరీలుగా శిరికి చంద్రరావు, గూనూరు సంతోష్కుమార్, రంభ అవతారం, జె.జ్యోతి, కార్యదర్శులుగా బి.స్వామినాయుడు, దాసరి చినసత్యం, ట్రెజరర్గా చిప్పాడ నాగరాజు ఎంపికయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
లక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో రంగరాయపురం జంక్షన్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేపాడ మండలం చామలాపల్లి గ్రామానికి చెందిన పెద్దాడ అర్జునరావు మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భార్య, కుమారుడితో కలిసి విశాఖ జిల్లా చిన్న ముషిడివాడలో అర్జునరావు నివాసముంటున్నాడు. తమ స్వగ్రామంలో వినాయక నిమజ్జన మహోత్సవానికి బైక్పై వెళ్తుండగా రంగరాయపురం జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టిన అర్జునరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్పడాల్ తెలిపారు. బొలెరో ఢీకొని యువకుడు.. బొండపల్లి: మండలం కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కు సంబంధించి ఎస్సై యు. మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి మక్కువకు ముగ్గురు యువకులు బైక్పై వెళ్తుండగా పెట్రోల్ బంక్ వద్ద ఎదురురుగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో బోలెరోను బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదంలో బైక్పై కూర్చున్న దాసరి సాయి(20)తీవ్రంగా గాయపడి విజయనగరంలోని కేంద్ర సర్వ జన ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఆవాల రాజేష్ బైక్ నడుపుతూండగా, వెనుక ఎన్.రఘు ఉన్నాడు. గాయపడిన వారిద్దరినీ చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తునట్లు ఎస్సై తెలిపారు. -
‘సూపర్ స్కూల్’గా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల
లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామం సమీపంలో గల మహాత్మా జోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో సూపర్ స్కూల్ కేటగిరి–ఎలో ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ పాత్రో గురువారం తెలిపారు.ఈ మేరకు 3వ తేదీన విజయవాడలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గురుకుల విద్యాలయాల కార్యదర్శి మాధవీలత చేతుల మీదుగా ఈ ప్రశంసాపత్రాన్ని అందుకున్నట్లు చెప్పారు. 10వ తరగతి పరీక్షా పలితాల్లో శతశాతం ఉతీర్ణత,ఈ ఏడాది పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థినులు ట్రిపుల్ ఐటీకీ ఎంపిక కావడం, పాఠశాలలో గ్రంథాలయం నిర్వహణ, పర్యావరణ హిత ప్రాజెక్టులు తదితర అంశాల్లో మిగిలిన బీసీ గురుకుల విద్యాలయ సంస్థలకు భిన్నంగా నిర్వహించడం వల్ల ఈ గుర్తింపు లభించిందన్నారు. ఈ సందర్భంగా ఈ ఘనత సాధనకు కృషిచేసిన బోధనా సిబ్బందిని ప్రిన్సిపాల్ అభినందించారు. -
ప్రాణాలు తీసేస్తున్న డీజేలు
విజయనగరం క్రైమ్: ఆనందాలు కాస్త ఆవిరవుతున్నాయి. సరదాలు మితిమీరుతున్నాయి. పండగలు ప్రాణాలు తీస్తున్నాయి. సాంస్కృతిక వైభవం చాటాల్సిన కార్యక్రమాల్లో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. మారుతున్న కాలంలో సంప్రదాయాలను చాటిచెప్పాల్సిన పండగలలో సమష్టి కృషి, సమైక్య పనితనం మచ్చుకై నా కానరావడం లేదు. ఖర్చులు పెడుతున్నామనే భావన తప్ప భక్తి, ఆ పై సంస్కృతి పరిఢ విల్లడం లేదు. విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో వారం రోజులుగా అయిదు పోలీస్ స్టేషన్ల పరిధిలో అలాంటి ఘటనలే జరుగుతుండడం దారుణం. ఇటీవల విజయనగరం వన్ టౌన్ స్టేషన్ పరిధి కొత్త దుప్పాడలో ఓ యువకుడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో పెట్టిన భారీ శబ్దాలు (డీజే) ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడిని బలిగొన్నాయి. నిన్నకాక మొన్న విజయనగరం వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఒకటి, టూటౌన్ పీఎస్ లో ఒకటి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు వినాయక నిమజ్జనాల్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాల్లో మునిగి చివరకు కన్నవారికి దూరమయ్యారు. తాజాగా విజయనగరంలోని బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ (22) వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్స్కు బుధవారం రాత్రి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. డిగ్రీ పూర్తి చేసిన హరీష్ పోటీ పరీక్షలకు కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ఈ దారుణ ఘటన జరిగింది. శ్రుతిమించుతున్న శబ్దాలు -
మాటలకే పరిమితమైన మంత్రి హామీలు
మెంటాడ: ఇటీవల కురుస్తున్న వర్షాలకు చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి జగన్నాథ పురానికి వెళ్లేమార్గంలో ఉన్న తాత్కాలిక పైపు కల్వర్టు పైన ఉన్న మట్టి మొత్తం కోతకు గురైంది. పైపులు మాత్రమే మిగిలాయి. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జనసేన నాయకులు ఎన్నికల ముందు జగన్నాథపురం గ్రామానికి ఆండ్ర ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి తారురోడ్డు, చంపావతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తామని ముమ్మర ప్రచారం చేశారు. గుమ్మడి సంధ్యారాణి అయితే ఒక ఆడుగు ముందుకేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పదవి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జగన్నాథపురం యువత 12 సార్లు ఆమెకు దరఖాస్తులు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా పనులు ముందుకు సాగలేదు. రోడ్డు, బ్రిడ్జి గురించి ప్రశ్నిస్తే గ్రామంలోని కూటమినేతలు ఇదుగో..వస్తుంది అదుగో..వస్తుంది అని చెప్పుకువస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లాగానే ఈ హామీ కూడా గాలిలో కలిసి పోతుందేమోనని ఇక్కడి ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
కార్మికులకు వరం ఈ–శ్రమ్
విజయనగరం గంటస్తంభం: శ్రామికులకు వెన్నుదన్ను..విపత్కర వేళ తోడుగా నిలిచేది ఈ–శ్రమ్ కార్డు. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–శ్రమ్ కార్డు పొందడం పూర్తిగా ఉచితమైనా అవగాహన లోపం వల్ల చాలా మంది ప్రయోజనాలకు దూరంగా ఉంటున్నారు. టైలర్లతో సహా చాలా రంగాలకు చెందిన శ్రామికులు ఈ–శ్రమ్ కార్డు పొందడానికి అర్హులు. నమోదు కూడా సులభం. ఈ–శ్రమ్లో నమోదైన కార్మికులు, వలస కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పలు ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ డేటాబేస్ ఆధారంగా ఉపాధి,నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారు. నిజంగా శ్రామికుల పాలిట‘ ఈ–శ్రమ్’ ఓ వరం వంటిదని చెప్పవచ్చు. కార్మికశాఖ ఎంత కసరత్తు చేస్తున్నా ఇంకా పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ–శ్రమ్ కార్డు పొందలేదు. ఈ–శ్రమ్ నమోదు కోసం ప్రత్యేకంగా ఆగస్టు 25 తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కార్డు ఎలా పొందాలి? ఈ–శ్రమ్ కార్డు పొందడం చాలా సులభం. కంప్యూటర్పై అవగాహన ఉన్నవాళ్లు ‘ఈ–శ్రమ్’ వెబ్సైట్లోకి వెళ్లి సొంతంగా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్లు, మీ–సేవ, సీఎస్సీ సెంటర్లలో వివరాలను నమోదు చేసుకుని కార్డు పొందవచ్చు. బ్యాంకు అకౌంట్ నంబర్, అకౌంట్కు లింక్ అయిన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డు, ఫొటో ఉంటే సరిపోతాయి. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత సెల్ నంబర్కు మెసేజ్ వస్తుంది. కార్డును ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. అర్హులెవరంటే..? అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, వలస కార్మికులు, చిన్న, సన్నకారు, కౌలు రైతులు, కూలీలు, పశుపోషణ, వడ్రంగి, ఉప్పు తయారీ, ఇటుకబట్టీ, రాతి క్వారీ కార్మికులు, పనిమనుషులు, క్షురకులు, కూరగాయలు, పండ్ల విక్రేతలు, చేతివృత్తుల వాళ్లు, వీధి వ్యాపారులు, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, టైలర్లు, మత్స్యకారులు, నర్సరీ కూలీలు, ఉపాధి కూలీలు, భవననిర్మాణ కార్మికులు, పాల వ్యాపారులు, కొరియర్, పేపర్ బాయ్స్, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, సెరికల్చర్, హమాలీలు, హోంమెయిడ్స్, ఈఎస్ఐ, ఈపీఎఫ్లో సభ్యత్వం లేనివారు, ఆదాయపు పన్ను పరిధిలో లేనివాళ్లు అర్హులు. 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. -
మంచిసినిమాలను ప్రోత్సహించాలి
సాలూరు: మంచి సినిమాలకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కోరారు. పీపుల్స్ స్టార్ ఆర్నారాయణమూర్తి దర్శకత్వం వహించిన యూనివర్సిటీ పేపర్లీక్ సినిమాను నారాయణమూర్తితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో గురువారం రాజన్నదొర చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణమూర్తి ఎప్పుడూ మంచి చిత్రాలనే తీస్తుంటారని, సామాజిక అంశాలపై ఆయన తీసే సినిమాలు ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయన్నారు. ఇటువంటి మంచి సినిమాలు మరిన్ని రావాలంటే ప్రభుత్వం ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాలని కోరారు. తమ సినిమాను నేరుగా వచ్చి చూడడంతో పాటు తన వెంట అధిక సంఖ్యలో అభిమానులతో సినిమా చూసిన రాజన్నదొరకు నారాయణమూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
యూరియా అందక వెనుదిరిగిన అన్నదాతలు
లక్కవరపుకోట: మండలంలోని కళ్లేపల్లి సచివాలయానికి బుధవారం రాత్రి 150 బస్తాల యూరియా వ చ్చింది. ఈ యూరియాను రేగ, కళ్లేపల్లి, పూడివానిపాలెం, సీతాగొర్లెవానిపాలెం, శ్రీరాంపురం, తామరాపల్లి గ్రామాలకు చెందిన రైతులకు అందజేస్తామని వ్యవసాయాధికారులు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తు న రైతులు గురువారం ఉదయం 9 గంటలకే సచివా లయం ముందు క్యూ కట్టారు. ఇంతలో కూటమి నా యకులు సచివాలయం వద్దకు చేరుకుని వారికి నచ్చి న వారికి యూరియాను అందజేశారు. దీంతో ఉద యం నుంచి లైన్లో నిల్చున్న రైతులకు యూరియా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని వాపోయారు. రైతులను ఉసురు పెట్టిన ప్రభుత్వాలు ఎంతకాలం పాలన చేయలేవంటూ రైతులు శాపనార్థాలు పెట్టారు. -
కోళ్ల మరణాలను ఆపేందుకు సస్యరక్షణ చర్యలే మార్గం..
● పశువర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ దామోదరరావుకొత్తవలస: కొత్తవలస సబ్డివిజన్ పరిధిలో కొత్తవలస, లక్కవరపుకోట మండలాలతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఇటీవల లక్షకుపైగా పౌల్ట్రీ, నాటుకోళ్లు మృత్యవాత పడుతున్నాయని ఈ మరణాలను అరికట్టేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఒక్కటే మార్గమని పశువర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.దామోదరరావు అన్నారు. ఈ మేరకు కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో వింత వ్యాధితో లక్షకుపైగా కోళ్ల మృతి శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా కొత్తవలస ఎ.డి కార్యాలయంలో రెండు మండలాల పశువైద్యాధికారులు, సచివాలయం పశుసహాయకులతో సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. చనిపోయిన కోళ్ల నమూనాలను పరీక్ష నిమిత్తం విజయవాడ సెంట్రల్ లేబొరేటరీకి పంపించామని వ్యాధి నిర్థారణ నివేదికలు రాలేదని డీడీ తెలిపారు. ఈ సందర్భంగా డీడీ దామోదరరావు మాట్లాడుతూ లక్షకు పైగా కోళ్లు మృతి చెందడం వాస్తవమేనన్నారు. పౌల్ట్రీల్లో మరో రెండు నెలల వరకు కొత్త పిల్లలను పెంచవద్దని చూచించారు. గ్రామాల్లో ఎటువంటి పక్షులు చనిపోయినా గ్రామానికి దూరంగా గొయ్యి తీసి పాతిపెట్టాలని చెప్పారు. పౌల్ట్రీల్లో పనిచేసే కార్మికులు మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా ఉండేందుకు శానిటైజేషన్ చేయాలన్నారు. ఈ జాగ్రత్తలపై గ్రామాల్లో దండోరా వేసి అవగాహన కల్పించాలని సిబ్బందికి చూచించారు. కార్యక్రమంలో ఎ.డి కన్నంనాయుడు, రెండు మండలాల పశువైద్యాదికారులు పాల్గొన్నారు. -
చదువుకున్న చోటే బోధన
పార్వతీపురం రూరల్: విద్యార్థి జీవితంలో కళాశాల జ్ఞాపకాల నిలయం. ఇక్కడ నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు జీవితాంతం మార్గనిర్దేశం చేస్తాయి. ఆ విద్యార్థుల్లో కొందరు మాత్రమే ప్రతిభ, కృషి నిబద్ధతతో భవిష్యత్లో గురువులుగా మారుతారు. విద్యార్థిగా తరగతి గదిలో కూర్చుని గురువు వెలిగించిన జ్ఞానదీపంతో మంచి మార్గంలో నడుస్తూ గతంలో కళాశాల తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకున్న వారే అదే తరగతి గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూ పలువురికి ఆదర్శనమవుతున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్కళాశాలలో ప్రస్తుతం ప్రిన్సిపాల్గా, ఎకనామిక్స్ అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు గతంలో ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. ప్రస్తుతం వారు చదువుకున్న చోటే ప్రిన్సిపాల్గా ఒకరు, అధ్యాపకుడిగా మరొకరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వారు చదువుకున్న ఆనాటి జ్ఞాపకాలను వారి మాటల్లో తెలుసుకుందాం.నాడు విద్యార్థిగా నేడు ప్రిన్సిపాల్గా మా స్వగ్రామం సీతానగరం మండలం మరిపివలస కావడంతో రోజూ ఉదయం 8గంటలకు కళాశాలకు సైకిల్పై స్నేహితులతో కలిసి చేరుకునేవాళ్లం. సాయంత్రం 6గంటల వరకు కళాశాలలోనే ఉండే వారం. నాకు తక్కువ మార్కులు వచ్చిన కారణంగా ఎంపీసీలో సీటు ఆశించినప్పటికీ బైపీసీలో సీటు దక్కింది. ఈ కళాశాలలో విద్యార్థిగా జీవితానికి ఉపయోగపడే చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఊహించని రీతిలో ఇదే కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తానని అనుకోలేదు. 1990లో ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాను. అనంతరం 2003లో బోటనీ అధ్యాపకుడిగా కళాశాలకు వచ్చి నేడు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించడం, చదువుకున్న చోటే ఉద్యోగం చేయడం ఆసక్తిగా ఉంది. – ఆకుల రాజు, ప్రిన్సిపాల్, పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల 6 నుంచి ఇంటర్ వరకు మా నాన్నగారు ఇదే కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఈ క్రమంలో 1978 నుంచి 1985 వరకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇదే కళాశాలలో చదువుకున్నాను. అయితే ఇదే కళాశాలలో ప్రస్తుతం ఎకనామిక్స్ అధ్యాపకుడిగా పనిచేసే అవకాశం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకప్పుడు నేను కూర్చుని విద్యాబుద్ధులు నేర్చుకున్న చోటే అధ్యాపకుడిగా బోధన చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. –టి.రవికుమార్, గుమ్మలక్ష్మీపురం -
ఆర్టీసీ బస్సుల అడ్డగింత
● ఆందోళనకు దిగిన ఆటో కార్మికులు ● యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా ● నెలకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ బొబ్బిలి: ఆటో కార్మికుల ఉసురు తీయవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఆటో కార్మికుల యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులను అడ్డగించి నిరసన చేశారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన చేపడుతున్నప్పుడు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు అటు వైపు వెళ్లడంతో కార్మికులు అడ్డుకున్నారు. డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పొట్నూరు శంకరరావు, ఆటో కార్మికుల సంఘం నాయకులు ఎ.మోహనరావు, బీటీఆర్ గంగరాజు, వీరన్న, జయరాం తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తచట్టాలతో భారీ జరిమానాలు విధిస్తోందన్నారు. బీఎన్ఎస్ 106లోని పలు సెక్షన్ల ప్రకారం ఆటోలను నడపడమే కష్టతరంగా మారిందని వాపోయారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పుండుపై కారం జల్లినట్టు ఫ్రీ బస్సు ప్రవేశపెట్టిందని, దీంతో మహిళలెవరూ ఆటోలు ఎక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వేదాంతకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి అంతే కాకుండా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న రాష్ట్రం దానిని అసలు పట్టించుకోకుండా వేదాంత సంస్థకు ఫిట్నెస్, బ్రేక్ సర్టిఫికెట్ల జారీ బాధ్యతను అప్పగించడం వల్ల ఆటో కార్మికులంతా అదనపు భారాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పట్టణమంతా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా కార్మికులంతా పెద్ద పెట్టున నినదించారు. తమ సమస్యలను పరిష్కరిస్తామన్న చంద్రబాబు,పవన్ కల్యాణ్లు పత్తాలేకుండా పోయారన్నారు. వేదాంత సంస్థకు ఇచ్చిన బ్రేక్, ఫిట్నెస్ అనుమతులను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపును ప్రభుత్వమే భరించాలని, వెంటనే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 17న జిల్లా బంద్ చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ పట్టించుకోకపోతే ఈనెల 19న చలో విజయవాడ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ ఎం శ్రీనుకు మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో ఆటో కార్మికుల సంఘం నాయకులు త్రినాథ, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఐ కె.సతీష్కుమార్, ఎస్సై పి జ్ఙానప్రసాద్, సిబ్బంది ఆటో కార్మికులు బస్సులకు ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకున్నారు. -
గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కొమరాడ మండలంలోని నాగావళి నదికి ఆవల తొమ్మిది పంచాయతీల పరిధిలో 33 గ్రామాల ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరంతా రోజువారీ పనులకు నాగావళి నదిని దాటుకుని రావాల్సిందే. పడవ ప్రయాణమే వీరికి ఆధారం. నది ఉద్ధృతంగా ప్రవహించే సమయంలో బాహ్య ప్రపంచంతో వీరికి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. పూర్ణపాడు–లాభేసు వంతెన పూర్తయితే ఈ ప్రాంతాల్లోని సుమారు 20 వేల మందికిపైగా ప్రయోజనం. నాగావళి నదిపై కొమరాడ–కొట్టు గ్రామాల మధ్య పడవ ప్రయాణం -
ప్రయాణానికి చింతే..
సాక్షి, పార్వతీపురం మన్యం: వర్షం కురిస్తే చాలు.. మన్యం ప్రజలు వణుకు తారు. నదులు, వాగులు దాటి స్కూల్కు వెళ్లిన చిన్నారులు.. కూలి పనులకు వెళ్లిన పెద్దలు తిరిగి ఇంటికి చేరేవరకు బిక్కుబిక్కుమంటూ గడుపుతా రు. ఇక్కడ చినుకు రాలినా.. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా వారికి భయమే. సరైన రహదారు లు లేక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ ప్రయాణాలు చేయడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. చాలా వరకు నదులపై వంతెనలు లేకపోవడం, చిన్నపాటి వరదలకే కల్వర్టులు, కాజ్వేలు కొట్టుకుపోవడంతో ప్రధానంగా గిరిజనులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. గర్భిణులు, రోగులను డోలీలు కట్టి, వాగుల మీదుగా తీసుకెళ్లిన ఘటనలు అనేకం. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 50 వరకు వంతెనలు, కాజ్వేలు, కల్వర్టులు అవసరమని గిరిజన సంక్షేమశాఖ అధికారుల అంచనా. నిధులు లేక మధ్యలోనే ఆగిపోతున్నవి కొన్ని వారధులు కాగా.. నిధులు కోసం చూస్తున్నవి మరికొన్ని ఉన్నాయి. ●ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 96 కిలోమీటర్ల మేర నాగావళి ప్రవహిస్తోంది. ఎగువన వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తే ఆవలున్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు సాగించే క్రమంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. గతేడాది పాచిపెంట మండలం కొటికిపెంట ఏకలవ్య పాఠశాల ఉపాధ్యాయులు ఇద్దరు గెడ్డ దాటుతుండగా ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పశువులు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సందర్భాలున్నాయి. ●కురుపాం మండలం గొట్టివాడ గ్రామస్తులు మార్గమధ్యంలోని బోరిగెడ్డ దాటి ఏ పనికై నా ఇటు రావాల్సిందే. ●సీతంపేట మండలం రేగులగూడ–వెంపలగూడ మధ్య ప్రయాణం వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతోంది. వానలు కురిస్తే వాగు పొంగి, సమీప ప్రాంతాలకు రాకపోకలు తెగిపోతున్నాయి. ●భామిని మండలం కొరమ సమీపంలోని బగ్గామర్రిపాడు గెడ్డపై ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన 2002లో కూడిపోయింది. తర్వాత ప్రత్యామ్నాయంగా రూ.16 లక్షల వ్యయంతో కాజ్వే నిర్మాణం చేపట్టారు. భారీ వర్షాలు కురిస్తే వాగు ఉద్ధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ●మెంటాడ మండలం జగన్నాథపురం వద్ద చంపావతి నదిపై నిర్మించిన కల్వర్టు వర్షాల సమయంలో కొట్టుకుపోవడం సాధారణంగా మారింది. ప్రస్తుతం కూడా వర్షాలకు నది ప్రవాహం ధాటికి దెబ్బతింది. దీంతో జగన్నాథపురం, చాకివలస గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ●ఒడిశాలో వర్షాలు కురిస్తే సాలూరు నియోజకవర్గంలో సువర్ణముఖి నది ఉద్ధృతి పెరిగి సమీప గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్ అవతున్నా యి. దండిగాం వద్ద గతంలో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఇక్కడి కాజ్వే స్థానంలో డబుల్ రోడ్డుతో కూడిన వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఎండీఆర్ ప్లాన్ కింద రూ.8 కోట్లు మంజూరు చేయించారు. పనులు ప్రారంభమయ్యే సమయానికి ప్రభుత్వం మారడంతో ముందుకు సాగలేదు. అనంతర కాలంలో వంతెన పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల దండిగాం, కురుకూటి, సొంపి గాం, డెన్సరాయి తదితర పంచాయతీల్లోని సుమా రు 20కిపైగా గిరిజన గ్రామాల ప్రజలు వర్షాకాలం సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సువర్ణముఖి నది దాటుతున్నారు. సాలూరు మండలంలోని పెద్దపారన్నవలస గ్రామంలోని కూరగెడ్డపై కూడా నీటి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పార్వతీపురం మండలం వెలగవలస పంచాయతీ సందివలస గ్రామం నుంచి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే గెడ్డ దాటాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో విద్యార్థులు భయంభయంగానే వెళ్తున్నారు. -
ఆవిష్కరణాత్మక ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపాలి
పార్వతీపురం: నూతన ఆవిష్కరణాత్మక ప్రాజెక్టులకు ప్రతిపాదనలను ఈ నెల 5వ తేదీలోగా నీతి అయోగ్కు సమర్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారుల తో ఆయన బుధవారం సమీక్షించారు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం(ఏడీపీ), యాస్పిరేషన ల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద నూతన ఆవిష్కరణ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపించాలన్నారు. జిల్లాస్థాయి ప్రతిపాదనల సమన్వయం, పర్యవేక్షణకు నోడల్ అధికారిగా మహేష్ వ్యవహరిస్తారన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జియ్యమ్మవలస(రూరల్): గిరిజన గ్రామాల్లో జ్వరాల ఉద్ధృతి పై ‘మంచం పట్టిన మన్యం’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన వార్తకు వైద్యాధికారులు స్పందించారు. రావాడ రామభద్రపు రం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్ట ర్ సీహెచ్ శంకరరావు సిబ్బందితో కలిసి పిటి మండ గిరిజన గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశా రు. అవసరమైన వారికి మందులు అందజేశా రు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత గిరిజనులకు అవగాహన కల్పించారు. కాచిచల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. వీరఘట్టం: మండలంలోని పెద్ద గదబవలస పంచాయతీ పరిధిలో గదబవలస కాలనీకి కొద్ది దూరంలో గిరిజనులు వేసుకున్న ఐదు పూరిళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం నిప్పుపెట్టారు. పూరిళ్లన్నీ కాలిబూడిదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జి.కళాధర్ తెలిపారు. గదబవలస కాలనీకి సందిమానుగూడకు మధ్యలోని ప్రభుత్వ స్థలాన్ని సందిమానుగూడకు చెందిన గిరిజనులకు ఐటీడీఏ గతంలో డీ పట్టాలు ఇచ్చింది. అదే స్థలంలో గదబవలస కాలనీకి చెందిన కొంత మంది అక్రమంగా గుడెసెలు వేశారు. దీనిపై పట్టాదారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఏడాది జనవరిలో తొలగించారు. మళ్లీ గదబవలస కాలనీ కి చెందిన కొంత మంది ఈ ఏడాది మార్చి నెలలో ఇక్కడ మరలా గుడెసెలు వేశారు. ప్రస్తుతం వాటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్టు ఎస్ఐ తెలిపారు. పార్వతీపురం రూరల్: బడిదేవరకొండ గ్రానైట్ లైసెన్స్ను రద్దుచేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కలెక్టర్ శ్యామ్ప్రసాద్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వెలగవలస చెరువును గ్రానైట్ బూడిదతో నింపేసి చేపల వేటకు వెళ్లిన మత్స్యాకారుడు పాడి బంగారిదొర మృతికి గ్రానైట్ కంపెనీయే కారణమని ఆరోపించా రు. బంగారిదొర కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇప్పించేందుకు అధికారులు చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసి యజమానిని అరెస్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (ఎన్ఎంఎంఎస్) కోసం ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైందని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. దరఖాస్తులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’లో అందుబాటులో ఉన్నాయన్నారు. -
మహిళా సంక్షేమంపై మరుపు
● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా పథకాల అమలు ● ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాల ద్వారా నిధుల జమ ● జగనన్న తోడు పథకం ద్వారా రూ.49.99కోట్లు ● బ్యాంకు లింకేజీ ద్వారా రూ.947.94కోట్లు ● వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు విడతల్లో రూ.554.5కోట్లు ● వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.30.5కోట్లు -
6న చలో విజయవాడ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 6తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి డి.రాము, సీహెచ్. వెంకటేష్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎల్బీజీ భవన్లో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15నెలలు గడిచింది. కానీ విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని విమర్శించారు. ప్రధానంగా జిల్లాలో ఐదేళ్ల క్రితం ఏర్పడిన విజయనగరం, రాజాం, గజపతినగరం డిగ్రీ కళాశాలలకు దిక్కుమొక్కు లేకుండా పోయిందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రూ.6,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసి డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పలు డిమాండ్స్ సాధన కోసం జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమంలో జిల్లా విద్యార్థులంతా వేలాదిగా పాల్గొని జయపద్రం చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ కృషి చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి పోరాటం నిర్వహిస్తామని, దీనికి విద్యాశాఖ బాధ్యత వహింల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జె.రవికుమార్, వి.చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. పోస్టర్స్ ఆవిష్కరణ -
ర్యాగింగ్కు పాల్పడి జీవితం నాశనం చేసుకోవద్దు
విజయనగరం క్రైమ్: జిల్లాలో వివిధ ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఇతర కళాశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు సిబ్బందిని బుధవారం ఆదేశించారు.ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ కొన్ని సూచనలు, ఆపై జాగ్రత్తలను సిబ్బందికి, స్టూడెంట్స్కు జారీ చేశారు. ర్యాగింగ్ వల్ల కలిగే దుష్ప్ప్రభావాలను విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. తమ పరిధిలోగల ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలు, ఇతర విద్యాలయాలను సందర్శించి, విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పభ్రావాలను వివరించాలని చెప్పారు. సీనియర్ విద్యార్థులు తోటి విద్యార్థుల పట్ల శృతిమించి ప్రవర్తిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాలని సూచించారు. ర్యాగింగుకు పాల్పడిన విద్యార్థులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫలితంగా అర్ధాంతరంగా చదువు, కెరీర్ నాశనం అవుతాయన్న విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించాలని హితవు పలికారు. ఎస్పీ వకుల్ జందల్ హితవు -
రైలులో ముమ్మర తనిఖీలు
కొమరాడ: రాయిపూర్ నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ ట్రైన్లో అక్రమంగా గంజాయి, నిషేధిత వస్తువులు తరలి వెళ్తుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్సై కె.నీలకంఠం ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది, డాగ్స్క్వాడ్, ఈగల్ టీం తో పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్లో రైలులో బుధవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఒడిశా, రాయిపూర్ లాంటి ప్రాంతాల నుంచి గంజాయితో పాటు పలు నిషేధిత పదార్థాలతో అక్రమ వ్యాపారులు ప్రయాణం చేస్తున్నారని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. -
నమస్తే కార్యక్రమంపై అవగాహన పెంపొందించుకోవాలి
సాలూరు: చెత్త, ఇతర కుప్పల్లో దొరికే ప్లాస్టిక్, ఐరన్ వంటి వాటిని ఏరుకునే కార్మికులకు లబ్ధిచేకూర్చేందుకు ప్రవేశపెట్టిన నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) కార్యక్రమంపై అవగాహన పెంపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని స్క్రాప్ షాపుల యజమానులతో బుధవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కొందరు కార్మికులు చెత్త, ఇతర కుప్పల్లో దొరికే ప్లాస్టిక్,ఐరన్ వంటి వాటిని ఏరుకుని స్క్రాప్ షాపులకు వచ్చి విక్రయించి జీవనం సాగిస్తుంటారని, అటువంటి వారికి యాంత్రిక పద్ధతులపై శిక్షణ ఇచ్చి వారికి మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని వివరించారు. షాపులకు వచ్చి వాటిని అమ్మే కార్మికుల వివరాలను మున్సిపల్ కార్యాలయానికి అందించాలని సూచించారు. తద్వారా వారికి ఎంతో సాయం చేసిన వారవుతారని అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో బ్రెయిన్ హెల్త్ క్లినిక్ను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బుధవారం ప్రారంభించారు. నీతి ఆయోగ్ ప్రాజెక్ట్ బృందం డిల్లీ నుంచి వర్చువల్గా బ్రెయిన్ హెల్త్ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రసారం చేసి కార్యాచరణ అంశాలపై వివరించింది. జిల్లా ఆస్పత్రి నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ అధికారులు ఆన్లైన్ ప్రెజెంటేషన్ను వీక్షించారు. బ్రెయిన్ హెల్త్ క్లినిక్లో అందుబాటులోకి రానున్న సేవలపై జిల్లా ఆస్పత్రి వైద్యబృందంతో వారు చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక జీవన ప్రపంచంలో మానవుని జీవనశైలి విధానాలు క్రమేణా పలు మానసిక రుగ్మతలు, ఒత్తిడులకు దారి తీస్తున్న నేపధ్యంలో బ్రెయిన్ హెల్త్ పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో మైగ్రేన్(పార్శ్వ బాధ) కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, అలాగే ఎపిలిప్సీ (ఫిట్స్), ఆటిజం, డిప్రెషన్ కు లోనవ్వడం మొదలగు మానసిక సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపధ్యంలో బ్రెయిన్ హెల్త్ క్లినిక్ సేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు. మన జిల్లాకు బ్రెయిన్ హెల్త్ క్లినిక్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నందున జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డా.నాగభూషణరావు, ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి డా. జగన్మోహనరావు, సూపరిండెంటెంట్ డా.నాగశివజ్యోతి, సైకియాట్రిస్ట్ డా.రష్మిత, వైద్యాధికారులు డా శ్యామల, డా.కౌశిక్, ప్రజాప్రతినిధులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.