దాగుడుమూతలు..!
సాక్షి, పార్వతీపురం మన్యం: దాగుడుమూతా దండాకోర్ ఆటలా ఉంది జిల్లా కేంద్రంలోని అధికార యంత్రాంగం, ఆక్రమణ దారుల తీరు. చేసిందే కోట్ల రూపాయల విలువైన వరహాల గెడ్డ ఆక్రమణ..చేయించుకున్నదే తప్పుడు రిజిస్ట్రేషన్..ఆపై దర్జాగా విశాఖకు చెందిన వ్యాపారికి విక్రయం..ఇది చాలదన్నట్లు భయం, బెరుకు లేకుండా హెచ్చరిక బోర్డుల తొలగింపు. కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు బోర్డులు పాతుతున్న అధికారులు..ఆక్రమణదారులను సుతిమెత్తగా మందలిస్తున్నారు. ‘అబ్బో..ఆపాటి గౌరవం మేమెందుకెవ్వం?’ అంటూ నాలుగు రోజులు ఆగి, వేసిన బోర్డును పీకేస్తున్నారు ఆక్రమణ దారులు.
వరహాలగెడ్డ విషయంలో అధికారులు, ఆక్రమణదారుల తీరు
హెచ్చరిక బోర్డు’ పెట్టి సుతిమెత్తగా మందలిస్తున్న అధికారులు
నాలుగు రోజులు ఊరుకుని..
పీకి పడేస్తున్న ఆక్రమణదారులు


