రెండు రోజుల్లో స్థలం మొత్తం కొలతలు వేస్తాం
వీరఘట్టం పట్టణంలోని గాసీవీధికి మేధరివీధి మధ్యలో ఉన్న స్థలం వద్ద గత కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. తమ సిబ్బందిని పంపించి స్థలాన్ని పరిశీలించాం. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 304లో 2.06 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అది గతంలో శ్మశానవాటిక స్థలం. ప్రస్తుతం ఇక్కడ వెల్నెస్ సెంటర్ కడుతున్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కొలతలు వేసి ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తిస్తాం. ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం. ఇక్కడ ప్రవేటు వ్యక్తులు ఎవరికీ సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఇక్కడ స్థలాన్ని ఎవరైనా అమ్మాలని చూసినా, కొనాలని చూసినా శిక్షార్హులు అవుతారు. దళారుల మాయమాటలు నమ్మవద్దు.
– ఏ.ఎస్.కామేశ్వరరావు, తహసీల్దార్, వీరఘట్టం
●


