రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రామభద్రపురం: మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయలైన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రామభద్రపురం చొక్కాపు వీధికి చెందిన చొక్కాపు రామారావు పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై బుసాయవలస వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దాంతో రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రధమ చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బాడంగి సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


