బాల మేధావి అపూర్వ అష్టావధానం | - | Sakshi
Sakshi News home page

బాల మేధావి అపూర్వ అష్టావధానం

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

బాల మేధావి అపూర్వ అష్టావధానం

బాల మేధావి అపూర్వ అష్టావధానం

అబ్బురపడ్డ సాహితీవేత్తలు

సీతంపేట: విశాఖ సాహితి ఆధ్వర్యంలో ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో జరిగిన నరసింహదేవర జయలక్ష్మి సంస్కృత అష్టావధానం సభికులను మంత్రముగ్ధులను చేసింది. బెంగళూరులో 7వ తరగతి చదువుతున్న ఈ బాలిక, మహాదేవ మణి శిష్యురాలిగా తన అద్భుత మేధాశక్తిని ప్రదర్శించింది. ఎనిమిది మంది పృచ్ఛకులు సంధించిన కఠినమైన సాహిత్య సవాళ్లు, నిషిద్ధాక్షరి, దత్తపది వంటి అంశాలను ఏకాగ్రతతో ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు అల్లి తన ధారణా శక్తితో అందరినీ నివ్వెరపరిచింది. శ్రీలలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ సభకు ఆచార్య కోలవెన్ను మలయవాసిని అధ్యక్షత వహించగా, డాక్టర్‌ ధూళిపాళ మహదేవమణి సంచాలకులుగా వ్యవహరించారు. పీబీవీ శివప్రసాద్‌, డా.ధూళిపాళ అన్నపూర్ణ వంటి ప్రముఖులు పృచ్ఛకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో, చిన్న వయస్సులోనే సంస్కృత భాషపై జయలక్ష్మి కనబరిచిన పట్టును చూసి సెంచురియన్‌ వర్సిటీ వీసీ ఆచార్య జి.యస్‌.ఎన్‌.రాజు, విశ్రాంత ఐఏఎస్‌ వై.వి. అనురాధ తదితర ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement