ఘనంగా గణతంత్ర దినోత్సవం
విశాఖ చేరుకున్న భారత్ – కివీస్ జట్లు
● పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ ● ఉత్తమ అవార్డులు అందుకున్న 498 మంది ఉద్యోగులు
ద్వైపాక్షిక్ష టీ20 సిరీస్లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు భారత్తో పాటు న్యూజిలాండ్ జట్లు సోమవారం విశాఖ చేరుకున్నాయి.
జీవీఎంసీ శకటానికి ప్రథమ బహుమతి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలోని ప్రగతిని తెలియజేస్తూ ఎనిమిది శకటాల ప్రదర్శన నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ విశాఖ లక్ష్యాలను తెలుపుతూ జీవీఎంసీ తయారు చేసిన శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. నైపుణ్య విలువలతో విద్యార్థి సమగ్రాభివృద్ధి అనే అంశంపై సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ప్రదర్శించిన శకటం ద్వితీయ స్థానం సొంతం చేసుకోగా, మహిళా సాధికారతను ప్రతిబింబిస్తూ మహిళా, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ రూపొందించిన శకటం తృతీయ స్థానంలో నిలిచింది. సివిల్ సప్లయిస్ విభాగం రూపొందించిన శకటం ప్రోత్సాహక బహుమతి గెలుచుకుంది. కలెక్టర్ చేతుల మీదుగా ఆయా విభాగాల అధికారులు బహుమతులు అందుకున్నారు.
ఘనంగా గణతంత్ర దినోత్సవం


