మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
కూసుమంచి : మత సామరస్యానికి, సోదరభావానికి ఇఫ్తార్ విందులు వేదికలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచిలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు


