breaking news
Khammam District Latest News
-
ఔను.. వారు విజేతలు!
కష్టపడితే విజయం బానిసగా మారుతుందని నిరూపించారు కొందరు యువతీ, యువకులు. నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ముగ్గురు ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఏపీలో నోటిఫికేషన్ రాగానే సిద్ధమై అక్కడ కూడా ఉద్యోగాలు సాధించడం విశేషం. – మధిరప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించాలన్న కలను నిజం చేసుకునేందుకు తెలంగాణలో ఐదు శాతంగా ఉన్న ఓపెన్ కేటగిరీలో పలువురు ఏపీ వాసులు పోటీపడ్డారు. ఇందులో నాయుడు భవాని, రుద్రపంక్తి సంతోష్ కుమార్, మజ్జిగ త్రినేత్ర ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరు గత ఏడాది అక్టోబర్ 10న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకొని మధిర మండలంలో ఎస్జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ సంతృప్తి చెందక... సొంత రాష్ట్రమైన ఏపీలోనూ ఉద్యోగాలు సాధించాలనే తపనతో సిద్ధమై ఇటీవల పరీక్ష రాయగా ఉద్యోగాలు దక్కాయి. దీంతో వీరు ఏపీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలో ఈనెల 19న వారు నియామక పత్రాలు అందుకోనున్నారు. కాగా, మధిర మండలంలో పనిచేసిన 11 నెలల కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల, సహచర ఉపాధ్యాయుల మన్ననలు పొందారు.ఏపీలోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగాయలంక గ్రామం భవానీ స్వగ్రామం. ఆమె తండ్రి దుర్గాప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తల్లి వీరలక్ష్మి ఆశా వర్కర్గా పనిచేస్తోంది. తెలంగాణ టెట్లో 150కి 135, డీఎస్సీలో వందకు 81 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం మధిర ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఏపీ టెట్లో 150కి 143.58, సాధించగా డీఎస్సీలో వందకు 85.19 మార్కులతో ఉద్యోగానికి ఎంపికై ంది. ఈసందర్భంగా భవానీ మాట్లాడుతూ తన తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించానని తెలిపారు. తన చిన్నతనంలో మూస పద్ధతిలో బోధనతో ఇబ్బంది పడగా, సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ సిద్ధమయ్యానని చెప్పారు. ఇదే సమయాన తాను బోధించే పాఠశాలలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు. -
జ్ఞానమే ఆయుధం కావాలి
సత్తుపల్లిరూరల్: విద్యార్థులు జ్ఞానాన్నే ఆయుధంగా చేసుకోవాలని, తద్వారా అదే బలంగా మారి ఉన్నత స్థానాలను చేరుస్తుందని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో కళాశాలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందిస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయటం అద్భుతమైన మైలురాయిగా నిలిచేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని చెప్పారు. విపాసన ఎడ్యూకేషనల్ ట్రస్టీ బండి అన్విద మాట్లాడగా కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్రెడ్డి, ప్రిన్సిపాల్ ఊటుకూరి శేషారత్నకుమారి, మీరాసాహెబ్, షేక్ యాకూబ్, కొండా రవికుమార్, టి.శేషసాయి, రామకృష్ణ ప్రసాద్, వీరన్న, కృష్ణారెడ్డి, శేఖర్బాబు పాల్గొన్నారు.ఎంపీ, హెటిరో అధినేత పార్థసారధిరెడ్డి -
‘రెవెన్యూ’లో ఉలికిపాటు..
● ఏసీబీ దాడులతో కలకలం ● ఇంకా ‘జలగ’లు ఉన్నాయని ఆరోపణలు సత్తుపల్లి: జిల్లాలోని తల్లాడ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం చేసిన తనిఖీలతో రెవెన్యూ శాఖలో కలకలం మొదలైంది. తల్లాడ తహసీల్దార్ వి.సురేష్కుమార్, ఆర్ఐ మాలోతు భాస్కర్నాయక్, కంప్యూటర్ ఆపరేటర్ బి.శివాజీరాథోడ్ రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. పని చేయకుండా కొర్రీలు పెట్టడం, డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఓ రైతు ఏసీబీని ఆశ్రయించగా రెడ్హ్యాండెండ్గా పట్టుకున్నారు. గతంలోనూ తల్లాడలోనే తహసీల్దార్ పట్టుబడడం గమనార్హం. అయితే, రెవెన్యూ శాఖలో ఇంకా పలువురు అక్రమార్కులు ఉన్నందున ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. అయినా భయం లేదు... సత్తుపల్లి నియోజకవర్గంలో ఏసీబీ దాడులు జరుగుతున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారకపోవటం చర్చానీయాంశంగా మారింది. 1989లో అప్పటి తల్లాడ తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. 2019 ఫిబ్రవరి 26న తల్లాడ మండలం కలకొడిమ వీఆర్ఓ శ్రీనివాసరావు, అదే ఏడాది మార్చి 27న సత్తుపల్లి మండలం గంగారం వీఆర్వో పద్దం వెంగళరావు, జులై 16న దమ్మపేట నీటిపారుదల శాఖ ఏఈఈ పంది నర్సింహారావు, ఈ ఏడాది జనవరి 27న మున్సిపల్ వార్డు ఆఫీసర్ వినోద్ను ఏసీబీ రెడ్హ్యాండెట్గా పట్టుకుంది. అలాగే, 2019లో జులై 26, 27వ తేదీల్లో వేంసూరు తహసీల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేపట్టారు. ఎకరాకు రూ.10వేల నుంచి.. రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిపై వరుస ఆరోపణలు వస్తుండడం, ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నా తీరు మారడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏ సర్టిఫికెట్కై నా ముక్కుపిండి డబ్బు వసూళ్లు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారని, రిజిస్ట్రేషన్లకు వచ్చిన రైతుల నుంచి ఎకరాకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరైనా డబ్బు ఇవ్వకపోతే సాంకేతిక సమస్యల పేరిట పెండింగ్ పెట్టడం ఆనవాయితీగా మారిందని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ భూమి ప్రొబిటెడ్ జాబితాలో పడగా, ఆన్లైన్లో దరఖాస్తు రైతుకు సంబంధించి పత్రాలను ఓ అధికారి కలెక్టరేట్కు సమర్పించకపోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయని సమాచారం. ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రి పొంగులేటి మందలించినా.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూలై నెల 17న పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఇద్దరు గిర్దావర్ల తీరుతో ఫిర్యాదు చేయడంతో తక్షణమే వారిని బదిలీ చేయాలని ఆదేశించారు. ఇక జులై 25న జిల్లాలోని 27 మంది డిప్యూటీ తహసీల్దార్లు, గిర్దావర్లను బదిలీ చేస్తే సత్తుపల్లి నియోజకవర్గం నుంచే ఐదుగురు ఉండడం చర్చకు దారితీసింది.తల్లాడ: తల్లాడ తహసీల్దార్ సహా ముగ్గురు ఒకేరోజు ఏసీబీకి పట్టుబడడంతో గురువారం కార్యాలయం వెలవెలబోయింది. తహసీల్దార్ సురేష్కుమార్, ఆర్ఐ భాస్కర్నాయక్, భూ భారతి ఆపరేటర్ శివాజీ రాథోడ్ బుధవారం ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే, ఈ స్థానాల్లో ఎవరినీ నియమించకపోవడంతో కార్యాలయంలో లావాదేవీలేవీ జరగలేదు. గత ఏడాది కాలంగా తల్లాడలో డిప్యూటీ తహసీల్దార్, రెండో ఆర్ఐ కూడా లేరు. ఇప్పుడు ముగ్గురు ఏసీబీకి పట్టుబడడంతో భూభారతి రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, ఇతర కార్యకలాపాలు కూడా కొనసాగలేదు. -
అందరిపైనా అమ్మవారి ఆశీస్సులు
ఖమ్మం మయూరిసెంటర్: దుర్గామాత ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. ఖమ్మం 48వ డివిజన్లో కార్పొరేటర్ తోట రామారావు, గోవిందమ్మ ఆధ్వర్యాన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించనుండగా విగ్రహాన్ని గురువారం వేదికపైకి చేర్చారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు జరిగే పూజల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. పొంగులేటి వ్యాఖ్యలు గర్హనీయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పొంగులేటి అదే కేటీఆర్తో స్నేహం చేశారని, అదే కేటీఆర్ 2023 ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మున్నూరు కాపు సంఘం నాయకులు ఆకుల గాంధీ, తోట రమేష్, తోట లక్ష్మణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎంపీ వద్దిరాజు రవిచంద్ర -
●ప్రతిష్ఠాపనకు ప్రతిమలు సిద్ధం
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22న మొదలుకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా గతంతో పోలిస్తే ఎక్కువ మంది అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠాపనకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కోల్కతా కళాకారులు అమ్మవారి విగ్రహాలను సిద్ధం చేయగా.. మండపాల నిర్వాహకులు ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఖమ్మం కాల్వొడ్డు వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని వేదిక వద్దకు గురువారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని చేర్చగా మహిళలు కోలాటం ఆడుతూ స్వాగతం పలికారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
●రుద్రపంక్తి సంతోష్ కుమార్
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సంతోష్ తండ్రి మల్లేశ్వరరావు ఆ గ్రామ శివాలయంలో పూజారిగా పనిచేస్తుంటారు. తల్లి శైలజ గృహిణి. టీజీ టెట్లో 132, డీఎస్సీలో మూడో ర్యాంకు సాధించి మధిర ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఏపీ టెట్లో 139, అక్కడి డీఎస్సీలో 85.25 మార్కలు సాధించాడు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ఆర్థిక సమస్యలను అధిగమించి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సిద్ధమయ్యానని వెల్లడించారు. హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు షేక్ షావలీ ప్రోత్సహించగా, డీఎస్సీకి అకాడమీ పుస్తకాలు చదువుతూ సొంతంగానే నోట్స్ సిద్ధం చేసుకున్నానని చెప్పారు. దీంతో నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో, లోకల్ కోటాలో ఏపీలోనూ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. మధిర పాఠశాలలో కొద్దికాలమే పనిచేసినా విద్యార్థుల ఉన్నతికి బాధ్యతాయుతంగా వ్యవహరించానని, ఫలితంగా సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మన్ననలు అందాయని వెల్లడించారు. -
20న జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేలా టేకులపల్లి మోడల్ కేరీర్ సెంటర్లో ఈనెల 20న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ లాబోరేటరీస్లో ప్రొడక్షన్ ట్రెయినీ ఉద్యోగలకు ఎంపిక ఉంటుందని వెల్లడించారు. ఎంపీసీ, బైపీసీతో ఇంటర్ పూర్తిచేసిన వారు, ఎంఎల్టీ, బ్రిడ్జి కోర్సు, ఫార్మా టెక్ 2024–2025లో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 18 – 25 ఏళ్ల వయస్సు కలిగిన యువకులు సర్టిఫికెట్ల జిరాక్స్తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 91546 79103 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రేషన్ దుకాణం సీజ్ కొణిజర్ల: కొణిజర్ల మండలం సాలెబంజరలోని రేషన్ దుకాణంలో రికార్డులతో పోలిస్తే బియ్యం తక్కువగా ఉండటంతో సీజ్ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్ తెలిపారు. రేషన్షాప్లను గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులు, స్టాక్ను పరిశీలించారు. షాప్నకు 86.76 క్వింటాళ్ల సన్నబియ్యం కేటాయిస్తే 7.31 క్వింటాళ్లే పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉందని, మిగతా 79.45 క్వింటాళ్లకు గాను క్వింటా మాత్రమే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈమేరకు డీలర్ బాదావత్ బిచ్యాపై 6(ఏ) కేసు నమోదు చేసినట్లు డీసీఎస్ఓ వెల్లడించారు. డీలర్లు బియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ప్రతీనెల బియ్యం సరిగా ఇవ్వకపోవడంతో పక్క గ్రామాలకు వెళ్తున్నట్లు గ్రామస్తులు ఆయనకు ఫిర్యాదు చేశారు. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీ వెంకటేశ్వర్లు, ఆర్ఐ వీరయ్య పాల్గొన్నారు. స్వయం ఉపాధిపై అవగాహన ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ఆధ్వర్యాన ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో గురువారం సీ్త్ర సంఘాల(ఎస్ఎస్జీ) సభ్యులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ బ్యాంకులు అందిస్తున్న రుణాలు, సబ్సిడీతో మహిళల స్వయం ఉపాధి రంగాల్లో ఎదగాలని సూచించారు. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం డీసీసీబీ అధికారులు రుణాల మంజూరు, సబ్సిడీలు, చెల్లింపు వివరాలను వివరించారు. బ్యాంకు సీఈఓ ఎన్.వెంకటఆదిత్య, డైరెక్టర్ పునుకొల్లు రాంబ్రహ్మం పాల్గొన్నారు. చిన్నారుల గాంధీగిరి! తల్లాడ: పాఠశాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు గాంధీ మార్గాన్ని అనుసరించారు. తల్లాడ మండలం మల్లవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం పంచాయతీ కార్యదర్శి షేక్ సిద్దిక్ మియాకు గులాబీపూలు అందించారు. పాఠశాలలో భగీరథ పైపులైన్ లేక తాగునీరు అందడం లేదని, పైపులైన్ నిర్మాణానికి తవ్వి వదిలేయడంతో రోడ్డు పాడైందని పేర్కొన్న వారు పాఠశాలకు ఇరువైపలా పిచ్చిమొక్కలు తీయించాలని కోరారు. దాసరి వీరభద్రరావు యూత్ క్లబ్ నిర్వాహకులు డి.అజయ్కుమార్, జి.కృష్ణారావు సంఘీభావం తెలపగా సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని కార్యదర్శి తెలిపారు. బదిలీ స్థానాల్లో చేరుతున్న పీఏసీఎస్ల కార్యదర్శులు ఖమ్మంవ్యవసాయం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) కార్యదర్శుల బదిలీల వ్యవహారం తిరిగి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఆగస్టు చివరి వారంలో కేటగిరీల వారీగా బదిలీలు చేపట్టగా కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో వారిని పాత స్థానాల్లోనే కొనసాగించాలని స్టే ఇచ్చింది. జిల్లాలో 76 పీఏసీఎస్లకు 69 సంఘాల కార్యదర్శులను బదిలీ చేయగా, వీరిలో 35 మంది కోర్టును ఆశ్రయించారు. మిగిలిన వారు బదిలీలను సమ్మతించగా.. జిల్లా కమిటీ అనుమతితో 16 మంది నూతన స్థానాల్లో చేరారు. కోర్టుకు వెళ్లిన 35 మందిలో 25మంది కేసు విరమణకు పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే వీరు సైతం బదిలీ స్థానాల్లో చేరనుండగా, కార్యదర్శుల వినతితో కొందరి స్థానాలు మార్చే అవకాశముందని సమాచారం. -
రూ.25లక్షల పోస్టల్ బీమా చెక్కు
వేంసూరు: మండలంలోని అడసర్లపాడుకు చెందిన తాటికొండ పాండురంగాచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి పోస్టల్ బీమా ద్వారా మంజూరైన రూ.25లక్షల చెక్కను ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి గురువారం అందజేశారు. గత ఏడాది పాండురంగాచారి రూ.549, రూ.749 ప్రీమియంతో రెండు బీమా పాలసీలు చేశారని ఆయన తెలిపారు. తక్కువ ప్రీమియంతో బీమా పథకాలు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐపీపీబీ మేనేజర్ రాజేష్, సత్తుపల్లి పోస్టల్ ఇన్స్పెక్టర్ జి.రాజేష్, ఎంఓ రాజాతోపాటు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి ముదిగొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. మండలంలోని గోకినేపల్లిలో గురువారం ఆమె ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. యంత్రాంగం తరఫున సహకరిస్తుండడమే కాక బిల్లులు దశల వారీగా అందుతున్నందున ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీఓ వాల్మికీ కిషోర్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్ ముదిగొండ: మండలంలోని పెద్దమండవ, గంధసిరి మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్ చేశారు. సీఐ ఓ.మురళి ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టగా పెద్దమండవ మున్నేరు నుంచి అనుమతి లేకుండా తరలిస్తున్న మూడు, గంధసిరి నుంచి ఇసుక తీసుకెళ్తున్న రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. ఈమేరకు వాహనాలను సీజ్ చేసి డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు తిరుమలాయపాలెం: మండలంలోని గోల్తండా పరిధి ఓ వెంచర్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో గురువారం టాస్క్ఫోర్స్ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురిని అదుపులోకి తీసుకుని రూ.6,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులున స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించగా కేసు నమోదు చేశారు. కారు, ద్విచక్ర వాహనం ఢీ : ముగ్గురికి గాయాలుఖమ్మంఅర్బన్: ఖమ్మం – వైరా రోడ్డులో వెలుగుమట్ల పార్క్ సమీపాన గురువారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. పార్కు రోడ్డులో నుంచి వస్తున్న ద్విచక్రవాహనాన్ని వైరా వైపు నుండి ఖమ్మం వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఆపై రోడ్డు వెంట ఉన్న కేఎంసీ బోర్డును కూడా ఢీకొట్టగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే, క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించగా వారి వివరాలు తెలియాల్సి ఉందని ఖమ్మం అర్బన్ సీఐ తెలిపారు. -
ప్రజా ఉద్యమ నాయకుడు జియావుద్దీన్
తిరుమలాయపాలెం: ప్రజా ఉద్యమాలకే కాక ఉపాధ్యాయ ఉద్యమానికి ఎస్.డీ.జియావుద్దీన్ సారథిలా నిలిచారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం నాయకుడు, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు జియావుద్దీన్ సంస్మరణ సభ మండలంలోని సుబ్లేడులో గురువారం నిర్వహించగా ఆయన మాట్లాడారు. జీవితకాలం గిరిపుత్రుల అభివృద్ధి కోసం తపించడమే కాక ఉద్యోగ విరమణ తర్వాత సీపీఎంలో ప్రజాఉద్యమాలు నిర్మించారని తెలిపారు. ప్రజా సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశాడని కొనియాడారు. కాగా, కేంద్రప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం కాపాడుకోడమే కాక రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నందున బీజేపీని గుణపాఠం చెప్పేలా కార్యకర్తలు సిద్ధం కావాలని తమ్మినేని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నాయకులు పోతినేని సుదర్శన్రావు, బండి రమేష్, షేక్ బషీరుద్దీన్, జియావుద్దీన్ జావీద్తో పాటు రామసహాయం నరేష్రెడ్డి, చావా శివరామకృష్ణ, బెల్లం శ్రీనివాస్, మందుల రాజేంద్రప్రసాద్, గొర్రెపాటి రమేష్, సోమనపల్లి వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ●ఏన్కూర్: మండలంలోని ఇమామ్నగర్కు చెందిన బానోతు శ్యామ్కుమార్ మృతి చెందగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్, సీపీఎం నాయకులు వేముల కృష్ణప్రసాద్, గుడ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం -
●మజ్జిగ త్రినేత్ర
చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరు గ్రామానికి చెందిన త్రినేత్ర తండ్రి మునెప్ప వ్యవసాయం చేస్తుండగా తల్లి సరోజమ్మ గృహిణి. టీజీ టెట్లో 123, డీఎస్సీ78.9 మార్కులతో ఉద్యోగం సాధించిన ఆయన రామచంద్రాపురం మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇక ఏపీ టెట్లో 141.79, డీఎస్సీ 90.79 మార్కులు సాధించింది. క్రమశిక్షణ, పట్టుదలతో చదవడం ద్వారా ఉద్యోగాలు సాధించానని వెల్లడించారు. తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూస్తూ వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని భావనతో చదవడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. -
జ్యూస్ తాగుతూ కుప్పకూలిన యువకుడు
ఇబ్రహీంపట్నం రూరల్: జ్యూస్ తాగుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పల్లిపాడుకు చెందిన మేడ ఏకలవ్య(30) కొన్నాళ్లు యూకేలో ఉద్యోగం చేశాడు. ఆపై ఉద్యోగం కోల్పోవడంతో ఇబ్రహీంపట్నంలోని తన స్నేహితుడు ఆకాష్పటేల్ వద్ద ఉంటున్నాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆయన జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో రావడంతో పడిపోయాడు. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత -
●ఇంటింటా చందా.. కోతులకు బందీఖానా!
కామేపల్లి మండలం ఊట్కూర్ వాసులను కొద్దినెలలుగా కోతుల బెడద వేధిస్తోంది. పలుమార్లు చిన్నారులు, వృద్ధులను గాయపర్చడమే కాక ఇళ్లలోకి చొరబడి సామగ్రి ఎత్తుకెళ్తున్నాయి. అంతేకాక పంట పొలాలపై దాడి చేస్తుండడంతో రైతులకు నష్టం మిగులుతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక గ్రామస్తులంతా ఏకమై ఇంటికి రూ.500 నుంచి రూ.వేయి వరకు వసూలు చేశారు. ఆపై కోతులు పట్టేవారిని సంప్రదించి ఒక్కో కోతికి రూ.250 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో కోతులు పట్టే బృందం సభ్యుడు బాలరాజు ఆధ్వర్యాన గురువారం ఒకేరోజు 400 కోతులను బంధించారు. వీటిని ఇనుప బోనులో ఉంచి ఆహారం సమకూర్చడంతో పాటు రాత్రి సమయాన అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో కోతుల బెదడ తప్పినట్లయిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – కామేపల్లి -
మాకెవరూ అడ్డు లేరు..
●బోనకల్ మండలం లక్ష్మీపురంలో పట్టా భూమి నుంచి మట్టి తరలిస్తున్న దృశ్యంఅవసరాలే అదనుగా.. జిల్లాలోని నగరాలు, మండల కేంద్రాల్లో నిర్మాణాలు నానాటికీ పెరుగుతున్నాయి. వీటికి తోడు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి, ఇసుక అవసరమవుతోంది. ఇదే అదనుగా కొందరు దందాకు తెరలేపారు. వాగులు తదితర వనరుల నుంచి ఇసుక, గుట్టలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి తవ్వి రవాణా చేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకుంటుండగా గ్రామాల్లో లోడ్లతో వాహనాలు కళ్లముందే తిరుగుతున్నా అధికారులు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల పేరిట.. పలు ప్రాంతాల్లో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. మట్టి తవ్వకానికి ఎర్రుపాలెం మండలం రాజుపాలెం, ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు ప్రాంతాల్లోనే పర్మిట్లు ఉన్నాయి. అలాగే, రాష్ట్ర, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, జలవనరుల శాఖ పరిధిలో పనుల కోసం 61 ప్రాంతాల్లో తాత్కాలిక అనుమతులు జారీ చేశారు. ఈ ప్రాంతాల నుంచే మట్టి తరలించాల్సి ఉండగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక ఇసుక అధికారిక క్వారీలు లేకున్నా తహసీల్దార్ల నుంచి కూపన్లు తీసుకుని పరిమితికి మించి రవాణా చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎప్పుడైనా ఫిర్యాదు అందితేనే అధికారులు హడావుడి చేసి ఆతర్వాత అటువైపుగా చూడకపోవడం అక్రమార్కులకు కలిసొస్తోంది. చదును చేస్తామంటూ... బోనకల్ మండలం లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో 60ఎకరాల పట్టా భూమిలో గుట్టలు ఉన్నాయి. గోవిందాపురం రెవెన్యూలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ రెండు చోట్ల నుంచి ఎర్రమట్టి తోలకానికి అనుమతి లేకపోగా.. భూమి చదును చేస్తామంటూ దందాకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అవసరాల పేరుతో నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ప్రైవేట్ అవసరాలకు మట్టిని తరలిస్తున్నారు. గోవిందాపురం(ఎల్)లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం జరుగుతుండగా, ఆ పేరుతోనూ మట్టి తరలింపు కొనసాగుతోంది. స్థానిక అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేక స్థానికులు ఇటీవల కలెక్టర్కు విన్నవించారు. దీంతో గత రెండు, మూడు రోజులుగా తనిఖీ చేస్తుండగా టిప్పర్లు, ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం డిపోలు ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేలా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతీ నియోజకవర్గంలో ఇసుక డిపోలను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేశారు. ఖమ్మం, కామేపల్లి, సత్తుపల్లి, కూసుమంచి, మధిర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనుండగా, ఖమ్మం, కూసుమంచి, మధిరలో ప్రారంభమయ్యాయి. త్వరలోనే కామేపల్లి, సత్తుపల్లిలో కూడా డిపోల ద్వారా ఇసుక పంపిణీ మొదలవుతుందని హౌసింగ్ పీడీ శంకర్నాయక్ తెలిపారు. అయినా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమార్కులు అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు.జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. దందాను అడ్డుకోవాల్సిన యంత్రాంగం ఫిర్యాదు అందితేనే కదులుతాం అన్నట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక, మట్టిని ప్రభుత్వ అవసరాల పేరిట, తాత్కాలిక అనుమతుల మాటున తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు రెండు క్వారీలకే అనుమతి ఉండగా, చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇక ఇసుకను తాత్కాలిక అనుమతుల పేరుతో లెక్కకు మించి రవాణా చేస్తుండడం గమనార్హం. – సాక్షిప్రతినిధి, ఖమ్మం/ ఖమ్మంఅర్బన్పలు మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలతో 30 – 40 అడుగుల ఎత్తుతో ఉండే గుట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. అక్రమ తవ్వకాలపై స్థానికులు పలుమార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎర్రుపాలెం మండలంలో తవ్వకాలపై ఫిర్యాదు చేశాక అధికారుల్లో కదలిక వచ్చింది. ఈక్రమంలోనే బోనకల్, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ తదితర మండలాల్లో పోలీసు, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు.జిల్లాలో యథేచ్ఛగా ఇసుక, మట్టి రవాణా ఇసుక, మట్టి తరలింపుపై నిఘా వేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1,288 వాహనాలు తనిఖీ చేశాం. ఇందులో 211 వాహనాల్లో ఇసుక, 109 వాహనాల్లో ఇతరత్రా తరలిస్తున్నట్లు గుర్తించి రూ.43.69లక్షల జరిమానా విధించాం. గత ఐదు నెలల కాలంలో 340 కేసులు నమోదు చేసి రూ.1.71,73,000 పెనాల్టీ వసూలు చేశాం. – సాయినాథ్, ఏడీ, మైనింగ్శాఖ -
నిరంతర కృషితోనే మెరుగైన ఫలితాలు
ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థులు నిరంతరం శ్రద్ధగా చదువుతూ భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం రాపర్తినగర్లోని టీజీఎంఆర్జేసీ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను గురువారం ఆయన ప్రారంభించారు. కాలేజీలో లైబ్రరీ, పాఠ్యపుస్తకాలు, తరగతి గదులను పరిశీలించాక విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇక్కడి సౌకర్యాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక దశ అయినందున శ్రద్ధగా చదవాలని తెలిపారు. ఇంటర్లో రాణించడంతోనే తనకు బిట్స్ పిలానీలో సీటు వచ్చిందని, ఆతర్వాత సివిల్స్ రాశానని చెప్పారు. డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో సీటు రావడానికి ఇంటర్లో అడుగులు పడతాయని తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ద్వారా నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించనున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయానికి దగ్గరి దారులు ఉండవనే విషయాన్ని గుర్తించి కష్టాన్నే నమ్ముకోవాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్, ఆర్ఎల్సీ అరుణకుమారి, ప్రిన్సిపాల్ చుండు అఖిల, అధ్యాపకులు పాల్గొన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్ -
బీసీ రిజర్వేషన్లు అమల్లోకి రాగానే ఎన్నికలు
వైరా: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ బిల్లు అమలుకాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వైరాకు గురువారం వచ్చిన ఆమె రాజశేఖర్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు దక్కేలా బిల్లు అమలుకు కేంద్రం సహకరించాలని కోరారు. కాగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేరుతో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని తెలిసినా, రైతులను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమను తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు త్వరలో మరమ్మతులు చేయిస్తామని, రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చెరుకూరి కిరణ్, శీలం వెంకటనర్సిరెడ్డి, సూర్యదేవర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు మేలు
ఖమ్మంలీగల్: మధ్యవర్తిత్వం వల్ల అనేక లాభాలు ఉన్నందున కక్షిదారులు ఉపయోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థలో మధ్యవర్తిత్వంతో లాభాలపై అవగాహన కల్పించేలా ఏర్పాటుచేసిన పోస్టర్లను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మధ్యవర్తిత్వంతో కేసు రాజీ పడకుంటే మళ్లీ కోర్టుకు వెళ్లవచ్చని తెలిపారు. ఎలాంటి ఖర్చు ఉండకపోగా, చర్చలు గోప్యంగా ఉంటాయని చెప్పారు. నాలుగు దశల్లో మధ్యవర్తిత్వ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. వాణిజ్య వివాదాలు, కుటుంబ కలహాలు, చెక్బౌన్స్, ప్రమాద కేసులను రాజీ చేసుకునే అవకాశం ఉన్నందున న్నాయయసేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా జడ్జి సూచించారు. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి తల్లాడ: రైతులు పంటల సాగు సమయాన నాణ్యమైన విత్తనాలను ఎంచుకుంటూనే అధిక దిగుబడులు సాధించొచ్చని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంతకుమార్ అన్నారు. తల్లాడ మండలం నూతనకల్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా పంపిణీ చేసిన డబ్ల్యూజీఎల్ 44, సిద్ధి విత్తనాలతో సాగు చేసిన వరి క్షేత్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అధిక దిగుబడి కోసం విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకుంటే మేలైన యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందొచ్చని చెప్పారు. అలాగే, వరిలో ఆశిస్తున్న బ్యాక్టీరీయా, ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటో మైసిన్ 40 గ్రాములను పిచికారీ చేయడమే కాక తాత్కాలికంగా నత్రజని సంబంధిత ఎరువులు ఆపాలని సూచించారు. శాస్త్రవేత్తలు కె.రవికుమార్, డాక్టర్ శిరీష, ఏఓ ఎండీ.తాజుద్దీన్, ఏఈఓ త్రివేణి, రైతులు పాల్గొన్నారు. ‘రోజ్గార్ యోజన’ను వినియోగించుకోవాలి ఖమంగాంధీచౌక్/ఖమ్మం సహకారనగర్: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన(పీఎంవీబీఆర్వై) పథకాన్ని అవసరమైన ఉద్యోగులు, యాజమాన్యాలు వినియోగించుకోవాలని వరంగల్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్–2 వైడీ.శ్రీనివాస్ సూచించారు. ఉపాధి అవకాశాల పెంపు, యువతలో ఉపాధి సామర్థ్యాల అభివృద్ధి, సామాజిక భద్రతను మెరుగుపర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నెల వేతనం(గరిష్టంగా రూ. 15వేలు), రెండు విడతలుగా ఖాతాల్లో జమ చేస్తారని, తయారీ రంగం యజమానులకు ప్రతీ ఉద్యోగిపై నెలకు రూ.3వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. అయితే, యజమానులు ఎంప్లాయర్ పోర్టల్లోని పీఎంవీబీఆర్వై లింక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు వరంగల్లోని పీఎఫ్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. పాలేరులో సీసీ రోడ్లకు రూ.20కోట్లు -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తిరుమలాయపాలెం: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు దశల వారీగా మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలోని మేకలతండా, మేడిదపల్లి, తిమ్మక్కపేట, సుబ్లేడు గ్రామాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన గురువారం రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల సమయాన ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే, తాము మాత్రం అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తూ ప్రతీ సోమవారం నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. కాగా, సుబ్లేడులో ఇటీవల మృతి చెందిన యూటీఎఫ్ ఉమ్మడి ఏపీ కోశాధికారి, సీపీఎం నాయకుడు జియావుద్దీన్ సంస్మరణ సభలో మంత్రి పొంగులేటి పాల్గొని నివాళులర్పించారు. పేదల అభివృద్దికి చిత్తశుద్ధితో కృషి కూసుమంచి: రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసమంచి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ, బీటీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇది కాక అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో ఎన్నికల నాటి హామీలు నెరవేరుస్తున్నామని వెల్లడించారు. కాగా, రెవెన్యూ శాఖలో జీపీఓలుగా నియమితులైన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయవద్దని, అలా జరిగితే ఉద్యోగం పోతుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. కొత్తగా నియమితులైన జీపీఓలు మంత్రిని కలవగా ఆయన మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా తాము తీరుస్తామని తెలిపారు. కానీ తప్పు చేసి రెవెన్యూ శాఖకు మచ్చ తీసుకురావొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమాల్లో ఆర్అండ్బీ, పీఆర్ ఎస్ఈలు యాకోబు, జి.వెంకట్రెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, డీఎల్పీఓ రాంబాబు, తహసీల్దార్లు విల్సన్, రవికుమార్, ఎంపీడీఓలు సిలార్ సాహెబ్, రాంచందర్రావు, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు రామసహాయం నరేష్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, బోడ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
పనికొచ్చే మొక్కలు పెంచండి..
● సత్తుపల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసత్తుపల్లి: అటవీశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకొని పనికొచ్చే మొక్కలను పెంచాలని.. ఈ క్రమాన జామాయిల్ మొక్కల స్థానంలో వెదురు మొక్కలను నాటాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని తెలిపారు. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్పార్కులో చైన్లింక్ ఫెన్సింగ్, సఫారీ బ్యాటరీ వాహనాలు, టింబర్ డిపోలో మీటింగ్హాల్, పరేడ్ మైదానాన్ని గురువారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పట్టాలు ఇచ్చామని, పంటలు పండించుకుని ఫలసాయం పొందేందుకు ఆ భూములు వినియోగించుకోవాలని తెలిపారు. కాగా, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు అటవీశాఖ అటంకం కల్పించొద్దని సూచించిన ఆయన... పులిగుండాల ప్రాజెక్టుకు ఎన్నో అభ్యంతరాలు చెప్పినా, ఇప్పుడు అక్కడే ఎకో టూరిజం ప్రాజెక్టు సిద్ధమైందని చెప్పారు. రహదారులు, పంట కాల్వలకు అవసరమైన భూములను అటవీశాఖ నుంచి తీసుకుంటున్నప్పటికీ, ఎకరం కూడా అడవి ఆక్రమణ జరగకుండా చూసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్పామ్ టన్ను రూ.20వేలు ప్రస్తుతం ఆయిల్పామ్ గెలలు టన్ను ధర రూ.19,400 ఉండగా, ఈ నెలాఖరుకల్లా రూ.20వేలు వచ్చేలా చూస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఏడాది జూన్కల్లా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి వేశ్యాకాంత చెరువును గోదావరి జలాలతో నింపుతామని చెప్పారు. కాగా, మాజీ సీఎం జలగం వెంగళరావును చూసి రాజకీయాల్లోకి వచ్చిన తాను ఆయన చేయలేని బేతుపల్లి ప్రత్యామ్నాయ కాల్వ, వేంసూరు ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చానని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం తనకు రాజకీయ జన్మనిచ్చినందున, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు ఉన్నా అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకొస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ సునీల్దత్, అటవీశాఖ సీసీఎఫ్ భీమానాయక్, డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎఫ్డీఓ వాడపల్లి మంజుల, మార్కెట్ చైర్మన్లు దోమ ఆనంద్, భాగం నీరజాదేవి, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, తోట సుజలరాణి పాల్గొన్నారు. -
కోర్టును ఆశ్రయించిన సొసైటీల పాలకవర్గాలు
ఖమ్మంవ్యవసాయం: గతనెల 14న పీఏసీఎస్ల పదవీకాలం ముగియగా, కొన్నింటిని ఆరు నెలల పాటు పొడిగించిన ప్రభుత్వం ఇంకొన్ని పాలకవర్గాలను మాత్రం రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు, నిర్వహణ లోపాలతో ఈ నిర్ణయం తీసుకుని పర్సన్ ఇన్చార్జ్లను నియమించారు. ఈక్రమంలోనే జిల్లాలోని ఏదులాపురం, చేగొమ్మ, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పోచారం పాలకవర్గాలను రద్దు చేయగా, ఆయా పీఏసీఎస్ల చైర్మన్ల నాయకత్వాన హైకోర్టును ఆశ్రయించారు. మిగతా వారిలాగే తమను సైతం కొనసాగించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. జిల్లాతో పాటు నల్లగొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లోనూ రద్దయిన పాలకవర్గాల బాధ్యులు కోర్టును ఆశ్రయించగా, స్టే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా రామానుజం ఖమ్మంక్రైం: ఖమ్మం అడిషనల్ డీసీపీ(అడ్మిన్గా) బి.రామానుజం నియమితులయ్యారు. ఈ స్థానాన గతంలో పనిచేసిన నరేష్కుమార్ బదిలీ అయ్యాక కొద్దినెలలుగా పోస్తు ఖాళీగా ఉంది. ఈనేపథ్యాన రామానుజంను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. 1991వ ఎస్ఐ బ్యాచ్కు చెందిన ఆయన ఉమ్మడి జిల్లాలో ఎస్ఐ, సీఐ, డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ డీఎస్పీగా పనిచేస్తుండగా ఏఎస్పీగా పదోన్నతి కల్పించి ఖమ్మం బదిలీ చేశారు. 2,343 మెట్రిక్ టన్నుల యూరియా ● నేడు మరో 3వేల మెట్రిక్ టన్నులు.. ఖమ్మంవ్యవసాయం: జిల్లాకు యూరియా సరఫరా కొనసాగుతోంది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు గురువారం 2,343 మెట్రిక్ టన్నుల ఎన్ఎఫ్ఎల్ కంపెనీ యూరియా చేరింది. ఇందులో 1,073 మెట్రిక్ టన్నులు ఖమ్మం జిల్లాకు, 470 మెట్రిక్ టన్నులు భద్రాద్రి జిల్లాకు, 600 మెట్రిక్ టన్నులను మహబూబాబాద్ జిల్లాకు చేరవేశారు. మిగిలిన 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేశారు. ఇక శుక్రవారం మరో 3వేల మెట్రిక్ టన్నుల క్రిబ్–కో యూరియా చేరనుండగా, మూడు జిల్లాలకు 1,500, 300, వేయి మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో మిగిలే 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా గోదాంల్లో భద్రపరుస్తామని వెల్లడించారు. -
మరో సర్వేకు అడుగులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్తోపాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్లలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కొత్తగూడెంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో చిన్న విమానాలతోపాటు ఎయిర్బస్ వంటి భారీ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకునేందుకు వీలుగా మూడు కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 950 ఎకరాల భూమి అవసరమని భావించారు. కొత్తగూడెం మండల పరిధిలోని రామవరం, గరీభ్పేట శివారులలో 707, సుజాతనగర్ మండల పరిధిలో 195, చుంచుపల్లి మండల పరిధిలో 50 ఎకరాల స్థలాలను కూడా గుర్తించారు. ఇక్కడున్న ఎత్తైన గుట్టలు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా నిలిచాయి. మరోవైపు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల విషయంలో సానుకూల ఫలితాలు వచ్చి క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. దీంతో సెప్టెంబరు 16న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కొత్తగూడెం ఎయిర్పోర్టు కోసం విజ్ఞప్తి చేయగా.. మరోసారి ఫీజుబులిటీ సర్వేకు అడుగులు పడ్డాయి. ఇరవై ఏళ్లుగాఽ అదే సమస్య కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే అంశంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన స్థలాన్ని ఎంపిక చేయడమే సవాల్గా మారింది. భవిష్యత్లో బోయింగ్ విమానాలు దిగేందుకు వీలుగా వెయ్యి ఎకరాల్లో ఎయిర్పోర్టు కోసం సుజాతనగర్ ప్రాంతంలో భూములు వెతికారు. అయితే అది సాధ్యపడలేదు. చివరకు ఎయిర్కార్గో సేవల కోసం ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక ఆ తర్వాత పాల్వంచ మండలం గుడిపాడు – బంగారుజాలల మధ్య ఎయిర్పోర్టు నిర్మాణం కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. పాల్వంచ పట్టణాన్ని అనుకుని ఉన్న ఎత్తైన గుట్టలు, కేటీపీఎస్ చిమ్నీలు, కూలింగ్ టవర్ల వల్ల సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఈ ప్రతిపాదన అక్కడే ఆగిపోయింది. ఎంతో ఉపయుక్తం జిల్లాలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే దేశం నలుమూలల నుంచి భద్రాచలం క్షేత్రానికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి గనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, కేటీపీఎస్, బీటీపీఎస్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీ, డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటైంది. దేశం మొత్తం మీద ఎర్త్ సైన్సెస్ విభాగంలో ప్రత్యేక కోర్సులు అందిస్తున్న వర్సిటీగా ఇది నిలిచింది. త్వరలోనే సేంద్రియ సాగు విధానానికి సంబంధించి ఎక్స్లెన్స్ సెంటర్ కూడా జిల్లాకు రానుంది. మరోవైపు అడవులు విస్తారంగా ఉండటంతో ఎకో టూరిజానికి ఈ ప్రాంతం అనువుగా ఉంది. ఇప్పటికే ఎకో టూరిజంలో ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి, పాపికొండలు, సీలేరు – పొల్లూరు వాటర్ఫాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు భద్రాచలం గేట్వేగా ఉంది. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలు ఈ ప్రాంతంలో పుంజుకుంటాయి. సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఆస్కారముంది. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ఎన్నిసార్లు స్థలాలను గుర్తించినా ఎత్తైన కొండలు, అభయారణ్యం, హై టెన్షన్ కరెంటు లైన్లు, రైల్వే మార్గాలు, నేల స్వభావం, గాలుల తీవ్రత, నీటి ప్రవాహాలు వంటి భౌగోళిక, సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ మండలాలను మినహాయించి భద్రాచలం – కొత్తగూడెం మధ్య ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాలను పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు సైతం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు మూడు చోట్ల స్థలాలను గుర్తించగా, ఇందులో ఒక స్థలాన్ని ఎయిర్పోర్టు కోసం ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. -
మతాల మధ్య చిచ్చుకు కుట్ర
● సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులుముతారా..? ● సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులు మత పరమైన రంగు పులుముతున్నాయని సీపీఎం జాతీయ ప్రధా న కార్యదర్శి ఎం.ఎ.బేబీ విమర్శించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం రాత్రి జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడా రు. ఈ పోరాటంలో శ్రామికులు, కార్మికులు, రైతులు భాగస్వాములయ్యారని, మహిళల భాగస్వామ్యం కూడా గొప్పదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరులో అనేక మంది ప్రాణత్యాగం చేశారని నివాళులర్పించారు. దున్నేవాడికే భూమి కావాలని భూ స్వాములకు ఎదురొడ్డి పోరాటం సాగిందని, దీని ఫలితంగానే లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచారని తెలిపారు. అయితే కేంద్రంలోని నేటి పాలకులు ఈ పోరాటానికి మతం రంగు పులుము తూ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దీన్ని ముస్లింలకు – హిందువులకు మధ్య జరిగిన పోరాటమని కొందరు వక్రీకరిస్తూ విమోచన, విలీనం, విద్రోహం అనే పేర్లతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హక్కులు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి, అత్యాచారాల నిరోధంతో పాటు దున్నే వాడిదే భూమి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నాయకులు బండి రమేష్, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎం. సుబ్బారావు, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు. -
హామీలన్నీ అమలు చేస్తున్నాం
ఖమ్మంసహకారనగర్: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 2వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారికి సోలార్ పంపుసెట్లు అందిస్తామని తెలిపారు. జిల్లాలో కొత్తగా 24,818 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పారు. 70వేల మందికి ఉచిత విద్య.. జిల్లాలో 1,257 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 70,257 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారని భట్టి తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద 1,840 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,542 మంది గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులు 35,282 మందికి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన, రూ.130 కోట్లతో వైద్య కళాశాల భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.139 కోట్లతో పది రెండు లేన్ల రోడ్లను నాలుగు వరుసల రహదారులుగా విస్తరిస్తామని అన్నారు. మధిర, సత్తుపల్లిలో రూ.34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ 100 పడకల ఆస్పత్రులు, కల్లూరులో రూ.10.50 కోట్లతో 50 పడకల సీహెచ్సీ, పెనుబల్లిలో రూ.7.50 కోట్లతో 30 పడకల కమ్యూనిటీ సెంటర్ను పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను భట్టి సందర్శించి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, డీఆర్ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైన, నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.అంకితభావంతో సేవలందించాలిఖమ్మంవైద్యవిభాగం: ప్రైవేట్ ఆస్పత్రుల వారు ప్రజారోగ్యం పట్ల అంకిత భావంతో సేవలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బుధవారం ఆయన వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని, ఎన్ని అవాంతరాలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కావొద్దనే లక్ష్యంతో చాలా ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిలో చేర్చుకుందని తెలిపారు. జిల్లా స్థాయిలో కో–ఆర్డినేటర్ల ద్వారా మానిటరింగ్ చేస్తూ రూ.కోట్ల బడ్జెట్ను కేటాయించిందన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి పొల్యూషన్ బోర్డ్ సర్టిఫికెట్, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో నాణ్యతలు పాటించాలని, పేషెంట్తో పాటు అతడితో వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య సేవలకు, సర్జరీలకు తీసుకునే చార్జీల వివరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమ, నిబంధనలు ప్రైవేట్ ఆస్పత్రులు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ, డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ చందునాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పేదల సంక్షేమానికి పెద్దపీట
తిరుమలాయపాలెం: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్’ కార్యక్రమాన్ని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తోందని, ఈ రెండు రంగాలకు పుష్కలంగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తోందని, ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదుకుంటోందని చెప్పారు. వైద్యాధికారులు అంకితభావంతో పని చేయాలని, దూర ప్రాంతాల నుంచి రావడం, ఒక గంట సేపు ఉండివెళ్లడం వంటివి చేయొద్దని సూచించారు. వైద్యులు దేవుడితో సమానమని, రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. తిరుమలాయపాలెం ఏరియా ఆస్పత్రి 30 పడకల నుంచి 50 పడకలకు అప్గ్రేడ్ అయిందని, కొత్త స్కానింగ్, ఎక్స్ రే మిషన్లు, ఇతర పరికరకాలను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు చేపట్టిన స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆస్పత్రిలో అందుతున్న ఓపీ, ఐపీ సేవలను పరిశీలించారు. అనంతరం కంటి పరీక్షల యూనిట్, ఇతర ఓపీ సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత పోషణ మాసం –2025 పోస్టర్ను పొంగులేటి ఆవిష్కరించారు. 21 మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రూ.1.50 కోట్లతో చేపట్టనున్న తిరుమలాయపాలెం – ములకలపల్లి హై లెవల్ బ్రిడ్జి అప్రోచ్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. ఉద్యమంలా చేపట్టాలి.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రతీ మహిళ, పిల్లలు పరీక్షలు చేయించుకునేలా ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు నిర్వహించి ఉచిత పరీక్షలు, చికిత్స అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ చందూనాయక్, వైద్యాధికారులు డాక్టర్ కృపా ఉషశ్రీ అమర్సింగ్, బొల్లికొండ శ్రీనివాసరావు, వైదేహి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఎస్ఈ వెంకట్రెడ్డి, డీఈ వేణుగోపాల్ డీపీఓ రాంబాబు, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, ఆత్మ చైర్మన్ చావా శివరామకృష్ణ, రామసహాయం నరేష్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టుల త్యాగాలతోనే విలీనం
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టుల త్యాగాలతోనే దేశంలో తెలంగాణ విలీనమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. తెలంగాణ పోరాట చరిత్ర, కమ్యూనిస్టుల త్యాగాలను వక్రీకరిస్తే జాతి క్షమించదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ ముగింపు సభ బుధవారం నగరంలోని జెడ్పీ మీటింగ్హాలు లో నిర్వహించారు. అంతకుముందు పాత బస్టాండ్ నుంచి జెడ్పీ వరకు భారీ ప్రదర్శన చేయగా.. జనసేవాదళ్ కార్యకర్తలు కవాతు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల పట్ల అవగాహన లేని వారు ఇది మతపరమైన పోరాటంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముస్లిం అయినప్పటికీ ఆయన కింద ఉన్న జమిందార్లు, జాగీరుదారులు, పటేల్, పట్వారీలు 95 శాతం హిందువులేనన్నారు. వీరి చేతుల్లోనే ఎక్కువ భూమి ఉండేదని, గ్రామీణ ప్రాంతాల్లో వీరి అరచాకాలు ఎక్కువగా ఉండి ప్రజల మాన, ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జమ్ముల జితేందర్రెడ్డి, మహ్మద్ మౌలా నా, యర్రా బాబు, ఎస్.కె. జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్, బి.జి.క్లెమెంట్, మహ్మద్ సలాం, అజ్మీర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం
భధ్రాచలం: భద్రాద్రి రామయ్య చెంతకు వచ్చే భక్తులకు ప్రశాంత దర్శనం, సకల సౌకర్యాల కల్పన, దేవస్థానం అభివృద్ధే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తిస్తానని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొల్లు దామోదర్రావు తెలిపా రు. ఇటీవల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భక్తులకు సౌకర్యాల కల్పన భద్రాచలం ఆర్డీఓగా పనిచేసి ఉండటంతో భద్రాచలం, దేవస్థానంపై అవగాహన ఏర్పడింది. దీంతో పాటు ఆలయ అభివృద్ధిలో కీలకమైన మాఢ వీధుల విస్తరణలో భూ సేకరణ చేసి నిర్వాసితులకు నష్టపరిహారం అందజేశాం. ఇప్పుడు ఆలయ ఈఓగా అదే అభివృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తా. ఇప్పటికే భక్తులకు అందుతున్న ఆన్లైన్ సౌకర్యాలను ఇతర విభాగాలకూ విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక ప్రధానంగా రామాలయంలో నిర్వహించే సేవలు, ఆలయ ప్రాశస్త్యంపై ప్రచార లోపం ఉందనే అపోహలు తొలగించేందుకు ఆ సేవలు, ఇతర హోర్డింగ్లను భద్రాచలంతోపాటు మారుమూల ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రంగనాయకుల గుట్టపై నిరుపయోగంగా ఉన్న టీటీడీ, అన్నవరం సత్రాలను పూర్తిగా తొలగించి ఉన్నతాధికారుల సూచనల మేరకు భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నాం. రామాలయం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తొలగించి క్లీన్ భద్రగిరిగా ఉంచేందుకు కృషి చేస్తా. మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలు.. ఇక ప్రభుత్వం సంకల్పించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తా. ప్రధానంగా ఆలయం, ఉపాలయాల అభివృద్ధి, మార్పులు, చేర్పులపై ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పండితులు, వైదిక కమిటీలతో సమన్వ యం చేసుకుంటూ వారి సలహాలు, సూచనల మేరకు ముందుకెళ్తాం. ఈ మేరకు ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. చర్చలు ముగిశాక కలెక్టర్, ఇతరులతో కలిసి తగిన నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తాం. ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాల కల్పనే ప్రధాన అజెండాగా పని చేస్తాం. 2027 గోదావరి పుష్కరా లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీని తట్టుకునేందుకు తాత్కాలిక వెయిటింగ్ గదులు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మిథిలా స్టేడియం, ఇతర ప్రాంతా లను పరిశీలిస్తున్నాం. భక్తులకు సరిపడా లడ్డూలు, వీఐపీలకు ఇతర సేవలను దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తాం. రాముడికి చెందిన భూములను చట్ట ప్రకారం కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఏపీలోని పురుషోత్తపట్నంలో రాముడి భూములు దేవస్థానానికి చెందేలా అన్ని పత్రాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించాం. వీటిని న్యాయపరంగానే దక్కించుకుంటాం. ఏపీలోని అన్ని శాఖల సహాయ సహకారాలతో ఈ భూములపై పోరాడుతాం. ఇతర ప్రాంతాలలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులకు సేవ చేసేందుకు రామయ్య కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. -
ఖమ్మం మీదుగా అమృత్ భారత్ రైలు
ఖమ్మం రాపర్తినగర్ : దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో అమృత్ భారత్ రైలును ఖమ్మం మీదుగా నడపనుంది. ఈ రైలు వారంలో ఒకరోజు మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈరోడ్ నుంచి జోగ్బని వెళ్లే రైలు(16601) ఈనెల 25న గురువారం రాత్రి 23:09 ని.లకు ఖమ్మం స్టేషన్కు వచ్చి 23:10 ని.లకు బయలు దేరుతుందని, జోగ్బని–ఈరోడ్ రైలు (16602) మధ్యాహ్నం 12.24 ని.లకు వచ్చి 12:25ని.లకు బయలుదేరుతుందని తెలిపారు. ఇందులో స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయని పేర్కొన్నారు. సకాలంలో టీకాలు వేయాలి జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ రమణ కల్లూరు/కల్లూరురూరల్ : గర్భిణులు, చిన్నారులకు సకాలంలో టీకాలు వేసి వారి ఆరోగ్య పరి రక్షణకు కృషి చేయాలని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సీహెచ్.వి.రమణ అన్నారు. కల్లూరు మండల కేంద్రంతో పాటు బత్తులపల్లి, చెన్నూరు ప్రభుత్వాస్పత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంకా టీకాలు వేయని వారుంటే బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో గుర్తించి అందరికీ వేయాలని, యూడబ్ల్యూఐఎన్ పోర్టర్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. చిన్నారులు, మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. టీకాల కార్యక్రమంపై ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నవ్యకాంత్ తదితరులతో చర్చించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ రాణి, అధికారులు, సిబ్బంది వేణుగోపాల్, సత్యనారాయణ, నవీన్, కిరణ్, గుండెపునేని రామారావు పాల్గొన్నారు. 311 మంది ఉపాధ్యాయుల సర్దుబాటుఖమ్మం సహకారనగర్ : జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులను సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్మెంట్) చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారిగా ఉన్న అదనపు కలెక్టర్ పి.శ్రీజ బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 311 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టినట్లుగా అధికారులు తెలిపా రు. స్థానిక మండలాల్లో ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మేరకు సర్దుబాటు చేయగా మిగిలిన వారిని ఇతర ప్రాంతాలకు పంపించారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో చేసి న డిప్యుటేషన్లను రద్దుచేసినట్లు తెలిపారు. -
అంధుల పాఠశాలకు ప్రణాళిక రూపొందించండి
ఖమ్మం సహకారనగర్ : అంధుల పాఠశాల నిర్మాణా నికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా విద్యాశాఖ అధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంధుల పాఠశాలలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. విద్యతో పాటు కంప్యూటర్ స్కిల్స్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన లిపి, పుస్తకాలు అందుబాటులో ఉంచాలని, పాఠశాలల్లో సెన్సరీ రూమ్, గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన వస్తువులు మాత్రమే వినియోగించాలన్నారు. మలక్పేటలోని అంధుల పాఠశాలను, దేవనార్ పాఠశాలను అధికారులు సందర్శించి.. జిల్లాలో చిన్న స్థాయిలో అంధుల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. సమావేశంలో సీఎంఓ ప్రవీణ్, స్పెషల్ ఎడ్యుకేటర్ రాకేష్, పంచాయతీరాజ్ ఏఈ చిరంజీవి పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశం -
కబడ్డీ ఎంపిక పోటీలకు స్పందన
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలకు స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 200 మంది బాలురు, 80 మంది బాలికలు రావడంతో ఎంపిక ప్రక్రియ కష్టంగా మారిందని నిర్వాహకులు తెలి పారు. కాగా, జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. ప్రక్రియను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తుంబూరు దయాకర్రెడ్డి, కె.క్రిష్టాఫర్బాబు పర్యవేక్షించారు. కార్యక్రమంలో నాగప్రాసద్, సీహెచ్. సుధాకర్, లాలయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారి వివరాలు.. బాలుర జట్టు: ఎ.సతీశ్, జి.వినయ్, డి.నాగఅఖిల్, జె.ఉమేశ్రెడ్డి, విఘ్నేశ్, కె.నితిన్, ఎ.నాగరాజు, బి.గణేశ్, కె.అశోక్కుమార్, బి.చిరు, పి.భార్గవకల్యాణ్, ఎస్కే నశ్రీద్, బి.జగన్నాయక్, బి.రాఘవ, జె.వివేక్, యు.వెకంటకృష్ణ. బాలికల జట్టు: బి.హనీ, జి.చరణ్య, జి.శైలజ, బి.చైత్ర, సప్తిక, సిరిచందన, నవిత, లిఖిత, తేజ, బాలనాగ, నాగమణి, కీర్తన, నాగ, శ్రీజ, శాన్వి, రేణుక, శ్రావణి, స్ఫూర్తి. -
విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలు
సత్తుపల్లిరూరల్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని సత్యనారాయణపు రం గ్రామంలో చోటుచేసుకుంది. గంగారం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కార్తీక్ పాకలగూడెం లైన్మెన్ లక్ష్మీనారాయణ వద్ద ప్రైవేట్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సత్యనారాయణపురం, ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని కోనరావుపాలెం వద్ద త్రీఫేజ్ పొలాలకు వెళ్లే విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేస్తున్నాడు. అదే సమయంలో విద్యుత్ సరఫరా కావటంతో షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చేతికందిన పత్తి పంట ధ్వంసంకారేపల్లి: చేతికందిన పత్తి పంటను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని గేటురేలకాయలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం.. గేటురేలకాయలపల్లి గ్రామానికి చెందిన పోడురైతు ధర్మసోతు సూర్య తనకున్న 2 ఎకరాల పోడు భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టి, పత్తి పంటను సాగు చేయగా.. కాయ దశకు చేరుకుంది. ఇంకా నెలరోజుల్లో పత్తి పంట చేతికందుతుందనుకున్న దశలో గుర్తుతెలియని వ్యక్తులు పత్తి పంటను వాహనాలతో ధ్వంసం చేశారు. మొక్కలను వేర్లతో సహా పెకిలించి పడేయడంతో కష్టపడి, రూ.2లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే.. నేలమట్టం చేశారని బాధిత రైతు కుటుంబం కన్నీరుమున్నీరైంది. 30ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నామని, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు రావాల్సి ఉందని, సర్వేలు సైతం పూర్తయ్యాయని, ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు రాత్రివేళలో వచ్చి పత్తి పంటను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ.. కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అమెరికాలో కేయూ స్వర్ణోత్సవాలు
తల్లాడ: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్థానం 50ఏళ్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా అమెరికాలో ప్రవాస భారతీయులు ఘనంగా స్వర్ణోత్సవాలు జరుపుకున్నారు. రెండు రోజుల పాటు మిత్రులు, గురువులతో కలిసి అనుభవా లను నెమరువేసుకున్నారు. కేయూలోని ఫార్మా స్యూటికల్ సైన్సెస్లో 1976 – 2025 వరకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేసి అమెరికాలో వివిధ రంగా ల్లో స్ధిరపడిన 335 మంది అట్లాంటిక్ సిటీలోని క్యాసినోలో గల బోగట్ట హోటల్లో వేడుకలను సోమ, మంగళవారాల్లో జరుపుకున్నారు. తల్లా డ మండలం కుర్నవల్లికి చెందిన యన్నం శ్రీని వాసరెడ్డితో పాటు డాక్టర్ సాంబారెడ్డి, పరు చూరి శ్రీనివాస్, తమర విజయ్ కార్యక్రమాల ను పర్యవేక్షించారు. కేయూ ఉపకులపతి దర్శ న ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, పారుపల్లి నేహా హాజరయ్యారు. ఉద్యోగం సాధించిన ట్రాన్స్జెండర్వైరారూరల్: మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన ట్రాన్స్జెండర్ కోరే రుచిత అలియాస్ రమేశ్ హైదరాబాద్లోని మెట్రో రైలులో సెక్యూరిటీ గార్డ్గా ఎంపికై మంత్రి అట్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రం అందుకున్నారు. రుచిత 2019 వరకు పురుషుడిగా ఉండి డీగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత వరంగల్ వెళ్లి అక్కడ ట్రాన్స్జెండర్లతో కలిసి భిక్షాటన చేసిన రుచిత 2021లో హైదరాబాద్లో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా మారాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంగా జీవించేందుకు మెట్రో రైల్ శాఖలో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానించగా రుచిత దరఖాస్తు చేసుకొని ఉద్యోగాన్ని సాధించింది. మట్టి తోలకాల స్థావరాలపై దాడిబోనకల్: మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో మట్టి తోలకాల స్థావరాలపై బుధవా రం మధిర సీఐ మధు, ఎస్ఐ పొదిలి వెంకన్న, ఆర్ఐ షేక్ వహిదాసుల్తానా దాడులు నిర్వహించారు. కొంతకాలంగా లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో అనుమతులు లేకుండా కొందరు అక్రమమార్గంలో వందల ట్రిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు. దీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి, అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్, టిప్పర్లను సీజ్ చేసినట్లు సీఐ మధు తెలిపారు. చుక్కల దుప్పి మృతి సత్తుపల్లి: వీధి కుక్కలు వెంట పడటంతో ఓ చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. సింగరేణి అటవీ ప్రాంతం వైపునుంచి పట్టణంలోని జలగంనగర్కు వచ్చిన దుప్పి.. వీధి కుక్కలు వెంట పడటంతో మృతిచెందింది. స్థానికులు అటవీశా ఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతి చెందిన చుక్కల దుప్పిని స్వాధీనం చేసుకున్నా రు. దుప్పి ఎలా చనిపోయిందో నిర్ధారించడం కోసం వెటర్నరీ వైద్యులతో పోస్టుమార్టం చేయించాల్సి ఉందని రేంజర్ స్నేహలత తెలిపారు. -
యాత్రాదానం.. సేవాభావం
● వినూత్న కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పేదలు, అనాథలను యాత్రలకు తీసుకెళ్లేలా కార్యాచరణ ● దాతలు ముందుకొస్తే బస్సుల కేటాయింపుసత్తుపల్లిటౌన్: పుణ్యక్షేత్రాలు, పర్యాటక, విజ్ఞాన విహార యాత్రలను సందర్శించాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది. కానీ, పేదరికం వల్ల ఆ కల నెరవేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారి కోసం ఆర్టీసీ యాజమాన్యం వినూత్నంగా ‘యాత్రా దానం’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పలు యాత్రలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకబస్సులు నడుపుతున్న ఆర్టీసీ యాత్రాదా నం పేరిట ఆదాయాన్ని ఆర్జించేందుకు నూతన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను దాతల సహకారంతో అనాథలు, పేద లు సందర్శించేలా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీరికి అవకాశం కల్పించేలా.. జిల్లాలోని అనాథలు, ఆశ్రమాలలోని వృద్ధులు, దివ్యాంగులు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టీసీ ‘యాత్రాదానం’తో పర్యాటక, పుణ్య క్షేత్రాల సందర్శనకు తీసుకెళ్తారు. అందుకోసం రీజియన్ లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డిపోల పరిధి లో డిపోమేనేజర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. దాతల చేయూతతో.. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక రోజులు, పండుగలు తదితర సందర్భాలు, సంతోషకరమైన రోజుల్లో అన్నదానం, రక్తదానం, నేత్రదానం, అవయవదానం ఎక్కువగా చేస్తుంటా రు. ఈసందర్భాలలో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాల దర్శ నం కల్పించటానికి ఆర్టీసీకి డబ్బులు విరాళంగా అందజేస్తే బస్సు సదుపాయం కల్పిస్తారు. అలాంటి దాతలు, సంస్థల సేవలను వినియోగించుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఎన్ఆర్ఐలతో పాటు కార్పొరేట్ సంస్థలు, స్వస్ఛంద సంస్థలు, సంఘాలు ముందుకు వచ్చి ఆర్టీసీ ‘యాత్రాదానం’లో భాగస్వాములు కావొచ్చు. మిత్రుల భాగస్వామ్యంతోనైనా.. యాత్రాదానం కార్యక్రమంలో దాతలు ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు సామాజిక సేవ చేశామనే ఆనందం పొందవచ్చు. దాతలు ఏ పుణ్యక్షేత్రానికి యా త్రాదానం చేయదల్చుకున్నారో వివరాలతో డిపో మేనేజర్లను సంప్రదించాలి. యాత్రకు సంబంధించి కిలోమీటర్లను లెక్కించి దాని ప్రాతిపదికన ఏసీ, సూపర్లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల చార్జీలు వెల్లడిస్తారు. ఆపై బస్సులను ఎంచుకుంటే డిపోల నుంచి కేటాయిస్తారు. యాత్రకు సంబంధించి నగదును ఒకరైనా.. ఇంకొందరితో కలిపైనా చెల్లించవచ్చు. పుణ్యక్షేత్రాలతో.. ఖమ్మం రీజియన్లో ఏడు డిపోలకు గాను మొత్తం 563 బస్సులు ఉన్నాయి. గతంలో జూన్ నుంచి పుణ్యక్షేత్రాలు, యాత్రల పేరిట అరుణాచలం తదితర ప్రాంతాలకు ప్రత్యేకరోజుల్లో బస్సులు ఏర్పా టు చేస్తున్నారు. రీజియన్ నుంచి 42 బస్సులు నడపగా 25,682 మంది భక్తులు ఉపయోగించుకున్నారు. తద్వారా రీజియన్కు రూ.17,03,668 ఆదాయం లభించింది. సేవాభావంతో ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి యాత్రాదానానికి సహకరించవచ్చు. సామాజిక సేవలో భాగంగా విరాళాలు ఇస్తే పేదలు పుణ్యక్షేత్రాలు, విజ్ఞాన, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సుల్లో సందర్శించే అవకాశం లభిస్తుంది. వారం రోజులు ముందుగానే బస్సును బుక్ చేసుకోవాలి. –ఎ.సరిరామ్, ఆర్టీసీ ఆర్ఎం, ఖమ్మం -
సుదీర్ఘ పోరాటాల నేల తెలంగాణ
ఖమ్మంసహకారనగర్: సుదీర్ఘ పోరాటాల నేల తెలంగాణ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం తన అస్తిత్వం, గుర్తింపు కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిందని, ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత బతుకమ్మ, బోనాలు, సంస్కృతి, కళలు, సంప్రదాయాలకు మంచి గుర్తింపు, ప్రాముఖ్యత లభించిందన్నారు. అభివృద్ధి ప్రమాణాలలో దేశంలోని అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, ప్రజల జీవన ప్రమాణాలు క్రమంగా మెరుగు పడ్డాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎ.పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ●జిల్లా పరిషత్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెడ్పీ సీఈఓ దీక్షారైనా జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ●తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సంఘం జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు శేషుప్రసాద్, విజయ్కుమార్, హరీశ్, రాంబాబు, మాధవరావు పాల్గొన్నారు. కలెక్టరేట్లో జాతీయ పతాకావిష్కరణలో అదనపు కలెక్టర్ శ్రీజ -
అటవీ శాఖకు నూతన హంగులు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి అటవీశాఖకు జిల్లా కేంద్రం తరహాలో నూతనహంగులు రానున్నాయి. టింబర్ డిపోప్రాంగణంలోని స్థలాన్నిపరేడ్గ్రౌండ్గా తీర్చిదిద్దా రు. ఇందులోరూ.2లక్షలతో అటవీ అమరవీరుల స్తూపం, రూ.4 లక్షలతో పోడియం ఏర్పాటు చేశారు. డివిజన్స్థాయిలో ఉద్యోగులకు శిక్షణ, సమావేశాల నిర్వహణకోసం రూ.12 లక్షలతో మీటింగ్హాల్ నిర్మించారు. నీలాద్రి అర్బన్ పార్కులో.. సందర్శకుల ఆదరణ పెరుగుతున్న నీలాద్రి అర్బన్ పార్కుకు రూ.10 లక్షలతో మారో రెండు బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అర్బన్ పార్కులోని వన్యప్రాణులు బయటకు రాకుండా.. వీధి కుక్కలు లోపలికి చొరబడకుండా కన్జర్వేషన్ జోన్ ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో 1.5 కిలోమీటర్ల మేర చైన్లింగ్ ఫెన్సింగ్తో రక్షణ చర్యలు చేపట్టారు. ఈ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని సత్తుపల్లి ఎఫ్డీఓ వాడపల్లి మంజుల, రేంజర్ స్నేహలత తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతచింతకాని: మండలంలోని మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇసుక ట్రాక్టర్ను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తిమ్మినేనిపాలెం మున్నేరు నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఎస్ఐ నాగుల్మీరా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నేడు రూ.90 కోట్ల పనులు ప్రారంభం -
డెంగీ నివారణకు చర్యలు
ఏన్కూరు: జిల్లాలో డెంగీ కేసుల కట్టడి, వ్యాప్తి జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ తెలిపారు. ఏన్కూరు పీహెచ్సీని మంగళవారం తనిఖీ చేసిన ఆమె గ్రామాల వారీగా నమోదైన డెంగీ కేసులు, చికిత్సపై ఆరా తీశారు. అనంతరం అత్యధిక కేసులు నమోదైన పైనంపల్లి తండాను సందర్శించిన డిప్యూటీ సీఈఓ అక్కడ పారిశుద్ధ్య పనులపై సూచనలు చేశారు. ప్రజలు ఇళ్లు, వ్యక్తిగతంగానే కాక పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎంపీడీఓ రంజిత్కుమార్, వైద్యాధికారులు రాములు, మౌనిక, వేమిరెడ్డి భాస్కరరెడ్డి, శ్యామల, ల్యాబ్ టెక్నీషియన్ పి.వెంకటరమణ పాల్గొన్నారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్లో కామర్స్ పరిశోధన కేంద్రంఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలను మంగళవారం కాకతీయ యూనివర్సిటీ కామర్స్ ప్రొఫెసర్ల బృందం సందర్శించింది. కళాశాల కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాన్ని పరిశోధనా కేంద్రంగా గుర్తించేందుకు అవసరమైన లైబ్రరీ, ఈ–జర్నల్స్, ఇంటర్నెట్ సదుపాయం, అధ్యాపకుల అర్హతలను వారు సమీక్షించారని ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. ఈ బృందం చైర్మన్గా ప్రొఫెసర్ కట్ల రాజేందర్ వ్యవహరించగా, ప్రొఫెసర్లు హనుమంతరావు, పి.అమరవేణి, పి.వరలక్ష్మి, ఎస్.నరసింహాచారి, ఎం.యాదగిరి, కోలా శంకర్ ఉన్నారని వెల్లడించారు. ప్రొఫెసర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అవకాశముంటుందని తెలిపారు. కాగా, కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యాన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ జకీరుల్లా తెలిపారు. టీచర్ల సర్దుబాటుపై సమీక్ష ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అదనంగా ఉన్న పాఠశాలల నుంచి అవసరమైన చోటకు ఉపాధ్యాయుల సర్దుబాటుపై అధికారులు మంగళవారం సమీ క్షించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ చావా శ్రీనివాసరావు ఎంఈఓలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొనగా, ఇప్పటికే సిద్ధమైన జాబితాలో మార్పులు, చేర్పులపై చర్చించారు. కలెక్టర్ ఆమోదం అనంతరం టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు వెలువడే అవకాశముందని తెలిసింది. -
నాసిరకం ఆయిల్పామ్ విత్తనాలపై దర్యాప్తు జరపాలి
సత్తుపల్లి/వైరా: విదేశాల నుంచి నాసిరకం ఆయిల్పామ్ విత్తనాలు దిగుమతి చేసి తెలంగాణలోని నర్సరీల్లో పెంచడం ద్వారా రైతులకు నష్టం జరిగి నందున సమగ్ర దర్యాప్తునకు సహకరించాలని తెలంగాణ ఆయిల్పామ్ రైతు సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలభారత కిసాన్ సభ(ఏఐకేఎస్) సమావేశంలో జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ దవాలే, వీ.జీ.కృష్ణణ్కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ అంశంపై దర్యాప్తుతో పాటు రైతులకు పరిహారం అందించేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలాగే, పామాయిల్ గెలల టన్ను ధర రూ.25వేలు ఉండేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, ధర నిర్ణయంలో రైతు సంఘాలకు ప్రాతినిధ్యం దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్పామ్ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు మహేష్రెడ్డి, కొక్కెరపాటి పుల్ల య్యతో పాటు నాయకులు టి.సాగర్, బొంతు రాంబాబు, శోభన్, పి.జంగారెడ్డి, శ్రీనివాసులు, సోమయ్య, చందునాయక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
● నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తులు ● పరీక్ష ద్వారా అర్హులైన విద్యార్థుల ఎంపిక ● జాబితాలో చోటు దక్కితే నాలుగేళ్ల పాటు ఉపకార వేతనాలుకొణిజర్ల: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేలా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) ప్రవేశపరీక్షకు రంగం సిద్ధమైంది. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేలా ఈ పథకాన్ని కేంద్రం 2008లో ప్రవేశపెట్టింది. ఇందు కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులను అర్హులుగా నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో పలువురు బాలబాలికలు ఎనిమిదో తరగతి తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మానివేస్తున్నట్లు గుర్తించడంతో 9వ తరగతి నుండి ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ అందించే ఈ పథకం అమలవుతోంది. 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశపరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అర్హతలు.. దరఖాస్తు విధానం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి, ప్రస్తుతం 8వ తరగతి బాలబాలికలు పరీక్ష రాయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఉంటే అర్హులుగా పరిగణిస్తారు. దరఖాస్తు సమయాన ఆధార్కార్డు, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. ఓసీ, బీసీలైతే రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 6వ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై దరఖాస్తు ప్రింట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందిస్తే వారు డీఈఓ కార్యాలయంలో సమర్పిస్తారు. అక్టోబర్ 23న పరీక్ష స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులకు అక్టోబర్ 23న పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ నగదు నేరుగా విద్యార్థుల అకౌంట్లోనే జమ అవుతుంది. అయితే, పదో తరగతి తర్వాత ఉపకార వేతనం అందాలంటే ఎస్సెస్సీలో కనీసం 60 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించాలి. పరీక్షా విధానం మొత్తం 180 మార్కులకు ఎంపిక పరీక్ష ఉంటుంది. ఇందులో రీజనింగ్,ఆర్థమెటిక్, పదాలభిన్న పరీక్ష, అంకెలు, అక్షరాల ఎనాలజీ, కోడింగ్, డీ కోడింగ్, లాజికల్, వెన్ చిత్రాలు, ప్రతి బింబాలకు సంబంధించి 90మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలో 8వ తరగతి సిలబస్ నుంచే 90 ప్రశ్నలు ఇస్తారు. గణితం 20, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 35, సోషల్ స్టడీస్ 35 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో నిర్వహించనుండగా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎక్కువ మంది హాజరయ్యే ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు.ఆర్థిక వెసులుబాటు లేని బాలబాలికలకు ఉపకార వేతనాలతో ఉపయోగంగా ఉంటుంది. ఎంపికై తే నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ అందుతుంది. పరీక్షకు చాలా సమయం ఉన్నందున విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. – పి.శివన్నారాయణ, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ గుబ్బగుర్తికేంద్రం అమలుచేస్తున్న స్కాలర్షిప్ పథకంపై ఇప్పటికే అన్ని పాఠశాలలకు సమాచారం ఇచ్చాం. ఎక్కువ మంది విద్యార్థులతో దరఖాస్తు చేయించి, పరీక్షకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించాం. – డి.అబ్రహం, ఎంఈఓ కొణిజర్ల గత ఏడాది పరీక్ష రాసి స్కాలర్షిప్నకు ఎంపికయ్యా. ఈ ఏడాది నుంచి నాకు నాలుగేళ్ల పాటు రూ.12 వేల అందుతుందని చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు అభినందించగా, మా అమ్మానాన్న సంతోషించారు. – తాటి షర్మిల, జెడ్పీహెచ్ఎస్, గుబ్బగుర్తి -
చర్రితను వక్రీకరిస్తే మారేది కాదు...
నేలకొండపల్లి: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించాలని చూసినా మారబోదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్రను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. నాడు కమ్యూనిస్టులే ప్రజలను చైతన్యం చేస్తూ నైజాం, దొరల దోపిడీపై పోరాడుతూ వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారని తెలిపారు. కాగా, రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ బుధవారం ఖమ్మంలో జరగనుండగా పార్టీ జాతీయ కార్యదర్శి ఎం.ఏ.బేబి, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని, ఈ సభకు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు. నాయకులు బండి రమేష్, బషీరుద్ధీన్, గుడవర్తి నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, ఏటుకూరి రామారావు, మారుతి కొండలరావు, రచ్చా నరసింహారావు తదిరులు పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం వైరా: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటా లు నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సూచించారు. వైరా మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనలో అఽధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం బొంతు సమత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు దిగొచ్చే వరకు ఆందోళనలు నిర్వహించాలని తెలిపారు. ఖమ్మంలో బుధవారం జరిగే సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు సుంకర సుధాకర్ , భూక్యా వీరభద్రం, చింతనిప్పు చలపతిరావు, మచ్చామణి, గుడిమెట్ల రజిత, సాంబశివరావు, సుధాకర్, మోహనరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు -
నేపాల్ తిరుగుబాటులో అమెరికా పాత్ర
ఖమ్మంమయూరిసెంటర్: నేపాల్లో తిరుగుబాటుకు రాజకీయ అస్థిరత్వం, అవినీతి అంతర్గత కారణాలు గా నిలిస్తే, దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా తదితర దేశాల చర్యలు బాహ్య కారణాలుగా ఉన్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు అన్నారు. ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో మాస్లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని నియంత్రించడానికి అమెరికా అదృశ్యశక్తిగా పనిచేస్తోందని తెలిపారు. నేపాల్లో దాడుల్లోనూ ఆ దేశ పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కాగా, సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల అశోక్, శిరోమణి, శోభ, కె.శ్రీను, ఆజాద్, రాకేష్, లక్ష్మణ్, వెంకటేష్, లెనిన్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు -
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
ప్రభుత్వ పాఠశాలల ఎనిమిదో తరగతి విద్యార్థులకు నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ అందించేలా పరీక్ష నిర్వహించనున్నారు.రజాకార్ల అరాచకాలకు ఉమ్మడి జిల్లా ఎదురొడ్డి నిలిచింది. నిజాం సేనల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పలువురు ప్రాణాలను ఫణంగా పెట్టారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్అలీఖాన్, గ్రామాల్లోని దొరల ఆగడాలు, అణచివేతపై జిల్లా తిరగబడుతూ బందూకులై గర్జించారు. తద్వారా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పుటల్లో జిల్లాకు ప్రత్యేక స్థానం లభించింది. నాటి పోరాటం, అమరుల స్మరణతో ఏటా సెప్టెంబర్ 17న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంబుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025కణకణం..అగ్నిగోళంరావెళ్ల మార్గదర్శకంలో.. బోనకల్ మండలం చిరునోములకు చెందిన రావెళ్ల జానకీరామయ్య వరంగల్ జిల్లా ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో యువత కదం తొక్కింది. భూస్వాములు, జమీందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా జానకీరామయ్య నేతృత్వాన లక్ష్మీపురంలోని మల్లెల వెంకటేశ్వర్లు దళ కమాండర్గా, గోవిందాపురానికి చెందిన తమ్మారపు గోవిందు, చుండూరు నరసింహారావు, జొన్నలగడ్డ రామయ్య ఉప కమాండర్లుగా పోరాడారు. లక్ష్మీపురంతోపాటు బ్రాహ్మణపల్లి, ముష్టికుంట్ల తదితర గ్రామాల యువకులు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు. ఎర్ర కెరటమైన పిండిప్రోలు తెలంగాణ సాయుధ పోరులో తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు ఎర్ర కెరటమైంది. కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రాంకిషన్రావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, రాయల వెంకటనారాయణ వంటి నేతలు ఇక్కడే సమావేశాలు నిర్వహించి పోరాటానికి ఊపిరిలూదారు. దున్నే వాడిదే భూమి అన్న నినాదంతో లక్షలాది ఎకరాలను పేదలకు పంచారు. గ్రామానికి చెందిన రాయల వెంకటనారాయణ దళ కమాండర్గా పనిచేయగా.. పలువురు యువకులు పోరాటంలో అమరులయ్యారు. తిరుగుబావుటా నిజాం నవాబుల పాలనపై ఎర్రుపాలెం మండలం మీనవోలు పోరాటయోధులు తిరగబడ్డారు. ఎర్రుపాలెంలో నిజాం నవాబులు క్యాంపు ఏర్పాటుచేస్తే, క్యాంప్ ఇన్చార్జి, బ్రిటిష్ అధికారి సార్జెంట్ తరచూ దాడులతో ప్రజల సొమ్ము కాజేసేవారు. దీంతో 1948 జనవరి 15న గ్రామస్తులంతా తిరగబడ్డారు. ఈటెలతో దాడి చేయగా.. సార్జెంట్ విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రాంపల్లి రామయ్య, సుఖభోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆతర్వాత తిరుగుబాటును అణచివేసేలా రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. గ్రామంలో పరిస్థితి చేయి దాటడంతో పలువురు ఊరు విడిచివెళ్లారు. నేడు సాయుధ పోరాట వారోత్సవాల సభ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో బుధవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. గత వారం రోజులుగా అమరువీరులకు నివాళులర్పించడమేకాక సభను విజయవంతమయ్యేలా ప్రచారం చేశామని వెల్లడించారు. ఈమేరకు బుధవారం జరిగే సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబి, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్రావుతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.3రజాకార్లకు ఎదురొడ్డిన ఉమ్మడి జిల్లా నాటి మధిర తాలుకాలో నిజాం సైన్యం, రజాకార్ల మూకలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుల కోసం గాలించాయి. గోవిందాపురం సరిహద్దు వద్ద 1948 ఫిబ్రవరి 10న వివిధ గ్రామాలకు చెందిన యల్లమందల చంద్రయ్య, మంద అచ్చయ్య, మద్ది రాములు, గొర్రుముచ్చు హాజరయ్య, కొత్తపల్లి కృష్ణమూర్తి, సామినేని గోపయ్య, మడుపల్లి వీరస్వామి, తమ్మినేని బుచ్చయ్య, తమ్మారపు వెంకటకోటయ్యను బంధించగా వెంకటకోటయ్య సైన్యం కళ్లుకప్పి తప్పించుకున్నారు. ఇక కృష్ణమూర్తి చిన్నవయస్కు డని వదిలివేశారు. మిగిలిన ఏడుగురిని జనం చూస్తుండగా మంగలి గుట్టపై చంపి ఒకే చితిపై కాల్చారు. -
తనికెళ్లపై రజాకార్ల దాడులు
కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య, షేక్ మహబూబ్ అలీ, తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల ముత్తయ్య, యాస వెంకట లాలయ్య తదితరులు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నల్లమల గిరిప్రసాద్, షేక్ రజబ్ అలీ నేతృత్వాన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. పుచ్చలపల్లి సుందరయ్యతో కూడా కలిసి పనిచేసిన అనుభవం వీరికి ఉంది. రజాకార్లు తనికెళ్లపై దాడులు జరిపి కనిపించిన వారినల్లా హింసించారు. దళంలో ముఖ్యుడైన గడల సీతారామయ్య ఆచూకీ చెప్పమని చిత్రహింసలకు గురిచేస్తూ, ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకొస్తే ఆయనే సీతారామయ్యగా రజాకార్లను నమ్మించారు. -
చెరువులకు పూర్వవైభవం
● మూడింటి అభివృద్ధికి రూ.75 కోట్లతో ప్రతిపాదనలు ● కట్టల బలోపేతం, ఘాట్ల నిర్మాణానికి నిర్ణయం ఖమ్మంఅర్బన్: ఒకప్పుడు గ్రామాలు, నగరాల ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించిన చెరువులు కాలక్రమంలో కాలగర్భంలో కలిసే స్థితికి చేరాయి. ఆక్రమణలకు తోడు మురుగునీరు చేరడంతో వాటి వైభవం కోల్పోయాయి. అయితే, ఇలాంటి చెరువులను పునరుద్ధరించి పర్యాటకానికి అనువుగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఖానాపురం చెరువు, ధంసలాపురం పెద్ద చెరువు, పుట్టకోట(వెలుగుమట్ల) చెరువుల అభివృద్ధికి జలవనరుల శాఖ సుమారు రూ.25 కోట్ల చొప్పున అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఆక్రమణల నివారణ, బలమైన కట్టలు చెరువుల అభివృద్ధిలో భాగంగా తొలిదఫా శిఖం భూములు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యలు చేపడుతారు. పూర్తిస్థాయిలో శిఖం భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటుచేయడమే కాక చుట్టూ కట్టలను బలోపేతం చేస్తారు. అంతేకాక తూములు, అలుగులకు మరమ్మతు చేసి చెరువుల చుట్టూ సుమారు ఆరు కిలోమీటర్ల మేర బలపరుస్తారు. కట్ట పైనుంచి మట్టి జారకుండా రాళ్లు ఏర్పాటుచేసి కట్టపై రక్షణ కంచె ఏర్పాటుచేయనున్నారు. అలాగే, చెరువులోకి నీరు వచ్చే వాగులపై వంతెనలు నిర్మించి అలుగుల వద్ద కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా వంతెనల నిర్మాణం చేయాలని ప్రతిపాదనల్లో పొందుపర్చారు. మురుగునీరు చేరకుండా... ఖమ్మం నియోజకవర్గంలోని ఎనిమిది చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలిదశలో మూడు చెరువులకు సంబంధించి ప్రతిపాదనలు పంపగా, దశల వారీగా మిగతా చెరువులపై దృష్టి సారించనున్నారు. నిధులు మంజూరు కాగానే ప్రతీ చెరువుకు నాలుగు వైపులా బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక మురుగునీరు చేరకుండా, కట్టలపై వరద నీరుతో కోతకు గురి కాకుండా నీటి మళ్లింపునకు కాల్వలు నిర్మిస్తారు. ఫలితంగా చెరువులు శుభ్రంగా మారి ఉత్సవాలకు, సాయంకాలం స్థానికులు సేద తీరే వేదికగా నిలవనున్నాయి. ఇదే సమయాన మొక్కలు నాటడంతో పాటు పర్యాటక శాఖ ద్వారా కేఫ్లు కూడా ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నారు. -
ఎయిర్పోర్ట్ నిర్మాణంపై చొరవ తీసుకోండి
● కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి ఖమ్మంఅర్బన్/ఇల్లెందు: కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రాంమోహన్నాయుడుకు వివరాలు అందజేసి మాట్లాడారు. గతంలో గుర్తించిన స్థలం అనుకూలంగా లేదని తేల్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన నేపథ్యాన సర్వే చేయించాలని కోరారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులే కాక సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పరిశ్రమలకు వచ్చివెళ్లే అధికారులకు అనువుగా ఉంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామిని కూడా కలిసిన తుమ్మల.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఆవశ్యకతను వివరించారు.నేడు ప్రజాపాలన దినోత్సవం ఖమ్మం సహకారనగర్: ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యాన ఏర్పాటు చేసే స్టాళ్లను భట్టి విక్రమార్క సందర్శిస్తారు. -
రూ.కోట్ల విలువైన భూమి స్వాధీనం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం పాకబండ రెవెన్యూలో రూ.కోట్ల విలువ చేసే సాగర్ మేజర్ కాల్వ–2 మిగులు భూమిని అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కాల్వ భూమి ఆక్రమణకు గురవుతోందని అందిన ఫిర్యాదుతో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా సర్వే నంబర్ 88లో రెండెకరాల నాలుగు గుంటల భూమిని ఓ వ్యక్తి ఆయన భూమిలో అక్రమంగా కలుపుకున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ మార్కెట్లో రూ.10 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఆపై భూమిని చదును చేయించగా ఫెన్సింగ్ ఏర్పాటు పనులు పూర్తయ్యాక మొక్కలు నాటనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు కె.శ్రీనివాస్, నాగేశ్వరరావు, జలవనరుల శాఖ డీఈ ఉదయప్రతాప్తో పాటు కేఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు.‘సాగర్’ స్థలాల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు రావడంతో చర్యలు -
డంపింగ్ యార్డ్కు స్థలాన్ని గుర్తించండి
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్త డంపింగ్కు అవసరమైన స్థలాన్ని త్వరగా గుర్తించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి, పల్లిపాడు, లాలాపురం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను మంగళవారం పరిశీలించిన ఆమె మూడెకరాలకు తగ్గకుండా స్థలం ఎంపిక చేయాలని తెలిపారు. అయితే, తల్లాడ మండలం కొడవటిమెట్ట వద్ద ప్రభుత్వ స్థలాన్ని గతంలో కేటాయించినా దూరం కావడంతో చెత్త తరలింపుఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. దీంతో పల్లిపాడు – లాలాపురం సమీపాన 1.36 ఎకరాల ప్రభుత్వ స్థలం రికార్డులు అందజేయాలని కొణిజర్ల తహసీల్దార్ ఎన్.అరుణకు ఫోన్లో సూచించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గంలోని తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ శ్రీజ సమీక్షించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం తదితరులు పాల్గొన్నారు. -
ఆరు సొసైటీల పాలకవర్గాలు రద్దు
● ఆ స్థానంలో పర్సన్ ఇన్చార్జిల నియామకం ● మరో ఆరింటిపై త్వరలోనే నిర్ణయంఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలోని ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను మంగళవారం రద్దు చేశారు. ఆ స్థానంలో సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. డీసీసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో విస్తరించి ఉండగా మొత్తం 101 పీఏసీఎస్లకు గాను ఖమ్మం జిల్లాలో 76 ఉన్నాయి. వీటి పాలకవర్గాల ఐదేళ్ల కాలపరిమితి ఆగస్టు 14తో ముగియగా పాత పాలకవర్గాలనే ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదేసమయాన పనితీరు సరిగ్గా లేని, అక్రమాలు జరిగిన చోట పర్సన్ ఇన్చార్జిలను నియమించాలని ఆదేశించింది. 62 పాలకవర్గాల కొనసాగింపు జిల్లాలో మొత్తం 76 పీఏసీఎస్లకు గాను ఏదులాపురం, చేగొమ్మ, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పోచారం సొసైటీల పాలక వర్గాలను రద్దుచేశారు. ఈ మేరకు వీటి పర్సన్ ఇన్చార్జ్లుగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జి.ఉషశ్రీ, ఎస్బీవీ.రామిరెడ్డి, కె.రాజశేఖర్, జి.శ్రీనివాసకుమార్, సీహెచ్.రవికుమార్, ఎన్.ఉషారాణిని నియమిస్తూ జిల్లా సహకార అధికారి జి,గంగాధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కుర్నవల్లి, అమ్మపాలెం సంఘాల పాలకవర్గాలు రద్దు కాగా అక్కడ పర్సన్ ఇన్చార్జ్ల పాలనే కొనసాగుతోంది. ఇక మిగిలిన 68 పీఏసీఎస్ల్లో మరో ఆరింటి పాలకవర్గాలను కూడా రద్దు చేయనున్నట్లు తెలుస్తుండగా, మిగతా 62 సంఘాలకు ప్రస్తుత పాలకవర్గాలనే కొనసాగిస్తారు. అలాగే, భద్రాద్రి జిల్లాలో 21 పీఏసీఎస్లకు గాను 17 సంఘాల పాలకవర్గాల కొనసాగిస్తూ ఆ జిల్లా సహకార అధికారి అవధానుల శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా నాలిగింటిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. -
యూనిట్లకు సకాలంలో అనుమతులు
ఖమ్మం సహకారనగర్: పరిశ్రమలకు సంబంధించి యూనిట్ల ఏర్పాట్లకు అందిన దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి టీజీ ఐ–పాస్ కమిటీ సమావేశంలో పలు దరఖాస్తులు, అభ్యంతరాలను సమీక్షించారు. ఇందులో గ్రానైట్, రైస్ మిల్లులు, క్రూడ్ పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సరైన వనరులు ఉన్నందున ఔత్సాహికులను ప్రోత్సహించాలని తెలిపారు. అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదే సమయాన స్థానిక యువతకు ఉపాధి లభించేలా డిగ్రీ కళాశాలలు, ఐటీఐల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సీతారాం, మైనింగ్ ఏడీ సాయినాథ్, ఆర్టీఓ వెంకటరమణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె.శ్రీరామ్, గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.యుగంధర్, కె.గోపాల్రావు పాల్గొన్నారు. రక్షణ సామగ్రి పంపిణీ ప్రకృతి విపత్తుల సమయాన ఉపయోగించే రక్షణ సామగ్రిని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లకు అందజేశారు. వీటిని విపత్తుల సమయాన వినియోగానికి భద్రపర్చాలని సూచించారు. ఇందులో మైక్లు, టార్చిలైట్లు తదితర సామగ్రి ఉన్నాయి. డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు పి.రాంప్రసాద్, అరుణ, శ్వేత, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శర్మ పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
కళ్ల ముందే మార్కెట్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. గతంలో పాలకవర్గం సైతం ఏర్పడినా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకపోగా కేవలం చెక్పోస్ట్, కోల్డ్ స్టోరేజీ ఫీజుల వసూళ్లకు పరిమితమైంది. మార్కెట్లో కార్యకలాపాలు జరగాలంటే 50 మందికి పైగా కమీషన్దారులు ఉండాలని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల పరిధి రైతుల కోసం నిర్మించిన ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలైతే రైతుల ఇబ్బందులు తీరడమే కాక ఖమ్మం వ్యవసాయ మార్కెట్పై ఒత్తిడి తగ్గనుంది. ప్రస్తుతం ఖమ్మంలో మోడల్ మార్కెట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన మద్దులపల్లి మార్కెట్ను ఈ పంట సీజన్లోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. రైతులకు మరింత అందుబాటులో.. ఉమ్మడి జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్లు ఉండగా.. ఇటీవల చింతకాని, ముదిగొండ మండలాలకు చింతకాని మండలం మత్కేపల్లి వద్ద మరో మార్కెట్ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక్కడ స్థల సేకరణ ప్రక్రియ నడుస్తోంది. భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదించగా నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, వైరా, నేలకొండపల్లి, కల్లూరు, సత్తుపల్లి, ఏన్కూరు, మద్దులపల్లి మార్కెట్ల పరిధిలో 21 చెక్పోస్టులు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, దమ్మపేట వ్యవసాయ మార్కెట్లు, 18 చెక్పోస్టులు పనిచేస్తున్నాయి. అయితే, రైతులకు మరింత చేరువ చూసేలా కొత్త మార్కెట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. నిర్మాణం పూర్తయినా.. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో షెడ్లు, కార్యాలయాల భవనాల నిర్మాణం పూర్తయింది. గతంలోనే పాలకవర్గాన్ని సైతం నియమించినా కార్యకలాపాలు మాత్రం మొదలుకాలేదు. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిర్మాణ పనులు జరుగుతున్నందున మద్దులపల్లిలో లావాదేవీలు మొదలుపెడితే ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల నుంచే కాక జిల్లాలోని ఇతర ప్రాంతాలు, పక్క జిల్లాల రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ అవసరమైన 50 మందికిపైగా కమీషన్దారులను నోటిఫై చేయకపోవడం, ఇతర కారణాలతో ముందడుగు పడడం లేదు. ఫలితంగా ఇప్పటి వరకు మార్కెట్ ఫీజు, చెక్పోస్ట్ ఫీజు మాత్రమే ఆదాయం వస్తోంది. మత్కేపల్లికి ముహూర్తం ఎప్పుడో.. ఖమ్మం మార్కెట్ పరిధిలో ఉన్న చింతకాని, నేలకొండపల్లి మార్కెట్ పరిధిలోని ముదిగొండ మండలాన్ని విడదీసి నూతనంగా చింతకాని మండలం మత్కేపల్లిలో మార్కెట్ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఆగస్టు 2న జీఓ విడుదల చేసింది. ఇందుకోసం 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్కు ఆదేశాలు అందాయి. తొలుత మత్కేపల్లి రెవెన్యూ పరిధి 41వ సర్వేనెంబర్లో ఎనిమిది ఎకరాలను గుర్తించారు. మిగతా భూమిని కూడా గుర్తించి నిర్మాణాలు చేపడితే రెండు మండలాల రైతులకు మేలు జరగనుంది.ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఉమ్మడి జిల్లాతోపాటు సమీప జిల్లాలు, ఏపీ నుంచి రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొస్తారు. ఈ మార్కెట్పై ఒత్తిడి తగ్గించేందుకు 2018లో ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లిలో మార్కెట్ నిర్మాణాన్ని రూ.19.90 కోట్లతో 23.28 ఎకరాల్లో ప్రారంభించారు. ఇక్కడ ఖమ్మంరూరల్ మండలంలోని 19 గ్రామాలు, తిరుమలాయపాలెం మండలంలోని 25 గ్రామాల రైతులు పండించే మిర్చి, పత్తి, మొక్కజొన్న, పెసలు, కందిపప్పు, మినుములు కొనుగోలు చేయాలనేది అంచనా. అయినా.. మద్దులపల్లిలో మొదలుకాని కొనుగోళ్లు మద్దులపల్లి మార్కెట్ అందుబాటులోకి వస్తే ఖమ్మం వెళ్లాల్సిన అవసరం ఉండదు. దూరాభారం తగ్గుతుంది. రవాణా ఖర్చులు కలిసొస్తాయి. ఇక్కడ అన్ని పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటు రైతులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలి. – పల్లె రమేష్, రైతు, పోచారం, కూసుమంచి మండలంమా పంటలు అమ్ముకోవాలంటే ఖమ్మం వెళ్లాల్సి వస్తోంది. మద్దులపల్లిలో మార్కెట్ మంజూరు కావడంతో సంతోషించాం. ఇక్కడ నిర్మాణాలు కూడా పూర్తయినందున మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావాలి. తద్వారా మా ప్రాంత రైతులకు కలిసి వస్తుంది. – నామ అప్పారావు, పాపాయిగూడెం, తిరుమలాయపాలెం మండలం -
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులు, వినతిపత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటిప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి దరఖాస్తులు స్వీకరించాక అధికారులతో సమావేశమయ్యారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. కాగా, ఈఈ హౌసింగ్, డీఆర్డీఓ, డీపీఓ, డీఎంహెచ్ఓ తదితరులపై పత్రికల్లో వచ్చిన వ్యతిరేక వార్తలపై తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● వైరా మండలం గన్నవరం క్రాస్లోని రెబ్బవరం బస్టాండ్ను పునరుద్ధరించాలని స్థానికులు విన్నవించారు. ● వేంసూరు మండలం కందుకూరు రైతులు వరుణ్ అగ్రిటెక్ కంపెనీకి చెందిన బీపీటీ 2782 వరి సాగుతో నష్టపోయినందున కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ● బోనకల్ మండలం ఆళ్లపాడుకు చెందిన మరీదు శ్రీను దివ్యాంగుల పింఛన్ను పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు. ● చింతకాని మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్ల పరిధి గ్రామాలను మధిర డివిజన్లోకి మార్చకుండా ఖమ్మం డివిజన్లోనే కొనసాగించాలని టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. నిస్వార్థంగా సేవలు అందించాలి గ్రామ పాలన అధికారులుగా నియమితులైన వారు క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. జీపీఓలకు నియామక ఉత్తర్వులు అందజేసిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మందికి పోస్టింగ్ ఇచ్చామని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలుపై దృష్టి సారించాలని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.సునీల్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి ఖమ్మం సహకారనగర్: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో సమీక్షించారు. 2002 తర్వాత ఓటర్ జాబితా సవరణ జరగనుండగా, మాస్టర్ ట్రెయినర్ల ద్వారా బూత్ స్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. 2002 ఎస్ఐఆర్ తర్వాత ఓటు హక్కు వచ్చిన అందరి వివరాలు ధ్రువీకరించాల్సి ఉంటుందని చెప్పారు. ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఎన్నికల విభాగం ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు శాపంలా ప్రభుత్వ నిర్ణయాలు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారాయని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బకా యి ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్తో విద్యార్థులు, నాయకులు సోమవారం ఖమ్మంలో ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ నాయకులు ఇటికాల రామకృష్ణ, తుడుం ప్రవీణ్, వంగూరి వెంకటేష్, మస్తాన్, మంద సురేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకా యిల విషయంలో ప్రభుత్వం మారినా తీరు మాత్రం మారలేదని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చినా స్పందించకపోవడం గర్హనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జార్జిరెడ్డి, మడుపల్లి లక్ష్మణ్, సుధాకర్, తిప్పారపు లక్ష్మణ్, శ్యామల, లోకేష్, వినయ్, సురేష్, రాము, జంపన్న తదితరులు పాల్గొన్నారు.విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన నిరసన ర్యాలీ -
కాంగ్రెస్ హయాంలోనే మహిళా సంక్షేమం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యాన ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్కట్ చేశాక దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మహిళల్ని రాజకీయంగా చైతన్యవంతం చేయాలని ఉద్దేశంతో 1952లోనే కాంగ్రెస్ మహిళా సెల్ ఏర్పాటైందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతీ పథకాన్ని మహిళల పేరిటే అమలుచేస్తోందని చెప్పారు. ●జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తెలిపారు. వివిధ పార్టీల నాయకులు సింగారపు చంద్రమౌళి, వంగూరస్వామి తదితరులు సోమవారం కాంగ్రెస్లో చేరగా ఆయన కండువాలు కప్పి మాట్లాడారు. ఈకార్యక్రమాల్లో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, కార్పొరేటర్ లకావత్ సైదులు, నాయకులు గజ్జెల్లి వెంకన్న, మూడుముంతల గంగరాజు యాదవ్, దేవత్ దివ్య, రమ, స్వరూప, ఏలూరి రజని, ఊరుకొండ చంద్రిక, బలుసు లక్ష్మి, జంపాల రామకృష్ణ, మేడారపు హరినాథ్, రాచమల్ల నర్సింహారావు, మామిడాల కుమారస్వామి, జంపాల జంపన్న, దూదిపాళ్ల ఉపేందర్, రాచమల్ల హన్మంతరావు, రామవరపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ -
అధికారుల తీరు సరికాదు..
ఖమ్మంవైరారోడ్: కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మేరకు పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధి ప్రాథమిక సహకార సంఘాల సొసైటీల పాలకవర్గాలను పొడిగించే విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మంలో డీసీఓ గంగాధర్ను సోమవారం వారు కలిసి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సొసైటీల పదవీ కాలాన్ని పొడిగించాల్సి ఉండగా.. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇకకైనా పీఏసీఎస్ల పాలకవర్గాల పదవీకాలం పొడిగించాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, కనగాల వెంకటరావు, వీరమోహన్రెడ్డి, పాలెపు రామారావు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర -
కొత్త పత్తి వస్తోంది..!
● ఖమ్మం మార్కెట్కు ఇప్పుడిప్పుడే సరుకు ● ధర కోసం రైతుల ఎదురుచూపులుఖమ్మంవ్యవసాయం: వానాకాలంలో రైతులు సాగు చేసిన పత్తి చేతికొస్తోంది. జూన్ ఆరంభంలో సాగు చేసిన వారు ఇప్పుడిప్పుడే పత్తితీత మొదలుపెడుతున్నారు. అయితే, మైల పంటగా భావించే మొదటి సరుకును నిల్వ చేయకుండా విక్రయానికే మొగ్గుచూపుతారు. ఈనేపథ్యాన వారం రోజులుగా ఖమ్మం మార్కెట్కు 500 – వెయ్యి బస్తాల మేర పత్తి వస్తోంది. అయితే, ధర మాత్రం అంతంత మాత్రంగానే పలుకుతోంది. దసరా దాటితే జోరు పత్తి పంట సహజంగా వంద రోజుల్లో చేతికి అందుతుంది. జూన్లో సాగు చేసిన పంట తీత ఇప్పుడిప్పుడే మొదలుపెడుతుండగా దసరా తర్వాత జోరందుకునే అవకాశముంది. అయితే, పత్తి క్వింటాకు కేంద్రప్రభుత్వం తేమశాతం ఆధారంగా గరిష్టంగా రూ.8,110 ధర నిర్ణయించింది. కానీ ఆ ధర మార్కెట్లో కనిపించటం లేదు. గత ఏడాది పండించిన పంటకు కూడా కనీస మద్దతు ధర దక్కడం లేదు. కొత్త, పాత పత్తికి తేడా లేకుండానే వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తికి గరిష్టంగా రూ.7,500, మోడల్ ధర రూ.6,500, కనిష్ట ధర రూ.5,100గా పలుకుతోంది. నిత్యం 2వేల బస్తాల పత్తి వస్తుండగా ఇందులో సగం కొత్త పంట ఉంటోంది. కానీ పాత పత్తికి సైతం కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈక్రమంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టినా నేపథ్యాన ఆ కేంద్రాలు ప్రారంభమైతే మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. వానాకాలం ఆరంభంలోనే మూడెకరాల్లో పత్తి వేశా. అధిక వర్షాలతో తొలితీతలో 8బస్తాలే వచ్చింది. ప్రభుత్వం క్వింటాకు రూ.8,110 ధర చెప్పినా వ్యాపారులు రూ.5వేల నుంచి రూ.6 వేలకే కొనుగోలు చేశారు. అదేమంటే మైల పంట అని చెప్పారు. – బి.కొండలు, గోవిందాపురంఅన్ సీజన్లో ధర వస్తుందని గత ఏడాది నిల్వ చేసిన పత్తి తీసుకొచ్చా. పంటల పెట్టుబడి కోసం అమ్మకానికి వస్తే కనీస ధర కూడా లేదు. పంట నాణ్యంగా ఉన్నా క్వింటా రూ.6,500కే అడిగారు. అధికారులు స్పందిస్తేనే మేలు జరుగుతుంది. – జి.సత్యనారాయణరెడ్డి, మోతె, సూర్యాపేట జిల్లా -
అండర్ పాస్ ఎత్తు పెంచాల్సిందే..
మధిర: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా నిర్మిస్తున్న అండర్ పాస్ ఎత్తు పెంచాలని మధిర మండలం నిధానపురం గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు పనులు జరుగుతున్న ప్రదేశం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అండర్ పాస్ను 12అడుగులతో నిర్మిస్తుండడంతో ప్రజల రాకపోకలు, రైతులు పంట ఉత్పత్తుల వాహనాలు రావడం ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఈమేరకు 20 అడుగులకు పెంచకపోతే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ విజిలెన్స్ అధికారుల తనిఖీమాజీ సర్పంచ్ ఇంటికి సరఫరా కట్ బోనకల్: బోనకల్ మండలం చొప్పకట్లపాలెంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బారావు 2022 నుంచి విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో రూ.53వేల బకాయి పేరుకుపోగా సరఫరా నిలిపివేశారు. అలాగే, మరికొన్ని సర్వీసులను కూడా తనిఖీ చేశారు. ఏఈ మనోహర్, సీహెచ్.రమణి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ విద్యార్థినికి బంగారు పతకంకారేపల్లి: మండలంలోని తొడితలగూడెంకు చెందిన ఆదివాసీ విద్యార్థిని ఎట్టి ప్రియ కు బంగారు పతకం లభించింది. మహా త్మాగాంధీ యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తిచేసిన ఆమె యూనివర్సిటీ స్థాయి ఫలితా లు సాధించడంతో బంగారు పతకం ప్రకటించారు. ప్రియ తండ్రి రమణ ఆమె చిన్నతనంలోనే మృతిచెందగా, తల్లి కోటేశ్వరి కూలీ పనులకు వెళ్తూ చదివించింది. ఈ సందర్భంగా ప్రియను పలువురు అభినందించారు. బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్లుఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో తారురోడ్ల నిర్మాణానికి రూ.16.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి తెలిపా రు. మండలంలోని పెద్ద గోపవరం – బంజర, కొత్త గోపవరం – బంజర, జమలాపురం – రామాపురం మార్గంలో ఈ నిధులతో రహదారుల నిర్మానం జరుగుతుందని వెల్లడించారు. ‘జాలిముడి’ మరమ్మతులకు రూ.5.23 కోట్లు ఖమ్మంఅర్బన్: మధిర మండలం జాలిముడి ఆనకట్ట కెనాల్ మరమ్మతుల కోసం రూ.5.23 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాలిముడి ఆనకట్ట ఎడమ, కుడి ఫ్లాంక్ కెనాళ్ల మరమ్మతులకు ఈ నిధులు కేటాయించింది. అంచనాలు, డిజైన్ రూపకల్పన బాధ్యతను ఖమ్మం చీఫ్ ఇంజనీర్కు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా మార్కెట్ చైర్మన్ల ఫోరం ఏర్పాటుగౌరవ అధ్యక్షుడిగా హన్మంతరావు ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం ఏర్పాటైంది. రాష్ట్ర ఫోరం తరహాలో ఉమ్మడి జిల్లా ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మార్కెట్లకు గాను తొమ్మిది మార్కెట్లకు పాలకవర్గాలు ఉన్నాయి. ఈ మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సమావేశమైన చైర్మన్లు ఫోరం ఏర్పాటు చేసుకున్నారు. ఫోరం గౌరవ అధ్యక్షుడిగా ఖమ్మం ఏఎంసీ చైర్మన్ యరగర్ల హన్మంతరావును ఎన్నికయ్యా రు. అలాగే, అధ్యక్షుడిగా బండారు నరసింహారావు(మధిర), ఉపాధక్షులుగా బాగం నీరజ(కల్లూరు), కార్యదర్శిగా దోమ ఆనంద్బా బు(సత్తుపల్లి), సహాయ కార్యదర్శిగా టి. సీతమ్మ(భద్రాచలం),, కోశాధికారిగా ఇరుప శ్రీని వాసరావు(చర్ల)ను ఎన్నుకున్నారు. త్వరలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విధులు నిర్వర్తిస్తామని హన్మంతరావు తెలిపారు. -
అప్పుల బాధతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
తల్లాడ: మండలంలోని నరసింహారావుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి అప్పులు పెరగడం, అవి ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎదురవుతుండడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహరావుపేటకు చెందిన పిన్ని ప్రశాంత్(27) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఆయన రూ.26 లక్షల మేర హైదరాబాద్కు చెందిన రిషిక మల్లికార్జున్, సురేష్కుమార్, రంజిత్కుమార్ వద్ద అప్పు చేయగా, తీర్చాలని వారి నుంచి ఒత్తిడి ఎదురైంది. దీంతో ఈనెల 12 రాత్రి స్వగ్రామానికి వచ్చిన ప్రశాంత్ 13వ తేదీన పురుగుల మందు తాగగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రశాంత్ ఆదివారం మృతి చెందడంతో ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.పాఠశాలలో పాము కలకలం వైరారూరల్: వైరా మండలం జింకలగూడెం ప్రాథమిక పాఠశాలలో సోమవారం పాము కలకలం రేపింది. సాయంత్రం తరగతులు ముగిశాక విద్యార్థులు ఆట వస్తువుల వద్దకు వెళ్లగా అక్కడ పాము కనిపించింది. దీంతో విద్యార్థులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈమేరకు స్థానికులు చేరుకుని పామును చంపేశారు. పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో పాములు చేరాయని తెలుస్తుండగా, శుభ్రం చేయిస్తామని ఉపాధ్యాయుడు బి.పుల్లారావు తెలిపారు. కారు బోల్తా, నలుగురికి గాయాలుముదిగొండ: ఖమ్మం–కోదాడ నేషనల్ హైవేపై ముదిగొండ మండలం వెంకటాపురం సమీపాన ప్రమాదవశాత్తు సోమవారం బోల్తా పడింది. ఖమ్మం నుంచి నాగమ్మ, నరేందర్, బాలకృష్ట, శేఖర్ కారులో కోదాడ వైపు వెళ్తుండగా టైరు పంక్చర్ కావటంతో బోల్తా పడగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకోసం అంబులెన్స్లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ఆంధ్రా ఇసుకకు బ్రేకులు!
● చింతలపూడి వద్ద 21 లారీలు సీజ్ ● అన్నీ సత్తుపల్లి వ్యాపారులవే... ● ఇన్నాళ్లూ లక్షల టన్నుల ఇసుక అక్రమ రవాణాసత్తుపల్లి: ఏపీ నుంచి తెలంగాణలోకి గోదావరి ఇసుక రవాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. అయితే, జిల్లా పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారుల తనిఖీలతో ఇది సాధ్యం కాలేదు. ఆంధ్రా – తెలంగాణ ఇసుక మాఫియా మధ్య ఆధిపత్య పోరుతో గుట్టు బయటపడింది. ఏలూరు జిల్లా యర్రగుంటపాడుకు చెందిన ఓ వ్యాపారి లారీలను తెలంగాణలో మరో వ్యాపారి పోలీసులకు పట్టించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదే సమయాన ఆంధ్రా వ్యాపారి ఇచ్చిన సమాచారంతో డొంక కదలగా మరికొందరి లారీలను ఏలూరు జిల్లా అధికారులు సీజ్ చేశారు. లక్షల టన్నులు... గోదావరి ఇసుకను ఆంధ్రా సరిహద్దుగా గ్రామాల్లోని వ్యక్తుల పేరిట కొన్నాళ్ల నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు. చింతలపూడి మండలంలోని పలు గ్రామాల వ్యక్తుల పేరిట అనుమతి తీసుకుని లక్షల టన్నుల ఇసుకను సరైన పత్రాలు లేకుండానే తరలించారు. అయితే, ఏపీ అధికారులు తనిఖీ చేయగా సీతానగరం గ్రామస్తుల పేరిట 60 లారీల ఇసుక తరలించినట్లు బయటపడినట్లు తెలిసింది. కాగా, నాలుగురోజుల క్రితం చింతలపూడిలో సత్తుపల్లికి చెందిన 21లారీలను సీజ్ చేశారు. కొవ్వూరు, తాళ్లపూడి, అన్నదేవరపేట, వాడపల్లి, గోపాలపురం రీచ్ల నుంచి సత్తుపల్లి పరిసరాలకు గోదావరి ఇసుక ప్రతిరోజు పదుల సంఖ్యలో లారీల ద్వారా చేరుతోంది. ఈ అంశంపై ఖమ్మం జిల్లా అధికారులు కూడా దృష్టి సారించినట్లు తెలిసింది. రూ.లక్షల్లో దండుకొని.. సత్తుపల్లికి చెందిన యజమానుల ఇసుక లారీలను విడిపిస్తానని గంగారానికి చెందిన ఓ వ్యక్తి రూ.లక్షలు వసూలు చేసి పత్తా లేకుండా పోయినట్లు సమాచారం. దీంతో ఏపీలోని అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే యత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. అయితే భారీగా ఇసుక అక్రమ రవాణా కావడంతో అక్కడి అధికారులు చేతులెత్తేసినట్లు సమాచారం. ఏదిఏమైనా నాలుగు రోజుల నుంచి సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ఏపీ గోదావరి ఇసుక అక్రమ రవాణా లేకపోవడంతో స్థానిక ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయాన అక్రమార్కులు కృష్ణా నది నుంచి ఇసుక రవాణా చేసేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు తెలిసింది. తిరువూరు మీదుగా కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లికి కృష్ణా నది ఇసుకను తెప్పిస్తున్నా గోదావరి ఇసుక మాదిరి నాణ్యత లేకపోవడంతో నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదని సమాచారం. -
మిర్చి ధర పతనం
● విదేశాలకు ఆర్డర్లు లేకపోవడమే కారణం? ● దేశీయంగా పండుగ ప్రభావంఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర తిరోగమనంలో కొనసాగుతోంది. జూలై ఆరంభం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన మిర్చి ధర ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. ప్రధానంగా విదేశాలకు ఎగుమతి చేసే ‘తేజా’ రకం మిర్చి ధరపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఓ వైపు విదేశీ ఆర్డర్లు లేకపోవటం, మరో వైపు దేశీయంగా దసరా పండుగ ప్రభావంతో కొనుగోళ్లు లేక ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అన్ సీజన్లో ధర వస్తుందనే ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులు వానాకాలం పంటల సాగు పెట్టుబడి కోసం అమ్మకానికి తీసుకొ స్తున్నారు. కానీ వారి ఆశలకు భిన్నంగా ధర పడిపోతుండడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. కొంత పెరిగినా... సుమారు 50రోజులుగా మిర్చి ధరలో కొంత పురోగతి కనిపించింది. కానీ ఇప్పుడు తిరోగమనం దిశగా సాగుతుండడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. జూన్లో క్వింటా మిర్చి ధర రూ.13 వేల నుంచి రూ.13,500 పలకగా.. జూలైలో రూ. 13,900 వరకు పెరిగింది. ఆగస్టు ఆరంభంలో రూ. 14వేలకు పెరిగి, 26వ తేదీ నాటికి రూ.15,600కు చేరింది. ఇక ఈనెలారంభం నుంచి మాత్రం తిరోగమనం ప్రారంభమైంది. ఈనెల 1న రూ.15,450, 8న రూ.15,400, 10న రూ.15,200, 11న రూ.15,100గా, 12వ తేదీన రూ.15వేలకు తగ్గి సోమవారం రూ.14,900కు చేరింది. దీంతో నెల వ్యవధిలో క్వింటాకు రూ.700 ధర తగ్గినట్లయింది. రకరకాల కారణాలతో.. తేజా రకం మిర్చిని చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. కానీ ఈ ఏడాది పంట సీజన్ నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక ధరలో పురోగతి కానరాలేదు. గత ఏడాది రూ.20వేలు పలికిన ఈ ఏడాది ఓ సమయాన సగానికి పడిపోయింది. సీజన్లో సగటున రూ.13 వేలు, చివరలో రూ.10వేలకు తగ్గింది. ఇప్పుడు అన్ సీజన్లో ధరలు లేకపోవడం గమనార్హం. విదేశాలకు ఆర్డర్లు లేకపోవడం ఓ కారణమైతే... ఉత్తరాది రాష్ట్రాల్లో దసరా పండుగ సీజన్ మొదలుకావడంతో కొనుగోళ్లు మందగించి ధరపై ప్రభావం పడుతున్నట్లు సమాచారం. అయితే, రైతులు మాత్రం వానాకాలం పంటల సాగు పెట్టుబడుల కోసం నిల్వ మిర్చి విక్రయానికి మొగ్గు చూపుతున్నారు. తద్వారా విక్రయాలు పెరగడం కూడా ధర పతనానికి కారణంగా ఇంకొకొందరు విశ్లేషిస్తున్నారు. -
గ్రావెల్ తవ్వకాలపై కలెక్టర్కు ఫిర్యాదు
ఎర్రుపాలెం: మండలంలోని పలు గ్రామాల్లో కొందరు అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు తవ్వకాలు నిలిపేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సోమవారం ఖమ్మంలో కలెక్టర్ అనుదీప్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దివ్వెల వీరయ్య, మద్దాల ప్రభాకర్, నల్లమోతు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పోడు పట్టాలకు రైతు భరోసా ఇవ్వాలని.. కొణిజర్ల: పోడు భూమి సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయాలని కొణిజర్ల మండలం రామనరసయ్యనగర్కు చెందిన రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్, డీఏఓ ధనసరి పుల్లయ్యకు వినతిపత్రాలు అందజేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్, నాయకులు పాశం అప్పారావు, కంపసాటి వెంకన్న, పలువురు రైతులు పాల్గొన్నారు. -
హైవే సమస్యల పరిష్కారానికి కృషి
ఖమ్మం సహకారనగర్: గ్రీన్ఫీల్డ్ హైవేకు సంబంధించిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులతో పాటు వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల రైతులతో కలెక్టరేట్లో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీసు రోడ్లు, డ్రెయిన్ల సామర్ధ్యం పెంపు అంశాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అభివృద్ధి పనులకు ఆటంకం ఎదురుకాకుండానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈమేరకు హైవే పనులను అడ్డుకోవద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ తొలుత చెప్పినట్లు సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించకపోతే రైతులు నష్టపోతారని తెలిపారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే పీడీ దివ్య, నాయకులు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
గేదెల పంపిణీ ప్రారంభం
‘ఇందిరా’ డెయిరీలో ముందడుగు బోనకల్: మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటులో భాగంగా ముందడుగు పడింది. మహిళలకు రెండేసి పాడిగేదెలు పంపిణీ చేసి పాల సేకరణతో వారి ఆర్థికాభివృద్ధి కోసం డెయిరీని ఏర్పాటుచేస్తున్నారు. ఈమేరకు పలువురు సభ్యులు ఉండగా.. బోనకల్ మండలంలోని వివిధ గ్రామాల్లో తొలి విడతగా 25 మంది లబ్ధిదారులకు 50గేదెలు పంపిణీ చేశారు. అధికారులు, లబ్ధిదారులతో కూడిన కమిటీలు ఏపీలోని ద్రాక్షారామం వెళ్లి అక్కడ వీటిని కొనుగోలు చేశారు. రూ.2లక్షల విలువ కలిగిన యూనిట్తో పాటు దాణా సైతం సోమవారం లబ్ధిదారులకు అందజేసినట్లు ఏపీఎం కొట్టె వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.2,100 చెల్లించి మండలంలో 4వేల మంది డెయిరీలో సభ్యత్వం తీసుకోగా, దశల వారీగా గేదెలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. -
ఘనంగా ఇంజనీర్స్ డే
ఖమ్మంఅర్బన్: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంపులో ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు. పలువురు ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. జల వనరుల శాఖ ఖమ్మం, కొత్తగూడెం ఎస్ఈలు మంగళపూడి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్తో పాటు అధికారులు వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా, త్వరలో ఇంజనీర్ల అసోసియేషన్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. 23న నుంచి ‘దివ్య దక్షిణ’ రైలుయాత్ర మధిర: దసరా సెలవుల సందర్భంగా దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చుట్టివచ్చేలా ఐఆర్టీసీ ఆధ్వర్యాన దివ్యదక్షిణ యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఏర్పాటుచేశారు. ఈ రైలు 23న సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని ఐఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ టీవీ.వెంకటేష్ తెలిపారు. మధిరలో సోమవారం ఆయన మాట్లాడుతూ 23వ తేదీన సికింద్రాబాద్లో మొదలయ్యే రైలు అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ ముందుకు సాగుతుందని చెప్పారు. రైలుకు ఖమ్మం, మధిర రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ ఉన్నందున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్కొక్కరికి స్లీపర్ రూ.14వేలు, థర్డ్ ఏసీ రూ.22,500, సెకండ్ ఏసీ టికెట్ రూ.29,500గా నిర్ణయించినట్లు తెలిపారు. టికెట్లు, వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదా 96705 99512, 92810 30749, 92819 30714, 92814 95848 నంబర్లలో సంప్రదించాలని వెంకటేష్ సూచించారు. ‘విద్యానిధి’ దరఖాస్తు గడువు గడువు ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మా జ్యోతి బాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 24వ తేదీ వరకు పొడిగించారు. ఈమేరకు అర్హులైన అభ్యర్థులు ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.లక్ష్మణ్ సూచించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు ఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లోని సోమవారం అధికారులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 28వరకు పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 287 మంది, ఇంటర్ పరీక్షలకు 254 మంది హాజరుకానున్నందున కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్ల చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, డీఐఈఓ కె.రవిబాబు, ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి మంగపతిరావు తదితరులు తెలిపారు. బౌద్ధక్షేత్రం అభివృద్ధికి కార్యాచరణ నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎల్.రమేష్ తెలిపారు. బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యాన సోమవారం ఆయన చరిత్రకారులతో సమావేశమయ్యారు. క్షేత్రం పరిసరాల్లో చేపట్టిన తవ్వకాలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనందున అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకంగా ఆదరణ పెరుగుతుందని తెలి పారు. చరిత్రకారులు అరవింద్, కె.శ్రీనివాస్, చారిత్రక బృందం సభ్యులు పసుమర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రజాకార్లతో రణం చేసి..
కృష్టా జిల్లా నందిగామ తాలూకాలో పరిటాల సమీపాన పోలీస్ హెడ్క్వార్టర్పై విప్లవకారులు దాడి చేసి ఆయుధాలు సంపాదించారు. ఆ తర్వాత మోటమర్రిలో మిలిటరీ క్యాంపుపైనా దాడి చేశారు. ఆపై మైదాన ప్రాంతాల్లోని జమీందార్ల గడీలు, ఇళ్లపై దాడులు చేస్తూ ఆయుధ సంపత్తి పెంచుకున్నారు. దీంతో గ్రామ దళాలకు బర్మార్లు, గెరిల్లా పోరాటం చేసేవారికి షాట్గన్లు, ఆపై స్థాయిలో ఉండేవారికి 12 బోర్ రైఫిళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీరితో 50 గ్రామాల్లో ప్రత్యేక రక్షక దళాలు ఏర్పడ్డాయి. మరోవైపు గిరిజన ప్రాంతాలకు వెళ్లిన కామ్రేడ్లు ‘ఫారెస్టు’ జులుంను అడ్డుకుని కోయ ప్రజల నమ్మకం పొందారు. ఫలితంగా 1948 ఏప్రిల్ నాటికి జిల్లాలో సుమారు వేయి మంది కోయ సభ్యులు గెరిల్లా పోరాటంలో భాగస్వాములయ్యారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్ర మహాసభ ప్రభావం ఎక్కువగా ఉండేది. చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, సర్వదేవభట్ల రామనాథం వంటి నాయకులు ఇక్కడ పార్టీని బలోపేతం చేశారు. 12వ ఆంధ్ర మహాసభ 1945లో ఖమ్మంలో సుమారు ఇరవై వేల మందితో జరిగింది. ఈ సభ స్ఫూర్తితోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడగలమనే ధీమా విప్లవకారులకు వచ్చింది. దీంతో 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం వరంగల్ జిల్లాలోని విస్నూర్ గడి కేంద్రంగా రగులుకుంది. దీంతో ముందుజాగ్రత్తగా ఖమ్మం, మధిర, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఇల్లెందు, పాల్వంచ, ములకలపల్లి వంటి ప్రాంతాల్లో రజాకార్లు క్యాంపులు ఏర్పాటుచేశారు. గ్రామాల్లోకి కమ్యూనిస్టులు రాకుండా, సంఘాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాల్వంచలో కోయదళంపై దాడి.. వేంసూరు సంస్థానంలో భూపంపిణీ చేసిన దళాలు తమ తదుపరి కార్యక్షేత్రంగా పాల్వంచ సంస్థానానికి చేరుకున్నాయి. ఇక్కడ 120 మంది ఆదివాసీ/కోయ యువకులతో గెరిల్లా దళం ఏర్పాటు కాగా, భూపంపిణీ మొదలైంది. దాన్ని అణచివేసేందుకు నిజాం సర్కార్ వేయి మంది సైనికులను పాల్వంచ తాలూకాకు పంపింది. పదిహేను రోజుల పాటు జరిగిన పోరులో ఎనిమిది మంది నిజాం సైనికులు చనిపోయారు. అలాగే, గెరిల్లా దళ నాయకుడు ముత్యాలు మృతిచెందగా మరో ఆరుగురిని నిజాం సర్కార్ ఉరి తీసింది. ఆ తర్వాత రజాకార్ దళాలు ములకలపల్లిలో క్యాంపు ఏర్పాటు చేశాయి. పాల్వంచలో నష్టపోయిన కోయ దళాలు ములకలపల్లిలోని రజాకార్ క్యాంపుపై దాడులు చేశాయి. చివరకు బతుకుజీవుడా అంటూ ఈ క్యాంపును ఎత్తివేయాల్సి వచ్చింది. కార్మిక సంఘం ఏర్పాటు.. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రహస్యంగా ఏర్పడింది. హెడ్డాఫీసులో క్లర్క్గా పనిచేస్తున్న శేషగిరిరావు పోరాటంలో మొదటి అడుగు వేశారు. శేషగిరిరావు నేతృత్వంలో సాయుధ దళాలు రంగంలోకి దిగి కార్మికుల హక్కుల కోసం పోరాడాయి. ఫలితంగా కాంట్రాక్టు విధానం రద్దయి ఉద్యోగులనే గుర్తింపు వచ్చింది. మహిళలు, పిల్లలను గనుల్లో పని చేయించడంపై నిషేధం విధించగా.. ఉపాధి కోల్పోయిన మహిళలకు సింగరేణి పవర్ ప్లాంట్లలో పని కల్పించారు. చివరకు శేషగిరిరావును 1948 ఏప్రిల్లో నెల్లిపాక వద్ద నిజాం పోలీసులు కాల్చి చంపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటం జోరందుకునే సమయంలో 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగిన ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీస్ చర్యతో నిజాం సర్కార్ కుప్పకూలింది. హైదరాబాద్ స్టేట్ భారత్లో విలీనమైంది. ఆ తర్వాత జరిగిన మలి దశ పోరాటానికి భద్రాద్రి జిల్లా అడవులే కేంద్ర స్థానాలయ్యాయి. అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెనలో 1948లో రజాకార్లకు – సాయుధ పోరాట యోధులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. వట్టికుంట నాగేశ్వరరావు నేతృత్వంలో గుంపెనలో సమావేశమైన 70మంది సభ్యులతో కూడిన దళాన్ని కల్లూరు నుంచి భారీ సంఖ్యలో వచ్చిన రజాకార్లు చుట్టుముట్టారు. దీంతో విప్లవకారులు ప్రాణాలకు తెగించి పోరాడుతూ అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ దాడిలో ఒక గెరిల్లా, మరో ఇద్దరు గ్రామస్తులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత దళాల నిర్వహణపై కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. సాయుధ దళంలో 20కి మించి సభ్యులు ఉండకూదనే తీర్మానం చేశారు. 2రైతాంగ పోరాటానికి బాటలు వేసిన ఖమ్మం మహాసభ -
చినుకు పడితే వరదే..
సత్తుపల్లిరూరల్: చినుకు పడితే చాలు అంగన్వాడీ కేంద్రంలోకి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే భవనం శ్లాబ్ పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారగా.. ఇప్పుడు వరదతో సత్తుపల్లి మండలం కాకర్లపల్లి బోడుకాలనీలోని కాకర్లపల్లి–1 అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం పల్లపు ప్రాంతంలో ఉండడంతో చిన్నపాటి వర్షానికే వరండా, గదుల్లోకి నీరు చేరుతోంది. దీంతో బకెట్లతో తోడిబోస్తూ సిబ్బంది అవస్థ ఎదుర్కొంటున్నారు. పాత భవనం కావడంతో శ్లాబ్ పెచ్చులూడి పడుతుండగా ఎప్పుడేం జరుగుతోందనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
జిల్లా సైన్స్ సెమినార్ పోటీలు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని జిల్లా సైన్స్ మ్యూజియంలో సోమవారం జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. ఎన్సీఎస్సీ కోఆర్డినేటర్ ఇనుముల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పోటీల్లో ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈనెల 18న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని చెప్పారు. ఈ పోటీల్లో కె.వనీషా(త్రివేణి), కె.అశ్రీత్ రామ్(హార్వెస్ట్), పి.లేఖ(రిక్కాబజార్), బి.శివసాయిరామ్(నయాబజార్) విద్యార్థులు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు రామారావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, త్రివేణి పాఠశాల విద్యార్థిని కె.వనీషారెడ్డి ప్రథమ స్థానంలో నిలవడంపై త్రివేణి పాఠశాలల అధిపతి గొల్లపుడి వీరేంద్రచౌదరి, త్రివేణి– కృష్ణవేణి విద్యాసంస్థల అధిపతి వై.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ అభినందించారు. -
భూసేకరణ వేగవంతం చేయండి
ఖమ్మం సహకారనగర్ : జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు వీలుగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జాతీయ రహదారుల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం – దేవరపల్లి, నాగపూర్ – అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం – దేవరపల్లి రహదారికి ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ కొరకు 6.22 ఎకరాల భూసేకరణ చేయాలని అన్నారు. ఇందులో 3.16 ఎకరాలకు ఇప్పటికే అవార్డ్ పాస్ చేశామని, మిగతా 3.06 ఎకరాల భూసేకరణకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మేజర్ బ్రిడ్జిని నవంబర్ లోగా, ఆర్ఓబీ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. కొదుమూరు వద్ద 400 కేవీఈహెచ్ టీ షిఫ్టింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. నాగపూర్ – అమరావతి ప్యాకేజీ 1, 2 భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, అక్టోబర్లోగా పరిహార చెల్లింపు పూర్తిచేసి, భూమిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. సమావేశంలో ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ఎన్హెచ్ అధికారులు రామాంజనేయ రెడ్డి, దివ్య, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ.. నగరంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో ఆదివారం నిర్వహించిన లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం సెషన్ థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది, మధ్యాహ్నం పరీక్షకు 205 మందికి గాను 202మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
●చెక్కుచెదరని ‘పాలేరు’
కూసుమంచి: 1928లో నిజాం పాలనలో పాలేరు చెరువు నిర్మించారు. నాటి చీఫ్ ఇంజనీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో ఈ చెరువు నిర్మించారు. ఈ చెరువు తూములు, ఆనకట్టల నిర్మాణం అద్భుతంగా సాగింది. చతురస్రాకారంలో ఉన్న నున్నటి బండరాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మధ్యలో సిమెంట్, కాంక్రీట్ లాంటి సీసం, డంగుసున్నం, బంకమట్టితో నిర్మాణ పనులు చేపట్టారు. చెరువులో నీరు నిండుగా ఉన్నా నేటికీ చుక్క కూడా లీక్ కాకపోవడం నాటి ఇంజ నీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పడిలేచే గేట్లు.. పాలేరు చెరువు నుంచి రిజర్వాయర్గా మారిన తర్వాత ఇంజనీర్ల మరో ఘనత ఏంటంటే.. వరదలు వచ్చినప్పుడు రిజర్వాయర్లో మిగులు నీరు అలుగు ద్వారా బయటకు వెళ్లేందుకు ఫాలింగ్ గేట్లు (పడి లేచే గేట్లు) అమర్చారు. దీంతో 21 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం దాటిన తర్వాత ప్రవాహం పెరిగిన కొద్దీ వాటంతట అవే పడిపోతాయి. రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుతుంటే పైకి లేస్తుంటాయి. దీంతో ఎంత పెద్ద వరద వచ్చినా రిజర్వాయర్కు ప్రమాదం ఉండదు. 1978లో రిజర్వాయర్ నిర్మాణంలో ఈ తరహా గేట్లు అమర్చారు. కొన్నేళ్ల క్రితం ఈ గేట్లు దెబ్బతినగా అదే పద్ధతిన కొత్త గేట్లు అమర్చారు. -
కదనరంగంలో కొదమసింహాలై...
తెలంగాణ సాయుధ పోరాటం అనగానే దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, భీంరెడ్డి నర్సింహారెడ్డి తదితర ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన పోరాట యోధులే గుర్తుకొస్తారు. ఆరోజుల్లో పల్లెల్లో అరాచక పాలనకు కేంద్రాలుగా ఉన్న దొరల గడీలు, వారికి మద్దతుగా నిలిచిన నైజాం సర్కార్, అతని క్రూరసైన్యంలో భాగమైన రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను వారు ఏకం చేశారు. చేతిలో రాళ్లు, వడిసేల, గుత్ప(కర్రలు)లనే ఆయుధాలుగా చేసుకుని పోరాటం చేశారు. అయితే ఈ పోరాటంలో విప్లవకారులకు విల్లంబులు ఎక్కుపెట్టడం నుంచి జిలిటెన్ స్టిక్స్తో దాడులు చేయడం వరకు నేర్పింది ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా.. నేటి భద్రాద్రి జిల్లానే. కానీ ఈ చారిత్రక అంశాలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. దీంతో సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా పాత్ర ఈనాటి ప్రజానీకానికి ఎక్కువగా తెలియకుండా పోయింది. ఆనాటి వివరాలను ‘సాక్షి’ వెలికితీసే ప్రయత్నంలో వెలుగుచూసిన అంశాలపై నేటి నుంచి ప్రత్యేక కథనాలు.. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రా ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో కమ్యూనిస్టుల ప్రభావం ఈ జిల్లాపై ఎక్కువగా పడింది. మధిర, ఇల్లెందు వంటి పట్టణాలే కాక పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేట సంస్థానాల్లో వేలాది ఎకరాలు కలిగిన భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. కార్మికులు సంఘాలను ఏర్పాటు చేసుకుని నిజాం నిరంకుశ విధానాలకు ఎదురుతిరిగారు. మరోవైపు రోజురోజుకూ గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం పెరిగిపోతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు కాశీం రజ్వీ నేతృత్వంలో రజాకార్ల పేరుతో ప్రత్యేక సేనలు గ్రామాల్లో అడుగుపెట్టాయి. దీంతో కమ్యూనిస్టు విప్లవకారులు, రజాకార్ల మధ్య జిల్లాలోని అనేక గ్రామాల్లో పోరాటాలు జరిగాయి.పోరాట నేపథ్యం భారత దేశంలో ఓ వైపు బ్రిటిష్ సామ్రాజ్యం కొనసాగుతుంటే వారి సహకారంతో నిజాం రాజులు హైదరాబాద్ స్టేట్లో పాలన సాగించారు. రాష్ట్ర సాగుభూమిలో దాదాపు నాలుగో వంతుకు పైగా జమీందార్లు, దేశ్ముఖ్ల చేతుల్లో ఉండేది. సాధారణ రైతులు ఈ జమీందార్ల భూముల్లో సాగు చేసిన తర్వాతే తమ సొంత పొలాలను దున్నుకోవాల్సి వచ్చేది. చేతి వృత్తుల వారు ఉచితంగా అన్ని రకాల సేవలు చేయాల్సి వచ్చేది. సామాన్యులు రేయింబవళ్లు గొడ్డు చాకిరీ చేసినా నోట్లోకి నాలుగు వేళ్లూ పోయేవి కాదు. మరోవైపు భారత స్వాతంత్య్ర సమరంలో అగ్రభాగాన ఉన్న కాంగ్రెస్.. స్వదేశీ సంస్థానాల విషయంలో జోక్యం చేసుకోకూడదనే నిర్ణయం కారణంగా నైజాం రాజ్యంలోని ప్రజల కడగండ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబికే ఆగ్రహ జ్వాలలను ఒడిసిపట్టుకునే రాజకీయ పరిస్థితులు లేవు. నిజాం రాజ్యంలో తెలుగును అధికార భాషగా మార్చాలనే నినాదంతో ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టులు ముందుకొచ్చారు. దున్నేవాడిదే భూమి నినాదంతో ప్రజల్లో నమ్మకం పొందారు. ప్రజలను సమీకరించి దొరల పెత్తనానికి సవాల్ విసిరారు. అలా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 జూన్ 4న మొదలైంది. ఫలించిన ‘అల్లూరి’ శిక్షణ.. భద్రాచలం నుంచి విశాఖపట్నం మధ్య ఉన్న తూర్పు కనుమల్లో అల్లూరి సీతారామరాజు నిర్వహించిన గెరిల్లా పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులను ఆకర్షించింది. దీంతో భద్రాచలం ఏజెన్సీలోని వరరామచంద్రాపురం(వీఆర్ పురం) మండలం పేరంటాలపల్లిలో అల్లూరి సీతారామరాజు సమకాలికుడు, ఉద్యమ సహచరుడిగా పేరున్న సింగరాజు సాధువు వద్దకు శిక్షణ కోసం విప్లవకారులు వెళ్లారు. అక్కడ సుమారు 200 మంది గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ తీసుకుని తిరిగి పోరు భూమికి వచ్చారు. మరోవైపు ఇల్లెందు, కొత్తగూడెం బొగ్గు గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాల గిడ్డంగులపై విప్లవకారులు దాడులు చేశారు. ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లిన బాంబులనే ఆ తర్వాత సైనిక వాహనాలు పేల్చివేయడానికి, నిజాం పోలీసు క్యాంపులపై దాడులు చేయడానికి ఉపయోగించారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో ప్రత్యేక కోయ దళాలు వెలిశాయి. దీంతో నిజాం రజాకార్లపై శిక్షణ పొందిన విప్లవకారుల పోరాటానికి జిల్లా వేదికగా మారింది. సాయుధ పోరాటంలో ప్రత్యేకం.. ఉమ్మడి ఖమ్మం 1 -
పటిష్టం.. ‘దుమ్ముగూడెం’
● ఆనకట్ట నిర్మించి 160 ఏళ్లు ● నిర్మాణంలో బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ప్రతిభ అశ్వాపురం/భద్రాచలంటౌన్: దుమ్ముగూడెం ఆనకట్ట, కిన్నెరసాని ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ప్రతిభకు దర్పణం పడుతున్నాయి. ఏ స్థాయిలో వరదలు వచ్చినా తట్టుకోగలుగుతున్నాయి. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా ఆ ప్రాజెక్ట్ల నిర్మాణం గురించి తెలుసుకుందాం. గోదావరి నదిపై 160 ఏళ్ల క్రితం 1865లో సర్ ఆర్థర్ కాటన్ దుమ్ముగూడెం ఆనకట్టను రాతి కట్టడంతో నిర్మించారు. 160 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు. గోదావరికి పలుమార్లు వరదలు వచ్చినా దెబ్బతినలేదు. ఆనకట్ట ఆధారంగా మణుగూరు భారజల కర్మాగారం నిర్మించగా గోదావరి నుంచి నీరు సేకరించి భారజలం ఉత్పత్తి చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజీవ్సాగర్ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేసి పనులు చేపట్టగా బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్గా మార్చి పనులు చేపట్టింది. సీతమ్మ సాగర్ నిర్మాణం సైతం చేపడుతోంది. ఇక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఆనకట్ట వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ, శీతాకాలంలో నీరు జాలువారుతూ, వేసవికాలంలో అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాలకు వారధిగా మూడు కాలాల్లో ఒక్కో అందంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జల రవాణా కోసం.. జల రవాణాను అభివృద్ధి చేసే క్రమంలో బ్రిటిష్ ఇండియా ఆనకట్ట నిర్మాణం చేపట్టింది. నదిలో జల ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో కూడా రవాణా ఆగకుండా నిత్యం నీరు ప్రవహించే విధంగా దుమ్ముగూడెం నిర్మాణం చేపట్టారు. గోదావరి నది మధ్యలో ఉండే లంకకు ఇరువైపులా రెండు ఆనకట్టలు నిర్మించారు. మొదటి దుమ్ముగూడెం లంక, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం మధ్య, రెండో లంకకు దుమ్ముగూడేనికి మధ్య ఉన్నాయి. ఇక్కడి నుంచి రాజమండ్రి వరకు లాంచీల ద్వారా వాణిజ్య రవాణా సాగేది. నిర్మాణంలో కాటన్ ఇంజనీరింగ్ ప్రతిభ చూపాడు. కోడి గుడ్డు సొన, సున్నం, బంకమట్టిని పశువులతో గానుగ ఆడించి ఆ మిశ్రమంతో రాళ్లను పేర్చి ఆనకట్ట నిర్మించారు. అప్పటి నుంచి జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి, పారిశ్రామిక వనరుగా మారింది. -
నాటి కట్టడం.. నేటికీ పదిలం
● ఔరా అనిపించేలా వైరా రిజర్వాయర్ ● 103 ఏళ్ల చారిత్రక అనవాళ్లు ● 1923లో పునాది.. 1930లో పూర్తి నేడు ఇంజనీర్స్ డే వైరా: వైరా రిజర్వాయర్ నిర్మాణానికి 103ఏళ్ల చరి త్ర ఉంది. నిజాం పాలనలోనే ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. 25వేల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు మరెన్నో ఎత్తిపోతల పథకాల ఆధారంగా ఉంటూ జిల్లా చరిత్రలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. ఇదీ చారిత్రక నేపథ్యం.. 1923లో నాటి నిజాం నవాజ్ నీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహుదుర్ ఈ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఏడేళ్లలో పనులు పూర్తయి 1930లో అందుబాటులోకి వచ్చింది. నిజాం ఆదేశాల మేరకు ఆనాటి నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ స్థాహెద్ జాగా నవాబ్, తిలావత్ జంగ్ బహుదూర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, కారేపల్లి, ఏన్కూరు, కామేపల్లి, కొణిజర్ల మండలాల్లోని పగిడేరు, కిసరా లచ్చమ్మ గుట్టల మధ్య నుంచి ప్రవహించే రాళ్లవాగు, తల్లాడ మండలం రెడ్డిగూడెం, వైరా మండలం బ్రాహ్మణపల్లి మధ్య కలిసి నదిగా ఏర్పడగా.. అక్కడే ప్రాజెక్టు కట్టారు. 2.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ను డంగు సున్నం, రాయితో నిర్మించారు. రూ.35.90 లక్షల వ్యయంతో.. వైరా ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో రూ.35,90,275 ఖర్చు చేశారు. ఆనకట్టు పొడవు 1.78 కిలోమీటర్లు, ఎత్తు 88 అడుగులు, 4 వేల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. రిజర్వాయర్కు రెండు ప్రధాన కాల్వలు ఉన్నాయి. కుడి కాల్వ 24 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 16 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. 2010లో జపాన్ బ్యాంకు నిధులతో కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ జరగగా ప్రస్తుతం రెండో దశ పనులు కొనసాగుతున్నాయి. 2005లో అత్యధికంగా.. వైరా రిజర్వాయర్ చరిత్రలో 2005 సెప్టెంబర్లో అత్యధికంగా వరద నీరు వచ్చి చేరింది. 26.6 అడుగులకు నీటిమట్టం చేరగా సుమారు 95 వేల క్యూసెక్కుల నీరు ఒక్కరోజే బయటకు వెళ్లింది. ఈ ఏడాది ఇప్పటివరకు 6.2టీఎంసీలు నీరు కృష్ణానదిలో కలిసింది.వైరా రిజర్వాయర్కు చారిత్రక అనవాళ్లు ఉన్నాయి. ఆనకట్టను 88 అడుగుల లోతులో నిర్మించారు. స్పిల్వే ప్రాంతంలో నిర్మించగా.. గతంలో 4 అలుగులు మాత్రమే ఉండేవి. 2009లో అదనపు అలుగులు నిర్మించడంతో రోజుకు ఒక క్యూసెక్కు నీరు కూడా బయటకు పంపే అవకాశం ఉంది. మరో వందేళ్లయినా ఈ రిజర్వాయర్కు ఢోకా లేదు. – శ్రీనివాస్, ఐబీ, డీఈ, వైరా -
సామాన్యులకు కమ్యూనిస్టులే అండ..
కొణిజర్ల: నాటి నిజాం పాలన, నేటి బూర్జువా పార్టీల పాలనలో సామాన్యులకు అండగా నిలిచి పోరాటాలు చేస్తున్నది కమ్యూనిస్టులే అని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని తనికెళ్లలో గడల సీతారామయ్య, కొణిజర్లలో దొండపాటి వెంకయ్య స్మారక స్తూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రను ఎవరూ వక్రీకరించలేరని, రజాకార్లకు ఎదురొడ్డి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వం నాటి నిజాం పాలకులను గుర్తు చేస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలో కొనసాగాలని చూస్తోందని ఆరోపించారు. అనంతరం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు యర్రా బాబు, దొండపాటి రమేశ్, పోటు కళావతి, మండల కార్యదర్శి గడల భాస్కరరావు, సహాయ కార్యదర్శులు స్వర్ణ రమేశ్, మణిగె కోటేశ్వరరావు, నాయకులు గడల సీతారామయ్య, తోటపల్లి సీతారాములు, సోమయ్య, గోపాల్రావు, విష్ణుమూర్తి, రామయ్య, రాంబాబు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఓసీల్లోని నీటిని ఎత్తిపోయాలి
మణుగూరు టౌన్: వర్షాల వల్ల ఉపరితల గనుల్లోకి చేరే నీటిని వీలైనంత త్వరగా బయటకు ఎత్తిపోయాలని, బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలను నివారించాలని డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన ఓఎన్జీసీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సునీల్కుమార్, జనరల్ మేనేజర్ ఎస్ఎస్ మాయల్ కిరణ్లతో కలిసి పగిడేరు జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ను సందర్శించారు. 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు అవకాశాలు పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి పీకేఓసీ–2లో వరద నీరు చేరిన ప్రదేశాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. నిలిచిన నీటిని బయటకు పంపే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జీఎంలు దుర్గం రాంచందర్, కనకయ్య, శ్రీనివాస్, ఇతర అధికారులు పంకజ్, రాజ్కుమార్, శ్రీనివాస్, శ్రీనివాస్, వీరభద్రరావు, శ్రీనివాసచారి, కనకయ్య, బీఎస్ రావు, వీరభద్రుడు, సురేశ్, శ్రీనివాస్, దయాకర్, బబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు -
యూరియా పంపిణీలో విఫలం
ఖమ్మంమయూరిసెంటర్: రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని, దీని వల్ల తెలంగాణలో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆవుల అశోక్ అన్నారు. ఆదివారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సీజన్లో రైతాంగానికి యూరియా ఎంత అవసరమో ప్రభుత్వాలకు తెలియంది కాదని, అయినా సరైన సమయానికి యూరియాను అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రైతాంగం నాట్లు వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు యూరియా కోసం ఏం చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. యూరియా కోసం వేలాది మంది రైతులు ఆయా కేంద్రాల వద్ద ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారని, టోకెన్లు పోలీస్ స్టేషన్లో పంచె దుస్థితి వచ్చిందంటే సమస్య ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గతేడాది వచ్చిన వరదలతో నష్టపోయిన బాధితులు ఇంతవరకు ప్రభుత్వ సాయం అంతలేదని, పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, మాస్లైన్ ఖమ్మం నగర కార్యదర్శి శోభ, తేజ నాయక్, ఆజాద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ సరదాగా గడిపారు. 526 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.28,780 ఆదాయం లభించింది. 230 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్కు రూ.13,900 ఆదాయం లభించినట్లు నిర్వావహకులు తెలిపారు. కిన్నెరసాని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేతపాల్వంచరూరల్: ఎగువ ప్రాంతాల నుంచి కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి 1700 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్లోకి చేరుతుండగా, రెండు గేట్లు ఎత్తిఉంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూరిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ఆదివారం 405.50 అడుగులుగా నమోదైంది. -
ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలోని జిమ్నాజియం హాల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి మహిళల ఖేలో ఇండియా వెయిట్లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం సతీమణి నందిని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. తొలుత జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం పలు కేటగిరిల్లో విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.శ్రుతి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.క్రిష్టోఫర్బాబుతోపాటు శివగణేశ్, దొంగల వినోద్కుమార్, హనుమంతరాజు, రవి, సుధాకర్, సీహెచ్ నాగరాజు, సిద్ధార్థనాగిరెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పోటీలకు రాష్ట్రంలోని నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. జూనియర్ బాలికల 44 కేజీల విభాగంలో సింధు, బి.గౌతమి, 48 కేజీల కేటగిరిలో శ్రీపాద శ్రీజ, ఎం.సహస్ర, బి.అలేఖ్య, 53 కేజీల కేటగిరిలో ఎ.ట్రోనీ, పి.అర్చన, వై.అంజలి, 58 కేజీల విభాగంలో ఎం.స్వాతి, జి.శ్రుతి, ఎ.వర్షిత, 63 కేజీల కేటగిరిలో టి.ఆర్చన, కె.స్వాతి, ఎం.గౌరీ, 69 కేజీల కేటగిరిలో వి.హరిత, బి.హరిణి, 77 కేజీల విభాగంలో బి.తోషిని, బింధుప్రియ, కీర్తన, 77 కేజీల పైకేటగిరిలో వి.సహస్ర, లిబికా, మహేశ్వరీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. -
నృత్య పోటీల్లో ఖమ్మం కళాకారుల ప్రతిభ
ఖమ్మంగాంధీచౌక్: కల్చరల్ ఫైన్ ఆర్ట్ ఫెడరేషన్ ఆదివారం హైదరాబాద్లోని బిర్లా మందిర్భాస్కర ఆడిటోరియంలో 9వ నేషనల్ డ్యాన్స్, అండ్ మ్యూజిక్ చాంపియన్షిప్ హైదరాబాద్–2025 పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో వివిధ ప్రాంతాల నుంచి నృత్యకారులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. ఖమ్మం నగరానికి చెందిన మీనా కూచిపూడి నృత్యాలయం కళాకారులు పలు అంశాల్లో ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలిచి అవార్డులను గెలుచుకున్నారు. కూచిపూడి జూనియర్స్ సోలో విభాగంలో భువన చద్దిక(బీటీఏ) ప్రథమ బహుమతి, సబ్ జూనియర్స్ విభాగంలో జ్ఞాన ప్రథమ బహుమతి, ఇదే విభాగంలో ద్వితీయ బహుమతి అపరంజిత, తృతీయ బహుమతి యాషిక, ఫోక్ సబ్ జూనియర్స్ విభాగంలో మాన్య ప్రథమ బహుమతి, గ్రూప్స్ విభాగంలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. నాట్య గురువు ఏలూరు మీనాకు ‘నాట్య విజ్ఞాన్’అవార్డు అందించి నిర్వాహకులు సత్కరించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మెమంటోలు, బహుమతులను అందించి అభినందించారు. -
ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి
ఖమ్మం మయూరిసెంటర్: ప్రజా సమస్యలపై యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల రమేష్, బొడ్డు మధు, మాజీ రాష్ట్ర నాయకుడు ఎం.ఏ.జబ్బర్లు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం డివిజన్లో జరిగిన డీవైఎఫ్ఐ మహాసభలో వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందాయని విమర్శించారు. అనంతరం నూతన డీవైఎఫ్ఐ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా నాయకులు భూక్య శ్రీను, ఎస్.నవీన్రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం వీరబాబు, మాజీ నాయకులు షేక్.నాగుల్ మీరా, కూరపాటి శ్రీనులతో పాటు యర్రా శ్రీకాంత్, రావులపాటి నాగరాజు, కూచిపూడి నరేష్, యర్రా సాయి, యాటా రాజేష్, షేక్.రెహమాన్, పోటు హర్షవర్ధన్, కొర్లపాటి రాజేష్, తదితరులు పాల్గొన్నారు. మహిళను వేధించిన వ్యక్తిపై కేసు ఖమ్మంఅర్బన్: కుటుంబ గొడవల నేపథ్యంలో ఓ మహిళపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలి) పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్ఐ శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని 1వ డివిజన్ కై కొండాయిగూడెంనకు చెందిన తేజావత్ వినోద్ ఓ మహిళను వేధిస్తున్నాడు. కొడవలి పట్టుకుని వెళ్లి ఆమెను చంపుతానని బెదిరించాడు. తర్వాత వినోద్ కుటుంబ సభ్యులు సుజాత, హుస్సేన్, మంగమ్మ బాధిత మహిళ ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ, చంపుతామని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముగ్గురిపై కేసు రఘునాథపాలెం: వ్యవసాయ భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా అడ్డుకున్న ముగ్గురిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని చింతగుర్తికిచెందిన రైతు భరత్ తన భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా, అదే గ్రామానికి చెందిన అశోక్, అనిలా, వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నం నేలకొండపల్లి: ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బోదులబండకు చెందిన మహేశ్ (25) ఆదివారం పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కొనుగోళ్లలో కొత్త రూల్..
● సీసీఐకి పత్తి విక్రయించాలంటే స్లాట్ బుకింగ్ తప్పనిసరి ● అందుకోసం ‘కాపాస్ కిసాన్’ యాప్ ఏర్పాటు ● పత్తి దిగుబడి గుర్తించేందుకు జిల్లా కమిటీలు ● ఉమ్మడి జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లులు ఖమ్మంవ్యవసాయం: పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులు పొందేందుకు సీసీఐ ఈ ఏడాది కొత్త నిబంధన విధించింది. రైతులకే మద్దతు ధర దక్కేలా నిబంధనలు కఠినం చేస్తోంది. సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ‘కాపాస్ కిసాన్’ యాప్ రూపొందించింది. పంట సాగు చేసిన రైతులు ఈ యాప్లో వివరాలు నమోదు చేస్తే.. సాగు చేసినవారే సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయించే అవకాశం ఉంటుంది. రైతుల ఆధార్కు బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని 9 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 14 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పత్తి దిగుబడులను గుర్తించేందుకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయనుంది. యాప్ ద్వారా వివరాల నమోదు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయానికి ‘కాపాస్ కిసాన్’ యాప్లో రైతులు తాము సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తే.. బుకింగ్ నంబర్ జారీ చేస్తారు. దీని ఆధారంగా స్లాట్ బుక్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు లేదా వ్యవసాయ అధికారు లు, జిన్నింగ్ మిల్లుల వద్ద ఉన్న మార్కెటింగ్ అధికారుల ద్వారా స్లాట్ బుక్ చేయాలి. నిర్దేశించిన సమయంలో రైతులు పత్తిని జిన్నింగ్ మిల్లుకు తగిన ప్రమాణాలతో తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. 4.46 లక్షల ఎకరాల్లో సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 4,46,958 ఎకరాల్లో పత్తిసాగుచేశారు. ఖమ్మంలో 2,25,613, భద్రాద్రిలో 2,21,345 ఎకరాల్లో పత్తి సాగైంది. ఖమ్మంజిల్లాలో 27,07,356 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో 22,13,450 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 8 నుంచి 12 వరకు తేమశాతం కలిగిన పంటను మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. గతేడాది 8 శాతం తేమ కలిగిన పత్తికి క్వింటాకు రూ.7,521 ఇవ్వగా, ఈ ఏడాది రూ.8,110గా (రూ.589 పెరిగింది) నిర్ణయించింది. పంటను లూజ్గా విక్రయానికి తీసుకురావాలి. జిల్లా కమిటీలకు బాధ్యత పత్తి దిగుబడులను గుర్తించేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీలను ఏర్పా టు చేయనుంది. వాతావరణం, నేలలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని పత్తి దిగుబడులను ఈ కమిటీలు గుర్తిస్తాయి. వర్షాధారంగా పత్తి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. నీటి ఆధారంగా 18 నుంచి 20 క్వింటాళ్ల వరకు వస్తుంది. జిల్లా కమిటీలు నిర్ణయించిన దిగుబడి ఆధారంగా రైతులు పంట విక్రయించుకోవాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై నిబంధనల్లో మార్పులు కౌలు రైతులు పంట విక్రయించేందుకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తాత్కాలిక రిజిస్ట్రేషన్ల సౌక ర్యం కల్పించింది. అయితే, గతేడాది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని దళారులు రైతులకు చెందాల్సిన మద్దతు ధరను కొల్లగొట్టారు. అధికారులూ సహకరించి అడ్డంగా దొరికిపోయి రాష్ట్రవ్యాప్తంగా సస్పెండ్ అయ్యారు. దీంతో ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారుల అనుమతులు ఉంటేనే తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించే విధంగా నిబంధనలు మార్చారు. కాగా, అక్టోబర్ నుంచి కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ●జీఆర్ఆర్ ఇండస్ట్రీస్ వెంకటగిరి ఖమ్మం రూరల్. ●శ్రీసాయి బాలాజీ జిన్నింగ్ అండ్ ఆయిల్ మిల్, తల్లంపాటు ఖమ్మం రూరల్. ●అమరావతి టెక్స్టైల్స్ దెందుకూరు, మధిర. ●మంజీత్ కాటన్ మిల్ మాటూరు, మధిర. ●శ్రీ శివగణేశ్ కాటన్ ఇండస్ట్రీస్ ఇల్లెందులపాడు, మధిర. ●ఉషశ్రీ కాటన్, జిన్నింగ్ మిల్స్, సువర్ణాపురం, ముదిగొండ. ●స్టాప్లరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్, తల్లాడ. ●జీఆర్ఆఆర్ జిన్నింగ్ మిల్స్, పొన్నెకల్, ఖమ్మంరూరల్. ●శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్, గోల్తండా, తిరుమలాయపాలెం. భద్రాద్రి జిల్లాలో సీసీఐ కేంద్రాలు ●లక్ష్మీప్రియ జిన్నింగ్ మిల్, కారేపల్లి. ●మంజిత జిన్నింగ్ మిల్స్, కొత్తగూడెం. ●అనూశ్రీ జిన్నింగ్ మిల్, బూర్గంపాడు. ●శ్రీ లక్ష్మీనరసింహ జిన్నింగ్ మిల్, బూర్గంపాడు. ●శ్రీరామా జిన్నింగ్ మిల్స్, అశ్వాపురం. తేమశాతం ఆధారంగా నిర్ణయించిన పత్తి ధర (రూ.లలో) తేమశాతం మద్దతు ధర 8 శాతం 8,110 9 శాతం 8,029 10 శాతం 7,948 11 శాతం 7,867 12 శాతం 7,786 కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంట విక్రయంలో కూడా రైతులు ఇబ్బందులు పడకుండా స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్రక్రియ రైతులకు ఎంతో మేలైంది. నిర్దేశించిన సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. –ఏంఏ అలీం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం -
ఈనెల 16 నుంచి ‘యాత్రాదానం’
● దాతలు కోరుకున్న రోజుల్లో బస్సుల ఏర్పాటు ● ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సరిరాం ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక రోజుల్లోఅనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు తీసుకెళ్లేలా టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరిట కార్యక్రమాన్ని రూపొందించిందని ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తాము కోరుకున్న రోజుల్లో పర్యటనకు తీసుకెళ్లేలా విరాళం అందజేయొచ్చని తెలిపారు. విరాళం ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు సమకూరుస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం సమీప ఆర్టీసీ డిపోల్లో సంప్రదించాలని ఆర్ఎం సూచించారు.దూరం ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్లగ్జరీ రాజధాని (కి.మీల్లో.) (రూ.ల్లో) 0–200 26,707 32,587 29,752 43,507 201–300 32,587 32,587 29,752 43,507 301–400 38,782 38,782 35,002 43,507 401–500 44,977 44,977 40,252 50,962 -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జమలాపురంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్కు అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం జరిపించాక, భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. టెట్ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేయాలి ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులు సర్వీస్లో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పక ఉత్తీర్ణత సాధించాలంటూ వెలువడిన కోర్టు తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు అశనిపాతంలా మారిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ కోర్టు తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం కలిగించేలా ఉన్నందున రాష్ట్రప్రభుత్వం తీర్పుపై అప్పీల్ చేసి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. అంతేకాక పదోన్నతుల్లో మిగిలిన ఖాళీ పోస్టులకు అర్హులను ఎంపికచేయాలని, గిరిజన సంక్షేమశాఖ, మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. తొలుత ఇటీవల మరణించిన పూర్వ జిల్లా అధ్యక్షుడు జియావుద్దీన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నాయకులు జీవీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ, రాందాస్, నర్సయ్య, సురేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం మీదుగా మరో ప్రత్యేక రైలు ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం మీదుగా ఇప్పటికే ఉన్న వారాంతపు ప్రత్యేక రైలుకు తోడు మరో రైలును రైల్వే శాఖ ప్రకటించింది. నాందేడ్ – తిరుచానూర్ మధ్య ఈనెల 16, 23, 30వ తేదీల్లో ఈ రైలు ప్రారంభమవుతుందని ఖమ్మం సీసీటీఓ రాజగోపాల్ తెలిపారు. తిరుగుప్రయాణంలో ఈనెల 17, 24, వచ్చేనెల 1వ తేదీన ఉంటుందని వెల్లడించారు. ఈ రైలు తిరుచానూర్ వెళ్లేటప్పడు నిర్ణీత తేదీల్లో అర్ధరాత్రి 1–13 గంటలకు, నాందేడ్ వెళ్లే క్రమంలో తెల్లవారుజామున 3–45 గంటలకు ఖమ్మం చేరుకుంటుందని తెలిపారు. దసరా, దీపావళి పండుగల వేళ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం ఈ రైలు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. టీజీవోస్ రాష్ట అధ్యక్షుడికి సన్మానం ఖమ్మంమయూరిసెంటర్: సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు కృషి చేసిన టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం బాధ్యులు శనివారం సన్మానించారు. వసతి గృహ సంక్షేమ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడాలని కోరారు. టీఎన్జీవోస్ నాయకుడు హరికృష్ణ కోణార్, వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోటపాటి రుక్మారావు, ఎన్.నాగేశ్వరరావుతో పాటు కె.తిరుపతిరావు, పి.హన్మంతరావు, సీహెచ్.నాగమణి, బి.వసంత, మాధురి, బాలాజీ, నర్సింహారావు, రమాదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఇటీవల ఎన్నికై న మున్సిపల్ ఫోరం ల్లా కార్యవర్గ బాధ్యులు ఏలూరి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.సుధాకర్, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం
ఖమ్మంలీగల్: రాజీ మార్గంలో కేసుల పరిష్కారం ద్వారా ఆరోగ్యకరమై సమాజ నిర్మాణానికి అంతా కలిసి రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్అదాలత్లో రాజీ పడితే ఇరువర్గాలు గెలిచినట్లేనని తెలిపారు. కుటుంబ వివాదాల కేసుల్లో భార్యాభర్తలు కలిస్తే వారి సంతానంతో పాటు ఇరు కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యాన కక్షిదారులకు భోజనం, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు దేవినేని రాంప్రసాదరావు, న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖరరావుతో పాటు ఎం.కల్పన, టి,మురళీమోహన్, కాసరగడ్డ దీప, బి.రజిని, ఏపూరి బిందుప్రియ, వినుకొండ మాధవి, బి.నాగలక్ష్మి, అఖిల, లోక్ అదాలత్ సభ్యులు సంధ్యారాణి, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రూ.3.15 కోట్ల పరిహారం లోక్అదాలత్లో భాగంగా పలు కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. మోటార్ వాహన కేసు ను వాది తరపున న్యాయవాది పోట్రు వెంకయ్య చౌదరి, రాయల్ సుందరం బీమా కంపెనీ తరఫున బండారుపల్లి గంగాధర్ వాదించారు. ఈమేరకు కేసు పరిష్కారం కాగా వాదికి రూ.19.50 లక్షల అవార్డు కాపీతో పాటు పూల మొక్కను జిల్లా జడ్జి రాజగోపాల్ అందించారు. అలాగే దంపతులు పెద్దబోయిన మాధవి–లక్ష్మణ్ కేసు ప్రత్యేక కోర్టు న్యాయధికారి బి.నాగలక్ష్మి చొరవతో పరిష్కారమైంది. మొత్తంగా లోక్అదాలత్లో 4,771 కేసులను పరిష్కరించారు. ఇందులో మోటారు వాహన ప్రమాద బీమా కేసులు 80 ఉండగా, బాధితులకు పరిహారంగా రూ.3,16,71,251 ఇవ్వడానికి బీమా కంపెనీలు అంగీకరించాయి. అలాగే, క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదా, సివిల్ ఇతర కేసుల్లో ప్రతివాదులకు రూ.30,17,255 పరిహారం అందింది. -
ఊరూరా వరి !
సత్తుపల్లి సమీపాన సాగవుతున్న వరి పంటసరిపడా వానలు ఈ ఏడాది పంటల సాగుకు వర్షాలు అనుకూలించాయి. సీజన్లో జూన్ మినహా, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్లో 131.2 మి.మీ. వర్షపాతానికి గాను 123.9గా నమోదైతే, జూలైలో 240.9 మి.మీ.కు 281.6, ఆగస్టులో 240మి.మీ.కు గాను 389.7గా నమోదు కావడంతో జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు చేరింది. వివిధ పద్ధతుల్లో సాగు వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు వరి సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. కూలీల కొరత, ఇతర ఇబ్బంతుల నేపథ్యాన రకరకాల విధానాలు ఎంచుకున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పొడి దుక్కుల్లోనే వరి విత్తనాలు చల్లగా, కొందరు భూములను దమ్ము చేసి విత్తనాలను ఒకరోజు నానబెట్టి వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. ఇంకొందరు డ్రమ్ సీడర్ విధానం ద్వారా విత్తనాలు నాటారు. మరికొందరు సంప్రదాయ విధానంలో వరి నార్లు పోసి నాట్లు వేశారు. సత్తుపల్లి డివిజన్లో అత్యధికం జిల్లాలోని సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లో అత్యధికంగా 1,28,434 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ డివిజన్లోని కల్లూరు మండలంలో 33,403ఎకరాల్లో పంట సాగు చేశారు. ఆ తర్వాత స్థానంలో పాలేరు(కూసుమంచి) వ్యవసాయ డివిజన్లో 72,259 ఎకరాల్లో సాగవుతోంది. అలాగే, మధిర వ్యవసాయ డివిజన్లో 41,356, వైరా డివిజన్లో 36,281, ఖమ్మం డివిజన్లో 12,530 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో లక్ష్యాన్ని దాటేలా పంట సాగు అన్ని వ్యవసాయ డివిజన్లలో వరి లక్ష్యం మేర సాగవుతోంది. జూలై, ఆగస్టులో కురిసిన వాన సాగుకు అనుకూలించింది. వరిలో కూడా రైతులు సన్నరకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో ఈ రకాలే ఎంచుకున్నారు. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారిమంచి వర్షాలతో జలాశయాల్లోకి నీరు చేరడం వరి సాగుకు అనుకూలించింది. మొత్తం 20ఎకరాల్లో వెదజల్లే పద్ధతి, డ్రమ్సీడర్, నాట్ల విధానంలో సాగు చేస్తున్నాం. ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో మొత్తం సన్నరకాలే ఎంచుకున్నాం. – దేవరపల్లి సత్యనారాయణరెడ్డి, కమలాపురం, ముదిగొండ మండలం -
ప్రజల కోసం పోరాడిన సురవరం
● సుధాకర్రెడ్డి మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు ● సంస్మరణ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిఖమ్మంమయూరిసెంటర్: సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజల కోసం పోరాడిన నికార్సయిన కమ్యూనిస్టు సురవరం సుధాకర్రెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇటీవల మృతి చెందిన సురవరం సంస్మరణ సభ ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం నిర్వహించగా ఆయన చిత్రపటం వద్ద వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజాఉద్యమ గొంతుకగా సురవరం పనిచేశారని, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాక పేద ప్రజలకు తీరని లోటన్నారు. కాగా, మతం, సైన్స్కు ప్రాంతీయ భేదం లేనట్లే కమ్యూనిజానికి సైతం ప్రాంతీయత లేదన్నారు. కమ్యూనిజం విడిపోయి బలహీనపడినా మళ్లీ ఐక్యతతో బలపడతామని తెలిపారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే సుధాకర్రెడ్డి లాంటి అమరులకు ఇచ్చే నివాళి అని చెప్కాపరు. కాగా, వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాన్ని నేటి తరానికి వివరిస్తూ బలమైన ప్రజాఉద్యమ నిర్మాణాల కోసం డిసెంబర్ 26న ఖమ్మంలో శత వసంత ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పోరాటాలను నడిపిన సురవరం ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బాగం హేమంతరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డాక్టర్ రవీంద్రనాథ్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఆవునూరి మధు, నున్నా నాగేశ్వరరావు, మహ్మద్ మౌలానా, కె.రాంనారాయణ, ఆకుతోట ఆదినారాయణ, జమ్ముల జితేందర్రెడ్డి, స్పర్శ భాస్కర్, రవిమారుత్, పోట్ల మాధవరావు, డాక్టర్ వై.ప్రసాద్, వడ్డె నారాయణరావు, యర్రా బాబు, జానీమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, క్లెమెంట్, మహ్మద్ సలాం, పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు. -
●జోరు వర్షంలోనూ ఆగని దందా
నేలకొండపల్లి: ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారు పగలు, రాత్రీ తేడాను పట్టించుకోకపోగా జోరు వర్షాన్ని సైతం లెక్క చేయడం లేదు. నేలకొండపల్లి మండలంలోని రామచంద్రాపురం, పైనంపల్లి ఏటి పరీవాహకం నుంచి పలువురు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు. శనివారం వర్షంతో ఓ పక్క ఏరు ఉధృతంగా ప్రవహిస్తున్నా ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలించారు. గతంలో ఇదే ఏటిలో ప్రమాదవశాత్తు మునిగిన ఇద్దరు మృతి చెందారు. అయితే, ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.ప్రమాదకర పరిస్థితుల్లో ఇసుక రవాణా -
జిల్లా అంతటా వర్షం
● కల్లూరు అత్యధికంగా 70 మి.మీ. వర్షపాతం ● పలుచోట్ల ఉధృత ంగా వాగులుఖమ్మంవ్యవసాయం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం 3గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. పలుచోట్ల దాదాపు రెండు గంటల పాటు వర్షం కురిసింది. అత్యధికంగా కల్లూరు మండల కేంద్రంలో 70.3 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, తిమ్మారావుపేటలో 68.5, మధిరలో 60.8, గంగారంలో 52.8, వేంసూరులో 49, ఎర్రుపాలెంలో 48.8, ముదిగొండలో 45, మధిర ఏఆర్ఎస్లో 42.8, పెద్ద గోపతిలో 41.5, పెనుబల్లిలో 38.3, ఏన్కూరులో 35.8 గేటు కారేపల్లిలో 33.5, గౌరారంలో 32, సత్తుపల్లి ఓసీ వద్ద 30.5, ఖమ్మం ప్రకాష్నగర్లో 29.3, చింతకానిలో 29, సత్తుపల్లి, సదాశివునిపాలెంలో 25, పంగిడిలో 21, ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్హౌస్ వద్ద 20.3 మి.మీల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన వర్షాలతో వరద వాగుల్లోకి చేరి ఉధృతంగా ప్రవహించాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వర్షాలు పంటలకు ప్రయోజనం కలిగిస్తాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలో చిక్కుకున్న కూలీలు క్షేమం ఏన్కూరు: ఏన్కూరు మండలం కేసుపల్లి పరిధిలో కొందరు కూలీలు శనివారం వరదలో చిక్కుకున్నారు. పొలాల్లో పని ముగించుకొని సాయంత్రం వస్తుండగా ఏలుగోడు వాగు ప్రవహాంతో చిక్కుకపోయారు. గ్రామస్తులు తాళ్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కాసేపటికి వరద తగ్గడంతో కూలీలు వాగు దాటి క్షేమంగా గ్రామానికి చేరారు. -
ఐస్ స్కేటింగ్లో పతకాల పంట
● మోటమర్రి క్రీడాకారిణి నయనశ్రీ ప్రతిభ ● అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడానికి ఆర్థిక ఇక్కట్లుబోనకల్: ఐస్ స్కేటింగ్ అంటే ఆమెకు ప్రాణం. దీంతో ఆటపైనే దృష్టి సారించగా.. తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా ప్రోత్సహించడంతో పతకాల మోత మోగిస్తోంది. బోనకల్ మండలం మోటమర్రి గ్రామానికి చెందిన తాళ్లూరి నయనశ్రీ ప్రస్తుతం బెంగళూరులో డిగ్రీ చదువుతోంది. గ్రామానికి చెందిన నారాయణరావు – వీణ దంపతుల ఏకై క కుమార్తె అయిన నయనశ్రీ తొమ్మిదేళ్ల వయస్సు నుంచే హైదరాబాద్ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటోంది. ఇమె ప్రతిభను గుర్తించిన కోచ్ ఐస్ స్కేటింగ్పై దృష్టి సారించాలని సూచించగా.. 2017లో తొలిసారి ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. అలాగే, 2018లో సింగపూర్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రజిత పతకం సాదించింది. నాటి నుంచి నేటి వరకు జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 17 పతకాలు సాధించగా.. జాతీయ స్థాయిలో 23, రాష్ట్రస్థాయిలో 20కి పైగా పతకాలను గెలుచుకుంది. గత నెల డెహ్రాడూన్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో రెండు రజితం, రెండు కాంస్య పతకాలను సాధించిన ఆమె నవంబర్లో కజకిస్తాన్లో జరిగే జూనియర్ వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమవుతుంది. అయితే, శిక్షణ కోసం సౌత్ కొరియా వెళ్లాల్సి ఉండగా.. దాదాపు రూ.10లక్షల మేర నగదు అవసరమతుంది. నయనశ్రీ తల్లిదండ్రులు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తుండటంతో వారు భారం మోసే పరిస్థితి లేదు. దీంతో దాతలు, క్రీడాభిమానులు సహరించాలని కోరుతున్నారు. -
ఖమ్మం.. సాహిత్య గుమ్మం
ఖమ్మంగాంధీచౌక్: ఆధునిక సాహిత్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఖమ్మం కేంద్రంగా నిలుస్తోందని కవి, విమర్శకులు, మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో కవి వంశీకృష్ణ తల్లి తాటికొండల భ్రమరాంబ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం శనివారం నిర్వహించారు. ఈ పురస్కారాన్ని నరసింహారెడ్డికి అందజేయగా ఆయన మాట్లాడారు. భక్త రామదాసు, ప్రముఖ భాషావేత్తలు నడియాడిన నేలపై సాహిత్య పురస్కారం అందుకోవడం తనకు ప్రత్యేకమని తెలిపారు. అనంతరం రచయిత్రి, అనువాదకురాలు స్వర్ణ కిలారి, కుటుంబీకులు రాసిన భ్రమరాంబ స్మృతి గీతాల సంపుటి ‘నెనరు–నెమరు’ను ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కవి, సంపాదకులు ఆనందాచారి మాట్లాడగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహామండలి సభ్యులు ప్రసేన్తో పాటు మువ్వా జయశ్రీ, వంశీకృష్ణ, సీతారాం, రవిమారుత్, ఇబ్రహీం, నిర్గుణ్, సుభాషిణి, నీలిమ, వీఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. ‘నెనరు–నెమరు’ సంపుటి ఆవిష్కరణలో వక్తలు -
జోరు వాన.. పెరిగిన వరద
కల్లూరురూరల్: కల్లూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు వర్షం ఆగకుండా కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రెయినేజీలు నిండి ఇళ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ●తల్లాడ: తల్లాడ మండలంలో శనివారం మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు వర్షం కురిసింది. తల్లాడ పరిసర గ్రామాల్లో రోడ్లపై వరద నీరు చేరింది. తల్లాడలోనూ ప్రధా, అంతర్గత రహదారులు, పలు కార్యాలయాల వద్ద నీరు నిలిచింది. ●మధిర: మధిర మండంలోని పలు మండలాల్లోనూ వర్షం కురిసింది. నిదానపురం, మాటూరుపేటల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ●ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలో భారీ వర్షం, ఎగువ నుండి కట్లేరుకు పెరుగుతున్న వరదతో మొలుగుమాడులోని కట్లేరు వాగు పొంగింది. దీంతో ములుగుమాడు–ఇనగాలి మధ్య రాకపోకలు నిలిపివేశారు. కాగా, కట్లేరుకు వరద రావడంతో పరీవాహకంలో వరి పంట నీటమునిగింది. ●ముదిగొండ: ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. ముదిగొండ ప్రధాన సెంటర్, వల్లభి రోడ్డు, ఎస్బీఐ ఎదుట ఖమ్మం – కోదాడ రహదారిపై వర్షపు నీరు చేరడంతో చెరువును తలపించింది. రోడ్డు లోతట్టుగా ఉండడంతో నీరు నిలిచి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
ఫీజుల కోసం పోరుబాట
● రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యాసంస్థల నిర్ణయం ● రేపటి నుంచి రెండు రోజులు నిరసనలుఖమ్మం సహకారనగర్: పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాటి నుంచి ఎందరో విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరారు. కానీ కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో తమపై భారం పడుతోందని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మూడేళ్లుగా బకాయిలు విడుదల కాక విద్యాసంస్థల నిర్వహణ ఇబ్బందిగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక నిరసనలకు నిర్ణయించామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కళాశాలలు వంద వరకు ఉండగా, రీయింబర్స్మెంట్ బకాయిలు రాక కళాశాలల నిర్వహణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేతనాలు, అద్దె చెల్లింపులకు కష్టంగా మారిందని యాజమాన్యాలు చెబతున్నాయి. రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యాసంస్థల బాధ్యులు ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో శనివారం సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ విద్యాసంస్థల యాజమాన్యాల అధ్యక్షుడు చలసాని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మూడేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళాశాలలు నడపడం కష్టంగా మారిందన్నారు. ఎస్బీఐటీ చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. కాగా, తొలిదశలో ఈనెల 15న సోమవారం విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, యాజమాన్యాలతో ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలుపుతామని, 16వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ కాలేజీల యాజమాన్య బాధ్యులు ఉషాకిరణ్, శ్రీధర్, కాటేపల్లి నవీన్బాబు, సత్యనారాయణ, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారం పాటు విమోచన దినోత్సవం
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యాన రాష్ట్రంలో వారం పాటు నిర్వహించనున్నామని ఆ పార్టీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఖమ్మంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతలు హాజరు కాకపోవడం గర్హనీయమన్నారు. ఇదే సమయాన ఆ పార్టీ నేత రాహుల్గాంధీ రాజ్యాంగంపై మాట్లాడడం ద్వంద్వ స్వభావానికి నిదర్శనమని తెలిపారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరఫరా చేసిన యూరియాను దారి మళ్లింంచడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇందుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైఫల్యమే కారణమని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 11ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తామని పొంగులేటి వెల్లడించారు. ●తిరుమలాయపాలెం: మండలంలోని సుబ్లేడులో పోరాటయోధుడు సోయబ్ ఉల్లాఖాన్ విగ్రహానికి బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి నివాళులర్పించారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినో త్సవంగా జరపనున్న నేపథ్యాన రాష్ట్రవ్యాప్తంగా పోరాటయోధులను స్మరించుకోనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరా వు, నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, నున్నా రవికుమార్, దొంగలసత్యనారాయణ, ఈవీ.రమేష్, జి.వెంక టేశ్వర్లు, సుబ్బారావు, ప్రభాకర్రెడ్డి, గుత్తా వెంకటేశ్వర్లు, సుదర్శన్ మిశ్రా, నల్లగట్టు ప్రవీణ్కుమార్, రవిరాథోడ్, విజయరెడ్డి, రజినీరెడ్డి, నెల్లూరి బెనర్జీ, నగరికంటే వీరభద్రం, మహేష్, ఇందూరి మహేష్, గంట్ల లక్ష్మారెడ్డి, భూక్యా వెంకటేష్, నల్లగట్టు ఉపేందర్, నాగరాజు, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి -
సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
చింతకాని/బోనకల్: నైజాం నిరంకుశ పాలనను అంతమొందించేందుకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు. చింతకాని మండలం ప్రొద్దుటూరులో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తాళ్లపల్లి రాములు, బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించి మాట్లాడారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం రాచరికం, నిర్బంధానికి వ్యతిరేకంగా సాగితే బీజేపీ మాత్రం ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సాయుధ పోరాటంలో నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో అన్ని వర్గాల వారు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్రావు, దూసరి గోపాలరావు, యంగల ఆనందరావు, అబ్బూరి మహేష్, పదిమెల వెంకటనర్సయ్య, పగిడిపల్లి ఏసు, తాళ్లపల్లి అజయ్, పెంట్యాల చలమయ్య, వేల్పుల కోటయ్య, తుళ్లూరు శ్రీనివాసరావు, తుడుం పాలరావు, పెంట్యాల రామారావు, పాపినేని రంగారావు, పులి యజ్ఞనారాయణ, జక్కుల రామారావు, వల్లంకొండ బ్రహ్మం, కొత్తపల్లి రమేష్, తమ్మారపు లక్ష్మణ్రావు, తమ్మారపు బ్రహ్మయ్య, కొత్తపల్లి కృష్ణ పాల్గొన్నారు. పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి బోనకల్: అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో దెబ్బతిన్న పత్తి పంటలను సీపీఐ జిల్లా కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అధిక వర్షాలతో పత్తి దిగుబడి పడిపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం సర్వే చేయించి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. నాయకులు, రైతులు జక్కుల రామారావు, యంగల ఆనందరావు, పుచ్చకాయల తిరుపతయ్య, గోళ్ల కనకయ్య, చింతలచెర్వు మదారయ్య పాల్గొన్నారు. -
నిరుపేద విద్యార్థులకు చేయూత
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుతకు చేయూతనిస్తున్న పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కూసుమంచి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రరావు, విశ్రాంత ఏడీ పి.కోటేశ్వరరావు కొనియాడారు. వైరాకు చెందిన బసవోజు మనోజ్, ఖమ్మం వైఎస్సార్ కాలనీకి చెందిన తాటికొండ సోమశేఖర్కు ట్రస్ట్ తరఫున రూ.20వేల చొప్పున చెక్కులను శనివారం ఖమ్మంలో అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ పరిశ పుల్లయ్య, మహంకాళి స్వరాజ్యలక్ష్మి, పరిశ లక్ష్మీరాజ్యం, శ్రీనివాసరావు, ఊడుగు వెంకటేశ్వరరావు, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆవేదనను గుర్తించండిపెనుబల్లి: గ్రీన్ ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్డు లేకపోతే రైతులు ఇబ్బంది పడనున్నందున వారి ఆవేదనను అధికారులు గుర్తించాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పేర్కొ న్నారు. పెనుబల్లి, వేంసూరు మండలాల రైతులు హైవే వెంట చిన్న బ్రిడ్జిలకు బదులు సర్వీస్ రోడ్డు నిర్మించాలనే డిమాండ్తో రెండో రోజైన శనివారం కూడా నిరసన తెలిపారు. ఈమేరకు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్కు దయానంద్ సమాచారం ఇవ్వగా ఆయన చేరుకుని వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు లేకపోతే రైతులు పొలాలకు వెళ్లాలంటే 10కి.మీ. చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. భూనిర్వాసిత రైతులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, నాయకులు కీసర వెంకటేశ్వరరెడ్డి, చీకటి రామారావు, వి.పవన్, గూడూరు మాధవరెడ్డి, దొంతు మాధవరావు, ఈడా కమలాకర్, పిల్లి నవజీవన్ పాల్గొన్నారు. మధిరలో కోదాడ ఎమ్మెల్యేమధిర: రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సతీమ ణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శనివారం మధి ర వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు అనిల్కుమార్ నెహ్రూ, కరివేద సుధాకర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి డిప్యూటీ సీఎం సతీమణి నందినితో సమావేశమయ్యారు. అలాగే, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహిందర్ సింగ్ సైతం మల్లు నందినితో సమావేశం కాగా ఆయనను సన్మానించారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి మోతె: టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం శివార్లలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వుకు చెందిన గుండమాల వెంకన్న(50) టీవీఎస్ ఎక్సెల్పై మోతె వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మామిళ్లగూడెం శివారులో వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను 108లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని ఎస్ఐ అజయ్కుమార్ తెలిపారు. -
ఆదిలోనే హంసపాదు
● వేంసూరు మండలంలో ‘2782’ వరి రకం సాగు ● 90 రోజులకే 40శాతం మేర ఈనిన పంట ● ఫలితంగా దిగుబడిపై రైతుల్లో ఆందోళనవేంసూరు: రాష్ట్రప్రభుత్వం సన్న రకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో రైతులు ఈసారి ఎక్కువగా సన్నరకాల సాగుకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, కల్తీ విత్తనాలా, ఇంకేదైనా కారణమో తెలియదు కానీ వేంసూరు మండలంలో పలువురు సాగు చేసిన వరి ముందుగానే ఈనింది. దీంతో మిగతా పంట ఈనేలోగా మొదటి గింజలు రాలిపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. దిగుబడి వస్తుందని... వేంసూరు మండల వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 28 వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 27 వేల ఎకరాలు సన్న రకాలే ఉన్నాయి. మండలంలోని కందుకూరు, భరణిపాడు, మర్లపాడు, చౌడవరం, కుంచపర్తి గ్రామాల రైతులు పంట కాలం ఎక్కువైనా దిగుబడి బాగుంటుందనే భావనతో కరీంనగర్ వరణ్ అగ్రిటెక్కు చెందిన బీపీటీ 2782 రకం విత్తనాలు ఎంచుకున్నారు. మండలంలో దాదాపు 3వేల ఎకరాలల్లో ఈ రకాన్ని సాగు చేయగా 150 రోజుల పంట కాలం కలిగిన ఈ రకం 120 రోజుల తర్వాత ఈతకు రావాలి. కానీ 90 రోజులకే 40శాతం మేర పంట ఈనుతుండడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సత్తుపల్లి మండలం నారాయణపురం, కందుకూరు డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. దాదాపు బీపీటీ 2782 వరి రకం మొత్తం ముందుగానే ఈనుతుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నారు. దిగుబడిపై ప్రభవం వరి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టారు. అయితే, 2782 రకం వరి 120రోజులకు ఈతకు రావాల్సి ఉండగా వరి 90రోజులకే 40శాతం ఈనుతుండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మరో 30రోజుల తర్వాత మిగతా వరి ఈనేలోగా ముందుగా ఈనిన వరి గింజలు రాలిపోతే దిగుబడి తగ్గే అవకాశముందని చెబుతున్నారు. మొత్తంగా ఎకరాకు 20బస్తాల దిగుబడి తగ్గనుండడంతో పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు విత్తన కంపెనీ యాజమాన్యం, అధికారులు వరి పంటను పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 20ఎకరాల్లో బీపీటీ 2782 రకం సాగు చేశా. పంటకాలం కంటే ముందే వరి ఈనడంతో దిగుబడి సగానికి పైగా తగ్గుతుంది. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున కంపెనీ యాజమాన్యమే న్యాయం చేయాలి. – ఒగ్గు సత్యనారాయణరెడ్డి, రైతు, కందుకూరుఎకరాకు రూ.30వేల చొప్పున పెట్టుబడితో 30ఎకరాల్లో బీపీటీ 2782 రకం సాగు చేశా. ముందుగానే సగం పొలం ఈనుతోంది. వెనుక పంట ఈతకు వచ్చేలోగా ముందు పంట రాలిపోతుంది. దీంతో పెట్టుబడి కూడా వస్తుందో, రాదో తెలియడం లేదు. – గొర్ల రాజశేఖర్రెడ్డి, రైతు, కందుకూరు -
శాశ్వత పరిష్కారం
సత్వర న్యాయం.. ఖమ్మంలీగల్: కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జా ప్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తున్న లోక్అదాలత్లు కక్షిదారులకు వరంగా మారాయి. ఈ లోక్అదాలత్ల నిర్వహణతో రాజీపడదగిన అనేక కేసులకు పరిష్కారం లభిస్తోంది. ప్రతీ లోక్అదాలత్లో వేలాది కేసులను పరిష్కరి స్తుండగా కక్షిదారుల సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. అంతేకాక కేసులకు శాశ్వత, అంతిమ పరిష్కారం అందుతోంది. అందరికీ న్యాయసాయం కోసం.. ప్రభుత్వం 1987లో న్యాయసేవాధికార చట్టాన్ని ప్రవేశపెట్టింది. డబ్బు ఉన్న వారికే న్యాయం సొంతం అనే అపోహను తొలగించేలా రాజ్యాంగంలోని 39వ అధికరణ ద్వారా పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పేదలకు న్యాయ సాయం అందించేలా న్యాయ విజ్ఞాన సదస్సులు, కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. ప్రీ లిటిగేషన్ కేసుల్లో ఎక్కువశాతం విచారణకు ముందే లోక్ అదాలత్ల ద్వారా పరిష్కారమవుతున్నాయి. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో చట్టం, న్యాయంపై అవగాహన లేని వారికి సత్వరన్యాయం అందించడమే లక్ష్యంగా లోక్అదాలత్లు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ పరిష్కారం రాజ్యాంగం కల్పించిన చట్టం, న్యాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించేందుకు న్యాయసేవా సంస్థలు అవతరించాయి. ‘ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతి’ సూత్రాన్ని అనుసరించి ప్రభుత్వం ప్రజా న్యాయపీఠం(లోక్ అదాలత్) ప్రక్రియను ప్రవేశపెట్టింది. న్యాయసేవాధికార సంస్థల చట్టంలోని 9వ అధికరణ ప్రకారం న్యాయపరమైన సమస్యలను ఉభయులకు నచ్చచెప్పి వారి సమ్మతితో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారు. ఎవరు కూడా ఆర్థిక కారణాలు, ఇతర అంశాలతో న్యాయాన్ని పొందే అవకాశం కోల్పోకుండా ఉచిత న్యాయసాయం సైతం అందిస్తున్నారు. నేడు జాతీయ లోక్అదాలత్ జిల్లా కోర్టు ఆవరణతో పాటు జిల్లాలోని పలు కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందులో అత్యధిక కేసులు పరిష్కరించేలా ఇప్పటికే ముందస్తు లోక్ అదాలత్లు నిర్వహించారు. అలాగే పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బీమా కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎక్కువ కేసులు పరిష్కరించేలా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ప్రత్యేక చొరవ చూపారు. ప్రత్యేక బెంచ్ల ఏర్పాటు జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహణకు ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేశారు. ఆయా బెంచ్లకు మూడు అదనపు జిల్లా జడ్జి రాంప్రసాదరావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి టి.మురళీమోహన్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్రావు, ప్రి న్సిపల్ జూనియర్ సివిల్జడ్జి కె.దీప, అడిషనల్ జూ నియర్ సివిల్ జడ్జిలు బి.రజిని, వై.బిందుప్రియ, వి.మాధవి, బి.నాగలక్ష్మి నేతృత్వం వహిస్తారు.నిర్వహణ పరిష్కారమైన కేసులు మార్చి 2024 7,665 జూన్ 2024 10,712 డిసెంబర్ 2024 8,519 మార్చి 2025 19,345నేడు జాతీయ లోక్అదాలత్ జిల్లాలోని కోర్టుల్లో శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజీ మార్గమే రాజమార్గంగా భావిస్తే కేసులు పరిష్కరించుకోవచ్చు. ఇరువర్గాలు రాజీపడితే సత్వర న్యాయం అందుతుంది. జిల్లాలో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కక్షిదారులు ముందుకు రావాలి. – జి.రాజగోపాల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
రేషన్ షాప్ల్లో డీఎస్ఓ తనిఖీ
ఏన్కూరు: మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ షాప్లను డీఎస్ఓ చందన్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. రాజలింగాల, తిమ్మారావుపేట, శ్రీరాంపురంతండాల్లో షాపుల ద్వారా బియ్యం పంపిణీని పరిశీలించిన ఆయన డీలర్లకు సూచచనలు చేశారు. లబ్ధిదా రులకు సమస్యలు ఎదురైతే హెల్ప్లైన్ నంబర్ 98682 00445కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆర్ఐ వీరయ్య పాల్గొన్నారు.నేడు సురవరం సంస్మరణ సభ ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ శనివారం ఖమ్మంలో నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో సభ మొదలవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. ఖమ్మం మీదుగా వారాంతపు రైలు ఖమ్మం రాపర్తినగర్: చర్లపల్లి – అనకాపల్లి నడుమ ఈనెల 13నుంచి వారాంతపు రైలు ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. చర్లపల్లిలో ప్రతీ శనివారం రాత్రి 8గంటలకు బయలుదేరే రైలు ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు అనకాపల్లికి చేరుతుందని తెలిపారు. ఈ రైలు ఖమ్మంకు రాత్రి 11–11గంటలకు వస్తుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి–చర్లపల్లి రైలు అర్ధరాత్రి 1–28 గంటలకు ఖమ్మం స్టేషన్కు వస్తుందని అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు 18 మంది ఎంపికఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 18 మంది ఎంపికయ్యారు. అపోలో ఫార్మసీలో వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించగా హాజరైన 35 మందిలో 18 మంది ఎంపిక కాగా నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన శాఖఅధికారి కొండపల్లి శ్రీరాం, అపోలో ఫార్మసీ ప్రతినిధులు పాల్గొన్నారు. 17న సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈనెల 17న నిర్వహించే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారో త్సవాల ముగింపు సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబీ హాజరుకానున్నారని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నాయకులు బండి రమేశ్, వై.విక్రమ్తో కలిసి మాట్లాడారు. సభలో బేబీతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్రావు, తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈమేరకు సభను విజయవంతం చేయాలని కోరారు. తపాలా బీమాను సద్వినియోగం చేసుకోవాలితిరుమలాయపాలెం: తపాలా శాఖ అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి సూచించారు. పోస్టల్ బీమా తీసుకుని ఇటీవల ప్రమాదానికి గురైన మండలంలోని తిప్పారెడ్డిగూడెం వాసి వేల్పుల భద్రమ్మకు రూ.1,08,000 చెక్కును శుక్రవారం ఆయన అందజేసి మాట్లాడారు. తక్కువ ప్రీమియంతో పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోస్టల్ శాఖ ఇన్స్పెక్టర్ కాళీ మహేశ్వరి, ఉద్యోగులు రాజేష్, వెంకయ్య, పాండు, సారయ్య పాల్గొన్నారు. భద్రాచలం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలిఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో పెరిగిన పనిభారం, మస్టర్ల కుదింపునకు వ్యతిరేకంగా ఐదు రోజుల నుంచి అక్కడి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఖమ్మం రీజియన్ ఆర్టీసీ జేఏసీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో పర్సనల్ ఆఫీసర్ సంపత్కుమార్కు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. భద్రాచలం డిపో మేనేజర్ కార్మికులపై భారం మోపుతూ మస్టర్లు కుదిస్తున్నారని తెలిపారు. నాయకులు ఏ.కృష్ణ, వినోదరావు, పి.సుధాకర్, జి.మాధవరావు, పి.రమేష్, బుచ్చిబాబు, బి.హన్మంతరావు, ఆర్.టీ.రావు పాల్గొన్నారు. -
అవసరం మేరకే ఎరువులు వినియోగించాలి
సత్తుపల్లిరూరల్: పంటలకు అవసరం మేరకే నత్రజని ఎరువు వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. సత్తుపల్లి మండలంలోని కిష్టారం, తుంబూరు, గంగారం పీఏసీఎస్ల్లో యూరి యా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పంటలకు కొంత మొత్తంలో నానో యూరియా, నానో డీఏపీలను పిచికారీ చేస్తే ఇక్కట్లు ఉండవని తెలిపారు. జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులు పంపిణీ చేస్తున్నందున ఎక్కడా కొరత లేదని వెల్లడించారు. అనంతరం కిష్టారం, బేతుపల్లిల్లో పంటల నమోదు ప్రక్రియను డీఏఓ తనిఖీ చేశారు. సత్తుపల్లి ఏడీఏ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్హెచ్ఓ టి.శ్రీహరి, ఏఓ వై.శ్రీనివాసరావు, ఏఈఓలు డి.నరేష్, టి.సాయివాసంతి, కె.ఆశాజ్యోతి పాల్గొన్నారు. -
హైవేపై సర్వీస్ రోడ్డు కోసం రైతుల ధర్నా
పెనుబల్లి: గ్రీన్ఫీల్డ్ హైవేలో భాగంగా మండలంలోని కొత్తరాయిగూడెం, పాతకారాయిగూడెం వద్ద ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించాలని పెనుబల్లి మండల రైతులు శుక్రవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ హైవేపై చిన్న బ్రిడ్జిల నిర్మాణంతో పొలాలకు యంత్రాలు, వాహనాలను తీసుకెళ్లడం కష్టమవుతుందని వాపోయారు. కాగా, రైతులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ హైవే అధికారి అమరేందర్తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. అలాగే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని దయానంద్ తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలితిరుమలాయపాలెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి సూచించారు. తిరుమలాయపాలెం సీహెచ్సీ నుంచి విడదీసి పాతర్లపాడులో ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె అదనపు జిల్లా వైద్యాధికారి అరుణతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ,ఐపీ రికార్డులు పరిశీలించడంతో మందుల లభ్యత, చికిత్స వివరాలు ఆరాతీసి ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం హెపటైటిస్ బీ వ్యాక్సినేషన్ డే సందర్బంగా తిరుమలాయపాలెం ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్ వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కృపాఉషశ్రీ, అమర్సింగ్, బొల్లికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన వసతిగృహాల్లో
కార్మికుల సమ్మెఖమ్మంమయూరిసెంటర్: గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డెయిలీ వేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. కొద్దినెలలుగా కుక్, కామాటి, వాచ్మన్లకు వేతనాలు రాకపోవడంతో శుక్రవారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. జిల్లాలో డెయిలీ వేజ్ వర్కర్లు 77 మంది, ఔట్సోర్సింగ్ వర్కర్లు 45 మంది ఉండగా.. వీరు విధులు బహిష్కరించడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం వండి వడ్డించే వారు లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు వార్డెన్లకు సూచించారు. కానీ వార్డెన్లు పట్టనట్లు వ్యవహరించడంతో విద్యార్థులకు టిఫిన్ అందలేదు. రెగ్యులర్ వర్కర్లు ఉన్నచోట్ల నుంచి అవసరమైన వసతిగృహాలకు కొందరిని పంపించారు. ఇంకొన్ని వసతిగృహాల్లో విద్యార్థులతోనే వంట చేయించినట్లు తెలిసింది. వేతనాలు అందలేదని వర్కర్లు విధులు బహిష్కరించారు. ఈ ప్రభావంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వార్డెన్లకు సూచించాం. రెగ్యులర్ వర్కర్లు ఉన్న చోటనుంచి అవసరమైన వసతిగృహాలకు పంపించాం. ఎక్కడ కూడా విద్యార్థులు ఇబ్బండి పడకుండా చూస్తున్నాం. – విజయలక్ష్మి, డీడీ, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖవసతిగృహాల్లోని ఔట్సోర్సింగ్, డెయిలీ వేజ్ వర్కర్ల సమ్మెకు కార్మిక సంఘాలు మద్దతు తెలి పాయి. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్లోని బాలికల కళాశాల వసతిగృహం ఎదుట వర్కర్లతోపాటు కార్మిక సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ మాట్లాడుతూ కొద్దినెలలుగా వర్కర్లకు వేతనాలు ఇవ్వకపోడమే కాక పనిభారం మోపారని తెలిపారు. ఇకనైనా పెండింగ్ వేతనాలు చెల్లించి, శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, డీవైఎఫ్ఐ నాయకులు సింగు నరసింహారావు, సుబాన్, చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
టీఎన్జీవోస్ మున్సిపల్ ఫోరం కమిటీ ఎన్నిక
ఖమ్మంమయూరిసెంటర్: టీఎన్జీవోస్ అనుబంధ మున్సిపల్ ఫోరం నూతన కమిటీని ఖమ్మంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగులు పాల్గొనగా.. ఒక్కో సెట్ నామినేషన్లే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల అధికారి తాళ్లూరి శ్రీకాంత్ ప్రకటించారు. ఫోరం అధ్యక్షుడిగా ఏ.సుధాకర్, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా ఈ.ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.శ్రీనివాస్, కె.లింగయ్య, జె.నాగరాజు, జె.సుచిత, కార్యదర్శిగా జి.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అలాగే, సంయుక్త కార్యదర్శులుగా ఎం.సాంబయ్య, సీహెచ్.శ్రీనివాస్, జె.రాంబాయి, ఏ.ప్రేమ్కుమార్రెడ్డి, కోశాధికారిగా బి.నాగేశ్వరరావుతో పాటు ఇతర పదవులకు బి.సుధీర్, కె.శ్రీకాంత్, అవినాష్, కే.హేమనాథ్సాయి, ఎం.ప్రవీణ్ కుమార్, పి.రజిని, కృష్ణకుమారి, కవిత, అనురాధ ఎన్నికయ్యా రు. నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్ అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొమరగిరి దుర్గాప్రసాద్, జెడ్.ఎస్.జైపాల్, యర్రా రమేష్, లలితకుమారి, ప్రభాకరాచారి, రుక్మారావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం
● ముగిసిన టెండర్ల దాఖలు గడువు ఖమ్మంవ్యవసాయం: ఎట్టకేలకు చేపపిల్లల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది. జిల్లాలో నిర్దేశించిన జలాశయాలకు చేపపిల్లలు సరఫరా చేసేందుకు టెండర్ల దాఖలు గడువు మూడు సార్లు పొడిగించిన అనంతరం ముగిసింది. ఈమేరకు ఏడుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా, వీరి ఫామ్స్ను పరిశీలించి ఖరారు చేశాక చేపపిల్లల పంపిణీ మొదలుకా నుంది. ఇప్పటికే అదును దాటుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతుండగా ఎట్టకేలకు ప్రక్రియలో వేగం పెరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాకు 3.49కోట్ల పిల్లలు జిల్లాలోని 882 రిజర్వాయర్లు, పెద్ద చెరువులు, చిన్న చెరువుల్లో నీటి సామర్ద్యం, విస్తీర్ణం ఆధారంగా చిన్న, పెద్ద చేప పిల్లలు పంపిణీ చేస్తారు. 80–100 మి.మీ.ల సైజు పెద్ద చేపపిల్లలు 2.11 కోట్ల వరకు, 35–40 మి.మీ. ఉండే చిన్నపిల్లలు 1.38 కోట్లు కలిపి 3.49 కోట్ల చేపపిల్లలకు జలాశయాల్లో విడదల చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4 కోట్లు వెచ్చించనుంది. కాగా, టెండర్లు దాఖలు చేసిన వారి సీడ్ ఫామ్స్ను జిల్లా మత్స్యశాఖ అధికారి నేతృత్వాన బృందం పరిశీలిస్తుంది. ఆతర్వాత అదనపు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే కమిటీ టెండర్లను పరిశీలించి తక్కువ బిడ్ దాఖలు చేసిన వారిని ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి జలాశయాల్లో చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ కసరత్తు చేస్తోంది. రైతువేదికలో జరిగిన ఘటనపై కలెక్టర్ ఆరాకామేపల్లి: కామేపల్లి రైతు వేదికలో గురువారం యూరియా కూపన్ల పంపిణీ సందర్భంగా జరిగి న ఘటనపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆరా తీశా రు. రైతులతో ఏఈఓలు దురుసుగా ప్రవర్తించినట్లు కథనాలు రావడంతో నివేదిక ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారిని ఆదేశించినట్లు తెలిసింది. కాగా, కూపన్లు పంపిణీ చేస్తుండగా జాస్తిపల్లికి చెందిన రైతు రాయల కృష్ణ తనతో పాటు కామేపల్లి ఏఈఓ శ్రీకన్యను దూషించాడంటూ మద్దులపల్లి ఏఈఓ రవికుమార్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. వివాదాస్పద భూములకు ఫెన్సింగ్ఖమ్మం అర్బన్: రఘునాథపాలెం సమీపాన ఖమ్మం అర్బన్ మండల పరిధి మల్లెమడుగు లో వివాదాస్పద భూములకు పోలీసుల పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఫెన్సింగ్ వేశారు. ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్ సైదులు, ఉద్యోగులు భూములకు ఫెన్సింగ్ వేయించి ఎవరూ ప్రవేశించవద్దని సూచిస్తూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సుమారు 29ఎకరాల భూమికి సంబంధించి కొన్నేళ్లుగా మల్లెమడుగు రైతులు, భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు, ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. భూముల్లోకి ఎవరూ వెళ్లొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా కొందరు సాగు చేయడంతో ఫెన్సింగ్ వేయించామని ఆర్డీఓ, తహసీల్దార్ తెలిపారు. కాగా, భూమి కొనుగోలు చేసినట్లు చెబుతున్న టి.శ్రీనివాసరావు మాట్లాడారు. అధికారులు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఫెన్సింగ్ వేయడం సరికాదని, ఈ అంశంపై చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. -
తీరని యూరియా వెతలు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం సొసైటీ కార్యాలయం వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు సీపీఎం ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని, రాష్ట్రప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని ఆరోపించారు. నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, దివ్వెల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ●తల్లాడ: తల్లాడ సొసైటీ పరిధి రైతువేదికల్లో శుక్రవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. అన్నారుగూడెం, బిల్లుపాడుల్లో కూపన్ల ఆధారంగా బందోబస్తు నడుమ పంపిణీ చేపట్టారు. ●నేలకొండపల్లి: నేలకొండపల్లి పీఏసీఎస్లో యూరియా పంపిణీకి మూడు రోజుల క్రితం కూపన్లు జారీ చేశారు. వీటి ఆధారంగా ఒక్కో రైతుకు బస్తా చొప్పున యూరియా ఇస్తుండగా కొన్ని కూపన్లపై నంబర్లు డబుల్ రావడంతో వివాదం నెలకొంది. దీనిపై ఓ రైతు నేలపై పడుకుని నిరసన తెలిపారు. అక్కడకు వచ్చిన ఏఓను నిలదీయగా కూపన్లు ఉన్న అందరికీ యూరియా పంపిణీ చేశారు. ●వైరా: గత నెలలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పుస్తకాలు ఇచ్చినా ఇప్పటికీ యూరియా పంపిణీ చేయలేదని పలువురు రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం వైరా తహసీల్దార్, ఏఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. వైరా రిజర్వాయర్ కింద సాగు చేసిన వరి పంటకు యూరియా లేక ఎదుగుదల లోపిస్తోందని తెలి పారు. అయితే, రెండు రోజుల్లో యూరియా అందించే ఏర్పాట్లు చేస్తామని వైరా ఎస్ఐ పి.రామారావు, ఏఓ మంజుఖాన్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, చింతనిప్పు చలపతిరావు, సంక్రాంతి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
మధిర: మధిరలో మృత్యుంజయ స్వామి ఆలయ సమీ పాన వైరా నదిలో ఈతకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంకు చెందిన తొర్లికొండ కృష్ణ(45) మధిరలో సెంట్రింగ్ వర్క్ చేస్తాడు. కొద్దిరోజులుగా మధిరచెరువులో ఈత నేర్చుకుంటున్న ఆయన పలువురితో కలిసి వైరా నదికి వెళ్లాడు. అయితే, చెక్డ్యామ్ వద్ద ప్రవాహంలో కృష్ణతో పాటు రామ్ కొట్టుకుపోయారు. ఈక్రమాన కృష్ణను రామ్ బయటకు లాగి వెళ్తుండగా ఒడ్డుకు వచ్చేసరికి కృష్ణ నీటిపై తేలియాడుతూ కనిపించాడు. కాగా, వరద భయంతో గుండె ఆగి మృతి చెందాడని భావిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. మధిర టౌన్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతులను రెచ్చగొట్టారంటూ జర్నలిస్టుపై కేసు కొణిజర్ల: ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలని రైతులను ప్రేరేపించారంటూ ఓ టీవీ చానల్ (సాక్షి కాదు) రిపోర్టర్పై కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 11న కొణిజర్ల సొసైటీ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు దీరారు. అక్కడకు వచ్చిన రిపోర్టర్ సాంబశివరావు, తదితరులు యూరియా సరిపోవడం లేదని చెప్పాలంటూ రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని ఎస్సై సూరజ్ తెలిపారు. కొణిజర్లకు చెందిన గంధం నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని వెల్లడించారు. కాగా, జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసు ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి ఆధ్వర్యాన జర్నలిస్టులు అడిషనల్ డీసీపీని ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. -
గొంతు నొక్కేయడం కక్షే..
పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కేయడం సరికాదు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం, అక్కడ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ప్రజల పక్షాన నిలిచే వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. – సింగం జనార్దన్, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్, ఖమ్మం -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాక ప్రజలను చైతన్యవంతులను చేసేలా పత్రికలు వ్యవహరిస్తాయి. అలాంటి పత్రికల స్వేచ్ఛను హరించడం సరికాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలన్నా... ప్రజలకు ఏమేం వసతులు కావాలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంలో పత్రికలు కీలకంగా నిలుస్తాయి. కానీ ఏపీలో ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్జి, జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు. – ఎస్.విజయ్, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
దాడులు నిలిపేయాలి
సమాజ శ్రేయస్సు, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఏపీలో ‘సాక్షి’ పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో నాలుగో మూలస్తంభంగా వ్యవహరించే పత్రికా రంగంపై దాడులను నిలిపేయాలి. ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై నమోదుచేసిన కేసులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. – మోదుగు వేలాద్రి, టీజీవోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి -
చకచకా సీఎంఆర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో 2024–25 యాసంగికి సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రేషన్షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో గడువులోగా సీఎంఆర్ సేకరించే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. జిల్లాలో యాసంగిలో 3,06,446.600 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పౌర సరఫరాల సంస్థకు చేరాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2,44,901.277 మెట్రిక్ టన్నులు అందాయి. అంటే 80 శాతం మేర బియ్యం చేరగా, మిగిలిన బియ్యాన్ని ఈ నెలాఖరులోగా సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోపక్క 2024–25 వానాకాలం సీఎంఆర్ సేకరణ కూడా 98శాతం పూర్తయింది. ఇక 2023–24 ఏడాదిలో సీఎంఆర్ ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడిన మిల్లర్లలో ఇద్దరికి నోటీసులు ఇవ్వగా.. ఇంకో మిల్లర్పై కేసు పెట్టారు. గడువుతో గడిపేస్తూ.. గత కొన్నేళ్లుగా మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తున్నా మిల్లర్లు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. జిల్లాలో ఏటా పౌరసరఫరాల సంస్థ సుమారు 70 మిల్లులకు ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇస్తోంది. ధాన్యం మర ఆడించాక 67 శాతం బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అందించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గడువులోగా ఇవ్వకపోవడమే కాక సాకులతో కాలం వెళ్లదీస్తున్నారు. 2023–24 సీజన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగడంతో అవసరాలకు బియ్యం కేటాయించడం ఇబ్బందిగా మారింది. యాసంగిలో 80 శాతం 2024–25 ఏడాది వానాకాలంలో 98 శాతం, యాసంగిలో 80 శాతం సీఎంఆర్ సేకరణ పూర్తయింది. యాసంగి సీజన్లో మిల్లర్లకు 4,56,167 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగిస్తే అందులో 3,06,446.600 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 2,44,901.277 మెట్రిక్ టన్నులు అందించారు. మిగతా బియ్యాన్ని సైతం ఈనెలాఖరులోగా సేకరించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ మిల్లర్లపై చర్యలు.. గతంలో చాలా మిల్లులు గడువులోగా సీఎంఆర్ ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడ్డాయి. 2023–24లో హైదరాబాద్ నుంచి వచ్చిన టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టడంతో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లుగా తేలింది. దీంతో మిల్లర్లకు జరిమానా విధించినా చెల్లించలేదు. మూడు మిల్లులకు నోటీసులు జారీ చేస్తే రెండు మిల్లుల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. మరో మిల్లుపై ఇప్పటికే కేసు నమోదైంది. అయితే అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా అలాంటి చర్యలు తీసుకోలేదు.సీఎంఆర్ త్వరగా సేకరించేంలా చర్యలు చేపట్టాం. ఇప్పటికే 80 శాతం మేర సన్నబియ్యం అందింది. ఈనెలాఖరు వరకు గడువు ఉన్నందున మొత్తం సేకరిస్తాం. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో సరిపడా నిల్వ ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీలత, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ 2024–25 రబీ ధాన్యంలో 80 శాతం సేకరణ ఈ ఏడాది ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అంతేకాక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వసతిగృహాల్లో భోజనానికి సైతం సన్న బియ్యం అందిస్తున్నారు. ఈనేపథ్యాన గడువులోగా సీఎంఆర్ సేకరించేలా అధికారులు దృష్టి సారించారు. ప్రతినెలా రేషన్ షాపులు, ఇతర అవసరాలకు సన్నబియ్యం పంపిణీ చేయాలంటే ముందస్తుగా నిల్వ చేయడం తప్పనిసరి. దీంతో బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించకుండా గడువులోగా అందించేలా అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే సమయాన మిల్లుల్లో ధాన్యం, బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా పెట్టారు. -
రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలి
ఖమ్మం సహకారనగర్: అడ్డంకులను అధిగమించి రాజీవ్ స్వగృహ సముదాయాన్ని దక్కించుకోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ సముదాయాన్ని ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీ బిడ్లో కై వసం చేసుకోగా, నాయకులు శుక్రవారం కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక ఒరవడి కలిగిన జిల్లా ఉద్యోగులు ప్రాజెక్టును విజయవంతం చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొనిదెన శ్రీనివాసరావు, టీజీవోస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, నాయకులు విజయ్, రాంబాబు, జైపాల్, వెంకన్న, దుర్గాప్రసాద్, హరికృష్ణ, కోణార్క్, ప్రభాకరాచారి, రుక్మారావు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను వివిధ పార్టీల నాయకులతో కలిసి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భద్రత, అగ్నిమాపక యంత్రాల నిర్వహణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.ఉద్యోగ సంఘాలతో కలెక్టర్ అనుదీప్ -
శరవేగంగా భూసర్వే
మధిర: మధిర మండలంలోని వంగవీడు సమీపాన వైరా నదిపై నిర్మించే జవహర్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణపై యంత్రాంగం దృష్టి సారించింది. వైరా నదిపై రూ.630 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం నిర్మించి పైప్లైన్ల ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈమేరకు అవసరమైన 193.15 ఎకరాల భూసేకరణకు 40 మంది సిబ్బందితో సర్వే చేయిస్తున్నారు. వైరానదిపై చెక్డ్యామ్, ఆ పక్కన పంప్హౌస్ నిర్మించి అక్కడి నుంచి మూడు పైపులైన్ల ద్వారా నీరు ఎత్తిపోస్తారు. భూమి నుంచి ఆరు అడుగుల లోపల పైప్లైన్లు వేసే క్రమాన మధ్యలో బోర్లు ఉన్నా ఇబ్బంది ఎదురుకాకుండా భూసేకరణకు నిర్ణయించారు. అంతేకాక పైప్లైన్ల మరమ్మతులు, నిర్వహణ కోసం ఓ వైపు రోడ్డు నిర్మిస్తారు. ఇప్పటికే పంప్హౌస్ పనులు మొదలుకాగా.. పైప్లైన్, రహదారికి అవసరమైన భూసేకరణకు కసరత్తు మొదలుపెట్టారు. మూడు మార్గాల్లో.. వైరా నదిపై పంప్హౌస్ నుంచి మూడు మార్గాల్లో పైపులైన్లు వేస్తారు. ఇందులో ఒకటి 11.2 కి.మీ. పొడవుతో నిర్మించి నిధానపురం మేజర్ కెనాల్ 38వ కి.మీ. వద్దకు నీరు చేరుస్తారు. ఇక 26 కి.మీ. పొడవైన రెండో పైప్లైన్ ద్వారా జమలాపురం మేజర్ వద్ద ఉన్న కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. అలాగే, మూడో పైప్లైన్ 27 కి.మీ. ఉంటుందని.. దీనిద్వారా మైలవరం మేజర్ కెనాల్లోకి నీటిని డంపింగ్ చేస్తారు. తద్వారా ఏపీ భూభాగం నుంచి సాగునీరు తీసుకోకుండానే జవహర్ ఎత్తిపోతల ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధి చివరి ఆయకట్టుకు నీరందిస్తారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని సాగర్ జోన్–3 నుంచి జోన్–2లోగా మార్చారు. ఎత్తిపోతల పథకం కూడా పూర్తయితే కు ఇన్నాళ్లు చివరి ఆయకట్టుకు నీరందక నష్టపోయిన రైతులకు మేలు జరగనుంది. మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో తమ సాగునీటి కష్టాలు తీరనున్నాయని రైతులు చెబుతున్నారు. భూసేకరణ మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధిలో 37వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. పైప్లైన్ ఏర్పాటుతో పాటు ఇతర పనులకు మొత్తం 193.15 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. మధిర మండలంలో 116.35, ఎర్రుపాలెం మండలంలో 76.20 ఎకరాల భూసేకరణ నిర్ణయించారు. మధిర మండలంలోని వంగవీడులో 19.21, మునగాలలో 20.38, ఆత్కూరులో 16.27, మాటూరులో 25.18, నాగవరప్పాడులో 9.26, సిద్దినేనిగూడెంలో 21.28, ఎర్రుపాలెం మండలంలోని గోసవీడులో 25.37, అయ్యవారిగూడెంలో 12.47, భీమవరంలో 12.31, గుంటుపల్లి గోపవరంలో 3.27, మామునూరులో 25.38 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు
ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛను హరించేలా తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పుపడుతున్నారు. ‘సాక్షి’ తెలుగు దినపత్రికకు చెందిన పలు ఎడిషన్ కేంద్రాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇక ప్రభుత్వం హామీల అమలులో చేస్తున్న జాప్యంపై ప్రజల పక్షాన వార్తలు ప్రచురిస్తే మాత్రం కేసులు నమోదు చేసి సాక్షి కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తాజాగా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి, రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను అక్కడి ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తీసుకునేలా చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడ్డారు. – ఖమ్మం సహకారనగర్ / ఖమ్మం లీగల్ -
డంపింగ్ యార్డ్కు స్థలం గుర్తించండి
వైరా: వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్కు అనువైన స్థలాన్ని గుర్తించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ ఆదేశించారు. వైరా మండలం ముసలిమడుగులో స్థలాన్ని అమె తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. అయితే, ఈ స్థలం దూరంగా ఉన్నందున, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో రెండెకరాల స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ యు.గురులింగం తదితరులు పాల్గొన్నారు. యాత్రాదానానికి విరాళాలు అందించండి ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక బాధ్యతలో భాగంగా ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ఉద్దేశమని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వారు ప్రత్యేక రోజులు, పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక నిధికి విరాళం ఇస్తే బస్సులు సమకూరుస్తామని తెలిపారు. ఇందుకోసం వ్యక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, ఎన్జీవోలు నగదు సమకూర్చవచ్చని పేర్కొన్నారు. నిరుపేదలనే కాక సభ్యులు, బంధువులు, స్నేహితులను కూడా యాత్రకు తీసుకెళ్లవచ్చని, వివరాల కోసం డిపోల్లో లేదా 040–69440000, 040–23450033 నంబర్లలో సంప్రదించాలని ఆర్ఎం సూచించారు. -
అక్రమ కేసులు గర్హనీయం
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం గర్హనీయం. ప్రభుత్వాలు ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సరైన విధానం అనిపించుకోదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు నియంతృత్వంతో వ్యవహరించడం, పత్రికాస్వేచ్ఛను అణచివేసేలా ప్రభుత్వాలు ప్రయత్నించడం శోచనీయం. మీడియా కార్యాలయాలపై దాడులు, జర్నలిస్టులపై కేసులను ఖండిస్తున్నాం. – కర్లపూడి శ్రీనివాసరావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఖమ్మం -
మిర్చి సీజన్ నాటికి నిర్మాణాలు పూర్తి
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయిఖమ్మంవ్యవసాయం: మిర్చి పంట సీజన్ ప్రారంభయ్యే నాటికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మోడల్ మార్కెట్ నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆదేశించారు. ఖమ్మం మార్కెట్లో రూ. 155.30 కోట్లతో నిర్మాణ పనులను అధికారులతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. మిర్చి క్రయవిక్రయాలకు ఐదు షెడ్లు, రైతుల విశ్రాంతి భవనం, కార్మికులు, దడవాయిల కార్యాలయాలు, శీతల గిడ్డంగి నిర్మాణాలను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశమైన డైరెక్టర్ మాట్లాడుతూ రైతులు, ఉద్యోగులకు తాగునీటి సౌకర్యం కల్పించేలా ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలు, విద్యుత్ లైట్ల ఏర్పాటు, డ్రెయినేజీ వ్యవస్థపై చర్చించారు. అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణ్గౌడ్, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
సాదాబైనామాకు సై..
తెల్ల కాగితాలపై నమోదైన భూకొనుగోళ్ల ఒప్పందాలు ఇకపై అధికారికం కానున్నాయి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 106జీఓతో దరఖాస్తుదారుల ఐదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. జిల్లాలో 2020లో 1,11,443 దరఖాస్తులు అందాయి. నాటి దరఖాస్తుల కటాఫ్ తేదీ ఆధారంగానే పరిశీలించి అధికారికంగా హక్కు కల్పించనున్నారు. భూముల క్రమబద్ధీకరణపై కోర్టు స్టే తొలగిపోవడం, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో దరఖాస్తుదారులకు ఊరట కలిగించినట్లయింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఐదేళ్లు నిలిచిపోవడంతో.. భూములను రెగ్యులరైజ్ చేయడానికి గత ప్రభుత్వం 2020 అక్టోబర్లో జీఓ 121 జారీ చేయగా రెవెన్యూ యంత్రాంగానికి సాదాబైనామా దరఖాస్తులు వెల్లువలా అందాయి. అయితే, 2020 ఆర్వోఆర్ చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు లేనందున కోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి వేలాదిమంది నిరీక్షిస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టంలో కూడా అధికంగా సాదాబైనామాల క్రమబద్ధీకరణకే దరఖాస్తులు అందాయి. ఇటీవల స్టే తొలగించడంతోపాటు ప్రభుత్వం 106 జీఓను విడుదల చేయగా దరఖాస్తులకు మోక్షం లభించనుంది. హక్కులు లేక అవస్థ పట్టేదారు పాస్ పుస్తకం ఉన్న భూములకు రుణాలు అందడమే కాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అలాగే పంటల అమ్మకం, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల సమయంలోనూ ఒక్కోసారి పట్టాదారు పాస్ పుస్తకాలు కీలకంగా మారుతున్నాయి. కానీ వేలాది మంది రైతులు భూముల క్రయవిక్రయాలను తెల్లకాగితాలపై చేసుకోవడంతో పాస్ పుస్తకాలు లేక, అధికారిక భూహక్కులు దక్కక ప్రభుత్వపరంగా పథకాలకు దూరమవుతున్నారు. ఆ కటాఫే ప్రామాణికం స్టే తొలగించినా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేక సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఏ ప్రాతిపదికత తీసుకుంటారో స్పష్టత రాలేదు. కానీ బుధవారం జీఓ 106 విడుదల చేసింది. దీని ప్రకారం 2014కు పూర్వం సాదాబైనామాల ద్వారా క్రయవిక్రయాలు చేయడంతోపాటు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను పరిష్కరించనున్నారు. అయితే, గత 12ఏళ్లు భూమి తమ స్వాధీనంలోనే ఉన్నట్లు దరఖాస్తులు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. రెవెన్యూ సదస్సుల్లోనూ.. ధరణి స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురాగా భూసమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో మొత్తం 75,004 దరఖాస్తులు అందగా, వీటిలో సాదాబైనామాపైనే 45,254 ఉన్నాయి. వీటిలో 2020లో చేసుకున్న వారిని గుర్తించేలా వడబోయనున్నారు. ప్రభుత్వ జీఓలో 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు చేసుకున్న దరఖాస్తులనే పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 6ను అనుసరించి ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలులేదు. అయితే, కటాఫ్ తేదీ తర్వాత సాదాబైనామాపై అందిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.స్టే తొలగింపు, జీఓ జారీతో తప్పిన చిక్కులు సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 2014కి ముందు తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన ఐదెకరాల లోపు కుష్కీ, రెండున్నర ఎకరాల తరి ఉన్న చిన్న, సన్నకారు రైతుల భూములు క్రమబద్ధీకరిస్తాం. మున్సిపల్ ప్రాంతాలు తప్ప మిగతా చోట్ల ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2020లో దరఖాస్తులు ఇచ్చి.. మరోసారి రెవెన్యూ సదస్సుల్లోనూ ఇచ్చిన వారికి గతంలోనే నోటీసులు ఇచ్చాం. 2020 కటాఫ్ తేదీ ప్రకారమే దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. – పి.శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) -
ఎర్రబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలం డిపో కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు తగ్గించిన మస్టర్లను పునరుద్ధరించాలనే డిమాండ్తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యాన కార్మికులు గురువారం ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మొదటి షిఫ్ట్లో రీజియన్లోని అన్ని డిపోల్లో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఖమ్మం డిపోలో జరిగిన నిరసనలో జేఏసీ నాయకులు పిట్టల సుధాకర్, బూదాటి శ్రీనివాసరెడ్డి, నిమ్మటూరి సత్యం, బత్తినేని హనుమంతరావు, పగిళ్లపల్లి నరసింహారావు, గుగ్గిళ్ల రోశయ్య, బేతంపూడి బుచ్చిబాబు, నర్సింహాచారి, పద్మా, జ్యోతి, సంధ్యారాణి, ఉమారాణి, నాగవీర, భాస్కర్, లాల్బీ పాల్గొన్నారు. ట్రాఫిక్ సీఐ–2గా అప్పలనాయుడు ఖమ్మంక్రైం: ఖమ్మం ట్రాఫిక్ సీఐ–2గా అప్పలనాయుడు నియమితులయ్యారు. ప్రస్తుతం రిజర్వ్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఆయనను ట్రాఫిక్ సీఐగా నియమిస్తూ సీపీ సునీల్దత్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ స్థానంలో ఉన్న సాంబశివరావును తిరిగి హెడ్ క్వార్టర్స్కు కేటాయించారు. ఈమేరకు అప్పలనాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ‘ఆశా’లకు రూ.18వేల వేతనం చెల్లించాలి ఖమ్మంమయూరిసెంటర్: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించి వారి సర్వీసును క్రమబద్ధీకరించేలోగా రూ.18వేల వేతనం చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు యూనియన్(సీఐటీయూ) జిల్లా ఏడో మహాసభ జిల్లా అధ్యక్షురాలు జె.మంగమ్మ అధ్యక్షతన గురువారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఆశాల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు వేతనం పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు, పి. రమ్య, పి.మోహన్రావు, విఠల్, చంద్రశేఖర్, శీలం నర్సింహారావు, జిల్లా ఉపేందర్, నాయకులు నవీన్రెడ్డి, బషీరుద్దీన్, వీరన్న, ఆశావర్కర్ల యూని యన్ నాయకులు జె.మంగమ్మ, బి.అమల పాల్గొన్నారు. బ్యాంక్ అధికారులకు అవగాహన ఖమ్మంమయూరిసెంటర్: స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ విధానంపై ఉమ్మడి జిల్లాలోని బ్యాంకుల మేనేజర్లకు గురువారం అవగాహన కల్పించారు. ఖమ్మంలోని టీటీడీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల లింకేజీ కార్యకలాపాలు, రుణ పరిమితి, రుణబీమా, ఆర్బీఐ మార్గదర్శకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు కె.శ్రీనివాసరావు, నరసింహస్వామి, బాలస్వామి, డీఆర్డీఓ ఆర్.సన్యాసయ్య, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికారులు జయశ్రీ, నీలేష్, ఖమ్మం, ఆంజనేయులు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేని మైనింగ్ కట్టడి
బోనకల్: బోనకల్ మండలంలోని లక్ష్మీపురంలో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారనే సమాచారంతో మైనింగ్, రెవెన్యూ ఉద్యోగులు గురువారం తనిఖీలు చేపట్టారు. మైనింగ్ ఇన్స్పెక్టర్ పాపగంటి నాగరాజు, ఆర్ఐ మైథిలి పరిశీలించి భూయజమానులతో మాట్లాడారు. అయితే, తవ్వకాలు చేపట్టిన వారికి సంబంధించి జేసీబీలు మరోచోట ఉండడంతో వివరాలు సేకరించారు. ఈమేరకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు.‘బీజేపీ, బీఆర్ఎస్ భూస్థాపితం బాధ్యత బీసీలదే’తల్లాడ: రాష్ట్రప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా కేంద్రప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ పేర్కొన్నారు. తల్లాడ మండలం బిల్లుపాడులో గురువారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పాటు, తమ పాలనలో బీసీలను అణచివేసిన బీఆర్ఎస్ను భూస్థాపితం చేసే బాధ్యత బీసీలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో వచ్చే అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడేపల్లి కృష్ణచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివతో పాటు మల్లెల శ్రీనివాస్, మర్రి ప్రసాద్, జొన్నలగడ్డ వె ంకటేశ్వర్రావు, రుద్రాక్ష లక్ష్మణాచారి, నరసింహాచారి, వెంకటేశ్వరరావు, దీవెల వెంకటేశ్వర్లు, వెంకటరామయ్య, వీరభద్రరావు, సతీష్, గడ్డంబాను, కూరపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.14న రాష్ట్రస్థాయి మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలుఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 14న రాష్ట్రస్థాయి మహిళల వెయిట్ లిఫ్టింగ్ (ఇండియా లీగ్) పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు జరుగుతాయని అధ్యక్ష, కార్యదర్శులు శివ గణేష్, డి.వినోద్కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఈ పోటీలకు క్రీడాకారులు హాజరుకానున్నారని వెల్లడించారు.మున్సిపల్ ఉద్యోగుల పేరిట ఫోన్లు● క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లించాలని సూచనసత్తుపల్లి: మీ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసింది.. రెన్యూవల్ కోసం వాట్సప్లో పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా నగదు పంపించండి.. పది నిమిషాల్లో రెన్యూవల్ సర్టిఫికెట్ పంపిస్తాం.. అంటూ సత్తుపల్లిలో పలువురు వ్యాపారులకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. సత్తుపల్లికి చెందిన ఎల్.లక్ష్మణ్రావు, జ్యోతి, సుభాష్ తదితరులకు గురువారం ఫోన్ రావడంతో మున్సిపల్ కార్యాలయంలో ఆరా తీయగా తమకేం సంబంధం లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ స్పందిస్తూ అపరిచితులు ఫోన్ చేసినా, క్యూ ఆర్ కోడ్ పంపినా స్పందించవద్దని సూచించారు. మున్సిపల్ ఉద్యోగులెవరూ ఇలా చేయరని, వ్యాపారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభవైరా: జైళ్లశాఖలో హెడ్ వార్డర్గా పనిచేస్తున్న వైరా మున్సిపాలిటీ గండగలపాడుకు చెందిన పి.వెంకటరత్నం ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో 28 రాష్ట్రాల నుంచి పలువురు పోటీ పడగా, తెలంగాణ తరఫున పాల్గొన్న వెంకటరత్నం ద్వితీయ బహుమతి సాఽధించాడు. ఉద్యోగం సాధించకముందు వైరాలో రత్న ఆర్ట్స్ నిర్వహించిన ఆయన జాతీయ స్థాయిలో సత్తా చాటడంపై పలువురు అభినందించారు. -
ప్రతీ ఒక్కరికి ఆర్థిక భద్రత అవసరం
కూసుమంచి: ప్రస్తుత తరుణాన అందరికీ ఆర్థిక భద్రత అవసరమని, ఇందుకోసం పొదుపు మార్గాన్ని ఎంచుకోవాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ చిన్మయ్కుమార్ సూచించారు. కూసుమంచి మండలం నేలపట్లలో ఎస్బీఐ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన జన సురక్ష ప్రచార శిబిరం, ఆర్థిక అక్ష్యరాస్యత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండి, డబ్బు పొదుపు చేస్తూ ఆర్థికంగా బలపడాలన్నారు. ఈవిషయంలో అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదేసమయాన సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు వివరిస్తున్నామని చెప్పారు. ఎస్బీఐ డీజీఎం కస్తూరి వినోద్కుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా ఆర్థిక సేవలే కాకుండా ప్రజలను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దడం, పేద పిల్లల చదువుకు తోడ్పాటు కోసం స్కాలర్షిప్ ఇస్తున్నామని తెలిపారు. డీఆర్డీఓ ఏపీడీ జయశ్రీ, ఆర్బీఐ ఎల్డీఓ చేతన్ గోనేకర్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాజశేఖర్, కూసుమంచి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఆర్బీఐ ప్రాంతీయ డైరక్టర్ చిన్మయ్కుమార్ -
నిండా ముంచిన కల్తీ విత్తనాలు?
వేంసూరు: కల్తీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు కంపెనీ యాజమాన్యం న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. వేంసూరు మండలం కందుకూరుకు చెందిన పలువురు రైతులు కరీంనగర్కు చెందిన వరుణ్ కంపెనీ బీపీటీ 2782 రకం వరి విత్తనాలతో 1,500 ఎకరాల్లో పంట సాగు చేశారు. అయితే, 120 రోజుల్లో ఈతకు రావాల్సిన వరి 90 రోజులకే 40 శాతం మేర ఈనడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యాన పొలాలను గురువారం మాజీ ఎమ్మెల్యే సండ్ర పరిశీలించి మాట్లాడారు. సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తోందని భరణిపాడు, మర్లపాడు, లింగపాలెం, కుంచపర్తి, చౌడవరం గ్రామాల రైతులు వరి సాగు చేశారని తెలిపారు. కానీ విత్తన లోపంతో ఒక కందుకూరులోనే 1,500 ఎకరాల్లో నష్టపోయారని చెప్పారు. అధికారులు, కంపెనీ ప్రతినిధులు పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు గొర్ల ప్రభాకర్రెడ్డి, పాల వెంకటరెడ్డి, పగట్ల వెంకటేశ్వరరావు, జుబ్బూరి నాగరాజు, దొడ్డ వెంకటకృష్ణారెడ్డి, మందపాటి మహేశ్వరరెడ్డి, గొర్ల సత్యనారాయణరెడ్డి, ఎర్ర రమేష్, గండ్ర రామిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య -
ముందు బిల్లులు ఇవ్వండి
● లేకపోతే పనిచేయలేమంటున్న కాంట్రాక్టర్లు ● నోటీసులు ఇచ్చినా కాన రాని ఫలితం ● ఆర్అండ్బీ పరిధిలో రోడ్డు పనులకు అంతరాయంఖమ్మంఅర్బన్: జిల్లాలో రోడ్లు–భవనాల శాఖ పరిధిలో అనేక పనులు నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు నోటీసులు పంపినా చాలా మంది స్పందించకపోవడం గమనార్హం. అధికారులు తరచుగా నోటీసులు ఇస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం తొలుత బిల్లులు చెల్లించాలని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో కొన్ని రోడ్ల నిర్మాణం ప్రారంభం కాకపోగా.. ఇంకొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. యంత్రాలు కూడా తరలింపు ప్రధానంగా ఖమ్మం–ఇల్లెందు రహదారిపై రఘునాథపాలెం నుంచి బూడిదంపాడు వరకు రూ.40 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం ప్రారంభమైంది. అయితే బిల్లులు విడుదల కానందున కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి సామగ్రి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆ రోడ్డుపై వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. ఇల్లెందు–ఖమ్మం రోడ్డుకు సంబంధించి మరమ్మతు పనులు ఆపిన కాంట్రాక్టర్కు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదని సమాచారం. సదరు కాంట్రాక్టర్ ఇప్పటివరకు చేసిన పనులకు సుమారు రూ.10కోట్ల బిల్లు రావా ల్సి ఉండగా, అందులో కొంత మొత్తమైనా ఇవ్వకపోతే పనులు చేసేది లేదని చెప్పినట్లు సమాచారం. మిగతా పనులు కూడా.... జిల్లా వ్యాప్తంగా రహదారుల వార్షిక మరమ్మతులు, గుంతల పూడ్చివేత, రోడ్లకు ఇరువైపులా కంచె చెట్ల తొలగింపు పనుల టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదు. గత రెండేళ్ల క్రితం చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ రాలేదని.. మళ్లీ పనులు చేసి అప్పులు కాలేమంటూ కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వార్షిక పనులు, చిన్న గుంతలు పూడ్చడం, కంపచెట్లు తొలగింపు తదితర పనులన్నీ నిలిచిపోయాయి. జిల్లాలోని సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఏడెనిమిది మండలాల పరిధిలో పనులు పూర్తి కాగా.. మిగిలిన అన్నిచోట్ల కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఏన్కూరు మండల కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించాల్సిన డ్రెయిన్ల పనులకు గత ఎన్నికల కంటే ముందే టెండర్ అయినా ప్రారంభం కాాలేదు. దీంతో టెండర్ గడువు ముగియడం, నోటీసులకు స్పందన రాకపోవడంతో టెండర్ను రద్దు చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా నిధులు మంజూరై, టెండర్లు అయిన పనులు నిలిచిపోగా.. రోడ్ల మరమ్మతులు జరగకపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. -
గుంతలో నగలు.. అవసరమైతే అమ్మకం
ఖమ్మంక్రైం: జైలుకు వెళ్లివచ్చినా తీరు మార్చుకోకుండా రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి చోరీ సొత్తు గుంతలో దాచి అవసరమైనప్పుడు అమ్ముతూ విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఈమేరకు నిందితుడిని ఖమ్మం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేయగా వివరాలను గురువారం వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ నాగేల్లి వరకుమార్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీల బాట ఎంచుకున్నాడు. రైళ్లల్లో ప్రయాణిస్తూ, ప్లాట్ఫాంపై తిరుగుతూ ఆదమరిచి ఉండే ప్రయాణికుల వద్ద చోరీకి పాల్పడుతున్నాడు. గతంలో ఓసారి జైలుకు వెళ్లి వచ్చినా మార్పు రాలేదు. ఖమ్మం స్టేషన్లో గురువారం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వరప్రసాద్ను అదుపులోకి తీసుకోగా చోరీల విషయం బయటపడింది. దీంతో ఆయన నుంచి 10గ్రాములు బంగారు నెక్లెస్ స్వాధీనం చేసుకున్నారు. తొలుత చోరీ నగలపై ఆరా తీయగా ఇంట్లో దాచినట్లు వరప్రసాద్ చెప్పినా దొరకలేదు. తిరిగి తోతుగా విచారించడంతో ఇంటి వెనుక గుంతలో పెట్టినట్లు ఒప్పుకున్నాడు. డబ్బు అవసరమైనప్పుడు ఒక్కో ఆభరణం తీసి అమ్ముతున్నట్లు అంగీకరించాడు. ఇప్పటివరకు వరప్రసాద్ చోరీ చేసిన సొత్తు విలువ రూ.8.50లక్షలు ఉంటుందని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు అంజలి, సురేష్గౌడ్ తెలిపారు. ఈసమావేశంలో ఎస్ఐ సురేష్, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్ -
ఆర్టీసీ ఆధ్వర్యాన ‘యాత్రాదానం’
సత్తుపల్లిటౌన్: టీజీ ఆర్టీసీ ఆధ్వర్యాన ‘యాత్రాదానం’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి తెలిపారు. సత్తుపల్లిలో గురువా రం ఆమె మాట్లాడుతూ సాంస్కృతిక విలువల పరిరక్షణ, సమాజానికి ఇచ్చే మానవత్వపు బహుమతిలో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ఉన్నా స్థోమత లేని అనా థలు, నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పంపించేలా ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. విరాళాల ఆధారంగా బస్సులు సమకూరుస్తామని వెల్లడించా రు. సత్తుపల్లి డిపో పరిధిలో బుకింక్ కోసం డిపోలో లేదా 99592 25962, 98666 19189 నంబర్లలోసంప్రదించాలని డీఎం సూచించారు. ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలోని రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ను గురువారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. రద్దీ ప్రాంతాలలో అదనంగా సిబ్బందిని నియమించి, వాహనదారులతో అనవసర వివాదాలకు పోకుండా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని తెలిపారు. అలాగే, బాడీవార్మ్ కెమెరాల ఉపయోగం, సీసీ కెమెరాల ఏర్పాటు, జరిమానా వసూళ్లపై సమీక్షించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను గుర్తించాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారయణ పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలు సునందకు కీర్తి పురస్కారం ఖమ్మం సహకారనగర్/ఖమ్మం మామిళ్లగూడెం: ప్రముఖ రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలు ఉరిమళ్ల సునందకు 2024 సంవత్సరానికి గాను తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాన్ని ప్రకటించింది. ఆమె ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్విస్తూనే సాహిత్యంలో రాణిస్తున్నారు. ఎక్కడ పనిచేసాన విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ సాహిత్యంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే, ఏటా తన సోదరి వురిమళ్ల పద్మజ పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందచేస్తున్నారు. కాగా, తెలుగు యూనివర్సిటీ ప్రకటించిన పురస్కారాన్ని త్వరలో సునంద అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయులు, కవులు, రచయితలు అభినందించారు. జిల్లాలో పలుచోట్ల వర్షం ఖమ్మంవ్యవసాయం: ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు రోజులుగా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నా యి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు కూడా జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది. బుధవారం ఉదయం 8–30నుంచి గురువారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో సగటున 22.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి మండలంలో అత్యధికంగా 68.8 మి.మీ.వర్షపాతం నమోదు కాగా, వేంసూరు మండలంలో 57.2, పెనుబల్లిలో 56.2, కారేపల్లిలో 41.8, తల్లాడలో 40.2, చింతకానిలో 22.4, ముదిగొండలో 21.6, కామేపల్లి, రఘునాథపాలెంలో 20.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల వరకు నమోదు కాగా గురువారం 28 డిగ్రీలకు పడిపోయింది. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
ప్రశ్నించడమే నేరమా?
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వాలు – ప్రజలకు మధ్య వారధిలా పత్రికలు పని చేస్తుంటాయి. అలాంటి పత్రికల్లో వచ్చే కథనాలను జీర్ణించుకోలేక ఎడిటర్లపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. తక్షణమే సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. – పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం, జర్నలిస్టుల హక్కుల రక్షణకు పాలకులు పాటుపడాలి. అంతేతప్ప ప్రభుత్వం – ప్రజలకు వారధిగా ఉంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను ఫాసిస్టు చర్యగా భావిస్తున్నాం. – ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్), జిల్లా అధ్యక్షుడుఏపీలో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛపై ఉక్కుపాదం ● అక్కడి ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న పలువురుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛపై అక్కడ టీడీపీ ఆధ్వర్యాన అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గడిచిన మే నెలలో ‘సాక్షి’ దినపత్రిక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, మంగళగిరి, రాజమండ్రి, ఏలూరు, శ్రీకాకుళం జిల్లా కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు మూకదాడులకు దిగాయి. ఈ విషయంలో దోషులను శిక్షించాలని ‘సాక్షి’ జర్నలిస్టులు పోలీస్స్టేషన్లలో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. ఇదే సమయాన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కొందరు ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ తక్షణమే కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటుచేసే ప్రెస్ కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన ‘సాక్షి’ దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని దాడులు, కేసులు, పోలీసులతో కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కేస్తున్న ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను పలువురు తప్పుపడుతున్నారు. – ఖమ్మం సహకారనగర్ ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్ర జరుగుతోంది. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్కడి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జర్నలిస్టులను ఏదోలా లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో సాక్షిపై, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఆధారాలు లేకున్నా సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డిపై అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడాన్ని మానుకోవాలి. – కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
అటవీ సంపద రక్షణ అందరి బాధ్యత
ఖమ్మంవ్యవసాయం: అటవీ సంపద, అడవుల సంరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరిస్తే అటవీ అమరవీరులకు నివాళులర్పించినట్లవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మంలోని అటవీ శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులుఅర్పించాక కలెక్టర్ మాట్లాడుతూ తాను భద్రాద్రి కలెక్టర్గా ఉన్న సమయాన అటవీ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడం కలచివేసిందని తెలిపారు. అటవీ ఉద్యోగులు అడవుల పరిరక్షణకు రాత్రీపగలు పనిచేస్తున్నారని అభినందించారు. అడవుల నరికివేతతో మానవ మనుగడ కష్టమవుతుందనే విషయాన్ని అందరూ గుర్తించి ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణను బాధ్యతగా కాక ప్రజలు కర్తవ్యంలా భావించాలని తెలిపారు. అనంతరం ఉద్యోగులకు రెయిన్ కోట్లు, స్టిక్ గార్డ్లు పంపిణీ చేయగా కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరా పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి ఖమ్మం సహకారనగర్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన వివిధ శాఖల ఆధ్వర్యాన జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. జిల్లాకు మంజూరైన అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలపై సూచనలు చేసిన కలెక్టర్.. కొన్ని పనులు ప్రారంభం కాకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, రఘునాథపాలెం మండలంలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్, సత్తుపల్లి, మధిర, పాలేరులో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో పనులు మొదలుకాకపోతే వాటిని రద్దు చేయాలని తెలిపారు. అలాగే, చెక్డ్యాంలు, సీతారామ ఎత్తిపోతల పథకం పనులపై కలెక్టర్ సమీక్షించారు. సీపీఓ ఏ.శ్రీనివాస్, డీఆర్డీఓ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ రాంగోపాల్రెడ్డి, ఎస్ఈలు యాకోబు, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్ -
గుంతలో పడి వ్యక్తి మృతి
మధిర: రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంతలో పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మధిర హనుమాన్ కాలనీకి చెందిన ఉప్పతల జమలయ్య(45) బోనకల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఇనుప బీరువాల తయారీ పనిచేస్తున్నాడు. బుధవారం ఆయన మధిర వడ్డెర కాలనీలో ఫంక్షన్కు హాజరై తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబీకులు గాలిస్తుండగా గురువారం ఉదయం గుంతలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఫంక్షన్కు వెళ్లి వస్తున్న క్రమాన మద్యం మత్తులో రోడ్డు పక్కన నీటి గుంతలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అయితే, సెల్ఫోన్తో పాటు నగదు రోడ్డుపై ఉండడంతో మద్యం మత్తులో పడ్డాడా, ఇతర కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మధిర టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ తిరుమలాయపాలెం/రఘునాథపాలెం: తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువులోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో గురువారం టాస్క్ఫోర్స్ ఎస్ఐ రఘు ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని రూ.30,520 నగదు, కారు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్లో అప్పగించగా కేసు నమోదు చేశారు. అలాగే, రఘునాథపాలం మండలం కొర్లబోడు తండాలోనూ తనిఖీలు చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారు కాగా, పట్టుబడిన వారి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సాగర్ కెనాల్లో మృతదేహం ఖమ్మంక్రైం: ఖమ్మం వేణుగోపాల్ నగర్ వద్ద సాగర్ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి(40) మృతదేహన్ని గుర్తించారు. తెలుపు, నలుపు అడ్డగీతల టీషర్ట్, కాటన్ ప్యాంట్తో ధరించిన వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిందని ఖమ్మం టూ టౌన్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు సీఐ బాలకృష్ణ వెల్లడించారు. -
అటు మూత.. ఇటు వెత
ఖమ్మంలోని కాల్వొడ్డు మున్నేరు పాత వంతెనపై రాకపోకలపై నియంత్రణ విధించారు. ఇక్కడ తీగల వంతెన నిర్మాణ పనులతో ప్రతిరోజు ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎలాంటి వాహనాలను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఈ సమయాన వాహనాలను కరుణగిరి బ్రిడ్జి మీదుగా మళ్లించారు. ఫలితంగా బ్రిడ్జిపై రద్దీ నెలకొని వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
కాలేజీల్లో వసతుల కల్పన
● ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.2.96కోట్లు ● అక్టోబర్ 15నాటికి పూర్తిచేసేలా ప్రణాళికఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పన, అవసరమైన మరమ్మతులపై దృష్టి సారించారు. ఈమేరకు జిల్లాలోని 21 కాలేజీలకు గాను 15కళాశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం జిల్లాకు రూ.2.96 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో అమ్మ ఆదర్శ కళాశాలల కమిటీల ద్వారా పనులు చేపడుతున్నారు. ‘అమ్మ’ కమిటీల ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో చేపట్టిన పనులన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యాన చేపట్టారు. కళాశాలల్లోనూ అదే మాదిరి పర్యవేక్షణకు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను నియమించారు. ఈ కమిటీల ద్వారా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పనులు చేపడుతుండగా, కమిటీలతో పాటు గ్రామీణ ప్రాంత కళాశాలల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లోనైతే మున్సిపల్ కమిషనర్లు, విజిలెన్స్ ఆఫీసర్లు, రిసోర్స్ పర్సన్లు పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఈ పనులన్నీ అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 15 కళాశాలల్లో పనులు.. రూ.2.96 కోట్ల నిధులతో జిల్లాలోని 15 జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులు కొనసాగుతున్నాయి. కళాశాలల్లో అవసరమైన చిన్నచిన్న మరమ్మతులతో పాటు టాయిలెట్ల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పన, సైన్స్ ల్యాబ్ల్లో సామగ్రి కొనుగోలు, రంగులు వేయించేందుకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. కాగా, జిల్లాలోని 15 కాలేజీలకు నిధులు మంజూరు కాగా.. అత్యధికంగా కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.30లక్షలు మంజూరయ్యాయి. అలాగే, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.28.6 లక్షలు, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కాలేజీకి రూ.26 లక్షలు, కారేపల్లి కళాశాలకు రూ.20.5 లక్షలు కేటాయించారు.జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అన్ని పనులు అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని నిర్ణయించాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కాలేజీల్లో అవసరాలను గుర్తించి నిధులు వెచ్చించేలా ప్రణాళిక రూపొందించాం. – రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి -
చరిత్రను వక్రీకరిస్తే జాతి క్షమించదు..
ఖమ్మంమయూరిసెంటర్: చరిత్రను వక్రీకరించాలని ఎవరు యత్నించినా తెలంగాణ జాతి క్షమించదని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతపరమైన పోరాటంగా చిత్రీకరించేందుకు బీజేపీ యత్నిస్తోందని.. కానీ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ పోరాటంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను గురువారం ఖమ్మంలో నల్లమల గిరిప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం హేమంతరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచచ్చాక నిజాం స్వాతంత్ర రాజుగా ప్రకటించుకుంటే రావి నారాయణరెడ్డి, ముగ్దుం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన మహత్తర పోరాటంలో సామాన్యులు సాయుధులై ముందుకు సాగారని, నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులయ్యారని చెప్పారు. భూమి, భూక్తి, విముక్తి కోసం సాగిన ఈ పోరాటంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారని తెలిపారు. అయితే, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలనే విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే వైఖరితో ఉండటం దురదృష్టకరమన్నారు. ఈమేరకు నాటి సాయుధ పోరాట ఘట్టాలను నేటి తరానికి తెలియజేసేలా సీపీఐ ఆధ్వర్యాన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు బాగం తెలిపారు. తొలుత అంబేడ్కర్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, కొండపర్తి గోవిందరావు, కార్పొరేటర్ బీజీ.క్లెమెంట్తో పాటు మహ్మద్ సలాం, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకష్ణ. తోట రామాంజనేయులు, మిడికంటి వెంకటరెడ్డి, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.సాయుధ పోరాట వారోత్సవాలను ప్రారంభించిన బాగం -
జీపీఓలు వచ్చేస్తున్నారు..
ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకు గ్రామ పాలనా అధికారులు (జీపీఓ) నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. రెండు రోజుల క్రితం జీపీఓలకు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి నియామకపత్రాలు అందించగా.. కలెక్టరేట్లో బుధవారం రాత్రి వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 380 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిని 299 క్లస్టర్లుగా విభజించారు. అయితే జీపీఓలు 252 మంది ఉన్నారు. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి 13 మంది జిల్లాకు వస్తుండగా.. సుమారు 10 మంది ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 299 క్లస్టర్లకు 252 మంది జీపీఓలు ఉంటుండగా.. 56 మంది జూనియర్ అసిస్టెంట్లను జీపీఓల సేవలకు వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నేడు అందనున్న ఆర్డర్లు.. జీపీఓల కౌన్సెలింగ్ బుధవారం రాత్రి వరకు నిర్వహించగా వారికి గురువారం ఉత్తర్వులు అందించనున్నారు. అయితే గురు, శుక్రవారాల్లో వారు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పైరవీలకు ఆస్కారం లేకుండా పోస్టింగ్లు పైరవీలకు, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మెరిట్ పద్ధతిలో గ్రామ పరిపాలనా అధికారులకు కౌన్సిలింగ్ చేపట్టి, పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పరిపాలనా అధికారులకు నిర్వహించిన కౌన్సెలింగ్లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారులను నియమించిందన్నారు. జిల్లాలో పరీక్ష ద్వారా 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో పోస్టింగ్లు ఇస్తున్నామన్నారు. ప్రజావాణిలో, గ్రామాల సందర్శన సందర్భంగా ఎక్కువగా భూ సమస్యలపైనే దరఖాస్తులు వస్తున్నాయని, వీటిని పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. భూ భారతి చట్టం పటిష్ట అమలుకు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మశ్రీ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు
కల్లూరు: వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిత తెలిపారు. వివరాలిలా.. కల్లూరు మున్సిపాలిటీ పరిధి లోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన కంటిపూడి యోహాన్తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది. కాగా, యోహాన్ ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేస్తుండగా.. తట్టుకోలేక గడ్డిమందు తా గింది. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. దీనిపై మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేయగా యోహాన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘ఇందిరమ్మ’లో ముందంజ
ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు దశల వారీగా ముందుకు సాగుతున్నాయి. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిన విషయం విదితమే. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయగా.. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్ కార్డు గల వారికి తొలి దశలో కేటాయించారు. ఒంటరి మహిళలు, వితంతువులకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో నియోజక వర్గాల వారీగా మొత్తం 16,441 ఇళ్లు మంజూరు కాగా అందులో 13, 242 (81 శాతం) ఇళ్లకు మార్కింగ్ చేయగా, వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోనే జిల్లా టాప్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు, ఇల్లెందు నియోజక వర్గ పరిధిలోని కామేపల్లి మండలం కలుపుకొని మొత్తం 16,441 ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణ పనుల వేగవంతానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. మంజూరైన ఇళ్లలో 13,24 ఇళ్లకు ముగ్గులు పోయగా 7,700 ఇళ్లు బేస్మెంట్ లెవల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,922ఇళ్లు గోడల దశకు వచ్చాయి. 881 ఇళ్లు స్లాబ్ లెవల్కు చేరాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్ మండలంలో నాలుగు ఇళ్లు పూర్తి కాగా, 290 స్లాబ్ లెవల్లో, 638 గోడల లెవల్లో, 1,776 బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. మరో 3,087ఇళ్లు మార్కింగ్ చేసి ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో ఒకటి, వైరా నియోజకవర్గం పరిధిలోని ఏన్కూరు మండలంలో మూడు, కొణిజర్లలో ఒకటి, వైరాలో ఒకటి.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముగ్గు పోసిన వాటిని బేస్మెంట్ స్థాయికి తీసుకొచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కృషి జరుగుతోంది. బేస్మెంట్ స్థాయి దాటితే నిర్మాణ పనుల్లో వేగం పెరుగుతుంది. అనతి కాలంలోనే అన్ని ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. – బి. శ్రీనివాస్, హౌసింగ్ పీడీ నియోజకవర్గం మంజూరైన ముగ్గు బేస్మెట్ గోడల స్లాబ్ పూర్తయిన ఇళ్లు దశ లెవల్ లెవల్ లెవల్ ఇళ్లు ఖమ్మం 3,285 1,557 724 40 10 01 పాలేరు 3,483 3,087 1,776 638 290 04 మధిర 2,792 2,503 1,637 69 89 –– సత్తుపల్లి 3,426 3,138 1,756 817 337 –– వైరా 2,923 2,529 1,585 302 128 05 కామేపల్లి 532 428 222 56 27 –– మొత్తం 16,441 13,242 7,700 1,922 881 10 -
ఫుడ్ పాయిజన్ అంటూ ప్రచారం
కూసుమంచి: మండలంలోని మల్లేపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పాయిజన్ అయిదంటూ సోషల్ మీడియాలో ప్రచారం కాగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రచారంతో ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాంచందర్రావు, ఎంఈఓ బీవీ రామాచారి హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో వండిన ఆకుకూర పప్పు రుచిలో తేడా ఉండటం, సాంబారు పుల్లగా ఉండటంతో పలువురు స్థానిక విద్యార్థులు ఇళ్లకు వెళ్లి భోజనం చేశారు. కాగా, భోజనం రుచిగా లేకపోవటంతో కొందరు విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లి భోజనం చేశారని, అంతేగానీ విద్యార్థులు ఎవరూ అస్వస్థతకు గురికాలేదని ఆర్డీఓ తెలిపారు. కోలాహలంగా ‘కేటీపీఎస్’ ఎన్నికలుపాల్వంచ/మణుగూరురూరల్: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికలు బుధవారం కోలాహంగా జరిగాయి. కేటీపీఎస్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 2,100 మంది సభ్యులకు 1,728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణుగూరులోని బీటీపీఎస్ ఎస్పీఎఫ్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రంలో 500 మంది ఉద్యోగస్తులకు గాను 450మంది ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వైటీపీఎస్లో 396 మంది ఓటర్లకుగాను 367 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్ల ను ఆకర్షించేలా ఫ్లకార్డులు, కరపత్రాలు, గుర్తులను సూచిస్తూ అభ్యర్థులు సందడి చేశారు. పోటీలో ఉన్న 37 మంది డైరెక్టర్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రా ల వద్ద ఉద్యోగులను కలుస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. సొసైటీలో మొత్తం 2,996 మంది ఓటర్లు ఉండగా, 2,545మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు. మొత్తం84.94శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. గుప్త నిధుల కోసం అన్వేషణ!అశ్వారావుపేట: అశ్వారావుపేటలో కొందరు గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు పగటి వేళల్లో లాడ్జిల్లో బస చేస్తూ, అర్ధరాత్రి వేళలో తవ్వకాలను జరిపే ప్రాంతాలను అన్వేషించేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీరి తో పాటు గుప్తనిధుల ముఠాఓ కమాండర్ జీప్లో సంచరిస్తున్నట్లు సమాచా రం. మండలంలో పలు గ్రామాల్లో జీప్ తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అశ్వారావుపేట ఎస్ ఐ యయాతి రాజు దృష్టికి తీసుకువెళ్లగా.. రాత్రిళ్లు తిరిగే వాహనాలు, వ్యక్తులపై నిఘాపెడతామన్నారు. గుప్తనిధు లు వంటి ప్రచారాలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనసాగుతున్న ఆర్టీసీ డ్రైవర్ల నిరసనభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్లు చేపట్టిన నిరసన మూడో రోజు బుధవారం కూడా కొనసాగింది. 42 మంది టిమ్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు 10 సర్వీసులను తగ్గించారు. ఫలితంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు యూని యన్ల నాయకులు జేఏసీగా ఏర్పడి, టిమ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డీఎం తిరుపతిని కోరారు. లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని చెప్పారు. భద్రాచలానికి డిపోనకు చెందిన టిమ్ డ్రైవర్ నాగరాజు పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తోటి డ్రైవర్లు తెలిపారు. కాగా భద్రాచలం డిపోలో సేప్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ (ఎస్డీఐ)గా విధులు నిర్వహిస్తున్న పోకల సురేష్ తన పోస్టుకు మంగళవారం రాత్రి రాజీనామా చేశారు. -
పిడుగుపాటుతో రైతుకు గాయాలు
కామేపల్లి: పిడుగుపాటుతో ఓ రైతు తీవ్రంగా గా యపడిన ఘటనమండలంలో బుధవారం చోటు చేసుకుంది. కొమ్మినేపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ భావ్సింగ్ మిరప తోటలో పని చేస్తుండగా సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలోనే భావ్సింగ్ సమీపంలోనే పిడుగు పడడంతో షాక్ కు గురై కిందపడిపోయాడు. పిడుగు ప్రభావంతో చర్మం కాలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పొరుగున ఉన్న రైతులు అతడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గడ్డిమందు తాగిన వ్యక్తి మృతిఖమ్మంఅర్బన్: గడ్డిమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై బుధవారం ఖమ్మంఅర్బన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన కాటం గోపిరెడ్డి(31) హైదరాబాద్లో ప్రైవేట్ఉద్యోగం చేస్తున్నాడు. మూడురోజుల క్రితం ఆయన గడ్డిమందు తాగగా కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఖమ్మంలోని మమతఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవా రం మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంట్రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. కాగా, ఘటన హైదరాబాద్లో జరిగినందును కేసును అక్కడికి బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. దాడి చేశారని ఫిర్యాదు ఖమ్మంఅర్బన్: చెత్త తరలించే ప్రైవేట్ వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని ఓ వ్యక్తి డయల్ –100కు కాల్ చేయడంతోపాటు సీపీకి సైతం బుధవారం ఫిర్యాదు చేశాడు. నగరంలోని శ్రీనగర్కాలనీ రోడ్డు నంబర్–1లో నివాసం ఉండే రంగిశెట్టి నాగేందర్ ఇంటి పక్కన, సమీపంలో కాలనీవాసులు చెత్త వేస్తుంటారు. ఈ క్రమంలో చెత్త సేకరించే ప్రైవేట్ వాహనంలో వచ్చిన వ్యక్తులు వచ్చి తమకు చెత్త వేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఇలా వేస్తున్నారా? అంటూ అసభ్యకరంగా దూషిస్తూ తనపై, తల్లి ప్రమీలపై దాడికి పాల్పడినట్లు నాగేందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతి
సత్తుపల్లిరూరల్: ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘసటన సత్తుపల్లి మండలం సత్యంపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రుద్రాక్షపల్లి పంచాయతీ సత్యంపేట గ్రామంలో సోయం శివ, సంధ్యారాణి దంపతుల సంవత్సరం వయసు గల కుమార్తె మోక్షదుర్గ.. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ మూతలేని ఇంకుడుగుంతలో పడింది. కుటుంబ సభ్యులు గమనించకపోవడతో కొద్ది సేపటికి చిన్నారి మృతి చెందింది. ఆ తర్వాత చిన్నారి కోసం వెదుకుతుండగా ఇంకుడుగుంతలో మృతదేహం కనిపించింది. కాగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్విజయ్కుమార్ బుధవారం సత్యంపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి చిన్నారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కారు పల్టీ ముదిగొండ: ఖమ్మం – కోదాడ నేషనల్ హైవేపై కారు పల్టీ కొట్టగా ఓ యువకుడికి గాయాలైన ఘటన ముది గొండ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఖమ్మానికి చెందిన ఆసిఫ్ కారులో కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్నాడు. ముదిగొండ సమీపంలో కారు పల్టీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న ఆసిఫ్కు స్వల్ప గాయాలయ్యాయి. -
స్థానిక ఎన్నికల్లో కష్టపడాలి
● రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జిల్లానే కారణం ● ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కారణమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన దళిత విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచేలా తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్లను గెలిపించుకునే బాధ్యత దళితులపై ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతీ దళిత బిడ్డకు అనేక అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దళిత విజయోత్సవ సభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ దిష్టిబొమ్మ దహనం.. రాయ్బరేలిలో లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీపై బీజేపీ దాడిని ఖండిస్తూ పాత బస్టాండ్ ముందు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, రాష్ట్ర కన్వీనర్ దర్జీ చెన్నారావు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు దాసరి దానియేలు, నాయకులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజెండ్ల సాయి కుమార్, సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రేషన్’ సమస్యలుంటే ఫిర్యాదు చేయండి
నేలకొండపల్లి: ఆహార భద్రత కార్డుదారులకు చేరువయ్యేలా కేంద్ర ప్రభుత్వం అన్నా సహాయత కార్యక్రమానిన ప్రవేశపెట్టిందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన రేషన్ దుకాణాలను తనిఖీచేశారు. బియ్యం నాణ్యత ఎలా ఉందని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. అన్నా సహాయత కార్యక్రమంపై అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రేషన్ కార్డుదారులకు ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాట్సాప్ నంబర్ 98682 00445 లేదా టోల్ఫ్రీ నంబర్ 14457 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్లను రేషన్ దుకాణాల వద్ద బోర్డుపై ప్రదర్శించాలని డీలర్లను ఆదేశించారు. అనంతరం నేలకొండపల్లి గురుకుల బాలిక పాఠశాలను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ముదిగొండ మండలంలోని శ్రీ సత్యసాయి రైస్మిల్ను సందర్శించారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఫౌరసరఫరా శాఖ అధికారి చందన్కుమార్ -
అనుమానాస్పద స్థితిలో నానమ్మ, మనవరాలు మృతి
● మంచిర్యాలలో ఘటన ● మృతులు ఖమ్మం జిల్లా వాసులుమంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాలవాడ రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో ఖమ్మం నగరానికి చెందిన బెజ్జాల సత్యవతి(55), ఆమె మనవరాలు గీతశిరీష(4) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇదే ఇంట్లో మూడేళ్ల క్రితం సత్యవతి చిన్న కుమారుడు(టాన్స్జెండర్) శిరీష(24) సైతం అనుమానాస్పదంగా మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ప్రస్తుతం నానమ్మ, మనవరాలు మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల పోలీసులు తెలిపిన వివరాలిలాల.. ఇంటి అమ్మకానికి తీసుకొచ్చి... ఖమ్మం త్రీటౌన్కు చెందిన బెజ్జాల చంద్రయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు గంగోత్రి, వెంకటేష్ ఉండగా.. చిన్న కుమారుడు వెంకటేష్ ట్రాన్స్జెండర్(శిరీష)గా మారి మంచిర్యాలలో స్థిరపడింది. గోపాలవాడ శివారులో రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఓ ఇల్లు నిర్మించుకుని జీవనం సాగించింది. 2022 జనవరి 4న అనుమానాస్పదంగా మృతిచెందింది. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు తరచూ వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఈ నెల 8న గంగోత్రి తన తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషతో కలిసి ట్రాన్స్జెండర్ శిరీష ఇల్లు విక్రయించడానికి మంచిర్యాలకు వచ్చారు. 9న తనకు అస్తమా సమస్య వచ్చిందంటూ గంగోత్రి తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషను ఇక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటి వారికి సమాచారం అందించాడు. స్థానికులు వెళ్లి పరిశీలించగా తలుపులు తీయకపోవడంతో డయల్ 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా సత్యవతి, గీతశిరీష విగతజీవులుగా కనిపించారు. ఈ విషయమై మంచిర్యాల పోలీసులు పలుమార్లు గంగోత్రికి సమాచారం ఇచ్చి రావాలని సూచించినా రాకపోవడంతో ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యా.. ఆత్మహత్యా.. సత్యవతి, గీతశిరీష మరణంపై హత్యా.. ఆత్మహ త్యా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిని విక్రయించడానికి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు ఇక్కడే ఉండడం, ఒక్కరే వెళ్లిపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. -
4,654 ఎకరాల్లో పంటలకు నష్టం
ఖమ్మంవ్యవసాయం : జిల్లాలో ఇటీవల భారీగా కురిసిన వర్షాలతో 3,635 మంది రైతులకు చెందిన 4,654 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు బుధవారం రాత్రి వివరాలు వెల్లడించింది. జిల్లాలో వరి, పత్తి, పెసర, ఉద్యాన పంటలు సాగులో ఉన్నప్పటికీ అత్యధికంగా పెసర పంటకు నష్టం వాటిల్లిందని, ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ. 4.65 కోట్లు పరిహారం అందించాలని నివేదికలో పేర్కొంది. పంట నష్టాలకు సంబంధించిన సమగ్ర నివేదికను వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఆగస్టు మూడు, నాలుగు వారాల్లో నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీనికి తోడు ఎగువన కురిసిన వానలతో నదులు, వాగులు, జలాశయాలు ఉప్పొంగాయి. దీంతో వాటి పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఆరంభం నుంచి క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తర్ణాధికారులు పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి జిల్లా వ్యవసాయ శాఖకు నివేదికలు అందించారు. 10 మండలాల్లో పంటలకు నష్టం భారీ వర్షాలతో చింతకాని, కొణిజర్ల, తల్లాడ, వైరా, కూసుమంచి, కారేపల్లి, కల్లూరు, ఏన్కూరు, రఘునాథపాలెం, బోనకల్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ నివేదికల్లో పేర్కొంది. అత్యధికంగా చింతకాని మండలంలో 1,678 మంది రైతులకు చెందిన 2,255 ఎకరాల్లో, కొణిజర్ల మండలంలో 1,079 మంది రైతులకు చెందిన 1,292 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అధిక విస్తీర్ణంలో పెసరకు.. చేతికందే దశలో ఉన్న పెసర పంటకు అధిక విస్తీర్ణంలో నష్టం వాటిల్లింది. 3,286 మంది రైతులకు చెందిన 4,386 ఎకరాల్లో పెసర పంటకు నష్టం వాటి ల్లగా ఈ పంటకు రూ. 4,38,63,500 పరిహారానికి వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. వరి 137 ఎకరాల్లో, పత్తి 121, మినుము 3, టమాట 2, చిక్కుడు 1.20, కాకర ఎకరం, మిర్చి 30 గుంటల విస్తీర్ణంలో నష్టపోయినట్లు వెల్లడించిన అధికారులు.. ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ. 4,65,44,000 పరిహారానికి నివేదిక అందించారు. -
ఉప్పొంగిన గంగ!
ఖమ్మం సహకారనగర్: గత రెండళ్లుగా భూగర్భ జలాలు పైకి వస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి కూడా జలాలు వస్తుండమే దీనికి కారణమని అంటున్నారు. భూగర్భ జలాలు పెరుగుతున్న క్రమంలో కొంత మేర తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతీనెలా కొద్దికొద్దిగా.. జిల్లాలోని 21 మండలాల్లో గత నాలుగు నెలలుగా భూగర్భ జలాలను పోలిస్తే ప్రతీ నెలలోనూ గతం కంటే ఈ సంవత్సరం పైకి చేరుకున్నాయి. 2024 మేలో 7.30 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ ఏడాది 5.89 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అంటే సుమారు 1.50 మీటర్ల మేర పైకి చేరాయి. గతేడాది జూన్లో సరాసరి 6.99 మీటర్లు ఉంటే ఈ ఏడాది 5.69 మీటర్లకు చేరాయి. 2024 జూలైలో 4.59 మీటర్ల లోతులో ఉంటే ఈ ఏడాది 3.87 మీటర్ల పైకి చేరాయి. గత ఆగస్టులో 3.10 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది ఆగస్టులో 2.72 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుతుండడం విశేషం. అన్ని మండలాల్లోనూ ఆశాజనకమే.. జిల్లాలోని ప్రతీ మండలంలో భూగర్భజలాలు పెరిగాయి. గతంలో ఒకటి, రెండు మండలాల్లో ఎక్కువ ఉండగా.. ఈసారి మాత్రం అన్ని మండలాల్లోనూ ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటే భవిష్యత్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో 3.87 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఆగస్టులో 2.72 మీటర్లకు చేరాయి. దీంతో ఒక్క నెలలోనే సుమారు 1.15 మీటర్ల లోతు భూగర్భజలాలు పైకి చేరాయి. 2025 – 26 సంవత్సరంలో వర్షపాతం 31 శాతం అధికంగా నమోదైంది. అందుకు అనుగుణంగా భూగర్భజలాలు సరాసరి 1.16 మీటర్లు పెరిగాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలి. భూగర్భజలాల సుస్థిరతకు ఇంటింటికీ ఇంకుడు గుంతలు, వ్యవసాయ బోరుబావి దగ్గరలో ఫామ్పాండ్ వంటి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి. – ఎం.రమేష్, జిల్లా భూగర్భజల శాఖాధికారినెల 2024 2025 సరాసరి పెరుగుదల మే 7.30 5.89 1.41 జూన్ 6.99 5.69 1.3 జూలై 4.59 3.87 0.72 ఆగస్టు 3.10 2.72 0.38 -
పరిషత్ లెక్క తేలింది
మండలం మొత్తం పురుషులు మహిళలు ఇతరులు బోనకల్ 36,381 17,611 18,769 01 చింతకాని 41,707 19,987 21,720 0 ఏన్కూరు 27,920 13,390 14,530 0 కల్లూరు 35,530 17,364 18,166 0 కామేపల్లి 35,538 17,436 18,102 0 ఖమ్మంరూరల్ 35,797 17,155 18,640 02 కొణిజర్ల 41,864 20,370 21,493 01 కూసుమంచి 50,149 24,251 25,896 02 మధిర 31,728 15,306 16,419 03 ముదిగొండ 48,554 23,274 25,278 02 నేలకొండపల్లి 49,533 23,691 25,841 01 పెనుబల్లి 43,873 21,342 22,531 0 రఘునాథపాలెం 40,790 19,420 21,366 04 సత్తుపల్లి 36,160 17,424 18,735 01 సింగరేణి 45,411 22,205 23,205 01 తల్లాడ 46,261 22,547 23,713 01 తిరుమలాయపాలెం 50,771 24,557 26,213 01 వేంసూరు 36,992 18,122 18,870 0 వైరా 27,306 13,175 14,130 01 ఎర్రుపాలెం 40,425 19,616 20,808 01 మొత్తం 3,88,243 4,14,425 8,02,690 22జిల్లాలో పరిషత్ ఓటర్లతో పాటు పోలింగ్ స్టేషన్ల లెక్క తేలింది. మొత్తం 8,02,690 మంది ఓటర్లతో పాటు 1,580 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. ఈ వివరాలను బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రకటించారు. ఈనెల 2న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలు వెల్లడించగా.. జీపీల్లో 8,02,691 మంది ఓటర్లు, 5,214 పోలింగ్ స్టేషన్లుగా ఖరారయ్యాయి. హైకోర్టు తీర్పును అనుసరించి ఈనెల 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సమస్య నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోకున్నా అధికారులు మాత్రం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం -
విద్యుత్ సరఫరా, అంతరాయాలపై సమీక్ష
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ సరఫరా, అంతరాయాలపై టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) రాజు చౌహాన్ బుధవారం ఖమ్మంలో విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ సరఫరాలో తీసుకుంటున్న చర్యలు, అంతరాయాలను అధిగిమిస్తున్న విధానం, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్ పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, ప్రమాదాలను నియంత్రించాలని తెలిపారు. సమావేశంలో ఖమ్మం సర్కిల్ ఎస్ఈ శ్రీనివాసా చారి, ఎస్ఏఓ శ్రీధర్, డివిజనల్ ఇంజనీర్లు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రాములు, భద్రు పవార్, టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోరాటస్ఫూర్తికి ప్రతీక.. ఐలమ్మ
ఖమ్మంమయూరిసెంటర్: పోరాట స్ఫూర్తికి ప్రతీకగా వీర వనిత చాకలి ఐలమ్మ నిలుస్తారని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీక అని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి వీర వనితగా చరిత్రలో నిలిచారని కొనియాడారు. అటువంటి వీరవనితను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంఘ సేవకురాలిగా, భూమి, భుక్తి కోసం, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకం అన్నారు. ఆమె ఆశయాలను నేటి తరం వారు కొనసాగించాలని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారిణి జి. జ్యోతి, బీసీ సంఘం నాయకులు తుపాకుల ఎలగొండ స్వామి, నారాయణ, శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, జక్కుల వెంకటరమణ, మిట్టపల్లి శంకర్, గోనెల శివప్రసాద్, గోనెల రవిశంకర్, దాసరి నాగేశ్వరరావు, కె. గోవిందరావు, కె. కొండల రావు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి -
రేపు జాబ్మేళా
ఖమ్మం రాపర్తినగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈనెల 12న నగరంలోని టేకులపల్లి మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్లో ఫార్మసిస్ట్ పోస్టులు 40, ట్రైనీ ఫార్మసిస్ట్ 20, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ 30, రిటైల్ ట్రైనీ 10 పోస్టులకు ఇంటర్వ్యూలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10 గంటలకు జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 2,680 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు పంపిణీ ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్కు బుధవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,680 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ ఎరువును ఖమ్మం జిల్లాకు 1,380, భద్రాద్రి జిల్లాకు 800, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ శాఖ ద్వారా కూపన్లు జారీ చేసి యూరియా పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేయగా.. పోలీసు పహారాలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఖానాపురం చెరువు పరిశీలనఖమ్మంఅర్బన్: నగరంలోని 3, 6 డివిజన్ల మధ్య ఉన్న ఖానాపురం చెరువును జలవనరుల శాఖ అధికారులు బుధవారం సందర్శించారు. చెరువులను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఏయే పనులు చేపట్టాలి, కట్టల పటిష్టత, పూడిక తీత, అలుగుల మరమ్మతులు తదితర అంశాలపై అంచనాలు రూపొదించనున్నట్లు ఆ శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వెంట డీఈ ఉదమ్ప్రతాప్, రైతు సంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు మలీదు మనీష్ తదితరులు ఉన్నారు. డెంగీ బాధితులు కోలుకున్నారునేలకొండపల్లి : జిల్లాలో డెంగీ కేసుల బాధితులంతా కోలుకున్నారని, ఎలాంటి ప్రమాదం లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ డి.కళావతిబాయి అన్నారు. నేలకొండపల్లి పీహెచ్సీని, చెరువుమాధారం, పైనంపల్లి ఉప కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 3.11లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించి, 7.45 లక్షల మందికి వైద్య పరీక్షలు చేశామని తెలిపారు. ఇందులో 3,712 మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. జిల్లాలో 155 డెంగీ కేసులు నమోదు కాగా.. వారంతా రికవరీ అయ్యారని తెలిపారు. చికున్ గున్యా, మలేరియా కేసులు లేవని చెప్పారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చెరువుమాధారానికి తరలించే విషయం ప్రస్తుతానికి లేదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్.ఆర్.శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐల బదిలీ ఖమ్మంక్రైం: జిల్లాలో ఇద్దరు ఎస్ఐలను బదిలీచేస్తూ సీపీ సునీల్దత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం టూటౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న సంధ్యను ఏన్కూరుకు, అక్కడ పనిచేస్తున్న ఉపతల రఫీని ఖమ్మం వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పనుల్లో జాప్యాన్ని సహించం
● మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు వేగవంతం చేయాలి ● కలెక్టర్ అనుదీప్ఖమ్మంఅర్బన్/రఘునాథపాలెం: నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం తగదని సూచించారు. ప్రారంభానికి ముందే అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యత లోపం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. రూ. 200 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల డిజైన్ కూడా మంచి మోడల్గా ఉండాలని, వాస్తును పాటిస్తూ అకరణీయంగా ఉండేలా తీర్చి దిద్దాలని అన్నారు. గురుకుల పాఠశాల నిధులు తన అకౌంట్లో నిల్వ ఉన్నాయని, బిల్లుల జాప్యం పేరుతో పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదని అన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తామని, పార్ట్ బిల్లు చేసిన 24 గంటల్లో చెల్లిస్తామని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్, రహదారుల వంటి పనులు సైతం పూర్తి చేయాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాల ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. మెడికల్ కళాశాలలో ఇప్పటి వరకు రూ. 45 కోట్ల విలువైన పనులు పూర్తి చేయగా రూ.15 కోట్ల బిల్లులు అందించామని చెప్పారు. కాలేజీలో అంతర్గత రహదారులు, ప్రహరీ, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ పవార్, డీఈ లక్ష్మీనాయక్, ఏఈఈ లలిత, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం తహసీల్దార్లు సైదులు, శ్వేత, ఎంఈఓ రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. జవాబుదారీతనంతో పనిచేయాలి ఖమ్మం సహకారనగర్ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన పైలట్ ప్రజావాణి కార్యక్రమం తరహాలో మధిర నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లోనూ నిర్వహణకు కార్యాచరణ చేపట్టామని, ఈ కార్యక్రమం అమలులో అధికారులు జవాబుదారీగా ఉండాలని అన్నారు. మండల స్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ పైలట్ ప్రజావాణి కా ర్యక్రమం కింద మండల కేంద్రంలోని ఐఎఫ్సీ సెంటర్లో సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి రశీదు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, అధికారులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కరీనా, శ్రీహర్ష, అఖిల్ సూర్య పాల్గొన్నారు.ఖమ్మంమయూరిసెంటర్: నగరంలో లేఔట్ అనుమతుల జారీ అంశంలో నిబంధనలు పాటించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన లేఔట్ కమిటీ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేర భూమి లే ఔట్ లో కేటాయించేలా అధికారులు పరిశీలించాలని అన్నారు. నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, సుడా సీపీఓ, పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, ఈఈ తానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడపడుచులకు బతుకమ్మ కానుక
● ఎస్హెచ్జీల సభ్యులకు రెండేసి చీరలు ● జిల్లాకు 3.35 లక్షలు చీరల కేటాయింపు ● విడతల వారీగా వస్తున్న స్టాక్ ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు కానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం తరఫున చీరలు పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన సిద్ధమైన చీరలను విడతల వారీగా జిల్లాకు చేరవేస్తున్నారు. బతుకమ్మ వేడుకల ప్రారంభానికి ముందే వీటిని అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి ఒకటి.. తర్వాత ఇంకొకటి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం 3,35,878 చీరలు కేటాయించారు. సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యులకు రెండేసి చీరలు పంపిణీ చేస్తారు. బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందు ఒకటి.. వేడుకలు మొదలయ్యాక ఇంకొకటి అందించనున్నట్లు సమాచారం. తొలిదఫా ఇవ్వాల్సిన సుమారు 1.50 లక్షల చీరలు ఇప్పటికే చేరగా, మిగిలినవీ వారం రోజుల్లో వచ్చే అవకాశముంది. జిల్లాలో 20 మండల సమాఖ్యలు, 1,018 గ్రామ సమాఖ్యలు, 26వేల స్వయం సహాయక సంఘాల్లో 2లక్షలకు మందికి పైగా సభ్యులు ఉన్నారు. స్టాక్ పాయింట్లలో నిల్వ జిల్లాకు చేరుకున్న చీరలను అధికారులు స్టాక్ పాయింట్లలో భద్రపరుస్తున్నారు. రఘునాథపాలెం(టేకులపల్లి జిల్లా మహిళా సమాఖ్య ప్రాంగణం), వైరా, మధిర మార్కెట్ల గోదాంలు, సత్తుపల్లి మండల సమాఖ్య కార్యాలయంలో డంప్ చేస్తున్నారు. అలాగే, మెప్మా పరిధిలోని సంఘాల సభ్యుల చీరలను ఆ విభాగం అధికారులకు అప్పగిస్తారు. బతుకమ్మ పండుగను మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా జరుపుకునేలా వేడుకలు ప్రారంభమయ్యేలోగానే చీరల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చీరలను ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి ఇవ్వనున్నారు. ఆ సంచిపై ఇందిరాగాంధీ ఫొటో, ఇందిరా మహిళా శక్తి పేరిట లోగోతో పాటు ‘అక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ అని రాసి ఉంది. అలాగే, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రుల ఫొటోలు ముద్రించారు.యూనిఫామ్ శారీస్ కింద జిల్లాకు ప్రభుత్వం చీరలు సరఫరా చేస్తుంది. ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి వీటిని మహిళా సంఘాల సభ్యులకు అందజేయనున్నాం. ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు, విధివిధానాలు రాగానే పంపిణీపై స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన చీరలను గోదాముల్లో భద్రపరుస్తున్నాం. – సన్యాసయ్య, డీఆర్డీఓ -
ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యం
ఎర్రుపాలెం: మారుమూల గ్రామాల్లోని ప్రజల అవసరాలు తీరుస్తూ, మౌలిక వసతులు కల్పించి జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో భట్టి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 50ఏళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మధిరను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం సుడిగాలి పర్యటన ఎర్రుపాలెం మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని అయ్యవారిగూడెం, ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బనిగండ్లపాడు బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో రూ.4 కోట్ల ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. పెద్దగోపవరం, భీమవరంలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. బనిగండ్లపాడులో భోజన విరామం అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డి, డీపీఓ ఆశాలత, ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి, తహసీల్దార్ ఉషాశారదతో అభివృధ్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఇక బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని ఇనద్రమ్మ చెరువును కలెక్టర్ అనుదీప్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్లతో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు. అక్కడకు వెళ్లే రహదారి ఇటీవల వర్షాలతో బురదమయంగా మారడంతో ట్రాక్టర్పై వెళ్లారు. ఇనద్రమ్మ చెరువును పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆతర్వాత జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్లను ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మతో కలిసి భట్టి ఆవిష్కరించారు. ఈకార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, నాయకులు యరమల పూర్ణచంద్రారెడ్డి, అనుమోలు కృష్ణారావు, తల్లపురెడ్డి నాగిరెడ్డి, మల్లెల లక్ష్మణరావు, శీలం వెంకట్రామిరెడ్డి, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఇసుక బజార్లు !
● ఇందిరమ్మ లబ్ధిదారులకు పంపిణీ కోసం ఏర్పాటు ● ఒక్కో ఇంటికి 10 ట్రాక్టర్ల ఇసుక ఇచ్చేలా నిర్ణయం ● టన్ను రూ.1,100 ధరతో విక్రయంఖమ్మంగాంధీచౌక్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఇసుక బజార్లు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇసుక ధరలు ఎక్కువగా ఉండడమే కాక వర్షాకాలం కావటంతో పలు ప్రాంతాల్లో సరిపడా లభించడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సమస్య ఎదురై ఆలస్యమవుతోంది. కొన్నిచోట్ల ధరల కారణంగా లబ్ధిదారులు నిర్మాణాలు నిలిపివేశారు. ఈ నేపథ్యాన ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇసుక బజార్ ఏర్పాటుచేయనున్నారు. తొలి బజార్ కూసుమంచిలో... ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను టన్ను రూ.1,100 చొప్పున లబ్ధిదారులకు ఇసుక బజార్ల ద్వారా అందిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 10 టాక్టర్లు(40 టన్నులు) ఇసుక అందించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు తొలి ఇసుక బజార్ను కూసుమంచిలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కాగా, లబ్ధిదారులు గృహ నిర్మాణ శాఖ ఏఈ నుంచి ఇండెంట్ పొంది తహసీల్దార్కు అందిస్తే వారు కూపన్ల జారీ చేస్తారు. ఈ కూపన్ల ఆధారంగా ఇసుకను తీసుకోవచ్చు. లబ్ధిదారులే ట్రాక్టర్ తెచ్చుకోవాల్సి ఉండగా.. నిర్వాహకులు కాంటా పెట్టి అప్పగిస్తారు. కాగా, నగదు ఆన్లైన్లో చెల్లించేలా ఏర్కాపట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇసుక బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో ఇప్పటికే పాలేరు నియోజకవర్గ బజార్ను కూసుమంచిలో ఏర్పాటుచేశారు. ఇక ఖమ్మం నియోజకవర్గానికి ఎన్ఎస్పీ క్యాంపులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలతో పాటు ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కామేపల్లి మండలంలో కూడా ఇసుక బజార్ ఏర్పాటుకు నిర్ణయించారు. వీటిలో గోదావరి ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తారు. కాగా, మహిళా సంఘాల సభ్యులు ఇళ్లు నిర్మించుకుంటే టన్ను రూ.1,300 చొప్పున ఇసుక కొనుగోలుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. -
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత
● ప్రజలు మెచ్చేలా ప్రభుత్వ పాలన ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికూసుమంచి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో గ్రామపంచా యతీ భవనాన్ని మంగళవారం ప్రారంభించిన మంత్రి.. కిష్టాపురం, జుజుల్రావుపేటల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన బూట్లు, సాక్సుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కాటమయ్య కిట్లు, క్రైస్తవ మహిళలకు కుట్టుమిషన్లు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. అన్ని హామీలు అమలుచేస్తాం ఎన్నికల వేల ఇచ్చిన హామీలన్నీ అమలుచేసేలా ముందుకెళ్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్థిక భారం ఉన్నా దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, ఎన్నడూలేని విధంగా 7.5 లక్షల తెల్లరేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో పథకాలు మరింత జోరందుకోనున్నందున ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి కోరారు. యూరియా పంపిణీలో సమస్యలు రావొద్దు పాలేరు నియోజకవర్గంలో యూరియా పంపిణీలో సమస్యలు రాకుండా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి యూరియా పంపిణీపై సమీక్షించిన ఆయన పీఏసీఎస్ల ద్వారా పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఈనెల 3నుంచి ఇప్పటి వరకు 610 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామని అధికారులు చెప్పగా, భవిష్యత్లో ఇదే కొనసాగించాలని సూచించారు. కాగా, జీపీఓలుగా నియమితులైన పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు మంత్రిని కలిసి తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలి పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ పేరు నిలబెట్టేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు నిజాయితీగా, చిత్తశుద్ధితో సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ నరసింహారావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్రెడ్డి, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, బీసీ సంక్షేమాధికారి జ్యోతి, పాలేరు ప్రత్యేకాధికారి రమేష్, డీఎల్పీఓ రాంబాబు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ రాంచందర్రావు, సీఐ సంజీవ్, ఏడీఏ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
ఖమ్మంక్రైం: ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ సూచించారు. రాజీమార్గాన్ని రాజ మార్గంగా భావించాలని.. లోక్ అదాలత్లో ఇరువర్గాలు పరస్పర అంగీకారానికి వస్తే సత్వర పరిష్కారం పొందొచ్చని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసుల్లో కక్షిదారులు రాజీపడే అవకాశం ఉందని వెల్లడించారు. చిన్న కేసులతో సమయం, డబ్బు వృథా కావడమే తప్ప ఎలాంటి ఫలితం ఉండదని తెలిపారు. ఈమేరకు లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో సీపీ విజ్ఞప్తి చేశారు. కాగా, పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బంది రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాలు లోక్అదాలత్కు హాజరయ్యేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచనలు చేశామని తెలిపారు. గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా అవగాహన రఘునాథపాలెం: ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి సూచించారు. పథకంపై రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజుల పాటు ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం డీడీ మాట్లాడుతూ పూర్తిగా వెనుకబడిన గిరిజన గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను 2028 నాటికి చేరవేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వాల ద్వారా అమలయ్యే పథకాల లబ్ధిని గిరిజనులు అందుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఎంపీడీఓ అశోక్కుమార్, ఏఓ నారాయణరెడ్డి, ట్రెయినర్లు బాలు, జ్యోతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు ఖమ్మంఅర్బన్: జిల్లాలో జలవనరుల శాఖ పరిధిలో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా అంచనాల ప్రకారం కొనసాగించాలని క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ సీ.హెచ్.బుచ్చిరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలో మున్నేటి వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణం, సీతారామ ప్రాజెక్టు 14, 15వ ప్యాకేజీ పనులతో పాటు వైరా రిజర్వాయర్ పరిధిలోని పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల నాణ్యతను తనిఖీ చేసిన సీఈ అవసరమైన మార్పులపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఈఈ రమణ, డీఈ చంద్రమోహన్, జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ బాబురావు, డీఈ ఉదయప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం: కలెక్టర్
ఖమ్మం సహకారనగర్: ప్రజా చైతన్యమే లక్ష్యంగా మహాకవి కాళోజీ నారాయణరావు రచనలు చేశారని, సాహితీవేత్తగా సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ అని, తెలంగాణ వైతాళికుడిగా నిలిచారని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, డీఎంహెచ్ఓ కళావతిబాయి, సీపీఓ ఏ.శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్బాబు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పడిపోతున్న కార్మికుల జీవన ప్రమాణాలు’
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధానిగా మోడీ ఇంకొన్నాళ్లు కొనసాగితే కార్మికుల కనీస జీవన ప్రమాణాలు మరింత పడిపోతాయని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ల (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన జిల్లా నాలుగో మహాసభలో ఆయన మా ట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్లకు అప్పగిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పది గంటల పనివిధానం తీసుకురావడం గర్హనీయమని పేర్కొన్నారు. కీలకమైన రవాణా రంగంపై పాలకులు చిన్నచూపు విడనాడకపోతే సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాగా, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటోడ్రైవర్లకు నెలకు రూ.12 వేలు, డ్రైవర్లకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.అనంతరం సంఘం నూతన అధ్యక్షుడిగా వై విక్రమ్, కార్యదర్శిగా జిల్లా ఉపేందర్, కోశాధికారిగా ధరావత్ రాందాస్తోపాటు 31 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.విష్ణు, నాయకులు పి.మోహన్రావు, బాబు తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిజానికి అంతం లేదు..
సూపర్బజార్(కొత్తగూడెం): కమ్యూనిజానికి అంతం లేదని.. కమ్యూనిస్టులు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభను పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా అధ్యక్షతన నిర్వహించారు. సురవరం చిత్రపటానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు పలు పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ సురవరం విద్యార్థి దశ నుంచే కమ్యూనిజాన్ని నమ్మి నిరంతర పోరాటాలు చేశారని తెలిపారు. కాగా, 2026 మార్చి వరకు మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటన సరికాదని, మావోయిస్టు ప్రతి రక్తపు బొట్టు నుంచి తిరిగి ఉద్భవిస్తారని వ్యాఖ్యానించారు. వివిధ పార్టీల నాయకులు బాగం హేమంతరావు, ఆవునూరి మధు, అన్నవరపు సత్యనారాయణ, నాగా సీతారాములు, కంచర్ల చంద్రశేఖర్రావు, కకె.అనంతరాములు, ఎస్.అనుదీప్, పసుపులేటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
రావోజీతండా వాసికి డాక్టరేట్
కారేపల్లి: కారేపల్లి మండలం రావోజీ తండా గ్రామానికి చెందిన గుగులోతు నెహ్రూ ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి బాపట్ల వ్యవసాయ కళాశాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. వేరుశనగ సాగులో అధిక దిగుబడి, తెగుళ్ల నివారణపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. కాగా, నెహ్రూ తల్లిదండ్రులు రాందాస్, భద్రి వ్యవసాయం చేస్తుండగా.. రైతుల కుటుంబాలకు మేలు జరిగేలా మరిన్ని పరిశోధనలు చేయడమే తన లక్ష్యమని తెలిపారు. జాబ్ మేళాలో 15 మంది ఎంపిక ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ మంగళవారం నిర్వహించిన జాబ్మేళాకు 56 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా 15మంది ఎంపికయ్యారు. జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ జాబ్మేళాను పర్యవేక్షించారు. అప్రమత్తతోనే సీజనల్ వ్యాధులు దూరంబోనకల్: ప్రజలు ఇళ్లలోనే కాక పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యా ధులు దరిచేరవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా ధికారి కళావతిబాయి తెలిపారు. మండలంలోని ముష్టికుంట్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఇటీవల వర్షాలతో ఉపకేంద్రంలో నీరు నిలిచిందని, గ్రామంలోనూ డ్రెయినేజీలు లేక రోడ్లపై మురుగు నీటి ప్రవాహంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని ఉద్యోగులు చెప్పారు. ఈమేరకు ఫ్రై డే – డ్రై డే, శానిటేషన్ పనులపై పంచాయతీ కార్యదర్శి సైదులుకు డీఎంహెచ్ఓ సూచనలు చేశారు. అంతేకాక దోమల నివారణ, ఇతర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డీపీఓ ఎం.దుర్గ, వైద్యాధికారులు స్రవంతి, ప్రియాంక, ఉద్యోగులు పాల్గొన్నారు.