breaking news
Khammam District Latest News
-
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కల్లూరురూరల్: ఉద్యానవన శాఖ అందిస్తున్న పలు పథకాలు, రాయితీలను రైతులు వినియోగించుకోవాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎంవీ మధుసూదన్ కోరారు. కల్లూరు మండలంలోని హనుమాన్తండాలో బానోతు రాందాస్ మామిడి తోటను బుధవారం తనిఖీ చేశారు .ఫ్రూట్ బ్యాగులను పరిశీలించారు. మామిడికాయలకు ఫ్రూట్ బ్యాగులను కట్టడం ద్వారా కాయ నాణ్యత పెరుగుతుందని చీడపీడల నుంచి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం పెద్ద కోరుకొండిలో రైతు దేవభక్తిని రవి ఆయిల్పామ్ తోటను సందర్శించారు. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్పామ్, డ్రిప్ ఇరిగేషన్ ప్లాస్టిక్ క్రేట్స్, నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి నగేశ్, ఆయిల్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్, స్కిప్పర్ కంపెనీ ప్రతినిధులు నరేశ్, సుమన్, రైతులు పాల్గొన్నారు. -
ఎరువుల బస్తా రూ. 2 వేలు
బూర్గంపాడు: కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. వానాకాలం సీజన్ కంటే బస్తాకు రూ. 150 నుంచి రూ. 250 వరకు పెరిగాయి. వానాకాలం సీజన్ మాదిరే ప్రస్తుత యాసంగిలోనూ సరిపడా యూరియా దొరకటం లేదు. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి వస్తోంది. ధరలు అమాంతం పెరిగిపోవటంతో ఆర్థికభారం పడుతోంది. ఎకరాకు రూ. 2వేల వరకు పెట్టుబడి పెరుగుతోంది. నియంత్రణ చర్యలతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల సాగులో యూరి యా వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం యూరియా ధరలో రాయితీని భరి స్తోంది. యూరియా అధికంగా వినియోగంతో పొలా ల్లో భూసారం దెబ్బతింటోందని వ్యవసాయ అధికా రులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అటు రాయితీ భారం, ఇటు భూసారం దెబ్బతింటున్నాయనే కారణంతో ప్రభుత్వం యూరియా సరఫరాలో నియంత్రణ విధించింది. రాష్ట్రాలకు సరఫరా చేసే యూరియాలో కోతలు పెడుతోంది. వానాకాలం సీజన్లో రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడ్డారు. యాసంగి సీజన్లో అలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం యూరియా విక్రయాల కోసం ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్, సాంకేతిక సమస్యలతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవటం, ఓటీపీలు చెప్పటం రానటువంటి రైతులు యూరియాపై ఆశలు వదులుకుంటున్నారు. ఎక్కువ ధరలైనా కాంప్లెక్స్ ఎరువులు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎరువుల దుకాణాల వద్దకు వెళితే ధరల షాక్ కొడుతోంది. 5.40 లక్షల బస్తాలు అవసరం జిల్లాలో యాసంగి సీజన్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. కనీసంగా ఎకరాకు మూడు బస్తాల చొప్పున కాంప్లెక్స్ ఎరువులు వినియోగించిన 5.40లక్షల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. బస్తాకు రూ.200 చొప్పున పెరిగిన ధరలతో జిల్లా రైతులపై రూ 10.80 కోట్ల భారం పడుతుంది. అటు యూరియా దొరకక, ఇటు కాంప్లెక్స్ కొనలేక రైతులు అగచాట్లు పడుతున్నారు. కాంప్లెక్స్ ధరలను కొంతమేర తగ్గించి పెట్టుబడి భారం తగ్గించాలని రైతులు కోరుతున్నారు. బస్తాకు రూ.150కి పైగానే... వానాకాలం సీజన్లో రూ.1,900 ఉన్న 14:35:14 ఎరువుల బస్తా ప్రస్తుతం రూ.2,150కు పెరిగింది. రూ. 1,300 ఉన్న 20:20:013 కాంప్లెక్స్ ఎరువు బస్తా ప్రస్తుతం రూ.1,475కు చేరింది. నెల క్రితం వరకు రూ.1,800 ఉన్న 28:28:0:13 బస్తా ధర ప్రస్తుతం రూ.1,950కు చేరింది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా బస్తాకు రూ.150 నుంచి రూ.250 వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రాయితీతో డీఏపీ ఎరువు మాత్రం రైతులకు ప్రస్తుతం రూ.1,450కు అందుతోంది. పొటాష్, కాల్షియం ఎరువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. వ్యవసాయం చేసేదెట్టా అని రైతుల ఆవేదన కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగటంతో వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల ధరలను తగ్గిస్తేనే రైతులు కోలుకునే పరిస్థితులుంటాయి. – మల్లికంటి వెంకటేశ్వర్లు, రైతు, భాస్కర్నగర్వానాకాలం 14:35:14 బస్తా ధర రూ.1850కు కొన్నాం. ఇప్పుడు అదే బస్తా ధర రూ. 2,150 చేరింది. పెరిగిన ధరలతో కాంప్లెక్స్ బస్తాలు కొనలేకపోతున్నాం. యూరియా ఆలైన్ బుకింగ్తో ఇబ్బందులు పడుతున్నాం. – బాసిబోయిన గంగరాజు, రైతు, బూర్గంపాడు -
గ్రంథాలయ పన్నులపై దృష్టి పెట్టాలి
ఖమ్మంగాంధీచౌక్: వివిధ సంస్థల నుంచి గ్రంథాలయాలకు రావాల్సిన పన్నులపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్ డాక్టర్ పి శ్రీజ సూచించారు. ఐడీఓసీలో బుధవారం నిర్వహించిన సంస్థ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గ్రంథాలయాల నిర్మాణాలు, భవనాల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. కాగా, 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ సంచాలకులకు పంపించేందుకు సమావేశం అనుమతించింది. కార్యక్రమంలో డీఈఓ చైతన్య జైనీ, డీపీఓ రాంబాబు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కె.కరుణకుమారి, గ్రంథాలయ ఉద్యోగులు భాస్కర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. సదరమ్ విభాగంలో పరిశీలన.. ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పపత్రిలోని సదరమ్ విభాగాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. కార్యాలయంలోని పలు గదులతో పాటు దివ్యాంగులు కూర్చునేందుకు నిర్మించిన భవనాన్ని తనిఖీ చేశారు. చిన్నచిన్న పనులేమైనా ఉంటే త్వరతగతిన పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట పెద్దాసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్ ఉన్నారు. దివ్యాంగుల వినతి.. పెద్దాస్పత్రిలో పార్కింగ్ కాంట్రాక్ట్ను కొనసాగించేలా చూడాలని స్తంభాద్రి వికలాంగుల సమాఖ్యఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తమ సమాఖ్య ద్వారా ఆస్పత్రిలో 17 ఏళ్లుగా పార్కింగ్ నడుపుతున్నామని, దీనిపై 13 మంది ఆధారపడి జీవిస్తున్నామని విన్నవించారు. తమ సమాఖ్య కాంట్రాక్ట్ గడువు తీరిపోతున్నందున టెండర్లు పిలవకుండా తమనే కొనసాగించాలని వేడుకున్నారు. కాగా, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆమె దివ్యాంగులకు సూచించారు. -
లక్ష్యానికి ఆమడదూరంలో...
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల సభ్యులు సొంత వ్యాపారంతో ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం రుణాలు అందజేస్తోంది. తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాక కుటుంబ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, మరికొందరికి ఉపాది కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇలా ఇప్పటికే జిల్లాలోని పలు స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే, ఈ విషయంలో సభ్యులను ప్రోత్సహించడంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు వెనుకబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో అర్హులైన 18,924 మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రుణాలపై ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. సభ్యులు బ్యాంకుల్లో చేస్తున్న పొదుపు ఆధారంగా అవసరమైన రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నిర్దేశించిన రూ.1,047.46కోట్ల లక్ష్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసే దశకు చేరుతున్నా 8,858 సంఘాలకురూ.811.24 కోట్ల రుణాలు ఇవ్వడం గమనార్హం. మరో 40రోజులే గడువు ఈ ఏడాది జిల్లాలో 18,924 సంఘాలు బ్యాంక్ లింకేజీ రుణాలకు అర్హత ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. ఆయా సంఘాలకు రూ.1,047.46 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో జిల్లా అధికారులు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని టర్మ్ లోన్, సీసీఎల్ లోన్లు మంజూరు చేయిస్తున్నారు. అయినా ఇప్పటి వరకు 8,858 సంఘాలకు రూ.811.24 కోట్లు రుణాలే ఇవ్వగలిగారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 40 రోజుల గడువు ఉండగా.. ఇప్పటి వరకు 77.45 శాతం లక్ష్యాన్నే చేరడం గమనార్హం. గత రెండు, మూడేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంటున్నా ఈసారి కూడా లక్ష్యం మేర రుణాలు ఇప్పించడంలో అధికారులు విఫలమయ్యారు.మండలం ఎస్హెచ్జీల రుణం సంఖ్య (రూ.కోట్లలో) తిరుమలాయపాలెం 646 56.64 ఎర్రుపాలెం 374 52.05 రఘునాథపాలెం 670 52.16 నేలకొండపల్లి 467 50.19 ముదిగొండ 499 48.41 కూసుమంచి 606 47.76 వేంసూరు 439 42.99 తల్లాడ 436 41.91 చింతకాని 524 41.49 సింగరేణి 442 39.72 పెనుబల్లి 447 38.47 మధిర 404 38.28 ఖమ్మంరూరల్ 334 38.08 కొణిజర్ల 379 36.98 కామేపల్లి 328 35.08 కల్లూరు 348 34.50 వైరా 367 30.03 ఏన్కూరు 347 30.19 బోనకల్ 380 28.96 సత్తుపల్లి 421 27.25ఎస్హెచ్జీలకు రుణ పంపిణీలో జాప్యం ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో మాత్రమే హడావుడిగా మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేస్తున్న అధికారులు ఆ తర్వాత పూర్తిగా పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కొన్ని సంఘాలకే చెక్కులు మంజూరు చేయించగా, ఆతర్వాత పట్టించుకోలేదని సమాచారం. అంతేకాక ప్రభుత్వానికి గతనెలలో సమర్పించిన నివేదికలో ఎక్కువ రుణాలు ఇచ్చినట్లు పొందుపర్చారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక గత 6వ తేదీకే రుణ మంజూరు లక్ష్యాలను అధిగమించినట్లు చూపించారు. -
సస్యరక్షణతో చీడపీడల నివారణ
ఇల్లెందురూరల్: మామిడిలో సమగ్ర సస్యరక్షణతో చీడపీడలను నివారించుకోవచ్చని ఇల్లెందు హార్టికల్చర్ అధికారి బి.స్రవంతి సూచించారు. మామిడిలో పూత దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఆమె పలు సూచనలు చేశారు. మామిడిలో పూతను కాపాడుకోవడానికి సరైన సమయంలో మందులు పిచికారీ చేయాలని సూచించారు. రసం పీల్చు పురుగు, బూడిద తెగులు నివారణతో మొగ్గలు రావడానికి, అవి విచ్చుకోవడానికి లీటరు నీటికి 2 మి.లీ. మోనోకొటోఫాస్, 3 గ్రాములు వెట్టబుల్ సల్ఫర్, 10 గ్రాములు 19:19:19 కలిపి పిచికారీ చేయాలన్నారు. తెల్లపూత దశలో మందులు పిచికారీ చేయొద్దని, నీటి తడులు అందించొద్దని సూచించారు. పురుగు పూతను గూడుగా ఏర్పర్చుకొని, పూతను తిని పిందెలు ఏర్పడకుండా చేస్తుందన్నారు. ఈ పురుగు నివారణకు క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పూల గుత్తులపై పిచికారీ చేయాలని చెప్పారు. చల్లని రాత్రులు, వెచ్చని పగటి వాతావరణంలో పువ్వు కాడలపై, పూల మీద తెల్లని పొడ లాంటి బూజు ఏర్పడుతుందని, దీని నివారణకు పూలమొగ్గలు కనిపించిన దశలో లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేయాలన్నారు. పూత దశలో బూడిద తెగులు కనిపిస్తే లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మిలీ లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా డైనోకాప్ 1 మి.లీ చొప్పున కలిపి పూత కాడలు తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు. పూత మాడు తెగులు నివారణకు మొగ్గ బయటకు వచ్చే దశలో 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్, పచ్చిపూత మీద 1 గ్రాము కార్భండాజిమ్ లేదా 1 గ్రాము ఽథయోఫినైట్ మిథైల్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. -
పిల్లలను దండించారని ఆందోళన
సత్తుపల్లిరూరల్: స్కూల్కు విద్యార్థులు రాలేదని ప్రధానోపాధ్యాయురాలు దండించడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టిన ఘటన సత్తుపల్లి మండలం రేజర్లలో బుధవారం చోటుచేసుకుంది. రేజర్ల హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి అనంతరం సోమవారం పలువురు విద్యార్థులు స్కూల్కు రాలేదు. వారిని మరుసటి రోజు హెచ్ఎం నాగమణి దండించింది. దీంతో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి హెచ్ఎం, ఎంఈఓ నక్కా రాజేశ్వరావుతో వాగ్వాదానికి దిగారు. పిల్లల్ని వాతలు తేలేదాక కొట్టాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ పాఠశాలలో విచారణ నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ విచారణ -
‘రంజాన్’ ఆగయా..
● నేటి నుంచి ముస్లింల ఉపవాస దీక్షలు ● నెలవంక దర్శనంతో ప్రారంభమైన వేడుకలు ● సుందరంగా ముస్తాబైన మసీదులుసత్తుపల్లి: ముస్లింలకు ప్రీతిపాత్రమైన రంజాన్ మాసం వచ్చేసింది. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని వారి విశ్వాసం. ముస్లింలు విధిగా రోజా(ఉపవాసం) పాటించడంతో పాటు ఈ నెలంతా ఖురాన్ పఠనంలో గడుపుతారు. 30 రోజులు ఉపవాస దీక్షలు ఆచరించిన వారు అల్లాహ్ అనుగ్రహం పొందుతారని వారి నమ్మకం. ఈ మాసంలో ఏదైనా పుణ్య కార్యక్రమం చేస్తే 70 రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. రోజా(ఉపవాసం) ఆచరించే సమయంలో చెడు మాట్లాడకుండా, దురాలోచనలు దరి చేరకుండా అల్లాహ్ స్మరణలో ఉండాలని, సర్వేంద్రియాలు అదుపులో ఉంచుకోవాలని మత పెద్దలు సూచిస్తున్నారు. ఉపవాస దీక్షలు ఇలా.. పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ముస్లింలంతా ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. సూర్య కిరణాలు పడకముందే అన్నపానీయాలు పూర్తి చేసి, సూర్యాస్తమయ సమయాన ఉపవాస దీక్షలు విరమిస్తారు. కాగా, గురువారం తెల్లవారుజామున 5.12 గంటలకు ఉపవాస దీక్ష ప్రారంభమై సాయంత్రం 6.18 గంటలకు ముగుస్తుంది. ప్రాంతాలను బట్టి కొన్నిచోట్ల ఈ వేళలు 5 నుంచి 7 నిమిషాల వ్యత్యాసంతో ఉంటాయి. రంజాన్ విశిష్టత.. రంజాన్ నెలను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి పదిరోజులు రహమత్కే రోజాలు(కరుణ కురిపించే), రెండో పదిరోజులు మగఫిరత్కే రోజాలు (పాపాల నుంచి క్షమాపణ పొందే దినాలు), చివరి పది రోజులు జహున్నుమ్సే ఝాట్కారే రోజాలు(నరకదండన నుంచి విముక్తి కోరే దినాలు)గా పిలుస్తారు. చివరి పదిరోజులు ఇతెఖాఫ్(మసీద్లో అల్లాహ్నామ స్మరణ చేసుకుంటూ గడపటం) పాటిస్తారు. తరావీహ్ నమాజ్.. రంజాన్ నెలవంక కనిపించగానే ప్రతి రోజు ఇషా నమాజ్ తర్వాత ‘తరావీహ్’ నమాజ్ ఆచరిస్తారు. కేవలం రంజాన్ నెలలోనే తరావీహ్ నమాజ్ చేస్తారు. 20 రకాతులు నమాజ్లో ఖురాన్ పఠనం ఉంటుంది. రాత్రి 8.30 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు తరావీహ్ నమాజ్ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. దీని ద్వారా రోజేదార్(ఉపవాస దీక్షాపరుడు) ఖురాన్ పఠనం వినడం వల్ల చదివినంత పుణ్యఫలం వస్తుందని ముస్లింల విశ్వాసం. జకాత్, ఫిత్రాహ్, సథఖహ్.. రంజాన్ మాసంలో జకాత్, ఫిత్రాహ్, సథఖహ్ చేస్తారు. ప్రతి ముస్లిం రంజాన్ పర్వదినాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో పేదలకు దానధర్మాలు చేస్తారు. ఈ నెల చివరి వారం రోజుల్లో ఫిత్రా ఇస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఫిత్రాహ్ విధిగా నిర్ణయించబడుతుంది. పండుగ రోజు పుట్టిన బిడ్డకు సైతం ఫిత్రాహ్ చెల్లించాల్సిందే. ‘ఫిత్రాహ్’ విలువను 1.75 కిలోల గోధుమ ధరతో లెక్కిస్తారు. అదే విధంగా జకాత్(విధి దానం) చెల్లించాల్సి ఉంటుంది. ఏడున్నర తులాల బంగారం, 52.50 తులాల వెండి కలిగి ఉన్న ప్రతీ ముస్లీం విధిగా జకాత్ ఇవ్వాల్సి ఉంటుంది. ‘జకాత్’ను పేదలు, అనాథ పిల్లలు ఉండే ముస్లిం మదర్సాలకు ఇస్తారు. సంపాదనలో కొంత సొమ్మును ‘సథఖహ్’ కింద బంధువుల్లోని నిరుపేదలకు ఇస్తారు. లైలతుల్ ఖదర్ అన్వేషణ.. రంజాన్ నెలలోని 21, 23, 25, 27, 29వ రోజుల్లో ముస్లింలు జాగారం చేస్తూ.. నమాజ్ ఆచరిస్తూ.. ఖురాన్ పఠిస్తూ లైలతుల్ ఖదర్(తాఖ్రాత్) అన్వేషిస్తారు. లైలతుల్ ఖదర్ రోజు రాత్రి జరిగే నమాజ్తో వెయ్యి రాత్రుల ఫుణ్యఫలం దక్కుతుందని ముస్లింల విశ్వాసం. దీని కోసం చివరి ఐదురోజులు జాగారం చేస్తూ అల్లాహ్ కరుణ పొందేందుకు అన్వేషిస్తారు.నెలవంక బుధవారం సాయంత్రం కనిపించగా గురువారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. రంజాన్ మాసాన్ని పుసరస్కరించుకుని మసీదులను విద్యుత్ దీపాలు, రంగులతో అలంకరించారు. -
భూసేకరణ వేగవంతం చేయండి
ఖమ్మం సహకారనగర్ : నేషనల్ హైవే ప్రాజెక్ట్ల పూర్తికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్ భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. నాగపూర్ – అమరావతి నేషనల్ హైవే ఖమ్మం – విజయవాడ ప్యాకేజీ –1కు సంబంధించి కొణిజర్ల మండలం గోపతి, బోనకల్ మండలం చిన్నబీరవెల్లి గ్రామాల్లో భూమి స్వాధీనానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఖమ్మం – విజయవాడ ప్యాకేజీ –2కు సంబంధించి మధిర, ఎర్రుపాలెంలో మిషన్ భగీరథ, అటవీశాఖలతో స్ట్రక్చరల్ వాల్యుయేషన్ పూర్తి చేసినందన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. కేబుల్ బ్రిడ్జి భూ సేకరణకు సంబంధించి అవార్డు మొత్తాన్ని డిపాజిట్ చేయాలని అన్నారు. వీధి వ్యాపారులకు వెండర్ జోన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, నేషనల్ హైవే పీడీ దివ్య, తహసీల్దార్లు సైదులు, రమాదేవి, అరుణ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
ఆలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలోని స్టోర్ రూమ్లను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లోకేష్కుమార్ సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీ చేశారు. లడ్డూ తయారు చేసే వంటశాలను, తయారీ విధానం, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం అన్నదాన సత్రాన్ని పరిశీలించి వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ ఎస్ఏఐ) ద్వారా ఆలయాల్లో తయారు చేసే వస్తువుల నాణ్యతను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఈ అథారిటీ వారు యాదగిరిగుట్ట తర్వాత జమలాపురం వేంకటేశ్వరస్వామివారి దేవాలయాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఆలయంలో లడ్డూ తయారీకి, అన్నదానానికి వాడే పదార్థాల నమూనాలను సేకరించి నాణ్యతా ప్రమాణాల నిమిత్తం ఫుడ్ లేబోరేటరీకి పంపిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల్లో డీఏఓ తనిఖీకల్లూరు రూరల్ : మండలంలోని కప్పలబంధం, చెన్నూరు, గ్రామాల్లోని ఎరువుల దుకాణాల ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫెర్టిలైజర్ యాప్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని డీలర్లను ఆదేశించారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆ తర్వాత చెన్నూరులో రైతు గుర్తింపుకార్డు ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని ఎం.రూప, ఏఈఓలు పవన్ కళ్యాణ్, వెంకట లీల తదితరులు పాల్గొన్నారు. మార్చి 4 నుంచి సర్టిఫికెట్ల పరిశీలనఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో స్టాఫ్ అసిస్టెంట్లుగా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను మార్చి 4, 5, 6 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో డీసీసీబీ విస్తరించి ఉండగా 50బ్రాంచీల ద్వారా సేవలను విస్తృతం చేసేందుకు 99 స్టాఫ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి బ్యాంకు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఐబీపీఎస్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్) సంస్థ ద్వారా ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. పీఏసీ ఎస్ల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఇన్ సర్వీస్ కింద 25శాతం అవకాశం కల్పించారు. మార్చి మొద టి వారంలో సర్టిఫికెట్లు పరిశీలించి ఏప్రిల్ మొదటి వారంలో పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. -
రాష్ట్ర ఆర్చరీ జట్టులో ఏడుగురు జిల్లా వాసులే
ఖమ్మం స్పోర్ట్స్ : ఖేలో ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో గిరిజనులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆర్చరీ పోటీల రాష్ట్ర జట్టులో జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు ఎంపిక కావడం విశేషం. వీరు ఈనెల 20, 21 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఖేలో ఇండియా పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఎంపికైన వారిలో కె.అశ్విన్దొర, ఈ.ఆనంద్, కె.లక్ష్మణ్, బి.శివకుమార్, కె.జ్యోత్స్న, ఈ.అవంతిక, బి.సంజనతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన క్రీడాకారుడు రవికుమార్ ఉన్నారు. కోచ్గా ఉమ్మడి జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు గొంది మారప్ప వ్యవహరించనున్నారు. జిల్లా నుంచి ఎంపికై న ఏడుగురిని జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు, వైరా ఏసీపీ సాధుల సారంగపాణి, జాతీయ ఆర్చరీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి పుట్టా శంకరయ్య, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తదితరులు అభినందించారు. -
అంగన్వాడీల్లో ఇక వెలుగులు
● రూ.125కు నూతన మీటర్లు ● ఆపై ఉచిత విద్యుత్ కూడా.. అంగన్వాడీ భవనానికి అధికారులు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయడంతో కరెంట్ సమస్య తీరింది. ఏటా వేసవి కాలంలో చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులు ఉక్కపోతతో ఇబ్బంది పడేవారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేయగా స్థానికులు ఫ్యాన్లు అందించారు. దీంతో ఈ ఏడాది ఉక్కపోత కష్టాలు ఉండవని చిన్నారుల తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. –ఎం.మహాలక్ష్మి, అంగన్వాడీ టీచర్, బనిగండ్లపాడు జిల్లాలోని ప్రభుత్వ అంగన్వాడీ భవనాలకు, రెంట్ ఫ్రీ భవనాలకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు స్థానిక విద్యుత్ అధికారులకు ఆదేశాలందాయి. భవనాలకు విద్యుత్ సరఫరా చేయడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వేసవికాలంలో ఇబ్బందులు ఉండవు. – వేల్పుల విజేత, జిల్లా సంక్షేమాధికారిఎర్రుపాలెం: అంగన్వాడీ కేంద్రాల భవనాల్లో ఇక విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. జిల్లాలోని ఏడు ఐసీడీసీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,840 అంగన్వాడీ కేంద్రాల భవనాలున్నాయి. వీటిలో సొంత భవనాలు 888, అద్దె భవనాలు 501, రెంట్ ఫ్రీ భవనాలు 451 ఉన్నాయి. ఇందులో 1,296 భవనాలకు విద్యుత్ సరఫరా ఉండగా మిగిలిన 544 భవనాలకు కరంట్ సరఫరా లేదు. ఇకపై ఈ కేంద్రాలకు కూడా విద్యుత్ సౌకర్యం రానుంది. ఈ మేరకు మీటర్లు జారీ చేయాలని, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని గత డిసెంబర్లో టీజీఎన్పీడీసీఎల్ నుంచి జిల్లా విద్యుత్ ఎస్ఈ, డీఈలకు ఆదేశాలు అందాయి. అంగన్వాడీ భవనాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏటా వేసవిలో చిన్నారులు ఉక్కపోతతో అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి. విద్యుత్ సరఫరాతో ఆ వెతలు తీరనున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక ఏర్పడే ఇబ్బందులను పలువురు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తేగా ఆయన స్పందించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. జీరో బిల్లుతోనే సరఫరా.. రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారికి ప్రభుత్వం ఉచితంగానే సరఫరా చేస్తోంది. అంగన్వాడీ భవనాలకు కూడా జీరో బిల్లు(ఉచిత విద్యుత్) వర్తింపజేయనుంది. స్థానిక అంగన్వాడీ సిబ్బంది ఎన్పీడీసీఎల్కు రూ.125 చెల్లిస్తే అధికారులు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక విద్యుత్ సరఫరా ఉన్న కేంద్రాల్లోనూ ఫ్యాన్లు లేవు. చిన్నారులు వేసవి తీవ్రత, ఉక్కపోత తట్టుకునేలా ఐసీడీఎస్ శాఖ అధికారులు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు. -
తీర్థాల ఆదాయం రూ.42.73 లక్షలు
ఖమ్మంరూరల్ : ఈనెల 15న ప్రారంభమైన తీర్థాల జాతర బుధవారం ముగిసింది. నాలుగు రోజుల్లో దాదాపు 3.50 లక్షల మంది భక్తులు సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జాతర ముగియడంతో భక్తులు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. కాగా ఈ ఏడాది జాతర సందర్భంగా స్వామివారికి హుండీలు, దుకాణాల వేలం.. ఇలా అన్ని రకాలు కలిపి రూ.42,73,392 ఆదాయం సమకూరింది. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ.2,76,194 ఆదాయం అధికంగా రావడం విశేషం. స్నానాల లక్ష్మీపురంలో రూ.10.07 లక్షలు వైరారూరల్: మహా శివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన జాతర ద్వారా దేవాదాయ శాఖకు రూ.10,07,596 ఆదాయం వచ్చింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. కానుకల ద్వారా రూ.3,62,950, అభిషేకం టికెట్ల ద్వారా రూ.49,200, శీఘ్ర దర్శనం ద్వారా రూ.1,31,196, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.84,900, సాధారణ దర్శనం ద్వారా రూ.45,850, జాతరలో ఏర్పాటుచేసిన దుకాణాల ద్వారా రూ.1,50,500, కొబ్బరి చిప్పల వేలం రూ.43వేలు, లడ్డూ ప్రసాదం విక్రయాల వేలం రూ.1.40 లక్షలు మొత్తంగా రూ.10,07,596 ఆదాయం సమకూరిందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది జాతర ఆదాయం రూ.9,43,564 కాగా, ఈ ఏడాది రూ.64,032 పెరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డ ఉషారాణి, సభ్యులు మల్లు శేషమ్మ, సుల్తాన్, పద్మ, తలారి నరసింహారావు, మొగునూరి సత్యనారాయణ, సర్పంచ్ నూతి వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ హరిచంద్రశేఖర్, అర్చకులు కంచెల చంద్రశేఖరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
హోల్సేల్గా దోచేస్తాం !
వారు ఆడిందే ఆట ! ఖమ్మంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్ను రిటైల్, కమీషన్ వ్యాపారుల సౌకర్యార్థం నిర్మించారు. ఇక్కడ మొత్తం 48 హోల్సేల్, 269 రిటైల్ కూరగాయల దుకాణాలు ఉన్నాయి. హోల్సేల్ దుకాణాలను కమీషన్ వ్యాపారులు నిర్వహిస్తుండగా, జిల్లాతో పాటు భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల వ్యాపారులు కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పలురకాల కూరగాయలు, దుంపలు, ఉల్లిగడ్డలు దిగుమతి అవుతుంటాయి. వీరే కాకుండా ఖమ్మం పరిసర ప్రాంతాల రైతులు పండించిన కూరగాయలను ఈ మార్కెట్లో విక్రయిస్తుంటారు. వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల రీటైల్ వ్యాపారులకు అమ్ముతుంటారు. ఇదంతా బాగానే ఉన్నా.. కొందరు వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాట చందంగా వ్యహరిస్తున్నారు. భారీగా షెడ్ల నిర్మాణం.. కమీషన్ వ్యాపారులు ఒక్కో దుకాణానికి రూ.1,600 నుంచి రూ.3 వేలకు పైగా మార్కెట్ కమిటీకి అద్దె చెల్లిస్తున్నారు. అయితే కొందరు తమకు కేటాయించిన దుకాణాలు కాకుండా మార్కెట్లోని ఖాళీ ప్రాంగణంలో భారీగా షెడ్లు నిర్మించారు. అద్దె చెల్లించే దుకాణాలను కార్యాలయాలుగా మార్చుకుని, ఈ షెడ్లలో వ్యాపారం చేస్తున్నారు. మార్కెట్ ప్రాంగణంలో మొత్తంగా పదికి పైగా ఇలాంటి అక్రమ షెడ్లు వెలిశాయి. కూరగాయల లోడ్తో వచ్చిన వాహనాలను నిలపడం, కూరగాయల పెట్టెలను దించడం వంటివి ఇక్కడ చేస్తున్నారు. ఇలా షెడ్లు నిర్మించిన వారు అదనంగా ఒక్క రూపాయి కూడా మార్కెట్ కమిటీకి చెల్లించకపోవడం గమనార్హం. ఇదేంటని అడిగే వారు లేకపోవడంతో ఏకంగా మూడు, నాలుగు గదుల మాదిరిగా షెడ్లు నిర్మించారు. దీంతో మార్కెట్ ప్రాంగణమంతా ఇరుకుగా మారింది. ఇక రైతులు కూరగాయలు తెచ్చే వాహనాలను మాత్రం మార్కెట్ బయటే గంటల కొద్దీ నిలపాల్సి వస్తోంది. మార్కెట్ ఫీజులోనూ మాయ.. నిత్యం రూ.లక్షల్లో లావాదేవీలు నిర్వహించే ఈ మార్కెట్లో రోజూ రూ.50 వేలకు పైగా పీజు వసూలు కావాలి. కానీ ఇందులో 10శాతం మాత్రమే చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ వ్యాపారులు ఎక్కువ బిజినెస్ చేసి తక్కువగా చూపిస్తున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా ఈ తంతు సాగుతున్నా మార్కెట్ కమిటీ దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నామమాత్రపు పర్యవేక్షణతో కమీషన్ వ్యాపారులదే మార్కెట్లో పైచేయి అయిందనే ప్రచారం జరుగుతోంది. అక్రమ వ్యాపారం, మార్కెట్ ఫీజు తక్కువ చెల్లిస్తున్న విషయమై పలుమార్లు ఆ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది.ఈ మార్కెట్లో వ్యాపారం చేస్తున్న కమీషన్ వ్యాపారులకు రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయి. దీంతో ఒకరిని చూసి మరొకరు తగ్గేదేలేదనట్లుగా ఇష్టారీతిన షెడ్లు నిర్మించారు. మార్కెట్ అదాయానికి గండికొడుతూ.. వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నా సంబంధిత కమిటీ, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. రైతుల ఫిర్యాదులతో పలుమార్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు సదరు కమీషన్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేదు. గతంలో కొందరు రాజకీయ పలుకుబడితో ఒకటి, రెండు షెడ్లను నిర్మించగా.. ఇటీవల కాలంలోనే ఎక్కువగా వెలిశాయి. అంతేకాకుండా భారీ ఎత్తున ఈ షెడ్లు ఉండడంతో ఎవరూ వీరిని నియంత్రించలేరా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.షెడ్లు నిర్మించిన వారికి కమిటీ నిర్ణయం మేరకు నోటీసులు ఇచ్చాం. కమిటీ ఇచ్చే ఆదేశాల ప్రకారం వారిపై చర్యలు ఉంటాయి. ఇష్టారీతిన నిర్మించడానికి ఎలాంటి అనుమతులు లేవు. కూరగాయల వ్యాపారం చేసుకోవడానికే మాత్రమే వారికి దుకాణాలు కేటాయించాం. – పి.ప్రవీణ్కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఖమ్మం -
కోర్టు ఆదేశాలను గౌరవించాలి..
ఖమ్మం మామిళ్లగూడెం: కోర్టు ఆదేశానుసారమే భూదాన్ భూముల్లో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ తెలిపారు. ఈమేరకు అక్కడ నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మంగళవారం ఆయన సీనియర్ జర్నలి స్ట్ పాశం యాదగిరితో కలిసి మాట్లాడారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూమిని 2014లో పేదల ఇళ్లస్థలాల కోసం కేటాయించారని తెలిపారు. అక్కడ వసతుల కల్పనపై కోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. అంతేకాక పేదలను వెళ్లగొట్టే చర్యలకు దిగడం సరికాదన్నారు. అయితే, భూదాన్ భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఇకనైనా జిల్లా అధికారులు కోర్టు ఆదేశాలను అనుసరించి ఇళ్లు నిర్మించుకున్న వారికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాకాకుండా పేదలను పంపించాలని చూస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు. అలాగే, ఈ భూములు ఎవరైనా కొనుగోలు చేస్తే ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ మోహన్రెడ్డి, న్యాయవాది లక్ష్మీనారాయణ, డి.విజయేందర్, భద్రునాయక్, యర్ర బాబు తదితరులు పాల్గొన్నారు. -
చుట్టాలు వచ్చాయి !
ఖమ్మం వ్యవసాయం/ఖమ్మం రూరల్: జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం చింతపల్లిలో నాలుగేళ్ల తర్వాత అతిథుల సందడి నెలకొంది. ఈ గ్రామానికి సైబీరియా దేశం నుంచి ‘పెయింటెడ్ స్టార్క్’(ఎర్రకాళ్ల కొంగలు) వేల మైళ్ల దూరం దాటి ఏటా వస్తుంటాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి మధ్య కొంగలు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. అయితే, గత నాలుగేళ్లుగా కొంగలు రాకపోగా.. ఈసారి చింతపల్లి పరిసర ప్రాంతాల్లో చెట్లపై ఎర్రకాళ్ల కొంగలు సందడి చేస్తున్నాయి. దీంతో అతిథులను చూసి గ్రామస్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పక్షులు గ్రామంలోని చింతచెట్లు, సర్కారీ తుమ్మచెట్లు, వాటర్ ట్యాంకుపై గూళ్లు కట్టుకొని సంతానోత్పత్తి చేశాక తిరిగి వెళ్లిపోతాయి.నాలుగేళ్ల తర్వాత సైబీరియా కొంగలు రావడంతో వాటి సంరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలో ఎర్రకాళ్ల కొంగలను చూసేందుకు స్థానికులే కాక వివిధ ప్రాంతాల ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. ఇలా వచ్చే వారు పక్షులపై రాళ్లు వేయడం, గూళ్ల నుంచి తరమడం వంటి చర్యలకు పాల్పడొద్దని అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక సెల్ఫీలు దిగడం, గట్టిగా అరవడం చేయొద్దని సూచిస్తున్నారు. అలాగే, కొంగలు ఆవాసం ఏర్పర్చుకున్న చెట్ల కొమ్మలను నరకొద్దని, గుడ్లు కిందపడినా, గాయపడిన పక్షులు కనిపించినా అటవీ ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన కొంగలను అతిథులుగా భావించి కాపాడుకోవడం అందరూ బాధ్యతగా భావించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సూచించారు. -
కబడ్డీ టోర్నీ విజేత ఖమ్మం జట్టు
చింతకాని: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని నేరడలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యాన నిర్వహించిన రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీల్లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో విజేతలకు మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో వైరా ఏసీపీ సారంగపాణి బహుమతులు అందజేశాక మాట్లాడారు. గ్రామీణ క్రీడలు, క్రీడాకారులను అందరూ ప్రోత్సహించాలని సూచించారు. కాగా, టోర్నీలో ఖమ్మం జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50 వేల నగదు బహుమతి గెలుకుంది. ఆతర్వాత రెండు నుంచి తొమ్మిదో స్థానం వరకు కల్లూరు, కాకినాడ, కొత్తగూడెం, చెరువుమాధారం, నేరడ, బయ్యారం, బర్ఖత్గూడెం, విజయవాడ జట్లు నిలవగా నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ దూసరి నేతాజీ, ఎస్సై వీరేందర్తో పాటు వివిధ పార్టీల నాయకులు భాగం హేమంతరావు, జమ్ముల జితేందర్రెడ్డి, పావులూరి మల్లికార్జున్రావు, దూసరి శ్రీరాములు, మడుపల్లి భాస్కర్, కొప్పుల గోవిందరావు, మంకెన నాగేశ్వరరావు, దూసరి గోపాలరావు, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు జాబ్మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 19వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. పేటీఎం సేల్స్ అండ్ సర్వీసెస్లో వంద ఉద్యోగాల భర్తీకి టేకులపల్లిలోని మోడల్ కేరీర్ సెంటర్లో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. అర్హతలు, ఇతర వివరాల కోసం 98667 71213 నంబర్లో సంప్రదించాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభంఖమ్మం స్పోర్ట్స్: విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు మంగళవా రం ప్రారంభమయ్యాయి. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం, భక్తరామదాసు కళా క్షేత్రంలో పోటీలు నిర్వహిస్తుండగా రాష్ట్రంలోని 18 జిల్లా ల నుంచి పలువురు మహిళా క్రీడాకారిణిలతో పాటు పురుషులు 300మందికి పైగా హాజరయ్యారు. మహిళలకు టేబుల్టెన్నిస్, బ్యాడ్మింటన్, చదరంగం, క్యారమ్స్, టెన్ని కాయిట్లో, పురుషులకు లాన్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే, సాంస్కృతిక అంశాల్లో భాగంగా పాటలు, శాసీ్త్రయనృత్యం, వాయిద్యాలు, ఫ్యాన్సీడ్రెస్, నాటిక పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. పోటీలను మంగళవా రం ఉదయం సూపరింటెండెంట్ ఆప్ ఇంజనీర్(ఓఎంసీ ట్రాన్స్పోర్ట్) వి.రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్లు బి.బాబునాయక్, ఎన్.జగన్నాథం, ఎం.వీ.కృష్ణారావుతో పాటు పీ.వీ.అప్పారావు, అశోక్, జి.కవిత, జి.మధు, సురేష్, సురేందర్రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాయకల్ప బృందం పెనుబల్లి: పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం కాయకల్ప బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పెనుబల్లి సీహెచ్పీలో వైద్య సేవలు, ఆస్పత్రి పరిశుభ్రత, సౌకర్యాలపై ఆరా తీయడంతో పాటు రోజువారీ వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తొలి ప్రయత్నంలోనే మెడిసిన్ పీజీ సీటుబోనకల్: మండలంలోని రావినూతలకు చెందిన గిరిజన విద్యార్థి ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో పీజీలో జనరల్ మెడిసిన్ సీటు సాధించాడు. గ్రామానికి చెందిన బానోతు తులసీదాస్ – సుజాత కుమారుడు వంశీకృష్ణ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తొలిప్రయత్నంలోనే పీజీలో జనరల్ మెడిసిన్ సీటు సాధించడం విశేషం. ఆయనను సర్పంచ్ భూక్యా భద్రునాయక్, ఉప సర్పంచ్ దొండపాటి సత్యనారాయణతో పాటు గుగులోతు పంతు, కొమ్మినేని ఉపేంద్ర, షేక్ వజీర్ తదితరులు అభినందించారు. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి ఎర్రుపాలెం: వచ్చే విద్యాసంవత్సరం ప్రభుత్వ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలతో పాటు 6నుంచి 9వ తరగతి వరకు బ్యాక్సీట్ల భర్తీ కోసం ఈనెల 22న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని గురుకుల పాఠశాలల డీసీఓ, ఎర్రుపాలెం ప్రిన్సిపాల్ చావా జ్యోతి సూచించారు. ఈమేరకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభఖమ్మం సహకారనగర్: హైదరాబాద్ దోమలగూడలోని వ్యాయామ విద్య కళాశాలలో జరిగిన దివ్యాంగ విద్యార్థుల రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ కేటగిరీల్లో 20మంది పాల్గొనగా, 14మంది ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నారని సీఎంఓ బాజోజు ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈమేరకు విద్యార్థులను విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మతో పాటు కలెక్టర్ అనుదీప్, డీఈఓ చైతన్య జైనీ అభినందించారు. -
గుండెపోటుతో యువకుడు మృతి
కారేపల్లి: ఒక్కగానొక్క కొడుకు కానరాని లోకా లకు వెళ్లాడని ఆయన తల్లి దండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ యువకు డు గుండెపోటుతో కుప్పకూలి కుప్పకూలి మృతి చెందిన దృశ్యాన్ని సీసీ కెమెరా ఫుటేజీలో చూసి కన్నీరుమున్నీరయ్యారు. కారేపల్లి స్టేషన్ రోడ్డుకు చెందిన గణితి నారాయణ–ప్రసన్నలక్ష్మి ఏకై క కుమారుడు గణితి సాయిచంద్ర (24) బీ ఫార్మసీ తర్వాత హైదరాబాద్ కూకట్పల్లిలోని హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆయన ఎడమ చేయి లాగడంతో పక్కనే ఉన్న ఓ మెడికల్ షాపునకు వెళ్లి టాబ్లెట్లు అడిగాడు. ఇంతలోనే సాయిచంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో షాపు సిబ్బంది సీపీఆర్ చేసిన ప్రయోజనం దక్కలేదు. ఇదంతా సీసీ కెమెరాలో నమోదు కాగా, ఆయన ఫోన్లోని నంబర్ల ఆధారంగా కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున కారేపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సాయిచంద్ర తండ్రి నారాయణ ఏన్కూర్ మండలం గార్లొడ్డు లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. టాబ్లెట్ కోసం వెళ్లి కుప్పకూలిన వైనం -
అసలే హాని.. ఆపై కల్తీ
● జిల్లాలో జోరుగా నకిలీ సిగరెట్ల విక్రయాలు ● రూ.లక్షల్లో ఆర్జిస్తున్న ముఠాసత్తుపల్లి: ‘ధూమపానం ఆరోగ్యానికి హానీకరం’ అని సిగరెట్పై పెట్టెలపై ఫొటోలతో సహా ముద్రించి ఉంటుంది. అయినా అలవాటు పడిన వారు మానేయలేక కొనసాగిస్తుంటారు. ఇలాంటి వారి బలహీనతను ఆసరా చేసుకున్న కొందరు నకిలీ సిగరెట్లను మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసలైన సిగరెట్ల కంటే నకిలీలే ఎక్కువగా అమ్ముతున్నారని తెలుస్తోంది. సిగరెట్లతో ఆరోగ్యానికి హానీ ఎదురవుతుండగా, నకిలీ సిగరెట్లతో మరింత ముప్పు పొంచి ఉన్నట్లేనని పలువురు హెచ్చరిస్తున్నారు. సత్తుపల్లిలో డూప్లి‘కేటు’ సత్తుపల్లి మార్కెట్లో పలు మాఫియాలకు కీలక సూత్రధారి అయిన ఓ వ్యక్తి కనుసన్నల్లో రూ.లక్షల విలువైన స్మగ్లింగ్ సిగరెట్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి జిల్లాకు ప్రముఖ బ్రాండ్లను పోలి ఉండే నకిలీ సిగరెట్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. ఇది రిటైల్ వ్యాపారులకు తెలిసే జరుగుతోందని చెబుతున్నారు. బ్రాండ్ సిగరెట్లతో పోలిస్తే నకిలీలు అమ్మితే లాభాలు ఎక్కువగా వస్తుండడంతో రిటైల్ వ్యాపారులు ఇటే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఒక్కో సిగరేట్ ప్యాకెట్కు రూ.20 నుంచి రూ.30 వరకు కమీషన్ వస్తున్నట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో కంటే పల్లెల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోందని తెలిసింది. ధరల పెంపు ప్రచారంతో... ఐటీసీ కంపెనీ సిగరెట్లు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. అయితే, ఇటీవల ధరల పెంపు ప్రచారంతో కొత్త స్టాక్ రాలేదంటూ హోల్సేల్ వ్యాపారులు గిరాకీకి సరిపడా రిటైల్ వ్యాపారులకు ఇవ్వడం లేదని సమాచారం. దీంతో పలువురు నకిలీల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఇది బహిరంగంగానే జరుగుతున్నా కట్టడి చేయాల్సిన అధికారులకు ఎవరూ సమాచారం ఇవ్వకపోవడంతో దందా యథేచ్ఛగా సాగుతోంది. కాగా, సిగరెట్ పెట్టైపె ఉన్న బార్కోడ్ను స్కాన్ చేస్తే అసలా, నకిలీనా అని గుర్తించొచ్చని ఐటీసీ బాధ్యులు చెబుతున్నారు. అంతేకాక సిగరెట్లపై గుర్తుల ముద్రణలోనూ తేడా ఉంటుందని తెలుస్తోంది. -
వెటరన్ క్రీడాకారుల సత్తా
ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్లోని బ్యాడ్మింటన్ అకాడమీలో ఈనెల 14నుంచి 16వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఖమ్మంకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఈమేరకు నర్సయ్య, కిషన్రావు 75 ఏళ్ల కేటగిరీలో డబుల్స్లో ప్రథమస్థానం సాధించగా, చావా వెంకటేశ్వరరావు, సైదయ్య 65 ఏళ్ల కేటగిరీలో డబుల్స్లో ద్వితీయస్థానాన నిలిచారు. అంతేకాక జాతీయస్థాయి పోటీలకు నర్సయ్య, కిషన్రావులు ఎంపికయ్యారు. క్రీడాకారులను బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.వెంకట్రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వీరభద్రం, వి.చంద్రశేఖర్ అభినందించారు. -
ఈ విజయం.. కార్యకర్తలకు అంకితం
ఖమ్మంమయూరిసెంటర్: ఐదు మున్సిపాలిటీల్లో మెజార్టీ వార్డులను గెలవడమే కాక చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కై వసం చేసుకుందని.. ఈ విజయాన్ని పార్టీ కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల విజయంతో జిల్లా కాంగ్రెస్ అడ్డా అని మరోసారి రుజువైందన్నారు. పార్టీకిభారీవిజయం అందించిన జిల్లాప్రజలు, కార్య కర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్క శేఖర్గౌడ్, నరేష్నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
ధూమ్ధామ్.. యువజనోత్సవం
ఖమ్మం రాపర్తినగర్: గురుగుల బొమ్మలు ఎల్లమ్మా... గుళ్లల్లో దీపాలు ఎల్లమ్మా... ఏడికిపోతవ్ ఎల్లమ్మా అంటూ సాగిన పలు జానపద పాటలకు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. ఉమ్మడి జిల్లా స్థాయి యువజనోత్సవాన్ని ఖమ్మంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించగా వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తొలుత యువజనోత్సవాన్ని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశలోనే సేవాదృక్ఫథం అలవడేలా ఎన్ఎస్ఎస్ దోహదం చేస్తుందని తెలిపారు. ఈమేరకు వలంటీర్లు సామాజిక రుగ్మతల నిర్మూలనలో పాలుపంచుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో వందల సంఖ్యలో వలంటీర్లు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఎన్ఎస్ఎస్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కోఆర్డినేటర్లు ఎన్.శ్రీనివాసరావు, కామేశ్వరరావు మాట్లాడుతూ వలంటీర్లకు యువజనోత్సవం మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ కాటేపల్లి నవీన్బాబు, ప్రిన్సిపాల్ వి.రామారావు, ఎన్ఎస్ఎస్ పీఓలు జి.విల్సన్, శివకుమార్, ఆర్.వీ.ఎస్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే... ఉమ్మడి జిల్లాస్థాయి యువజనత్సవంలో భాగంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించగా విజేతల వివరాలిలా ఉన్నాయి. వక్తృత్వ పోటీల్లో కె.భరణిసాయి, ఎం.డీ అస్మా, డిబేట్లో సీహెచ్.అశ్విని, ఈ.తేజస్వి, వ్యాసరచనలో బి.వినయ్శ్రీ, వి.లక్ష్మి శ్రీజ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక క్విజ్లో పి.నీరజ్కుమార్, పి.చరణ్తేజ, కె.భార్గవ్, బి.ప్రసన్నకుమార్, కె.మౌనిక, డి.శ్రుతి విజేతలుగా నిలిచారు. జాతీయ గీతం ఆలాపనలోఎస్.కే.రిజ్వానా, కె.అక్షయ్, రంగోలీలో వి.తేజస్విని, ఉష, పోస్టర్ పెయింటింగ్లో ఎం.డీ.అయేషి, ఈ.స్వాతి, మోనోలో ఎం.డీ.ఫరీన్ బేగం, పి.రమ్య భారతి, సోలో వాయిద్యంలో కె.నాగేంద్ర, ఎం.ఉపేందర్, సోలో సాంగ్లో సీహెచ్.కీర్తిప్రసన్న, పి.దుర్గాభవాని, శాసీ్త్రయనృత్యంలో నిఖిత, జి.దుర్గ మొదటి రెండేసి స్థానాలు దక్కించుకున్నారు. ఇక బృంద నృత్యంలో ఖమ్మం ప్రియదర్శిని కాలేజీ, నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారు. ఇక జూనియర్ కళాశాలల విభాగం వ్యాసరచన పోటీల్లో డి.హరిణి, జి.దేవి, క్విజ్లో నాగులవంచ, బోనకల్ బృందాలు, రంగోలిలో బి.లిందుమతి, జి.గౌతమి, పోస్టర్ పెయింటింగ్లో డి.ఇందు, జి.జస్వంతి మొదటి రెండు స్థానాల్లో నిలవగా బృంద నృత్యంలో నాగులవంచ వలంటీర్లుగా విజేతగా నిలిచారు.ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు -
ప్రతీ విద్యార్థి చదివేలా బోధన
ఖమ్మం సహకారనగర్: ప్రాథమిక స్థాయిలోనే ప్రతీ విద్యార్థి చదివేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆమె ఏడు మండలాల ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదివేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈమేరకు అనువైన అభ్యసన ప్రక్రియలు ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం ఎవ్రీ చైల్డ్ రీడ్(ఈసీఎఆర్)పై పలు సూచనలు చేశారు. ఈసమావేశంలో డీఈఓ చైతన్యజైనీ, ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈఓ చైతన్య జైనీ సమావేశమై అందిన నిధులు, చేపడుతున్న పనులపై సమీక్షించారు. -
ఏపీ నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్
ఖమ్మంక్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీ లను సీజ్ చేయడమే కాక యాజమానులు, ఏజెంట్లు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏపీ నుంచి సత్తుపల్లి ప్రాంతానికి ఇసుక తరలిస్తున్న టిప్పర్, ట్రాక్టర్ను బుధవారం తెల్లవారుజామున సత్తుపల్లి మండలం గంగారం చెక్పోస్ట్ వద్ద గుర్తించినట్లు తెలిపారు. అలాగే, కంచికచర్ల మండలం నుంచి ఇసుకతో వస్తున్న రెండు లారీలను తల్లాడ మండలం కుర్నవల్లి వద్ద తల్లాడ పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. అంతేకాక వేంసూరు మండలం వెంకటాపురం గ్రామంలోకి వస్తున్న ఇసుక లారీ, ఏపీలోని మల్కాపురం నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ను బాణాపురం వద్ద ముదిగొండ పోలీసులు పట్టుకున్నారని సీపీ వివరించారు. అలాగే, ఇసుక లోడ్తో వచ్చిన ట్రాక్టర్లను కల్లూరులో సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. భూమి ఆక్రమించుకున్నారని ఆవేదన కారేపల్లి: జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసం కింద కేటాయించిన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకోవడమే కాక రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లిలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నాయకులతో కలిసి గలిగ పాపమ్మ తదితరులు మంగళవారం మాట్లాడారు. 2003లో లొంగిపోయిన పాపమ్మకు కమలాపురం సర్వే నంబర్ 147లో 4–37ఎకరాల భూమి కేటాయించగా, అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పట్టా అందజేశారు. ఈ భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకోగా పోలీసులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందన్నారు. అయినా ఆగకుండా ఓ గిరిజన రైతు ద్వారా దాడులకు దిగుతున్నారని, మరికొందరి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులో పేర్లు మార్పించారని వాపోయారు. ఈమేరకు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పాపమ్మ తదితరులు కోరారు. ఈ సమావేశంలో నాయకులు అలెం కృష్ణ, కల్తి రాంప్రసాద్, ఈసం భాస్కర్, గలిగ జయమ్మ పాల్గొన్నారు. ఆభరణాలతో పాటు నగదు చోరీ చింతకాని: మండలంలోని కోమట్లగూడెంకు చెందిన దుంపల బాబు ఇంట్లో చోరీ జరిగింది. బాబు దంపతులు సోమవారం తల్లాడ మండలం మిట్టపల్లికి వెళ్లి మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉండగా, లోపల పరిశీలిస్తే 13 గ్రాముల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.20 వేల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈమేరకు బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. కంది పంటకు నిప్పుపెట్టిన ఇద్దరిపై కేసు ముదిగొండ: మండలంలోని వల్లాపురంలోని ఓ రైతు కంది పంటకు నిప్పు పెట్టిన ఇరువురిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. వల్లాపురానికి చెందిన కొక్కిరేణి వెంకయ్య రెండున్నర ఎకరాల్లో కంది పంట సాగు చేయగా, అదే గ్రామానికి చెందిన మేరే శ్రీనివాస్, మేరే పిచ్చయ్య సోమవారం రాత్రి నిప్పుపెట్టారు. దీంతో పంట పూర్తిగా కాలి బూడిదై రూ.30వేల మేర నష్టం జరిగింది. బాధిత రైతు వెంకయ్య ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రూ.5లక్షల విలువైన పాడిగేదెలు చోరీ ఖమ్మంఅర్బన్: ఖమ్మం కొత్తగూడెంలో పాడి గేదెలు చోరీకి గురైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలు చామకూరి సరస్వతి తెలిపిన వివరాలు... ఆమె భర్త మరణానంతరం పాలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఈమేరకు తన ఇంటి సమీపంలో ఐదు గేదెలను కట్టివేసింది. సోమవారం ఉదయంకల్లా రూ.5లక్షల విలువైన గేదెలు లేకపోవడం, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు మధిర: అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ కల్పించిన కందిమళ్ల విజయకుమార్ చిరస్మరణీయుడని తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవరపు నాగేశ్వరరావు తెలిపారు. మధిరకు చెందిన సైదేశ్వరరావు, రాజేశ్వరి దంపతుల కుమారుడు విజయకుమార్ ఇటీవల ఏపీలోని తాడేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆపై ఆయన బ్రెయిన్డెడ్ కాగా విజయకుమార్ అవయవాలను అవసరమైన ఎనిమిది మందికి అమర్చారు. ఈమేరకు అవయవదానానికి అంగీకరించిన విజయ్ తల్లిదండ్రులను మంగళవారం నాగేశ్వరరావు సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమావత్ బాబురావు, ఊట్ల శంకర్రావు, శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో నిధుల పంచాయితీ
● పెండింగ్ బిల్లుల విషయంలో కొర్రీలు ● పాత – కొత్త సర్పంచ్ల మధ్య నలుగుతున్న కార్యదర్శులునేలకొండపల్లి: గ్రామపంచాయతీల్లో కొన్నాళ్లు కొత్త పాలకవర్గాలు కొలువుదీరగా... రెండు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. అయితే, ఈనిధులతో జీపీల్లో కొత్త పంచాయితీ నెలకొంది. దాదాపు రెండేళ్ల పంచాయతీలకు సర్పంచ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు నిలిచిపోయాయి. అత్యవసర పనులకు కార్యదర్శులే సొంతంగా ఖర్చు చేశారు. అంతేకాక గత పాలకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసిన అప్పటి సర్పంచ్లకు బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ఇంతలోనే కేంద్రం నుంచి నిధులు మంజూ రు కాగా తమ బకాయిలను పంచాయతీ కార్యదర్శులు తీసుకుంటున్నారు. కానీ పాత సర్పంచ్లకు సంబంధించి బిల్లులు ఇచ్చే విషయంలో కొత్త సర్పంచ్లు కొన్నిచోట్ల కొర్రీలు పెడుతున్నట్లు సమాచారం. ఈక్రమాన మధ్యలో కార్యదర్శులు నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. పాత సర్పంచ్లకు బిల్లులు చెల్లించే విషయంలో కొత్తసర్పంచ్లు నిరాకరిస్తుండడం వెనుక పలు కార ణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికల వేళ తమకు సహకరించలేదనే భావనతో పాత వారి బిల్లులు పక్కన పెడుతున్నట్లు సమాచారం. దీంతో నే గత పాలకవర్గం తీర్మానాలు, అధికారుల ఎం.బీ. రికార్డులు చేసినా, మరికొన్నింటికి చెక్కులు జారీ అయినప్పటికీ నిధులు లేక తిరస్కరించిన బిల్లులు సైతం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం ఇటీవల విడుదలచేసిన నిధులను 2023–24లో వీధిదీపాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య నిర్వహణ, పైపులైన్ లీకేజీల మరమ్మతుల పనులకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పనులకు మాజీ సర్పంచ్లు అప్పులు చేసి మరీ వెచ్చించగా ప్రస్తుత సర్పంచ్లు అడ్డు తగులుతుండడంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు మాజీ సర్పంచ్లు ఎంపీడీఓలకు ఫిర్యాదుచేశారు. అంతేకాక కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇంకొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పంచాయతీ నిధులగొడవ పెద్దదిగా మారకముందే అధికారులు కొత్తసర్పంచ్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై నేలకొండపల్లి ఎంపీడీఓ ఎం.యర్రయ్య వివరణ కోర గా... 2023–24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు గాను బిల్లులు మంజూరయ్యాయని తెలి పారు. కొత్త సర్పంచ్లకు ఈ విషయమై సృష్టత ఇస్తామని వెల్లడించారు. -
ఆశలు చేజారాయి..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్నిచోట్లా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ గెలుపుతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేవు. కానీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆశించిన వారిలో మాత్రం ఒకింత నైరాశ్యం నెలకొంది. పార్టీలో నిబద్ధతతో పనిచేయడమే కాక స్థానికంగా ప్రజాబలం ఉండి, తమకే పదవులు ఖాయమని భావించిన పలువురికి భంగపాటు తప్పలేదు. ప్రధానంగా వైరా, మధిర మున్సిపల్ పీఠాల విషయంలో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. మిగతా మున్సిపాలిటీల్లోనూ వైస్ చైర్మన్ పదవులు ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఇది కాక ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీల్లో ఒకే కమ్యూనిటీకి ఐదు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టడం పార్టీలోని ఇతర సామాజిక వర్గాల్లో చర్చకు దారి తీసింది. వైరాలో దక్కని పదవి వైరా మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులను గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను కై వసం చేసుకుంది. ఇక్కడ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో బొర్రా ఉమాదేవి, కాపా చంద్రకళ పోటీ పడ్డారు. పార్టీ నిర్ణయమంటూ చైర్పర్సన్ పదవిని కాపా చంద్రకళకు, వైస్ చైర్మన్ పదవికి కట్ల సంతోష్ను ఖరారు చేశారు. అయితే, వైరా పీఏసీఎస్ చైర్మన్, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన బొర్రా రాజశేఖర్ తన భార్య ఉమాదేవిని చైర్పర్సన్ పదవే లక్ష్యంగా పోటీకి దింపారు. చివరి వరకు ప్రయత్నించినా సఫలం కాలేదు. చైర్పర్సన్ పీఠాన్ని ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి ఇచ్చారని పార్టీ నియోజకవర్గ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. మధిరలో అనూహ్య మలుపు మధిర మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికలోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నేత వేమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి భార్య లక్ష్మీ తులసి 6వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. విజేతల్లో 599 ఓట్లతో రెండో అత్యధిక మెజార్టీ ఆమెదే కావడం విశేషం. వేమిరెడ్డి ఇటీవల డీసీసీ అధ్యక్ష పదవికి కూడా పోటీ పడినా దక్కకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ గిరిపై ఆశలు పెట్టుకుని తన భార్యను బరిలోకి దింపారు. పదవి లక్ష్మీతులసికే వస్తుందని శ్రీనివాసరెడ్డి సన్నిహితులు, బంధువులు ఎన్నిక రోజున భారీ ఎత్తున మధిరకు చేరుకున్నారు. చివరకు సామినేని సుజాతకు పదవి దక్కడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, త్వరలోనే శ్రీనివాసరెడ్డికి నామినేటెడ్ కోటాలో రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా..! మున్సిపల్, కార్పొరేషన్ పాలకవర్గాలు ఐదేళ్లు కొనసాగనున్నాయి. కానీ మూడేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే వ్యూహాత్మకంగా చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకం జరిగిందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. వచ్చే ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కై వసం చేసుకునేలా ఓటర్లు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో ఆయా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇస్తే.. మిగతా వారిని విస్మరించినట్లేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వైస్ చైర్మన్ల ఎంపికలోనైనా బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఇతర సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పురపీఠాలు దక్కని కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్లో చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ కలిపి 16 పదవులు ఉన్నాయి. ఇందులో జనరల్కు రిజర్వ్ అయినవి కలుపుకుని మొత్తంగా ఒకే సామాజిక వర్గానికి ఐదు దక్కాయని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పదవుల్లో కూర్చోవాలని ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు వారితో పాటు, వారి భార్యను కూడా పోటీ చేయించి గెలిచారు. అయినా పదవులు రాక వారు అసంతృప్తితో ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇచ్చారని గుసగుసలాడుతున్నా ఎక్కడా బహిరంగంగా అసంతృప్తి మాత్రం వెళ్లగక్కడం లేదు. -
‘భరోసా’ ఇంకెప్పుడు?
● చివరి దశకు చేరుతున్న యాసంగి సాగు ● జిల్లాలో 6.74లక్షల ఎకరాల్లో పంటలు ● సాయం కోసం 3.53 లక్షల మంది ఎదురుచూపులుఖమ్మంవ్యవసాయం: యాసంగి సీజన్ పంటల కాలం చివరి దశకు చేరుతోంది. అయినా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం మాత్రం అన్నదాతలకు అందలేదు. పంటల సాగు మొదలయ్యే సమయంలోనే దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు రైతులకు ఉపయోగపడేలా ‘రైతు భరోసా’ పేరిట ప్రభుత్వం సాయం అందించాల్సి ఉంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లో నీరు ఉండగా, యాసంగిలోనూ రైతులు విస్తారంగా పంటలు సాగు చేస్తున్నారు. గడిచిన నవంబర్ నుంచే సాగు పనులు మొదలయ్యాయి. ఈ సీజన్లో అన్నీ కలిపి 4.16లక్షల ఎకరాల్లో, ఉద్యాన పంటలు 2.50లక్షల మేర ఎకాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. వరి ప్రధాన పంట కాగా, మొక్కజొన్న సాగు విస్తీర్ణం కూడా అధికంగానే ఉంది. మొదలైన మొక్కజొన్న కోతలు యాసంగిలో సాగు చేసిన పంటలు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. వానాకాలం సీజన్ వాతావరణం పత్తికి అనుకూలించకపోవడమే కాక అధిక వర్షాలతో పంట దెబ్బతిన్నది. దీంతో పలువురు పంటను తొలగించి మొక్కజొన్న వేశారు. ఈ క్రమాన జిల్లాలో రికార్డు స్థాయిలో 1.70 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, ప్రధాన పంట అయిన వరి 2.50 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం మొక్కజొన్న కోతలు మొదలుకాగా, ముందస్తుగా వేసిన వరి కోత దశకు చేరుకుంది. అంతేకాక అధికారులు యాసంగి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయినా ప్రభుత్వం అందించాల్సిన పెట్టుబడి సాయం రైతుల దరి చేరకపోవడం గమనార్హం. ఎకరాకు రూ.6వేల చొప్పున.. యాసంగి పంటల పెట్టుబడి సాయం జిల్లాలో దాదాపు 3.53 లక్షల మంది రైతులకు అందాల్సి ఉంది. వీరికి ఎకరాకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం రూ.436.84 కోట్లు జమ చేయాలి. వీరే కాక నూతనంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములు కలిగిన వారు, భూభారతి ద్వారా పట్టాలు పొందిన వారు ఇంకొందరు ఉంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశ పెట్టి ఏటా రెండు సీజన్లలో ఎకరాకు రూ.5వేల చొప్పున సాయం అందించేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘రైతుభరోసా’గా పేరు మార్చి ఎకరాకు రూ.6వేల చొప్పున ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి వానాకాలం సీజన్లో మాత్రం పెట్టుబడి సాయాన్ని మాత్రం అందించలేదు. ఆ తర్వాత వానాకాలం సీజన్లోనూ పూర్తి స్థాయిలో రైతులకు అందలేదు. గత వానాకాలం సీజన్లో మాత్రం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.. యాసంగి సీజన్లో జాప్యం చేస్తుండడం, ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేక రైతులు ఎదురుచూస్తున్నారు. -
64వేల మంది రైతులకు సన్నధాన్యం బోనస్
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్కు సంబంధించి సన్న ధాన్యం అమ్మిన రైతులకు బోనస్ చెల్లింపులు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలి పారు. ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్గా ప్రభుత్వం జమ చేస్తోందని వెల్లడించారు. ఈమేరకు జిల్లాలో 64,093 మంది రైతులకు రూ.175.69 కోట్ల నగదు బోనస్ వారి ఖాతాల్లో జమ అయిందని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. పీఎంకేవీవై కోర్సుల్లో ప్రవేశాలు ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకం ద్వారా మూడు నెలల కాల పరిమితితో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి అర్హతతో సీఎన్సీ టర్నింగ్ ఆపరేటర్, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో కోర్సులో 30సీట్లు ఉంటాయని, ఆసక్తి ఉన్న విద్యార్థులు పదో తరగతి మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ఫొటోతో ఈనెల 21వ తేదీ వరకు కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99493 40417 నంబర్లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో సూచించారు. గోదాం నిర్మాణానికి ఐదెకరాల భూమి ఖమ్మంఅర్బన్: తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా గోదాం నిర్మాణానికి ఐదెకరాల ప్రభుత్వ భూమి కేటాయించనున్నారు. విత్తన గిడ్డంగుల కార్పొరేషన్ అవసరాల దృష్ట్యా గోదాం నిర్మాణానికి ఖమ్మం నగర పరిధి అల్లీపు రం వద్ద సర్వే నంబర్ 241లో ఈ భూమిని గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో భూమి పత్రాలు అప్పగిస్తామని పేర్కొన్నారు. గోదాం నిర్మాణం పూర్తయితే రైతుల పంటల నిల్వ, విత్తనాలు భద్రపర్చడం సులువవుతుందని వెల్లడించారు. శివాలయం హుండీ ఆదాయం రూ.13.74 లక్షలు కూసుమంచి: కూసుమంచిలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈమేరకు రూ.13,74,734 ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాది కంటే రూ.1,44,559 అదనమ ని అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ అధి కారులు లెక్కింపును పర్యవేక్షించగా, సర్పంచ్ కొండా కృష్ణవేణి, ఆలయ చైర్మన్ రేలా ప్రదీప్ రెడ్డి, ఈఓ కాముని శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆర్టీసీకి నీలాద్రి ఆదాయం రూ.84.44 లక్షలు సత్తుపల్లిటౌన్: మహాశివరాత్రి సందర్భంగా పెనుబల్లి మండలంలోని నీలాద్రి జాతరకు వెళ్లే భక్తుల కోసం సత్తుపల్లి డిపో ద్వారా ప్రత్యేక బస్సులు నడిపించారు. ఈనెల 15వ తేదీ తెల్లవారుజాము నుంచి 16వ తేదీ ఉదయం వరకు 26 బస్సులతో 171 ట్రిప్పులు నడిపించగా రూ.84.44 లక్షల ఆదాయం లభించిందని డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఇది గతేడాదితో పోలిస్తే రూ.26వేలు అదనమని పేర్కొన్నారు. జాతరకు 9,113 కి.మీ. మేర బస్సులు నడవగా 14,127 మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని, మొత్తం 23,422 మంది ప్రయాణించారని తెలిపారు. ఈసమావేశంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్కుమార్, మెకానికల్ ఇంజనీర్ సాహితి పాల్గొన్నారు. ‘సౌర విద్యుత్’ పనుల్లో మరింత వేగం బోనకల్: జిల్లాలో సౌర విద్యుత్ పథకం పనుల్లో వేగం పెంచాలని ఎన్పీడీసీఎల్ సీఈలు వెంకటరమణ, కె.రాజుచౌహాన్ ఆదేశించారు. బోనకల్లో మంగళవారం నిర్వహించి సమీక్షలో వారు మాట్లాడుతూ జిల్లాలో మోడల్ సోలార్ పథకం కింద గృహ వినియోగదారుల కోసం 2కిలోవా ట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు, వ్యవసాయ మోటార్ల కోసం 7.5 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఏర్పాటుచేయాల్సి ఉంటుందని తెలిపా రు. ఈమేరకు పనుల్లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వేగంపెంచాలని సూచించారు. ఖమ్మం ఎస్ఈ ఈ.శ్రీనివాసాచారి, రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్, ఉద్యోగులు సత్యనారాయణ, బి.శ్రీనివాసరావు, వై.వీ.ఆనంద్కుమార్, అనురాధ, టి.మనోహర్, హరిప్రవీణ్, ఏఇలు పాల్గొన్నారు. -
నష్టపోకుండా అత్యధిక పరిహారం
ఖమ్మం సహకారనగర్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా భూమి ఇచ్చే రైతులు, యజమానుల ఖాతాల్లో నిబంధనల మేర అత్యధిక పరిహారం జమ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సింగరేణి మండలం బాజు మల్లాయిగూడెం, రేలకాయలపల్లి గ్రామాల రైతులతో మంగళవారం ఆయన కలెక్టరేట్లో చర్చించారు. బాజుమల్లాయిగూడెం, రేలకాయపల్లిల్లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ పనులకు భూ సర్వే నిర్వహించి అవార్డులు ప్రకటించామని తెలిపారు. ఆపై అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించడంతో పాటు నిబంధనల ప్రకారం భూముల్లోని పంపుసెట్లు, సుబాబుల్, ఇతర చెట్లతో పాటు నిర్మాణాలకు ప్రత్యేక పరిహారం అందించామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట పరిహారం చెల్లించినందున భూనిర్వాసితులు పనులకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీఓ జి.నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ కె.బాబూరావు, డీఈ ఎస్.కిషోర్, తహసీల్దార్ ఆనంతుల రమేష్ పాల్గొన్నారు. పకడ్బందీగా మ్యాపింగ్ ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన వీసీ ద్వారా ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టే మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శర్రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహకరిస్తూ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులకు ఈ విషయమై అవగాహన కల్పించాలని, ఇతర దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో ప్రక్రియ వివరాలను కలెక్టర్ అనుదీప్ వివరించగా, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్, ఆర్డీఓ నర్సింహారావు, ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అనంతుల రమేష్, అరుణ, అన్సారీ పాల్గొన్నారు.భూనిర్వాసితుల సమావేశంలో కలెక్టర్ అనుదీప్ -
కేసీఆర్ పాలనలోనే సుభిక్షంగా రాష్ట్రం
ఖమ్మం వైద్యవిభాగం/కామేపల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడమే కాక అభివృద్ధి పథంలో పయనించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. కామేపల్లి మండలం తాళ్లగూడెం ఉపసర్పంచ్ శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యాన మంగళవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడంతో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించడంతో పాటు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆతర్వాత కొత్తలింగాల కోటమైసమ్మతల్లి దేవాలయంలో నాయకులు పూజలు చేశారు. ఇక ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి తాతా మధు కేక్ కట్ చేశారు. అలాగే, జీవనసంధ్య వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్బాబు ఆధ్వర్యాన పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, నాయకులు, ప్రజాప్రతినిధులు నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, మక్బూల్, బచ్చు విజయ్కుమార్, బత్తుల మురళీప్రసాద్రావు, చిరుమామిళ్ల రవికిరణ్, వాంకుడోత్ సురేష్, అజ్మీరా వీరునాయక్, పిన్ని కోటేశ్వరరావు, మెంటం రామారావు, మాటేటి కిరణ్, కొల్లు పద్మ, షేక్ ఉస్మాన్, వీరేంద్రగౌడ్, కంచర్ల దయాకర్, కొమ్ము విజేత, తీర్థాల చిదంబరరావు, ఆంతోటి అచ్చయ్య, వడియాల కృష్ణారెడ్డి, మల్లెంపాటి శ్రీనివాసరావు, మూడ్ కృష్ణప్రసాద్నాయక్, సామా మోహన్రెడ్డి, కాట్రాల రాంబాబు, యలమద్ది అప్పారావు, పుచ్చకాయల బాబు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ను కలిసిన ఎంపీ వద్దిరాజు ఖమ్మం వైద్యవిభాగం: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మంగళవారం కలిశారు. ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ను కలిసిన ఆయన పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ తాతా మధు -
చివరి వరకూ ఉత్కంఠే..
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్గా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్లో ఉత్కంఠ కొనసాగినట్లు తెలిసింది. ఈ విషయమై ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చర్చలు జరిగినట్లు సమాచారం. మొదట్లో తోట సుజలరాణి, ఎండీ.రెహనాబేగం మధ్య పోటీ ఉండగా, చివరకు బొంతు సుమలత, రెహానాబేగంలో ఒకరిని ఎంపిక చేయాలనే భావనకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ క్యాంప్లో ఈ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యే మధ్య అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినట్లు సమాచారం. ఏపీ ముఖ్యనేత సిఫారసు? బొంతు సుమలతకు మద్దతుగా ఏపీకి చెందిన ముఖ్యనేత ఒకరు ఇక్కడ అధికార పార్టీలో ముఖ్యనేతకు సిఫారసు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో సుమలత పేరు దాదాపు ఖరారైనట్టేనని చెప్పుకున్నారు. అయితే, సుమలత సామాజిక వర్గానికే చెందిన నేతలకు మధిర, వైరా మున్సిపల్ చైర్పర్సన్ పదవులు దక్కడం.. ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో ఎక్కడా అవకాశం లేకపోవడంతో సర్దిచెప్పి చివరకు రెహానాబేగంను ఎంపిక చేశారు. కాగా, డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కుటుంబం వెంట నడుస్తున్న ఎండీ.కమల్పాషా సతీమణి రెహానాబేగంను చైర్పర్సన్గా ఎంపిక చేయడం విధేయతకు పట్టం కట్టినట్లేనని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి దయానంద్తో కమల్పాషా కొనసాగుతున్నారు. చైర్మన్ స్థానం బీసీ జనరల్ అయితే ఆయనకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగినా జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్యను ఎంపిక చేశారు. కాగా, మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ప్రవేశం ఉంటుందని అధికారులు ముందుగా చెప్పినా గేటు వద్దే నిలిపివేశారు. దీంతో నిరసన తెలపడంతో సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ నలుగురినే అనుతిస్తామని, అది కూడా సెల్ఫోన్లు లేకుండా రావాలని సూచించారు. ఈమేరకు మీడియా ప్రతినిధులు లోనకు వెళ్లలేదు. ఇదేసమయాన అధికార పార్టీ నేతలను లోపల చర్చలకు అనుమతించడంపై జర్నలిస్టు సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు.సత్తుపల్లి చైర్పర్సన్ ఎంపికపై చర్చలు -
ఊడిపోయిన బీబీసీ షట్టర్
కొణిజర్ల: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ నుంచి బోనకల్ బ్రాంచ్ కాల్వకు నీరు విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు షట్టర్లలోలో ఒకటి ఊడిపోయి కొద్దిపాటి పట్టుతో నిలిచింది. దీంతో నీటికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాక వృథాగా పోతోంది. ప్రస్తుతం బోనకల్ బ్రాంచ్ కాల్వ పరిధిలో మొక్కజొన్న పంట సాగు చేస్తుండగా నీటి అవసరం కూడా అంతగా లేకున్నా మరమ్మతు చేయకపోతే భవిష్యత్లో ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు చెబుతున్నారు. సాగర్ ప్రధాన కాల్వకు బీబీసీకి అనుసంధానంగా ఏర్పాటు చేసిన షట్టర్లు కూడా తుప్పుపట్టి శిధిలావస్థకు చేరడంతో నీటి ఉధృతి కారణంగా షట్టర్ ఊడి పోయిందని తెలుస్తోంది. ఈ విషయమై జలవనరులు శాఖ ఏఈ పూర్ణచంద్రరావును వివరణ కోరగా నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందుకు షట్టర్ మరమ్మతులు సాధ్యం కావడం లేదన్నారు. వారబందీ ప్రకారం నీటి ప్రవాహం నిలిపివేశాక తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. అయితే, ఇప్పటికే కొత్తషట్టర్లు కూడా మంజూరైనందున నీటి సరఫరా గడువు ముగిశాక వేసవిలో పనులు చేపడుతామని వెల్లడించారు.వృథాగా పోతున్న సాగునీరు -
సాగునీటి కోసం ఎన్నెస్పీ కార్యాలయం ముట్టడి
తల్లాడ: వారబందీ విధానంతో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు వెంటనే నీరు విడుదల చేయాలనే డిమాండ్తో తల్లాడలోని ఎన్నెస్పీ డివిజన్ కార్యాలయం వద్ద సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, బిల్లుపాడు పొలాల కోసం సిరిపురం మేజర్ కాల్వ పరిధి మైనర్లు, మేజర్లకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమాన రైతులు కార్యాలయాన్ని ముట్టడించగా ఉద్యోగులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ కార్యాలయానికి తాళం వేశారు. ఆతర్వాత కల్లూరు ఎన్నెస్పీఇ ఈఈతో రైతు సంఘం నాయకుడు సేలం సత్యనారాయణరెడ్డి ఫోన్లో మాట్లాడి తక్షణమే నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, నాయకులు నల్లమోతు మోహన్రావు, అయినాల రామలింగేశ్వరరావు, అక్కల హరీష్రెడ్డి, పులి కృష్ణయ్య, గుండ్ల నాగయ్య, శనక్కాయల నర్సింహారావు, ఏగుపాటి హన్మంతరావు, పాలవెల్లి ప్రసాద్, సాయిని ప్రకాష్రావు, అనుములు కృష్ణయ్య, దగ్గుల భద్రారెడ్డి, బోడ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు. -
● హార్వెస్ట్ విజయభేరి
జేఈఈ మెయిన్స్లో తమ విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్తో సత్తా చాటారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. కళాశాలలో విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడారు. కృష్ణమోహన్ 99.87 పర్సంటైల్, పి.అన్విదరెడ్డి 99.47, కె.లోకేష్ 99.42, బి.స్ఫూర్తి 99.31, ఎం.సాయిచరణ్ 99.04 పర్సంటైల్ సాధించారన్నారు. వీరితో పాటు వి.జగల్, పి.గోవర్ష, ఏ.సుహాని, కృష్ణ మనోజ్ఞ 98పర్సంటైల్కు పైగా సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి గతనెలలో నిర్వహించిన జేఈఈ (మెయిన్) పేపర్–1 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఉదయం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు.. సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ పర్సంటైల్తో సత్తా చాటారు. ఈ మేరకు విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి. – ఖమ్మం సహకారనగర్: ● ఎస్ఆర్ విజయఢంకా జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించి విజయఢంకా మోగించారని విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన అభినందించగా అధ్యాపకులు వివరాలను వెల్లడించారు. సందీప్ 99.55 పర్సంటైల్, గ్రీష్మంత్ తేజ్ 99.34, అనూష 98.50, కమరాన్ ముస్తఫా 96.13 పర్సంటైల్ సాధించారన్నారు. డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్రెడ్డి, సీఈఓ సురేందర్రెడ్డి, డీజీఎం గోవర్దన్ రెడ్డి, చీఫ్ జోనల్ సదన్రావు, జోనల్ ఇన్చార్జ్ విజయభాస్కర్రెడ్డి, డీన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు అశోక్, శ్రీనివాస్, సుధాకర్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ● న్యూవిజన్ విజయకేతనం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించాక ఆయన మాట్లాడారు. కళాశాల నుంచి 99 పర్సంటైల్ 13 మందికి, 98 పర్సంటైల్ 26 మంది విద్యార్ధులు సాధించారన్నారు. ఇందులో ఏపూరి నిహంత్ 99.89 పర్సంటైల్, రాయపూడి సాత్విక్ కుమార్ 99.85, పోట్ల జీవన్ 99.82, వేమూరి రిషికార్తిక్ 99.80, తూము నాగేందర్ 99.74, మారేమళ్ల లోకేష్ 99.70, తాళ్లూరి రేవంత్కుమార్ 99.56, మహ్మద్ రెహాన్ షేక్ 99.49, దీవెల మోహన్ 99.47, మహ్మద్ రిజా సిమ్రా 99.39, బయ్యారపు రేవంత్ ప్రసాద్ 99.25, సత్యాల సిరిసంజన 99.12, కొమ్మినేని మౌక్తిక 99.02, కనకమేడల రిత్విక్చౌదరి 98.87, షేక్ షాహిద్ 98.87, బానోత్ శ్రీకరణ్ 98.57, కొత్తకొండ నాగ చైత్రిక్ 98.50, కొళ్లూరి రూపిక 98.42, షేక్ సైఫ్ ఉల్ అజ్మణ్ 98.41, మూడ్ చరణ్ చౌహాన్ 98.37, అనుమోలు శ్రావణ్ 98.16, మాధవరపు నాగ వెంకట సాయిచరణ్ 98.13, కోట సాయిసాత్విక్ 98.10, ఉప్పునూరి మన్వితారెడ్డి 98.26, బొల్ల నాగసాయి జస్వంత్ 98.31పర్సంటైల్ సాధించారని వెల్లడించారు. అకడమిక్ డైరెక్టర్ సీహెచ్.కార్తీక్, డైరక్టర్ సీ.హెచ్.గోపిచంద్, డీన్ శ్రీధర్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
● అగ్రగామిగా శ్రీ చైతన్య
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్తో అగ్రగామిగా నిలిచారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు వివరాలు వెల్లడించారు. ఎం.అమాన్ శ్రీ సాయి 99.85పర్సంటైల్, వి.విఘ్నేష్ కౌండిన్య 99.74, ఎస్.శ్రీనిధి 99.64, వి.కీర్తి 99.52, వి.స్నేహిత 99.50, సీహెచ్.మోక్షజ్ఞ 99.38, డి.సాయిప్రణవ్ 99.16, బి.ప్రణయ్ విశాల్ 99.05 పర్సంటైల్ సాధించగా ఇంకొందరు కూడా అత్యుత్తమ పర్సంటైల్ సాధించారని తెలిపారు. అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం చేతన్ మాధూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ.వర్మ, డీన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్నేహబంధానికి అండగా...
కూసుమంచి: ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబాలకు పలువురు అండగా నిలిచి స్నేహబంధాన్ని చాటారు. ఒకే పాఠశాలలో చదువుకున్న తమ మిత్రుల కుటుంబాలకు ఆపద ఎదురైందని ఆర్థిక సాయం అందించి మన్ననలు అందుకున్నారు. కూసుమంచి మండలం పోచారం శివారు సీతారాంపురం గ్రామానికి చెందిన నక్కల మల్లికార్జున్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన తిరుమలాయపాలెం మండలం బీరోలు ఉన్నత పాఠశాలలో 2006–07లో పదో తరగతి పూర్తిచేశాడు. ఈమేరకు మల్లికార్జున్తో చదువుతుకున్న వివిధ గ్రామాల మిత్రులు రూ.50వేలు సేకరించి సోమవారం ఆయన కుటుంబీకులకు అందజేశారు. ఈకార్యక్రమంలో గ్రామపెద్దలు పాల్గొన్నారు. బాణాపురం పూర్వవిద్యార్థులు.. ముదిగొండ: మండలంలోని బాణాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2002లో పదో తరగతి పూర్తిచేసిన నాగరాజు, సుధాకర్ ఇటీవల మృతి చెంచారు. దీంతో వారి స్నేహితులు రూ.40వేలు సేకరించి ఒక్కొక్కరి కుమార్తె చదువు కోసం రూ.20 వేల చొప్పున సోమవారం అందజేశారు. ఈకార్యక్రమంలో కిషోర్, పిరోజ్, నరేష్, సోమాజీ, బాలకృష్ట, రామకృష్ట, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చికిత్సకు చేయూత.. తల్లాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మోకాలికి సర్జరీ చేయించుకున్న తేల్లూరి బాలకృష్ణకు ఆయన స్నేహితులు సోమవారం రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల గొల్ల గూడెం నుంచి తల్లాడ వెళ్తుండగా బాలకృష్ణ గాయపడ్డాడు. ఆయన కు శస్త్రచికిత్స జరగడంతో 2005లో పదో తరగతి బ్యాచ్మేట్లు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండ్ల బాలకృష్ణ, గుండ్ల రమేష్, ఇస్నేపల్లి నాగేశ్వర్రావు, చల్లా మురళి తదితరులు పాల్గొన్నారు. -
సాయి మందిరంలో ‘అక్షయపాత్ర’ విగ్రహం
ఖమ్మంగాంధీచౌక్: ఖమం గాంధీచౌక్లోని షిర్డీ సాయి మందిరం వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అక్షయపాత్ర విగ్రహాన్ని షిర్డీ సంస్థాన్ సీఈఓ గోరక్ష ఘడిల్టర్ బాబా ఆవిష్కరించారు. మందిరం చైర్మన్ డాక్టర్ వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల చైర్మన్లను సన్మానించడమే బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండా వీరేంద్రదాస్, రేణుక, మల్లయ్య, అర్వపల్లి నిరంజన్, పీవీడీ.ప్రసాద్, కురువెల్ల జగన్మోహన్రావు, డాక్టర్ వేములపల్లి నరేష్, శ్రీనివాసరావు, నగేష్, గన్నవరపు నాగేశ్వరరావు, ఎం.శ్రీధర్, కె.శ్రీనివాస్, శీలం హన్మంతరావు, బోనగిరి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. -
● రెజొనెన్స్ ఉత్తమ ప్రతిభ
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయభేరి మోగించారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్వీ.నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడారు. ఎల్.రామ్మోహన్ రెడ్డి 99.09 పర్సంటైల్, కె.లహరి 96.34, ఎం.మోక్షిత 94.22, జి.భరత్చంద్ర 93.76, ఎండీ.నిఖత్ 93.94, శ్రీవర్షిణి 93.61 పర్సంటైల్ సాధించగా, 68శాతం మందికిపైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్కు అర్హత సాధించారని తెలిపారు. ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి
● మధిరకు త్వరలోనే డెవలప్మెంట్ కమిటీ ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమధిర: మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్గా, అత్యంత అనువైన నివాస యోగ్యమైన పట్టణంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. మధిరలో సోమవారం నూతన కౌన్సిలర్లతో సమావేశమైన ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు అఖండ విజయాన్ని చేకూర్చిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలిపారు. అత్యంత బాధ్యతగా పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత.. ఈ మూడు అంశాల ఆధారంగా మధిర వాసులకు మెరుగైన పాలన అందిస్తామన్నారు. కాగా, మధిర పట్టణాన్ని భవిష్యత్ తరాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దేలా పాలకవర్గ బాధ్యులు ఇకపై రాజకీయాలను పక్కన పెట్టి కేవలం అభివృద్ధి నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మధిరను అభివృద్ధి చేసేందుకు పట్టణంలోని పెద్దలు, మేధావులతో రాజకీయాలకు అతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ చేయాల్సిన అభివృద్ధిపై పాలకవర్గానికి సలహాలు, సూచనలు ఇస్తుందన్నారు. అంతేకాక ప్రతీనెల తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోనా ధనికుమార్, మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, సూరంశెట్టి కిషోర్, మిరియాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వైరా అభివృద్ధి బాధ్యత నాదే... వైరా: వైరా మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైరా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై న డాక్టర్ కాపా చంద్రకళ, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్నాయక్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు మధిరలో భట్టిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం సంపూర్ణంగా అందజేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తానన్నారు. లయన్స్క్లబ్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్ కాపా మురళీకృష్ణ, చంద్రకళ దంపతులు రాజకీయాల్లోనూ రాణించాలన్నారు. కౌన్సిలర్లు, నాయకులు ఉండ్రు వరలక్ష్మి, నిమ్మతోట శ్రావణి, లగడపాటి లక్ష్మీరాజ్యం, లగడపాటి ప్రభాకర్రావు, శీలం చంద్రశేఖరరెడ్డి, వేముల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కొలువులు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపాలిటీల్లో రాజకీయ పరంగా కొత్త కొలువులు భర్తీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం సాఫీగా ముగిసింది. మెజార్టీ కౌన్సిలర్ల బలంతో ఆరు మున్సిపాలిటీలనూ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇల్లెందు మున్సిపాలిటీలో మాత్రం చైర్మన్ అభ్యర్థి విషయంలో ‘పీఠ’ముడి వీడకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మిగిలిన చోట్ల టీపీసీసీ నుంచి సీల్డ్ కవర్లో వచ్చిన పేర్లను క్యాంపుల్లో ఉన్న సభ్యులకు ముందే చెప్పడంతో సమావేశంలో వారి పేర్లను ప్రతిపాదించాక ఏకగ్రీవంగా ఆమోదించారు. చైర్మన్ ఎన్నికకు సరిపడా బలం ఉన్నా ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైరా, సత్తుపల్లిలో ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి హాజరయ్యారు. కల్లూరు కై వసం కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. ఇక్కడ 7వ వార్డు నుంచి గెలిచిన ధరావత్ మోహన్ చైర్మన్గా ఎన్నికవగా.. 5వ వార్డు కౌన్సిలర్ శీలం కోటీశ్వరి వైస్ చైర్మన్ అయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు కాంగ్రెస్ పార్టీ 12, బీఆర్ఎస్ ఏడింటిని కై వసం చేసుకుంది. మరో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. బీఆర్ఎస్ సభ్యులు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ ఎన్నిక సమయాన బయటకు వెళ్లారు. దంపతులు ‘పేట’ పాలనాధీశులు.. అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో 22 వార్డులకు కాంగ్రెస్ 17, బీఆర్ఎస్, స్వతంత్రులు రెండు చొప్పున, బీజేపీ ఒక వార్డులో గెలిచింది. మెజార్టీ కౌన్సిలర్ల బలంతో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను సొంతం చేసుకుంది. ఆరో వార్డు నుంచి విజయం సాధించిన జూపల్లి శశికళ చైర్మన్గా, 13వ వార్డు నుంచి గెలిచిన జూపల్లి రమేశ్బాబు వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ దంపతులు కావడం విశేషం. సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రేసులో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు ఉన్నా 22వ వార్డు నుంచి గెలిచిన ఎండీ.రెహనాబేగంకు అవకాశం దక్కింది. జనరల్ మహిళకు ఈ పదవి రిజర్వ్ అయింది. వైస్ చైర్మన్గా మూడో వార్డు కౌన్సిలర్ బొంతు సుమలత ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్ నుంచి 17 మంది, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ ఎన్నిక సమయాన బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వినియోగించుకున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 24 మందికి గాను బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యులు 21 (ఇండిపెండెంట్లు ఇద్దరితో కలిపి) మంది హైదరాబాద్లోని క్యాంపు నుంచి బయలుదేరి ఇల్లెందుకు వచ్చే సరికి సమావేశ సమయం ముగిసింది. దీంతో ప్రమాణ స్వీకారం మంగళవారం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ మధు వెల్లడించారు. ఇక్కడ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. పదవికి ముగ్గురు పోటీ పడుతుండడంతో, ఎవరన్నది తేలక సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. వైరా మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆరో వార్డు నుంచి గెలిచిన డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్గా 9వ వార్డుకు చెందిన కట్ల సంతోష్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి 12మంది, ఇండిపెండెంట్ ఒకరు వీరికి ఓటు వేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఐదుగురు, సీపీఎం, సీపీఐ నుంచి గెలిచిన ఒక్కొక్కరు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ ఎన్నిక ముగిసే వరకూ సమావేశంలోనే ఉన్నారు. నగర పంచాయతీగా ఉన్న మధిర 2020లో మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి బీఆర్ఎస్ పుర పీఠం దక్కించుకుంది. ఇప్పుడు మెజార్టీ వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందగా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కై వసం చేసుకుంది. మొత్తం 22 వార్డులకు గాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. మరో వార్డు బీఆర్ఎస్కు దక్కింది. చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో 4వ వార్డు నుంచి విజయం సాధించిన సామినేని సుజాత చైర్మన్గా, 18వ వార్డు నుంచి గెలిచిన కోనా ధనికుమార్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఎక్స్ ఆఫీషియో హోదాలో హాజరయ్యారు. ఆరు మున్సిపాలిటీలపై ‘హస్తం’ పీఠాధిపతులు ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 24 మంది కౌన్సిలర్లు గెలవగా, సీపీఐ నుంచి ముగ్గురు, మరో ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం చైర్మన్, వైస్ చైర్మన్కు మద్దతు తెలిపారు. దీంతో 28 మంది మద్దతు చైర్పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థులకు దక్కింది. చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా 23వ వార్డు నుంచి గెలిచిన పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్గా 14వ వార్డుకు చెందిన తమ్మినేని నవీన్ను ఎన్నుకున్నారు. కాగా, సీపీఎం నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశాక బయటకు వెళ్లిపోయారు. -
నూతన పాలకవర్గాలకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికై న మేయర్, చైర్మన్తో పాటు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వాన పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా చింతకాని: జిల్లాలోని చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,917.16 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 300 మె.టన్నులు కేటాయించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్కుమార్ తెలిపారు. అలాగే, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, మిగతా 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. సీహెచ్సీలో కాయకల్ప బృందం పరిశీలన నేలకొండపల్లి: నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సోమవారం కాయకల్ప బృందం పరిశీలించింది. ఇంటర్నల్ అసిస్టెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు ఆధ్వర్యాన వచ్చిన బృందం ఆస్పత్రి పరిసరాలు, ఇక్కడ అందుతున్న చికిత్స, ఇస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించిపలువురితో మాట్లాడారు. ఆతర్వాత వైద్యులతో సమావేశమై రోజువారీ ఓపీ, మందుల లభ్యతపై చర్చించారు. వైద్యాధికారులు మంగళ, కె.రాజేష్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు, వినతిపత్రాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పరిష్కారంపై సూచనలు చేశారు. ఫిర్యాదుల్లో కొన్ని.. రఘునాథపాలెం మండలం మంచుకొండ, కోయచిలక రైతులకు మంచుకొండ, కోయచిలక రెవెన్యూ పరిధిలో భూములు ఉండగా, వెళ్లేందుకు కొందరు అడ్డుపడుతున్నందున న్యాయం చేయాలని కోరారు. కొణిజర్లకు చెందిన సయ్యద్ లాల్ బీ తన భూమి అసైన్డ్ జాబితాలో చేరినందున పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభివృద్ధి పనులకు మంజూరైన రూ.28లక్షల నిధుల వ్యయంలో అక్రమాలు జరుగుతున్నాయని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి మస్తాన్, నాయకులు శ్రీకాంత్, రాము ఫిర్యాదు చేశారు. దివ్యాంగులు రాణించాలి ఖమ్మం సహకారనగర్: దివ్యాంగ విద్యార్థులు పట్టుదలతో ముందు సాగుతూ ఇతర రంగాలతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. దివ్యాంగ విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్తున్న వారి బస్సును కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేలా పోటీలు దోహదపడతాయన్నారు. హైదరాబాద్లో మంగళవారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి అండర్–14, 16 విభాగాల్లో 20 మంది పాల్గొంటున్నారని తెలిపారు. గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పన జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కావాల్సిన వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ అంశాలపై సమీక్షించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత మెరుగుపరచాల్సిన అవసరముందన్నారు. అలాగే, గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం ఈజీఎస్ ద్వారా చేపట్టేలా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. కాగా, వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదురుకాకుండా ముందస్తు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. ఆతర్వాత రబీ ధాన్యం కొనుగోళ్లు, ప్రమాదాల నివారణకు బ్లాక్స్పాట్ల వద్ద చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈసమావేశాల్లో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు, ఏఎస్ఓ భానుప్రకాష్, డీఎస్ఓ శ్రీనివాస్, సీఎంఓ బి.ప్రవీణ్కుమార్, వివిధ శాఖల అధికారులు యాకూబ్, రామారావు, రాజశేఖర్, చందునాయక్, శ్రీలత, రాంబాబు, పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు. -
మేయర్ పీఠంపై సీపీఐ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ – కాంగ్రెస్ మిత్రపక్షాలకు చెందిన మొదటి పాలవర్గం కొలువుదీరింది. దీంతో మూడు రోజుల ఉత్కంఠకు తెర పడింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లలో గెలిచి అతి పెద్ద పార్టీలుగా అవతరించిన సీపీఐ, కాంగ్రెస్ చెరి రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించాయి. ఆ మేరకు సీపీఐ తరఫున 20వ డివిజన్ నుంచి గెలుపొందిన మూడ్ గణేశ్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తరఫున 8వ డివిజన్ నుంచి గెలుపొందిన సిరిపురం లలితకుమారికి దక్కింది. సీపీఐ, కాంగ్రెస్, సీపీ ఎం, బీజేపీతో పాటు స్వతంత్రులుగా గెలిచిన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి హాజరు కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది కొత్తగూడెంలోనే ఉన్నప్పటికీ గైర్హాజరయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులతో కలిసి జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లికి వందనం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ తరఫున ప్రకటన విడుదల చేశారు. సాఫీగా సాగిపోయింది తెలంగాణలో తొలిసారిగా క్యమూనిస్టు పార్టీ నేతృత్వాన కార్పొరేషన్లో పాలకవర్గం ఏర్పాటైంది. అంతకు మూడు రోజుల ముందు దీనిపై రాష్ట్ర స్థాయిలో హైడ్రామా చోటుచేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధిష్టానం జోక్యం చేసుకోవడంతో సీపీఐ – కాంగ్రెస్ పార్టీల నుంచి ‘పవర్ షేరింగ్’ ప్రకటన వచ్చింది. అయితే, అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల నుంచి సంయుక్త ప్రకటన, సమావేశాల వంటివి జరగలేదు. పైగా ఎవరికి వారే అన్నట్టుగా తమ శిబిరాలను కొనసాగించారు. దీంతో ప్రమాణ స్వీకారం రోజున ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. అయితే, నాటకీయ పరిణామాలకు ఇరు పక్షాలు తావివ్వలేదు. పవర్ షేరింగ్ ఒప్పందంలో కీలక భూమిక పోషించిన సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కొత్తగూడెం చేరుకున్నారు. వీరితో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, డీసీసీ అధ్యక్షురాలు తోటి దేవీప్రసన్న కలిసి సీపీఐ, కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్లతో ఉదయం 11–30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ వెనుకే మరికొందరు కార్పొరేటర్లతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా వచ్చారు. అప్పటికే ఇరు పక్షాలు చర్చించుకోవడంతో మేయర్ పదవి సుజాతనగర్ ప్రాంతానికి దక్కగా, డిప్యూటీ మేయర్ పాల్వంచకు వెళ్లింది. అంతకుముందు సీపీఐతో పవర్ షేరింగ్ చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ కాంగ్రెస్ తరఫున 26వ డివిజన్ నుంచి గెలిచిన దుంపల రాజేశ్వరరావు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. పాలకవర్గంతో తనకు సంబంధం లేదని, తాను ప్రతిపక్ష పాత్ర తీసుకుంటానని ఆయన ప్రకటించారు. కూనంనేని అభినందనలు.. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన మూడ్ గణేశ్ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభినందిచారు. ఆయనతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా తదితరులు గణేశ్ను మేయర్ సీటులో కూర్చోబెట్టారు. కొత్తగూడెంలో సాఫీగా సాగిన ‘మిత్రపక్షం’ప్రమాణ స్వీకారం -
కోడి పందేలకు వచ్చి మృత్యువాత
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం గ్రామ సమీపంలోని మామిడి తోటలో నిర్వహించిన కోడిపందేల జూదానికి వచ్చి ఓ వ్యక్తి మృత్యువాత పడిన దుర్ఘటన ఈనెల 13న చోటు చేసుకుంది. కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి చేసిన క్రమంలో ఏపీ రాష్ట్రం మైలవరం మండలం గుర్రాజుపాలెం గ్రామానికి చెందిన సుంకర కృష్ణారావు (36) ఆందోళనకు గురై అక్కడ నుంచిపరారవుతూ సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తు పడి మృత్యువాత పడ్డాడు. కృష్ణారావు ఆచూకీ కోసం కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించగా.. బావిలో ఉన్న మృతదేహాన్ని శనివారం రాత్రి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య లీలాభవాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
కొలువుదీరేది నేడే..
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా ముగిసి, ఫలితాలు వెలువడడంతో ఇప్పుడు అందరి దృష్టీ చైర్మన్ పీఠాలపై పడింది. చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులు ఎవరికి దక్కుతాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదులాపురం మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేయగా.. మిగిలిన చోట్ల ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. ప్రిసైడింగ్ అధికారుల నియామకం.. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు ఐదుగురు గెజిటెడ్ హోదా గల వారిని ప్రిసైడింగ్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదులాపురానికి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మధిరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారి నవీన్బా బు, వైరాకు ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, సత్తుపల్లికి కలూర్లు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, కల్లూరుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరిని నియమించారు. ఉదయం ప్రమాణ స్వీకారం.. మధ్యాహ్నం ఎన్నిక కొత్తగా ఎన్నికై న మున్సిపల్ కౌన్సిలర్లతో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కౌన్సిల్ ఏర్పాటు చేసి కోరం పూర్తయితే చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికను పరోక్ష పద్ధతిన నిర్వహిస్తారు. కోరం పూర్తి కాకుంటే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. అయితే ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు మెజార్టీ స్థానాలు దక్కడంతో ఆ పార్టీకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఇన్చార్జి మంత్రి ద్వారా మున్సిపల్ అధికారులకు విప్ కూడా జారీ చేయగా, గెలుపొందిన వారితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు హాజరు కానున్నారు. అక్షర క్రమంలో పిలుపు.. మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంలో అధికారులు క్రమ పద్ధతిని పాటించనున్నారు. సభ్యుల నామినేషన్ పత్రాల్లో ని పేర్ల ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు. ఎవరైనా ఇంగ్లిష్లో పత్రాన్ని నింపితే.. ముందుగా తెలుగులో పేర్లున్న వారితో ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత మిగిలిన వారిని పిలుస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్లను కౌన్సిలర్లు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నుకుంటారు. ఒక్కరే అభ్యర్థి ఉన్నచోట ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఆ అభ్యర్థిని ఒక కౌన్సిలర్ ప్రతిపాదించగా.. మరో కౌన్సిలర్ ఆమోదించాల్సి ఉంటుంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక బాధ్యతను అధిష్టానం తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సూచనతో పాటు పార్టీ అనుసరిస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఐదు మున్సిపాలిటీల చైర్మన్ల పేర్లను, వారికి సంబంధించిన బీ –ఫామ్లను సీల్డ్ కవర్లలో పెట్టి ఇన్చార్జి మంత్రి కొండా సురేఖకు అందజేశారని, ఆదివారం రాత్రికే జిల్లాకు చేరుకున్న మంత్రి.. సోమవారం ఉదయం ఆయా ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లను అందజేసి, అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. క్యాంపు నుంచి కౌన్సిల్కు.. మున్సిపల్ ఎన్నికల అనంతరం సత్తుపల్లి, కల్లూరు, వైరా మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ వార్డు సభ్యులను ఈనెల 13న రాత్రే హైదరాబాద్ క్యాంపునకు తరలించారు. వారు తిరిగి సోమవారం ప్రత్యేక బస్సుల ద్వారా ఆయా మున్సిపాలిటీలకు చేరుకోనున్నారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాతనే ఇంటికి వెళ్లనున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆయా ఎమ్మెల్యేలు పేర్లు నమోదు చేసుకున్నారు. మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరాలో మాలోత్ రాందాస్ నాయక్ పేర్లు నమోదు చేసుకోగా వారు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొంటారు. విప్ల నియామకంమున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ విప్లను నియమిస్తూ టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసిందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. ఏదులాపురానికి తుంబూరు దయాకర్ రెడ్డి, మధిరకు కోనా ధనికుమార్, వైరాకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కల్లూరుకు పొంగులేటి ప్రసాదరెడ్డి, సత్తుపల్లికి ఎమ్మెల్యే మట్టా రాగమయిని నియమించినట్లు పేర్కొన్నారు.జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మెజార్టీ వార్డులను గెలుచుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆశించేవారి నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవికి 23వ వార్డు నుంచి గెలిచిన పోకబత్తిని అనిత, 9వ వార్డు నుంచి గెలిచిన కందుకూరి శేషమ్మ పోటీ పడుతున్నారు. మధిరలో చైర్మన్ పదవిని 6వ వార్డు నుంచి గెలిచిన వేమిరెడ్డి లక్ష్మీతులసి, 8వ వార్డు నుంచి గెలిచిన యన్నం కోటేశ్వరరావు, 12వ వార్డు నుంచి గెలిచిన మోదుగు నాగలక్ష్మి ఆశిస్తున్నారు. వైరాలో 3వ వార్డు నుంచి గెలిచిన బొర్రా ఉమాదేవి, 6వ వార్డు నుంచి గెలుపొందిన కాపా చంద్రకళ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. సత్తుపల్లిలో చైర్మన్ పదవి కోసం ఎండీ రెహనా బేగం, తోట సుజల రాణి, బొంతు సమలత పోటీ పడుతున్నారు. కల్లూరులో ధరావత్ మోహన్ నాయక్, బాణోత్ మారోని చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవికి కూడా పోటీ తీవ్రంగా నెలకొంది. మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి -
త్వరలో రుద్రంపూర్ బొల్లిగుట్ట కనుమరుగు
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్లో గల సుమారు వేయేళ్ల క్రితం ఏర్పడిన బొల్లిగుట్ట వచ్చే ఏడాదిలో కనుమరుగు కానుంది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీ ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ గుట్టను తీసేందుకు సింగరేణి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుమారు 600 అడుగుల ఎత్తు, 1.3 కి.మీ. పొడవు, సుమారు 100 మీటర్ల వెడల్పు గల ఈ గుట్టను తీయడానికి సుమారు 9 మాసాలు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గుట్ట కింద జీ–7, జీ–8లతో పాటు ఇతర గ్రేడ్ల బొగ్గు అధికంగా ఉన్నట్లు సింగరేణి అధికారుల ఎక్స్ప్లోరేషన్ సర్వేలో వెల్లడైంది. ఈ నాణ్యమైన బొగ్గు తీయాలంటే ఈ గుట్టను తవ్వడం తప్పనిసరి కానుంది. దీనిలో రానున్న కొన్ని వేల ట్రక్కుల రాళ్లు, మట్టిని (ఇతర మైటీరియల్)ను జీకేఓసీలో గతంలో బొగ్గు తవ్విన క్యావెట్రీ (ఖాళీ స్థలంలో) పోయడానికి సిద్ధపడినట్లు తెలిసింది. -
ప్రమాదమా..? పథకం ప్రకారమా?
● మోతె వద్ద రక్తపు మడుగులో యువకుడు ● స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలింపు ● విషమంగా యువకుడి ఆరోగ్య పరిస్థితి బూర్గంపాడు: మోతె పట్టీనగర్ గ్రామ సమీపంలోని ఎదుర్లవాగు బ్రిడ్జి వద్ద శనివారం ఓ యువకుడు రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు క్షతగాత్రుడిని భద్రాచలానికి తరలించారు. క్షతగాత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన కట్టా యశ్వంత్గా గుర్తించారు. అతని తలకు తీవ్రగాయాలు కావడంతో అతడి బంధువులు గుంటూరుకు, అక్కడి నుంచి ఖమ్మానికి తరలించారు. సోషల్ మీడియాలో వార్తలు.. గన్నవరం గ్రామానికి చెందిన యశ్వంత్ కొంతకాలం సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేశాడు. ప్రస్తుతం అతను ఐటీసీలో పని మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. శనివారం సాయంత్రం యశ్వంత్ అశ్వాపురం మండలం వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే రోజు రాత్రి అశ్వాపురం మండలంలో ఓ యువకుడిపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు రాగా.. ఇది మోతె పట్టీనగర్ బ్రిడ్జి వద్ద ఘటనను నిర్థారణ చేస్తోంది. యశ్వంత్ అంటే గిట్టనివారు దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని చర్చసాగుతుంది. అయితే యశ్వంత్ పడిఉన్న దగ్గర నుంచి కొద్దిదూరంలో అతను వేసుకొచ్చిన స్కూటీ బాగానే ఉండగా.. ఏమైనా వాహనాలు ఢీకొట్టినట్లు ఆనవాళ్లు ఏమీ కనపడకపోవడం గమనార్హం. దాడిపై పలు అనుమానాలు.. యశ్వంత్ తన తల్లిదండ్రులు మృతిచెందడంతో మేనమామ వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో జాబ్ మానేసిన అతడు శనివారం రాత్రి అలా రక్తపు మడుగులో పడి ఉండడంపై ప్రేమికుల రోజున అతనిని నమ్మించి ఇక్కడకు రప్పించి పథకం ప్రకారమే దాడి చేశారా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారం కాని, వివాహేతర సంబంధం కాని కారణమని స్థానికంగా చర్చ సాగుతుంది. ఈ విషయమై బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ను వివరణ కోరగా.. శనివారం రాత్రి మోతె పట్టీనగర్ వద్ద ప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని, దీంతో రోడ్డు ప్రమాదం జరిగిందనే అనుమానంతో అటుగా వస్తున్న వాహనాలను తనిఖీ కూడా చేశామన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బాధితుని తరఫున ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. -
బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాను 2030 నాటికి బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని, ఇందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రసాదరావు అన్నారు. ఆదివారం జిల్లాలో బాల్య వివాహ ముక్త్ భారత్ రథయాత్రను నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదరికం, మూఢనమ్మకాలతో పోరాడి బాల్య వివాహాలను అంతం చేయాలని, చదువు ద్వారానే విద్యార్థులు జీవితంలో స్థిరపడాలని పిలుపునిచ్చారు. ఎయిడ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భారతరాణి, సంస్థ డైరెక్టర్ హరి ప్రసాదరావు తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే చెల్లించాలి ఖమ్మంఅర్బన్: రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జయనగర్ కాలనీలో గుండెపోటుతో మృతి చెందిన రిటైర్డ్ హెచ్ఎం గౌస్ మృతదేహానికి ఆదివారం నివాళులర్పించాక ఆయన మాట్లాడారు. గౌస్ 2025 ఆగస్టులో ఉద్యోగ విరమణ పొందినా ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదని, అనారోగ్యంతో ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశాంత జీవనం గడపడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శిథిలావస్థలో హాస్టల్ వసతి.. బోనకల్: మండలంలోని జానికీపురం ఎస్సీ హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతుండడంతో ఆదివారం పీడీఎస్యూ ఆధ్వర్యాన హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నాక పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు గోకెనపల్లి మస్తాన్ మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన హాస్టల్లో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, మరుగుదొడ్లు సరిపడా లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా కమిటీ సభ్యులు నాగార్జున, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు టేకులపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను అటు వైపు వచ్చిన ఇల్లెందు డీఎస్పీ స్పందించి ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన ఉప్పలి ప్రసాద్, ఇల్లెందుకు చెందిన జాగంటి విల్సన అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆదివారం రాత్రి కొత్తగూడెం నుంచి ఇల్లెందుకు బయలుదేరారు. ఈక్రమంలో రోళ్లపాడు క్రాస్రోడ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంలో వారిద్దకీ తీవ్ర గాయాలై రోడ్డుపై పడ్డారు. కొంతసమయం తర్వాత టేకులపల్లి మండలంలో శివరాత్రి వేడుకల పర్యవేక్షణ ముగించుకుని ఇల్లెందుకు బయలుదేరిన ఇల్లెందు డీఎస్పీ వెంకన్న బాబు వారిని చూసి వెంటనే 108 ద్వారా ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రసాద్కు కాలు, చెయి విరిగి తలకు గాయాలు కాగా, విల్సన్కు కూడా కాలు, చేతులు విరగడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు. మణుగూరు టౌన్: మండలంలోని ఉడతనేనిగుంపు శివారు ప్రాంతంలో మోటార్సైకిల్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన ఇర్ప సుధీర్(21) తన వ్యక్తిగత పనిమీద పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉడతనేనిగుంపు వద్ద ఉన్న ఓ చెట్టు వేగంగా ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. -
ఫుడ్ ఫెస్టివల్.. వేరే లెవల్
ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది తమ ఆహారపు అలవాట్లలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అనారోగ్యపాలవుతున్నట్లు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఈ సమయంలో నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జంక్ఫుడ్ వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ, తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేలా ఇటీవల ఫుడ్ఫెస్టివల్ను సైతం నిర్వహించారు. హడావుడిగా.. మారుతున్న పరిస్థితుల్లో అనేక మంది హడావుడిగా తినడంతో వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. ప్రధానంగా ఉబకాయం, మధుమేహం, గుండెపోటు వంటి సమస్యలతో యువత బాధపడుతుండగా.. మంచి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తపై ఫుడ్ ఫెస్టివల్ ఎంతో ఉపకరించింది. వినూత్న ప్రదర్శన.. జంక్ఫుడ్లు తినకుండా పండ్లు, కూరగాయలు రసాయనాలు ఉపయోగించని ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చనే అంశాన్ని తెలియజేసేందుకు విద్యార్థులు వినూత్నంగా ఫుఢ్ఫెస్టివల్ను నిర్వహించారు. ఇందులో ప్రధానంగా హెర్బల్ టీ, జొన్న ఉప్మా, మిల్లెట్ పిజ్జా, హెర్బల్ పానియాలు, కొర్రల పాయసం తదితర పదార్థాలు ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా అందరిని ఆకట్టుకున్నాయి. ఏక్యుఏసీ, మైక్రో బయాలజీ, గర్ల్స్ సెఫ్టీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జంక్ ఫుడ్ వద్దు.. స్వచ్ఛమైన ఫుడ్ ముద్దు -
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
● అన్ని హంగులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నాం ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర: భవిష్యత్లో ప్రభుత్వ పాఠశాలలో చదవడం తమ అదృష్టంగా విద్యార్థులు భావించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిరలోని తేళ్ల వసంతయ్య మెమోరియల్ (టీవీఎం) ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం 48వ వార్షిక సమ్మేళనం ఆదివారం నిర్వహించగా, భట్టి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 48వ వార్షిక సంచికను ఆవిష్కరించిన ఆయన, విద్యారంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు. అత్యాధునిక వసతులతో పాఠశాలలను పునర్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి విజ్ఞాన కేంద్రాలని అన్నారు. బడ్జెట్లో విద్యకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, డిజిటల్ విద్యా విధానం, తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, బాలికలకు ప్రత్యేక వసతులు, లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాలతో పోటీపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నామని వివరించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే ప్రజాప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. సమాజానికి తిరిగి ఇవ్వండి పూర్వ విద్యార్థులు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాల, సమాజానికి తిరిగి ఏమి ఇవ్వగలరో ఆలోచించాలని డిప్యూటీ సీఎం సూచించారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావాలని సూచించారు. పెద్దల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. విద్యార్థులను భావి భారత మార్గదర్శకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపైనే ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు కేవలం అక్షరాలను మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో భాషా సంస్కారాన్ని, విలువల పట్ల గౌరవాన్ని పెంపొందించాలని, నాయకుల తప్పుడు ధోరణులను గుడ్డిగా అనుసరించకుండా, విజ్ఞతతో వ్యవహరించేలా వారిని మేధావులుగా మార్చాలని కోరారు. పాఠశాల దశలో నైతిక పునాదులు బలంగా పడితేనే, భవిష్యత్లో ఈ విద్యార్థులు సమాజానికి వెలుగునిచ్చే బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగగలరని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థి సంఘం సావనీర్ను ఆవిష్కరించారు. -
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
ఖమ్మంవ్యవసాయం: మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి పలుచోట్ల ఆలయాల్లో స్వామివారి కల్యాణం నిర్వహించారు. భక్తులు వేలాదిగా పాల్గొనగా విద్యుత్ సరఫరాకు అంతరాయం రాకుండా ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. సరఫరాలో ఆటంకం రాకుండా లైన్ల వెంట ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు తీర్థాల, కూసుమంచి, స్నానాల లక్ష్మీపురం, పెనుబల్లి మండలం నీలాద్రి తదితర ఆలయాల వద్ద విధులు నిర్వర్తించారు. జిల్లా వాలీబాల్ జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి యూత్ వాలీబాల్ జట్ల వివరాలను వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.గోవిందారెడ్డి ఆదివారం వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసిన బాలబాలికల జట్లు సోమవారం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి యూత్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. బాలుర జట్టుకు పి.సాయికృష్ణ, ఈ.ప్రణయ్, కె.చరణ్రాజ్, కృష్ణవంశీ, ప్రశాంత్, రుణ్తేజ్, వి.రాజేష్, బి.అజయ్, ఆశోక్, గోపినాథ్, రాజు, శివసాయిగణేష్, జానీ ఎంపికయ్యారని పేర్కొన్నారు. అలాగే, బాలికల జట్టులో ఆసియాబేగం, షేఖ్ పోని, షేక్ జాస్మిన్. సీహెచ్.వర్చన, సీహెచ్.వైష్ణవి, సీహెచ్.జ్యోత్స్న అవిజ్ఞ, బి.రిషికా, వి.ప్రణతి, బి.ప్రద్విక, ఎస్.రుత్విక, బి.అరవింద, పి.ఉమా, జి.ఉషా, ఎం.గ్రేసీకి స్థానం దక్కిందని వివరించారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనఖమ్మంవ్యవసాయం: ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యే పండుగలు, జాతరల వద్ద అవగాహన కల్పించేలా జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యాన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయడమే కాక సమస్యల పరిష్కారానికి 87422 95323 నంబర్ను అందుబాటులో ఉంచారు. మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని అటవీ ప్రాంతాల సమీపాన ఉన్న ఆలయాల వద్ద భక్తులకు అవగాహన కల్పించారు. ఎకో టూరిజంగా పేరుగాంచిన పులిగుండాల అటవీ ప్రాంతం సమీపంలోని వీరభద్రస్వామి ఆలయంతో పాటు మరికొన్ని చోట్ల ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ రహిత క్షేత్రాలుగా.. అటవీప్రాంతంలో ఉన్న ఆలయాల వద్ద ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిళ్లు, కవర్ల వాడకా న్ని నిషేధించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అడవుల్లో వేస్తే వన్యప్రాణులు తిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని భక్తులకు అవగాహన కల్పించారు. కాగా, భక్తుల కోసం ప్రథమ చికిత్సా కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. -
శివాలయాల్లో పొంగులేటి పూజలు
ఖమ్మంరూరల్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని సంగమేశ్వరస్వామి, కూసుమంచి గణపేశ్వరాలయం, భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు కనకగిరి గుట్టలపై వేంచేసి ఉన్న వీరభద్రస్వామి ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని పరమశివుడిని వేడుకున్నట్లు తెలిపారు. -
డయాలస్ట్రెస్..!
పెరుగుతున్న కిడ్నీ బాధితులు ● తక్కువ సెంటర్లతో విడతల వారీగా రక్తశుద్ధి ● అందుబాటులో లేని నెఫ్రాలజిస్టులు ● నామమాత్రంగా వైద్య సేవలుఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాలో కిడ్నీ వ్యాధితో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు, నియంత్రలేని జీవన శైలిలో మార్పు, అవగాహన లేక కిడ్నీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. బీపీ, షుగర్ బారిన పడిన వారిలోనూ ఈ సమస్యలు పెరుగుతుండడంతో డయాలసిస్ బాధితులు ఎక్కువవుతున్నారు. అయితే డయాలసిస్ బాధితులకు ఉమ్మడి జిల్లాలో బాధితులకు తగినన్ని డయాలసిస్(రక్తశుద్ధి) కేంద్రాలు లేక హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రక్తశుద్ధి చేయించుకుంటే గానీ వారి జీవనం సాగే పరిస్థితి కనబడడం లేదు. ఉమ్మడి జిల్లాలో 600 మంది.. కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ డయాలసిస్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకుని రక్తశుద్ధి చేయించుకుంటున్న వారి సంఖ్య 600 మంది వరకు ఉన్నారు. అయితే ఇక్కడ అవకాశం లేనివారు హైదరాబాద్ వంటి నగరాలకు తరలివెళ్తున వారి సంఖ్య దాదాపుగా అదే సంఖ్యలో ఉండి ఆర్థికంగా నష్టపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 68 డయాలసిస్ మిషన్లు ఉండగా.. 340 మంది బాధితులు రక్త శుద్ధి చేయించుకుంటుండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 56 మిషన్లకు గాను 260 మంది బాధితులు విడతల వారీగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో తగినన్ని డయాలసిస్ కేంద్రాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బెడ్డు ఖాళీగా ఉంటే వారి వంతు వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ బెడ్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేరు బాధితులు డయాలసిస్ మిషన్లు ఖమ్మం 146 22 సత్తుపల్లి 38 05 కొత్తగూడెం 63 10 భద్రాచలం 52 10 పాల్వంచ 40 10 మణుగూరు 32 05 ఇల్లెందు 30 08 చర్ల 03 05ఉమ్మడి జిల్లాలో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుసంధానంగా కొత్తగూడెం, ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఖమ్మం ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్లో 22 మిషన్లు ఉండగా, 146 మంది, కొత్తగూడెం ఆస్పత్రిలో 10 మిషన్లు ఉండగా.. 63 మంది షిఫ్టుల వారీగా డయాలసిస్ చేయించుకుంటారు. అంతేకాక సత్తుపల్లిలో 38 మంది, భద్రాచలంలో 52, పాల్వంచలో 40, మణుగూరులో 32, అశ్వారావుపేట 23, ఇల్లెందు 30, చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు డయాలసిస్ చేయించుకుంటారు. అయితే ఉమ్మడి జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఉన్నా.. ఒక్క నెఫ్రాలజీ వైద్య నిపుణుడు లేకపోవడంతో సాధారణ ఫిజీషియన్ సమక్షంలోనే వైద్య పరీక్షలు అందిస్తూ నెట్టుకొస్తున్నారు. దీంతో సరైన వైద్య సేవలు అందక బాధితులు ఎక్కువ కాలం బతకలేకపోతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో మృత్యువాత పడే వారి సంఖ్య ఎక్కువ అవుతుండడం అందోళన కల్గిస్తోంది. -
సరుకు భళా.. ధర డీలా!
● మిర్చి పెరుగుతుండడంతో ధర తగ్గుముఖం ● 20 రోజుల్లో క్వింటాకు రూ.2,300 తగ్గిన ధర ఖమంవ్యవసాయం: మిర్చి విక్రయాలు పెరుగుతుండగా.. ధరపై ప్రభావాన్ని చూపిస్తోంది. మిర్చి సీజన్ కొద్ది రోజులుగా ఊపందుకోగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు నిత్యం 30వేల బస్తాల వరకు విక్రయానికి తీసుకొస్తున్నారు. గత శుక్రవారం 40వేల బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. అంతేకాక శనివారం వారాంతపు సెలవైనా వరుస సెలవుల నేపథ్యాన మార్కెట్ నిర్వహించగా 15వేల బస్తాల మిర్చి తీసుకొచ్చారు. ఇక్కడి మార్కెట్లో ‘తేజా’ రకం మిర్చి కొనుగోళ్లకు పేరు ఉండడంతో జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు సరుకు తీసుకొస్తున్నారు. ఖమ్మం వ్యాపారులు ఈ మిర్చిని కొనుగోలు చేసి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే, చైనాలో ఈ రకం మిర్చి సాగుతో ఆర్డర్లు లేక ధరపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దేశీయంగా డిమాండ్ మేరకు మిర్చి కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే, సీజన్ కావడంతో సరుకు పెరుగుతుండగా క్రమంగా ధర తగ్గుతుండడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. ఖమ్మం మార్కెట్లో మిర్చి ధర ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2,300 మేర తగ్గింది. జనవరి 23న రూ.20 వేలు పలికిన ధర ఎంతోకాలం నిలవలేదు. ఈనెల మొదటి వారంలో రూ.19,700 పలకగా, ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. ఈనెల 6న రూ.19వేలు, 10–12వ తేదీ వరకు రూ.18,700గా నమోదైన ధర శనివారం రూ.18,400కు పడిపోయింది. జెండాపాట ధర రూ.18,400 పలికినా మోడల్ ధర రూ.17,500తోనే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక కనిష్ట ధర రూ.10వేలకే పరిమితమైంది. -
రింగ్ లీడర్..!
● మున్సి‘పోల్స్’లో మంత్రి పొంగులేటి కీలక పాత్ర ● ఉమ్మడి ఖమ్మంతో పాటు వరంగల్లో ప్రచారం ● 249 వార్డుల్లో ప్రచారం.. 174 చోట్ల కాంగ్రెస్ గెలుపు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక తక్కువ వ్యవధిలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో సుడిగాలి ప్రచారం చేశారు. పది రోజుల్లో రెండు ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధి 249 వార్డుల్లో ప్రచారం చేయగా 174 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం టూ ఓరుగల్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో మంత్రి ప్రచారం చేశారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల ప్రచారానికి కూడా హాజరయ్యారు. మంత్రి ప్రచారం చేసిన ఏదులాపురం మున్సిపాలిటీలో 24 వార్డులు, కల్లూరులో 12, సత్తుపల్లిలో 17, అశ్వారావుపేటలో 17, ఇల్లెందులో 19వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్లోని భూపాలపల్లి మున్సిపాలిటీలో 16 వార్డులు, పరకాలలో 13, స్టేషన్ఘన్పూర్లో 13 వార్డుల్లో విజయంతో పుర పీఠాలు ఆ పార్టీ ఖాతాలో చేరాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే లేని కొత్తగూడెం కార్పొరేషన్లో ఒంటరిగా పోటీ చేయగా 22 డివిజన్లు పార్టీకి దక్కాయి. అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పథకాలను ఓటర్లకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్గదర్శకత్వంలో తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుందని వెల్లడించారు. స్థానిక పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కలుపుకుంటూ మంత్రి చేసిన ప్రచారంతో మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కు దక్కాయని నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కోడిపందేల స్థావరంపై దాడి
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం సమీపాన మామిడితోటలో కోడిపందేల స్థావరంపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. వైరా ఏసీపీ సారంగపాణి శనివారం వివరాలు వెల్లడించారు. గ్రామ సమీప తోటలో ఏపీ, తెలంగాణలోని మైలవరం, జి.కొండూరు, ఎర్రుపాలెం మండలాలకు చెందిన పలువురు కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందగా ఎస్ఐ రమేశ్కుమార్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 20 మందిని అదుపులోకి తీసుకోగా, వారి నుంచి రూ.43,300 నగదు, తొమ్మిది కార్లు, 23 బైక్లు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, జూదరులకు ఏసీపీ కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, అనుమతి లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు, తరలింపు చేపడితే ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. సమావేశంలో మధిర రూరల్ సీఐ డి.మధు, మధిర, బోనకల్ మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. 20 మందిపై కేసు, రూ.43,300 నగదు స్వాధీనం -
జాతీయ ఉద్యోగుల క్రీడాపోటీలకు వినయ్
ఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడల్లో భాగంగా జిల్లాకు చెందిన ఆర్.వినయ్వర్షిత్ బాస్కెట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. దీంతో ఈ నెల 17 నుంచి న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో ఆయనకు స్థానం దక్కింది. కాగా, వినయ్ ప్రస్తుతం కూసుమంచి మండలం నేలపట్ల జెడ్పీహెచ్ఎస్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తుండగా ఎంపీడీఓ జశ్వంత్కుమార్, హెచ్ఎం రామాచారి, పీవీ రమణ, ఉపాధ్యాయులు అభినందించారు. ముదిగొండ ఈఆర్వో కార్యాలయం మంజూరు ఖమ్మంవ్యవసాయం: ఇటీవల ఏర్పాటైన మధిర విద్యుత్ డివిజన్ పరిధిలో నూతనంగా ముదిగొండ విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని (ఈఆర్వో) మంజూరు చేశారు. దీనిని తాత్కాలికంగా ఖమ్మం త్రీటౌన్ గుట్టలబజార్లోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కార్యాలయ పరిధిలో ముదిగొండ, పమ్మి, నాగులవంచ, చింతకాని సెక్షన్లు చేర్చగా ఏఏఓగా బండి మాధురి బాధ్యతలు స్వీకరించారు. ముదిగొండలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే వరకు ఖమ్మంలోనే ఈ కార్యాలయం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రేక్పాయింట్కు 2,638 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు సీఐఎల్ కంపెనీకి చెందిన 2,638.62 మెట్రిక్ టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,538.62 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్కుమార్ తెలిపారు. మిగతా 200 మెట్రిక్ క్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. జమలాపురం హుండీలో నగదు చోరీ ● తాత్కాలిక ఉద్యోగిపై ఈఓ ఫిర్యాదు ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో తాత్కాలిక ఉద్యోగి ఒకరు శుక్రవారం హుండీలోని నగదు చోరీ చేశారు. ఈ మేరకు ఉద్యోగి బి.విజయ్ హుండీలో నగదు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల పుటేజీతో గుర్తించినట్లు ఈఓ కె.జగన్మోహన్రావు తెలిపారు. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడమే కాక శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు మొదలుపెట్టగా, ఎంత నగదు చోరీ చేశాడనేది త్వరలో వెల్లడిస్తామని ఎస్ఐ రమేశ్కుమార్ తెలిపారు. -
మీకో సగం.. మాకో సగం
● కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ – సీపీఐ మధ్య ఒప్పందం ● చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవి ● తొలుత సీపీఐకి అవకాశంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా కాంగ్రెస్, సీపీఐలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. దీంతో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 9న ఎన్నికలు జరగ్గా, 11న ఫలితాలు వెల్లడయ్యాయి. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ మిత్రపక్షాలకు 22, సీపీఐ మిత్రపక్షాలకు 22 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 31 సీట్లు ఏ ఒక్క పార్టీకీ రాలేదు. మరోవైపు సీపీఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఫలితంగా సీపీఐ 22, బీఆర్ఎస్ ఎనిమిది మంది కార్పొరేటర్ల బలం కలుపుకుంటే మేజిక్ ఫిగర్ చేరేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇదే సమయంలో స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లతో కాంగ్రెస్ సైతం మేయర్ పదవి కోసం ఆరంభంలో ప్రయత్నాలు చేసినా, ఆ తర్వాత అర్ధంతరంగా ఆ ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఇంతలోనే కాంగ్రెస్, సీపీఐలకు చెందిన అగ్రనాయకులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. చివరకు పవర్ షేరింగ్పై ఇరువర్గాల మధ్య శనివారం ఒప్పందం కుదిరింది. అయితే, పవర్ షేరింగ్పై ఇటు కాంగ్రెస్, అటు సీపీఐలో కొత్తగూడేనికి సంబంధించిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ విషయం ఇక్కడితో సమసి పోతుందా లేక సోమవారం వరకు కొనసాగుతుందా అనేది చూడాలి. సీపీఐలో మేయర్ పదవి ఎవరిని వరించునో... సీపీఐ నుంచి 22 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఇందులో మేయర్ పదవి రిజర్వ్ చేయబడిన ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు గెలిచారు. వీరిలో ఒకరు మేయర్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. సీపీఐ తరఫున గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు సైతం కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ డివిజన్ల నుంచి గెలుపొందారు. వేర్వేరు ప్రాంతాలుగా ఉన్న ఈ మూడింటిని ఒక్కటిగా చేస్తూ కార్పొరేషన్గా మార్చారు. ఇప్పుడు మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థులు గెలవడం, వారంతా మేయర్ పదవికి అర్హులై ఉండటం విశేషం. సుజాతనగర్ పరిధిలోకి వచ్చే 20వ డివి జన్ నుంచి మూడు గణేశ్ 277 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పాల్వంచ పరిధిలోకి వచ్చే 31వ డివిజన్ నుంచి నూనావత్ శ్యామల 73 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కొత్తగూడెం పరిధిలో 52వ డివిజన్ నుంచి బానోతు కళావతి 224 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించింది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు. ఆది నుంచీ ఆసక్తి కొత్తగూడెం మేయర్ కుర్చీలో తొలిసారిగా కూర్చునేది ఎవరనే అంశంపై ఆది నుంచీ ఆసక్తి నెలకొంది. కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. మొత్తం 60 డివిజన్లలో 11 డివిజన్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో మేయర్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుని చాలా మంది అశావహులు ఎన్నికల బరిలో దిగారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే వైద్యులు సైతం ఖద్దరు బట్టలు తొడిగి రాజకీయ కదనరంగంలోకి దూకారు. వైద్యుడు భూక్యా శ్రీనివాసరావు జనరల్కు రిజర్వ్ అయిన ఆరో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచారు. ఆయన రికార్డు స్థాయిలో 608 ఓట్ల మెజార్టీ సాధించారు. కొత్తగూడెంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ. సీనియర్ రాజకీయనేత శంకర్నాయక్ సతీమణి స్వప్నా నాయక్ 19వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు కాకుండా మూడో డివిజన్ నుంచి గుగులోతు శ్రీను, 23 డివిజన్ నుంచి బానోతు అనిత, 33 డివిజన్ నుంచి బానోతు బాలు ఉన్నారు. -
పెద్దాస్పత్రిలో క్లిష్టమైన శస్త్రచికిత్స
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి భేష్ అనిపించుకున్నారు. రఘునాథపాలెంనకు చెందిన బి.తరుణ్ (25)కు ఇటీవల జరిగిన ప్రమాదంలో తొంటి ఎముక, కుడికాలి ఎముక విరిగింది. ప్రమాదకర స్థితిలో ఉన్న ఆయనను పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లినా శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ముందుకు రాలేదు. ఆయన 120 కేజీల బరువు ఉండడంతో ఇబ్బందులు వస్తాయని వారు నిరాకరించారు. దీంతో కుటుంబీకులు ఈ నెల 9వ తేదీన తరుణ్ను పెద్దాస్పత్రి ఆర్థోపెడిక్ విభాగానికి తీసుకొచ్చారు. దీంతో హెచ్ఓడీ ఎల్.కిరణ్కుమార్ ఆధ్వర్యాన మంగళవారం ఐదు గంటలకు పైగా శ్రమించి చేసిన శస్త్రచికిత్స విజయమైంది. ఈ బృందంలో వివిధ విభాగాల వైద్యులు వినయ్కుమార్, మసాస్, రష్మీ, రవి, నాగేందర్ పాల్గొనగా మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్ అభినందించారు. -
● నెర్రెలు బారుతోంది...
ముదిగొండ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల పొలాలకు నిరంతరం సాగర్ జలాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పంటలు చేతికి వస్తున్న నేపథ్యాన వారబందీ ఎత్తివేయాలంటూ పలువురు శనివారం తెలిపారు. నిరంతరం నీరు విడుదల చేస్తూ పంటలు ఎండిపోకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ విషయం తెలిసిన ఇరిగేషన్ డీఈ పెద్ద రాంబాబు రైతులతో మాట్లాడారు. ఆదివారం నుంచి సాగర్ నీరు సరఫరా చేస్తామని వెల్లడించిన ఆయన సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. – ముదిగొండ -
ఉత్సాహంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం
కల్లూరు: కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985–86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు శనివారం సమ్మేళనం నిర్వహించారు. 40 ఏళ్ల అనంతరం కలుసుకున్న ఆనాటి విద్యార్థులు పాత జ్ఞాపకాలు, అప్పుడు వ్యవహరించిన తీరును గుర్తుచేసుకున్నారు. ఒకరికొకరు యోగ క్షేమాలు, కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ కొమ్మూరి శ్రీనివాస్, కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ జీవీఆర్ లక్ష్మణ్రావు, భూపాలపల్లి డీఆర్ఆర్ఓ శీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నల్లమల గిరిప్రసాద్ సతీమణి మృతి మధిర: స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఐ మాజీ జాతీయ సహాయ కార్యదర్శి నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) శనివారం మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. మధిర మండలం తొండలగోపవరం గ్రామానికి చెందిన నల్లమల గిరిప్రసాద్ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు అనేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాగా, కమలాదేవి మృతిపై సీపీఐ నాయకుడు బెజవాడ రవిబాబు తదితరులు సంతాపం ప్రకటించారు. రెప్పపాటులో తప్పించుకున్న దొంగలు! నేలకొండపల్లి: ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ముఠా సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని గువ్వలగూడెంలో వారం వ్యవధిలోని మూడు చోట్ల చోరీ జరిగింది. ఈనేపథ్యాన శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో సిబ్బంది అనుమానంతో వచ్చారు. ఈక్రమాన ట్రాన్స్ఫార్మర్ వద్ద అలికిడి వినిపించగా సర్పంచ్కు సమాచారం ఇవ్వడంతో రైతులతో కలిసి చేరుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన దుండగులు బైక్ వదిలేసి పారిపోయారు. పోలీసులు వచ్చి బైక్ స్వాధీనం చేసుకుని నంబర్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. -
● మృత్యుంజయ స్వామి ఆలయం
మధిర: మధిరలోని వైరా నది ఒడ్డున శ్రీమృత్యుంజయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లి అభిషేకం చేసుకునే అవకాశం ఉండడం విశేషం. పంచముఖ ద్వారాలతో కాశీలో మాదిరిగా పడమర దిక్కున వైరా నది, ఉత్తరం దిక్కున శ్మశానం ఉండి చిన్న కాశీగా ఈ క్షేత్రం పేరు పొందింది. తమిళనాడు రాష్ట్రంలోని మధురై పుణ్యక్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు కాశీ నుంచి రైలులో తీసుకెళ్తుండగా ఆ రైలు మధురైకి బదులు మధిరకు చేరిందని చెబుతారు. ఈ విషయం తెలిసిన భక్తులు రైల్వేస్టేషన్లో పూజలు చేశాక ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీ మత్యుంజయ స్వామి దేవాలయం పేరుతో 1965 మార్చి 1న ప్రతిష్ఠించగా నిత్యపూజలు జరుగుతున్నాయి. ఆలయ గర్భగుడికి నాలుగు ద్వారాలు ఏర్పాటు చేయడంతో భక్తులు స్వయంగా అభిషేకం చేసే అవకాశం లభిస్తుంది. అలాగే, గర్భాలయంలోనే శివలింగానికి నైరుతి మూలలో శ్రీ గురుదత్త స్వామి విగ్రహం ఉంటుంది. కాగా, రజాకార్ల తూటాలకు బలైన వానరానికి దేవాలయం పక్కనే ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేయడం మరో విశిష్టత. కాగా, ఏటా మహాశివరాత్రికి ఐదు రోజుల పాటు జాతర నిర్వహించనుండగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
● ముస్తాబైన కూసుమంచి శివాలయం
కూసుమంచి: కూసుమంచిలోని శివాలయం(గణపేశ్వరాలయం) మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనుండగా శనివారం రాత్రి ధ్వజారోహణ, అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ఆదివారం వేలాదిగా హాజరయ్యే భక్తులు సాఫీగా స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లలో ఆలయ కమిటీ నిమగ్నమైంది. కాగా, కూసుమంచిలో ఈ ఆలయాన్ని కాకతీయుల పరిపాలనలో గణపతి రుద్రదేవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలోని శివలింగం ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదిగా ఘనతికెక్కింది. ఒకప్పుడు జీర్ణావస్థకు చేరిన ఆలయానికి కొన్నేళ్లుగా భక్తుల రాక పెరిగింది. ఆలయ అభివృద్ధికి ఇటీవలె ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించడం మరో విశేషం. -
బడిలో వజ్రోత్సవం!
వేంసూరు: ఒకటి కాదు, రెండు కాదు పాఠశాల ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయింది. ఇప్పటివరకు ఇక్కడ చదివిన ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలకు చేరారు. ఈ నేపథ్యాన వేంసూరు ఉన్నత పాఠశాలలో వజ్రోత్సవ వేడుకలు శనివారం నిర్వహించగా.. పూర్వవిద్యార్థులు హాజరై తాము విద్యా బుద్ధులు నేర్చుకున్న బడిలో సందడిగా గడిపారు. పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు హాజరైన పూర్వ విద్యార్థులు మళ్లీ బాల్యంలోకి వెళ్లిపోయారు. ఉద్యో గం, కుటుంబ బాధ్యతలను పంచుకోవడమేకాక చదువుకున్నప్పుడు జరిగిన ఘటనలు గుర్తుచేసుకున్నారు. అంతేకాక తమకు పాఠాలు బోధించిన గురువులతో మాట్లాడి వారి కృషితోనే ఈ స్థాయికి చేరామని కృతజ్ఞతలు చెప్పుకున్నారు. పాఠశాల ప్రారంభం నుంచి పదో తరగతి పూర్తి చేసిన వారు బ్యాచ్ల వారీగా ఫొటోలు దిగుతూ ఫోన్ నంబర్లు మార్చుకుంటూ సంబురపడ్డారు. తొలుత బ్యాచ్ల వారీగా ర్యాలీలతో పాఠశాలకు చేరుకున్నారు. -
దశాబ్దాల తర్వాత ...
1980 నుంచి ఎనిమిది ఏళ్ల పాటు ఇక్కడ ఇంగ్లిష్, సోషల్ బోధించా. దశాబ్దాల కాలం తర్వాత వజ్రోత్సవాల వేళ రావడం ఆనందంగా ఉంది. నేను పాఠాలు చెప్పిన వారు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉండడం సంతోషంగా అనిపించింది. –ఎం.వసంతరావు, ఉపాధ్యాయుడు వేంసూరు పాఠశాలలో 1974 నుంచి 84 వరకు పీఈటీగా పని చేశా. ఇంత కాలం తరువాత మళ్లీ ఇక్కడకు రావడం.. నాటి విద్యార్థులతో గడపడం సంతోషాన్నిచ్చింది. అప్పుడు క్రీడల్లో గెలుపొందిన వారు అనుభవాలను వివరించారు. –ఎం.బాలకృష్ణారెడ్డి, పీఈటీ పాఠశాలలో స్నేహితులైన వారిని ఎన్నటికీ మరిచిపోలేం. ఏస్థాయికి చేరినా బాల్యస్నేహం ఎప్పటికీ మదిలో సజీవంగా నిలిచే ఉంటుంది. అందుకే ఉత్సవాలకు మా స్నేహితులం అందరం హాజరై రోజంతా సంతోషంగా గడిపాం. – వెల్ది జగన్మోహన్రావు, పూర్వ విద్యార్థి -
కాంగ్రెస్కు ఓట్ల సునామీ!
ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల వివరాలుఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఓట్ల సునామీ సృష్టించింది. దీంతో ప్రతిపక్షాలకు పరిమిత స్థాయిలోనే వార్డులు దక్కాయి. హోరాహోరీ పోరు ఉంటుందని భావించినా అన్నిచోట్ల కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 50.07 శాతం ఓటింగ్ను ఆ పార్టీ సాధించడం గమనార్హం. ఇక బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ స్థాయిలో వార్డులను దక్కించుకోలేకున్నా, మిగిలిన పార్టీలతో పోలిస్తే గణనీయమైన ఓటింగే సాధించింది. ఆ పార్టీ 34 శాతం ఓట్లతో రెండో స్థానాన నిలిచింది. ఇక ప్రధాన సీపీఎంకు 4.1 శాతం, బీజేపీకి కేవలం రెండు శాతం, సీపీఐకి 1.3 శాతం ఓట్లే దక్కాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంమొత్తం పోలైన ఓట్లుకాంగ్రెస్1,52,72277,55250.7%‘చేయి’ఎత్తి జై కొట్టిన ఓటర్లు ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో 163 వార్డులకు గాను 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 50.7 శాతం ఓట్లు సాధించి అన్ని మున్సిపాలిటీలను స్వీప్ చేసింది. మొత్తం మున్సిపాలిటీల్లో 1,52,722 ఓట్లు పోలైతే అందులో కాంగ్రెస్కే 77,552 ఓట్లు వచ్చాయి. అత్యధికంగా ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. ఇక్కడ పార్టీకి 18,667 ఓట్లు దక్కాయి. ఇక సత్తుపల్లిలో 23 వార్డులుకు గాను 17 గెలవగా, 11,949 ఓట్లు లభించాయి. బీఆర్ఎస్.. 52 వేలు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన మేర రాణించలేదు. అయితే, వార్డులు దక్కకున్నా గౌరవప్రదమైన స్థాయిలోనే ఓట్లు సాధించింది. మొత్తం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ 26వార్డులు గెలవగా, 34 శాతంతో 52,457 ఓట్లు నమోదయ్యాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో 32వార్డులు ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థులకు 9,950 ఓట్లు రాగా రెండు చోట్ల మాత్రమే గెలిచారు. ఇక 23 వార్డులు ఉన్న సత్తుపల్లిలో 9,391ఓట్లు రాగా ఆరు స్థానాలు దక్కాయి. కల్లూరు మున్సిపాలిటీలో 20వార్డులకు గాను ఏడింట నెగ్గగా, 7,487 ఓట్లు సాధించింది. వైరాలోని 20 వార్డుల్లో 9,272 ఓట్లు సాధించినా ఐదు సీట్లకే పరిమితమైంది. వెనుకబడిన కామ్రేడ్లు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు వెనుకపడగా కంచుకోటల్లోనూ ఓటమి ఎదురైంది. మొత్తంగా సీపీఐ నాలుగు, సీపీఎం మూడు వార్డులకే పరిమితమయ్యాయి. ఏదులాపురంలో సీపీఎం రెండు, సీపీఐ మూడు వార్డుల్లో గెలవగా వైరాలో చెరో వార్డు గెలుచుకున్నాయి. అన్నిచోట్ల కలిపి సీపీఐకి 1,978, సీపీఎంకు 6,407 ఓట్లు వచ్చాయి. ఏదులాపురంలోని 32వార్డులకు సీపీఐ ఏడు చోట్ల పోటీ చేస్తే 2,528 ఓట్లు సాధించింది. సీపీఎం ఎనిమిది వార్డుల్లో పోటీ చేయగా 3,611 ఓట్లు నమోదయ్యాయి. ఇక వైరాలో సీపీఐ రెండు వార్డుల్లో బరిలో నిలిస్తే 939, సీపీఎం మూడు వార్డుల్లో బరిలో నిలిచి 1,435 ఓట్లు పొందింది. మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో సీపీఎం 4.1 శాతం, సీపీఐ 1.9 శాతం ఓట్లు సాధించగలిగారు. అలాగే, బీజేపీ అంతగా ప్రభా వం చూపలేదు. మొత్తం ఓట్లలో కేవలం 3,046 ఓట్లు సాధించగా రెండు శాతంగా నమోదైంది. కార్పొరేషన్లో పోటాపోటీ కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ – సీపీఐ మధ్య పోటా పోటీ నెలకొంది. ఇక్కడ రెండు పార్టీలు 22వార్డులను గెలుచుకున్నట్లుగానే, ఓట్లను కూడా పార్టీలు పంచుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 58 డివిజన్లలో పోటీ చేయగా 35,532 ఓట్లు(35.37 శాతం) నమోదయ్యాయి. సీపీఐ 57 డివిజన్లలో బరిలోకి దిగితే 34,398 ఓట్లు దక్కాయి. ఇక బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ 60 డివిజన్లలో పోటీ చేసినా 12.29 శాతంతో 12,355 ఓట్లు సాధించింది. అలాగే, బీజేపీ కేవలం 1.42 శాతంతో 1,430 ఓట్లు పొందింది.‘చేయి’ గుర్తుకు మున్సిపాలిటీల్లో 50శాతం ఓట్లు -
పట్టు‘భట్టి’ విజయం
● మధిర మున్సిపల్పై తొలిసారి కాంగ్రెస్ జెండా ● డిప్యూటీ సీఎం వ్యూహంతో 22కు 21వార్డుల్లో విజయం ● ఒకే వార్డుకు పరిమితమైన బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కూటమి మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసినప్రచారం, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మంజూరు చేయిస్తున్న నిధుల వివరాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో ఎన్నికల్లో ఏకపక్షంగా జనం కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టారు. మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని పట్టు‘భట్టి’న ఆయన పార్టీ శ్రేణులను కదిలిస్తూనే స్వయంగా ప్రచారం చేశారు. దీంతో ఇక్కడ 22వార్డులకు గాను కాంగ్రెస్ స్వయంగా 18వార్డులు గెలుచుకోగా, కూటమితో కలిపి 21సీట్లు సొంతమయ్యాయి. ఇదే సమయాన బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేసి ఒకే సీటుకు పరిమితమైంది. చేస్తున్నవి ఇవీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, మరికొన్ని పనులకు మంజూరు చేయించిన నిధుల వివరాలను భట్టి ప్రచారంలో వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు, వరద ముంపు నివారణకు వైరా నదికి కరకట్ట నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను ప్రస్తావించారు. గత పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేదని, మున్సిపాలిటీ అప్పటి అధికార పార్టీ చేతిలోనే ఉన్నా నిధులు మంజూరు చేయలేదని ప్రచారంలో వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడమే కాక డిప్యూటీ సీఎంగా ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. బాధ్యతల అప్పగింత ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా భట్టి విమర్శల జోలికి వెళ్లకుండా చేసిన, చేయబోయే అభివృద్ధిని మాత్రమే ప్రస్తావించారు. మధిర ఓ పక్క డిప్యూటీ సీఎం స్వయంగా ప్రచారం చేస్తూనే సీనియర్లకు సైతం బాధ్యతలు అప్పగించారు. అలాగే, ప్రచా రం, ఇతర వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. దీంతో 22 వార్డులకు గాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించి తొలిసారి మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయించారు. -
శ్రీవారికి అభిషేకం, నిత్య కల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదానికి పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించగా, ఆతర్వాత శ్రీవారికి పల్లకీ సేవలో వివిధ ప్రాంతాల భక్తులు పాలుపంచుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంరూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని సంగమేశ్వరస్వామిని ఉదయం 8గంటలకు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆతర్వాత కూసుమంచిలోని గణపేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని స్వామిని మంత్రి దర్శించుకుంటారు. మున్సిపల్ కౌన్సిల్హాల్ ముస్తాబు సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. ఇదే రోజు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండడంతో కౌన్సిల్ హాల్ను ముస్తాబు చేస్తున్నారు. ఈమేరకు ఆవరణలో శుభ్రం చేయించడమే కాక మైక్సెట్లను శనివారం సరిచేశారు. ఈ పనులను కమిషనర్ కొండ్ర నర్సింహ పర్యవేక్షించగా ఏఈ సురేష్, మేనేజర్ మైసా శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి శిక్షణకు నలుగురు మహిళా సర్పంచ్లు కొణిజర్ల: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ భవనంలో ఈనెల 16నుండి 20వ తేదీ వరకు సర్పంచ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు జిల్లా నుంచి నలుగురు మహిళా సర్పంచ్లు ఎంపికయ్యారు. కొణిజర్ల మండలం మోకాలకుంట సర్పంచ్ భూక్యా అనితతో పాటు వైరా మండలం విప్పలమడక సర్పంచ్ మేడ హేమిమా చక్రపాణి, రఘునాథపాలెం మండలం జీ.కే.బంజర, చింతగుర్తి సర్పంచ్లు ఎం.జ్యోతి, టి.ప్రియాంక ఇందులో ఉన్నారు. ‘స్థానిక పాలనలో మహిళా సాధికారత’ అంశంపై ఈ శిక్షణ శిబిరం జరగనుంది. -
ఆర్ఎంఓలు మరింత మంది!
● జిల్లా జనరల్ ఆస్పత్రిలో పర్యవేక్షణకు ఐదుగురు ● 24గంటలు వైద్యసేవలు అందించేలా చర్యలు ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలోకి వెళ్లాక విభాగాలు విస్తరించాయి. మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఆస్పత్రికి ఎక్కువ సంఖ్యలో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కేటాయించారు. అయినప్పటికీ వైద్యసేవలు మాత్రం పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు. సిబ్బందిని పర్యవేక్షించాల్సిన అధికారులు అవసరం మేర లేకపోవడమే ఇందుకు కారణమని ఇటీవల నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ గుర్తించారు. ఈమేరకు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంఓ) పోస్టులు భర్తీ చేయాలని మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ను ఆదేశించారు. దీంతో పాలనా సౌలభ్యం కోసం పలు విభాగాల పర్యవేక్షణకు ఆర్ఎంఓలను నియమించారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు బాధ్యతలు ప్రస్తుతం సివిల్ సర్జన్ ఆర్ఎంఓ పోస్టు ఖాళీగా ఉండడడంతో రెగ్యులర్ డిప్యూటీ సివిల్ సర్జన్ బి.రాంబా బు ఆర్ఎంఓగా ఆస్పత్రి మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నా రు. అటు మెడికల్ సూపరింటెండెంట్, ఇటు ఆర్ఎంఓతో అన్ని విభాగాలు పర్యవేక్షించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యాన కొందరు సమయపాలన పాటించకపోగా సేవలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు తాత్కాలికంగా ఆర్ఎంఓలుగా బాధ్యతలు అప్పగించారు. వీరిలో డాక్టర్ కె.శ్రీలతకు మాతా శిశు ఆరోగ్య కేంద్రం గ్రౌండ్ ఫ్లోర్, ఎం.అనితకు ఎంసీహెచ్ మొదటి, రెండో ఫ్లోర్ బాధ్యతలు అప్పగించారు. వీరు ఓపీ, ఐపీ వార్డులు, నర్సింగ్ స్టాఫ్ విధులు, శానిటేషన్, పేషంట్ కేర్ సర్వీస్, ఎమర్జెన్సీ కేసుల పర్యవేక్షణ ఇతర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ రాజేంద్రప్రసాద్కు శానిటేషన్ పర్యవేక్షణ, నర్సింగ్, ఇతర సిబ్బంది విధుల పర్యవేక్షణ, వార్డుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇక డాక్టర్ డి.శ్రీకాంత్ జనరల్ ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో విధులను పర్యవేక్షిస్తారు. ఫలితంగా పెద్దాస్పత్రిలో 24 గంటల పాటు పర్యవేక్షణ ఉంటుందని మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. -
అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘లూనా’
ఖమ్మంఅర్బన్: ఖమ్మంకు చెందిన యువ దర్శకుడు గోగినేని ఆకాష్ రూపొందించిన విజ్ఞాన కల్పిత లఘుచిత్రం ‘లూనా’కు ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రశంసలు దక్కాయి. న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన చలన చిత్రోత్సవంలో ‘లూనా’ను ప్రదర్శించారు. గతంలోనే ఈ చిత్రం జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్కు అధికారికంగా ఎంపికై న విషయం విదితమే. తాజాగా ఢిల్లీలో జరిగిన చలన చిత్రోత్సవంలో ఆకాశ్కు పురస్కారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉండడంతో ఆకాశ్ తల్లిదండ్రులు గోగినేని కిరణ్కుమార్, హిమబిందు పురస్కారం స్వీకరించారు.నగర వాసి రూపొందించిన లఘుచిత్రానికి పురస్కారం -
● శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం
వైరారూరల్: వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ఏటా మాదిరిగానే మహాశివరాత్రి సందర్భంగా కల్యాణం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వామి భద్రాచలం వెళ్తూ లక్ష్మీపురంలోని వైరా నదిలో స్నానం చేశాక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. శ్రీరాముడు స్నానమాచరించిన ప్రదేశం కాలక్రమేణా రామగుండంగా ప్రసిద్ధి చెందింది. దీంతో మహాశివరాత్రి వేడుకల్లో లక్షలాది మంది భక్తులు వైరా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ మేరకు ఐదు రోజుల పాటు జరిగే జాతరకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఆదివారం రాత్రి జరిగే కల్యాణంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొననున్నారు. కాగా, జాతర చరిత్రలో తొలిసారి చిన్నాపెద్దను ఆకట్టుకునేలా జాయింట్ వీల్, బ్రేక్డాన్స్, డ్రాగన్ ట్రెయిన్ తదితరాలు ఏర్పాటు చేశారు. అంతేకాక భక్తుల పుణ్యస్నానాల కోసం ఘాట్ల నిర్మాణం, రూ.1.05 లక్షలతో శివపార్వతుల కల్యాణ వేదిక నిర్మించారు. ఇక వైరా ఏసీపీ ఎస్.సారంగపాణి ఆధ్వర్యాన వైరా సీఐ వెంకటప్రసాద్, ఎస్ఐలు పుష్పాల రామారావు, వెంపటి పవన్కుమార్తో పాటు 100మందికి పైగా బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. కాగా, జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ హరి చంద్రశేఖరశర్మ వెల్లడించారు. -
● కౌన్సిలర్లను తరలించిన కాంగ్రెస్ నేతలు ● ఎన్నిక రోజు నేరుగా మున్సిపాలిటీలకు రాక
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారిని క్యాంప్లకు తరలించారు. ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో గెలుపొందిన వారిని హైదరాబాద్తో పాటు సమీప ప్రాంతాల క్యాంప్లకు తీసుకెళ్లారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినా నాయకత్వం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి వీరు ప్రత్యేక బస్సుల్లో వెళ్లినట్లు సమాచారం. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే సమయానికి నేరుగా మున్సిపాలిటీలకు రానున్నారు. -
ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో పార్టీల వారీగా విజయం సాధించిన వార్డులు
మొత్తం మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఎం సీపీఐ స్వతంత్రులు ఏదులాపురం 32 24 02 00 02 03 01సత్తుపల్లి 23 17 06 00 00 00 00మధిర 22 18 01 00 00 00 03కల్లూరు 20 12 07 00 00 00 01వైరా 20 12 05 00 01 01 01ఇల్లెందు 24 19 03 00 00 00 02అశ్వారావుపేట 22 17 02 01 00 00 02మొత్తం 163 119 26 01 03 04 10 కొత్తగూడెం కార్పొరేషన్ 60 22 08 01 01 22 06 -
డీసీసీ కార్యాలయంలో సంబరాలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్.. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరితో కలిసి కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతోపాటు దొబ్బల సౌజన్య, పుచ్చకాయల వీరభద్రం, రాపర్తి శరత్, గజ్జెల్లి వెంకన్న, సయ్యద్ గౌస్, ముజాహిద్ హుస్సేన్, మొక్క శేఖర్గౌడ్ పాల్గొన్నారు. ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మంసహకారనగర్/ఖమ్మంరూరల్: ఐదు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రియదర్శిని కళాశాలలో ఏదులాపురం మున్సిపల్ లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించాక, కలెక్టరేట్లో మానిటరింగ్ సెల్ నుంచి అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. పోలీసులను అభినందించిన సీపీ ఖమ్మంక్రైం: ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు, లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా బందోబస్తు విధులు నిర్వర్తించిన పోలీసు ఉద్యోగులను సీపీ సునీల్దత్ అభినందించారు. నేడు వేంసూరు పాఠశాల వజ్రోత్సవాలు వేంసూరు: 1950లో అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభమై 75 ఏళ్లు పూర్తిచేసుకున్న వేంసూరు ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలను శనివారం నిర్వహించనున్నారు. ఎందరో విద్యార్థుల ఉన్నతికి ఈ పాఠశాల ఉపాధ్యాయుల బోధన కారణమైంది. ఈ నేపథ్యాన నిర్వహిస్తున్న వజ్రోత్సవాలకు దేశ, విదేశాల్లో స్థిరపడిన వారే కాకుండా స్థానిక పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే అడవుల రక్షణ ● పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ సత్తుపల్లిటౌన్: అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా తోడైతే మంచి ఫలితాలు వస్తాయని అటవీశాఖ పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ తెలిపారు. సీసీఎఫ్ డాక్టర్ భీమానాయక్, డీఎఫ్ఓ సిద్ధార్థ్విక్రమ్సింగ్తో కలిసి శుక్రవారం ఆమె సత్తుపల్లి రేంజ్లో పర్యటించారు. టింబర్ డిపోలో రూ.5 లక్షలతో నిర్మించిన వీఐపీ గది, చంద్రాయపాలెంలో వాచ్టవర్ను ప్రారంభించాక చంద్రాయపాలెంలో ఉన్నత పాఠశాలలో అటవీ శాఖ నిధులతో వేయించిన రంగులను పరిశీలించారు. చంద్రాయపాలెం వనసంరక్షణ సమితి సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన కంటెయినర్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఎఫ్డీఓ వి.మంజుల, రేంజర్ పి.స్నేహలత, అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా శ్రావణ్కుమార్ నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం పీహెచ్సీ వైద్యాధికారి రచ్చా శ్రావణ్కుమార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఈమేరకు టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ లాలయ్యకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్కుమార్ను నేలకొండపల్లి పీహెచ్సీ ఉద్యోగులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. -
కాంగి‘రేస్’లో నెగ్గింది..
ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా కొత్తగూడెంలో అనూహ్యంగా హంగ్ ఏర్పడింది. ఇక్కడ ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు కీలకం కానున్నారు. ఇక్కడ 60 డివిజన్లకు గాను మేయర్ పదవి దక్కాలంటే 31 డివిజన్లు గెలుచుకోవాలి. కానీ మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కకపోవడంతో సంకీర్ణంతో పాలకవర్గం ఏర్పడనుంది. కార్పొరేషన్లో కాంగ్రెస్.. సీపీఎంతో జత కట్టింది. ఇక సీపీఐ, బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి. ఈమేరకు కాంగ్రెస్, సీపీఐకి సమానంగా 22 చొప్పున డివిజన్లు దక్కాయి. బీఆర్ఎస్కు ఎనిమిది, బీజేపీ, సీపీఎం ఒక్కో డివిజన్లో గెలవగా, ఆరు స్థానాలు ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎనిమిది డివిజన్లు దక్కించుకుని కింగ్మేకర్ అయింది. అయితే మేయర్ పదవిని దక్కించుకోవడానికి స్వతంత్రులు ఎవరికి సహకరిస్తారు, ఎక్స్ అఫీషియో ఓట్లు ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయో లెక్కల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయాన కూనంనేనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేయగా.. కాంగ్రెస్లోని పలువురు మంత్రులు ఆయనతో చర్చలు మొదలుపెట్టినట్లు తెలియగా పాలకవర్గం ఏర్పాటుపై శనివారం స్పష్టత రానుంది.సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ మినహా ఏడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ దూసుకెళ్లింది. డివిజన్లు, వార్డులు కలిసి మొత్తం 223 ఉండగా.. అందులో కాంగ్రెస్ 141 స్థానాలు దక్కించుకుంది. ఇక బీఆర్ఎస్కు 34, బీజేపీకి రెండు, సీపీఎంకు నాలుగు, సీపీఐకి 26, ఇండిపెండెంట్లకు 16 సీట్లు దక్కాయి. గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లాగే మున్సి‘పోల్స్’లో కూడా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్దే పై ‘చేయి’ అయింది. చాలెంజ్గా తీసుకుని.. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలెంజ్గా తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాక పార్టీ సభకు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే విజయం కావాలని పిలుపునిచ్చారు. ఆపై రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం, సత్తుపల్లి, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోనే కాక కొత్తగూడెం కార్పొరేషన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు, సత్తుపల్లిలో ఆ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర మున్సిపాలిటీతోపాటు వైరాలో ప్రచారం చేశారు. అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేల సమష్టి ప్రణాళికతో పార్టీకి భారీ విజయం చేకూరింది. ముందుకు వెళ్లని ‘కారు’ ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కలిసొచ్చే పార్టీలతో జతకట్టింది. అయినా ఆ పార్టీ ఎక్కడా చెప్పుకోదగిన పోటీ ఇవ్వలేకపోయింది. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను కేవలం రెండే దక్కగా, మధిరలో ఒక్క స్థానానికే పరిమితమైంది. అశ్వారావుపేటలో రెండు, ఇల్లెందులో మూడు వార్డులతో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అయితే, సత్తుపల్లిలో ఆరు, కల్లూరు మున్సిపాలిటీలో ఈ పార్టీకి ఏడు వార్డులు దక్కాయి. మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విస్తృతంగా ప్రచారం చేసినా కాంగ్రెస్ విజయపరంపరకు బీఆర్ఎస్ బ్రేకులు వేయలేకపోయింది. అనుకున్న మేర సత్తా చాటక.. సీపీఎం, సీపీఐ పోటీ చేసిన స్థానాల్లో అనుకున్న మేరకు సత్తా చాటలేకపోయాయి. ఉమ్మడి జిల్లాలో సీపీఎంకు నాలుగు స్థానాలే దక్కాయి. కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఎనిమిది డివిజన్లు గెలిచి కింగ్మేకర్ అయితే.. సీపీఐ 22 స్థానాల్లో గెలిచింది. ఇక అన్నిచోట్ల కలిపి 16 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటడం గమనార్హం. కొత్తగూడెంలో గెలిచిన ఆరుగురు ఇండిపెండెంట్లు మేయర్ పీఠం దక్కించుకోవాలనుకునే కాంగ్రెస్, సీపీఐకి కీలకమయ్యారు. ఇక ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం రెండింటినే దక్కించుకుది. అశ్వారావుపేటలో ఒక వార్డు, కొత్తగూడెం కార్పొరేషన్లో ఒక డివిజన్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.ఉమ్మడి జిల్లాలోని 141 స్థానాల్లో విజయం -
నేనంటే.. నేనే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో విజేతల నుంచి చైర్మన్ పదవులకు పోటీ మొదలైంది. చైర్మన్ రిజర్వ్ అయిన కేటగిరీ వార్డుల్లో గెలిచిన అభ్యర్థులంతా తమకే పదవి ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నపాలు చేస్తున్నారు. అంతేకాక ముఖ్యనేతలతో పైరవీలు చేయించడంలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీ అధిష్టానమే సీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను పంపుతుందన్న ప్రచారం జరుగుతోంది. ● ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ పదవిని 23వ వార్డు నుంచి గెలిచిన పోకబత్తిని అనిత, 9వ వార్డు నుంచి గెలుపొందిన కందుకూరి శేషమ్మ, 17వ వార్డు నుంచి గెలిచిన గొడ్డుగొర్ల కృష్ణకుమారి ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవికి కూడా ఇదే స్థాయిలో ఆశావహులున్నారు. అయితే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయం మేరకే ఎంపిక ఉంటుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. ● మధిర మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో 6వ వార్డు నుంచి గెలుపొందిన వేమిరెడ్డి లక్ష్మీతులసి ఆ పదవిని ఆశిస్తున్నారు. అలాగే వైస్ చైర్మన్ రేసులో 8వ వార్డు నుంచి గెలిచిన యన్నం కోటేశ్వరరావు, 12వ వార్డు విజేత మోదుగు నాగలక్ష్మి ఉన్నారు. ఇక్కడ పదవులు ఎవరికన్నది డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నిర్ణయంతోనే ఫైనల్ కానుంది. ● వైరా మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ పదవిని 3వ వార్డులో గెలిచిన బొర్రా ఉమాదేవి, 6వ వార్డులో గెలుపొందిన కాపా చంద్రకళ ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవికి 13వ వార్డు నుంచి గెలిచిన ముళ్లపాటి విజయలక్ష్మి, 6వ వార్డు గెలిచిన నుంచి పణితి సైదులు, 9వ వార్డు నుంచి గెలుపొందిన కట్ల సంతోష్ పోటీ పడుతున్నారు. ● సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ పదవి కోసం బొంతు సుమలత, తోట సుజలరాణి, ఎండీ.రెహనాబేగం, మట్టా దేవజ్యోతి పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ పదవి రేసులో ఎండీ.రెహనాబేగం, దూదిపాల రాంబాబు, మండపాటి ప్రభాకర్రెడ్డి, ఎస్కే.గ్రాండ్ మౌలాలీ ఉన్నారు. ● కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా ధరావత్ మోహన్నాయక్, బానోత్ మారోని, భూక్యా రాంబాయి ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవికి కూడా ముగ్గురు, నలుగురు పోటీలో ఉన్నారు. ● ఇల్లెందు మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. చైర్మన్ పదవిని 5వ వార్డు విజేత చిల్లా విజయభారతి, 8వ వార్డు నుంచి గెలిచిన రేఖా స్వరూప ఉన్నారు. వైస్చైర్మన్ పదవిని 20వ వార్డు నుంచి గెలిచిన మహమ్మద్ జాఫర్ ఆశిస్తున్నారు. ● అశ్వారావుపేట మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. చైర్మన్ పదవిని 6వ వార్డు నుంచి గెలుపొందిన జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ పదవిని 13వ వార్డు నుంచి గెలుపొందిన జూపల్లి రమేష్బాబు ఆశిస్తున్నారు. వీరిద్దరూ భార్యాభర్తలు కావడం విశేషం. -
అరుదైన ‘గజసంహార వీరగాళ్లు’
చింతకాని: పూర్వీకుల పరాక్రమానికి నిదర్శనంగా నిలిచే రెండు అరుదైన చారిత్రక చిహ్నాలను గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు భోగా గిరి తెలిపారు. జిల్లాలోని చింతకాని మండలం పాతర్లపాడులో ఒకటి, ఖమ్మం మేదరిబజార్లో ఇంకొకటి బయటపడగా గజసంహార వీరగాళ్లుగా తేల్చినట్లు వెల్లడించారు. కాలక్రమాణ చారిత్రక కథలు మరుగున పడిపోయినా ఈ చిహ్నాలు వీరుల పరాక్రమం, త్యాగాన్ని సజీవంగా నిలుపుతున్నాయని తెలిపారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి అరుదైన శిల్పాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెల్లడించారు. -
గౌడ ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు
ఖమ్మంఅర్బన్: గౌడ సంఘం అభివృద్ధికి ఐక్యతే ప్రధానమని సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. ఖమ్మంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఖమ్మంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ (ఆత్మగౌరవ భవనం) నిర్మాణానికి రఘునాథపాలెంలో ప్రభుత్వం 29 గుంటల భూమి కేటాయించగా, గత ఏడాది జూన్లో మంత్రులు శంకుస్థాపన చేశారని తెలిపారు. అక్కడ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిస్తూ జీఓ జారీ చేసిందని చెప్పారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్గౌడ్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సమావేశంలో గోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బొల్లకొండ శ్రీనివాసరావుగౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు వడ్డెబోయిన నర్సింహారావుగౌడ్, గూడిద శ్రీనివాసగౌడ్, అమరగాని వెంకన్నగౌడ్, కత్తి నెహ్రూగౌడ్, రుద్గాని ఉపేందర్గౌడ్, మార్కం లింగయ్యగౌడ్, డాక్టర్ నారగాని రాంప్రసాద్గౌడ్, పోతగాని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం చేసిన నాయకులు -
ఉత్సాహంగా ‘అస్మిత’ అథ్లెటిక్స్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా అస్మిత బాలికలకు అథ్లెటిక్స్, కబడ్జీ పోటీలు గురువారం నిర్వహించారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్డీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి ప్రారంభించగా, 60 మంది బాలికలు పాల్గొన్నారు. అండర్–17 100 మీటర్ల పరుగులో ఎం.డీ.ఆఫ్రిన్, బి.మైథిలి, బి.దీక్ష, 200 మీటర్ల పరుగులో స్లామామేతాబ్, ఎ.అగ్లీ, టి.అస్మిత, 400 మీటర్ల పరుగులో బి.దీక్ష, ఎం.నందిని, స్లామామేతాబ్, 800 మీటర్లలో సీహెచ్.మీనాక్షి, ఎం.డీ.ఆఫ్రిన్, డి.అభినయ వరుసగా మూడుస్థానాల్లో నిలిచారు. జావెలిన్ త్రోలో ఎస్.శ్రీవల్లి, పి.కీర్తన, వి.నయోమి, షాట్పుట్లో బి.ఉమామహేశ్వరి, డి.అంజలి, సహస్ర, లాంగ్జంప్లో ఎం.డీ.ఆఫ్రిన్, బి.మైథిలి, సాల్మా మేతాబ్ మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు. వీరిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు డీవైఎస్ఓ తెలిపారు. అలాగే, కబడ్డీ పోటీల్లో జీళ్లచెరువు ప్రథమస్థానంలో నిలవగా ఖమ్మానికి చెందిన రాజేంద్రనగర్ పాఠశాల విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి వై.రామారావు, కబడ్డీ, అథ్లెటిక్స్ అసోసియేషన్ల జిల్లా కార్యదర్శులు కె.క్రిస్టోఫర్బాబు, ఎం.డీ.షఫిక్అహ్మద్, అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
ఖమ్మంమామ్లిగూడెం: ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు రాజకీయ నేతల ప్రయోజనాల కోసం పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం అదనపు కలెక్టర్కు వారు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నాయకులు దొంగల సత్యనారాయణ, నున్నా రవి, గుత్తా వెంకటేశ్వరరావు, నల్లగట్టు ప్రవీణ్కుమార్, వీరెల్లి రాజేశ్, రవిరాథోడ్, అల్లిక అంజయ్య, దొడ్డ అరుణ, రవిగౌడ్, కొణతం లక్ష్మీనారాయణ, బోయినపల్లి సురేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రికి పార్థివదేహం సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం బేతుపల్లికి చెందిన నల్లమోతు వెంకమ్మ (82) బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆమె ముందుగానే చేసిన సూచన మేరకు వెంకమ్మ మృతదేహాన్ని కుమార్తెలు బొంతు అనసూర్య, తన్నీరు పుష్పావతి నార్కెట్పల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి అందించారు. వైద్య విద్యార్థుల బోధన కోసం తల్లి పార్థీవదేహాన్ని అందించిన వారిని సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్(అమ్ములు) తదితరులు అభినందించారు. ప్రతీ విద్యార్థికి తర్ఫీదు ఇవ్వాలి కూసుమంచి: ఎవ్రీ చైల్డ్ రీడ్ (ఈసీఆర్)లో భాగంగా ప్రతీ విద్యార్థికి ఆంగ్లంలో చదవడం, రాయడం వచ్చేలా తర్ఫీదు ఇవ్వాలని జిల్లా పరిషత్ సీఈఓ దీక్షారైనా సూచించారు. మండలంలోని జీళ్లచెరువు, చేగొమ్మ పాఠశాలలను గురువారం తనిఖీ చేసిన ఆమె విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఈసీఆర్పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతీ విద్యార్థిలో సామర్థ్యాలు పెరిగేలా బోధన కొనసాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంఓ ప్రవీణ్కుమార్, ఎంపీడీఓ జశ్వంత్కుమార్, ఎంవీఓ వీరస్వామి, ఎంపీఓ రాజారాం, సీఆర్పీలు వెంకటేశ్వర్లు, జాఫర్ పాల్గొన్నారు. మహిళ అప్పగింత ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న ఓ మహిళను చేరదీసి ఆమె భర్తకు అప్పగించినట్లు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో తిరుగుతున్న 35 ఏళ్ల మహిళను జీఆర్పీ పోలీసులు గుర్తించి ఆశ్రమానికి అప్పగించారు. ఆమెకు వైద్యం చేయించడంతో కోలుకోగా తన పేరు సావిత్రి అని, తమది ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా బలిజేపల్లి గ్రామంగా వెల్లడింది. దీంతో అక్కడి పోలీసుల ద్వారా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా సావిత్రి భర్త చంద్రశేఖర్ ఖమ్మం వచ్చాడు. ఇటీవలే ఇంటి నుంచి తప్పిపోయిన ఆమె కోసం గాలిస్తుండగా అప్పగించడంపై కృతజ్ఞతలు తెలిపారు. మృతుడి ఆచూకీ గుర్తింపు ఖమ్మంక్రైం: ఖమ్మం టేకులపల్లిలోని ఎన్నెస్పీ కాల్వలో బుధవారం లభించిన మృతదేహం ఆచూకీని గుర్తించారు. మృతదేహం కై కొండాయిగూడెంనకు చెందిన బానోతు కృష్ణ (55)దిగా తేలింది. మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఆయన ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కృష్ణ భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూ టౌన్ పోలీసులు తెలిపారు. బిల్లింగ్ విధానంపై అవగాహన ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని హెచ్టీ, ఎల్టీ విద్యుత్ వినియోగదారులకు బిల్లింగ్ విధానంపై గురువారం ఖమ్మంలోని విద్యుత్ గెస్ట్హౌస్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ బాలాజీ మాట్లాడుతూ కిలోవాట్ హవర్(కేడబ్ల్యూహెచ్) నుంచి మారిన కిలోవాట్ యాంపియర్ హవర్(కేవీఏహెచ్) విధానంలో బిల్లులు తగ్గించుకునేందుకు ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్ ప్యానెళ్లు అమర్చుకోవాలని సూచించారు. తద్వారా బ్లాకింగ్ లేదా జరిమానాను నివారించవచ్చని తెలిపారు. అనంతరం వినియోగదారులు సందేహాలను ఎస్ఈ శ్రీనివాసాచారి నివృత్తి చేశారు. ఎస్ఏఓ శ్రీధర్, డీఈలు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు, రమేష్, వెంకటేశ్వర్లుతో పాటు ఏడీఈలు, ఏఏఓలు పాల్గొన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు కూసుమంచి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రుల బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ రామారావు హెచ్చరించారు. కూసుమంచిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను గురువారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు ల్యాబ్లను పరిశీలించాక ఆయన మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్లు సాయికుమార్, లక్ష్మీ లోహిత పాల్గొన్నారు. -
పకడ్బందీగా కౌంటింగ్
సత్తుపల్లిటౌన్: మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్ స్పష్టం చేశారు. సత్తుపల్లిలోని కౌంటింగ్ కేంద్రంలో గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ కచ్చితమైన సమాచారాన్నే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడి సూచనలు చేశారు. మూడంచెల భద్రత : ఏసీపీ వసుంధర యాదవ్ సత్తుపల్లిటౌన్/కల్లూరురూరల్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సత్తుపల్లి, కల్లూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శంగా సాగేలా హాళ్లల్లోకి మొబైళ్లు, పెన్నులు, ఇంక్, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్లు నిషేధించినట్లు చెప్పారు. అంతేకాక వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపుపై దృష్టి సారించామని తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద సాయుధ పోలీస్ బలగాలతో బందోబస్తు కొనసాగుతోందని ఏసీపీ వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ, అధికారులు రామకృష్ణ, నాగేశ్వరరావు, సీఐ టి.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ -
● చిట్టి చేతులు.. గట్టి చేతలు !
ఆ చిన్నారుల చేతులు కుటుంబ పెద్దలకు ఆసరాగా నిలుస్తున్నాయి. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న కుటుంబాలకు చిన్నారులు కూడా అండగా నిలబడుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి కుటుంబాలతో సహా వచ్చిన వలస కూలీలు ఏన్కూరు మండలం జన్నారం తదితర ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తున్నారు. ఈ క్రమాన పెద్దలు వరినాట్లు వేస్తుండగా.. ఆ కుటుంబాల్లో చిన్నారులు నాట్లు సంచుల్లో వేయడం, పొలాల వద్దకు తీసుకెళ్లి ఇవ్వడమే కాక సమయానికి భోజనాలు తీసుకొస్తూ ఉడతాభక్తిగా సాయం చేస్తుండడం కనిపించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ పొలం గట్లపై నారుతో వెళ్తున్న చిన్నారులు సంచిలో వరి నారు కట్టలు వేస్తున్న బాలుడుకుటుంబ సభ్యులకు ఆహారం తీసుకెళ్తున్న చిన్నారి -
ఏ ఒక్కరితోనే తెలంగాణ రాలేదు..
● రామదాసు బాటలో పోరాటంతో స్వరాష్ట్రం ● టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరామ్ నేలకొండపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి పోరాటంతోనే రాలేదని, అమరువీరుల త్యాగాలతో సాధ్యమైందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నేలకొండపల్లిలో గురువారం జరిగిన పాలేరు డివిజన్ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఎందరో అమరులయ్యారని తెలిపారు. కానీ ఏ ఒక్కరి పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని భావిస్తే పొరపాటని చెప్పారు. రాముడికి ఆలయం కట్టాలని ఆనాడు భక్తరామదాసు తెగిస్తే.. ఆయన వారసత్వంతో తెలంగాణ కోసం ప్రజలు పోరాడారని, రామదాసు బాటలో అప్పటి పాలకులను నిలదీసి స్వరాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. అమరువీరులంతా చనిపోయే ముందు కుటుంబాలను కాకుండా తెలంగాణ ఆకాంక్షనే వ్యక్తం చేశారని చెప్పారు. కాగా, ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరిన ఆయన ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించిందని తెలిపారు. ఇక తెలంగాణ వచ్చాక తాము ప్రజాసమస్యలపై పోరాడితే కేసులు పెట్టడమే కాక, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్ట్లు డిజైన్ చేశారని విమర్శించారు. రాష్ట్ర రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించేలా మంత్రులను కలుస్తామని కోదండరామ్ తెలిపారు. కాగా, నేలకొండపల్లి పర్యటనలో భాగంగా కోదండరామ్ భక్తరామదాసు ధ్యాన మందిరంలో పూజలు చేశాక రామదాసు కాంస్య విగ్రహం వద్ద నివాళులర్పించారు. మందిరం చరిత్రను పూజారి సౌమిత్రి రమేష్ వివరించడంతో పాటు ఇక్కడ మ్యూజియం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అంతే కాకుండా ఇంకా అభివృద్ధి చేయాలని సంబంధిత మంత్రులను కలవనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, నాయకులు పల్లె వినయ్కుమార్, కె.రవి, మాదాసు శ్రీనివాసరావు, బెల్లంకొండ నాగేశ్వరరావు, తీగ రాములు, రవీందర్నాయక్ , సైదులు తదితరులు పాల్గొన్నారు. సుబ్లేడు మండల కేంద్రం కోసం వినతి తిరుమలాయపాలెం: ఏళ్లుగా సుబ్లేడు మండలం ఏర్పాటు చేయాలని కోరుతున్న నేపథ్యాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మండల సాధన కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరామ్కు వినతిపత్రం అందజేశారు. మాజీ సర్పంచ్ భూక్య వీరన్నతో పాటు గండమల్ల సుందర్రావు, కంచం వీరన్న, మెట్టు ఆంజనేయులు, మెట్టు వెంకన్న, గంధసిరి సత్యం, పోలే పొంగు బాలరాజు, రేఖ్యా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్ల బకాయిలు విడుదల కోసం కృషి
ఖమ్మంమామిళ్లగూడెం: పెన్షనర్ల ఎదురుచూస్తున్న బకాయిల విడుదల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి తెలిపారు. ఖమ్మంలో గురువారం జరిగిన రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారి బకాయిల కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయమై వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సమావేశంలో వెస్లీ, కోటేశ్వరరావు, బొల్లు రాంబాబు, శ్యాంసుందర్రెడ్డి, మైస నాగయ్య, ఈశ్వర్కుమార్, వెంకటనారాయణ, ఉపేందర్రావు, సాంబశివరావు, రమణయాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్య రహిత సమాజానికి పాటుపడాలి
తిరుమలాయపాలెం: నానాటికీ పెరుగుతున్న కాలుష్యంతో ఎదురవుతున్న ఇబ్బందులను విద్యార్థులు గుర్తించి కాలుష్య రహిత సమాజ స్థాపనలో పాలుపంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైనీ సూచించారు. గతంలో సుబ్లేడు పాఠశాల పరిశీలన సందర్భంగా విద్యార్థులు ప్లాస్టిక్ బాటిళ్లు వాడుతుండడాన్ని ఆమె గుర్తించారు. దీంతో సొంత ఖర్చుతో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 120 మందికి స్టీల్ బాటిళ్లు ఆమె సొంత ఖర్చులతో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పి.ప్రభాకర్రెడ్డి, హెచ్ఎం గోపాల్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్టీల్బాటిళ్లు అందించిన డీఈఓ చైతన్యజైనీ -
● యాసంగిలో ఈ పంటకే రైతుల ప్రాధాన్యత ● కొన్నిచోట్ల పత్తి, మిర్చి పంటలు తొలగించి మరీ సాగు ● సమృద్ధిగా నీరు ఉండడంతో పెరిగిన విస్తీర్ణం
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్న సాగుకు జిల్లా రైతులు మొగ్గు చూపుతుండడంతో యాసంగిలో విస్తీర్ణం పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది విస్తీర్ణం గణనీయంగా పెరగడం విశేషం. సాధారణ పెట్టుబడితో యాసంగి కాలానికి అనుకూలమైన పంటగా పేరుండడంతో కొన్నేళ్లుగా నీటి వనరుల ఆధారంగా రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఆధారంగా యాసంగిలో వారబందీ పద్ధతుల్లో నీరు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యాన వానాకాలం పత్తి సాగు చేసిన భూముల్లో యాసంగి పంటగా మొక్కజొన్నకు అవకాశం ఉండగా, చివరి ఆయకట్టు భూముల్లోని వరి మాగాణుల్లో కూడా ఇదే పంట ఎంచుకుంటున్నారు. గతంలో 80 వేల నుంచి 90 వేల ఎకరాల వరకు సాగయ్యే మొక్కజొన్న గత ఏడాది 1.22 లక్షల ఎకరాలకు చేరింది. ఈసారి మరో 43 వేల ఎకరాలు పెరగడం విశేషం. అత్యధికంగా చింతకాని, కొణిజర్ల, బోనకల్, ముదిగొండ, రఘునాథపాలెం, ఏన్కూరు మండలాల్లో మక్క పంట సాగు చేస్తున్నారు. నికర ఆదాయం గ్యారంటీ.. జిల్లాలో ఈ ఏడాది యాసంగి పంటగా 1,65,463 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వస్తుండడంతో రైతులు ఈ పంట ఎంచుకుంటున్నారు. మొక్కజొన్న ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుండగా ఎకరాకు 35 – 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు కనీస మద్దతు ధర రూ.2,400గా నిర్ణయించినందున ఎకరంలో సాగు చేస్తే రూ.96 వేల ఆదాయం వస్తుంది. ఖర్చులు పోగా సుమారు రూ.80 వేల ఆదాయం నికరంగా వస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. నష్టాలతో ఇటు చూపు ఈ ఏడాది వానాకాలంలో అధిక వర్షాలకు పత్తి దెబ్బతిన్నది. దీంతో అరకొరగా పండిన పంటను రెండు తీతల్లో తీసి తొలగించాక పలువురు మొక్కజొన్న వేశారు. అలాగే, మిర్చి తోటలు దెబ్బత్ని చోట కూడా రైతులు తోటలు తొలగించి మొక్కజొన్న వేయడం.. సాగర్ నుంచి నీరు విడుదల చేస్తుండడంతో ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మండలం గత ఏడాది ఈ ఏడాది చింతకాని 26,072.13 28,351 కొణిజర్ల 18,106.12 20,431 బోనకల్ 17,476.10 19,105 ముదిగొండ 14,331,38 14,560 రఘునాథపాలెం 4,147.10 13,649 ఏన్కూరు 3,703.29 10,214 ఎర్రుపాలెం 5,051.12 7,848 తల్లాడ 2,807.19 7,565 ఖమ్మంరూరల్ 5,546.32 5,640 కామేపల్లి 1,245.30 5,212 కూసుమంచి 2,791.15 5,078 ఏపుగా పెరుగుతున్న మొక్కజొన్న పైరు (ఇన్సెట్) కంకి దశలో ఉన్న మొక్కజొన్న జిల్లాలో యాసంగి పంటగా మొక్కజొన్న ఆశాజనకంగా ఉంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారు. పలుచోట్ల పంట ప్రస్తుతం కంకి దశలో ఉంది. నీరు సమృద్ధిగా ఉండటంతో దిగుబడి కూడా మెరుగ్గా నమోదయ్యే అవకాశం ఉంది. –ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
కౌంట్.. డౌన్!
నేడు మున్సిపాలిటీల ఫలితాలు ● ఐదు చోట్ల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి ● ఉదయం 8గంటలకు ప్రక్రియ ప్రారంభం ● కేంద్రాల పరిధిలో పోలీసు ఆంక్షల అమలుపక్కాగా ఏర్పాట్లు.. ఏదులాపురం మున్సిపాలిటీ ఓట్లను పెద్దతండాలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో, కల్లూరు మున్సిపాలిటీ ఓట్లను ప్రభుత్వ హైస్కూల్లో, మధిర మున్సిపాలిటీ ఓట్లను ఖాజీపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్కించనున్నారు. అలాగే, వైరా మున్సిపాలిటీ ఓట్లను వెటర్నరీ హాస్పిటల్లో, సత్తుపల్లి మున్సిపాలిటీ ఓట్లను జ్యోతి నిలయంలో లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్బాక్స్లను భద్రపరచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద భారీ భద్రత కల్పించగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు, అభ్యర్థులు, ఏజెంట్లకు సౌకర్యాలు సమకూర్చారు. ప్రతీచోట రెండేసి రౌండ్లు ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 59టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు మరొకరు సహాయకులుగా ఉంటారు. వీరికి అదనంగా 18మంది సూపర్వైజర్లు, 38 మంది సహాయకులు విధులు నిర్వర్తించనున్నారు. ఏదులాపురంలో 32 వార్డులకు గాను 16 టేబుళ్లు ఏర్పాటుచేసినా, 15వ వార్డు ఏకగ్రీవం కావడంతో ఒక టేబుల్పై రెండో రౌండ్ లెక్కింపు ఉండదు. ఒక్కో టేబుల్పై తొలి రౌండ్లో ఒక వార్డు, ఆతర్వాత మరో వార్డు అంటే ప్రతీ టేబుల్పై రెండేసి వార్డుల లెక్కింపు ఉంటుంది. ఇలా అన్ని మున్సిపాలిటీల్లోనూ రెండేసి రౌండ్లలో అన్ని వార్డుల ఫలితం వెలువడుతుంది. లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. కేంద్రాల వద్ద కర్రలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో తిరగడంనిషేధమని, మైక్లతో ప్రసంగాలు, ఫొటోలు, గుర్తులు ప్రదర్శించొద్దని తెలిపారు. అంతేకాక సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతి లేదని, బహిరంగ ప్రదేశాల్లో విజయోత్సవ ర్యాలీలపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల పరిధిలో వైన్స్, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లను మూసివేయాలని సీపీ ఆదేశించారు.మున్సిపాలిటీ వార్డులు టేబుళ్లు ఏదులాపురం 31 16సత్తుపల్లి 23 12మధిర 22 11వైరా 20 10కల్లూరు 20 10మొత్తం 116 59మొదటగా స్ట్రాంగ్రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్స్లను భద్రత నడుమ కేంద్రంలోకి తీసుకొస్తారు. ఏజెంట్ల సమక్షాన సీల్ తెరిచాక తొలుత పోస్టల్ బ్యాలెట్లను వేరు చేస్తారు. ఆపై 8గంటలకు పోస్టల్ బ్యాలెట్లనే మొదట లెక్కిస్తారు. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సాధారణ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గంటకు పైగా సమయం పడుతుందని అంచనా. ఒక్కో వార్డుకు వేయి నుంచి 2వేల లోపు ఓట్లు ఉండగా... అన్ని మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 12గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశముంది. -
గెలుపు.. మాదే
● మున్సి‘పోల్స్’పై రాజకీయ పార్టీల్లో ధీమా ● ఐదు చోట్ల చైర్పర్సన్ పీఠంపైనే అందరి గురి ● విజేతలను క్యాంపునకు తరలించేలా ఏర్పాట్లుసాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ముగియగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా తామే గట్టెక్కుతామనే అంచనాకు వస్తూ శుక్రవారం ఓట్ల లెక్కింపు తర్వాత అమలుచేయాల్సిన వ్యూహాలపై చర్చల్లో నిమగ్నమయ్యారు. ఐదు చోట్ల చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా.. గెలిచిన వారెవరూ జారిపోకుండా క్యాంపులకు తరలించడంతో పాటు విప్ జారీకి సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీల్లోనూ అదే ధీమా మున్సిపాలిటీల్లో పోలింగ్ ముగిశాక ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఏ వార్డులో ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. పోలింగ్ శాతం ఎక్కువగా ఉన్న చోట పరిస్థితి ఎలా ఉంటుంది.. తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు ఎన్ని నమోదై ఉంటాయనే అంశంపై అనుచరులు, కార్యకర్తలు, ఏజెంట్లతో అభ్యర్థులు, నేతలు చర్చించారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొనగా.. రెండు పార్టీల అభ్యర్థులు విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలతోపాటు బీజేపీ, సీపీఎం, సీపీఐ కూడా తాము బరిలో ఉన్న వార్డుల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నారు. పీఠంపై గురి మెజార్టీ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకుంటామనే అంచనాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యాన ఫలితాలు వెలువడ్డాక కౌన్సిలర్లు జారిపోకుండా ఏం చేయాలి.. ఒకటి, రెండు సీట్లు తక్కువైతే ఏ వ్యూహం అమలుచేయాలనే అంశంపై ఇరు పార్టీల్లోనూ మంతనాలు జరుగుతున్నాయి. ఫలితాలు రాగానే అభ్యర్థులు ఎక్కడకు వెళ్లకుండా కట్టడి చేయాలని... పొత్తులో భాగంగా కలిసి పోటీ చేసిన పార్టీల అభ్యర్థులు సైతం ప్రత్యర్థులతో చేతులు కలపకుండా చూడాలనే నిర్ణయానికి వచ్చారు. నేరుగా క్యాంపులకే... జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంపు మొదలుపెట్టేలా పార్టీల నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీలతో బేరసారాలకు దిగకుండా ముందుజాగ్రత్తల్లో భాగంగా తీసుకెళ్లాల్సిన ప్రాంతాలను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఎన్నికల ఫలితాల ఆధారంగా క్యాంపులు నిర్వహిస్తారా, లేదా అన్నది తేలనుంది. కాగా, ఫలితం వెలువడ్డాక చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నికకు మధ్యలో రెండు రోజుల సమయమే ఉన్నందున దూరం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే క్యాంపు నిర్వహించే అవకాశం ఉండగా.. ఎన్నికకు ముందు పార్టీలు విప్ జారీ చేయాలని నిర్ణయించాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నేపథ్యాన జిల్లాలో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో గెలుపోటములపై బెట్టింగ్ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచే అంచనాల ఆధారంగా పార్టీల అభిమానులతోపాటు సామాన్యులు కూడా ఫలానా అభ్యర్థి గెలుస్తారని, ఫలానా పార్టీకే చైర్మన్ పీఠం దక్కుతుందంటూ రూ.వేల నుంచి రూ.లక్షల్లో పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గురువారం బెట్టింగ్ల పర్వం ఊపందుకున్నట్లు సమాచారం. -
లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే..
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక శక్తిని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేలా ఉన్నందున రద్దు చేయడమే కాక విద్యుత్, విత్తన సవరణ బిల్లులు, విబిజీరాంజీ చట్టం ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో కార్మికులు కదం తొక్కారు. దేశంలోని ప్రధాన పది కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలో గురువారం సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా ఖమ్మం పెవిలియన్ మైదానం నుండి జెడ్పీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించగా కార్పొరేషన్ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, మార్కెట్ హమాలీలు, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. హక్కులను కాలరాస్తున్నారు.. బ్రిటిష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను కేంద్రం కాలరాస్తోందని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సమ్మెలో భాగంగా ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో కార్మిక సంఘాల అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, నరేష్ నాయుడు, కళ్యాణం వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, వెంకన్న, ఎండీవై. పాషా అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్రావు, కాంగ్రెస్ నాయకులు నాగండ్ల దీపక్ చౌదరి, సీపీఎం, మాస్లైన్ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకుడు గుండాల కృష్ణ మాట్లాడారు. దేశంలోని 50 కోట్ల మంది కార్మికుల హక్కులను ఒక శాతంగా కలిగిన కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని ఆరోపించారు. ఇప్పటికే ప్రైవేటీకరణలో వేగం పెంచిన మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఈ పని చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో వివిధ సంఘాల నాయకులు జి.రామయ్య, కొండపర్తి గోవిందరావు, బీజీ.క్లెమెంట్, వై.విక్రమ్, తోట రామాంజనేయులు, రావి శివరామకృష్ణ, పోటు కళావతి, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆర్టీసీ అభివృద్ధిపై మేథోమధనం
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ సంస్థ, ఖమ్మం రీజియన్ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం, ఆదాయం వృద్ధి, వ్యయ నియంత్రణ మార్గాలపై చర్చించేందుకు శుక్రవారం మేధో మథనం నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. ఖమ్మం కొత్త బస్టాండ్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రీజియన్లోని అధికారులతో ఆదాయ వనరుల పెంపు, నిర్వహణ ఖర్చుల నియంత్రణ, యాంత్రీకరణకు అవకాశాల అన్వేషణపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెయింటెనెన్స్ సూపర్వైజర్లు, ఏడీసీలు, ఇతర విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని ఆర్ఎం వెల్లడించారు. యఽథావిధిగానే రవాణాశాఖ సేవలు ఖమ్మంక్రైం: జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో శుక్రవారం అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతాయని జిల్లా రవాణా శాఖాధికారి ధర్మపురి జగదీష్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో శిక్షణకు ఉద్యోగులు వెళ్లనున్నందున శుక్రవారం సేవలకు అంతరాయం ఏర్పడుతుందని ముందుగా ప్రకటించామని తెలిపారు. కానీ ఉద్యోగులు అందుబాటులోనే ఉంటున్నందున ఎలాంటి అంతరాయం ఏర్పడదని, వాహనదారులు స్లాట్లు బుక్ చేసుకోవచ్చని డీటీఓ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఐకేపీ ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి తిరుమలాయపాలెం: మహిళా సంఘాల సభ్యులు వ్యాపారాలు చేసేలా రుణాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ఐకేపీ సిబ్బంది కృషి చేయాలని డీఆర్డీఓ శ్రీరామ్ సూచించారు. తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఐకేపీ, ఈజీఎస్ సిబ్బందితో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఏపీఎంలు, సీసీలు, వీఓఏలు బాధ్యతగా పనిచేస్తూ నూతన సంఘాల ఏర్పాటు, రుణాల మంజూరు, వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, సభ్యుల్లో అక్షరాస్యత పెంపునకు పాటుపడాలని తెలిపారు. కాగా, ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన కూలీలకు పని కల్పించాలని, ఎండలు పెరుగుతున్నందున పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే, నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు బ్యాగ్ల తయారీ శిక్షణను డీఆర్డీఓ పరిశీలించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎస్.కే.సిలార్ సాహెబ్, తదితరులు పాల్గొన్నారు. భూగర్భజలాల పెంపునకు కృషి ఖమ్మంలీగల్: వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాల పెంపులో అందరూ పాలుపంచుకోవాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ సూచించారు. జలమండలి అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి జాలా సత్యనారాయణతో కలిసి గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు చల్లా కోటయ్య ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో జిల్లా జడ్జి రాజగోపాల్, ఏడీ సత్యనారాయణ మాట్లాడారు. అన్ని ఇళ్లు, కార్యాలయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మిస్తే నీటి వనరులకు ఇక్కట్లు ఎదురుకావని చెప్పారు. ఈమేరకు సలహాల కోసం 99899 85102(సత్యనారాయణ), 98666 31720(డాక్టర్ డి.రమేష్కుమార్)ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తాళ్లూరి దిలీప్చౌదరి, వెంకట్గుప్తా, నేరెళ్ల శ్రీనివాస్, కొల్లి సత్యనారాయణ, ఎం.నిరంజన్రెడ్డితో పాటు డాక్టర్ టి.సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా.. రోజుకో తీరయా!
● యాప్తో ఇప్పటికే రైతులకు ఇక్కట్లు ● ఆపై బుకింగ్లో తరచూ మార్పులు చేస్తున్న యంత్రాంగంఖమ్మంవ్యవసాయం: సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఫర్టిలైజర్ యాప్తో ద్వారా యూరియా బుకింగ్కు రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత వానాకాలం సీజన్ మాదిరి ఇక్కట్లు ఎదురుకావొద్దని ప్రభుత్వం యాప్నుప్రవేశపెడితే అంతకు మించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాగుకు అనుగుణంగా అవసరమైనంత వరకే యూరియా తీసుకునేలా యాప్ ద్వారా బుకింగ్ విధానం అమలుచేస్తున్నారు. అయితే, తొలుత జిల్లా యూనిట్గా అవకాశం కల్పించగా.. స్టాక్ ఉన్న చోటుకే రైతులంతా వస్తుండడంతో స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీనికి తోడు రైతులు దూర ప్రాంతంలోని డీలర్, పీఏసీఎస్ను ఎంచుకుని వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో డివిజన్ యూనిట్గా నాలుగు, ఐదు మండలాల్లో ఎక్కడైనా యూరియాను బుక్ చేసుకునేలా తొలుత మార్పు చేశారు. ఈ విధానంలోనూ సమస్యలు రావడంతో ఇప్పుడు మండలం యూనిట్గా యూరియా బుకింగ్కు అవకాశం కల్పించారు. ఫోన్లు లేక ఇక్కట్లు గ్రామీణ ప్రాంత రైతులకు స్మార్ట్ఫోన్లు లేక.. ఉన్నా యాప్ వినియోగంపై అవగాహన లేక గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైతులు ఆందోళన తెలిపారు. కాగా, యాప్లో యూరియా బుక్ చేసుకున్నా పాస్బుక్, ఆధార్ కార్డుతో సహకార సంఘం లేదా డీలర్ వద్దకు వెళ్లక తప్పడం లేదు. ఈనేపథ్యాన రైతులు పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈవిషయమై జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య మాట్లాడుతూ రైతులు కొత్త విధానానికి అలవాటు పడక తప్పదని తెలిపారు. అయితే, బుకింగ్లో ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
మధిర యువకుడి బ్రెయిన్డెడ్
మఽధిర: బీటెక్ చదువుతున్న ఓ యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రె యిన్ డెడ్ కాగా, కుటుంబీ కులు పుట్టెడు దుఃఖంలో నూ అయవదానానికి అంగీకరించి ఐదుగురి జీవితా ల్లో వెలుగులు నింపారు. మధిరకు చెందిన కందిమళ్ల విజయ్కుమార్(20) విజయవాడలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీన తాడేపల్లిలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను అక్కడి ఆస్పత్రికి తరలించారు. అయితే, మెదడులో రక్తస్రావం జరుగుతోందని గుర్తించి చికిత్స చేసినా ఫలితం లేక వైద్యులు బుధవారం బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఆపై విజయ్ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబీకులకు ఆంధ్రప్రదేశ్ జీవన్ధాన్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ రామాంజనేయరెడ్డి అవగాహన కల్పించగా అవయవదానానికి అంగీకరించారు. దీంతో గుండె, కాలేయంను మణిపాల్ ఆస్పత్రిలో అవసరమైన ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి, కిడ్నీలను గుంటూరు విధాత ఆస్పత్రికి, కార్నియా ను విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి అందజేసి అవసరమైన వారికి అమర్చారు. అవయవదానంతో ఐదుగురికి జీవితాల్లో వెలుగులు -
సాగర్ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఖమ్మంక్రైం: ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపాన సాగర్ కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి(55) మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. కాల్వలో మృతదేహం కొట్టుకువెళ్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టౌటౌన్ పోలీసులు చేరుకున్నారు. ఆపై అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో బయటకు తీశారు. అయితే, మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించే పరిస్థితి లేకపోవడంతో శ్రీనివాసరావు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై మార్చురీకి తీసుకెళ్లారు. మృతుడి వివరాలు తెలిస్తే టూటౌన్ పోలీస్స్టేషన్ (87126 59110)లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. కల్లాల్లో 30 క్వింటాళ్ల మిర్చి చోరీ మధిర: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కల్లాల్లో ఆరబోసిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రాయపట్నం గ్రామంలో ఆగొల్ల వెంకట్రావుకు చెందిన 15 క్వింటాళ్లు, నాగనబోయిన వెంకటేశ్వర్లుకు చెందిన పది క్వింటాళ్లతో పాటు దేశినేనిపాలెంలో శాఖమూడి శ్రీనుకు చెందిన ఐదు క్వింటాళ్ల మిర్చి చోరీకి గురైంది. మంగళవారం రాత్రి కల్లాల్లో ఆరబోసిన రైతులు బుధవారం ఉదయం వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. వయోజన విద్య రిటైర్డ్ డీడీ మృతి మధిర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తించిన రావిరాల బసవయ్య(90) బుధవారం రాత్రి మృతి చెందారు. మధిరలోని లడక బజార్కు చెందిన ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో కీలకంగా వ్యవహరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బసవయ్యకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై రిటైర్డ్ ఉద్యోగుల సంఘం బాధ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించడమే కాక నివాళులర్పించారు. -
ఇంటర్నేషనల్ కరాటే టోర్నీకి ఇద్దరు విద్యార్థులు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం శ్రీనగర్కాలనీలోని స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థులు ఫునకోషి షాటోఖాన్ కరాటే ఆర్గనైజేషన్(డబ్ల్యూఎఫ్ఎస్కేఓ) ఆధ్వర్యాన నిర్వహించిన ఆసియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్లో ప్రతిభ కనబరిచారు. అండర్–14 కుమిటే బాలుర విభాగంలో ఎస్కే.అద్నాన్ బంగారు పతకం, కటాస్లో వెండి పతకం గెలుచుకోగా, అండర్–12 బాలికల్లో రెండు విభాగాల నుంచి రెడ్డిబోయిన సోనాక్షి వెండి, రజిత పతకాలు గెలుచుకుంది. వీరిద్దరు ఏప్రిల్ 26నుంచి దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ ట్రోఫీకి అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ డైరెక్టర్లు కొండా శ్రీధర్రావు, కృష్ణవేణి బుధవారం అభినందించారు. ప్రిన్సిపల్ పీవీఆర్.మురళీమోహన్, కోచ్ ఖాసీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘ఎన్నికల వేళ అధికార దుర్వినియోగం’
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించే కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఖమ్మం జిల్లాలో పరిణామాలను గుర్తించాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు సూచించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరు ఓట్ల చోరీకి పాల్పడ్డారో తెలిసిపోయిందని పేర్కొన్నారు. పోలింగ్ సరళి, ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకున్న అనుమానాస్పద పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీఐ కమిషనర్ తనిఖీ ఖమ్మం సహకారనగర్: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం, ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాల్లో తనిఖీ చేసిన ఆయన ఆర్టీఐ దరఖాస్తులు, పరిష్కారంపై సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని నిబంధనల మేరకు ఇవ్వాలని తెలిపారు. నేడు కార్మికుల సమ్మె లేబర్ కోడ్ల రద్దు డిమాండ్తో పిలుపు ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆరోపిస్తూ.. వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సమ్మె జరగనుంది. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం సరికాదని నిరసించడంతో పాటు వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ సమ్మె చేపడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలు అమలుచేయడంతో పాటు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీయూసీఐ, సీఐటీయూ, బీఆర్టీయూ, ఐఎఫ్టీయూ సంఘాల ప్రతినిధులు కొద్దిరోజులుగా సమ్మెను విజయవంతం చేయాలని పారిశ్రామిక ప్రాంతాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, పని ప్రదేశాల్లో ప్రచారం చేయడమే కాక యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు. కుల, జనన ధ్రువపత్రాలు రద్దు ఖమ్మంఅర్బన్: ఖమ్మం అర్బన్ తహసీల్దార్ 2019లో ఓ వ్యక్తికి జారీ చేసిన బీసీ–ఈ కుల ధ్రువీకరణ పత్రంతో జనన ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన షేక్ హమీద్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోగా, విచారణకు రావాలని నోటీసు జారీ చేసినట్లు తహసీల్దార్ సైదులు తెలిపారు. ‘ఉపాధి’ పనులు పరిశీలించిన డీఆర్డీఓముదిగొండ: మండలంలోని గోకినేపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను డీఆర్డీఓ శ్రీరామ్ బుధవారం పరిశీలించారు. పంట కాల్వల పూడికతీత పనులు, నర్సరీల్లో మొక్కలను పెంపకాన్ని పరిశీలించిన ఆయన హాజరైన కూలీలతో మాట్లాడారు. పనుల గుర్తింపు, కూలీలకు కేటాయింపులో ఇబ్బందులు రాకుండా చూడాలని ఉద్యోగులను ఆదేశించారు. ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి, ఏపీఓ రంగనాయకమ్మ, గోకినేపల్లి సర్పంచ్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోప్ వే ఏర్పాటెప్పుడో..?
● కిన్నెరసానిలో పరిశీలించిన పుణే బృందం ● నెల రోజులు గడిచినా కదలికలేని ప్రక్రియ పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకుల ఆహ్లా దం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలో అమలు చేయడంలేదు. సఫారీ ఏర్పాటకు అటవీశాఖ ప్రత్యేకంగా రూ.45లక్షలతో వాహనాలు కొనుగోలు చేసింది. ఇంతవరకు సఫారీ ఏర్పాటు జాడలేదు. రోప్ వే కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించా రు. నెలరోజుల క్రితం పుణే నుంచి ప్రత్యేక బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. ఆతర్వాత రోప్ వే ఊసే లేదు. పర్యాటకులు, సహసయాత్రికుల కోసం రోప్ వే (జిప్లైన్)ను ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేశారు. కిన్నెరసానిలోని అద్దాల మేడ నుంచి జలా శయం మధ్యలో ఉన్న చిన్న ద్వీపం వరకు సుమారు అర కిలోమీటర్ మేర సింగిల్ రోప్ వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.25 లక్షల వ్యయం అవుతుందని అంచనా రూ పొందించారు. నిధుల కొరత కారణంగా తొలు సింగిల్ రోప్ వే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రోప్ వే ఏర్పాటుకు పుణే నుంచి నెయిల్ అడ్వెంచర్స్ పంకజ్ కుమేరియా బృందం గత నెల 23న కిన్నెరసానిలో పర్యటించింది. నివేదికను కలెక్టర్కు అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. కానీ ఆ తర్వా రోప్ వే ఏర్పాటులో కదలిక లేకుండాపోయింది. డార్జిలింగ్ తరహాలో.. రోప్వేలు కేరళ, మయన్మార్, డార్జిలింగ్ ప్రాంతాల్లో ఎత్తైన కొండ ప్రదేశాల మధ్య ఉన్నాయి. దీంతో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కిన్నెరసానిలో కూడా రోప్వే ఏర్పా టు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. -
హమ్మయ్య.. అంతా ప్రశాంతం !
మధిర మడుపల్లి బూత్లో ఓటు వేయడానికి వచ్చిన మహిళ బిడ్డను లాలిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మి సాక్షి నెట్వర్క్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. అధికారుల నిత్య సమీక్షలతో పాటు నిరంతర పర్యవేక్షణలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలింగ్ పూర్తయింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారం, ఎత్తుగడల్లో నిమగ్నమైన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి జలగంనగర్లోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. అలాగే, కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మానిటరింగ్ సెల్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎన్నికల పరిశీలకులు పవన్కుమార్, డీఆర్వో పద్మశ్రీ, సీపీఓ శ్రీనివాస్ పరిశీలిస్తూ ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, కల్లూరులోని పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. అంతేకాక కల్లూరు మున్సిపల్ పరిధిలోని కేంద్రాల్లో పోలింగ్ను కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ●వైరా, ఏదులాపురం, కల్లూరు తదితర మున్సిపాలిటీల్లో కేంద్రాలకు సీపీ సునీల్దత్ పరిశీలించి బందోబస్తుపై సూచనలు చేశారు. అడిషనల్ డీసీపీ రామానుజం, కల్లూరు, వైరా, రూరల్ ఏసీపీలు వసుంధర యాదవ్, సారంగపాణి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ●వైరా మున్సిపల్ 12వ వార్డు అభ్యర్ధి మాదినేని నాగరాణికి 20వ వార్డులో ఓటు హక్కు ఉంది. ఆమె ఉదయం నుంచి వార్డులో పోలింగ్ను పరిశీలిస్తూ చివరకు భర్త లక్ష్మణ్తో కలిసి 20వ వార్డుకు వెళ్లేసరికి సమయం దాటడంతో గేట్లు మూసేశారు. దీంతో ఆమె నిరాశగా వెనుదిరిగారు. -
టెన్షన్.. టెన్షన్ !
● పోలింగ్ బూత్ల వద్దా విస్తృత ప్రచారం ● పోలింగ్ సరళిపై అంచనాల్లో అభ్యర్థులు ● ఎవరికి వారే గెలుపుపై ధీమా ● బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల జాతకంసాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు ఓటింగ్ సరళిపై అంచనాలు వేసుకుంటున్నారు. వారం రోజులుగా ప్రచారం, వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన పార్టీ నేతలు, అభ్యర్థుల్లో ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది. సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డిన అభ్యర్థులు... పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లను అభ్యర్థిస్తూ కనిపించారు. అంతకుముందు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ‘మంచి’ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈక్రమాన పలుచోట్ల డబ్బు, మద్యం ఏరులై పారింది. ఎత్తులు.. పైఎత్తులు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పడిన పాట్లు అన్నీఇన్ని కావు. ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడమే కాక వారిని మించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ప్రచారం ముగిసినప్పటి నుంచి అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. తమ అనుచరులను ఓటర్ల ఇళ్లకు పంపి ఓటు తప్పక వేసేలా ఒప్పించారు. జోరుగా ప్రలోభాల పర్వం మున్సిపల్ ఎన్నికలను అభ్యర్థులతోపాటు పార్టీల నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు మించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో మద్యం, డబ్బు, బహుమతుల పంపిణీ విచ్చలవిడిగా సాగింది. ఒకరికి మించి మరొకరు ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు ఓటర్లకు అందజేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఓ అభ్యర్థి ఓటుకు రూ.3వేలు చొప్పున ఇస్తే.. మరొకరు రూ.5 వేల చొప్పున ఇవ్వడం గమనార్హం. ప్రధానంగా చైర్పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థులు మరింత ఎక్కువ ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక మద్యం, చికెన్, చీరలు వంటి బహుమతులు అదనంగా పంపిణీ చేశారు. అలాగే, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లించడం విశేషం. కునుకు లేకుండా.. బుధవారం ఉదయం పోలింగ్ మొదలుకానుండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు మంగళవారం రాత్రి నిద్ర లేకుండానే గడిపారు. ఓటర్ల ఇళ్లకు వెళ్లి నిద్ర లేపి మరీ ప్రలోభాలతో ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల ఓటర్లు ఇదే తరుణం అన్నట్లుగా తమకు కావాల్సినవి అడిగి మరీ తీసుకున్నారు. కొందరు ఓటర్లకు అభ్యర్థులే వాహనాలు సమకూర్చి పోలింగ్ బూత్ల వరకు తీసుకొచ్చారు. ఈ క్రమాన పోలింగ్ బూత్ల వద్ద కూడా విస్తృతంగా ప్రచారం చేయించారు. ఈ సమయంలోనే పోలింగ్ సరళిని గమనిస్తూ.. తమకు ఓటు వేసే వారెవరు, ఇప్పటివరకు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో అంచనాలు వేసుకున్నారు. అంతేకాక ఇంకా పోలింగ్ బూత్ రాని వారి ఇళ్లకు అనుచరులను పంపి పిలిపించారు. సరళిపై పోస్ట్మార్టం పోలింగ్ ముగిశాక అధికారులు బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్లోభద్రపరిచారు. ఈమేరకు పోలింగ్ సరళిపై అభ్యర్థులు పోస్టుమార్టమ్కు దిగారు. పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలతో సమావేశమై ఒక్కో బూత్లో పరిస్థితి ఎలా ఉందనే అంశంపై చర్చించారు. బూత్ల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అందులో తమకు ఎన్నిక వచ్చి ఉంటాయో అన్న లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ఓటింగ్ సరళి, తాము చేసిన ప్రయత్నాలను బేరీజు వేసుకుంటున్న కొందరు గెలుపుపై ధీమాతో ఉన్నారు. అయినా కొందరిలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. -
రేపు రవాణా శాఖ సేవలకు అంతరాయం
ఖమ్మంక్రైం: జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాలయ ఉద్యోగులు ఈనెల 13న(శుక్రవారం) ‘వాహన్ పోర్టర్’పై శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లనున్నారని జిల్లా రవాణా శాఖాధికారి జగదీష్ తెలిపారు. ఈమేరకు వైరా యూనిట్ కార్యాలయంలో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించారు. ఖమ్మం, సత్తుపల్లి కార్యాలయాల్లో కూడా సేవలు పాక్షికంగా అందుతాయని తెలిపారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి సహకరించాలని డీటీఓ ఓ ప్రకటనలో కోరారు. నేడు హెచ్టీ విద్యుత్ వినియోగదారుల సదస్సు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధి హెచ్టీ, సీటీ మీటర్ల వినియోగదారుల సదస్సు గురువారం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్రోడ్డులో ఉన్న విద్యుత్ గెస్ట్హౌస్లో సాయంత్రం 3–30 గంటలకు సదస్సు మొదలవుతుందని పేర్కొన్నారు. ఇందులో అకౌంట్స్ విభాగం అధికారులు, ఇంజనీర్లు పాల్గొని హెచ్టీ, సీటీ మీటర్ల సమస్యలు, అన్ బ్లాకింగ్ రీడింగ్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు వేదికగా ఖమ్మం ● ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్ సీఎం కప్ ఇక్కడే.. ఖమ్మం స్పోర్ట్స్: సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగియడంతో వివిధ అంశాల్లో క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈనేపథ్యాన జిల్లాల వారీగా పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఆర్చరీ, బాల్బ్యాడ్మింటన్ పోటీలు ఖమ్మంలో నిర్వహించా లని నిర్ణయించారు. ఈనెల 20నుంచి 22వ తేదీ వరకు ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఇక్క డ జరగనున్నాయి. అలాగే, అథ్లెటిక్స్ పోటీలు హనుమకొండలో, జిమ్నాస్టిక్స్ కరీంనగర్లో, నెట్బాల్, సాఫ్ట్బాల్, ఖో–ఖో, కబడ్డీ, బాస్కెట్బాల్, సెపక్తక్రా, సైక్లింగ్ పోటీలు మహబూబ్నగర్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పంటల నమోదు గడువు మార్చి 15వరకు.. ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో సాగవుతున్న పంటల వివరాల నమోదు గడువును మార్చి 15గా నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 4.16 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే, ప్రాజెక్టులు, జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉన్నందున ఈ విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 75వేల ఎకరాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వచ్చేనెల 15లోగా క్లస్టర్ల వారీగా ఏఈఓలు మిగతావి కూడా నమోదు చేయనున్నారని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి కామేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని డీఎంహెచ్ఓ రామారావు సూచించారు. కామేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక రోజువారీ ఓపీ నమోదు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్న నేపథ్యాన సీజనల్ వ్యాధులు, వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, ఉద్యోగులు తనూష, రాధాకృష్ణ, పుష్పలత, తిరుమలయ్య, శ్రీనివాస్, రమణ, ఉష, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రమణీయంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తొలుత గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరా ధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశాక స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. -
ఓటు వేసి!
బారులు దీరి.. ఏదులాపురం మున్సిపల్ పరిధి తెల్దారుపల్లి కేంద్రంలో క్యూ కట్టిన ఓటర్లుసాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ జరగగా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైనప్పటి నుంచే ఓటర్లు రావడం మొదలైంది. కానీ చాలాచోట్ల మధ్యాహ్నం వరకే ఎక్కువ శాతం పోలింగ్ పూర్తయింది. ఇంకొన్ని చోట్ల సాయంత్రం తర్వాత ఓటర్లు రావడంతో 5గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో 1,41,875 మంది ఓటర్లకు గాను 1,17,043 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 55,506 మంది పురుషులు, 61,520 మంది మహిళలతో పాటు ఇతరులు 17 మంది ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు వైరా, ఏదులాపురం, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. కాగా, ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా కృషి చేసిన ఉద్యోగులు, సహకరించిన ఓటర్లు, పార్టీల నాయకులు, అభ్యర్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందనలు తెలిపారు. ఉత్సాహంగా వచ్చారు.. ఐదు మున్సిపాలిటీల్లోనూ ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు దీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, కుర్చీలు ఏర్పాటుచేయడంతో ఇబ్బందులు ఎదురుకాలేదు. అలాగే, దివ్యాంగులకు వీల్చైర్లు సమకూర్చి సహాయకులను ఏర్పాటుచేశారు. ఐదు మున్సిపాలిటీల్లో 117 వార్డులకు గాను ఏదులాపురం 15వ వార్డు ఏకగ్రీవం కాగా 116 వార్డుల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 240 పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు, యువతే కాక దివ్యాంగులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. వైరాలోని 12వ వార్డులో చివరి నిముషంలో ఓ మహిళ రాగా అధికారులు అనుమతించారు. స్వల్ఫ ఘర్షణలు మినహా.. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల స్వల్ప వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వైరాలోని 9వ వార్డులో ఉదయం పోలింగ్ కేంద్రం వద్ద సీపీఎం, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేశారు. ఏదులాపురం 26వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎఎస్ వర్గీయులు తమకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించే క్రమాన బాహాబాహీకి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఓటు వేసిన డిప్యూటీ సీఎం మధిర మున్సిపాలిటీ 9వ వార్డు ఇందిరా డెయిరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే, వైరాలోని 5వ వార్డులో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్, సత్తుపల్లిలోని 18వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, 12వ వార్డులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుటుంబీకులతో కలిసి ఓటు వేశారు. అలాగే, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి 14వ వార్డులో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, 22వ వార్డులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుర్రాలపాడులో సిరా మార్క్ చూపిస్తున్న యువతులుఐదు మున్సిపాలిటీల్లో 82.50 శాతం పోలింగ్ -
ఓడరేవుల్లో సివిల్ ఇంజనీర్గా ఎంపిక
చింతకాని: భారత ఓడరేవుల(పోర్ట్లు)కు సంబంధించి సివిల్ ఇంజనీర్ల ఎంపికకు జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షలో చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీ గ్రామానికి చెందిన షేక్ సలీం ప్రతిభ కనబరిచి ఐదో ర్యాంక్ సాధించాడు. సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో 14 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, ఇందులో తొమ్మిది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, ఐదు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈమేరకు 2025 డిసెంబర్ 2వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఎనిమిది మంది ఇతర రాష్ట్రాల వారు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి సలీం మాత్రమే 160 మార్కులకు గాను 146.25మార్కులతో ఐదో స్థానాన నిలిచి ఉద్యోగానికి అర్హత సాధించాడు. ఆయన 1నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలోని కేంద్రియ విద్యాలయంలో, ఇంటర్ న్యూవిజన్ కళాశాలలో, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వరంగల్ ఎన్ఐటీలో పూర్తిచేశాడు. సలీం తండ్రి నాగుల్మీరా ఖమ్మం మామిళ్లగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తుండగా గ్రామస్తులు అభినందించారు. అయితే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్) సాధించడమే తన లక్ష్యమని సలీం వెల్లడించాడు.నాగులవంచ వాసికి జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
వైరారూరల్: మండలంలోని స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం స్వగ్రామైన స్నానాల లక్ష్మీపురంలో శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం, వేదిక తదితర పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూనే త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. ఆతర్వాత మహాశివర్రాతి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జాతర సమీపించినందున వైరా నదిలో పూడికతీత, పిచ్చి చెట్లు తొలగించి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా రిజర్వాయర్ నుండి నీరు విడుదల చేయాలన్నారు. అలాగే, జాతరకు హాజరయ్యే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల ఆధ్వర్యాన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, సర్పంచ్లు నూతి వెంకటేశ్వర్లు, తడికమళ్ల నాగార్జున, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు ముగిశాయి. రెండో రోజైన బుధవారం హ్యాండ్బాల్, ఉషూ, కరాటే, జూడో పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లావ్యాప్తంగా 245మంది క్రీడాకారులు హాజరుకాగా, ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పోటీలను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి పర్యవేక్షించారు. కాగా, ఈనెల 18నుంచి జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొనే జట్లతో వెళ్లేందుకు కోచ్లు, మేనేజర్లను ఎంపిక చేయనున్నట్లు డీవైఎస్ఓ తెలిపారు. -
కేంద్రం విధానాలపై 21నుంచి చైతన్యయాత్రలు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా, దేశీయ రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు విమర్శించారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయంగా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ఎరజ్రొన్నలు పండించే రైతులు భారీగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఈసారి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు గణనీయంగా తగ్గించారని విమర్శించారు. ఈమేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈనెల 12న కార్మికులతో కలిసి రైతులు నిరసన తెలపనుండగా, ఈనెల 21నుంచి మార్చి 5వరకు గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రచార యాత్రలు, సభలు నిర్వహించి రైతులను చైతన్యపరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు, కోలేటి నాగేశ్వరరావు, కోశాధికారి కేలోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిది క్వింటాళ్ల మిర్చి చోరీ
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల రైతులు కల్లాలో ఆరబెట్టిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారు. ఇటీవల రెండు ఘటనలు చోటుచేసుకోగా సోమవారం అర్ధరాత్రి చిమ్మపూడిలో గ్రామానికి చెందిన రైతు జానేబోయిన పాపయ్య కల్లం నుంచి ఎనిమిది క్వింటాళ్ల మిర్చిని ఎత్తుకెళ్లారు. ఈ మిర్చి విలువ సుమారు రూ.1.60 లక్షలు కాగా ఘటనపైరఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య కామేపల్లి: మండలంలోని పింజరమడుగుకు చెందిన మల్లెంపాటి రంగయ్య(70) మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న ఆయన ఇంటి సమీపాన ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రంగయ్యకు భార్య, ముగ్గురు కుమారైలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మనస్తాపంతో వ్యక్తి.. ఏన్కూరు: భార్యతో పాటు బంధువులు దాడి చేశారనే మనస్థాపంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఏన్కూరు జంగాల బజార్లో నివాసముండే సగ్గుర్తి రాజశేఖర్(40) మంగళవారం తన ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య వాణి, బావమరిది వంశీతో పాటు దమయంతి, కమలమ్మ, సాయిబాబు తన కొడుకును కొట్టడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని రాజశేఖర్ తండ్రి కృష్ణ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంధ్య తెలిపారు. -
మళ్లీ ‘సాగర్’ కష్టాలు
● వారబందీ విధానంతో అందని సాగునీరు ● చివరి ఆయకట్టులో పంటల సాగుకు ఇక్కట్లు ● ఆందోళనకు దిగుతున్న అన్నదాతలు ఖమ్మం అర్బన్: నాగార్జునసాగర్ కాల్వల పరిధి చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యలు మొదలయ్యాయి. యాసంగి సీజన్ మధ్యలోనే నీటి కొరత తలెత్తడంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. చివరి భూములకు సక్రమంగా నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమాన సోమవారం కొణిజర్ల మండలంలో రైతులు ఆందోళనకు దిగగా, ఏపీ ప్రాంత రైతులు మంగళవారం బోనకల్లో రాస్తారోకో నిర్వహించారు. 2.55లక్షల ఎకరాల ఆయకట్టు సాగర్ నుంచి జిల్లాలోని 17 మండలాల పరిధిలో సుమారు 2.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతోంది. ఏప్రిల్ 4వరకు నీటి విడుదల కొనసాగించాలని అధికారులు నిర్ణయించినా ప్రస్తుత పరిస్థితి చూస్తే కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారబందీ విధానం అమలుచేస్తుండడంతోనే చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదని చెబుతున్నారు. ఈసారి వర్షాకాలంలో అధిక వర్షాలు కురవడంతో సాగర్ డ్యాంలో పుష్కలంగా నీరు చేరింది. దీంతో రైతులు ఆశగా యాసంగి పంటలు సాగు చేపట్టారు. ప్రధానంగా మధిర, వైరా నియోజకవర్గాల్లోని సాగర్ ఆయకట్టు పరిధిలో అధిక విస్తీర్ణంలో వరి, మొక్కసాగు జరుగుతోంది. అయితే, కల్లూరు, మధిర, బోనకల్, కొణిజర్ల మండలాల పరిధి బ్రాంచ్ కాలువల్లో పూడిక, కంపచెట్లు అడ్డుపడడంతో నీరు సాఫీగా ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీజన్కు ముందే ఈ సమస్యను పరిష్కరిస్తే ఇబ్బంది ఎదురయ్యేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఏపీ మీదుగా వస్తుండడంతో... బోనకల్లు–మధిర బ్రాంచ్ కాల్వల పరిధిలో సుమారు 10 కి.మీ. మేర ఏపీ ఆయకట్టుకు కూడా నీరు వెళ్తుంది. ఆతర్వాత తెలంగాణకు చేరే క్రమాన అక్కడి రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. కానీ ఏపీ ప్రాంత రైతులు మంగళవారం బోనకల్లో ఆందోళనకు దిగిన నేపధ్యాన సమస్యకు కారణాలు అంతుపట్టడంలేదు. సాగర్ నుంచి పాలేరుకు సుమారు 4,300క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 2,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో 2వేల క్యూస్కెల వరకు జిల్లా అయకట్టు అవసరాలకు, 800 క్యూసెక్కులు ఏపీ అయకట్టుకు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కాల్వలో నీటి సరఫరా కొనసాగుతున్నా బ్రాంచ్ కాల్వల విషయంలో స్పష్టమైన షెడ్యూల్, పర్యవేక్షణ అమలుచేయకపోతే ఇక్కట్లు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నీటి విడుదలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలోని ఆయకట్టుకు సాగర్ జలాలను ముందుగా నిర్ణయించిన వారబందీ షెడ్యూల్ ప్రకామే విడుదల చేస్తున్నాం. చిన్నచిన్న సమస్యలు తప్ప ఎక్కడా సమస్య ఎదురుకావడం లేదు. ఆయకట్టు అంతటికీ నీరు అందేలా మా శాఖ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. – ఎం.వెంకటేశ్వర్లు, ఎస్సీ, జలవనరులశాఖ -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం మొ క్కలు నాటుతున్న కొత్తగూడేనికి చెందిన విశ్వామిత్ర చౌహాన్కు వరల్డ్బుక్ఆఫ్ రికార్డ్స్లోస్థానం దక్కింది. ఈ మేరకు మంగళవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన కార్యక్రమంలో ఆయనను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వాహకుడు, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ వరి ధర్ శ్రీరామ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రముఖులు విలియం జెజ్లర్, పూనమ్ జెజ్లర్, నవాల్సాగర్ తదితరులు పాల్గొనగా ఇప్పటివరకు విశ్వామిత్ర 1,119 మొక్కలు నాటడంపై అభినందించారు. -
అభివృద్ధి.. ఇంకొన్ని ప్రణాళికలు
● మధిరలో రూ.600కోట్ల నిధులతో పనులు ● పురోగతిలో పలు నిర్మాణాలుమధిర: మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగానే కాక ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖలు చూస్తున్నారు. దీంతో మధిర మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.600 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్లను బీటీ రోడ్లుగా తీర్చిదిద్దగా.. మధిర మున్సిపల్పై మరింత ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు మధిర మున్సిపాలిటీ కేంద్రంలో మురుగునీరు బయటకు కనిపించకుండా రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే, మేజర్ స్టార్ట్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరు కాగా, వైరా నది వరద ముంపు సమస్య రాకుండా రూ.65 కోట్లతో చేపట్టే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇవికాక విద్యుత్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ కోసం రూ.28 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అలాగే, వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించగా, రూ.2 కోట్లతో డిగ్రీ కళాశాల, రూ.4 కోట్లతో జూనియర్ కళాశాల నూతన భవనాలు చేపట్టనున్నారు. మధిరలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.193 ట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇక రూ.12 కోట్లతో మధిర చెరువు, రూ.3కోట్లతో మడుపల్లి చెరువు ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుత ఉన్న బస్టాండ్ స్థానంలో కొత్త నిర్మాణానికి రూ.9.50 కోట్లు కేటాయించారు. అలాగే, రూ.25 కోట్లతో కోర్టు భవనాల సముదాయం నిర్మించనున్నారు. ఇంకా మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద రూ 50 లక్షలతో స్నానాల ఘాట్, రూ.50 లక్షలతో బతుకమ్మ ఘాట్ నిర్మాణం, మున్సిపల్ పరిధి ఇల్లెందులపాడు, జిలుగుమాడు, అంబారుపేట, మడుపల్లిల్లో రూ.3 కోట్లతో శ్మశాన వాటికల్లో సౌకర్యాల కల్పనకు నిర్ణయించారు. మరికొన్ని పనులకు ప్రణాళిక మధిరలో కళాకారులకు అండగా నిలవడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేలా సాంస్కతిక కళా కేంద్రం ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అంబేద్కర్ నాలెడ్జి సెంటర్, ఐటీ హబ్ ఏర్పాటుచేయనున్నట్లు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే, డిజిటల్ లైబ్రరీ, మడుపల్లిలో ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు, చిరు వ్యాపారుల కోసం మినీ షాపింగ్ కాంప్లెక్స్, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రియల్ పార్క్, వృద్ధుల కోసం డే కేర్ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు కూడా ప్రతిపాదనల్లో ఉన్నాయని చెబుతున్నారు. -
ఆన్లైన్ బుకింగ్ మాకొద్దు
● మండ్రాజుపల్లిలో రైతుల ఆందోళన నేలకొండపల్లి: యూరియా పంపిణీకి అమలుచేస్తున్న ఆన్లైన్ బుకింగ్ విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్న రద్దు చేయాలని మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని మండ్రాజుపల్లి సొసైటీ వద్దకు చేరుకున్న రైతులు ఆన్లైన్ విధానం వల్ల సమస్యలు వస్తున్నందున రద్దు చేయాలంటూ యూరియా పంపిణీని అడ్డుకుని ధర్నాకు దిగారు. అందరి వద్ద స్మార్ట్ఫోన్లు లేనందున ఎలా బుకింగ్ చేసుకోవాలని నినాదాలు చేశారు. ఈమేరకు రైతులందరికీ అవసరం మేరకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. యూరియా ఇక్కట్లు తీర్చాలి తిరుమలాయపాలెం: యాప్లో బుక్ చేసుకోవడం కష్టంగా ఉందని, క్షణాల్లోనే స్లాట్లు అయిపోతున్న నేపథ్యాన రైతుల ఇక్కట్లు తీర్చాలని మండలంలోని గోల్తండాకు చెందిన కౌలు రైతు ఎం.డీ.సైదా తదితరులు కోరారు. తండాలో మొక్కజొన్న, వరి సాగు చేస్తుండగా ప్రస్తుత సమయంలో అవసరమైన యూరియా లభించడం లేదనివాపోయారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్నా ఇప్పటివరకు ఎరువు అందలేదని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి గతంలో మాదిరి షాపుల్లో నేరుగా యూరియా విక్రయించాలని కోరారు. సౌత్జోన్ అండర్–14 క్రికెట్ టోర్నీకి ఎంపికబోనకల్: మండలంలోని ఆళ్లపాడుకు చెందిన తోటకూర వంశీకృష్ణ–హారిక కుమారుడు ఉమేష్ సౌత్జోన్ ఇంటర్ స్టేట్ అండర్–14 బాలుర క్రికెట్ టోర్నీలో ఆడే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ఉమేష్ తన స్థిరమైన ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని విజ్ఞాన్జ్యోతి స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న ఉమేష్ను ఈసందర్భంగా పలువురు అభినందించారు. రూ.4.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనంఅశ్వాపురం: బైక్పై ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా మండలంలోని మొండికుంటలో మంగళవారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీహరిరావు ఆధ్వర్యాన తనిఖీ చేస్తుండగా, అశ్వాపురం వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరి వద్ద రూ.4.60 లక్షల విలువైన ఏడు కేజీల గంజాయి లభించింది. సూర్యాపేట జిల్లా తెల్లబెల్లికి చెందిన బడేటి వెంకటేశ్, ఏపీలోని కృష్ణా జిల్లా వెంగనాయకునిపాలెంనకు చెందిన మోరుబోయిన గోపయ్య.. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిని మణుగూరు ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో హెడ్కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు బహుమతులు..!
● అశ్వారావుపేట పలు వార్డుల్లో నగదు పంపిణీ? ● మహిళలకు చీరలు, కుక్కర్లు కూడా..అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అశ్వారావుపేటలోని పలు వార్డుల్లో కాంగ్రెస్, సీపీఎం, బీఆర్ఎస్, బీజేపీలతో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఓటుకు నోటుతో పాటు బహుమతుల పంపిణీ మొదలుపెట్టినట్లు తెలిసింది. రెండు వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు చైర్మన్ రేసులో ఉండగా, ఒకరు ఓటుకు రూ.5 వేలు, ఇంటికో చీర, ఇంకొకరు ఓటుకు రూ.2,500 ఇచ్చాడని సమాచారం. అలాగే, ఇంకో వార్డులో ఓ అభ్యర్థి ఓటుకు రూ.3 వేలు, చీర, జాకెట్, గాజులు, ఇదే వార్డులో మరో అభ్యర్థి ఓటుకు రూ.3 వేలతోపాటు రైస్ కుక్కర్, స్టీల్ క్యారేజీ, మరో వార్డులో ఓటుకు రూ.2,500, చీర, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పంపిణీ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఇంకొన్ని వార్డుల్లో ఓటుకు రూ.వేయి, చీర, జాకెట్ ఇవ్వగా.. వీటికి తోడు మద్యం, బిర్యానీతో విందులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే, కొందరు అభ్యర్థులు, వారి అనుచరులు మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు బహిరంగంగానే ఓటర్లకు నగదు, బహుమతులు పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. -
తొలి పీఠానికి పోటా పోటీ
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు బుధవారం తొలిసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ తమ బలాన్ని చూపించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో మేయర్ పీఠం కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చోట్లా ఓటర్లను ప్రభావితం చేసేందుకు భారీగా తాయిలాలు అందిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఒక్కో ఓటుకు రూ.2000 వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. మిగతా వార్డుల్లోనూ గెలుపు ధీమా ఉన్న వారు రూ.2000 వరకు పంపిణీ చేయగా, మిగిలిన అభ్యర్ధులు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఇచ్చారని తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకోగా.. సీపీఐ, టీడీపీతో జత కట్టింది. బీఆర్ఎస్ అధికారికంగా ఎవరితోనూ పొత్తు లేకున్నా.. ఆయా డివిజన్లలో స్థానిక పరిస్థితులను బట్టి లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతోంది. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 30 సీట్లు మహిళలకు రిజ్వర్ కాగా పాలకవర్గంలో 30 మంది పురుషులు, 30 మహిళలు ఉండే అవకాశం ఉంది. మేయర్ స్థానం ఎస్టీ జరనల్కు రిజర్వ్ కాగా ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ సామాజిక వర్గం వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ సారి 56 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీకి నాలుగు సార్లు ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 1971లో నోటిఫైడ్ ఏరియాగా ఏర్పాటు కాగా, 1988లో నోటిఫైడ్ ఏరియాకు కమిటీని నియమించారు. అందులో చైర్మన్, కమిటీ సభ్యులు ఉండే వారు. అధికారులు కమిటీ సభ్యుల నిర్ణయాల మేరకు అభివృద్ధి పనులు నిర్వహించే వారు. కాలక్రమేణా 1995లో మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. తర్వాత 2000 సంవత్సరంలో 25 వార్డులతో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అ సమయంలో గరీబ్పేట పంచాయతీలో ఉన్న చిట్టి రామవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పడు పాతకొత్తగూడెం మొదటి వార్డుగా ఏర్పాటుచేసి, వరుసగా వార్డులకు నంబర్లు కేటాయించారు. ఆ తర్వాత 2005లో కూడా 25 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో గొల్లగూడెంను మొదటి వార్డుగా కేటాయించి, మిగతా వార్డులకు వరుసగా నంబర్లు కేటాయించారు. 2014లో మూడోసారి ఎన్నికలు జరగగా, పెరిగిన ఓటర్లకు అనుగుణంగా వార్డుల సంఖ్యను 33కు పెంచారు. 2020లో 36 వార్డులతో నాలుగోసారి ఎన్నికలు నిర్వహించారు. 2025లో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలిపి మొత్తం 60 డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయగా, తొలిసారి బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్కు నేడు మొదటిసారి ఎన్నిక -
● పోటాపోటీగా నగదు పంపిణీ?!
● ఏదులాపురంలో రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు.. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 31 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంత ఖర్చయినా పర్వాలేదు.. గెలుపు ముఖ్యం అన్నట్లుగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం కొందరు అప్పులు చేసి మరీ ఎదుటి అభ్యర్థికి దీటుగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగియగా, మంగళవారం ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నికల సమయాన ఎవరైనా అభ్యర్థి డబ్బు పంపిణీ చేస్తుంటే ప్రత్యర్థులు అధికారులకు సమాచారం ఇచ్చేవారు. కానీ, ఈ సారి అభ్యర్థులు, వారి అనుచరులు బహిరంగంగా పంపకాలు చేపట్టినా ఎవరూ ఫిర్యాదు చేసుకోకపోవడం గమనార్హం. దాదాపు అన్ని వార్డుల్లో ఓటుకు కనీసం రూ.2 వేలకు తగ్గకుండా రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఓ అభ్యర్థి ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకు రూ.500 కలిపి ఎదుటి అభ్యర్థి ఇవ్వగా.. ఇంకొందరు నగదుకు తోడు చీర, చికెన్, మద్యం క్వార్టర్ సీసాలు కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
● ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి
ఖమ్మంసహకారనగర్: మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్కు వెళ్లేలా అనుమతి మంజూరు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు సంబంధిత శాఖాధికారులకు వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని తెలిపారు. ● కలెక్టరేట్ నుంచి పోలింగ్ పర్యవేక్షణ ఖమ్మంసహకారనగర్: మున్సిపాలిటీల్లో పోలింగ్ను నిరంతరం పర్యవేక్షించేలా ఖమ్మం కలెక్టరేట్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు వెబ్క్యాస్టింగ్ మానిటరింగ్ సెల్ ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మశ్రీ మంగళవారం పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని 117 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేయగా.. అక్కడి పోలింగ్ సరళి పరిశీలనకు కలెక్టరేట్లో ఐదు స్క్రీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, టెక్నికల్ మేనేజర్ హనుమాచారి, ఈడీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖలో మహిళా కమిటీ
ఖమ్మంవ్యవసాయం: మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంపై రూపొందించిన చట్టం అమలుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. ఈమేరకు ఖమ్మం విద్యుత్ శాఖలో మంగళవారం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్ పర్సన్గా టిరజనికుమారి(జేఏఓ), సభ్యులుగా పి లక్ష్మీప్రియ(ఏఈ), బి.మానస(జేఏఓ), టి.బబిత(సీనియర్ అసిస్టెంట్), ఆర్.సంధ్యారాణి(ఆర్టిజన్ గ్రేడ్–1)లను నియమించారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో కమిటీ, మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మాట్లాడారు. 2013లో ఏర్పాటైన లైంగిక వేధింపుల నివారణ చట్టం పై మహిళా ఉద్యోగులకు నూతన కమిటీ అవగాహన కల్పిస్తుందని తెలిపారు. మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను గోప్యంగా ఉంచి విచారణ చేపడుతారని వెల్లడించారు. మహిళా ఉద్యోగులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉందని ఎస్ఈ తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్ల గుట్టపై బ్లూవిల్లాస్ సముదాయంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వల్లభనేని వెంకన్నబాబు ఐదు నెలల క్రితం అమెరికాలో ఉన్న తన పిల్లల వద్దకు వెళ్లాడు. ఈ విషయాన్ని గుర్తించిన నలుగురు దుండగులు సోమవారం తెల్లవారుజామున ముసుగులు ధరించి వచ్చి తాళం పగలగొట్టి లోనకు ప్రవేశించారు. ఆపై బీరువాలో దాచిన 12 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి ఆభరణాలను అపహరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు వెంకన్నబాబు విద్యుత్ బిల్లు చూడమంటూ తన మిత్రుడు తన్నీరు రామును పంపించగా మంగళవారం ఉదయం వెళ్లేసరికి తాళం పగలగొట్టి ఉండడం, చోరీ ఆనవాళ్లు కనిపించడంతో విషయం బయటపడింది. అంతేకాక దుండగులు సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. ఘటనపై రాము ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ముసుగు ధరించిన నలుగురు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. బంగారం, వెండి ఆభరణాల అపహరణ -
●పకడ్బందీగా బందోబస్తు
ఖమ్మంక్రైం/ఖమ్మం రూరల్/వైరా: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా బందోబస్తు ఏర్పాటుచేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసులతో మంగళవారం ఖమ్మంలోని సీపీ కార్యాలయంతో పాటు రూరల్ ఏసీపీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికలకు 1,100మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియమావళిని ఎవరూ ఉల్లంఘించకుండా చూడడమే కాక అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. కాగా, వైరాలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సీపీ సునీల్దత్ పరిశీలించారు. విధులకు వెళ్తున్న పోలీసులకు బందోబస్తుపై సూచనలు చేశారు. ప్రలోభాలకు గురి చేసే వారిపై నిఘా వేసి, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. అనంతరం వైరా పోలీస్స్టేషన్లో అధికారులతో సమావేశమైన సీపీ.. రౌడీ షీటర్ల కట్టడి, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యతక, కేసుల విచారణపై సూచనలు చేశారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
గెలుపే లక్ష్యం కావాలి..
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● ఉత్సాహంగా జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలుఖమ్మం స్పోర్ట్స్: క్రీడాకారులు ప్రతీసారి గెలుపే లక్ష్యంగా శ్రమిస్తే తప్పక ఫలితం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అయితే, ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా లోటుపాట్లను తెలు సుకుంటే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. పోటీలకు ఐదు నియోజకవర్గాల నుంచి 1,200 మంది క్రీడాకారులు హాజరవడం అభినందనీయమన్నారు. అందరికీ ప్రతిభ చాటాలనే తపన ఉన్నా కొందరికే విజయం సొంతమవుతుందని తెలిపారు. ఆపై శిక్షణపై దృష్టి సారించాలని సూచించారు. గత ఏడాది జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు 47 పతకాలను సాధించిన నేపథ్యాన ఈసారి సంఖ్య పెరగాలన్నారు. ఖమ్మంలో త్వరలోనే మరో ఆధునిక స్టేడియం నిర్మించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, డీఈఓ చైతన్య జైనీ, కోచ్లు, క్రీడా అసోసియేషన్ బాధ్యులు ఎండీ.గౌస్, ఉదయ్కుమార్, కె.ఆదర్శ్కుమార్, కె.క్రిస్టోఫర్బాబు, వై.రామారావు, బొంతే శ్రీనివాస్, ఎండీ.షఫీక్ అహ్మద్, వీవీఎస్.సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్టేడియంలో కోలాహలం జిల్లాస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులతో పటేల్ స్టేడియంలో సందడి నెలకొంది. వివిధ కేటగిరీల్లో నిర్వహించిన కబడ్డీ, ఖో–ఖో, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్ తదితర పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ చాటారు. క్రీడాకారులకు స్టేడియంలో తాగునీటి వసతితో పాటు భోజనాలు సమకూర్చారు. అథ్లెటిక్స్లో విజేతలు వీరే... సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను అండర్–16, 20 బాలబాలికల విభాగాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్కు సంబంధించి అండర్–16 బాలుర 60 మీటర్ల పరుగులో ఆర్.మోహన్, ఎస్.కే.ఉమర్ ఫారూఖ్, ఏ.నాగరాజు, 600 మీటర్ల పరుగులో గోపాలకృష్ణ, విజయరామ అరవింద్, ఈశ్వర్, జావెలిన్ త్రోలో టి.సందీప్, బి.సందీప్, కొండ, షాట్పుట్లో కె.వెంకట్రావు, బి.సందీప్, వి.రాంచరణ్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల షాట్పుట్లో జోషికా, గౌరీప్రియ, స్రవంతి, జావెలిన్ త్రోలో ఆమ్ములు, శ్రీలక్ష్మి, పవిత్ర, 600 మీటర్ల పరుగులో నక్షత్ర, ఎం.డీ.ఆఫ్రిన్, దీక్ష, పురుషుల 400 మీటర్ల పరుగులో ఎస్.గోపీచంద్, ఎన్.వినయ్కుమార్, ఎం.కళ్యాణ్ వరుసగా మూడు స్థానాలు దక్కించుకున్నారు. అలాగే, 800 మీటర్ల పరుగు బాలికల అండర్–20 విభాగంలో ఎస్.కే.ఆఫ్రిన్, బాలుర విభాగంలో అబ్దుల్ రజాక్, 200 మీటర్ల పరుగులో డి.వివేక్చంద్ర, కృష్ణమనోహర్, సురేష్, అండర్–18 బాలికల షాట్పుట్లో బి.వైశాలి, సాబా తబసుమ్, శ్రావణి, మహిళల 100 మీటర్ల పరుగులో ఎ.మైథిలి, ఎం. మనీషా విజేతలుగా నిలిచారు. -
జాబ్మేళాలో 15 మంది ఎంపిక
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ మోడల్ కెరీర్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన జాబ్మేళాలో 15 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బీమా కంపెనీలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మేళాకు 65 మంది హాజరుకాగా ఇంటర్వ్యూ అనంతరం 15మందిని ఎంపిక చేసినట్లు జిల్లా ఉపాధి కల్ప న శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి నేలకొండపల్లి: ఈనెల 25నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి(డీఐఈఓ) కె.రవిబాబు తెలిపారు. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షలను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వార్షిక పరీక్షలకు జిల్లాలో 66 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 35,188 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందులో మొదటి సంవత్సరం 17,467, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,721మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్స్టేషన్ల నుంచి ఎస్కార్ట్ మధ్య పరీక్ష ప్రశ్నాపత్రాలు తరలించడమే కాక ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు అమరుస్తున్నామని తెలిపారు. హాల్టికెట్లను విద్యార్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఐఈఓ వెల్లడించారు. కాగా, ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం ముగియనుండగా, జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని తెలిపారు. ఆయన నేలకొండపల్లి కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్.వెంకటేశ్వర్లు ఉన్నారు. వ్యవసాయ రంగంలో పీహెచ్డీ కామేపల్లి: లక్ష్యాన్ని చేరేందుకు గ్రామీణ నేపథ్యం అడ్డంకి కాదని చెబుతూ శాస్త్రవేత్తగా ఎదగడమే ధ్యేయంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్న మండలంలోని సాతానిగూడెం గ్రామానికి చెందిన పేలపూడి హిమబిందు వ్యవసాయ రంగంలో పీహెచ్డీ సాధించింది. ఉప్పు నీటి ఆధారంగానూ సాగయ్యే వరి వంగడాలపై ఆమె చేసిన పరిశోధనలకు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించగా వీసీ జానయ్య చేతుల మీదుగా అందుకుంది. భర్త సిరిపురపు వెంకటేష్చౌదరి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న ట్లు వెల్లడించిన హిమబిందు... ఐకార్–ఐఐఆర్ఆర్, ఐకార్–ఐఐఓఆర్లో పరిశోధకురాలిగా సేవలందించడమే కాక గతంలో యంగ్ సైంటి స్ట్, యంగ్ రీసెర్చర్ అవార్డులు గెలుచుకుంది. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. విజయేంద్రప్రసాద్ పూజలు.. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, ఎంపీ విజయేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఈఓ దామోదర్రావు స్వాగతం పలకగా అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. -
ఐటీడీఏలో ఇక డీడీఈఓ !
● గిరిజన విద్య బలోపేతానికి సర్కారు నిర్ణయం ● డిప్యుటేషన్పై సీనియర్ హెచ్ఎంలకు బాధ్యతలు ● గతంలో సేవలందించిన ఏజెన్సీ డీఈఓలు భద్రాచలం: గిరిజన విద్య బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఐటీడీఏల పరిధిలో డిప్యూటీ డీఈఓలను నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఐటీడీఏ పరిధి పాఠశాలలను గిరిజన సంక్షేమ శాఖ డీడీ పర్యవేక్షిస్తుండగా.. వారిపై విధుల భారం, ఒత్తిడి పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. జిల్లాల పునర్విభజనలో ఈ పోస్టు జిల్లాకు తరలిపోవడంతో ఆ స్థానాన్ని డిప్యూటీ డీఈఓ పోస్టుతో భర్తీ చేయనుంది. 2016లో పోస్టు మాయం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గతంలో ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, గిరిజన గురుకులాలను సదరు అధికారి పర్యవేక్షించేవారు. అయితే 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాచలం ఏజెన్సీ డీఈఓ పోస్టును జిల్లా విద్యాశాఖాధికారి పోస్టుగా అప్గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి డీఈఓ పరిధిలోనే అన్నిరకాల విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. చివరి ఏజెన్సీ డీఈఓగా రవీందర్బాబు బాధ్యతలు నిర్వర్తించారు. నిరాశ పరుస్తున్న ఫలితాలు ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో 2016 తర్వాత ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. పాఠశాలల పర్యవేక్షణ గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిధిలోకి వెళ్లడం, ఆ అధికారికి ఇతర శాఖల పర్యవేక్షణ, ఒత్తిడితో పాఠశాలలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇక డీడీలు ఉద్యోగ విరమణ చెందినప్పుడు ఏపీఓ జనరల్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం, మళ్లీ నూతన డీడీ రాగానే విధులు బదలాయించడం.. ఇలా రకరకాల కారణాలతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతోనే ఐటీడీఏలో డిప్యూటీ డీఈఓలను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. గిరిజన సంక్షేమ శాఖలోని సీనియర్ ప్యానల్ గ్రేడ్ హెచ్ఎంను డిప్యుటేషన్పై ఈ పోస్టులో నియమించనుండగా, ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో బోధనపై పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు బాధ్యతలు వీరికి అప్పగించనున్నారు. పీఓ కల సాకారమయ్యేనా ? భద్రాచలం ఐటీడీఏ పీఓగా రాహుల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాథమిక విద్యార్థుల్లో లోపించిన తెలుగు, గణితం, సైన్స్ నైపుణ్యాలు, ప్రాథమిక అంశాలను పెంపొందించేందుకు ఉద్దీపనం, ప్రాక్టీస్ బుక్లు తయారుచేశారు. అయితే విద్యాశాఖలో అధికారి పోస్టు లేక పర్యవేక్షణకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. ప్రస్తుతం డిప్యూటీ డీఈఓ పోస్టు భర్తీ అయితే గిరిజన విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే పీఓ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. కాగా గిరిజన ఆశ్రమ పాఠశాలలను భద్రాచలం, దమ్మపేట, ఇల్లెందు డివిజన్లుగా విభజించారు. ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 3 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఉండగా, గిరిజన గురుకులాలు భద్రాద్రి జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో ఆరు ఉన్నాయి. కాగా, డిప్యూటీ డీఈఓ పోస్టు భర్తీ విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆదేశాలు రాలేదని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ తెలిపారు. అయితే, తాము గతంలో ఉన్న డీఈఓ పోస్టును భర్తీ చేయాలని కొన్నాళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదించామని వెల్లడించారు. -
●పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
సత్తుపల్లి/కల్లూరు రూరల్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ఉద్యోగులకు సామగ్రి పంపిణీ కేంద్రాలతో పాటురిసెప్షెన్, స్ట్రాంగ్రూం, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, ఆతర్వాత బ్యాలెట్బాక్స్ను స్ట్రాంగ్రూంకు తరలించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించగా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశామని తెలిపారు. వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని, సెన్సిటివ్ కేంద్రాల్లో పరిశీలనలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని వెల్లడించారు. ఈనేపథ్యాన ప్రజలు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కలెక్టర్ కోరారు. ఆయన వెంట కల్లూరు సబ్కలెక్టర్ అజయ్ యాదవ్, తహసీల్దార్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు నర్సింహ, ఎం.రామదుర్గారెడ్డి, వివిధ శాఖల అధికారులు నాగేశ్వరరావు, చంద్రశేఖర్, రామకృష్ణ, చలపతిరావు, కృష్ణ, నందిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
మున్సిపోల్స్కు సిద్ధం..
మళ్లీ ‘సాగర్’ కష్టాలు సాగర్ కాల్వల ద్వారా వారబందీ విధానంలో నీరు విడుదల చేస్తుండగా చివరి ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగుతున్నారు.బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026IIలోసాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగే పోలింగ్కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మున్సిపాలిటీల పరిధిలో 117 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏదులాపురంలో 15వ వార్డు ఏకగ్రీవం కావడంతో 116వార్డుల్లో ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈమేరకు 414మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 1,41,875మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చ నున్నారు. ఓటర్లలో మహిళలు 74,083 మంది, పురుషులు 67,768 మందితో పాటు ఇతరులు 24 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో మంగళవారం సాయంత్రంకల్లా కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. సామగ్రి పంపిణీని కలెక్టర్ అనుదీప్ పరిశీలించగా, బందోబస్తుపై పోలీసు ఉద్యోగులకు కమిషనర్ సునీల్దత్ సూచనలు చేశారు. కాగా, పోలింగ్ తర్వాత బందోబస్తు నడుమ బ్యాలెట్బాక్స్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించనుండగా, ఈనెల 13న శుక్రవారంఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఏర్పాట్లు పూర్తి ఐదు మున్సిపాలిటీలకు గాను 116 వార్డుల్లో పోలింగ్కు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 240 పోలింగ్స్టేషన్లు ఏర్పాటుచేయగా, ఓటర్లకు ఇబ్బందులు ఎదురుకాకుండా తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్ల కోసం వీల్చైర్లు, సహాయకులను సిద్ధం చేశారు. ప్రత్యేక బృందాలు ఎన్నికల విధులకు అవసరమైన ఉద్యోగుల కన్నా 20శాతం ఎక్కువగా కేటాయించారు. పోలింగ్కు మొత్తం 240మంది అవసరమైతే 295మందికి శిక్షణ ఇచ్చారు. ఏపీఓలు 295మంది, ఓపీఓలు 910మంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే, 55మంది రిటర్నింగ్ అధికారులు, 60మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. అవసరమైన 482 బ్యాలెట్ బాక్స్లకు తోడు 20శాతం అదనంగా అంటే 580 బాక్స్లు సమకూర్చారు. అలాగే, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 26మంది జోనల్ ఆఫీసర్లు, పదేసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్లు ఏర్పాటు చేశారు. వీరికి తోడు 35మంది మైక్రో అబ్జర్వర్లు, మరో 38 మంది రూట్ ఆఫీసర్లు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. సామగ్రితో కేంద్రాలకు... మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు మంగళవారం సామగ్రిని పంపిణీ చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పలు కేంద్రాలను పరిశీలించి సూచనలు చేశారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం, పీఓ డైరీ నింపడం, పోలింగ్ పూర్తయ్యాక సీల్ వేయడం తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వివరించారు. కాగా, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఉద్యోగులు 58 బస్సుల్లో తమకు కేటాయించిన సెంటర్లకు చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 1,100 మందితో బందోబస్తు ఎన్నికలకు 1,100మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో నలుగురు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది సిబ్బంది పాల్గొంటారు. ఈమేరకు పోలీస్ కమిషనర్ సునీల్దత్ సిబ్బందికి అవగాహన కల్పించారు.నేడు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికార యంత్రాంగం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇక్కడ జరుగుతున్న పోలింగ్ను కలెక్టరేట్లోని ప్రత్యేక సెల్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్లలో 25 సమస్యాత్మక, 32 అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించి వెబ్కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
ఇల్లెందురూరల్/కారేపల్లి: ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామ పంచాయతీ పరిధి ఐటీఐ సమీపాన పనులు చేస్తున్న కేబుల్ ఆపరేటర్ జువ్వాజి లాలయ్య (45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సుభాష్నగర్ నుంచి లలితాపురం వరకు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇటీవల కొత్త స్తంభాలను అమర్చారు. ఈ మేరకు రాఘవాపురంలో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్న లాలయ్య స్తంభాలపై టీవీ కేబుల్ అమర్చే పనులకు సోమవారం సిద్ధమయ్యాడు. అయితే, స్తంభాల పక్కనే బూడిదంపాడు నుంచి ఇల్లెందు సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా చేసే 33 కేవీ లైన్ ఉంది. కేబుల్ వేసే పనుల్లో నిమగ్నమైన లాలయ్య పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకగా షాక్కు గురై పైనుంచి కిందపడ్డాడు. ఆయనను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, లాలయ్యకు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కవల కుమార్తెలు సహా నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో భార్య, పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు నాగేశ్వరరావు – సరోజ చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు సీఐ సురేశ్ తెలిపారు. రోడ్డుప్రమాదంలో.. పెనుబల్లి: మండలంలోని లంకపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన రాయల జయప్రకాష్(37) మృతి చెందాడు. ఆయన సోమవారం బైక్పై సత్తుపల్లి వెళ్తుండగా లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై బొగ్గు టిప్పర్ ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన జయప్రకాశ్ను పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తుపల్లి డిపోలో ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాన్ డ్రైవర్... తల్లాడ: సిగ్నల్ లైట్లు వేయకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపిన కంటైనర్ లారీని వ్యాన్ ఢీకొనగా డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ సమీపాన చోటు చేసుకుంది. రహదారిపై లారీని డ్రైవర్ సిగ్నల్ లైట్లు లేకుండా నిలిపాడు. ఇదేమార్గంలో హుజూర్నగర్కు కొబ్బరికాయలు లోడుతో వ్యాన్ డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించక ఢీకొట్టాడు. ఘటనలో వ్యాన్ డ్రైవర్ అయిన వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన కొమ్ముల బన్నిరాజు(19) అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన మృతదేహం క్యాబిన్లోలో ఇరుక్కుపోగా స్థానికులు సాయంతో పోలీసులు బయటకు తీశారు. -
విత్తనోత్పత్తి కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉన్నప్పుడే 1995లో అంబాజీపేటతోపాటు అశ్వారావుపేటలో కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం ఏర్పాటుచేశారు. అంతకుముందు 1988లో పట్టు పరిశ్రమ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ ఆవరణలో మల్బరీతోట సాగు చేస్తూనే ఆయిల్పామ్ మొక్కలు పెంచుతున్నారు. ఇదే ప్రాంగణాన్ని ఇటీవల ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించారు. ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన 1989లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశారు. అలాగే, 1988లో హార్టికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ కూడా ఏర్పాటైంది. ఉద్యాన యూనివర్సిటీ ద్వారా ఈ కేంద్రంలో పలు రకాల ఉద్యాన పంటల సాగు చేస్తూనే కొత్త వంగడాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అలాగే, అవేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన రూరల్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్వీటీసీ) ఐటీఐ కళాశాలను 1981లో ప్రారంభించారు. ఇక్కడ ఐటీఐతోపాటు అగ్రికల్చరల్ ఇంటర్మీడియట్ కోర్సు నిర్వహిస్తున్నారు. కాగా, అశ్వారావుపేట పంచాయతీ సమితిగా ఉన్నపుడు స్వాతంత్య్ర సమరయోధులకు గుర్తుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాతి స్థూపాన్ని ఏర్పాటు చేశారు. -
ఓటు వేయడం కష్టమే...
● గడప దాటలేని స్థితిలో వృద్ధులు, దివ్యాంగులు ● ‘హోం ఓటింగ్’ అవకాశం లేక ఆవేదనసత్తుపల్లిటౌన్: వృద్ధులు, దివ్యాంగులు పలువురు గడప దాటలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలంటే యాతన పడాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం గతంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు అవకాశం కల్పించింది. ఎన్నికల అధికారులకు ముందస్తుగా సమాచారం ఇస్తే పరిస్థితి తీవ్రత ఆధారంగా జాబితాలో చోటు కల్పించే వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓటు వేయించేవారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో ఓటు వినియోగించుకోవాలనే ఆకాంక్ష ఉన్నా శరీరం సహకరించని పలువురు ఆవేదన చెందుతున్నారు. కొందరిని కుటుంబీకులు, మరికొందరిని అభ్యర్థులు అతికష్టంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నా.. ఇంకొందరు మాత్రం ఓటుకు దూరం కావాల్సి వస్తోంది. -
నేటి నుంచి బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో మంగళవారం నుంచి ఐఈఎల్టీఎస్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 10గంటల్లోగా స్టడీసర్కిల్కు చేరుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోని వారు కూడా మంగళవారం నేరుగా రావొచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 08742–230848, 94419 3135 9 నంబర్లలో సంప్రదించాలని ఆమె తెలిపారు. పీఆర్టీయూతోనే సమస్యల పరిష్కారం ఖమ్మం సహకారనగర్/మధిర: ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలు పీఆర్టీయూతోనే పరిష్కారమవుతాయని యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్రావు, ఆర్.రంగారావు పేర్కొన్నారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవా రం ఖమ్మం, మధిరలో జరిగిన సమావేశాల్లో పతాకాలు ఆవిష్కరించాక మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు గర్వపడేలా విధంగా తమ సంఘం పనిచేస్తుందని, రాష్ట్రంలో 75 వేల సభ్యత్వంతో ప్రథమ స్థానాన ఉందని తెలిపా రు. ఈ కార్యక్రమాల్లో యూనియన్ నాయకులు షేక్ మదార్, ఆర్.బ్రహ్మరెడ్డి, చిలుకూరి సత్యనారాయణరెడ్డి, పోలే సుధాకర్, రవికుమార్, కొమ్ము శ్రీనివాసరావు, డి.వెంకటేశ్వరరావు, తూమాటి కృష్ణారెడ్డి, కోట జయరాజు, బూసా కోటేశ్వరావు, కొలగాని ప్రసాదరావు, పిల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రూ.4 కోట్ల విలువైన గంజాయి దహనం ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలో నమోదైన 47 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 953 కేజీల గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు సోమవారం దహనం చేశారు. తల్లాడ మండలం గోపాల్రావుపేటలో ఈ గంజాయిని కాల్చివేయగా, దీని విలువ రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 21 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 194 కేజీలు, భద్రాద్రి జిల్లాలోని 47 కేసుల్లో పట్టుబడిన 760 కేజీల గంజాయిని దహనం చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్రెడ్డి, ఏఈఎస్లు పాల్గొన్నారు. -
● ఆయువుపట్టు.. సూపర్బజార్!
సూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి కార్మికుల నిత్యావసరాల కొనుగోళ్లకే కాకుండా ఇతర వర్గాల ప్రజానీకానికి సైతం అన్ని వస్తువులు దొరికే ప్రాంతంగా కొత్తగూడెంలోని సూపర్బజార్ సెంటర్ నిలుస్తోంది. కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపాన జాతీయ రహదారి పక్కన సూపర్బజార్ను సింగరేణి సంస్థ ఏళ్ల క్రితం ఏర్పాటు చేసింది. అంతకముందు నాలుగు రోడ్లు కలిసే జంక్షన్ కావడంతో త్రీటౌన్ సెంటర్ లేదా రైల్వేస్టేషన్ సెంటర్గా పిలిచేవారు. సూపర్బజార్ ఏర్పాటయ్యాక అదే పేరు స్థిరపడింది. సూపర్బజార్ ఎదురుగా జాతీయ రహదారి ఇరువైపులను కలుపుతూ ఆర్చి కూడా ఉంటుంది. ఈ సెంటర్లో ప్రతీ ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నిలుపుతుండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. -
కుళ్లిన మాంసం విక్రయాలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం త్రీటౌన్ పరిధి మూడు బొమ్మల సెంటర్ వద్ద ఓ షాపు నుంచి దుర్వాసన వస్తుండడంతో కుళ్లిన మాంసం విక్రయిస్తున్నారనే అనుమానంతో స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోనూ మటన్ షాప్ నిర్వాహకుడు రాజేందర్ తక్కువ ధరకే కొన్నేళ్లుగా పలు హోటళ్లు, ప్రభుత్వ సంస్థలకు మాంసం సరఫరా చేస్తున్నట్లు తెలియగా, షాప్ నుంచి కొద్దిరోజులుగా తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు సోమవారం సమాచారం ఇచ్చారు. దీంతో కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయగా ఫ్రిడ్జ్లో కుళ్లి, బూజు పట్టిన మాంసం బయటపడింది. ఆపై డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు చేరుకుని విచారణ చేపట్టారు. బూజు పట్టి, కొంత మురిగిపోయిన 50 కేజీల మాంసం రెండు వారాల క్రితం కోసినదిగా నిర్ధారించారు. అంతేకాక షాపునకు అనుమతులు లేవని తేల్చారు. కాగా, అధికారుల తనిఖీ సమయాన రోగాల బారిన పడిన గొర్రెలను ఆటోల తీసుకురాగా, ఆరా తీయడంతో ఈ దుకాణంలో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు ఆటో డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. ఈమేరకు షాప్ నిర్వాహకుడు రాజేందర్పై ఫుడ్ ఇన్స్పెక్టర్ లోకేష్ సమక్షాన కేఎంసీ అధికారులు ఖమ్మం త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.దుర్వాసన రావడంతో వెలుగులోకి వచ్చిన బాగోతం -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
రఘునాథపాలెం: మండలంలోని చెరువుకొమ్ము తండాకు చెందిన కౌలు రైతు భూక్యా లక్ష్మా(40) కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. అయితే, పంటలు దెబ్బతినడంతో అప్పులు మిగిలిపోగా మద్యానికి బానిసైన లక్ష్మా జనవరి 13న గడ్డి మందు తాగాడు. దీంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఘటనపై లక్ష్మా భార్య చంద్రావతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. -
విద్యుత్ సేవల్లో డిజిటల్ విప్లవం
ఖమ్మంవ్యవసాయం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఖమ్మం విద్యుత్ సర్కిల్ మరో అడుగు ముందుకు వేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, ఉద్యోగుల విధులు సులువయ్యేలా డిజిటల్ గ్రిడ్ మ్యాప్ను రూపొందించింది. ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మార్గదర్శకత్వంలో సిద్ధమైన ఈ మ్యాప్ను గూగుల్ మ్యాప్తో అనుసంధానించారు. డిజిటల్ మ్యాప్లో జిల్లాలోని 33 కేవీ సబ్స్టేషన్లు, అనుబంధ 11 కేవీ, 33 కేవీ లైన్లతో పాటు ట్రాన్స్కో పరిధిలోని 132, 220, 400 కేవీ విద్యుత్ లైన్ల వివరాలు పొందుపరిచారు. తద్వారా విద్యుత్ నెట్వర్క్ మొత్తం ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా సేవలు ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే సిబ్బందికి అవసరమైన సబ్ స్టేషన్ లేదా లైన్ ప్రాంతానికి గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్లే అవకాశముంటుంది. దీంతో సమస్య ఎదురైన ప్రాంతాన్ని గుర్తించడంలో ఎదురవుతున్న తిప్పలు తప్పనున్నాయి. ఈక్రమాన ఉద్యోగుల సమయం ఆదా అవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించవచ్చని చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రజలకు అందించే సేవలను మెరుగుపర్చడమే లక్ష్యం. ఇందులో భాగంగానే డిజిటల్ గ్రిడ్ మ్యాప్ను రూపొందించాం. భవిష్యత్లో మరిన్ని ఆవిష్కరణలతో విద్యుత్ రంగంలో స్మార్ట్ జిల్లాగా తీర్చిదిద్దుతాం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ఫిర్యాదులు, వినతిపత్రాలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై పరిష్కారంపై సూచనలు చేశారు. ● ఆర్థిక అంశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాక ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించాక ఆయన మాట్లాడారు. ● ప్రారంభ దశలో కేన్సర్ను గుర్తిస్తే చికిత్స చేయించుకుని మెరుగైన జీవనం పొందొచ్చని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. యువికెన్ ఫౌండేషన్ బాధ్యులు డాక్టర్ షహనాజ్బాను ఆధ్వర్యాన బ్రెస్ట్ కేన్సర్ నిర్ధారణ యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 30ఏళ్లు దాటినా మహిళా ఉద్యోగుల పరీక్షల కోసం క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. కేన్సర్ నిర్ధారణ యంత్రం సమకూర్చిన బాధ్యులను అభినందించారు. ● సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఐసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఖమ్మం రిక్కాబజార్ పాఠశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈమేరకు ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎల్డీఎం ఏ.రవిప్రసాద్, టీజీబీ రీజినల్ మేనేజర్ ఏ.ప్రసన్న కుమార్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరామ్ బరన్, డీఎంహెచ్ఓ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ చందునాయక్, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి ప్రసాద్, ఉద్యోగులు భిక్షు, హరిబాబు, వినయ్, సతీష్ పాల్గొన్నారు. గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్ -
అటు ఏపీ.. దాటొస్తే తెలంగాణ
అశ్వారావుపేట: మున్సిపాలిటీగా తొలిసారి ఎన్నికలు జరగనున్న అశ్వారావుపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆహ్లాదకర వాతావరణం, పచ్చని పంటలు, జాతీయ స్థాయి ఖ్యాతి కలిగిన పలు సంస్థలు.. ఇలా అనేక అంశాలు ఈ మున్సిపాలిటీ సొంతం! 1950లోనే ఇక్కడ ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహం అశ్వారావుపేటలో ప్రధాన సెంటర్గా ఉండేది. ప్రస్తుతం గాంధీ బొమ్మ సెంటర్ పాత అశ్వారావుపేటగా ఉంది. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణకు సరిహద్దుగా ఉండే అశ్వారావుపేటలో హైదరాబాద్, రాజమండ్రి, భద్రాచలం రోడ్లను కలిపే రింగ్ సెంటర్ ఉంటుంది. ఈ సెంటర్లో వివేకానందుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రింగ్ సెంటర్ వచ్చిందంటే తెలంగాణలోకి ప్రవేశించామని వాహనదారులు, డ్రైవర్లు గుర్తిస్తారు. అశ్వారావుపేట వ్యవసాయానికే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలతో స్థానిక, స్థానికేతర యువతకు ఉపాధి లభిస్తోంది. అశ్వారావుపేటలో పేపర్ మిల్లుతో పాటు పవర్ ప్లాంట్ కూడా ఉంది. అలాగే, కెమిలాయిడ్స్, హెర్బెక్స్ పరిశ్రమలు ఉండగా, స్థానిక నిరుద్యోగుల ఉపాధికి ఢోకా లేకుండా పోయింది. అశ్వారావుపేటలోనే తెలంగాణలో మొట్టమొదటి ఆయిల్పామ్ పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీలో నిర్ణయించిన నూనె దిగుబడి శాతాన్ని అనుసరించే ఆయిల్పామ్ గెలల ధర నిర్ణయిస్తుండడం విశేషం. అశ్వారావుపేట ఏర్పాటైన తొలినాళ్లలో కులాల వారీగా బజార్లు ఏర్పాటయ్యాయి. గౌడ బజార్, వడ్డెర బజార్, మంగలి బజార్, దూదేకుల బజార్, శివయ్యగారి బజార్, మేరీల బజార్ ఇలా సులువుగా గుర్తిస్తుంటారు. కాలక్రమేణా కాళింగుల బజార్ కూడా ఏర్పడింది. బందరు నుంచి వ్యవసాయం నిమిత్తం అశ్వారావుపేటకు వచ్చి స్థిరపడిన వారితో బందరు మకాం, కోత మిషన్ ఉన్నందుకు కోత మిషన్ బజార్ ఏర్పడ్డాయి. పుల్లలు కొట్టే వారు నివసించే ప్రాంతం పుల్లల కాలనీ, డ్రైవర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ డ్రైవర్ల కాలనీగా ఏర్పడినా ప్రస్తుతం బీసీ కాలనీగా రికార్డుల్లో ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ అటెండర్స్ కాలనీ, ఎన్టీఆర్ హయాంలో మంజూరైన ఇళ్లతో నందమూరి కాలనీ, జలగం ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలతో జలగం కాలనీ, ఫైర్ సిబ్బంది నివాసాలతో ఫైర్ కాలనీ, వైఎస్సార్ హయాంలో నిరుపేదలకు మంజూరు చేసిన కాలనీ మోడల్ కాలనీగా పేరు పొందాయి. దీనిని అల్లుళ్ల కాలనీగా కూడా పిలుస్తుంటారు. ఇవి కాక అల్లూరి సీతారామ రాజు కాలనీ, అశ్వారావుపేట జమీన్దారుల గుర్రాలు నీళ్లు తాగిన ప్రాంతం గుర్రాలచెరువుగా ఉండేది. ఈ గ్రామపంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది. అలాగే, దొంతికుంట చెరువుకు సమీపంలో పేదలకు మంజూరు చేసిన కాలనీ దొంతికుంటగానే కాక దివ్యాంగుల కాలనీ, కార్మికులతో ఆటోనగర్ పేర్లు స్థిరపడ్డాయి. సరిహద్దులో ‘పేట’ మున్సిపాలిటీ -
సత్తుపల్లికి ప్రత్యేక స్థానం..
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంసత్తుపల్లి/కల్లూరు రూరల్: ‘ఎప్పుడు ఏం చేయాలి.. ఎవరిని గెలిపించాలో సత్తుపల్లి ఓటర్లకు తెలిసినంత ఎవరికీ తెలియదు.. అంతలా సత్తుపల్లికి ప్రత్యేక బ్రాండ్ ఉంది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరో మూడేళ్లు రేవంత్రెడ్డి నేతృత్వాన ప్రభుత్వమే కొనసాగనున్నందున ప్రజలకు ఏం కావాలన్నా చేసేది తామేనని తెలిపారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున సోమవారం నిర్వహించిన రోడ్డు షోల్లో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్తో కలిసి పాల్గొన్న మంత్రి పలుచోట్ల మాట్లాడారు. సత్తుపల్లి అభివృద్ధికి సీఎంను ఒప్పించి మరిన్ని నిధులు సాధిస్తానని తెలిపారు. కళ్ల ముందు కనిపిస్తున్న శాశ్వతమైన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించాలని కోరారు. వచ్చే తొలకరికల్లా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి వేశ్యకాంతచెరువులోకి గోదావరి జలాలు నింపడమే కాక వేంసూరుకు పంపిస్తామని తెలిపారు. త్వరలోనే బుగ్గపాడు ఫుడ్పార్క్ను సైతం పూర్తి చేసి 3వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించామని మంత్రి వెల్లడించారు. ఇక కల్లూరు అభివృద్ధి కోసమే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశామని, ఆతర్వాత మున్సిపాలిటీగా మార్చామని తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవే కాకుండా కల్లూరులోనే నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కల్లూరు మండలం చెన్నూరులో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేశామని తెలిపారు. రెండు మున్సిపాలిటీల్లో వంద శాతం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల వెల్ల డించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ గత పదిహేను ఏళ్ల పాలనలో అభివృద్ధి కాగితాలకే పరిమితం కాగా, నిధులు విడుదల చేయకుండా శంకుస్థాపనలతోనే సరిపుచ్చారని విమర్శించారు. అబద్ధాలు, మోసాలతో కాలం గడిపారని, సింగరేణి సైలోబంకర్ వల్ల ప్రాణాలు పోయిన కుటుంబాలను ఏనాడైనా పరామర్శించారా అని నిలదీశారు. రూ.50 కోట్లతో సత్తుపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రచారంలో నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పొంగులేటి ప్రసాద్రెడ్డితో పాటు చల్లగుళ్ల నర్సింహారావు, ఎండీ.కమల్పాషా, తోట సుజలరాణి, బొంతు సుమలత, గ్రాండ్ మౌలాలీ, మందపాటి ప్రభాకర్రెడ్డి, దూదిపాల రాంబాబు, కర్నాటి విజయకుమారి, చావా స్వరూపారాణి, మట్టా ప్రసాద్, పసుమర్తి చందర్రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏమేం కావాలి ?!
మైక్లు కట్.. చివరిరోజైన సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా వార్డులను చుట్టేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా అన్ని ప్రయత్నాలు చేశారు. అభ్యర్థులు ముఖ్యనేతలతో కలిసి రోడ్షోలు నిర్వహించడమే కాక ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. దాదాపు వారం పాటు హోరాహోరీగా సాగిన ప్రచారం ముగియడంతో కార్పొరేషన్, మున్సిపాలిటీలు స్తబ్దుగా మారాయి. వ్యూహాలకు పదును ప్రచారం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సమావేశమై మున్సిపాలిటీల్లో అత్యధిక ఓట్లు సాధించేలా అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు. అలాగే, పోలింగ్ ఏజెంట్ల నియామ కం, పోల్ మేనేజ్మెంట్, పోలింగ్ స్టేషన్ల వద్ద వ్యవహరించాల్సిన తీరుపైనా సమీక్షించారు. అంతేకాక రాత్రివేళ సన్నిహితులను వెంట పెట్టుకుని ఓటర్లను కలుస్తున్నారు. మరోవైపు డివిజన్లు, వార్డుల్లో కీలకంగా ఉన్న నేతల వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకునేలా తమవంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. అక్కడ.. ప్రత్యేక దృష్టి బహిరంగ ప్రచారానికి తెరపడడం.. పోలింగ్కు ఒకే రోజు గడువు ఉండడంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. సోమవారం సాయంత్రం నుంచే చాలాచోట్ల ప్రలోభాలకు తెరతీశారు. ప్రధానంగా మేయర్, చైర్పర్సన్లకు రిజర్వ్ అయిన డివిజన్లు, వార్డులపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. అభ్యర్థుల విజయానికి నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈనేపథ్యాన ఓటర్లకు ఎంత ముట్టచెప్పడానికై నా వెనుకాడడం లేదు. డిమాండ్ ఆధారంగా ఓటరుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మద్యం కూడా అదే స్థాయిలో పంపిణీ చేసేలా పార్టీలు ఏర్పాట్లు చేశాయి. కొత్తగూడెం కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోని కొన్నిచోట్ల ఇప్పటికే మద్యం పంపిణీ మొదలు కాగా, ఓటర్లు డబ్బుతోపాటు ఇతర బహుమతులు కోరినా కాదనకుండా ఇచ్చేలా సిద్ధమయ్యారు. ఏదైనా ఇస్తాం కానీ ఓటు మాత్రం తమకే వేయాలని మాట తీసుకుంటున్నట్లు సమాచారం.ఓట్లు రాబట్టుకునేందుకు ఉన్న చివరి అవకాశాన్ని వినియోగించుకునేలా సోమవారం ప్రధాన పార్టీల్లోని ముఖ్యనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రచారం చేయగా, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధితో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రచారం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ప్రచారం చేపట్టారు. మధిరలో బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, పాల్వంచలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు రోడ్డు షోల్లో పాల్గొన్నారు. అభ్యర్థుల తెరచాటు మంతనాలు -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మం సహకారనగర్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఎన్నికల పరిశీలకుడు పవన్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాట్లను కలెక్టర్ వివరిస్తూ ఉద్యోగుల నియామకం, శిక్షణ పూర్తయిందని తెలిపారు. అలాగే, మున్సిపాలిటీల్లో సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఐదు మున్సిపాలిటీలు.. 117 వార్డులు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 117 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇందుకోసం 295 మంది చొప్పున పోలింగ్ అధికారులు, ఏపీఓలతో పాటు 910 ఓపీఓలను నియమించామన్నారు. అంతేకాక 26 మంది జోనల్ అధికారులు, 38 మంది రూట్ అధికారులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. మున్సిపాలిటీల వారీగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. లోటుపాట్లు ఎదురుకావొద్దు ఖమ్మంరూరల్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు సామగ్రి పంపిణీలో లోపాలు ఎదురుకావొద్దని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి పెద్దతండాలోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షెన్, కౌంటింగ్ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగులు చేరుకుంటారని, వీరికి పోలింగ్ బాక్స్లు, సామగ్రి సరిచూశాక అందించాలని తెలిపారు. ఆపై వాహనాల్లో కేంద్రాలకు చేర్చాలని పేర్కొన్నారు. వాహనాలు సమకూర్చడంతో పాటు భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈకార్యక్రమాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్, రిటర్నింగ్ అధికారి నవీన్బాబు, తహసీల్దార్ రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..
మధిర: మధిరను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏ స్థాయికి ఎదిగినా మధిరను ప్రాణంగా భావించే తాను ఇక్కడి ప్రజలకు ఏ అవసరం వచ్చినా తీర్చేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. మధిర మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం ఎన్నికల ప్రచారం చేయగా, రోడ్ షోల్లో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మధిర పట్టణ అభివృద్ధికి సానుకూలంగా ఉంటుందని తెలిపారు. గతంలో పదేళ్లు తాము అధికారంలో లేకపోగా, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం నిధులు మంజూరు చేయలేదన్నారు. ఇప్పుడు తాను డిప్యూటీ సీఎంగానే కాక ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖలు చూస్తున్నందున మధిర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈమేరకు రాజకీయ కోణంలో కాకుండా మంచి పాలకవర్గం ఎన్నికయ్యేలా కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని భట్టి కోరారు. ఎన్నికలు ముగిశాక అన్ని వర్గాల నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రముఖులను ఎంపిక చేసి పట్టణ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని, వారి సూచనలతో పనులు చేపడుతామని తెలిపారు. ఓటు వృథా కానివ్వొద్దు.. మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాక పరిశ్రమల ఏర్పాటుకు శిక్షణ ఇప్పిస్తామని భట్టి వెల్లడించారు. అలాగే, ఇండస్ట్రియల్ పార్కులో వారికి ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తామన్నారు. మధిర ఓటర్లు ఓటు వృథా చేయకుండా అభివృద్ధి కోసం కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాగా, పేదలకు రేషన్కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ అమలుచేస్తున్న తమను మున్సిలిటీల్లోనూ గెలిపించి మరింత బలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మధిర డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయగా, వరదల సమయాన ఇక్కట్లు ఎదురుకాకుండా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే, ఈదురు గాలులు వచ్చినా రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థతో పాటు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ అందుబాటులోకి రానుందని భట్టి వివరించారు. కాగా, మధిర 16, 17, 18, 19వ వార్డుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోడ్డు షోలు నిర్వహించచగా అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆలయానికి రూ.10లక్షల విలువైన మకర తోరణం
ఏన్కూరు: మండలంలోని నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామికి అలంకరణ కోసం భక్తులు వెండి మకర తోరణం అందజేశారు. ఖమ్మంకు చెందిన నారాయణరెడ్డి దంపతులు మకరతోరణాన్ని సోమవారం అర్చకుడు శ్రీనివాసచార్యులకు అందజేయగా ఆయన స్వామికి అలంకరించారు. కాగా, ఈ తోరణం విలువ రూ.10 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. శరవేగంగా సింథటిక్ ట్రాక్ పనులు ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత బ్లాక్ చిప్ వేయడం పూర్తిచేశారు. రెండో విడత కూడా పూర్తయ్యాక ట్రాక్పై రెడ్ చిప్స్ వేసి చదును చేయనున్నారు. అనంతరం లైన్ మార్కింగ్ పనులు జరుగుతాయని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. 20వరకే పత్తి కొనుగోళ్లు ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ వరకే పత్తి కొనుగోళ్లు ఉంటాయని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పత్తి సాగు చేసిన రైతులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని కేంద్రాలకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈనెల 21 నుంచి సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయనున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ముదిగొండ: కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ముదిగొండ మండలం బాణాపురంలో ఏర్పాటుచేసిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బాజీ హనుమంతుతో పాటు గండ్లూరి కిషన్రావు, మొక్క చిన్ననర్సయ్య విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించగా అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో జాన్వెస్లీ మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దోచిపెడుతోందని ఆరోపించారు. అంతేకాక ఎరువులపై సబ్సిడీ తగ్గించి రైతులకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి స్ఫూర్తితో అసమానతలు లేని సమాజం కోసం కార్యకర్తలకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు వనం నర్సింగరావు, పొన్నం వెంకటేశ్వరరావు, రాంబాబు, మన్నేపల్లి సుబ్బారావు, బండి పద్మ, బట్టు పురుషోత్తం, రాయల వెంకటేశ్వర్లు, పాండురంగారావు, కూరపాటి శ్రీనివాసరావు, చింతకాయ రామారావు, కె.తిరుపతి, ఎం.వెంకన్న, ఇరుకు నాగేశ్వరరావు, కె.ఉపేందర్ పాల్గొన్నారు. ఎఫ్ఎల్ఎస్ అమలుపై పరిశీలన ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) అమలును రాష్ట్ర బృందం పరి శీలించింది. ఎన్సీఈఆర్టీ బాధ్యులు భరణి జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, ఖమ్మం ఇందిరానగర్ పాఠశాలను సోమవారం సందర్శించారు. మూడో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ఎఫ్ఎల్ఎస్ అమలుపై ఆరా తీయడంతో పాటు ఈసీఆర్ వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ శైలజలక్ష్మీ, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
సాగునీటి కోసం రైతుల ఆందోళన
కొణిజర్ల: మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయాన సాగర్ జలాలను నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఎన్నెస్పీ గుబ్బగుర్తి, అంజనాపురం మేజర్ కాల్వలకు వారబందీ పేరుతో అధికారులు నీటిసరఫరా నిలిపి వేశారు. దీంతో మొక్కజొన్న, తదితర పంటలు ఎండిపోతున్నాయని అంజనా పురం, రామచంద్రాపురం, రాంపురం, గుబ్బగుర్తి రైతులు గుబ్బగుర్తిలో సోమవారం రహదారిపై బైఠాయించారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని పేర్కొనగా, ఏన్కూరు, పల్లిపాడు రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ విష యం తెలుసుకున్న పోలీసులు చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ఆయా కాల్వలకు నీరు విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. గుబ్బగుర్తిలో రాస్తారోకో -
అభివృద్ధి బాధ్యత నాదే..
● కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ● ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి పొంగులేటి ఖమ్మం రూరల్/కొత్తగూడెంఅర్బన్: ఏదులాపురంలో కాంగ్రెస్, కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఏదులాపురం మున్సిపల్ పరిధిలో సోమవారం నిర్వహించిన రోడ్డు షోలు, కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్నర్ మీటింగ్ల్లో ఆయన మాట్లాడారు. తప్పుడు ప్రచారంతో కారుకూతలు కూసే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని.. దందాలు, దౌర్జన్యాలు చేసే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రానున్న ఏప్రిల్లో రెండో విడత ఇళ్ల కేటాయింపు ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని తెలిపారు. మున్నేటి ముంపు ఎదురుకాకుండా వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా, సింగరేణి ప్రాంతమైన కొత్తగూడెంలో స్థలాల క్రమబద్ధీకరణ సమస్యను పరిష్కరించడంతో పాటు రోడ్లు, డ్రెయినేజీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్పై తొలి సారి కాంగ్రెస్ జెండా ఎగరవేసే బాధ్యత కూడా తనదేనని పొంగులేటి ప్రకటించారు. -
జెండా పాటే ప్రామాణికం
ఖమంవ్యవసాయం: మిర్చి కొనుగోళ్లలో జెండా పాట ధరను వ్యాపారులు ప్రామాణికంగా పాటించాలని మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి సూచించారు. జెండాపాట కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయగా ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం వచ్చిన ఆమె రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రస్తుతం విదేశీ ఎగుమతులు లేవని, దేశీయంగా 15వేల బస్తాల వరకు పంపించే అవకాశముండగా అంతకు మించి సరుకు వస్తే సమస్యలు ఎదురవుతున్నాయని వ్యాపారులు వివరించారు. ఈ సంర్భంగా డీడీ మాట్లాడుతూ జెండాపాట, మోడల్ ధరలకు మిర్చి కొనుగోళ్లు జరపాలని సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు, దిగుబడులు తగ్గాయని తెలుస్తోందన్నారు. ధర గత ఏడాది ఇదే సమయాన రూ. 14 వేలు ఉంటే ఇప్పుడు రూ. 19వేల వరకు పలుకుతోందని తెలిపారు. ఈనేపథ్యాన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, గత ఏడాది సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లలో తాత్కాలిక రిజిస్ట్రేషన్లు(టీఆర్) అమలుచేయగా జరిగిన అక్రమాలపై ఉద్యోగులకు చార్జిమెమోలు జారీ చేయగా, వారు ఇచ్చే సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని డీడీ తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సరెండర్ చేశామని వెల్లడించారు. డీడీ వెంట ఖమ్మం మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్, సహాయ కార్యదర్శి వీరాంజనేయులు తదితరులు ఉన్నారు. మిర్చి కొనుగోళ్లను పరిశీలించిన డీడీ పద్మావతి -
కొత్తగా గూడెం..
రుద్రంపూర్: సుమారు 110 ఏళ్ల కిందట ఏర్పాటైన సింగరేణి గనుల ద్వారా కొత్తగూడెం ఏర్పడింది. ఒకప్పడు అటవీ ప్రాంతంతోకూడిన చిన్న, చిన్న గ్రామాల సమూహంగా కొత్తగూడెం ఉండేది. ఇక్కడి ప్రజలు గోదావరి ఉపనదులను ఆధారం చేసుకుని జీవించేవారు. బ్రిటీష్ కాలంలో మలుపు.. బ్రిటీష్ హయాంలో 1880లో డాక్టర్ విలియం నేతృత్వంలో బొగ్గు గనుల అన్వేషణతో కొత్తగూడెం పేరు తెరపైకి వచ్చింది. 1886లో బొగ్గు తవ్వకాల కారణంగా పట్టణంగా మారింది. ఆ రోజుల్లోనే రైల్వేలైన్, కార్మికవాడలు, ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. నల్లగొండ, ఏపీ, ఇతర ప్రాంతాల నుంచి మార్వాడీలు, వైశ్యులు ఇక్కడ వ్యాపారాన్ని విస్తరించారు. కాగా, సింగరేణి ఏర్పాటు చేసిన 12 భూగర్భ గనుల్లో సుమారు 15, 16 వేల మంది కార్మికులు పనిచేసేవారు. దీంతో కార్మిక సంఘాల ఏర్పాటు, కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనూ ఈ ప్రాంతం కీలక పాత్ర వహించగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ల పేర్లతోనే కాలనీలు.. నాడు సింగరేణిలో ఏపనులనైనా కాంట్రాక్టర్ల ద్వారా చేయించేవారు. దీంతో వారి పేర్లపైనే కార్మికవాడలు వెలిశాయి. గోరఖ్పూర్ వారిని నియంత్రించేందుకు సీఆర్పీ వారు రవడంతో సీఆర్పీ క్యాంపు, బర్మాదేశస్తులు రావడంతో బర్మాక్యాంపు.. ఇలా గాజులరాజంబస్తీ, బాబూక్యాంపు, నాగయ్యగడ్డ, వనందాస్గడ్డ, పంజాబ్గడ్డ ఏర్పాటయ్యాయి. 2016లో జిల్లా కేంద్రంగా.. 1970లో పాల్వం తాలుకా నుంచి విడివడి.. కొత్త తాలూకాగా ఏర్పడింది. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక 2016లో భద్రాద్రి కొత్తగూడెంను జిల్లాగా మార్చారు. తొలుత, 1971లో నోటిఫైడ్గా మారిన కొత్తగూడెం సుమారు 24 ఏళ్ల తరువాత 1995లో మున్సిపాలిటీగా మారగా.. మరో 30 ఏళ్ల తరువాత కార్పొరేషన్గా అవతరించింది. నేడు కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. అయితే, ఒకనాడు ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో యువత వలస బాట పడుతున్నారు. కార్పొరేషన్ అయినప్పటికీ ఆశించినస్థాయిలో అభివృద్ధి లేకపోవడం కూడా వెలితిగా మారింది. నాడు అటవీ ప్రాంతం.. నేడు పరిశ్రమల కేంద్రం -
ప్రజలకు అండగా కమ్యూనిస్టులు
● ప్రజా సేవకులకు ఓట్లు వేయండి ● సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణఖమ్మంరూరల్: ప్రజల కష్ట సుఖాల్లో అండగా ఉండేది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో నారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజా సేవకులకు మాత్రమే ఓట్లు వేయాలని, నిత్యం ప్రజల్లో ఎవరు ఉంటున్నారు? బయటి నుంచి ఎవరు వచ్చి పోటీలో ఉన్నారు? అనే విషయాలను బేరీజు వేసుకుని ఓటు వేయాలని తెలిపారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసింది కమ్యూనిస్టులేనని, కరపత్రాలతో ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది కూడా కమ్యూనిస్టులేనని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి, పాలకులను నిలదీసి, పరిష్కరించిన ఘనత సీపీఐదేనని తెలిపారు. శాసనసభలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నాడని చెప్పారు. ప్రతీ ఎన్నికలకు పార్టీ మార్చేవారు ప్రజలకు ఏంసేవ చేస్తారని, కేవలం వారి స్వలాభం చూసుకుంటారని, అలాంటి వారిని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టాలని సూచించారు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులకు ఒకే చోట స్థానం ఉంటుందని, నిరంతరం ప్రజల మధ్య ఉండి వారిని ఆపదలో ఆదుకంటూ ప్రజల కోసం పనిచేసే వారిని మాత్రమే మున్సిపాలిటీలో పాలకవర్గంగా ఉంచాలని కోరారు. బయటి వారు ఎన్నికలు అయిపోగానే వాళ్లదారి వారు చూసుకుంటారని, ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు వారికి గుర్తుండవని స్పష్టం చేశారు. ఖమ్మంరూరల్ మండలంలో పలు కాలనీలను తొలగించాలని పాలకులు ప్రయత్నించినప్పుడు అడ్డుపడి ప్రజల పక్షాన నిలబడింది ఎర్రజెండా నాయకులేనని ఆయన వెల్లడించారు. సభలో సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్, మిడకంటి చినవెంకటరెడ్డి, దండి రంగారావు, చెరుకుపల్లి పవిత్ర, మిడకంటి అరుణశ్రీ, దండి వ్రీజ తదితరులు పాల్గొన్నారు. -
రైలుకింద పడి వ్యక్తి మృతి
బోనకల్: బోనకల్ రైల్వేస్టేషన్ సమీపంలో గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన ఇరుగు నాగేశ్వరరావు(60) ఆదివారం ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. నాగేశ్వరరావు భార్య కరోనా సమయంలో మృతి చెందగా, ఇద్దరు పిల్లలను ఆయనే అన్నీ తానై పోషిస్తున్నాడు. కాగా, ఆయన ఖమ్మం వెళ్లి బోనకల్ రాగా గ్రామానికి వెళ్లడానికి బ్రిడ్జి పైనుంచి కాకుండా ట్రాక్ దాటే ప్రయత్నంలో ఒకే సమయాన రెండు ట్రాక్లపై రైళ్లు వస్తుండడంతో గమనించక మృత్యువాత పడ్డాడు. వ్యక్తి అనుమానాస్పద మృతి ఖమ్మంఅర్బన్: బల్లేపల్లిలోని ఓ మద్యం దుకాణంలో ఆదివారం రాత్రి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం దుకాణం వెనుక ఉన్న ఓ గదిలో మృతదేహాన్ని గుర్తించిన కొందరు యజమానికి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, చిమ్మపూడి గ్రామానికి చెందిన కొల్లు శ్రీను (30)గా గుర్తించారు. అయితే, మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుటుంబ సభ్యులు వచ్చే లోపే మద్యం దుకాణం నిర్వాహకులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, ఈ మద్యం దుకాణంలో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని, ఒకరిపై ఒకరు దాడి చేయడం సర్వసాధారణంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు కూసుమంచి: మండలంలోని నాయకన్గూడెం గ్రామంలో శనివారం ఓ వ్యక్తిని బీరు బాటిల్తో కొట్టి తీవ్రంగా గాయపర్చిన ఘటనలో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. గ్రామానికి చెందిన అమ్మటి శివయ్య (శివ) తన బంధువు దశదిన కర్మకు హాజరై భోజనం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన అమ్మటి ఉదయ్ బీరు సీసాతో దాడి చేశాడు. గాయపడిన శివను ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధతుడి భార్య ఫిర్యాదు మేరకు ఉదయ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విస్తృతంగా తనిఖీలు
కల్లూరురూరల్: కల్లూరు పరిధిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మున్సిపాలిటీ సరిహద్దు గ్రామమైన హనుమాన్ తండా వద్ద హైవేపై చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ విడతల వారీగా విధులు నిర్వర్తిస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు 24 గంటల పాటు తనిఖీలు చేస్తున్నారు. 11న జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీలు ఖమ్మంస్పోర్ట్స్: ఈనెల 11వ తేదీన జిల్లాస్థాయి ఖేలో ఇండియా క్రీడాపోటీలు నిర్వహిస్తామని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. అండర్– 14, 17 విభాగాల నుంచి అథ్లెటిక్స్, కబడ్డీ, బాక్సింగ్ అంశాల్లో బాలికలకు సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారిని అస్మిత లీగ్కు ఎంపిక చేయడంతో పాటు జాతీయస్థాయి పోర్టల్లో పేర్లు నమోదు చేస్తామని తెలిపారు. తద్వారా స్పోర్ట్స్ అథారిటీ కేంద్రాల్లో శిక్షణ అందుతుందని పేర్కొన్నారు. స్కార్పియోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు సమీపంలో ఆర్టీసీ బస్సు స్కార్పియో వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పాలేరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు వాహనంలో ఖమ్మం వెళ్తుండగా జీళ్లచెరువు సమీపంలో సూర్యాపేట వైపు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. -
సత్తుపల్లి.. రూటే సెపరేటు!
● ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ● ప్రతీ ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పు సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతి నిథ్యం వహించిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, ఆపై ఖమ్మం ఎంపీగానూ ఎన్నికై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక జలగం ప్రసాదరావు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సేవలందించారు. అలాగే, గతంలో ఇక్కడ, ఆ తర్వాత పాలేరు, ప్రస్తుతం ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నియోజకవర్గంలోని కల్లూరు మండలానికి చెందిన పొంగులేటి శ్రీనివా సరెడ్డి తొలిసారి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గుండెకాయలా మున్సిపాలిటీ.. సత్తుపల్లి పట్టణ ఓటరు తీర్పు ప్రతీసారి విలక్షణంగా ఉంటుంది. అధికార పార్టీ హవా నడిచే సమయాల్లోనూ ఓటర్లు నిశ్శబ్ద తీర్పుతో ఆశావహులకు ముచ్చెమటలు పట్టించిన దాఖలాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రకంగా.. లోక్సభ ఎన్నికల్లో మరో రకంగా.. మున్సిపల్ ఎన్నికల్లో ఇంకో రకంగా తీర్పు ఇవ్వడం ఓటర్ల ప్రత్యేకత. అందుకే సత్తుపల్లి నియోజకవర్గానికే గుండెకాయ వంటి మున్సిపాలిటీ ఓటరు తీర్పుపై అన్ని పక్షాలు ఆసక్తిగా గమనిస్తుంటాయి. ఊహించని విధంగా తీర్పులు మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అధికారం చెలాయించే సమయాన 1992 ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కానీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచే తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడం విశేషం. తుమ్మల మంత్రిగా అధికారం శాసిస్తుండగా 2001 లో సత్తుపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన కొత్తూరు ప్రభాకర్రావును కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి కోటగిరి మురళీకృష్ణారావు ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. 2001లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తుపల్లిలోని ఆరు స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ఇక 2004 అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకటరావు చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చవిచూశారు. నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ సత్తుపల్లి నగర పంచాయతీగా ఉన్నప్పుడు 2014లో జరిగిన ఎన్నికల్లో 20 వార్డులకు గాను టీడీపీ 17చోట్ల గెలవగా, మరో మూడింటిని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కై వసం చేసుకున్నారు. ఆతర్వాత మున్సిపాలిటీగా ఏర్పడ్డాక తొలిసారి 2020లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 23 వార్డులకు గాను వంద శాతం బీఆర్ఎస్కు దక్కించుకోవడం విశేషం. అప్పుడు బీఆర్ఎస్లో ప్రస్తుత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు ఉన్నారు. ఈసారి వీరందరూ కాంగ్రెస్ ఉండగా, రాజకీయ సమీకరణల నేపథ్యాన ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. పాలకులు వీరే.. సత్తుపల్లి పంచాయతీ ఏర్పడ్డాక 1961లో తొలి సర్పంచ్గా మొరిశెట్టి రాజయ్య ఎన్నికై 1966 వరకు కొనసాగారు. ఇక గాదె నర్సయ్య 1966 నుంచి 70వరకు, అనుమోలు నర్సింహారావు 1970 నుంచి 83వరకు, కొత్తూరు ప్రభాకర్రావు 1983–88 వరకు సర్పంచ్గా ఉన్నారు. అలాగే, కోటగిరి మురళీకృష్ణారవు 1988 నుంచి 95వరకు, కొత్తూరు పార్వతి 1995 నుంచి 2001 వరకు, కోటగిరి మురళీకృష్ణారావు 2001 నుంచి 2005 వరకు సర్పంచ్గా కొనసాగారు. సత్తుపల్లి గ్రామ పంచాయతీ 2005లో నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయ్యాక చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. తొలి చైర్ పర్సన్గా పూచి యశోద 2010 వరకు, రెండో సారి బీసీ మహిళకు రిజర్వ్ అయితే దొడ్డాకుల స్వాతి 2014 నుంచి 2019 వరకు కొనసాగారు. 2020 లో మున్సిపాలిటీగా ఏర్పాటయ్యాక తొలి చైర్మన్గా కూసంపూడి మహేష్ ఎన్నికై 2025 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మున్సిపాలిటీకి రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. -
● రండీ.. వచ్చి వెళ్లండి !
● వలస ఓటర్లపై అభ్యర్థుల గురి ● దూరం నుంచి వస్తే చార్జీలు, ఖర్చుల పేరిట వలఅశ్వారావుపేట రూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్కు సమయం సమీపిస్తుండడంతో బరిలో ఉన్న ప్రధాన పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని స్వస్థలాలకు రప్పించేలా పాట్లు పడుతున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 78 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా, 16,850 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఒక్కో వార్డులో 657 – 848 మంది ఓటర్ల గాను కనీసం 30 – 60 మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పటికే వీరి జాబితా సిద్ధం చేయడంతో పాటు ఫోన్ నంబర్లు సేకరించి కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, ఏపీలోని ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో వివిధ పనులు, ఉన్నత విద్య, ఉపాధి కోసం పలువురు వెళ్లారు. వీరందరినీ పోలింగ్ జరిగే ఈనెల 11వ తేదీన రప్పించేలా పార్టీల నాయకులు, అభ్యర్థులు దృష్టి సారించారు. ఆర్టీసీ బస్సు చార్జీలతో పాటు ఇతర ఖర్చులన్నీ తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. సామూహికంగా వస్తే ప్రత్యేక వాహనం కూడా సమకూరుస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పలువురికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు కూడా పంపినట్లు సమాచారం. ఒకటి, రెండు ఓట్లే కీలకంగా మారనున్న నేపథ్యాన ఎవరినీ వదలకుండా పోలింగ్ స్టేషన్కు రప్పించేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. -
● ప్రచారంలో వాకీ టాకీ !
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వినూత్న రీతిలో ప్రచారం కొనసాగుతోంది. 56వ డివిజన్ నుంచి ఆర్ఎల్డీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈసంపల్లి మౌనిక లైసెన్డ్స్ వాకీటాకీని ఉపయోగిస్తూ.. అదే డివిజన్లోని ఇతర వీధుల్లో తన అనుచరులతో మాట్లాడుతూ.. ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటున్నారు. ● మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు !కొత్తగూడెంఅర్బన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అంటూ ఓ ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని రామవరానికి చెందిన సందీప్ తన ఇంటి గేటుకు ఈ మేరకు బోర్డులు ఏర్పాటు చేయగా, పలువురు ఆసక్తిగా చర్చించుకున్నారు. -
● బరిలో దంపతులు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున భార్యాభర్తలు బరిలో నిలిచారు. 49వ డివిజన్ నుంచి కనుకుంట్ల కుమార్, 10వ డివిజన్లో ఆయన సతీమణి కనుకుంట్ల వెంకటరమణ పోటీ చేస్తుండగా ఆదివారం ఆయా డివిజన్లలో ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు తామిద్దరమూ పోటీ చేస్తున్నామని, గతంలో పనిచేసిన అనుభవంతో డివిజన్లను అభివృద్ధిపథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వారికి పద్మశాలీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. -
మిగిలింది రెండు నెలలే..
● బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుకంజ ● లక్ష్యంలో ఇంకా 24 మిలియన్ టన్నులు బాకీ ● జనవరిలో 74శాతానికే ఉత్పత్తి పరిమితంరుద్రంపూర్: సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, గడిచిన పది నెలల్లో 58.47 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 48 మిలియన్ టన్నుల(84శాతం) ఉత్పత్తి మాత్రమే నమోదైంది. అంటే ఇంకా మిగిలిన రెండు మాసాల్లో 24 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనుకంజ వార్షిక లక్ష్య సాధనలో భాగంగా రోజుకు 2.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలి. కానీ ఇప్పుడు రోజుకు 1.50 లక్షల టన్నులు (55 శాతం) దాటడం లేదు. జవనరిలో సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లోని 18 ఓపెన్కాస్ట్ గనులు, 20 భూగర్భ గనుల్లో 70,01,100 టన్నుల లక్ష్యానికి 51,55,921 టన్నుల(74శాతం) మాత్రమే నమోదు కాగా, 26శాతం వెనుకంజలో ఉన్నట్లు సంస్థ వెల్లడించిన గణాంకాల ద్వారా వెల్లడైంది. సత్తుపల్లి ఏరియా టాప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది నెలలు గడిచిపోయాయి. ఈసమయంలో సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో ఒక్క సత్తుపల్లి ఏరియానే 39.45లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 40,39,200 (102శాతం) టన్నుల ఉత్పత్తి సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన ఏ ఏరియా కూడా 100శాతం ఉత్పత్తి సాధించలేక పోయాయి. జనవరి నెలలో పరిశీలిస్తే బెల్లంపల్లి ఏరియా మొదటి స్థానంలో, సత్తుపల్లి ఏరియా రెండో స్థానంలో నిలిచాయి. రోజు వారీ ఉత్పత్తిలో ఒక్క ఏరియా కూడా 100శాతం నమోదు చేయలేకపోవడం గమనార్హం. 52 మిలియన్ టన్నులతో సరి? సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో వెనకపడేలా ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఉత్పత్తిలో కోలిండియాకు దీటుగా నిలిచిన సింగరేణి ఈ ఏడాది 80శాతం దాటడం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఇటీవల సింగరేణిలో అధికారుల ప్రక్షాళన, ఓబీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, భూగర్భగనుల్లో మొండికేసిన యంత్రాలు.. వెరసి ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశముంది. మిగిలిన రెండు నెలల్లో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి నమోదైనా మొత్తంగా 52 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించే అవకాశముందన్న భావన వ్యక్తమవుతోంది. ఫలితంగా లక్ష్యసాధనలో 20 మిలియన్ టన్నుల మేర వెనకంజలో ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. సింగరేణిలోని భూగర్భగనుల్లో కొంత ఉత్పత్తి నష్టం ఉంది. ఈ నేపథ్యాన ఓపెన్ కాస్ట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం ఓబీ కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహించి గనుల వారీగా లోపాలను సవరించి లక్ష్యసాధనకు కృషి చేస్తాం. – ఎల్.వీ.సూర్యనారాయణ, డైరెక్టర్ (ఆపరేషన్స్) -
శ్రీ వైష్ణవ సేవా సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
ఖమ్మంగాంధీచౌక్ : శ్రీవైష్ణవ సేవా సంఘం జిల్లా కమిటీని ఆదివారం నగరంలోని పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ మూడేళ్ల పాటు కొనసాగనుంది. జిల్లా అధ్యక్షులుగా నల్లాన్చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, కార్యనిర్వహక అధ్యక్షులుగా తూపురాని మధుసూదనాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కొదమసింహం రవికిరణాచార్యులు, కోశాధికారిగా వేదాంతం ఫణి, కన్వీ నర్గా మరింగంటి భార్గవాచార్యులు, ఉపాధ్యక్షులు గా పల్లెర్లమూడి సౌందర్యరాజన్లను ఎన్నుకున్నామని, పూర్తి కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకుంటామ ని శ్రీనివాసాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు శేషబట్టర్ రఘునాథాచా ర్యులు, రాష్ట్ర జేఏసీ కమిటీ సభ్యులు నల్లాన్చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.


