Khammam District Latest News
-
లారీని ఢీకొట్టిన బస్సు.. తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం: టైర్ పంక్షర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో 10మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు సోమవారం సాయంత్రం ఖమ్మం వస్తోంది. పిండిప్రోలు సమీపాన కాశీపట్నం వద్ద టైర్ పంక్షర్ అయి ఆగిన లారీని తప్పించే క్రమంలో ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయాలైన 10 మంది ప్రయాణికులను 108లో ఖమ్మం తరలించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
ఫంక్షన్ హాళ్ల మధ్య దుర్గంధం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద ఫంక్షన్హాళ్ల సమీపంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక దుర్గంధం వెదజల్లుతోంది. ఫంక్షన్ హాళ్ల యజమానులు డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో మురుగునీరు హాళ్ల మధ్య గల ఖాళీ ప్రదేశంలోకి చేరుతోంది. దీంతో ఫంక్షన్లు చేసుకునే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శికి, ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ లేక అవస్థలు -
● హార్వెస్ట్కు ఉత్తమ ర్యాంకులు
హార్వెస్ట్ విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో బి.సాయిచరణ్ 83వ ర్యాంకు, బి.సంజయ్ 207, ఎం.నాగయశ్వంత్ 393, బి.సిద్దార్థ్ 395, డి.శ్రీనివాస గౌతమ్రెడ్డి 686, వి.చరణ్ గోపాల్స్వామి 1,092, బి.మోక్షజ్ఞ 1,159, పి.క్రిష్ సాత్విక్ 1,163, ఎ.గణేష్ 1,195, ఎన్.సీ.హెచ్.జస్వంత్ సాయి 1,268, ఎన్.రాఘవేంద్ర నవనీత్ 2,108, పి.ప్రేమ్వర్ధన్ 5,078, వి.సాయిదీపక్ 6,001 ర్యాంకు సాధించారని వెల్లడించారు. -
రాష్ట్ర ఆవిర్భావానికి బీజం వేసింది బీజేపీనే...
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజం వేసింది బీజేపీయేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన సాధ్యమని పేర్కొంటూ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను బీజేపీ ఎంపీలు వినిపించారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు గెంట్యాల విద్యాసాగర్, సన్నే ఉదయ్ ప్రతాప్, గోంగూర వెంకటేశ్వరరావు, మందడపు సుబ్బారావు, జ్వాలా నర్సింహారావు, అల్లిక అంజయ్య యాదవ్, రుద్ర ప్రదీప్, శ్యాంరాథోడ్, మందడపు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజలకు బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో... ఖమ్మంమయూరిసెంటర్: తెలంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు గుండాల కృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. ఆతర్వాత పెవిలియన్ మైదానం సమీపాన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. -
‘న్యూలిటిల్ ఫ్లవర్స్’ విద్యార్థులకు అభినందన
వైరా: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో వైరాలోని న్యూలిటిల్ ఫ్లవర్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన వి.కుశాల్ 165, ఎం.నాగ యశ్వంత్ 393, రాహుల్దేవ్ 4,068 ర్యాంకులు సాధించగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సోమవారం అభినందించారు. కళాశాల కరస్పాడెంట్ డాక్టర్ పి.భూమేష్, డైరెక్టర్ సుమన్, ప్రిన్సిపాల్ భువనప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రతిభ మధిర: జేఈఈ అడ్వా న్స్డ్ ఫలితాల్లో మధిరకు చెందిన పాగి శశాంక్ జాతీయస్థాయిలో 3,354 ర్యాంక్ సాధించాడు. 1 – 10వ తరగతి వరకు మధిర శ్రీ చైతన్య పాఠశాలలో చదివిన ఆయన ఇంటర్లో వెయ్యికి 986 మార్కులతో ప్రతిభ చాటారు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్లో మెరుగైన ర్యాంకు సాధించిన శశాంక్ను పలువురు అభినందించారు. రహదారి మరమ్మతు చేయించాలని ఆందోళన కామేపల్లి: మండలంలోని ముచ్చర్ల నుంచి ఏన్కూర్ వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైనా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన సోమవారం రాస్తారోకో చేశారు. నిమ్మవాగు సమీపాన చేపట్టిన ఆందోళనలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్ మాట్లాడుతూ.. కొత్త రహదారి నిర్మాణం మాటేమో కానీ కనీసం మరమ్మతు చేయించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అనంతరం డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన సైకిల్యాత్ర చేపట్టారు. నాయకులు భూక్యా వీరభద్రం, ప్రభాకర్, రమేశ్, కృష్ణ, శ్రీనివాసరెడ్డి, బాదావత్ శ్రీనివాస్, నవీన్, గిరిధర్, నర్సిరెడ్డి పాల్గొన్నారు. కరాటే పోటీల్లో ప్రతిభ ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఖమ్మం మహబూబ్ కరాటే స్కూల్కు చెందిన పది మంది విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించిన ఎన్.నియాన్ష్, పి.కుశల్, ఉద్యాంష్దత్తా, పి.అక్షిత, సయ్యద్ అమీర్పాషా, ఆర్.శశి, ఎన్.శ్రీసాహిత్య, రూప, కె.గణేశ్, సయ్యద్ అదిల్పాషా పతకాలు గెలుచుకున్నారు. వీరిని కరాటే స్కూల్ మాస్టర్ ఎండీ మహబూబ్ తదితరులు అభినందించారు. ఇక మరింత వేగం ! ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ, తరలింపునకు ఇప్పటివరకు పలు వాహనాలు ఉన్నాయి. అయితే, పారిశుద్ధ నిర్వహణ మరింత మెరుగుపడేలా కొత్తగా 19 ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు వంద రోజుల ప్రణాళిక అమలు మొదలుపెట్టిన సోమవారం ఈ ట్రాక్టర్లను మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. అనంతరం ఓ ట్రాక్టర్ను కమిషనర్ అభిషేక్ ఇలా స్టార్ట్ చేసి కార్పొరేటర్లు, ఉద్యోగులతో కలిసి విజయ సంకేతం చూపించారు. జయరాజుకు గుర్తింపుపై హర్షంకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ప్రజా పోరాటానికి స్ఫూర్తిని అందించిన కవి, గాయకుడు, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు జయరాజును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించి, రూ. కోటి నగదు అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. జయరాజు సింగరేణి కార్మిక ఉద్యమ నిర్మాతగా ఉమ్మడి జిల్లా వాసులకు సుపరిచితులని కొనియాడారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య, ఆశ్రమం కో ఆర్డినేటర్ సుగుణారావు ఉన్నారు. -
విందుల్లో విష సంస్కృతి
● విచ్చలవిడిగా ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం ● పుట్టగొడుగుల్లా పరిశ్రమల ఏర్పాటు, విక్రయం ● ఆహారపదార్థాల కలుషితం.. పరిశ్రమల పరిసరాల్లో ఇక్కట్లుఅధికారులు స్పందించాలి ప్లాస్టిక్ వినియోగం ఏదో ఒక రూపంలో ప్రజలను వెంటాడుతేనే పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం రావడం లేదు. అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై మరింత చిత్తశుద్ధి పనిచేయాలి. – మహేష్రెడ్డి, భద్రాచలంప్లాస్టిక్ నిర్మూలనపై దృష్టి భద్రాచలంలో ప్లాస్టిక్ నిషేధం అమలుకు కృషి చేస్తున్నాం. తొలుత షాపుల్లో కవర్ల వినియోగాన్ని నిర్మూలించే కార్యక్రమం చేపట్టాం. త్వరలో ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పుల తయారీ పరిశ్రమలపైనా దృష్టి సారిస్తాం. వాటర్ ప్లాంట్ల వద్ద కూడా పరిశీలిస్తాం. – శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ ఈఓ, భద్రాచలంభద్రాచలంఅర్బన్: పట్టణాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న ఏ విందు అయినా భోజనం వడ్డించడం ఆనవాయితీ. గతంలో అరటి ఆకులు, అడ్డాకులు(విస్తర్లు) వినియోగించగా.. ఇప్పుడు ప్లాస్టిక్ బఫే పేట్లు తెరపైకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం భద్రాచలంలోనే వీటి తయారీకి 6 – 7 కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్లేట్లలో భోజనాలు చేసే వ్యక్తులు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఆయా కార్యక్రమాల వద్ద తాగునీరు సమకూర్చేందుకు వినియోగిస్తున్న వాటర్ ప్యాకెట్లు కూడా అంతే ప్రమాదంగా మారుతున్నాయి. అంతా కలుషితమే... ఇప్పుడు ప్రతీ గల్లీలో పేపర్ ప్లేట్ల పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే, వీటి తయారీకి ఉపయోగించే ముడిసరుకు ప్రమాదకరమని.. తయారీ అనంతరం మిగిలిన వ్యర్థాలను పొలాలు, చెరువుల పక్కన వేయడంతో ఆ ప్రాంతాలు కలుషితమవుతున్నాయని చెబుతున్నారు. అంతేకాక ఉపయోగం అనంతరం రహదారుల వెంట వేస్తుండడంతో అందులోని ఆహార పదార్థాలనే కాక ప్లేట్లను తింటున్న పశువులు సైతం రోగాల బారిన పడుతున్నాయి. ప్రమాదకర రసాయనాలు.. పేపర్ ప్లేట్లు, కప్పుల్లో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని చెబుతున్నారు. హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరను వినియోగిస్తుండగా.. మోట్రో సోమిన్,బిస్పినాల్, బార్డ్ ఇథనాల్ డాక్సిన్ వంటి కెమికల్స్ ఈ ప్లేట్లు, కప్పుల్లో ఉంటాయని తెలుస్తోంది. ఇందులో వేడి వేడి ఆహార పదార్థాలు వేశాక కరిగి ఆహార పదార్థాల ద్వారా మానవ శరీరంలోకి చేరుతాయని.. తద్వారా చర్మసంబంధిత వ్యాధులే ఇతర ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశముందని చెబుతున్నారు. -
కార్యకర్తల కోసం ప్రాణమైనా ఇస్తా..
నేలకొండపల్లి/కూసుమంచి: బీఆర్ఎస్ కార్యకర్తలను తన ప్రాణం అడ్డు వేసైనా కాపాడుకుంటానని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో సోమవారం జరిగిన సమావేవంలో ఆయన పార్టీ కార్యకర్తలను ఎవరు వేధించినా సహించేది లేదని చెప్పారు. ఎదుటి వారు ఒక దెబ్బ కొడితే... తాము రెండు దెబ్బలు కొడతామని తెలిపారు. తన వద్ద డబ్బు లేకపోయినా చేతనైన మేర సాయం చేస్తానని, కనీసం రెండు శాతం మంది ప్రజలైనా తాను మంచి చేయలేదని చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్ల డించారు. కాగా, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా విజయం బీఆర్ఎస్నే వరిస్తుందని కందాళ ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్ మాజీ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్యతో పాటు నాగుబండి శ్రీనివాసరావు, కోటి సైదారెడ్డి, షేక్ హుస్సేన్, కమదన ప్రవీణ్, యాతాకుల భాస్కర్, గోలుసు రవి, మాదాసు ఆదాం, దాసరి ఉదయ్, దేవరశెట్టి మురళి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచి మండలం గంగబండ తండాలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కందాళ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి -
సమగ్రాభివృద్ధే లక్ష్యం
మధిర: మధిర నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర మండలం మాటూరులో రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ సబ్ ఏర్పాటుతో మాటూరు, మాటూరుపేట, నాగవరప్పాడు, సిద్ధినేనిగూడెం, అంబారుపేట గ్రామాలకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఇదే కాక అవసరమైన చోట సబ్స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈలు బండి శ్రీనివాసరావు, కె.హీరాలాల్, ఏడీఈలు ఏ.కిరణ్ చక్రవర్తి, శ్రీనివాస్, ఎం.అనురాధ, ఈఈ జి.వెంకటేశ్వర్లు, ఏడీఈ మధిర రూరల్ ఏఈ ఎస్.మైథిలి పాల్గొన్నారు. ఈ చెత్తాచెదారం ఏమిటి? ఐబీ డీఈ నాగబ్రహ్మయ్యపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా జాలిముడి ప్రాజెక్టును తనిఖీ చేశారు. అక్కడ మద్యం సీసాలు, చెత్తాచెదారం ఉండడాన్ని గమనించిన ఆయన నిర్వహణ కోసం నిధులు మంజూరు చేసినా నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. రూ.25కోట్లతో రహదారి, సెంట్రల్ లైటింగ్ చింతకాని: చింతకానిలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు. రూ.25 కోట్ల నిధులతో చింతకాని నుంచి కొణిజర్ల వరకు డబుల్ లేన్ బీటీ రహదారి నిర్మాణంతో పాటు చింతకానిలో ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ నిర్మానం పనులకు శంకుస్థాపన చేయగా.. కాంగ్రెస్ నాయకులు, స్థానికులకు ఆయనకు స్వాగతం పలికారు. కాగా, చింతకానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని స్థానికులు చెప్పగా ఆర్టీసీ ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీచేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ డీఈ రాంప్రసాద్, తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అంబటి వెంకటేశ్వర్లు, నాయకులు మడుపల్లి భాస్కర్, కూరపాటి కిషోర్, కన్నెబోయిన గోపి, బందెల నాగార్జున్, కొప్పుల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
బెల్ట్షాపులు తొలగించాలని నిరసన
సత్తుపల్లిరూరల్: మద్యంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నందున బెల్ట్షాప్లు తొలగించాలనే డిమాండ్తో వేంసూరు మండలం శంభునిగూడెంకు చెందిన మహిళలు పలువురు సోమవారం నిరసన తెలిపారు. ఈమేరకు సత్తుపల్లి ఎకై ్సజ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడారు. ఎకై ్సజ్ అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్షాపులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎస్సై శేఖర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పద్మ, రాధ, మారేశ్వరమ్మ, చెన్నమ్మ, తిరుపతమ్మ, సావిత్రి, రమణ, కొలికపోగు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీసీఎంఎస్ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్, సంస్థ పర్సన్ ఇన్చార్జి పి.శ్రీనివాసరెడ్డి ప్రశంసా పత్రాలు అందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఖమ్మంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఆఫీస్ సబార్డినేట్ వెలిశాల వెంకటి, కల్లూరు సూపర్వైజర్ పెరుగు నాగరాజు, నేలకొండపల్లి ఉద్యోగి బొడ్డు సంతోష్కు ప్రశంసాపత్రాలు అందించారు. సంస్థ మేనేజర్ కె.సందీప్, ఉద్యోగులు పి.వినోద్, గోపి, శివప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. వర్షానికి కూలిన ఇంటి పైకప్పు కారేపల్లి: ఇటీవల కురిసిన వర్షాలతో పూర్తిగా నానిన పెంకుటింటి కప్పు కుప్పకూలింది. మండలంలోని గేటుకారేపల్లికి చెందిన భూక్యా శాంతి బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె సోమవారం పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లగా, ఇప్పటికే వరుస వర్షాలతో నానిన ఇంటి కప్పు, గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ సమయంలో శాంతి లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, అధికారులు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరింది. చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి కారేపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోతు మంగ్లీ(70) భర్త ఏడాది క్రితం మృతి చెందగా, అప్పుడప్పుడూ మద్యం తాగుతుండేది. ఈ క్రమంలోనే గత నెల 29న మద్యం తాగాక మంగ్లీ పురుగుల మందు తాగింది. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందిందని ఎస్ఐ బి.గోపి తెలిపారు. స్పృహ తప్పిన ఏఆర్ కానిస్టేబుల్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ హుస్సేన్ పాషా స్పృహ తప్పి కిందపడ్డాడు. దీంతో సహచర సిబ్బంది 108 వాహనంలోకి ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ఆయన స్పృహ కోల్పోగా, చికిత్స అనంతరం కోలుకున్నాడని అధికారులు తెలిపారు. రుణ బాకీ పేరిట వితంతువుల పింఛన్ నిలిపివేత మధిర: వితంతు, ఒంటరి మహిళ పింఛన్లు అందుకుంటున్న మహిళలు సభ్యులుగా ఉన్న మహిళా సంఘం పేర బకాయి ఉందంటూ పది నెలలుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ పింఛన్లు నిలిపివేయడంపై ఆవేదన చెందుతున్నారు. మధిర మండలం దెందుకూరుకు చెందిన కొత్తపల్లి సుధ, పగిడిపల్లి కాంతమ్మ వితంతువుల పింఛన్, గద్దల పున్నమ్మ ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్నారు. అయితే, పది నెలలుగా దెందుకూరులోని తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్ పింఛన్ ఆపేయడంతో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాము సభ్యులుగా ఉన్న డ్వాక్రా గ్రూపులో కొందరు రుణబకాయి చెల్లించకపోవడమే ఇందుకు కారణమంటూ మేనేజర్ చెప్పారని తెలిపారు. ఈవిషయమై బ్యాంక్ మేనేజర్ వెంకన్నను వివరణ కోరగా అంజలి డ్వాక్రా గ్రూపు తరఫున రుణం తీసుకోగా కొందరు సభ్యులు తిరిగి చెల్లించడం లేదన్నారు. గ్రూపు నిబంధనల ప్రకారం సభ్యులెవరు చెల్లించకున్నా అందరూ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే వారి అకౌంట్ హోల్డ్లో పెట్టామని వెల్లడించారు. -
● రెజొనెన్స్ జయభేరి
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లతో జయభేరి మోగించారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్వీ. నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. టి.స్నేహ మృదుల 89వ ర్యాంక్, బి.రాకేష్ 230, బి.అభినాయక్ 342, జె.మదన్ 371, జి.సురేష్ 557, బి.హర్షవర్థన్ 906, బి.శ్యామ్ 1,860, ఆర్.గురుప్రసాద్ 2,097, గోపిచంద్ 2,275, జి.దివ్యతేజ 2,847వ ర్యాంక్ సాధించగా, మరికొందరు సైతం ఉత్తమ ర్యాంక్లు సాధించారన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్, భాస్కర్రెడ్డి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా..
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులతో ప్రతిభ చాటారు. ఈమేరకు ఆయా విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు అభినందించి వివరాలు వెల్లడించారు. – ఖమ్మం సహకారనగర్ ● న్యూవిజన్ ప్రభంజనం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో పేరాల ప్రణవ్ 497వ ర్యాంక్, మరో కేటగిరీల్లో అజ్మీరా రోషిక్ మణిదీప్ 5వ ర్యాంక్ సాధించారని తెలిపారు. ఇక భూక్యా పీయుష్ వర్థన్ 102, అజ్మీరా జిగీష 204, ఆంగోతు శ్యామ్ 205, భూక్యా యశ్వంత్ 394, పేరాల ప్రణవ్ 497, గూడె కార్తీక్సాయి 537, చంద్రసాయికృష్ణ 556, గుగులోతు షణ్ముఖ 562, తేజావత్ స్రవంతి 605, బానోతు వివేక్రామ్ 618, భూక్యా ప్రతీక్ 678, స్వర్ణ మనస్విక్ 770, గంగావత్ చరణ్తేజ్ నాయక్ 888, రామ కౌశిక్ 953, పగిడిపల్లి చేతన్చంద్ర 977, కంసాని మధుర హాసిని చౌదరి 1,026, భుక్యా శివనాగచైతన్య 1,093, బానోతు కౌశిక్ 1,377, ధర్మసోత్ రాహుల్ నాయక్ 1,427, వడ్లముడి ఆశిష్ 1,433, ఆళ్ల హేమంత్ 1,683, పండేటి యశస్విన్ 1,797, వాంకుడోతు బిందుబాయ్ 1,800, బానోతు దీపిక 1941, బానోతు మోహన్ సాయిలక్ష్మి 1,962వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సీహెచ్.గోపీచంద్, సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. ● శ్రీచైతన్య.. ఆల్టైం రికార్డు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంక్లతో ఆల్టైం రికార్డు సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఆలిండియా స్థాయిలో హెచ్.జశ్వంత్ 9వ ర్యాంక్, ఎస్వీ.వీరబ్రహ్మం 92, బి.లిగ్నేష్ 144, వి.కుషాల్ 165, బి.విక్టోరియా 199, బి.జయంత్ 221, ఐ.అను 258, ఎం.జ్ఞాతిక్ లక్కి 270, డి.అంకిత 272, జి.కార్తీక్ 330, డి.రూపేష్ 370, ఎన్.జస్మిత 375, బి.వరుణ్ సాయి 383, హెచ్.జీవన్ 456, బి.మృదున 478, జి.ఉదయ్ కృష్ణ 502, జి.అమృత హాసిని 527, బి.సిద్ధు 538, బి.సిద్ధార్థ 560, బి.వంశీ 598, జె.లహరి 602, జి.రాహుల్ 664, బి.మహేష్ 673, టి.రోహిత్ 677, బి.పండు చరణ్ 761, ఎల్.మనోజ్కుమార్ 768, ఎం.లోకేష్ 847, బి.సుజిత్ 850, జె.మాయావతి 870, హెచ్ఎస్ చరణ్తేజ 882, వి.ప్రణతి 897, ఈ.శ్రీకర్ 921, బి.మురళి 928, టి.జశ్వంత్కుమార్ 947, బి.లావణ్య 1,007వ ర్యాంక్ సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం చేతన్మాదూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ.వర్మ, డీన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాశ్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విలువలు కలిగిన నేత పోటు ప్రసాద్
ఖమ్మంఅర్బన్: సమకాలీన రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చే నేతగా పోటు ప్రసాద్ నిలిచిపోతారని, ఆయన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేశారని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కొనియాడారు. ఇటీవల మృతి చెందిన సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్ స్మారక స్థూపాన్ని ఖమ్మం ఇందిరానగర్ వద్ద ఖానాపురం హవేలీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేయగా సోమవారం పువ్వాడ ఆవిష్కరించి మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ, సీపీఐలో కీలకపాత్ర పోసించిన ప్రసాద్ అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, దండి సురేష్, జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్.కే.జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, పోటు కలావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, తోట రామాంజనేయులు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, వరదా నర్సింహారావు, పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు పాల్గొన్నారు.స్తూపాన్ని ఆవిష్కరించిన సీపీఐ నేత పువ్వాడ -
‘సహకారం’ సరికొత్తగా..
● పీఏసీఎస్ల్లో ఎఫ్పీఓ సంఘాలు ● భద్రాద్రి జిల్లాలో 11 పీఏసీఎస్ల ఎంపిక ● రైతుల ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంబూర్గంపాడు: రైతుల ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరిచేందుకు, పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్పీఓ (ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్) సంఘాలను ఏర్పాటు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 10 వేల ఎఫ్పీఓలు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో 2020లో కేంద్రం దీనికి శ్రీకారం చుట్టింది. కంపెనీల చట్టం, సహకార చట్టం కింద నమోదైన సంఘాల్లోని సభ్యులతో ఎఫ్పీఓలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలోని 21 పీఏసీఎస్లకు గాను తొలివిడతగా 11 సొసైటీల్లో ఎఫ్పీఓ సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. జిల్లాలోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, దుమ్ముగూడెం, చర్ల, గానుగపాడు, గుంపెన, కొత్తగూడెం, జూలూరుపాడు పీఏసీఎస్లకు ఇందులో స్థానం దక్కింది. సభ్యులుగా 750 మంది రైతులు.. ఎఫ్పీఓ సంఘంలో 750 మంది రైతులు సభ్యులుగా ఉంటారు. ఒక్కొక్కరు రూ. 2000 చొప్పున వాటాధనం చెల్లించి సభ్యులుగా చేరాలి. రైతుల ఈక్విటీగా మొత్తం రూ.15 లక్షలు జమచేస్తే, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా రూ.15 లక్షలు అందిస్తుంది. ఎఫ్పీఓలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను, పాలకమండలిని కూడా ఎన్నుకోవాలి. ఎఫ్పీఓలలో సగం మంది సన్న, చిన్నకారు రైతులతో పాటు మహిళా రైతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. ఎఫ్పీఓల నుంచి 18 నెలల వ్యాపార ప్రణాళిక, బడ్జెట్తో వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేపట్టాలి. రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, యంత్ర పరికరాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడం, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం వంటి వ్యాపారాలను ఎఫ్పీఓలు చేపట్టాల్సి ఉంటుంది. విత్తనోత్పత్తి, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం వంటి అధిక ఆదాయం వచ్చే ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. ఆదాయం పెంపే లక్ష్యంగా.. ఎఫ్పీఓలతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యాపారాలను విస్తృతపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, సాగుకు అవసరమైన యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్ల విక్రయాలు చేపట్టాలని భావిస్తోంది. ఉద్యానవన పంటల మార్కెటింగ్, పశుపోషణ, జీవాల పెంపకాలకు అవరమైన వసతులు కల్పించడం వంటి పనులు నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా ఎఫ్పీఓలు పనిచేయాల్సి ఉంది. ఎఫ్పీఓల ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించేందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని కూడా ఏర్పాటు చేయనున్నారు.విత్తనాలు, ఎరువుల విక్రయం.. ఇప్పటికే పీఏసీఎస్లు రైతులకు వ్యవసాయ రుణాలు అందించడంతో పాటు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతను కూడా పీఏసీఎస్లకే అప్పగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కుదేలయ్యాయి. రైతులు తీసుకున్న అప్పులు చెల్లించక ఆర్థికంగా దెబ్బతిన్నాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల వ్యవసాయ రుణాలు, బంగారం తాకట్టు రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయడంతో సహకార రంగం ఊపిరి పీల్చుకుంది. ఆయన హయాంలోనే పీఏసీఎస్లను బలోపేతం చేసేందుకు ఎరువులు, విత్తనాల విక్రయాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పీఏసీఎస్లు బలోపేతం కాసాగాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్పీఓ సంఘాలు ఏర్పాటు చేస్తుండడంతో మరింత ఆర్థిక పరిపుష్టి సంతరించుకోనున్నాయి. -
ఆకట్టుకున్న శకటాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సంబంధించి రూపొందించిన శకటాలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో రవాణాశాఖ (మహాలక్ష్మి) బస్సు శకటం, పౌర సరఫరాల శాఖ ద్వారా ఉచిత బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లు, గృహ నిర్మాణ శాఖ శకటం ఇందిరమ్మ ఇంటి నమూనాతో రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. వీటితో పాటు సంక్షేమ శాఖలు, రవాణా శాఖ, పర్యాటక శాఖల శకటాలు సైతం ఆకట్టుకున్నాయి. అంతేకాక వైద్య ఆరోగ్యశాఖ, డీఆర్డీఏ, విద్యుత్ తదితర శాఖల ద్వారా అమలవుతున్న పథకాలతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. కాగా, వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అలరించాయి. – ఖమ్మం సహకారనగర్ -
నీటి సంప్లో పడి చిన్నారి మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని రేగులచలకలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని నీటి సంప్లో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రేగులచలకకు చెందిన ఆటో డ్రైవర్ సత్తి నరేష్–వినోద్ కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీరాజ్యవి (5) ఇంటి ముందు అడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడి నీటి సంప్లో పడింది. తల్లి ఇంటి పనుల్లో ఉండగా ఈ విషయాన్ని గుర్తించలేదు. కాసేపటి తర్వాత చిన్నారి ఎటు వెళ్లిందోనని ఆరా తీస్తుండగా సంప్లో కనిపించడంతో బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అంతసేపు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపారు. ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నిరుపేదనైన తన పేరు లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. మండలంలోని మంగాపురంతండాకు చెందిన ధరావత్ కేశ్యా పేరు జాబితాలో పేరు సోమవారం ఆయన పంచాయతీ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. గ్రామస్తులు అడ్డుకోవటంతో వెనక్కి తగ్గినప్పటికీ ఆ కాసేపటికి ఒంటిపై పోసుకోగా స్థానికులు అడ్డుకుని ఇంటికి తీసుకెళ్లారు. మోకాళ్ల పై కూర్చుని నిరసన కారేపల్లి: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదంటూ కారేపల్లి మండలం పేరుపల్లిలో పలువురు అంబేడ్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. రేకుల ఇళ్లలోఉంటున్న తాము కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నా ఇళ్లు మంజూరు ఏయలేదని వాపోయారు. కొందరి స్వార్ధంతో ఈ పరిస్థితి ఎదురైనందున అధికారులు స్పందించాలని కోరారు. ఈకార్యక్రమంలో స్థానికులు పప్పుల నిర్మల, పప్పుల వెంకటేశ్వర్లు, అజ్మీరా సరిత, శంకర్, ధరా బక్కయ్య, అజ్మీరా నగేష్, ధారా రాంబాబు, పాయం బిక్షపతి, రవి, గుగులోతు సుభద్ర, కోటం నాగమణి, అజ్మీరా లక్ష్మి, విక్రమ్, గడ్డి రేణుక తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ల లక్ష్యం ఖరారు
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ద్వారా వసూలు చేయాల్సిన పన్నులకు సంబంధించి లక్ష్యాన్ని ఖరారు చేశారు. గత ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి మించి ఆదాయం నమోదైంది. దీంతో 2025–26 సంవతసరానికి గాను జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ల ద్వారా రూ.69.37 కోట్ల వసూలుకు మార్కెటింగ్ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. గత ఏడాది లక్ష్యానికి మించి ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్ధులపల్లిలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.63.15 కోట్ల లక్ష్యాన్ని విధించగా రూ.65.56 కోట్ల ఆదాయం నమోదైంది. దీంతో ఈసారి రూ.69.37 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. తద్వారా దాదాపు రూ.6 కోట్లు పెంచినట్లయింది. అయినప్పటికీ లక్ష్య సాధన కోసం మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నారు. మార్కెట్లలో వ్యాపారులు చేసే కొనుగోళ్లలో కొంత శాతం పన్ను రూపంలో వసూలు కానుంది. అలాగే, వివిధ ప్రాంతాల్లోని చెక్పోస్టుల ద్వారా సెస్ వసూలు చేయనున్నారు. ఈ ఏడాది రూ.69.37 కోట్ల వసూళ్లకు ప్రణాళిక గతేడాది కంటే రూ.6 కోట్ల పెంపుమార్కెట్ల వారీగా గత ఏడాది, ఈ ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం (రూ.కోట్లలో) మార్కెట్ గత ఏడాది ఈ ఏడాది ఖమ్మం 30 35 మధిర 4.75 4.99 నేలకొండపల్లి 3.78 4 కల్లూరు 5.67 5.44 వైరా 6.73 6.29 ఏన్కూరు 4.87 4.95 సత్తుపల్లి 4.94 5.12 మద్దులపల్లి 3.15 3.21 -
సిద్ధమైన నమూనా గృహం
రఘునాథపాలెం: రఘునాథపాలెం తహసీల్ ఆవరణలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణం పూర్తయింది. మండలంలో మల్లేపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 19మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అయితే, వడపోత తర్వాత 13 మందినే ఎంపిక చేయగా ముగ్గురు ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. మిగతా 10మంది ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే, దశల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయనుండడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలతో నిర్మించుకునేలా అవగాహన కోసం తహసీల్ ఆవరణలో నమూనా గృహాన్ని నిర్మించారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా విధులు ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) డాక్టర్ పి.శ్రీజ సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సోమవారం ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీజ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు, ఉద్యోగుల ఉద్యమంతో తెలంగాణ సిద్దించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ ఎన్.అరుణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఖమ్మంరూరల్: అక్రమంగా పశువుల రవాణాను అడ్డుకునేలా విస్తృత తనిఖీలు చేపట్టాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు సూచించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రూరల్ మండలం వెంకటగిరి క్రాస్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టును డీసీపీ సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయడమే కాక పశువులను తరలిస్తున్నట్లే తేలితే అనుమతి పత్రాలు పరిశీలించాలన్నారు. సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేయాలని ఆదేశించారు. కాగా, నిబంధనలకు విరుధ్ధంగా పశువుల రవాణా జరుగుతున్న తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలే తప్ప ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాకతీయుల కాలం నాటి శిలాశాసనం నేలకొండపల్లి: మండలంలోని అనాసాగారంలో కాకతీయుల నాటి శిలాశాసనాన్ని గుర్తించారు. గ్రామ పాత బొడ్రాయి సెంటర్లో రావిచెట్టు వద్ద ఈ శాసనం వెలుగుచూసింది. నాలుగు అడుగుల పొడవు, అడుగు మందంతో ఉన్న నల్లరాతి బండపై ఓ వైపున 19 పంక్తులతో తెలుగు లిపిలో రాసి ఉన్న శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్ కట్టా శ్రీనివాస్ నేతృత్వాన సోమవారం గుర్తించారు. శాసనంపై శివలింగం, దానికి రెండువైపులా సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయి. మహామండలీశుడు కాటేయ(రుద్రసేనాని కొడుకు) రాజ్యం ఏలుతున్నప్పుడు గోవిందమాంబ, దేవశెట్టి కొమ్మోజు తవ్వించిన రుద్రసముద్రానికి ఎకరంన్నర భూదానం చేసినట్లు ఈ శాసనం తెలుపుతోందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బృందం కన్వీనర్ హరగోపాల్, గ్రామ పెద్దలు వున్నం వెంకయ్య, పసుమర్తి శ్రీనివాస్, తిరుమల్, షేక్ రహీముతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
మా బతుకులు రోడ్డున పడ్డాయి..
● ఆర్సీహెచ్పీకి బొగ్గు లోడింగ్ నిలిపివేయాల్సిందే.. ● ఆందోళనకు దిగిన లారీల యజమానులు ● నాణ్యమైన బొగ్గు ఇవ్వడం లేదని ఆవేదన సత్తుపల్లి: నాణ్యమైన బొగ్గు ఇవ్వకపోవడంతో... కొనుగోలుదారులు మహారాష్ట్ర, ఒడిశా గనులకు వెళ్తున్నారని తద్వారా తమకు లోడింగ్ లేక జీవనాధారం కోల్పోతున్నామని సత్తుపల్లికి చెందిన లారీల యయజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సత్తుపల్లి మండలంలోని ఓసీల్లో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతున్నా రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ) ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ తమ బతుకులను రోడ్డున వేశారని మండిపడ్డారు. ఈమేరకు కిష్టారం ఓసీ వద్ద సోమవారం ఆందోళనకు దిగడమే కాక ఆర్సీహెచ్పీ కి వెళ్లే టిప్పర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి భూమిలో బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా, ఆంధ్రా కాంట్రాక్టర్లకు లబ్ధి జరిగేలా యాజమాన్యం, అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సమస్య ఏమిటంటే... ఓసీల ఏర్పాటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులు, స్థానికులు జీవనాధారం కోసం లారీలు కొనుగోలు చేశారు. వీరికి రోజు 6వేల టన్నుల బొగ్గు లోడింగ్ ఇస్తామని పలుమార్లు అధికారులు తెలిపారు. అయితే, ఆచరణలో మాత్రం రోజుకు కేవలం 2వేల నుంచి 2,500 టన్నులు మాత్రమే ఇస్తుండడంతో 30 లారీలకే లోడింగ్ వస్తోంది. సత్తుపల్లిలో మొదటగా 650 లారీలు ఉండగా.. సరైన లోడింగ్ అందక సకాలంలో ఫైనాన్స్ కిస్తీలు చెలిం్లచక ఒక్కొక్కరు అమ్ముకుంటూ రావడంతో ఆ సంఖ్య ప్రస్తుతం 450కి పడిపోయింది. నాణ్యమైన బొగ్గు ఇవ్వకపోవడంతోనే.. సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల్లో జీ–8, 9, 11, 13, 15, 16 రకం బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇందులో జీ–8, 13 నాణ్యమైనది కావడంతో మంచి డిమాండ్ ఉంది. కానీ నాణ్యమైన బొగ్గును కావాల్సిన కంపెనీలకు కాక రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ) ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈక్రమాన సింగరేణి క్వాలిటీ మేనేజర్ తీరుతో వివిధ కంపెనీల బాధ్యులు ఆర్డర్లు రద్దు చేసుకుని మహారాష్ట్ర, ఒడిశా గనులకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ ప్రాజెక్టు నుంచి 5వేల టన్నులు ఆర్డర్ చేస్తే.. బొగ్గు లోడింగ్ ఇవ్వలేదని సమాచారం. తాత్కాలిక అనుమతితో రవాణా రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ)కు రోడ్డు మార్గాన టిప్పర్ల బొగ్గు రవాణా చేసేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా ఓసీ ల్లో బొగ్గు ఉత్పత్తి అధికంగా ఉందని, నిల్వ చేస్తే మంటలు వస్తున్నాయని సాకు చూపి తాత్కాలిక అనుమతితో రవాణా చేస్తున్నారు. ఏడాది దాటినా ఆర్సీహెచ్పీకి నిరంతరాయంగా బొగ్గు రవాణా చేస్తుండడంతో స్థానిక లారీ లకు లోడింగ్ అందడంలేదు. ఇకపై ఆర్సీహెచ్పీకి లోడింగ్ అడ్డుకుంటామని లారీల యజమానులు చెబుతున్నారు.జూలై నుంచి ఇస్తాం.. బొగ్గు కాంట్రాక్టు ఆర్డర్లు లేకపోవడంతోనే లోడింగ్ ఇవ్వలేకపోతున్నామని.. వచ్చే జూలై నుంచి లోడింగ్ పెంచుతామని కిష్టారం, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ పీఓలు నర్సింహారావు, ప్రహ్లాద్ లారీల యజమానులకు హామీ ఇచ్చారు. యజమానుల ఆందోళనతో వారు యూనియన్ కార్యాలయంలో చర్చించినా వారి సమాధానంతో సంతృప్తి చెందలేదు. మరో దఫా చర్చలు జరిపి లోడింగ్లు పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆందోళలో లారీ యూనియన్ బాధ్యులు కొండపల్లి రమేష్రెడ్డి, ఎస్.కే.మౌలాలీ, కోట మోహన్రావు, చిన్నంశెట్టి సూరిబాబు, ఎస్.కే.మస్తాన్, ఎస్.కే.ఖలీల్, దురిశేటి శ్రీనివాసరావు, కొండపల్లి క్రాంతిరెడ్డి, చిలుకూరి మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
అదే మా లక్ష్యం, పాలనావిధానం
● రాజీవ్ కెనాల్తో 1.25లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ● మధిరలో ఇందిరా మహిళా డెయిరీతో మహిళల ఆర్థికాభివృద్ధి ● తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కజాతీయజెండా ఆవిష్కరించి వందనం చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పక్కన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, సీసీ సునీల్దత్ (ఇన్సెట్) ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతుండగా, అభివృద్ధి, సంక్షేమాలను ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో జిల్లాకు చెందిన అనేకమంది అసువులు బాయగా.. వీరి త్యాగాలతోనే ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈక్రమంలోనే జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం ఆయన మాటల్లోనే... – సాక్షి ప్రతినిధి, ఖమ్మంపెరగనున్న ఆయకట్టు సేద్యం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకురావాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోంది. రూ.100 కోట్లతో నిర్మించిన రాజీవ్ కెనాల్ను వినియోగించి రూ.1.25 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి– యాతాలకుంట ట్రంక్కెనాల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. రఘునాథపాలెం మండలంలో రైతులకు సాగు నీరు అందించేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశాం. మున్నేరు నుంచి పాలేరు కెనాల్ వరకు రూ.102.92 కోట్ల అంచనా వ్యయంతో లింక్ కెనాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచాం. మున్నేటి వరద ముంపునకు అడ్డుకట్ట వేసేలా ఇరువైపులా రూ.525.36 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నాం. మహిళల ఆర్థిక సాధికారత ● మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుచేస్తున్నాం. 21వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండేసి పాడి గేదెలు ఇచ్చి పాలు సేకరిస్తాం. అలాగే, ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళా మార్ట్, 64 సీ్త్ర టీ షాపుపెద్దమొత్తంలో నిధులతో 613 క్యాంటీన్ షెడ్లు, 28 పౌల్ట్రీ షెడ్లు ఏర్పాటు చేశాం. ● భూభారతితో రైతుల సమస్యలు తీరనున్నాయి. జిల్లాలోని నేలకొండపల్లిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సదస్సుల ద్వారా 3,224 దరఖాస్తులు స్వీకరించాం. ఆపై బోనకల్ మండలాన్ని రెండో పైలట్ మండలంగా ఎంపిక చేసి సదస్సులు నిర్వహించాం. మంగళవారం నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. ● 2024–25 యాసంగి సీజన్లో జిల్లాలో ఇప్పటి వరకు 32,102 మంది రైతుల నుంచి 21,66,180 క్వింటాళ్ల ధాన్యం సేకరించాం. ఇందులో సన్న ధాన్యానికి బోనస్గా 47,494 మంది రైతులకు రూ.136.33 కోట్లు చెల్లించాం. ● తాగునీటి సమస్య పరిష్కారానికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రూ.229 కోట్లతో చేపట్టిన పనులు తుదిదశలో ఉన్నాయి. వైరాలో రూ.28 కోట్లు, మధిరలో రూ.17 కోట్ల నిధులతో పనులు పూర్తిచేశాం. ● జిల్లాలోని 60 పాఠశాలల్లో న్యూట్రిగార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందిస్తున్నాం. మధిరలో రూ.4కోట్లు, సిరిపురంలో రూ.5 కోట్లు, కూసుమంచి మండలంలో రూ.5.50 కోట్లతో జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలు చేపట్టాం. ఖమ్మం మెడికల్ కాలేజీకి నూతన భవనాల నిర్మాణం రూ.130 కోట్లతో చేపడుతున్నాం. అలాగే, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 – 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నాం. ● పర్యాటక అభివృద్ధికి నూతన పాలసీ తీసుకొచ్చాం. వెలుగుమట్ల అర్బన్పార్క్ వద్ద 40 అడుగుల రోడ్డు, ప్లే ఏరియా, బోటింగ్ ఏరియా అభివృద్ధి చేశాం. ఖమ్మం ఖిలాపైకి రోప్వే నిర్మాణానికి రూ.29 కోట్లతో ప్రతిపాదించాం. పాలేరు రిజర్వాయర్ అభివృద్ధి, పర్యాటకులకు సౌకర్యాల కల్పన కోసం రూ.16.75 కోట్లతో ప్రతిపాదించి రూ.5కోట్లు మంజూరు చేశాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్దత్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్ఓ పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పెనుబల్లి మండలం పులిగుండాల వద్ద ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా ఏర్పాటుచేసిన సఫారీ వాహనాన్ని పరేడ్ గ్రౌండ్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తిరుమలాయపాలెం: అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలంలోని రఘునాథపాలెం, గోల్తండా, రాజారం, దమ్మాయిగూడెం, కొక్కిరేణి గోపాలపురం తదితర గ్రామాల్లో సోమవారం పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయడమే కాక పూర్తయిన పనులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ నిరుపేదలకు తొలుత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని.. ఆతర్వాత అర్హులందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. మొదటి దఫా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగా మరో విడత కేటాయిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇచ్చిన మాట ప్రకారం రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. నేటి నుంచి సదస్సులు వానాకాలం సీజన్కు సంబంధించి త్వరలోనే రైతులకు రైతు భరోసా నిధులు విడుదలవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. అలాగే, ధరణి స్థానంలో ప్రవేశపెట్టిన భూభారతి ద్వారా అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలపై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం నుంచి ఈ సదస్సులు మొదలవుతాయని వెల్లడించారు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపినా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, రామసహాయం నరేష్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, మంగీలాల్, కొప్పుల అశోక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
ఆస్తుల కన్నా.. పర్యావరణం మిన్న
సింగరేణి(కొత్తగూడెం): ప్రపంచంలో అన్నింటికీ హద్దులు ఉన్నా.. గాలి, వెలుతురు, ఆక్సిజన్కు లేవని, అందుకే ఆస్తుల కంటే పర్యావరణమే ముఖ్య మని గుర్తించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ సూచించారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేఓసీ డంప్యార్డ్ వద్ద ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 121 మొక్కలు నాటారు. దీంతో తాను ఇప్పటివరకు 19,121 మొక్కలు నాటానని, వచ్చే జూలై చివరి నాటికి మరో 1,879 మొక్కలు నాటి.. 21వేల లక్ష్యాన్ని చేరాల్సి ఉందని వివరించారు. ఒక మొక్క ద్వారా రూ. కోటి విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్.వీ.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం శాలేంరాజు, అటవీ, పర్యావరణ శాఖ సలహాదారు మోహన్ చంద్ర పరిగెన్, పర్యావరణ జీఎం సైదులు, జీకేఓసీ పీఓ రమేష్, సూర్యనారాయణతో పాటు ఎండీ రజాక్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవంలో మొక్కలు నాటిన సీఎండీ -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఒడి బియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. రాయితీపై ఫైబర్ గడలు దమ్మపేట : పామాయిల్ గెలల కోతకు వినియోగించే ఫైబర్ గడలను ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై అందజేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని గండుగులపల్లిలోని తన నివాసంలో పలువురు రైతులు కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎత్తయిన పామాయిల్ చెట్ల గెలలు కోసే క్రమంలో విద్యుత్ షాక్ తగలకుండా ఫైబర్ గడలను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, వసంతరావు, అప్పారావు, రైతులు పాల్గొన్నారు. -
ఐఎఫ్ఎస్గా భరత్ స్కూల్ పూర్వ విద్యార్థి ఎంపిక
మధిర: మధిరలోని భరత్ టెక్నో స్కూల్ పూర్వ విద్యార్థి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం రామిరెడ్డిపల్లికి చెందిన ఆలపాటి గోపీనాథ్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఓసీ కేటగిరీ నుంచి 55వ ర్యాంకు సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యాడు. ఈసందర్భంగా ఆదివారం ఆయనను స్కూల్ చైర్మన్ శీలం వెంకటరెడ్డి సన్మానించారు. భరత్ విద్యానికేతన్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివిన గోపీనాథ్ ఐఎఫ్ఎస్కు ఎంపికవడంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయ నెట్బాల్ టోర్నీలో కాంస్య పతకం ఖమ్మం స్పోర్ట్స్: మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ నెట్బాల్ పోటీల్లో ఖమ్మం రూరల్ పెద్ద వెంకటగిరికి చెందిన వి.హర్షిణి కాంస్య పతకం దక్కించుకుంది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమె ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా హర్షిణిని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, నెట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సీహెచ్.దీప్తి, కార్యదర్శి ఎన్.ఫణికుమార్, కోచ్లు పీ.పీ.రమణ, అఖిల్కుమార్ అభినందించారు. అధ్యాపకుల నిరసన ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని నూతన అధ్యాపకులకు రెండో వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో కొందరు కుట్ర పన్నారని పేర్కొంటూ అధ్యాపకులు నిరసన తెలిపారు. ఈమేరకు ఖమ్మంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్–475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడగా బాధ్యులు బేగం, మల్లయ్య, కిషోర్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అనుమతి లేని కళాశాలల్లో చేరొద్దు ఖమ్మం సహకారనగర్: పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరే క్రమాన కళాశాలల అనుమతులు సరిచూసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు. అకాడమీలు, ట్యూషన్ సెంటర్లకు ఎలాంటి అనుమతులు ఉండవని వెల్లడించారు. ఈనేపథ్యాన ప్రభుత్వ అనుమతులు పరిశీలించాకే చేరాలని.. తద్వారా నష్టం జరగదని పేర్కొన్నారు. ఈమేరకు కళాశాలల గుర్తింపు వివరాలను tsbie.cgg.gov.in వెబ్సైట్లో చూడొచ్చని డీఐఈఓ తెలిపారు. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నందున విద్యార్థులు హాజరుకావాలని ఆయన సూచించారు. భారజల కర్మాగారం జీఎంగా శ్రీనివాసరావు అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని మణుగూరు భారజల కర్మాగారం జీఎంగా ఘంటసాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుత జీఎం హెచ్కే.శర్మ ఉద్యోగ విరమణ చేయడంతో డీజీఎంగా పని చేస్తున్న శ్రీనివాసరావుకు ఉద్యోగోన్నతి లభించింది. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. -
‘ఈ దేశ మూలవాసులం మనమే..’
ఖమ్మం మామిళ్లగూడెం: ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కాక మతం మార్చుకున్న ముస్లిం మైనార్టీలు కూడా ఈ దేశ మూలవాసులేనన్న అంశం శాసీ్త్రయంగా నిరూపితమైందని బామ్సెఫ్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా శ్రీధర్ తెలిపారు. సంఖ్యాపరంగా అధిక సంఖ్యలోనే ఉన్నా బానిసలుగా, బాధితులుగా మిగిలిపోవడంతో విద్య నుండి దూరమయ్యామని చెప్పారు. ఖమ్మం టీటీడీసీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇతర దేశాల నుండి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడి జీవన విధానం, నాగరికతను ధ్వంసం చేసి ఎవరూ తిరగబడకుండా కుల వ్యవస్థ, మనుధర్మాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈమేరకు అందరూ చరిత్రను చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయకుమారి మాట్లాడుతూ మాతస్వామిక తత్వంతో జీవించగా, సీ్త్రలకు విలువలు లేని మనుధర్మ శాస్త్రం, కులాన్ని రుద్దడం ద్వారా రాజ్యాధికారానికి దూరం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో తొలుత సామాజిక ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈకార్యక్రమంలో బామ్సెఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా పెద్దన్నతో పాటు వివిధ సంఘాల నాయకులు భూక్యా ఉపేంద్రబాయి, షేక్ నజీమా, ప్రమీల, త్రివేణి, భవాని, సరోజని, బానోతు భద్రునాయక్, మీగడ రామారావు, రవి, సోమ్లా, సంజీవరావు, పగిడిపల్లి నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏదీ కారుణ్యం?
● జెన్కోలో కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యం ● మూడేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు ● కేటీపీఎస్లో సుమారు 76 మంది బాధితులు పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. కర్మాగారాల్లో నిత్యం కాలుష్యం అధికంగా ఉండే రెడ్జోన్ పరిధిలో కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో అనేక ప్రాణాంతక వ్యాధులకు గురై అనారోగ్యంతో బాధపడుతుంటారు. వ్యాధులు, ప్రమాదాలతోపాటు అకాల మరణాలు చెందిన అనేక మంది ఉద్యోగుల కుటుంబాలకు దక్కాల్సిన కారుణ్య నియామకాలపై జెన్కో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఉద్యమాలు చేస్తున్నా తాత్సారం చేస్తోంది. జెన్కో వ్యాప్తంగా సుమారు 110 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తుండగా, కేవలం కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలోనే సుమారు 76 మంది వరకు ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. బాధితుల ఎదురుచూపులు ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో జాప్యం లేకుండా కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. జెన్కోలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సీఎండీలు మారడం, డైరెక్టర్ స్థాయి పోస్టులు ఖాళీగా ఉండటం, ప్రభుత్వం మారడం వంటి పరిణామాలతో మూడేళ్లుగా ఈ ప్రక్రియ మందగించింది. దీంతో విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న బాధిత కుటుంబీకులు మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఫైరవీల పేరుతో బాధితుల నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాలు వెంటనే ఇస్తే ఎక్కువ కాలం విధులు నిర్వర్తించే చేసే అవకాశం, సీనియారిటీ పెరిగి అధిక వేతనం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నట్లు పలువురు వాపోతున్నారు. వర్తించని జీపీఎఫ్ 1999 నుంచి 2004 మధ్యలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తించడం లేదు. ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చి పెన్షన్ ఇవ్వాలని ఉద్యోగాలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యపై కూడా ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. అయినా సమస్య పరిష్కారం కావడంలేదు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి, కారుణ్య నియామకాల కోసం, జీపీఎఫ్ కోసం తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాడ్ చేస్తున్నాయి. -
డిప్యూటీ సీఎంను కలిసిన ఎస్టీఎఫ్ నాయకులు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో విద్యార్థులకు మేలు జరగడమే కాక విద్యారంగానికి దిక్సూచిలా నిలుస్తాయని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్లో ఆదివారం ఆయన పలువురు ఎస్టీఎఫ్ బాధ్యులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఈమేరకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ చిత్రపటాన్ని అందజేసి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కాక అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు ఉత్తమ విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. -
భారంగా పచ్చిరొట్ట సాగు
● గత ఏడాదితో పోలిస్తే విత్తనాల ధర రెట్టింపు ● సరఫరా సైతం నామమాత్రంగానే... ● ఉత్పత్తి సరిపడా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఖమ్మంవ్యవసాయం: భూసారాన్ని పెంచేలా రైతులు సాగుచేసే పచ్చిరొట్ట విత్తన ధరలు అమాంతం పెరిగాయి. గత ఏడాదితో రెట్టింపు కావడం గమనార్హం. ఏకంగా ఒక్కో విత్తన బ్యాగ్పై రూ.వేయికి పైగా ధర పెరిగినా.. సరిపడా అందుబాటులో లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పంటల సాగుకు ముందు తొలకరి వర్షాలు కురవగానే భూముల్లో పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేస్తారు. ఈ పైరు పెరిగాక భూమిలో కలియదున్నడంతో భూసారం పెరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి సాగు చేసే మాగాణి భూముల్లోనే కాక మిర్చి, పండ్ల తోటల్లో భూముల్లో పచ్చిరొట్ట పంటలైన జీలుగు, జనుము, పిల్లి పెసర సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతకు మించి... పచ్చిరొట్ట విత్తనాల ధరలు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. గత ఏడాది కిలో జీలుగుల ధర రూ.37.20 కాగా, ఈ ఏడాది రూ.71.25కు చేరింది. జనుము గత ఏడాది రూ.36.20 ఉంటే రూ.62.75, పిల్లి పెసర గత ఏడాది రూ.54.20 కాగా ఈ ఏడాది రూ.102.50గా నిర్ణయించారు. ఈ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం ఽ50 శాతం సబ్సిడీతో అందిస్తున్నా రైతులు భారం మోయలేకపోతున్నారు. అంతంతే సరఫరా ఈ ఏడాది పచ్చిరొట్ట విత్తనాల సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు డిమాండ్ మేరకు విత్తనాభివృద్ది సంస్థకు ఇండెంట్ ఇస్తాయి. ఆపై విత్తనాభివృద్ధి సంస్థ పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో తీసుకొస్తుంది. ఈ ఏడాది ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల అధికారులు జీలుగులు 19వేల క్వింటాళ్లు, జనుము 1,900 క్వింటాళ్లు, పిల్లి పెసర 200 క్వింటాళ్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఇందులో జీలుగు 3,252 క్వింటళ్లు, జనుము 1,170 క్వింటాళ్లే అందుబాటులోకి వచ్చాయి. ఇక పిల్లి పెసర విత్తనాల జాడే లేదు. గత ఏడాది జీలుగులు 15,229 క్వింటాళ్లు, జనుము 1,172 క్వింటాళ్లు, పిల్లి పెసర 171 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కానీ ఈసారి తక్కువగా అందుబాటులో రావడంతో రైతులందరికీ అందకపోగా.. , ధర పెరిగిన నేపథ్యాన కొందరు సాగుపై నిర్లిప్తత కనబరుస్తున్నారు. ఉత్తరాది నుంచి దిగుమతి పచ్చిరొట్ట పంటలను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సాగు చేస్తారు. ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లోనే కాక బిహార్లో ఈ పంటలే సాగవుతున్నాయి. కానీ ఈ ఏడాది పచ్చిరొట్ల పంటల దిగుబడి తగ్గిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తద్వారా ధరలపైనే కాక లభ్యతపై ప్రభావం పడిందని విశ్లేషిస్తున్నారు. ఏదిఏమైనా విత్తన ధరలు పెరగడం, సరఫరా తగ్గడంతో ఈ ఏడాది పచ్చిరొట్ట సాగు సైతం తగ్గుతుందని చెబుతున్నారు. ఫలితంగా రసాయన ఎరువుల వినియోగం పెరిగే అవకాశముంది.పచ్చిరొట్ట విత్తనాల ధరలు (రూ.ల్లో) విత్తనం కిలోలు గత ఏడాది ఈ ఏడాది పెంపు జీలుగు 30 1,116 2,137 1,021 జనుము 40 1,448 2,510 1,062 పిల్లిపెసర 30 1,084 2,055 971 -
వాతావరణ ం
జిల్లాలో సోమవారం ఎండ ప్రభావం పెరుగుతుంది. మధ్యాహ్నం వేళ వడగాలుల శ్రీప్రభావం సైతం ఉంటుంది. త్వరలోనే హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకానుంది. ఇన్నాళ్లు కాల్వొడ్డు తదితర ప్రాంతాల్లో పండ్లు అమ్ముతుండగా అమ్మకందారులే కాక ప్రజలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యాన నగరంలోని 4వ డివిజన్ పారిశ్రామిక ప్రాంతంలో మూడేళ్ల నుంచి అసంపూర్తి నిర్మాణాలతో ఖాళీగా ఉన్న వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ షెడ్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. కొద్దిమేర మిగిలి ఉన్న పనులు పూర్తిచేసి హోల్సెల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది అమల్లోకి వస్తే నగరవాసులకు అన్ని రకాల పండ్లు ఒకే చోట లభించనున్నాయి. ఈకార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు. ప్రణాళికాయుతంగా పనులు ఖమ్మంవన్టౌన్: జిల్లా కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రణాళికాయుతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధి కారులతో ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. రహదా రులపై ర్యాంప్ల నిర్మాణం, ఆక్రమణతో వెడల్పు తగ్గి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అయితే, అధికారులు తొలిదశలో అడ్డుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, వర్షాలు పడేనాటికి ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలని, విద్యుత్ లైన్ల ఏర్పాటులో ఉద్యోగులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మరిన్ని బడుల్లో ఏఐ
విద్యార్థుల్లో సామర్ధ్యం పెంపు కంప్యూటర్ ఆధారిత బోధనతో విద్యార్థుల్లో సామర్థ్యాలు మెరుగయ్యాయి. పాఠశాలకు క్రమం తప్పకుండా రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పిల్లలు కంప్యూటర్ వినియోగిస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. – కె.రవికుమార్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి 176 పాఠశాలల్లో ఏర్పాట్లు జిల్లాలోని 176 పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత బోధన మొదలుపెడుతున్నాం. ఇప్పటికే అమలుచేసిన స్కూళ్లలో సత్ఫలితాలు వచ్చాయి. దీంతో మరిన్ని పాఠశాలలకు విస్తరిస్తున్నాం. – సామినేని సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారిరాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు అనేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత విద్యాసంవత్సరం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత బోధన సాగించారు. జిలాల్లోని ఏడు పాఠశాలల్లో ఈ విధానం అమలుచేయగా సత్ఫలితాలు వచ్చాయని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఇంకా 176 పాఠశాలల్లో అమలుకు నిర్ణయించారు. – ఖమ్మం సహకారనగర్అమలు ఇలా.. పేరున్న కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రమే ఏఐ ఆధారిత బోధన కొనసాగుతోంది. దీన్ని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో తెలుగు, ఇంగ్లిష్, గణిత సామర్థ్యాలు పెంచేలా అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయోగాత్మకంగా జిల్లాలోని ఏడు పాఠశాలలకు కంప్యూటర్లు సమకూర్చి 3 నుంచి 5 తరగతుల్లో పదేసి మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆపై ‘ఏక్ స్టెప్‘ ఫౌండేషన్ రూపొందించిన ప్రోగ్రాం ఆధారంగా రోజుకు 40 నిమిషాలు, వారానికి నాలుగు రోజులు కంప్యూటర్లతో బోధించారు. తద్వారా ప్రతీ విద్యార్థి కంప్యూటర్ను వినియోగిస్తూ ఉచ్ఛారణను రికార్డు చేయడమే కాక ఆపై మళ్లీ వింటూ తప్పొప్పులు సరిచేసుకున్నారు. ఖమ్మం ఎన్నెస్పీ కాలనీ, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలు, మల్లెమడుగు, పాండురంగాపురం, సింగారెడ్డిపాలెం, సత్తుపల్లి, సిద్ధారంలోని మండల పరిషత్ పాఠశాలల్లో ఈ విధానం అమలుచేయగా విద్యార్థుల సామర్థ్యాలు పెరిగినట్లు గుర్తించారు. తల్లిదండ్రులకు నివేదికలు గత ఏడాది ఏఐ ఆధారిత బోధన సాగిన పాఠశాలల్లోని విద్యార్థుల ప్రగతిని రెండు సార్లు తల్లిదండ్రులకు అందించారు. ఈ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. అంతేకాక ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో నిలవగా ఉన్నతాధికారులు డీఈఓ సామినేని సత్యనారాయణకు ప్రశంసాపత్రం అందించారు. దీంతో ఈ ఏడాది 50కి మించి విద్యార్థులు ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఐదు చొప్పున కంప్యూటర్లు కేటాయించి విస్తరించాలని నిర్ణయించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధనపై ప్రత్యేకదృష్టి సారించారు. జిల్లా కేంద్రంలోని ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో కొత్త విధానం అమలును తరచుగా పర్యవేక్షించిన ఆయన అధికారులకు సూచనలు చేశారు. దీంతో కార్యక్రమం సమర్థవంతంగా అమలైంది. గత ఏడాది ఏడు పాఠశాలల్లో అమలు విద్యార్థుల ఉత్సాహం.. మెరుగైన ఫలితాలు ఈసారి కొత్తగా 176స్కూళ్లలో ఏర్పాటుకు నిర్ణయం ఇవీ లాభాలు ఏఐ ఆధారిత బోధన ద్వారా తెరపై చూస్తూ పాఠాలు వింటుండడంతో విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా దోహదపడుతుందని భావిస్తున్నారు. అలాగే, కంప్యూటర్ విద్యపై భయం తగ్గుతుందని.. వెనకబడిన విద్యార్థులు సైతం చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు సులభంగా నేర్చుకున్నారని తేలింది. తెలివితేటలు, ఏకాగ్రత పెరిగి విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారని గుర్తించారు.ఈ ఏడాది అమలు చేయనున్న స్కూళ్ల వివరాలు నియోజకవర్గం పీఎస్లు యూపీఎస్లు మొత్తం పాఠశాలలు పాలేరు 40 08 48మధిర 35 03 38ఖమ్మం 35 02 37వైరా 23 05 28సత్తుపల్లి 21 04 25మొత్తం 154 22 176 -
సాగుకు మరింత నీరు
● బుగ్గవాగు చెక్డ్యాం నుంచి పైపులైన్ల ఏర్పాటుకు ప్రణాళిక ● రూ.82కోట్ల బడ్జెట్తో ప్రభుత్వానికి ప్రతిపాదన ● అమలైతే 5,500 ఎకరాలకు సజావుగా సాగునీరు ఖమ్మంఅర్బన్: జిల్లాలోని కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో సాగునీటి కష్టాలు తీర్చేలా కొత్త పథకం తెరపైకి వచ్చింది. కారేపల్లి – కామేపల్లి మండలాల సరిహద్దుల్లో బుగ్గవాగుపై ఏళ్ల క్రితమే చెక్డ్యాం నిర్మించగా.. గ్రావిటీ కాల్వల నిర్మాణానికి భూసేకరణ ఇబ్బందిగా మారడంతో ఫలితం దక్కలేదు. ఇటీవల రఘునాథపాలెం మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ల ద్వారా 33 చెరువులకు సాగునీరు మళ్లించగా విజయవంతమైంది. ఇదే తరహాలో చెక్డ్యాం నుంచి పైపులైన్లు వేసి చెరువులకు నీరు మళ్లించాలని ప్రతిపాదించిన జల వనరుల శాఖ అధికారులు రూ.82 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించినట్లు తెలిసింది. పదేళ్ల క్రితమే నిర్మాణం బుగ్గవాగుపై పదేళ్ల క్రితమే చెక్డ్యామ్ నిర్మించారు. ఆతర్వాత గ్రావిటీ కాల్వల ద్వారా చెరువులకు నీరు తరలించాలని భావించారు. ఇందుకోసం సుమారు రూ.40 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా... భూసేకరణలో విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు వ్యతిరేకించారు. దీనికితోడు మరి కొన్ని సమస్యలతో పథకం ముందుకు సాగలేదు. ‘మంచుకొండ’ సక్సెస్ బుగ్గవాగు చెక్డ్యాం నుంచి నీరు తరలించేందుకు ఎక్కువ భూసేకరణ అవసరం లేకుండా ప్రత్యామ్నాయంపై అధికారులు ఆలోచన చేశారు. ఇటీవల రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ల ద్వారా 33 చెరువులకు సాగునీరు విడుదల చేశారు. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో అధికారులు బుగ్గవాగు చెక్డ్యాంపై దృష్టి సారించారు. మంచుకొండ మాదిరిగానే పైపులైన్లు నిర్మిస్తే తక్కువ భూసేకరణ, వ్యయంతో పని పూర్తవుతుందనే నిర్ణయానికి వచ్చారు. 26 కి.మీ.. 200 క్యూసెక్కులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో సుమారు 26 కి.మీ. మేర పైపులైన్ నిర్మాణం, భూసేకరణ, ఇతర పనులకు రూ.82కోట్లు అవసరమని జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఇది అమలైతే కామేపల్లి మండలంలోని 21, రఘునాథపాలెం మండలంలోని 10 చెరువులకు కలిపి 31 చెరువులకు పైపులైన్ ద్వారా నీరు అందుతుంది. సుమారు 200 క్యూసెక్కుల నీటిని తరలించడం ద్వారా దాదాపు 5,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు మెరుగుపడతాయని.. తాగునీటి సమస్యకు సైతం పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. వర్షాకాలంలో వాగుల ద్వారా వచ్చే నీటిని చెక్డ్యామ్లో నిలిపి.. ఆపై చెరువులకు తరలిస్తే పంట సాగు చివరి దశలో ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నారు. కాగా, మంచుకొండ లిఫ్ట్ ద్వారా రఘునాథపాలెం మండలంలోని పలు చెరువులకు సాగర్ జలాలు విడుదల చేయగా, మిగతా చెరువులకు బుగ్గవాగు చెక్డ్యాం నుంచి నీరు అందనుండడంతో మండలంలో సాగునీటి కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. -
విత్తనోత్పత్తికి శ్రీకారం
● రైతులకు ‘ఫౌండేషన్ సీడ్’ పంపిణీ ● జిల్లాలోని 379 గ్రామాల్లో ముగ్గురేసి రైతుకు వరి, పెసర విత్తనాలు ● నేడు పంపిణీకి సిద్ధం చేసిన యంత్రాంగంఖమ్మంవ్యవసాయం: మెరుగైన విత్తనోత్పత్తే లక్ష్యంగా రైతులకు ఫౌండేషన్ సీడ్(పునాది విత్తనం) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన రైతులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం వీటిని అందించనున్నారు. జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురు చొప్పున రైతులకు వరి, పెసర విత్తనాలను పంపిణీ చేసేలా జిల్లా వ్యవసాయ శాఖ, వైరా కేవీకే ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. వరి డబ్ల్యూజీఎల్–44 సన్న రకం, పెసర ఎంజీజీ– 385 రకాలను అందిస్తారు. వరి విత్తనాలను ఒక్కో రెవెన్యూ గ్రామంలో ఇద్దరికి చొప్పున 758 మందికి, పెసలు ఒక్కొక్కరు చొప్పున 379 మంది రైతులకు అందించాలని నిర్ణయించారు. నాణ్యమైన విత్తనాల కోసం.. రైతులు ఏటా విత్తనాలు కొనుగోలు చేయకుండా సొంతంగా విత్తనోత్పత్తి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా రైతులు సొంత అవసరాలకు వాడుకోవడమే కాక గ్రామాల్లో ఇతరులకు అమ్ముకోవడం ద్వారా ఆదాయం లభిస్తుందని భావనకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా రైతుల ద్వారా విత్తనోత్పత్తి చేసేలా ప్రభుత్వం ఫౌండేషన్ సీడ్ పంపిణీకి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ద్వారా విత్తనాలు విక్రయించడం కంటే రైతులే విత్తనోత్పత్తి చేసేలా ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా నకిలీ విత్తనాల బారిన పడకుండా అడ్డుకట్ట వేసే అవకాశముంది. అలాగే, రైతులు సాగు చేసే పంటను అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించి అవగాహన కల్పిస్తేఅందరికీ మేలు జరగనుంది. ఈ రకంగా మూడేళ్ల పాటు విత్తనోత్పత్తి చేయించేలా ఫౌండేషన్ విత్తనాలు పంపిణీ చేయనున్నారు. -
షరా మామూలే
తప్పుల తడక.. సత్తుపల్లి: సత్తుపల్లిలోని పలు స్కానింగ్ సెంటర్లలో తప్పులతడకగా రిపోర్టులు ఇవ్వడం, రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. పలుమార్లు ఆందోళనలు జరుగుతుండడం షరామామూలుగా మారింది. పట్టణంలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్కు మే 1వ తేదీన వచ్చిన మహిళను ఎదురుగా ఉన్న ఆస్పత్రికి రిఫర్ చేయటం.. అక్కడ ఆపరేషన్ వికటించి ఆమె మృతి చెందింది. ఈ ఘటన మరువక ముందే ఆరు నెలల గర్భిణి అనూషకు తొమ్మిది నెలలు నిండిన జ్యోతి స్కానింగ్ రిపోర్టు ఇవ్వడంతో చికిత్స వికటించింది. కేసులు నమోదు అవుతున్నా.. గతేడాది ఆల్ఫాస్కానింగ్ సెంటర్లో కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో నష్టపోయానని సత్తుపల్లి పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. నెల కిందట విద్యుత్శాఖ ఉద్యోగి బంధువు కడుపులో ఓవరిస్ సమస్య లేకపోయినా ఉందని నివేదిక ఇవ్వగా, ఖమ్మంలో స్కానింగ్ చేయిస్తే ఇబ్బంది ఏమీ లేదని తేలింది. దీనిపై బాధితుడు స్కానింగ్ సెంటర్ బాధ్యులను నిలదీస్తే తప్పు జరిగిందని అంగీకరించారు. వైద్యురాలు ఏం చేస్తున్నట్టు.. ఆరు నెలల గర్భిణి రిపోర్టు స్థానంలో తొమ్మిది నెలల గర్భిణి నివేదిక ఇవ్వగా.. పేరు చూడకుండానే డాక్టర్ ఉడతనేని లలితకుమారి మందులు రాయడం గమనార్హం. ఆరు నెలల గర్భిణికి తొమ్మిది నెలల గర్భిణికి సంబంధించిన మందులు రాయడంతో ఆమె అస్వస్థతకు గురవడం చర్చనీయాంశమైంది. గతంలో ఇదే ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందగా సర్దుబాటు చేసుకున్న విషయం విదితమే. పర్సంటేజీలతోనే స్కానింగ్ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే స్కానింగ్కు పంపించటం కొందరికి అనవాయితీగా మారింది. ప్రతీ స్కానింగ్లోనూ వైద్యులకు, స్కానింగ్ సెంటర్ నడుమ పర్సంటేజీల వ్యవహారం ఉండడంతోనే ఇలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్తుపల్లిలోని కొందరు వైద్యులకు ఇది నిత్యకృత్యంగా మారిందని చెబుతున్నా సత్తుపల్లిలో రెండు స్కానింగ్ సెంటర్లు ఉన్నా ఒకే సెంటర్కు రిఫర్ చేస్తుండడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. రెన్యూవల్ కాకున్నా.. ఆల్ఫా స్కానింగ్ సెంటర్కు 2023 వరకు మాత్రమే అనుమతి ఉండగా.. రెన్యూవల్కు దరఖాస్తు చేసుకున్నటికీ అనుమతి రాలేదని డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.సీతారాం శనివారం చేపట్టిన తనిఖీల్లో తేలింది. అంతేకాక ఏ పరీక్షకు ఎంత రుసుమో తెలిపే బోర్డు కూడా ఏర్పాటుచేయకుండా ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. స్కానింగ్ సెంటర్లో రిపోర్టులు తారుమారైన ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారాం, లంకాసాగర్ పీహెచ్సీ వైద్యులు చింతా కిరణ్కుమార్ తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రిపోర్టులు మారిన తర్వాత వైద్యం చేయడంపై డాక్టర్ లలితకుమారిని కూడా ప్రశ్నించామని తెలిపారు. పేర్లు చూడకుండా వైద్యం చేసిన నేపథ్యాన వివరణ తీసుకున్నామని చెప్పారు. అలాగే, స్కానింగ్ సెంటర్లో సక్రమంగా వ్యవహరించడమే కాక పరీక్షల ధరలతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. స్కానింగ్ సెంటర్లపై ఫిర్యాదులొస్తున్నా చర్యలు శూన్యం వైద్యులతో పర్సంటేజీ ఒప్పందాలపై విమర్శలు నిర్వాహకుల ఇష్టారాజ్యంతో ప్రజల ఇక్కట్లు -
పారదర్శకత.. వేగం
స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు ● కొత్తగా ఆధార్ ఈ–సంతకం సేవలు ● పైలట్గా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ● రేపటి నుంచి అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పౌర సేవలను మరింత వేగవంతం చేయడమే కాక పారదర్శకత పెంపునకు సంస్కరణలు తీసుకొస్తోంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన సంక్లిష్ట ప్రక్రియలను సరళీకృతం చేస్తూ, నూతన విధానాలు అమల్లోకి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన అధికారులను బదిలీ చేశారు. ఆపై రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునికీకరించడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇకపై ఆధార్ ఈ–సంతకం పౌర సేవలను సులభతరం చేసేలా ఆధార్ అనుసంధానంతో కూడిన ఈ–సంతకం సేవల అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఇది భౌతికంగా కార్యాలయంలో దస్త్రాలపై సంతకాలు తగ్గించడం, డాక్యుమెంట్లు తయారు చేశాక కార్యాలయానికి వచ్చినప్పుడు మళ్లీ సంతకాలు పెట్టే పని లేకుండా ఉపకరిస్తుందని చెబుతున్నారు. డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకాల ద్వారా లావాదేవీలను పూర్తి చేయడంలో సమయం తగ్గి, మానవ జోక్యాన్ని తగ్గించినట్లవుతుందని.. తద్వారా అవినీతికి ఆస్కారముండదని భావిస్తున్నారు. అంతేకాక డిజిటల్ సంతకాలు అత్యంత సురక్షితంగా, ట్యాంపరింగ్కు వీల్లేకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్కు వచ్చిన వారు భౌతికంగా వేలిముద్రలు వేసే పని లేకుండా... ఒక వేలి ముద్రను స్కానింగ్ చేస్తే ఆధార్ వెబ్సైట్ ద్వారా వారి సదరు వ్యక్తి అన్ని వేళ్ల ముద్రలు ఆన్లైన్లోకి వచ్చేస్తాయని.. తద్వారా పని సులువవుతుందని భావిస్తున్నారు. అన్ని ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించడం.. పనులు త్వరగా పూర్తయ్యేలా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుచేయనున్నారు. ఈ విధానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కూసుమంచి, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాక రాష్ట్రంలోని ఇంకొన్ని కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఇది విజయవంతమైన నేపథ్యాన స్లాట్ బుకింగ్ విధానాన్ని అన్ని కార్యాలయాలకు విస్తరించనున్నారు. కాగా, ఈ విధానంతో ఆయా కార్యాలయాల్లో సకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తిచేయడంతో పాటు గంటల వ్యవధిలోనే దస్త్రాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అందిస్తున్నారు. ఉత్తమమైన సేవలు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు ఆన్లైన్ ద్వారా ముందే తమ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో నిర్దేశిత సమయానికి వస్తే త్వరగా పని పూర్తవుతుంది. ఫలితంగా గంటల తరబడి వేచి ఉండే ఇక్కట్లు తీరినట్లేనని చెబుతున్నారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం పెరుగుతోంది. ఇలాంటి సంస్కరణలతో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ మరింత చేరువ కావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.పైలట్ ప్రాజెక్ట్గా కూసుమంచి నూతన విధానం అమలుకు పైలట్ ప్రాజెక్ట్గా రాష్ట్రంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో జిల్లాలోని కూసుమంచి కార్యాలయం కూడా ఉంది. రెండు కార్యాలయాల్లో ఆధార్ ఈ–సంతకం విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, మార్పులు అవసరమైతే చేశాక రాష్ట్రంలోని అన్ని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరించనున్నారు. కాగా, కూసుమంచిలో ఒకటి, రెండు రోజుల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ప్రపంచవ్యాప్తంగా విస్తరణకు చర్యలు
● లాభదాయకమైన టెక్నికల్ మినరల్స్ తవ్వే ఆలోచనలో సింగరేణి ● జీఎం కార్యాలయం, ఏరియా వర్క్షాప్ ప్రారంభోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థకు మంచి రోజులు వచ్చాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సంస్థ పదేళ్లు వెనక్కు వెళ్లిందని, కొత్త గనులు రాకపోవడం, విస్తరణ చేపట్టకపోవడమే దీనికి కారణమని చెప్పారు. కొత్తగూడెంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన వర్క్షాప్ను, ఆ తర్వాత జీఎం కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగూడెం ఏరియాలో వీకే – 7 ఓసీకి పర్యావరణ అనుమతులు వచ్చాయని, త్వరలో రెండో దశకు అనుమతులు రానున్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. 136 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ సంస్థ కేవలం బొగ్గుపైనే ఆధారపడకుండా లాభదాయకమైన టెక్నికల్ మినరల్స్ తవ్వే ఆలోచనలో ఉన్నామని, రాబోయే 30 ఏళ్లలో మరో 22 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా వెలికితీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి ప్రమాద బీమా వర్తింపజేస్తున్నామని, దీంతోపాటు వారసులకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే ఆగ్రహం.. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ప్రారంబోత్సవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యేగా తన అధ్యక్షతన జరగాల్సి ఉందని, అంతేకాక ప్లెక్సీలో తన ఫొటో ముద్రించకుండా ప్రొటోకాల్ విస్మరించారని కూనంనేని సాంబశివరావు సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను కాదని ఏ పనీ చేయొద్దని, భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కావొద్దని సూచించారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గడిపెల్లి కవిత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నేషనల్ కో ఆర్డినేటర్ కొప్పుల రాజు, భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, కొప్పల వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, మిరియాల రంగయ్య, కొత్తగూడెం ఏరియా జీఎం శాలేంరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సత్కారం
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో విధులు నిర్వర్తిస్తూ శనివారం ఉద్యోగ విరమణ చేసిన అధికారులను రీజినల్ మేనేజర్ ఎ.సరిరాం ఖమ్మంలో సన్మానించారు. భద్రాచలం డీఎంగా పనిచేసి, ప్రస్తుతం కార్గో ఏటీఎంగా విధులు నిర్వర్తిస్తున్న రామారావు, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) వీరన్న ఉద్యోగ విరమణ చేశారు. కార్యక్రమంలో ఖమ్మం డిపో మేనేజర్ దినేశ్కుమార్, పర్సనల్ ఆఫీసర్ రామకృష్ణ, ఏఓ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. రైతుల పేరిట రుణం తీసుకున్న చైర్మన్ ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం సహకార సంఘం చైర్మన్ జర్పుల లక్ష్మణ్నాయక్ తమ పేరుపై సొసైటీలో రుణం తీసుకుని చెల్లించలేదని తనగంపాడుకు చెందిన తేజావత్ బాలు, వీరన్న ఆరోపించారు. పట్టాదారు పాస్ బుక్లు పెట్టి రుణం తీసుకోగా, తిరిగి చెల్లించాలని కోరితే రుణమాఫీ అవుతుందని నమ్మబలికాడని పేర్కొన్నారు. అయితే, రుణమాఫీ కాకపోగా ప్రస్తుతం అప్పు చెల్లించాలని తమకు నోటీసులు వచ్చాయని వాపోయారు. ఈ మేరకు చైర్మన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం వారు జిల్లా సహకార శాఖ అధికారి, ఖమ్మం రూరల్ సీఐకి ఫిర్యాదు చేశారు. విద్యుత్ వేసవి ప్రణాళిక విజయవంతంఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఖమ్మంవ్యవసాయం: వేసవి కాలానికి రూపొందించిన విద్యుత్ ప్రణాళికను విజయవంతంగా అమలు చేశామని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. నవంబర్లోనే కార్యాచరణ సిద్ధం చేసి.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంతో వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలిగామని వెల్లడించారు. లోడ్ పెరిగే అవకాశం ఉన్న కొత్తలింగాల, మమతా రోడ్డు, తనికెళ్ల, బత్తులపల్లి, మిట్టపల్లి, జన్నారం, ములుగుమాడు, సత్తుపల్లి సబ్స్టేషన్లలో మొత్తం 13 పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే, ఇల్లెందు క్రాస్, టేకులపల్లి, దానవాయిగూడెం, ప్రకాశ్నగర్, ధంసలాపురం, ఖానాపురం, బుర్హాన్పురం, వైరా, ఎర్రుపాలెం, లక్ష్మీపురం, జిల్లా ఆస్పత్రి, మర్లకుంట ప్రాంతాల్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమే కాక అవసరమైన చోట 295 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. తద్వారా ఓవర్ లోడ్ తగ్గిందని తెలిపారు. కాగా, 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ ఏర్పాటుతో సమస్య ఎదురైన సబ్స్టేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ సరఫరా చేయగలిగామని ఎస్ఈ వెల్లడించారు. ఇప్పటివరకు 213.14 కి.మీ. మేర 36 సబ్స్టేషన్లకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. మత్స్యకార మహిళలకు ముగిసిన శిక్షణకూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల మహిళా మత్స్యకారులకు చేపలు, రొయ్యలతో ఆహార ఉత్పత్తుల తయారీపై ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా వారికి నైపుణ్య సర్టిఫికెట్లు అందజేశాక నర్సాపురం మత్స్య కళాశాల అసిసియేట్ డీన్ నీరజ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో మత్స్య రంగ అభివృద్ధికి అనువైన అవకాశాలు ఉన్నందున మహిళలు చేపలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని సూచించారు. నైపుణ్యాలు పెంచుకుని యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చని తెలిపారు. చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, ఇతర ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా కొనసాగించాలని పేర్కొన్నారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఇప్పటి వరకు 4 వేల మంది మత్స్యకారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రవీందర్, నాగరాజు, భార్గవి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
కేన్సర్తో పోరాడి ఓడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
రఘునాథపాలెం: కేన్సర్ను తుది దశలో గుర్తించినా, ధైర్యంగా చికిత్స చేయించుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన పోరాటంలో ఓడిపోయారు. మండలంలోని కోయచలకు చెందిన మాదంశెట్టి సత్యగోపాల్ (34) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. ఆయనకు కేన్సర్ సోకిన ట్లు తెలియడంతో మూడేళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. అయినా ఫలితం లేక శనివా రం ఉద యం మృతి చెందాడు. కాగా, సత్యగోపాల్ సోదరుడు రాంబాబు అన్న కోసం ఉద్యోగం వదిలిపెట్టి చికిత్సకు చేయూతగా నిలవగా, చివరకు సోదరుడు కన్నుమూయడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు సత్యగోపాల్ అంత్యక్రియలకు కుటుంబీకులు, స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ మృతి వైరారూరల్: వైరా సమీపాన బ్రిడ్జిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీడ్రైవర్ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఇనుప చువ్వల లోడుతో వైరా వైపు నుంచి తల్లాడ వైపు లారీ వెళ్తుండగా డీసీఎం వ్యాన్ను, ఆ తర్వాత కారును ఢీకొన్న విషయం విదితమే. ఈ ఘటనలో లారీడ్రైవర్ షేక్మహబూబ్ సుభానీ అలియాస్ మున్నా(32)కు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా శనివారం మృతి చెందాడు. ఆయన స్వగ్రామం విజయవాడ కాగా భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారని ఎస్ఐ పి.రామారావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం వేంసూరు: అప్పుల పెరగడం, ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేంసూరు మండలం వెంకటాపురానికి చెందిన షేక్ నాగుల్మీరా (37) భార్యతో కలిసి చికెన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిస కావడంతో అప్పులు పెరిగి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా డు. శనివారం నాగుల్మీరా భార్య షాకీనా ఆస్పత్రికి వెళ్లగా ఆయన ఉరి వేసు కున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబీకులు గుర్తించి సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా, ఆయనకు భార్య తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతితిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని సుద్దవాగుతండాకు చెందిన బానోతు శ్రీనివాస్(42) మోటార్సైకిల్పై శనివారం రాత్రి సోలీపురం నుంచి కాకరవాయి వస్తుండగా కింద పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, శ్రీనివాస్ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిందా లేదా గేదెను తగిలి పడ్డాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య బుజ్జితో పాటు ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాటరాయుళ్లపై కేసుబోనకల్: మండలంలోని రావినూతలలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిపై కేసు నమోదుచేసి రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ పి.వెంకన్న తెలిపారు. -
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ కె.విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగినుల వసతిగృహంలో ప్రవేశాలు ఖమ్మంవన్టౌన్: మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహిస్తున్న ఉద్యోగినుల వసతిగృహంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తూ 18 – 40 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఆర్థికంగా వెనుకబడిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థినులకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ఈమేరకు పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఉద్యోగ ధ్రువీకరణ లేదా ఉద్యోగ శిక్షణకు సంబంధించిన పత్రం, వేతన సర్టిఫికెట్తో తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 7901017341 నంబర్కు ఫోన్ చేయొచ్చని డీడబ్ల్యూఓ తెలిపారు. 12న అథ్లెటిక్స్ అకాడమీ ఎంపికలు ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీలో ఎంపిక ప్రక్రియ ఈనెల 12వ తేదీన నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. బాలురకు మాత్రమే అవకాశం ఉండగా, 30 జూన్ 2009 నుంచి 1 జూలై 2011 లోపు జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 8గంటలకు అకాడమీకి చేరుకోవాలని సూచించారు. మూడు నెలల బియ్యం పంపిణీకి సిద్ధం బోనకల్: ఈనెలలో రేషన్షాప్ల ద్వారా ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. బోనకల్ మండలంలో పలు రేషన్షాపులను తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ నవీన్కుమార్, సివిల్ ప్లయీస్ తహసీల్దార్ వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో బియ్యం నిల్వ సామర్ధ్యం, ఇతర ఏర్పాట్లను పరిశీలించిన డీసీఎస్ఓ మూడు నెలల బియ్యం పంపిణీ సజావుగా సాగేలా రేషన్ డీలర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, బియ్యం తీసుకున్న వారు అమ్మితే కార్డు రద్దు చేస్మాతని స్పష్టం చేశారు. డీలర్లు సుంకర రామారావు, బందం అచ్చయ్య, తోట లింగయ్య, వరలక్ష్మి, సత్తార్, నిర్మల, పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. 3న హెచ్ఎంలు, ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం ఖమ్మం సహకారనగర్: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100శాతం నమోదైన ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలను సన్మానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో 3వ తేదీన కలెక్టరేట్లో జరిగే సమావేశంలో వంద శాతం ఫలితాలు సాధించిన 66పాఠశాలల హెచ్ఎంలతో పాటు జిల్లా, మండల స్థాయి టాపర్లను సైతం సన్మానించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
జీవనంలో సగపాలు
జీవన ప్రమాణాలు మెరుగుపర్చేది పాడిపరిశ్ర మ●● పౌష్టికాహారంలో పాలకే ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లాలో మెరుగ్గా పాల ఉత్పత్తి ● త్వరలోనే ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు ● నేడు ప్రపంచ పాల దినోత్సవంపాల ఉత్పత్తికి పెరుగుతున్న ప్రాధాన్యం మనిషి ఆరోగ్యం పాల ఉత్పత్తులపై ఆధారపడటంతో ఆయా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యాన ప్రభుత్వాలు పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాడి పరిశ్రమపైనా రైతులు మక్కువ కనబరుస్తునానరు. ఉమ్మడి జిల్లాలో గేదె పాలు ఉత్పత్తి ఎఉ్కవగా ఉండగా.. ప్రభుత్వం 25 వేల లీటర్ల సామర్థ్యంతో పాడి పరిశ్రమ (విజయ డెయిరీ)ను నిర్వహిస్తోంది. ఖమ్మంలోని ఈ పరిశ్రమకు అనుబంధంగా కామేపల్లి, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెంలలో 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాల శీతలీకరణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 227 గ్రామాల్లో పాల సేకరణ పాల శీతలీకరణ కేంద్రాల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 30 మండలాల్లోని 227 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ పాల సేకరణ కేంద్రాల్లో 3,025 మంది ఉత్పత్తి చేసే పాలను విక్రయిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రస్తుతం రోజుకు 7,750 లీటర్ల పాలను సేకరిస్తుండగా, కొత్తగూడెం జిల్లా నుంచి 2,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఈ మొత్తం నుంచి ఖమ్మం జిల్లాలో 1,000 లీటర్లు, కొత్తగూడెం జిల్లాలో 2,600 లీటర్లు విక్రయిస్తున్నారు. విజయ పాల ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రాధాన్యం ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 6 డెయిరీ పార్లర్లు నడుస్తున్నాయి. వెన్నశాతం ఆధారంగా పాడి పరిశ్రమ రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. ప్రభుత్వం ఇటీవల పాల ధరను పెంచింది. 10 వెన్నశాతం ఉన్న గేదె పాల ధరను రూ.80 నుంచి 84.60కు, వెన్నశాతం 7 ఉన్న గేదె పాల ధర రూ.56 నుంచి రూ.59.50లకు పెంచింది. ఇందిరా డెయిరీతో పెరగనున్న ఉత్పత్తి రాష్ట్ర ప్రభుత్వం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సభ్యులైన మహిళలకు రెండు గేదెల చొప్పున సబ్సిడీపై అందించనున్నారు. మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. ఇప్పటికే ఎర్రుపాలెంలో బల్క్మిల్క్ కేంద్రం ఉండగా, బోన కల్, చింతకాని, మధిర, ముదిగొండల్లో ఒక్కో మండలంలో 2,500ల నుంచి 5 వేల సామర్థ్యం కలిగిన బల్క్మిల్క్ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశారు. ఆరోగ్యం.. శక్తి పాలలో మన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్, పాస్ఫరస్, అయోడిన్, ఐరన్, పొటాషియం, ఫోలేట్స్, విటమిన్–ఏ, బిటమిన్–డీ, రైబోఫ్లేవిన్, విటమిన్ బీ–12, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ (ఆరోగ్య కొవ్వు పదార్థాలు) వంటివి ఉంటాయి. అనాదిగా అనేక దేశాలు పాల ప్రాధాన్యాన్ని గుర్తించాయి. నిత్యం సగటున ఒక మనిషికి 274 గ్రాముల పాలు, పాల పదార్థాలు అవసరం. అయితే మన దేశంలో ఒక్కో మనిషికి సగటున 186 గ్రాములు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 గ్రాములకు మించి పాల ఉత్పత్తులు అందటం లేదని నివేదికలు చెబుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పాలు ఆరోగ్యకరమన ఆహారం. జీవనోపాధి, సమాజ ప్రయోజనాలకు పాడి పరిశ్రమ ఎంతగానో దోహదపడుతుంది. జీవన ప్రమాణాలను మెరుగుపర్చటంలో పాడి పరిశ్రమ ప్రధాన భూమిక పోషిస్తుందనటంలో సందేహం లేదు. మానవాళి జీవనంలో పాలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ నేపథ్యాన నేడు (ఆదివారం) అంతర్జాతీయ పాల దినోత్సవం సందర్భంగా కథనం. –ఖమ్మంవ్యవసాయం రైతుల్లో పెరుగుతున్న అవగాహన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెరుగుతోంది. పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో పాడి పరిశ్రమపై కూడా రైతులు దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు గేదెలను పెంచుకొని, వాటి ద్వారా పాడిని ఉత్పత్తి చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. స్థానికంగా పాలు విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా డెయిరీలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. –మోహనమురళి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్, ఖమ్మం -
మహిళ వస్త్రాలు ఎత్తుకెళ్లిన దుండగుడు!
నేలకొండపల్లి: ఓ దొంగ రెక్కీ నిర్వహించాడంటే ఆ ఇంట్లో నగలు, డబ్బు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేస్తాడు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి కేవలం మహిళల వస్త్రాలే ఎత్తుకెళ్లడం గమనార్హం. నేలకొండపల్లిలో ఓ మహిళ శనివారం దుస్తులు ఉతికి ఆరుబయట దండెంపై ఆరేసింది. ఆ ఇంటి వద్ద అటూఇటు ఓ యువకుడు తిరుగుతుండగా స్థానికులు ప్రశ్నిస్తే సేల్స్మేన్గా చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి దండెంపై ఆరేసిన మహిళ వస్త్రాలను బ్యాగ్లో పెట్టుకుని పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ఎదురుగా ఉన్న షాప్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మైనర్, డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో జరిమానా ఖమ్మంక్రైం: వాహనాలు నడుపుతూ పట్టుబడిన 34 మంది మైనర్లకు రూ.వెయ్యి చొప్పున, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 75 మందికి రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన మైనర్లు, మద్యం తాగిన వారిని కోర్టులో హాజరుపర్చగా నాలుగో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్) న్యాయమూర్తి బి.నాగమణి జరిమానా విధించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలువైరారూరల్: మండంలోని స్టేజీ పినపాక సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని విప్పలమడకకు చెందిన అక్కిశెట్టి కృష్ణారావు వైరాలో హమాలీగాపనిచేస్తున్నాడు. పని ముగిశాక ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తల్లాడ వైపు నుంచి ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావును పోలీసులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మిషన్ భగీరథ సర్వీసుల తనిఖీ ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ల విద్యుత్ సర్వీసులను ఎన్పీడీసీఎల్ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఆయా ప్లాంట్ల కనెక్షన్లు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అంశాలను పరిశీలించారు. ఖమ్మంలోని పలు సర్వీసుల తనిఖీ డీఈ(ఆపరేషన్స్) నంబూరి రామారావు ఆధ్వర్యాన కొనసాగింది. -
కాంగ్రెస్ ఇన్చార్జ్, పీసీసీ చీఫ్తో మంత్రి భేటీ
ఖమ్మంవన్టౌన్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ శనివారం ఖమ్మం వచ్చారు. భద్రాద్రి జిల్లా కిన్నెరసానిలో జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళనంలో పాల్గొన్న వారిని తిరుగు ప్రయాణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని మంత్రి సన్మానించగా.. జిల్లాలో పార్టీ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించారు. మదన్లాల్ కుటుంబానికి పరామర్శ రఘునాథపాలెం: మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ కుటుంబాన్ని శనివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో మదన్లాల్ మృతి చెందగా, ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు తుల్లూరి బ్రహ్మయ్య, వాంకుడోత్ దీపక్, బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
విత్తన దందాపై నజర్
● ఏపీ కేంద్రంగా తయారీ.. జిల్లాకు రవాణా ● అడ్డుకట్ట వేసేలా 14 చెక్పోస్టుల ఏర్పాటు ● పాత నేరస్తులపైనా నిఘాఖమ్మంవ్యవసాయం: వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న వేళ అక్రమార్కులు విత్తన దందాకు తెరలేపారు. రైతుల అవసరాలు, ఆతృతను సొమ్ము చేసుకునేలా రంగంలోకి దిగారు. విత్తన తయారీ, విక్రయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డాగా నిలుస్తుండగా.. అక్కడ కుటీర పరిశ్రమల మాదిరి నకిలీ విత్తనాలు తయారుచేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఏపీకి సరిహద్దుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండడంతో అక్కడి నుంచి విత్తనాలు తీసుకొస్తున్న మధ్యవర్తులు మాయమాటలతో రైతులకు అంటగడుతున్నారు. ఈ నేపథ్యాన రైతులెవరూ మోసపోకుండా వ్యవసాయ, పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఏపీ అడ్డాగా నకిలీ విత్తన దందా అధికోత్పత్తుల పేరుతో అక్రమార్కులు నకిలీ విత్తన దందాకు తెగబడుతున్నారు. ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణ విత్తనాలనే ఆకర్షణీయమైన ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నారు. మైలవరం, మండలం చంద్రుగొండ, తెనాలి, బాపట్ల తదితర ప్రాంతాల్లో అరుణోదయ లేబుల్తో రైబోజోల్ మిశ్రమంతో తయారు చేసిన విత్తనాలను మినీ పరిశ్రమల స్థాయిలో తయారుచేస్తున్నారు. ఆపై ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నారని తెలుస్తోంది.. గుట్టురట్టు చేసిన పోలీసులు ఏపీ అడ్డాగా సాగుస్తున్న విత్తన దందాను ఖమ్మం పోలీసు యంత్రాంగం గుర్తించింది. జిల్లాలోని ఏన్కూరు, మధిర మండలాలకు ఏపీ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న పత్తి విత్తన ప్యాకెట్లను గుర్తించి.. క్వింటాళ్ల మేర స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పత్తి విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్కు రూ.901 ధర నిర్ణయించగా... అక్రమార్కులు ఎక్కువ దిగుబడి వస్తుందంటూ రూ.1,200 చొప్పున వరకు విక్రయిస్తున్నారు. ఇక నిషేధిత బీటీ–3 విత్తనాల ప్యాకెట్లు రూ.2,600 వరకు కూడా విక్రయిస్తున్నట్లు తేలింది. రవాణా విభాగాలు, పాత నేరస్తులపై దృష్టి జిల్లాలో ఏర్పాటుచేసిన 21 టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. రవాణా సంస్థల గోదాములు, ప్యాకేజీ ఇండస్ట్రీలతో పాటు డీలర్ల గోదాముల్లోనూ తనిఖీలు చేపట్టారు. అంతేకాక గతంలో నకిలీ విత్తన దందాకు పాల్పడిన వారిపై పోలీస్ యంత్రాంగం నిఘా వేసింది. గతంలో కారేపల్లి, కొణిజర్ల, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో కొందరు అనుమతి లేని పత్తి, మిర్చి విత్తనాలు అమ్మారనే సమాచారంతో వారి కదలికలను పరిశీలిస్తున్నారు.చెక్పోస్టుల్లో తనిఖీలు నకిలీ విత్తనాలు జిల్లాలోకి రాకుండా సరిహద్దులు, టోల్ ప్లాజాల వద్ద వ్యవసాయ, పోలీసు యంత్రాంగం సంయుక్తంగా 14 చెక్ పోస్టులను ఏర్పాటుచేసింది. ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులతో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నేలకొండల్లి మండలం అప్పలనర్సింహాపురం, ముదిగొండ మండలం వల్లభి, వైరా మండలం గన్నవరం(నెమలి క్రాస్ రోడ్), బోనకల్ మండలం వత్సవాయి రోడ్డు, ఎర్రుపాలెం మండలం పెద్దాపురం క్రాస్ రోడ్డు, మధిర మండలం మధిర క్రాస్ రోడ్డు, వేంసూరు మండలం వెంకటాపురం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్, కూసుమంచి మండలం పాలేరు(సింగరేణిపల్లి టోల్ప్లాజా), వైరా మండలం పాలడుగు, కొణిజర్ల మండలం బస్వాపురం క్రాస్, కల్లూరు మండలం హనుమా తండా, పెనుబల్లి మండలం ముత్తగూడెంలో ఈ చెక్పోస్టులు ఏర్పాటయ్యాయి. చెక్ పోస్టుల వద్దే కాక ఇతర చోట్ల కూడా తనిఖీలు ముమ్మరంగా చేపడుతూ నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రణా ళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. -
జిల్లా వ్యాప్తంగా వాన
ఖమ్మంవ్యవసాయం: రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం ఉదయం 8–30 నుంచి శనివారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో సగటున 20.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కారేపల్లి మండలంలో 76.8 మి.మీ.లు, కామేపల్లి మండలంలో 73.4, తల్లాడలో 52.4, ఏన్కూరులో 49.2, పెనుబల్లిలో 38.2, వేంసూరులో 32.2, వైరాలో 20, కల్లూరులో 15.4, సత్తుపల్లిలో 10.6, కొణిజర్లలో 10.2 మి.మీ. వర్షపాతం నమోదైందని నివేదికలో పేర్కొన్నారు. -
‘బడిబాట’ పూర్తయ్యాక సర్దుబాటు చేయాలి
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో బడిబాట కార్యక్రమం పూర్తయ్యాకే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు శనివారం డీఈఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రభుత్వపాఠశాలలు బలోపేతం చేసే లా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలన్నారు. అంతే తప్ప అసంబద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలు పాటించాలనడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు విజయ, అమృత్కుమార్, రాయల నరసింహారావు, గిలకత్తుల వెంకటరమ ణ, జిల్లా ఉపాధ్యక్షులు లింగం సతీశ్ పాల్గొన్నారు సర్దుబాటు జీఓను సవరించాలి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 25లో లోపాలు ఉన్నందున సవరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ కోరారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు – విద్యార్థుల నిష్పత్తి సరిగా లేదని, ఇకనైనా ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు, నాయకులు వెంకటేశ్వరరావు, ఉమాదేవి, కోటేశ్వరరావు, గరికే శ్రీను, నాగిరెడ్డి, యాకూబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు. -
డెయిరీ ఫలాలతో ఆర్థికాభివృద్ధి
మధిర: ఇందిరా మహిళా డెయిరీ ద్వారా అందే యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ మహిళా లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్డీఓ సన్యాసయ్య సూచించారు. త్వరలో డెయిరీ ఏర్పా టు కానున్న నేపథ్యాన మధిరలోని కార్యాలయంలో శనివారం మహాజనసభ నిర్వహించగా డీఆర్డీఓ మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో డెయిరీ ఏర్పాటవుతోందని తెలిపారు. సభ్యత్వం కలిగిన వారికి సబ్సిడీపై రెండు చొప్పున పాడి గేదెలు ఇవ్వనుండగా, ఇప్పటి నుంచే దాణా సేకరణ, గడ్డి పెంపకంపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం డెయిరీలో నిబంధనల సవరణ, నూతనంగా పలువురికి సభ్యత్వం కల్పించడం, ఎర్రుపాలెం మినహా మిగిలిన నాలుగు మండలాల్లో పాలశీతలీకరణ కేంద్రాల ఏర్పాటు, నూతన పాలకవర్గం ఎన్నిక ప్రతిపాదనలపై చర్చించారు. సమావేశంలో ఏపీఎం జంగం లక్ష్మణ్రావుతో పాటు మామిళ్ల శ్రీనివాసరావు, కోటేశ్వర్రెడ్డి, మురళీకృష్ణ, అన్నపూర్ణ, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా భూసమస్యల పరిష్కారం
● రెవెన్యూ సదస్సులకు సిద్ధం కావాలి ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: భూ భారతి చట్టం ద్వారా రైతులు, ప్రజలకు సంబంధించి భూసమస్యల దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. వీటిని పరిశీలిస్తూ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇక ఈనెల 3నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని మిగిలిన అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు జరగనుండగా, ప్రతీ మండలానికి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యాన రెండేసి బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీరోజు సదస్సుల నిర్వహణపై నివేదిక ఇస్తూ, దరఖాస్తుదారులకు రశీదు అందించాలని తెలి పారు. కాగా, సదస్సు వేదికల వద్ద హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, సరిపడా దరఖాస్తులు సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఒకవేళ ఎవరి దరఖాస్తులైనా తిరస్కరిస్తే అందుకు కారణాలు స్పష్టంగా తెలియచేయాలని చెప్పారు. కాగా, ఆర్ఎస్ఆర్పీఓటీ, భూ సేకరణ కేసులు, సరిహద్దు వివాదాలు, పార్ట్ బీ కేసులు, అసైన్డ్ భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈసమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేందర్గౌడ్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.రేపటి నుంచి విధుల్లోకి జీపీఏలు గ్రామ పాలన అధికారులు(జీపీఓ) సోమవారం నుంచి విధుల్లోకి రానున్నారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 382 రెవెన్యూ గ్రామాలు ఉండగా, జీపీఓగా విధులు నిర్వర్తించేందుకు 255మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పరీక్షకు 225మంది హాజరుకాగా, అందులో 192మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నియామక పత్రాలు, పోస్టింగ్లు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఆపై 3వ తేదీ నుంచి గ్రామాల్లో జరిగే భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వీరు విధులు నిర్వహించే అవకాశం ఉంది. -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, కేజీ తరగతులు ప్రవేశపెట్టడంతో పాటు ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడం ద్వారా పాఠశాలలను బలోపేతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి కోరారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల వెలువరించిన టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలని డిమాండ్ చేశారు. అంతేకాక అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు నూతన ఆవాసాల్లో పాఠశాలలు ప్రారంభించాలన్నారు. వందలాదిగా సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యాన అర్హులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయాలని, కాలయాపన చేయకుండా పెండింగ్ టీఏలు, పీఆర్సీ విడుదల చేయాలని రవి డిమాండ్ చేశారు. అంతేకాక పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, కేజీబీవీ, సర్వశిక్ష ఉద్యోగ ఉపాధ్యాయులకు సరైన వేతనం చెల్లించాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, ఉద్దండ్ షరీఫ్, ప్రసాద్రావు, వీరస్వామి, వీరబాబు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి -
మత్స్య ఆధారిత ఉత్పత్తులతో అభివృద్ధి
కూసుమంచి: చేపల పెంపకం, అమ్మకానికే పరిమితం కాకుండా మత్స్య ఆధారిత ఉత్పత్తుల తయారీతో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని నేషనల్ ఆగ్రో ఫౌండేషన్(చైన్నె) జాయింట్ డైరెక్టర్ పి.ప్రకాష్ తెలిపారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల మహిళా మత్స్యకారులకు చేపలు, రొయ్యల ఆహార ఉత్పత్తుల తయారీపై ఇస్తున్న శిక్షణ శుక్రవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుదతూ చైనా, అమెరికా తదితర దేశాలతో పోలిస్తే మన దేశంలో చేపలతో తయారయ్యే విలువ ఆధారిత ఉత్పత్తులు తక్కువగా ఉన్నాయన్నారు. భవిష్యత్లో వీటికి డిమాండ్ పెరగనున్నందున మహిళా మత్స్యకారులు శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొంందించుకోవాలని సూచించారు. గ్రూప్లుగా ఏర్పడి చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, ఇతర ఉత్పత్తులు చేస్తే ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయొచ్చని తెలిపారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల కోఆర్డినేటర్ సునీల్కుమార్, జనగామ జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
30 అడుగుల బ్రిడ్జి.. కింద చెత్త
● లారీ ఢీకొనడంతో కింద పడిన కారు ● ఆపై టన్నుల కొద్దీ ఇనుపచువ్వల కట్టలు ● క్షణాల్లో కిందకు దిగడంతో ఐదుగురికి తప్పిన ముప్పుఇక్కడ మొదటి ఫొటోలో వేలాడుతున్న లారీలో టన్నుల కొద్ది 20 ఎం.ఎం. ఇనుప చువ్వల లోడ్ ఉంది. ఈ లారీ శుక్రవారం వైరా వైపు నుంచి తల్లాడ వైపునకు వెళ్తోంది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద హైలెవల్ వంతెనపైకి చేరుకుంటుండగానే తల్లాడ వైపు నుంచి కొబ్బరి బొండాల లోడ్తో వైరా వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ను అదుపు తప్పి అతివేగంగా ఢీకొట్టింది. అయితే, వ్యాన్ డ్రైవర్ అప్రమత్తతతో వంతెన రెయిలింగ్ను తాకి నదిలో పడకుండా (రెండో ఫొటో) ఆగిపోయింది. కారును సైతం.. వ్యాన్ను ఢీకొట్టాక లారీ అంతే వేగంగా వెళ్లి ఏపీలోని విసన్నపేట మండలం తెల్దారుపల్లి నుండి వైరా మండలం రెబ్బవరం వస్తున్న కారును సైతం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వంతెన పైనుంచి సుమారు 30అడుగుల లోతులో వైరా నదిలో పడింది. అదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోగా.. మున్సిపాలిటీ కార్మికులు డంప్ చేసిన చెత్త కుప్పలపై కారు పడడంతో అందులో ఉన్న మొగిలిశెట్టి కోటేశ్వరరావు కాలు విరిగింది. ఆయన కుమారుడు రాజశేఖర్, కోడలు గీత, మనవడు తేజస్, మనవరాలు జ్యోతి సురక్షితంగా బయటపడ్డారు. క్షణాల్లోనే మరో ముప్పు కోటేశ్వరరావు కుటుంబీకులు ప్రమాదం నుంచి తేరుకుని కిందకు దిగగానే.. అంతసేపు బ్రిడ్జి పైనుంచి వేలాడుతున్న లారీ కొద్దికొద్దిగా కిందకు జారుతూ కారు పక్కనే పడింది. ఈ సమయాన లారీలోని టన్నుల కొద్ది ఇనుప చువ్వల కట్టలు కారుపై పడడంతో గుర్తుపట్టలేనంత నుజ్జు నుజ్జయింది. అంతకు క్షణాల ముందే కోటేశ్వరరావు కుటుంబీకులు కిందకు దిగి కొంచెం దూరానికి చేరడంతో ఇదంతా కళ్లారా చూస్తూ తాము ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డామో ఊహించుకుంటూ షాక్కు గురయ్యారు. లారీ డ్రైవర్కు తీవ్రగాయాలు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఏపీలోని తిరువూరుకు చెందిన షేక్ మున్నా తీవ్ర గాయాలతో క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులు ఆయనను బయటకు తీసి 108 వాహనంలో ఖమ్మంలోని ప్రభుత్వాస్పతికి తరలించారు. ఈ ఘటనతో వైరా– తల్లాడ జాతీయ ప్రధాన రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఎస్సై పుష్పాల రామారావు ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని వంతెనపై ఆగిన డీసీఎం వ్యాన్ను జేసీబీతో పక్కకు తీయించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. కాగా, ప్రమాదం నుంచి బయటపడిన గీత స్వగ్రామం రెబ్బవరం కాగా, అత్తగారిల్లయిన ఏపీలోని విసన్నపేట నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం.. అంతా ముప్పు నుంచి బయటపడడంతో ఘటనాస్థలిలో పిల్లలతో కూర్చున్న ఆమె షాక్తో కనిపించింది. – వైరారూరల్12 -
ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమం
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకానికి తగినన్ని నిధులు కేటాయించకుండా.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నిన నేపథ్యాన చట్టం పరిరక్షణకు ఉద్యమించాలని సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆయా సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్లో శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడంతో పనిదినాలు తగ్గగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీ లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇకనైనా నిధులు, పనిదినాల సంఖ్య పెంచడమే కాక రైతు కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, శ్రీనివాసరావు, తాళ్లపల్లి కృష్ణ, వత్సవాయి జానకీరాములు, కొండెబోయిన నాగేశ్వరరావు, పొన్నగంటి సంగయ్య, కే.వీ.రెడ్డి, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, ఎస్.నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు
మార్కెట్లోకి ● ఏపీలో తయారీ.. జిల్లాకు తీసుకొచ్చి విక్రయం ● ఏన్కూరు, మధిరలో భారీగా నకిలీ, నిషేధిత విత్తనాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీపీ సునీల్దత్ఏన్కూరు: కుటీర పరిశ్రమ మాదిరి ఇళ్లలోనే నకిలీ పత్తి విత్తన తయారుచేస్తూ విక్రయిస్తున్న పలువురిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మూడు ఘటనల్లో రూ.లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఏన్కూరు పోలీసుస్టేషన్లో శుక్రవారం పోలీసు కమిషనర్ సునీల్దత్ వెల్లడించారు. ఏన్కూరుకు చెందిన గాజుల నరసింహారావు అనుమతి లేని పత్తి విత్తనాలు అమ్ముతున్నాడనే సమాచారంతో ఈనెల 28న తనిఖీలు చేపట్టారు. ఆయనను విచారించగా ఏపీలోని మైలవరం మండలం చంద్రుగూడెంకు చెందిన శాలివాహన ఇంటి వద్ద పత్తి విత్తనాలు తయారు చేస్తున్నట్లు తేలింది. సదరు వ్యక్తి కర్ణాటక నుంచి విత్తనాలు తీసుకొచ్చి రైబోజోల్ మిశ్రమాన్ని కలిపి నరసింహారావుకు పంపుతున్నాడని, ఆపై ఏజెంట్లకు లాభాల ఆశ చూపి కలుపు, తెగుళ్లను తట్టుకుంటాయని నమ్మబలుకుతూ ప్యాకెట్ రూ.1,200 చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. శాలివాహన ఇంటి వద్ద క్వింటా రైబోజోల్ మిశ్రమం కలిపిన ప్యాక్ చేయని పత్తి విత్తనాలు, 450 గ్రాముల బరువు కలిగిన అరుణోదయ లేబుల్తో ఉన్న 272 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా ఏపీ నుంచే... ఏన్కూరు మండలం రేపల్లెవాడలోని వెనిగండ్ల శ్రీఽహరిరావు వ్యవసాయ భూమిలో 210 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. ఆపై శ్రీఽహరిరావు అనుచరుడు ఇమ్మనేని కిషోర్ ఇంట్లో తనిఖీ చేస్తే 120 కేజీల పత్తి విత్తనాలను గుర్తించారు. శ్రీహరిరావు ఏపీలోని తన బంధువు లక్ష్మీనారాయణ ద్వారా కేజీ రూ.800 చొప్పున నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రూ.2,600 చొప్పున అమ్ముతుండడంతో శ్రీహరిరావు, కిషోర్తో పాటు ఏపీకి చెందిన అన్నెం లక్ష్మీనారాయణ, సిబ్బంది గుగులోత్ గోపీ, వరదబోయిన రమేష్, తంబళ్ల నవీన్, దొంతబోయిన రమేష్ను అరెస్టు చేసి 330 కేజీల నకిలీ పత్తి విత్తనాలు, ప్యాకింగ్, వేయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏన్కూరుకు చెందిన పోలేటి కోటేశ్వరరావు ఇంట్లో తనిఖీ చేపట్టగా 20 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు లభించాయి. ఆయన ఏపీలోని తెనాలి నుంచి అనుమతి లేకుండా విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కోటేశ్వరరావుతో పాటు ఆయనకు విత్తనాలు సరఫరా చేస్తున్న ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన వెనిగండ్ల రవిని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో కల్లూరు ఏసీపీ రఘు, కల్లూరు రూరల్ సీఐ ముత్తులింగం, ఎస్సైలు షేక్ రఫీ, హరిత పాల్గొన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో... మధిర: మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో ప్రభుత్వం నిషేధించిన బీజే–3 పత్తి విత్తనాలు ప్యాకెట్లను శుక్రవారం టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పారా రామస్వామి ఓ ఫెర్టిలైజర్స్ కంపెనీలో పని చేస్తుండగా ఆయన ఇంట్లో నిషేధిత పత్తి విత్తనాలు, పురుగు మందులు ఉన్నాయనే సమాచారంతో మధిర టౌన్ సీఐ రమేష్, వ్యవసాయ అధికారి సాయిదీక్షిత్, ఎస్ఐ లక్ష్మీభార్గవి ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈమేరకు బీజే–3 అరుణోదయ పత్తి విత్తనాల ప్యాకెట్లు మూడు, అనుమతి లేకుండా విక్రయిస్తున్న రూ.65 వేల విలువైన పురుగు మందులు లభ్యమయ్యాయి. ఆయన నిదానపురంలో చెందిన బాధ పాపిరెడ్డి వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లు చెప్పగా విచారణలో ఏపీలోని మైలవరం మండలం గంగినేనికి చెందిన నరేష్ వద్ద తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. ఈమేరకు బాధ్యులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
రైల్వేట్రాక్ పక్కన మృతదేహం గుర్తింపు
బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఏ) రైల్వేట్రాక్ సమీపాన ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. పదిహేను రోజుల క్రితం సదరు యువకుడు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తెలుస్తుండగా దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రైల్వే పోలీసులు శుక్రవారం పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా, ఆ పక్కనే లభించిన సెల్ఫోన్లో ఉన్న నంబర్లకు ఫోన్ చేయడంతో మృతుడు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం సీతారాంపురం వాసి నేతుల అనిల్బాబు(20)గా తేలింది. ఈ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇచ్చి నట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు సాయంతో ఖమ్మం మార్చురీకి తరలించారు. గుండెపోటుతో రైతు మృతికారేపల్లి: పంటల సాగు పనుల్లో నిమగ్నమైన రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన కామేపల్లి మండలం మంగళితండా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పిల్లలమర్రి వెంకటేష్(30) రెండున్నర ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, వరి సాగుకు ఏర్పాట్లుచేసుకుంటున్నాడు. ఈక్రమాన శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పగా గుండెపోటుగా గుర్తించిన కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి...చింతకాని: అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని తిమ్మినేనిపాలెంకు చెందిన తుడం రవి(55) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈనేపథ్యాన ఆయన భార్య పొలం పనులకు వెళ్లిన సమయాన గురువారం పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. -
ప్రత్యేకంగా పర్యాటక అభివృద్ధి
● ఎకో టూరిజంలో ‘కనకగిరి’కి స్థానం ● భద్రాచలం, కిన్నెరసాని, పులిగుండాల అనుసంధానానికి ప్రణాళిక ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెనుబల్లి: జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నందున, ఈ రంగంలో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తద్వారా పర్యాటక రంగానికే కాక స్థానికులకు ఆదాయం పెరగనుందని చెప్పారు. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు వద్ద అటవీశాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఎకో టూరిజం ప్రాజెక్టును కలెక్టర్ ముజ్మమిల్ఖాన్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో పాటు అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. బ్రహ్మళకుంట అటవీప్రాంత సమీపాన పులి గుండాల సాగునీటి ప్రాజెక్టు వద్ద రూ.20 లక్షలతో చేపట్టిన టూరిజం పనులను పరిశీలించాక, టూరిస్టుల కోసం బస్సును ప్రారంభించారు. రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు పులిగుండాల వద్ద సుమారు 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎకోటూరిజం ప్రాజెక్టుగా గుర్తించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలోని వికారాబాద్, ఆదిలా బాద్ జిల్లాలతో పాటు జిల్లాలోని పులిగుండాల ప్రాజెక్టు వరకు కనకగిరి గుట్టల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వీటన్నింట్లో పులిగుండాల ప్రాజెక్టును కీలకంగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సుమారు రూ.7 కోట్ల నిధులతో ఎకో టూరిజం పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు. కాగా, పెనుబల్లి మండలంలో ఇటీవల పోడు పేరుతో అడవులు నరుకుతున్నట్లు తెలి సిందని.. ఇలాంటి వారిపైనే కాక నిర్లక్ష్యంగా వహించే సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్టు పరిధిలో చిరుతపులి, ఎలుగుబంటి, తోడేలు వంటివే కాక 120 రకాల పక్షి జాతులు సంచరిస్తున్నందున పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. పులిగుండాల ప్రాజెక్టు నుండి అటవీ మార్గం ద్వారా భద్రాచలం వరకు వెళ్లేలా రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు భద్రాచలం, కిన్నెరసాని, పులిగుండాల ప్రాజెక్టులను అనుసంధానానికి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ అటవీ, పర్యాటక శాఖల మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు సహకారంతో పులిగుండాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మట్టా దయానంద్తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ డీఎస్పీకి క్యాష్ రివార్డు
ఖమ్మంక్రైం: ఏసీబీ డీఎస్పీ రమేష్కు విధినిర్వహణలో అభినందనలు దక్కాయి. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఉమ్మడి జిల్లాలో అత్యధిక కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యాన హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీఎస్పీకి ఏసీబీ డీజీపీ విజయకుమార్ క్యాష్ రివార్డు అందజేసి అభినందించారు.బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులుఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఐదో తరగతి(రెసిడెన్షియల్), ఒకటో తరగతి(డే స్కాలర్)లో ప్రవేశానికి వచ్చేనెల 2నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఐదో తరగతిలో 131 మంది, ఒకటో తరగతిలో 128 మందికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి మార్కుల జాబితా, ఒకటి తరగతిలోనైతే పుట్టినతేదీ ధ్రువపత్రం, రేషన్కార్డు లేదా ఆధార్కార్డు జిరాక్స్, మీ సేవ ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాలను దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలిపారు.ముగిసిన ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియఖమ్మంమయూరిసెంటర్: భద్రాద్రి జోన్ పరిధి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తిచేశామని జోనల్ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఖమ్మంలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ కళాశాల(బాలికలు)లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకున్న 1,165 మంది అభ్యర్థుల్లో 700 మంది హాజరయ్యారని వెల్లడించారు. విద్యార్హతలు, ప్రతిభ, డెమో ఆధారంగా తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీ చేపట్టామని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.కొనసాగుతున్న ‘దోస్త్’ ప్రవేశాలుఖమ్మం సహకారనగర్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో భాగంగా సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. లేనిపక్షంలో వారు సీటు కోల్పోతారని పేర్కొన్నారు. ఇక రెండో విడత ప్రవేశాల కోసం జూన్ 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దోస్త్ కోఆర్డినేటర్ ఎం.డీ.సలీంపాషా ఓ ప్రకటనలో వెల్లడించారు.లబ్ధిదారులకు అండగా నిలుస్తాం..మధిర: ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు యంత్రాగగం అన్నివిధాలుగా సహకరిస్తుందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.శ్రీనివాసరావు తెలిపారు. మధిర మండలం సిరిపురం, వంగవీడు గ్రామాల లబ్ధిదారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పశుగ్రాసం ఆవశ్యకత, గేదెల ఎంపిక, అధిక పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. త్వరలో యూనిట్లు అందనున్నందున ఇప్పటి నుంచే పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, అధిక పాల దిగుబడి వచ్చేలా మేలైన గేదెలను ఎంపిక చేసుకుని, పాలను ప్రభుత్వ కేంద్రాలకు సరఫరా చేయాలని తెలిపారు. ఆపై లబ్ధిదారుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఉమాకుమారి, గ్రామ దీపికలు పాల్గొన్నారు. -
విపత్తు వేళ ప్రణాళికే కీలకం
ఖమ్మం సహకారనగర్: ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ప్రణాళికాయుతంగా పనిచేస్తే ప్రజల ప్రాణాలతో విలువైన ఆస్తులు నష్టపోకుండా కాపాడొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో పాటు ‘ఆపద మిత్ర’లుగా ఎంపిక చేసిన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది వరద వచ్చిన సమయాన అందరూ సమష్టిగా పనిచేయడంతో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడడమే కాక 15రోజుల వ్యవధిలో సాధారణ పరిస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. ఈసారి కూడా మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షం వివరాలు ఎప్పటిప్పుడు తెలుసుకుంటూ, వరద వచ్చే అవకాశముంటే గ్రామం నుంచి జిల్లా వరకు వివిధ స్థాయిల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం చేరవేస్తామని చెప్పారు. అంతేకాక కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి సంబంధిత ప్రాంతాలకు సమాచారం చేరవేసి రెస్క్యూ బృందాలతో పాటు వలంటీర్లను రంగంలోకి దించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇళ్లు, ఒంటరి మహిళలు, వృద్ధులను గుర్తించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకుబ్యాగ్లు పంపిణీ చేసి ముఖ్యమైన పత్రాలు, ఆభరణాలు భద్రపర్చుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆపద మిత్రలకు కలెక్టర్ సామగ్రి అందజేశారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, సీపీఓ ఏ.శ్రీనివాస్, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ -
ఉత్సాహంగా క్రీడా శిక్షణ
● జిల్లా కేంద్రంలో 21 అంశాల్లో శిబిరాల నిర్వహణ ● నేటితో ముగియనున్న వేసవి శిక్షణఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యాన నెల రోజులుగా జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శనివారం ముగియనున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగానే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ఈ శిబిరాలు ఏర్పాటుచేశారు. దీంతో పెద్దసంఖ్యలో ఔత్సాహిక క్రీడాకారులతో స్టేడియం ఇన్నాళ్లు కళకళలాడింది. స్టేడియంలో 21 క్రీడాంశాల్లో ఇచ్చిన శిక్షణకు పెద్దసంఖ్యలో బాలబాలికలు హాజరయ్యారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, లాన్ టెన్నిస్, ఖో–ఖో, నెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, క్రికెట్, ఉషూ, కరాటేలో శిక్షన్న తీసుకున్న పలువురు సెలవులు ముగిశాక కూడా శిక్షణ కొనసాగిస్తామని చెబుతుండడం విశేషం. కాగా, పెవిలియన్గ్రౌండ్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ మైదానాల్లో కొన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చారు. శిబిరాల్లో 1,672 మంది ఔత్సాహికులు పాల్గొనగా వర్ధమాన క్రీడాకారులు మరో 300 మంది ఉంటారని అధికారులు తెలిపారు. ఎక్కువగా బాలురే... వివిధ క్రీడల్లో ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు బాలికలతో పోలిస్తే బాలురే ఎక్కువగా వచ్చారు. మొత్తంగా బాలురు 1,216 మంది హాజరు కాగా, బాలికలు 456 మంది పాల్గొన్నారు. అత్యధికంగా స్విమ్మింగ్ శిక్షణకు 580 మంది హాజరయ్యారు. అలాగే, రోలర్స్కేటింగ్కు 177 మంది బాలబాలికలు, బాస్కెట్బాల్కు 104 మంది, క్రికెట్ 100మంది, అథ్లెటిక్స్కు 85మంది, వాలీ బాల్కు 80 మంది, బ్యాడ్మింటన్కు 80 మంది, టెన్నిస్కు 79 మంది హాజరు కాగా మిగిలిన క్రీడాంశాల్లో 40మందికి తగ్గకుండా పాల్గొన్నారు. గతంతో పోలిస్తే ఈసారి గణనీయంగా క్రీడాకారులు రావడంతో కోచ్లు ఉత్సాహంగా శిక్షణ ఇచ్చారు.మంచి స్పందన వచ్చింది... జిల్లా కేంద్రంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అనూహ్యమైన స్పందన లభించింది. అనుకున్న దాని కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. వీరిలో కొందరైనా నిత్యం శిక్షణ కొనసాగిస్తే మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి రాడం ఖాయం. ఈ విషయమై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. – టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓ -
అనుమతులు లేని లేఔట్ల పరిశీలన
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా వేసిన లే ఔట్లను గుర్తిస్తున్నట్లు టీపీబీఓ కె.రాజు తెలిపారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘రియల్’ దందా..’ శీర్షికన ప్రచురితమైన కథనంతో కమిషనర్ కె.నర్సింహ స్పందించారు. ఆయన ఆదేశాలతో టీపీబీఓ రాజు పలు వెంచర్లను తనిఖీ చేశారు. సత్తుపల్లిలోని అయ్యగారిపేట, కొమ్మేపల్లి కాలనీ సమీపాన రియల్ ఎస్టేట్ వెంచర్లను పరిశీలించి అనుమతులపై ఆరా తీశారు. అనుమతి లేని వెంచర్లకు సంబంధించి అధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పోక్సో కేసు నమోదుచింతకాని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం వేధించాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. -
విత్తన ఎంపికే కీలకం
● అనుమతి ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి ● భూమి పదునెక్కాక సాగు చేస్తే మేలు ● సమగ్ర యాజమాన్య పద్ధతులతో ఉత్తమ దిగుబడి ● ‘సాక్షి’ ఫోన్ ఇన్లో డీఏఓ పుల్లయ్య, కేవీకే కోఆర్డినేటర్ రవికుమార్ ఖమ్మంవ్యవసాయం: ‘పంటకు విత్తే మూలం.. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలను అవలంబిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయి..’ అని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, వైరా కేవీకే కో–ఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన ఫోన్ ఇన్లో జిల్లా నలుమూలల నుంచి రైతులు సాగుకు అనువైన విత్తనాలు, అందుబాటులో ఉన్న రకాల వివరాలే కాక సాగు విధానాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన కంపెనీలు, ఏజెన్సీలు, సంస్థలకు చెందిన విత్తనాలే కొనుగోలు చేయాలని సూచించిన అధికారులు పంట కాలం పూర్తయ్యే వరకు రశీదులు భద్రపర్చుకోవాలని తెలిపారు. ఈమేరకు రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి. ●ప్రశ్న : ప్రస్తుత వర్షాలకు వరి నార్లు పోసుకోవచ్చా? ఏ రకం విత్తనాలు మేలు? – గరిడేపల్లి రామారావు, సుర్దేపల్లిజవాబు : జూన్ మొదటి వారం తర్వాత వరినార్లు పోసుకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన సన్న రకాలను విత్తుకుంటే మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుంది. ●ప్ర : పచ్చిరొట్ట విత్తన ధరలు గత ఏడాదితో పోలిస్తే పెంచారు.– అయినాల కనకరత్నం, కేజీపురం, మల్లేశ్వరరావు, భీమవరం జ : విత్తనోత్పత్తి తగ్గడంతో కొంత మేర ధర పెరిగింది. ప్రభుత్వ సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ●ప్ర : యూరియాకు సబ్సిడీ ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు సైతం మరింత సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఉందా?– షేక్ లాల్ మహ్మద్, ఖానాపురంజ : యూరియా వాడకం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. కాంప్లెక్స్ ఎరువుల్లోనూ యూరియా పాళ్లు ఉంటాయి. ఫార్మర్ ఐడీ విధానం అమలైతే భూమి ఆధారంగా కోటా నిర్ధారించే అవకాశం ఉంది. ●ప్ర : పెసర ఎప్పుడు, ఏ రకాలు విత్తుకోవచ్చు? – ఏటుకూరి రవి, నాగులవంచ, జంగా రవీందర్రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం జ : ఇప్పుడు దుక్కులు సిద్ధం చేసుకుని 60 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యాక జూన్ మొదటి వారం నుంచి పెసర విత్తుకోవచ్చు. ఎంజీజీ రకాలు అందుబాటులోకి వచ్చాయి. ●ప్ర: పంటల సాగుపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారా? – శ్రీనివాసరెడ్డి, రామానుజపురంజ : రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లైసెన్స్డ్ డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే నకిలీల బెడద ఉండదు. ●ప్ర : వరిలో కేఎన్ఎం 7715 రకం అందుబాటులోకి వస్తాయా? – ఏలూరి వెంకట్రావు, కొక్కిరేణిజ : ఈ విత్తనాలను వ్యవసాయ విశ్వ విద్యాలయం ఇంకా రిలీజ్ చేయలేదు. ●ప్ర: ఆయిల్పామ్లో మొక్కజొన్నను అంతర పంటగా వేసుకోవచ్చా? – కన్నెబోయిన రామకృష్ణయాదవ్, బస్వాపురం జ : 19 నెలల వయసు ఉన్న తోటలో అంతర పంటగా మొక్కజొన్న కంటే కూరగాయలు, పెసర, మినుము సాగు మేలు. దుక్కి ఎక్కువగా దున్నకూడదు. అలా చేస్తే ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. యాసంగి పంటగా మాత్రం మొక్కజొన్నకు అవకాశముంది. ●ప్ర : మెట్ట వరి సాగులో అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏవీ? – వరదా సైదులు, కొక్కిరేణిజ : మెట్టలో వరి సాగు చేస్తే అంతగా దిగుబడులు రాకపోగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. కలుపు, తెగుళ్ల సమస్యలు ఉంటాయి. అలాగే, ఆరుతడి వరి సాగులో ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ●ప్ర : పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? – శీలం సత్యనారాయణ రెడ్డి, ఎర్రుపాలెంజ : రైతుల కోసం అందుబాటులో ఉంచే పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పడితే సహించేది లేదు. ఎవరైనా సరైన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తీసుకున్న విత్తనాలపై అవసరమైన ప్రాంతాల్లో క్రాప్ బుకింగ్ చేయిస్తాం. ●ప్ర : ఈ వర్షాలతో పత్తి సాగు చేయొచ్చా? పెసలు ఎప్పుడు వేసుకోవచ్చు? – చాంద్పాషా, ముష్టికుంట్ల, సైదారావు, తనికెళ్ల, డి.తిరుపతిరావు, రాజులదేవరపాడు జ : ఈ ఏడాది రోహిణి కార్తెలోనే వానలు కురుస్తున్నాయి. నేలలో పదును ఆధారంగా జూన్ 10 తర్వాత పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. పెసర కూడా జూన్ రెండో వారం నుంచి విత్తుకోవచ్చు. పెసరలో ఎంజీజీ రకాలు, వరంగల్ రకాలు అనుకూలం. ●ప్ర: ప్రస్తుత వర్షాలకు మెట్ట పైరుగా పత్తి సహా ఏయే పంటలు వేసుకోవచ్చు? – శ్యాంసుందర్ రెడ్డి, గైగోళ్లపల్లిజ : ఈ వర్షాలకు నేల రకాల ఆధారంగా మెట్ట పంటలుగా పత్తి, పెసర సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం పత్తి వేసిన నేలలో యాసంగి పంటగా మొక్కజొన్న వేసుకునే అవకాశముంది. ●ప్ర : ఎరువులు పాత నిల్వలు ఇస్తుండడంతో గడ్డలుగా ఉంటున్నాయి. వరిలో సన్న రకాల విత్తనాలు లభ్యం కావడం లేదు. – నంద్యాల మాధవరావు, తిమ్మినేనిపాలెంజ : ఎరువుల నిల్వలు అయిపోయాయి. ఇకపై గడ్డ కట్టిన ఎరువుల సరఫరా ఉండదు. రేక్ పాయింట్ కూడా మారింది. వరిలో సన్న బీపీటీ 5204 సాంబమసూరితో పాటు పలు సన్న రకాలు అందుబాటులోకి వచ్చాయి.ప్ర : విత్తనాలు నకిలీవా, మంచివా ఎలా గుర్తించాలి?– భూక్యా రాంబాబు, చంద్రశేఖర్, సింగరేణి మండలం జ: లైసెన్స్డ్ దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయడమే కాక అన్ని వివరాలతో రశీదు తీసుకోవాలి. అపరిచిత వ్యక్తులు మాయమాటలతో అమ్మే విత్తనాలు నకిలీవని భావించాలి.ప్ర : వరిలో 1224 రకాన్ని సాగు చేస్తే విక్రయానికి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడేం చేయాలి?– పోతురాజు నర్సింహారావు, తుమ్మలపల్లిజ : 1224 కాకుండా ఇతర సన్న రకాల సాగు మంచిది. ఎంటీయూ 1010 వంటి అనేక రకాలు ఉన్నాయి. -
కల్లూరు.. ఇకపై మున్సిపాలిటీ!
కల్లూరు: కల్లూరు మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ కొన్నాళ్ల క్రితం నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఇకపై కల్లూరు మున్సిపాలిటీగా మనుగడలోకి రానుంది. అంతేకాక ఇన్చార్జ్ కమిషనర్గా మధిర మున్సిపల్ కమిషనర్ అరెగెల సంపత్కుమార్ నియమించగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అలాగే, స్పెషల్ ఆఫీసర్గా ఇల్లెందు కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ను కేటాయించారు. కల్లూరును మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేయాలని స్థానికులతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి వినతితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదింపజేశారు. కప్పలబంధం, పుల్లయ్యబంజర, తూర్పు లోకవరం, పడమర లోకవరం, కిష్టయ్యబంజర, హనుమాతండా, వాచ్చానాయక్ తండాల విలీనంతో కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈమేరకు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సంపత్కుమార్ను పంచాయతీ ఈఓ నందిశెట్టి నాగేశ్వరరావు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్చార్జ్ కమిషనర్గా సంపత్కుమార్ -
ముగిసిన ఎన్సీసీ శిక్షణా శిబిరం
వైరా: వైరా శాంతినగర్లోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో పది రోజులుగా నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఎన్సీసీ ఆఫీసర్లు కల్నల్ ఎస్.కే.భద్ర, కల్న ల్ నవీన్ యాదవ్ నేతృత్వాన కేడెట్లకు దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపు, శారీరక ధృడత్వం తదితర అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. ఈ సందర్భంగా చివరిరోజు భద్ర, నవీన్యాదవ్ మాట్లాడుతూ దేశ రక్షణలో సైన్యం పాత్రపై అవగాహన కల్పించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన కేడెట్లకు బహుమతులు అందించగా, అధికారులకు న్యూలిటిల్ ఫ్లవర్స్ పాఠశాల కరస్పాడెంట్ డాక్టర్ పి.భూమేష్ జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఆఫీసర్ సీహెచ్.అపురూపాదేవి, ఉద్యోగులు పాల్గొన్నారు.ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా డీఈఓ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యాన 15 రోజులుగా మూడు దశల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ మేరకు డీఈఓ, రిసోర్స్ పర్సన్లను పలువురు సన్మానించారు. ఏఎంఓ రవికుమార్ పాల్గొన్నారు.నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుసత్తుపల్లి/వేంసూరు: పంటల సీజన్ మొదలైన నేపథ్యాన ఎవరైనా అనుమతి లేని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య హెచ్చరించారు. సత్తుపల్లి పట్టణంతో పాటు వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన విత్తనాల షాపుల్లో తనిఖీ చేశారు. షాప్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రాన్స్పోర్టు కార్యాలయాలను పోలీస్ అధికారులతో కలిసి తనిఖీ చేయగా డీఏఓ మాట్లాడారు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవని తెలిపారు. రైతులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తనిఖీల్లో ఏడీఏ శ్రీనివాసరెడ్డి, ఏఓలు శ్రీనివాసరావు, రామ్మోహన్, ఏస్సైలు రఘు, అశోక్, ఏఈఓలు కావ్య, నవ్య, రీమా, స్వాతి, అక్షర తదితరులు పాల్గొన్నారు.గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్ముదిగొండ: ముదిగొండలోని పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఓ.మురళి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉమేష్కుమార్, రింకూ కుమార్ ముదిగొండ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఇటీవల వారు స్వగ్రామం నుండి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి పలువురికి అమ్ముతున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే శుక్రవారం గుమ్మడిద సత్యనారాయణ కిరాణా షాపు వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా 280 గంజాయి చాక్లెట్లు లభించాయి. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.12 మంది మైనర్లకు జరిమానాఖమ్మంక్రైం: వాహనాలు నడిపిన 12మంది మైనర్లకు రూ.200 చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిందని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో చేపట్టిన తనిఖీల్లో వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు. దీంతో వారికి జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి.రజని తీర్పు చెప్పారని వెల్లడించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, తల్లిదండ్రులెవరూ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. -
కేన్సర్ బాధితులకు బేఫికర్
● జిల్లా కేంద్రంలోనే చికిత్సకు ఏర్పాట్లు ● పెద్దాస్పత్రిలో సిద్ధమవుతున్న 20 పడకల వార్డు ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో కేన్సర్ బారిన పడిన పేదల ఇక్కట్లు తీరనున్నాయి. ప్రభుత్వ వైద్యం కోసం హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోని చికిత్స అందుబాటులోకి రానుంది. కేన్సర్ సోకి చివరి దశలో ఉన్న వారికే ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఇకపై కేన్సర్ నిర్ధారణ, కీమోథెరఫీ, ఇతర చికిత్స కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో వార్డు కేన్సర్ బారిన పడిన కొందరికి కీమోతోపాటు రేడియేషన్ థెరపీ అవసరమవుతుంది. కానీ ప్రభుత్వ పరంగా ఆ సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్కి వెళ్లాల్సి వస్తోంది. నాన్ కమ్యూనబుల్ డిసీజ్ ప్రోగ్రామ్ ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తుండగా.. మహిళా ఆరోగ్య కార్యక్రమం ద్వారా బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ కేన్సర్ బాధితుల గుర్తింపు కొనసాగుతోంది. వీరిలో వ్యాధి ప్రారంభ దశలో ఉంటే జిల్లాలోనే చికిత్స అందిస్తుండగా, సీరియస్ కేసులకు ప్రత్యేకంగా వార్డు లేదు. దీంతో కీమో, రేడియేషన్ థెరఫీ కోసం వారిని హైదరాబాద్ పంపిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేన్సర్ బాధితులు పెరుగుతున్న నేపథ్యాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 20 పకడలతో కేన్సర్ వార్డు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ వార్డును అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. చివరి దశలో ఉంటే.. జిల్లాలో కేన్సర్ బారిన పడి చివరి దశలో ఉన్న వారికి పెద్దాస్పత్రిలోని పాలియేటివ్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఈ సెంటర్లో కేవలం ఏడు పడకలే ఉన్నాయి. హైదరాబాద్లో చికిత్స చేయించినా ఫలితం లేక జీవిత చరమాంకానికి చేరిన వీరికి ఈ సెంటర్లో చికిత్స అందించడమే కాక ఇంకొందరికి మొబైల్ వాహనం ద్వారా మందులు ఇస్తున్నారు.ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పెద్దాస్పత్రిలో 20 పడకలతో కూడిన కేన్సర్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. జిల్లాలో ప్రస్తుతం 3వేల మంది వరకు కేన్సర్ బాధితులు ఉన్నట్లు అంచనా. ఆస్పత్రిలో ప్రత్యేక వార్డుతో పాటు కీమో, రేడియేషన్ థెరపీ సేవలు మొదలైతే ప్రభుత్వ వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన ఇక్కట్లు తీరనున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
కొణిజర్ల: కారు. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ వెల్ల డించిన వివరాల మేరకు... ఏపీలోని చింతలపూడి నుంచి శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్న కారును తనికెళ్ల సమీపాన ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అంతేకాక కొణిజర్ల నుంచి ఖమ్మం వెళ్తున్న ఆటోనూ ఢీకొట్టడంతో బోల్తా పడింది. కారు డ్రైవర్ కోడూరి సునీల్, అందులో ఉన్న చింతలపూడికి చెందిన వెంకటేశ్వరరావు, పార్వతికి గాయలయ్యాయి. అలాగే, ఆటోడ్రెవర్ చింతకాని మండలం నేరడకు చెందిన తాటి లోకేష్, కొణిజర్లకు చెందిన పందిళ్ల వెంకటేశ్వర్లు, మరో వ్యక్తి గాయపడ్డారు. అయితే, ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్ రోడ్డుపైనే వాహనం వదిలేసి పరారయ్యాడు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. ఉరి వేసుకుని ఆత్మహత్యచింతకాని: మండలంలోని పొద్దుటూరుకు చెందిన తుడుం ఎల్లేష్(33) ఉరి వేసుకుని బలవన్మరణానికి బలపడ్డాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆయన కరెంట్ వైరుతో దూలానికి ఉరి వేసుకున్నాడు. ఎల్లేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఖమ్మంలో యువతి... ఖమ్మంక్రైం: ఖమ్మం జూబ్లీ క్లబ్ సమీపంలో నివసిస్తున్న బంక కస్తూరి(25) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. ఆమె తల్లి ఇచ్చిన సమాచారంతో ఖమ్మం త్రీటౌన్ పోలీసులు పరిశీలించారు. కస్తూరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
పకడ్బందీగా ప్రాధాన్యతా పథకాలు
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో భట్టితో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ఽవర్షాకాల ఆరోగ్య కార్యాచరణ, సాగు ప్రణాళికలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తొలుత ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి.పాటిల్ జిల్లాల వారీగా పథకాలు అమలు నివేదికలు వెల్లడించారు. నకిలీలు అమ్మితే కఠిన చర్యలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలోకి నకిలీలు రాకుండా ఏపీ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా, రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అలాగే, భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఆయన జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై సూచనలు చేశారు. అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలను తొలి దశలో అరికట్టడమే కాకుండా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేయాలని, జాబితాలో అర్హుల పేర్లే ఉండేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ఆశాజనకంగానే ఉన్నా మరింత పెరగాలని సూచించారు. ఇక రుతుపవనాలు ముందుగా వచ్చినందున సరిపడా ఎరువులు, విత్తనాలు సమకూర్చాలని తెలిపారు. ఎక్కడా కొరత రావొద్దు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని తెలిపారు. నిల్వలను తరచుగా పరిశీలిస్తూ ఎక్కడా బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చూడాలని సూచించారు. అనర్హులు ఉంటే అధికారులపై చర్యలు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉన్నట్లు తేలితే బాధ్యులైన గెజిటెడ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసైన్డ్ భూముల్లో పొజిషన్లో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నందున ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అలాగే, సాదా బైనామా దరఖాస్తుల్లో ప్రభుత్వ భూములు ఉంటే తిరస్కరించాలని తెలిపారు. కాగా, జూన్ 3నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పారు. కాగా, జూన్ 10 లోపు పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే కాక లబ్ధిదారులకు అవసరమైన ఇసుక టోకెన్ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని తెలిపారు. అంతేకాక సగంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తిచేయించాలన్నారు. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఏ ఒక్క అనర్హుడికి ఇల్లు దక్కినా బాధ్యులపై చర్యలు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రత్యేక దృష్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి ఇంకా ఎవరేం అన్నారంటే.... ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు మరోమారు జరగకుండా ప్రణాళిక రూపొందించాలని కోరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కింద బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని కోరారు. అలాగే, ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులను కేటాయించాలని సూచించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించటంతో పాటు వైద్యులను, సిబ్బందిని పెంచాలని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని.. ఎమ్మెల్యేల సిఫారసులు పరిగణనలోకి తీసుకోకుండా ఇందిరమ్మకమిటీలు, అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంకా సమావేశంలో ఖమ్మం పోలీస్ కమి షనర్ సునీల్దత్, భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్ రాజ్, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్లు పి.శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, వివిధ శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆదివాసీల అంతానికి కేంద్రం కుట్ర
● అటవీ సంపదను సంపన్నులకు దోచిపెట్టే ప్రయత్నం ● ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సీతక్క పాల్వంచరూరల్ : ఆదివాసీ జాతిని అంతం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఆదివాసీ సమ్మేళనాన్ని గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మణిపూర్, అసోం, నాగాలాండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల్లో ఆది వాసీలపై కేంద్ర ప్రభుత్వం పలు ఆపరేషన్ల పేరుతో దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఐదు, ఆరు చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే స్థానిక గిరిజనులతో గ్రామసభలు నిర్వహించి అమోదించాక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేకుండానే మోడీ ప్రభుత్వం ఖరీదైన అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని, ఎదురుతిరిగిన వారిపై నక్సలైట్లు అనే ముద్ర వేసి అడ్డు తొలగిస్తోందని ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీడీఏలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నాడు రద్దు చేసిన జీఓలను తిరిగి తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని, ఐటీడీఏలకు పూర్వ వైభవం తీసుకొస్తామని వివరించారు. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాలి.. రాజ్యాంగ పరిరక్షణకు ఆదివాసీలు ఉద్యమించాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరామ్ నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ.. గిరిజన చట్టాలు, హక్కులపై అందరికీ అవగాహన ఉండాలని, ఇలాంటి శిక్షణ తరగతుల్లో వాటి గురించి తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా అమలు చేయకుండా బీజేపీ సొంత ఎజెండా అమలు చేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివాసీల హక్కులు, సంప్రదాయాల పరిరక్షణకు ఉద్యమించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. కాంగ్రెస్తోనే సామాన్యులకున్యాయం జరుగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గిరిజన హక్కుల సాధనకు ఉద్యమం చేస్తామని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ బాబూరావు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ప్రోగ్రామ్ కన్వీనర్ రాహుల్ బాల్ తదితరులు పాల్గొన్నారు. -
విపత్తు ఎదురుకాకుండా..
● విత్తన తనిఖీలకు 21టాస్క్ఫోర్స్ బృందాలు ● పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులతో ఏర్పాటు ● ఏ ఒక్క రైతు మోసపోకుండా తనిఖీలు, నిఘా ఖమ్మంవ్యవసాయం: ముందస్తు వర్షాలతో వానాకాలం సాగు పనులు మొదలయ్యాయి. ఈనేపథ్యాన రైతులు అవసరమైన విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎక్కడా అక్రమాలు జరగకుండా, నకిలీలు మార్కెట్లోకి రాకుండా ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు వ్యవసాయ, పోలీసు శాఖలతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయగా.. వారు షాపుల్లో తనిఖీలు కూడా చేస్తున్నారు. ఇదే సమయాన రైతులు మోసపోకుండా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. సీజన్ వస్తే చాలు... వ్యవసాయ సీజన్ మొదలైందంటే చాలు పలుచోట్ల దళారులు రంగప్రవేశం చేస్తారు. ఇతర జిల్లాలకు చెందిన పలువురు రాత్రి వేళ గ్రామాల్లో తిరుగుతూ తమ వద్ద ఉన్న విత్తనాలు అధిక దిగుబడులు ఇస్తాయని నమ్మిస్తూ రైతులకు అంటగడుతుంటారు. అయితే, వీటికి రశీదు ఇవ్వకపోగా ఎవరు అమ్మారో కూడా గుర్తించలేని పరిస్థితులతో రైతులు నష్టపోవడం ఆనవాయితీగా మారింది. ప్రధానంగా పత్తి, మిర్చి విత్తనాల మోసం తరచూ జరుగుతోంది. ఇక కొందరు లైసెన్స్ కలిగిన వ్యాపారులు సైతం అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తూ జైలు పాలయ్యారు. గత ఏడాది 300మందికి పైగా రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. దీంతో దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తుగా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుకు ఆదేశించింది. నకిలీ, అనుమతులు లేని విత్తనాలతో ఎవరూ నష్టపోకుండా ప్రాథమిక దశ నుంచే తనిఖీల కోసం ఈ బృందాలను నియమించడంతో వారు పని మొదలుపెట్టారు. మండలానికి ఒక బృందం జిల్లాలోని 21 మండలాలకు ఒక్కో టాస్క్ఫోర్స్ బృందాన్ని నియమించారు. ఈ బృందానికి మండల వ్యవసాయాధికారి, మండలంలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వం వహిస్తారు. వీరి సూచనలతో గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తర్ణాధికారులు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు విత్తన షాపుల్లో తనిఖీలు చేయనున్నారు. విత్తన విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ వానాకాలం సీజన్ ప్రారంభమవడంతో విత్తనాల విక్రయానికి వ్యవసాయ శాఖ అనుమతించింది. ఇటీవల డీలర్ల సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ దిశానిర్దేశం చేశారు. విత్తన విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు విత్తనాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఈ ఏడాది 2.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా వేయగా 6.40 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని చెబుతున్నారు. ఇందులో 4.28 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. 450 గ్రాములు ఒక్కో విత్తన ప్యాకెట్ ధర రూ.901గా నిర్ణయించారు.విత్తన విక్రయాలపై పటిష్ట నిఘా.. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. టాస్క్ఫోర్స్ బృందాల ద్వారా తనిఖీలు చేయిస్తున్నాం. ఎవరైనా విత్తన మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. రైతులు కూడా లైసెన్స్డ్ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి పూర్తి వివరాలతో రశీదు తీసుకోవాలి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
పెద్దమ్మతల్లి హుండీ ఆదాయం రూ.23.42 లక్షలు
పాల్వంచరూరల్: పాల్వంచ మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఈసందర్భంగా 80 రోజులకు గాను రూ.23,42,780 నగదుతో పాటు విదేశీ కరెన్సీ, మిశ్రమ బంగారం, వెండి లభ్యమయ్యాయని ఈఓ రజినీకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవా దాయ శాఖ పర్యవేక్షణాధికారి జి.సుదర్శన్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ అనిల్కుమార్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి సువర్ణ పుష్పార్చన.. శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
రైతులకు అండగా ‘సాక్షి’
నేడు డీఏఓ, శాస్త్రవేత్తలతో ఫోన్ ఇన్ఖమ్మంవ్యవసాయం: నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు మొదలయ్యాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, దుక్కులు దున్నడంలో జాగ్రత్తలు, మేలైన విత్తనాల ఎంపిక, నకిలీల బారిన పడకుండా కాపాడుకోవడం తదితర అంశాలపై అవగాహన కోసం రైతులకు ‘సాక్షి’ అండగా నిలవనుంది. రైతులు తమ సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం నేరుగా జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, కేవీకే శాస్త్రవేత్తలతో మాట్లాడేలా ‘ఫోన్ ఇన్’ నిర్వహిస్తోంది. ఈమేరకు అన్నదాతలు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 30–05–2025, శుక్రవారం (నేడు) సమయం : ఉదయం 9నుంచి 10 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 89777 47500 -
ఐటీ హబ్లో 2నుంచి నైపుణ్య శిక్షణ
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని ఐటీ హబ్లో వచ్చేనెల 2వ తేదీ నుంచి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యాన నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు. జావా ఫండమెంటల్, జావా ప్రోగ్రామింగ్, పైథాన్ డేటాబేస్, క్లౌడ్ కంప్యూటింగ్, టాలీ జీఎస్టీ, ఐటీ స్కిల్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందుకోసం రూ.599 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ఆరు నెలల వ్యవధిలో అభ్యర్థులకు అనుకూలమైన సమయంలో శిక్షణకు హాజరుకావొచ్చని వెల్లడించారు. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం 95025 05880 నంబర్లో సంప్రదించాలని వారు ఓ ప్రకటనలో సూచించారు. నూరు శాతం వ్యాక్సినేషన్ ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని చిన్నారులకు నూరు శాతం వ్యాక్సినేషన్ నిర్వహించాలని డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి ఆదేశించారు. ఖమ్మంలో గురువారం మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు రోటా వైరస్, ఇతర వ్యాక్సిన్లపై ఏర్పాటుచేసిన ఓరియేంటేషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 97శాతం వ్యాక్సినేషన్ పూర్తయినందున, 100 శాతానికి సిద్ధం కావాలని తెలిపారు. ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు సంయుక్తంగా తల్లిదండ్రులను కలిసి ఎనిమిది ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించేలా వేస్తున్న వ్యాక్సిన్పై అవగాహన కల్పించడంతో పాటు వారిలో అపోహలు తొలగించాలని సూచించారు. అంతేకాకుండా అన్ని వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చందునాయక్, డబ్ల్యూహెచ్ఓ శిక్షకులు మురహరి మాట్లాడగా వివిధ విభాగాల అధికారులు రామారావు, సుబ్రహ్మణ్యం, శేషురత్నం, రమణ పాల్గొన్నారు. ఆరు జిల్లాల మహిళా మత్స్యకారులకు శిక్షణ కూసుమంచి: పాలేరులోని పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో మహిళా మత్స్యకారులకు మూడు రోజుల పాటు శిక్షణ గురువా రం ప్రారంభమైంది. ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, హైదరాబాద్, వికారా బాద్ జిల్లాల మహిళా మత్స్యకారులు పాల్గొనగా.. చేప, రొయ్యల పచ్చడి తయారీని శిక్షకులు వివరించారు. సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులునాయక్ మాట్లాడుతూ మహిళలు శిక్షణను సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఏపీలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ మత్స్య శాస్త్రవేత్త వీరాంజనేయులు చేపలతో తయారుచేసే ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. ఫిష్ బాల్స్, సమోసా, పాపడ్, కట్లెట్, లాలీపాప్స్, బర్గర్ల తయారీతో మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. పాలేరు ప్రధాన శాస్త్రవేత్త శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఏదీ ముందస్తు సన్నద్ధత?
గుర్తించడం ఎలా? జిల్లాలో కరోనా వ్యాప్తి చెందితే గుర్తించే పరిస్థితులు లేవు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలతో వస్తే సాధారణ పరీక్షలే నిర్వహిస్తున్నారు. కోవిడ్ను గుర్తించేందుకు ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాల్సి ఉన్నా ఏ ఆస్పత్రిలో కూడా కిట్లు అందుబాటులో లేవు. కరోనా వ్యాప్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు ఇంత వరకు తీసుకోలేదు. కోవిడ్ సన్నద్ధతపై తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడమే ఇందుకు కారణమని చెబుతుండడం గమనార్హం. పరీక్షల కోసం ర్యాపిడ్ కిట్లు 3వేలు కావాలని ప్రతిపాదించినా జిల్లాకు చేరలేదు. ఇక ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించే పరిస్థితి కూడా లేదు. ఈ పరీక్షలు గతంలో జిల్లా ఆస్పత్రిలో మాత్రమే నిర్వహించగా నివేదిక కచ్చితత్వంతో వస్తుంది. కానీ ఈ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి లేకపోవడంతో ఇండెంట్ పంపించి వదిలేశారు. వార్డు ఏర్పాటుతో సరి కరోనా వ్యాప్తి సూచనలతో అధికారులు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇరవై పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. వార్డు ఏర్పాటుచేసినా కిట్లు లేకపోవడంతో బాధితులను గుర్తించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కరోనా వ్యాప్తి సమయాన ప్రభుత్వ పరంగా లక్షలాది పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు కలిపి 18,64,446 మందికి నిర్వహించారు. అందులో 1,10,395 మందికి కోవిడ్ సోకినట్లు తేలగా, పరిస్థితి విషమించిన 1,447 మంది మృత్యువాత పడ్డారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నిరుపయోగంగా ప్లాంట్ కరోనా రెండో వేవ్ సమయాన ఆక్సీజన్ కొరత ఏర్పడింది. అప్పుడు గాలి నుండి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్ను పెద్దాస్పత్రిలో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.1.20 కోట్లతో ఏర్పాటుచేసిన కాన్సంట్రేటర్ ప్లాంట్ 2021 మే నెలలో అందుబాటులోకి వచ్చింది. సహజ సిద్ధమైన గాలిని ఒత్తిడికి గురిచేసి నైట్రోజన్, కార్బన్ డై ఆకై ్సడ్ తదితర వాయువులు, ఆక్సిజన్ను ఈ ప్లాంట్లో వేరు చేస్తారు. గంటకు 2వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగిన ఈ ప్లాంట్ నిర్వహణను కరోనా వ్యాప్తి తగ్గాక పట్టించుకోలేదు. ఆస్పత్రి అవసరాలకు ఉపయోగించుకునే వీలున్నా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు విలు వైన ప్లాంట్ తుప్పుపట్టే పరిస్థితికి చేరింది.జిల్లా ప్రజల్లో కరోనా భయం అందుబాటులో లేని పరీక్షల కిట్లు ఉపయోగంలో లేని ఆక్సిజన్ ప్లాంట్తగిన జాగ్రత్తలు పాటించాలి.. ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాప్తి లేదు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన సన్నద్ధతపై ఆదేశాలు లేకున్నా పరీక్షల కోసం కిట్లు పంపించాలని కోరాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించ డమే కాక తరచూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలి. జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలి. – బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
తెలంగాణ ఉద్యమకారుడు ఆశీర్వాదం మృతి
తల్లాడ: తల్లాడ మండలం పినపాకకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మోదుగు ఆశీర్వాదం(69) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. యాభై ఏళ్ల క్రితం కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. కొన్నాళ్లు కాంగ్రెస్లో కొనసాగగా, 2001లో టీఆర్ఎస్లో చేరి మలిదశ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మధిర నియోజకవర్గ ఇన్చార్జ్గానూ పనిచేసిన ఆశీర్వాదం తల్లాడలో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఆశీర్వాదం మృతదేహం వద్ద మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. అలాగే, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్తో పాటు వజ్రాల రామిరెడ్డి, కోడూరి వీరకృష్ణ, బద్దం కోటిరెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కాంపాటి జమలయ్య, జీవీఆర్, వివిధ పార్టీల నాయకులు సైతం నివాళులర్పించి ఆశీర్వాదం కుటుంబీకులను పరామర్శించారు. -
అర్హులందరికీ సంక్షేమమే లక్ష్యం
బోనకల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. బోనకల్ మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. గార్లపాగు నుంచి రామాపురం మీదుగా చింతకాని మండలం నాగులవంచ వరకు రూ.2.23కోట్లతో చేపట్టే రోడ్డు మరమ్మతు పనులు, చిన్నబీరవల్లి నుండి నారాయణపురం వరకు రూ.4.50కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు మరమ్మతుతో పాటు బోనకల్ ఇందిరా డైరీ నుంచి రావినూతల వరకు రూ.2.76కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ ద్వారా నిరుద్యోగులకు న్యాయం చేస్తూనే, స్వయం ఉపాధి పథకాల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. కాగా, వర్సాలు మొదలైనందున రైతులకు కావాల్సిన విత్తనాలను సమకూరుస్తున్నామని చెప్పారు. అయితే, నకిలీ విత్తనాల విషయంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, ఎస్ఈ గుర్రాల వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీర్ మహేష్బాబు, డీఈ కోటేశ్వరావు, ఏఈఈ నవీన్కుమార్, తహసీల్ధార్ రమాదేవి, ఎంపీడీఓ రమాదేవి, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు పైడిపల్లి కిశోర్, గాలి దుర్గారావు, పిల్లలమర్రి నాగేశ్వరావు, బోయినపల్లి వెంకటేశ్వర్లు, మోదుగు సుధీర్బాబు, ఎర్రంశెట్టి సుబ్బారావు, మరీదు శ్రీను, గత్తం బాలరాజు, చేబ్రోలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రూ.9.49కోట్ల విలువైన రోడ్ల పనులకు శంకుస్థాపన -
అక్రమంగా తరలిస్తున్న పశువుల స్వాధీనం
తిరుమలాయపాలెం: అనుమతి లేకుండా రవాణా చేస్తున్న పశువులు, వ్యాన్ను తిరుమలాయపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆవు దూడలను ట్రాలీ ఆటోలో తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం అర్ధరాత్రి పాతర్లపాడు సమీపాన తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా వ్యాన్ డ్రైవర్ నరేష్, వ్యాపారులు మాదాసు వెంకన్న, బత్తుల నరేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.జగదీష్ తెలిపారు. కాగా, స్వాధీనం చేసుకున్న ఆవుదూడలను గురువారం గొల్లగూడెంలోని గోశాలకు తరలించామని వెల్లడించారు. టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు మధిర: మధిర మండలం సిరిపురం పాత టోల్ గేట్ వద్ద టిప్పర్లను మల్లారం, రొంపిమల్ల గ్రామస్తులు గురువారం అడ్డుకుని నిరసన తెలిపారు. హైవే నిర్మాణానికి సామగ్రి తీసుకెళ్లే టిప్పర్ల రాకపోకలతో సిరిపురం – నెమలి రోడ్డుపై గోతులు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్పించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తారని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మల్లారం మాజీ సర్పంచ్ ఉపేంద్ర, కొంగర రంగయ్యతో పాటు మల్లారం, రొంపిమల గ్రామస్తులు పలువురు ల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల నిరసన పాల్వంచ/మణుగూరు రూరల్: ఉత్తరప్రదేశ్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్(టీజీపీఈ) జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాల్వంచలోని కేటీపీఎస్, మణుగూరులోని బీటీపీఎస్ల ఎదుట గురువారం భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులపై కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సంస్థల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని, ఉత్తరప్రదేశ్ కార్మికులకు అందరూ అండగా నిలవాలని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అసిస్టెంట్ ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులు రవిప్రసాద్, రవితేజ, బ్రహ్మాజీ, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి
ఖమ్మం సహకారనగర్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ కోరారు. పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యాన చేపట్టిన ప్రచార జాతాను ఖమ్మం జెడ్పీ సెంటర్లో టీజీవోస్ కార్యదర్శి మోదుగు వేలాద్రి, నాయకులతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందుతాయని తెలిపారు. ఈనేపథ్యాన తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు బుర్రి వెంకన్న, షరీఫ్, శ్రీనివాస్, శ్యాంకుమార్, రోజా, నర్సింహారావు, సాంబమూర్తి, రాంబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం గాంధీచౌక్లోని పలు విత్తన దుకాణాల్లో గురువారం టాస్క్ఫోర్స్ బృంధం తనిఖీలు చేసింది. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులు విత్తనాల విక్రయానికి ముందుకొస్తున్నారు. ఈమేరకు నకిలీలు మార్కెట్లోకి రాకుండా వ్యవసాయ, పోలీసు శాఖలతో కూడిన టాస్క్ఫోర్సు బృందాలు రంగంలోకి దిగాయి. ఖమ్మం గాంధీచౌక్ కేంద్రంగా పెద్ద సంఖ్యలో విత్తన దుకాణాలు ఉండగా, ఖమ్మంతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు వస్తుంటారు. దీంతో ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, ఖమ్మం అర్బన్ ఏఓ బలుసు కిషోర్బాబు, ఖమ్మం త్రీటౌన్ సీఐ జె.మోహన్బాబుతో కూడిన బృందం గురువారం పలు షాపుల్లో తనిఖీ చేసింది. పత్తి విత్తన ప్యాకెట్ల లభ్యత, లాట్ నంబర్లు, తయారీ, గడువు తేదీలను పరిశీలించారు. అలాగే, అనుమతి లేని బీటీ–3 విత్తన విక్రయాలు జరుగుతున్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని, నిర్దేశించిన విధంగా రికార్డులను నిర్వహించాలని డీలరలకు సూచించారు. -
మహిళలే అంబాసిడర్లు..
ఖమ్మంమయూరిసెంటర్: ‘మా వంతుగా మార్ట్ ఏర్పాటు చేసి ప్రచారం కల్పిస్తున్నాం.. మీరు తయారు చేసిన ఉత్పత్తులకు మీరే అంబాసిడర్లుగా విక్రయించుకోవడం, లాభాలు వచ్చేలా ముందుకు సాగే బాధ్యత మీదే’ అని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పేర్కొన్నారు. ఖమ్మం వైరా రోడ్డులో ఏర్పాటుచేసిన మహిళా మార్ట్ను భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఖమ్మం సీపీ సునీల్దత్, భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజ్, ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి కలెక్టర్ గురువారం సందర్శించారు. మార్ట్ ఏర్పాటుకు దారి తీసిన అంశాలను కలెక్టర్ వారికి వివరించాక మహిళా సంఘాల సభ్యులు రూపొందించిన వస్తువులను అధికారులు ఆసక్తిగా పరిశీలించారు. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా అధికారులు మార్ట్లో పలు వస్తువులు కొనుగోలు చేశారు. టీ బాగుంది.. నేనే పే చేస్తా.. మార్ట్ను సందర్శించాక ఆవరణలో ఏర్పాటుచేసిన క్యాంటీన్ను వద్దకు అధికారులంతా వచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ సునీల్దత్ అందరినీ టీ తాగాలని కోరారు. ఆపై టీ బాగుందని నిర్వాహకురాలిని అభినందించిన ఆయన తన ఫోన్లో యాప్ ద్వారా డబ్బు చెల్లించారు. మహిళా మార్ట్ను సందర్శించిన ఉమ్మడి జిల్లా అధికారులు -
కిష్టారం ఓసీ వెల్ఫేర్ ఆఫీసర్గా శ్రీనివాస్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ వెల్ఫేర్ ఆఫీసర్గా కసనబోయిన శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులను గురువారం జీఎం శాలేంరాజు అందించారు. సింగరేణి గతేడాది ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రెయినీ(వెల్ఫేర్ ఆఫీసర్)లుగా పలువురిని ఎంపిక చేయగా కొందరికే పోస్టింగ్ ఇచ్చింది. మిగతా వారు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. దీంతో ఐదుగురికి పదోన్నతి కల్పించగా అందులో శ్రీనివాస్ ఉన్నారు. అలాగే, కె.కల్యాణ్ రాజ్కుమార్ను ఆర్జీఓసీ–2కు, ఏ.మధును అడ్రియాలకు, సిరిమల్లె అశోక్ను ఇల్లెందు కేఓసీకి, దాసరి నాగరాజును జీడీకే 2, 2ఏకు కేటాయించారు. 2న హ్యాండ్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికకు జూన్ 2న పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి.రఘునందన్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డుతో ఉదయం 10 గంటలకల్లా రిపోర్టు చేయాలని సూచించారు. ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశే.. ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే 11ఏళ్లుగా నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి మనోహర్రాజు పేర్కొన్నారు. యూనియన్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఖమ్మంలోని కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన మనోహర్రాజు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యాన ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డితో పాటు విజయ్, పద్మ, ముత్తయ్య, వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, ఉమాదేవి, రాము తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి ఏఎస్పీగా నరేందర్ కొత్తగూడెంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్)గా గోపతి నరేందర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.కరీంనగర్ టాస్క్ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై అడిషనల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన నరేందర్ను పలువురు అధికారులు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గు టిప్పర్ దగ్ధం అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లి మండలం శాంతినగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం బొగ్గు టిప్పర్ కేబిన్లో మంటలు చెలరేగి దగ్ధమైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సత్తుపల్లి సింగరేణి ఓపెన్కాస్టు నుంచి బొగ్గు లోడ్తో వచ్చిన టిప్పర్ కొత్తగూడెంలో అన్లోడ్ చేసి తిరిగి వెళ్తోంది. ఈక్రమాన టిప్పర్ కేబిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ వాహనం నిలిపేసి దిగాడు. అనంతరం పోలీసులు చేరుకోగా, సత్తుపల్లి నుంచి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
విద్యుత్ ఫిర్యాదులకు ‘చాట్బాట్’
● వాట్సాప్ నంబర్ 79016 28348కు ఫిర్యాదు చేస్తే సరి ● స్థితిగతులు తెలుసుకునేలా ట్రాకింగ్ ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచడమే కాక వినియోగదారులకు మెరుగైన సేవలందించే లా ఎన్పీడీసీఎల్ (నార్తర్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) సాంకేతికతను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే సమస్యలపై అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ‘వాట్సాప్ చాట్బాట్’సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం వాట్సాప్ నంబర్ను కేటాయించింది. ఫిర్యాదు నమోదు ఇలా.. వినియోగదారులు తమ సెల్ఫోన్ నుంచి వా ట్సాప్ లో 79016 28348 నంబర్కు హాయ్ అని చాట్ చేయగానే టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్కు స్వా గతం అని వస్తుంది. అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. ఈ మేరకు రిజిస్టర్ కంప్లైంట్ ఎంచుకుంటే విత్ యూనిక్ సర్వీస్ నంబర్, వితౌట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెనూ అని వస్తుంది. ఆపై విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేస్తే వినియోగదారుడి సర్వీస్ వివరాలు వస్తాయి. ఆ వివరాలను సరిపోల్చుకున్నాక ఓకే చేస్తే సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. ఇలా ఏజెంట్తో చాట్ చేస్తూ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. ఐడీ నంబర్.. ట్రాకింగ్ వినియోగదారులు చాట్బాట్లో చేసే ప్రతీ ఫిర్యా దుకు సంస్థ ఒక నంబర్ కేటాయిస్తుంది. అలాగే, సంబంధిత అధికారి వద్దకు ఫిర్యాదు చేరిందని సమాచారం కూడా అందుతుంది. ఆపై వినియోగదారులు ఆ నంబర్ ఆధారంగా సమస్య పరి ష్కారం ఏస్థాయిలో ఉందో చాట్బాట్లో తెలుసుకోవచ్చు. అలాగే, సమస్య పరిష్కరించాక వినియోగదారునికి సమాచారం ఇవ్వడమే కాక ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ సీకరిస్తారు. ఒకవేళ వినియోగదారులు సంతృప్తి చెందకపోతే మరోమారు కంప్లైంట్ రీ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే www. tgnpdcl. com వెబ్సైట్లో కనిపించే వాట్సాప్ ఐకాన్పై క్లిక్ చేసి చాట్ చేయొచ్చు.మరింత మెరుగైన సేవలకు.. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించేలా సాంకేతికతను వినియోగించుకుంటున్నాం. ఇందులో భాగంగా మొబైల్ వాట్సాప్ నుంచి సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. ఇదేకాక టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా సేవలు పొందే అవకాశం ఉంది. –ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఖమ్మం ఎస్ఈ -
మావోల మృతదేహాలను బంధువులకు అప్పగించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన నంబాల కేశవరావు సహా మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించాలని వామపక్ష ప్రజా హక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శత్రుదేశాల సైనికులు యుద్ధంలో మరణిస్తే మృతదేహాలను వారిబంధువులకు అప్పగిస్తుండగా, మావోయిస్టుల విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. మావో లను సజీవంగా పట్టుకుని కాల్చి చంపినందుకే తాత్సారం చేస్తున్నారని తెలిపారు. కా గా, ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శాంతి సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బాగం హేమంతరావు, నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, దండి సురేష్, లక్ష్మీనారాయణ, కాకి భాస్కర్, ఐ.వీ.రమణారావు, రవిమారుత్, విజయ్, చిర్రా రవి, జానీమియా, ఎర్ర బాబు, గోవిందరావు, మాదినేని రమేష్, వై.విక్రమ్, జాన్సీ, ఖాసిం పాల్గొన్నారు. -
‘సాక్షి’ కార్యాలయంలో నిధి ఆప్కే నికట్
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని ‘సాక్షి’ కార్యాలయంలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఆధ్వర్యాన ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ‘నిధి ఆప్కే నికట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్పై ఉద్యోగుల సందేహాలను అధికారులు నివృత్తి చేయడమే కాక ప్రయోజనాలను వివరించారు. జిల్లా నోడల్ ఆఫీసర్ బి.నాగులు, సూపర్వైజర్ కె.నాగేశ్వరరావు, ఈఎస్ఐ బ్రాంచ్ ఇన్చార్జ్ మేనేజర్ రెహానా సుల్తానా, ఉద్యోగి బి.కార్తీక్తో పాటు సాక్షి బ్రాంచ్ మేనేజర్ జి.మోహనకృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు. రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిసత్తుపల్లిరూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సత్తుపల్లి సరస్వతి ఆలయం ఎదురుగా డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముంటున్న పాశం కల్యాణ్(28) ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన సోమవారం రాత్రి సత్తుపల్లి నుంచి గంగారం వైపు బైక్పై వెళ్తుండగా బేతుపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ఐషర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కల్యాణ్ను ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. చికిత్స పొందుతున్న యువకుడు.. ఖమ్మంరూరల్: మండలంలోని పొన్నేకల్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సింగరేణి మండలం చందర్లగూడెంకు చెందిన అజ్మీరా సునీల్కుమార్(28) ఈనెల 23న సూర్యాపేట వైపు నుండి ఖమ్మం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా పొన్నేకల్ మసీదు మూలమలుపు వద్ద రోడ్డు పక్కన రాళ్లను ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడని సీఐ ముష్క రాజు తెలిపారు. మనోవేదనతో వృద్ధుడి ఆత్మహత్యరఘునాథపాలెం: కుమారుడు ఇంటికి రావడం లేదనే మనోవేదనతో ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించిన వివరాలు.. రఘునాథపాలెంకు చెందిన సుగ్గల రాఘవయ్య(70) వ్యాపారం చేయగా, అనారోగ్యంతో ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యాడు. ఆయన చిన్నకుమారుడు శంకర్కు వివాహం కాకపోగా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన తిరిగి రాలేదు. దీంతో మనోవేదనకు లోనైన రాఘవయ్య ఈనెల 25న నివాసంలో ఉరి వేసుకోగా, కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. రెండు షాపుల్లో చోరీమధిర: మండలంలోని నిధానపురంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గ్రామంలోని రోడ్డు పక్కన షేక్ నాగుల్ మీరాకు చెందిన జానీ చికెన్ సెంటర్ లో చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రూ.10 వేల నగద ఎత్తుకెళ్లారు. అలాగే, పక్కనే ఉన్న బెల్ట్షాపులో 15మద్యం సీసాలు సైతం చోరీ చేశారు. ఘటనపై బాధితులు మంగళవారం మధిర రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారయత్నం కేసు నమోదు చింతకాని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒంటరి మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఆమె మంగళవారం మామిడి కాయలు కోయడానికి కూలీకి వెళ్లగా, సదరు వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఈ సమయాన బాధితురాలు కేకలు వేయడంతో ఆయన పరారయ్యాడు. సదరు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. రౌడీషీటర్పై పీడీ యాక్ట్ ఖమ్మంక్రైం: చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖమ్మంకు చెందిన రౌడీషీటర్ పేరల్లి ప్రవీణ్పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. భూకబ్జాలు చేయడమే కాక పలువురి నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న నేపథ్యాన పీడీ యాక్ట్ అమలుచేస్తూ చంచల్గూడలోని జైలుకు తరలించామని వెల్లడించారు. గతంలో ప్రవీణ్పై జిల్లాలో 30 కేసులు ఉండగా, బెయిల్పై బయటకు వచ్చినా తీరు మార్చుకోలేదని తెలిపారు. -
ఏసీబీ దాడులతో భయం.. భయం
● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంతా గప్చుప్ ● కార్యాలయం ముఖమే చూడని డాక్యుమెంట్ రైటర్లుఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా డబ్బు ముట్ట చెప్పాల్సిందేనన్న ఆరోపణలు ఏళ్లుగా ఉన్నాయి. కొందరు అడిగినంత ఇచ్చి పని చేయించుకుంటుండగా.. ఇంకొందరు ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యాన ఓ బాధితుడు చేసిన ఫిర్యాదుతో సోమవారం తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ రైటర్ పి.వెంకటేష్ ద్వారా రూ.30వేల లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ జె.అరుణను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ ఘటనతో మంగళవారం కార్యాలయమంతా బోసిపోయి కనిపించింది. ఉద్యోగులు భయంభయంగానే విధులు నిర్వర్తించగా సాధారణ రోజుల్లో పోలిస్తే తక్కువగనాఏ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ అరుణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఇన్చార్జ్ బాధ్యలు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూపాల్కు అప్పగించారు. తెరుచుకోని దుకాణాలు రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు నేరుగా వెళ్తే ఏ పని జరగదనే అపవాదు ఉంది. ఇదే సమయాన డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించి వారి చెప్పిన నగదు ముట్టచెబితే పనులు చకచకా సాగుతాయని చెబుతున్నారు. తాజాగా ఏసీబీకి పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ సైతం డాక్యుమెంట్ రైటర్ సాయంతోనే లంచం తీసుకుంటూ పట్టుబడింది. దీంతో మంగళవారం కార్యాలయం పై అంతస్తుతో పాటు చుట్టుపక్కల ఉన్న డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులను తెరవలేదు. అంతేకాక ఎవరు కూడా కార్యాలయంలోకి అడుగు పెట్టే సాహసం చేయలేదు. దూరదూరంగా తిరుగుతూ కార్యాలయంలో ఎవరైనా తనిఖీలకు వచ్చారా అంటూ ఆరా తీయడం కనిపించింది. ఇక కార్యాలయ ఉద్యోగులు సైతం నేరుగా వచ్చిన వారికే రిజిస్ట్రేషన్లు చకచకా పూర్తిచేయడంతో ప్రతిరోజు ఇలాగే చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ భూపాల్ను వివరణ కోరగా మొత్తం 14మందికి నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇక సబ్ రిజిస్ట్రార్ జె.అరుణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పలు విషయాలపై విచారణ చేసినట్లు తెలిసింది. అంతేకాక లావాదేవీలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. -
మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కన్నుమూత
● ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రస్థానం ● తొలినాళ్లలో సర్పంచ్, ఎంపీటీసీగా కూడా విజయం ● సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపంవైరా/రఘునాథపాలెం: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్(63) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో ఈనెల 23న చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఈర్లపుడి కాగా భార్య మంజుల, కుమారుడు మృగేందర్లాల్, కూతురు మనీషాలక్ష్మి ఉన్నారు. కుమారుడు తమిళనాడు(కోయంబత్తూరు) జీఎస్టీ కమిషనర్గా, కోడలు శ్వేత తమిళనాడు కేడర్లో జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు నెలల క్రితమే ఆయన సోదరుడు, ఏసీపీ జవహర్లాల్ ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు మదన్లాల్ మృతితో విషాదం నెలకొంది. ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యే దాకా.. మదన్లాల్ ఈర్లపూడిలోని సామాన్య కుటుంబంలో జన్మించారు. 11 మంది సంతానంలో మదన్లాల్ మూడో వ్యక్తి కాగా, ప్రాథమిక విద్య డోర్నకల్ మండలం బలపాలలో, డిగ్రీ ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో పూర్తిచేశారు. కళాశాల రోజుల్లో పీడీఎస్యూలో పనిచేసిన ఆయన.. 1989లో కామేపల్లి మండలం అబ్బాస్పురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. కబడ్డీలో ప్రావీణ్యం ఉండడంతో అదే ఏడాది ఎస్ఐ పోస్టుకు ఎంపికై నా కేసుల కారణంగా ఉద్యోగం దక్కలేదు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తికి రాజీ నామా చేసి 1996 – 2001 వరకు ఈర్లపూడి సర్పంచ్గా పనిచేశారు. 2001 – 2006 వరకు ఆయన భార్య మంజుల సర్పంచ్గా కొనసాగగా, తిరిగి 2006లో మదన్లాల్ రెండోసారి సర్పంచ్గా, ఆపై కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా విజయం సాధించారు. 2004లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కలేదు. 2009లో ఏర్పాటైన వైరా(ఎస్టీ) నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఫలితం లేక ఇండిపెండెంట్గా బరిలోకి దిగి 5వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దివంగత సీఎం వైఎస్పై అభిమానంతో 2014లో నాటి ఎంపీ, ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా వైఎస్సార్సీపీలో చేరి, వైరా నుంచి సీపీఎం మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఏడాది తిరగకుండానే బీఆర్ఎస్(టీఆర్ఎస్) లో చేరగా, 2018, 2023 ఎన్నికల్లోనూ పోటీ చేసినా విజయం దక్కలేదు. పరామర్శించిన కేసీఆర్.. పలువురి నివాళి మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ మృతదేహాన్ని ఖమ్మం కవిరాజ్నగర్లోని నివాసగృహానికి తీసుకొచ్చారు. ఈమేరకు మాజీ సీఎం కేసీఆర్ మదన్లాల్ కుమారుడు మృగేందర్లాల్కు ఫోన్ చేసి ఓదార్చారు. అలాగే, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఇక ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చానాగేశ్వరరావు, కొండబాలతదితరులు మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షు డు పువ్వాళ్ల దుర్గాప్రసాద్తో పాటు వివిధ పార్టీల నాయకులు గడిపల్లి కవిత, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రాంపూడి రోశయ్య, పగడాల మంజు ల, కూరాకుల నాగభూషణం, కమలరాజు, గుండాల కృష్ణ, నెల్లూరి కోటేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, నాగరాజు, సుబ్బారావు, నున్నా రవికుమార్, బాగం హేవంతురావు, దండి సురేష్, యర్రా బాబు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలి పారు. కాగా, మదన్లాల్ అంత్యక్రియలను బుధవారం స్వగ్రామమైన ఈర్లపుడిలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. -
జిల్లాలో దంచికొట్టిన వాన
ఖమ్మంవ్యవసాయం: నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 7గంటల నుంచి వర్షం కురిసింది. పగలంతా ఆకాశం మేఘావృతమై ఉండగా, సాయంత్రం దాటాక ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. రాత్రి 8 గంటల సమయానికి వాతావరణ శాఖ వెల్ల డించిన నివేదిక ఆధారంగా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో అత్యధికంగా 62.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, పెద్దగోపతిలో 57, తిరుమలాయపాలెంలో 37.8, రఘునాథపాలెంలో 36.5, ఖమ్మం ప్రకాష్నగర్లో 36, చింతకానిలో 22.5, ఖమ్మం కలెక్టరేట్ వద్ద, సదాశివునిపాలెంలో 15.8, గంగారంలో 14.3 మి.మీ. వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అంతేకాక మిగతా ప్రాంతాల్లోనూ రాత్రి పొద్దుపోయే వర్షం కురిసింది. ఈ వర్షం రైతులు దుక్కులు సిద్దం చేసుకోవడానికి దోహదపడనుంది. కాగా, వర్షంతో ఖమ్మంలోని గాంధీచౌక్, కమాన్బజార్, పాత బస్టాండ్, వైరా రోడ్డు, కస్బాబజార్ తదితర ప్రాంతాల్లో డ్రెయిన్లు నిండి రహదారులపైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నైరుతి రుతుపవనాల ప్రభావం -
‘శక్తివంతమైన నాయకుడు నెహ్రూ’
ఖమ్మంవన్టౌన్: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా నిలిచారని కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. నెహ్రూవర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచవర్ష ప్రణాళికలకు శ్రీకారం చుట్టడమే కాక ముందుచూపుతో నీటిపారుదలకు కాల్వలు, ఆనకట్టల నిర్మాణానికి నెహ్రూ శ్రీకారం చుట్టారని తెలిపారు. నాయకులు, కార్పొరేటర్లు పోట్ల నాగేశ్వరరావు, నాగండ్ల దీపక్చౌదరి, దొబ్బల సౌజన్య, కన్నం ప్రసన్నకృష్ణ, సాయికుమార్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, సయ్యద్ గౌస్, ఎర్రం బాలగంగాధర తిలక్, మొక్కా శేఖర్గౌడ్, మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, రాపర్తి శరత్, పల్లెబోయిన భారతీచంద్రం, పాలకుర్తి నాగేశ్వరరావు, యూసఫ్, కమతం రామకృష్ణ, బోడ శ్రావణ్, చంద్రిక, సమీరా, లక్ష్మి, జ్యోతి, కొత్తపల్లి పుష్ప పాల్గొన్నారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.కిరణ్కుమార్కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ఓయూ ప్రొఫెసర్ కె.సాధన పర్యవేక్షణలో ఆయన ‘స్ట్రక్చరల్ ఆప్టికల్ స్పెక్ట్రోస్కోపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డోపెడ్ జింక్ అల్యూమినేట్ ఫర్ ఎలక్ట్రో కెమికల్ అప్లికేషన్‘ అంశంపై పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించగా డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా కిరణ్కుమార్ను కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా, వివిధ విభాగాల బాధ్యులు ఎం.ప్రసాద్, బి.అనిత, డాక్టర్ బి.శ్రీనివాస్, ఎస్.రాంబాబు, రాజశేఖర్,ఽ ధర్మయ్య మంగళవారం అభినందించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి ఖమ్మం సహకారనగర్: పదో తరగతి అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పద్మశ్రీ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆమె పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. వచ్చే నెల 3నుంచి 11వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనుండగా, 1,048 మంది విద్యార్థుల కోసం ఖమ్మంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కు రెండు రోజుల ముందు వరకు కూడా రూ. 50జరిమానాతో ఫీజు చెల్లించే అవకాశమున్న విషయమై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ సత్యనారాయణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కారుమంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22న ప్రారంభం కాగా మంగళవారం ముగిశాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 27,775 మందికి 25,972మంది, ద్వితీయ సంవత్సరంలో 6,514మందికి 6,148మంది విద్యార్థులు హాజ రయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. రేపటి నుంచి మూల్యాంకనం ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ల జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు చేపట్టనున్నారు. మొదటి విడత 29న, రెండో విడత ఈనెల 31 న మొదలవుతుంది. జిల్లాకు ఇప్కపటికే 69,835 జవాబుపత్రాలు చేరాయని డిడీఈఓ రవిబాబు తెలిపారు. ఈమేరకు వాల్యూయేషన్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. కొత్త వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు శ్రీకారంచింతకాని: చింతకాని, ముదిగొండ మండలాల రైతులకు సేవలందించేలా నూతన మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చింతకాని మండలం మత్కేపల్లి పరిధి 41వ సర్వేనంబర్లో భూసేకరణకు మార్కెటింగ్, రెవె న్యూ అధికారులు మంగళవారం సంయుక్తంగా సర్వే చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, మార్కెట్ సహాయకార్యదర్శి వీరాంజనేయులు, సర్వేయర్ నవీన్ సర్వేలో పాల్గొన్నారు. ఇక్కడ మార్కెట్ ఏర్పాటైతే రెండు మండలాల రైతులకు దూరాభారం తప్పడమే కాక పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభిస్తుందని చెబుతున్నారు. -
జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
ఖమ్మంవన్టౌన్/ముదిగొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8గంటలకు ముదిగొండ మండలం యడవల్లిలో రూ.4.75కోట్ల నిధులతో చేపట్టనున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురం, ముఖ మండపం, గెస్ట్హౌస్, ఆర్చి పునర్నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఈమేరకు యడవల్లిలో శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రమేష్తో పాటు మందరపు నాగేశ్వరరావు, కందిమళ్ల వీరబాబు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5–30గంటలకు ఖమ్మం 20వ డివిజన్ ప్రకాష్నగర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత వైరా రోడ్డులోని అంబేద్కర్భవన్లో ఏర్పాటు చేసిన మహిళామార్ట్ను ప్రారంభిస్తారు. సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు రఘునాథపాలెం: భూసారాన్ని పెంచేందుకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సి డీపై ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య సూచించారు. రఘునాథపాలెం మండలంలోని వీ.వీ.పాలెం సొసైటీలో మంగళవారం పలువురికి విత్తనాలు అందజేశాక ఆయన మాట్లాడారు. ఈ విత్తనాలతో పంట సాగు చేసి కలియదున్నడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈకార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రావూరి సైదబాబు, ఏఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఓ లు సాయిశిరణ్మయి, దివ్య, సీఈఓ ఐతగాని తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా క్లినిక్లో మెరుగైన సేవలు ఖమ్మంవైద్యవిభాగం: మహిళా ఆరోగ్య క్లినిక్ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని డీఎంహెచ్ఓ బి.కళావతి బాయి తెలిపారు. ఖమ్మం పాత మున్సిపాలిటీ కార్యాలయంలోని క్లినిక్ను మంగళవారం సందర్శించిన ఆమె ఓపీ సేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా రిఫర్ చేసే వారికి ప్రతీ మంగళవారం పరీక్షిస్తూ చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పల్లె దవాఖానా, కోర్టు సముదాయంలోని ప్రభుత్వ డిస్పెన్సరీ కూడా డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. -
మన కోసం.. మన ఉత్పత్తులు!
భయం.. భయం.. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడిన నేపథ్యాన డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోకి అడుగు పెట్టలేదు. ● ఎస్హెచ్జీ సభ్యుల సామగ్రి అమ్మకానికి వేదిక ● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ చొరవతో సిద్ధమైన మహిళా మార్ట్ ● నేడు ప్రారంభించనున్న మంత్రి తుమ్మల ● దశలవారీగా ఇతర మున్సిపాలిటీలకూ విస్తరణబుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 20258లోఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా ఖమ్మంలో మహిళా మార్ట్ సిద్ధమైంది. ఇన్నాళ్లు ఉత్పత్తులు రూపొందిస్తున్నా అమ్మకానికి సరైన వేదిక కానరాక.. అవగాహన లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాణ్యమైన, ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు అయినప్పటికీ డిమాండ్ మేర విక్రయించుకోలేకపోయారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ప్రత్యేకంగా మహిళా మార్ట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మార్ట్ సిద్ధం కాగా.. బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఉత్పత్తులకు బ్రాండింగ్ ఎంత నాణ్యమైన, ఆర్గానిక్ ఉత్పత్తులైనా విక్రయించా లంటే బ్రాండ్ పేరు కావాలి. ఈమేరకు మహిళామార్ట్లో అమ్మే ఉత్పత్తులకు ‘మేడిన్ ఖమ్మం..ఫర్ ఖమ్మం’ పేరుతో బ్రాండ్ రూపొందించారు. ఇక్కడ అమ్మే వస్తువులన్నింటినీ ఇదే బ్రాండ్తో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేయించారు. కాగా, మార్ట్ నిర్వహణ విజయవంతంగా సాగాలనే భావనతో ఉత్పత్తులు నాణ్యతగా ఉన్న 20 సంఘాలను తొలిదశలో ఎంపిక చేశారు. పప్పులు, బియ్యం, కారం, పసుపు, తృణధాన్యాలతో చేసిన చిరుతిండ్లు, ఫినాయిల్, జూట్ బ్యాగ్లు, కాళ్ల పట్టాలు సహా పలు సరుకులను విక్రయానికి సిద్ధం చేశారు. అలాగే, మార్ట్ నిర్వహణ కోసం ఐదుగురికి శిక్షణ ఇప్పించారు. ఇదే బ్రాండింగ్తో అమెజాన్, ఫ్ల్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థల ద్వారా విక్రయానికి సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలిసింది. అంతేకాక ఖమ్మంలో ఏర్పాటుచేస్తున్న మహిళా మార్ట్ నిర్వహణ గాడిన పడగానే మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల పరిధిలోనూ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. నష్టం ఎదురుకావొద్దనే... జిల్లాలో అధికారులతో కలిసి పర్యటించిన సమయంలోనే కాక గవర్నర్ వచ్చినప్పుడు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించామని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. కానీ సరైన మార్కెటింగ్ సదుపాయం లేక మద్దతు ధర దక్కడం లేదని గుర్తించినట్లు చెప్పారు. మహిళామార్ట్ ప్రారంభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే రెండు నెలల్లో భవనాన్ని సిద్ధం చేశామని తెలిపారు. ఖమ్మంలో రద్దీ దృష్ట్యా మొదటి మార్ట్ ఇక్కడ ఏర్పాటు చేశామని, దశలవారీగా మిగిలిన మున్సిపాలిటీల్లో తెరుస్తామని చెప్పారు. ఖమ్మంలో ప్రారంభానికి సిద్ధమైన మహిళా మార్ట్ (ఇన్సెట్) మార్ట్లో విక్రయానికి సిద్ధంగా వస్తువులు వాతావరణ ం జిల్లా అంతటా బుధవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.మార్కెటింగ్ లేక.. మహిళా సంఘాల సభ్యులు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నా సరైన మార్కెటింగ్ లేక నష్టపోతున్నారు. దీంతో సొంతంగా కొన్ని షాపులకు సరఫరా చేయడం లేదా వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. తద్వారా శ్రమకు తగిన ఫలితం లభించడం లేదు. కొనుగోలుకు వ్యాపారులు ముందుకొస్తున్నా తక్కువ ధరే లభిస్తుండడంతో నష్టం ఎదురవుతోంది. ఈ నేపథ్యాన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఈ ఉత్పత్తులను పరిశీలించి మార్కెటింగ్ లేదనే విషయాన్ని గమనించారు. దీంతో సూపర్మార్కెట్ తరహాలో మహిళామార్ట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఖమ్మం వైరా రోడ్డులోని జలాంజనేయ స్వామి గుడి పక్కన మెయిన్రోడ్డుపై ఎస్సీ కార్పొరేషన్ పాత భవనాన్ని రూ.30 లక్షలతో ఆధునికీకరించారు. సూపర్మార్కెట్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. న్యూస్రీల్ -
ఆటోమేషన్లో సబ్స్టేషన్ల నిర్వహణ
● ‘రియల్ టైం మేనేజ్మెంట్’ విధానం అమలు ● ఎన్పీడీసీఎల్ పరిధిలోని 100 సబ్స్టేషన్లలో శ్రీకారం ● జానకీపురంలో ఆవిష్కరణకు సిద్ధంఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మానవ రహితంగా నిర్వహించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమేషన్ విధానం అమలుకు ఎన్పీడీసీఎల్(నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఆటోమేషన్ ఆఫ్ సబ్ స్టేషన్ల(స్వయం చలిత విద్యుత్ ఉప కేంద్రాలు) నిర్వహణ అమలవుతోంది. ఈ విధానాన్ని ఎన్పీడీసీఎల్ 33/11 కేవీ సబ్ స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించింది. సంస్థ పరిధిలోని 16 జిల్లాల్లో మొత్తం 1,516 సబ్ స్టేషన్లు ఉండగా తొలుత 100 సబ్ స్టేషన్లలో సరికొత్త విధానం అమలుకు రూ.26.32 కోట్లు వెచ్చిస్తున్నారు. తొలిదఫా జిల్లాలోని 38 సబ్ స్టేషన్లలో ఆటోమేషన్ విధానం అమల్లోకి రానుంది. రియల్ టైం మేనేజ్మెంట్ విధానం సబ్ స్టేషన్ల ఆటోమేషన్కు ‘రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం’ అమలు చేస్తారు. ఇందులో భాగంగా 11 కేవీ విద్యుత్ సరఫరా ఫీడర్ల ఆన్ – ఆఫ్ను ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ వ్యవస్థలతో అనుసంధానిస్తారు. తద్వారా సిబ్బంది అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా ఆపరేట్చేసే అవకాశం ఏర్పడుతుంది. సబ్ స్టేషన్కు సంబంధించి సరఫరా, అంతరాయాలు, ఇతర సాంకేతిక విషయాలను కంపెనీ హెడ్ క్వార్టర్లోని కంట్రోల్ రూమ్, సంబంధిత అధికారుల సెల్ ఫోన్లకు ఎప్పటికప్పుడు సమాచారం చేరుతుంది. తద్వారా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే తక్షణమే తెలుసుకుని.. మరమ్మతు అనంతరం పునరుద్ధరించే అవకాశముంది. ఫలితంగా ఎక్కువ సేపు అంతరాయాలు ఉండకుండా, నాణ్యమైన విద్యుత్ అందుతుందని చెబుతున్నారు. నమ్మకమైన, నిజమైన సరఫరా వివరాలు తెలియనుండడంతో నెట్ వర్క్ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేసుకోవడం వీలవుతుంది. జానకీపురంలో ఫస్ట్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని జానకీపురం సబ్ స్టేషన్లో ఆటోమేషన్ విధానాన్ని తొలిసారి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ విధానం అమలులో ఖమ్మం జిల్లాకు డిస్కం ప్రాధాన్యత ఇచ్చిందని, క్రమంగా నిర్దేశించిన 38 సబ్స్టేషన్లలో అమలు చేయనున్నామని ఖమ్మం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మంగళవారం వెల్లడించారు. -
పథకాల అమలులో మీరే కీలకం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు, పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరిస్తూ అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ఏడాది కంటే ఎక్కువ ధాన్యాన్ని తక్కువ సమయంలో సేకరించడంపై అభినందించారు. పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణతో వచ్చిన అనుభవం ఆధారంగా జూన్ 3నుంచి అన్ని మండలాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించాలని సూచించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ల ద్వారా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని తెలిపారు. కాగా, నకిలీ విత్తనాల జాడ లేకుండా చూడడంతో పాటు ఎవరైనా అమ్మితే పీడీ యాక్ట్ అమలుచేయాలని ఆదేశించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీని వాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు సన్యాసయ్య, శ్రీలత, చందన్కుమార్, భూక్యా శ్రీనివాస్, పుల్ల య్య, రాజేశ్వరి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ● జిల్లాలోని భవిత కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించిన ఆయన మాట్లాడుతూ రానున్న ఇరవై రోజుల్లోగా జిల్లాలోని కేంద్రాల్లో టాయిలెట్లు, వాష్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, ఆకర్షణీయంగా పెయింటింగ్ వేయించాలని తెలిపారు. డీఈఓ సత్యనారాయణ, సీఎంఓ రాజశేఖర్ పాల్గొన్నారు. ● బాలికల సంరక్షణలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్లకు బాలికల రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్పై ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అనుమానితుల గుర్తింపు, వ్యక్తిగత భద్రతపై బాలికలకు అవగాహన కల్పించాలని, అవసరమైనప్పుడు అండగా నిలవాలని సూచించారు. డీఈఓ ఎస్.సత్యనారాయణ, జీసీడీఓ తులసి తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా డెయిరీ కార్యాచరణ వేగవంతం చేయాలి● ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు కార్యాచరణలో వేగం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన ఇందిరా మహిళా డెయిరీ, రాజీవ్ యువ వికాసం, మహిళా మార్ట్ ప్రారంభోత్సవంపై అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. మహిళా డెయిరీ లబ్ధిదారులను ఎంపిక చేసి పశుగ్రాసం పెంప కం, యూనిట్ల కొనుగోలుకు సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల వివరాలను కార్పొరేషన్, బ్యాంకుల వారీగా విభజించాలని చెప్పారు. ఇప్పటివరకు 7,722ప్రతిపాదనలు బ్యాంకులకు పంపగా 5,183 దరఖాస్తులకు సమ్మతి అందిందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు ఎన్.సన్యాసయ్య, నవీన్బాబు, అలీమ్, జ్యోతి, పుల్ల య్య, విజయ లక్ష్మి, శ్రీనివాసరెడ్డి, మధుసూదన్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ పురంధర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేయండి వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్రెడ్డి -
డాక్టర్ రాగమయి !
సత్తుపల్లి: నిత్యం తనిఖీలు, సమీక్షలతో గడిపే సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సోమవారం స్టెతస్కోప్ పట్టుకున్నారు. సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఆమె నర్సింగ్ కళాశాల, అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆతర్వాత మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి శిశువులు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశాక కొందరు చిన్నారులను స్వయంగా పరీక్షించారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారావు, ఎం.డీ.కమల్పాషా, పింగళి సామేలు, జీవన్ పాల్గొన్నారు. -
ప్రారంభానికి ముస్తాబు
● పాఠశాలల్లో చివరి దశకు అభివృద్ధి పనులు ● బడి మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా పర్యవేక్షణ ● తద్వారా తీరనున్న విద్యార్థుల ఇక్కట్లు పనులపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులు విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నాం. అదనపు కూలీలను సమకూర్చుకుని పనులు వేగంగా చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. మా ఉద్యోగులు కూడా నిరంతరం పరిశీలిస్తున్నారు. – సామినేని సత్యనారాయణ, డీఈఓఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్ని వసతులు సమకూర్చేలా మంజూరైన నిధులతో చేపట్టిన పనులు చకచకా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం(2022–23) హయాంలో మన ఊరు –మన బడి, మన బస్తీ –మన బడి ద్వారా జిల్లాలోని 426 పాఠశాలలను ఎంపిక చేసి సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మిగతా పాఠశాలల్లో అవసరమైన వసతులు కల్పిస్తోంది. పనులు ఇలా.. 2022–23లో మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి కింద 426 పాఠశాలలను ఎంపిక చేయగా.. 275 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 151 పాఠశాలలను ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కిందకు చేర్చారు. మొత్తంగా 955 పాఠశాలల్లో అమ్మ ఆదర్శపాఠశాలల పథకం ద్వారా పనులు పూర్తి చేయాలని నిర్ణయించి రూ.35 కోట్లు కేటాయించింది. ఈ నిధుల ద్వారా 895 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో సుమారు రూ.23 కోట్ల బిల్లులు చెల్లించారు. మిగిలిన 60 పాఠశాలల్లోనూ పనులు చివరి దశకు చేరగా విద్యాసంవత్సరం మొదలయ్యేలా నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, పాఠశాలల్లో ప్రధానంగా అదనపు తరగతి గదులు, ప్రహరీలు, టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్ మరమ్మతులు తదితర పనులపై దృష్టి సారించారు. అన్ని సౌకర్యాలు కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి పాఠశాలల్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కాంట్రాక్టర్లకు సూచనలు చేస్తున్నారు. దీంతో విద్యుత్ వైర్లు, పెయింటింగ్, ప్రహరీల నిర్మాణం, చిన్న చిన్న మరమ్మతులు చకచకా సాగుతున్నాయి. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం 14 కేజీబీవీల్లో సైతం సౌకర్యాలు కల్పించేందుకు రూ.5కోట్లు కేటాయించగా, అక్కడ కూడా పనులు వేగంగా చేయిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుతాయని చెబుతున్నారు. -
20 పడకలతో కోవిడ్ వార్డు
ఖమ్మంవైద్యవిభాగం: దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయనే సమాచారంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు సోమవారం ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ ప్రత్యేక వార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇరవై పడకలతో ఈ వార్డును ఏర్పాటు చేయగా, అనుమానిత కేసులు ఉంటే వారికి చికిత్స చేయనున్నారు. అయితే, కరోనా సోకినట్లు గుర్తించడానికి జిల్లాలో ర్యాపిడ్ కిట్లు కానీ ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పా ట్లు లేకపోవడం గమనార్హం. ఈనేపథ్యాన జిల్లాకు 3వేల కిట్లు సరఫరా చేయాలని ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్లు ధరించడమే కాక గుంపులు గుంపులుగా సంచరించొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, శానిటైజర్తో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, జ్వరం, జలుబు, దగ్గు ఉంటే వైద్యులను సంప్రదించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఏకలవ్య కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ భద్రాచలం అర్బన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలల్లో జూనియర్ ఇంటర్లో ఖాళీగా ఉన్న 302 సీట్ల భర్తీకి సోమవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని ఈఎంఆర్ఎస్ కళాశాలలో కన్వీనర్ నాగేశ్వరరావు, ఆర్సీఓ అరుణకుమారి నేతృత్వాన కౌన్సెలింగ్ ఏర్పాటుచేయగా 577 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న 302 సీట్లలో మెరిట్ ప్రకారం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు భద్రాచలం కళాశాల ప్రిన్సిపాల్వందనాబీ దాస్ తెలిపారు. దీంతో కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు విజయ్కుమార్, సంజయ్ మల్కర్, ప్రశాంత్, నితిన్సింగ్, విజయేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేనెలలో 30వరకు బియ్యం పంపిణీ ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రేషన్షాప్ల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని జూన్లో ఒకేసారి అందించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన పలు రేషన్షాపులను తనిఖీ చేసి బియ్యం నిల్వలు, షాప్ల సామర్ధ్యాన్ని పరి శీలించి మాట్లాడారు. జిల్లాలో 4,15,905 కార్డులకు గాను 12,03,943మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. వీరికి 21,915.321మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తామని డీసీఎస్ఓ వెల్లడించారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం ఇవ్వనున్న నేపథ్యాన జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పంపిణీ ఉంటుందని తెలిపారు. బాలికల సంరక్షణ అందరి బాధ్యత ఖమ్మం సహకారనగర్: బాలికలు, మహిళ రక్షణను అందరూ బాధ్యగా భావించాలని జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ సూచించారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆడపిల్లల అక్రమ రవాణా, డ్రగ్స్ కారణంగా ఎందరో అమ్మాయిలు, అబ్బాయిల జీవితాలు నాశనమవుతున్నాయని తెలిపారు. ఈనేపథ్యాన విద్యార్థినీ, విద్యార్థులతో సన్నిహితంగా ఉండే ఉపాధ్యాయులు వారి సామాజిక, మానసిక స్థితిగతులను పరిశీలిస్తూ రక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా జీసీడీఓ అన్నమణి, హెచ్ఎం అజిత, ప్రజ్వల సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్, రిసోర్స్ పర్సన్ సురేష్కుమార్తో పాటు రాము తదితరులు పాల్గొన్నారు. -
బహుదూరపు బాటసారులకు నీడ!
మధిర: పూర్వకాలంలో రాకపోకలకు నడక మార్గం లేదా ఎడ్లబండ్లనే ఉపయోగించేవారు. దీంతో రాత్రివేళల్లోనే కాకుండా మార్గమధ్యలో విశ్రాంతికి ఆగ డం, అక్కడే భోజనం వండుకుని తిన్నాక ముందు కు సాగేవారు. ఇలాంటివారి కోసం వివిధ ప్రాంతా ల్లో సత్రాలు ఉండేవి. కొన్నిచోట్ల భోజనానికి సైతం దాతలు ఏర్పాట్లు చేసేవారు. అలా మధిర మండలం దెందుకూరులోనూ సత్రం నిర్మించగా వేలాది మందికి ఆశ్రయం కల్పించేవారని చెబు తారు. గ్రామానికి చెందిన కపిలవాయి సీతమ్మ నేతృత్వాన సత్రం కోసం పెంకుటిళ్లు నిర్మించగా.. శిథిలావస్థకు చేరడంతో ఆమె కుటుంబానికి చెందిన సుబ్బలక్ష్మి ఆధ్వర్యాన కొన్నేళ్ల క్రితం పునర్నిర్మించారు. రావిచెట్టు సెంటర్.. దెందుకూరులోని రావిచెట్టు సెంటర్లో బాటసారుల సత్రం ఉంటుంది. వందేళ్ల క్రితమే కపిలవాయి సీతమ్మ పూర్వీకులు సత్రంగా పెంకుటిల్లు నిర్మించారని చెబుతారు. అయితే, అది శిథిలావస్థకు చేరడంతో సీతమ్మ వారసులు సుబ్బలక్ష్మి తదితరులు మూడేళ్ల క్రితం అక్కడే నూతన భవనం నిర్మించి కపిలవాయి సీతమ్మ సత్రంగా నామకరణం చేశారు. సత్రం నిర్వహణ కోసం రెండు దుకాణాలను నిర్మించి అద్దెకు ఇచ్చారు. ఈ సత్రం గతంలో కళావేదికగానూ విలసిల్లింది. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక నాటక ప్రదర్శనలు, కళారూపాల ప్రదర్శన ఈ సత్రం వేదికగా ఇచ్చేవారట. ఇక్కడి రావిచెట్టు 150 ఏళ్ల నాటిదని పూర్వీకులు చెప్పేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కాగా, 1969లో తుఫాన్ వచ్చిన సందర్భంగా దెందుకూరు సమీపంలో మద్రాస్ ఎక్స్ప్రెస్ రైలు మూడు రోజులు నిలిస్తే ప్రయాణికులను దెందుకూరులోని ప్రతీ ఇంట ఆదరించారని చెబుతారు. అప్పటికే రావి చెట్టు పక్కన కపిలవాయి సీతమ్మ నిర్మించిన సత్రం ఎందరికో నిలువ నీడను ఇచ్చిందట. అలాగే, నడక మార్గంలో వెళ్లే ప్రయాణికులు, ఎడ్ల బండ్లపై వచ్చివెళ్లే చిరు వ్యాపారులు, సన్నకారు రైతులు ఆశ్రయం తీసుకునేవారని గ్రామంలో చెప్పుకుంటారు. రామాలయ నిర్మాణం తొలినాళ్లలో సత్రం నిర్మిస్తుండగా చేపట్టిన తవ్వకాల్లో శ్రీసీతారాముల విగ్రహాలు బయటపడ్డాయని చెబుతారు. ఈ విగ్రహాలను సత్రానికి సమీపంలో ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్వహణ కోసం కపిలవాయి సీతమ్మ 6.50 ఎకరాల భూమి, ఆంజనేయస్వామి ఆలయానికి 2.50 ఎకరాలు విరాళంగా ఇచ్చారు. శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి కుందా వెంకటేశ్వర్లు 4.07 ఎకరాలు భూదానం చేశారు. తద్వారా వచ్చే ఆదాయం ఆలయ నిర్వహణ సాఫీగా సాగుతోంది. పూర్వకాలం నుంచి రాకపోకలు సాగించే ఎందరికో ఆశ్రయం దెందుకూరులో సత్రం.. ఇటీవల పునర్నిర్మాణం కళాకారుల ప్రదర్శనలకు వేదిక కూడా... -
శుద్ధి.. అబద్ధం
● జిల్లాలో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు ● మినరల్ పేరుతో జనరల్ వాటర్ అమ్మకం ● ఏ ప్లాంట్లోనూ కనిపించని నిపుణులు, పరీక్షలు ● అయినా తనిఖీల మాటే ఎత్తని అధికార యంత్రాంగంఖమ్మంరూరల్: ప్రజలకు ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ, ఆపై మండుతున్న ఎండలతో మినరల్ వాటర్ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నకొందరు గల్లీకొకటి చొప్పున మినరల్ వాటర్ పేరిట ప్లాంట్లు ఏర్పాటుచేసి సాధారణ నీటినే అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ప్లాంట్లు అయితే కిరాణం షాపులు, చిన్న బడ్డీ కొట్లు, రోడ్ల వెంట షెడ్లలో ఏర్పాటుచేయడం గమనార్హం. కేవలం ఒక పెద్ద ట్యాంక్, మరో రెండు బాయిలర్ మాదిరి ట్యాంకులు.. అన్నింటినీ అనుసంధానిస్తూ పైప్లు ఏర్పాటుచేసి ఇవే మినరల్ వాటర్గా అమ్ముతున్నారు. జిల్లాలో ఇలాంటి వెయ్యికి పైగా ప్లాంట్లు ఉన్నాయని తెలుస్తుండగా.. పదుల సంఖ్యలో కూడా అనుమతి లేవని సమాచారం. అయినప్పటికీ అధికారులు మిగతా సమయాల్లో ఏమో కానీ కనీసం వేసవిలోనైనా ఏ ప్లాంట్లోనూ తనిఖీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫిల్టర్ నీరే... వాటర్ ప్లాంట్లలో నీరు శుద్ధి చేయకపోగా సాధారణ ఫిల్టర్ల నీటినే క్యాన్లలో నింపి సరఫరా చేయడం పరిపాటిగా మారింది. వేసవి తాపం నుంచి బయటపడేందుకు చల్లని నీటి కోసం వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తే మరింత ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. గల్లీలో ఉన్న డబ్బా కొట్టు మొదలు హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లు, శుభకార్యాలకు జనరల్ వాటర్నే మినరల్ వాటర్ పేరిట సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు డబ్బు చెల్లించి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లవుతోంది. నిబంధనలకు చెల్లుచీటీ జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నట్లు అంచనా. ఏ ప్లాంట్లో కూడా నీటిశుద్ధికి కనీస ప్రమాణాలు పాటించడం లేదని చెప్పొచ్చు. నాలుగైదు మినహాయించి మిగతా ప్లాంట్లకు బీఎస్ఐ(బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్) గుర్తింపు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇళ్లకై తే ఒక ధర, హోటళ్లు, బార్లకై తే ఇంకాస్త తక్కువ ధరకే నీటి అమ్మకాలు చేస్తున్నారు. ఇలా ఇంటింటికీ సాధారణ నీరే సరఫరా చేస్తున్న నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ ఏదీ? వాటర్ ప్లాంట్లను నిత్యం తనిఖీ చేయాల్సిన అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ప్లాంట్ల విషయంలో మున్సిపాలిటీ, రెవెన్యూ, ఆహార భద్రత, పర్యావరణ, ఆర్డబ్ల్యూఎస్ తదితర అధికారులు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలే లేవు. తరచూ పర్యవేక్షిస్తూ నీటిని ప్రయోగశాలలో పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా తనిఖీ చేయడం.. ఆపై చర్యల విషయంలో మీనమేషాలు లెక్కించడం పరిపాటిగా మారింది. ఇకనైనా అధికారులు స్పందించి అనధికారిక మినరల్ వాటర్ ప్లాంట్లపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.నిబంధనలు ఇలా.... వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే, ప్లాంట్లలో ల్యాబ్ ఏర్పాటుచేసి కెమిస్ట్లు, మైక్రో బయాలజిస్టులను నియమించాలి. వీరి ఆధ్వర్యాన ప్రతీరోజు నీటి పరీక్షలు చేశాకే సరఫరా చేయాలి. క్యాన్లను పొటాషియం పర్మాంగనేట్తో శుభ్రం చేయాలి. అలాగే, నీటిని నింపే ముందు క్యాన్ను అల్ట్రా వైరస్ రేస్తో శుభ్రపర్చాలి. అంతేకాక, సిబ్బంది చేతులకు గ్లౌస్లు వాడాలి. శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన పెద్ద ట్యాంక్లో నింపి ఓజోనైజేషన్ చేయాలి. అలాగే, క్యాన్లపై ధర, ప్లాంట్ పేరు, ఇతర వివరాలన్నీ ముద్రించాలి. కానీ జిల్లాలోని ఏ ప్లాంట్ నుంచి సరఫరా అవుతున్న క్యాన్ను పరిశీలించినా ఇవేవీ కనిపించవు. -
అంతర్రాష్ట సైబర్ నేరగాళ్లు అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్లైన్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్లో డబ్బు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి రూ.1.62కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోనకల్ మండలానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆన్లైన్ ట్రేడింగ్ లాభాల పేరిట నమ్మించారు. దీంతో ఆయన రూ.1.62కోట్లు చెల్లించగా.. ఆపై ముఖం చాటారు. దీంతో సదరు వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, సీపీ సునీల్దత్ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. తొలుత ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన షేక్ సుభానీని అదుపులోకి తీసుకుని విచారించగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దాసరి సునీల్కుమార్, సుదలగుంట్ల సాయికృష్ణ కూడా ఈ మోసంలో ఉన్నట్లు తేలింది. ఈమేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్, సీఐ యాసిన్అలీ, ఎస్ఐలు రంజిత్, విజయ్కుమార్, సిబ్బందిని సీపీ అభినందించారు. సన్నబియ్యం దందా మొదలు..తిరుమలాయపాలెం: రేషన్షాపుల్లో దొడ్డు బియ్యంకు బదులు ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తోంది. దీంతో లబ్ధిదారులంతా బియ్యం సొంతానికి వాడుకుంటారని, తద్వారా అక్రమాలు జరగవని భావించారు. కానీ అది తప్పని తేలిపోయింది. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 13.5 క్వింటాళ్ల సన్న రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన వడ్డెబోయిన నరేష్ ఇంట్లో పిండిప్రోలుకు చెందిన వ్యాపారి మడికంటి రామయ్య బియ్యం నిల్వ చేశాడు. ఈ సమాచారంతో పోలీసులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే, సదరు వ్యాపారి బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద కొన్నాడా, డీలర్ల నుంచి సేకరించాడా తేలాల్సి ఉందని సమాచారం. డివైడర్ను ఢీకొని కారు బోల్తావైరా: అతి వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొట్టగా కారు బోల్తా పడింది. ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీ.కొత్తూరుకు చెందిన మన్నెక సత్యనారాయణ, దేవప్రసాద్ కారులో సోమవారం కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈక్రమాన వైరా పాత బస్టాండ్ సమీపంలో ఆదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, దేవప్రసాద్కు స్వల్పంగా గాయపడడంతో స్థానికులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. -
ఫిర్యాదులను పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ప్రతీ దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో ప్రజావాణి(గీవెన్స్ డే)లో భాగంగా సోమవారం ఆమె మరో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన శ్రీజ మాట్లాడుతూ ప్రజలు అందించిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులు కొన్ని... ● ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు బి.సీతమ్మ, షేక్ రజియా సుల్తానా, ఎం.సావిత్రి తదితరులు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని చెప్పి ఇప్పుడు రెండో విడతగా వస్తాయని అంటున్నారని ఫిర్యాదు చేశారు. ఇళ్లను తమకు మొదటి దశలోనే ఇప్పించాలని కోరారు. అలాగే, వేంసూరు మండలం కుంచుపర్తికి చెందిన కర్ణి దుర్గ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు. ● బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన పి.రాంబాబు ఉపాధి హామీ పథకం పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ● తల్లాడ మండలం బాలప్పేటకు చెందిన జి.వీరయ్య 2008 నుంచి గ్రామంలో ఉపాధి హామీ పథకం సీనియర్ మేట్గా పనిచేస్తు న్నాడు. దీంతో తనకు ఫీల్డ్ అసిస్టెంట్గా అవకాశం ఇవ్వాలని కోరారు. ‘గ్రీవెన్స్ డే’లో అదనపు కలెక్టర్ శ్రీజ -
విద్యుత్ ఫీడర్లపై ఇండికేటర్లు
● అంతరాయం ఏర్పడిన భాగాన్ని గుర్తించేలా ఏర్పాటు ● 18 ఫీడర్ల పరిధిలో 79 ప్రదేశాల్లో ఏర్పాటుకు కసరత్తు ● ఇప్పటికే మధిర – ఎర్రుపాలెం లైన్లో పనులుఖమ్మంవ్యవసాయం: విద్యుత్ వ్యవస్థ సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది. మెరుగైన సరఫరా, అంతరాయాలను నియంత్రించడమే లక్ష్యంగా సంస్థ ‘ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సాంకేతిక కారణాలతో లైన్లలో తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయాన లైన్ మొత్తాన్ని తనిఖీ చేయకుండా బ్రేక్ డౌన్ అయిన ప్రాంతాన్ని గుర్తించేలా ఈ ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్(ఎఫ్పీఐ)లు ఉపయోగపడతాయి. వీటిని 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఫీడర్లపై ఏర్పాటు చేస్తుండడంతో సమస్య ఎదురైన ప్రాంతాన్ని గుర్తించి నేరుగా అక్కడకే వెళ్లి మరమ్మతు చేయనుండడంతో ఉద్యోగులపై భారం తగ్గుతుంది. అంతేకాక త్వరగా సరఫరా పునరుద్ధరించడానికి వీలవుతుంది. మొదలైన పనులు జిల్లాలో 18 విద్యుత్ ఫీడర్లలో సాంకేతికంగా అవసరమైన 79 ప్రదేశాల్లో ఎఫ్పీఐల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు జిల్లాలోని మధిర నుంచి ఎర్రుపాలెం వరకు 40 కి.మీ. పొడవైన 33 కేవీ విద్యుత్ లైన్లో గుర్తించిన ప్రదేశాల్లో ఐదు ఇండికేటర్లు, జానకీపురం నుంచి వెలువడే గ్లొపూడి ఫీడర్లో మరో ఐదు ఇండికేటర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఖమ్మం సర్కిల్లో గుర్తించిన ఇతర ప్రాంతాల్లోనూ ఇండికేటర్ల ఏర్పాటుకు కసరత్తు సాగుతుండగా ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారితో కూడిన అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. ఈ సందర్బంగా ఎస్ఈ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడిన భాగాన్ని త్వరగా గుర్తించేలా ఎఫ్పీఐలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తద్వారా విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కృషి
ఖమ్మంసహకారనగర్: అన్ని వసతులు, నాణ్యమైన బోధన అందుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, తద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు కోసం యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రచార జాతాను ఖమ్మంలో సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలాలు ఉండడమే కాక ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అందుతాయని తెలిపారు. కాగా, తొలిరోజు ఖమ్మంలోని వైరా రోడ్డు, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లెందు క్రాస్ రోడ్డు తదితర ఏరియాల్లో ప్రచార జాతా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావుతో పాటు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బానోత్ రాందాస్, లివిన్ స్టన్, ధర్మసోత్ నాగేశ్వరరావు, పినపాక సురేష్, కట్టా పద్మ, వి.దామోదర్, ఉద్దండ్, మంగీలాల్, నెల్లూరి వీరబాబు, ఏడునూతల రవికుమార్, జి.బిక్షపతి, యు.నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్, శివకోటి తదితరులు పాల్గొన్నారు.టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి -
ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు
తిరుమలాయపాలెం: చోరీ కేసులో వివక్ష ప్రదర్శించి తన కుమారుడు దారమల్ల సందీప్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఎస్ఐతో పాటు ఎర్రగడ్డ గ్రామానికి చెందిన అభిలాష్పై చర్యలు తీసుకోవాలని ఆయన తండ్రి తిరుప య్య కోరారు. ఈసందర్భంగా హైదరాబాద్లో సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు అందజేశారు. చోరీకేసులో ఇతర కులస్తులు ఉన్నా తన కుమారుడిని బెదిరించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ మేరకు ఎస్సైపై చర్యలు తీసుకోవడమే కాక తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందించూలా చూడాలని కోరారు. తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలివైరా: రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడమే కాక అభివృద్ధి పనులకు తగిన నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వైరాలో సోమవారం జరిగిన పార్టీ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 నెలలుగా గ్రామాల్లో పాలక మండళ్లు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అందడం లేదని తెలిపారు. ఫలితంగా సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని సూచించారు. అలాగే, సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా జరిగేలా నిధులు కేటాయించాలని, కారేపల్లి, కామేపల్లి ఏజెన్సీ మండలాలకు సాగు నీరు అందేలా చూడాలని కోరారు. సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నందున నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా నిఘా పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు మచ్చా మణి, సుంకర సుధాకర్, తాళ్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ, కొండెబోయిన నాగేశ్వరరావు, తోట నాగేశ్వరరావు, దొంతెబోయిన నాగేశ్వరరావు, కె.నరేంద్ర, కుటుంబరావు, శ్రీనివాసరెడ్డి, రామారావు, బాలాజీ, శ్రీనివాస్, తాతా పద్మ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి కూసుమంచి: కూసుమంచికి చెందిన భోగి శ్రీకాంత్(28) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భోగి వెంకన్న ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన శ్రీకాంత్ తండ్రితో ఉంటున్నాడు. ఆయన సోదరులకు వివాహాలు కాగా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఈక్రమాన శ్రీకాంత్, ఆయన తండ్రి ఆదివారం రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీకాంత్ సోదరుడి భార్య కూసుమంచి రాగా, ఇంటి తలుపులు వేసి ఉండడంతో బలంగా శబ్దం చేయడంతో మామ వెంకన్న తలుపులు తెరిచాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా చాపపై కింద పడుకున్న శ్రీకాంత్ విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. కాగా, శ్రీకాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆయన సోదరుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అర్హులైన గిరిజనులంతా లబ్ధి పొందాలిభద్రాచలం: అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా, వారు లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించాక మాట్లాడారు. అర్హతల మేరకు దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. గిరిజనులు సైతం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని అన్నారు. కాగా, టేకులపల్లి మండలం మూర్తులతండాకు చెందిన లక్ష్మయ్య తమ పొలంలో బోరు బావికి, పెనుబల్లి మండలం గట్టిగూడెంకు చెందిన నాగేశ్వరరావు కరెంటు మోటారుకు, జూలూరుపాడు మండలం కర్రెవారి గూడెంకు చెందిన రాంబాబు ట్రైకార్ రుణం కోసం, అశ్వారావుపేట మండలం అయ్యవారిగూడెంకు చెందిన కృష్ణ రోడ్లు, కరెంటు ఏర్పాట్లకు, పాల్వంచ మండలం పునుకుల గ్రామానికి చెందిన వెంకటమ్మ క్రాప్ లోన్ కోసం దరఖాస్తులు సమర్పించారు. ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
వేంసూరు: ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు సహా ఇద్దరు మృతి చెందారు. వేంసూరు మండలంలో చోటు చేసుకున్న ఈ ప్రమా దం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన నగరకంటి నాగరాజు(38), ఆదివారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన బొల్లిపోగు కృష్ణకుమార్(12) తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జయలక్ష్మీపురం నుంచి కొండెగట్ల ప్రధాన రహదారి వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలోని కొండెగట్ల చెరువు మూలమలుపు వద్ద ద్విచక్ర అదుపు తప్పి కింద పడ్డాక రహదారిపై రాసుకుంటూ వెళ్లి ఎదురుగా కూలీలతో వచ్చిన ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన నాగరాజు ఘటనాస్థలిలోనే మృతి చెందగా కృష్ణకుమార్ను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుల్లోకృష్ణ కుమార్ ఆరో తరగతి చదువుతుండగా, నాగరాజుకు కుమారుడు, కుమార్తె ఉన్నా రు. ఘటనపై కృష్ణకుమార్ తండ్రి ముత్తారావు ఫిర్యాదుతో కేసు నమెదు చేసినట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. వాహనం ఢీకొని మహిళ...వైరా: రోడ్డు దాటుతున్న మహిళను టాటా ఏస్ ఢీనడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందింది. వైరా యా దవబజార్కు చెందిన లక్ష్మి(52) సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతోంది. ఇదేసమయాన ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వస్తున్న టాటా ఏస్ ఆమెను ఢీకొనడంతో తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందు తూ ఆమె మృతిచెందింది. లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు. లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు...చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి సమీపాన సోమవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం దివ్యాంగుల కాలనీకి చెందిన షేక్ అఫ్జల్పాషా(40) సెంట్రింగ్ మేసీ్త్ర కాగా, సోమవారం పందిళ్లపల్లిలో ఓ ఇంటి నిర్మాణ పనులు మాట్లాడుకుని తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో గ్రామ సమీపాన వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో కింద పడిన ఆయన పైనుంచి లారీ వెనుక టైరు వెళ్లగా అఫ్జల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ప్రమాద సమయంలో ఖమ్మం నుంచి పందిళ్లపల్లి వస్తున్న మేకల నాగేశ్వరరావు తన బైక్తో అఫ్జల్ పాషా వాహనాన్ని ఢీకొట్టడంతో ఆయనకు సైతం గాయాలయయ్యాయి. ఈ గటనతో రెండు వైపులా రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, అఫ్జల్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి..తల్లాడ: తల్లాడ మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని అన్నారుగూడెంకు చెందిన సూదాకృష్ణయ్య(53) ఆయన భార్యకు మాత్రలు తీసుకొచ్చేందుకు ఆదివారం అర్ధరాత్రి మోటార్ సైకిల్పై తల్లాడ వస్తుండగా లక్ష్మీనగర్ వద్ద గేదెలు అడ్డు రావడంతో వాటిని తాకి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను 108లో ఖమ్మంకు, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.కొండల్రావు తెలిపారు. గేదెను ఢీకొని వాహనదారుడు..దమ్మపేట: గేదెను బైక్ ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామానికి చెందిన కూరం చంటి(36) తన బైక్పై దమ్మపేట మండలంలోని అంకంపాలెం వైపునకు సోమవారం రాత్రి వెళ్తున్నాడు. అయితే, గండుగులపల్లి శివారుకు చేరుకునే సరికి చీకట్లో రోడ్డుపై గేదెను గమనించక ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంటి అపస్మారక స్థితిలోకి వెళ్లగా స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చంటి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
దివ్యాంగుడిని ఆదుకోండి..
మధిర: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన దివ్యాంగుడిని ఆదుకోవాలని ఆయన తల్లి కోరుతోంది. మధిర ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ముత్తారపు చిరంజీవి – శారద దంపతులకు దివ్యాంగుడైన కుమారుడు శ్రీనివాస్, కుమార్తె శివాని ఉన్నారు. చిరంజీవి కొన్నేళ్లుగా ఆటో అద్దెకు తీసుకుని నడిపిస్తుండగా, ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఉపాధి దూరమైంది. దీంతో శివాని చదువు భారంగా మారింది. దీనికి తోడు దివ్యాంగుడైన శ్రీనివాస్కు వచ్చే రూ 4వేల పెన్షన్ ఆయన బాగోగులకు సరిపోవడం లేదని చిరంజీవి దంపతులు వాపోతున్నారు. పుట్టుకతో కాళ్లు, చేతులు పనిచేయని శ్రీనివాస్కు 28ఏళ్లు వచ్చినా ఏ పని చేసుకోలేని స్థితి కావడంతో ఎవరో ఒకరు పని మానుకుని ఇంటి వద్దే ఉండాల్సి వస్తోంది. కనీసం సొంత ఇల్లు కూడా లేని తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే కాక, కేర్ టేకర్ వేతనం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
కేంద్రం, ఏపీ ప్రభుత్వాలవి ఫాసిస్ట్ చర్యలు
ఖమ్మంమయూరిసెంటర్: ఈనెల 21న జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా కేంద్రంతోపాటు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఫాసిస్ట్ చర్యలకు పాల్పడుతోందని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతదేహాలకు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు భయపడుతున్నాయని తెలిపారు. ఇప్పటికై నా మృతదేహాలను బంధువులకు అప్పగించి.. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా చూడడంతో పాటు నిర్బంధం, బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వాలు, పోలీసుల వైఖరి గమనిస్తే మావోయిస్టులను పట్టుకొచ్చి కాల్చి చంపినట్లుగా వస్తున్న వార్తలను విశ్వసించాల్సి వస్తోందని తెలిపారు. మధ్య భారతంలో నరమేధం సృష్టిస్తున్న పాలకులు, సరిహద్దుల్లో చేయాల్సిన యుద్ధం దండకారణ్యంలో చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లు, ఆదివాసీల మరణా ల పై న్యాయ విచారణచేయాలని రంగారావు డిమాండ్ చేశారు. మాస్లైన్ రాష్ట్ర నాయకుడు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్స య్య మాట్లాడగా నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, గుండమళ్ల రామయ్య, ఝా న్సీ, మలీదునాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
ఆగని దందా
అదే పంథా..కింద రిజిస్ట్రార్ కార్యాలయం, పై అంతస్తులో డాక్యుమెంట్ రైటర్ల ఆఫీస్లుజిల్లాలో గతంలో పనిచేసిన అధికారులను మార్చి కొత్త వారిని నియమించినా అవినీతి ఆగకపోవడం గమనార్హం. తాజాగా ఏసీబీ అధికా రుల వలలో చిక్కిన ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ జె.అరుణ వ్యవహార శైలిపై కొన్ని నెలలుగా ఆరోపణలు వస్తున్నాయి. మూడు నెలల క్రితం ఆమైపె కొందరు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా తీరు మార్చుకోని ఆమె.. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి టార్గెట్లు విధించి వారి ద్వారా వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఏకంగా వెండర్లకు స్టాంప్లు విక్రయించడంలోనూ అదనపు వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులొచ్చాయి. ఇవన్నీ భరించలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పట్టుబడడం గమనార్హం. ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే వాటిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే, ఈ శాఖలో ఎన్ని మార్పులు, చేర్పులు చేసినా.. సంస్కరణలు తీసుకొచ్చినా గాడిన పడడం లేదన్న విమర్శలున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లు, దందా చర్చనీయాంశంగా మారుతోంది. కొందరు అధికారుల తీరుతో శాఖ మొత్తానికి మచ్చ పడుతోందని చెబుతున్నారు. అవినీతిపరులైన అధికారుల స్థానాలు మార్చినా, జిల్లాలు దాటించినా పాత వాసనలు మాత్రం వీడడం లేదు. వైరా కార్యాలయంలో ఒకేరోజు 100మేర డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కాగా.. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ జె.అరుణ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.30వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుపడ్డారు. ఇలాంటి ఘటనలతో శాఖలో అవినీతి దందా ఆగలేదని స్పష్టమవుతోంది. ప్రైవేట్ సైన్యం అండతో... కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చే భూయజమానులకు డాక్యుమెంట్లు సమకూర్చేందుకు రైటర్లు ఉంటారు. ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఏళ్లుగా జీవనాధారం పొందుతున్నారు. అయితే, వీరిని ఆలంబనగా చేసుకుని సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏ పని అయినా డాక్యుమెంట్ రైటర్ ద్వారా వస్తే త్వరగా అవుతుందని, నేరుగా వెళ్తే పని కాదనే నమ్మకం ఏర్పడడంతో భూయజమానులంతా తొలుత వీరిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వర్తించిన ఓ అధికారి.. ప్రైవేట్ వ్యక్తులను డాక్యుమెంట్ రైటర్లుగా వినియోగించుకున్నారు. వీరు ఏకంగా ప్రభుత్వ స్థలాన్నే రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సదరు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్పై వేటు పడింది. సోమవారం కూడా డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిగా వ్యవహరించి సబ్ రిజిస్ట్రార్ తరఫున నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్ల ఆగడాలు పెరిగిపోయాయని, వారు అధికారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ.. దస్త్రాల రిజిస్ట్రేషన్కు వచ్చే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు సైతం తమ చేతికి మట్టి అంటకుండా వీరి ద్వారానే వసూళ్లకు పాల్ప డుతున్నారనే అంశం నిరూపితమవుతోంది.అడుగడుగునా అక్రమాలేస్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలు ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ జిల్లాలు మార్చినా మారని తీరు ఏసీబీ అధికారుల వలలో చిక్కిన ఖమ్మం రూరల్ సబ్రిజిస్ట్రార్ జిల్లాలో అనేకం.. గత నాలుగైదేళ్లలో జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసి సస్పెండ్కు గురయ్యారు. ఇక 2020 మే నెలలో మధిరలోని ఎకై ్సజ్ కార్యాలయ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్పై వేటు పడింది. వీటితోపాటు అనేక స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి పలువురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్లకు గురైన ఘటనలు ఉన్నాయి. కూసుమంచి, వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలు బయటపడడంతో విధుల నుంచి తొలగించారు. ఈ అవినీతిని నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా శాఖను ప్రక్షాళన చేస్తూ సీనియర్ అసిస్టెంట్ నుంచి సబ్రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ స్థాయి అధికారులందరినీ ప్రస్తుత స్థానాల నుంచి పక్క జిల్లాలకు బదిలీ చేయించారు. -
దేశం జోలికొస్తే సత్తా చూపిస్తాం
ఖమ్మం మామిళ్లగూడెం : దేశం జోలికొస్తే నారీమణుల సత్తా చూపిస్తామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం ఖమ్మంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పహల్గాం ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్రమోడీ తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇకపై దేశం జోలికొస్తే చావు తప్పదనేలా ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం హర్షణీయమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ఆర్మీ అధికారులు తగిన శాస్తి చేశారని చెప్పారు. ఇకపై దేశం జోలికి రావాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైరాలో సోమవారం జరిగే తిరంగా యాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జవాన్లకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ సన్నే ఉదయ్ప్రతాప్, నాయకులు బండారు నరేష్, నకరికంటి వీరభద్రం, విజయారెడ్డి, దొడ్డా అరుణ, పమ్మి అనిత, నీరుకొండ ఉషారాణి, శ్రీరామనేని మణి, మంద సరస్వతి, రజినీరెడ్డి, సురేఖ, కనగంటి నాగమణి, దార్ల మల్లేశ్వరి, శిరీష పాల్గొన్నారు.బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి -
వైభవంగా వేంకటేశ్వరస్వామి తిరునక్షత్ర వేడుకలు
ఏన్కూరు: మండలంలోని నాచారం–రేపల్లెవాడ గ్రామాల మధ్య స్వయంభూగా వెలసిన అద్భుత వేంకటేశ్వర స్వామివారి 23వ తిరు నక్షత్ర వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, పుణ్యావాచనం, రక్షాబంధనం, 108 కలశాలతో ఆభిషేకం, మూలమంత్ర హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అర్చకులు నల్లాన్చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, సత్యనారాయణాచార్యులు, తిరుమల సత్యనారాయణాచార్యులు ప్రత్యేక పూజలు చేయగా ఆలయ నిర్మాణ దాత మొగిలి శ్రీనివాసరెడ్డి దంపతులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరయ్యారు. ముగిసిన డీడీఎన్ దరఖాస్తు గడువు ● ఉమ్మడి జిల్లాలో 210 ఆలయాల నుంచి దరఖాస్తులు ఖమ్మంగాంధీచౌక్: దేవాలయాల నిర్వహణ కోసం రూపొందించిన ధూప దీప నివేదన(డీడీఎన్) పథకం దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. ఈనెల 1న రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 210 ఆలయాల నుంచి దరఖాస్తులు అందాయి. ఇందులో ఖమ్మం జిల్లా నుంచి 145, భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి 65 దరఖాస్తులు ఉండగా, అధికారులు పరిశీలనప్రారంభించారు. కనీసం 15ఏళ్ల చరిత్ర కలిగి, దేవాదాయ శాఖలో రిజిస్టర్ అయిన ఆలయాల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తుండగా, అర్హత ఉన్న వాటి దరఖాస్తులను రాష్ట్ర కమిషనర్కు నివేదికను పంపిస్తారు. ఆతర్వాత ఆలయాలకు పడితరం(ధూప దీప నివేదన) కింద రూ.4 వేలు, అర్చకుల గౌరవ వేతనంగా రూ.6 వేలు అందిస్తారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 450 దేవాలయాలకు అమలవుతోంది. నేటి నుంచి శిక్షణఖమ్మం సహకారనగర్ : జిల్లాలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న 647 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు సోమవారం నుంచి జూలై 26వ తేదీ వరకు (పనిదినాల్లో) 50రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. టీటీడీసీలో 217 మందికి, ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో 215 మందికి, ప్రభుత్వ పీజీ కళాశాలలో 215 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తుదారులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. 21 మంది సర్వేయర్లతో పాటు ఆరుగురు రిటైర్డ్ సర్వేయర్లతో శిక్షణ ఇప్పించనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు తమకు కేటాయించిన శిక్షణ కేంద్రానికి వచ్చే సమయంలో ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు మరొక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చనభద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆదివారం సువర్ణ పుష్పార్చ నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన చేశారు. అనంతరం బేడా మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశాక.. స్వామివారికి కంకణఽ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణఽ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
వృత్యంతర శిక్షణతో అనేక ఉపయోగాలు
ఖమ్మంరూరల్: వేసవి సెలవుల్లో ఇస్తున్న వృత్యంతర శిక్షణతో ఉపాధ్యాయులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని డీఈఓ ఎస్.సత్యనారా యణ అన్నారు. మండలంలోని జలగంగనర్ ఉన్నత పాఠశాలలో ఐదురోజులుగా ఇస్తున్న శిక్షణ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈ శిక్షణతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమై బోధన అందుతుందని తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని పి.వెన్నెల పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ప్రైవేట్ పాఠశాలల కంటే సర్కారు స్కూళ్లలో మెరుగైన బోధన అందుతుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అనంతరం వెన్నెలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఏఎంఓ రవికుమార్, ఎంఈఓ శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్క్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
ఖమ్మంసహకారనగర్: జేఈఈ మెయిన్స్ పేపర్–2(బీ–ఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు విద్యార్థులను అభినందించి మాట్లాడారు. పి.సాయికుమార్ ఆలిండియా 55, ఎ.గోవర్దన్ 129 ర్యాంకు సాధించారని తెలిపారు. అలాగే, వి.ప్రణతి 210వ ర్యాంక్, ఎం.ప్రహ్లాద్ 275, బి.వంశీ 292, వి.కుశాల్ 339, డి.అరుణ్ 368, హనుమంత్ సాయి 493, పి.సాయిప్రకాష్ 570 ర్యాంకులు సాధించగా.. 594, 620, 710,712, 728, 751, 778, 892, 918, 953, 982 ర్యాంకులు తమ విద్యార్థులకు వచ్చాయని వెల్లడించారు. -
మెరిసిన హార్వెస్ట్ విద్యార్థులు
ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్స్ బీ–ఆర్క్, ప్లానింగ్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఆల్ఇండియా టాప్ ర్యాంకులు సాధించారని హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఎన్సీహెచ్.జస్వంత్సాయి 38వ ర్యాంకు, ఎం.నాగయశ్వంత్ 117, వై.సాయినేహా 128, బి.ప్రణీత 141, వేముల సాయిదీపక్ 206, పి.క్రిష్సాత్విక్ 225, వి.శరణ్ గోపాల్స్వామి 253, ఎన్.రాఘవేంద్ర నవనీత్ 302, కందుల రోహిత 346, కమతం విన్య 363 ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారితో పాటు అధ్యాపకులు అభినందించారు. -
సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి
తిరుమలాయపాలెం/కూసుమంచి: సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేపడుతూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా – మన్నెగూడెం, పాతర్లపాడు క్రాస్ – రావి చెట్టు తండా, మహ్మదాపురంలో బోడతండా – సుబ్లేడు, మేడిదపల్లి రోడ్డు – భవాని గుడి వరకు రహదారులతో పాటు తెట్టెలపాడులో అంతర్గత సీసీ రహదారుల నిర్మా ణం, కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో రహదారి నిర్మాణానికి మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుచేయగా, మిగతావి కూడా త్వరలోనే అమలుచేస్తామని తెలిపారు. కాగా, ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితా ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత మంజూరు పత్రాలు ఇస్తుండగా, ఎక్కడా పొరపాటు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, మంత్రి తన పర్యటనలో భాగంగా పలువురు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పీఆర్ ఎస్ఈలు యాకూబ్, వెంకట్రెడ్డి, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఆర్డీఓ నర్సింహారావు, ఏడీఏ సరిత, తహసీల్దార్లు లూథర్ విల్సన్, కరుణశ్రీ, ఎంపీడీఓలు సిలార్ సాహెబ్, వేణుగోపాల్రెడ్డితో పాటు చావా శివరామకృష్ణ, రామసహాయం నరేష్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, మంగీలాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే అర్చకులు స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించారు. ఆతర్వాత తెలంగాణ, ఏపీ నుంచి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ, ఉద్యోగులు పాల్గొన్నారు. పాలిసెట్ టాప్–15లో జిల్లా విద్యార్థులు ● 1, 9వ ర్యాంకులతో సత్తా ఖమ్మంసహకారనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను శనివారం విడుదల చేశారు. టాప్–15 ర్యాంకులతో జాబితా విడుదల చేయగా, ఇందులో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఈమేరకు తూమాటి లాస్యశ్రీ ఎంపీసీ, బైపీసీలో 120కి 120మార్కులతో రెండు విభాగా ల్లోనూ రాష్ట్ర ప్రథమస్థానం సాధించడం విశేషం. అలాగే, కాజా హరిదీప్ రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. కాగా, ఖమ్మం న్యూ విజన్ పాఠశాల విద్యార్థులు తూమాటి లాస్యశ్రీ రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు, కోట సాత్విక రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ జే.వీ.మైఖేల్ తెలిపారు. పదో తరగతి ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయి టాప్ మార్కులు సాధించిన తమ విద్యార్థులు పాలిసెట్లోనూ సత్తా చాటారని పాఠశాల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ వెల్లడించారు. ఈమేరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. -
పాలిసెట్లో త్రివేణి విద్యార్థులకు ర్యాంకులు
పాలీసెట్ ఫలితాల్లో ఖమ్మం త్రివేణి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. ఈమేరకు శనివారం ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. పాఠశాల విద్యార్థి సరయు 120మార్కులకు గాను 109 మార్కులతో రాష్ట్రస్థాయి 187వ ర్యాంక్ సాధించగా, ప్రణవి 106 మార్కులతో 339వ ర్యాంక్, వెంకట వర్షిత్ 107 మార్కులతో 481, చరిత 103 మార్కులతో 529వ ర్యాంకు సాధించగా, శాహిస్త 1,340, మాన్హైత 1,357, హమ్సికా 1,823వ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. ఈమేరకు విద్యార్థులను డైరెక్టర్ గొల్ల పూడి వీరేంద్ర చౌదరి, కృష్ణవేణి – త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, కాట్రగడ్డ మురళీకృష్ణతో పాటు స్వప్న, ముస్తఫా, అశోక్, చార్లెస్, సందీప్, ఉపాధ్యాయులు అభినందించారు. -
ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి
వైరా: తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగానే ప్రణాళికాయుతంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వైరాలోని ప్రభుత్వ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను డిప్యూటీ సీఎం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ రంగాల్లో నియామకాలు చేపడుతూనే, యువత ఉపాధి కోసం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు జాబ్మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉద్యోగం చేస్తూనే లక్ష్యసాధనకు ప్రయత్నించాలని సూచించారు. రూ.100కోట్ల వ్యయంతో సాగునీరు వైరా రిజర్వాయర్, సాగర్ కాల్వల ద్వారా ఇతర చెరువులకు సమృద్ధిగా గోదావరి నీరు అందించా లనే లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతల పథకం కింద ప్రత్యేకంగా రూ.100కోట్ల వ్యయంతో రాజీవ్ కెనాల్ నిర్మించామని భట్టి తెలిపారు. వైరా రిజర్వాయర్ కాల్వల ఆధునికీకరణకు రూ.44 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే, పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యనందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. అంతేకాక ఐటీఐని అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సహకారంతో జాబ్మేళా విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆతర్వాత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ తదితరులు మాట్లాడారు. కాగా, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన యువతకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామకపత్రాలు అందజేశారు. జాబ్మేళాకు 5వేల మందికి పైగా నిరుద్యోగ యువత హాజరుకాగా, 92కంపె నీల్లో 4,448 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, సింగరేణి జీఎం శాలేం రాజు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, నూతి సత్యనారాయణ, శీలం వెంకటనర్సిరెడ్డి, దొబ్బల సౌజన్య, దార్న రాజశేఖర్, బానోత్ విజయబాయి, కోసూరి శ్రీను, పమ్మి అశోక్ పాల్గొన్నారు. ప్రణాళికాయుతంగా యువతకు ఉపాధి అవకాశాలు వైరా జాబ్మేళాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటెత్తిన నిరుద్యోగులు – 8లో... -
సన్న ధాన్యం బోనస్ జమ
జిల్లాలో 9,156 మంది రైతులకు రూ.35.73 కోట్లునేలకొండపల్లి: యాసంగి సీజన్లో సన్నధాన్యం సాగు చేసి ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్ విడుదల చేసింది. ఈమేరకు జిల్లాలోని 9,156 మంది రైతులు 7,14,798.40 క్వింటాళ్ల ధాన్యం విక్రయించగా, వీరి ఖాతాల్లో క్వింటాకు రూ.500 చొప్పున రూ.35,73,99,200 కోట్ల బోనస్ శనివారం జమ చేశారు. ఈసందర్భంగా మండలాల వారీగా రైతులు, విక్రయించిన ధాన్యం, అందించిన బోనస్ వివరాలను వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో 2,356 మంది రైతుల నుంచి 1,73,527.60 క్వింటాళ్లు, బోనకల్ మండలంలో తక్కువగా 16 మంది రైతుల నుంచి 635.60 క్వింటాళ్ల సన్నధాన్యం కొనుగోలు చేశారు. -
అహర్నిశలు కష్టంతోనే ఈ స్థాయికి...
ఖమ్మం మామిళ్లగూడెం: విద్యార్థి దశ నుండి ప్రగతిశీల ఉద్యమాలు, జీవితంలో ఆటుపోట్లు, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా పడిన కష్టమే తనను ఈ స్థాయికి చేర్చిందని సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల సమాచార హక్కు చట్టం కమిషనర్గా నియమితులైన ఆయనను శనివారం ఖమ్మంలో వివిధ సంఘాల ఆధ్వర్యాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ స్నేహితులు తనను సన్మానిస్తుండడాన్ని గర్వంగా భావిస్తున్నానని, ఇదే సమయంలో నూకల నరేష్రెడ్డి, తన తల్లితో పాటు బుడాన్ బేగ్ ఉంటే మరింత సంతోషించేవారని తెలిపారు. అనంతరం ఆయన సతీమణి సృజన మాట్లాడగా ‘ఆ చల్లని సముద్ర గర్భం’ పాట పాడి ఉద్యమ రూపాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ జీ.వీ. బిచ్చాల తిరుమలరావు, ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షత వహించగా టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా కార్యదర్శి చిర్రా రవి, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వరావు, ఏనుగు వెంకటేశ్వరావుతో పాటు వెన్నబోయిన సాంబశివరావు, ఉషాకిరణ్, కే.వై.రామచందర్రావు, డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, జైపాల్, కూరపాటి రంగరాజు, కె.దిలీప్, యర్రమల్ల శ్రీను, నందగిరి శ్రీను, సాగర్, డాక్టర్ నారాయణరావు, విప్లవ్కుమార్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వరావు, గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, యలమందల జగదీష్, మందుల ఉపేందర్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.ఆర్టీఐ కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ -
చలచల్లగా వెళ్లొద్దామా !
మండు వేసవిలో ఏసీ బస్సులకు ఆదరణ ● ఖమ్మం నుంచి హైదరాబాద్కు నాన్స్టాప్ బస్సులు ● ఇతర డిపోల నుంచి సైతం రాజధాని, లహరి సర్వీసులు ● రెండు నెలల్లో రీజియన్కు రూ.7.43 కోట్ల ఆదాయంఖమ్మంమయూరిసెంటర్: మండు వేసవిలోనూ చల్లని గాలిలో పయనం సాగించేలా ప్రయాణికులు ఏసీ బస్సులను ఎంచుకుంటున్నారు. వారి అవసరం, ఆసక్తికి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల సంఖ్య పెంచింది. తద్వారా ఏప్రిల్, మే నెలల్లో ఈ బస్సులు నడిపించడం ద్వారా 1,62,557 మంది గమ్యస్థానాలకు చేరడంతో ఖమ్మం రీజియన్కు రూ.7,43,53,892 ఆదాయం సమకూరింది. ఖమ్మం నుంచి హైదరాబాద్కు గంటకొకటి చొప్పున నాన్ స్టాప్ రాజధాని సర్వీసులు నడిపించడం, ఖమ్మంతో పాటు మిగతా డిపోల నుంచి రాజధాని, లహరి ఏసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు సేవలందాయి. చార్జీ ఎక్కువైనా ఓకే.. ఉమ్మడి జిల్లాలో ఈ వేసవిలో ఎండలు 42 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యాన బస్టాండ్లకు వస్తున్న వారు ఏసీ బస్సు కనిపిస్తే చాలు ఎక్కేస్తున్నారు. దూర ప్రయాణాలకై తే తప్పనిసరిగా ఏసీ బస్సుల్లోనే సీట్లు ముందస్తుగా రిజర్వ్ చేసుకుంటున్నారు. ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులతో పోలిస్తే ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉన్నా ఎండ నేపథ్యాన లెక్క చేయడం లేదు. దీంతో దాదాపు అన్ని రోజుల్లోనూ ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 100శాతం నమోదవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు సైతం ఆదివారం, ఇతర ప్రత్యేక రోజుల్లో సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. అయితే, రీజియన్లోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి డిపోలకు రాజధాని, లహరి ఏసీ బస్సులు ఉండగా ఎక్కువగా హైదరాబాద్ రూట్లోనే తిప్పుతున్నారు. ఇవికాక హైదరాబాద్లోని డిపోల నుంచి సైతం ఉమ్మడి జిల్లాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఏసీ బస్సులు నడిపిస్తున్నారు. కాగా, కరీంనగర్, గోదావరిఖని, నిజామాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాలకు సైతం ఒకటి, రెండు ఏసీ బస్సులు ఏర్పాటుచేయాలనే ప్రయాణికుల డిమాండ్ను అధికారులు పరిశీలిస్తున్నారు. రూ.7.43 కోట్ల ఆదాయం.. ఈ వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఏసీ బస్సులను రెగ్యులర్తో పోలిస్తే ఎక్కువ సర్వీసులు నడిపించింది. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం డిపోల నుంచి ఏప్రిల్ నెలతో పాటు ఈనెల 23 వరకు 1,62,557 మంది ప్రయాణించగా రికార్డు స్థాయిలో రూ. 7,43,53,892 ఆదాయం సమకూరింది. ఇందులో 34 రాజఽ దాని బస్సుల్లో 1,49,816 మంది నుంచి రూ.6,52,25,993, నాలుగు లహరి ఏసీ బస్సుల్లో 12,741 మంది ప్రయాణించగా రూ.91,27,899 ఆదాయం నమోదైంది. రెండూ కలిపి ఏప్రిల్ నెలలో 87,322 మంది ప్రయాణించగా రూ.3,96,46,952, ఈనెల 23 వ తేదీ వరకు 75,235 మంది ప్రయాణించగా రూ.3,47,06,940 ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఖమ్మం డిపో నుంచే.. ఖమ్మం రీజియన్కు వచ్చిన ఆదాయంలో ఖమ్మం డిపో నుంచే అత్యధికంగా లభించింది. ఈ రెండు నెలల కాలంలో రాజధాని బస్సులు 34, లహరి ఏసీ బస్సులు నాలుగు తిరగగా.. ఖమ్మం డిపో నుంచి 21 రాజధాని, రెండు లహరి బస్సులు తిప్పారు. రాజధాని బస్సుల్లో 96,040 మంది ప్రయాణించగా.. రూ.4,16,52,551, లహరి ఏసీ బస్సుల్లో 4,873 మంది ప్రయాణించగా రూ.45,26,719 ఆదాయం సమకూరింది. రీజియన్ మొత్తం ఆదాయంలో 62 శాతం ఖమ్మం డిపో నుంచే లభించడం విశేషం. ఖమ్మం నుంచి హైదరాబాద్కు గంటకొకటి చొప్పున రాజధాని ఏసీ నాన్ స్టాప్ బస్ నడపడం కలిసొచ్చింది.ఏప్రిల్, మే 23వరకు ఏసీ బస్సులతో వచ్చిన ఆదాయం డిపో ప్రయాణికులు ఆదాయం (రూ.ల్లో) ఖమ్మం 1,00,913 4,61,79,270 భద్రాచలం 37,563 1,71,23,886 సత్తుపల్లి 21,237 98,56,103 కొత్తగూడెం 2,844 11,94,633మొత్తం 1,62,557 7,43,53,892మరిన్ని నాన్స్టాప్ సర్వీసులు సుఖవంతంగానే కాక త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రాజధాని ఏసీ బస్సులు తిప్పుతున్నాం. ఈ వేసవిలో ఏసీ బస్సులకు ఆదరణ పెరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్కు నడిచే నాన్స్టాప్ సర్వీసులను ప్రయాణికులు ఆదరిస్తున్నారు. దీంతో రీజియన్ వ్యాప్తంగా నాన్స్టాప్ ఏసీ సర్వీసులు పెంచేలా ఆలోచన చేస్తున్నాం. – ఎ.సరిరామ్, ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ -
విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దాలి
ముదిగొండ: ప్రభుత్వం అందించే శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు మరింత మెరుగైన బోధన చేయాలని పీఆర్టీయూ జిల్లా అద్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు కోరారు. ముదిగొండ జెడ్పీహెచ్ఎస్లో జరుగుతున్న శిక్షణ శిభిరాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మెరుగైన బోధనతో పాఠశాలల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కాగా, వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు కృషి చేస్తామని చెప్పారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు బంకా గురువయ్య, ఎన్.సాంబశివరావుతో పాటు కట్టా శేఖర్, టి.రత్నకుమార్ పాల్గొన్నారు. నవజాత శిశువుల మరణాల నివారణే లక్ష్యం నేలకొండపల్లి: నవజాత శిశువుల మరణాల నివారణే లక్ష్యంగా నియోనాటల్ సేవలు అందిస్తున్నట్లు ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఉమ్మడి జిల్లా పోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్సీ వద్ద శనివారం నియోనేటల్ సేవలపై ఉద్యోగులకు ఆయన అవగాహన కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 49 అంబులెన్స్లుఉండగా, ఒక్కో వాహనం ద్వారా కనీసం నెలకు 120 రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు తొలిసారిగా నియోనాటల్ వాహనం మంజూరైందని, ఇందులో అత్యాధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు దుర్గాప్రసాద్, భాస్కర్, సీతారాం, డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో రూ. 2.50 లక్షల విలువైన చెక్కలను శనివారం ఆయన అందించి మాట్లాడారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ తోట వీరభద్రం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లేడిబోయిన గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి ఉషూ పోటీలకు ఎంపికఖమ్మంస్పోర్ట్స్: సబ్ జూనియర్ విభాగం నుంచి రాష్ట్రస్థాయి ఉషూ పోటీల్లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులు ఇద్దరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో స్థానం సాధించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సాధన చేస్తున్న శశివర్ణిక 22 కేజీల (సాన్–ద) బాక్సింగ్ బాలికల విభాగంలో, వింగ్చున్ బాలుర విభాగంలో చక్రధర్ ఆర్యన్ ఎంపికయ్యారని ఉషూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.పరిపూర్ణచారి తెలిపారు. తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొననుండగా, డీవైఎస్ఓ సునీల్రెడ్డి తదితరులు అభినందించారు. ఓయూ నుంచి డాక్టరేట్సత్తుపల్లి: సత్తుపల్లిలోని గీతమ్స్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, అశ్వారా వుపేట మండలం ఆసుపాకకు చెందిన కును సోతు అశోక్కుమార్కు డాక్టరేట్ లభించింది. హైదరాబాద్లోని ఉస్మా నియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి.రమాదేవి పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఓయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. వేరుశనగలో వచ్చే కాండం కుళ్లు తెగులును తక్కువ ఖర్చుతో, సైడ్ ఎఫెక్టులు లేకుండా నిరోధించేలా చేసిన పరిశోధనలపై అశోక్కుమార్ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను గీతమ్స్ కళాశాల డైరెక్టర్ దొడ్డా శ్రీనివాసరెడ్డి, శాంతినికేతన్ కళాశాల ప్రిన్సిపాల్ మమంద్రారెడ్డి, అధ్యాపకులు తదితరులు అభినందించారు. రెవెన్యూ విభాగానికి విజిలెన్స్ నోటీసులు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం ద్వారా కొన్నేళ్లుగా జరిగిన కార్యకలాపాలకు సంబంధించి రికార్డులు సమర్పించాలని విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇంటి నంబర్ల కేటాయింపు, మ్యుటేషన్, 58, 59 జీఓ పట్టాల ఇళ్లకు అసెస్మెంట్ నంబర్లు కేటాయింపు.. తదితర అంశాల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నోటీసులు అందడంతో కేఎంసీ అధికారుల్లో ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. కాగా, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ఇతర మున్సిపాలిటీలకు బదిలీపై వెళ్లగా వారికి సైతం నోటీసులు వెళ్తాయని చర్చ జరుగుతోంది. -
సిద్ధాంతం ఎన్నటికీ చావదు..
● వామపక్ష లౌకిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయం ● గిరిప్రసాద్ వర్ధంతి సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖమ్మంమయూరిసెంటర్: సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న కొందరికి హత్య చేయడం సాధ్యమేమో కానీ ఆ సిద్ధాంతాన్ని చంపేయడం అంత తేలిక కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించిన నల్లమల గిరిప్రసాద్ వర్ధంతి సభలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ.. మావోయిస్టుల సిద్ధాంతాన్ని తాము వ్యతిరేకించినా.. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని వేలాది మంది ఉన్నారని, వారిని చంపినా మళ్లీ పుట్టుకొస్తారని తెలిపారు. ఇదే సమయాన మావోయిస్టులు సైతం తమ పంథాను మార్చుకోవాలని నారాయణ సూచించారు. రాజ్యాంగానికి మావోయిస్టుల నుంచి కానీ మరే ఇతరుల నుంచి కానీ ప్రమాదం లేదని, ఆ ప్రమాదం బీజేపీ వైపు నుంచే పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు గిరిప్రసాద్ నాడు సాయుధ పోరాటంలో వేల మందిలాగే గిరిప్రసాద్ను సైతం హతమార్చాలని ప్రయత్నిస్తే తుపాకీ గుండుకు ఎదురొడ్డి నిలిచారని నారాయణ తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరుగా ఆయన నిలిచారని, తుది శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడారని చెప్పారు. నియంత పాలనకు ప్రయత్నాలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రజా చైతన్యానికి వామపక్ష ఉద్యమం బలపడాలని పిలుపునిచ్చారు. కాగా, హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని అన్నందుకు కొందరు అవాకులు, చెవాకులు పేలారని.. ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీల్లో పాల్గొనే వారిని వేశ్యల్లా చూస్తున్నారని చెప్పిందన్నారు. చర్చలపై స్పందించరా? మావోయిస్టులు శాంతిచర్యలకు ప్రతిపాదిస్తున్నా కేంద్రప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. తెలంగాణ చైతన్యానికి ప్రతీక అని.. ఈ గడ్డపై మతోన్మాదం, కుల మత రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం తొలుత ఖమ్మం పాత బస్టాండ్ వద్ద గిరిప్రసాద్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, గిరిప్రసాద్ తనయుడు నల్లమల చక్రవర్తి, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, మిరియాల రంగయ్య, యర్రా బాబు, శింగు నర్సింహారావు, బీ.జీ.క్లెమెంట్, పోటు కళావతి, మహ్మద్ సలాం, జానీమియా, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మి, తోట రామాంజనేయులు, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయవాదులపై దాడి గర్హనీయం
ఖమ్మం మామిళ్లగూడెం: ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై ఆర్మీ జవాన్లకు మద్దతుగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్న జాతీయవాదులపై దాడి చేయడం గర్హనీయమని మాజీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల చేపట్టిన యాత్రలో చోటుచేసుకున్న ఘటనతో గాయపడిన బీజేపీ లీగల్ అడ్వైజర్ వెంకట్ గుప్తాను వారు శనివారం పరామర్శించారు. అనంతరం దళితమోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా, లీగల్సెల్ అడ్వైజర్ రమేష్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంత్రుల అండతోనే ఖమ్మంలో జాతీయవాదులపై దాడి జరిగినట్లు తాము భావిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ముస్లింల కోసమేనంటూ జిల్లాకు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలపై ిపీసీసీ చీఫ్ మహేష్గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జరిగిన దాడిని ముగ్గురు మంత్రులు ఎందుకు ఖండించలేదో చెప్పాలన్నారు. కాగా, ఈనెల 25న మహిళామణుల ఆధ్వర్యాన జరిగే సిందూర్ యాత్రకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు సన్నె ఉదయ్ప్రతాప్, నంబూరి రామలింగేశ్వరావు, రామారావు, విజయరాజు, వీరెల్లి రాజేష్ గుప్త, అల్లిక అంజయ్య పాల్గొన్నారు. -
కొండరెడ్లకు గృహ నిర్మాణాలు
సూపర్బజార్(కొత్తగూడెం): అటవీప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజన కుటుంబాలకు పీఎం జన్ధన్ పథకం కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపీడీఓలు ప్రతిపాదనలు అందజేయాలని భద్రా చలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో శుక్రవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల ఎంపీడీఓలు, కొండరెడ్ల గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అశ్వారావుపేట మండలంలోని ఏడు హ్యాబిటేషన్లు, దమ్మపేట మండలంలోని పూసుకుంటలోని కొండరెడ్ల గిరిజన కుటుంబాల ఇంటింటికీ తిరిగి మొబైల్యాప్ ద్వారా శనివా రం నుంచి సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
వల పన్ని.. పట్టుకున్నారు!
● స్టేషన్లో ఎఫ్ఓబీ పైనుంచి దూకేందుకు ఛత్తీస్గఢ్ యువకుడి యత్నం ● కింద వల అమర్చి కాపాడిన పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఖమ్మంక్రైం: ఛత్తీస్గఢ్కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఖమ్మం రైల్వేస్టేషన్లో శుక్రవారం హల్చల్ చేశాడు. ఫుట్ఓవర్ బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించడం కలకలం రేపింది. ఈ ఘటనతో సుమారు గంటపాటు గందరగోళం నెలకొనగా, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చివరకు ఆర్పీఎఫ్, జీఆర్పీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది చొరవతో కింద వలలు ఏర్పాటుచేసి.. ఆ యువకుడిని తోసేయడంతో వలపై పడగా అంతా ఊపిరిపీల్చుకున్నారు. మద్యం మత్తు.. కుటుంబ కలహాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు లలిత్ బరిహ ఖమ్మం సమీపాన గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలతో మద్యం సేవించిన ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం రైల్వేస్టేషన్కు వచ్చాడు. రెండో నంబర్ ప్లాట్పాం మీదుగా ఫుట్ఓవర్ బిడ్జిపైకి ఎక్కి దూకడానికి యత్నించాడు. బ్రిడ్జి కింద హైపర్ టెన్షన్ విద్యుత్ వైరు ఉండడం, అదే సమయానికి సికింద్రాబాద్కు వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రానుండడంతో వేచి ఉన్న ప్రయాణికులు లలిత్ను గమనించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ సురేశ్గౌడ్ ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని ఎంత నచ్చజెప్పినా వినకపోగా, పైకి ఎవరైనా వస్తే దూకుతానని బెదిరించాడు. ఆపై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, బ్రిడ్జిపైకి ప్రయాణికులు వెళ్లకుండా ఆపివేశారు. ఇంతలో కోణార్క్ ఎక్స్ప్రెస్ వస్తుడడంతో ఖమ్మం ఔటర్లోనే నిలిపివేశారు. ఆ తర్వాత అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని బ్రిడ్జి కింద వలలతో సిద్ధమయ్యారు. ఇదంతా సుమారు గంట దాటడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు పైకి వెళ్లి లలిత్ తీగలపై పడకుండా వలలో పడేలా కిందకు తోశాడు. దీంతో ఆయన నేరుగా వలలో సురక్షితంగా పడటంతో ఆర్పీఎఫ్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ అనంతరం కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా, లలిత్ తీరుతో రైళ్లు నిలిచిపోవటంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, ఆయన ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఫైర్ సిబ్బందిని పలువురు అభినందించారు. -
కృష్ణవేణి విద్యార్థులకు ర్యాంక్లు
బీఆర్క్ అండ్ ప్లానింగ్ ఫలితాల్లో తమ విద్యార్థు లు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. పి.మణిచంద్రసాయి 95వ ర్యాంక్, టి.తరుణ్ 242, ఎస్కే సమద్ 369, ఎల్.అభిజిత్ 676, డి.నిఖిల్ 681, టి.దినేశ్ 830, జి.దివ్య 833 సాధించారని వెల్లడించారు. అంతేకాక ఎస్.దినేశ్ 1,027, బి.చక్రవర్తి 1,059, ఆర్.గుప్తాశ్రీ 1,137, జె.జశ్వంత్ 1,202, జి.వినీత 1,266, డి.మహేశ్వర్ 1,308, కె.అభిషేక్ 1,420, బి.రాహుల్ 1,521, బి.రోహిత్గనీ 1,884, టి.గణేశ్ 2,189, టి.డిన్నీ 2,190, వి.సాత్విక 2,230, డి.రాజేశ్వరి 2,410, ఎన్.నేహిత 2,583, పి.యశస్వి 2,664, డి.సింధు 3,081, జి.సాహిత్ 3,259, కె.మహేశ్బాబు 3,301, కె.మౌనిక 3396, ఇ.శ్రీ సిరి 3,406, పి.తేజకుమార్ 3,530, కె.వెంకటసాయి నిఖిలేశ్ 3,542, డి.గీతశ్రీ 4,617,ఎం.వైష్ణవిరెడ్డి 4,847, ఎస్కే నౌరీస్ 4,925 వ ర్యాంక్ సాధించారన్నారు. కార్య క్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఏలూరివంశీకృష్ణ, ఏఓనిరంజన్కుమార్ పాల్గొన్నారు. -
జేఏసీ పోరుబాటలో భాగస్వాములు కావాలి
మధిర/బోనకల్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాల్లో ఉపాధ్యాయులంతా భాగస్వాములు కావాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు సూచించారు. మధిరలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని పరిశీలించడంతో పాటు బోనకల్ మండలం రావినూతల పాఠశాలలో శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల కోసం పోరాడుతూనే బడిబాటలో భాగంగా విద్యార్థుల సమోదు పెంచడానికి ఉపాధాయులు కృషి చేయాలని తెలిపారు. కాగా, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల సాధన కోసం యూనియన్ తరఫున కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే, విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచేలా ఉండొద్దనేది తమ విధానమని తెలిపారు. కార్యక్రమాల్లో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మోత్కూరి మధుతో పాటు ఆర్.బ్రహ్మారెడ్డి, తుమాటి కృష్ణారెడ్డి, రత్నకుమార్, చంద్రశేఖర్, సీహెచ్వీ రవికుమార్, శ్రీనివాసరావు, మల్లెల శ్రీనివాస్, శ్యామలరావు, స్వామి, మద్దినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
తల్లాడ: మండలంలోని మల్లవరంలో శుక్రవారం విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంభగిరి బలరాం (45) దళితకాలనీ సమీపాన ఉన్న చికెన్ షాపు వెనకాల మూత్ర విసర్జనకు వెళ్లాడు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ వైర్ను తాకిన ఆయన షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడ ఎవరూ లేక పోవడంతో విషయం బయటకు రాలేదు. మధ్యాహ్నం తర్వాత ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా, బలరామ్కు భార్య సుశీల, ఇద్దరు పిల్లలు ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారు ఆభరణాల చోరీ తిరుమలాయపాలెం: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి పట్టపగలే బంగారు, వెండి వస్తువులు చోరీ చేసిన ఘటనపై శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన పగిళ్ల రామకృష్ణ తన భార్యతో కలిసి ఈ నెల 20న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువా తెరిచి ఉండడంతో వెతికి చూడగా అందులోని సుమారు రూ.85 వేల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మల్లారంలో.. ముదిగొండ: మండలంలోని మల్లారంలో జరిగిన చోరీపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు... మల్లారం గ్రామానికి చెందిన బొగ్గారపు హనుమంతరావు గురువారం రాత్రి భోజనం అనంతరం ఆరు బయట పడుకోగా, ఆయన భార్య సుజాత దవరండాలో నిద్రించింది. అర్ధరాత్రి గాలివాన వస్తుండడంతో ఇరువురు ఇంట్లోకి వెళ్లగా ఇంటి మధ్య గది తలుపులు తెరిచి ఉండడమే కాక బీరువాలో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. సుజాత తలదిండు కింద పెట్టిన తాళాలను గుర్తించిన దుండగులు వాటి సాయంతో బీరువా తెరిచి ఆభరణాలు దొంగిలించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ముదిగొండ సీఐ ఓ.మురళి తెలిపారు. గ్యాస్ లీకేజీతో మంటలు ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నివాసముంటున్న వారు వంట చేసే క్రమాన స్టవ్ వెలిగించగా అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమతమైన వారు సిలిండర్ను బయటకు తీసుకొచ్చి నీళ్లు చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. ఈక్రమాన ఏం జరుగుతోందనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అప్పటికే అందిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. -
రెజొనెన్స్ విద్యార్థికి ఆల్ ఇండియా 2వ ర్యాంక్
బీఆర్క్ అండ్ బీప్లానింగ్లో తమ విద్యార్థులు ఆలిండియాస్థాయి ర్యాంక్లతో ప్రభంజనం సృష్టించారని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్లు ఆర్వీ నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. పలువురు వివిధ కేటగిరీల్లో జాతీయస్థాయి ర్యాంక్లు సాధించగా.. కార్తికేయ ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడని వెల్లడించారు. అలాగే, భవగ్న్య 829, బి.రాకేశ్ 997, దివ్యతేజ 1,163, ధృవ 1,173, మణికుమార్ 1,400, వేదాంశ్ 1,500, శివాణి 1,740, ధాన్యదీప్ 2,170, భగవతి 2,586, నిహారిక 3,080, వీరవెంకటకృష్ణప్రసాద్నాయక్ 3,261, డి.గణేశ్ 3,496, ప్రవళిక 3,663, సాయి సుమన 3,690వ ర్యాంక్లు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సతీశ్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
వేతనాలు వచ్చేదెప్పుడో..?
ఖమ్మం సహకారనగర్: 2008లో వారంతా డీఎస్సీ అర్హత సాధించారు. రకరకాల కారణాలతో పోస్టింగ్ ఇవ్వడం ఆలస్యం జరగగా, సుమారు 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కానీ, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియామకాలు చేపట్టారు. అయినా సరే, ప్రభుత్వం నుంచి అందే వేతనాలు కావడంతో జీవనానికి భరోసా ఉంటుందని భావించారు. దీంతో అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాలు మాని ఉపాధ్యాయులుగా చేరారు. కానీ, ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు నెలలైనా వచ్చే అరకొర వేతనం కూడా చెల్లించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్నింటికీ సర్దుకుపోతున్నా తమకు అందాల్సిన వేతనాల్లో జాప్యం చేయడంపై కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.34 మందిజిల్లాలో 2008 డీఎస్సీ అభ్యర్థులు 34 మందిని ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన విధుల్లోకి తీసుకున్నారు. వీరిని జిల్లాలోని వివిధ పాఠశాలలకు కేటాయించగా పాఠాలు బోధిస్తున్నారు. నాలుగు నెలల పాటు ఉంటున్న ప్రాంతం నుంచి పాఠశాలలకు వెళ్లి వచ్చినా నెలనెలా వేతనాలు మాత్రం రావడం లేదు. ఇదంతా పక్కన పెడితే విద్యాసంవత్సరం చివరిలో ఆయా ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసిన విద్యాశాఖ.. వేతనాల జారీలో మాత్రం జాప్యం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అయితే, వేతనాల విషయమై స్పష్టత ఇవ్వలేకపోతున్నప్పటికీ.. మళ్లీ పాఠశాలలు తెరవగానే వారిని విధుల్లోకి తీసుకునే అవకాశముందని చెబుతుండడంతో కొంత మేర ఊరట కలిగిస్తోంది. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలి
తల్లాడ: వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కచ్చితంగా పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖా ధికారి సామినేని సత్యనారాయణ సూచించారు. తల్లాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణను శుక్రవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్య, యూనిఫాం, మధ్యాహ భోజనం అమలవుతుండడమే కాక సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్న విషయాన్ని వివరిస్తూ విద్యార్థులను చేర్పించాలని తెలిపారు. ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్, ఎంఎన్ఓ పి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏన్కూరులో.. ఏన్కూరు: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికల కోసం పాఠశాలలు తెరిచేనాటికి యూనిఫాం సిద్ధం చేయాలని డీఈఓ సామినేని సత్యనారాయణ సూచించారు. ఏన్కూరులో యూనిఫాం కుడుతున్న కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. అనంతరం ఏన్కూరు హరిజనవాడ, గంగులనాచారం, ఎస్టీ కాలనీ, నాచారం ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలకు యూనిఫాంలు అందజేశారు. ఎంఈఓ రహీమ్, కాంప్లెక్స్ హెచ్ఎం సైదయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకులు గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
ఎల్ఆర్ఎస్కు తిప్పలెన్నో..
● అధికారుల చుట్టూ ప్లాట్లదారుల ప్రదక్షిణలు ● నిషేధిత స్థలం కాకున్నా జాబితాల్లోకి.. ● యజ్ఞంలా మారిన పరిశీలన, అనుమతులుఖమ్మం అర్బన్: స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ప్రవేశపెట్టగా దరఖాస్తులదారుల వెసులుబాటు కోసం ఇటీవల ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. దీంతో తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, తద్వారా నిర్మాణానికి ఇక్కట్లు తీరతాయని భావించిన దరఖాస్తుదారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారిని ప్రస్తుతం నిర్దేశిత ఫీజులో 25 శాతం రాయితీకి అర్హులుగా ప్రకటించారు. కానీ ప్రభుత్వం రూపొందించిన యాప్లో సాంకేతిక సమస్యలో లేక ఇతర కారణాలో తెలియదు కానీ యజమానులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫీజు చెల్లింపునకు అనుమతి జారీ కావడం లేదు. దశల వారీగా... ఎల్–1 దరఖాస్తులకు సంబంధించి కార్పొరేషన్ లేదా గ్రామపంచాయతీ అధికారులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంతా సవ్యంగా ఉంటే యాప్లో అప్ లోడ్ చేసి అనుమతి ఇస్తున్నారు. కానీ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మూడు శాఖల అధికారులకు ఒకేసారి సమయం లభించి క్షేత్రస్థాయికి వస్తేనే ప్లాట్ ప్రభుత్వ భూమిలో ఉందా, ఎఫ్టీఎఫ్ పరిధిలో ఉందా అనేది నిర్ధారించే అవకాశముంటుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు అధికా రుల చుట్టూ తిరిగి యాప్లో నమోదు చేయించుకున్నా... తిరిగి మరోమారు అనుమతి కోసం క్షేత్రస్థాయికి రావాల్సి ఉండడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదంతా పూర్తయ్యాక ఎల్–2(టౌన్ ప్లానింగ్), ఎల్–3(ముఖ్య అధికారి జారీ చేసే పత్రం) దశల్లోనూ విపరీతమైన జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇదంతా భరించలేక కొందరు తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అధికారులను నిలదీస్తున్నట్లు సమాచారం. ఇదే అదనుగా కొందరు అంత దూరం రావాలంటే ఖర్చులు అవుతాయని డబ్బు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రెండేసి సార్లు కొన్ని ప్లాట్లకు సమీపాన ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములు లేదా వాగులు, వర్రెలు ఉంటే ఈ భూమిని కూడా నిషేధిత(ప్రొహిబిటెడ్) జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడం ఏమిటని ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. ఇలాంటి ప్లాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే రాయితీతో ఫీజు చెల్లింపునకు అనుమతి ఇస్తుండడం గమనార్హం. అంతా పూర్తయి ఫీజు చెల్లించినా అనుమతి పత్రం కోసం మరోమారు ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుండడం గమనార్హం. మీ సేవ కేంద్రాలకు పరుగులు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే యజమానులు అన్ని పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కానీ ఇప్పుడు మరోమారు అప్లోడ్ చేయాలని ప్లాట్లదారులకు సమాచారం వస్తోంది. దీంతో నెట్ సెంటర్లు, మీ సేవ సేవా కేంద్రాలకు పరుగుల తీయక తప్పడం లేదు. ఇప్పటి కైనా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఫీజు చెల్లింపునకు అవకాశం ఇవ్వాలని, ఆ వెంటనే అనుమతులు జారీచేయాలని పలువురు కోరుతున్నారు. -
రండీ.. త్వరపడండి!
● టీఎంఆర్ఈఐఎస్ల్లో శరవేగంగా ప్రవేశాలు ● జిల్లాలో ఏడు పాఠశాలలు, ఒక కాలేజీ ● గత ఏడాది ఉత్తమ ఫలితాలు రావడంతో విద్యార్థుల ఆసక్తి ఖమ్మంమయూరిసెంటర్: మైనార్టీల కోసం ప్రత్యేకంగా స్థాపించిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) ద్వారా 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈనెల 31వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశముంది. అన్ని పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తుండగా, 6నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. ఇక జూనియర్ కళాశాలలో ఇంటర్కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, సీట్ల వరకే దరఖాస్తులు వస్తే నేరుగా ప్రవేశాలు కల్పించనుండగా, అంతకు మించి దరఖాస్తులు అందితే మాత్రం డ్రా విధానాన్ని పాటించనున్నారు. మైనార్టీలకు ఉచిత విద్య టీఎంఆర్ఈఐఎస్ల ద్వారా వేలాది మంది మైనార్టీ పిల్లలకు ఉచిత విద్య, హాస్టల్ వసతితో పాటు ఆధునిక కంప్యూటర్ విద్య, క్రీడలు, నైపుణ్య శిక్షణ అందుతున్నాయి. గత విద్యాసంవత్సరం ఈ పాఠశాలల్లో ఎస్సెస్సీ విద్యార్థులు 95.37 శాతం, ఇంటర్ విద్యార్థులు 85.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇతర ప్రభుత్వ గురుకులాలతో సమానంగా ఫలితాలు సాధించడంతో పాటు పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా తీర్చుతుండడంతో నీట్, ఐఐటీ–జేఈఈ, ఒలింపియాడ్, క్రీడాపోటీల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. ప్రవేశాలకు ఆహ్వానం.. విద్య, సమానత్వం, సామాజిక న్యాయాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంటూ మైనార్టీల కోసం టీఎంఆర్ఈఐఎస్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రఘునాథపాలెంలో ఖమ్మం గర్ల్స్–1(శారద ఇంజనీరింగ్ కళాశాల), ఖమ్మంలోని అల్లిపురం రోడ్డులో ఖమ్మం గర్ల్స్–2, కొణిజర్లలో ఖమ్మం బాయ్స్–1(పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజీ), సత్తుపల్లి గుడిపాడు రోడ్డులో సత్తుపల్లి బాయ్స్–1, జలగంనగర్లో నేలకొండపల్లి బాయ్స్–1, సింగరేణిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని వైరా గర్ల్స్–1, మధిర మండలం జీలుగుమాడులోని మధిర బాయ్స్–1 పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇక ఖమ్మం రాపర్తినగర్లోని జూనియర్ కళాశాల(ఖమ్మం గర్ల్స్–1) ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సద్వినియోగం చేసుకోవాలి.. టీఎంఆర్ఈఐఎస్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు వేగంగా సాగుతున్నాయి. ఐదో తరగతికి అన్ని పాఠశాలల్లో సీట్లు అందుబాటులో ఉండగా, 6 – 9వ తరగతికి మాత్రం ఖాళీల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాం. ఈనెల 31లోగా సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ బి.పురంధర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి -
దళారులకు నయాపైసా ఇవ్వొద్దు..
● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● ఎమ్మెల్యే రాగమయితో కలిసి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ సత్తుపల్లిటౌన్/వేంసూరు: ఇళ్లు మంజూరు చేయిస్తాని ఎవరైనా నమ్మబలికినా నయాపైసా ఇవ్వొద్దని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసేవన్నీ తప్పుడు విమర్శలేనని.. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని ఆయన తెలిపారు. సత్తుపల్లిలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపాలిటీ, మండలానికి సంబంధించి 574 మందికి, వేంసూరులో జరిగిన కార్యక్రమంలో 570మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుండడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో రైతుబంధు తప్ప ఏ పథకాన్ని సక్రమంగా అమలుచేయలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, సన్న ధాన్యం రైతులకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి తర్వాత మళ్లీ ఇప్పుడే పేదలకు ఇళ్లు మంజూరవుతున్నాయని చెప్పారు. ప్రతీ పథకంలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నందున, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ, ఆర్డీఓ రాజేంద్రగౌడ్, హౌసింగ్ డీఈఈ విక్రమం, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ నాగేశ్వరరావు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్బాబు, భాగం నీరజ, గాదె చెన్నారావు, చల్లగుళ్ల నర్సింహారావు, ఎం.డీ.కమల్పాషా, మందపాటి ముత్తారెడ్డి, తోట సుజలరాణి, ఉడతనేని అప్పారావు, చల్లగుండ్ల కృష్ణయ్య, చల్లారి వెంకటేశ్వరరావు, నారాయణవరపు శ్రీనివాస్, కాసరి చంద్రశేఖర్రెడ్డి, పుచ్చకాయల సోమిరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, మందపాటి రాఘవరెడ్డి, ఎం.డీ.పైజుద్దీన్, ఎం.డీ.ఫకృద్దీన్, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.పేదలందరికీ ఇళ్లే లక్ష్యం పెనుబల్లి : పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. పెనుబల్లిలో మండల పరిధిలోని 599 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశాక ఆమె మాట్లాడారు. ఐదేళ్లలో సత్తుపల్లి నియోజకవర్గంలో 20 – 25 వేల ఇళ్ల మంజూరుకు ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నామని తెలిపారు. కల్లూరు ఆర్డీఓ రాజేంద్రగౌడ్, ఎంపీడీఓ అన్నపూర్ణ, కల్లూరు, సత్తుపల్లి మార్కెట్ చైర్మన్లు భాగం నీరజాచౌదరి, దోమ ఆనందబాబుతో పాటు మట్టా దయానంద్, రాజబోయిన కోటేశ్వరరావు, పి.వెంకటేశ్వరరావు, కీసర శ్రీనివాసరెడ్డి, బుక్కా కృష్ణవేణి, గోదా రాములు, మేకతొట్టి కాంతయ్య, మాలోతు రాధాకృష్ణ పాల్గొన్నారు. -
భూసేకరణ పూర్తి చేయాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పెండింగ్ భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్నేటి తీరాన నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్, సీతారామ ఎత్తిపోతల పథకం, జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణ సకాలంలో పూర్తిచేస్తేనే పనులకు ఆటంకాలు రావని తెలిపారు. ఈ విషయంలో రైతులు, నిర్వాసితులతో నేరుగా చర్చించి వారికి నచ్చచెప్పాలని సూచించారు. అలాగే, సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా యాతాలకుంట టన్నెల్, పాలేరు రిజర్వాయర్ లింక్, డిస్ట్రిబ్యూషన్ కెనాళ్లకు అవసరమైన భూసేకరణపైనా సూచనలు చేశారు. కాగా, భూసేకరణ, రైతులకు పరిహారం అందించే అంశంలో మానవీయ కోణంలో వ్యవహరిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. ఈసమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేంద్రగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి -
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే..
బోనకల్/నేలకొండపల్లి: పశువుల అక్రమ రవాణాను నియంత్రించేలా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని అడిషనల్ డీసీపీ ప్రసాదరావు ఆదేశించారు. బోనకల్ మండలం పాలడుగుతో పాటు జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన చెక్పోస్ట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ చెక్పోస్ట్ల వాహనాలను తనిఖీ చేస్తూ అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా, లేదా అని పరిశీలించాలని, అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలితే వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు. అలాగే, నేలకొండపల్లి పోలీసుస్టేషన్కు వచ్చిన అదనపు డీసీపీ ప్రసాదరావు రికార్డులను పరిశీలించాక శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల విచారణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా వేయాలని ఆదేశించారు. శారీరక శిక్షణ, ఆయుధ విజ్ఞానం వైరా: వైరాలోని న్యూలిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో ఏర్పాటుచేసిన 11(బీ) బెటాలియన్ ఎన్సీసీ వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. ఈ శిబిరాన్ని వీరచక్ర అవార్డు గ్రహీత, వీఆర్సీ గ్రూప్ కమాండర్ కల్నల్ సచిన్ అన్నారావు సెంబాల్కర్ శుక్రవారం సందర్శించారు. కల్నల్ ఎస్కే.భద్ర, కల్నల్ నవీన్యాదవ్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శిబిరంలో భాగంగా కేడెట్లకు శారీరక శిక్షణ, ఆయుధాల పనితీరుపై అవగాహన కల్పిస్తూనే నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ కమాండర్ మాట్లాడుతూ ఎన్సీసీ శిక్షణతో సంఘ జీవనం, ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహన పెరగడమే కాక దేశభక్తి పెరుగుతుందని తెలిపారు. పాఠశాల కరస్పాడెంట్ పి.భూమేఽష్రావు, డైరెక్టర్ కుర్రా సుమన్, అపురూపాదేవి తదితరులు పాల్గొన్నారు. కోచ్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ఏడాది కాలానికి కోచ్లను నియమించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కిన్నెరసానిలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఆర్చరీ కోచ్, కాచనపల్లిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో కబడ్డీ కోచ్ ఎంపికకు ఎన్ఎస్, ఎన్ఐఎస్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్ములని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువపత్రాలతో ఈనెల 26నుంచి జూన్ 3వ తేదీ వరకు ఐటీడీఏలోని స్పోర్ట్స్ ఆఫీసర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా కానీ dtdo.bhadradri@gmail.com మెయిల్ ద్వారా కానీ దరఖాస్తులు పంపించాలని సూచించారు. వివరాలకు 98489 88205, 99123 62053 నంబర్లకు సంప్రదించాలని పీఓ తెలిపారు. -
అంతులేని చెత్త సమస్య
వైరా: వైరా మున్సిపాలిటీ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. అయినా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. కొన్నాళ్ల క్రితం వరకు రహదారులు, సైడ్ డ్రెయిన్లు సరిగ్గా లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోగా అందుకు నిధులు విడుదల కావడంతో కొంత మేర ఇక్కట్లు తీరాయి. ఇక చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల ఏర్పాటు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో ఇంటింటా వెలువడే చెత్త సేకరిస్తున్నా డంపింగ్కు సరైన ప్రదేశాలు గుర్తించక, గుర్తించినా వాహనాలు వెళ్లే మార్గం లేక సమస్య ఎటూ తేలడం లేదు. అయితే, ఇది కేవలం వైరాలో మాత్రమే కాదు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలనూ వేధిస్తోంది. కలెక్టర్లే పరిశీలించినా... వైరాలో 20 వార్డులకు గాను సుమారు 40వేల జనాభా ఉండగా, ప్రతీరోజు 8 – 10 టన్నుల చెత్త విడుదలవుతోంది. ఈ చెత్త సేకరణకు ఎనిమిది ఆటో రిక్షాలు, ఎనిమిది ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. కానీ సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగేళ్లలో ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు ఈ సమస్యపై దృష్టి సారించినా, ఏడాదిన్నర క్రితం స్థలం కేటాయించినా ఉపయోగం లేకపోయింది. సదరు స్థలానికి చెత్త తీసుకెళ్లేలా సరైన మార్గం లేకున్నా, ఇది పట్టణానికి ఐదు కి.మీ. దూరంలో ఉన్నా అష్టకష్టాలకోర్చి చెత్త తరలిస్తుండడంతో డీజిల్ ఖర్చులు పెరిగాయి. వర్షాకాలం వస్తే ఇక్కట్లే రెండేళ్లుగా వైరా సమీపంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెన కింద చెత్త వేస్తూ నిప్పుపెడుతున్నారు. దీంతో ప్రయాణికులు, స్థానికులకు అసౌకర్యంగా మారింది. ఈమేరకు ఏడాదిన్నర క్రితం రిజర్వాయర్ అలుగుల సమీపాన తల్లాడ మండలం కొడవటిమెట్ట రెవెన్యూలో మూడెకరాల స్థలాన్ని డంపింగ్ యార్డుకు కేటాయించారు. కానీ ఇక్కడకు చెత్త తరలించాలంటే క్రాస్ రోడ్డు నుండి రిజర్వాయర్ ఆనకట్ట కింది భాగం మీదుగా వెళ్లాలి. ఈ మార్గంలో మూడు అలుగు వాగులు ఉండడంతో వర్షాకాలంలో రిజర్వాయర్ నీటిమట్టం 18.4 అడుగులు చేరిందంటే వరద ప్రవహిస్తుంది. ఫలితంగా రెండు నెలలు ప్రత్యామ్నాయం వెతకాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాగా, రహదారి మెరుగుపరిచేలా పలు ప్రతిపాదనలు రూపొందించారు. మూడు వాగులపై కల్వ ర్టులు లేదా బ్రిడ్జి నిర్మించడంతో పాటు మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.1.7 కోట్లు, అవసరమైన చోట సీసీ రోడ్డు వేస్తూ చప్టాలు నిర్మించాలంటే రూ.2 కోట్లు, కల్వర్టులతో పాటు బీటి రోడ్డు వేయాలంటే రూ.2.5 కోట్లకు పైగా అవసరమని ప్రతిపాదించారు. దీనికి అనుమతులు వచ్చినా వానాకాలంలో చెత్త తరలించాలంటే ప్రహసనంగానే మారనుంది. మరోచోట 2–3 ఎకరాల స్థలం కొనాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కాక రిజర్వాయర్ను ఆనుకుని ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నందున అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.జిల్లాలోని మున్సిపాలిటీల వివరాలు మున్సిపాలిటీ వార్డులు జనాభా రోజువారీ వాహనాలు చెత్త (టన్నుల్లో) వైరా 20 40,000 10 16సత్తుపల్లి 23 38,000 11 15మధిర 22 35,000 20 17ఏదులాపురం 32 60,000 10 20సమస్యను అధిగమిస్తాం.. వైరాలో డంప్ యార్డుకు గుర్తించిన స్థలం పట్టణానికి దూరంగా ఉంది. అక్కడే చెత్త డంప్ చేస్తుండగా, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్ ఆదేశాలతో తుది నిర్ణయం ఉంటుంది. ఈ మార్గంలో కల్వర్టుల నిర్మాణానికి అంచనాలు రూపొంచినందున త్వరలోనే సమస్యను అధిగమిస్తాం. – చింతల వేణు, మున్సిపల్ కమిషనర్, వైరావైరా మున్సిపాలిటీలో డంప్ యార్డు ఇక్కట్లు మిగతా మూడుచోట్ల సేకరణ, తరలింపులో నిర్లక్ష్యం వర్షాకాలం వస్తే మరింత ఇబ్బందులు -
ఎందుకింత నిర్లక్ష్యం?
ఎయిడ్స్, లెప్రసీ విభాగాలపై అధికారుల చిన్నచూపు ● సుదీర్ఘ కాలంగా కొరవడిన పర్యవేక్షణ ● 2019 నుంచి ‘అదనపు’ విధులు నామమాత్రమే ● స్పెషలిస్టులు లేక పెరుగుతున్న కేసులుఖమ్మంవైద్యవిభాగం: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణపై నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ఈ వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా అదనపు జిల్లా వైద్యాధికారి(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) విభాగం ఉంటుంది. ఆ పోస్టుకు డిప్లొమా ఇన్ డెర్మటో వెనెరియోలజీ అండ్ లెప్రసీ(డీడీవీఎల్) స్పెషల్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. అయితే చాలా ఏళ్లుగా ఈ పోస్టుపై నీలినీడలు అలముకున్నాయి. ఎయిడ్స్ అండ్ లెప్రసీ అదనపు జిల్లా వైద్యాధికారి పోస్టులో పనిచేస్తున్న అధికారి దీర్ఘకాలంగా సెలవు పెట్టడంతో ఆ విభాగంపై పర్యవేక్షణ కొరవడుతోంది. 2019 నుంచి సదరు అధికారి డిప్యుటేషన్పై పొరుగు జిల్లాలో పనిచేయడం, ఆ తర్వాత వచ్చి మళ్లీ తన పోస్టులో జాయిన్ కావడం, ఆ తర్వాత తరచూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్తుండడంతో ఆ విభాగాన్ని పట్టించుకునే వారు లేరు. కీలకమైన వ్యాధుల కట్టడికి అర్హులైన స్పెషలిస్ట్ వైద్యాధికారి లేకపోవడంతో కేసుల నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఎయిడ్స్ కేసులు ౖపైపెకి.. ఎయిడ్స్ అండ్ లెప్రసీ జిల్లా అదనపు వైద్యాధికారి సాధారణంగా ఎయిడ్స్ కేసులపై నిత్యం పర్యవేక్షించాలి. వ్యాధి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం కింది స్ధాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తుండాలి. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు కేసులు పెరగకుండా చూడాలి. కానీ జిల్లాలో గత కొన్నేళ్లుగా ఎయిడ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అవగాహన లేమితో యువత హెచ్ఐవీ బారిన పడుతున్నారు. జిల్లాలో ప్రతీ నెల 50 నుంచి 60 పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే కాగా అనధికారికంగా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 17,350 మందికి ఈ వ్యాధి సోకినట్లు ఏఆర్టీ సెంటర్ల ద్వారా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఎంతమంది వ్యాధి గ్రస్తులు ఉన్నారు, ఎంత మంది చనిపోయారు అనే సమగ్ర రికార్డులు లేకపోవడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఏఆర్టీ ద్వారా 6,842 మంది మందులు వాడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని ఏఆర్టీ సెంటర్లలో నిత్యం పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సర్వే ద్వారానే కుష్ఠు బాధితుల గుర్తింపు.. కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు అదనపు జిల్లా వైద్యాధికారి(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) ఆధ్వర్యంలో నిరంతరం లెప్రసీ కాలనీల్లో పర్యటించాలి. ఎక్కడ అనుమానిత కేసులు ఉన్నాయో సిబ్బందితో కలిసి గుర్తించాలి. అయితే 2019 నుంచి ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రతీ సంవత్సరం ప్రభుత్వం రెండు వారాల పాటు సర్వే చేస్తుంది. ఆ సమయంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఎవరికై నా మచ్చలు ఉన్నాయా, అవి ఎలాంటివి అని పరీక్షిస్తారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తారు. ఆ సమయంలోనే తప్పితే ఆ తర్వాత కుష్ఠు వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో 2027 నాటికి కుష్ఠు రహిత దేశంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణ అధికారి సెలవులో ఉన్నది వాస్తవమే. అయినా ఆ రెండు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఓ అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాం. అర్హత గల అధికారి ఉండాల్సి ఉన్నా, కొరతతో ఉన్న వారితోనే వ్యాధి నియంత్రణకు పాటుపడుతున్నాం. ఎయిడ్స్ అండ్ లెప్రసీ అదనపు జిల్లా అధికారి పోస్టులో మరొకరిని శాశ్వతంగా నియమించాలంటే డీహెచ్ నిర్ణయం తీసుకోవాలి. – బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
● జూన్ 3 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులు ● ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి ● అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటిఖమ్మం సహకారనగర్ : ధరణి చట్టాన్ని రద్దు చేసి ప్రజలు మెచ్చే భూ భారతిని తీసుకొచ్చామని, ఈ చట్టంతో సమస్యలు పరిష్కారం కానున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. భూభారతి చట్టం విధి విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో తాను పర్యటించానని, అన్ని ప్రాంతాల ప్రజలు, రైతులు ఈ చట్టంపై సంతోషంగా ఉన్నారని తెలిపారు. జూన్ 3 నుంచి 20 వరకు రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు గ్రామాలకు వెళ్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇస్తున్నామని, అందులో 1.95 లక్షల మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశామని తెలిపారు. మిగతా 2.55 లక్షల మంది లబ్ధిదారులను ఈ నెలాఖరుకు ఫైనల్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 9,800 చెంచు, చెంచు ఉపకులాల కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజనులకు అదనంగా మరో 10వేల ఇళ్లు ఇస్తామన్నారు. జూన్ 2 నాటికి కనీసం 1000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఎవరైనా సిద్ధంగా లేకుంటే వారి నుంచి అంగీకారం తీసుకుని అర్హులైన మరొకరికి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెండో విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, జిల్లాకు 17,983 ఇస్తున్నామని ప్రకటించారు. ఇందులో 12,276 ఇళ్లకు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, ఇప్పటివరకు 7,212 ఇళ్లకు ఇన్చార్జ్ మంత్రి ఆమోదం లభించిందని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల జాబితా వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేయాలని చెప్పారు.మండలాల్లో అవగాహన సదస్సులు.. భూ భారతి చట్టంపై పైలట్ మండలంగా నేలకొండపల్లిని ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవె న్యూ సదస్సులు నిర్వహించామని, భూ సమస్యలపై 3,264 దరఖాస్తులు స్వీకరించగా, అందులో 1,786 సాదాబైనామా దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. రెండో విడతగా బోనకల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. ఎర్రుపాలెం మండలం మూలుగుమాడును రీ సర్వేకు పైల ట్ గ్రామంగా ఎంపిక చేశామని చెప్పారు. జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో సర్వే కోసం రెండు టీమ్ల చొప్పున సిద్ధం చేయాలని సూచించా రు. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ ముజమ్మి ల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల వేగవంతానికి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, భూ భారతి పైలట్ మండలాల్లో భూ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని వివరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, ఆర్డీఓలు నర్సింహారా వు, రాజేందర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
రామా.. కనవేమిరా!
● అరకొర వసతులతో అంజన్న మాలధారుల ఇక్కట్లు ● తరలివచ్చిన భక్తులతో భద్రాచలంలో హనుమజ్జయంతి సందడి ● కనీస ఏర్పాట్లు చేయని ప్రభుత్వం.. దాతల స్పందన కూడా కరువే.. భద్రాచలం: మాల విరమించేందుకు భద్రగిరి వచ్చిన అంజన్న భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. హనుమాన్ మాలధారులు ఇక్కట్ల నడుమే గురువారం శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకున్నారు. హనుమజ్జయంతికి ప్రభుత్వం, దేవస్థానం ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో హనుమాన్ మాల ధరిస్తారు. అయ్యప్ప మాలధారణ తర్వాత హనుమాన్ మాలధారణకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. మాలధారులు కొండగట్టు అంజన్న వద్ద, భద్రాచలం శ్రీ సీతారాముల చెంతన ఇరుముడి విరమణ చేసేందుకు ఆసక్తి చూపుతారు. మూడు రోజుల్లో సుమారు 40 వేల మంది భక్తులు భద్రాచలాన్ని సందర్శిస్తారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి తర్వాత హనుమాన్ జయంతికే ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్పవచ్చు. ఈసారి కూడా అధిక సంఖ్యలో అంజన్న మాలధారులు భద్రగిరి వచ్చారు. కానీ ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దేవస్థానం ఆధ్వర్యంలో కేవలం అధికంగా లడ్డూల తయారీ, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాట్లు తప్ప ఇతరత్రా ప్రత్యేక ఏర్పాట్లు ఏర్పాటు చేయలేదు. క్యూలైన్లు కిటకిట తరలివచ్చిన హనుమాన్ మాలధారులతో భద్రగిరి కాషాయవర్ణంగా మారింది. రోడ్లన్నీ సందడిగా మారాయి. శ్రీసీతారామ చంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. బుధవారం అర్ధరాత్రి వరకు, మళ్లీ గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో మాలధారణ విరమణను అర్చకులు పూర్తి చేశారు. అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా అభయాంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం, తమలపాకులతో అర్చన, తదితర పూజలను గావించారు. ప్రసాదాల కోసం శాశ్వత ఆరుకౌంటర్లు, స్టేడియంలో బ్యాంకర్ల ద్వారా నాలుగు, పడమర మెట్ల వైపు మరో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈఓ రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి 10.30 గంటలకు వెంకటగిరి క్రాస్రోడ్డులో, 10.45 గంటలకు గాంధీచౌక్లో ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11 గంటలకు 2వ డివిజన్ పాండురంగాపురంలో స్ట్రోమ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. శనివారం రఘునాథపాలెం మండలం కోటపాడులో కోయచలక – పాపటపల్లి దారిలో బ్రిడ్జి నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. చట్టానికి లోబడి వ్యాపారం చేయాలిజిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య బోనకల్: ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్లు చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య సూచించారు. బోనకల్లో గురువారం మధిర డివిజన్ డీలర్ల సమావేశం నిర్వహించగా డీఏఓ మాట్లాడారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని చెప్పారు. క్రమం తప్పకుండా లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేయడమే కాక పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీలర్లకు ఈపాస్ మిషన్లను అందించారు. కార్యక్రమంలో మధిర ఏడీఏ ఎస్.విజయచంద్ర, ఏఓలు వినయ్కుమార్, సాయిదీక్షత్, మానస, సాయిశివ, ఎస్ఐలు వెంకన్న, నాగుల్మీరా, లక్ష్మీ బార్గవి పాల్గొన్నారు. స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాలకు తేదీల ఖరారుఖమ్మం స్పోర్ట్స్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వార్యాన కొనసాగుతున్న స్పోర్ట్స్ అకాడమీలు, రీజినల్ స్పోర్ట్స్ హాస్టళ్లలో ప్రవేశాలకు తేదీలను ఖరారు చేసినట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి టి.సునీల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1న సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలకు, 10, 11 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో సైక్లింగ్, రెజ్లింగ్ ఎంపికలు, హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్కు ఎంపికలు జరుగుతాయని వివరించారు. ఇక 10వ తేదీన సరూర్నగర్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీకి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాలీబాల్ అకాడమీకి, 12న వనపర్తిలో హాకీ అకాడమీకి, ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీకి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 12, 13 తేదీల్లో మహబూబ్నగర్లో వాలీబాల్ అకాడమీకి ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు ఆయా క్రీడాంశాల్లో జరిగే ఎంపికలకు నిర్ణీత తేదీల్లో వెళ్లాలని సూచించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంఖమ్మం సహకారనగర్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 3,483 మంది విద్యార్థులకు గాను 3,268 మంది, మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 890 మందికి గాను 829 మంది హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. డీఈసీ, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను సందర్శించాయని, తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వివరించారు. వృత్యంతర శిక్షణతో ఉపాధ్యాయులకు మేలుఖమ్మం సహకారనగర్ : వృత్యంతర శిక్షణతో ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని స్టేట్ రిసోర్స్ పర్సన్, తెలుగు పర్యవేక్షకులు మడతా భాస్కర్ అన్నారు. నగరంలోని న్యూ ఇరా పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యా లక్ష్యాల సాధనకు ఈ శిక్షణ సరైందని అన్నారు. శిక్షణ కేంద్రం కో ఆర్డినేటర్ సీహెచ్.రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు పొత్తూరి సీతారామారావు, దేవయ్య, జంగం నాగేశ్వరరావు, జక్కంపూడి కృష్ణ, రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం..
● పుష్కరాలకు జిల్లా నుంచి తరలివెళ్తున్న భక్తులు ● నదీస్నానం పుణ్యఫలమని నమ్మకం ● ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనంఖమ్మంగాంధీచౌక్: సరస్వతీ పురష్కరాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈనెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోంది. ఈ త్రివేణీ సంగమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుండగా.. ఇక్కడ స్నానమాచరించిన భక్తులు పక్కనే ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. నదీ స్నానాలకు ప్రాముఖ్యం సరస్వతీ పుష్కరాల్లో నదీ స్నానాలకు భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పుష్కరస్నానం పుణ్యఫలమని, చదవుల తల్లిగా విరాజిల్లుతున్న సరస్వతీ నదిలో స్నానమాచరిస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయని వారి నమ్మకం. కాళేశ్వరంలో స్నాన ఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్నానానంతరం భక్తులు నదీ తీరంలో సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజలు చేయడంతో పాటు పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో పయనం.. జిల్లాలోని అన్ని ప్రాంతాల భక్తులు నిత్యం పుష్కరాలకు వెళ్తున్నారు. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో వరంగల్, పరకాల, భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వరకు 225 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఖమ్మం నుంచి మహబూబాబాద్, నర్సంపేట, మల్లంపల్లి, రేగొండ, భూపాలపల్లి, మహదేవ్పూర్ మీదుగా వెళితే 221 కి.మీ. ఉంటుంది. లేదంటే రైలులో ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాళేశ్వరం వెళ్లొచ్చు. ట్రావెల్స్ చార్జీల మోత.. జిల్లా నుంచి కాళేశ్వరానికి నేరుగా బస్సుల సౌకర్యం అంతగా లేకపోవడంతో భక్తులు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. కొందరు భక్తులు పుష్కరాలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, లక్నవరం, రామప్ప, వరంగల్ వేయి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి దేవాలయం వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరికి రవాణా చార్జీలు రూ.1,200 నుంచి రూ. 2,000 వరకు ఖర్చవుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు, సెలవులు కావడం, ఇప్పుడే పుష్కరాలు రావడంతో ప్రైవేట్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరల మోత మోగుతోంది. -
పుష్కరాల యాత్ర విజయవంతం కావాలి
ఖమ్మం మామిళ్లగూడెం: కాళేశ్వరం శ్రీ సరస్వతి పుష్కరాలకు వెళ్తున్న బస్సు యాత్ర విజయవంతం కావాలని ఖమ్మం వన్టౌన్ సీఐ తాటిపాముల కరుణాకర్ కోరారు. గురువారం ఖమ్మం జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్తో పాటు జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు పుష్కరాలకు వెళ్తుండగా.. ఖమ్మం గాంధీ పార్క్ నుంచి వెళ్లే బస్సును సీఐ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ మాట్లాడాక..సీఐను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెలిగేటి విజయలక్ష్మి, జయ, సభ్యులు అనాసి రాధాకృష్ణ, సాదినేని జనార్ధన్రావు, రాయల వెంకటేశ్వర్లు, వేగినాటి లక్ష్మయ్య, కేదాసు నరసయ్య, కె.సత్యనారాయణరెడ్డి, శ్రీహరి, జల్లా వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, లక్ష్మి, రమాదేవి, నాగమణి, లలిత, పద్మ, శ్రీలక్ష్మి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా వర్షం
● సగటు వర్షపాతం 24 మి.మీ. ● పలుచోట్ల 45 మి.మీ.కుపైగానే.. ● మూడు రోజుల పాటు వర్ష సూచనమండలం వర్షపాతం వైరా 47.4 చింతకాని 46.6 పెనుబల్లి 45.2 నేలకొండపల్లి 43.6 సత్తుపల్లి 42.0 తల్లాడ 33.4 కూసుమంచి 33.8 మధిర 32.8 కామేపల్లి 26.6 సింగరేణి 19.4 ఖమ్మం అర్బన్ 19.2 ఖమ్మం రూరల్ 16.2 ఎర్రుపాలెం 15.6 కొణిజర్ల 12.6 వేంసూరు 10.6 ముదిగొండ, బోనకల్ 10.4 తిరుమలాయపాలెం 10.2 రఘునాథపాలెం, ఏన్కూరు 9.8 కల్లూరు 8.4 ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది. మొత్తంగా 504.0 మి.మీ. వర్షపాతనం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 24 మి.మీ. కాగా అత్యధికంగా వైరాలో 47.4 మి.మీ. చింతకాని, పెనుబల్లి, నేలకొండపల్లి, సత్తుపల్లి మండలాల్లో 40 మి.మీ.కు పైగా నమోదైంది. కల్లూరులో అత్యల్పంగా 8.4 మి.మీ. వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం 33.4 నుంచి 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పమ్మిలో 38.2 డిగ్రీలు, అత్యల్పంగా గౌరారంలో 33.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రైతులు పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. అయితే ఈ వానలు మరో మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ముక్తిని కలిగించేది పుణ్య స్నానం
సరస్వతీ పుష్కరాలకు కుటుంబమంతా వెళ్లొచ్చాం. త్రివేణీ సంగమంలో స్నానమాచరించి సరస్వతీ అమ్మవారిని, ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అయితే సౌకర్యాలు ఆశించినంతా లేవు. తినుబండారాల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. – వల్లాల స్వప్న, రిక్కాబజార్, ఖమ్మం సమూహంగా వెళ్లేందుకు ఏర్పాట్లు కాలనీ వాసులం, కుటుంబ సభ్యులం కలిసి పుష్కరాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. నేరుగా బస్సులు లేకపోవడంతో ట్రావెల్స్ వాహనం మాట్లాడుకున్నాం. ట్రావెల్స్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. – కొండపల్లి మనోహరి, శ్రీనివాసనగర్, ఖమ్మం వాహనాలకు డిమాండ్ పెరిగింది పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లేందుకు వాహనాల బుకింగ్లు పెరిగాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరో వైపు వేసవి సెలవుల సమయంలో పుష్కరాలు రావడంతో వాహనాలకు డిమాండ్ పెరిగింది. దూరం, వాహనాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నాం. – ఆర్ ప్రకాష్, ట్రావెల్స్ యజమాని, ఖమ్మం● -
ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలి
ఖమ్మంమయూరిసెంటర్: దండకారణ్యం నారాయణపూర్, బస్తర్లో బుధవారం జరిగిన బూటకపు ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఖమ్మంలోని మంచికంటి హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, ప్రజా సంఘాల నేతలు కాకి భాస్కర్, డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్ మాట్లాడారు. మూడు నెలలుగా మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరుపుతూనే ఉందన్నారు. శాంతి చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపినా 2026 మావోయిస్టు రహిత దేశంగా మార్చుతామని కేంద్రం అమాయకులను పొట్టనబెట్టుకుంటుందన్నారు. తాజాగా జరిపిన ఎన్కౌంటర్ మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదను గుజరాత్ మార్వాడీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఈ ఎన్కౌంటర్లు అన్నారు. ఈ ఎన్కౌంటర్ను నిరసిస్తూ 23న సాయంత్రం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు వై.విక్రమ్, సింగు నర్సింహారావు, సీ.వై.పుల్లయ్య, రవి మారుత్, దేవిరెడ్డి విజయ్, చిర్ర రవి, విప్లవ కుమార్, రమణాల లక్ష్మయ్య, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫలరాజు ఫలించేలా..
యాజమాన్య పద్ధతితో అధిక లాభాలు ● నేల సారవంతానికి దుక్కులు అవసరం ● కొమ్మ కత్తిరింపులతో తెగుళ్ల నివారణ ● వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ వైరా: దేశంలో పండించే పండ్ల తోటల్లో ప్రధానమైనది, ఫలరాజుగా పేరుగాంచినది మామిడి. అయితే దీని సాగు విస్తీర్ణం దేశంలో మొత్తం 35శాతం ఉండగా.. 22,58,130 హెక్టార్లలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో 1,15,990 హెక్టార్లు, జిల్లాలో 13,674 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సాధారణంగా మామిడి రైతులు పూత, కాత దశలో మాత్రమే మామిడి తోటలపై దృష్టి సారించి చెట్టుకు కావాల్సిన ఎరువులు అందిస్తుంటారు. దీని వలన సరైన పోషకాలు అందక పూత సకాలంలో రాకపోవడం, వచ్చిన పూత, పిందె సరిగా నిలవక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యాన అధిక దిగుబడులు సాధించేందుకు కోత అనంతరం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ సూచిస్తున్నారు. కొమ్మ కత్తిరింపులు.. ● మామిడి కాయ కోత అనంతరం కాయ తొడిమలున్న కొమ్మలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన, విరిగిన కొమ్మలు, చెట్ల లోపల గాలి, వెలుతురు ప్రవేశానికి అడ్డుగా ఉన్న కొమ్మలను కత్తిరించాలి. ● పూత కాడల నుంచి వెనుకకు 15 సెంటీ మీటర్లు వరకు కత్తిరిస్తే నవంబర్, డిసెంబర్లలో కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి, అవే వచ్చే రుతువులో పుష్పిస్తాయి. ● ప్రతీ రెమ్మ చివరి నుంచి 3–5 చిగుర్లు వస్తే ఆరోగ్యంగా ఉన్న రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి. ● కత్తిరింపులతో కొంత మేర తెగుళ్లు తగ్గే అవకాశం ఉండగా.. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డ్ఫేస్ట్ పూయాలి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. దుక్కి దున్నడం.. తొలకరిలో అనగా జూన్, జూలై మాసాలలో రైతాంగం చెట్ల మధ్యన దున్నాలి. దీని వలన కోశస్థ దశలో ఉన్న పురుగులు, కలుపు నివారించబడడడంతో పాటు నేల గుల్లబారి, వేర్లకు గాలి బాగా చేరి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంటే గుణం పెరిగి నేల సారవంతమవుతంది. మూడవ దుక్కి అక్టోబర్లో చేపడినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి దోహదపడుతుంది. దున్నేటప్పుడు చెట్టు నుంచి 1–5 మీటర్ల దూరంలో దున్నడం ఉత్తమం. ఎరువుల యాజమాన్యం.. కాసే తోటలో చెట్లకు సరిఝైన మోతాదులో ఎరువులు అందించాలి. ఒక సంవత్సరం వయసున్న చెట్లకు 10 కిలోల పశువుల ఎరువు, 200 గ్రాములు యూరియా, 600 గ్రాములు సింగిల్ సూపర్ పాస్పేట్, 150 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేయాలి. అదే ఐదేళ్ల వయసున్న చెట్లకు 50 కిలోల పశువుల ఎరువు, కిలో యూరియా, 3 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 730 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. పదేళ్లు, ఆపై వయసు గల చెట్లకు 100 కిలోల పశువులు ఎరువు, 2.2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 1.75 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. మామిడి కోత అయ్యాక సిపార్సు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగతా 1/3 భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలో ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో వేయాలి. సూక్ష్మధాత లోపాలు ఎక్కువుగా ఉన్న తోటల్లో చెట్టుకు 150 గ్రాములు జింక్ సల్ఫేట్, 75 గ్రాములు బోరాక్స్, 100 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ 125 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ పశువుల ఎరువుతో కలిపి జూన్, జూలై మాసాలలో మొక్కల పాదుల్లో వేయాలి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మామిడి చెట్లు సెప్టెంబర్, అక్టోబర్లో కొత్త చిగుర్లు వేసి సకాలంలో పూత రావడమే గాక మంచి దిగుబడులు పొందవచ్చు. -
జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే..
ఖమ్మంవన్టౌన్: జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల నగరంలో జాతీయవాదుల నేతృత్వాన నిర్వహించిన తిరంగా యాత్రను కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఘటనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు నేతృత్వాన జిల్లా నేతలు కరీంనగర్లోని బండి సంజయ్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించగా.. ఆయన స్పందించారు.ఇలాంటి దేశద్రోహకర చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. బండి సంజయ్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు సన్నే ఉదయప్రతాప్, రమేష్, నున్నా రవికుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
బావమరిదిని దించేందుకు వెళ్లి అనంతలోకాలకు..
తల్లాడ: తల్లాడ ఎన్టీఆర్నగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు(28) అతడి కుమారుడు క్రిశాంత్(6) మోటార్ సైకిల్పై తల్లాడ వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈక్రమంలో ఎన్టీఆర్నగర్ వద్ద జాతీయ రహదారిలో ఎదురుగా సత్తుపల్లి నుంచి తల్లాడ వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రిశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా రాంబాబును 108లో ఖమ్మం ప్రభుత్వ్రాస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. బావమరిదిని బస్టాండ్లో దించేందుకు వెళ్లి.. కొత్తపల్లి రాంబాబు తన భార్య గోపరాణి పిల్లలతో పాటు అత్తగారు ఊరైన రామచంద్రాపురం గ్రామానికి బుధవారం రాత్రి వచ్చారు. రాత్రి అక్కడే బస చేసి గురువారం మధ్యాహ్నం తన బావమరిది తిరుపతిరావును తల్లాడ బస్టాండ్లో దించేందుకు మోటార్ సైకిల్పై వచ్చారు. బావమరిదిని దించేందుకు వస్తుండగా తన కుమారుడు క్రిశాంత్ నేను కూడా వస్తానని అనడంతో కుమారుడితో పాటు బావమరిదిని తీసుకొని బస్టాండ్లో దించి తిరిగి రామచంద్రాపురం బయలు దేరాడు. ఈక్రమంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా తండ్రీకుమారుడు మృతి చెందగా.. గ్రామంలో విషాదం అలుముకుంది. డీసీఎం వ్యాన్ ఢీకొని తండ్రీకొడుకులు మృతి -
ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక
నేలకొండపల్లి: ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మారగాని లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోగా ఆయన నియమితులయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కె.శ్రావణినాయుడు, కోశాధికారిగా వై.సూరయ్య, ఉపాధ్యక్షుడిగా వి.వీరన్న, సంయుక్త కార్యదర్శిగా పి.నరేష్, గౌరవ సలహాదారులుగా నరేష్, కృష్ణయ్య, మహేష్, చంద్రావతి, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎం.శివకుమార్, రవికుమార్ ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రత్యేక ఉపాధ్యాయలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు, హక్కుల సాధన కోసం కృషి చేస్తామన్నారు. బస్తీ దవాఖానా ఆకస్మిక తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: నగరంలోని రంగనాయకుల గుట్ట బస్తీ దవాఖానాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతిబాయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, వైద్యులు పేషంట్లతో వ్యవహారిస్తున్న తీరు, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. సిబ్బంది అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నాక సమయపాలన విధిగా పాటించాలన్నారు. అలాగే పేషంట్లతో మర్యాదగా వ్యవహారించాలని, లాబ్ పరీక్షలు నిర్వహించాలని, మందులు సరిపడా అందించాలని, అసంక్రమిత వ్యాధులపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. మలేరియ, డెంగీ, కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, టీబీ వ్యాధిగ్రస్తులకు మంచి సేవలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి ఆరోగ్యవిద్యను అందించాలని సూచించారు. విద్యుత్ అభివృద్ధి పనుల పరిశీలన ఖమ్మంవ్యవసాయం: దానవాయిగూడెం సబ్ స్టేషన్ పరిధిలో, రైల్వే అండర్ గ్రౌండ్ కేబుల్ పనులను గురువారం ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ అధికారుల బృందం పరిశీలించింది. మేకల భిక్షమయ్య ఫంక్షన్ హాల్ నుంచి కామంచికల్ వరకు జరుగుతున్న రహదార్ల అభివృద్ధి పనులకు సంబంధించి విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులతో పాటు కామంచికల్లో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఖమ్మం టౌన్ డీఈ నంబూరి రామారావు, రఘునాథపాలెం ఏడీఈ సంజీవ్ పాల్గొన్నారు. అడిషనల్ డీసీపీ బదిలీ ఖమ్మంక్రైం: ఖమ్మం అడిషనల్ డీసీపీ(అడ్మిన్) ఎ.నరేష్కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఏఎస్పీ(అడ్మిన్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాదిన్నర క్రితం ఖమ్మం అడిషనల్ డీసీపీగా బదిలీపై రాగా.. ప్రస్తుతం ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కాగా, మున్నేరు వరదల సమయాన ప్రజలకు సేవలు అందించి గుర్తింపు పొందారు. రామయ్య సేవలో మాజీ స్పీకర్ భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి గురువారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నేత ఎనుగుల రాకేష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మానె రామకృష్ణ, మండల కన్వీనర్ సునీల్ పాల్గొన్నారు. -
స్లాట్ బుక్ చేసుకుని పడిగాపులు
నేలకొండపల్లి: స్లాట్ బుక్ చేసుకున్న రైతులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాశారు. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల స్లాట్ బుక్ రైతులకు గురువారం మండల తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించారు. దీంతో వారు తమ చంటి పిల్లలతో సహా ఉదయం 10 గంటలకు కార్యాలయానికి చేరుకోగా.. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో రాత్రి 9 గంటల వరకు కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. తిండి తిప్పలు లేకుండా కార్యాలయంలో వేచి ఉన్న రైతులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దర్ వి.వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ఖమ్మంలో జిల్లా అధికారులతో సమావేశం ఉన్నందున్న ఆలస్యమైందని వెల్ల డించారు. డీఎస్పీ సేవలకు గుర్తింపు కొత్తగూడెంఅర్బన్: పొక్సో కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కేసుల పరిష్కారానికి కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు గుర్తింపు లభించింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు ప్రశంసాపత్రం లభించగా.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో గురువారం డీఎస్పీని అభినందించారు. -
బావిలో పడి ఆవు, రెండు దూడలు మృతి
చింతకాని: మేత కోసం అడవికి వెళ్లిన ఆవు, రెండు దూడలు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన చింతకానిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. చింతకాని గ్రామానికి చెందిన బండి సతీష్కు చెందిన ఆవు, ఉసికల తుమ్మలయ్యకు చెందిన పెయ్య దూడ, గడ్డం రాఘవులకు చెందిన కోడె దూడలను మూడు రోజుల క్రితం మేత కోసం అడవికి పంపించారు. చింతకాని నుంచి రేపల్లెవాడ వెళ్లే రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఆవు, రెండు దూడలు అందులో పడి మృతి చెందాయి. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో మూడు రోజుల నుంచి వాటి కోసం వెతుకుతుండగా.. గురువారం సాయంత్రం స్థానిక రైతులు చూసి సమాచారం ఇవ్వడంతో వాటిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి రఘునాథపాలెం: మండలంలోని చిమ్మపుడి గ్రామంలో బుధవారం రాత్రి ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడగా.. పాడి గేదె మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెల్ల బోయిన శ్రీనుకు చెందిన గేదె గురువారం ఉదయం మేతకు వెళ్లగా.. అప్పటికే తెగి పడిన తీగలకు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందిందని తెలిపారు. దీని విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని బాధిత రైతుల వాపోయాడు. కాగా, ఘటనా స్థలాన్ని మండల మాజీ వైస్ ఎంపీపీ గుత్తా రవి పరిశీలించి బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సుకినీతండాలో మూగ గోస..
రఘునాథపాలెం: మండలంలోని సుకినీతండాలో అనుమానాస్పద స్థితిలో పలువురు రైతులకు చెందిన నాలుగు ఆవులు గురువారం మృతి చెందాయి. బుధవారం మేతకు వెళ్లిన పశువులు రాత్రి నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. గమనించిన రైతులు వెంటనే చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా మాలోతు బద్యా, జగ్యా, రవి, సీతులకు చెందిన నాలుగు ఆవులు మృతి చెందాయి. అదేవిధంగా గ్రామానికి చెందిన వీరా, శంకర్, రవిలకు చెందిన మరో మూడు ఆవులు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతుండగా.. పాపటపల్లి పశువైద్యాధికారి గంగాధర్ ఆధ్వర్యాన వైద్యసిబ్బంది చికిత్స అందిస్తున్నారు. మేతకు వెళ్లిన సమయాన పొలాల్లో పురుగుమందుల డబ్బాలు, గాబుల్లో వర్షపు నీరు నిలిచి ఉండగా, అవి తాగిన కారణంగానే పశువులకు ఇలా ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేళ పశువుల మృతితో రైతు కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు. నాలుగు ఆవుల మృతి -
కర్ణాటకలో చోరీ.. వైరాలో రికవరీ
వైరా: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితుడు వైరాలో పట్టుబడగా సొత్తు రికవరీ చేసి అక్కడి పోలీసులకు అప్పగించారు. ఈఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వైరా లీలా సుందరయ్యనగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇక్కడ దొంగతనం చేసిన వారే అదే నెల 22 తేదీన కర్ణాటక రాష్ట్రంలోని చల్లెకిరే పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చోరీకి పాల్పడ్డారు. ఈమేరకు వైరా సీఐ నూనావత్ సాగర్నాయక్ ఆధ్వర్యాన చేపట్టిన విచారణలో నిందితులు పట్టుబడగా వారి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. అందులో కర్ణాటకలో నమోదైన కేసుకు సంబంధించి 12తులాల బంగారు ఆభరణాలు, కారును చొల్ల కిలే ఏఎస్ఐ రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ వసంత్కుమార్కు వైరాలో సీఐ సాగర్ బుధవారం అందజేశారు. విద్యుదాఘాతంతో చిన్నారి మృతిఖమ్మం సిద్ధార్థనగర్లో విషాదం ఖమ్మంఅర్బన్: ఖమ్మం అల్లీపురం రోడ్డులోని సిద్ధార్థనగర్లో విద్యుత్ షాక్తో బాలిక మృతి చెందింది. కొణిజర్ల మండలానికి చెందిన రాచుమళ్ల రాజు – మేరీ దంపతులు అల్లీపురం రోడ్డులోని సిద్ధార్థనగర్ ప్రాంతంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె టి.జాస్మిన్(11) బుధవారం ఉదయం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు స్విచ్ బోర్డును తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై మృతురాలి తల్లి మేరీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. కాగా, అంతసేపు కళ్ల ముందు ఆడుతూ తిరిగి కుమార్తె కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఆర్టిజన్లకు బదిలీల భయం
● కేటీపీఎస్లో అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికులు ● పర్మనెంట్ చేశాకే బదిలీ చేయాలని డిమాండ్ పాల్వంచ: కేటీపీఎస్ కర్మాగారంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు బదిలీల భయం పట్టుకుంది. ఇప్పటికే టీజీ జెన్కో పరిధిలోని పలు కర్మాగారాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాలతోపాటు, ఏఈ నుంచి ఎస్ఈ వరకు బదిలీలు జరిగాయి. కొత్తగా ఏర్పాటైన వైటీపీఎస్, బీటీపీఎస్లలో ఉద్యోగ, కార్మికులు అవసరం ఉండటంతో అక్కడికే ఎక్కువ మందిని బదిలీలు చేశారు. ఈ క్రమంలో కేటీపీఎస్లో అదనంగా ఉన్న ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కలిగించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలు సరికాదంటున్న కార్మికులు ఆర్టిజన్ కార్మికులు గ్రేడ్–1, 2 ,3, 4లుగా ఉన్నారు. స్కిల్ ఆధారంగా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. వీరు గతంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన క్రమంలో స్కిల్ను బట్టి ఆయా కంపెనీలు పనికి తగిన వేతనం ఇచ్చేవి. గత ప్రభుత్వం వీరిని ఆర్టిజన్లుగా తీసుకోవడం, కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత కాలంలో పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారనే ఆశలో ఆర్టిజన్లు ఉన్నారు. కానీ పదేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల మాదిరిగా వీరికి జెన్కో యాజమాన్యం సౌకర్యాలు కల్పించడంలేదు. పైగా అదనంగా ఉన్నారనే నెపంతో యాజమాన్యం ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలనే యోచన సరికాదనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నామని ఆర్టిజన్లు వాపోతున్నారు. ఉద్యోగులుగా తీసుకోవాలి ఇప్పటివరకు ఇతర కేడర్లలో అత్యధికంగా పదోన్నతులతోనే బదిలీలు చేపట్టారు. ఆర్టిజన్లు కేటీపీఎస్ 7వ దశలో 600 మంది, కేటీపీఎస్ 5,6 దశల్లో సుమారు 1,400 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థలన్నింటిలో కలిపి సుమారు 24 వేల మంది ఉన్నారు. బదిలీ చేసే ముందు తమను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగులకు కల్పి స్తున్న సౌకర్యాలన్నీ తమకు కల్పించాలని ఆర్టిజన్లు కోరుతున్నారు. లేనిపక్షంలో బదిలీ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.