breaking news
Khammam District Latest News
-
యువ ఇంజినీర్కు అరుదైన అవకాశం
‘విక్రమ్–1’ ప్రయోగంలో మాదాపురం వాసిముదిగొండ: ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్రెడ్డి తన ప్రతిభతో భారత అంతరిక్ష రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి తొలిసారి ప్రయోగించిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1(ఆగమన్) ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ రాకెట్ను రూపొందించగా.. ఇందులో నరేందర్రెడ్డి టీమ్ లీడ్ – ఇంటిగ్రేషన్ – టెస్టింగ్ ఇంజనీర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. విక్రమ్–1 ప్రయోగ వాహనంలోని లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థల సమీకరణ, పరీక్షలు, ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు. కాగా, నరేందర్రెడ్డి తండ్రి హనుమిరెడ్డి రైతు కాగా, తల్లి లక్ష్మి, భార్య వెంకటదివ్య ఉన్నారు. ఆయన తమ్ముడు రాజశేఖర్రెడ్డి నెదర్లాండ్స్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే నరేందర్రెడ్డి మామ ప్రోత్సాహంతో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి పదేళ్లకు పైగా అంతరిక్ష, రక్షణ రంగాల్లో అనుభవం సాధించాడు. ప్రస్తుతం విక్రమ్–1(ఆగమన్) ప్రయోగంలో పాలుపంచుకున్న ఆయనను మండల వాసులు అభినందించారు. -
శివాలయం అభివృద్ధికి రూ.లక్ష విరాళం
ఎర్రుపాలెం: మండలంలోని వెంకటాపురంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి(శివాలయం) అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన బొగ్గుల మల్లిక సోమవారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్దన్రెడ్డికి అందచేయగా ఆయనతో పాటు నాయకులు అభినందించారు. ఈకార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ బొగ్గుల లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు కర్నాటి సుధాకర్రెడ్డి, వెర్రు వెంకటేశ్వరరావు, గోపిరెడ్డి, నాగిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎల్ఏటీలో మూడో ర్యాంకు సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సోయం పూజిత తమిళనాడులోని నేషనల్ లా యూనివర్సిటీలో సీటు సాధించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సీఎల్ఏటీ)లో మూడో ర్యాంకు సాధించిన ఆమె యూనివర్సిటీకి ఎంపికై ంది. పూజిత తండ్రి సోయం నాగేశ్వరరావు ఎల్ఐసీ ఉద్యోగి కాగా, ఉపాధ్యాయురాలైన తల్లి సుమలత ప్రో ద్భలంతో సీటు సాధించిన ఆమెను ఆదివాసీ సంఘాల నాయకులు అభినందించారు. కవి శ్రీనివాసరావుకు పురస్కారం ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంకు చెందిన కవి, రచయిత మంత్రిప్రగడ శ్రీనివాసరావుకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టీటీఏ) మహాసభలను అమెరికాలో ఈనెల 17నుంచి 19 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి సాహిత్య ఎక్స్లెన్సీ పురస్కార పోటీల్లో కవితల విభాగం నుంచి పాల్గొన్న శ్రీనివాసరావు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఆయనకు సినీ గేయ రచయితలు కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్తో పాటు వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ అరుణ సుబ్బారావు, డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, గూడూరు శ్రీనివాస్, రాజశ్రీ పురస్కారం అందజేసి సన్మానించారు. అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. బీబీఏ, బీసీఏ బీబిఎఫ్ఎస్ఐ, బయోటెక్నాలజీ, బిజినెస్ అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్, డేటా సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్, గణితం, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్, తెలుగు అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో 50శాతం, ఇతర అభ్యర్థులు 55శాతం మార్కులు సాధించి ఉండాలని, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈనెల 23వ తేదీ సాయంత్రంలోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పిస్తే, ఈనెల 25వ తేదీన ఇంటర్వ్యూ, డెమో నిర్వహిస్తామని వెల్లడించారు. మహిళా డిగ్రీ కళాశాలలో... ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బానోత్ రెడ్డి తెలిపారు. కామర్స్ రెండు పోస్టులు, తెలుగు, ఇంగ్లిష్, చరిత్ర, రాజనీతిశాస్త్రం, కంప్యూటర్స్, గణితం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో 50శాతం, ఇతర అభ్యర్థులు 55శాతం మార్కులు సాధించి ఉండాలని, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీ సాయంత్రంలోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని, ఇంటర్వ్యూ తేదీ త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన వ్యాన్
కల్లూరు రూరల్: కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సోమవారం సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న సత్తుపల్లి డిపో బస్సును టాటా ఏస్ వ్యాన్ వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏసీ డ్రైవర్, చండ్రుగొండ మండలం మధుకూరుకు చెందిన తురక లక్ష్మణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనకు కల్లూరులో చికిత్స అనంతరం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయిది. ఇసుక లారీ బోల్తా, డ్రైవర్కు గాయాలు కొణిజర్ల: ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమాన ఇసుక లారీ బోల్తా పడింది. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి సమీపాన సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు... భద్రాచలం నుంచి సూర్యాపేట జిల్లా కోదాడకు ఇసుక లోడ్తో లారీ వెళ్తోంది. గుబ్బగుర్తి సమీపాన మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని డ్రైవర్ తప్పించే యత్నంలో అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్లలో బోల్తా పడింది. లారీ క్యాబిన్ అద్దాలు చెట్టుకు తాకడంతో పగిలిపోగా, డ్రైవర్ సత్యనారాయణ కేబిన్లో చిక్కుకుపోయాడు. దీంతో స్థానికులు ఆయనను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. 108 అంబులెన్స్ తనిఖీ బోనకల్: బోనకల్, చింతకాని మండలాలకు సేవలందిస్తున్న 108 అంబులెన్స్ను ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్(ఈఎంఈ) ఆలేటి ప్రవీణ్కుమార్ సోమవారం తనిఖీ చేశారు. అంబులెన్స్లో మందుల లభ్యత, పరికరాల పనితీరును ఆయన పరిశీలించారు. బాధితుల నుంచి వచ్చే ఫోన్లకు సత్వరమే స్పందించి ఘటనాస్థలికి వెళ్లడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చని తెలిపారు. సిబ్బంది నండ్రు మనోహర్, కోట భానుసహాన్, ఎం.ఎం.చక్రవర్తి, కలసాని వెంకట్రావుతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పాదరక్షల షోరూమ్కు జరిమానా ఖమ్మంలీగల్: నాణ్యత లేని పాదరక్షలతో అమ్మారని వినియోగదారుడు వేసిన కేసును విచారించిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు మాధవీలత సోమవారంషోరూమ్ నిర్వాహకులకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. వైరా మండలం తాటిపూడికి చెందిన న్యాయవాద క్లర్క్ లింగాల ప్రవీణ్కుమార్ సెంట్రో షోరూమ్లో 2025 ఆగస్టులో రూ.1,599 విలువైన పాదరక్షలు కొనుగోలు చేశాడు. రెండు, మూడు సార్లకే చెప్పుల సోల్, లెదర్ దెబ్బతిని మధ్యలో విరిగిపోయింది. దీంతో షోరూమ్లో సంప్రదిస్తే పట్టించుకోలేదు. ఈమేరకు ఆయన న్యాయవాదుల ద్వారా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించాడు. ఈమేరకు పాదరక్షల కొనుగోలు ధరతో పాటు నష్టపరిహారం, ఇతర ఖర్చులు చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు. -
పిండిప్రోలులో పోలీసుల జల్లెడ
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో ఇటీవల వృద్ధురాలు చెన్న సుగుణ హత్య జరగగా, నిందితులను గుర్తించేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కూసుమంచి సర్కిల్తో పాటు ఇతర ప్రాంతాల కు ఎస్ఐలు, సిబ్బంది సోమవారం ఉదయం నుంచే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి, గత చరిత్ర వివరాలు సేకరించారు. కూసుమంచి సీఐ సంజీవ్ ఆధ్వర్యాన వివిధ విభాగాల సిబ్బంది తనిఖీల్లో పాల్గొనగా అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే, సాయంత్రం హైదరాబాద్ నుండి వచ్చిన ఫోరెన్సిక్ టీమ్ సభ్యులు హత్య జరిగిన ఇంటిని పరిశీలించారు. అంతేకాక కేసు దర్యాప్తును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు.హత్య కేసు నిందితుడి కోసం గాలింపు -
పెద్దాస్పత్రిలో సీజనల్ కిటకిట
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సోమవారం కిటకిటలాడింది. వాతావరణంలో మార్పులతో వ్యాధుల వ్యాప్తి పెరగగా.. పలువురు జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు వారాంతపు సెలవులు రావడంతో సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఓపీ విభాగం వద్ద క్యూ నెలకొంది. జనరల్ ఆస్పత్రితో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రలో కూడా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల రద్దీ కనిపించింది. ఆస్పత్రిలో ఈ ఒక్కరోజు మొత్తం 2,500 మంది వరకు వివిధ రకాల వైద్యసేవలు పొందారని అధికారులు తెలిపారు. ఒకేరోజు ఎక్కువ మంది రావడంతో వృద్ధులు, గర్భిణులు ఇబ్బంది పడ్డారు. ఓపీ చీటీ తీసుకుని పరీక్ష చేయించుకునేందుకు చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చింది. -
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
ఖమ్మం వైద్యవిభాగం: పిల్లల్లో నులి పురుగుల నివారణే లక్ష్యంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. ఇటీవల మాత్రలు పంపిణీ చేయగా, మిగిలిన పిల్లల కోసం సోమవారం ‘మాప్–అప్ డే’ నిర్వహించగా ఆయన పలు ప్రాంతాల్లో తనిఖీ చేశారు. అలాగే, ఖమ్మం రస్తోగి నగర్, ఎన్నెస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రలు అందజేసి మాట్లాడారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. రెండో విడత ఎంఆర్ వ్యాక్సినేషన్ తట్టు – రుబెల్లా(ఎంఆర్) రెండో విడత స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతానికి ప్రణాళిక రూపొందించామని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 27నుండి మే 4వ తేదీ వరకు నిర్వహించిన మొదటి విడత వ్యాక్సినేషన్ డ్రైవ్లో జిల్లాలోని 443మంది పిల్లలకు గాను 431మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. తట్టు నిర్మూలనకు ఉద్దేశించిన ఎంఆర్ – 1 వ్యాక్సిన్ 116 మంది పిల్లలకు, ఎంఆర్ – 2 వ్యాక్సిన్ 123 మందికి, బీసీజీ 20 మందికి, పెంటావాలెంట్ 159 మందికి, డీపీటీ 159 మంది పిల్లలకు వేశామని తెలిపారు. అలాగే, గర్భిణులు 86 మందికి టీడీ టీకాలు వేయడంతో లక్ష్యం పూర్తయిందని వివరించారు. ఈనెల 27వ తేదీ వరకు జరిగే రెండో విడతను సైతం విజయవంతం చేసేలా ఉద్యోగులకు సూచనలు చేసినట్లు తెలిపారు. -
సాగుకు నీరు లేదు..
ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యాన వాస్తవాలను క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు చేరవేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులపై శాసీ్త్రయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలపై అంచనాకు వచ్చిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం ఎల్నినో సంసిద్ధతమై ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర టీ.ఎస్., అంకిత్, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఏడాది ప్రణాళిక ఉండాలి రానున్న మూడు నెలలకే పరిమితం కాకుండా కనీసం ఏడాది కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి సూచించారు. మండలాల వారీగా పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వర్షపాతం, తాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ దివాకర టీ.ఎస్. మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ వరకు పప్పుధాన్యాలు, అలసంద, కందులు, పెసర వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తొలుత పెద్దపల్లి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ ఎల్నినో పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈనెల 15నాటికి ఉమ్మడి జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం ఉన్నా, రైతులు ప్రస్తుతం పత్తి అధికంగా సాగు చేశారని తెలిపారు. వర్షాలు వస్తే వరి సాగుకు సిద్ధమవుతున్నారని, భూగర్భ జలాలు ఉన్న వారు నార్లు పోశారని అధికారులు వివరించారు. అనంతరం తెలంగాణ జలసిరి, ఎల్నినో సూపర్ స్థితిలో తీసుకునే చర్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు. ఇంకా ఈ సమావేశంలో పోలీస్కమిషనర్ సునీల్దత్, భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పి.దుర్గాప్రసాద్, ఖాదర్ బాబా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు. సాగర్, పాలేరు నుంచి రావడం కష్టమే.. వర్షాభావంతో రానున్న రెండు నెలల్లో భూగర్భజలాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగు చేసి నష్టపోవద్దని డిప్యూటీ సీఎం భట్టి కోరారు. ఈ విషయమై ప్రతీ రైతుకు సమాచారం చేరవేస్తూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వ లు, భూగర్భ జలాల పరిస్థితిపై సమగ్ర నివేదికను అందుబాటులో ఉంచాలన్నారు. రాజీవ్ లింక్ కాల్వ ద్వారా గోదావరి జలా లను జిల్లా అవసరాలకు వినియోగించడంపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో వర్షపాతం పరిస్థితులు, నీటి వనరుల లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నీటి లభ్యత ఆధారంగానే పంటలు ఎంపిక చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, పాలేరు ఆయకట్టుకు కూడా నీరు అందుబాటులో ఉండదని రైతులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. నీరు అధికంగా అవసరముండే వరి తదితర పంటలను ప్రోత్సహించకుండా, పెసర, మినుములు, కందులు, అలసంద, చిరుధాన్యాలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. బోర్ల ఆధారంగా వరి సాగు చేస్తే ఆగస్టు, సెప్టెంబర్ల్లో నీటి సమస్య మరింత తీవ్రమైతే ఇబ్బంది పడతారని తెలిపారు. ఈమేరకు రైతు వేదికల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇదే సమయాన ఉమ్మడి జిల్లాల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం వైరా, లంకా సాగర్ జలాశయాలను తాగునీటి అవసరాల కోసమే నింపుతున్నామని వెల్లడించారు. -
రూ. 22వేలకు చేరిన మిర్చి ధర
ఖమ్మంవ్యవసాయం: ‘తేజ’ మిర్చి క్వింటా ధర ఎట్టకేలకు రూ.22 వేలకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న జెండా పాటలో ఇదే ధర నమోదు కాగా.. సరిగ్గా మూడు నెలలకు సోమవారం మళ్లీ గరిష్ట ధరకు చేరుకుంది. దాదాపు రెండు నెలలుగా రూ. 21,500 నుంచి రూ.21,900 మధ్య కొనసాగుతోంది. అయితే, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన ఏసీ మిర్చిని సోమవారం తీసుకురాగా క్వింటాకు రూ.22 వేలు పలికింది. సీజన్లో రూ.18 వేల నుంచి రూ.19 వేలు ఉన్న ధర మే నెలలో రూ.20 వేలు, జూన్, జూలై నెలల్లో రూ.21 వేల మార్క్ను దాటింది. ఇక సోమవారం జెండా పాట రూ.22వేలుగా నమోదవగా, మోడల్ ధర రూ.21,600 పలికింది. అలాగే, నాన్ ఏసీ మిర్చికి రూ.17,400, తాలు మిర్చికి గరిష్టంగా రూ.10 వేల ధర పలుకుతోంది. వ్యవసాయ సీజన్ కావడంతో పెట్టుబడుల కోసం రైతులు మిర్చి విక్రయానికి ముందుకొస్తున్నారు. ఎగుమతుల ఊపు కొద్ది కాలంగా వివిధ ఉత్పత్తులకు డిమాండ్, ధరలు దృష్ట్యా మిర్చి ధర కూడా పెరుగుతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. మిర్చికి దేశీయంగానే కాక బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఈమేరకు ఖమ్మం మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేసే మిర్చి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో నిత్యం సుమారు 10 వేల బస్తాల మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నాయి. -
వైరా నదిలో గుంతల పూడ్చివేత
మధిర: మధిరలోని వైరా నదికి రిటైనింగ్ వాల్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మట్టి కోసం నదిలో చేపట్టిన తవ్వకాలు నిలిచిపోయాయి. ఈనెల 19న ‘సాక్షి’లో ‘భట్టి ఇలాఖాలో మట్టి దందా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. భారీగా గుంతలు తవ్వుతుండడంతో రాయపట్నం బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ఈ కథనంలో ప్రస్తావించగా కాంట్రాక్టర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు మట్టి తవ్వకాలు నిలిపివేయడమే కాక, ఇప్పటికే ఏర్పడిన గుంతలను పూడ్చివేయిస్తున్నారు. ఈ విషయమై సోమవారం తహసీల్దార్ రాంబాబు వివరణ కోరగా... కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలు, రవాణా కట్టడికి ఇరిగేషన్, మైనింగ్, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యాన తనిఖీలు చేపడుతామని తెలిపారు. -
చిత్రకూట మండపం తొలగింపు..
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈక్రమాన చిత్రకూట మండపాన్ని తొలగించే పనులు మొదలయ్యాయి. మండపంలోని శిల్పాకళా స్తంభాలను కొత్తగా నిర్మించే మండపంలో తిరిగి ఏర్పాటుచేసేలా భద్రపర్చనున్నారు. ఇందు కోసం ఒక్కో భాగానికి నంబర్లు వేస్తూ జాగ్రత్తగా తొలగిస్తున్నారు. 45 ఏళ్లుగా అనేక ఉత్సవాలకు సాక్షం భద్రాచల సీతారామాలయ ఉద్దరణ సంఘం ఆధ్వర్యంలో నాటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ చేతుల మీదుగా 1967 జూలై 15న చిత్రకూట మండపానికి శంకుస్థాపన చేయగా 1982 ఏప్రిల్ 4న అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పీవీ.చౌదరి ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక ఉత్సవాలకు సాక్షిగా నిలిచింది. తొలుత శ్రీరామనవమి, భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహించగా, ఇప్పుడు రద్దీ సమయాన నిత్యకల్యాణాలు నిర్వహిస్తున్నారు. -
రేషన్.. ఇక స్మార్ట్ !
● త్వరలోనే లబ్ధిదారులకు కార్డులు ● ఇప్పటికే జిల్లాకు చేరిక.. ఆదేశాలు రాగానే పంపిణీఖమ్మం సహకారనగర్: రేషన్ షాపుల ద్వారా బియ్యం అందుకుంటున్న లబ్ధిదారులకు త్వరలో స్మార్ట్ కార్డులు అందనున్నాయి. సుమారు పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు కార్డులు జారీ చేయలేదు. దీంతో అవసరమైన వారు ఈపీడీఎస్ సైట్ ద్వారా కార్డులను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటున్నారు. ఇంకొందరు సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని రేషన్షాపుల్లో చూపించి బియ్యం తీసుకుంటున్నారు. ఈక్రమాన ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. 4.72లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొందరికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసింది. పాత వారితో పాటు కొత్త కార్డుదారులకు రేషన్షాపుల ద్వారా సన్నం బియ్యం అందుతున్నాయి. ఈమేరకు అందరికీ స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని 748 రేషన్ షాపుల పరిధిలో 4,72,789 కార్డులు, ఇందులో 13,35,362మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ త్వరలో స్మార్ట్కార్డులు అందనున్నాయి. ఇప్పటికే జిల్లాకు పూర్తిగా కార్డులు చేరాయని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మల్లికార్జున్బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఏటీఏం తరహాలో.. తమిళనాడు తదితర రాష్ట్రాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు జారీ చేశారు. ఏటీఎం తరహాలో ఉండే ఈ కార్డుల్లో లబ్ధిదారులు, సభ్యుల పేర్లు, వయస్సు, ఆధార్ నంబర్ ముద్రించి ఉంటుంది. కార్డు ముందు భాగంలో కుటుంబ యజమానితో పాటు, రేషన్కార్డు నంబర్ ముద్రించడమే కాక క్యూ ఆర్ కోడ్ కూడా ఉన్నట్లు తెలిసింది.జిల్లాలో 4,72,789 కార్డులు, 13,35,362మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 26,454కార్డులకు గాను 41,423మంది ఈ–కేవైసీ ఇంకా చేయించుకోలేదు. ఈనెల 31వ తేదీ వరకే గడువు ఉన్నందున త్వరగా చేయించుకోవాలని డీసీఎస్ఓ మల్లికార్జున్బాబు సూచించారు. లేనిపక్షంలో కార్డు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, విదేశాల్లో ఉంటున్న వారి పేర్లు తొలగించేందుకు ప్రభుత్వం ఈ–కేవైసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
ఏన్కూరు: కుటుంబ వివాదాలతో దంపతులు పోలీసుస్టేషన్కు రాగా.. అందరి ముందే భార్యపై కత్తితో భర్త దాడి చేసిన ఘటన ఇది. ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాకు చెందిన భూక్యా రాంబాబు – రజిని దంపతులు కుటుంబ కలహాలతో కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈక్రమాన రజిని బ్యాంక్లో పని నిమిత్తం ఏన్కూరు ఎస్బీఐ వద్దకు సోమవారం వచ్చింది. ఈ విషయం తెలిసిన రాంబాబు బ్యాంకు వద్దకు చేరుకుని రజినితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆమె పోలీసుస్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తుండగా రాంబాబు కూడా వెనకాలే వెళ్లాడు. స్టేషన్ ఆవరణకు చేరుకుని ఓ పక్కన ఉన్న ఆమైపె కత్తితో దాడి చేశాడు. ఘటనలో రజిని భుజం, చేయిపై గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకుని, రజినిని చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.సంధ్య తెలిపారు.ఏన్కూరు పోలీసుస్టేషన్ ఆవరణలో ఘటన -
ఐఐటీ హైదరాబాద్ నుంచి డాక్టరేట్
ఖమ్మంరూరల్: లక్ష్యసాధనకు పేదరికం అడ్డుకాదని ఏదులాపురానికి చెందిన చేతరాజుపల్లి వీరేందర్ నిరూపించాడు. ఆయన ఐఐటీ హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డాక్టరేట్ అందుకోగా పలువురు అభినందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కాంపల్లికి చెందిన చేతరాజుపల్లి యాదగిరి – నాగమణి దంపతులు ఏళ్ల క్రితం ఏదులాపురంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు వీరేందర్ కాంపల్లి జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివి 600 మార్కులకు 550 మార్కులతో మండల ప్రథమ స్థానాన నిలిచాడు. ఆతర్వాత రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం పొంది పూర్తిచేశాక గేట్ ద్వారా వర్ధమాన్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ పీజీ పూర్తి చేశాడు. అనంతరం ఐఐటీ హైదరాబాద్లో ప్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాష్ పర్యవేక్షణలో ‘తక్కువ బరువుతో అధిక సామర్థ్యం కలిగిన ప్రీకాస్ట్ కాంక్రీట్ నిర్మాణ వ్యవస్థ’పై సమర్పించిన పరిశోధనాత్మత గ్రంధానికి డాక్టరేట్ లభించింది. చైన్నెలోని మాడ్యులస్ హౌసింగ్ సంస్థలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజినీర్గా పనిచేస్తూనే డాక్టరేట్ సాధించిన వీరేందర్ను పలువురు అభినందించారు. -
పైర్లకు ప్రాణం పోసిన వాన
ఖమ్మంవ్యవసాయం: అల్పపీడనం కారణంగా సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు జల్లులు కురుస్తున్నాయి. అయితే, సోమవారం మాత్రం ఓ మోస్తరు వర్షం కురవడంతో సాగులో ఉన్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. జూన్లో కురిసిన వర్షాలతో జిల్లాలో 3లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా, ఇందులో అత్యధికంగా 2.30 లక్షల ఎకరాల్లో పత్తి ఉంది. అయితే, ఇటీవల వర్షాల జాడ లేకపోగా.. వేసవిని తలపించేలా ఎండలు నమోదవుతున్నాయి. ఈక్రమాన పంటలు వడబడుతున్న క్రమాన వర్షం కురవడంతో రైతులు ఎరువులు వేస్తున్నారు. విత్తనాలు మొలకెత్తని చోట మరోసారి విత్తనాలను నాటుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులే ఉంటాయని, వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. కానీ ప్రస్తుతం కురుస్తున్న వానలతో రైతులు డోలాయమానంలో ఉన్నారు. ఖమ్మం పరిసరాల్లో.. ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. గంట పాటు వర్షం కురవడంతో ఉక్కపోతతో ఇబ్బంది జనానికి ఊరట లభించినట్లయింది. రాత్రి 9 గంటల సమయానికి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం ఖానాపురంలో అత్యధికంగా 46.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 44.8, తిరుమలాయపాలెంలో 25.5, కలెక్టరేట్ వద్ద 25, రఘునాథపాలెంలో 17.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే, రఘునాథపాలెంలోని పలు గ్రామాలతో పాటు వేంసూరు, తల్లాడ, కొణిజర్ల, ముదిగొండ, వైరా, కారేపల్లి, కూసుమంచి, కామేపల్లి, కల్లూరు మండలాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని పలుచోట్ల వర్షం -
వాణిజ్య పంటలతోనే అభివృద్ధి
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల ● అంజనాపురంలో గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభంకొణిజర్ల: వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం పరిగణనోకి తీసుకుని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తోందని చెప్పారు. ఇదే సమయాన రైతుల ఆర్థిక స్థిఽతిగతులు మెరుగుపడాలంటే సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కొణిజర్ల మండలం అంజనాపురంలో రూ.300 కోట్ల వ్యయంతో గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ నిర్మించిన సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మర్ నాదిర్ బి.గోద్రెజ్లతో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఫ్యాక్టరీలో గెలల ప్రాసెసింగ్ యూనిట్లు, నియంత్రణ వ్యవస్థను పరిశీలించాక భట్టి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రైతులు వినూత్న పంటల సాగుకు చిరునామాగా నిలుస్తున్నారని తెలిపారు. జిల్లాలు విడిపోయాక ఫ్యాక్టరీలు, సింగరేణి సంస్థ భద్రాద్రి జిల్లాలోకి వెళ్లడంతో ఖమ్మం జిల్లా రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని తెలిపారు. 2023లో టన్ను పామాయిల్ గెలల ధర రూ.12 వేలు ఉంటే ప్రస్తుతం రూ.23 వేలకు చేరడంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కొణిజర్ల మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం రైతులకు వరమని తెలిపారు. ఈ కాంప్లెక్స్లో సీడ్ గార్డెన్, మిల్లింగ్ మిషన్, రిఫైనరీ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. ఇక్కడి సీడ్ గార్డెన్ దేశానికే నాణ్యమైన పామాయిల్ విత్తనాలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. . పామాయిల్ హబ్గా తెలంగాణ ఆయిల్పామ్ సాగులో గణనీయంగా పురోగతి సాధిస్తున్న తెలంగాణ రానున్న ఐదేళ్లలో దేశానికి హబ్గా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాకే పరిమితం అయిన ఈ పంట నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాగవుతోందని చెప్పారు. ప్రత్యేగా సీడ్ గార్డెన్తో పాటు పరిశోధనా కేంద్రం, రైతులకు అవగాహన కలిపించడానికి సమాఽధాన్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గంటకు 30 టన్నుల ఆయిల్ క్రషింగ్ సామర్ధ్యం కలిగిన ఈ ఫ్యాక్టరీని దశల వారీగా 120 టన్నులకు చేర్చనుండగా, 500 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. మహిళల పాత్ర పెరగాలి గోద్రెజ్ సంస్థఽల చైర్పర్సన్ నాదిర్ బి.గోద్రెజ్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగులో మహిళలు భాగస్వాములు కావాలని సూచించారు. మహిళల పాత్ర పెరిగితేతే దేశం వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తుందని చెప్పారు. అంజానాపురంలోనే త్వరలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.సురేంద్రమోహన్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడగా గోద్రెజ్ ఆగ్రోవెట్ వైస్ చైర్మన్ బుర్జీన్ ఎన్.గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఎండీ, సీఈఓ సునీల్ కటారియా, ఆయిల్పామ్ సీఈఓ సౌగత నియోగి, దీపాంశుగుప్తా, ఉద్యాన శాఖ డైరక్టర్ యాస్మిన్ బాషా, టీజీ పెడ్ చైర్మన్ పవన్కుమార్, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్దత్, సర్పంచ్లు అంబడిపూడి కమలమ్మ, భూక్యా సునీత తదితరులు పాల్గొన్నారు. వైరా: కొణిజర్ల మండల పర్యటన అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం వెళ్లారు. మార్గమధ్యలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా కూలీలు కనిపించగా కారు ఆపి మాట్లాడారు. ‘అక్కయ్యా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా, ఉచిత విద్యుత్ సరఫరా ఉందా.. రేషన్ దుకాణం నుంచి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారా.. అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయా..’ అని ఆరా తీశారు. దీంతో కూలీలు పథకాలు అందుతున్నాయని తెలిపారు. అయితే, వైరా నుంచి ముసలిమడుగుకు రవాణా సౌకర్యం లేక ఆటోలు సైతం సరిగా ఉండవని చెప్పిన కూలీలు కూలీలు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా భట్టి సానుకూలంగా స్పందించారు. -
ఆలయాల్లోని సొత్తే లక్ష్యం
సత్తుపల్లి(పెనుబల్లి): దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను వీఎం.బంజర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు స్టేషన్లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. కొంతకాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఏపీలోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై కె.వెంకటేష్ ఆధ్వర్యాన ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయని తెలిపారు. ఈక్రమాన తల్లాడ గ్రామానికి చెందిన షేక్ జానీ, ఏపీలోని పోలవరం జిల్లాకు చెందిన పేరాల నరసింహారావుతోపాటు వీరికి సహకరించిన కొత్తగూడెంకు చెందిన ఆరవ ఉదయ్కుమార్ పట్టుబడ్డారని చెప్పారు. వీరు ఇళ్లతోపాటు కొత్తగూడెం హనుమాన్ దేవాలయం, ఉప్పలచెలకలోని అక్కమ్మ గుడి, రామాలయం, తల్లాడ మండలం అంజనాపురంలోని హనుమాన్ దేవాలయం, కల్లూరు మండలం గనియాతండాలోని హనుమాన్ దేవాలయం, వేంసూరు మండలం లింగపాలెంలోని హరి క్షేత్ర దేవాలయం, ఏపీలోని గోకవరం గంగాలమ్మ గుడి, పెనుబల్లి మండలం బయ్యనగూడెంలోని దేవాలయాల్లో బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేయగా, 24 గ్రాముల బంగారం, కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులపై వివిధ కేసులతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. కాగా, నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు వెంకటేష్, హరిత, కానిస్టేబుళ్లు నాగేంద్రం, వెంకటేశ్వర్లు, రాజమల్లు, మజీద్ పాషా, నరసింహారావు, శ్రీనివాసరావును ఏసీపీ అభినందించారు. కాగా, ఆలయాల నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా భద్రత ఉంటుందని ఆమె తెలిపారు.అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు -
‘విక్రమ్–1’లో మన వినయ్!
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి తొలిసారి ప్రయోగించిన భారతీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1(ఆగమన్) ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ రాకెట్ను రూపొందించగా.. ఈ బృందంలో ఖమ్మం జిల్లా యువకుడు వినయ్కుమార్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తించాడు.వ్యవసాయం కుటుంబం..జిల్లాలోని రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో వినయ్కుమార్ జన్మించాడు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ మూడేళ్లు, ఆతర్వాత లేటరల్ ఎంట్రీగా ఇంజనీరింగ్ మూడేళ్లు పూర్తిచేశాడు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఆతర్వాత ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈక్రమాన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీలో చేరాడు.ఇందులో భాగంగానే విక్రమ్–1 ప్రయోగంలో పాలుపంచుకోగా విజయవంతం కావడంపై పలువురు అభినందిస్తున్నారు. కాగా, శ్రీచైతన్య కాలేజీ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ తమ కాలేజీ పూర్వ విద్యార్థి వినయ్కుమార్ తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ, ప్రయోగంలో పాలుపంచుకోవడం గర్వకారణమని తెలిపారు. ఆయనను శ్రీధర్తో పాటు డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ వి.సుదర్శన్, వివి విభాగాల అధిపతులు వైశాలి, డాక్టర్ చార్యులు, కుమార్ తదితరులు అభినందించారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
టేకులపల్లి: అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచులు పెట్టిన శారీరక, మానసిక వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. శంభునిగూడెం గ్రామానికి చెందిన భట్టు భద్రయ్య తన కుమార్తె సుమ (25)ను 2023 మే 16న లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వివాహం అనంతరం కొద్దిరోజుల పాటు ఈ దంపతులు హైదరాబాద్లో ఉన్నారు. ఏడాది గడిచిన తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను అనుమానించడం, బంధువులతో ఫోన్ మాట్లాడినా అవమానించడం, ఎవరితోనూ మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడు. కాగా, తొమ్మిది నెలల క్రితం వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వీరిద్దరూ నాగార్జునసాగర్కు కాపురం మార్చారు. సుమకు పిల్లలు కలగకపోవడం, మరోవైపు వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతడి కుటుంబంలో మార్పులు వచ్చాయి. భర్త వెంకటేశ్వర్లుతో పాటు అతని అక్కలు అదనంగా కట్నం తీసుకురావాలంటూ సుమను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారు. పది రోజుల క్రితం భర్త వెంకటేశ్వర్లు సుమను చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో సుమ శంభునిగూడెంలోని పుట్టింటికి వచ్చింది. శనివారం భర్త వెంకటేశ్వర్లు, అతని అక్కలు కలిసి శంభునిగూడెంలోని సుమ పుట్టింటికి వచ్చి, అక్రమ సంబంధం అంటకట్టి, దూషించి, విపరీతంగా కొట్టి వెళ్లిపోయారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సుమ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి బట్టు భద్రయ్య ఫిర్యాదు మేరకు భర్త వెంకటేశ్వర్లు, ఆడ బిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తిరుపతి వెల్లడించారు. నలుగురిపై కేసు నమోదు -
అమ్మా.. ఆకలి
● జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనంపై సందిగ్ధత ● అమలు ఎప్పుడో స్పష్టత కరువు ● ప్రారంభిస్తేనే విద్యార్థులకు మేలుఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ విద్యాసంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా ప్రకటన ఆచరణ రూపం దాల్చకపోవడంతో విద్యార్థులు ఎప్పుడు అమలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, త్వరలోనే పథకాన్ని అమలుచేసే అవకాశముందని విద్యార్థుల హాజరు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. విడతల వారీగా ప్రారంభిస్తారని తెలుస్తున్నా, ఏయే కళాశాలల్లో మొదట అమలవుతుందో స్పష్టత రాలేదు. కాగా, జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 5,540మంది చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే ఎక్కువగా చదువుతున్నారు. వీరు ఉదయం 7–30 నుంచి 8గంటల మధ్య ఇళ్ల నుంచి బయలుదేరి పట్టణ, మండల, జిల్లా కేంద్రాల్లోని కాలేజీలకు వస్తారు. ఈ సమయానికి ఇళ్లలో భోజనం సిద్ధం కాకపోవడంతో అలాగే వస్తున్నారు. కాలేజీలో భోజనం లేక, బయట తినే స్థోమత లేక తిరిగి రాత్రి 6గంటలకు ఇళ్లు చేరేవరకు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. ఇకనైనా మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభిస్తే మరింత మంది గ్రామీణ విద్యార్థులు కాలేజీల్లో చేరే అవకాశమున్నందున ప్రభుత్వ త్వరగా స్పందించాలని పలువురు కోరుతున్నారు.విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు అధ్యాపకులు ఇంటింటా ప్రచారం చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు అందుతాయని, మెరుగైన బోధన ఉంటుందని వివరించారు. అంతేకాక ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థుల నుంచి ఆశించిన స్పందన లభించింది. అయితే, కాలేజీలు మొదలై నెలన్నర దాటినా భోజనం అమలుపై స్పష్టత లేక దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు గతంలో మాదిరిగానే ఆకలితో పాఠాలు వినాల్సి వస్తోంది. అంతేకాక విద్యార్థులు, తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు అధ్యాపకులు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం త్వరలో అమలయ్యే అవకాశం ఉంది. తొలుత జిల్లాలోని ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే కాలేజీల వారీగా విద్యార్థుల సంఖ్య, హాజరు వివరాలు సేకరించాం. – రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి -
ఆస్పత్రిలో ఉద్యోగి కుమార్తె సీమంతం
వివాదాస్పదంగా మారిన ఘటన మధిర: మధిర ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 16న ఓ ఉద్యోగిని కుమార్తెకు సీమంతం నిర్వహించగా.. వివాదం నెలకొంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ రాజరాజేశ్వరి త్వరలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈక్రమాన ఆస్పత్రిని చూపించేందుకు గర్భిణిగా ఉన్న తన కుమార్తె, అల్లుడిని 16వ తేదీన తీసుకొచ్చారు. సహచర ఉద్యోగులకు వారిని పరిచయం చేయగా... రాజరాజేశ్వరి కుమార్తె గర్భిణి కావడంతో ఆమెకు ఉద్యోగులు గాజులు, పసుపు, కుంకుమతో పాటు స్వీట్లు అందజేసి ఆశీర్వదించారు. అయితే, ఇందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ నెల 18న జిల్లా ఆరోగ్య సమన్వయ అధికారి రాజశేఖర్ గౌడ్ మధిర ఏరియా ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడివేంసూరు: మండలంలోని అమ్మపాలెం శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై ఎస్ఐ కవిత, పోలీసు సిబ్బంది దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2 వేలు నగదు, 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 240 మంది క్రీడాకారులు పాల్గొనగా, విజేతలను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విజేతలకు ఎస్బీఐటీ కరస్పాండెంట్ గుండాల కృష్ణ, రెజొనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ ఆర్వీ నాగేంద్రకుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు టి.వీరన్న, పి.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలు. వరుసగా మొదటి మూడు స్థానాల్లో బి.క్రీతిక, జి.వివాంషిక, సాత్విక్ నిలవగా వీరికి ట్రోఫీలతో రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేశారు. పీ.వీ.సింధుకు అభినందనలుఖమ్మంస్పోర్ట్స్: జపాన్లో జరిగిన సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీ.వీ.సింధు తొలిసారిగా సింగిల్స్ టైటిల్ కై వసం చేసుకోవడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బ్యాడ్మింటన్ సంఘం జిల్లా ప్రతినిధి సిరిపురపు సుదర్శన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వారు ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. గత 43 ఏళ్లుగా ఈ టోర్నీలో భారత్ క్రీడాకారులు టైటిల్ దక్కించుకోలేదని, ఇప్పుడు తొలిసారి పీ.వీ.సింధు కై వసం చేసుకోవడం దేశానికే గర్వకారణమని ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘ఈశా’ క్రీడాపోటీలు..ఖమ్మంస్పోర్ట్స్: జిల్లాస్థాయి ఈశా గ్రామోత్సవంలో భాగంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. క్లస్టర్–1 త్రోబాల్ పోటీల్లో కోయచెలక వారియర్, జై విజయ, విజయశక్తి, అంకమ్మ జట్లు వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. అలాగే, క్లస్టర్–2లో పాపటపల్లి, గాంధీజీ, ఆర్సీ సెంటర్, దివ్య జట్లు విజయం సాధించాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేయగా, సుభాన్, వాలీబాల్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు. 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలి టీఎస్ ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల వ్యవస్థను పూర్తిస్థాయిలో పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి, ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని టీఎస్ ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండయ్య డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం, మహ బూబాబాద్ జిల్లాల స్థాయి టీఎస్ ఎంఎస్టీఎఫ్ సమావేశం ఖమ్మంలో ఆదివారం నిర్వహించగా.. ఆయన పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడంలో మోడల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నా, ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా టీజీటీలకు నోషనల్ సర్వీస్ ప్రయోజనాలు అందించి, హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిలివేరు మహేశ్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్తో పాటు నాగరాజు, రంజిత్, సాత్విక్, మోహన్రావు, నాగార్జున, ఫణికుమార్, ఉపేందర్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల నిధుల ఖర్చుపై ఆడిట్పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలలో ఖర్చు చేసిన నిధుల వినియోగంపై హైదరాబాద్కు చెందిన ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు. ఆదివారం స్థానిక కేటీపీఎస్ కాలనీలోని అభ్యుదయ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్బీ, సీవీసీఏ ఆడిట్ అధికారులు సత్యనారాయణ, శ్రీమన్నా రాయణ, తనూజ్, కరుణాకర్ ఉపాధ్యాయుల నుంచి రికార్డులు, క్యాష్బుక్స్, బిల్లులు, ఓచర్లు పరిశీలించారు. స్వచ్ఛభారత్, బడిబాట ఇతర కార్యాక్రమాల నిర్వహణకు చేసిన ఖర్చులను ఆడిట్ చేశారు. జిల్లాలోని కేజీబీవీలు, కళాశాలల నిర్వహణ ఖర్చులను సైతం తనిఖీ చేశారు. అయితే, ఆడిట్ అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసినందుకు ఆయా ప్రధానోపాధ్యాయుల నుంచి చేతివాటం ప్రదర్శించినట్లు పలువురు వాపోయారు. భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. -
సీబీఐ విచారణ జరిపించాలి
సింగరేణి కుంభకోణాలపై ఖమ్మంమామిళ్లగూడెం: సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించి.. వాటాల వారీగా పంచుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మామిళ్లగూడెంలో టీఆర్ఎల్డీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి అస్తవ్యస్తంగా మారగా, బొగ్గును వాటాల వారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం, అధికారుల చేతివాటం పెరగడంతో సింగరేణి మనుగడ దెబ్బతినే ప్రమాదముందని తెలిపారు. అలాగే, ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టాలనే డిమాండ్తో త్వరలోనే ఆందోళనలు చేపడుతామని దిలీప్కుమార్ తెలిపారు. కాగా, తమ పార్టీ ఆధ్వర్యాన వచ్చేనెల 26న జాబ్ మేళా నిర్వహించనుండగా, అదేరోజు అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ‘లక్ష్యం కోసం.. లక్ష సైన్యం’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అంతేకాక త్వరలో జరిగే ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తాను పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జానీ మహమ్మద్, నాయకులు మోత్కూరి వెంకటేశ్వరాచారి, పి.వీరప్ప, ఎన్.నర్సింహారావు, విశాల్, గిరి, చెన్నోజు వెంకటరమణాచారి, ఇటుకల లత, బండి నాగమణి పాల్గొన్నారు. టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్కుమార్ -
గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రజని తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీకామ్ కంప్యూటర్స్, బీఏ, బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లాలోని గిరిజన విద్యార్థినులు ఈనెల 26లోగా కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో సూచించారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అదికారి జి.జ్యోతి సూచించారు. 2026–27 ఏడాదికి గాను కళాశాల విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం http://telanganaepass. cgg.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ ఏడాది విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నగదును నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని వెల్లడించారు. 108 ఈఎంఈగా ప్రవీణ్కుమార్ ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా అత్యవసర సేవల విభాగం 108 సర్వీస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్(ఈఎంఈ) గా ఆలేటి ప్రవీణ్కుమా ర్ నియమితులయ్యా రు. ఇన్నాళ్లు ఈఎంఈ గా ఉన్న అవులూరి దుర్గాప్రసాద్ వనపర్తి జిల్లాకు బదిలీ కాగా, ఆయనను ఖమ్మం కార్యాలయంలో ఆదివారం 108, 1962, 102 వాహనాల ఉద్యోగులు సన్మానించి వీడ్కోలు పలికా రు. అనంతరం ప్రవీణ్కుమార్ బాధ్యతలు స్వీకరించగా శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర సర్వీసుల విభాగం అధికారులు, ఉద్యోగులు షేక్ నజీరుద్దీన్, షేక్ ఇమామ్ పాషా, తుమ్మా జగదీష్, శ్రీనివాస్, కొమ్ము వెంకటేష్, గొల్లమందల కృష్ణ, భాస్కర్, వినోద్రావు, మేడా పుల్లారావు, భూషయ్య, కృష్ణయ్య, రేణుక, విజయలక్ష్మి, సంగిశెట్టి మోహన్, సయ్యద్ ఖాద్రీ, సీతా రాంబాబు పాల్గొన్నారు. అంచనాల కమిటీ చైర్మన్గా ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య ● సభ్యుడిగా వైరా ఎమ్మెల్యేకు స్థానం ఇల్లెందు: శాసనసభ, శాసన మండలి అంచనాల కమిటీ చైర్మన్గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీ సభ్యుడిగా వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్తో పాటు సునీతా లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎం.యశశ్వినిరెడ్డి, పి.రాకేష్రెడ్డి, ఎమ్మెల్సీలు సుంకరి రాజు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, వంటేరు యాదవ రెడ్డి నియమితుయ్యారు. కాగా, కనకయ్య, రాందాస్ నియామకంపై ఉమ్మడి జిల్లా ప్రప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వైభవంగా నదీహారతి భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద ఆదివారం గోదావరికి నదీ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య గణపతి పూజ, 108 ప్రమిదల దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం సీతారాములకు 12 సార్లు, గోదావరి మాతకు 21 సార్లు హారతులు సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పురోహితులు రామవజ్జల రవికుమార్, పవన్ కుమార్ శర్మ, సత్యప్రసాద్ శర్మ, ఫణికుమార్ శర్మ, భక్తులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. -
కాలేజీ.. ఎప్పుడు, ఎక్కడ?
● మధిరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు ● ఈసారి ఏర్పాటుకు అందుబాటులో లేని భవనాలు ● ఫలితంగా ప్రారంభం, స్థలం ఎంపికపై సందిగ్ధత మధిర: చింతకాని మండలం మత్కేపల్లిలో ఈ నెల 10న జరిగిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వినతితో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుపై ప్రకటన చేశారు. అంతేకాక కాలేజీకి పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యాన వెంటవెంటనే జరుగుతున్న పరిణామాలతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కొనసాగుతుండగా.. రెండో కాలేజీని మధిరలోనే ఏర్పాటు చేస్తారా.. నియోజవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అనువైనా స్థలాలను గుర్తిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాక ఒక దశ ఎపెసెట్ కౌన్సెలింగ్ ఇప్పటికే పూర్తయినందున రెండో దశలో కాలేజీని చేరుస్తారా, వచ్చే ఏడాది నాటికి అంతా సిద్ధం చేసి ప్రారంభిస్తారా అన్నది వెల్లడించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా.. మధిర నియోజకవర్గం ఏపీకి సరిహద్దుగా ఉండడంతో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేట్ యజమాన్య పరిధిలో విజయవాడ, ఖమ్మం ఇతర ప్రాంతాలు ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యాన ఖమ్మం జిల్లాలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కొన్నేళ్ల క్రితం మొదలైనా అందరికీ సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరక తప్పడం లేదు. ఈ నేపథ్యాన జిల్లాలో రెండో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు కానుండడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఆరు జూనియర్ కాలేజీలు.. ఏపీ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాలో కొన్నేళ్ల క్రితం వరకు ప్రభుత్వ పరిధిలో ఇంజనీరింగ్ విద్య అందుబాటులో లేదు. తొలి కాలేజీ పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటుకాగా, అప్పటివరకు విద్యార్థులు హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లి ఇంజనీరింగ్ చదివారు. మధిర నియోజకవర్గంలో ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, ప్రైవేట్తో కలిపితే ఏటా 4వేల నుంచి 5వేల మంది విద్యార్థు లు ఇంటర్ పూర్తి చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఎంచుకునేవారు ఎప్సెట్ రాస్తుండగా, మధిరలో ప్రభు త్వ కాలేజీ ఏర్పాటైతే ర్యాంకుల ఆధారంగా స్థానికంగా సీటు దక్కించుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే మధిరలో వ్యవసాయ పాలిటెక్నిక్, ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాలలు కొనసాగుతుండగా, ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీ మంజూరుతో విద్యా ర్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు నియోజకవర్గ కేంద్రమైన మధిరలో స్థల సమస్య ఉంది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉన్న స్థలంలో ఏరియా ఆస్పత్రి, ఇండోర్ స్టేడియం నిర్మించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 5.20 ఎకరాల భూమి ఉంది. అయితే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని బ్రాంచ్ల బోధన సముదాయాలు, సిబ్బందికి క్వార్టర్లు, విద్యార్థుల హాస్టళ్లతో పాటు పరిపాలనా భవనాలు నిర్మించాలి. అన్నింటికీ సుమారు 15 ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా. ఇంత భూమి మధిర నియోజకవర్గ కేంద్రంలో ఉందా, లేదా అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోపక్క ఎర్రుపాలెం మండలంలో అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ భూమి ఉంది. కానీ, ఆ భూమి సేకరించాలంటే అటవీ శాఖ అనుమతులు, ప్రత్యామ్నాయ భూమి కేటాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ప్రైవేట్ భవనాలు అద్దెకు తీసుకుని ఈ ఏడాదే కాలేజీ ఏర్పాటు చేస్తారా.. లేక అన్ని వసతులు సమకూర్చుకుని వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభిస్తారా అన్నది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. -
రండీ... పోటీపడదాం!
ఖమ్మం సహకారనగర్: పౌరులంతా భాగస్వామ్యమైతేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే నినాదంతో కేంద్రప్రభుత్వ పరిధిలోని పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ విద్యార్థుల్లో అవగాహన పెంచేలా పోటీల నిర్వహణకు సిద్ధమైంది. తెలంగాణ నేషనల్ గ్రీన్ కాప్స్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాల, కళాశాలు, పరిశోధన విద్యార్థులకే కాక ఇతరులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. అందరికీ సర్టిఫికెట్లు ‘నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటేషన్(ఎన్ఎస్పీసీ) పేరిట విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పర్యావరణంపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, హరిత గృహప్రభావం, సహజ వనరుల వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం, శిలాజ ఇంధనాలు, అడవుల పరిరక్షణ ఆవశ్యకత తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. క్విజ్ పోటీలు ఈనెల 15నుంచి మొదలుకాగా సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతా యి. పోటీల్లో పాల్గొన్న ప్రతీఒక్కరికి ఈ – సర్టిఫికెట్ జారీ అవుతుంది. తుది ఫలితాలను సెప్టెంబర్ 20 తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. దశల వారీగా బహుమతులు జిల్లాలో అత్యధిక స్కోర్ చేసిన ఐదుగురు విద్యార్థులకే కాక ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చొరవ చూపిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందిస్తారు. ఇక రాష్ట్రస్థాయిలో అత్యధిక స్కోర్ చేసిన విద్యార్థులు, అత్యధిక సంఖ్యలో పాల్గొన్న జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి అభినందన సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. అలాగే, జాతీయస్థాయిలో అత్యధిక విద్యార్థులు పాల్గొన్న జిల్లా అధికారులకు సన్మానం ఉంటుంది. గతంలో రాష్ట్రంలోని జనగామ జిల్లా జాతీయస్థాయికి ఎంపికై ంది.గ్రూప్ పాల్గొనాల్సిన విద్యార్థులు 01 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు 02 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు 03 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు 04 యూజీ, పీజీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు 05 ఇతర కేటగిరీల వారు క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు https:// ecomitram. org/ organizationsలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎక్కువ మంది విద్యార్థులు ఈ పర్యావరణ అవగాహన క్విజ్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు సహకరించాలి. తద్వారా జిల్లాను ప్రథమ స్థాయిలో నిలపాలి. ఆసక్తి ఉన్న వివరాల కోసం 94404 50141 నంబర్లో సంప్రధించవచ్చు. – ఇనుముల వెంకటేశ్వర్లు, గ్రీన్ కాప్స్ కోఆర్డినేటర్ -
‘విక్రమ్–1’లో మన వినయ్!
ఖమ్మంరూరల్: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి తొలిసారి ప్రయోగించిన భారతీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1(ఆగమన్) ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ రాకెట్ను రూపొందించగా.. ఈ బృందంలో జిల్లా యువకుడు వినయ్కుమార్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. వ్యవసాయం కుటుంబం.. జిల్లాలోని రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో వినయ్కుమార్ జన్మించాడు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ మూడేళ్లు, ఆతర్వాత లేటరల్ ఎంట్రీగా ఇంజనీరింగ్ మూడేళ్లు పూర్తిచేశాడు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఆతర్వాత ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈక్రమాన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీలో చేరాడు. ఇందులో భాగంగానే విక్రమ్–1 ప్రయోగంలో పాలుపంచుకోగా విజయవంతం కావడంపై పలువురు అభినందిస్తున్నారు. కాగా, శ్రీచైతన్య కాలేజీ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ తమ కాలేజీ పూర్వ విద్యార్థి వినయ్కుమార్ తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ, ప్రయోగంలో పాలుపంచుకోవడం గర్వకారణమని తెలిపారు. ఆయనను శ్రీధర్తో పాటు డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మినారాయణ, ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ వి.సుదర్శన్, వివి విభాగాల అధిపతులు వైశాలి, డాక్టర్ చార్యులు, కుమార్ తదితరులు అభినందించారు.తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో జిల్లా యువకుడు -
సీతారామా.. కనుమా !
అవసరమైన ప్రభుత్వ, ప్రైవేట్ భూమి 10,069.29 ఎకరాలు పాత ఆయకట్టు స్థిరీకరణ 3.45ఎకరాలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే సీతారామ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ అడ్డంకిగా మారింది. ఈ ప్రాజెక్టు పరిధిలో అటవీ, ప్రైవేట్, ప్రభుత్వ భూములు ఉండడం, కొన్ని భూములు వన్యప్రాణులు జీవించే సున్నిత పర్యావరణ ప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్) కావడంతో సమస్య నెలకొంది. ప్రాజెక్టు నిర్మాణానికి 10,069.29 ఎకరాలతోపాటు అటవీ భూములు 808.18 ఎకరాలు అవసరం కాగా.. ఇందుకోసం భూయజమానులకు రూ.1,027.02 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందులో కొందరు రైతులు నిరాకరించడం, కోర్టులకు వెళ్లడం, అటవీ అనుమతులు జారీ కాకపోవడం, పరిహారం పెండింగ్ వంటి కారణాలతో ఆలస్యమవుతోంది. అయితే గతంలో సేకరించిన కొంత భూమికి రూ.135 కోట్ల పరిహారం విడుదలకు ఇటీవల పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అలాగే, మొత్తం భూసేకరణ రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించిన నేపథ్యాన అంతా అనుకున్నట్టు జరిగితే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగనుంది. 6.74 లక్షల ఎకరాల సాగు.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం 2016లో రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత పలుమార్లు అంచనాలను సవరించగా, 2025లో రూ.19,324.92 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు కింద 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు నూతన ఆయకట్టు 3.29 లక్షల ఎకరాలు ఉంటుందని ప్రకటించారు. ఎనిమిది డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు, నాలుగు పంప్హౌస్లు ప్రతిపాదించారు. ప్రాజెక్టులో సాగునీటికి 63.13 టీఎంసీలు, తాగునీటికి 2.12 టీఎంసీలను కేటాయించనున్నారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలోని బీజీ కొత్తూరు, వీకే రామవరం, కమలాపురం పంపుహౌస్ల నిర్మాణం పూర్తవగా వైరా రిజర్వాయర్కు నీరు విడుదల చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద నాలుగో పంపుహౌస్ పనులు కొనసాగుతున్నాయి. అనువైన చోట చకచకా.. ప్రాజెక్టు పరిధిలో 1 నుంచి 8 ప్యాకేజీల వరకు ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తయ్యాయి. జూలూరుపాడు టన్నెల్ పనులు మొదలుకావాల్సి ఉంది. అలాగే 9 నుంచి 12 ప్యాకేజీల్లో సత్తుపల్లి మెయిన్ కెనాల్ (యాతాలకుంట టన్నెల్తోసహా), బేతుపల్లి, దమ్మపేట బ్రాంచ్ కెనాళ్లు, పాలవాగు మెయిన్ కెనాల్, వినాయకపురం, గొల్లగూడెం కెనాళ్లు ఉన్నాయి. ఈ ప్యాకేజీల్లో 115.86 కి.మీ.కు గాను 75.56 కి.మీ. మేర కాల్వల నిర్మాణం పూర్తయింది. యాతాలకుంట టన్నెల్ తవ్వకం పూర్తయి లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇక 13 నుంచి 16 ప్యాకేజీల్లో ఉన్న పాలేరు లింక్ కెనాల్లో 66.974 కి.మీ.కు గాను 27.474 కి.మీ. తవ్వకం పూర్తయింది. పాలేరు టన్నెల్లో 8.50 కి.మీ.కు గాను నాలుగు కి.మీ. పైగా పూర్తయ్యాయి. ప్రధాన దృష్టి.. ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణకే ప్రాధాన్యత ఇవ్వాలని తాజాగా పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బకాయిల చెల్లింపునకు రూ.135 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మంత్రుల సూచనలతో సర్వే వేగంగా పూర్తయి భూసేకరణ ఓ కొలిక్కి వస్తే సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటివరకు పూర్తి 4 కి.మీ.ప్రాజెక్టుకు భూసేకరణ పెండింగ్ సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలకు భారీగా భూమి అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్ భూమి 10,069.29 ఎకరాలకు తోడు అటవీ భూ ములు 808 ఎకరాల వరకు కావాలి. ఇందులో కిన్నెరసాని వంటి ఎకో సెన్సిటివ్ జోన్లు ఉండడం, పోడు, అటవీ భూముల ద్వారా కాల్వలు తవ్వాల్సి ఉంది. వీటికి అటవీ శాఖ అనుమతులు సాధించడం, గిరిజనులకు పరిహారం చెల్లింపు సవాల్గా మారింది. పంపుహౌస్లతో పాటు 1–8 ప్యాకేజీల్లో ప్రధాన కాల్వల నిర్మాణానికి 80 శాతం వరకు భూసేకరణ పూర్తయినా, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు పెండింగ్ ఉంది. ఫలితంగా గత ఏడాదే టెండర్లు పిలిచినా ఫలితం లేదు. కాగా, ఖమ్మం జిల్లాలో 1,877.66 ఎకరాలు, భద్రాద్రిలో 6,399.53 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సిఉండగా, రెండు జిల్లాల్లో కలిపి 2,107.21 ఎకరాల్లో సర్వే పూర్తయింది. -
ఆలోచింపజేసిన ‘సహాన’
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నెల నెలా వెన్నెల 108వ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నిగ్ధ రచనలో ఎన్.శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘సహాన’నాటికను ప్రదర్శించారు. అన్యాయంపై తిరుగుబాటు చేస్తూ, సమాజంలో నిజాయితీగా ఉండేందుకు ఓ తండ్రి, కూతురు సాగించిన జీవన పోరాటం ఇతివృత్తంగా నాటికను రూపొందించారు. నాటికలో ఎన్.రవీందర్రెడ్డి, వీసీహెచ్కే ప్రసాద్, మీరయ్య, పోతురాజు, లక్ష్మణశాస్త్రి, శ్రీలేఖ, కుసుమసాయిలు పాత్రలను పోషించారు. ఈ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. నాటికకు ముందుగా దైవం మానుష్య లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. నృత్య కళాభారతి వైరాకు చెందిన చిన్నారులు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో నాటిక బాధ్యులకు తెలంగాణ ఏజెన్సీస్ సంస్థల అధినేతకాళ్ల రామారావు 11వ వర్ధంతి పేరిట పారితోషికాన్ని కుటుంబ సభ్యులచే అందించారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు ఎస్వీఎల్ ప్రసాద్, వ్యాపారవేత్త కాళ్ల పాపారావు, కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ మేళ్లచెరువు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి నెల నెల నెలా వెన్నెల కార్యక్రమాలను సమాజహితం కోసం నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్.సీతారం, బద్రినారాయణ, కృష్ణమోహన్, భాస్కర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమాలను నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, మోటమిర్ర జగన్మోహన్రావు, నామా లక్ష్మీనారాయణ, వేములసదానందం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మకాన్ని చూరగొంటున్న భద్రాద్రి బ్యాంక్
ఖమ్మంగాంధీచౌక్: భద్రాద్రి బ్యాంకు అందిస్తున్న సేవలతో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 29వ సర్వసభ్య సమావేశం ఆదివారం ఖమ్మం నగరంలోని వాసవీ కల్యాణమండపంలో బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. తొలుత బ్యాంకు చైర్మన్ 2025–26 సంవత్సర వార్షిక నివేదికను వినిపించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా బ్యాంకు అంచెలంచెలుగా ఎదుగుతూ 25 శాఖలతో అభివృద్ధిపథంలో సాగుతోందని తెలిపారు. బ్యాంకు చరిత్రలో తొలిసారిగా రూ.1,000 కోట్లకు పైగా వ్యాపారంతో రికార్డు సాధించిందని, రాష్ట్రంలోని మొత్తం సహకార బ్యాంకుల వ్యాపారంలో భద్రాద్రి బ్యాంక్ 5 శాతం వాటాను కై వసం చేసుకుందని వివరించారు. 2026 మార్చి 31 నాటికి బ్యాంకు డిపాజిట్లు రూ.629.06 కోట్లు, రుణాలు రూ.401.10 కోట్లకు చేరాయని, దీంతో బ్యాంకు రూ.151.39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందన్నారు. గత ఏడాది 4 కొత్త శాఖలను ప్రారంభించామని, ఇందులో భాగంగా తొలిసారిగా హైదరాబాద్లో బ్రాంచ్ను నెలకొల్పినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 9 జిల్లాల్లో 25 శాఖలతో బ్యాంకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు 21,849 మంది వాటాదారులతో 30వ వసంతంలోకి విజయవంతంగా అడుగుపెడుతోందని చెప్పారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా సహకార అధికారి గట్టు గంగాధర్, సన్నె ఉదయ్ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు దేవత రాజారావు, మద్ది పిచ్చయ్య, రాజ్ పురోహిత్ చెన్ సింగ్, వైవీఎస్ రావు, రంగా నాగశ్రీనివాసరావు, దారా జీవన్రాం, కర్లపూడి నర్మద, కపిలవాయి జయప్రద పాల్గొన్నారు. వార్షికోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
నేటి సీఎం పర్యటన రద్దు
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని ఇటీవల ప్రకటించారు. ఈమేరకు కలెక్టర్, అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయితే, సీఎం పర్యటన రద్దయిందని తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయకున్నా భారీ వర్ష సూచనతో సీఎం రేవంత్రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. అయితే, అంజనాపురంలోని గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారమే ప్రారంభించేలా సన్నాహాలు కొనసాగిస్తున్నారు. డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. వీరితో పాటు గోద్రెజ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సునీల్ కటారియా, ఆయిల్పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగీ హాజరవుతారని వెల్లడించారు. ఈమేరకు ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ సుమారు వేయి మంది ఆయిల్పామ్ రైతులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం.పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి -
హామీలన్నీ అమలు చేస్తున్నాం..
కామేపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలతో సహా పలు హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కామేపల్లి మండలం మద్దులపల్లిలో రూ.2.85 కోట్లతో నిర్మించే 33/11 కే.వీ. విద్యుత సబ్ స్టేషన్, తాళ్లగూడెంలో రూ.8.95 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్నాయక్తో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రతీ గ్రామం, మారుమూల తండాకు పక్కా రవాణా సౌకర్యం కల్పించేలా రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమై ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇచ్చిన అన్ని హామీల అమలుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యాన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ, రైతులకు కష్టం రాకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని తెలిపారు. వ్యవసాయరంగానికి నాణ్యమైన విద్యుత్ను నిరంతరం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, కలెక్టర్ దివాకర టీ.ఎస్., రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, పీఏసీఎస్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పుచ్చకాయల వీరభద్రం, ధనియాకుల హన్మంతరావు, సర్పంచ్లు పడిగ నాగమణి, లకావత్ సునీత, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో పాటు ఎం. మల్లిబాబు యాదవ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కారేపల్లి క్రాస్లో స్వాగతం కారేపల్లి: కామేపల్లి మండల పర్యటన అనంతరం ఇల్లెందు మండలానికి వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కారేపల్లిలో నాయకులు స్వాగతం పలికి సన్మానించారు. సొసైటీ చైర్మన్లు, సర్పంచ్లు దుగ్గినేని శ్రీనివాసరావు, బానోతు రామ్మూర్తి, పెద్దబోయిన ఉమాశంకర్, విష్ణువర్దన్రెడ్డి, మేదరి టోనీవీరప్రతాప్, అజ్మీరా నరేష్, భీముడు, హీరాలాల్, హన్మంతరావు, నాయకులు తోటకూరి రాంబాబు, దేవ్లానాయక్, అడ్డగోడ ఐలయ్య, ఎండీ.హనీఫ్, యాకూబ్ అలీ, షపీ, ఆదెర్ల రాములు, రాజు, జగ్గయ్య, హేమ్లానాయక్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
అంగన్వాడీలకు మహర్దశ
● రూపురేఖలు మార్చేలా యంత్రాంగం సన్నాహాలు ● తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల కల్పనపై దృష్టి ● వచ్చేనెల 15 నాటికి పూర్తియడమే లక్ష్యంగా పనులు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చడం.. తద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న వసతుల కొరత తీర్చి, వాటిని ఆధునికీకరించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్న కేంద్రాలతో పాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో కూడా విద్యుత్, రక్షిత తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. 300కు పైగా కేంద్రాలకు విద్యుత్ జిల్లాలోని 1,840 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన అధికారులు.. ఎక్కడెక్కడ ఏమేం మౌలిక వసతుల కొరత ఉందో నివేదిక రూపొందించారు. ఇందులో భాగంగా విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలు 316 ఉండగా, ప్రస్తుతం 246 కేంద్రాలకు సంబంధించి నివేదిక కలెక్టర్కు సమర్పించారు. ఎన్పీడీసీఎల్ అధికారుల సమన్వయంతో ఈ కేంద్రాలకు త్వరలోనే మీటర్లు బిగించనుండగా విద్యుత్ సరఫరా మొదలవుతుంది. మరుగుదొడ్ల నిర్మాణం చిన్నారులకు ఇబ్బంది లేకుండా చూడడం, బాలికల ఆరోగ్యం దృష్ట్యా 202 కేంద్రాల్లో కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. వీటి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్(పీఆర్) శాఖకు అప్పగించి నిధులు కూడా మంజూరు చేశారు. దీంతో పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాగా, ఇంకొన్ని చోట్ల పనులు కొనసాగుతున్నాయి. ‘మిషన్ భగీరథ’తో నీరు జిల్లాలోని ఏజెన్సీ (వైరా, సత్తుపల్లి, పినపాక తదితర ప్రాంతాల సరిహద్దులు), గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ అధికారులను రంగంలోకి దించారు. ప్రతీ కేంద్రానికి నల్లా కనెక్షన్ ఇచ్చి, నిరంతరం రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు మిషన్ భగీరథ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన పూర్తి చేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక సమీక్ష అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణపై కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ ఇటీవల ఐసీడీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. నిధుల కొరత రాకుండా ఉపాధి హామీ నిధులను కూడా అవసరమైన చోట మరుగుదొడ్ల నిర్మాణం, సదుపాయాల కల్పనకు అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం పలు కేంద్రాల్లో తుది దశకు చేరిన పనులతో పాటు, కొత్తగా మౌలిక వసతుల కల్పన కోసం చేస్తున్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం గడువు విధించింది. రాబోయే ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ పనులన్నీ వంద శాతం పూర్తి చేసి, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా చిన్నారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఆధునికీకరణ పనులు పూర్తయితే జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలన్నీ ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా ముస్తాబు కానున్నాయి. -
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/కామేపల్లి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆది, సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం కామేపల్లి మండలంలోని తాళ్లగూడెం–నర్సయ్య కుంట, కామేపల్లి శ్మశాన వాటిక – కామేపల్లి తదితర మార్గాల్లో రోడ్లు, మద్దులపల్లిలో సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం రొంపేడులో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో నిర్మాణం పూర్తయిన సబ్స్టేషన్ను ప్రారంభిస్తారు. శ్రీవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే గర్భగుడిలో మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదా నికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారు, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి భక్తుల నిత్యకల్యాణం, పల్లకీసేవ జరిపించారు. కాగా, ఆలయంలో నియమితులైన ఇద్దరు వేద పండితులు, ఇద్దరు అర్చకులు, మరో ఉద్యోగి విధుల్లో చేరారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ‘దోస్త్’ ప్రత్యేక ప్రవేశాలు ఖమ్మం సహకారనగర్: డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 20నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఆతర్వాత 27నుంచి వెబ్ ఆప్షన్లు ఇస్తే సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. గత మూడు దశల్లో రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని, వివరాలకు తమ కళాశాలలోని హెల్ప్ లైన్ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. లోక్అదాలత్లో 175 కేసుల పరిష్కారం ఖమ్మంలీగల్: జిల్లాలోని కోర్టుల్లో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. చెక్బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించగా 175 కేసులు రాజీ ద్వారా పరిష్కరించారు. ఇందులో రూ.49,072,734 విలువైన కేసుల పరిష్కారం జరిగిందని జిల్లా న్యాయ సేవా సంస్థ(డీఎల్సీఏ) కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. అంతేకాక జిల్లావ్యాప్తంగా కోర్టుల్లో ప్రీ లిటిగేషన్ కేసులు కూడా పరిష్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీ పడిన పలువురికి ఆమె అవార్డు అందజేశారు. విద్యార్థుల హాజరుశాతం పెరగాలి ఎర్రుపాలెం: పాఠశాలలకు విద్యార్థులంతా హాజరయ్యేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని డీఈఓ జి.సదానందం ఆదేశించారు. మండలంలోని అయ్యవారిగూడెం ప్రాథమిక పాఠశాలను శనివారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన డీఈఓ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం, గణిత పక్రియలు వచ్చేలా బోధించాలని తెలిపారు. తద్వారా విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయని పేర్కొ న్నారు. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం సమకూర్చాలని సూచించారు. భోజనం తయారీని పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని తెలిపారు. సీఎంఓ ప్రవీణ్, ఎంఈఓ బి.మురళీ మోహన్రావు పాల్గొన్నారు. -
చెమటోడిస్తేనే చేనుకు నీరు
ముదిగొండ: వాతావరణ పరిస్థితుల నేపథ్యాన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. జూన్లో తొలకరి వానలకు పత్తి విత్తనాలు నాటగా.. ఆతర్వాత వరుణుడు కరుణ లేక కొందరు రెండు, మూడేసిసార్లు విత్తనాలు నాటారు. అయినా ఇప్పుడు వర్షాల జాడ లేకపోవడంతో పంటను కాపాడుకునేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముదిగొండ మండలంలోని రైతులు అత్యధికంగా వ్యవసాయంపైనే ఆధారపడుతుండగా.. వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా పండిస్తారు. అయితే, నాటిన పత్తి గింజలు బతికి మొక్కలు వచ్చినా ప్రస్తుత ఎండలతో వడబడి చనిపోతున్నాయి. మరోపక్క బోర్లు, బావులు, చెరువుల్లోనూ నీరు అడుగంటుతుండడంతో ఆగమ్యగోచరంగా మారింది. మండలంలోని కమలాపురానికి చెందిన పెద్దిబోయిన శ్రీను మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి విత్తనాలు నాటగా మొక్కలు బతికించుకునేందుకు బావుల నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా రోజూ అందిస్తున్నాడు. రోజుకు పది కాల్వలు మాత్రమే తడుస్తుండగా.. ఏ మాత్రంఆశ వదులుకోకుండా నాలుగు రోజుల నుంచి బావి నీరు పెడుతున్నాడు. అయితే, వాన దేవుడు కరుణిస్తే తప్ప పంట చేతికి వచ్చే అవకాశం లేదని శ్రీను చెబుతున్నాడు.పత్తి మొక్కలు కాపాడుకునేందుకు భగీరథ యత్నం -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలోని గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. అంజనాపురంలో హెలీపాడ్ నిర్మాణ పనులతో పాటు పామాయిల్ ఫ్యాక్టరీ, సభాస్థలిని ఆయన శనివారం పరిశీలించి సూచనలు చేశారు. ప్రొటోకాల్కు అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లు చేసి, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, వీఐపీ పాసులు అవసరానికి మించి పంపిణీ చేయొద్దని చెప్పారు. సభా ప్రాంగణంలో బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, మైనార్టీ సంక్షేమాధికారి ముజాహిద్, డీవైఎస్ఓ సునీల్రెడ్డి, డీపీఓ రాంబాబు, డీఎంహెచ్ఓ రామారావు, ఉద్యాన శాఖాధికారి అనిత, వైరా ఏసీపీ సారంగపాణి, తహసీల్దార్ అరుణ, గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అంజనాపురంలో పరిశీలించిన కలెక్టర్ దివాకర -
పంటల సాగులో జాగ్రత్త
● వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోండి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినేలకొండపల్లి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గమనిస్తూ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనల ఆధారంగా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. నేలకండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మంత్రి పర్యటించారు. కోరట్లగూడెంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశాక, పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, కోనాయిగూడెంలో నందిగామ బ్రాంచి కెనాల్పై హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, సధాశివాపురంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆరెగూడెం సర్పంచ్ వడ్డె విశాల కాంగ్రెస్లో చేరగా ఆహ్వానించిన మంత్రికి, భక్తరామదాసు ధ్యాన మందిరం అభివృద్ధిపై విద్వత్ కళాపీఠం ప్రతినిధులు వినతిప్రతం అందించారు. ఇక నేలకొండపల్లిలో గంగమ్మ జాతరలో పాల్గొన్న పొంగులేటి, బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్ల నీటినే నమ్ముకోవద్దు నీరు తక్కువగానే అవసరమయ్యే పంటలపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి సూచించారు. కేవలం బోరు నీటిపై ఆధారపడి వరి వంటివి సాగు చేస్తే మధ్యలో కొరత ఏర్పడి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి సాగర్లో నీటి లభ్యత పెరిగితే సాగునీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా, ప్రతీ రహదారిని సీసీగా మార్చనుండగా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విడతల వారీగా కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్., మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు, తుంబూరు దయాకర్రెడ్డి, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, మేకల వెంకటేశ్వర్లు, బొందయ్య, భద్రయ్య, పెంటమళ్ల పుల్లమ్మ, తిగుళ్ల భవాని, పాకనాటి కన్నారెడ్డి, చెరుకుపల్లి రాజేష్ జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి దందా
భట్టి ఇలాఖాలోమధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. కట్టలేరు, వైరా, మున్నేరు నదులను ఆసరాగా చేసుకుని అక్రమంగా ఇసుక తరలించేందుకు కొందరు కాంగ్రెస్ నాయకులు ఏకంగా ట్రాక్టర్లు కొనుగోలు చేయడం గమనార్హం. ఇసుక తరలింపునకు ఒక కూపన్ తీసుకొని రెండు, మూడేసి ట్రక్కులు బహిరంగంగానే తరలిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ట్రాక్టర్ల అనుమతులు, కూపన్లను తనిఖీ చేయాల్సిన అధికారులు.. అధికార పార్టీ నేతల విషయంలో మిన్నకుండి పోతున్నారని సమాచారం. ఇంకొన్ని చోట్ల స్థానిక ఉద్యోగులు అవినీతిలో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పలువురు కాంగ్రెస్ నాయకులే ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. రాత్రయితే సైలెంట్ మధిర మండలంలో చిలుకూరు, నక్కలగరుబు, రాయపట్నంల్లో ప్రభుత్వం అధికారికంగా రీచ్లకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ నుంచి నిబంధనల మేరకు కూపన్ల ఆధారంగా ఇసుక తరలించాల్సి ఉంటుంది. కానీ కొద్ది నెలల పాటు పరిమితి మించి, అనుమతి లేకుండా ఇసుక తరలించగా.. ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీలు ముమ్మరం చేయగా రాత్రిపూట తోలకాలు నిలిపివేశారు. మధ్యాహ్నం మాత్రం తమకెవరూ అడ్డు లేరన్నట్లుగా.. ఒక కూపన్ ఆధారంగా రెండు, మూడేసి ట్రక్కుల ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు ఉద్యోగులు కొందరు ‘మామూలు’గా తీసుకుంటూ ఇందుకు కారణమైన ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకుల జోలికి వెళ్లడంలేదని తెలుస్తోంది. ఇసుక కూపన్ల తనిఖీ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యాన సిరిపురం క్రాస్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటుచేసినా పరిశీలన అంతంత మాత్రంగానే సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.వైరా నదిలో తవ్వకాలతో భారీగా గుంతలు వైరా నదిలో రిటైనింగ్ వాల్ కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్తో మట్టి తవ్వి తరలిస్తుండగా సీపీఎం నాయకులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శీలం నరసింహారావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా భారీ గుంతలు తవ్వుతుండడంతో రాయపట్నం బ్రిడ్జికి ప్రమాదం ఎదురవుతుందని చెప్పారు. ఈవిషయం తెలిసి టౌన్ ఎస్ఐ కిషోర్ చేరుకుని తవ్వకాలను నిలిపివేయించారు. నాయకులు పడకంటి మురళి, పాపినేని రావనర్సయ్య, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కూసుమంచి: పాలేరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దివాకర టీ.ఎస్., పోలీసు కమిషనర్ సునీల్దత్తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులపై శాఖల వారీగా సమీక్షించిన మంత్రి.. టెండర్లు ఆగిపోయిన పనులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించడమే కాక నాణ్యతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజా దర్బార్లలో అందిన దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే, నియోజకవర్గంలోని భూముల రీసర్వే వేగంగా చేపడుతూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్ఈలు వెంకటరెడ్డి, యుగంధర్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. -
వరుణుడి కరుణ...
● పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వాన ● వర్షం కురిసిన ప్రాంతాల్లో పైర్లకు ప్రాణం ఖమ్మంవ్యవసాయం: రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఊరిస్తుండగా శనివారం సాయంత్రం తర్వాత వరుణుడు ఎట్టకేలకు నామమాత్రంగా కనికరించాడు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల సమయానికి కొణిజర్ల మండలం పెద్దగోపతి వద్ద 37 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక తిరుమలాయపాలెం మండలం బచ్చోడు వద్ద 34.5 మి.మీ., ఖమ్మం ఖానాపురం వద్ద 17.8 మి.మీ., పంగిడిలో 14.5, కలెక్టరేట్ వద్ద 14.3, ముదిగొండలో 11.8, చింతకానిలో 9.8, కల్లూరు, పెనుబల్లిలో 7, వైరాలో 6.5, కాకరవాయిలో 3.8, సత్తుపల్లిలో 3, పమ్మిలో 2.8, మంచుకొండలో 2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉక్కపోతతో సతమతమవుతున్న జనానికి ఈ వాన కొంత మేర ఊరటనిచ్చినట్లయింది. పంటలకు ప్రాణం ఎండ తీవ్రతతో వడబడుతున్న పైర్లకు ప్రస్తుతం కురుస్తున్న వర్షపు జల్లులు ప్రాణం పోస్తున్నాయి. ఈనెల ఆరంభం నుంచి వర్షాలు లేక ఎండల ప్రభావంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈక్రమాన తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురిసిన వాన పైర్లకు ఊపిరి పోస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుండగా, పత్తి 2.24 లక్షల ఎకరాల్లో, పెసర 18 వేల ఎకరాల్లో, వరి 42 వేల ఎకరాల్లో సాగైనట్లు అంచనా. -
అటు ఆధ్యాత్మికత.. ఇటు విలాసాలు
● వసూలు చేసిన రూ.85లక్షలు ఖర్చు చేసిన నిందితుడు ● తక్కువ ధరతో బంగారం పేరిట 18మందికి టోకరా కామేపల్లి: తక్కువ ధరకే బంగారం ఇస్తానన్న మాయమాటలతో ఓ వ్యక్తి పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. డబ్బు తీసుకున్నాక పాపభీతి ఎదురైందో ఏమో కానీ ఆ నగదులో కొంత మేర పూజలు, అన్నదానాలు, ఆలయాల్లో ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ విగ్రహాల ప్రతిష్ఠాపనకు వెచ్చించాడు. అంతేకాక కొంత నగదుతో గోవాలో విలాసంగా గడిపి, పాత అప్పులు తీర్చాడు. దివ్యాంగుడైన నిందితుడు 18మంది రూ.85.70లక్షలు వసూలు చేసి పోలీసులకు చిక్కే సరికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం గమనార్హం. ఈమేరకు ప్రధాన నిందితుడితో పాటు ఆయనకు సహకరించిన మరో వ్యక్తిని ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా.. శనివారం సీఐ సాగర్, ఎస్సై శ్రీకాంత్ వివరాలు వెల్లడించారు. ఏసీ బస్సుల్లో యాత్రలు దివ్యాంగుడైన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన నారాయణప్ప గురప్ప గతంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, భూములు, బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడ్డాడు. నగదు వసూలు చేయ డం.. మకాం మార్చి జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఏడాది క్రితం గురప్ప తన పేరును బోగా లక్ష్మీనారాయణగా చెప్పుకుంటూ అయ్యప్పస్వామి మాల ధరించి కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు వచ్చాడు. ఇక్కడ పూజలు, అన్నదానాలు, పడిపూజలు చేయడం... పలువురిని తన నగదుతో శబరిమలై, ఏడుపాయల యాత్రలకు ఏసీ బస్సుల్లో తీసుకెళ్తూ నమ్మకం పెంచుకున్నాడు. ఇదే మండలం బాసిత్నగర్కు చెందిన బానోత్ సాయికుమార్ను డ్రైవర్ పెట్టుకుని ఆయనతో ఫిబ్రవరి నుంచి తక్కువ ధరలో బంగారం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ప్రజల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేయడం మొదలుపెట్టారు. తొలుత కొందరికి బంగారం రాలేదని, డబ్బులు తిరిగి ఇచ్చేసరికి మిగతా వారు నమ్మి మరింత ఇవ్వడం మొలుపెట్టారు. అంతేకాక ఓ మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనపై కల్లూరులో కేసు నమోదు కాగా తిరిగి కల్లూరులో దింపి శనివారం బాసిత్నగర్ వెళ్తూ అప్పటికే గాలిస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని విచారించగా 18 మంది నుంచి రూ.85.70 లక్షలు వసూలు చేసినా అంతా ఖర్చయిందని వెల్లడించారు. ఇందులో రూ.10.50లక్షలు కొందరికి అప్పుగా ఇచ్చామని చెప్పడంతో ఆ నగదు రికవరీపై పోలీసులు దృష్టి సారించారు. అనేక ప్రాంతాల్లో రూ.కోట్లలో మోసం చేసిన గురప్ప జైలు శిక్ష కూడా అనుభవించాడని గుర్తించారు. ఈమేరకు ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ వెంకటరత్నం, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
ఏ బస్సు ఎప్పుడు వస్తుంది ?!
డిపోల వారీగా ఎంకై ్వరీ నంబర్లు విడుదలడిపో పేరు డిపో మేనేజర్ / సెల్ నంబర్ బస్స్టేషన్ ఖమ్మం డిపో మేనేజర్ 99592 25958 పాత బస్టాండ్ 99592 25965 కొత్త బస్టాండ్ 99592 25979 మధిర డిపో మేనేజర్ 99592 25961 మధిర బస్టాండ్ 73829 25289 సత్తుపల్లి డిపో మేనేజర్ 99592 25962 సత్తుపల్లి డిపో 99592 25990 భద్రాచలం డిపో మేనేజర్ 99592 25960 బస్టాండ్ 99592 25987 కొత్తగూడెం డిపో మేనేజర్ 99592 25959 బస్టాండ్ 99592 25982 మణుగూరు డిపో మేనేజర్ 99592 25963 సురక్ష బస్టాండ్ 94905 53145 ఇల్లెందు డిపో మేనేజర్ 90634 21452 బస్టాండ్ 99592 25984ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు బస్సుల వేళలు, ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు విచారణ(ఎంకై ్వరీ) నంబర్లు విడుదల చేశారు. రీజియన్లోని డిపోల వారీగా డిపోలు, బస్ స్టేషన్ల వారీగా నంబర్ల వివరాలిలా ఉన్నాయి. -
తాడిచర్ల–2 బ్లాక్ సాధన విజయోత్సవం
రుద్రంపూర్: సింగరేణి సంస్థకు ఇటీవల కేంద్ర బొగ్గుగనుల శాఖ తాడిచర్ల–2 బ్లాక్ను కేటాయించింది. ఈ మేరకు కొత్తగూడెంలోని కార్పొరేట్, సెంట్రల్ వర్క్షాపుతో పాటు ఏరియాలోని పీవీకే–5, వర్క్షాపు, జీకే ఓసీల్లో శనివారం విజయోత్సవాలు నిర్వహించారు. కార్పొరేట్లో జరిగిన వేడుకల్లో డైరెక్టర్లు వెంకటేశ్వరు, సూర్యనారాయణ, తిరుమలరావు పాల్గొనగా, కొత్తగూడెం ఏరియాలో జీఎం ఎం.శాలేంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తాడిచర్ల–2 కేటాయింపు సింగరేణి సంస్థ భవిష్యత్కు కీలకంగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందేశాన్ని చదివి ప్రతులను ఉద్యోగులకు అందజేశారు. ఆతర్వాత స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, నాయకులు వి.నరసింహారావు, మల్లికార్జున్రావు, ఎం.డీ.రజాక్, గోవిందరావు, తిరుపతి, రామకృష్ణ, ముక్కపాటి వెంకటేశ్వర్లు, యోహాన్, రాజారాం, హరీష్, గట్టయ్య, సౌజన్య, సాగర్ తదిరులు పాల్గొన్నారు.డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసుల్లో 46మందికి జరిమానా ఖమ్మంక్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 46మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇటీవల తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపర్చగా, రూ.4.60లక్షల జరిమానా విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి నాగలక్ష్మి తీరు చెప్పారని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈక్రమాన ప్రాసిక్యూషన్కు సహకరించిన అధికారులను సీపీ సునీల్దత్ అభినందించారని వెల్లడించారు. కుమారుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదుపాల్వంచరరూల్: తమను ఇంటి నుంచి గెంటివేశాడని తల్లిదండ్రులు కుమారుడిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల ఫరిధిలోని ఇల్లెందులపాడుతండాకు చెందిన భూక్యా మంగ్యా, లక్ష్మి దంపతుల పెద్దకుమారుడు, కేటీపీఎస్లో డీఈ ఉద్యోగం చేస్తున్న భూక్యా పుల్యా ఆస్తి విషయమై గొడవపడి శుక్రవారం తల్లిదండ్రులను బయటకు వెళ్లగొట్టి ఇంటికి తాళం వేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ్ముడుపై అన్న.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని భూక్యా పుల్యా తన సోదరుడు కిషన్పై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇద్దరిని ఆదివారం పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. -
యువతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలోని యువత విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వారి ఆశలు, ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ సూచనలతో చేపట్టిన ‘ఛాత్రూన్ కి గూంజ్’లో భాగంగా నాయకులు శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం పేపర్ లీకేజీ కారణంగా ఎందరో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారన్నారు. అయినా బాధ్యతగా కేంద్ర మంత్రి విద్యామంత్రి రాజీనామా చేయకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కాగా, దీక్షలో కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, మొక్కా శేఖర్గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ హుస్సేన్, విప్లవ కుమార్, కర్నాటి రామారావు, కిలారు అనిల్ కుమార్, బచ్చలకూర నాగరాజు, మూడుముంతల గంగరాజు, దామా స్వరూప, ప్రభావతిరెడ్డి, గాదెల ఝాన్సీ, శ్రీలత, శ్రీనివాస్ యాదవ్, వేల్పుల మురళి, అన్నపూర్ణ, లక్ష్మి తదిరులు పాల్గొన్నారు. వీరికి రాష్ట్ర గిడ్డంగులు, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరితో పాటు పోట్ల నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, గజ్జెల్లి వెంకన్న, వెంకయ్య, సహెలా, రంగా జనార్దన్, వనం ప్రదీప్తచక్రవర్తి, మడుపల్లి భాస్కర్, ప్రతిభారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
పాలకుల మాటలు తప్ప చేతలు లేవు..
కామేపల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మాటలతో కాలం గడుపుతోందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ ఆరోపించారు. కామేపల్లి మండలం మద్దులపల్లి, ముచ్చర్లలో శనివారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోక ప్రజలు నిరాశలో ఉన్నారని తెలిపారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు ఉండీ అభివృద్ధి చేయకపోగా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాక ప్రాజెక్టుల నిండా నీరు ఉన్నా వదలకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుతో ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నందున, రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించిన రవీందర్రావు.. అర్హుల ఓట్లు తొలగించకుండా పర్యవేక్షించాలని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు బానోత్ హరిసింగ్నాయక్, సామా మోహన్రెడ్డి, మల్లెంపాటి శ్రీనివాసరావు, శతకోటి హన్మంతరావు, కాట్రాల రాంబాబు, గడ్డం వెంకటేశ్వర్లు, తూము బాబు, భూక్యా దళ్సింగ్నాయక్, పగడాల నాగమణి, జాటోత్ జాయ్లూసీ, వడియాల కృష్ణారెడ్డి, మోతుకూరి సీతయ్య, మూడ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు -
‘ఈశా గ్రామోత్సవం’ క్రీడాపోటీలు ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో 18వ ఈశా గ్రామోత్సవం పేరిట నిర్వహిస్తున్న క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈమేరకు తొలిరోజు త్రోబాల్ తదిత ర పోటీలు నిర్వహించగా పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పోటీలను జీవీ మాల్ అధినేత ఉమామహేశ్వర్రావు ప్రాంరభించి మాట్లాడు తూ ఈశా గ్రామోత్సవంలో వయోబేధం లేకుండా మహిళలు ఉత్సాహంగా హాజరుకావడం అభినందనీయమన్నారు. కాగా, పోటీల్లో 84 ఏళ్ల నరసమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా... మ్యూజికల్ చైర్స్, లెమన్–స్పూన్, గోనె సంచి పరుగు తదితర పోటీలు నిర్వహించారు. తెలంగాణ, ఏపీలోని 15 జిల్లాల్లో గ్రామస్థాయి పోటీలు జరుగుతుండగా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పూర్తయ్యాక ప్రతీ స్థాయిలో మొదటి నాలుగు స్థానా ల్లో నిలిచిన జట్లకు బహుమతులు అందిస్తారు. ఇక సెప్టెంబర్ 6న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఫైనల్స్ జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. కాగా, తొలిరోజు త్రోబాల్ పోటీలకు 65జట్లు హాజరుకాగా, మూడు కోర్టులు మ్యాచ్లు నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా ఉపేందర్ ఖమ్మం లీగల్: ఖమ్మం మహిళా కోర్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇటీవల బదిలీపై వచ్చి న రేణిగుంట ఉపేందర్ శనివారం విధుల్లో చేరారు. అంతేకాక ఆయనే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా నియమితులవడంతో ఆ బాధ్యతలు కూడా స్వీకరించారు. అంతేకాక కొత్తగూడెం అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా ఫణికుమార్, ఖమ్మం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఏపీపీగా పీ.వీ.డీ.లక్ష్మి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఏపీపీలతో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉపేందర్ సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం పోలీసు కమిషనరసునీల్దత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీలు అనిల్, కిషన్, భద్రయ్య, స్వప్న, ఇందిర, రాజారావు, శ్రీధర్ పాల్గొన్నారు. గంజాయి సేవించిన ముగ్గురి అరెస్ట్ ఖమ్మంక్రైం: గంజాయి సేవించిన ముగ్గురు యువకులను శనివారం ఖమ్మం త్రీటౌన్ పోలీ సులు అరెస్ట్ చేశారు. కరీనంగర్కు చెందిన పసు ల సూర్యనారాయణ, కడుసు రాకేష్, జగిత్యాల జిల్లా తిప్పన్నపేటకు చెందిన మైదం మల్లేష్ ఖమ్మం ప్రకాష్నగర్ బ్రిడ్జి వద్ద గంజా యి సేవిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పరీక్షించగా గంజాయి సేవించినట్లు తేలడంతో కేసు నమో దు చేశామని సీఐ మోహన్బాబు తెలిపారు. హుండీ పగలగొట్టి నగదు చోరీ నేలకొండపల్లి: మండలంలోని బైరవునిపల్లి గంగమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దుండగులు శనివారం తెల్లవారుజామున ఆలయ తలు పులను కట్టర్తో ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ఆర్వాత హుండీ తీసుకెళ్లి పొలాల్లో ధ్వంసం చేసి నగదు చోరీ చేశారు. ఈమేరకు శనివా రం ఉదయం గుర్తించిన ఆలయ కమిటీ ప్రతి నిధుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలంలో పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, హుండీలో రూ.50వేల నగదు ఉంటుందని కమిటీ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మట్టి తరలింపునకు వసూళ్లు
కారేపల్లి: కారేపల్లి మండలం గుట్టకిందిగుంపు గ్రామంలోని గంగదేవిగుట్టపై రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యాయన రూ.10కోట్లతో నిర్మించనున్న గోదాం పనులకు అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. నెల క్రితం నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాందాస్నాయక్ శంకుస్థాపన చేశారు. గుట్టపై మట్టిని కాంట్రాక్టర్ జేసీబీలతో తొలగిస్తారని, మట్టి అవసరమైన వారు ఎవరికీ రూపాయి కట్టకుండా ట్రాక్టర్లు, టిప్పర్లలో తీసుకెళ్లవచ్చని ప్రకటించారు. ఈక్రమాన కొందరు టిప్పర్ల యజమానులు రంగంలోకి దిగి రూ.3వేల నుంచి రూ.3,500 చొప్పున ధర నిర్ణయించి మట్టి అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇది పక్కన పెడితే ప్రతీ టిప్పర్కు రూ.500 చొప్పున గ్రామాభివృద్ధికి చెల్లించాలని సర్పంచ్ సమక్షంలో గ్రామస్తులు కమిటీ ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తున్నారు. ఇదంతా చూసినా కాంట్రాక్టర్కు మరో ఆలోచన వచ్చింది. జేసీబీలతో ఉచితంగా మట్టిని టిప్పర్లో వేస్తున్నందున.. గ్రామాభివృద్ధి పేరిట వసూలు చేస్తున్న నగదులో కొంత డీజిల్ ఖర్చులకు ఇవ్వాలని సూచించాడు. దీనికి కమిటీ సభ్యులు ససేమిరా అనడంతో శనివారం నుంచి టిప్పర్లలో మట్టి ఎత్తేది లేదంటూ జేసీబీ ఆపరేటర్లను పంపించాడు. దీంతో టిప్పర్లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమస్య తీవ్రరూపం దాల్చకముందే ఉన్నతాధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నాన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల టోర్నీలో విజేతగా ఉమ్మడి జిల్లా జట్టు
ఖమ్మంవ్యవసాయం: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన ఇంటర్ సర్కిల్ వాలీబాల్, బాల్బ్యా డ్మింటన్, క్యారమ్స్ పోటీలు శనివారం ముగిశాయి. వాలీబాల్ పోటీల్లో 20 జట్లు పాల్గొనగా ఫైనల్స్లో మహబూబ్నగర్–ఖమ్మం ఉద్యోగుల జట్లు తలపడ్డా యి. ఇందులో విజేతగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగుల జట్టు నిలిచింది. వరుసగా ఆరోసారి విజేతగా నిలిచి రికార్డు సృష్టించడం విశేషం. జట్టు కెప్టెన్గా కొత్తగూడెంకు చెందిన రాజు వ్యవహరించగా, వైస్ కెప్టెన్గా జి.వెంకటేశ్వర్లు, రామ్కుమార్(అశ్వారావుపే ట), శివాజీ(దమ్మపేట), యాకూబ్(పెనుబల్లి), శివ(మణుగూరు), ప్రశాంత్(ఖమ్మం రూరల్), సతీష్(చండ్రుగొండ) పాల్గొనగా, మేనేజర్గా ఖమ్మంకు చెందిన ఉపేందర్, కోచ్గా జయప్రకాష్ వ్యవహరించా రు. జట్టుకు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు టి.మధుసూదన్, హెచ్ఆర్డీ సి.ప్రభాకర్ బహుమతులు అందజేశారు.వాలీబాల్లో వరుసగా ఆరోసారి విజయం -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఉద్యమం
సత్తుపల్లిరూరల్: పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు హెచ్చరించారు. మండలంలోని కాకర్లపల్లిలో శనివారం ఆయన నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాల్వలను పరిశీలించారు. అనంతరం వెంకట్రాములు మాట్లాడుతూ ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న 34 ఎకరాల్లోని పాత ఎన్టీఆర్ కాల్వను పూడ్పించి, కాకర్లపల్లి పేదలతో పాటు సత్తుపల్లిలోని నిరుపేద కుటుంబాల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈవిషయమై ప్రభుత్వ యంత్రాంగం సానుకూలంగా ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, నాయకులు జాజిరి జ్యోతి, యర్రా శ్రీనివాసరావు, మేరుగు సత్యనారాయణ, జాజిరి శ్రీనివాస్, మోరంపూడి పాండు రంగారావు, రావుల రాజబాబు, కొలికపోగు సర్వేశ్వరరావు, కువ్వారపు లక్ష్మణరావు, ఇమామ్ పాల్గొన్నారు. -
‘ఫ్లైయాష్’లోకి రైల్వే..
సాక్షి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం: కేటీపీఎస్ విస్తరణకు స్థల, నిధుల సమస్య కంటే బూడిద నిర్వహణే పెద్ద అడ్డంకిగా మారింది. అయితే, బూడిద రవా ణా సేవల్లోకి రైల్వే ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో థర్మల్ పవర్ ప్లాంట్ బూడిదకు పారిశ్రామిక, నిర్మాణ రంగాల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. భారీ ఎత్తున వెలువడుతున్న బూడిద కేటీపీస్లో రోజూ 3,500 టన్నుల బూడిద వెలువడుతోంది. ఇంచుమించు ఇదేస్థాయిలో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నుంచీ వస్తోంది. భారీస్థాయిలో అవక్షేపంలా పేరుకుపోయే బూడిదను పర్యావరణానికి హానీ కలిగించని విధంగా నిల్వ చేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక అవసరాలను సైతం ఉచితంగా/నామమాత్రపు ధరకు ఇస్తుంటారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వెలువడే బూడిదలో సుమారు 30 శాతం సిమెంట్ పరిశ్రమలే తీసుకుంటున్నాయి. రోడ్లు, ఇతర నిర్మాణ రంగాల్లోనూ బూడిద వినియోగించే అవకాశం ఉంది.రవాణా భారం బూడిద రవాణాకు సాధారణ లారీలతోపాటు ఫ్లైయాష్ ట్యాంకర్లను వినియోగిస్తారు. బీటీపీఎస్, కేటీపీఎస్ నుంచి నిత్యం వందకు పైగా ఫ్లైయాష్ ట్యాంకర్లు వెళ్తుంటాయి. రవాణా భారం ఎక్కువ కావడంతో సిమెంట్ రంగాన్ని మినహాయిస్తే ఇతర పారిశ్రామిక, నిర్మాణ రంగాలు బూడిద వినియోగానికి మొగ్గు చూపడం లేదు. దీంతో విడుదలయ్యే బూడిదలో 50శాతానికి మించి నిల్వ చేయాల్సి రావ డం తలకుమించిన భారంగా మారుతోంది. ఇందుకోసం వందలాది ఎకరాల్లో యాష్పాండ్లు ఏర్పాటు చేయాల్సి రావడం, దాన్ని సమర్థంగా నిర్వహించాల్సి రావడం సవాల్గా మారింది. ప్రయోజనాలు రోడ్డు మార్గంతో పోల్చితే రైలు మార్గంలో రవాణా ఖర్చులు చాలా తక్కువ. దీన్ని సానుకూల అంశంగా పారిశ్రామిక, నిర్మాణ రంగం భావిస్తే థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వెలువడే బూడిదకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు థర్మల్ పవర్ ప్లాంట్పై బూడిద నిర్వహణకు సంబంధించిన చిక్కులు కొంత మేరకు తొలగిపోయే అవకాశం ఉంది. బూడిద రవాణాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఆ మేరకు రోడ్డు మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. విధాన, నిర్మాణాత్మక రంగాల్లో మొత్తం 17 రకాల సంస్కరణలు ప్రవేశపెట్టబోతున్నట్టు ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. అందులో నిర్మాణాత్మకై న సంస్కరణలో మొదటిదిగా థర్మల్ పవర్ ప్లాంట్లలో వెలువడే బూడిద ట్రాన్స్పోర్టును చేర్చారు. ప్రస్తుతం బొగ్గు రవాణాకు ఉపయోగించే సాధారణ వ్యాగన్లే బూడిద రవాణాకు రైల్వే అందుబాటులో ఉంచింది. టాప్ ఓపెన్గా ఉండే ఈ వ్యాగన్లలో బూడిద రవాణాతో ప్రయోజనాల కంటే నష్టాలే అధికం. దీంతో యాష్ ట్రాన్స్పోర్టుకు రైల్వేపై ఎవరూ ఆధారపడటం లేదు. ఈ లోపాన్ని గుర్తించిన రైల్వేశాఖ, బూడిద రవాణా కోసం క్లోజ్డ్గా ఉండే ప్రత్యేక కంటైనర్లను ప్రవేశపెట్టాలని తాజాగా నిర్ణయించింది. -
‘సీతారామ’కు పునాది వేసిందే కేసీఆర్
● ఆ ఘనత దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ● మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి/వేంసూరు: ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేలా సీతారామ ప్రాజెక్టుకు పునాది వేసింది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడేనని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. సత్తుపల్లి, వేంసూరు మండలం మర్లపాడులో పార్టీ బీఎల్ఏలతో శుక్రవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమే కాక రూ.19 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వెచ్చించి 70 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణం, మోటార్లు బిగించడం అంతా బీఆర్ఎస్ ఉన్నప్పుడు పూర్తికాగా, ఇప్పుడు చిన్న కాల్వ తీసి, అంతా తమ ఘనతేనని కాంగ్రెస్ మంత్రులు చెప్పుకోవడం తగదన్నారు. ఇటీవల సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండున్నరేళ్లల్లో రూ.వేయి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడమే బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనుల విలువను తెలియచేస్తోందన్నారు. కాగా, జిల్లాలో ఒక మంత్రికి పేరు వస్తుందని మిగిలిన వారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని తీసుకొచ్చి హడావుడి చేశారని విమర్శించారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుపైనా దుష్ప్రచారం మానుకోవాని సండ్ర సూచించారు. అవసరమైతే రక్తం ఇస్తాం సాగు అవసరాలకు నీరు విడుదల చేయాలని తాము కోరితే సీఎం రేవంత్రెడ్డి మాత్రం రక్తం పోస్తామని మాట్లాడడం గర్హనీయమని సండ్ర పేర్కొన్నారు. ఒకవేళ సీఎంకు అవసరమైతే తమ కార్యకర్తల రక్తం పంపించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా, కేసీఆర్ కుటుంబంపై సీఎం మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టిన విషయం రైతులకు తెలుసునని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా అర్హులు ఓట్లు కోల్పోకుండా పార్టీ బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. సమావేశాల్లో నాయకులు కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, ఎస్కే చాంద్పాషా, అమరవరపు కృష్ణారావు, దొడ్డా శంకర్రావు, ఎండీ అయూబ్పాషా, కోటగిరి వెంకటరావు, పాలా వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, దొడ్డ వెంకటకృష్ణారెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, దొడ్డ చెన్నకేశవరెడ్డి, గండ్ర సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ సమస్యలపై సీఎంకు పోస్టుకార్డులు
బోనకల్: కేజీబీవీల్లో ఉపాధ్యాయులు, ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పోస్టుకార్డులు పంపిస్తున్నట్లు టీఎస్ యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ మేరకు బోనకల్ కేజీబీవీలో పోస్టుకార్డులు పంపించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రా రంభించిన ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల శ్రమను దోచుకోవడం ఇకనైనా ఆపేసి మినిమం టైం స్కేల్ అమలుచేస్తూ పోస్టులకు తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాక సెలవులు వర్తింపజేయాలని, ఉపా ధ్యాయులను బోధనకే పరిమితం చేసి ఆరోగ్య కార్డుల జారీ, వార్షిక ఇంక్రిమెంట్లు, పెండింగ్ బిల్లుల విడుదలపై దృష్టి సారించాలని కోరా రు. కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిన్న రంగారావు, నాయకులు కె.లక్ష్మణ్రావు, సురేశ్, శశికళ, సక్కుబాయి, రాణి, మరియమ్మ, చంద్రకళ, నిర్మల, శైలజ, విజయకుమారి, ఝాన్సీ, సుధారాణి, సుజాత, సునీత పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి రక్షణకు ట్రెంచ్ సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని గాడిదలవాగు సమీపంలోని 13 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సర్వే నంబర్ 13లో ఇతరులు సాగుచేస్తున్న భూమికి సర్వేయర్ నాగు ఆధ్వ ర్యాన సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. ప్రస్తు తం ఈ భూమిలోకి ఇతరులు వెళ్లకుండా శుక్రవారం ట్రెంచ్ కొట్టించారు. ఆర్ఐ ఉమామహేశ్వరరావు, జీపీఓ నాగేశ్వరరావు పనులను పర్యవేక్షించారు. దుబాయ్లో ఉద్యోగాలకు 21న ఇంటర్వ్యూలు ఖమ్మంరాపర్తినగర్: దుబాయిలోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉండడంతో అర్హుల ఎంపికకు టామ్కామ్ ఆధ్వర్యాన ఈ నెల 21న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి తెలిపారు. క్లీనర్లు, షట్టరింగ్ కార్పెంటర్, ప్లంబర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ తదితర ట్రేడ్లలో 500 మందిని ఎంపిక చేస్తారని చెప్పా రు. ఎంపికై న వారికి నైపుణ్యాల ఆధారంగా వేతనం అందుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు బయోడేటా, పాస్పోర్ట్, విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాలతో హైదరాబాద్లోని మాస బ్ ట్యాంక్ సమీపాన టామ్కామ్ కార్యాలయంలో ఈ నెల 21న జరిగే ఇంటర్వ్యూలకు హాజ రు కావాలని ఆమె ఓ ప్రకటనలో సూచించారు. తెలంగాణ వాసులకే ప్రాధాన్యత ఇవ్వాలిఖమ్మంలీగల్: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఈ రాష్ట్రానికే చెందిన అర్హత, ప్రతి భ కలిగిన న్యాయవాదులు, న్యాయాధికారులకు ప్రాధాన్యత ఇవ్వాలని పలు అసోసియేషన్ల బాధ్యులు కోరారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ అడ్వకేట్ల అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ, ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ అధ్యక్షుడు తాళ్లూరి దిలీప్చౌదరి, ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ కార్యదర్శి మర్రి ప్రకాశ్రావు శుక్రవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయ మూర్తులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని, జూనియర్ అడ్వకేట్ల స్టైఫండ్ను రూ.వేయి నుంచి రూ. 12 వేలకు పెంచాలని కోరారు. అలాగే, శిక్షణ గడువు పొడిగింపు, ఆరోగ్య బీమా, పెన్షన్ అమలుపై వినతిపత్రం అందజేశారు. -
‘నీట్’లో విద్యార్థుల ప్రతిభ
ప్రైవేట్ కాలేజీల విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు●‘న్యూవిజన్’ అత్యుత్తమం ఖమ్మం సహకారనగర్: వైద్య విద్య(యూజీ)లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్’ ఫలితాలు గురువారం రాత్రి విడుదలయ్యాయి. ఇందులో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. జాతీయ స్థాయిలో జి.రీతిక 1,886వ ర్యాంక్, బి.శశాంక్ 2,791, కె.అరోణ్ నిహాల్ రాయ్ 3,173, జి.విష్ణువర్థన్ 3,235, జె.వివేక్నాయక్ 3,277, బి.సిద్ధు 3,286, కె.శ్రీహర్ష 4,836, బి.పవిత్ర 5,218, బి.జ్యోత్స్న 5,533, బి.ఉదయ్ రాజ్కుమార్ 6,250, బి.కేతన్ సాయివర్ధన్ 6526, బి.ప్రసన్నలక్ష్మి 7662, ఏ.విద్యశ్రీ 7,753, ఎల్.సంజీవ్ 8,411, టి.గోమతి 8,569, రోషిణి 9,847, జి.స్పందన 11,098, బి.ఉదయ్ భాస్కర్ 12,576, వి.సరిత 11,400, వి.సాయి కార్తీక్ 16,549, ఏ.లికిత్ కృష్ణ నాయక్ 17,162, జి.ప్రణీత్ 18,453, వి.తరణి 19,066వ ర్యాంక్ సాధించగా చైర్మన్, డైరెక్టర్లు సీహెచ్.కార్తీక్, డైరెక్టర్ సీహెచ్.గోపీచంద్, డీన్ శ్రీధర్ అభినందించారు. ●‘శ్రీ చైతన్య’ ప్రభంజనం నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బి.సాయిశరణ్ 720 మార్కులకు 701 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 19వ ర్యాంక్, ఎన్.సంధ్య 611 మార్కులతో 2,662వ ర్యాంక్ సాధించిందని తెలిపారు. వివిధ కేటగిరీల్లో బి.సాయిశరణ్ 5వ ర్యాంక్, డి.డిస్నీకృతిక 255, బి.సబిత 3,456, బి.మాన్య శ్రీ 3,491, బి.నిఖిత 3,737, ఎం.ఉదయ్ 3,942, జి.జశ్వంత శివసాయి 4,666, బి.శివసాయి 5,683, ఎం.మానస 5,862, డి.స్పందన 6,421, జి.హేమ శ్రీ 7,141, జి.ఘనిత 7,505, ఏ.తరుణ్ 7,890, జె.భాగ్యరాజ్ 8,162, వి.లక్ష్మీసుమ 8,342వ ర్యాంక్ సాధించారన్నారు. కార్యక్రమంలో ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, జి.గోపాలకృష్ణ, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. ●‘హార్వెస్ట్’ ముందంజ నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉన్నత శ్రేణి ఫలితాలు సాధించారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో పి.యామిని 484మార్కులతో 55,379వ ర్యాంక్, బానోతు లక్ష్మిత 1,732వ ర్యాంక్, ఎం.రాహుల్ 3,176, జర్పుల పూజిత 3,507, ఏ.అన్విదారెడ్డి 29,175, సిమ్రాన్ కౌనైన్ 31,147, పి.భవిత 11,108తో పాటు బానోతు పార్థవి, కె.హర్షిత, ఈ.ఉదయ్కిరణ్, ఏ.అన్విదా రెడ్డి, సిమ్రాన్ కౌనైన్, పి.భవిత మెరుగైన ర్యాంకులు సాదించారని పేర్కొన్నారు. ●‘రెజొనెన్స్’ విజయభేరి నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లు సాధించారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్.వీ. నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. జాతీయ స్థాయిలో వి.శిరీష 459, ఎ.ంపద్మవచన్ 411, కె.హారికారెడ్డి 390, ఐ.హరికృష్ణ 366, కె.జాహ్నవి 362, ఎన్.శైలు 350, టి.సిరిలహరి 343, ఎన్.జాహ్నవి 338వ ర్యాంక్లు సాధించారని తెలిపారు. ఇంకా మరికొందరు ఉత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సతీష్, ఎం.భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. ●‘సర్వజ్ఞ’ సక్సెస్నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సర్వజ్ఞ విద్యాసంస్థల చైర్మన్ ఆర్.వీ.నాగేంద్రకుమార్ తెలిపారు. ఎం.లక్ష్మీదేవి 8,355వ ర్యాంక్, బి.మెర్సీ 8,757, కె.సింధు 9,833, ఏ.తన్విత్ 14,118, కె.మైథిలి 37,508 ర్యాంకులు సాధించగా చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ జనార్దన్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సోనమ్ వాంగ్చుక్ దీక్షకు సంఘీభావం
ఖమ్మంమయూరిసెంటర్: పర్యావరణ కార్యకర్త, విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఖమ్మంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జెడ్పీసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహంవద్ద పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. లడఖ్ హక్కుల సాధన, దేశ భవిష్యత్ కోసం వాంగ్చుక్ చేస్తున్న ఆమరణ దీక్షపై కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ఈ మేరకు అన్నివర్గాలు వాంగ్చుక్కు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎన్.తిరుమలరావు, కె.భాస్కర్, రవిమారుత్, డాక్టర్ వై.రవీంద్రనాథ్, దేవిరెడ్డివిజయ్, డాక్టర్ రెహానాబేగం, ఐవీ రమణారావు, డాక్టర్ భారవి, డాక్టర్ నాగమణి, డాక్టర్ ఆనందవాణి, చిర్ర రవి, బుగ్గవీటి సరళ, శేషగిరి, పుల్లయ్య, మోహన్ రావు, తిరుమల్రావు, స్వర్ణ సుబ్బారావు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ●నేలకొండపల్లి: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నేలకొండపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా సమస్యలు పరిష్కరించాలని కోరారు. పౌర సమాజం ప్రతినిధులు పసుమర్తి శ్రీనివాస్, కనకం రవికుమార్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, ఆదాం పాల్గొన్నారు. -
గంజాయి రవాణా కట్టడికి విస్తృత తనిఖీలు
ఖమ్మంక్రైం: గంజాయి రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఖమ్మంలోని కొత్త, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్తో తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. అలాగే, నార్కోటిక్ జాగిలం సాయంతో పాన్షాపులు, కిరాణా దుకాణాలు, విద్యాసంస్థల పరిసరాల్లో తనిఖీలు చేపడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల అమ్మకాన్ని నియంత్రిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎవరికై నా సమాచారం తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో లేదా ఈగల్ఫోర్స్కు సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ సీఐ ఉదయ్కుమార్, ఎస్ఐ కిరణ్ పాల్గొన్నారు. నలుగురు సబ్ ఇంజనీర్లకు పదోన్నతి, బదిలీ ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో నలుగురు సబ్ ఇంజనీర్లకు ఇన్చార్జ్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఏఈ)గా పదోన్నతి కల్పిస్తూ సీఎండీ వర్నాటి వరుణ్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమలాయపాలెం సెక్షన్ సబ్ ఇంజనీర్ సీహెచ్ ఆదినారాయణను ఏఏఈగా పదోన్నతి కల్పించి కొణిజర్ల సెక్షన్లో నియమించారు. ముదిగొండ మండలం పమ్మి సెక్షన్ సబ్ ఇంజనీర్ ఆర్.నాగేశ్వరరావుకు పదోన్నతి కల్పించి వైరా సెక్షన్కు, ఖమ్మం ఎంఆర్టీ డివిజన్ సబ్ ఇంజనీర్ కొరివి వెంకటరామకృష్ణ భరద్వాజ్కు పదోన్నతి కల్పించి కొణిజర్ల మండలం పెద్ద గోపతి సెక్షన్కు, కూసుమంచి సెక్షన్లో సబ్ ఇంజనీర్ జి.శ్రీశైలంకు పదోన్నతి కల్పించి కారేపల్లి సెక్షన్కు బదిలీ చేశారు. అలాగే, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఖమ్మం ఎంఆర్టీ డివిజన్ ఏఈ అలేఖ్యను ఖమ్మం డివిజన్ కార్యాలయం టెక్నికల్ ఏఈగా నియమించారు. వసతిగృహాల్లో అన్ని సౌకర్యాలు వేంసూరు: విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం అన్ని వసతులు సమకూరుస్తోందని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి జ్యోతి తెలిపారు. వేంసూరులోని బాలుర వసతిగృహాన్ని శుక్రవారం రాత్రి ఆమె తనిఖీ చేశారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సదుపాయంతో పాటు భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. మెడికల్ బోర్డుకు 92 మంది హాజరురుద్రంపూర్: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన మెడికల్ బోర్డుకు యాజమాన్యం 120 మంది కార్మికులను పిలవగా 92 మంది హాజరయ్యారు. 28 మంది గైర్హాజరయ్యారు. శుక్రవారం ప్రీ బోర్డ్లో వైద్య పరీక్షలు పూర్తికాగా, శనివారం ఫిజికల్ ఫిట్నెస్ ఆధారంగా శనివారం కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు అన్ఫిట్ చేయనున్నారు. అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు యాజమాన్యం ఉద్యోగ అవకాశం కల్పించనుంది. అనుమతి లేని మందులు సీజ్ ఏన్కూరు: అనుమతి లేకుండా విక్రయిస్తున్న మందులను డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్రెడ్డి సీజ్చేశారు. మండలంలోని బురద రాఘవాపురంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేకండా విక్రయిస్తున్నట్లు తేలడంతో రూ.10 వేల విలువైన మందులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. -
వేగం తక్కువ
లక్ష్యం ఎక్కువ..సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎల్నినో పరిస్థితుల వల్ల కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలు రాక అంటూ జరుగుతున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య పొంతన కుదరడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎత్తిపోతల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్షా యాభై వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమయ్యే పనిలా లేదు. దీంతో ప్రస్తుత ఎత్తిపోతలు మరో ట్రయల్రన్గా మారుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణాకు గోదావరి భరోసా.. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా కృష్ణా ఆయకట్టు కింద ఉన్న లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఉజ్జాయింపు లెక్కల ప్రకారం ఒక టీఎంసీ (11,574 క్యూసెక్కులు) నీటితో పది వేల ఎకరాలు సాగు అవుతాయి. ఈ లెక్కన లక్షా యాభై వేల ఎకరాలకు సాగు నీరు అందాలంటే, సరఫరా నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే 15 టీఎంసీల నీరు అవసరం. సీతారామ ప్రధాన కాలువ ఎత్తిపోతల సామర్థ్యం రోజుకు 9,000 క్యూసెక్కులు (0.78 టీఎంసీలు). గరిష్ట సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తే 20 రోజుల్లో పదిహేను టీఎంసీల నీటిని ఎత్తిపోయడం పెద్ద విషయం కాదు. లక్ష్యం చేరుకునేనా గోదావరి జలాలను సీతారామ ట్రంక్ కెనాల్– రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఈ నెల 8 నుంచి ఎత్తిపోస్తున్నారు. రోజుకు 1,500 క్యూసెక్యుల వంతున ఎత్తిపోతలు జరుగుతున్నాయి. దీంతో గడిచిన పది రోజుల్లో కేవలం ఒక టీఎంసీ నీటినే ఎత్తిపోయగలిగారు. ఈ క్రమంలో 15 టీఎంసీల నీరు ఎత్తిపోయాలంటే ఇంకో ఐదు నెలల సమయం పడుతుంది. కనీసం పది టీఎంసీలు ఎత్తిపోయాలన్నా మూడు నెలలు అవుతుంది. ఈలోగా ఖరీఫ్ సీజన్లో విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు అన్ని రోజుల పాటు గోదావరిలో వరద ప్రవాహం ఉండేది అనుమానమే. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదముంది. లోపం ఎక్కడ? కాటన్ ఆనకట్ట దగ్గర నీటిమట్టం 47.50 అడుగులకు చేరుకుంటే పూర్తి స్థాయిలో అలుగు పడుతుంది. ఆ సమయంలో 45 అడుగుల నీటి మట్టం నుంచి గోదావరి నీటిని సీతారామ ప్రధాన కాలువకు తరలించుకోవచ్చు. ఇలా గోదావరి నుంచి నీటిని తీసుకునే ఇన్టేక్ పాయింట్ను బెల్మౌత్ అని, వచ్చిన నీరు ప్రధాన కాలువ, పంపుహౌస్లను ముంచెత్తకుండా వరదను క్రమబద్ధీకరించేందుకు హెడ్ రెగ్యులేటరీలు అవసరం పడుతాయి. సీతమ్మసాగర్ బరాజ్ ప్యాకేజీలో బెల్మౌత్, హెడ్ రెగ్యులేటరీల నిర్మాణాలు ఉన్నాయి. అయితే, పర్యావరణ అనుమతులు రాకపోవడంతో బరాజ్తో పాటు బెల్మౌత్, హెడ్రెగ్యులేటరీల నిర్మాణ పనులు ఆగిపోయాయి.న్యాయపరమైన చిక్కులతో బరాజ్ పనులు ఆగిపోవడం, సీతారామపై పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితం రాకపోవడం వల్ల ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుని కొత్తదైన సీతమ్మసాగర్తో సంబంధం లేకుండా పాతదైన కాటన్ ఆనకట్ట ద్వారా ఎత్తిపోతలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా యుద్ధప్రతిపాదికన రాజీవ్ ్ లింక్ కెనాల్, పంపు హౌస్లకు విద్యుత్ కనెక్షన్లు అందించింది. ఆ సమయంలోనే గోదావరి నుంచి నీటిని తీసుకునే ఇన్టేక్ పాయింట్ (బెల్మౌత్), హెడ్రెగ్యులేటరీ పనులను సైతం చేయాల్సి ఉంది. ఈ రెండు పనులను 2024లో మొదలు పెట్టారు. కానీ, నేటికీ పూర్తికాలేదు. ఫలితంగా గోదావరి నుంచి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఎక్కువ మొత్తంలో నీరు తీసుకునే వీలు లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాల తరలింపు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రమాదమా, ఆత్మహత్యా? సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వెనక టైర్ల కింద పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లాడ మండలం రామా నుజవరానికి చెందిన జంగం రత్నాకర్ (31) సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా కొత్త లంకపల్లి వద్ద బస్సు కింద పడేందుకు ప్రయత్నించాడు. దీంతో డ్రైవర్ అప్రమత్తమై డివైడర్ ఎక్కించాడు. అయినా రత్నాకర్ మళ్లీ బస్సు వెనుక టైర్ల కింద పడడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు. స్తానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, రత్నాకర్ అనారోగ్య కారణాలతో సత్తుపల్లి ప్రభు త్వాస్పత్రిలో కొన్నాళ్ల నుంచి చికిత్స పొందుతున్నాడని తెలిసింది. ఆయన చేతికి సైలెన్ పెట్టే క్యాన్లా ఉండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రమాదమా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, రత్నాకర్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొని వాహనదారుడు.. తిరుమలాయపాలెం: మండలంలోని దమ్మాయిగూడెం సమీపాన బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన జోగా సతీశ్ (33) బతుకుదెరువు కోసం ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలో ఉంటూ మరిపెడ బంగ్లాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి ఆయన మరిపెడ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టగా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య అంజమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకుండా, జాగ్రత్తలు పాటించకుండా రోడ్డుపై లారీ నిలపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సతీశ్ తండ్రి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో లారీడ్రైవర్ లింగంపల్లి మురళీధర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీశ్ తెలిపారు. -
వనితర సాధ్యులు
తొలుత ఓటరు మ్యాపింగ్ ముగించాం. ఇది వంద శాతం పూర్తవడంతో తదుపరి ప్రక్రియలు సులువయ్యాయి. మా బూత్ పరిధిలో 12వ తేదీ నాటికి ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. నిరక్షరాస్యులు, వృద్ధుల ఫారాలు మేమే నింపాం. – పాలడుగు రమాదేవి, గువ్వలగూడెం, బీఎల్ఓమా బూత్ పరిధిలో గడువులోపే వంద శాతం డిజిజలైజేషన్ పూర్తి చేయడంసంతోషంగా ఉంది. ఇంటింటా ఫారాలు సేకరించాం. ఓటర్లకు ఫారాలు నింపడం, కావాల్సిన పత్రాలపై అవగాహన కల్పించడంతో అందరూ మాకు సహకరించారు. – వడ్లమూడి కల్పన, రాజేశ్వరపురం, బీఎల్ఓఓటరు జాబితా సవరణ(సర్)ను మండలంలో విజయవంతంగా పూర్తి చేసేందుకు మొదటి నుంచే ప్రణాళిక రూపొందించాం. నిరంతరం పర్యవేక్షణలో చకచకా సాగుతోంది. గడువుకు ముందే లక్ష్యాన్ని పూర్తిచేస్తామనే నమ్మకం ఉంది. – పి.రాంప్రసాద్, తహసీల్దార్, నేలకొండపల్లినేలకొండపల్లి: ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) జిల్లాలో కొనసాగుతోంది. అయితే, ఓ చోట ఓటర్లు ఇంట్లో లేరని.. ఉన్నవారికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చినా నింపలేదని.. నింపినా తిరిగి ఇవ్వలేదని, సిబ్బంది రావడం లేదంటూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి కారణాలతోనే డిజిటలైజేషన్ గడువును వచ్చేనెల 3వరకు పొడిగించారు. కానీ నేలకొండపల్లి మండలంలోని ఇద్దరు బీఎల్ఓలు గడువుకు ముందే లక్ష్యాన్ని చేరుకోవడం, వీరిద్దరూ మహిళలు కావడం విశేషం. ‘సర్’ ప్రక్రియలో తొలినాళ్ల నుంచే నేలకొండపల్లి మండలం ఆదర్శంగా నిలుస్తోంది. మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలోనే అగ్రభాగాన నిలిచి తహసీల్దార్ పి.రాంప్రసాద్ అవార్డు అందుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో 90 శాతం దాటారు. తహసీల్దార్కు తోడు డీటీలు కనకం నరసింహారావు, సుందర్సింగ్ తదితరుల నిత్య పర్యవేక్షణ పనులు చకచకా సాగుతున్నాయని బీఎల్ఓలు చెబుతున్నారు. రెండు కేంద్రాల్లో శతశాతం నేలకొండపల్లి మండలంలోని 32జీపీల్లో 49,395మంది ఓటర్లు ఉన్నారు. ఈమేరకు 59మంది బీఎల్ఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో గువ్వలగూడెం, రాజేశ్వరపురం బీఎల్ఓలు నూరు శాతం ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ కూడా చేయించారు. ఓటరు మ్యాపింగ్ సాఫీగా సాగడంతో బీఎల్ఓల పనులు సులువయ్యాయని తహసీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. కాగా, గువ్వలగూడెం బీఎల్ఓ పాలడుగు రమాదేవి 243 పోలింగ్ బూత్ల పరిధిలో ఓటర్ల డిజిటలైజేషన్ 16రోజుల్లోనే పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ బూత్ పరిధిలో 876 మంది ఓటర్ల డిజిటలైజేషన్ 12వ తేదీనే ముగించారు. ఇక రాజేశ్వరపురం పోలింగ్ బూత్ నంబర్ 237 బీఎల్ఓ వడ్లమూడి కల్పన 267 మంది ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పూర్తిచేశారు. ఇంకొందరు బీఎల్ఓలు లక్ష్యసాధనకు చేరువలో ఉన్నారు. -
రైతులు అధైర్యపడొద్దు..
● సమగ్ర భూసర్వేతో నష్టం జరగదు ● కాకరవాయిలో పర్యటించిన కలెక్టర్ దివాకర తిరుమలాయపాలెం: సమగ్ర భూసర్వేలో వచ్చిన నోటీసులు చూసి రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అందులో వివరాలు సమగ్రంగా లేకపోతే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. తిరుమలా యపాలెం మండలం కాకరవాయిలో సమగ్ర భూ సర్వే పూర్తయిన నేపథ్యాన శుక్రవారం ఆయన గ్రామరైతులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే ద్వారా ఎవరికీ నష్టం జరగదని, భూమి కచ్చితంగా రికార్డుల్లో నమోదు అవుతుందని తెలిపారు. ఇంకా ఎవరికై నా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా, గ్రామంలో వరి నారుమడిని చూసిన కలెక్టర్.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన వరికి బదులు ప్రత్యా మ్నాయ పంటలు సాగుచేయాలని తెలిపారు. ఆ తర్వాత సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో బీరోలు సమీపాన జరుగుతున్న సొరంగం పనులను కలెక్టర్ దివాకర పరిశీలించారు. పనుల్లో వేగంపెంచి, త్వరగా మున్నేరు నీటిని పాలేరుకు తరలించేలా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమా ల్లో ఆర్డీఓ శ్రీనివాస్, ఈఈలు రమణ, శ్రీనివాసరెడ్డి, డీఈలు చంద్రమోహన్, బాణాల రమేశ్రెడ్డి, తహసీల్దార్ లూథర్ విల్సన్, ఉద్యోగులు సుధీర్, లక్ష్మణ్, సతీశ్రెడ్డి సర్పంచ్ గూడూరు ఉపేందర్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటలే మేలు కూసుమంచి: ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వరి, పత్తి, మిర్చికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. కూసుమంచి మండలం పోచారంలో పర్యటించిన ఆయన ఇప్పటివరకు పంటల సాగు, సాగునీటి వసతి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరి సాధ్యమైనంత తగ్గించేలా అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో యాప్ ర్వారా యూరియా పంపిణీ సక్రమంగా జరుగుతోందని, రైతులకు సమస్యలు వస్తే అధికారులను సంప్రదించాలని తెలిపారు. కలెక్టర్ వెళ్లే మార్గంలో ఓ రైతు వరినాట్లు వేస్తుండగా వరికి బదులు ఇతర పంటలు ఎంచుకోవాలని చెప్పారు. సర్పంచ్ సల్వాది గురుమూర్తి, తహసీల్దార్ సైదులు, ఏఓ వాణి, ఉద్యోగులు రాము, రవి, జానీబాబా పాల్గొన్నారు. నిబంధనల మేరకు పశువుల కొనుగోలు ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీ పథకం అమలులో వ్యయాలను నియంత్రించడమే కాక నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ఇందిరా మహిళా డెయిరీ పథకంపై సమీక్షించారు. లబ్ధిదారుల జాబితా ఖరారైన వెంటనే కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పాడి పశువులు కొనుగోలు చేయించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో లబ్ధిదారుల ఆమోదమే కీలకమని చెప్పారు. ప్రతీ వారం 25 మంది లబ్ధిదారులకు 50 పశువులను కొనుగోలు చేసేలా సిద్ధం కావాలన్నారు. ఇందుకోసం ప్రతీ మండలంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్కుమార్, డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎండీ ముజాహిద్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి బి.పురంధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయంపై విస్తృత అవగాహన ఖమ్మంవ్యవసాయం: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలే సాగు చేసేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుంవర్థక తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. తక్కువ వర్షపాతం నమోదుతో భూగర్భ జలాలు తగ్గుతున్నందున గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణాన్ని కనీసం 25 శాతం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతీ ఏఈఓ తన పరిధిలో కనీసం 50 ఎకరాల్లో కూరగాయలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లాలో ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ, పశు సంవర్థక, సహకార, ఉద్యాన శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, బి.పురంధర్, గంగాధర్, అనిత తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటల నుంచి కూసుమంచి మండలం మల్లాయిగూడెం, కోక్యాతండా, అగ్రహారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనండగా, పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సాయంత్రం 4గంటల నుంచి నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం, కోనాయిగూడెం, సదాశివపురం, అనాసాగరం, గువ్వలగూడెం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాక పూర్తయిన పనులను మంత్రి ప్రారంభించనున్నారు. కాగా, కోనాయిగూడెంలో నందిగామ బ్రాంచి కెనాల్పై నిర్మించిన వంతెనను మంత్రి ప్రారంభించనుండగా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవింరావు, నాయకులు పాకనాటి కన్నారెడ్డి, చెరుకుపల్లి రాజేష్ శుక్రవారం పరిశీలించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి సత్తుపల్లిరూరల్: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు పంటల సాగులో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. తెలిపారు. సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సాగవుతున్న పంటలను శుక్రవారం పరిశీలించారు. అనంతరం కిష్టారం సొసైటీ కార్యాలయంలో జరిగిన సదస్సులో డీఏఓ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురుస్తాయనే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈమేరకు బోర్లు, బావుల కింద కూడా వరి సాగు తగ్గించి పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగులు, నువ్వులు, ఉలవ సాగు చేయాలని సూచించారు. లేనిపక్షంలో భూగర్భ జలాలు మరింత తగ్గి తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. అలాగే, నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా రైతులు తమ పొలాల్లో పంట కుంటల నిర్మాణం చేపట్టాలని డీఏఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వి.శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, ఏఈఓ డి.నరేష్, పీఏసీఎస్ చైర్మన్ సీహెచ్.లక్ష్మీనారాయణ, సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రత్యేక లోక్ అదాలత్ ఖమ్మం లీగల్: చెక్బౌన్స్ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించేందుకు శనివారం ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టంద్వారా పెండింగ్లో ఉన్న చెక్బౌన్స్ కేసులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈమేరకు కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస సూచించారు. ఆర్అండ్బీ ఎస్ఈగా యుగంధర్ ఖమ్మంఅర్బన్: జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)లో బదిలీల నేపథ్యాన నూతన అధికారులు శుక్రవారం విధుల్లో చేరారు. ఆర్అండ్బీ ఖమ్మం సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)గా ఉన్న యాకూబ్ ఉద్యోగ విరమణ చేయడంతో, నేషనల్ హైవేస్ ఈఈ వి.యుగంధర్కు పదోన్నతి కల్పించి ఈ స్థానంలో నియమించారు. ఇక ఈఈగా మహబూబ్నగర్ నుంచి బదిలీపై వచ్చిన టి.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. అలాగే, ఖమ్మం ఆర్అండ్బీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వరంగల్ నుంచి పదోన్నతిపై వచ్చిన ఎస్.గణేశ్ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు టెక్నికల్ ఆఫీసర్ యర్రా రమేశ్, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. 31 లోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలి ఖమ్మంసహకారనగర్: రేషన్కార్డుదారులు కుటుంబ సభ్యులందరి ఈ–కేవైసీ (బయోమెట్రిక్) ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్బాబు సూచించారు. పలువురు కుటుంబంలోని ఒకరు లేదా ఇద్దరి ఈ–కేవైసీ పూర్తి చేయగా, ఇంకొందరు మిగిలి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రయోజనాలు నిరంతరాయంగా అందేందుకు ప్రతీ కుటుంబ సభ్యుడి ఈ–కేవైసీ పూర్తి చేయాలని, ఇందుకోసం రేషన్షాపుల్లో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
ఖమ్మం మయూరిసెంటర్/ఖమ్మం లీగల్: ప్రతీ చిన్నారికి విద్య హక్కుగా లభిస్తుందని.. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధగా చదివితే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని జిల్లా న్యాయ సేవా సంస్థ(డీఎల్సీఏ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.దేవీమానస తెలిపారు. దానవాయిగూడెంలోని సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల, జూనియర్ కాలేజీలో శుక్రవారం మిషన్ బాల సురక్ష – శిక్షా ప్లాన్ తదితర అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో న్యాయమూర్తి దేవీమానస మాట్లాడుతూ పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం అమల్లో ఉందని తెలిపారు. విద్యార్థినులు ఇతర అంశాలపై దృష్టి సారించకుండా శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరడం ద్వారా ఇంకొందరికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అలాగే, హక్కులను తెలుసుకోవడమే కాక క్రమశిక్షణ, సమాజంపై బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా అలవర్చుకోవాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు ఉచిత న్యాయ సాయం, రక్షణ, వారి హక్కులను వివరించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.డీఎల్ఎస్ఏ కార్యదర్శి దేవీమానస -
ఉపాధితో జల ఆసరా!
జిల్లాపై ఎల్నినో పంజా విసురుతోంది. వానలు ముఖం చాటేయడం, ఎండలు మండుతుండడంతో వ్యవసాయ పనులు చురుగ్గా సాగడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతుండగా.. కూలీలకు పనులు దొరకడం కష్టమైంది. ఈ నేపథ్యాన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఉపాధి హామీ (వీబీజీ రామ్జీ) పథకాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జల సంరక్షణ పనులను ముమ్మరం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 17 వేల మందికి పైగా కూలీలు పనులకు వస్తుండగా, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంవీబీజీ రామ్జీ ఇలా..జిల్లాలో జాబ్కార్డులు2,92,468పని పొందిన కుటుంబాలుపనిచేసిన కూలీలు1,70,689కూలీల సంఖ్య6,07,836జలసంరక్షణ.. ఉపాధి పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలను ఆదుకోవడం.. ఇంకోపక్క రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్ తరాలకు నీటి భద్రత, భూగర్భ జలాల పెంపుదల, సుస్థిర జల నిర్వహణే లక్ష్యంగా ‘జల్ సంచయ్ జన భాగీదారి’ నినాదంతో ఉపాధి పనులపై గ్రామసభల్లో చర్చించేలా అజెండా చేర్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత, ప్రజల భాగస్వామ్యం, తక్కువ వ్యయం ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో శాసీ్త్రయంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ నిధులే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, నాబార్డ్, సింగరేణి వంటి సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను సైతం ఇందుకోసం సమీకరిస్తున్నారు. ప్రతీ గ్రామంలో చెక్డ్యామ్ ఏటా వ్యవసాయ సీజన్ ముగిశాక వేసవిలో చేపట్టే ఉపాధి పనులతో కూలీలకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ అయినా ఎల్నినో ప్రభావం కారణంగా కూలీలకు పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం ‘జల్ సంచయ్ జన భాగీదారి’ ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయతీలో 200 ఇంకుడు గుంతలు, రైతులకు మేలు జరిగేలా ప్రతీ గ్రామంలో కనీసం 50 ఫామ్ పాండ్స్, కనీసం ఒక చెక్డ్యామ్ నిర్మించేందుకు నిర్ణయించారు. అంతేకాక వైరా, సత్తుపల్లి, కామేపల్లికి మండలానికి సరిహద్దుల్లో గుట్టలు ఉన్న ప్రాంతాల్లో ఎత్తు నుంచి కిందకు నీరు ప్రవహించేలా కొండ వాలుల్లో కందకాలు తవ్వడం, గతంలో నిర్మించిన జల సంరక్షణ పనుల నిర్వహణ, మరమ్మతులకు సిద్ధమవుతున్నారు. స్ఫూర్తి నిండుగా.. లక్ష్యం దిశగా.. జల సంరక్షణలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో 5.61 లక్షల నీటి సంరక్షణ నిర్మాణాలను పూర్తి చేసి దేశంలోనే ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ కృషికి గాను రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు కేంద్రం నుంచి రూ. 2 కోట్ల మేర నగదు ప్రోత్సాహకాలు లభించాయి. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కింద భారీగా నీటి సంరక్షణ, వర్షపు నీటి రీచార్జ్ నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర జలశక్తి పోర్టల్లో నమోదు చేశారు. పనుల గుర్తింపు కోసం నిర్వహించే గ్రామసభల్లో ప్రజల్లో బాధ్యత పెంచేలా ‘జల సంరక్షణ – మన సంరక్షణ’ పేరుతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.వర్షాభావంతో ముందుకు సాగని వ్యవసాయం ఉపాధి పథకం కింద చేపడుతున్న జల సంరక్షణ పనులకు ప్రస్తుతం కూలీలు ఎక్కువగా హాజరవుతున్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరం జూన్లో 3,99,334 మంది కూలీలు హాజరైతే... ఈ జూన్లో 10,45,333 మంది హాజరుకావడం పనుల కొరతను తెలియచేస్తోంది. సహజంగా జూలైలో అత్యధిక వర్షాలు కురిసి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఈ నేపథ్యాన ఉపాధి పనుల అవసరం కూలీలకు ఉండదు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో ఉపాధి పనులకు రోజుకు 17 వేల మంది చొప్పున హాజరవుతున్నారు. అంటే జూలై ముగిసే వరకు 5.10 లక్షల మంది పని చేసినట్లవుతుంది. ఈక్రమాన కూలీలను ఉపాధి పనులు ఆదుకుంటుండగా.. రైతుల కోసం భూగర్భ జలాలు పెంచేందుకు ‘జల్ సంచయ్ జన భాగీదారి’ పథకం దారి చూపినట్లు అవుతుంది. -
డీసీసీబీకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పనితీరుకు గుర్తింపు లభించింది. నాబార్డ్ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘ఉత్తమ పనితీరు’ అవార్డును ప్రభుత్వ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.దానకిషోర్ చేతుల మీదుగా సీఈఓ ఎన్.వెంకట్ఆదిత్య అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.3,460 కోట్లుగా ఉన్న డీసీసీబీ లావాదేవీలు 2025–26లో రూ.4,338 కోట్లకు పెరిగాయి. అంతేకాక రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ రూ. 2,995 కోట్ల రుణాలు జారీ చేశారు. వ్యవసాయ అవసరాలకే కాక రైతుల పిల్లలకు విద్యా రుణాలు, స్వయం సహాయక బృందాలు, చిరు వ్యాపారులు కూడా బ్యాంకు రుణాలను అందిస్తోంది., గ్రామీణ ప్రాంతంలో రైతులు, వివిధ వర్గాల ప్రజలకు అందిస్తున్న సేవలను నాబార్డ్ గుర్తించి ఖమ్మం డీసీసీబీకి అవార్డు ప్రకటించింది. బ్యాంకు పాలక మండలి, అధికారులు, ఉద్యోగులు, పీఏసీఎస్ల సమష్టి కృషి ఫలితంగానే ఈ అవార్డు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) బి.ఉదయ్భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.‘ఉత్తమ పనితీరు’ అవార్డుకు ఎంపిక -
మాది దృఢ సంకల్పం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను ఈ విడతలోనే పూర్తి చేసేలా దృఢ సంకల్పంతో ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనులను గురువారం పరిశీలించారు. అనంతరం అధికారులతో టన్నెల్ పురోగతి, భూసేకరణ, నిధులపై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేందుకు ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రూపొందించగా.. అప్పట్లోనే 60 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. కేవలం రూ.1,500 కోట్లతో ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ పక్కనపెట్టి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి.. దోపిడీ కోసం అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.24 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. తిరిగి తాము అధికారంలోకి వచ్చాక రైతుల ప్రయోజనాల కోసం సీతారామ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రూ.100కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మించి ఎన్నెస్పీ కెనాల్, వైరా రిజర్వాయర్లకు అనుసంధానించామని చెప్పారు. పాలేరు రిజర్వాయర్కు వెళ్లే ఏన్కూరు టన్నెల్ పనులు వేగంగా చేపట్టి మున్నేరు నదిని లింక్ చేయడం ద్వారా పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లను నింపనున్నట్లు వివరించారు. తద్వారా సత్తుపల్లి, పరిసర ప్రాంతాల రైతులకు త్వరగా సాగు అందుతుందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.వేయి కోట్ల బిల్లులు విడుదల చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, భూసేకరణ కోసం దాదాపు రూ.135 కోట్లు అవసరమని అధికారులు తెలపగా... తక్షణమే క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. నీళ్ల కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నందున ఆ నీరు వృథా కావొద్దన్నదే తమ లక్ష్యమని భట్టి తెలిపారు. భూసేకరణకు ప్రాధాన్యత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంతోపాటు ఇతర నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ నిధులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు మొత్తం నిధులు విడుదల చేస్తూనే, పెండింగ్లో ఉన్న బిల్లులు 50 శాతం విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాం నుంచే ఎన్జీటీ కేసు ఉందని వెల్లడించిన ఆయన ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లేదంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా న్యాయపోరాటం చేసి కేంద్రం నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటామని చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి 67 టీఎంసీల నీటి కేటాయింపులు తమ ప్రభుత్వమే సాధించిందని తెలిపారు. చట్టపరమైన సమస్యలను పరిష్కరించి సీతమ్మ సాగర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు.సీతారామ భూసేకరణకు తక్షణమే రూ.135 కోట్లు రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం భేషజాలకు పోకుండా సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేస్తోందని వివరించారు. ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ ప్రాజెక్టు పరిధిలో సాధ్యమైనంత మేర ఆయకట్టుకు ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర, అంకిత్, పోలీస్ కమిషనర్ సునీల్దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగులు, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కల్లూరు ఏసీపీ వసుంధర, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ వి.మోహన్రావు, ఇరిగేషన్ సీఈలు శ్రీనివాసరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ యుగంధర్రావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసచారి, డీపీఓ రాంబాబు, సీపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపుల పరిధి గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద గురువారం విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఆరెంపులకు చెందిన మేడా రవీందర్(45) స్తంభంపై మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ గురై కిందపడగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనను విద్యుత్ శాఖ అధికారులు పనుల కోసం తీసుకొచ్చారని, సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈమేరకు పోలీసులు చేరుకుని నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, రవీందర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.మృతదేహంతో స్థానికుల ఆందోళన -
మెడికల్ కాలేజీకి శరీరదానం
సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం వీఎం. బంజరకు చెందిన నాగుబండి సుశీల అనారోగ్యంతో మృతి చెందారు. ఈమేరకు లయన్స్ క్లబ్ బాధ్యులు అవగాహన కల్పించడంతో సుశీల భౌతికదేహాన్ని ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలకు అప్పగించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. క్లబ్ బాధ్యులు, సంఘాల నాయకులు అబ్దుల్ సలాం, శ్రీధరాల సుబ్బారావు, మిట్టపల్లి శ్రీధర్, సాంబశివరావు, మిట్టపల్లి నరేంద్ర, ప్రభాకర్రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, పెనుగొండ రమేష్, చల్లగుండ్ల అప్పారావు, రమేష్, మిట్టపల్లి నరేంద్రకుమార్, సుశీల కుమారుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన మాజీ ప్రజాప్రతినిధిఖమ్మం అర్బన్: ఖమ్మం రామన్నపేట శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్, ఖమ్మం అర్బన్ పోలీసులు గురువారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఓ మాజీ ప్రజాప్రతినిధితో పాటు 10మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి రూ.31వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరగగా, పోలీసులు రూ.31 వేలేనని వెల్లడించడం గమనార్హం. ఇక పట్టుబడిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. -
రైల్వే డబ్లింగ్ లైన్ పనుల పరిశీలన
కారేపల్లి: డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ వరకు రైల్వే డబ్లింగ్ లై నిర్మాణ పనులు కారేపల్లి మండలంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గాదెపాడు గ్రామ పంచాయతీ చర్లపల్లి, గాదెపాడు, ఒడ్డుగూడెం గ్రామాల మధ్య పనులను రైల్వే ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు గురువారం పరిశీలించారు. కాగా, సర్వే నంబర్ 67లో రిజర్వుడ్ ఫారెస్టు భూమి ఉందని అటవీ అధికారులు వివరించారు. అలాగే, చర్లపల్లి, గాదెపాడు, ఒడ్డుగూడెం గ్రామాల పోడు రైతులు కూడా లైన్ నిర్మాణంతో తాము ఆధారం కోల్పోతున్నందున పరిహారం చెల్లించాలని కోరారు. కాగా, గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్కుమార్ భూనిర్వాసితుల సమస్యను వైరా ఎమ్మెల్యే రాందాస్కు ఫోన్లో వివరించగా.. ఆయన రైల్వే, రెవెన్యూ అధికారులతో మాట్లాడి నిర్వాసితులకు న్యాయం చేయాలని సూచించారు. ఎన్ఐఎస్లో కబడ్డీ శిక్షణకు జిల్లా క్రీడాకారిణి ఖమ్మం స్పోర్ట్స్: ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఎన్ఐఎస్)లో కబడ్డీ శిక్షణకు ఖమ్మం క్రీడాకారిణి సిల్వేరు పూజిత ఎంపికై ంది. ఈ ఏడాది ఆమె ఎన్ఐఎస్ బెంగళూరు సెంటర్లో శిక్షణ పొందనుంది. ఇప్పటికే పలు జాతీయ టోర్నీలో రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన పూజిత ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా ఆమెను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు దయాకర్రెడ్డి, కె.క్రిస్టోఫర్బాబు, కోచ్లు శివజ్యోతి, రామలక్ష్మణ్ అభినందించారు. -
జనగణన సన్నాహాలపై సమీక్ష
ఖమ్మంమయూరిసెంటర్: జనగణనకు సంబంధించి ప్రత్యేక క్వశ్చనీర్ (ప్రశ్నాపత్రం) సెప్టెంబర్ మొదటి వారంలోగా వచ్చే అవకాశం ఉందని సెన్సెస్ విభాగం జాయింట్ డైరెక్టర్ రఘు వెల్లడించారు. ఈమేరకు గురువారం ఆయన ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలిసి జనగణన ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించి, సెన్సెస్ సామగ్రి అందజేశారు. అనంతరం జేడీ ఉద్యోగులతో సమావేశమై సూచనలు చేశారు. ప్రశ్నాపత్రం వచ్చేలోగా పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని తెలిపారు. రాష్ట్రాల వారీగా వేర్వేరు ప్రశ్నలతో క్వశ్చనీర్ సిద్ధమవుతోందని తెలిపారు. కేఎంసీ పరిధిలో లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో గణన చేపట్టాలని సూచించారు. -
సమ సమాజ స్థాపన కోసం పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: సమసమాజ స్థాపన కోసం రాయల చంద్రశేఖర్ స్ఫూర్తితో యువత, ప్రజలు పోరాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ కేంద్ర కమిటీ నాయకులు కే.జీ.రామచందర్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చెల రంగయ్య అధ్యక్షతన జరిగిన రాయల రెండో వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న దోపిడీ, అవినీతి, అక్రమాలు, నిరుద్యోగానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలు అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పుష్కరకాలం గడిచినా పెట్టుబడిదారీ వర్గాల దోపిడీపై ప్రధాని నోరు మెదపడం లేదని ఆరోపించారు. కాగా, రాయల చంద్రశేఖర్ అజ్ఞాత జీవితంలో ప్రతిఘటన పోరాట యోధుడిగా విప్లవ ప్రస్తానాన్ని కొనసాగించారని తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె.రమ, జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు చంద్ర అరుణ, పాయం చిన్న చంద్రన్న తదితరులు మాట్లాడుతూ రాయల పార్టీ చేస్తున్న విప్లవ కార్యాచరణ సరైన ఫలితాలను ఇస్తుందా లేదా అని నిరంతరం సృజన శీలంగా ఆలోచించేవారని తెలిపారు. నాయకులు ముద్దా బిక్షం, నాయని రాజు, కొత్తపల్లి రవి, ఆవుల వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, జి రామయ్య, ఆవుల అశోక్, బందెల వెంకయ్య, రేపాకుల శివలింగం, టి.ఝాన్సీ తదితరులతో పాటు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు గడ్డం లక్ష్మణ్, యోగానందం, కంకణాల శ్రీనివాస్, ప్రభు, పేరాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.మాస్లైన్ కేంద్ర నాయకుడు కే.జీ.రామచందర్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కల్లూరురూరల్: కల్లూరు ఎన్నెస్పీ క్రాస్ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు మెరుగు గోపి(25) బుధవారం అర్ధరాత్రి చేపల చెరువు వద్దకు వెళ్లి తిరిగి బైక్పై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమాన ఎన్నెస్పీ క్రాస్రోడ్డులో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్ట గా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ప్రమాదం అనంతరం లారీని అక్కడే నిలపగా గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో లారీని స్టేషన్కు తరలించి, గోపి తండ్రి వెంకటస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. బస్సు ఢీకొని ఉపాధ్యాయురాలు... ఖమ్మంక్రైం: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు మృతి చెందింది. ఖమ్మం న్యూఇరా స్కూల్ ఉపాధ్యాయురాలు షేక్ రెహానా(35) రోజులాగే గురువారం అజీజ్ గల్లీ నుంచి స్కూటీపై పాఠశాలకు బయలుదేరింది. ఈమేరకు కాంగ్రెస్ కార్యాలయం సమీపాన పాత బస్టాండ్ నుంచి బోనకల్ వెళ్లే ఆర్టీ బస్సు ఢీకొట్టింది. ఈ సమయాన డ్రైవర్ లోయ గురవయ్య అతి వేగంగా, అజాగ్రత్తగా బస్సు నడిపినట్లు తెలిసింది. ఈమేరకు రెహానా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త అజీముద్దీన్ కేఎంసీలో పనిచేస్తుండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటివరకు కుటుంబంతో గడిపిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియగానే భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. రైలు నుంచి జారిపడి యువకుడు... కేసముద్రం: వేగంగా వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడిన ఓ యువకుడు మృతి చెందాడు. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాలు.... ఖమ్మం ప్రకాష్నగర్కు చెందిన చెక్కల మణికంఠ(25) అదే ప్రాంతానికి చెందిన బండారి జగదీష్, కళ్యాణ్కుమార్, కోరెడ్డి లక్ష్మారెడ్డితో కలిసి హైదరాబాద్లోని చుక్కగూడలో కూలి పనులకు వెళ్లాడు. ఆ పనులకు సంబంధించి నగదు కోసం వారంతా గురువారం హైదరాబాద్ వెళ్లే ఈస్ట్కోస్ట్ రైలులో బయలుదేరారు. రైలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం – ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఉండగా మణికంఠ ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు జీఆర్పీ సిబ్బంది మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించికుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చోరీ కేసులో మూడేళ్ల జైలు శిక్ష ఖమ్మం లీగల్: చోరీ కేసులో ఖమ్మం పాండురంగాపురానికి చెందిన ఈదర బోయిన సుమన్కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి అరవ ప్రవీణ్ గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం జూబ్లీపురకు చెందిన పెనుగొండ లక్ష్మీకాంతం ఈ ఏడాది మే 4న రాత్రి 9–30 షాపు నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఎదురుగా వచ్చి మెడలోని రూ.3.60లక్షల విలువైన నానుతాడు లాక్కొని పారిపోయాడు. ఘటనపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి సుమన్ను నిందితుడిగా గుర్తించారు. ఆయనను అరెస్టు చేసి కోర్టులో చార్జి షీటు దాఖలు చేయగా విచారణ అనంతరం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 13 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం ముదిగొండ: మండలంలో ని పెద్దమండవ, గంధసిరి మున్నేటి నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో గురువారం ముదిగొండ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ అశోక్, సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను సీజ్ చేశారు. గంధసిరి మున్నేరు నుంచి ఇసుక తరలించే నాలుగు, పెద్దమండవ మున్నేరు నుంచి ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవరుల, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
చుక్కాచుక్కా ఒడిసిపట్టేలా..
ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నినోను సమర్థవంతంగా ఎదుర్కోవడం, భవిష్యత్ తరాలకు నీటి కరువు రాకుండా అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యాన ‘క్యాచ్ ది రెయిన్ – సేవ్ ఎవ్రీ డ్రాప్’ మహోద్యమం మొదలైంది. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికారులు ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టడం, భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. నిస్సారమవుతున్న భూగర్భ జల వనరులను పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ‘నీటి సంరక్షణ – అందరి బాధ్యత’ అంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అంతేకాక ఇళ్లు, అపార్ట్మెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను తప్పక ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. సమగ్ర అవగాహన.. ప్రతీ పౌరుడికి వర్షపు నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించేలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఉద్యోగులు జల సంరక్షణ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. అధికారులను, సిబ్బంది క్రియాశీలకంగా పాల్గొంటూ అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటును తప్పనిసరి చేయ డం, పాత భవనాల్లోనూ ఏర్పాట్లు చేసేలా యజమానులను ప్రోత్సహిస్తున్నారు. శాసీ్త్రయ పద్ధతిలో నిర్మాణం వర్షపు నీటి సేకరణ గుంతల నిర్మాణం శాసీ్త్రయ పద్ధతిలో జరిగితే మేలు కలుగుతుంది. భవనాల పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీటిని పైపుల ద్వారా క్రమపద్ధతిలో ఇంకుడు గుంతకు అనుసంధానించాలి. ఈ గుంతలో పొరలుగా ఉండే పదార్థాలు నీటిని సహజ సిద్ధంగా వడపోసి భూమిలోకి పంపుతాయి. ఇందులోని పై పొర నీరు సులభంగా లోపలికి వెళ్లేందుకు వీలు కల్పించనుండగా, గులకరాళ్లు పెద్ద వ్యర్థాలు, ఆకులను ఆపేస్తాయి. అలాగే, కంకర ద్వితీయ శ్రేణి వడపోతగా పనిచేయనుండగా, ఇసుక సూక్ష్మ ధూళి కణాలను నిరోధించి స్వచ్ఛమైన నీటిని భూమికి అందిస్తుంది. ఇక బరువైన కంకర పునాది పొరగా ఉండి నీటిని వేగంగా భూగర్భంలోకి రీచార్జ్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ జల రక్షకులు కావాలి.. ‘మనం దాచే ప్రతీ వర్షపు చుక్కా నీరు మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల జీవనాధారం‘ అని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ‘ప్రతీ ఇంటి పైకప్పు ఒక నీటి వనరు – ప్రతీ పౌరుడూ జల సంరక్షకుడు’ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంటింటా ఇంకుడు గుంతను నిర్మిస్తే జల భద్రతకు బాటలు పడతాయని చెబుతున్నారు. జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు Pledge.Mygov.in వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయొచ్చని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.వర్షపు నీరు వృథా కాకుండా భూమి పొరల్లోకి చేరిస్తే బోరుబావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. ఎండాకాలంలో వచ్చే నీటి కొరతను అధిగమించి, సుస్థిరమైన నీటి లభ్యత సాధించొచ్చు. కుండపోత వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా, డ్రెయినేజీల ఒత్తిడి తగ్గించి పట్టణ ప్రాంతాల్లో వరద ముప్పుకు అడ్డుకట్ట వేయొచ్చు. బాహ్య నీటి సరఫరా వనరులపై ఆధారపడడం తగ్గడం వల్ల మున్సిపల్, వ్యక్తిగత నీటి బిల్లులు గణనీయంగా తగ్గుతాయి. -
సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి
ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఆస్పత్రుల డేటా ఎంట్రీ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని సంఘం ప్రతినిధులు గురువారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ 18ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేనందున కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించి, ఐఎఫ్ఎమ్ఎస్ ద్వారా వేతనాలు చెల్లిండమే కాక పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయాలని కోరారు. అంతేకాక గత 10–12 నెలలుగా పెండింగ్ వేనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వినయ్భాస్కర్, జి.సుధాకర్తో పాఉ నిఖిలేష్, రఘురామ్, నిరంజన్, నాగేష్, బాలు, కృష్ణ, సమత, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రవాహం సాఫీగా సాగేలా...
● ఆకేరు అక్విడెక్ట్లో బండరాళ్ల తొలగింపు ● మంత్రి పొంగులేటి ఆదేశాలతో ముమ్మరంగా పనులుతిరుమలాయపాలెం: ఏటా వర్షాకాలంలో ఆకేరు ప్రవాహం వస్తుందంటే మండలంలోని రాకాసి తండా వాసుల్లో ఆందోళన మొదలవుతుంది. 2024 సెప్టెంబర్ 1న భారీ వర్షాలతో వచ్చిన వరదలు తండాను ముంచెత్తాయి. అయితే, సీతారామ ప్రాజెక్టులో భాగమైన అక్విడెక్ట్ నిర్మాణం సందర్భంగా కాంట్రాక్టర్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమని రాకాసితండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పు మరోమారు ఎదురుకాకుండా అక్విడెక్ట్లో అడ్డుగా ఉన్న గుట్టలు, బండరాళ్ల తొలగింపు పనులు మొదలవడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సాక్షి’లో కథనం.. మంత్రి ఆదేశాలు అక్విడెక్ట్లో అడ్డుగా గుట్టలు ఉండడంతో ఆకేరు ప్రవాహం సాఫీగా సాగక రాకాసి తండాను ముంచెత్తినట్లు గుర్తించారు. ఈ విషయమై గత ఏడాది ఆగస్టు 13న ‘అక్విటెక్ట్కు అడ్డుగా గుట్టలు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా, అదేరోజు అప్పటి కలెక్టర్ అనుదీప్ పరిశీలించి అక్విటెక్ట్ ఖానా(నీరు వెళ్లే మార్గం)లకు అడ్డుగా ఉన్న గుట్టలను తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ఇటీవల తిరుమలాయపాలెంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్లో కూడా రాకాసితండా వాసులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కాంట్రాక్టర్ సమీపాన రైతులతో మాట్లాడి ఏడు నెలల్లో భూములకు ప్రభుత్వ పరిహారం అందేలా చూస్తానని చెప్పడమే కాక ప్రస్తుతం పంట నష్టపోయినందుకు కౌలు చెల్లించేందుకు అంగీకరించి పనులకు ఒప్పించాడు. ఈమేరకు అక్విటెక్ట్లోని 11 ఖానాలకు అడ్డుగా గుట్టలు, బండరాళ్లను తొలగింపున పనులు పొక్లెయినర్లు, డంపర్లతో చేయిస్తున్నారు. ఐదు రోజులుగా జరుగుతున్న ఈ పనులు మరో వారంలోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్రెడ్డి తెలిపారు.అక్విటెక్ట్ ఖానాల వద్ద పెద్దపెద్ద బండరాళ్లు అడ్డుగా ఉండడంతో ఆకేరు వరద వెళ్లే మార్గం లేక మా తండాను ముంచెత్తుతోంది. ఈ విషయమై ఇటీవల ప్రజాదర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివారెడ్డికి ఫిర్యాదు చేశాం. దీంతో గుట్టలు, బండరాళ్లు తొలగింపు చేపడుతుండడంతో ఆనందంగా ఉంది. ఈ పనులు పూర్తయితే ఆకేరు వరద నుంచి మా గ్రామానికి కొంత రక్షణ లభిస్తుంది. – భూక్యా దేశ్యా, రైతు, రాకాసితండా -
నైపుణ్యాల పెంపుతోనే అవకాశాలు
మధిర: యువత అందుబాటులో ఉన్న వనరుల ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే మెరుగైన అవకాశాలు లభిస్తాయని ‘మై భారత్’ పోర్టల్ జిల్లా ఇన్చార్జ్ ఎం.రాంబాబు తెలిపారు. మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన ‘యువతకు అందుబాటులో ఉన్న అవకాశాలు’ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో రాంబాబు మై భారత్ పోర్టల్లో నమోదు, తద్వారా లభించే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను వివరించారు. పోటీ ప్రపంచంలో చదువుకుంటూనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు సాధిస్తే విజయం సొంతమవుతుందని తెలిపారు. ఈమేరకు విద్యార్థులు పోర్టల్లో నమోదు చేసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ అరుణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.సుజాత, అధ్యాపకులు డాక్టర్ ఇందిర, పి.శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. నేటి నుంచి నేత్ర వైద్య నిపుణుల రాష్ట్రస్థాయి సదస్సు ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని మమత వైద్య కళాశాలలో శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు 11వ రాష్ట్ర స్థాయి నేత్ర వైద్య నిపుణుల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశాలే కాక రాష్ట్రంలోని పలువురు నేత్ర వైద్య నిపుణులు సమారు 800మంది పాల్గొని ఆధునిక చికిత్స పద్ధతులు, అత్యాధునిక పరికరాల వినియోగంపై చర్చిస్తారని డాక్టర్ రెండుచింతల రాధాకృష్ణ తెలిపారు. అంతేకాక 70 కంపెనీల నేత్ర వైద్య పరికరాలు ప్రదర్శనలో ఉంటాయని వెల్లడించారు. నేత్ర వైద్య నిపుణుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విజయ్కుమార్, ప్రవీణ్తో పాటు రవీంద్ర, లావణ్య, సాహితి, సత్యనారాయణమూర్తి, రామకోటయ్య తదితరులు పాల్గొంటారని తెలిపారు. పట్టుదలతో చదివితే విజయం కారేపల్లి: విద్యార్థి దశలోనే లక్ష్యాలు ఎంచుకుని పట్టుదలతో చదివితే విజయాలు సొంతమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.సదానందం తెలిపారు. కారేపల్లి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని గురువారం తనిఖీ చేసిన ఆయన 10వ తరగతి విద్యార్థినుల సామర్థ్యాలను పరీక్షించారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం తదతర అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. అలాగే, యూనిఫాం కుడుతున్న వారితో మాట్లాడారు. సీఎంఓ బి.ప్రవీణ్కుమార్, సీఆర్టీలు సమీనా, ఝాన్సీ, ఉద్యోగులు పాల్గొన్నారు. ‘మేరా యువ భారత్’లో వలంటీర్ల నియామకం ఖమ్మం రాపర్తినగర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన మేరా యువభారత్(మై భారత్)లో యువ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో యువజన సంఘాల నిర్మాణం కోసం ఈ వలంటీర్లు కృషి చేయాల్సి ఉంటుందని మేరా యువ భారత్ అధికారి ఎం.వీ.రాంబాబు తెలిపారు. ప్రతీ గ్రామంలో యువజన సంఘాల ఏర్పాటుకు గాను 18 – 29ఏళ్ల వయసు కలిగి, కనీసం పదో తరగతి విద్యార్హత ఉండడమేకాక సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు అర్హులని వెల్లడించారు. ఈనెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిౖకైన వారు గౌరవ వేతనంతో రెండేళ్లు వలంటీర్గా కొనసాగే అవకాశముందని తెలిపారు. వివరాలకు 91773 29258 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మిగిలిన సీట్ల భర్తీకి రేపు కౌన్సెలింగ్ ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి శనివారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఐదో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్, ఇతర పత్రాలతో రఘునాథపాలెంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్(బాలుర)లో 18న ఉదయం 10గంటలకు మొదలయ్యే కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆర్సీఓ రాంబాబు సూచించారు. -
తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత
● సీజనల్ వ్యాధుల కట్టడిపై దృష్టి ● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఖమ్మం సహకారనగర్: ఎక్కడా ఇబ్బంది రాకుండా తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల కట్టడితో పాటు విద్యాశాఖ, ఎల్నినో పరిస్థితులపై హైదరాబాద్ నుంచి గురువారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీకి సత్తుపల్లి తహసీల్ నుంచికలెక్టర్ దివాకర టీ.ఎస్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమబద్ధీకరించాలని సూచించారు. అలాగే, వ్యాధులు ప్రబలకుండా ప్రతీ శుక్రవారం అన్ని గ్రామాలు, పట్టణా ల్లో డ్రైడే నిర్వహించాలని తెలిపారు. కాగా, ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి ఒక జత యూనిఫామ్ సమకూర్చాలని పేర్కొన్నారు. ఇక ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పొరపాట్లు లేకుండా భూముల రీసర్వే భూభారతి చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. సత్తుపల్లి తహసీల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్యాదవ్తో కలిసి ఆయన సర్వేయర్లు, గ్రామ పాలన అధికారులు, రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ఉద్దేశం భూమిని విభజించడం కాదని తెలిపారు. భూమిని ఎవరు సాగు చేస్తున్నారు, వారి పేరిట ఎంత భూమి ఉంది, పాస్ ఉందా, లేదా అనేది నిర్ధారించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. ఎక్కువ లేదా తక్కువ విస్తీర్ణం నమోదైతే, అందుకు కారణాలను పరిశీలించి ధ్రువీకరించాలని తెలిపారు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో సర్వే పూర్తికాగా, కుటుంబ వివాదాలు మినహా పెద్దగా అభ్యంతరాలు రాలేదని చెప్పారు. ఈసమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్, సత్తుపల్లి తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
కాలేజీల్లో సీట్లు ఖాళీ
● ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు అంతంతే.. ● 6,986 సీట్లకు 2,699 మాత్రమే భర్తీఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు కల్పిస్తూ అవసరమైన మేర అధ్యాపకులను నియమించింది. అంతేకాక ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రకటించినా విద్యార్థుల నుంచి నామమాత్రపు స్పందనే లభించింది. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సీట్లు భర్తీ కాలేదు. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం సీట్లు 6,986 ఉండగా.. 2,699 మంది మాత్రమే ప్రవేశాలు పొందడం గమనార్హం. సౌకర్యాలు ఉన్నా... దాదాపు అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సరిపడా భవనాలు ఉన్నాయి. అవసరమైన చోట్ల మరమ్మతులు చేయించిసౌకర్యాలు కల్పించారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, అందించడమే కాక వివిధ విభాగాల్లో అధ్యాపకుల నియామకం చేపట్టారు. అయినా ప్రవేశాలు ఏటా మాదిరిగానే ఈసారి కూడా నామమాత్రంగానే నమోదయ్యాయి. కనీసం సగం సీట్లు కూడా భర్తీ కాకపోవడంతో ఎక్కడ లోపం ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. అధ్యాపకులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నా గత నాలుగేళ్ల నుంచి సీట్లు సరైన స్థాయిలో భర్తీ కావడం లేదు. ఈ ఏడాది కొత్తగా విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రకటించినా ఆశించిన ఫలితం దక్కలేదు.జిల్లాలో 21కాలేజీలు ఉండగా, ఖమ్మంలోని ఏఎస్ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో 488 సీట్లకు గాను అత్యధికంగా 420 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇక వేంసూరు మండలం కందుకూరు జూనియర్ కళాశాలలో 176 సీట్లకు కేవలం 12 మందే చేరారు. అలాగే, బనిగండ్లపాడు కాలేజీలో 85 సీట్లకు 14 మంది, నేలకొండపల్లి కాలేజీలో 320 సీట్లకు 29 మంది ఇప్పటివరకు చేరారు. మిగతా కాలేజీల్లోనూ ప్రథమ సంవత్సరం సీట్లు సగం కూడా భర్తీ కాలేదు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఈసారి 30 శాతం ప్రవేశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రిన్సిపాళ్లు, సిబ్బందితో సమీక్షించాం. దీంతో కొంత మేర ఫలితం వచ్చింది. ఇంకొన్ని సీట్లు కూడా త్వరలో భర్తీ అయ్యే అవకాశముంది. – రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం -
వైరా మున్సిపాలిటీలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం?
వైరా: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కొంతకాలంగా ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం చేయడం, ఏకంగా చైర్ పర్సన్ చాంబర్లో కూర్చుని ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడమే కాక ఉద్యోగులకు ఆదేశా లు జారీ చేస్తున్నారని వైస్ చైర్మన్ కట్ల సంతోష్ ఆరోపించారు. ఆయన బుధవారం కమిషనర్ ఎం.రామచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలి టీ కార్మికులకు చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ భర్త కాపా మురళీకృష్ణ విధులు కేటాయిస్తున్నారని, అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అందులో పేర్కొన్నారు. అంతేకాక చైర్పర్సన్ చాంబర్లో గంటల కొద్ది కూర్చుని సిబ్బంది విధులకు ఇబ్బంది కలిగిస్తూ, ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టులో వివాదం.. ఇటీవల మున్సిపాలిటీలో మరుగుదొడ్లు శుభ్రం చేసే కాంట్రాక్టు స్థానికులకు కాకుండా ఏపీలోని చింతలపూడి ప్రాంతానికి చెందిన వారికి చైర్పర్సన్ భర్త మురళీకృష్ణ ఇప్పించినట్లు తెలిసింది. ఈ క్రమాన చైర్పర్సన్ భర్త – వైస్ చైర్మన్ సంతోష్ మధ్య వాగ్వాదం జరగగా, వైస్ చైర్మన్పై పరుష పదజాలంతో మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనతో కొన్నాళ్లుగా ఉన్న విభేదాలు తీవ్రరూపం దాల్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయమై చైర్పర్సన్ భర్త మురళీకృష్ణ మాత్రం మున్సిపాలిటీలో తన పెత్తనం ఏమీ లేదని, ఎవరితో విభేదాలు లేవని పేర్కొనడం గమనార్హం. చైర్పర్సన్ భర్తపై వైస్ చైర్మన్ ఫిర్యాదు -
విద్యార్థిని చితకబాదిన పీఈటీ
కొణిజర్ల: మండలంలోని అమ్మపాలెంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల పీఈటీ భాస్కర్ తమ కుమారుడిని చితకబాదడమే కాక ప్రిన్సిపాల్తో టీసీ ఇప్పించాడని బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు పాఠశాల వద్ద బుధవారం నిరసన తెలిపారు. కొణిజర్లకు చెందిన చింతల ఉదయ్కిరణ్ గురుకులంలో 9వ తరగతి చదువుతుండగా, క్రమశిక్షణ లేదని పీఈటీ భాస్కర్ ఇటీవల కర్రతో కొట్టగా వీపుపై వాతలు తేలాయి. ఈ సమయాన ఉదయ్కిరణ్, ఆయన సోదరుడు ఈశ్వర్ మణికంఠ అడ్డుకోబోగా ఇద్దరికి క్రమశిక్షణ లేదని టీసీలు ఇస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో బుధవారం ఉదయ్కిరణ్ తండ్రి ఎల్లిబాబు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకుడు సూరంపల్లి రామారావు ఆధ్వర్యాన పాఠశాలకు వచ్చి పీఈటీ భాస్కర్ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. సుమారు 3 గంటల పాటు పాఠశాల ఎదుట బైఠాయించడంతో ప్రిన్సిపాల్ నాగమణి ఇచ్చిన సమాచారం మేరకు ఆర్సీఓ పాఠశాలకు చేరుకున్నారు. పీఈటీని కూసుమంచికి బదిలీ చేస్తున్నట్లు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. స్థానికుల ఆందోళనతో బదిలీ -
అర్హులైన ఓటర్లకు జాబితాలో స్థానం
● వివరాల్లో తేడా ఉన్నా.. నమోదు చేయకున్నా విచారిస్తాం ● పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ దివాకర ఖమ్మం సహకారనగర్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతీ ఓటరుకు జాబితాలో స్థానం కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం కాగా, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ‘సర్’ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే అనంతరం పోలింగ్ కేంద్రాలు క్రమబద్ధీకరించాక ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాక తుది ఓటరు జాబితా విడుదల అవుతుందని చెప్పారు. జిల్లాలో 1,460 పోలింగ్ స్టేషన్లు, 12,43,781 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 8,48,491 మంది(68.22శాతం) ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజ్ చేశామని తెలిపారు. డిజిటలైజ్ చేసిన వారిలో సుమారు 72 వేల మందికి సంబంధించి అభ్యంతరాలను రెండు నెలల్లో విచారణ ద్వారా పరిష్కరిస్తామన్నారు. మరో 25 వేల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినా అవసరమైన వివరాలు నమోదు చేయకపోవడంతో మ్యాపింగ్ జరగలేదని తెలిపారు. డ్రాఫ్ట్ జాబితా విడుదలయ్యాక వీరికి నోటీసులు అందుతుతాయని వివరించారు. అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారం అందని ఓటర్లు ఆన్లైన్లో తీసుకోవాలని, లేకపోతే బీఎల్ఓను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎస్డీసీ సదానందం, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగం డీటీ అన్సారీ పాల్గొన్నారు. ఆన్లైన్లోనే ఇసుక బుకింగ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యాన జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులకు కావాల్సిన ఇసుక బుకింగ్ ఆన్లైన్లోనే జరగాలని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు ఎంత పరిమాణం ఇసుక, ఎక్కడ నుంచి తెప్పించారో నివేదిక సమర్పించాలని తెలిపారు. ఇసుకను టీజీఎండీసీ, స్యాండ్ బజార్, స్థానికంగా సమకూర్చుకుంటూ ఆన్లైన్లోనే బుక్ చేయాలని చెప్పారు. కాగా, రీచ్ల వారీగా వచ్చిన ఆదాయాన్ని నిబంధనల మేరకు గ్రామపంచాయతీకు పంపిణీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పీఆర్, ఆర్అండ్బీ ఎస్ఈలు వెంకట్రెడ్డి, యుగంధర్ రావు, టీజీఎండీసీ పీఓ జి.శంకర్, మైన్స్ ఏజీ ఏజీ ఏ.రమేష్, వివిధ శాఖల అధికారులు బుగ్గయ్య, ఉమామహేశ్వరరావు, మహేష్బాబు, రామకోటి, సూపరింటెండెంట్ శర్మ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న మున్సిపల్ కార్మికుడు మృతి
సత్తుపల్లిటౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మున్సిపల్ శానిటేషన్ కార్మి కుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై గాంధీనగర్కు చెందిన ఇనుపనూరి గుమ్మడయ్య (55) పని చేస్తున్నాడు. ఈ నెల 1న ఉదయం రింగ్ సెంటర్ వద్ద పారిశుద్ధ్య పనులు చేస్తున్న ఆయనను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ మేరకు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. గత 30 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, గుమ్మడయ్య మృతిపై మున్సిపల్ చైర్పర్సన్ ఎండీ రెహానా కమల్పాషా, కమిషనర్ నర్సింహ, ఉద్యోగులు, సిబ్బంది సంతాపం తెలిపారు. కుటుంబ కలహాలతో బలవన్మరణం కల్లూరురూరల్: కుటుంబ కలహాలు తట్టుకోలేక ఓ ఆశా కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని రఘునాథగూడెంకు చెందిన జానపాటి శారద (45) ఆశాకార్యకర్తగా పనిచేస్తోంది. తోటి కోడలు ద్వారక, మరిది భాస్కర్రావుతో జరిగిన గొడవల కారణంగా మనస్తాపానికి గురైనన శారద.. ఎక్కువ సంఖ్యలో మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరగా, కల్లూరు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఘటనపై ఆమె భర్త రామారావు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో గ్రామకార్యదర్శి? కారేపల్లి: మండలంలోని గంగారంతండా గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ బుధవారం ఉదయం మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు తెలిసింది. ఇదేమిటని సర్పంచ్ కిరణ్, గ్రామస్తులు నిలదీయగా ఆయన తాను మద్యం తాగలేదని.. కావాలని ఆరోపణలు చేస్తున్నారని వాగ్వాదానికి దిగాడు. దీంతో సర్పంచ్, స్థానికులు ఆయనను కారేపల్లి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా సిబ్బంది బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. సర్పంచ్ కిరణ్ ఘటనపై ఎంపీఓ మల్లేల రవీంద్రప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంపీఓ మాట్లాడుతూ.. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని తెలిపారు. -
20న జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి
● అంజనాపురంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీకొణిజర్ల: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 20వ తేదీన కొణిజర్ల మండలం అంజనాపురం రానున్నారు. ఇక్కడ గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయిల్పామ్ రైతులతో ముఖాముఖి మాట్లాడి.. ఇక్కడి నుంచే వైరా నియోజకవర్గ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనలకు శంకుస్థాపన చేసే అవకాశముంది. అలాగే, ఆయిల్పామ్ సీడ్ ప్లాంటేషన్ పనులు కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి 20వ తేదీన సీఎం రేవంత్రెడ్డి రానుండగా.. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్దత్ అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీ, పరిసరాలను బుధవారం పరిశీలించిన వారు అధికారులు, కంపెనీ ప్రతినిధులకు సూచనలు చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని.. ఈ కార్యక్రమానికి రైతులను కూడా ఆహ్వానిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చర్యలు తీసుకోవాలన్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, వైరా ఏసీపీ సారంగపాణి, కొణిజర్ల తహసీల్దార్ అరుణ, గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హమ్మయ్య.. ఊపిరి పీల్చుకోవచ్చు!
● జనరల్ ఆస్పత్రిలో బ్రాంకోస్కోపీ సేవలు ● అందుబాటులోకి రూ.18 లక్షల విలువైన అత్యాధునిక యంత్రంఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పలో బ్రాంకోస్కోపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం రూ.18 లక్షల విలువైన బ్రాంకోస్కోపీ యంత్రాన్ని ఆస్పత్రికి కేటాయించింది. ఊపిరితిత్తులకు సంబంధిత వ్యాధులు, టీబీ నిర్ధారణ, కఫం పరీక్షల కోసం ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఈమేరకు యంత్రాన్ని బుధవారం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ ప్రారంభించారు. పల్మనాలజీ వైద్యుడైన ఆయన స్వయంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మొదటి పరీక్ష చేశారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత.. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే ఉండే బ్రాంకోస్కోపీ సేవలు ప్రభుత్వ విభాగంలో హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనే మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే జిల్లా వాసులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో లేదా హైదరాబాద్లో పరీక్ష చేయించుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో ఆధునిక బ్రాంకోస్కోపీ యంత్రాన్ని సమకూర్చడంతో ఆర్థికంగా భారం తగ్గడమే కాక దూరాభారం తప్పనుంది. ఈ యంత్రం ద్వారా శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో బాగాన్ని స్పష్టంగా పరిశీలించొచ్చు. ఎండోస్కోపీ మాదిరిగానే కెమెరా, లైట్ ఉన్న సన్నటి గొట్టాన్ని రోగి ముక్కు, నోటి ద్వారా శ్వాసనాళాల్లోకి పంపించి స్క్రీన్పై పరిశీలిస్తూ వ్యాఽధి నిర్ధారిస్తారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు, కేన్సర్ ఉంటే గుర్తించడం సులువవుతుంది. అలాగే, చిన్నపిల్లలు చాక్పీసులు, ఇతర వస్తువులు మింగినా, ఆహారం తీసుకునేటప్పుడు ముళ్లు, ఎముకలు నోట్లోకి వెళ్లినా వాటిని తొలగించేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతుంది. అంతేకాక ఊపిరితిత్తుల కేన్సర్, క్షయ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి పరీక్షల కోసం నమూనాలను సేకరించవచ్చు. బ్రాంకోస్కోపీ మిషన్ ద్వారా వివిధ రకాల పరీక్షలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.15వేల నుంచి రూ.20వేలు అవుతుండగా.. ఇకపై పెద్దాస్పత్రిలో ఉచితంగా లభించనుంది. -
స్టాక్ లేదు.. మళ్లీ రండి!
● జిల్లాలో రెవెన్యూ స్టాంప్ల కొరత ● ఇదే అదునుగా రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయం ఖమ్మంగాంధీచౌక్: ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సరఫరా లేక రూ.1 రెవెన్యూ స్టాంపులకు కొరత ఏర్పడింది. పలు అవసరాలకు ఉపయోగపడే ఈ స్టాంప్లను రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తుంది. పోస్టాఫీసుల్లోనూ విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, ఉమ్మడి ఖమ్మంలోని పోస్టల్ డివిజన్ నుంచి ప్రతీ 20 రోజులకు 1.28 లక్షల స్టాంపులు కావాలని ఇండెంట్ పెట్టి, స్టాక్ వచ్చాక ప్రధాన, బ్రాంచ్ పోస్టాఫీసుల ద్వారా విక్రయిస్తుంటారు. కానీ ఇండెంట్ పెడుతున్నా ఆశించిన స్థాయిలో సరఫరా లేక పోస్టాఫీసుల్లో 15 రోజులుగా కొరత ఏర్పడగా ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేశారు. పలు అవసరాలకు తప్పనిసరి రూ.1 రెవెన్యూ స్టాంపులను కోర్టుల్లో అఫిడవిట్లు, న్యాయవాదులు పిటిషన్లు వేసేందుకు ఉపయోగిస్తారు. చిట్ఫండ్స్లో లావాదేవీలు, పలు రకాల పెన్షన్లు, అప్పులు, ప్రామిసరీ నోట్లపైనే కాక పలు ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాల జారీ సమయాన వినియోగిస్తారు. కానీ, ఈ స్టాంప్ల కొర త ఏర్పడడంతో కొందరు వ్యాపారులు తమ వద్ద స్టాక్ ఉన్న వాటిని ఏకంగా రూ.5 నుంచి 10 వరకు విక్రయిస్తున్నారు. కొరతను ముందే గుర్తించి కొంద రు వ్యాపారులు తపాలా ఉద్యోగులను మచ్చిక చేసు కుని ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లు సమాచారం. సరఫరా లేకే కొరత రెవెన్యూ స్టాంప్ల కొరతపై ఖమ్మం పోస్టల్ డివిజన్ వీరభద్రస్వామి వివరణ కోరగా.. ఇండెంట్లకు తగిన సరఫరా లేదని తెలిపారు. కొద్ది రోజులుగా ఇదే పరి స్థితి నెలకొదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్టాంప్లు సరఫరా అయ్యేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. -
నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన
ఖమ్మమంయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు మణుగూరుకు హెలీకాప్టర్లో చేరుకోనున్న వారు అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం ఆఫ్టేక్ పాయింట్ను పరి శీలించి పనులపై అధికారులతో సమీక్షిస్తారు. ఆతర్వాత సత్తుపల్లి మండలం యాతాలకుంటకు చేరుకుని టన్నెల్ నిర్మాణ పురోగతిని పరిశీలించి పనులు, భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఏర్పాట్ల పరిశీలన సత్తుపల్లి: సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మాణ పనులను గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పరిశీలించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లను కలెక్టర్ దివాకర, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆస్తుల రక్షణ, ప్రయాణికుల భద్రతే కీలకం ● ఆర్పీఎఫ్ ఐజీ అరోమాసింగ్ ఠాగూర్ ఖమ్మంక్రైం: రైల్వే ఆస్తులను పరిరక్షించడమే కాక ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలని ఆర్పీఎఫ్ ఐజీ అరోమాసింగ్ ఠాగూర్ సూచించారు. ఖమ్మం రైల్వేస్టేషన్లోని ఆర్పీఎఫ్ పోలీస్స్టేషన్ను ఐజీ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ టీవీ కంట్రోల్ రూమ్ పనితీరు, రికార్డులు, కేసుల విచారణ వివరాలు ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విధుల్లో ఆర్పీఎఫ్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూ రైల్వే ప్రయాణికులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు. తొలుత ఐజీకి సీఐ సురేష్గౌడ్ స్వాగతం పలకగా, సీనియర్ డివిజనల్ కమిషనర్ నవీన్కుమార్, జీఆర్పీ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఆరుతడి పంటలే సాగు చేయండి మధిర: ఎల్నినో పరిస్థితుల నేపథ్యాన ప్రస్తుత సీజన్లో తక్కువ కాల వ్యవధి, తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. మధిర మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించిన ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలుగా పెసర, మినుము, కంది, జొన్న, ఇతర చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వర్షాభావంతో భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉన్నందున వరి, మిర్చికి బదులు ఇతర ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచించారు. అంతేకాక ప్రభుత్వం వీబీజీ–రామ్ జీ పథకం ద్వారా పొలాల్లో ఫామ్ పాండ్స్(పంట కుంటలు) నిర్మాణానికి వంద శాతం రాయితీ ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్, ఏఈఓలు పాల్గొన్నారు. పోలీస్ డ్యూటీమీట్లో పతకాలు ఖమ్మంక్రైం: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో జిల్లా పోలీసులు పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో టాస్క్ఫోర్స్ సీఐ ఉదయ్కుమార్ రెండు బంగారు పతకాలు, కూసుమంచి ఎస్ఐ దివ్య కాంస్య పతకం, ఏఆర్ కానిస్టేబుల్ ఎం.మహేష్ కాంస్య పతకాలు సాధించగా సీపీ సునీల్దత్ అభినందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. -
పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యం
మధిర/ఎర్రుపాలెం: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా తొలగించే లక్ష్యంతో మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎంపీ లాడ్స్ నిధు లు రూ.60 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు మధిర మండలం మాటూరుపేట, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, మీనవోలు, తక్కెళ్లపాడు, ఇనగాలి, ఎర్రుపాలెం, రేమిడిచర్ల గ్రామాల్లో ఎంపీ నిధులతో నిర్మాణం పూర్తయిన 14 రహదారులను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తక్కెళ్లపాడు గ్రామంలోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవసరమైన అన్నిచోట్ల రోడ్లకు నిధులు కేటాయిస్తున్నానని చెప్పారు. కాగా, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇప్పించాలని పలువురు వినతిపత్రం ఇవ్వగా ఉన్నతాధికారులతో మాట్లాడతామని ఎంపీ తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు రాయబారపు పుల్లారావు, ముక్కర రామకృష్ణారెడ్డి, అనసూర్య, కోట కన్నమ్మ, నండ్రు స్వప్న, బలుసుపాటి జయరాజు, మధిర మార్కెట్, సొసైటీ చైర్మన్లు బండారు నర్సింహారావు, అక్కిరెడ్డి, మదన్మోహన్రెడ్డి, నాయకులు కోట రాంబాబు, సూరంశెట్టి కిశోర్, అమరవాది సత్యనారాయణరెడ్డి, కర్నాటి రామారావు, యన్నం కోటేశ్వరరావు, శ్రీనివాసరాజు, రవికాంత్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, శీలం ప్రతాపరెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కడియం శ్రీనివాసరావు, శీలం వెంకట్రామిరెడ్డి, కొత్తపల్లి ప్రశాంత్, కూరపాటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి -
ఎస్బీఐ ఎస్జీఎస్పీ ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత
ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత, మెరుగైన బ్యాంకింగ్ సేవలు, కుటుంబ సభ్యులకు అదనపు ప్రయోజనాలు కల్పించే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అందిస్తున్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ ప్యాకేజీ(ఎస్జీఎస్పీ)ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లోని బుధవారం ఆయన ఎస్జీఎస్పీ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్బీఐ అధికారులు ప్యాకేజీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ప్రత్యేక సౌకర్యాలు, బీమా రక్షణ, కుటుంబ సభ్యులకు లభించే ప్రయోజనాలు, రుణ సదుపాయాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సాధారణ శాలరీ ఖాతాలను నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎస్జీఎస్పీ ఖాతాలుగా మార్చుకుంటే అదనపు ఆర్థిక భద్రత లభిస్తుందని తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా రూ. కోటి వరకు ఉచిత ప్రమాద బీమా రక్షణతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వనపల్లి శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్ రామ్బరన్, ఎల్డీఎం ఏ.రవిప్రసాద్, కలెక్టరేట్ బ్రాంచ్ మేనేజర్ డి.సునీత, అధికారులు ల్గొన్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
పెద్దాస్పత్రిలో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ ఖమ్మంవైద్యవిభాగం: ఆస్పత్రికి వచ్చే వారితో మర్యాదగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని బుధవారం తనిఖీ చేసిన ఆమె ఎంసీహె చ్, ఎస్ఎన్సీయూ, చిన్నారుల వార్డుల్లో వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే, జనరల్ ఆస్పత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేశాక ఫార్మ సీ నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అంతేకాక మరుగుదొడ్ల శుభ్రత, క్రిటికల్ కేర్ భవన నిర్మాణంపై తీసి త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్, డిప్యూ టీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్, ఆర్ఎంఓలు రాంబాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీబీ బాధితులకు ఆర్థిక సాయండీఎంహెచ్ఓ రామారావు ఖమ్మంవైద్యవిభాగం: క్షయ(టీబీ) బాధితులకు కేంద్ర ప్రభుత్వ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ‘నిక్షయ్ పోషణ్ యోజన’ ద్వారా ఆర్థిక సాయం అందుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాధి నిర్ధారణ అయిన సమయంలో రూ.3వేలు, 84 రోజుల చికిత్స తర్వాత మరో రూ3వేలు అందుతాయని వెల్లడించారు. 2025లో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.17లక్షలు విడుదల చేయగా, జిల్లాలోని 283 మంది నమోదిత బాధితులకు రూ.6వేల చొప్పున ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు రూ.39.54లక్షలు విడుదల కాగా, ఇప్పటికే గుర్తించిన 460 మంది ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. మరో 210 మందికి రూ.3వేల చొప్పున, 324 మందికి రూ.6వేల చొప్పున విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇవికాక కొత్తగా గుర్తించిన మరో 189 మంది బాధితుల వివరాలు పరిశీలించాక నిధులు విడుదల అవుతాయని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్షయ వ్యాధికి చికిత్స పొందుతున్న వారు నిక్షయ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నాక, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ వివరాలను ఆరోగ్య కార్యకర్తలకు లేదా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అందించాలని డీఎంహెచ్ఓ సూచించారు. ఆలయానికి ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్ ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డు శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో భక్తుల తాగునీటి కోసం పాల్వంచకు చెందిన భక్తులు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ వితరణ చేశారు. పాల్వంచకు చెందిన పట్టాభి రామారావు – విజయలక్ష్మి దంపతులు రూ.50వేల విలువైన ప్లాంట్ ను సమకూర్చగా సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు భూక్యా నర్సి, భూక్యా లాలు, ఈఓ ప్రసాద్, అర్చకులు నాగరాజు, వేణుగోపాలాచార్యులు, వరశంకర్, ప్రసాద్, రమణయ్య పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై ఉద్యమిస్తాంబీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు సత్తుపల్లిటౌన్: ముఖ్యమంత్రిరేవంత్రెడ్డి విద్యా ర్థుల జీవితాలతో చెలగాటం ఆడడం మానేసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు డిమాండ్ చేశా రు. బకాయిలు విడుదల చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. సత్తుపల్లి లో బుధవారం విద్యార్థులతో కలిసి ‘ఫీజు బకా యి – బీజేపీ లడాయి’పేరిట నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా రింగ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. కేంద్రం తన వంతు నిధులు ఇస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వాక దాని పుల్లారావు, బి.వీరంరాజు, నాయుడు రాఘవరావు, సుదర్శన్ మిశ్రా, నరేశ్, డాక్టర్ పెద్దిరాజు, బి.విజ య్, శివకృష్ణ, కార్తీక్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
పాత స్థానాలపైనే మక్కువ!
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో బదిలీ అయిన వసతిగృహాల వార్డెన్లు మళ్లీ పాత స్థానాలపైనే కన్నేశారు. కొత్తస్థానాల్లో విధుల్లో చేరినా.. అలవాటు పడిన ప్రాణాలు కావడంతో పాత స్థానాల్లోకి తిరిగి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల (బీసీ, ఎస్సీ వెల్ఫేర్) హాస్టళ్లలో బదిలీలు ముగిసి, కొత్త వార్డెన్లు విధుల్లో చేరిన తర్వాత అసలు తంతు ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం బదిలీ ఉత్తర్వులు రావడంతో తప్పనిసరై కొత్త స్థానాల్లో చేరినా.. మళ్లీ పాత స్థానాలకు లేదా గతంలో పని చేసిన అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లేందుకు వార్డెన్లు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లా మొదలు రాష్ట్రస్థాయి వరకు జోరుగా పైరవీలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తప్పని స్థితిలో చేరినా.. ఇటీవల జరిగిన బదిలీల్లో జిల్లాలోని పలు హాస్టళ్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వార్డెన్లను నిబంధనల ప్రకారం బదిలీ చేశారు. ఆ సమయాన ఉన్నతాధికా రుల ఒత్తిడి, నిబంధనల ఉల్లంఘన కావొద్దని కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టారు. కొద్దిరోజులకే అక్కడ ‘సర్దుబాటు’కాలేకపోతున్నామనే సాకుతో మళ్లీ పాత హాస్టళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. గతంలో వదిలిపెట్టిన స్థానాలకు తిరిగి చేరడం లేదంటే సమీపంలోని వసతి గృహాల్లోకి మారడానికి తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ‘డిప్యూటేషన్’ అస్త్రంతో .. కొత్త స్థానాల నుంచి పాత స్థానాలకు మారడానికి కొందరు వార్డెన్లు ఇప్పుడు డిప్యూటేషన్(తాత్కాలిక బదిలీ) మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బదిలీల నిబంధనల ప్రకారం ఇంత త్వరగా స్థానచలనం కలిగే అవకాశం లేక డిప్యూటేషన్ పేరుతో తాత్కాలికంగానైనా పాత చోటుకే వచ్చేలా ప్రయత్నిస్తున్నా రు. ఇందుకోసం కొందరు వార్డెన్లు గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల్లో ప్రస్తుతం ఎలాంటి డిప్యూటేషన్లు లేవని అధికారులు చెబుతుంటే.. కొందరు వార్డెన్లు హనుమకొండ, హైదరాబాద్లోని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఫైళ్లను కదిలించే ప్రయ త్నం చేస్తున్నట్లు తెలిసింది. ఎస్సీ సంక్షేమ శాఖలో కొందరు వార్డెన్లు తమ వ్యక్తిగత, అంతర్ జిల్లా ఇబ్బందులను సాకుగా చూపిస్తూ, హెడ్డాఫీస్ ద్వారా పాత స్థానాలు, లేదా అనుకూలమైన జిల్లాలకు డిప్యూటేషన్ల మంజూరుకు అనుకూలురైన అధికారుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బదిలీల ఉద్దేశానికే గండి.. హాస్టళ్ల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేసిన వారిని బదిలీ చేసింది. కానీ, విధుల్లో చేరిన కొన్నాళ్లకే కొందరు వార్డెన్లు పాత స్థానాల కోసం పైరవీ చేస్తుండడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వార్డెన్లు రాకపోకలు సాగిస్తే విద్యార్థుల పర్యవేక్షణ, మెనూ అమలుపై ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక డిప్యూటేషన్లకు అనుమతి ఇవ్వొద్దని పలువురు కోరుతున్నారు. బదిలీ జరిగిన నెలలోనే ఖమ్మం ఎస్సీ అభివృద్ధి శాఖలో విధులు నిర్వర్తించే ఓ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు తెలిసింది. ఆయన పాత స్థానానికి తిరిగి వెళ్తున్న సందర్భంగా ఖమ్మం కార్యాలయ ఉద్యోగులకు విందు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు ఉద్యోగి ఉత్తర్వుల ఆధారంగా ఇంకొందరు ఉద్యోగులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అయితే, బదిలీ ఉద్యోగులకు ఆరు నెలల వరకు డిప్యూటేషన్లు, బదిలీలు చేయొద్దనే ఆదేశాలు ఉన్నా జిల్లా అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
నిర్మాణాలకు మార్కింగ్..
● భద్రగిరిలో కొనసాగుతున్న ఫుట్బ్రిడ్జి తొలగింపు పనులు ● నేడు చిత్రకూట మండపం తొలగింపుభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణలో భాగంగా నాలుగు వైపులా నిర్మాణాలకు మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఒక వైపు భవనాల నిర్మాణాల కూల్చివేత, శిథిలాల తొలగింపు జరుగుతుండగానే మరోవైపు నిర్మాణాల పనులు చేపడుతున్నారు. బుధవారం ఉత్తరం దిక్కున మార్కింగ్ చేయగా, మిగతా దిక్కుల్లో కూడా మార్కింగ్ చేయనున్నారు. హద్దుల మధ్యలోనే ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఉత్తరం దిక్కున ఉన్న 16 ఏళ్ల నాటి ఫుట్ బ్రిడ్జి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉత్తర ద్వారం తలుపులు తొలగించగా, నిర్మాణం కూల్చాల్సి ఉంది. దక్షిణ భాగంలో ఉన్న మెట్లను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పైకప్పు రేకులను తొలగించారు. గురువారం చిత్రకూట మండపం తొలగింపు పనులు కూడా చేపడతామని అధికారులు తెలిపారు. ఇప్పటికే కూల్చిన కుసుమ హరనాథబాబా ఆలయం శిథిలాల తొలగింపుతోపాటు మట్టి చదును పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. నేడో, రేపో ఉద్యోగులకు ఉత్తర్వులు ఇటీవల దేవస్థానంలో ఖాళీగా ఉన్న వేదపండితులు, అర్చకులు, పరిచారిక తదితర పోస్టులకు హైదరాబాద్లో అర్హత పరీక్షలు జరిపారు. మొత్తం 21 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కాగా, నేడో, రేపో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కోల్పోయినట్టేనా...
మెట్ట..తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువులో వడబడి మాడిపోతున్న పత్తి చేను (ఇన్సెట్) ఎండిపోతున్న పత్తి మొక్కసాక్షి ప్రతినిధి, ఖమ్మం: మెట్ట పంటలు సాగు చేసిన రైతులకు కాలం కలిసిరావడంలేదు. ఎల్నినో తీవ్ర రూపంతో వారి ఆశలు అడుగంటుతున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో పంటల సాగు మొదలుపెట్టగా.. ఈ నెల ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటలు వడబడుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో వర్షాలు పడకపోతే పంటలు కోల్పోయినట్లేనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలకరి ఉరకలు పెట్టించి.. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వానా కాలం సీజన్లో మొదటి రెండు నెలలు కీలకం. ఈ రెండు నెలల్లో మెట్టతో పాటు రిజర్వాయర్ల నుంచి ఆయకట్టుకు నీరు విడుదలైతే తరి పంటలు కూడా సాగవుతాయి. ఈమేరకు జూన్లో తొలకరి వర్షాలు మొదలై నెలాఖరు వరకు కొనసాగడంతో రైతులు మెట్ట పంటల సాగుకు సిద్ధమయ్యారు. జూన్లో సాధారణ సగటు వర్షపాతం (ఒక్కో మండలంలో) 13.1 సెం.మీ. కాగా 15.4 సెం.మీ.గా నమోదైంది. గత ఏడాది కంటే ఇది ఎక్కువే కావడంతో రైతులు సంతోషించారు. వర్షాధారంగా సాగయ్యే పత్తిని అ్యధికంగా 2,24,067 ఎకరాలు సాగు చేసినా ప్రస్తుతం వారి ఆశలు అడియాశలవుతున్నాయి. చినుకు జాడ లేక.. తొలకరి వర్షాలు, మధ్యలో పొడి వాతావరణంతో పత్తి విత్తనాలు చాలా ప్రాంతాల్లో మొలకెత్తలేదు. అదును దాటిపోతుందని రైతులు రెండోసారి కూడా నాటారు. అయినా ఫలితం దక్కక.. మొలకెత్తిన మొక్కలు కూడా వర్షం లేక వడబడుతున్నాయి. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం చల్లటి వాతావరణానికి పంట కళకళలాడుతున్నా మధ్యాహ్నం ఎండ తీవ్రత, వడగాలితో వడలిపోతున్నాయి. గత కొన్నేళ్లలో లేని పరిస్థితి పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర పంటలు కళ్లముందు ఎండిపోతున్నా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో రైతులు ఉన్నారు. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనట్లు ఈ నెల లోటు వర్షపాతం నమోదైంది. ఈనెల ఇప్పటి వరకు 15 రోజుల్లో సగటున ఒక్కో మండలంలో 11.7 సెం.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ కేవలం 2.1 సెం.మీ. వర్షపాతమే నమోదవడం పంటలపై ప్రభావం చూపుతోంది. ఆశగా ఎదురుచూస్తూ... మొక్క దశలో మెట్ట పంటలు ఉన్నప్పుడు వర్షం లేకపోతే రైతు కష్టమంతా దుక్కిలోనే కలిసిపోనుంది. ఈ వారంలో తగిన వర్షాలు లేకపోతే మొక్కలు మాడిపోయే అవకాశముంది. కారు మబ్బులు పట్టినట్లు ఆకాశం కనిపించినా వేడి గాలుల తీవ్రతతో అవి తేలిపోతుండగా.. చాలా ప్రాంతాల్లో కనీసం జల్లులు కూడా కురవడం లేదు. జల్లులు పడి తేమ శాతం పెరగడమే కాక ఒకటి, రెండు భారీ వర్షాలు కురిస్తే తప్ప పత్తి పంట చేతికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. నైరుతి వంచించి.. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే గత నెల జిల్లాలో సాధారణాన్ని మించి వర్షపాతం నమోదైంది. జూన్ సగటు వర్షపాతం 13.1 సెం.మీ.కు గాను 15.4సెం.మీ.గా నమోదు కావడంతో రైతులు మెట్ట పంటలు ముమ్మరంగా సాగు చేశారు. ఈనెలకొచ్చే సరికి పరిస్థితి భిన్నంగా ఉండడంతో నైరుతి వంచించినట్టేనని వాపోతున్నారు. మరోపక్క ఎల్నినో తీవ్రత ఇంకా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన మిగిలిన మూడున్నర నెలల్లో ఒకటి, రెండైనా భారీ వర్షాలు కురుస్తాయా, లేదా అన్న సందిగ్ధత నెలకొంది. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జూన్ మినహా మిగతా మూడు నెలల్లో సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైంది. కానీ ఈనెల పదిహేను రోజుల్లో అతి తక్కువ వర్షపాతం నమోదుకావడం ఎల్నినో తీవ్రతకు అద్దం పడుతోంది.గత నెలలో కురిసిన వర్షాలతో పంటల సాగు 2025 2026నెల సాధారణం నమోదు సాధారణం నమోదు జూన్ 13.1 11.8 13.1 15.4 జూలై 24.1 26.0 11.7 2.1ఆగస్టు 24.0 37.1సెప్టెంబర్ 17.8 23.1 -
రూ.40 కోట్లతో ‘హరిత భవన్’
ఖమ్మంఅర్బన్: జిల్లాను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో లకారం పార్క్ సమీపాన రూ.40 కోట్లతో ‘హరిత భవన్’నిర్మాణానికి నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సచివాలయంలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదెకరాల్లో నిర్మించే భవన నమూనాలు సిద్ధం కాగా పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. తొలుత ప్రతిపాదించిన ‘హరిత హోటల్’అని కాకుండా పేరు ‘హరిత భవన్’గా మార్చాలని సూచించారు. ఇప్పటికే ఐదెకరాల భూమిని జిల్లా యంత్రాంగం కేటాయించినందున, త్వరగా నిర్మాణం పూర్తి చేస్తే జిల్లాకు వచ్చే పర్యాటకులు, ఇతర వర్గాల వారికి నాణ్యమైన వసతి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంతేకాక ప్రాజెక్టుకు అవసరమైన రూ.40 కోట్ల నిధులు త్వరగా మంజూరు చేయాలని కోరుతూ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాసినట్లు వెల్లడించారు. సమావేశంలో పర్యాటశాఖ ఎస్ఈ సరిత, డీఈ రామకృష్ణ, ఏఈ నరేశ్, కన్సల్టెంట్ బాలకృష్ణ పాల్గొన్నారు. లకారం పార్క్ సమీపాన నిర్మాణం -
విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ కోసం 45 ఆధార్ కిట్లు సమకూర్చినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియను బాత్రానిక్స్ సంస్థకు ప్రభుత్వం అప్పగించినందున సంస్థ బాధ్యులు ప్రతీ పాఠశాలకు వెళ్లి ఉచితంగా విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని వెల్లడించారు. సెప్టెంబర్ వరకు ఉచితంగా చేయనుండగా, ఆ తర్వాత ప్రభుత్వం ధరలు నిర్ణయిస్తుందని తెలిపారు. ఈమేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేయించడమే కాక సంస్థ బాధ్యులు నగదు వసూలు చేయకుండా పర్యవేక్షించాలని డీఈఓ సూచించారు. ● ఖమ్మం శాంతినగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కొనసాగుతుండగా, డీఈఓ సదానందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక, భౌగోళిక పరిస్థితులు, సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకుని విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని సూచించారు. ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, శిక్షణ కేంద్రం ఇన్చార్జి చల్లా రంగారెడ్డి, హెచ్ఎం కృపాబాలానందం, రిసోర్స్ పర్సన్లు పి.నరేష్, నవీన్కుమార్, బి.ప్రసాద్, నాగరాజు, సత్యనారాయణ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
డెయిరీ ఆస్తుల రక్షణకు చర్యలు
● ఏడాదిలోగా ఖమ్మం డెయిరీ ఆధునికీకరణ ● రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య జీఎం మధుసూదన్రావు ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ డెయిరీ(విజయ)ల ఆస్తుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య జనరల్ మేనేజర్ మధుసూదన్ రావు తెలిపారు. ఖమ్మం రోటరీనగర్లోని విజయ డెయిరీని రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిట్, పరిశ్రమ స్థలాన్ని పరిశీలించాక కలెక్టర్ దివాకర టీ.ఎస్.ను కలిసి ఖమ్మం యూనిట్ ఆధునికీకరణ ప్రతిపాదనలు సమర్పించారు. ఇందుకు అవసరమైన నిధుల మంజూరుకు సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఎంపీలను కలిశామని తెలిపారు. అనంతరం జీఎం మధుసూదన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ డెయిరీల బలోపేతానికి చర్యలు చేపట్టామని తెలిపారు. పాల సేకరణ కేంద్రాల నిర్వహణకు సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, పాడి రైతులకు బీమా సౌకర్యం కల్పించడంతో గేదెల కొనుగోలుకు రుణాలు అందించే కృషి జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ప్రత్యేకాధికారి మల్లికార్జున్రావు, ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆవరణలో బంక్, ఆధునికీకరణ రాష్ట్రంలో రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ డెయిరీ(విజయ) స్థలాల్లో పెట్రోల బంక్ల ఏర్పాటు చేయనున్నట్లు జీఎం మధుసూదన్రావు తెలిపారు. ఈ జాబితాలో జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లితో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, ఆదిలాబాద్, నిర్మల్, లక్సెట్టిపేట, షాద్నగర్, వరంగల్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ బంక్ల ఏర్పాటుతో పాడి యూని ట్లకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఇక పాల నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఖమ్మంతో పాటు వరంగల్, నిజామాబాద్ ప్రభుత్వ డెయిరీ యూని ట్లను రూ.100 కోట్లతో సమూలంగా ఆధునికీకరించనున్నామని తెలిపారు. అధునాతన యంత్రాలు ఏర్పాటుచేసి ఏడాదిలోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని జీఎం వివరించారు. -
మరింత వేగంగా ‘సర్’
కూసుమంచి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మరింత వేగంగా జరిగేలా ఓటర్లు సహకరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కూసుమంచి మండల కేంద్రంలో మంగళవారం పర్యటించిన ఆయన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆన్లైన్ను పరిశీలించి బీఎల్ఓల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఎంత కీలకమో సేకరణ కూడా ముఖ్యమేనని తెలిపారు. వివరాలు నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తే త్వరగా అందుతాయని చెప్పారు. అయితే, డేటా ఎంట్రీకి సమయం ఎక్కువగా పడుతోందని సిబ్బంది చెప్పగా.. అదనపు సిబ్బందిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ నెల 24లోగా ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉన్నందున ఓటర్లు త్వరగా అందించి సహకరించాలని కోరారు. తొలుత ప్రక్రియ విజయవంతానికి ప్రజాప్రతినిధులు, వలంటీర్లు సహకరించాలని కోరారు. అనంతరం గంగబండతండా వద్ద కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యా పురోగతి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కాగా, పాఠశాలలో నీటి కొరత ఉందని విద్యార్థులు చెప్పగా వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ జశ్వంత్కుమార్, ఎంఈఓ రాయల వీరస్వామితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి దేవీమానస ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థులు స్నేహభావంతో ఉండాలే తప్ప ర్యాగింగ్కు పాల్ప డితే చట్టరీత్యా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ఖమ్మంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఎస్ఆర్జేసీ బాలికల కళాశాలలో ర్యాగింగ్తో అనర్థాలపై మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులకు వేధింపులు ఎదురైతే అధ్యాపకులు లేదా యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యాసంస్థల్లో సురక్షితమైన, స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పేలా ప్రతీ విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. యువతులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని, తద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ విలీన హామీ అమలుచేయాలి మధిర: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు కోరారు. మధిరలో మంగళవారం జరిగిన సమావేశంలో యూనియన్ మధిర డిపో కమిటీని ప్రకటించారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక సమ్మె సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలను చెల్లించాలని కోరారు. నాయకులు శీలం నరసింహారావు, పడకంటి మురళి, మందా సైదులు, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు లింగమూర్తి, పద్మావతి, సుధాకర్, నర్సిరెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపడాలి తల్లాడ: పారిశుద్ధ్య నిర్వహణ మెరుగైతేనే సీజనల్ వ్యాధులను కట్టడి చేయొచ్చని జిల్లా మలేరియా అధికారి కొత్తగుండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తల్లాడ మండలం కుర్నవల్లిలో ఇటీవల ఓ వ్యక్తి డెంగీ సోకి మృతి చెందగా, గ్రామంలో డీఎంఓ మంగళవారం తనిఖీ చేశారు. ఈమేరకు ఇళ్లతో పాటు పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. అలాగే, మురికి నీరు నిల్వ ఉండకుండా, దోమలు వృద్ధి చెందే ఆవాసాలను శుభ్రం చేయించాల్సిన ఆవశ్యకతపై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ శిరీష, పైలేరియా కన్సల్టెంట్ లక్ష్మణ్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో ఆన్లైన్ సేవలకు బ్రేక్ ఖమ్మంరూరల్: వెబ్సైట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఏదులాపురం మున్సిపాలిటీలో పలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త ఇళ్లకు నంబర్ల కేటాయింపు, ఆస్తి యాజమాన్య మార్పిడి(మ్యూటేషన్), పేరు సవరణ వంటి సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. అయితే, ఈ సమస్య ఏదులాపురం మున్సిపాలిటీలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు తెలిసిందని వెల్లడించారు. సమస్య పరిష్కారానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని, అప్పటివరకు అంతరాయం కొనసాగుతుందని తెలిపారు. -
యుద్ధప్రాతిపాదికన నీటి సంరక్షణ
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్ల ఏర్పాటుతో పాటు నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఫామ్ పాండ్లు, నీటి సంరక్షణ, పంటల సాగు విధానాలపై సమీక్షించాక కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ వర్షపాతం నమోదవుతున్నందున భూగర్భ జలాల పెంపునకు దోహదపడే ప్రతీ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో అమలు చేయాలని సూచించారు. ఫామ్ పాండ్లు భూగర్భ జలాల పెరుగుదలకు, రైతుల సాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయనే అంశంపై అవగాహన కల్పించాలని తెలిపారు. జూలై నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు జరగాలని చెప్పారు. ఇక పత్తిలో మిశ్రమ పంటలు, అంతర పంటల సాగు, ఎల్నినో కారణంగా తక్కువ నీరు అవసరమయ్యే స్వల్పకాలిక పంటలే సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ విషయమై వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సరిత, ఉద్యానవన అధికారి అనిత పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన రిటైనింగ్ వాల్ ఖమ్మంఅర్బన్: మున్నేటి వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణంలో వేగం పెంచి గడువులో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర సూచించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ, డ్రెయినేజీల డిజైన్పై అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. భూసేకరణ వేగంగా జరిగేలా భూ యజమానులతో చర్చించాలని తెలిపారు. జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్, పలు శాఖల అధికారులు బాబూరావు, శ్రీనివాస్రెడ్డి, ఉదయ్ప్రతాప్, వాణిశ్రీ, మహేశ్బాబు పాల్గొన్నారు. -
పోక్సో కేసుల్లో వేగంగా దర్యాప్తు
ఖమ్మంక్రైం: పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగంగా చేపట్టి గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన నేరసమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితులకు శిక్షల శాతం పెరగడమే లక్ష్యంగా దర్యాప్తు, శాసీ్త్రయ ఆధారాల సేకరణ ఉండాలని తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం గడువులోగా ట్రయల్ పూర్తి చేయాలని, సాక్షులు కోర్టుకు హాజరయ్యేలా భరోసా కల్పించాలని తెలిపారు. ఇక ఎన్టీపీఎస్ కేసుల్లో నేరాన్ని రుజువు చేయడానికి గంజాయి, మాదకద్రవ్యాల స్వభావం, పరిమాణంపై ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేదిక సమర్పించాలని సూచించారు. జిల్లా మీదుగా గంజాయి రవాణా, విక్రయాలను ఆరికట్టడానికి ఈగల్ బృందాలు, టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సీపీ తెలిపారు. నిఘా వ్యవస్దను బలోపేతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, చోరీ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును బాధితులకు అప్పగించడంలో సాంకేతికతను ఉపయోగించాలని చెప్పారు. నేరాలు జరిగాక స్పందించడం కంటే ముందస్తు చర్యల కోసం సమర్థవంతమైన పోలీసింగ్ నిర్వహించాలని సీపీ సూచించారు. కాగా, రోడ్డు ప్రమాదాల ఎక్కువగా జరిగే హాట్ స్పాట్ల వద్ద సరైన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, ఫణీందర్, నర్సింహరావు, సర్వర్, సత్యనారాయణ, సాంబరాజు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
కల్లూరురూరల్: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.1.50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు పోలీసుస్టేషన్లో మంగళవారం సత్తుపల్లిరూరల్ సీఐ ముత్తులింగం, ఎస్ఐ హరిత వివరాలు వెల్లడించారు. కల్లూరుకు చెందిన స్నేహితులు షేక్ హబీబ్, బొడ్డు చంద్రు గంజాయి తాగడానికి అలవాటు పడారు. గత ఏడాది మణుగూరుకు చెందిన ఇంకో ఇద్దరితో కలిసి ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి వెళ్లి, సన్నీ వద్ద గంజాయి కొనుగోలు చేసి, తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా బయటకు వచ్చాక హబీబ్ కొంతకాలం బాగానే ఉన్నా మణుగూరు అత్తగారింటికి వెళ్లినప్పుడు పాత స్నేహితుడైన తేజావత్ రమేశ్ను కలవగా మళ్లీ గంజాయి తాగడం మొదలైంది. ఆపై చంద్రుతో కలిసి తల్లాడ మండలంలోని ముద్దులూరులో గంజాయి కొనుగోలు చేసి ధర ఎక్కువ కావడంతో హబీబ్, చందు ఈనెల 7న ఒడిశా వెళ్లి వచ్చారు. అలాగే, వాహనం సమకూర్చినందుకు రమేశ్కు వాటా ఇస్తామని చెప్పారు. ఒడిశాలో తీసుకొచ్చిన గంజాయితో సోమవారం పేరువంచ వెళ్తుండగా తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు రూ.1.50 లక్షల విలువైన మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని హబీబ్, చందు, రమేశ్ను మంగళవారం రిమాండ్ చేసినట్లు సీఐ ముత్తులింగం తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన ఎస్ఐ హరిత, సిబ్బంది నర్సింహారావు, లక్ష్మీపతి, శ్రీనివాసరావు, సత్యనారాయణ, రఫీ, విజయ్, రంగారావును సీఐ అభినందించారు. -
ఫారాక్వాట్ కలుపు మందుపై నిషేధంపై హర్షం
బోనకల్: రైతుల ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణ, సురక్షత వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఫారాక్వాట్ కలుపు మందును నిషేధించడం చరిత్రాత్మకమని ఖమ్మం శ్రీరక్ష మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అధినేత గోంగూర వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఫారాక్వాట్ కలుపుమందు దిగుమతి, తయారీ, నిల్వ, అమ్మకం, రవాణాపై నిషేధం ఉంటుందని తెలిపారు. కాగా, ఫారాక్వాట్ వల్ల కలిగే నష్టాలపై శ్రీరక్ష ఆరోగ్య యాత్ర ద్వారా ఖమ్మంలోని 100 గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని వెల్లడించారు. గురుకులం అధ్యాపకురాలి సస్పెన్షన్ కారేపల్లి: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో కారేపల్లి మైనార్టీ గురుకుల కళాశాల అధ్యాపకురాలిని సస్పెండ్ చేశారు. ఈ నెల 3న మైనార్టీ గురుకుల కాలేజీలో చదివే ఓ బాలిక బంధువు అని చెబుతూ మహిళ వచ్చి బయటకు తీసుకెళ్లింది. అయితే, ముగ్గురు మహిళలు, ఓ యువకుడు కలిసి సదరు బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆ తర్వాత బయటపడింది. ఈ మేరకు నలుగురిపై పోక్సో కేసు కూడా నమోదైంది. అయితే, ఆ సమయాన విధుల్లో ఉన్న అధ్యాపకురాలు దుర్గాభవాని అలసత్వమే ఇందుకు కారణమని నిర్ధారించి ఆమెను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె నుంచి చిన్నారిని తీసుకొచ్చిన మేనమామ అమ్మమ్మకు అప్పగించిన పోలీసులు నేలకొండపల్లి: ఓ వ్యక్తి మద్యం మత్తులో చిన్నారితో రెస్టారెంట్లో ఉండగా, నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారించి అమ్మమ్మకు అప్పగించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన ఓ కుటుంబం చైన్నెలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ విభేదాల కారణంగా ఆ కుటుంబానికి చెందిన చిన్నారిని మేనమామ ఎవరికీ తెలియకుండా చైన్నె నుంచి తీసుకుని సోమవారం రాత్రి వచ్చాడు. నారాయణపురానికి వెళ్తూ నేలకొండపల్లిలో మద్యం సేవించి ఓ రెస్టారెంట్లో భోజనానికి రాగా నిర్వాహకులు అనుమానంతో పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీస్ స్టేషన్కు తరలించి వివరాలు ఆరా తీశాక చిన్నారి అమ్మమ్మను పిలిచి అప్పగించారు. కాగా, చిన్నారి పేరిట ఉన్న ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు గుర్తించామని ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి మధిర: మధిర రైల్వేస్టేషన్ సమీపాన మంగళవారం రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మధిర రాయపట్నం సెంటర్లో నివసించే యర్రం వెంకటకృష్ణ(38) ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. అయితే, ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. ఈవిషయమై జరుగుతున్న వివాదం నేపథ్యాన ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేసి రైలు కిందకు నెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధిర– తొండల గోపవరం స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు ఢీకొనగా వెంకటకృష్ణ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
వాహన తనిఖీల్లో ప్రమాదం
ఇసుక ట్రాక్టర్ పైనుంచి పడిన కానిస్టేబుల్కు తీవ్రగాయాలు ఖమ్మంక్రైం: వాహన తనిఖీలు చేపడుతుండగా ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీటీఓను లారీ ఢీకొనగా మృతి చెందిన ఘటన మరవకముందే ఖమ్మం జిల్లా కేంద్రంలోనూ ప్రమాదం జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను రవాణా శాఖ కార్యాలయానికి తరలిస్తుండగా జారి పడిన రవాణా శాఖ కానిస్టేబుల్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఖమ్మం ప్రకాష్నగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఇన్చార్జ్ డీటీఓ శ్రీనివాస్ తనిఖీలు చేపడుతుండగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుబడింది. ఈ మేరకు ట్రాక్టర్ను రవాణా శాఖ కార్యాలయానికి తరలిస్తూ శాఖ కానిస్టేబుల్ అశోక్ ఇంజన్పై డ్రైవర్ పక్కన కూర్చుని బయలుదేరాడు. మార్గమధ్యలో బొలేరో వాహనం యూటర్న్ తీసుకుంటూ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఘటనలో ఇంజన్పై కూర్చున్న కానిస్టేబుల్ అశోక్ కింద పడగా ట్రాక్టర్ టైరు ఆయన చేయి పైనుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. దీంతో ఆర్టీఓ శ్రీనివాసరావు ఆయనకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి అశోక్ కుటుంబీకులతో కలిసి తరలించారు. ఘటన సమాచారం అందగానే రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే, రవాణా శాఖ జాయింట్ కమిషనర్లు చంద్రశేఖర్గౌడ్, రమేశ్, పాండురంగారావు ఆస్పత్రికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం అశోక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన చేతికి శస్త్రచికిత్స పూర్తయిందని ఆర్టీఓ శ్రీనివాస్ తెలిపారు. -
కారేపల్లి స్టేషన్లో డీఆర్ఎం
కారేపల్లి: ప్రత్యేక రైలులో కొత్తగూడెం స్టేషన్ తనిఖీకి వెళ్లి వస్తున్న దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) గోపాలకృష్ణన్ మంగళవారం కారేపల్లి స్టేషన్లో ఆగారు. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లలో భాగంగా ఆయన సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం స్టేషన్ వరకు పరిశీలించారు. ఈక్రమాన తిరుగు ప్రయాణంలో కారేపల్లి జంక్షన్లో ఆగి స్టేషన్లో వసతులపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు డబ్లింగ్ పనులపై అధికారులతో చర్చించారు. కాగా, కరోనా సమయాన రద్దయిన రైళ్ల పునరుద్ధరణ, కారేపల్లి – ఇల్లెందు రైల్వేగేటు, కారేపల్లి – పేరుపల్లి రైల్వే గేట్ల స్థానంలో ఓవర్ బ్రిడ్జిల ఆవశ్యకతపై కారేపల్లి గ్రామస్తులు డీఆర్ఎంకు వినతిపత్రాలు అందజేశారు.పెనుబల్లి మండల వాసికి డాక్టరేట్ పెనుబల్లి: మండలంలోని సూరయ్యబంజర్ గ్రామానికి చెందిన బొల్లు సోమయ్య కుమారుడు శివకేశవరావుకు డాక్టరేట్ లభించింది. ఆయన ‘డిజైన్ – అనాలిస్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అల్గోరిథం ఫర్ ఎర్లీ ప్రిడిక్షన్ ఆఫ్ ట్యూబర్కులోసిస్’అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథం, వ్యాసానికి భోపాల్లోని రవీంద్రనాథ్ఠాగూర్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా శివకేశవరావును ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు. మోడల్ సోలార్ విలేజ్ పథకంపై సమీక్ష ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ పథకం అమలుపై రెడ్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని బోనకల్ మండలంతో పాటు రఘునాథపాలెం, చెరువుమాధారం, స్నానాల లక్ష్మీపురం, సిరిపురం సహా 27 గ్రామాల్లో సోలార్ మోడల్ విలేజ్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో 16,837 గృహాలకు రెండేసి కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ యూనిట్, 4,371 వ్యవసాయ పంపుసెట్లకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు పనులపై సమీక్షించిన అధికారులు వేగవంతానికి సూచనలు చేశారు. తొలుత ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పథకం కాంట్రాక్టర్లతో సమావేశమై పనులపై చర్చించారు. డీఈఓ మళ్లీ కరీంనగర్కే.. ఖమ్మంసహకారనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తించిన చైతన్య జైనీని గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఖమ్మం డీఈఓ (ఎఫ్ఏసీ)గా నియమించారు. నాటి నుంచి జిల్లాలో విధులు నిర్వర్తించిన ఆమె రెండు నెలల క్రితం సెలవులో వెళ్లారు. ఆగస్టు 7వ తేదీన సెలవు పూర్తయ్యాక 8వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంది. కానీ, ఖమ్మంలో ఆమె పోస్టింగ్ను రద్దు చేసి, కరీంనగర్ డీఈఓగా విధుల్లో చేరాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే విధుల్లో చేరి నివేదిక సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. భారీ వృక్షం కూలి స్తంభాలు ధ్వంసం సత్తుపల్లిటౌన్: విద్యుత్ తీగల వీదుగా ఓ ఇంటిపై భారీ జామాయిల్ వృక్షం కూలిన ఘటన మంగళవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. సత్తుపల్లి గాంధీనగర్కు ఆనుకొని అటవీశాఖ ప్లాంటేషన్లో భారీ జామాయిల్ వృక్షాలు ఉన్నాయి. ఇందులో ఓ వృక్షం కాలనీలోని ఇంటిపై పడగా ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే, చెట్టు పడడంతో ఇంటి గోడ కూలిపోవడమే కాక నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగి తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ శాఖకు సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లిందని ఏఈ శరత్బాబు తెలిపారు. కౌన్సిలర్ కూసంపూడి మహేశ్ ఆధ్వర్యాన చెట్ల కొమ్మలను తీయించగా, విద్యుత్ సిబ్బంది స్తంభాలను సరిచేసి సరఫరా పునరుద్ధరించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం కామేపల్లి: ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్న విషయం వెలుగుచూసింది. మండలంలోని ఊట్కూర్ రెవెన్యూ పరిధిలోని 213 సర్వే నంబర్లోని రెవెన్యూ భూమిని సదరు వ్యక్తి ట్రాక్టర్తో దున్నించాడు. ఈ భూమి పక్కనే ‘ఈ ప్రభుత్వ భూమిని ఎవరైనా అతిక్రమించినచో కఠిన చర్యలు తీసుకోబడును’అని బోర్డు ఉన్నా పట్టించుకోకుండా సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కజ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కామేపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు వివరణ కోరగా, క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యం
వైరా: దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల అవకాశవాద రాజకీయాలకు బలైపోయిన ఖమ్మం జిల్లాలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా పని చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గౌతమ్రావు సూచించారు. వైరాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలతో పాటు కమ్యూనిస్టుల అవకాశ వాద రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కమ్యూనిస్టులు అపవిత్ర కలయికతో పబ్బం గడుపుకుంటూ సిద్ధాంతాలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు. మరోపక్క కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం చేస్తుండగా, జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదని తెలిపారు. కాగా, బీజేపీ అవలంబిస్తున్న సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లాలో పార్టీ పటిష్టతకు పాటుపడాలని సూచించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్రెడ్డి, నాయకులు దేవకి వాసుదేవరావు, కొండపల్లి శ్రీధర్రెడ్డి, వాకదాని పుల్లారావు, నంబూరి రామలింగేశ్వరరావు, సన్నె ఉదయ్ప్రతాప్, గోంగూర వెంకటేశ్వర్లు, గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, రమేశ్, సత్యనారాయణ, రవికుమార్, సుబ్బారావు, నరేశ్, సరస్వతి, శ్యామ్రాథోడ్, అనిత, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు -
‘లిఫ్ట్’చేయలేక..!
ఖమ్మంఅర్బన్: రైతులకు వరంగా నిలవాల్సిన జిల్లాలోని పలు చిన్న ఎత్తిపోతల పథకాలు ఒక్క టొక్కటిగా మూలన పడుతున్నాయి. చెరువులు, వాగులు, కాల్వల నుంచి నీటిని ఎత్తిపోసి వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ఎత్తిపోతల పథకాలను నిర్మించినా, ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై పనికిరాని స్థితికి చేరుతున్నాయి. నిధుల కొరత, విద్యుత్ సమస్యలు, మోటార్లు దెబ్బతినడం, మరమ్మతులు చేపట్టకపోవడం తదితర కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో మొత్తం 135 చిన్న ఎత్తిపోతల పథకాలు ఉండగా, అందులో 34 పథకాలు మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 23,614 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మరో ఎనిమిది పథకాలు పాక్షికంగా మాత్రమే పనిచేస్తుండగా, 74 పథకాలు పూర్తిగా నిలిచిపోయాయి. సాగుపై ప్రభావం జిల్లాలోని మూలన పడిన 74 పథకాల కింద సుమారు 16,858 ఎకరాల ఆయకట్టు ఉంది. పాక్షికంగా పనిచేస్తున్న ఎనిమిది పథకాల కింద మరో 3,859 ఎకరాల సాగుభూమి ఉంది. ప్రస్తుత పరిస్థితితో వేలాది ఎకరాల్లో సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీరంతా బోర్లతో పాటు వర్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. రైతులపైనే మరమ్మతుల భారం చిన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ప్రధానంగా విద్యుత్ సమస్య ఎదురవుతోంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, మోటార్లు, వైర్లు దెబ్బతినడం సాధారణమైపోయింది. ప్రభుత్వం నుంచి సత్వర స్పందన లేక రైతులే నగదు పోగు చేసుకుని మరమ్మతు చేయించుకోవాల్సి వస్తోంది. ఇంకొన్ని చోట్ల విద్యుత్ బిల్లుల బకాయిల భారంతోనూ కనెక్షన్లు తొలగిస్తున్నారు. రూ.1.72 కోట్లు వెచ్చిస్తే.. పాక్షికంగా పనిచేస్తున్న పథకాల పునరుద్ధరణకు రూ.1.72 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో మూడు పథకాలకు రూ.64 లక్షలు మంజూరు కాగా, మరో ఐదు పథకాలకు రూ.1.08 కోట్లు రావాల్సి ఉంది. అలాగే పనిచేయని పథకాల మరమ్మతులకు రూ.938.76 లక్షలు మంజూరైనా పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇక మరో 40 పథకాల పునరుద్ధరణకు రూ.4,595.50 లక్షలు అవసరమని నివేదిక సిద్ధం చేశారు. అవి అసలే పనికిరావు జిల్లాలో పూర్తి నిరుపయోగంగా మారిన 19 ఎత్తిపోతల పథకాలు మూతపడిన జాబితాలోకి చేరాయి. వీటి కింద సుమారు 2,583 ఎకరాల ఆయకట్టు ఉంది. మరో ఐదు పథకాలను కూడా ఇదే జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే మరిన్ని పథకాలు కూడా ఇదే స్థితికి చేరే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన నిధులు విడుదల చేసి పథకాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని.. లేనట్లయితే వేల ఎకరాల ఆయకట్టులో సాగు నిలిచిపోయే అవకాశముందని చెబుతున్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణలో కీలకంగా విద్యుత్ పనులే ఉంటున్నాయి. అయితే, ఈ పనులు చేసే కాంట్రాక్టర్లు తక్కువగా ఉండడంతో మరమ్మతులు, పునరుద్ధరణ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం మంచుకొండ, కొదుమూరు – వందనం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల రెండో దశతో పాటు ఎర్రుపాలెం మండలంలో జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఐదు పథకాల కోసం జలవనరుల శాఖ అధికారులు అంచనా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఏన్కూరు మండలంలోని గార్లొడ్డు, జన్నారం తదితర పథకాలు ఉన్నాయని సమాచారం. -
జిల్లాకు టీజీ టీ–20 రన్నరప్ జట్టు
ఖమ్మంస్పోర్ట్స్/ఖమ్మంసహకారనగర్: జిల్లాలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము కూడా సహకరిస్తామని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని తెలిపారు. ఇటీవల ముగిసిన టీజీ టీ–20 టోర్నీలో రన్నరప్గా నిలిచిన ‘అన్విత – ఖమ్మం ఏసెస్’ జట్టు సభ్యులు మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా అభినందన ర్యాలీ నిర్వహించాక జరిగిన సమావేశంలో ఆమె క్రీడాకారులను సన్మానించి మాట్లాడారు. క్రీడాకారుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడుతూ.. అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు రన్నరప్గా నిలువడం గర్వకారణమన్నారు. అనంతరం జట్టు కెప్టెన్ చామా వజ్రేంద్ర మిలింద్, క్రీడాకారులు మల్లు సహేంద్రవిక్రమాదిత్య తదితరులు ఎస్బీఐటీ కాలేజీకి వెళ్లగా మల్లు నందినితో పాటు కాలేజీ చైర్మన్ గుండాల కృష్ణ సన్మానించారు. జిల్లా జట్టు హెడ్ కోచ్ అభిజిత్ చటర్జీ, జట్టు ఫ్రాంచైజీ యజమాని గోపన్న అచ్యుతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
అది వేలం జాబితాలో లేని బ్లాక్
● సింగరేణికి మేలు చేసినట్లుగా కేంద్రమంత్రి ప్రగల్భాలు ● ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ఖమ్మంవైరారోడ్: కేంద్రం వేలం నిర్వహించే బొగ్గు బ్లాక్ల జాబితాలో తాడిచర్ల–2 బ్లాక్ లేదని, దీనిని సింగరేణికి కొత్తగా కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి సోమవారం ఆయన మాట్లాడారు. 1995లోనే సింగరేణి ఈ బ్లాక్ను గుర్తించగా, అనుమతులు వచ్చాయని తెలిపారు. మునుపెన్నడూ సింగరేణి విషయంలో కిషన్రెడ్డి మాట్లాడకపోగా, బొగ్గు బావులను వేలం వేస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి టెండర్లకు సహకరించారే తప్ప అడ్డుకోలేదన్నారు. కాగా, సింగరేణిలో కుంభకోణాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ లేఖలు రాసినా కిషన్రెడ్డి స్పందించకపోవడానికి కాంగ్రెస్తో లోపాయికారీ ఒప్పందాలే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా ఆయనకు సింగరేణిపై నిజంగా ప్రేమ ఉంటే కోయగూడెం–3, సత్తుపల్లి–3, శ్రావణపల్లి మైన్లను కూడా కేటాయించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్ట సవరణలతోనే సింగరేణికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అలాగే, బీఆర్ఎస్ హయాంలో పునరుద్ధరించిన మెడికల్ బోర్డు, కారుణ్య నియామకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ప్రతీ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచించారు. ఖమ్మం బుర్హాన్పురంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయనతో పాటు కుటుంబ సభ్యుల ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బీఎల్ఓ సావిత్రికి అందజేశారు. అనంతరం ఎంపీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్పై వివరాలు ఆరా తీశారు. మాజీ కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
అన్నదానానికి రూ.27,126 విరాళం
ఖమ్మం అర్బన్: ఖమ్మం కై కొండాయిగూడెం స్టేజీ సమీపాన ఉన్న శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే అన్నదానానికి దాసరి ఉమామహేశ్వర్రావు – రేణుక దంపతులు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం వారు రూ.27,126 విరాళాన్ని ఆలయ కమిటీ బాధ్యులకు అందజేయగా సన్మానించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగండ్ల కోటేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు. ఉషూ టోర్నీలో రాణించిన క్రీడాకారులు ఖమ్మం స్పోర్ట్స్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈనెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి ఉషూ పోటీల్లో ఖమ్మంకు చెందిన క్రీడాకారులు రాణించారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కె.శశివర్ణిక, పి.సహస్య, ఎన్.చైతన్య, వి.అభిషేక్గౌడ్, బి.ప్రేమ్కుమార్ ఐదు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి సోమవారం అభినందించారు. దేవాదాయ శాఖ ఈఓలు, మేనేజర్ల సంఘం ఎన్నిక ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ఈఓలు, మేనేజర్ల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మం కమాన్బజార్లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈఓలు, మేనేజర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించాక నూతన కమిటీని ఏకగీవ్రంగా ప్రకటించారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొత్తూరు జగన్మోహన్రావు, అధ్యక్షుడిగా వనం వెంకటనర్సింహారావు, ఉపాధ్యక్షుడిగా భీమవరపు సూర్యప్రకాషరావు, కార్యదర్శిగా అద్దంకి విజయ్కుమార్, సహాయ కార్యదర్శిగా పాకాల వెంకటరమణ, కోశాధికారిగా కాముని శ్రీకాంత్తో పాటు కార్యవర్గ సభ్యులుగా మరో ఆరుగురిని ఎన్నుకున్నారు. విద్యుత్ సంస్థలో ఖాళీలు భర్తీ చేయాలి ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అన్మ్యాన్డ్, తాత్కాలిక కార్మికులతో భర్తీ చేయాలని టీఈఈయూ 1104 యూనియన్ డిస్కం సలహాదారు టి.శేషగిరిరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో సోమవారం యూనియన్ ప్రాంతీయ అధ్యక్షుడు ఎంవీ.రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది విధినిర్వహణలో భద్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీతారామయ్య, సురేష్, శ్రీధర్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రమణారావు, మాధవి, స్రవంతి, రమణ, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ పేరిట రూ.5వేలు స్వాహా ఏన్కూరు: బాలికలకు స్కాలర్షిప్ కావాలంటే త్వరగా ఫోన్ పే చేయండి అని సూచించిన వ్యక్తి రూ.5వేలు పంపించాక ఫోన్ స్విచాఫ్ చేసిన ఘటన ఇది. ఏన్కూరు మండలం బురదరాఘఽవపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాగి సుజాత తెలిపిన వివరాలు... పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుంకర శ్రావణి తల్లి లక్ష్మికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి సోమవారం ఫోన్ చేశాడు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నామని, శ్రావణికి కూడా కావాలంటే రూ.5వేలు పంపించాలని సూచించాడు. దీంతో లక్ష్మి నిజమే అనుకుని రూ.5వేలు ఫోన్పే ద్వారా పంపించింది. ఆతర్వాత పాఠశాలకు వచ్చి వివరాలు ఆరా తీయగా ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పడం, ఆ నంబర్ స్విచాఫ్ వస్తుండడంతో సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కాగా, అపరిచిత వ్యక్తుల ఫోన్లకు స్పందించవద్దని హెచ్ఎం సుజాత సూచించారు. రేషన్ షాపుల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు ఖమ్మం అర్బన్: ఖమ్మం అర్బన్ మండలంలోని పలు రేషన్షాపుల్లో విజిలెన్స్ టాస్క్ఫోర్స్ బృందం సోమవారం తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్కు చెందిన విజిలెన్స్ ఓఎస్టీ డీఎస్పీ అంజయ్య నేతృత్వాన నాలుగు బృందాలుగా ఏర్పడి ఖమ్మం అర్బన్, వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్ ప్రాంతాల్లోని రేషన్ షాపులను పరిశీలించారు. షాపుల అనుమతి, స్టాక్ బోర్డులు, నిల్వలను పరిశీలించారు. ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం, బల్లేపల్లి, బాలపేట ప్రాంతాల్లో డీఎస్పీ అంజయ్య స్వయంగా తనిఖీ చేయగా, సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ సీఐ సైదయ్య, ఖమ్మం అర్బన్ డీటీ మెచ్చు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, నేతలకు స్వాగతం
కూసుమంచి/తల్లాడ: కొత్తగూడెం, మణుగూరులో సోమవారం జరిగిన సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డికి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. మంత్రి కిషన్రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు, ఎంపీ డీ.కే.అరుణ తదితరులకు స్వాగం పలకగా అల్పాహారం తీసుకున్నాక నాయకులు బయలుదేరారు. అలాగే, మార్గమధ్యలో తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్ వద్ద కూడా నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. అంతేకాక వివిధ సమస్యలపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర్రావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు మేక సంతోష్రెడ్డి, గల్లా సత్యనారాయణ, చావా కిరణ్, రుద్ర ప్రదీప్, గోంగూర వెంకటేశ్వర్లు, శ్యామ్రాథోడ్, గడ్డం వెంకటేశ్వర్లు, గుండా ఉపేందర్రెడ్డి, ఉపేందర్ గౌడ్, పుణ్యవతి, చల్లా నాగులు, ఆపతి వెంకటరామారావు, గాదె కృష్ణారావు, చల్లా తిరుమలాదేవి, పెరికె కిరణ్, స్వర్ణలత పాల్గొన్నారు. -
ఇకపై ప్రత్యామ్నాయం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురుకాగా, పంటల సాగు మందకొడిగా సాగుతోంది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు పంటలు సాగు చేయని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలుచేయనుంది. ప్రాంతాలు, పంటల సాగు విస్తీర్ణం, విత్తన నిల్వల ఆధారంగా ప్రణాళికలతో నివేదిక సిద్ధం చేశారు. 189 గ్రామాల్లో తీవ్ర ప్రభావం జిల్లాలోని 471 గ్రామాలకు గాను 189 గ్రామాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరో 62 గ్రామాల్లో మధ్యస్థ ప్రభావం ఉంది. ఇక 220 గ్రామాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితుల ప్రభావం లేదని వ్యవసాయ శాఖ గుర్తించింది. తీవ్ర వర్షాభావం ఉన్న గ్రామాల్లో పాలేరు వ్యవసాయ డివిజన్లో 54, సత్తుపల్లి డివిజన్లో 49 గ్రామాలు, మధిర డివిజన్లో 42 గ్రామాలు, వైరా డివిజన్లో 26 గ్రామాలు, ఖమ్మం డివిజన్లో 18 గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. జూన్లో కొంత మేర వర్షాలు కురిసినా, జూలైలో ఆ పరిస్థితి లేక పంటల సాగు వెనకబడుతోంది. 2.77 లక్షల ఎకరాల్లో వెనకంజ జిల్లాలో జూలై 15 నాటికి 6,18,412 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ వర్షాల ఆధారంగా 1,43,533 ఎకరాల్లో, నీటి పారుదల కింద 1,97,117 ఎకరాల్లో మొత్తం 3,40,650 ఎకరాల్లోనే పంటలు వేశారు. ఇంకా 2,77,762 ఎకరాల్లో వెనుకబడినట్టేనని వ్యవసాయ శాఖ చెబుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం. ఇందుకోసం వ్యవసాయ, ఉద్యాన, నీటి పారుదల శాఖల సంయుక్త ఆధ్వర్యాన గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం. నేలలు, నీటి వనరులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తక్కువ కాల పరిమితి, లాభసాటి పంటల సాగు వివరాలు వెల్లడిస్తాం. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారిఈనెల 15నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని 2,18,565 ఎకరాల్లో పంటల సాగు చేయించాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో అత్యధికంగా వరి 1,71,908 ఎకరాలు ఉండగా, పెసర 11,603 ఎకరాలు, మినుము 1,996, మొక్కజొన్న 895, కంది 715, కూరగాయలు 612, అలసంద 597, పశుగ్రాసం జొన్న 370, ఉలవలు 50, ఇతర పంటలు 29,819 ఎకరాలను ప్రణాళికలో చేర్చారు. ఈ పంటలకు 43,667.604 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, ఇప్పటికే 12,389.81 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన విత్తనాలను కూడా సిద్ధం చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇక మరో 59,197 ఎకరాల్లో పంటల సాగుకు వర్షాల ఆధారంగా ఆగస్టులో ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. -
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకరఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్కుమార్ పాల్గొనగా వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కూసుమంచి మండలం పాలేరులో జనాభా ఆధారంగా రెండో రేషన్ షాపు కేటాయించాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు. ● చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన అమర్లపూడి వసంతరాణి ఇంటర్ పూర్తిచేసిన తాను ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఆయా పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నా, రాలేదని అర్హత ఆధారంగా ఇప్పించాలని కోరారు. ● తల్లాడ మండలం గొల్లగూడెంకు చెందిన జి.సురేష్ తన కుమారుడు సాత్విక్కు వైరా మహత్మా జ్యోతి బాపూలే స్కూల్లో సీటు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ● ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన డి.ఉపేంద్ర కంటిచూపు కోల్పోయిన తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరారు. -
సాంకేతికతోనే సైబర్ నేరాల కట్టడి
ఖమ్మంక్రైం: సైబర్ నేరాల కట్టడితో పాటు డిజిటల్ భద్రతను పటిష్టం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. సైబర్నేరాల నియంత్రణ, దర్యాప్తులో పాటించాల్సిన విధానాలపై పోలీసుస్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు సోమవారం పీటీసీలో శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబర్ ప్రమాదాలను ఎదర్కొవడానికి బలమైన, విధానపరమైన సమన్వయం అవసరమని తెలిపారు. సైబర్ నేరగాళ్లు సాంకేతికతను వాడుకుంటున్నట్లే పోలీసులు అదే సాంకేతికత ఆధారంగా వారి ఆట కట్టించాలని సూచించారు. అంతేకాక ఎవరూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సదస్సులో అడిషనల్ డీసీపీ రామానుజం, సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణీందర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లపైకి కేజ్ వీల్స్తో వస్తే చర్యలు రోడ్లపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్దత్ హెచ్చరించారు. ప్రజారవాణా కోసం ప్రభుత్వం నిర్మించిన రహదారులు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈమేరకు రైతులు పొలాల వద్ద పని ముగిశాక కేజ్ వీల్స్ తొలగించి సాధారణ టైర్లు అమర్చుకోవాలే తప్ప అలాగే రోడ్లపై నడపొద్దని సూచించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి శివారులో ఆర్అండ్బీ రోడ్డుపై కేజ్ వీల్స్తో ట్రాక్టర్లు నడుపుతున్నారనే ఆర్అండ్ బీ అధికారుల ఫిర్యాదు మేరకు డ్రైవర్లు సారా కృష్ణ, పమ్మి కృష్ణయ్య, గుత్తి ముత్యాలరావు, బోసి కోర్రాజుపై కేసు నమోదు చేయడమే కాక ట్రాక్టర్లు సీజ్ చేశామని తెలిపారు. ఈమేరకు రైతులు, ట్రాక్టర్ల యజమానులు నిబంధనలు పాటించాలని సీపీ ఓ ప్రకటనలో కోరారు.యువత భవిష్యత్ను కాపాడేలా మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు జిల్లా సరిహద్దులు, జాతీయ రహదారులపై విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు సీపీ సునీల్దత్ తెలిపారు. గంజాయి రవాణా మార్గాలపై టాస్క్ఫోర్స్, ఈగల్ఫోర్స్ సిబ్బందే కాక ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో 55 కేసులు నమోదు చేయగా, రూ.2.24కోట్ల విలువైన 450 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 123మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో గంజాయి మూలాలను గుర్తించి శాశ్వతంగా నిర్మూలించేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా, గంజాయి రవాణా, విక్రయాలు, సాగు వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు కమిషనర్ సునీల్దత్ -
91శాతం మందికి ‘ఆల్బెండజోల్’ మాత్రలు
డీఎంహెచ్ఓ రామారావుఖమ్మంవైద్యవిభాగం: పిల్లల కడుపులో పెరిగే నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు పనిచేస్తాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం నయాబజార్ పాఠశాలలో ఆయన పిల్లలతో ఆల్బెండజోల్ మాత్రలు మింగించాక మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించాక చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలతో నులిపురుగులు దరి చేరవని తెలిపారు. జిలాల్లో 1నుంచి 19ఏళ్ల వయస్సు పిల్లలు 2,87,579 మంది ఉండగా, సోమవారం 2,82,196 మంది(91శాతం) పిల్లలకు మాత్రలు పంపిణీ చేశామని చెప్పారు. మిగతా వారితో ఈనెల 20న మాత్రలు మింగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు డాక్టర్ ప్రతాప్ సంపత్కుమార్, డాక్టర్ లక్ష్మీనారాయణ, కే.వీ.రాజు, రమణ, డాక్టర్ దేవిశ్రీ, డాక్టర్ రవికుమార్, నాగమాధురి, జైపాల్, శారద, రామకృష్ణ, హెచ్ఎం ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు. -
నిష్పాక్షిక ప్రాసిక్యూషన్ సేవలు అందించాలి
ఖమ్మంలీగల్: ప్రాసిక్యూషన్ అధికారులు ప్రజా కేంద్రీకృత, నిష్పాక్షిక, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ సేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్.సాంబశివరెడ్డి సూచించారు. జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన ఉమ్మడి జిల్లా ప్రాసిక్యూటింగ్ అధికారులతో సమావేశమయ్యారు. నూతన క్రిమినల్ చట్టాల అమలు, ఈ–ప్రాసిక్యూషన్ వేదిక వినియోగం, కేసుల పరిష్కారం, పరిపాలన, వృత్తిపరమైన అంశాలపై సూచనలు చేశారు. తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసిన సాంబశివరెడ్డి ప్రాసిక్యూటింగ్ అధికారులకు గదులు, వసతులు కల్పించాలని కోరారు. అలాగే, అదనపు జిల్లా న్యాయమూర్తి సీనయ్యను కూడా కలిశారు. కాగా, పలువురు న్యాయవాదులు సాంబశివరెడ్డని కలిసి ఏపీపీల నియామకంపై వినతిపత్రం ఇవ్వగా, కోర్టు డ్యూటీ అధికారులు తమ సమస్యలను వివరించారు. ఇక్కడే చదువుకున్నా... డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివరెడ్డి జిల్లా పర్యటనలో విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిల్లాలోని ఎర్రుపాలెం మండలం భీమవరానికి చెందిన తాను ప్రాథమిక గ్రామ ప్రభుత్వ పాఠశాలలో, డిగ్రీ సత్తుపల్లిలోని జేవీఆర్ కళాశాలలో పూర్తిచేశానని తెలిపారు. అంతేకాక మధ్యలో కొన్నాళ్లు ఖమ్మంలోని మాంట్ఫోర్ట్ హైస్కూల్లో చదివానని పేర్కొన్నారు. ప్రస్తుతం శాఖాధిపతిగా జిల్లాకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పీవీడీ.లక్ష్మి, స్వప్న, ప్రాసిక్యూషన్ డీడీ(ఇన్చార్జ్) జి.డేనియల్ కుమార్, ఏపీపీలు రాజారావు, ఎల్.కిషన్, శరత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివరెడ్డి -
భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన నాగన్న
తిరుమలాయపాలెం: భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సుదీర్ఘ కాలం తన గళం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపిన ఘనత అరుణోదయ నాగన్నకు దక్కుతుందని న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిది జే.వీ.చలపతిరావు, కేంద్ర కమిటీ సభ్యుడు గాదె మాధవరెడ్డి తెలిపారు. ఇటీవల మృతి చెందిన నాగన్న సంస్మరణ సభ ఆయన స్వగ్రామమైన మండలంలోని రాజారంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీపాద శ్రీహరి విగ్రహానికి నివాళులర్పించాక, నాగన్న స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం చలపతిరావు, మాధవరెడ్డి మాట్లాడుతూ నాగన్న 50 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో ప్రజలకు నాయకత్వం వహించారని తెలిపారు. నాటి తరం అరుణోదయ కళాకారులు లేని లోటును యువ కళాకారులు తీర్చాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరు మధు మాట్లాడగా తొలుత కళాకారులు డప్పు నృత్యాలు, పాటలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నాయకుడు మందుల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు గాదె ఝాన్సీ, ఏనుగుల చంద్రారెడ్డి, బండారి ఐలయ్య, మందుల అరుణ, పరకాల లక్ష్మి, అజయ్, ఉదయగిరి, పోలేపొంగు నాగయ్య, వేణు, విప్లవ కుమార్, గొర్రెపాటి రమేష్, ప్రకాష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.సంస్మరణ సభలో ఎన్డీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిరావు -
జీపీల అభివృద్ధికి కృషి చేయాలి
పంచాయతీరాజ్ శాఖ డీడీ విద్యాలత కొణిజర్ల: గ్రామపంచాయతీల అభివృద్ధికి పాలక మండళ్ల బాధ్యులు, మండల పరిషత్ అధికారులు కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఎం.విద్యాలత సూచించారు. కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో గ్రామ సమాఖ్య భవనం, డ్రెయిన్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలను సోమవారం ఆమె పరిశీలించారు. అలాగే, వన మహోత్సవంలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో మొక్క నాటారు. అనంతరం డీడీ మాట్లాడుతూ వీబీజీ రామ్కు సంబంధించి పనుల గుర్తింపు మొదలుపెట్టాలని సూచించారు. అలాగే, అభివృద్ధి నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ పి.శ్రీనివాసరావు, డీఎల్పీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ రామిరెడ్డి ఉపేంద్రయ్య, సర్పంచ్ వేము నాగరాజు, ఉపసర్పంచ్ సురభి కృష్ణ, వివిధ శాఖల ఉద్యోగులు కిషోర్, అమ్మాజాన్, సునీల్, పవన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, డీడీగా పదోన్నతి పొందాక తొలిసారి కొణిజర్ల మండలానికి వచ్చిన విద్యాలతను ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు సత్కరించారు. కల్లూరు ప్రభుత్వ కాలేజీకి బాలికల హాస్టల్ కల్లూరురూరల్: కల్లూరులోని ప్రభుత్వ జూని యర్ కాలేజీకి అనుబంధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన బాలికల హాస్టల్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల వసతి నిమిత్తం హాస్టల్ మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ వేముల శేఖర్ గతంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈమేరకు జిల్లాకు రెండు బాలికల హాస్టళ్ల మంజూరు చేయగా ఒకటి కల్లూరుకు కేటాయించారు. త్వరలోనే అనువైన భవనాన్ని గుర్తించి హాస్టల్ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరాటే కోచ్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మం స్పోర్ట్స్: బాలికల స్వీయ రక్షణకోసం ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు కరాటే శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎంశ్రీ పథకం కింద శిక్షణ ఇవ్వనుండగా, ఆసక్తి ఉన్న కోచ్లు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి సూచించారు. బాక్ బెల్ట్ ఉన్న వారే అర్హులని, నెలకు 24రోజుల చొప్పున మూడు నెలల శిక్షణకు గౌరవ వేతనంగా రూ.10 వేలు ఇస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న సర్టిఫికెట్లతో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని డీవైఎస్ఓ సూచించారు. 2,142 మె.టన్నుల యూరియా చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు సీఐఎల్ కంపెనీకి చెందిన 2,142 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 742 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 800 మె.టన్నులు కేటాయించగా మిగతా 100 మె.టన్నులు బఫర్ స్టాక్గా నిల్వ చేశామని డీఏఓ పుల్లయ్య తెలిపారు. పౌర సరఫరాల సంస్థ డీఎంగా మల్లికార్జున్బాబుఖమ్మం సహకారనగర్: పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్గా ఎం.మల్లికార్జున్బాబు నియమితులయ్యారు. కొన్నాళ్లుగా ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో డీవైఎస్ఓ సునీల్రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇంతలోనే జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి(డీసీఎస్ఓ) చందన్కుమార్ కూడా సెలవులో వెళ్లడంతో రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో హైదరాబాద్ పౌరసరఫరాల శాఖ ఏసీఎస్ఓగా పని చేస్తున్న మల్లికార్జున్బాబును ఖమ్మం డీఎంగా నియమించారు. అంతేకాక డీసీఎస్ఓగా ఇన్చార్జి బాధ్యతలు సైతం ఆయనకు అప్పగించగా సోమవారం ఆయన విధుల్లో చేరారు. -
నిజాయితీ చాటుకున్న హోంగార్డు
ఖమ్మంక్రైం: ఏటీఎం మిషన్లో ఖాతాదారుడు మర్చిపోయిన డబ్బును బ్యాంక్ ఉద్యోగులకు అందజేసి హోంగార్డు తన నిజాయితీ చాటుకున్నాడు. ఖమ్మంకు చెందిన హోంగార్డు రాంప్రసాద్ సోమవారం ఖమ్మం వైరా రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. అప్పటికే మిషన్లో ఓ ఖాతాదారుడు డ్రా చేసిన రూ.10వేల నగదు ఉంది. దీంతో రాంప్రసాద్ ఆ నగదును బ్యాంక్ మేనేజర్కు అప్పగించగా అధికారులు ఆయనను అభినందించారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యాన అవగాహన కూసుమంచి: విపత్తుల సమయాన అప్రమత్తంగా ఉండడంతో పాటు రక్షించుకోవాల్సిన విధానాలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు అవగాహన కల్పించారు. మండలంలోని పాలేరు గ్రామంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరదల సమయాన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరదల్లో చిక్కుకుంటే ఎలా బయటపడాలో వివివరించారు. గతంలో పాలేరు రిజర్వాయర్కు భారీ వరద వచ్చి నష్టం జరిగినందున ఈ సదస్సు ఏర్పాటుచేసినట్లు తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ జశ్వంత్కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ జ్యోతి, స్థానికులు పాల్గొన్నారు. -
లెక్క తప్పుతోంది..
పర్యావరణ సమతుల్యతను కాపాడడం, పచ్చదనం పెంపు కోసం ఏటా ప్రభుత్వం వన మహోత్సవం నిర్వహిస్తోంది. సహజంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించగానే, వన మహోత్సవ హడావుడి ప్రారంభమవుతుంది. ఈసారి జూన్ నెలలో రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి వనమహోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లాలోనూ మొదలుపెట్టినా, వర్షాలు సరిగ్గా లేక కార్యక్రమం అంతంత మాత్రంగానే నడుస్తోంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అమలు చేస్తున్న వన మహోత్సవ కార్యక్రమానికి ఈసారి వర్షాభావ పరిస్థితులు అడ్డొచ్చాయి. ఎల్నినో ప్రభావంతో ఇప్పటివరకు సరైన వర్షాలు లేక అంతంతమాత్రంగానే మొక్కలు నాటారు. ఏటా జూన్లో వర్షాలు మొదలుకాగానే ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాల మేరకు మొక్కలు నాటడం మొదలుపెడతారు. కానీ ఈసారి జూలై వచ్చినా ఒక్క భారీ వర్షం లేకపోగా, మొక్కలు నాటినా సంరక్షణ కష్టమనే భావనతో అధికారులు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. జిల్లాలో 31.30 లక్షల మొక్కలను నాటాలని నిర్దేశించుకున్నా, ఇప్పటి వరకు నాటింది, పంపిణీ చేసినవి రెండు లక్షలే కావడం గమనార్హం. సంరక్షణ కష్టమే.. వర్షాకాలం వచ్చి నెల దాటినా జిల్లాలో ఇంకా పొడి వాతావరణమే కొనసాగుతోంది. మబ్బులు పట్ట డం, జల్లులు కురవడమే తప్ప పెద్దవర్షాలు లేక భూమిలో వేడి చల్లారలేదు. ఈ పరిస్థితుల్లో మొక్కలు నాటడం సబబు కాదని, నాటినా సంరక్షించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యాన భారీ వర్షాలు పడే వరకు మరికొంత సమయం వేచిచూసే అవకాశం ఉంది. దూరంగా లక్ష్యం జిల్లాలో ఈ ఏడాది 31.30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు శాఖల వారీగా లక్ష్యాలు కేటాయించి నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు 1,99,400 మొక్కలే నాటగా.. 1,100 మొక్కలరు పంపిణీ చేశారు. అంటే లక్ష్యంలో కేవలం 6.41 శాతమే పూర్తయింది. వర్షాలు కురిస్తేనే.. జిల్లాలో పూర్తిస్థాయిలో వర్షాలు కురిస్తేనే వన మహోత్సవం జోరందుకోనుంది. అధికారులు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసి, ఎక్కడెక్కడ నాటాలో కూడా స్థలాలను ఎంపిక చేశారు. ప్రస్తుతం నర్సరీల్లో వెదురు, మందార, చింత, దానిమ్మ, ఎర్ర తురాయి, కానుగ, నెమలినార, ఉసిరి, వేపతో పాటు ఇతర మొక్కలను పెంచారు. జూలైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించగా, రెండు వారాలు దాటినా ఆ పరిస్థితి కానరావడం లేదు. ఈనెలాఖరు వరకై నా భారీ వర్షం కురిస్తే వన మహోత్సవం చకచకా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.శాఖల వారీగా నాటాల్సిన మొక్కలువన మహోత్సవంలో 31.30లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక -
కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల
వైరా: వైరా రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరడంతో ఆయకట్టులో సాగు అవసరాల నిమిత్తం కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గోదావరి జలాలు చేర్చామని తెలిపారు. ఈ నీటిని ప్రతీ ఎకరాకు అందేలా చర్యలు చేపట్టామని, రైతులు నీరు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు పాల్గొన్నారు. -
అయోధ్య గుడి పేరుతో అక్రమాలు
భద్రగిరిలో మౌనదీక్ష చేపట్టిన ప్రభుత్వ సలహాదారుడు వీహెచ్భద్రాచలం: అందరి దేవుడైన అయోధ్య రాముడికి గుడి నిర్మించాక ప్రారంభానికి గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా బీజేపీ నాయకులు అవమానించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు వీహెచ్.హనుమంతరావు పేర్కొన్నారు. అయోధ్యలో అక్రమాలు, అవినీతి ఆరోపణలకు నిరసనగా భద్రాచలంలో ఆయన సోమవారం 30 నిమి షాల మౌన దీక్ష చేపట్టారు. దీక్ష విరమించాక వీహె చ్ మాట్లాడుతూ రాముడి పేరుతో గుడి కట్టించిన బీజేపీ ప్రభుత్వం నిర్మాణం మొదలు హుండీల వరకు దోచుకుంటోందని విమర్శించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినందున, అయోధ్యలో అక్రమాలపై సిట్తో కాకుండా సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాముడికి హనుమంతు పేరు కలిగిన తన కంటే పెద్ద భక్తుడు ఎవరు ఉంటారని ప్రశ్నించారు. రాముడంటే అయోధ్య రాముడే కాదని, భద్రగిరిలో ఉండేది కూడా రాముడేనని తెలిపారు. అందుకే భద్రగిరి రామయ్య చెంతన మౌన దీక్ష చేపట్టానని, ఈనెల 19వ తేదీన ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భద్రాచలం దేవస్థానం అభివృద్ధి చేస్తున్నందున, కేంద్రం కూడా నిధులు విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ భక్తులు విరాళాల రూపంలో అందించిన సొమ్మును కాపాడుతూ వసతుల కల్పించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ దీక్షలో నాయకులు తోట దేవీప్రసన్న, పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ను రద్దు చేయాల్సిందే..
ఖమ్మం సహకారనగర్: ఎన్నికల సమయాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్ సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జన జాగరణ యాత్ర సోమవారం ఖమ్మంకు చేరుకుంది. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా ఆయన మాట్లాడారు. ర్యాలీలో దివ్యాంగ, మహిళా ఉద్యోగులు సంఘాలకు అతీతంగా వందల సంఖ్యలో పాల్గొనడం పాత పెన్షన్ పునరుద్ధరణ ఆవశ్యకతను తెలియచేస్తోందని చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్తో పాటు మిగతా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శులు మోబీన్ అహ్మద్, రాగి సురేష్, లక్ష్మణాచారితో పాటు వివిధ సంఘాల నాయకులు గుగులోత్ మోహన్, ఎం.శ్వేత, నాగమణి, బంగారయ్య, క్రాంతి, రాజశేఖర్, శ్రీకాంత్, సుభాన్, కె.సంపత్, టి.సాయికృష్ణ, పారుపల్లి నాగేశ్వరరావు, ఎస్.విజయ్, వెంగళరావు, మల్లయ్య, శ్రీనివాస్రెడ్డి, నాగుల్ మీరా, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటరమణారెడ్డి, లింగానాయక్ తదితరులు పాల్గొన్నారు.టీఎస్ సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ -
రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక
సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక కోసం కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్ స్విమ్మింగ్ పూల్లో సోమవారం పోటీలు నిర్వహించారు. అనంతరం జట్టు వివరాలను స్విమ్మింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి హన్మంతరాజు వెల్లడించారు. గ్రూప్ ఏలో పి.వరప్రసాద్, ఏ.సాయికార్తీక్, జె.అజయ్, జె.లలిత్సాయి ఎంపిక కాగా, గ్రూప్ బీలో కె.హరీష్, సీహెచ్.శివకార్తికేయ, బి.శ్రీనాగచైతన్య, కె.నీరజ్, పి.నోయల్ విన్సెంట్, కె.మదన్, విష్ణువర్ధన్, గ్రూప్ సీలో సీహెచ్.మోక్ష చంద్రశేఖర్, ఆర్.ప్రతీక్ సింగ్, జి.హషిత్ సాయి, పి.హర్షిత్ చరణ్, ధనుంజయ్, వి.మనీష్, ఎం.తోషన్, వి.దేదీప్యసాయి, గ్రూప్ డీ జట్టుకు జి.మాన్విక్, ఏ.స్నేహిత్, ఎం.కేతన్, కె.లిఖిల్, పి.భవిష్, సీహెచ్.శ్రీధయి, సీహెచ్.కృష్ణవేణి, కృతిక, టి.లక్ష్మి హయాతి, సీహెచ్.జాన్విక ఎంపికయ్యారని తెలిపారు. ఈ జట్లు 18, 19వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో పాల్గొంటారని వివరించారు. -
పోలీసుల చేతుల్లో లాఠీ, తుపాకీ!
● గతంలో మాదిరి ‘బేసిక్ పోలీసింగ్’ ● డీజీపీ పర్యటన తర్వాత గస్తీ, బందోబస్తులో మార్పులుఖమ్మంక్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గస్తీ కాయడం, బందోబస్తు నిర్వహించే పోలీసుల చేతుల్లో లాఠీలు, తుపాకులు ఉంటేనే ఎదుటి వారు మాట వింటారని భావిస్తారు. ‘బేసిక్ పోలీసింగ్’గా దీన్ని పరిగణిస్తూ కొన్నేళ్ల క్రితం వరకు పోలీసులు ఇలాగే విధులు నిర్వర్తించేవారు. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమల్లోకి వచ్చాక, లాఠీలు, ఆయుధాలను స్టేషన్లకే పరిమితం చేశారు. అయితే, ఇటీవల జిల్లాలో డీజీపీ సీ.వీ.ఆనంద్ పర్యటన తర్వాత పోలీసులు ఏళ్ల క్రితం వదిలేసిన విధానంపై దృష్టి సారించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అందరికీ కాదు... ఉమ్మడి జిల్లా పర్యటనకు ఇటీవల వచ్చిన డీజీపీ సీ.వీ.ఆనంద్ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ‘సామాన్యులకు చట్టం ద్వారా రక్షణ కవచంలా, అండగా నిలిచేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ తప్పేమీ కాదు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే రౌడీలు, గుండాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. అలాంటి వారిని కట్టడి చేయడానికి బేసిక్ పోలీసింగ్పై దృష్టి సారించాలి’ అని సూచించినట్లు చెబుతున్నారు. ఈమేరకు క్రమశిక్షణ అదుపుతప్పి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యాన గస్తీలో లాఠీలు, ఆయుధాలు తప్పవన్న నిర్ణయానికి వచ్చిన ఖమ్మం కమిషనరేట్లో అమలుచేయడం ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు అధికారుల వద్ద ఆయుధాన్ని అందుబాటులో ఉంచుకోవడం శ్రేయస్కరంగా భావించి లాఠీలు, తుపాకులతో గస్తీ, బందోబస్తుకు బయలుదేరుతున్నారు. ఈమేరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి నిర్మానుష్య ప్రాంతాలు, హాట్ స్పాట్లలో అర్ధరాత్రి వేళ గస్తీ పెంచి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్న వారు, రోడ్ల వెంట మద్యం తాగుతున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తుండగా.. ఇది నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. -
కత్తిరిస్తే.. లాభాల పంట
● మామిడి తోటల్లో కొమ్మల కత్తిరింపు కీలకం ● ఇదే అనువైన సమయం కావడంతో అధికారుల అవగాహన ● రైతులు ముందుకొస్తే మంచి ఫలితాలు తల్లాడ: మామిడితోటల్లో కాయల సీజన్ ముగిసింది. ఈ సమయాన రైతులు సస్యరక్షణ చర్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు ముదురు తోటల్లో చెట్లకు భారంగా మారిన కొమ్మలను నరికివేయడం మొదలుపెట్టారు. ఇలా కొమ్మల తొలగింపుతో గాలి, వెలుతురు అన్ని కొమ్మలకు సమృద్ధిగా తాకుతుందని.. సీజన్లో పిందె రాలడం తగ్గుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే, దట్టంగా ఉన్న కొమ్మలను తీస్తే చెట్టు శక్తి అవస రమైన కొమ్మలతో పాటు పూత, పిందెకు ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. ఈ మేరకు రైతులు మామిడి తోటల్లో కొమ్మల కత్తిరింపు పనుల్లో నిమగ్నం కాగా.. రైతులంతా ముందుకొచ్చేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. చీడపీడలు తక్కువ మామిడి చెట్లపై అన్ని కొమ్మలకు గాలి తాకకపోతే బూజు, ఆకుమచ్చ, పొడిబెట్ట వంటివి వస్తాయి. కత్తిరింపుతో చెట్టు మధ్యలో గాలి తిరిగి తేమ తగ్గుతుంది. పురుగు మందులు కొట్టడం కూడా సులువవుతుంది. అలాగే, కొమ్మల కత్తిరింపుతో చెట్లు ఎక్కువ ఎత్తు పెరగకుండా 3–4 మీటర్లలో ఉంచితే కాయలు కోయడం, మందు కొట్టడం తేలికవుతుంది. చిన్నప్పటి నుంచి కత్తిరిస్తే గుండ్రటి, బలమైన కాండం, సమానంగా విస్తరించిన కొమ్మలతో చెట్టు సరైన రూపం దాల్చి గాలి, తుపానుకు విరిగిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఇదే అదును.. పంట కోసిన వెంటనే.. జూన్ – జూలై నెలల్లో ఎండిన, చీడపీడలు ఉన్నవే కాక ఒకదానిపై ఒకటి రుద్దుకునే కొమ్మలను తొలగించాలి. కొత్త చిగుళ్లు వచ్చే ముందు కత్తిరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒకేసారి 20 – 25 శాతం కంటే ఎక్కువ కొమ్మలు మాత్రం తీయొద్దు. ఇక కత్తిరించిన చోట ‘బోర్డో’పేస్ట్ రాస్తే ఫంగస్ రాకుండా ఉంటుంది. జిల్లాలో 32 వేల ఎకరాలు.. ఖమ్మం జిల్లాలో 32 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. కల్లూరు డివిజన్లో 20 వేల ఎకరాలు, ఖమ్మం డివిజన్లో 12 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అయితే, మొత్తం తోటల్లో 50 శాతానికి పైగా ముదురు తోటలు ఉన్నట్లు అంచనా. బంగినపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు, గులాబీ, తోతాపురి, హిమ పసంద్ వంటి రకాలకు చెందిన తోటల్లో ఏటా డిసెంబర్లో పూత ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సీజన్ ముగిసినందున కొమ్మల తొలగింపు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మామిడితోటల్లో కొమ్మల కత్తిరింపు వల్ల చెట్లు ఏపుగా పెరుగుతాయి. దిగుబడి కూడా పెరుగుతుంది. లేత తోటల్లో ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ము దురు తోటల్లోనైతే పూత నిలవడం, కాయ దిగుబడి పెరగడానికి ఉపకరిస్తుంది. రైతులు జూలై నెలలో కొమ్మలు కత్తిరించడం వల్ల వర్షాలకు మళ్లీ చిగుర్లు వచ్చి కొత్త కొమ్మలు పెరుగుతాయి. –ఎండీ తాజుద్దీన్, ఏఓ, తల్లాడ -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
వేంసూరు: భార్య కాపురానకి రావడం లేదని శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. లింగపాలెం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి నాగరాజుకు రేజర్ల గ్రామానికి చెందిన మాధివితో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాలతో వారు కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. కాగా, మర్లపాడులోని తిరువూరు రోడ్డులో అనురాధ రెస్టారెంట్లో ఒంటరిగా ఉన్న మాధవిపై నాగారాజు కత్తితో దాడి చేయాగా కుడి భుజం, కుడి చేతి వేళ్లు, ఎడమ మణికట్టుకు తీవ్ర గ్రాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, తన సోదరుడు అన్నమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ కవిత వెల్లడించారు. కాగా, నాగరాజు కుటుంబ సభ్యులు సైతం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలు
నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదం జరగగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నేలకొండపల్లిలోని ఓ కంపెనీ సెల్ఫోన్ టవర్ మరమ్మతు లను కల్లూరుకు చెందిన కొందరు చేస్తున్నారు. ఈ క్రమాన ఆదివారం కార్మికుడు ఈశ్వర్ 11 కే.వీ.కి జంపర్లు కలిపేందుకు ఎల్సీ ఇవ్వాలని ఆన్లైన్లో కోరాడు. కానీ అనుమతి రాకముందే ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేస్తుండుగా విద్యుదాఘాతానికి గురయ్యా డు. ఆయన పైనుంచి కింద పడడంతో తీవ్రగాయాలు కాగా సహచరులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 95 కేజీల గంజాయి సీజ్ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు పెనుబల్లి: ఒడిశా నుంచి కర్ణాటకలోని మైసూరుకు తరలిస్తున్న గంజాయిని ఈగల్ టీం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండ లం వీఎం బంజర పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న నిందితులు పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పాయింట్ వద్ద టిఫిన్ కోసం ఆగారు. ఇదే సమయాన తనిఖీలు చేపడుతున్నఈగల్ టీం, స్థానిక పోలీసులు కారులో పరిశీలించగా 95 కేజీల గంజాయి బయటపడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన ఆకుల అయ్యప్పరెడ్డి, కాకినాడకు చెందిన మొగిలిశెట్టి దేవి, మైసూర్కు చెందిన అంబరీ పూజారి చంద్రశేఖర్ను విచారించగా ఒడిశా నుంచి మైసూర్కు గంజాయి తరలిస్తున్నట్లు అంగీకరించారు. కాగా, నిందితులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో ఎస్ఐ వెంకటేశ్, ఏఎస్ఐ చెన్నారావు, సిబ్బంది పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుడి రిమాండ్దర్యాప్తు కోసం కస్టడీ కోరిన పోలీసులు కారేపల్లి: చోరీ కేసులో నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరినట్లు కారేపల్లి ఎస్ఐ బి.గోపి తెలిపారు. జూన్ 22వ తేదీన కారేపలి బస్టాండ్ సెంటర్కు చెందిన కేతిమాల సారయ్య ఇంట్లో ఐదు తులాల బంగారం, రెండు తులాల వెండి పట్టీలతో పాటు, కొంత నగదు చోరీకి గురైంది. విచారణలో నిందితుడు హైదరాబాద్కు చెందిన పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. తాజాగా హైదరాబాద్లోనూ చోరీ చేయగా, నిందితుడు అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు కారేపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్కడి నుంచి ఖమ్మం సబ్జైలుకు తరలించారు. కాగా, చోరీకి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కోసం నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరినట్లు ఎస్ఐ గోపి వెల్లడించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో పలు సబ్జెక్ట్లను బోధించేందుకు గాను ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇన్సర్వీస్ టీచర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వాసంతి ఆదవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, గణితం, ఫిలాసఫీ, సోషయాలజీ, సైకాలజీ, సైన్స్, తెలుగు సబ్జెక్ట్లు బోధించే వారు అర్హులని, ఈ నెల 14వ తేదీ వరకు www. schooledu. telangana. gov. inవెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రశాంతంగా పరీక్షకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని కేజీబీవీల్లో చదివే ఆరో తరగతి విద్యార్థులకు ఆదివారం జరిగిన యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ (జేఈఈ, నీట్, సీఎల్ఏటీ)లలో శిక్షణ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ డి.వాసంతి తెలిపారు. పరీక్ష నిర్వహ ణ కోసం జిల్లాలో రెండు సెంటర్లు ఏర్పాటు చేయగా, జేఈఈ శిక్షణ కోసం 35 మంది దర ఖాస్తు చేసుకోగా, 14 మంది పరీక్ష రాశారని, నీట్ కోసం 75 మంది దరఖాస్తు చేసుకోగా, 52 మంది, సీఎల్ఏటీ కోసం 37 మంది దరఖాస్తు చేసుకోగా, 29 మంది పరీక్ష రాశారన్నారు. పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంభుప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామ్స్) మాధవరావు, జెండర్ కోఆర్డినేటర్ జానకీదేవి, పాల్వంచ ఎంఈఓ రాంమూర్తి, దుమ్ముగూడెం ఎంఈఓ సమ్మయ్య సహకరించారని డీఈఓ పేర్కొన్నారు. మాలల ప్రయోజనాలే ముఖ్యం భద్రాచలంటౌన్: ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే... తనకు పదవులేం ముఖ్యం కాదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మాలల హక్కుల సాధన, వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడతానని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ అమలు, రోస్టర్ విధానం రద్దు కోసం భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన మహా ర్యాలీ, బహిరంగ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే వర్గీకరణ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా... ఉమ్మడి రాష్ట్రంలోని దామాషా ప్రకారమే ఈ విభజన జరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం కొన్ని సెక్టార్లనే పరిగణనలోకి తీసుకుని లెక్కించారని గుర్తుచేశారు. గతంలో షమీమ్ అఖ్తర్ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ నేపథ్యాన మాలలకు జరిగిన అన్యాయంపై తాను ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడతానని చెప్పారు. అలాగే, వర్గీకరణపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీలోని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో చర్చించి మాలలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని తాను ఇప్పటికే హెచ్చరించానని తెలిపారు. కాగా, మాల ఉద్యోగుల్లో ప్రస్తుతం ఆశించినంత ఆసక్తి కనిపించడం లేదని.. వారు చొరవ తీసుకుని హక్కుల సాధన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
దివ్యాంగులకు అండగా రాష్ట్రప్రభుత్వం
ఖమ్మంమామిళ్లగూడెం: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తెలిపారు. ఖమ్మం టీఎన్జీవోస్ హాల్లో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే కల్యాణలక్ష్మి ద్వారా రూ.2 లక్షలు ఇస్తుండడమే కాక ఈ ఏడాది 2 వేల మందికి వాహనాలు అందించామని తెలి పారు. అంతేకాక పదోన్నతి వచ్చిన చోటే ఉద్యోగులు కొనసాగేలా జీఓ జారీ చేసిందని చెప్పారు. కాగా, దివ్యాంగ మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఏ సమస్య ఉన్నా జిల్లాలో ని ముగ్గురు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కా రానికి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు కుంచం ఉప్పలయ్య మాట్లాడుతూ.. వేయి గజాల్లో దివ్యాంగుల భవనం ఏర్పాటుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారని చెప్పారు. అనంతరం పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడగా స్టడీ సర్కిల్ సంస్థ చైర్మన్ నరసింహారావు, నాయకులు తాటికొండ రమేశ్, కోటి, ఈడబోయిన సురేశ్, యూసుఫ్, షేక్ ముస్తఫా, డోన్వాన్ నాగరాజు, బండి వెంకటరమణ, వడ్డెపూడి లక్ష్మయ్య, షేక్ జానీ, తేళ్ల ప్రవీణ్కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు. -
అడవి పందుల వధ..
నేలకొండపల్లి: అక్రమంగా అడవి పందులను తీసుకొచ్చి వధించేందుకు సిద్ధం కాగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. మెదక్ నుంచి నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారానికి ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన పి.నాగరాజు డీసీఎం వ్యాన్లో ఏడు అడవి పందులను తీసుకొచ్చారు. వీటిని ఇక్కడ కోసి విక్రయించేందుకు సిద్ధం కావడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ పి.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకోగా, అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ కేవీ రామారావు, సెక్షన్ ఆఫీసర్ పి.దానియేలు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించారు. చనిపోయిన రెండు పందులను పశు సంవర్థక శాఖ అధికారులతో పోస్టుమార్టం చేయించి ఖననం చేయించగా, మరో ఐదింటిని వెలుగుమట్ల అటవీ ప్రాంతంలో వదిలేశారు. అలాగే, నాగరాజుపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రెండు మృతి, మరో ఐదు స్వాధీనం -
అలరించిన ‘సుదీర్ఘ గానలహరి’
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం వేదికగా ఆదివారం ఉదయం 6 నుంచి 15 గంటల పాటు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’పేరిట నిర్వహించిన సుదీర్ఘ గానలహరి ప్రేక్షకులను అలరించింది. స్వర మధురిమ కల్చరల్స్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ గాయకుడు వీవీ రెడ్డి 15 గంటల పాటు తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది గాయనీ, గాయకులు 150 సినీ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా కల్చరల్ యూనిట్ అధ్యక్షుడు ఇసనపల్లి నగేశ్ మాట్లాడుతూ.. 15 గంటల పాటు సంగీత విన్యాసం చేసిన వీ.వీ.రెడ్డి పలు రికార్డులను సొంతం చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ బాధ్యులు, గాయకులు మార్కపూడి నాగభూషణం, నందిగామ రాజ్కుమార్ జానీ, దేవపంగు ఫణి, భిక్షం, శ్రీకాంత్ కన్నా, అద్దంకి నరసింహారావు, గద్దల కుటుంబరావు, ఆలవాల కృపానందం, పీజే వినయ్కుమార్,జిల్లపల్లి రమేశ్, పాషా తదితరులు పాల్గొన్నారు. -
జానకమ్మ స్వరం
మన నేలపై..శ్రీరామ రామ రామేతి.. ఖమ్మం గాంధీచౌక్లో 1996 ఏప్రిల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు నిర్వాహకుల ఆహ్వానం మేరకు జానకమ్మ హాజరయ్యారు. భక్త రామదాసు ప్రాజెక్టు బాధ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని తన మధుర గానంతో జిల్లావాసులను రంజింపజేశారు. సుమారు రెండు గంటల పాటు భక్తి గీతాలతో పాటు అలనాటి మధుర గీతాలను జానకమ్మ ఆలపించారని స్థానికులు గురు ్తచేసుకుంటున్నారు. శ్రీరామ రామ రామేతి, ఎంత మాత్రమున ఎవరెరుగగలరు, పాలయమామ్ వంటి భక్తిగీతాలే కాక తెలుగు సినీ పాటలతో మంత్రముగ్ధులను చేశారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం, సంగీత ప్రియులు హాజరుకావడంతో కూర్చునేందుకు కూడా స్థలం దొరకలేదని పలువురు తెలిపారు. ఖమ్మం ప్రజలకు జానకమ్మ గాత్రం మధుర జ్ఞాపకంగా ఉండిపోతుందని శ్రీరామనవమి వేడుకల నిర్వాహకులు, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. ‘జానకమ్మ వేదిక ఎక్కగానే గాంధీచౌక్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఆమె పాడిన కొన్ని పాటలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాయి’ అని ఆ కార్యక్రమానికి హాజరైన పలువురు తెలిపారు. ఇక ఖమ్మంకు సుధా సౌండ్ సిస్టం నిర్వాహకులతో ఉన్న పరిచయంతో వారి ఇంటికి వెళ్లిన జానకమ్మ కుటుంబ సభ్యులతో ఫొటో దిగారు. అంతేగాక ఆమెకు శ్రీకృష్ణ మందిరం ఫొటో జ్ఞాపికగా అందించామని వారు తెలిపారు. భద్రాచలానికి కూడా.. సుమధుర గాయని జానకమ్మ రాముడు నడయాడిననట్లు విశ్వసిస్తున్న భద్రాచలానికి సైతం పలుమార్లు వచ్చారు. ప్రభుత్వం ముప్ఫై ఏళ్ల క్రితం నిర్వహించిన భద్రాద్రి ఉత్సవాలకు ఆమె ఓసారి హాజరై రామయ్యను కూడా దర్శించుకున్నారు. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన పలువురు ఆమె పాడిన పాటలను జ్ఞాపకం చేసుకున్నారు. మరోమారు ఉత్సవాలకు వచ్చినప్పుడు తొలుత తమ ఇంట జానకమ్మ కాసేపు సేద తీరారని రామాలయ ప్రస్తుత ప్రధాన అర్చకుడు కోటి రామస్వరూప్ గుర్తుచేసుకున్నారు. అప్పుడే రామయ్యకు ఆమె వెండి కిరీటం సమర్పించారు. జానకమ్మకు రామయ్య అంటే అపారమైన భక్తి అని.. ఆ కారణంగానే ఉత్సవాలకు హాజరై రామయ్య కీర్తనలు ఆలపించారని రామస్వరూప్ తెలిపారు. అదే సమయాన పర్ణశాలను కూడా దర్శించుకున్నారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. సుప్రసిద్ధ గాయని ఎస్.జానకికి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో అనుబంధం ఉంది. ఆమె శనివారం గుండెపోటుతో కన్నుమూసినట్లు తెలియగానే సంగీత ప్రియులు, జిల్లావాసులు ఆమెతో జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. ఖమ్మంలో జానకమ్మ పాడిన రామభజనలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతున్నాయని తెలిపారు. జానకమ్మ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని గాయనీ, గాయకులు పేర్కొన్నారు. – ఖమ్మంగాంధీచౌక్/భద్రాచలంగానకోకిల జానకమ్మ పాటలు మరువలేనివి. ఆమె గాత్రమే పాటలను మధురంగా మారుస్తుంది. చిన్న పిల్లలు మొదలు, పెద్దలు, వృద్ధుల వరకు ఆడ, మగ గాత్రాలను పాడగలడం ఆమె గొప్పతనం. ఆమె పాటలు పాడుతూనే చిరునవ్వులు చిందించడం ఎంత సేపైనా చూడొచ్చు. –శఠగోపం సుదర్శన్, సుధా సౌండ్ సిస్టం, ఖమ్మం జానకమ్మ గొంతులో ఉండే భావం, నాలుగు భాషల్లో పలికించే ఉచ్ఛారణను మళ్లీ వినలేం. ఆమె లేకుండా తెలుగు పాట చరిత్ర అసంపూర్ణం. 88 ఏళ్ల వయసులో కూడా ఆమె పాడిన పాటలు, సంగీతంపై ఆమెకు ఆసక్తి మాలాంటి ఎందరికో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. –ఎస్.వీ.రమణ, గాయకుడు, ఖమ్మం -
కాళేశ్వరంపై అబద్ధాలు చెబుతున్నారు..
● రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసైనా సీఎం మేల్కొనాలి ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్అశ్వాపురం: కాళేశ్వరం నీళ్లు వస్తే కేసీఆర్ గొప్పతనం ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందోనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రాజెక్ట్ను పడుకోబెడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అశ్వాపురంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి మాట్లాడారు. రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసైనా సీఎం రేవంత్ రెడ్డి సోయి తెచ్చుకోవాలన్నారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల మేర నీటి ప్రవాహం ఉందని, కానీ 94 మీటర్లకే పంపులు ఆన్ చేయవచ్చని అన్నారు. మరో 100 రోజులపాటు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుందని రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే గోదావరి బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపి సస్యశ్యామలం చేసే అవకాశం ఉందన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మేడిగడ్డ నుంచి భద్రాచలం వరకు 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు తెచ్చామని, అప్పుడు కొట్టుకుపోని భద్రాచలం ఇప్పుడు లక్ష క్యూసెక్కులు కూడా లేకపోయినా ఎలా మునిగిపోతుందని ప్రశ్నించారు. పోలవరంతో తప్ప మేడిగడ్డతో భద్రాచలానికి ప్రమాదం లేదన్నారు. ఎన్నికల సమయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మీద ఆన అంటూ ఇచ్చిన హామీలను సీఎం గాలికొదిలేశారని విమర్శించారు. యూరియా దొరకడం లేదని రైతులు రోడ్డెక్కితే వారు రైతులే కాదనడం హాస్యాస్పదమన్నారు. సింగరేణి సమస్యలపై పోరాడేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కొల్లు మల్లారెడ్డి, కోడి అమరేందర్, మర్రి మల్లారెడ్డి, కంచుగంట్ల వీరభద్రం, ఎన్నా అశోక్ కుమార్, రావులపల్లి రాంప్రసాద్, పగడాల సతీష్ రెడ్డి, వట్టం రాంబాబు పాల్గొన్నారు. -
వైరా రిజర్వాయర్కు 550 క్యూసెక్కులు
వైరా/ఏన్కూరు: సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాల్లో 550 క్యూసెక్కుల నీటిని వైరా రిజర్వాయర్కు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. ఈమేరకు ఏన్కూరు మండలం తిమ్మరావుపేట ఎస్కేప్ లాక్ల వద్ద ఆదివారం ఆయన రిజర్వాయర్కు నీటిని విడుదల చేశాక గంగమ్మకు హారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి జలాలను సాగర్ కాల్వ ద్వారా రిజర్వాయర్లోకి చేర్చడంతో ఆయకట్టు కింద 30వేల ఎకరాల్లో పంటల సాగుకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరావు, నాయకులు స్వర్ణ నరేందర్, బొర్రా రాజశేఖర్, వడ్డే నారాయణ, డాక్టర్ కాపా మురళీకృష్ణ, లచ్చిరాం నాయక్, మేడా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రీ ప్రైమరీ’ విద్యార్థులకు కిట్లు
● ఎనిమిదేసి వస్తువులతో పంపిణీ ● మొదలైన ఇన్స్ట్రక్టర్ల నియామకంఖమ్మం సహకారనగర్: రాష్ట్రప్రభుత్వం ప్రైవేట్ కాన్వెంట్లకు దీటుగా చిన్నారులకు బోధన అందించేందుకు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగాన్ని ప్రవేశపెడుతోంది. జిల్లాలో గతేడాది 30 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించగా... ఈ ఏడాది మరో 114 పాఠశాలలకు మంజూరు చేశారు. కాగా, గతేడాది ప్రీ ప్రైమరీ తరగతులు మొదలైన పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కిట్లో సామగ్రి ఇవే... ప్రీ ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న కిట్లలో పలు రకాల సామగ్రి ఉన్నాయి. విద్యార్థులకు షూ, బెల్ట్, సాక్స్, యూనిఫామ్, పలక, డ్రాయింగ్ బుక్తో పాటు కలర్ క్రేయాన్లు, పెన్సిళ్లు తదితర వస్తువులు ఉన్నాయి. ఆటపాటలతో కూడిన విద్య అందించే ఉద్దేశంతో ఈ విభాగంలో బోధన జరగనుంది. కాగా, ఈ విద్యా సంవత్సరం కొత్తగా మంజూరైన 114 పాఠశాలల విద్యార్థులకు త్వరలో కిట్లు అందనున్నాయి. ఇక బోధనకు సైతం ఇన్స్ట్రక్టర్ల ఎంపిక పూర్తికాగా, వీరికి నియామక పత్రాలు అందజేస్తున్నారు. వీరి ద్వారా సోమవారం నుంచి బోధన మొదలుకానుందని విద్యాశాఖ ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
ప్రతికూలమేనా ?!
జిల్లాపై వరుణుడి కటాక్షం కరువైంది. వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఎల్నినో పరిస్థితులతో ఎండలు వేసవిని తలపిస్తుండగా.. పంటల సాగుకు వాతావరణం సహకరించడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వేసిన పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం అన్నదాతలను అయోమయంలో పడేస్తోంది. – ఖమ్మంవ్యవసాయంకనీస వర్షం కరువు... జూన్ సాధారణ వర్షపాతం 203 మి. మీ.కు గాను 168.9 మి.మీ.లే నమోదైంది. ఇక ఈనెల వర్షపాతం 241 మి. మీ.గా అంచనా వేస్తే 11వ తేదీ నాటికి కేవలం 20.1 మి.మీ.గా నమోదు కావడం గమనార్హం. రెండు నెలలు కలిపి 57.4 శాతం లోటు నమోదైంది. జిల్లాలోని 21 మండలాలకు గాను కారేపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, సత్తుపల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం మండలాలు లోటు వర్షపాతంలో ఉండగా, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తల్లాడ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం ముదిగొండ, చింతకాని, ఏన్కూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. మండుతున్న ఎండలు వర్షాలు లేకపోగా కొద్దిరోజులుగా నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. వర్షాలతో చల్లని వాతావరణం ఉండాల్సిన జూలైలో అందుకు భిన్నమైన పరిస్థితి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గడిచిన వేసవిలో 40 – 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ప్రస్తుతం 35 – 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఓ పక్క వాన లేక.. ఇంకోపక్క ఉష్ణోగ్రతల ప్రభావం పంటల సాగుపై పడుతోంది. చేతికి వస్తాయా? జూన్లో కురిసిన తొలకరి వానలకు రైతులు పత్తి, అపరాల పంటలు సాగు చేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితి అనుకూలించక పత్తితో పాటు పెసర, కంది వంటి పంటలు బెట్టకేశాయి. పత్తి పైరు ఎదుగుదల లోపించి, పెసర పైర్లు వడబడుతున్నాయి. పొడి దుక్కుల్లో నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తక, రెండోసారి నాటినప్పటికీ భూమిని చీల్చుకుని మొక్క రావడం లేదు. సహజంగా జూలై రెండో వారం కల్లా జిల్లాలో పత్తి సాగు లక్ష్యాన్ని చేరాల్సి ఉండగా.. సాధారణ సాగు 2,36,908 ఎకరాలకు గాను ఇప్పటివరకు 2,08,277 ఎకరాల్లోనే నాటారు. మరోపక్క పెసర, మొక్కజొన్న, చెరకు, కంది, వేరుశనగ వంటి పంటల సాగు కూడా నామమాత్రంగానే ఉంది. ఊపు లేని వరిసాగు జిల్లాలో ప్రధాన పంట అయిన వరి జూలై వచ్చిందంటే ఊపందుకోవాలి. ప్రధాన నీటివనరు అయిన సాగర్లోకి నీరు చేరితే వరి సాగు లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. కానీ ఎల్నినో ప్రభావంతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3,05,366 ఎకరాలకు ఇప్పటి వరకు కేవలం 18,166 ఎకరాల్లో నాట్లు వేశారు. బోర్లు, బావుల సౌకర్యం ఉన్న వారు మరో 64,436 ఎకరాలకు వరినార్లు సిద్ధం చేసుకున్నా వానలు లేకపోవడంతో వడబడుతున్నాయి.ఈ వాతావరణంలో ప్రత్యామ్నాయ పంటలైన అపరాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వడబడుతున్న మొక్కల రక్షణకు యూరియా ద్రావకం, నానో యూరియాను అధికారుల సూచనల మేరకు పిచికారీ చేస్తే 15 రోజులు కాపాడుకోవచ్చు. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
నేడు సీతమ్మ సాగర్ సందర్శన
● సమీక్షించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట సమీపంలో నిర్మాణంలో ఉన్న సీతమ్మసాగర్ బ్యారేజీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సందర్శించనున్నారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో అమ్మగారిపల్లి గ్రామ సమీపంలోని ఎల్అండ్టీ హెలీప్యాడ్కు చేరుకోనున్నారు. కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట ఫ్యూజ్ పాయింట్ పరిశీలించి, సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణ పనులను సందర్శించనున్నారు. అనంతరం సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నిర్మాణ పనుల వేగవంతం, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నేడు కేంద్ర మంత్రి పర్యటన మణుగూరు టౌన్: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సోమవారం మణుగూరులో పర్యటించనున్నారు. పీకేఓసీ–2 గనిని సందర్శించడంతోపాటు గేట్ సమావేశంలో కార్మికులతో మాట్లాడనున్నారు. కాగా ఇటీవల తాడిచర్ల–2 బ్లాక్ను సింగరేణికి కేటాయించారు. మణుగూరు భవిష్యత్ దృష్ట్యా పీకేఓసీ డీప్ సైడ్ను సింగరేణికే కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలి ఖమ్మం సహకారనగర్: డీఎస్సీ – 2003 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నందున మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఇతర హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు, డీఏ చెల్లింపు, సీపీఎస్ విధానం రద్దు, ఆరోగ్య కార్డుల జారీపై ఇంకా తాత్సారం చేయొద్దని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈసమావేశంలో నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బానోత్ రాందాస్, సురేష్, ధర్మసోత్ నాగేశ్వరరావు, గుగులోత్ రామకృష్ణ, షేక్ ఉద్దండ్ షరీఫ్, పెంట్యాల ప్రశాంతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ కోసం ఉద్యమిస్తాం.. బోనకల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు కోసం ఉద్యమిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు హెచ్చరించారు. బోనకల్లో ఆదివారం జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లయినా అమలులో అమలులో నిర్లక్ష్యంగా ఉందని, ఇకనైనా స్పందించకపోతే ఆందోళనలు చేపడుతామని తెలిపారు. జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణతో పాటు చిన్న రంగారావు, నర్సింహారావు, గోపాల్రావు, కోటయ్య, నరేంద్రసింహా, నిర్మల, సౌభాగ్యలక్ష్మి, హరికృష్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఖానా.. కల్తీ !
● హోటళ్లు, స్వీట్స్టాళ్లలో తనిఖీలు అంతంతే.. ● ఖాళీగా గెజిటెడ్ అధికారి పోస్టు, సెలవులో ఎఫ్ఎస్ఓ ● ఇదే అదునుగా వసూళ్లలో సిబ్బంది? ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా ప్రజల ఆరోగ్యానికి భద్రత కరువైంది. రంగురంగుల లైట్లతో మెరిసిపోయే హోటళ్లు, ఆకట్టుకునే పేర్లతో ఏర్పాటవుతున్న బిర్యానీ సెంటర్లు, గల్లీకొకటి వెలుస్తున్న టిఫిన్ సెంటర్లు వినియోగదారుల జేబులను గుల్ల చేయడమే కాకుండా వారి ఆరోగ్యాలతోనూ చెలగాటమాడుతున్నాయి. ప్రజలకు కల్తీ లేని, నాణ్యమైన ఆహారం అందేలా నిరంతరం పర్యవేక్షించాల్సిన ఆహార తనిఖీ (ఫుడ్ సేఫ్టీ) శాఖను సిబ్బంది కొరత వేధిస్తుండగా.. హోటళ్లపై పర్యవేక్షణ కరువై వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోంది. ఇన్చార్జితోనే.. జిల్లావ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించాల్సిన ఆహార తనిఖీ శాఖలో తీవ్రమైన శూన్యత కనిపిస్తోంది. కీలకమైన గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ అధికారి బదిలీ అయ్యాక ఎవరినీ నియమించలేదు. ఇక క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారి సైతం సుదీర్ఘ సెలవులో వెళ్లారు. దీంతో భద్రాద్రి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ను ఇన్చార్జ్గా నియమించారు. రెండు జిల్లాల బాధ్యతలతో ఎక్కడా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఇక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ (డీఓ), అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పోస్టుల్లో ఇద్దరు అధికారులు ఇటీవలే చేరినా కార్యాలయ విధులతోనే వారికి సరిపోతోంది. శాంపిళ్ల సేకరణ కూడా లేక.. హోటళ్లు, తయారీ కేంద్రాల నుంచి నిరంతరం శాంపిళ్లు సేకరించి ల్యాబ్కు పంపాలి. నిర్వహణ, ఆహార తయారీలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సీజ్ చేయడమే కాక జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అధికారుల కొరతతో తనిఖీలు నామమాత్రంగా కూడా జరగక.. రూ.1.50 కోట్ల విలువైన ‘రోడ్ ఆన్ సేఫ్టీ వీల్స్’వాహనం జిల్లాకు కేటాయించినా బయటకు తీసే నాథుడు లేక ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. జిల్లాకు పూర్తిస్థాయి గెజిటెడ్ అధికారిని నియమించడమే కాక ఇతర పోస్టులనూ భర్తీ చేస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా కానరావడం లేదు. అప్పటివరకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలతోనైనా ఆకస్మిక తనిఖీలు చేయిస్తే హోటళ్ల నిర్వాహకుల్లో మార్పు వచ్చే అవకాశముంది. దోపిడీకి తెరలేపిన సిబ్బంది కీలకమైన అధికారులు లేకపోవడంతో ఆహార తనిఖీ శాఖ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందితో ఇద్దరు నేరుగా హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి లైసెన్స్ ఉందా అని తీస్తూ, లేకపోతే తీసుకోవాలని చెబుతూనే రూ.వేలల్లో వసూలు చేస్తున్నారని సమాచారం. అంతేకాక బదిలీ అయిన, సెలవులో వెళ్లిన అధికారుల లాగిన్ ఐడీతో ఇటీవల కొన్ని లైసెన్సులు జారీ చేయడం వెనుక సిబ్బంది హస్తం ఉన్నట్లు తెలిసింది. మరోపక్క ఖమ్మంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం ఉంటే జరిమానా విధించాల్సిన కేఎంసీ శానిటేషన్ సిబ్బంది మామూళ్లు తీసుకొని వదిలేస్తున్నట్లు సమాచారం.ఇక నుంచి ఖమ్మం జిల్లాలో రెగ్యులర్గా ఆహార శాంపిళ్ల సేకరణపై దృష్టి సారిస్తాం. రెండు జిల్లాల బాధ్యతలు ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న సిబ్బందితోనే తనిఖీలు నిరంతరం చేపడుతాం. ప్రస్తుతానికి ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే తనిఖీ చేసి శాంపిళ్లు సేకరిస్తున్నాం. –శరత్, ఇన్చార్జ్ ఆహార తనిఖీ అధికారిజిల్లా కేంద్రంలోనే కాక మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో చిన్నాపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వేలాది గా ఉన్నాయి. వీటన్నింట్లో ఇన్చార్జ్ అధికారి నాణ్యతను ఎలా పర్యవేక్షిస్తారనేది ప్రశ్నగా మారింది. అడిగేవారు లేక పలు సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫ్రిజ్ల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్ వినియోగిస్తూ ప్రజల డబ్బు, ఆరోగ్యంపై దెబ్బ కొడుతున్నారు. బిర్యానీ, ఫాస్ట్ఫుడ్లో నిషేధిత రంగులు, టేస్టింగ్ సాల్ట్ వినియోగం, వాడిన నూనె పదేపదే మరిగిస్తూ వాడుతుండడం సాధారణమైపోయింది. -
‘లంకాసాగర్’కు గోదావరి జలాలు
● రైతుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం ● ప్రస్తుతానికి చెరువులు నింపుతున్న అధికారులు ● మూడు, నాలుగు రోజుల్లో సాగుకు విడుదలపై నిర్ణయంపెనుబల్లి: భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు నుంచి విడుదలైన గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కు చేరగా.. అక్కడి నుంచి ఎన్నెస్పీ కాల్వల్లో పరవళ్లు తొక్కుతూ ఆదివారం పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టుకు చేరాయి. వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో సందిగ్ధత నెలకొన్న సమయాన ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరడంతో ఆనందం వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో కీలకం సత్తుపల్లి నియోజకవర్గంలోనే లంకాసాగర్ కీలకమైన సాగునీటి ప్రాజెక్టుగా నిలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎన్నెస్పీ కాల్వకు 52వ కిలోమీటర్ వద్ద వదలగా.. అక్కడి నుంచి వేంసూరు మండలంలోని ఏపీ సరిహద్దు 101 కి.మీ. రెగ్యులేటర్ వరకు చేరాయి. ఆపై సాగర్ కాల్వ పరిధిలోని తెలంగాణ పరిధి చెరువుల్లో నీరు నింపేలా జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, గత ఏడాది జూలై 12 నాటికి లంకాసాగర్ ప్రాజెక్టులో 8.2 అడుగుల నీటిమట్టం ఉండగా, 2024 జూలై 12న 10 అడుగులుగా ఉంది. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో కేవలం 4.10 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులతో 0.31 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించారు. ఈమేరకు లంకాసాగర్లోకి గోదావరి జలాలు చేరుతుండగా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ఎన్నెస్పీ పరిధి చెరువులను నింపే పనులను జల వనరుల శాఖ సీఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఈ రామారావు, ఈఈ అర్జున్తో కలిసి ఆదివారం పరిశీలించారు. ప్రస్తుతం పెనుబల్లి మండలంలోని 16, వేంసూరు పరిధిలోని ఐదు చెరువులకు నీరు విడుదల చేస్తున్నామని.. ఈ జలాలు తాగునీటి అవసరాలకే కాక భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడతాయని తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల సమావేశం జరగనుండగా, సాగు అవసరాలకు విడుదలపై స్పష్టత వస్తుందని తెలిపారు. మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం లంకాసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరుతుండడంపై వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు లింక్ కెనాల్ వద్ద గోదావరి జలాలకు పూజలు చేయడమే కాక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి శేఖర రావు, తేళ్ల సురేష్, కొల్లి రాజాబాబు, చావా శేషయ్య, కొల్లి శ్రీనివాసరావు, గుంట్రు నాగరాజు, జొన్నలగడ్డ నాగేశ్వరరావు, మెరుగు వెంకటేశ్వర రావు, బోడ శ్రీనివాసరావు, బాదావత్ నాగేశ్వరరావు, రాచబంటి కృష్ణా రావు, కండె కృష్ణయ్య, సతీష్, రైతులు పాల్గొనారు. మరోపక్క సీతారామ ప్రాజెక్టు 80శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం గోదావరి జలాలు రావడానికి కేసీఆర్ చొరవే కారణమని చెబుతూ ఆయన చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. -
జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సత్తా
పెనుబల్లి: మండలానికి చెందిన ఫొటోగ్రాఫర్ కొప్పుల గోపాల్రావు జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సత్తా చాటారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీ (ఎఫ్ఐపీ) ఆధ్వర్యాన పాట్నాలో తాజాగా నిర్వహించిన పోటీల్లో ఆయన రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. జాతీయ డిజిటల్ సర్క్యూట్–2026 ఉమెన్ పవర్, మెన్స్ పవర్ విభాగాల్లో గోపాల్రావు తీసిన చిత్రాలకు ఈ పతకాలు లభించాయి. ఆయనను ఫొటోగ్రాఫర్లు, స్థానికులు అభినందించారు. కల్లూరు గురుకులంలో జోనల్ ఆఫీసర్ తనిఖీ కల్లూరురూరల్: కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను జోనల్ ఆఫీసర్ అపర్ణ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. విద్యార్థుల చదువు విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వంద శాతం ఫలితాల నమోదుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రిన్సిపాల్ కనకదుర్గ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడాకారులకు అవగాహనే కీలకం ఖమ్మంస్పోర్ట్స్: క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడపై పూర్తి అవగాహన పెంచుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) కోచ్ కె.దీపక్ప్రసాద్ సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం ‘స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రీడా శిక్షణ, అందుకు అవసరమైన పరికరాలు, గాయాలను అధిగమించడం తదితర అంశాలను వివరించారు. క్రీడల ద్వారా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని తెలిపారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14 వరకు జరిగే కార్యక్రమాన్ని క్రీడాకారులు, శిక్షకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి సునంద, శాయ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జి.రాకేశ్, డీఎస్ఏ మేనేజర్ ఉదయ్కుమార్, కోచ్లు ఎండీ గౌస్, లాజర్, జ్ఞానేశ్, నవీన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం సభకు వెళ్తుండగా ప్రమాదం గాయపడిన మహిళలకు ఎమ్మెల్యే రాగమయి పరామర్శ కల్లూరురూరల్: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద శుక్రవారం సీఎం పాల్గొన్న సభకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. కల్లూరు నుంచి క్రాంతి మహిళా సమాఖ్యకు చెందిన మహిళా సంఘాల సభ్యులు బస్సులో సభకు వెళ్తున్నారు. కొణిజర్ల సమీపాన మరో బస్సు ఢీకొనడంతో ఏడుగురు మహిళలు గాయపడ్డారు. ఇందులో ఎస్కే షాజహాన్, ఎస్కే షాహిదా, ఫాతిమూన్, దేవి, గోరీబి, షకీలా తదితరులు ఉండగా కల్లూరు, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ మేరకు కల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పరామర్శించి చికిత్సపై సూపరింటెండెంట్ రమేశ్తో చర్చించారు. కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్నాయక్, వైస్ చైర్పర్సన్ శీలం కోటేశ్వరి, కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, పోట్రు అర్జున్రావు, ఎస్కే ఉస్మాన్, యాసా శ్రీకాంత్ పాల్గొన్నారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష ఖమ్మంలీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఏపీలోని బుడ్డాయిపల్లి గ్రామానికి చెందిన కుక్కపల్లి నాగార్జునకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కాకుమాని జ్యోతిర్మయి శనివారం తీర్పు చెప్పారు. జిల్లాకు చెందిన తేజావత్ కృష్ణారావు వద్ద అప్పు తీసుకున్న నాగార్జున తిరిగి చెల్లించే క్రమాన చెక్కు జారీ చేసినా సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో విచారణ అనంతరం నాగార్జునకు జైలు శిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.7.90 లక్షలు చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. తాళం పగలగొట్టి చోరీ నేలకొండపల్లి: మండలంలోని చెన్నారంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం కొందరు ఆటోలో కొందరు రాగా, బంధువులు కావొ చ్చని స్థానికులు భావించారు. ఆపై ఇంటి తాళం పగులగొట్టి లోపల బీరువా సైతం ధ్వంసం చేసి వెండి పట్టీలు, బంగారం, నగదు చోరీ చేశారు. సాయంత్రం వచ్చిన నర్సమ్మ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు
చింతకాని: మండలంలోని మత్కేపల్లి క్రాస్ వద్ద శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ ప్రాంగణంలో భారీగా చెత్తాచెదారం పేరుకుపోయింది. ప్రాంగణం, పార్కింగ్ స్థలంతో పాటు భోజనశాల వద్ద ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, పేపర్ ప్లేట్లు పోగయ్యాయి. ఈ మేరకు మధిర, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లోని గ్రామపంచాయతీల నుంచి వంద మంది పారిశుద్ధ్య కార్మికులతో శనివారం ఉదయం చెత్త తీయిస్తూ ట్రాక్టర్ల ద్వారా డంప్ యార్డులకు తరలించారు. ఈ మేరకు పనులను జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు పరిశీలించారు. సభా ప్రాంగణం పూర్తిస్థాయిలో శుభ్రం అయ్యేవరకు పనులు కొనసాగుతాయని తెలిపారు. మరోపక్క సభావేదిక, జర్మన్ హ్యాంగర్లతో ఏర్పాటు చేసిన గుడారాలను సైతం తొలగిస్తున్నారు.పరిశీలించిన డీపీఓ రాంబాబు -
విలువలతో కూడిన విద్య అందించాలి
సత్తుపల్లిటౌన్: విద్యార్థులకు గురువులే మార్గదర్శకులని.. చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్య అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మహరాజ్ సూచించారు. శ్రీరామకృష్ణ వివేకానంద యువ ప్రచార పరిషత్, సత్తుపల్లి శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యాన డివిజన్లోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బోధమయానంద మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక, మానవీయ విలువలు పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం మైసూర్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి మహామేధానంద మహరాజ్, విజయవాడ రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి శితికంఠనంద మహరాజ్ మాట్లాడారు. ఆ తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. గురువును గౌరవించడమంటే సమాజాన్ని గౌరవించినట్టేని తెలిపారు. ఇంత గొప్ప ఘనత కలిగిన ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ పిల్లలకు ప్రేమతో బోధిస్తూ వారి లక్ష్యసాధనలో పాలు పంచుకోవాలని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎండీ రెహానాబేగం, మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, ఎంఈఓ రాజేశ్వరరావుతో పాటు చీకటి శ్రీనివాసరావు, చల్లగుండ్ల శ్రీనివాసరావు, గట్టే వాసు, యోగా అప్పారావు, నాయుడు వెంకటేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, ఎం.ప్రభాకర్రెడ్డి, ఒగ్గు భగవాన్రెడ్డి, ఇస్మాయిల్, పులి శ్రీనివాసరావు, మురళీకృష్ణ, లింగారెడ్డి, వంశీకృష్ణ, కిరణ్కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద -
పెద్దసంఖ్యలో వీధికుక్కల మృతి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వీడీవోస్కాలనీ ప్రాంతంలో వీధి కుక్కల మృతిపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం 54వ డివిజన్ పరిధిలోని ఓ చోట కుక్కలకు శనివారం ఉదయం కొందరు ఆహారం పెట్టేందుకు వచ్చేసరికి రెండు మృతి చెందాయని గుర్తించారు. అదే ప్రాంతంలో పరిశీలిస్తుండగా మొత్తం 14 కుక్కల మృతదేహాలు బయటపడ్డాయి. అంతేకాక కొన్నింటి మృతదేహాలకు ఇంజక్షన్ నీడిళ్లు ఉండడంతో విషప్రయోగం జరిగిందనే అనుమానంతో టి.వినీల్, విక్రమ్ తదితరులు ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఇన్ని కుక్కలు చనిపోవడంపై అనుమానాలు ఉన్నందున కారణాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత స్థానికుల ఫిర్యాదుతో చనిపోయిన కుక్కలను కార్పొరేషన్ సిబ్బంది ట్రాక్టర్లో తరలించారు.విషప్రయోగం అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు -
కష్టకాలంలో గోదారమ్మ!
● వైరా రిజర్వాయర్లో 14 అడుగుల నీరు ● రెండు రోజుల్లో ఆయకట్టుకు విడుదల వైరా: ఎల్నినో ప్రభావంతో ఇప్పటివరకు జిల్లాలో సరైన వర్షాలు లేక పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, కృష్ణా జలాల ఆధారంగా నిర్మించిన వైరా రిజర్వాయర్లోకి మునుపెన్నడూ లేని విధంగా గోదావరి జలాలు వచ్చి చేరాయి. దీంతో ఆయకట్టులో పంటల సాగుకు డోకా లేనట్టేనని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు వద్ద పంప్ హౌస్ నుంచి సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు రెండు రోజులుగా వైరా రిజర్వాయర్లోకి చేరుతున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో ఈ నీరు విడుదల చేయగా రాజీవ్ కెనాల్ నుంచి ఏన్కూరు మండలం తిమ్మారావుపేట ఎస్కేప్ లాక్ల ద్వారా 20 కి.మీ. మేర ప్రయాణించి రిజర్వాయర్లోకి చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 14 అడుగులు.. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా, గోదావరి జలాలు చేరుతుండడంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. రోజుకు 500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, శనివారం సాయంత్రానికి 1.73 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది జూలై 27 నాటికి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం దాటి అలుగుల ద్వారా వరద పారింది. దీంతో అదేరోజు కుడి, ఎడమ కాల్వ ద్వారా వరి నారు మళ్లకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్లో నీరు లేకపోవడం, ప్రతికూల వాతావరణంతో ఈసారి రిజర్వాయర్కు కృష్ణా జలాలు చేరే పరిస్థితి కానరావడం లేదు. దీంతో ప్రభుత్వ సూచనలతో రిజర్వాయర్కు గోదావరి జలాలు చేరగా, నారు మళ్ల అవసరాలకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్ అధికారులను ఆదేశించారు. 25 వేల ఎకరాలకు సరిపడా.. వైరా రిజర్వాయర్ నిర్మించి వందేళ్లు పూర్తయింది. తొలినాళ్లలో ఆయకట్టు పరిధిలోని సాగుకు మాత్రమే నీరు విడుదల చేసేవారు. కాలక్రమంలో రిజర్వాయర్ నీటిని తాగు అవసరాలకు వినియోగిస్తుండడంతో సాగుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సుమారు 25 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కూరగాయల వంటి పంటలు ఆయకట్టు పరిధిలో సాగవుతాయి. వందేళ్ల చరిత్రలో గోదావరి నీళ్లు రిజర్వాయర్కు చేరడం ఇదే తొలిసారి. ప్రతిరోజు 1.3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వినియోగిస్తుండడంగా, రోజుకు 33 క్యూసెక్కులు ఆవిరి రూపంలో వృథా అవుతుందని అంచనా. రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులకు వస్తే నారుమళ్లకు విడుదల చేసే అవకాశముంటుంది. ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా గోదావరి జలాలు చేరడం, రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆయకట్టు రైతులను గోదావరి జలాలు ఆదుకున్నట్లవుతుంది. ఆధునికీకరణ పనులకు బ్రేక్ వైరా రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరడం, ఆయకట్టు పరిధిలో సాగుకు విడుదల చేయాలని అధికారులు సిద్ధమవుతుండడంతో ఆధునికీకరణ పనులు నిలిపివేశారు. అలాగే, కుడి కాల్వ పరిధిలో సిరిపురం నుంచి గరికపాడు వరకు సిల్ట్ తొలగించే పనులు చేపడుతుండగా, ఇవి ఒకటి, రెండు రోజుల్లో పూర్తయితే చివరి భూముల వరకు కూడా నీరు అందనుంది.కల్లూరురూరల్: గోదావరి జలాలు సాగర్ ప్రధాన కాల్వ నుంచి కల్లూరు సర్కిల్ 71వ కి.మీ. వద్దకు శనివారం సాయంత్రం చేరాయి. దీంతో ఈ ప్రాంత రైతులు, నాయకులు గోదావరి జలాలకు పూజలు చేశారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో లింక్ కెనాల్ నిర్మించి గోదావరి జలాలను సాగర్ కాల్వలకు చేర్చారని కల్లూరు మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు డి.మోహన్నాయక్, బాగం నీరజాదేవి పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో సరైన వర్షపాతం లేకపోగా గోదావరి జలాలు ఇక్కట్లు తీరుస్తాయని తెలిపారు. రైతులు గోదావరి జలాలను పొదుపుగా వాడుకుంటూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. పలు పార్టీల నాయకులు పసుమర్తి చందర్రావు, చిత్తలూరి నరేశ్, ఎస్కే ఉస్మాన్, బాగం ప్రభాకర్చౌదరి, జిల్లెల్ల కృష్ణారెడ్డి, భూక్యా శివనాయక్, రత్నాల్రెడ్డి, జాస్తి శ్రీనివాసరావు, బీరవెల్లి మాధవ్, జిల్లెల్ల స్వాతి, దాసరి సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు. -
పేదల కన్నీళ్లు తుడవడమే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: ఆపదలో ఉన్న ప్రతీ నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ, పేదల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 129 మందికి మంజూరైన రూ.35,91,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ముగ్గురికి కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం ఆయన అందజేశారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిరుపేదలకు వైద్య ఖర్చులు భారం కావొద్దని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేగంగా చెక్కులు జారీ చేస్తున్నామని తెలిపారు. అంతేకాక నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ఆసరాగా నిలుస్తోందని చెప్పారు. అర్హులై న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ప్రాధాన్యతగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడులో రూ. 2.24 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి శంకుస్థాపన చేశాక ఆరేకోడు తండా గ్రామంలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఇదే వేదికపై గ్రామానికి చెందిన 20 మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. అలాగే, తిరుమలాయపాలెం మండలం రమణతండా నుంచి ములకలపల్లి – తిరుమలాయపాలెం బీటీ రోడ్డు వరకు రూ.1.94 కోట్లతో నిర్మించే లింక్ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 19 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 77 మందికి రూ. 24.67 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఆతర్వాత కొక్కిరేణిలో రూ.20 లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా నాణ్యతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కల నెరవేరేలా దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. కాగా, ఎర్రగడ్డలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ నాయకుడు బెల్లం చలపతిరావు కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి, అనారోగ్యం నుంచి కోలుకున్న ఏదులాపురం కౌన్సిలర్ తమ్మినేని మంగతాయిని పరామర్శించారు. ఈకార్యక్రమాల్లో ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, కౌన్సిలర్లు మహేష్, నవీన్, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, రామసహాయం నరేష్రెడ్డి, బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, బండి జగదీష్, సర్పంచ్లో మాలోతు భద్రునాయక్, సుజాత, కర్నాటి రాజేంద్రప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే గర్భగుడిలోని స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ‘రైతు ఆశీర్వాద సభ’ విజయవంతం ఖమ్మంమయూరిసెంటర్: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద శుక్రవారం జరిగిన రైతు ఆశీర్వాద సభ విజయవంతమైందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్న తమ ప్రభుత్వం రైతుభరోసా నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. కాగా, సభకు రైతులు, ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులతో పాటు నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతీ ఒక్కరి సేవలు అభినందనీయమని కొనియాడారు. రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం డీఎంహెచ్ఓ రామారావుఖమ్మం వైద్యవిభాగం: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సోమవారం జరగనుండగా అర్హులైన ప్రతీ విద్యార్థి ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జనాభా నియంత్రణ, తల్లీశిశు ఆరోగ్యం, సమతుల్య కుటుంబ వ్యవస్థ, బాలికల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రల తో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదలలో సమస్యలు రావని చెప్పారు. కాగా, వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల కట్టడికి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, జ్వరం వస్తే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే, గర్భాశయ ముఖద్వార కేన్సర్ నుంచి రక్షణ హెచ్పీవీ టీకా బాలికలకు తల్లిదండ్రులు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.వీ.పాలెం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి, హెచ్ఈఓ భద్రు, ఆశా కార్యర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డాక్టర్ సుబ్బారావుకు గోల్డ్ మెడల్ ఖమ్మం వైద్యవిభాగం: ప్రముఖ పల్మనాలజిస్ట్, క్షయ నివారణ జిల్లా మాజీ అధికారి వరికూటి సుబ్బారావును గోల్డ్ మెడల్ వరించింది. హైదరాబాద్లోని డెక్కన్ మెడికల్ కాలేజీలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి పల్మనాలజీ కాన్ఫరెన్స్లో ఆయన టీబీ కేర్పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందుకు గాను డాక్టర్ కన్వర్లాల్ ఓరియేషన్ గోల్డ్ మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు ఆయనను అభినందించారు. గతంలో సుబ్బారావు జిల్లా క్షయ నివారణ అధికారిగా సుదీర్ఘ కాలం పనిచేయగా, టీబీ నివారణ కోసం విశేష కృషి చేసి రాష్ట్ర, జాతీయ స్ధాయిలో అవార్డులు అందుకున్నారు. -
శాసీ్త్రయ దృక్పథమే సమాజ మార్పునకు మార్గం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రం, దేశంలోనే కాక అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను లోతైన అధ్యయనం, వర్గ విశ్లేషణతో అర్థం చేసుకోవడమేకాక శాసీ్త్రయ దృక్పథం పెంచుకుంటే సమాజ మార్పునకు అడుగులు పడతాయని డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ అన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో జరిగిన సీపీఎం జిల్లా శాఖల సభ్యుల శిక్షణా తరగతులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్ అనుకూల విధానాలు, కార్మిక చట్టాల నిర్వీర్యం వంటి సమస్యలపై అధ్యయనం చేయకుండా పరిష్కారం సాధ్యం కాదన్నారు. అంతేకాక సమస్యల నుంచి దారి మళ్లించేలా జరుగుతున్న కుల, మత రాజకీయాల స్వభావాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాల ప్రచారాన్ని నమ్మకుండా గణాంకాలు, విధానాలను పరిశీలిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ సమాజానికి ఆఖరి ఘడియలు సమీపించగా, భవిష్యత్ కమ్యూనిస్టుల వైపునకు మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు, పలు వర్గాల ప్రముఖులు కల్యాణం వెంకటేశ్వరరావు, ఎల్వీ రావు, బోడపట్ల రవీందర్, మల్లెంపాటి వీరభద్రం, బండారు రమేశ్, పారుపల్లి ఝాన్సీ, బి.రాజేశ్వరరావు, వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతు చేయి దాటాక పత్తికి ధర
● క్వింటా ధర రూ.9 వేలుగా నమోదు ● సీడ్ ధర, స్పిన్నింగ్ మిల్లుల్లో డిమాండ్ ఫలితం ఖమ్మంవ్యవసాయం: రైతులు పంట మొత్తం విక్రయించాక పత్తి ధర పెరుగుతోంది. పంట సీజన్లో తేమ, నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పలికింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పత్తి కనీస మద్దతు ధర (8 శాతం తేమ కలిగిన) రూ.8,110గా నిర్ణయించింది. కానీ, ప్రైవేట్ మార్కెట్లో ఈ ధర లేకపోవడంతో సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. అక్టోబర్లో పత్తి సీజన్ ప్రారంభం కాగా ఫిబ్రవరి, మార్చి నాటికి రైతులు పంట మొత్తం అమ్మేశారు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి పత్తి ధర మద్దతు ధరకి మించి నమోదవుతూ రూ.8,300గా పలికింది. ఈ నెల మొదటి వరకు రూ.8,550 వరకు పలకగా.. ఖమ్మం మార్కెట్లో 10వ తేదీన ఒకేసారి రూ.450 పెరిగి రూ.9 వేలకు చేరింది. ప్రస్తుతం ఇళ్లలో నిల్వ చేసిన రైతులు పంట పెట్టుబడి కోసం ఖమ్మం మార్కెట్కు నిత్యం 100 నుంచి 200 బస్తాల వరకు తీసుకొస్తున్నారు. నిల్వలు అంతంతే.. గత సీజన్లో పత్తి అత్యధికంగా సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారుల వద్ద, మిల్లుల్లో నిల్వలు తక్కువగానే ఉన్నాయి. ఫలితంగా స్పిన్నింగ్ మిల్లులు, టెక్స్టైల్స్ అవసరాలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమాన పత్తి ధర పెరుగుతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగా నూనెల ధరలు పెరగడం, ఇందులో పత్తి నూనె కూడా ఉండడంతో సీడ్ ధర పెరిగింది. క్వింటా రూ.4,100గా ఉన్న సీడ్ ధర ఆయిల్ డిమాండ్తో రూ.4,600కు చేరింది. ఇది కూడా పత్తి ధర పెరగడానికి దోహదపడుతోందని చెబుతున్నారు. ఈ ఏడాది కేంద్రం పత్తి క్వింటాకు మద్దతు ధర రూ.8,667గా నిర్ణయించగా.. ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో అంతకు మించి పలుకుతున్నా సీజన్ వచ్చేసరికి ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
అటవీ ఉత్పత్తుల ధర పెరిగేనా?
పాల్వంచరూరల్: రెండేళ్లుగా కలపయేతర అటవీ ఉత్పత్తులకు ఆశించిన ధరలు లేకపోవడంతో గిరిజ నులు సేకరణపై ఆసక్తి చూపడంలేదు. దీంతో అటవీ ఉత్పత్తుల సేకరణ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో పది రకాల అటవీ ఉత్పత్తుల ధరలు పెంచాలని జీసీసీ ప్రతిపాదనలు పంపింది. ధరలు పెరిగితే గిరిజనుల కష్టానికి ఫలితం దక్కే అవకాశం ఉంది. జిల్లాలో కలపయేతర అట వీ ఉత్పత్తుల సేకరణపై వందల మంది గిరిజనులు ఆధారపడి ఉన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేల్స్ డిపోల్లో విక్రయిస్తూ, కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా, పలు ఉత్పత్తులకు ప్రతిపాదనలు పంపగా, తేనె, మారేడు గడ్డలు, అడవి చీపుర్లు, బంక తదితర ఉత్పత్తులకు ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. అధికారులు స్పందించి అన్ని ఉత్పత్తులకు ప్రతి పాదనలు పంపాలని గిరిజనులు కోరుతున్నారు. అటవీ ఉత్పత్తి ప్రస్తుత ప్రతిపాదిత ధర ధర ఇప్పబద్ద 29 50 ఇప్పపువ్వు 30 70 ముష్టిగింజలు 75 130 కుంకుడుకాయలు 40 80 చింతపండు 40 120 నరమామిడిచెక్క 32 60 కానుగ గింజలు 10 40 చిల్లిగింజలు 35 60 గచ్చకాయలు 40 70 కరక్కాయలు 15 40 10 రకాల ఉత్పత్తుల రేటు పెంపునకు జీసీసీ ప్రతిపాదనలు -
సింగరేణితో పెట్టుకుంటే బాగుపడరు..
సత్తుపల్లి: సింగరేణి కార్మికుల పక్షాన ప్రశ్నించేందుకు వస్తున్న తమను అడ్డుకోవడం సరికాదని, సింగరేణితో పెట్టుకున్నోళ్లు బాగుపడిన చరిత్ర లేదని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె సత్తుపల్లి జేవీఆర్ ఓసీ సందర్శనకు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తదితరులతో కలిసి వచ్చారు. అయితే, అనుమతి లేదని పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ గేట్లు వేయడంతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగి తాళం పగలగొట్టారు. ఈక్రమాన ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కవిత మాట్లాడుతూ కార్మికులను కలవకుండా గుర్తింపు సంఘం, సింగరేణి అధికారులు ప్రయత్నించడం సరికాదన్నారు. ఏఐటీయూసీ యూనియన్ యాజమాన్యానికి అండగా నిలవడం మానేసి కార్మికుల హక్కులను కాపాడాలని సూచించారు. సింగరేణి ఆస్పత్రిని కేవలం రెండు పడకలతో నడుపుతుండగా, కార్మికుల సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఇల్లెందు, మణుగూరు పరిస్థితి సత్తుపల్లికి తలెత్తకుండా కొత్త గనులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాగా, కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఈ నెల 20న నిరాహారదీక్ష చేస్తామని కవిత ప్రకటించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన ఆమె టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సారన్న, నాయకులు గుట్టు కరుణ, వనం నాగేందర్, కిషన్నాయక్, వన్నెంరెడ్డి సాగర్, ఆంజనేయులు, ఆజ్గర్ఖాన్, వరికూటి శ్రీనివాస్, సందీప్, రెడ్డమ్మ, మహేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు.టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత -
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. సాయంత్రం తర్వాత ఆకాశం మేఘావృతమవుతుంది.బ్యూటీషియన్ కోర్సులో శిక్షణకు హాజరవుతున్నాను. ఆతర్వాత ప్రత్యేక బ్రైడల్ మేకప్పై తర్ఫీదు పొందాలనే భావనలో ఉన్నా. ఆపై బ్యూటీపార్లర్ ఏర్పాటుకు నిర్ణయించుకున్నాను. తద్వారా ఇంటి వద్దే ఉపాధి మార్గం లభించి కుటుంబానికి అండగా నిలవొచ్చు. – కె.దీపిక, కొణిజర్లకంప్యూటర్ శిక్షణ కోర్సు పూర్తికాగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయనే నమ్మకం ఉంది. నేను ఇష్టంగా నేర్చుకుంటున్న కంప్యూటర్ కోర్సుతో ఇంకొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాను. మా ప్రాంతంలో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చేలా ప్రయత్నిస్తా. – బత్తిని త్రివేణి, పోచారం, గార్ల మండలం -
రక్త హీనతకు చెక్..
● రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ● 1–19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● జిల్లాలో 2,89,533 మంది గుర్తింపు ఖమ్మంవైద్యవిభాగం: పిల్లల్లో రక్తహీనతను నివారించడమే లక్ష్యంగా నులిపురుగుల నిర్మూలనకు ప్రభు త్వం ఈ నెల 13న (సోమవారం) జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 19 ఏళ్ల మధ్య పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించనున్నారు. పిల్లల కడుపులో పెరిగే నులిపురుగులతో రక్తహీనత ఏర్పడి.. రోగనిరోధక శక్తి తగ్గి పలు వ్యాధుల బారిన పడతారు. దీన్ని అరికట్టేలా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన నిర్వహించే నులి పురుగుల నివారణ దినోత్సవంలో అంగన్వాడీ, విద్యా శాఖ ఉద్యోగులు పాలుపంచుకుంటారు. తొలిరోజైన సోమవారం జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో మాత్రలు మింగిస్తారు. ఇక మిగిలిన వారికి ‘మాపప్’ రౌండ్ పేరిట 20వ తేదీన పంపిణీ చేయనుండగా.. కార్యక్రమ నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సరిపడా ఆల్బెండజోల్ మాత్రలను అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లకు పంపిణీ చేశారు. వయస్సుల వారీగా.. జిల్లాలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కోసం అర్హులైన పిల్లలను గుర్తించారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు వారు 2,89,533 మంది ఉన్నారని తేల్చారు. వీరికి విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం మాత్రలు పంపిణీ చేసి మింగిస్తారు. 1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు అర మాత్ర, 2 నుంచి 19 ఏళ్ల వారికి ఒక మాత్ర ఇస్తారు. చిన్నపిల్లలకు అర మాత్ర పొడిచేసి తాగించాల్సి ఉండగా, మిగతా వారు నమిలి మింగాల్సి ఉంటుంది. అనారోగ్యం దరి చేరకుండా.. పిల్లల కడుపులో నులిపురుగులు ఉంటే రక్తహీనత ఎదురవుతుంది. తద్వారా పోషకాహర లోపం ఏర్పడి అలసట, ఎదుగుదల లోపాలు వస్తాయి. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు మట్టిలో ఆడుతున్నప్పుడు, కలుషిత నీరు తాగినప్పుడు, చేతులు సరిగ్గా కడుక్కోకుండా ఆహారం తింటే ఈ పురుగులు కడుపులో ఏర్పడతాయి. ఈ మేరకు పిల్లల చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, కాళ్లకు చెప్పులు ధరించటం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో నులిపురుగులు నిర్మూలిస్తే ఒంట్లో శక్తి పెరిగి చదువు, ఆటల్లో చురుగ్గా ఉంటారని చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు 1,618 అంగన్వాడీ సెంటర్లు 1,840 1 నుంచి 5 ఏళ్ల వయస్సు పిల్లలు 62,787 6 నుంచి 19 ఏళ్ల వయస్సు విద్యార్థులు 2,26,746 మొత్తం పిల్లలు 2,89,533 పాల్గొననున్న వైద్య శాఖ సిబ్బంది 1,260 ఆశా కార్యకర్తలు 1,339 అంగన్వాడీ టీచర్లు 1,739 పాఠశాలలు, కళాశాలల బాధ్యులు 1,618 -
మహిళా విజయం!
కష్టకాలంలో గోదారమ్మ! వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన.. గోదావరి జలాలు చేరడంతో వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026మహిళలకు ఉపాధి మార్గాన్ని చూపేందుకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఇస్తున్న శిక్షణకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతీ బ్యాచ్కు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆదరణ దృష్ట్యా జిల్లాలో మరిన్ని శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నాం. – తుంబూరు సునీల్రెడ్డి, డీవైఎస్ఓ టైలరింగ్ రంగానికి ఉన్న ఆదరణ దృష్ట్యా శిక్షణ తీసుకుంటున్నా. శిక్షణ పూర్తయ్యాక ఇంటివద్దే టైలరింగ్ షాపు ఏర్పాటుచేయాలనే ఆలోచన ఉంది. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వపరంగా రుణాలు, ఇతర ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటా. – జి.దివ్యశ్రీ, బూడిదంపాడు ఖమ్మం రాపర్తినగర్: ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో భర్త మాత్రమే ఉద్యోగం చేస్తే కుటుంబాన్ని పోషించడం కష్టమవుతోంది. ఇంకొందరు మహిళలు బయటకు వచ్చి పనిచేసేందుకు పరిస్థితులు సహకరించడం లేదు. ఇలాంటి వారు ఇంటి వద్దే ఉపాధి పొందేలా సెట్కామ్, యువజన, క్రీడల శాఖ అండగా నిలుస్తోంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటుచేసిన కేంద్రం ద్వారా మహిళలకు వత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇప్పించి నిష్ణాతులను తీర్చిదిద్దడమే కాక ఉపాధి కల్పించేలా అడుగులు పడుతున్నాయి. 2019లో ఏర్పాటైన ఈ కేంద్రం వద్ద ఇప్పటివరకు 2వేల మంది శిక్షణ పూర్తిచేసుకోగా.. ఇందులో చాలామంది ఎంచుకున్న రంగంలో స్వయం ఉపాధితో ఆర్థిక స్థిరత్వం సాధించడం విశేషం. మూడు కోర్సుల్లో శిక్షణ సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ కేంద్రాన్ని ఏడేళ్ల క్రితం ప్రారంభించారు. ఇక్కడ సెట్కామ్, యువజన, క్రీడల శాఖ ద్వారా పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా బ్యూటీషిషన్, కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల యువకులు, మహిళలు ఈ శిక్షణకు బారులు దీరుతున్నారు. దీంతో కేంద్రం ద్వారా ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా శిక్షణ పూర్తి చేసుకోగా పలువురు ఆయా రంగాల్లో స్థిరపడి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు కోర్సుల్లో రెండేసి బ్యాచ్లకు శిక్షణ పూర్తికావడం యువతుల నుంచి వస్తున్న ఆదరణకు అద్దం పడుతోంది. ఈ కేంద్రంలో నిపుణులైన ట్రెయినర్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తూ నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. శిక్షణకు వస్తున్న సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోనూ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పాటకు నివాళి..
● ఖమ్మంలో ‘అరుణోదయ నాగన్న’ సంస్మరణ సభ ● హాజరైన పార్టీలు, సంఘాల నాయకులు, కళాకారులు ● పాటను ఆయుధంగా మలిచారని కొనియాడిన వక్తలు ఖమ్మంమయూరిసెంటర్: కేవలం వినోదం కోసం కాకుండా, సామాజిక మార్పు కోసం, పీడిత ప్రజల గొంతుకగా తన జీవితాన్ని అంకితం చేసిన అద్భుతమైన ప్రజా కళాకారుడు అరుణోదయ నాగన్న అని వక్తలు కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని రక్షణ, సమాజంలో మార్పు కోసం ప్రజలను సంఘటితం చేయడమే మార్గమని నమ్మి పాటను విప్లవోద్యమానికి ఆయుధంగా మలిచిన నాగన్న ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఇటీవల మృతి చెందిన నాగన్న సంస్మరణ సభను ‘నాగన్న మాట – పాటల నివాళి’పేరిట ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సభకు కె.భాస్కర్ అధ్యక్షత వహించగా వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కళాకారులు పాల్గొని నాగన్న సాదాసీదా జీవితం, ఆయన సైద్ధాంతిక ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత తరానికి చుక్కాని.. నాగన్న కేవలం సాంస్కృతిక ఉద్యమకారుడే కాదని, ఎమర్జెన్సీ తర్వాతి తరానికి ఒక చుక్కానిలా మార్గదర్శనం చేశారని ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, జీవన్, అరుణోదయ విమలక్క తదితరులు వెల్లడించారు. దాదాపు 50 ఏళ్లు ఒకే సిద్ధాంతం, సంస్థకు కట్టుబడి పనిచేసిన అరుదైన, క్రమశిక్షణ కలిగిన నాయకుడని తెలిపారు. హక్కుల కార్యకర్తగా దళిత, పేద, గిరిజన, ఆదివాసీల పక్షాన నిలబడి తన గానంతో సమాజాన్ని చైతన్య పరిచారని పేర్కొన్నారు. రామనరసయ్య అమరత్వం, ఆదివాసీ గూడాల్లో లింగన్న అమరత్వంపై నాగన్న చేసిన ప్రసంగాలు, విప్లవ సింహం వీరగాథల బుర్రకథలు ఉమ్మడి రాష్ట్రంలో నిరక్షరాస్యులైన తొలితరం ప్రజలను మేల్కొలిపాయని తెలిపారు. ఆయన తన కళ, కలాన్ని ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబెట్టారని, జానపద శైలి, లయను నమ్ముకుని తేలికై న పదజాలంతో పాటలు అల్లుతూ భావోద్వేగాన్ని రగిలించారని చెప్పారు. ఆయన ఎప్పుడూ సభలో చప్పట్లు చూసుకోలేదని, ఎంతమంది మెదళ్లను మార్చగలిగామనే తపనతోనే చివరి శ్వాస వరకు జీవించారని గుర్తు చేసుకున్నారు. అయితే, నాగన్న వెనుక బలమైన సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం గాయకుడిగానే చూస్తే అది అర్థ సంస్మరణే అవుతుందని వక్తలు స్పష్టం చేశారు. కాగా, ప్రశ్నించడమే దేశద్రోహంగా భావించి ఉపా వంటి చట్టాలు ప్రయోగిస్తున్న వేళ నాగన్న దూరం కావడం తీరని లోటని పేర్కొన్నారు. ఇంకా ఈ సభలో పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు కోటి, కొమిరే సాకి, యశ్పాల్, యోచన, రామనరసయ్య, పి.వెంకన్న, దేవేందర్, దండి సురేశ్, నున్నా నాగేశ్వరరావు, ఆవునూరి మధు, ఆవుల అశోక్, దేవిరెడ్డి విజయ్, బిచ్చాల తిరుమల్రావు, టి.వేణు, చిర్ర రవి, విప్లవకుమార్ తదితరులు ఉన్నారు. కాగా, ఈ సభలో నాగన్న భార్య లక్ష్మక్క, కుమారుడు అజయ్తో పాటు సృజన తదితరులు నాగన్న పాటలు పాడి నివాళులర్పించారు.


