breaking news
Khammam District Latest News
-
‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేష్, బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యుడు గురుస్వామి డిమాండ్ ఈమేరకు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా వెంకటేష్, గురుస్వామి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 237ప్రైవేట్ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా 25వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతుండగా, రూ.200కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఫలితంగా పాఠశాలల యజమాన్యాలు పిల్లలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు, విద్యార్థుల తల్లిండ్రులు ప్రసాద్, స్టాలిన్, అశోక్, గోపి, బాలు, సతీష్, నాని, సునీల్, నవీన్, ప్రవీణ్, నాగరాజు, వీరబాబు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో ఉద్యోగి మృతివైరా: నేలకొండపల్లి మండలం చెన్నారం పీఏసీఎస్ సీఈఓ ఎస్.వీ.సత్యనారాయణ(58) ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన స్వగ్రామం ఏపీలోని కూనవరం కాగా నేలకొండపల్లిలో స్థిరపడ్డాడు. కాగా, సత్యనారాయణ సోమవారం కూనవరం బయలుదేరాడు. ఖమ్మం నుంచి భద్రాచలానికి డీలక్స్ బస్సులో వెళ్తుండగా వైరా వద్ద నొప్పి వస్తోందని పక్కనే ఉన్న ప్రయాణికుడికి చెబుతూ సీటులోనే కూప్పకూలాడు. దీంతో బస్సును పోలీస్స్టేషన్ సమీపాన నిలిపి 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా వచ్చిన సిబ్బంది, కానిస్టేబుల్ ఘనీ పాషా సాయంతో సత్యనారాయణకు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని ఎస్సై పి.రామారావు తెలిపారు. -
కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడిన కోటిరెడ్డి..
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా సింగరేణి ఉద్యోగి, ఐఎన్టీయూసీ నాయకుడు కళ్లం కోటిరెడ్డి నిరంతరం సంస్థ అఽభివృద్ధితో పాటు కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడ్డారని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణ య్య పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన కోటిరెడ్డిని ఇల్లెందు జేకే ఓసీలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ హక్కుల సాధనకు కోటిరెడ్డి చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జాకీర్ హుస్సేన్, చిన్నయ్య, నాయకులు లచ్చిరామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేకే సీఈఆర్ క్లబ్లో కూడా సన్మానించగా మున్సిపల్ మాజీ చైర్మన్ మడత రమా వెంకట్గౌడ్ మాట్లాడారు. అనంతరం కోటిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం, సింగరేణి అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ఎమ్మెల్యే కనకయ్య, మడత వెంకట్సారథ్యాన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు, కోటిరెడ్డి కుటుంబ సభ్యులు కళ్లం అమరనాఽథ్, శాలినీరెడ్డి, మురళీరెడ్డి, లావణ్య పాల్గొన్నారు. -
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
● ఎస్సై సహా కుటుంబీకుల వేధింపులే కారణమని ఆరోపణ ● ఆస్పత్రి మార్చురీ వద్ద భర్త తండ్రికి దేహశుద్ధి జూలూరుపాడు/ఖమ్మం క్రైం: భర్త పోలీసు శాఖలో ఎస్సై, బావ కూడా అదే ఉద్యోగం.. మామ సైతం రిటైర్డ్ పోలీసు అధికారి. సమాజంలో ప్రజల కష్టాలు తీర్చే ఉద్యోగుల ఇంటికి కుమార్తెను ఇస్తే బిడ్డ జీవితం బాగుంటుందని భావిస్తే వివాహేతర సంబంధాల పేరిటే కాక రకరకాల కారణాలతో వేధిస్తుండడంతో ఆమె తనువు చాలించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బానోతు రాణాప్రతాప్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన రాజేశ్వరి(34)కి 2018లో వివాహం జరిగింది. ఆ సమయాన రూ.40 లక్షలతో పాటు, 35 తులాల బంగారం, మరో రూ.4లక్షల విలువైన కానుకలను ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉండగా.. కొన్నాళ్ల నుంచి భర్తతో పాటు అత్తామామలు పుష్పరాణి – చంద్రం, బావ మహేష్ (ఎస్సై, మహబూబాబాద్ వీఆర్) రాజేశ్వరికి వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్నట్లు సమాచారం. కాగా, రాణాప్రతాప్కు ఖమ్మం జీఆర్పీ ఎస్సైగా పోస్టింగ్ రావడంతో భార్యాపిల్లలను జూలూరుపాడులోనే ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. అయితే, కుటుంబీకుల వేధింపులు తాళలేక రాజేశ్వరి జూలూరుపాడులోని అద్దె ఇంట్లో జూన్ 25న పురుగుల మందు తాగగా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందింది. మామపై దాడి.. హైదరాబాద్ నుంచి రాజేశ్వరి మృతదేహాన్ని సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈక్రమాన రాణాప్రతాప్ తండ్రి చంద్రయ్య మార్చురీ వద్దకు రావడంతో తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ రాజేశ్వరి కుటుంబీకులు దాడి చేశారు. దీంతో జూలూరుపాడు, ఖమ్మం టూటౌన్ పోలీసులు అడ్డుకుని ఆయనను టూటౌన్కు తరలించారు. ఘటనపై మృతురాలు తండ్రి సోమ్లా ఫిర్యాదుతో రాణాప్రతాప్, పుష్పరాణి, చంద్రం, మహేష్పై కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు ఎస్ఐ రవి తెలిపారు. కాగా, రాణాప్రతాప్, ఆయన సోదరుడు మహేష్ మొదటి నుంచీ వివాదాస్పదులుగానే ఉన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపాన ఓ చెప్పుల షాపు యజమానిపై కొన్నాళ్ల క్రితం అకారణంగా దాడి చేసిన రాణాప్రతాప్ తుపాకీతో బెదిరించాడు. ప్రస్తుతం ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
ఉద్యోగులను బలి తీసుకున్న ప్రమాదం
ఏన్కూరు: రోజు మాదిరిగానే విధులకు వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఉద్యోగాలకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి బయలుదేరగా.. కాసేపటికే ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందడంతో విషాదం అలుముకుంది. ఏన్కూరు మండలం హిమామ్నగర్లో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కొణిజర్ల మండల పల్లిపాడుకు చెందిన ఇమ్మడి రఘుపతి(51) కొత్తగూడెంలో హోంగార్డుగా, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం అంకపాలెంకు చెందిన బత్తుల రాజేష్(30) ఖమ్మంలో ఉంటూ కొత్తగూడెం ఎంఈఓ కార్యాలయంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ద్విచక్ర వాహనంపై రాజేష్ కొత్తగూడెం వెళ్తుండగా పల్లిపాడు వద్ద రఘుపతి లిఫ్ట్ అడిగి ఆయనతోపాటు బయలుదేరాడు. మార్గమధ్యలో ఏన్కూరు మండలం హిమామ్నగర్ సమీపాన వీరి బైక్ను జూలూరుపాడు నుండి ఏన్కూరు వైపు వస్తున్న వా్య్న్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేష్, రఘుపతికి తీవ్ర గాయాలు కాగా, 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులో వెళ్లినా బతికేవాడేమో... కొత్తగూడెంలో హోంగార్డుగా పనిచేసే రఘుపతికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే, రాజేష్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. రఘుపతి ప్రతీరోజు పల్లిపాడు నుంచి బస్సులో కొత్తగూడెం వెళ్లివచ్చేవాడు. అయితే, సోమవారం విధులకు ఆలస్యమవుతుండడంతో పల్లిపాడు వద్ద రాజేష్ను లిఫ్ట్ అడిగి ఆయన బైక్పై బయలుదేరాడు. దీంతో గమ్యం చేరకుండానే మార్గమధ్యలో ప్రమాదం బారినపడ్డాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు ఎస్ఐ రఫీ తెలిపారు.వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి -
ఉద్యమకారులను ఆదుకోవాలి..
ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే.వీ.కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కొత్త ఆర్టీసీ బస్టాండ్ ఎదుట చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఉద్యమకారుడు అర్వపల్లి విద్యాసాగర్, సీపీఐ నాయకుడు సింగు నరసింహరావుతో కలిసి ఆయన ప్రారంభించాక మాట్లాడారు. ప్రతీ ఉద్యమకారుడికి ఇంటి స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు, అమరవీరుల కుటుంబాలకు రూ.25వేలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇటిక్యాల రామకృష్ణ సంఘీభావం తెలపగా, సాయంత్రం పొలిటికల్ జేఏసీ మాజీ కన్వీనర్ కూరపాటి రంగరాజు విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్యతో పాటు అర్వపల్లి విద్యాసాగర్, పద్మాచారి, వెంకటేశ్వరావు, శేషగిరి, సతీష్, మట్టా దుర్గాప్రసాద్రెడ్డి, జ్వాల నరసింహారావు, షేక్ అబ్బాస్, రజనీకాంత్, ఎస్.డీ.బురాన్, ఆసిఫ్, నాగుల్మీరా, శ్రీనివాస్ నాయక్, పాలకుర్తి కృష్ణ, రాజేందర్నాయక్, విజయ్కుమార్, ఉమాయాదవ్, వరలక్ష్మి, ధనలక్మి, రమాదేవి తదితరులతో పాటు పెద్దసంఖ్యలో ఉద్యమకారులు పాల్గొన్నారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు -
రహదారిపైకి..
● డ్రెయిన్లు పొంగి వైరా: ఓ వైపు వర్షాలు కురుస్తుండగా డ్రెయిన్లలో చెత్తాచెదారం తొలగించకపోవడం, చాలా ప్రాంతాల్లో డ్రెయిన్లు లేకపోవడంతో రహదారులపైకి మురుగునీరు చేరుతోంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు సత్రంబజార్ లోతట్టు ప్రాంతంలో ఉండడంతో అటు వర్షపు నీరు, ఇటు ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరంతా ముందుకు వెళ్లే మార్గం లేక రోడ్లపై ప్రవహిస్తోంది. కనీసం నెలకొకసారి కూడా డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోందని స్థానికులు చెబుతున్నారు. అలాగే, చాలాచోట్ల రహదారులను ఆనుకుని పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించకపోవడంతో దోమలు పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నా ఫాగింగ్ చేయడం లేదని వాపోతున్నారు. మున్సిపాలిటీ జనా భాకు అనుగుణంగా చెత్త తరలించే వాహనాలు లేకపోవడం, ఉన్నవి మరమ్మతుకు రావడంతో ఈపరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. మావార్డును పట్టించుకోవడం లేదు.. మా ప్రాంతం లోతట్టు కావడంతో వరద ఇళ్లలోకి చేరుతోంది. అలాగే, మున్సిపాలిటీ వాహనాలు రాక చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు పెరుగుతున్నాయి. అయినా ఫాగింగ్ చేయడంలేదు అధికారులు మా వార్డులో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయి. – ఆర్.తిరుపతమ్మ, 12వ వార్డు, వైరా ● -
ఎప్సెట్ కౌన్సెలింగ్కు వేళాయె...
● ఇప్పటికే మొదలైన స్లాట్ బుకింగ్ ● నేటి నుంచి మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన ఖమ్మంసహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్ మంగళవారం మొదలుకానుంది. జూన్ 28వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కాగా.. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. ఇందుకోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా విద్యార్థులు ఇక్కడి ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలలతో రాష్ట్రంలోని ఏ కళాశాలనైనా వెబ్ ఆప్ష న్ల ద్వారా ఎంచుకునే అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్, ఇతర వివరాలు http:// tgeapcet.nic.in వెబ్సైట్లో చూడొచ్చని, లేదా కౌన్సెలింగ్ కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి ‘మాక్ అలాట్మెంట్’ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ మాదిరిగానే ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు సైతం వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాక ఈసారి నుంచి కొత్తగా మాక్ సీటు అలాట్మెంట్ ఇస్తారు. తద్వారా విద్యార్థులకు వారి ర్యాంక్, ఎంచుకున్న కోర్సు ఆధారంగా సీటు ఏ కాలేజీలో వస్తుందో అంచనా వేసుకోవచ్చు. ఆపై ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పించి సీటు ఫ్రీజ్ చేస్తారు. కాగా, మూడు దశల కౌన్సెలింగ్లో సీట్లు లభించిన విద్యార్థులు కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక మార్చుకునేందుకు ఆగస్టు 16, 17వ తేదీల్లో అవకాశం కల్పించారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లు వెంట తీసుకెళ్లాలి. టీజీఎప్సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఆధార్కార్డు, ఎస్సెస్సీ, ఇంటర్ మెమోలు, ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్మీడియట్ టీసీ, 01–04–2025 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్లాట్ బుక్ చేసుకున్న రశీదు చూపించాల్సి ఉంటుంది. అలాగే, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2025–26వ సంవత్సరానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి. మొదటి విడత కౌన్సెలింగ్ ఇలా... ఈనెల 7వ తేదీ వరకు స్లాట్ బుకింగ్కు అవకాశం ఉంది. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనుండగా, 6నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. వీరికి 13న మాక్ సీట్ల అలాట్మెంట్ చేసి 14, 15వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పిస్తారు. చివరగా జూలై 15 తేదీన సీట్ల కేటాయించనుండగా, జూలై 18నుంచి 22వ తేదీ వరకు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. దీన్ని ఇతరులకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కళాశాలలు, కోర్సులు ఎంపిక సమయాన అప్రమత్తంగా ఉండాలి. మాక్ అలాట్మెంట్ ద్వారా ఓ అంచనాకు రావొచ్చు. ఈనెల 18న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. – చండ్ర సుధాకర్, కో ఆర్డినేటర్, ఎప్సెట్ హెల్ప్లైన్ సెంటర్ -
● వేచి ఉండాల్సిందే...
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి, ఇంకొన్ని ప్రాంతాల్లో 15 రోజులకోసారి కూడా ఇంటింటా చెత్త సేకరించడం లేదు. చెత్త సేకరణకు ఉన్న 12 వాహనాల్లో నాలుగు ఆటోలు మూలనపడ్డాయి. టీచర్స్ కాలనీ, ఆర్సీఎం చర్చ్, ముస్లిం కాలనీ, యాదవ బజార్ తదితర ప్రాంతాల్లో వారం, పది రోజులకోసారి చెత్త సేకరిస్తుండగా వాహనాల మరమ్మతుతో మరింత జాప్యం జరుగుతోంది. ఇటీవల అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో భాగంగా అనేక చోట్ల రోడ్లను తవ్వడంతో చెత్త సేకరణ వాహనాలు అటువైపే వెళ్లడం లేదు. ఫలితంగా రోజుల తరబడి చెత్త ఇళ్లలో ఉంచాల్సి రావడంతో ఈగలు, దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అప్పుడప్పుడు సేకరించే చెత్తను సైతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసం నుంచి ఎంప్లాయీస్ కాలనీకి వెళ్లే బైపాస్ రోడ్డుకు ఇరువైపులా వేస్తుండడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారు దుర్గంధంతో అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే, సేవాసదనం రోడ్డు, కేజేఆర్ కాంప్లెక్స్ వెనుక, నారాయణ స్కూల్ సమీపాన, బంజారా కాలనీలో చెత్త వేస్తూ అనధికారిక డంపింగ్ యార్డులుగా మార్చారు.ఫిర్యాదు చేసినా పట్టింపు కరువు ఎంప్లాయిస్ కాలనీ రోడ్డులో చెత్త వేస్తున్నారని, సొసైటీ సమీపాన వీధిలైట్లు రావడం లేదని కమిషనర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నందున రెండు, మూడు రోజులకోసారైనా చెత్త సేకరించేలా చూడాలి. – పోతినేని రమాదేవి, మధిర ● -
ఆర్ అండ్ బీ ఈఈగా పవార్
ఖమ్మం అర్బన్: ఖమ్మం ఆర్ అండ్ బీ ఈఈగా ఎం.పవార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈఈగా హైవే విభాగానికి చెందిన యుగంధర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు హైదరాబాద్ నుంచి పవార్ను బదిలీ చేయగా విధుల్లో చేరిన ఆయనకు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. బ్లడ్బ్యాంక్ల్లో నిబంధనలు విస్మరించొద్దు ఖమ్మంవైద్యవిభాగం: బ్లడ్బ్యాంకుల నిర్వాహకులు నిబంధనలు పాటిచాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. శాఖ ఉద్యోగులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా ఖమ్మంలోని పలు బ్లడ్ బ్యాంక్ల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, సిబ్బంది అర్హతలు, రక్తం నిల్వలను పరిశీలించాక నిర్వాహకులకు సూచనలు చేశారు. అయితే, విధుర బ్లడ్ బ్యాంకులో తనిఖీ సందర్భంగా రక్తపు నిల్వలు ఇంకో చోట ఉన్నట్లు గమనించి స్టాక్ను పరిశీలించారు. అలాగే, శాంపిల్స్ను ఐపీఎం ల్యాబ్కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ అధికారి అరవింద్, జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనిల్కుమార్, అశ్విని, డిప్యూటీ డీఎంఎచ్ఓ సైదులు, బ్లడ్ బ్యాంకు ప్రోగ్రాం అధికారి వెంకటరమణ, డిప్యూటీ డెమో జి.సాంబశివరెడ్డి పాల్గొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై ఇంజనీర్లకు శిక్షణ ఖమ్మంవ్యవసాయం: గృహాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యాన ఎన్పీడీసీఎల్ ఇంజనీర్లకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని ఇంజనీర్లకు ఖమ్మంలో సోమవారం శిక్షణ మొదలుకాగా, ఇళ్లపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ప్రధానమంతి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకంలో భాగంగా ప్లాంట్లు ఏర్పాటుచేయనుండగా ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈలు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూనిర్వాసితులకు అండగా నిలుస్తాం..
ఖమ్మంమయూరిసెంటర్: మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న వారికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. భూనిర్వాసితులు పలువురు ఆయనను సోమ వా రం ఖమ్మంలో కలిశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. మున్నేటి వరదతో ఇబ్బందులు ఎదురుకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తాను రిటైనింగ్వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు పనికి రాని భూములు అంటగట్టే యత్నం చేస్తోందని ఆరోపించారు. ఈమేరకు తగిన పరిహారం చెల్లింపు, ప్లాట్ల కేటాయింపులో ప్రజలను ఇబ్బంది పెట్టా లని చూస్తే అడ్డుకుంటామని పువ్వాడ తెలిపారు.మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ -
రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా కార్యాచరణ
నేర సమీక్ష సమావేశంలో సీపీ సునీల్దత్ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా కార్యాచరణ రూపొందించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. ఖమ్మంలో సోమవారం జరిగిన నేరసమీక్ష సమావేశంలో ఆయన స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, దర్యాప్తుపై ఆరాతీశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వైరా, కల్లూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన బ్లాక్స్పాట్ల వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, బ్లింకింగ్ లైట్ల ఏర్పాటుతో ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే, మితిమీరిన వేగం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిని గుర్తించేలా నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. కాగా, అమాయక ప్రజలు అవసరాలను ఆసరాగా చేసుకుని చీటీలు నడిపే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, దొంగతనాల నివారణ, గంజాయి సరఫరా, అమ్మకాలు జరగకుండా బందోబస్తు పెంచాలని సీపీ ఆదేశించారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్రావు, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రఘు, రవి, సర్వర్, సుశీల్సింగ్, నర్సయ్య పాల్గొన్నారు. కాగా, జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ సోమవారం ఉద్యోగ విరమణ చేసిన వారిని సీపీ సన్మానించారు, ఏఆర్ ఏసీపీలు సుశీల్సింగ్, నర్సయ్య, ఆర్ఐలు కామరాజు, సురేష్, నాగుల్మీరా తదితరులు పాల్గొన్నారు. -
● మూడు రోజులు ఆగితేనే..
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. స్థానిక జవహర్నగర్లో పరిశీలించగా చెత్త సేకరణ రెండురోజులకోసారి జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఇక డ్రెయినేజీల్లో మురుగు, చెత్త తీసి రోడ్డుపై వేసి మూడురోజుల తర్వాతే తీసుకెళ్తున్నారని చెప్పారు. జవహర్నగర్లో సీసీ రోడ్లు ఉన్నా చాలా వీధుల్లో డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో మురుగునీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మరికొన్ని చోట్ల మురుగునీరు ఇంటి ఆవరణలోకి చేరుతోందని కాలనీ వాసులు తెలిపారు. డ్రెయినేజీలు లేకపోవడంతో... జవహర్నగర్ కాలనీలో డ్రెయినేజీలు నిర్మిస్తే మురుగుకు ఇబ్బంది ఉండదు. కచ్చా డ్రెయిన్ల కారణంగా ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోతూ దుర్వాసన వస్తుంది. మురుగునీరు రోడ్డుపై నిలుస్తుండడంతో చాలాచోట్ల సీసీ రోడ్డు దెబ్బ తింటున్నాయి. –చేపలమడుగు నాగరాజు, జవహర్నగర్, సత్తుపల్లి ● -
దరఖాస్తులు పెండింగ్ ఉండొద్దు
‘గ్రీవెన్స్ డే’లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కారం చూపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(గ్రీవెన్స్డే)లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డితో కలిసిఆయన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రజావాణిని అధికారులు అత్యంత ప్రాధాన్యతగా భావించి హాజరుకావాలని సూచించా రు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని, ఏదైనా పరిష్కరించలేకపోతే అందుకు కారణాలను దరఖాస్తుదారులకు తెలపాలని చెప్పారు. అయితే, దరఖాస్తుల పరిష్కారంలో మానవీయకోణంతో పనిచేయాలని తెలిపారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ సోమవారం ఉద్యోగ విరమణ చేసిన 22మంది అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ అనుదీప్ సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడిన కలెక్టర్.. విధినిర్వహణలో అనుభవాలను ప్రస్తుత ఉద్యోగులతో పంచుకోవాలని సూచించారు. కాగా, చైన్మెన్గా విధుల్లో చేరి చింతకాని తహసీల్దార్గా రిటైర్డ్ అవుతున్న కె.అనంతరాజు, డీటీ సీహెచ్.సత్యనారాయణ తదితరులు తమ అనుభవాలను వివరించారు. -
అటు చెత్త.. ఇటు కంపు
ఉద్యమకారులను ఆదుకోవాలి కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో తెలంగాణ ఉద్యమకారులు దీక్ష చేపట్టారు.8లోవర్షాకాలంతో పాటే వచ్చే వ్యాధులతో జనం ఆందోళన చెందుతున్నారు. డ్రెయినేజీలు, రహదారుల వెంట ఎప్పటికప్పుడు చెత్త తరలించాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు. ఫలితంగా దోమలు విజృంభిస్తుండడంతో వ్యాధుల భయం జనాన్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యాన ఖమ్మం కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల్లో పరిస్థితులను ‘సాక్షి’ సోమవారం పరిశీలించగా పలు సమస్యలు వెలుగు చూశాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం● విలీనం.. అధ్వానం ఖమ్మం కార్పొరేషన్లో విలీనమైన ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. ఖమ్మం కార్పొరేషన్లో ఖానాపురం హవేలీ గ్రామపంచాయతీ 2012లో విలీనమైంది. అయితే, ఇప్పటివరకు కూడా ఇక్కడ పారిశుద్ధ్యం గాడిన పడలేదు. ఖానాపురం, టేకులపల్లి, లక్ష్మీనగర్, మహిళా ప్రాంగణం, శ్రీకృష్ణానగర్, గోశాల, డైట్ కళాశాల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరిగి కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పలుచోట్ల డ్రైయినేజీలు లేవు. కేఎంసీ 7వ డివిజన్లోని టేకులపల్లిలో 2021 – 2022లో డబుల్ బెడ్రూం(కేసీఆర్ టవర్స్) గృహ సముదాయం నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 24 ఇళ్ల చొప్పున 54 బ్లాక్లను నిర్మించి 1,296 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇక్కడ సుమారు 4వేల మంది వరకు నివసిస్తుండగా డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. కుడి వైపు బ్లాక్ల నుంచి మురుగునీరు వెళ్లేందుకు డ్రెయినేజీ నిర్మించినా, ఎడమ వైపు డబుల్ బెడ్రూం సముదాయం ముగింపు వద్దే డ్రెయినేజీ ఆపేశారు. దీంతో మురుగునీరంతా ఖాళీ స్థలాల్లో నిలిచి దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన చేయడంతో తాత్కాలికంగా ఇక్కడ ఇంకుడు గుంత తీశారే తప్ప డ్రెయినేజీ మాత్రం నిర్మించలేదు. మామూలు రోజుల్లో ఏమో కానీ చిన్న వర్షం వచ్చినా మురుగునీరు రహదారిపై చేరి మరింత ఇబ్బంది పడుతున్నారు. అలాగే, కాలనీవాసులు రోడ్డు పక్కనే వేస్తున్న చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించకపోవడంతో పేరుకుపోతోంది. వర్షం వస్తే ఇబ్బందే.. మురుగు నీరు వెళ్లడానికి డ్రెయినేజీ నిర్మాణానికి బదులు ఇంకుడు గుంతలు తీశారు. దీంతో అందులో నీరు నిలిచి మురుగు వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నాం. సముదాయానికి ఓ పక్క డ్రెయినేజీ నిర్మించి ఇంకో పక్క వదిలేయడంతో ఈ సమస్యకు కారణమైంది. – తుడుం రాములమ్మ, కేసీఆర్ టవర్స్, టేకులపల్లి ప్రతిపాదనలకే పరిమితం మా డివిజన్ నుంచి ఏటా రూ.7 కోట్ల ఆదాయం కేఎంసీకి వస్తున్నా కాలనీల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు లేవు. ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ప్రజల కష్టాలు చూసైనా సమస్యలు పరిష్కరించాలి. – దొంగల సత్యనారాయణ, కార్పొరేటర్, 7వ డివిజన్టేకులపల్లి డబుల్ బెడ్రూం సముదాయం వద్ద డ్రెయినేజీ లేక నిలిచిన మురుగునీరు -
● వారానికోసారే చెత్త సేకరణ
ఖమ్మంరూరల్: ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీలో చెత్త సమస్యకు సరైన పరిష్కారం లభించడం లేదు. అధికారులు, సిబ్బంది సరిపడా లేక పర్యవేక్షణ లోపించడంతో డ్రెయినేజీల్లో మురుగునీరు, వీధుల్లో చెత్త తరలింపుపై పర్యవేక్షణ లోపిస్తోంది. వారానికి ఒకసారే డ్రెయినేజీలు శుభ్రం చేస్తున్నా, ఆ మురుగును తరలించకపోవడంతో రహదారులపై రాకపోకలకు జనం ఇబ్బంది పడుతున్నారు. పెదతండాలోని బొడ్రాయి వీధి జలగంనగర్లో పరిశీలించగా దాదాపు అన్ని వీధుల్లోని డ్రెయినేజీలు మురుగు నిండి కనిపించాయి. ఇక ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది వారం, పదిహేను రోజులకోసారి వస్తున్నారని స్థానికులు తెలిపారు. ఒకవేళ చెత్త సేకరించినా ఖాళీ స్థలాల్లో వేస్తున్నారని వాపోయారు. ఎక్కడి చెత్త అక్కడే రోజు విడిచి రోజు చెత్త తీస్తే శుభ్రంగా ఉంటుంది. కానీ సిబ్బంది వారానికోసారి తీసుకెళ్తుండగా, కాల్వలో తీసిన మురుగు అక్కడే వేస్తున్నారు. వారాల తరబడి తరలించక దుర్వాసన వస్తోంది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్త మా సమీపంలోనే వేస్తున్నారు. – పి.వీరస్వామి, బొడ్రాయి వీధి, పెదతండా● -
మార్కెట్లో సౌర వెలుగులు..
● ఖమ్మం వీడీవోస్ కాలనీ సమీకృత మార్కెట్లో ఏర్పాటుకు ప్రతిపాదన ● 15 కిలోవాట్ల ప్యానళ్లకు రూ.10 లక్షలతో అంచనా ● సౌర విద్యుత్తో నిర్వహణ భారం తగ్గే అవకాశం ఖమ్మంవ్యవసాయం: సౌర విద్యుత్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజిలి యోజన పథకం ద్వారా గృహాలకు ఉచిత విద్యుత్ అందించటం లక్ష్యంగా సబ్సిడీలతో ప్రోత్సహిస్తోంది. రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరగటంతో అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గమైన సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నాయి. అవకాశం ఉన్నచోట సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు, సమీకృత మార్కె ట్లు, రైతు బజార్లలో కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సూ చనలతో ఖమ్మంలోని వీడీవోస్ కాలనీ, బస్టాండ్ పక్కన ఉన్న సమీకృత రైతు బజార్లు, పాత బస్టాండ్ సమీపంలో ఉన్న రైతుబజార్లను మార్కెటింగ్ శాఖ, రెడ్–కో అధికారులు సందర్శించారు. ఈ మూడింటిలో వీడీవోస్ కాలనీలో ఉన్న సమీకృత రైతు మార్కెట్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నట్లు రెడ్–కో అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వీడీవోస్ కాలనీ సమీకృత రైతు మార్కెట్ భవనంపై సౌర విద్యుత్ ఫలకాల నిర్మాణానికి అవకాశం ఉన్న ట్లు రెడ్–కో అధికారులు గుర్తించారు. ఈ భవనంపై 15 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర ఫలకాల ఏర్పాటుకు అవకాశం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. 15 కిలోవాట్ల సౌర ఫలకాల నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి, రెడ్–కో అధికారులు, జిల్లా మార్కెటింగ్ శాఖ ద్వారా ఉన్నతాధికారులకు పంపించనున్నారు. అయితే సమీకృత మార్కెట్లను మున్సిపాలిటీ నిర్మించగా, నిర్వహణను మార్కెటింగ్ శాఖ చూస్తోంది. దీంతో సౌర విద్యుత్కు ప్రభు త్వం నుంచి అనుమతులు వస్తే నిధులను ఏ శాఖ భరిస్తుందనేది తేల్చాల్సి ఉంటుంది. తగ్గనున్న నిర్వహణ భారం సౌరవిద్యుత్ ఉత్పత్తితో సమీకృత మార్కెట్ నిర్వ హణ భారానికి కొంత వెసులుబాటు కలిగే అవకా శం ఉంది. ఇప్పటికే వినియోగదారుల ఆదరణకు నోచుకోకుండా అంతంతమాత్రంగా నిర్వహణ సాగిస్తున్నాయి. విద్యుత్ భారం అదనం. ఇప్పటికే మూతపడి ఉన్న నాన్వెజ్ మార్కెట్లో సేంద్రియ రైతు మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత కూరగాయలు, ఆకుకూరల విక్రయాలతో పాటు సేంద్రియ రైతు మార్కెట్ నిర్వహణలోకి వస్తే సౌర విద్యుత్ ఉత్పత్తి కొంత మేరకు తోడ్పాటునిచ్చే అవకాశం ఉంది. ఈ మార్కెట్కు విద్యుత్ బిల్లుల భారం తగ్గే అవకాశం ఉంది. అనుమతులు రాగానే పనులు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వీడీవోస్ కాలనీ సమీకృత రైతు మార్కెట్ భవనంపై సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం. ఈ భవనంపై 15 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఫలకాలను అమర్చే అవకాశం ఉంది. ఈ మార్కెట్ భవనంపై సౌర విద్యుత్ ఉత్పత్తికి వనరులు కూడా అనుకూలంగా ఉన్నాయి. –పి.అజయ్కుమార్, మేనేజర్, రెడ్–కో, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాట్లు నిర్మించాలి
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో గెజిటెడ్ అధికారుల కోసం గేటెడ్ కమ్యూనిటీలా ప్లాట్లు నిర్మించాలని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీని వాసరావు అన్నారు. టీజీఓ భవనంలో ఆదివారం జరిగిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల హౌస్ బిల్డింగ్ సోసైటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లు 576 ఉన్నాయని, సొసైటీలో 975 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారు జూలై 10 లోపు ఎన్ఎస్టీ రోడ్డులోని ఎస్బీఐలో రూ. 2లక్షలు డిపాజిట్ చేయాలని, ఆలా చేసిన వారిలో 576 మందికి ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. అంతకంటే ఎక్కువ మంది డిపాజిట్ చేస్తే లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో టీజీఓస్ జిల్లా అధ్యక్షుడు కస్తాల సత్యనారాయణ, కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీఎన్జీఓస్ జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్, కొండపల్లి శేషుకుమార్, రమేష్, మహేష్బాబు, సుధారాణి, డాక్టర్ సంజయ్, గంగవరపు బాలకృష్ణ, జయపాల్ తదితరులు పాల్గొన్నారు.టీజీఓ రాష్ట్ర అద్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు -
అలరించిన సినీ సంగీత విభావరి
ఖమ్మంగాంధీచౌక్: స్వర సుధా మ్యూజిక్ ఖమ్మం యూనిట్ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. యూనిట్ అధ్యక్షుడు కె. మాధవరావు, ఉపాధ్యక్షుడు వి.వి. రెడ్డి, ప్రతినిధులు పీజే వినయ్కుమార్, పిన్నెల్లి యాదగిరి, కీర్తన, రేవతి, జనార్దన్, స్వప్న, రాయప్రోలు సుబ్రమణ్యం, ఆర్.మధు చేసిన గానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యం, సామాజిక సేవకులు డాక్టర్ వనం కృష్ణవేణి, పుసులూరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు పూర్తిఖమ్మం స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలకు 70 మంది బాలబాలికలు హాజరయ్యారు. అండర్–14, 12, 10 విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మందుల వెంకటేశ్వర్లు, ఎండీ షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వానఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా ఆదివా రం రాత్రి వర్షం కురిసింది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురవగా, కొన్నిచోట్ల తేలికపాటి వాన పడింది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాత్రి 9 గంటల వరకు ముదిగొండ మండలం పమ్మిలో అత్యధికంగా 38.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చింతకాని మండలం నాగులవంచలో 35.3, బా ణాపురంలో 27.8, నేలకొండపల్లిలో 22.3, మధిరలో 20.5, తిరుమలాయపాలెంలో 18.8, గుబ్బగుర్తిలో 18, ఖమ్మం ఖానాపురంలో 17.3, మధిర ఏఆర్ఎస్ వద్ద 17, చింతకానిలో 16.5, రావినూతలలో 16.3, రఘునాథపాలెంలో 15.3, వైరాలో 15, కూసుమంచిలో 14.5, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 14.3, ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్హౌస్ వద్ద 14, పల్లెగూడెంలో 13, లింగాలలో 12, కొణిజర్లలో 11, సిరిపురంలో 10.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వాన పంటల సాగుకు, ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, పెసర వంటి పంటలకు మేలు చేస్తుందని, వరినారు పోసేందుకు కూడా దోహదపడుతుందని రైతులు చెబుతున్నారు. జూలై 5న కౌన్సెలింగ్సింగరేణి(కొత్తగూడెం): నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 150 సీట్ల భర్తీ కోసం సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు ఈ నెల 28 నుంచి 3వ తేదీ వరకు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్–30, కంప్యూటర్–30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్– 30, మెకానికల్–30, మైనింగ్–30 సీట్లు ఉన్నా యని, https:# scp. scpolytechnic. com/ online& admission వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసి, కాపీని డౌన్లోడ్ చేసి, సంభందిత గని, డిపార్ట్మెంట్ హెచ్ఓడీతో అటెస్టేషన్ చేయించి జూలై 5వ తేదీన జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని పేర్కొంది. వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. -
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్
ఖమ్మంక్రైం: నగరంలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన ములుగు జిల్లావాసులు ముగ్గురిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లాకు చెందిన కుర్రా మోహన్, బోడ మురారి, బోడ గౌతమ్ శ్రీనివాసనగర్లోని కాల్వకట్ట ప్రాంతంలో ఉంటున్నారు. వారు గంజాయివిక్రయంతోపాటు సేవించటానికి అల వాటు పడి ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన వినోద్కుమార్, జాడి రాకేశ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి ఖమ్మం తీసుకొచ్చారు. చర్చికౌంపౌండ్ బ్రిడ్జి కింద ఎస్ఐ కొండల్రావు తనిఖీలు చేపడుతుండగా వారు ద్విచక్రవాహనంపై వెళ్తూ పట్టుబడ్డారు. వారి వద్ద 1,100 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యూరియా తిని 11 మేకల మృతిములకలపల్లి: యూరియా తినడంతో 11 మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని మంగపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మంగపేట గ్రామానికి చెందిన వాడె దారయ్యకు చెందిన మేకలు గ్రామశివారు లో మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో ఓ రైతు ట్రాక్టర్లో యూరియా బస్తాలు తరలిస్తుండ గా ఒకటి రోడ్డుపై పడటంతో యూరియా కిందపడింది. సమీపంలో ఉన్న 11 మేక లు యూరియా తిని మృతిచెందాయి. సుమారు రూ.1.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. -
నయా ఫాసిస్టు పోకడలతో ప్రమాదకరం
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నయా ఫాసిస్టు పోకడలతో కూడిన పాలన కొనసాగిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించా రు. స్థానిక సుందరయ్య భవనంలో సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్రమోదీ 11 ఏళ్ల పరిపాలనలో కార్పొ రేట్ సంస్థలకు లబ్ధి జరిగేలా నిర్ణయాలు జరిగాయ ని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణ రైతాంగం, పట్టణ కార్మిక వర్గాలు ఆశించిన అభివృద్ధిని సాధించలేదని, దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని, ప్రజల కొనుగోలు శక్తి హీన స్థాయికి దిగజారిందని పేర్కొన్నా రు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి వేగం పుంజుకున్నప్పుడు దేశంలో, సేవారంగంలో సైతం అభివృద్ధి కనబడుతుందని చెప్పారు. లౌకిక, సామ్యవాద స్ఫూర్తికి నిలువుటద్దంగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని సైతం నిర్వీర్యం చేయడానికి బీజేపీ పూనుకుంటోందని విమర్శించారు. తన మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల ద్వారా నయా ఫాసిస్ట్ పోకడలతో కూడిన చర్యలను చేపడుతోందని, ప్రజలు గమనించాలని తమ్మినేని కోరారు. సమావేశంలో నున్నా నాగేశ్వరరావు, ఎం.సుబ్బారావు, పొన్నం వెంకటేశ్వరరావు, బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
కాల్వలోకి దూసుకెళ్లిన లారీ
వైరా: వైరా వైపు నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న ఓ లారీ ఆదివారం అదుపుతప్పి రిజర్వాయర్ ఎడమ కాల్వలో పడింది. గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు జరుగుతున్న సోమవరం ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ వద్ద లారీడ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న మరో లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న రిజర్వాయర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. లారీడ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడటంతో ప్రమాదం తప్పినట్లయింది. యువకుడి ఆత్మహత్యాయత్నంనేలకొండపల్లి: ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకా.. మండలంలోని మోటాపురం గ్రామానికి చెందిన రాజేశ్ (24) ఆదివారం అధికంగా టాబ్లెట్లు వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి.. ఖమ్మం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నగరవాసిపై పీడీ యాక్ట్ కేసుఖమ్మంఅర్బన్: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్న ఆరోపణలపై పగడాల విజయ్ అలియాస్ చంటిపై పోలీస్ శాఖ పీడీ యాక్ట్ను ప్రయోగించింది. ఖమ్మంఅర్బన్ పోలీస్స్టేషన్ పరిధిలో విజయ్ పలు నేరాలకు పాల్పడినందున ఈ చర్య తీసుకున్నట్లు సీపీ ఎస్.సునీల్దత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. నగరంలోని అగ్రహారం న్యూ కాలనీకి చెందిన పగడాల విజయ్ కొంతకాలంగా హత్యాయత్నం, దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపు లు, గుండాగిరి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నా డు. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినప్పటికీ జామీన్పై విడుదలై మళ్లీ అదేతరహా నేరాలకు పాల్పడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో విజయ్ను అదుపులోకి తీసుకుని, ఖానాపురం హవేలి (ఖమ్మంఅర్బన్) పోలీస్స్టేషన్ సీఐ భానుప్రకాష్ నేతృత్వంలో హైదరాబాద్ చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించామని కమిషనర్ వివరించారు. గంజాయి పట్టివేతపాల్వంచ: కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నా రు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం స్థానిక రెజీనా కాన్వెంట్ సమీపంలో ఎస్ఐ సుమన్ వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన కారు ను ఆపేందుకు యత్నించగా.. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. మరో ముగ్గురితోపాటు 11.100 కేజీల గంజాయి పట్టుబడింది. వారు చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కందిమళ్ల శ్రీహరి, జొన్నలగడ్డ రాకేశ్రెడ్డి, బోనకల్ మండలం ముష్టికుంట్లవాసి ఎస్కే జావిద్గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. రేషన్ బియ్యం.. కల్లూరు: మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కారుకుల నరసింహారావు, కారుకుల సత్యం తమ ఇళ్లలో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం మేరకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ డీటీ సత్యనారాయణకు అప్పగించారు. -
ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి
భద్రాచలం: పునర్విభజనలో భాగంగా ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్లో పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఏపీలో కలిపిన భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలైన ఎటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నంలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. వీటివల్ల పరిపాలనా, అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణం, తెలంగాణ ప్రధాన మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతోందని, భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో రెండు రాష్ట్రాల చెక్పోస్టుల వల్ల గిరిజనులు, వాణిజ్య వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి -
నేటి నుంచి గురుపౌర్ణమి వేడుకలు
సాయి మందిరాల్లో 11 రోజుల పాటు అభిషేకాలు, హోమాలు ఖమ్మంగాంధీచౌక్: గురుపౌర్ణమి వేడుకలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సాయిబాబా మందిరాల్లో 11రోజుల పాటు అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వర కు ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. వేడుకల్లో భాగంగా గురువులను, పెద్దలను పూజించే రోజును గురుపూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. వేద వ్యాసుడిని మానవులంతా గురువుగా భావిస్తారు. గురుపౌర్ణమి రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మరి కొందరు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఆచరిస్తారు. ఈ వేడుకల కోసం ఖమ్మం నగరంలోని రంగనాయకుల గుట్ట పక్కన గల శ్రీకృష్ణసాయి ఆశ్రమం, గాంధీచౌక్లోని షిర్డీసాయి మందిరంతో పాటు జిల్లాలోని పలు సాయిబాబా ఆలయాలు, మందిరాల్లో ఏర్పాట్లు చేశారు. విద్యారంగ పరిరక్షణకు కృషి చేయాలిటీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ ఖమ్మం సహకారనగర్ : విద్యారంగ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.అనిల్కుమార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 20శాతం నిధులు కేటాయించాలని కోరారు. ఖమ్మంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీల తర్వాతే పదోన్నతులు చేపట్టాలన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించి ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీపీటీఎఫ్ నేతలు నాగిరెడ్డి, మనోహర్ రాజు, విజయ్, పద్మ మాట్లాడుతూ.. కేజీబీవీ ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు చెల్లించాలని, వారిని రెగ్యులర్ చేయాలని కోరా రు. కేజీబీవీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వి. నాగేశ్వరరావు, వెంగళరావు, నాయకులు రమాదేవి, ముత్తయ్య, వెంకటేశ్వరరావు, వీరబాబు పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకుని అమ్మవారికి ఒడిబియ్యం, తలనీలాలు, చీరలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా, భక్తులు బోనాలు, సారె సమర్పించారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయకమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
గోదావరి పుష్కరాలకు ప్రణాళికే కీలకం
● 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు ● కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా ● ఇంకా ప్రణాళిక, నిధులు విడుదల చేయని ప్రభుత్వంభద్రాచలం: భక్తులు మహా పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు రెండేళ్ల సమయమే ఉంది. 2027లో జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించగా భ ద్రాచలానికి కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద నున్న త్రయంబకంలో పుట్టిన గోదావరి నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల మీదుగా భద్రాద్రి జిల్లాలోకి ప్రవేశించి భద్రాచలం దిగువన ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నది 180 కి.మీ.ప్రవహించగా, విభజనం అనంతరం ఏపీలో ఏడు మండలాలు విలీనం కాగా, ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 70 కి.మీ.ప్రవహిస్తోంది. 2015లో పుష్కరాలు.. గత పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. మళ్లీ 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి అత్యధికంగా తరలివస్తుంటారు. గత పుష్కరాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 70 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, 2027లో కోటి మందికి పైగానే భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం, పర్ణశాల, మోతె తదితర ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకటించని ప్రభుత్వం 2027లో పుష్కరాలను విజయవంతం చేయాలంటే కనీసం రెండేళ్ల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. స్నానఘాట్ల పెంపు, రోడ్లు వెడల్పు, ఆలయ పరిసర ప్రాంతాల విస్తరణ, భక్తులకు వసతుల కల్పన వంటి పనులు చేపట్టాలి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందస్తు పనులకు రూ.50కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఘాట్ల పెంపు వంటి వసతుల కల్ప నకు, శాశ్వత పనులకు ఇంకా నిధులు అవసరమవుతాయి. ఏపీలో ఇప్పటికే ఈ పుష్కరాల పనులపై సమీక్ష, బడ్జెట్తో ప్రణాళిక ప్రకటించారు. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఏ ప్రకటనా వెలువడలేదు. దీనిపై ఉమ్మడి జిలా మంత్రులు చొరవ తీసుకుని ప్రణాళిక, నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. -
అధికారం కోసమే బీజేపీ దైవజపం
● మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని నేలకొండపల్లి : అధికారం కోసమే బీజెపీ రామ జపం, దైవ జపం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండలంలోని మోటాపురంలో ఆదివారం జరిగిన సీపీఐ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో ప్రజలను వంచిస్తోందని, మతం మాటున ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి అధికార ధ్యాసే తప్ప దేశభక్తి లేదన్నారు. దేశం కోసం బీజెపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల అభ్యున్నతి, హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, త్యాగాల చరిత్ర తమ సొంతమని అన్నారు. కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సంపద సృష్టి కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించారు. మావోయిస్టులను హతమార్చడానికి అమిత్షా వంటి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలని కోరారు. సీపీఐ శత వసంతాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల మందితో చారిత్రక సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు హేమంతరావు, మహ్మద్ మౌలానా, దండి సురేష్, జితేందర్రెడ్డి, కర్ణకుమార్, కర్నాటి భానుప్రసాద్, రామ్మూర్తి, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పాల్తీయ శ్రీనివాసరావు, రాంకోటి, కాశిబోయిన అయోధ్య, మేకల పుల్లయ్య, మల్లెబోయిన ఉపేందర్, సీతారాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సేకరణలో భేష్..
● ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాల సత్తా ● జిల్లాలో 159 కేంద్రాల నిర్వహణ ● రైతుల నుంచి 8,96,528 క్వింటాళ్ల సేకరణ 8,96,528 క్వింటాళ్ల ధాన్యం సేకరణ.. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 159 కేంద్రాల ద్వారా 13,990 మంది రైతుల నుంచి 8,96,528 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలోనూ ధైర్యంగా ముందుకు సాగారు. ఇటు రైతులను ఒప్పించి, అటు మిల్లర్లకు సర్దిచెప్పి విజయవంతంగా తరలించారు. వీరికి వచ్చే కమీషన్ కొంచమే అయినా రైతులకు, మిల్లర్లకు మధ్య వారధిగా పనిచేయడం విశేషం. ఇలా ప్రతీ రెండు సీజన్లకు కొనుగోలు చేసే సభ్యులు మారుతుండగా.. ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించినట్టవుతుంది.నేలకొండపల్లి: ఏ రంగంలోనైనా.. తమకు తామే సాటి అంటూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ మహిళా సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం, మిల్లులకు తరలించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. రైతులు–మిల్లర్లకు మధ్య సంఘ సభ్యులు వారధిలా నిలుస్తున్నారు. ఇటీవల జిల్లాలో 159 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా.. విజయవంతంగా నిర్వహించారు. -
● మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ఇందిరా డెయిరీ ● త్వరలోనే 20వేల మంది సభ్యులకు 40వేల గేదెలు పంపిణీ ● ప్రాజెక్టుపై నిత్యం సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి
చేపట్టాల్సిన పనులు.. ●మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఏర్పాటు చేసిన బీఎంసీయూలు ఎర్రుపాలెం మినహా 4 మండలాల్లో ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలి. ●ఈ ప్రాజెక్టు విజయవంతానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణ ఉండాలి. ●పాల కేంద్రాలు ప్రారంభించి వారికి తగిన సామగ్రి అందించాలి. ●సంఘ సభ్యులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలి ●మండలాన్ని 5 క్లస్టర్లుగా విభజించి సుమారు 40 మంది నిరుద్యోగులతో గడ్డి పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేసి పశుగ్రాసం కొరత లేకుండా చూడాలి. ●గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం లభిస్తుంది. ప్రాజెక్టుకు రూపకల్పన.. మధిర నియోజకవర్గంలో పూర్తి వ్యవసాయ ఆధారిత భూమి ఉంది. వ్యవసాయ రంగానికి అనుసంధానంగా పాడి పరిశ్రమ ఏర్పాటు చేసి మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఐదు మండలాల్లో 2013లో 4వేల మందితో సభ్యత్వం కట్టించి సహకార సంఘ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కో మండలం నుంచి 4 వేల మంది చొప్పున 20 వేల మందితో సభ్యత్వం కట్టించగా, ప్రస్తుతం బ్యాంకులో రూ.3.75 కోట్లు ఇందిరా మహిళా డెయిరీ ఖాతాల్లో ఉన్నాయి. తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ఈ పనులు నిలిచిపోయాయి. తిరిగి 2024లో ప్రభుత్వం ఏర్పాటుతో డెయిరీ పనుల్లో వేగం పెంచారు. నియోజకవర్గంలో 20 వేల మందితో సభ్యత్వం కట్టించడంతోపాటు ఐదు మండలాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (పాలశీతలీకరణ కేంద్రాలు) ఏర్పాటు చేయించారు. ఎర్రుపాలెం మండలంలో గతేడాది విజయదశమి రోజున బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (బీఎంసీయూ)లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించగా పాలు సేకరిస్తున్నారు. బోనకల్లో రీ సైక్లింగ్.. ఐదు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా వచ్చిన పాలతో బోనకల్ మండలంలో 9.24ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయనున్న ఇందిరా మహిళా డెయిరీ మదర్ యూనిట్ ద్వారా పాలను రీసైక్లింగ్ చేస్తారు. వాటి ద్వారా పాల ఉత్పత్తులైన వెన్న, మజ్జిగ, పాలకోవా, పాల ప్యాకెట్లు తదితర ఉత్పత్తులను తయారు చేస్తారు. వీటితో వచ్చే ఆదాయాన్ని సంఘ సభ్యులకు బోనస్ రూపంలో చెల్లిస్తారు. ఈ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ శరవేగంగా పనులు సాగిస్తున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ ప్రాజెక్టు అమలుకు ఐకేపీ – డీఆర్డీఏ, పశు సంవర్థక, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలతో కలెక్టర్, డీఆర్డీఓ సమన్వయం చేస్తున్నారు. భట్టి విక్రమార్క చొరవతోనే.. 2013లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. డెయిరీ ప్రాజెక్టులో 20వేల మంది మహిళలు సభ్యులుగా చేరారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ పథకం నిలిచిపోయింది. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యాక తిరిగి వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టుతో మహిళలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. – బందెల లలిత కుమారి, కోశాధికారి, ఇందిరా మహిళా డెయిరీగుజరాత్, ములకనూరులో అధ్యయనం నియోజకవర్గంలోని ప్రతి మహిళను అభివృద్ధి చేసేందుకు భట్టి విక్రమార్క 2013లో ఇందిరా మహిళా డెయిరీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ నిర్వహణ కూడా మహిళలకే అప్పగించారు. గుజరాత్ లోని అముల్, తెలంగాణలోని ములకనూరు డెయిరీలను సందర్శించాం. వచ్చే నెలలో అన్ని సామాజిక వర్గాల మహిళలకు పాడి గేదెలు పంపిణీ చేస్తారు. – కంటెపూడి అన్నపూర్ణ, అధ్యక్షురాలు, ఇందిరా మహిళా డెయిరీ 80 శాతం సబ్సిడీ.. ఒక్కొక్కరికి రెండు గేదెల చొప్పున రూ.2 లక్షలకు గాను 80శాతం సబ్సిడీ ఉంటుంది. మిగిలిన 20 శాతం కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చేందు కు సిద్ధంగా ఉన్నాయి. 4 మండలాల్లో బీఎంసీ యూ ఏర్పాటుకు రూ. 2 కోట్లు మంజూరయ్యా యి. టెండర్లు కూడా పిలిచారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో పాల దిగుబడి పెరుగుతుంది. – ఏడుకొండలు, ఇందిరా మహిళా డెయిరీ, ఇన్చార్జ్ పర్సన్ -
మాకు న్యాయం చేయండి..
కారేపల్లి: ‘నా భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తూ నన్ను, నా కుమారుడిని ఇంట్లో నుంచి గెంటేశాడు. నాకు, నా కుమారుడికి న్యాయం చేయండి’అని ఓ వివాహిత ప్రాధేయపడింది. బాధితురాలు శనివారం విలేకరులతో తెలిపిన వివరాలు.. మాధారం గ్రామానికి చెందిన శైలజ, అదే గ్రామానికి చెందిన ఏనుగు శివయ్య 16 ఏళ్ల కిందట ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, శివయ్య వేరే మహిళతో సహజీవనం చేస్తూ, శైలజను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈ ఘటనపై శైలజ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శివయ్యను మందలించి వదిలేశారు. అయినా తీరుమార్చుకోని శివయ్య అదే మహిళతో ఉంటూ తమను వదిలించుకోవడం కోసం చిత్ర హింసలు పెడుతున్నాడని శైలజ కన్నీటి పర్యంతమైంది. శివయ్య తన పేరుతో ఉన్న రెండు ఎకరాల భూమిని విక్రయించి, తనకు, తన కుమారుడికి అన్యాయం చేయాలని చూస్తున్నాడని, స్థానిక తహసీల్దార్, కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొంది. మాధారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తన ప్రోద్బలంతో మంత్రుల పేర్లు చెప్పి తన భర్తను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకు పోయాడని, తనకు, తన కుమారుడికి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. -
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 14 ప్రసవాలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, కళాశాలలోని మాతా శిశు కేంద్రంలో శనివారం మధ్యాహ్నం వరకు వైద్యులు 14 ప్రసవాలు చేశారు. ఇందులో ఎనిమిది సహజ ప్రసవాలు కాగా.. ఆరు సిజేరియన్ చేశారు. వీరిలో నలుగురు మగ శిశువులు, పదిమంది ఆడశిశువులు ఉన్నారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. రైలు నుంచి జారిపడి సాధువు మృతిచింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్కు చెందిన సాధువు శ్రీబిన్ కేఎస్ (38) మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సాధువు వద్ద గోరఖ్పూర్ నుంచి త్రిస్సూర్కు వెళ్లే రైలు టికెట్ ఉన్నట్లు తెలిపారు. పుట్బోర్డుపై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించి ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు బృందం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి అమ్ముతున్న యువకుల అరెస్ట్ ఖమ్మంక్రైం: ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి గంజాయి తీసుకొచ్చి ఇతరులకు అమ్ముతూ, సేవిస్తున్న యువకులను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కరుణాకర్ కథనం ప్రకారం.. నిజాంపేట ప్రాంతానికి చెందిన వినీత్, హేమంత్సాయితోపాటు మరో ఇద్దరు గంజాయి విక్రయించడంతో వారూ సేవిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయితోపాటు రూ.10వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ వెల్లడించారు. -
విజ్ఞాన గని..
7,855 పుస్తకాలు, 453 సభ్యత్వాలు కారేపల్లి శాఖాగ్రంథాలయంలో 7,855 పుస్తకాలు ఉండగా, 453 మంది పాఠకులు సభ్యత్వాలు కలిగి ఉన్నారు. తెలుగు పుస్తకాలు 6,800, ఆంగ్ల పుస్తకాలు 725, హిందీ పుస్తకాలు 309 ఉండగా, పురుషులు 306, సీ్త్రలు 53, బాలురు 94 మంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు. రోజువారీగా 60 – 80 మంది పాఠకులు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంచుతారు. ప్రతి శుక్రవారం, ప్రతినెల రెండో శనివారం సెలవు దినాలు. కారేపల్లి: సింగరేణి (కారేపల్లి) శాఖా గ్రంథాలయం ఓ విజ్ఞాన గని. ఎందరో విద్యార్థులను ఉద్యోగులుగా, మేధావులుగా తీర్చిదిద్దిన ఓ స్థావరం. ఆనాటి యువకుల స్ఫూర్తితో.. స్వాతంత్య్రానికి ముందే 1929లో ‘భారత యువజన సంఘం’గా ఏర్పాటై, నేటి యువతకు స్ఫూర్తిదాయకమై విరాజిల్లుతోంది. భారత యువజన సంఘం స్థాపనలో ఆనాటి యువకులు పర్సా రామచంద్రరావు, నేదునూరి వీరరాఘవులు ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయం ఎన్నో జ్ఞాపకాలకు వేదిక అని పలువురు చెబుతుంటారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1986 వరకు పాత భవనమే ఉన్నప్పటికీ అనంతరం కారేపల్లి శాఖా గ్రంథాలయంగా మారి.. కొత్త భవనంలో కొనసాగుతోంది. పోటీ పరీక్షల సన్నద్ధత కోసం.. కారేపల్లి శాఖా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ ఎఫైర్స్, కాంపిటేటివ్ బుక్స్, నవలలు, పిల్లలకు సంబంధించిన కథల పుస్తకాలు, కాకతీయులు, మొఘలులు, జైనులు, శాతావాహనుల చరిత్ర, జాతీయ నాయకుల జీవితచరిత్ర, వీటితోపాటు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం వంటి పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, గ్రూప్–1, గ్రూప్–2, పోలీస్, ఎంసెట్, ఎంఈడీ, టీటీసీ ప్రవేశ పరీక్షలకు సైతం ఇక్కడ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఏడాది కిందటి వివిధ తెలుగు దినపత్రికలు, వార పత్రికలు, పక్ష పత్రికలు, మాస పత్రికలతో పాటు ఇంగ్లిష్, ఉర్దూ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. సింగరేణి గ్రంథాలయానికి విశేష స్పందన స్వాతంత్య్రానికి ముందే 1929లో ఏర్పాటు ఆనాడు భారత యువజన సంఘంగా నామకరణం ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన గ్రంథాలయం -
కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత
పాల్వంచ: కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని కేటీపీఎస్ 7వ దశ సీఈ పి.శ్రీనివాసబాబు అన్నారు. శనివారం స్థానిక కేటీపీఎస్ సీతారామ కల్యాణ మండపంలో పాకాలపాటి కృష్ణయ్య సాంస్కృతిక కళాపీఠం సమక్షాన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలమైందని అన్నారు. చిన్నప్పటి నుండే కళలపై మక్కువ పెంచుకునేలా కృషి చేయాలని, కళాకారుల ఆదరించి ప్రోత్సహించాలన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు తోట దేవీప్రసన్న, మధిర రంగ స్థల కళాకారుల సమైఖ్య అధ్యక్షులు పుతుంబాక కృష్ణ ప్రసాద్, బాబులాల్, ఎస్వీఆర్కే.ఆచార్యులు, వెంకటాచారి, జోన్నాడ కృష్ణ, ముత్యాల హనుమంతరావు, కృష్ణ, వెంకన్న, రోశయ్య చౌదరి, బాషా, పాకాలపాటి రోశయ్య చౌదరి, దామోదర్రావు, బాలస్వామి, పున్నయ్య పాల్గొన్నారు. -
సోషలిజం కోసం సీఐటీయూ పోరాటం
ఖమ్మంఅర్బన్: దేశంలో ఆర్థిక అసమానతలు లేని సమసమాజం, సోషలిజం స్థాపనే సీఐటీయూ లక్ష్యమని, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పెట్టుబడిదారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పేర్కొన్నారు. శనివారం యర్రా శ్రీకాంత్నగర్ సత్తెనపల్లి రామకృష్ణభవన్లో నిర్వహించిన సీఐటీయూ ఖానాపురం హవేలీ మండల మహాసభలో తొలుత సంఘం జెండా ఆవిష్కరించాక ఎం.సాయిబాబ మాట్లాడారు. దేశ సంపదను సృష్టించేది కార్మిక వర్గమే అయినా, దానిని కొద్దిమంది పెట్టుబడిదారులు కబ్జా చేస్తున్నారని, కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా కేంద్రం తీసుకొచ్చిందని, ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్దన్, కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మహాసభలో మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పిన్నింటి రమ్యతోపాటు ఎం.తిరుమలాచార్యులు, వై.విక్రమ్, దొంగల తిరుపతిరావు, భూక్య శ్రీనివాస్, గాలి వెంకటాద్రి, గొర్రెముచ్చు నాగేశ్వరరావు, గాలి అంజయ్య, కర్ల వీరస్వామి, వేదగిరి మురహరి, మాచర్ల గోపాల్, నల్లమల సత్యనారాయణ, కుర్రి వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖానాపురం హవేలీ మండల సీఐటీయూ కన్వీనర్గా గాలి అంజయ్య, కోకన్వీనర్గా కర్ల వీరస్వామితోపాటు సభ్యులను ఎన్నుకున్నారు. -
మట్టిని తొలగించి స్థలం కబ్జా..!
పెనుబల్లి: ఎన్నెస్పీ కాల్వ ఆధీనంలోని మట్టిని అక్రమంగా తోలుకుపోవడంతో పాటు ఆ స్థలాలను ఆక్రమించే పనిలో పడ్డారు అక్రమార్కులు. ఇలాంటి ఘటన మండలంలోని సూరయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. సూరయ్యబంజర్ వద్ద ఎన్నెస్పీ కాల్వ తవ్వి నప్పుడు వచ్చిన మట్టిని ఆ శాఖ స్థలంలోనే కాల్వకు ఇరువైపులా పోశారు. ఆ మట్టిని ఇటీవల కాలంలో గ్రీన్ ఫీల్డ్ హైవేకి భారీ ఎత్తున తోలుకుపోయారు. దీంతో పాటు ఆ మట్టిని పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నవారు తరలించారు. దళారులు జేసీబీ సాయంతో మట్టిని తొలిగించి, ఆ స్థలాన్ని ఆక్రమించడం ప్రారంభించారు. ఇలా సూరయ్యబంజర్లో మూడు ఎకరాలకు పైగా ఉన్న మట్టిని తొలగించి, ఆ స్థలాన్ని ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేయడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అక్రమార్కులకు కాకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూపన్లు జారీ చేసి, ఉచితంగా మట్టి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రామయ్యకు సువర్ణ తులసీ అర్చనభద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని కాకినాడకు చెందిన భక్తురాలు సత్య అనురాధ రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఆయిల్ రికవరీని కాపాడాలిఅశ్వారావుపేట/దమ్మపేట: ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని కాపాడాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సూచించారు. శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను నారంవారిగూడెంలోని ఆయిల్పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులు, గెలల క్రషింగ్ సామర్థ్యంపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం తగ్గకుండా ఉండేందుకు గెలల దిగుమతి నుంచి క్రూడాయిల్ సేకరణ వరకు అన్ని అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పక్వానికి రాని గెలలను తీసుకురావొద్దని రైతులను సూచించాలన్నారు. ప్లాంట్ల మేనేజర్లు ఎం.నాగబాబు, సత్యనారాయణ, అధికారులు పవన్, కళ్యాణ్, వెంకటేష్, కార్తీక్, రాజేష్, శివ,రాధాకృష్ణ ఉన్నారు. -
ప్రభుత్వ భూమి స్వాధీనం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం రెవెన్యూ పరిధి మోతీనగర్ ప్రాంతం సర్వే నంబర్ 123లో ఉన్న సుమారు 9 కుంటల (1,100 గజాలు) భూమిని రెవెన్యూ అధికారు లు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, హెచ్చరిక బోర్డు పెట్టారు. ఈ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య రెండు నెలలుగా వివాదం జరుగుతోంది. ఇది రెవెన్యూ అధికారుల వద్దకు చేరడంతో వారు సర్వే చేయగా ప్రభుత్వ భూమి అని తేలింది. దీంతో తహసీల్దార్ సైదులు, ఆర్ఐ సాయినరేశ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సమక్షంలో భూమిని స్వాధీనం చేసుకుని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు కార్పొరేషన్ అధికారులకు అప్పగించారు.హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
చింతకాని: మండలంలోని వందనం, రామకృష్ణాపురం గ్రామాల సమీపంలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి వాటిలోని రాగి వైరును అపహరించినట్లు విద్యుత్ ఏఈ చావా శ్రీధర్ స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. అలాగే రేపల్లెవాడ గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో తొమ్మిది విద్యుత్ స్తంభాలు విరిగిపోయినట్లు కూడా ఫిర్యాదులో తెలిపారు. ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ పైనుంచి పడి గాయాలు బోనకల్: మండలంలోని చిన్నబీరవల్లి క్రాస్రోడ్డు సమీపంలో మధిర మండలం సిద్ధినేనిగూడెం గ్రామానికి చెందిన పుట్టా రాంబాబు ద్విచక్ర వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడికి 108 సిబ్బంది కోటా భానుహాసన్, మిథున్చక్రవర్తి ప్రథమ చికిత్స చేసి మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్టల్లో ఉండలేక విద్యార్థిని ఆత్మహత్య తల్లాడ: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఉండటం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని రామానుజవరంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐలూరి పూజిత (16)ను తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేర్పించారు. విద్యార్థిని ఆదివారం పుట్టినరోజు జరుపుకుని, సోమవారం కళాశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ, శుక్రవారం రాత్రి పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పూజిత తండ్రి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు తల్లాడ హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర కబడ్డీ జట్టు వైస్కెప్టెన్గా హనీ
మధిర: మధిర పట్టణానికి చెందిన హనీ రాష్ట్ర కబడ్డీ జట్టుకు వైస్కెప్టెన్గా ఎంపికై ంది. ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న హనీ 8వ తరగతి నుంచే కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపుతోంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన జట్టులో భాగస్వామిగా ఉంది. శనివారం నుంచి ఉత్తరాఖండ్లో మొదలైన 5వ జాతీయ బాలికల కబడ్డీ పోటీల్లో అండర్–18 విభాగం తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు హనీ వైస్కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కాగా, తొలిరోజు పోటీల్లో తెలంగాణ జట్టు కేరళ రాష్ట్ర జట్టుపై విజయం సాధించింది. ఇంకా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. -
మార్కెట్ కార్మికుల రేట్లపై సమావేశం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పనిచేసే వివిధ వర్గాల కార్మికుల రేట్ల పెంపు అంశంపై శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రెండేళ్లకు ఒకసారి మార్కెట్ కార్మికుల కూలీ రేట్ల పెంపు ప్రక్రియ ఉంటుంది. కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ ఏడాది తమకు 25 శాతం రేట్లు పెంచాలని కోరుతూ మార్కెట్ కమిటీకి, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గానికి వినతిపత్రాలు అందించారు. సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ కూలీ రేట్లు పెంచాలని ప్రతిపాదన చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ ఏడాది మిర్చితో పాటు మార్కెట్కు విక్రయానికి వచ్చే పంటలకు ధరలు లేక పోగా, గత ఏడాదితో పోలిస్తే ధరలు తగ్గాయని వివరించారు. పంటల ధరలు తగ్గినందున కార్మికుల రేట్లు పెంపు సమంజసం కాదని వివరించారు. రైతు సంఘాల ప్రతినిధుల అభ్యర్థనకు కార్మిక సంఘాల నేతలు సుముఖత వ్యక్తం చేశారు. జరిగిన చర్చ వివరాలను జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ స్పష్టం చేసింది. సమావేశంలో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్, రైతుంఘాల ప్రతినిధులు అడపా రామకోటయ్య, మాదినేని రమేశ్, దొండపాటి రమేశ్, షేక్ మీరా, నాగేశ్వరరావు, శేఖర్ గౌడ్, రవీందర్, యుగంధర్నాయుడు, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్రావు, హమాలీ, రెల్లుడు, స్వీపర్ల సంఘాల ప్రతినిధులు బండారు యాకయ్య, భూక్యా శ్రీనివాస్, మద్ది సత్యం, దడవాయి సంఘం బాధ్యులు నీలం రాజేశ్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాలు పెంచాలి
● ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచండి ● ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండాలి.. ● అధికారులకు కలెక్టర్ అనుదీప్ ఆదేశంసత్తుపల్లి : ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే వారితో సేవాభావంతో మెలగాలని, సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్య సిబ్బంది సరిపడా ఉన్నారా అని సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.34 కోట్లతో నిర్మించిన నూతన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను తనిఖీ చేసి వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ – పాస్తోనే ఎరువులు విక్రయించాలి.. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. స్థానిక అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసి, పురుగుమందులు, ఎరువులు, విత్తనాల వివరాలపై ఆరా తీశారు. ఈ–పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని చెప్పారు. అధిక లాభాలు వచ్చే ఉద్యాన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు మట్టి, ఇసుక ఇబ్బందులు వస్తున్నాయని కొత్తూరు గ్రామ లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తేగా మట్టి, ఇసుక ముందుగానే డంప్ చేసి తహసీల్దార్ కూపన్ల ద్వారా జారీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కల్లూరు ఆర్డీఓ ఎల్.రాజేంద్రగౌడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్, పబ్లిక్హెల్త్ ఈఈ ఉమామహేశ్వరరావు, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ టి.సీతారాం, తహసీల్దార్ సత్యనారాయణ, కమిషనర్ కె.నర్సింహా, వైద్యులు సురేష్ నారాయణ, వసుమతీదేవి పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి.. పెనుబల్లి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. పెనుబల్లి మండలం రామచందర్రావు బంజర్లో నిర్మాణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు. ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇళ్లకు అవసరమైన ఇసుక, మట్టి లబ్ధిదారులకు ఉచితంగా అందేలా చూడాలని ఆర్డీఓ రాజేందర్ గౌడ్ను ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ కమల్పాషా, ఎంపీడీఓ అన్నపూర్ణ, ఆర్ఐ జగదీష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలి ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యవసాయ రంగాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల పనితీరుపై శనివారం ఆయన సమీక్షించారు. ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు భరోసా, రైతు బీమా, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వంటి అంశాలపై మండలాల వారీగా చర్చించి సూచనలు చేశారు. ఆధునిక సాగు పద్ధతులు, పంటల మార్పిడి విధానంలో జిల్లా ముందంజలో ఉండాలని సూచించారు. విత్తనాలు నాణ్యంగా ఉండేలా చూడాలని, ఎక్కడా కల్తీ విత్తనాలు అమ్మకుండా చూడాలని అన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. వరి వైపు మాత్రమే రైతులు మొగ్గు చూపకుండా లాభసాటి పంటలపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పొలాల మధ్యలో ఫిష్ పాండ్ అభివృద్ధితో లాభాల గురించి వివరించాలన్నారు. సమావేశంలో డీఏఓ ధనసరి పుల్లయ్య, ఇన్చార్జ్ ఉద్యానాధికారి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన బోధన అందించాలి
తిరుమలాయపాలెం: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధన అందించాలని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కె.సత్యనారాయణరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని ఏలువారిగూడెం, పాతర్లపాడు ప్రాథమిక పాఠశాలలు, బీరోలు, జల్లేపల్లి, తిరుమలాయపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలను శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం వంటి వాటిని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందా లేదా అని ప్రతీ తరగతిలోకి వెళ్లి ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోధన, అభ్యసన ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు డిజిటల్ పరికరాలను ఉపయోగిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ఈ సందర్భంగా జల్లేపల్లిలోని పీఎం శ్రీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈఓ శ్రీనివాసరావు, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ పెసర ప్రభాకర్రెడ్డి, జల్లేపల్లి, తిరుమలాయపాలెం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దారా రాజేష్, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి -
హాస్టల్లోనే అన్నీ..
ఆస్పత్రి కిటకిట..ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి శనివారం పేషెంట్లతో కిక్కిరిసిపోయింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఓపీ కౌంటర్ ప్రాంగణం కిటకిటలాడింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొనగా క్యూలో నిల్చున్న పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ఖమ్మంమయూరిసెంటర్: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా అన్నీ అందజేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా ఎస్సీ వసతిగృహాలను ఆధునికీకరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 41 ప్రీ మెట్రిక్ వసతిగృహాల్లో సుమారు 3 వేల మంది విద్యార్థులు ప్రస్తుతం ఈ వసతి సౌకర్యాన్ని పొందుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా వసతిగృహాల నిర్వహణ, సౌకర్యాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సకల సౌకర్యాలతో.. ఎస్సీ వసతిగృహాల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. కేవలం వసతి, భోజనంతో సరిపెట్టకుండా వారి విద్యా అవసరాలను పూర్తిగా తీరుస్తోంది. పాఠ్యపుస్తకాలతో పాటు సంవత్సరం పొడవునా అవసరమైన నోట్బుక్స్ను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఎస్సీ వసతిగృహాల్లో ఉంటూ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 నుంచి 28 నోట్ పుస్తకాలు అందజేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గిస్తున్నారు. వీటితో పాటు విద్యార్థులకు అవసరమైన బూట్లు, యూనిఫామ్, స్కూల్బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే నోట్ పుస్తకాలతో పాటు ఒక జత యూనిఫామ్ అందజేశారు. మరో మూడు జతల యూనిఫామ్ను జూలై నెలలో అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు నోట్బుక్స్, బూట్లు, నాలుగు జతల యూనిఫామ్ అందజేత 3 వేల మంది విద్యార్థులకు ప్రీ మెట్రిక్లో వసతి కార్పొరేట్కు దీటుగా హాస్టళ్ల నిర్వహణ తల్లిదండ్రులపై భారం పడకుండా చదువులు 3 వేల మందికి.. జిల్లాలోని 41 ప్రీ మెట్రిక్ వసతిగృహాలు ఉండగా వాటిలో రెన్యువల్ విద్యార్థులు 2,100 మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 700 మంది కొత్తగా చేరారు. మరో 200 మంది వరకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అంచనాలతో జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేలా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వసతిగృహాల్లో చేరే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బూట్లు, యూనిఫామ్తో పాటు ప్లేట్లు, గ్లాసులు, పరుపులు కూడా అందించనున్నట్లు తెలిసింది.నోట్ పుస్తకాలు అందజేశాం.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే వసతిగృహాలకు నోట్ పుస్తకాలు అందజేశాం. హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లే విద్యార్థి మొదటి రోజు నుంచే నోట్ బుక్స్ తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశాం. ఈ ఏడాది నాలుగు జతల యూనిఫామ్ అందజేయనున్నాం. వసతిగృహంలో చేరిన విద్యార్థికి ఎలాంటి అదనపు భారం పడకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. – కస్తాల సత్యనారాయణ, ఎస్సీ డీడీ -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
● వినియోగదారులకు త్వరలో అవగాహన సదస్సులు ● ఎస్ఈ శ్రీనివాసాచారి వెల్లడి ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి తెలిపారు. జిల్లాలోని విద్యుత్ అధికారులు, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో స్థానిక విద్యుత్ గెస్ట్హౌస్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సమస్యను తెలిపేందుకు 87124 83490 నంబర్ అందుబాటులో ఉంటుందని, సమస్య వివరించడంతో పాటు సంబంధిత ఫొటోను వాట్సాప్లో పెట్టవచ్చని చెప్పారు. సమీప సబ్ స్టేషన్లో ఉండే ఫిర్యాదుల పుస్తకంలోనూ సమస్యను నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు, స్తంభాలు తదితర సమస్యలు తమ దృష్టికి తేవాలని కోరారు. విద్యుత్ వినియోగం, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై రైతులకు పొలంబాట, వినియోగదారులకు జూలై మొదటి వారంలో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంపెనీ స్థాయిలో సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800 4250028ను సంప్రదించవచ్చని సూచించారు. సమావేశంలో ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, సత్తుపల్లి, ఖమ్మం ఎంఆర్టీ, టెక్నికల్, విజిలెన్స్ డీఈలు నంబూరి రామారావు, సీహెచ్ నాగేశ్వరరావు, బండి శ్రీనివాస రావు, ఎల్.రాములు, బాబూరావు, భద్రూ, టి.వెంకటేశ్వర్లు, ఎస్ఏఓ శ్రీధర్, ఏఓ మురళి, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు మందపాటి సత్యనారాయణ రెడ్డి, ఎం. ప్రసాద్, సురేష్, బీవీఎస్ మూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీ స్వామివారి విగ్రహానికి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం చేశారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణం జరిపించగా.. భక్తులు కనులపండువగా తిలకించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ గావించారు. తెలుగు రాష్ట్రాల భక్తులు భారీగా హాజరై శ్రీ వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలుడీఎంహెచ్ఓ కళావతిబాయి చింతకాని : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతి బాయి సిబ్బందిని హెచ్చరించారు. మండలంలోని పాతర్లపాడు పల్లె దవాఖానాను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశించారు. పల్లె దవాఖానాలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిశుభ్రంగా ఉంచితే కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి రామారావు, మండల వైద్యాధికారి డాక్టర్ ఆల్తాఫ్, సీహెచ్ఓ వీరందర్, హెల్త్ సూపర్వైజర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లుడీపీఓ ఆశాలత వెల్లడి మధిర/ ఎర్రుపాలెం: అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత అన్నా రు. లబ్ధిదారుల సర్వేలో భాగంగా శనివారం ఆమె మధిర మండలం ఖాజీపురం, మాటూ రు, ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామాల్లో పర్యటించారు. రామన్నపాలెంలో ఇప్పటికే రూపొందించిన జాబితాలోని అర్హుల పేర్లను సూపర్ చెక్ చేశారు. తొలివిడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎర్రుపాలెం ఎంపీడీఓ బి.సురేందర్నాయక్, ఎంపీలు జి. శ్రీలక్ష్మి, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. క్లినికల్ శిక్షణకు 11లోగా దరఖాస్తు చేసుకోవాలిఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ఎంపీహెచ్డబ్ల్యూ (ఫిమేల్) ఒకేషనల్ కోర్సులో క్లినికల్ శిక్షణకు జూలై 11 లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ కె.రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2020 తర్వాత ఉత్తీర్ణులైన వారికి ఏడాది పాటు క్లినికల్ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఆస్పత్రుల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని, ఎంపికై న వారు ఆస్పత్రి పేరుతో రూ.1000 డీడీ చెల్లించాలని సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకుని, ఎంపిక కాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించిన సొంత చిరునామా కవర్, జిరాక్స్ సర్టిఫికెట్లను జతపరిచి కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందించాలని సూచించారు. -
‘నివేదన’.. పరిశీలన
● డీడీఎన్ పథకానికి ఉమ్మడి జిల్లాలో 205 దరఖాస్తులు ● ఈఓలు, అర్చకులతో విచారణ కమిటీల ఏర్పాటు ● నివేదికల ఆధారంగా ఆలయాల ఎంపికఖమంగాంధీచౌక్: ధూప దీప నివేదన(డీడీఎన్) పథకానికి దరఖాస్తు చేసుకున్న ఆలయాల పరిశీలన ప్రక్రియను దేవాదాయ, ధర్మాదాయ శాఖ చేపట్టింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మే 1న నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెల 24వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. దీంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి 205 దరఖాస్తులు అందగా.. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పరిశీలనకు ఆలయాల ఈఓలు, అర్చకులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్.. కమిటీలు ఏర్పాటు చేసి, పరిశీలన బాధ్యతలు అప్పగించారు. డీడీఎన్ నిబంధనల ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఆలయాలను పరిశీలించి సమగ్ర నివేదికలు అందించాలని సూచించారు. ఆలయాల మనుగడ కోసం.. పురాతన ఆలయాలు మనుగడ కోల్పోతుండగా వాటి పునర్ వైభవం కోసం 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధూప దీప నివేదన పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 450 ఆలయాలకు ఈ పథకం అమలువుతోంది. ఇటీవల ప్రభుత్వం విడుదల నోటిఫికేషన్ ఆధారంగా ఖమ్మం జిల్లా నుంచి 146, భద్రాద్రి జిల్లా నుంచి 59 ఆలయాల అర్చకులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ నియమించిన కమిటీ పరిశీలించాక అర్హత గల ఆలయాలకు పథకం అమలయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో ఆరు కమిటీలు.. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు.. ఎండోమెంట్ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న ముఖ్య కార్యనిర్వహణాధికారులు, అర్చకులతో ధూప దీప నివేదన దరఖాస్తుల పరిశీలనకు కమిటీలు నియమించారు. ఖమ్మం జిల్లాలో మూడు, భద్రాద్రి జిల్లాలో మూడు కమిటీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. డీడీఎన్ పథకానికి ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించింది. ముఖ్యంగా పురాతన ఆలయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆలయం నిర్మించి 15 ఏళ్లు నిండి ఉండాలని, దేవాదాయ శాఖలో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని, ఆలయానికి మెట్ట భూమి ఐదెకరాలు, మాగాణి భూమి 2.50 ఎకరాలకు మించి ఉండరాదని, ఆలయంలో నిత్యం అర్చకుడు దీపం వెలిగించి నివేదన చేస్తూ ఉండాలని నిబంధనల్లో పొందుపర్చారు. నివేదిక ఆధారంగా ఎంపిక.. డీడీఎన్ పథకం దరఖాస్తుల పరిశీలనకు ఎంపిక చేసిన కమిటీలు క్షేత్ర స్థాయిలో ఆలయాలను సందర్శించి, ఆలయ చరిత్ర, ఆస్తి తదితర అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అర్చకుడి పనితీరును కూడా పరిశీలించాలి. నిబంధనల ఆధారంగా దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించి ఆలయాల వారీగా నివేదికలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు అందించాక ఆయన విచారణ చేసి తుది నిర్ణయం, అనుమతులను ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఆ తర్వాత ఎంపికై న ఆలయాల జాబితా విడుదలవుతుంది. అర్హత సాధించిన ఆలయాలకు ప్రభుత్వం నెలకు రూ.10 వేలు అందిస్తుంది. వీటిలో రూ.6 వేలు పడితరం(ఆలయ నిర్వహణ), రూ. 4 వేలు అర్చకుడికి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.నిబంధనల మేరకు ఎంపిక చేస్తాం నిబంధనలకు లోబడి ధూప దీప నివేదన పథకానికి ఆలయాలను ఎంపిక చేస్తాం. పరిశీలన కమిటీలు క్షేత్ర స్థాయిలో ఆలయాలను సందర్శిస్తాయి. ఈ ప్రక్రియలో దరఖాస్తుదారులు ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు. అర్హతల ఆధారంగా ఆలయాల ఎంపిక ఉంటుంది. తుది నిర్ణయం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ తీసుకుంటుంది. – ఎం వీరస్వామి, దేవాదాయ శాఖ ఏసీ -
‘బడిబాట’తో పెరిగిన ప్రవేశాలు
ఖమ్మం సహకారనగర్/ఏన్కూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చిందని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ కె.సత్యనారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన బడిబాట, ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై సమీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే ఒకటో తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు 33 శాతం పెరిగాయని సీఎంఓ రాజశేఖర్ వివరించారు. కలెక్టర్, డీఈఓ సత్యనారాయణ సూచనలతో విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించామని, తద్వారా 14 స్కూళ్లను పునఃప్రారంభించగా కొత్తగా ఒక పాఠశాల ఏర్పాటుచేశామన్నారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ ప్రవేశాలు తగ్గిన హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించి కొత్త విద్యార్థుల నమోదుపై దృష్టి సారించాలన్నారు. కాగా, భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు పరికరాలు అందించడంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ పాపారావు, ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఆతర్వాత ఏన్కూరులోని కస్తూర్బాగాంఽధీ బాలికల విద్యాలయాన్ని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, పరిసరాలు, వంటగదిని పరిశీలించిన ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. స్పెషల్ ఆఫీసర్ లావణ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి -
‘జల వనరులు’ ఖాళీ !
● ప్రధాన పోస్టులు భర్తీకి నోచుకోక ఇన్చార్జ్లతో పాలన ● ఫలితంగా ఆయకట్టుకు నీటి సరఫరాపై ప్రభావం ● అభివృద్ధి పనుల పర్యవేక్షణపైనా నీలినీడలు ఖమ్మంఅర్బన్: జిల్లా రైతుల్లో అత్యధికంగా సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా సాగు చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుల ద్వారా నీటి పంపిణీలో కీలకంగా వ్యవహరించే జలవనరుల శాఖలో పోస్టులు నెలల తరబడి భర్తీ జరగడం లేదు. కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం, కొన్నింటిని ఇన్చార్జ్లతో నెట్టుకొస్తుండడంతో ప్రాజెక్టుల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో సుమారు 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగర్ కాల్వల ద్వారా నీరు అందుతుండగా.. చెరువులు, చెక్డ్యాములు, వాగులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ఆధారంగా మరో 3లక్షల ఎకరాలకు పైచిలుకు భూమి సాగవుతోంది. చాలాచోట్ల ఖాళీ కుర్చీలే ప్రస్తుతం జిల్లాలోని అనేక డివిజన్లలో ఈఈ, డీఈ స్థాయి పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న వారిపై భారం పడుతుండగా పనులు ఆనుకున్న స్థాయిలో వేగంగా జరగడంలేదు. కల్లూరు డివిజన్ ఈఈ పోస్టులో కొనసాగిన అధికారి మార్చి 31న ఉద్యోగ విరమణ చేయగా అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఈ స్థానంలో కనీసం ఇన్చార్జ్ను కూడా నియమించకపోవడం గమనార్హం. అలాగే ఖమ్మం రూరల్ డివిజన్ డీఈ పోస్టు నాలుగేళ్ల నుంచి ఖాళీగానే ఉండడంతో ప్రస్తుతం నేలకొండపల్లి డీఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాక జలవనరుల శాఖ సర్కిల్ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం సీఈ గత డిసెంబర్లో రిటైర్ కాగా, నల్లగొండ సీఈ రమేష్బాబుకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అంతేకాక అక్టోబర్లో ఖమ్మం ఎస్ఈ రిటైర్ అయినా ఇప్పటికీ కొత్త అధికారిని నియమించకుండా పాలేరు ఈఈకి ఆ బాధ్యతలు కట్టబెట్టారు. ఇక మార్చిలో రిటైర్ అయిన డిప్యూటీ సీఈ స్థానంలోనూ ఎవరినీ నియమించకుండా కల్లూరు అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పర్యవేక్షణ ఎలా? ఇప్పుడిప్పుడే పంటల సాగు ఊపందుకుంటుండగా సాగునీటి సీజన్ మొదలవుతుంది. ఆయకట్టు ప్రాంతాల్లో నెల రోజుల్లోగా వరి నాట్లు వేయడం ప్రారంభిస్తారు. ఈ తరుణాన పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై పర్యవేక్షణ కరువవుతోంది. అంతేకాక పనుల పరిశీలన, కోర్టు కేసులకు హాజరుకావడం కూడా కష్టమవుతోందని సంబంధిత శాఖ అధికారులే చెబుతున్నారు. జిల్లాల సీతారామ ప్రాజెక్టు, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులే కాక గత ఏడాది వరదలతో దెబ్బతిన్న కాల్వల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. అయితే, పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ఇన్చార్జ్లు రెండు చోట్ల పనులను పర్యవేక్షించే పరిస్థితి లేక వేగంగా జరగడం లేదు. ఇకనైనా అధికారుల నియామకంపై ప్రభుత్వం స్పందించకపోతే రానున్న వ్యవసాయ సీజన్లో మరిన్ని ఇక్కట్లు ఎదురయ్యే అవకాశముంది. -
ఏజెంట్ల దందా..
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025జిల్లా రవాణా శాఖ కార్యాలయం దళారి లేకపోతే అంతే.. ప్రభుత్వం, రవాణా శాఖ ఉన్నతాధికారుల ప్రకటనలు నమ్మి ఎవరైనా వాహనదారుడు నేరుగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్తే పని పూర్తవడం కష్టమేనని చెబుతున్నారు. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ మొదలు క్యూలో నిల్చోవడం, ఆన్లైన్ పరీక్ష రాయడం వరకు ఇబ్బందులు తప్పవు. అంతేకాక నేరుగా వెళ్లే వాహనదారులు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం లేదు. ఇవన్నీ పూర్తయినా అవసరమైన కాగితాలన్నీ లేవనో, ఇంకేదైనా సర్టిఫికెట్ తక్కువగా ఉందనో కొర్రీలు పెడుతూ రకరకాల ప్రశ్నలతో ఉద్యోగులు విసిగిస్తారని చెబుతున్నారు. అదే ఏజెంట్ల ద్వారా వెళ్లే వాహనదారుడు నిరక్షరాస్యుడైనా అవలీలగా పరీక్ష గట్టెక్కుతుండడం గమనార్హం. దీంతో 24 సేవలు ఆన్లైన్ చేసినా.. ఏజెంట్ల ద్వారానే ఎక్కువగా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. షరా ‘మామూలే’.. ఆర్టీఓ కార్యాలాయాల్లో ఏజెంట్లు ఉండొద్దని ఉన్నతాధికారులు చెబుతున్నా ఏళ్ల తరబడి వీరి దందాకు తెర పడడం లేదు. అధికారులు వీరి ద్వారా వచ్చే పనులను త్వరగా పూర్తిచేస్తుండడం, వాహనదారుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న పలువురు కార్యాలయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయాల్లో పలుమార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయాన ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించకగా, కొన్ని రోజులపాటు అధికారులు వారిని కార్యాలయాల్లోకి అడుగు పెట్టనివ్వలేదు. ఆ తర్వాత అన్నీ ‘మామూలు’గానే మారిపోయాయి. మళ్లీ ఏజెంట్లు కార్యాలయాలకు రావడం, పనులు చేయించడం యథావిధిగా కొనసాగుతోంది. ఏసీబీ కలకలం.. హైదరాబాద్ ఉప్పల్తోపాటు రాష్ట్రంలోని పలు ఆర్టీఓ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సమాచారం అందడంతో ఖమ్మం, వైరా, సత్తుపల్లి ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఏజెంట్లు గురువారం మధ్యాహ్నం నుంచి ముఖం చాటేశారు. శుక్రవారం కూడా కొందరు ఏజెంట్లు మాత్రమే సమీపంలో తచ్చాడుతూ అప్పటికే బుక్ చేసిన స్లాట్ల ప్రకారం వాహనదారుల పనులు జరిగేలా చూశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ తమ ద్వారా వచ్చిన వాహనదారుల వివరాలు చేరవేశారు. కాగా, ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ తనిఖీలు జరుగుతాయనే ప్రచారం కలకలం రేపగా.. అధికారులు, సిబ్బంది కాసేపు హడావిడి చేశారు. అంతేకాక ఏజెంట్లను కార్యాలయంలోనికి రానివ్వకపోగా, తమ షాప్లకు ఏజెంట్లు తాళాలు వేయడం గమనార్హం.న్యూస్రీల్జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో వీరిదే హవా నేరుగా వెళ్తే వాహనదారులు వేచి ఉండాల్సిందే.. ఏజెంట్ల ద్వారా వెళ్తే సులువుగా పనులు తాజాగా ఏసీబీ భయంతో ఆఫీస్లకు దూరంగా కొందరురవాణా శాఖ కార్యాలయాల్లో వాహనదారుల సేవలన్నీ ఆన్లైన్ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా... కార్యకలాపాలు మాత్రం ఏజెంట్ల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. నేరుగా వెళ్లే వాహనదారులు పనుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం... తీరా తమ వంతు వచ్చినా కొర్రీలతో అధికారులు తిరస్కరించడం పరిపాటిగా మారింది. దీంతో డబ్బులు పోయినా పని త్వరగా ముగుస్తుండడంతో వాహనదారులు ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా వీరి దందా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా వెలుగొందుతోంది. ఏళ్లుగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవహారం వేళ్లూనుకుపోగా, అధికారుల తనిఖీ సమయాన రెండు, మూడు రోజులు దూరంగా ఉండడం.. ఆపై షరా మామూలుగానే కార్యకలాపాలు సాగిస్తుండడం పరిపాటిగా మారింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఅంతా వారిదే రాజ్యం.. జిల్లా కేంద్రమైన ఖమ్మంతో పాటు వైరా, సత్తుపల్లిల్లో రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 200 మంది ఏజెంట్లు ఉన్నట్లు అంచనా. వీరిలో పలువురు రవాణా శాఖ కార్యాలయాలకు సమీపాన షాప్లు ఏర్పాటుచేసుకోగా, ఇంకొందరు టీ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లలో అందుబాటులో ఉంటున్నారు. వాహనదారులకు కొత్త లైసెన్స్, రెన్యువల్, రిజిస్ట్రేషన్, వాహన పన్ను, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇలా ఏది కావాలన్నా వీరిని ఆశ్రయిస్తే త్వరగా పూర్తవుతుంది. క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా అన్ని పనులు చకచకా జరుగుతుండడంతో వాహనదారులు వీరినే ఆశ్రయిస్తున్నారు. అధికారులు కూడా దరఖాస్తులపై ‘కోడ్’ ఆధారంగా ఏజెంట్ల ద్వారా వచ్చినవైతే అభ్యంతరాలు చెప్పకుండా పూర్తిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
మిర్చి సాగు తగ్గుతుందా?!
మధిర: గత ఏడాది వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి గణనీయంగా పడిపోయింది. వచ్చిన మిర్చికి కూడా సరైన ధర పలకలేదు. అన్ సీజన్లోనైనా ధర పెరుగుతుందని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తే ఇప్పుడు కూడా మిర్చిలో ప్రధాన రకమైన తేజాకు క్వింటా ధర రూ.13 వేలు దాటడం లేదు. దీంతో ఈ సీజన్లో రైతులు మిర్చి సాగుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో పత్తి, ఇతర పంటల సాగుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు నర్సరీల్లో ఇప్పటివరకు నారు పెంపకం ఊపందుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గత ఏడాది 288 నర్సరీల్లో... జిల్లాలో ఉద్యానశాఖ నుంచి అనుమతి తీసుకుని 288 నర్సరీల్లో మిరప నారు పెంపకం చేపట్టారు. అయితే, ఈ ఏడాది అదనంగా ఒక్క నర్సరీ ఏర్పాటుకు కూడా దరఖాస్తు అందకపోగా, పాత వారే రెన్యువల్ చేయించుకున్నారు. అయితే, ఆయా నర్సరీల్లోనూ నారు పెంపకం ఇప్పటివరకు ఊపందుకోకపోవడం గమనార్హం. గత ఏడాది 288 నర్సరీల్లో 67కోట్ల మొక్కలకు సరిపడా నారు పెంచినట్లు అంచనా. ఈ మేరకు జిల్లాలో 60,401 ఎకరాల్లో మిరప పైరు సాగు చేయగా, ఈసారి 50 వేల ఎకరాలు దాటకపోవచ్చని భావిస్తున్నారు. ఆర్డర్లు కరువు సాధారణంగా మిరప నాటే సమయానికి 70 శాతం మంది రైతులు నారు కోసం నర్సరీల్లో ఆర్డర్ చేసి అడ్వాన్స్గా నగదు చెల్లిస్తారు. ఇందులో కొందరు తమకు కావాల్సిన రకం విత్తనాలను సొంతంగా తీసుకొస్తే మరికొందరు నర్సరీల యజమానులకే ఫలానా రకం కావాలని సూచిస్తారు. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు శాతం బుకింగ్ కూడా కాలేదని నర్సరీల యజమానులు చెబుతున్నారు. ఫలితంగా జూలై నెల సమీపిస్తున్నా మొక్కల పెంపకం పనులు చాలా నర్సరీల్లో మొదలేకాలేదు. ఇంకొందరు మాత్రం ఆర్డర్లు వస్తాయనే నమ్మకంతో అరకొరగా నారు పెంచుతున్నారు. గత ఏడాది దిగుబడితో పాటు తగ్గిన ధర ఫలితంగా పత్తి, ఇతర పంటల వైపు రైతుల మొగ్గు జిల్లాలోని నర్సరీల్లో ఊపందుకోని నారు పెంపకంఈయన పేరు వడ్లమూడి శ్రీనివాసరావు. మధిర మండలం మాటూరు క్రాస్ సమీపాన పదిహేనేళ్లుగా భూమి కౌలుకు తీసుకొని మిరప నర్సరీ నిర్వహిస్తున్నాడు. పది ఎకరాల విస్తీర్ణంలో ఏటా 2కోట్ల మేర మిరప మొక్కలు పెంచి అమ్ముతుంటాడు. సీజన్కు ముందుగానే 1.20 కోట్ల మిరప మొక్కలకు సంబంధించి బుకింగ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 5లక్షల బుకింగ్ మాత్రమే నమోదు కావడం గమనార్హం. దీంతో ఏటా పదుల సంఖ్యలో కూలీలకు ఉపాధి కల్పించే శ్రీనివాసరావు ఇప్పుడు కూలీలను నియమించుకోవాలా, వద్దా అన్న సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నాడు. రైతులు మిర్చి సాగుపై ఆసక్తి చూపడం లేదని భావించి మొక్కల పెంపకం తగ్గించినట్లు చెబుతున్నాడు. -
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక
● తహసీల్లో రూ.200 చెల్లిస్తే ట్రాక్టర్ లోడ్ ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మంగాంధీచౌక్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగకుండా అవసరమైన ఇసుక సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో ఇసుక రీచ్ల నిర్వహణ, కూపన్ల జారీపై సమీక్షించారు. లబ్ధిదారులకు ఎన్ని ట్రాక్టర్ల ఇసుక అవసరమో హౌజింగ్ శాఖ ఏఈ గుర్తించి ఇచ్చే లేఖ ఆధారంగా తహసీల్దార్ కూపన్ జారీ చేయాలని తెలిపారు. ఈ కూపన్ ఆధారంగా మూడు రోజుల్లోగా మండలానికి కేటాయించిన రీచ్ నుంచి ఇసుక తరలించుకోవాలని చెప్పారు. రీచ్ల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించగా లబ్ధిదారులు ప్రతీ ట్రాక్టర్ లోడ్ ఇసుకకు రూ.200 తహసీల్లో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో రూ.100 మహిళా సంఘాలకు, గ్రామపంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ.50 చొప్పున అందుతాయని చెప్పారు. కాగా, ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే రీచ్ల నుండి ఇసుక తరలింపునకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. విపత్తుల నిర్వహణ బృందాలకు సామగ్రి వరద ముప్పు ఎదురైతే సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టార్చ్ లైట్లు, లైఫ్ జాకెట్లు, మైక్ సెట్లు, బోట్లు తదితర సామగ్రి ఏ మేరకు అవసరమో గుర్తించాలని సూచించారు. ప్రతీ 15రోజులకోసారి మండల స్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించి ఆపద మిత్రలు, గజ ఈతగాళ్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేయాలని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా మైనింగ్ అధికారి సాయినాథ్, ఆర్డీవోలు నర్సింహారావు, ఎల్.రాజేందర్, డీఎల్పీఎఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
●‘అమ్మ’కు ఇల్లు దక్కింది..
కల్లూరురూరల్: తల్లికి అండగా నిల వాల్సిన కుమారులు ఆమెను ఇంటి నుంచి గెంటే యగా.. ఆమె అధికా రులను ఆశ్రయించడంతో న్యాయం జరిగింది. కల్లూరు మండలం రావికంపాడుకు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలైన తేనే నాగమ్మ భర్త మృతి చెందగా రూ.2వేల పింఛన్, రేషన్ బియ్యంతో జీవనం కొనసాగిస్తోంది. ఆమె ఉంటున్న ఇంటి నుంచి కుమారులు గత నెల 28న గెంటేశారు. దీంతో నిరాశ్రయులైన నాగమ్మ ఆర్డీఓ రాజేందర్గౌడ్కు ఫిర్యాదు చేసింది. సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం ఆమె ఆరుగురు కుమారులు ప్రతీనెల సంరక్షణ, జీవన భృతి కింద రూ.వెయ్యి చెల్లించడంతో పాటు ఇంటిని అప్పగించాలని ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం తహసీల్దార్ పి.సాంబశివుడు, పోలీసులు, ఆర్ఐ సుజాత తదితరులు చెన్నూరు వెళ్లి నాగమ్మకు ఇల్లు అప్పగించడంతో ఆమె కృతజ్ఞతలు తెలిపింది. -
కారేపల్లి చెరువులో మట్టి తవ్వకాలు
కారేపల్లి: కారేపల్లి పెద్ద చెరువులో కొందరు జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతూ తరలి స్తున్నారు. ఈ విషయమై శుక్రవారం ప్రశ్నించగా ఇందిరమ్మ ఇళ్లకోసం మట్టి తరలిస్తున్నామని చెప్పారని స్థానికులు తెలిపారు. అయితే, జేసీబీలతో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ ట్రాక్టర్కు రూ.800 చొప్పు న వందల ట్రిప్పుల మట్టి తరలించారని ఆరోపించారు. కాగా, పట్టపగలే దందా సాగిస్తున్నా రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్, ఇరిగేషన్ ఏఈని ఫోన్లో వివరణ కోరగా చెరువు నుంచి మట్టి తరలిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని, తక్షణమే అడ్డుకుంటామని చెప్పారు. కాగా, మట్టి అక్రమ త్రవ్వకాలపై స్థానిక మత్స్య సహకార సంఘం సభ్యులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తురక సాంబ, చింతల సంపత్కుమార్, సభ్యులు తురక నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కే.వీ.కృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా హామీలు అమలుచేయడం లేదని ఆరోపిస్తూ ఖమ్మంలో శుక్రవా రం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఉద్యమకారులకు 250గజా ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10లక్షల సాయం చేయడమే కాక పెన్షన్ మంజూరుచేస్తామని, హెల్త్ కార్డ్లు జారీచేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు విస్మరించడం సరికాదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులను ఆదుకోవా లని కోరారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షు డు పసుపులేటి నాసరయ్యతో పాటు అర్వపల్లి విద్యాసాగర్, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, జడల వెంకటేశ్వర్లు, గుంతేటి వీరభద్రం, నెల్లూరి అచ్యుతరావు, బచ్చల పద్మాచారి, పాలకురి కృష్ణ, చౌహాన్, నర్సింహారావు, మేకల శ్రీనివాస్, దేవిరెడ్డి విజయ్, గాదె లక్ష్మీనారాయణ, ఎస్.కే.సైదా, సీహెచ్.సీతామహాలక్ష్మి, వరలక్ష్మి, సతీష్, కోటేశ్, బురాన్, అసిఫ్ అహ్మద్, ఉమాశంకర్ పాల్గొన్నారు. -
కరెంట్తో జర భద్రం
సొంతంగా మరమ్మతు చేస్తే ప్రమాదమే.. ● సమస్యలు ఎదురైతే సిబ్బందికి సమాచారం ఇవ్వాలి ● సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్న అధికారులుఖమ్మంవ్యవసాయం: ఈదురుగాలులు, ఇతర కారణాలతో అక్కడక్కడా విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయి. ఆ ప్రాంతానికి మేత కోసం వెళ్తున్న మూగజీవాలు మృత్యువాత పడుతుండగా.. రైతులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈనేపథ్యాన విద్యుత్ ప్రమాదాలపై వినియోగదారులు, రైతుల్లో అవగాహన కల్పించేలా ఖమ్మం ఎస్ఈ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆధ్వర్యాన ఉద్యోగులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా తీగలు తెగిపడినా, ఇతర సమస్యలు ఉన్నా సొంతంగా మరమ్మతు చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయడమో లేదా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. -
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం
తల్లాడ: సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఖమ్మం మేత్రాసనం పీఠాధిపతి సగిలి ప్రకాష్ తెలిపారు. తల్లాడ మండలం రెడ్డిగూడెంలోని క్రీస్తుజ్యోతి జూనియర్ కళాశాలలో డాన్బోస్కో దిశ సహకారంతో శుక్రవారం నిర్వహించిన జాబ్మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డాన్బోస్కో దిశ ఆధ్వర్యాన ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాబ్మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, హైదరాబాద్కు చెందిన 27 కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా.. 1,700 మంది అభ్యర్థుల్లో ఇంటర్యూల అనంతరం 1,200 మందిని వివిధ పోస్టులకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పాధర్ జస్టిన్, క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.థామస్, లూర్దుమాత విచారణ గురువులు అజయ్, అధ్యాపకులు పాల్గొన్నారు. బెల్ట్షాపు వద్ద ఘర్షణనేలకొండపల్లి: మండల కేంద్రంలో ఓ బెల్ట్షాపు వద్ద ఘర్షణలో ఒకరికి దాడి జరిగింది. నేలకొండపల్లికి చెందిన కె.నాగేశ్వరరావు అదే గ్రామానికి చెందిన ఉదయ్ మధ్య పొలం కౌలు విషయంలో వివాదం జరుగుతోంది. శుక్రవారం రాత్రి స్థానిక బెల్ట్షాపు వద్ద ఇదే విషయమై గొడవ పడగా నాగేశ్వరరావుపై దాడి చేసినట్లు తెలిసింది. దీంతో ఉదయ్తో పాటు ఆయన వెంట మరో వ్యక్తి తనపై దాడిచేశారని నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఆదరించడం లేదని బిడ్డతో బైఠాయింపుఖమ్మంరూరల్: ప్రేమ పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ బిడ్డ జన్మించాక తమను పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఆయన ఇంటి ఎదుట బైఠాయించింది. మండలంలోని ఎం.వెంకటాయపాలెంకు చెందిన కానిస్టే బుల్ పాపిట్ల మహేష్ కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ముత్తగూడెంకు చెందిన చెరుకుపల్లి పరిమళను 2024లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి మగబిడ్డ జన్మించాక పట్టించుకోకుండా మహేష్ ముఖం చాటేయడంతో పరిమిళ బిడ్డతో సహా శుక్రవా రం ఆయన ఇంటి ఎదుట బైఠాయించింది. అత్తమామామలు కూడా తమను పట్టించుకోవడంలేదని ఆరో పించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని పరిమళతో మాట్లాడారు. మహేష్ను స్టేషన్కు పిలిపించి మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా ఆమె దీక్ష విరమించింది. -
ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
●తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దు. విద్యుత్ సిబ్బందికి లేదా టోల్ ప్రీ నెంబర్ 1912 ద్వారా సమాచారం ఇవ్వాలి. ●ఇళ్లలో బట్టలు ఆరవేసే వైర్లకు విద్యుత్ వైర్లు తాకితే సరఫరా అయి ప్రమాదం జరిగే అవకాశముంది. అందువల్ల బట్టలు ఆరేసుకునేందుకు ప్లాస్టిక్ తీగలనే ఉపయోగించాలి. ●స్తంభం నుండి ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను రేకులకు తాకకుండా చూడాలి. ●పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలి. ఎక్కడైనా కరెంట్ తెగి పడి ఉంటే సిబ్బందికి సమాచాం ఇవ్వాలి. ●ఇళ్లలో సరైన ఎర్తింగ్ చేయించడమే కాక నాణ్యమైన విద్యుత్ ఉపకరణాలనే వినియోగించాలి. ●సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడకపోవడమే మంచిది. ●పొరపాటున ఎవరైనా షాక్కు గురైతే రక్షించాలన్న ఆత్రుతలో నేరుగా తాకొద్దు. సదరు వ్యక్తిని వేరు చేయడానికి కర్ర, ప్లాస్టిక్ వంటివి వాడాలి. ●రైతులు మోటార్లు, పైపులు, ఫుట్ వాల్వ్లు నాణ్యమైనవి అమర్చుకుని, విధిగా ఎర్త్ చేయించాలి. ●ఎవరైనా విద్యుత్ కంచెలు ఏర్పాటుచేస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. -
ఆర్టీసీలో ఆధ్యాత్మిక ప్రయాణం
ప్రముఖ పుణ్యక్షేత్రాలకు.. ఆర్టీసీ ఖమ్మం రీజియన్లోని డిపోల నుంచి మొదలయ్యే ఈ బస్సులు నిర్దేశిత ప్రాంతాలకు వెళ్తూ, ఆలయాల సందర్శనకు సమయం ఇచ్చి తిరిగి బయలుదేరుతున్నాయి. అన్నవరం, వాడపల్లి, భద్రాచలం, అరుణాచలం వంటి వాటితో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించేలా ఈ టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తద్వారా భక్తులు అలుపు లేకుండా సురక్షితంగా తమ ఆధ్యాత్మిక యాత్ర పూర్తిచేసే అవకాశం లభిస్తోంది. ఒకటి, రెండు రోజులు... ఖమ్మం డిపో నుండి అన్నవరం, వాడపల్లి, భద్రాచలం దేవస్థానాలను భక్తులు సందర్శించేలా టూర్ ప్యాకేజీ రూపొందించారు. శుక్రవారం ఉదయం 8గంటలకు బయలుదేరిన ఈ బస్సు అన్నవరానికి చేరుకుని అక్కడ స్వామి దర్శనం పూర్తయ్యాక వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులతో చేరుకుంటుంది. అక్కడ దర్శనం అనంతరం రాత్రి భద్రాచలానికి శనివారం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం, ఆతర్వాత కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శన తర్వాత ఖమ్మం వస్తుంది. ఇక సత్తుపల్లి డిపో నుంచి మూడు డీలక్స్ సర్వీసులను మద్ది ఆంజనేయస్వామి ఆలయం, ద్రాక్షారామం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం, పెనుగొండ కన్యకాపరమేశ్వరి ఆలయం, ద్వారకా తిరుమలకు నడిపించారు. మధిర డిపో నుంచి రెండు డీలక్స్ బస్సులతో రామప్ప, భద్రకాళి ఆలయం, పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి, భద్రాచలం డిపో నుంచి రెండు సూపర్ లగ్జరీ బస్సులను అన్నవరం, ద్రాక్షారామం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఒక ప్యాకేజీగా ఏర్పాటుచేశారు. మరో ప్యాకేజీగా యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, హనుమకొండలోని వేయి స్తంభాలగుడికి బస్సులు నడిపారు. ఇక కొత్తగూడెం డిపో నుంచి ఒక డీలక్స్ బస్సు వేములవాడ, కొండగట్టు, హనుమకొండలోని భద్రకాళి ఆలయం, వేయి స్తంభాలగుడికి బయలుదేరింది. అరుణాచలం గిరిప్రదక్షిణకు.. తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యాన వచ్చే 10న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అక్కడకే వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన అధికారులు ఇందులోనే కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం) దర్శనానికి తీసుకెళ్లేలా ప్యాకేజీ రూపొందించారు. రీజియన్ నుంచి పుణ్యక్షేత్రాలకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులు గతంలో అరుణాచలానికి బస్సులు ఇప్పుడు రీజియన్ నుంచి ఇంకొన్ని క్షేత్రాలకు సైతం..ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి నేరుగా బస్సులు లేక రెండు, మూడు చోట్ల మారాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులు తీర్చేలా రాకపోకల కోసం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేయడంతో భక్తులు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా అరుణాచలంలో గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం నడిపిస్తున్న సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తుండడంతో ఇంకొన్ని ఆలయాలకు సైతం టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేస్తుండడంతో భక్తులు ఆదరిస్తున్నారు. ఇదే సమయాన ఆర్టీసీకి కూడా మెరుగైన ఆదాయం లభిస్తోంది. – ఖమ్మంమయూరిసెంటర్/సత్తుపల్లి టౌన్ప్రత్యేక టూర్ ప్యాకేజీలు.. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే ఉమ్మడి జిల్లా భక్తుల కోసం టూర్ ప్యాకేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా వెళ్లిరావొచ్చు. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. పూర్తి వివరాలతో డిపో మేనేజర్లను సంప్రదించవచ్చు. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఆర్టీసీ ఖమ్మం రీజియన్ సద్వినియోగం చేసుకోండి.. ప్రయాణికులపై అదనపు భారం లేకుండా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నాం. దర్శనం, అల్పాహారం, భోజనం, ఇతర ఖర్చులు భరించాల్సి ఉంటుంది. బస్సులు ఆలయాల సమీపానికి వెళ్లనున్నందున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – యు.రాజ్యలక్ష్మి, ఆర్టీసీ డిపో మేనేజర్, సత్తుపల్లిఅరుణాచలం టూర్ షెడ్యూల్ ఇలా.. జూలై 8న సాయంత్రం రీజియన్ పరిధిలోని ఖమ్మం, మణుగూరు, సత్తుపల్లి డిపోల నుండి బస్సులు బయలుదేరనున్నాయి. ఖమ్మం నుండి రాత్రి 7గంటలకు (సర్వీస్ నంబర్ 64064), మణుగూరు నుండి సాయంత్రం 6గంటలకు (సర్వీసు నంబర్ 55444), సత్తుపల్లి నుండి రాత్రి 7గంటలకు (సర్వీసు నంబర్ 99599) ఈ బస్సులు దేరతాయి. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మరుసటి రోజు ఉదయం కాణిపాకం, మధ్యాహ్నం 2గంటలకు గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం) దర్శనం తర్వాత రాత్రి 8 గంటలకు అరుణాచలం చేరుస్తారు. ఆతర్వాత రోజైన 10వ తేదీన తెల్లవారుజామున అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ, ఆలయంలో దర్శనం అనంతరం అరుణాచలం నుండి బయలుదేరుతారు. జూలై 11న ఆయా డిపోలకు బస్సులు చేరతాయి. మణుగూరు డిపో నుంచి బయలుదేరే బస్సు భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా వెళ్తుంది. ఇందులో పెద్దలకు రూ.5,500, పిల్ల లకు రూ.2,750గా టికెట్ ధర నిర్ణయించారు. సత్తుపల్లి డిపో బస్సు వీ.ఎం.బంజర నుంచి వెళ్లనుండగా పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.2,500 చార్జీ ఉంటుంది. ఖమ్మం డిపో బస్సు వైరా, మధిర మీదుగా వెళ్తుంది. ఈ బస్సులో పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.2,500 చార్జీ నిర్ణయించారు. టికెట్లు ఇతర వివరాల కోసం ఖమ్మం పరిధి ప్రయాణికులు 99592 25958, మణుగూరు డిపో వారైతే 99592 25963, సత్తుపల్లి డిపోకు సంబంధించి 99592 25962 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మోదీ విధానాలతో రైతులకు అన్యాయం
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం చింతకాని: కేంద్రంలో ప్రధాని మోదీ అవలంభిస్తున్న విధానాలతో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మండలంలోని నాగులవంచలో శుక్రవారం రాత్రి జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు నష్టం చేసేలా ఉన్న మోదీ విధానాలను అందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏదీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి జరుగుతోందని చెప్పారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ఎలాంటి ఫలితం దక్కడం లేదని తెలిపారు. ఈమేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా అనగాని ఎల్లయ్య విగ్రహం, అనగాని దుర్గారావు, రౌతు జగన్నాధం చిత్రపటాల వద్ద తమ్మినేని, నాయకులు నివాళులర్పించగా, గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు సామినేని రామారావు, మడుపల్లి గోపాలరావు, రాచబంటి రాము, వత్సవాయి జానికిరాములు, తోటకూరి వెంకటనర్సయ్య, ఆలస్యం రవి, తదితరులు పాల్గొన్నారు. రైల్వే సీసీఐగా రాజ్గోపాల్ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షి యల్ ఇన్స్పెక్టర్(సీసీఐ)గా బి.రాజ్గోపాల్ నియమితులయ్యారు. గతంలో సీసీఐగా విధులు నిర్వర్తించిన ఎం.డీ.జాఫర్ వరంగల్కు బదిలీ కాగా ఆయన స్థానంలో రాజ్గోపాల్ను నియమించారు. ఈమేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రేషన్ దుకాణాల్లో తనిఖీలుసత్తుపల్లి: సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల రేషన్ షాప్ల్లో సివిల్ సప్లయీస్ అధి కారులు శుక్రవారంతనిఖీ నిర్వహించారు. డీటీ లు మెచ్చు వెంకటేశ్వర్లు, విజయబాబు, నాగలక్ష్మి, సత్యనారాయణ, ఆర్ఐలు కిరణ్, నరేష్, పవన్కుమార్ బృందాలుగా విడిపోయి షాప్ ల్లో తనిఖీలు చేపట్టారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి సన్నబియ్యం ఇస్తున్న నేపథ్యాన అసలైన లబ్ధిదారులకే పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. ఈనెల 30వ తేదీ వరకు బియ్యం అందజేయాలని, షాపుల్లో పూర్తి వివరాలతో స్టాక్ రిజిస్టర్ నిర్వహించా లని తెలిపారు. జాబ్మేళాలో 21 మంది ఎంపిక ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లి మో డల్ కెరీర్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన జాబ్మేళాలో 21 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన జాబ్మేళా నిర్వహించగా, అపోలో ఫార్మసీలో ఉద్యోగాలకు 97మంది హాజరు కాగా 18 మంది, భారత్ హుండాయ్లో ఉద్యోగాలకు ఎంపికై న 25 మందిలో ముగ్గురిని ఎంపిక చేశారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సింగరేణిలో ఆరుగురు సర్వే ఆఫీసర్ల బదిలీ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న ఆరుగురు సర్వే ఆఫీసర్లను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఒక సర్వే ఆఫీసర్, ఐదు గురు జూనియర్ సర్వే ఆఫీసర్లు ఉన్నారు. వీరంతా జూలై 5వ తేదీలోపు కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యం
ఖమ్మంక్రైం: మాదకద్రవ్యాలు లేని మెరుగైన సమాజాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ప్రజలు పాలుపంచుకోవాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు.అంతర్జాతీయ మాదక ద్రవ్య, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న మాదక ద్రవ్యాలను సమాజం నుండి సమూలంగా నిర్మూలించడానికి అందరూ సహకరించాలని కోరారు. యువతీ, యువకులు కూడా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై ఉజ్వల భవిష్యత్ను కోల్పోవద్దని సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ సరదా కోసం మొదలయ్యే దురలవాట్లు ఆ తర్వాత జీవితాన్ని అంధకారంలోకి నెడతాయని తెలిపారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువు,భవిష్యతపైనే దృష్టి సారించాలని సూచించారు. ఈ ర్యాలీలో అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్రెడ్డి, డాక్టర్ నితీష్, సీఐలు భానుప్రకాష్, కరుణాకర్, స్వామి, సత్యనారాయణతో పాటు వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.అవగాహన ర్యాలీలో సీపీ, అదనపు కలెక్టర్ -
ఆరు గ్యారెంటీల అమలెక్కడ?
● దేశంలో మాయనిమచ్చగా మిగిలిన ఎమర్జెన్సీ ● మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల ముందు అధికారమే పరమావధిగా ఇచ్చిన 66 హామీలు, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఖమ్మంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ మాయని మచ్చగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు లేవని చెప్పారు. సామాజిక న్యాయంపై మాట్లాడే కాంగ్రెస్.. రాష్ట్రాన్ని 40 ఏళ్లు పాలించినా గిరిజనుడిని ముఖ్యమంత్రిని చేసిందా అన్ని ప్రశ్నించారు. ఇప్పుడు బీసీ, కులగణన అంటున్న కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఇవన్నీ ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కొట్లాడి, కష్టపడి తెలంగాణను తెచ్చుకుంటే రాష్ట్రాన్ని బాగు చేసే సత్తా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్కు లేదని తేలిపోయిందన్నారు. అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే మార్గమని ఈటల తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య కూసుమంచి: ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వం దుర్మార్గపు చర్యకు పాల్పడిందని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు ఈటల రాజేందర్ విమర్శించారు. కూసుమంచిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివస్(రాజ్యాంగ హత్యా దినోత్సవం)లో పాల్గొన్న ఈటెల ఎమర్జెన్సీ కాలం నాటి ఫొటోలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించాక మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ దుర్మార్గానికి పరాకాష్ట అని... దీంతో ఏమీ సాధించలేకపోగా ప్రజల చేతుల్లో ఓటమి ఎదురైందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలను ప్రజల శ్రేయస్సు కోసం చేపడితే కాంగ్రెస్ మాత్రం వందసార్లు వారి స్వార్ధం కోసమే రాజ్యాంగాన్ని సవరించిందని విమర్శించారు. ఈ సమావేశాల్లో మాజీ ఎంపీ సీతారాంనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు తాండ్ర వినోద్రావు, దేవకి వాసుదేవరావు, పుల్లారావుయాదవ్, సన్నె ఉదయ్ప్రతాప్, గెంటేల విద్యాసాగర్, దొంగల సత్యనారాయణ, ఈ.వీ.రమేష్, పుణ్యవతి, నున్నా రవికుమార్, సంతోష్రెడ్డి, విజయారెడ్డి, శీలం పాపారావు, హట్యానాయక్, శ్యాంరాథోడ్, గడ్డం వెంకటేశ్వర్లు, రవిరాథోడ్, మల్లారెడ్డి, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే పేదరికం దూరం
● జీపీల్లో మంచి వారిని ఎన్నుకుంటేనే గ్రామాల అభివృద్ధి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావురఘునాథపాలెం: చదువే జీవితాలను మారుస్తుందని, పేదరికాన్ని దూరం చేస్తుందనే విషయాన్ని గుర్తించిన తమ ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ విద్యను అందుబాటులోకి తీసుకొస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని పుఠానితండా, సూర్య తండాల్లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రతీ కుటుంబం ముందుచూపుతో ఆలోచించి పిల్లలను చదివించాలని తద్వారా పేదరికం నుంచి బయటపడడమేకాక సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఇందుకోసం అన్ని వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని సూచించారు. కాగా, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్ల నిర్మాణం చేపడుతుండగా, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో మంచి నాయకులను ఎన్నుకుంటే ఆయా గ్రామాలు అభివృద్ధి బాట పడతాయని మంత్రి చెప్పారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ గ్రామపంచాయతీ భవనా లను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటూ, ఒక గదిని గ్రంథాలయంగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం పుఠానితండా, సూర్యతండా గ్రామాల్లో 19మందికి మంత్రి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఆర్డీఓ నర్సింహారావు, డీపీఓ ఆశాలత, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డీఎల్పీఓ రాంబాబు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్కుమార్, ఆత్మ, సొసైటీ చైర్మన్లు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతా రఘురాంతో పాటు నాయకులు మానుకొండ రాధాకిషోర్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్రెడ్డి, మందడపు తిరుమలరావు, మారెళ్ల లక్ష్మణరావు, వాంకుడోత్ దీపక్, కొంటెముక్కల నాగేశ్వరరావు, మూడు చిన్నా, పీఆర్ డీఈ మహేష్, ఏఈ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సార్... నేను చదువుకుంటా చదువుకోవాలనే ఆసక్తి ఉంది సార్, నాకు గురుకులంలో ఇంటర్మీడియట్ సీటు ఇప్పించండి... అంటూ ఓ బాలిక పుఠానీ తండా సమావేశంలో వేదికపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరింది. సదరు గిరిజన విద్యార్థిని ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించగా గురుకులంలో ఇంటర్ సీటు కోసం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్పందించిన మంత్రి తుమ్మల చదువుపై ఆసక్తి ఉన్న వారికి అవకాశాలు కల్పించాల్సిన బాద్యత తమపై ఉన్నందున తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇస్తానని బదులిచ్చారు. -
అందరి ఆసక్తి!
రిజర్వేషన్లపైనే ●ఏం జరగనుందో.. గ్రామపంచాయతీల్లో వార్డులు, సర్పంచ్ల రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల నాటి రిజర్వేషన్లలో కాస్త మార్పు ఉంటుందా.. సమూలంగా మార్పులు వస్తాయా అనే చర్చ సాగుతోంది. బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నేపథ్యాన రిజర్వేషన్ల అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. సర్పంచ్ పదవికి బరిలో ఉండాలనుకునే నేతల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. ఎంచుకున్న వార్డు లేదా సర్పంచ్ స్థానానికి గెలిచే అవకాశమున్నా ఎవరికి రిజర్వు అవుతుందో తేలకపోవడంతో అది ఖరారయ్యాకే పోటీ చేయడమా కుటుంబీకులను రంగంలోకి దించడమా నిర్ణయించుకోవాలనే భావనలో ఉన్నారు.వాయిదాలు పడుతూ.. 2019 ఏడాదిలో 584 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఏడాది ఫిబ్రవరి 2న పాలక వర్గాలు పగ్గాలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. దీంతో 16 నెలల నుంచి జీపీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం, ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. రిజర్వేషన్ల చిక్కుముడి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా వార్డులు, సర్పంచ్ల రిజర్వేషన్ల మార్పుతో సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ చట్టం–2018ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం చేసిన రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలి. అంటే ఈసారి కూడా అవే రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోపక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఖరారుపై బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. చట్టసభలో బిల్లు ఆమోదం పొందడంతో రిజర్వేషన్ల మార్పు అనివార్యం కానుండగా.. ఈ ప్రక్రియ ఆలస్యం కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. నెలరోజుల్లో తేలనున్న లెక్కలు కోర్టు తీర్పు నేపథ్యాన వచ్చే నెలరోజుల్లో వార్డులు, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జిల్లాలో మొత్తం 589 గ్రామపంచాయతీలు ఉండగా.. గత ఎన్నికల్లో 584 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇటీవల ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో విలీనమైన జీపీలు మినహాయిస్తే 571పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో సర్పంచ్లు, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాక గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఆ ఎన్నికలపై కూడా.. కోర్టు తీర్పుతో త్వరలోనే జీపీ ఎన్నికలు జరగనుండగా.. ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సైతం నిర్వహిస్తుందని తెలుస్తోంది. జిల్లాలోని 289 ఎంపీటీసీ స్థానాలకు 2019 మే నెలలో ఎన్నికలు జరగ్గా.. పాలకవర్గాల గడువు తీరిపోయింది. అయితే ప్రస్తుతం ఎంపీటీసీ స్థానాలను పునర్విభజన చేశారు. ఖమ్మంరూరల్ మండలంలోని పది గ్రామపంచాయతీలు కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. మరో రెండు గ్రామపంచాయతీల పరిఽధిలోని కొన్ని గ్రామాలను సైతం కలిపారు. దీంతో అక్కడ రెండు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. మరోవైపు రఘునాథపాలెం మండలం నుంచి మూడు జీపీలు ఖమ్మం రూరల్లో కలవడంతో ఈ మండలానికి ఒక ఎంపీటీసీ స్థానం అదనంగా వచ్చింది. అలాగే, ఎంపీటీసీ స్థానాల పునర్విభజనతో కొత్త స్థానం ఏర్పడింది. అంతేకాక కల్లూరు మున్సిపాలిటీ ఏర్పాటుతో ఐదు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ఇవి మినహా మిగిలిన ఎంపీటీసీ స్థానాలతో పాటు 20 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు గ్రామస్థాయిలో పట్టు నిరూపణకు ఆశావహుల యత్నం రిజర్వేషన్ల ఖరారు తర్వాతే స్థానం తేల్చుకోవాలని భావన -
జమలాపురం హుండీ ఆదాయం రూ.41.23 లక్షలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆల య హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. దేవాదాయ శాఖ పరిశీలకుడు ఎం.అనిల్కుమార్, ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు సమక్షాన లెక్కింపు చేపట్టగా 95రోజులకు గాను రూ.41,23,546 ఆదాయం నమోదైంది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్ప ల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ఎస్.విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మతో పాటు శ్రీసత్యసాయి సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రైసెట్లో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఖమ్మంరూరల్: రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో ఉన్న తరుణి హాట్లోని రైసెట్ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. మహిళలకు టైలరింగ్లో, యువకుల కు సీసీ టీవీ ఇన్స్టాలేషన్లో శిక్షణ త్వరలో మొదలవుతుందని వెల్లడించారు. టైలరింగ్ శిక్షణకు ఈనెల 30వరకు, సీసీ టీవీ ఇన్స్టాలేషన్ కోర్సు కోసం జూలై 7వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ఉచితంగా వస తి, భోజనం సమకూర్చడమే కాక యూనిఫామ్, టూల్కిట్స్ అందిస్తామని తెలిపారు. పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం ఖమ్మం సహకారనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. పాలిసెల్లో అర్హత సాధించిన విద్యార్థుల్లో తొలిరోజు 286 మంది స్లాట్ బుక్ చేసుకోగా, 240మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్ 29వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు స్థానం ● రాష్ట్ర కార్యదర్శులుగా బాలకృష్ణ, జైపాల్ ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నాయకులకు చోటు దక్కింది. హైదరాబాద్లో గురువారం జరిగిన టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లాకు చెందిన గంగవరపు బాలకృష్ణ, జెడ్ఎస్.జైపాల్ను రాష్ట్ర కార్యదర్శులుగా ఎంపిక చేశారని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించడపై కేంద్ర అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్, ముజీబ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్, యర్రా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థి ప్రమాణాలు మెరుగుపడాలి రఘునాథపాలెం: ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థి విద్యాప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలోని ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేసిన ఆమె మాట్లాడారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని, వారిని అందరితో సమానంగా నిలబెట్టేలా బోధనా పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని తెలిపారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా బోధించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పాఠ్యాంశాల బోధనతో పాటు మానవీయ విలువలు, ఆచరణాత్మక నైపుణ్యాలు కూడా నేర్పాలని అదనపు సూచించారు. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డీఎంఈ బృందం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పడి మూడేళ్లు పూర్తవగా డీఎంఈ డాక్టర్ నరేందర్ కుమార్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర నేతృత్వంలోని బృందం గురువారం తనిఖీ చేసింది. గతంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యాన కళాశాలలను ఆన్లైన్ విధానంలో పరిశీలించి నిర్వహణపై సూచనలు చేసేవారు. కానీ ఇటీవల అనుమతుల విషయంలో అభ్యంతరాలు వస్తుండడంతో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుల నేతృత్వాన ప్రత్యక్షంగా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీఎంసీ నేతృత్వాన బృందం కళాశాల, జిల్లా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించింది. తరగతి గదులు, ల్యాబ్లు, అధ్యాపకుల వివరాలు ఆరా తీశాక అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధ్యక్షతన అధికారులతో సమావేశమయ్యారు. కాలేజీలో కల్పించాల్సిన మరిన్ని వసతులపై సూచనలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వర్రావు, వైస్ప్రిన్సిపాల్ సృజన, డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.వసతులు, బోధన సౌకర్యాలపై ఆరా -
మున్నేరు, ఆకేరు బ్రిడ్జిలపై ఫ్లడ్గేజ్ స్టేషన్లు
ఖమ్మం అర్బన్: మున్నేరుకు వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముంపును గుర్తించేలా జలవనరుల శాఖ అధికారులు తాత్కాలికంగా ఫ్లడ్గేజ్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. మున్నేరు ఉప్పొంగి ఖమ్మంపై ప్రభావం చూపకముందే వరద స్థాయిని అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలిశెట్టిగూడెం వద్ద బ్రిడ్జితో పాటు తంగిళ్లపల్లి వద్ద ఆకేరు వంతెనపై ఒక్కో స్టేషన్ ఏర్పాటుకు అధికారులు పాయింట్లను గుర్తించారు. నాయుడుపేట నుండి ఈ ఫ్లడ్గేజ్ పాయింట్ల వరకు సుమారు 9 కిలోమీటర్ల దూరం ఉండగా, అధిక వర్షపాతం నమోదైన సమయాన ప్రవాహ మోతాదును అంచనా వేయడం, పరీవాహక ప్రజలకు అప్రమత్తం చేసయడంలో ఈ ఫ్లడ్గేజ్ పాయింట్లు కీలకంగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, హైడ్రాలజీ విభాగం ఆధ్వర్యాన పూర్తిస్థాయిలో సర్వే చేపట్టి శాశ్వతంగా ఫ్లడ్ గేజ్ స్టేషన్లను ఏర్పాటుచేస్తే మరింత ఉపయోగంగా ఉంటుందనే భావనలో ఉన్నతాధికారులకు ప్రతిపాదించినట్లు తెలిసింది. 87శాతం బియ్యం పంపిణీ ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రేషన్షాపుల ద్వారా ఇప్పటివరకు 87శాతం సన్నబియ్యం పంపిణీ పూర్తయిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. జిల్లాలో 4,15,904 కార్డులకు గాను 3,63,361కార్డుల ద్వారా(87శాతం) బియ్యం తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు. బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకే ఉంటుందని, గడువు పొడిగించే అవకాశం లేనందున లబ్ధిదారులు త్వరగా తీసుకెళ్లాలని డీసీఎస్ఓ సూచించారు. -
రుణాలపై అవగాహన పెంచాలి
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలపై రైతులతో పాటు అన్నివర్గాల వారికి అవగాహన పెంపొందించాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఉదయ్భాస్కర్ సూచించారు. ఖమ్మంలో గురువారం వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలపై ప్రాంతీయ(ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల) స్థాయి బ్యాంకర్ల అవగాహన సదస్సు నాబార్డ్ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈసదస్సులో సీజీఎం మాట్లాడుతూ రుణాలు అందుబాటులో ఉన్న విషయమై రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తే సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. వివిధ రంగాల వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వాలు పథకాలను రూపొందించి సబ్సిడీ కల్పిస్తున్నాయని, కూరగాయల సాగు, సూక్ష్మ సేద్య పరికరాలు, డ్రోన్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు రుణాలు అందుబాటలో ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై బ్యాంకర్లు విస్తృత అవగాహ న కల్పించాలని సీజీఎం తెలిపారు. ఈ సమావేశంలో నాబార్డ్ జనరల్ మేనేజర్ గణపతి, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాజశేఖర్, నల్లగొండ డీసీసీబీ సీఈఓ శంకర్రావు, అధికారులు ఆర్య రవీంద్రన్, వినయ్కుమార్, సుజిత్కుమార్, రవీందర్ నాయక్, పాండురంగ పాల్గొన్నారు.నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్ -
ఎర్రజెండాలన్నీ ఏకమైతే ప్రజలకు మేలు
● హామీల అమలులో కాంగ్రెస్ ఆలస్యం ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిఖమ్మంరూరల్: కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమైతే ఢిల్లీలో ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగురవేయొచ్చని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. రూరల్ మండలంలోని పెదతండాలో గురువారం నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఒకే ఒకపార్టీ సీపీఐ మాత్రమేనని... ఆది నుంచి పేదలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందన్నారు. కాగా, ప్రజలు ఇచ్చిన అధికారంతో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులు చర్చలకు వస్తామని ప్రకటించినా ఆపరేషన్ కగార్ పేరుతో మారణకాండ చేయడం ఇందులో భాగమేనని తెలిపారు. అయితే, మావోయిస్టులు కూడా వనం వీడి జనంలోకి రావాలని కూనంనేని చెప్పారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మావోయిస్టులకు మద్దతుగా నిలిచింది సీపీఐనేనని చెప్పారు. కాగా, కాంగ్రెస్ తప్పిదాలతోనే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని వెల్లడించిన ఆయన ఏపీలో అధికారం కోసం చంద్రబాబు, పవన్కల్యాణ్ బీజేపీ వద్ద మోకరిల్లారని ఎద్దేవా చేశారు. రాజకీయ మేధావులు, విశ్లేషకులు, ప్రజలు కమ్యూనిస్టు పార్టీ ఆవశ్యకతను గుర్తెరిగి చెట్టు లాంటి కమ్యూనిస్టు పార్టీకి అండగా నిలవాలని సూచించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాటు ఏమీ చేయకుండా ఆర్థిక లోటు పేరుతో హామీలను నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కూనంనేని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు బాగం హేమంతరావు, ఎం. డీ.మౌలానా, దండి సురేష్, మిడకంటి చినవెంకటరెడ్డి, చెరుకుపల్లి భాస్కర్, పుచ్చకాయల సుధాకర్, ఉసికల రవికుమార్, సీతామహాలక్ష్మి, సిద్దినేని కర్ణకుమార్, పి.చందర్రావు, శంకర్రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పశుసంవర్థక, పశు వైద్యాధికారిగా పురంధర్
ఖమ్మంవ్యవసాయం: జిల్లా పశుసంవర్థక, పశువైద్యాధికారిగా డాక్టర్ పురంధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ డైరెక్టర్ హోదాలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు పురంధర్కు జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించి ఇక్కడే పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కే.వీ.నారాయణ ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేయగా, ఏడీ డాక్టర్ బోడేపూడి శ్రీనివాసరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు పురంధర్ గురువారం బాధ్యతలు స్వీకరించగా వైద్యాధికారులు అనంతు హరీష్, ఉపేందర్, అశోక్, రాజు, సుబ్బారావు, జగ్గూలాల్, రాంజీ, శ్రీనివాస్నాయక్, నాగమణి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆఫ్టైప్ మొక్కలపై విచారణ అశ్వారావుపేట: ఆయిల్ఫెడ్ నర్సరీల నుంచి సరఫరా అయిన మొక్కల్లో ఆఫ్టైప్ రావడంతో నష్టపోయినట్లు పలువురు రైతులు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో నివేదిక కోరగా అశ్వారావుపేట మండలంలోని పలువురి తోటలను ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించి మొక్కల ఎదుగుదల, దిగుబడిపై అధ్యయనం చేశారు. శాస్త్రవేత్తలు ఎంవీ.ప్రసాద్, రామచంద్రుడు, బి.కళ్యాణ్, విజయకృష్ణ పాల్గొన్నారు. -
జాతీయ హ్యాండ్బాల్ టోర్నీలో ప్రతిభ
ఖమ్మం స్పోర్ట్స్: జాతీయస్థాయి బాలికల జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. బీహార్ రాష్ట్రంలో ఈనెల 18నుంచి 22వ తేదీ వరకు టోర్నీ జరిగింది. రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్న జిల్లా క్రీడాకారులు మీనాక్షి, సంధ్య, నందిని జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. క్రీడాకారులను డీవైఎస్ఓతో పాటు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.రఘునందన్, పీడీలు సీహెచ్.కృష్ణయ్య, పి.శ్రీనివాస్ అభినందించారు. ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయం తల్లాడ: ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా తమ సంఘం కృషి చేస్తోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ తెలిపారు. మండలంలోని పలు పాఠశాలల్లో గురువారం పర్యటించిన యూనియన్ నాయకులు సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా రంజాన్ మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ చిత్తశుద్ధితో పాటుపడుతోందన్నా రు. కాగా, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ.ఎస్.నాగేశ్వరరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు షేక్ లాల్ సయ్యద్, టి.శ్రీనివాసరావుతో పాటు బి.ఇందుప్రియ, డి.రత్నకుమారి, కె.వెంకటేశ్వర్లు, షేక్ తసురున్నీసా, జి.మురళీకృష్ణ, జే.వీ.కిషోర్, చెన్నారావు పాల్గొన్నారు. డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల ● ఐదో సెమిస్టర్లో 50.56, ఆరో సెమిస్టర్లో 50.16శాతం ఉత్తీర్ణత కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. కేయూ క్యాంపస్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయగా.. పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ వివరాలు వెల్లడించారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 13,963 మంది విద్యార్థులు హాజరు కాగా 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని, ఆరో సెమిస్టర్ పరీక్షల్లో 37,999 మందికి 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. కాగా, ఫలితా లపై రీవాల్యుయేషన్కు విద్యార్థులు పదిహేను రోజుల్లోగా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. -
గోవిందాపురంలో మెడికల్షాపు దగ్ధం
బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఎల్)లో కల్యాణపు కిరణ్కుమార్కు చెందిన శ్రీ వెంకట గాయత్రీ మెడికల్ స్టోర్ బుధవారం అర్ధరాత్రి దగ్ధమైంది. అయితే, తానంటే గిట్టని వారే నిప్పు పెట్టి ఉంటారని కిరణ్ చేసిన ఫిర్యాదుతో సీఐ మధుబాబు, ఎస్ఐ పొదిలి వెంకన్న గురువారం పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అలాగే, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్రావు, పొన్నం వెంకటేశ్వరావు, చింతలచెర్వు కోటేశ్వరావు, కిలారు సురేష్ కూడా షాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం సీపీఎం కార్యకర్త ఎర్రబోయిన నాగేశ్వరావు హత్యకు గురికాగా, ఈ కేసులో కిరణ్కుమార్ సాక్షిగా ఉండడంతోనే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
వేతన.. వెతలు
● జీపీ కార్మికులకు మూడు నెలలుగా అందని జీతం ● జిల్లాలో 2వేల మంది ఎదురుచూపులు ● నేడు హైదరాబాద్లో ఆందోళనకు పయనం నేలకొండపల్లి: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలోనే కాక ఇతర అంశాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందటం లేదు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారు. గ్రామపంచాయతీల్లో కార్మికులే కాక వాటర్ మెన్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, కారోబార్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అసలే చాలీచాలనీ వేతనాలతో బతుకుబండి లాగిస్తుండగా ఆ వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టడం సరికాదని వాపోతున్నారు. ఈనేపథ్యాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా శుక్రవారం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు జిల్లా కార్మికులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్, పల్లె ప్రగతి తదితర కార్యక్రమాలలో కార్మికులే కీలకంగా వ్యవహరిస్తన్నారు. జిల్లాలో 2 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వీరికి నెలనెలా రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు. పెరిగిన ఖర్చుల రీత్యా వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తుండగా ఫలితం లేకపోగా ఆ వేతనం కూడా సక్రమంగా చెల్లించకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. ఉద్యోగ భద్రత కరువు ఉద్యోగ భద్రత లేక ప్రతీరోజు బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. కనీసం వేతనం రూ.20 వేలు ప్రతినెలా ఎస్టీఓ ద్వారా చెల్లించడమే కాక ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం హైదరాబాద్లో జరగనున్న ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి ఖమ్మంమయూరిసెంటర్: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్(టీయూసీఐ) నాయకులు కోరారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమర్లపూడి అప్పారావు, పగిడికత్తుల రాందాస్ ఆధ్వర్యాన జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను సంక్షేమాన్ని పట్టించుకోకపోగా వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్ ఉండడంతో ఇబ్బంది పడుతున్నందున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీగడ సైదులు, జోగా నాగేశ్వరరావు, కత్తుల భిక్షం, రమేష్, గోపి, భాష, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం పంచాయతీ కార్మికులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. ఇచ్చే అరకొర వేతనం కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టడం సరికాదు. ఇకనైనా కార్మికులకు ప్రతినెలా ఎస్టీఓ ద్వారా జీతం చెల్లించాలి. ఇందుకు ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేయాలి. – టి.విష్ణు, పంచాయతీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడుభారంగా కుటుంబ పోషణ ప్రతినెలా జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇకనైనా అధికారులు స్పందించి కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించి పెండింగ్ లేకుండా చెల్లించాలి. అలాగే, బీమా కల్పించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలి. – బొడ్డు ఆంజనేయులు, మల్టీపర్పస్ వర్కర్, కోనాయిగూడెం -
రక్తమోడుతున్న రోడ్లు
నిత్యం రహదారులు రక్తమోడుతున్నాయి. జిల్లాలోని ప్రధాన రహదారులపై రోజుకో ప్రమాదం సంభవిస్తోందంటే అతిశయోక్తి కాదు. బయటకు వెళ్లినవారు తిరిగి వచ్చేవరకూ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు కలవరానికి గురవుతున్నారు. – ఖమ్మంక్రైంమితిమీరిన వేగం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాల్లో మితిమీరిన వేగం ఒకటని అధికారులు చెబుతున్నారు. వాహనదారులు వినియోగించే పెద్ద పెద్ద వాహనాల నుంచి ద్విచక్రవాహనాల వరకు ఒక స్పీడ్ లిమిటెడ్ను చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు నడపడంతో ఒకరినొకరు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ రహదారులపై హడల్ జిల్లాలో ప్రధానమైన ఖమ్మం నుంచి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్ వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రయాణమంటే వాహనదారులు హడలిపోతున్నారు. నిత్యం కనీసం రెండు, మూడు అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయడంలో అతిశయోక్తి లేదు. గ్రీన్ఫీల్డ్ హైవే అయితే తప్ప ఈ ప్రమాదాలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరా రోడ్డులోని కొణిజర్ల మండలంతో పాటు వైరా, తల్లాడ, కల్లూరు, తిరుమలాయపాలెం మండలాల్లో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగాయని, ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు, రూరల్ పరిధిలోనూ ప్రమాదాలు ఎక్కువయ్యాయని చెబుతున్నారు. పట్టించుకోని అధికారులు.. జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత పోలీస్, రవాణా, ఆర్అండ్బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 30కి పైగా బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. అయినా ఆ ప్రాంతంలో సూచిక బోర్డులు కాని, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం జరిమానాల కోసమే వాహనాల తనిఖీ చేయడం కాకుండా వాహనదారులు ఎలాంటి నిబంధనలు పాటించాలి, ప్రమాదాలు జరగడం వలన జరిగే ఇబ్బందులు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చెబుతున్నారు. ఐదున్నర నెలల్లో 150 మంది.. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన 429 రోడ్డు ప్రమాదాల్లో 162 మంది మృతిచెందగా.. 431 మంది క్షతగాత్రులయ్యారు. అయితే, ఇవి అధికారిక రికార్డుల్లో నమోదు కాక.. రికార్డులకెక్కని ఘటనలు చాలానే ఉంటాయని చెబుతున్నారు. జిల్లాలో ప్రతీ ప్రధాన రహదారిపై రోజుకో ప్రమాదం గడిచిన ఐదున్నర నెలల్లో 150 మంది మృతి వందల సంఖ్యలో క్షతగాత్రులు ఓవర్టేక్ జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఓవర్ టేక్ కూడా ముఖ్య కారణమని అధికారులు చెబుతున్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఎలాగైనా దాటాలనే ఆతృతలో ఆ వాహనం సైడ్ ఇచ్చాడా లేదా అని ఆలోచించకుండా ఓవర్ టేక్ చేయడం.. ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా కాళ్లు, చేతులు, విరిగి అవిటివారిగా మారిపోతుడడం పరిపాటిగా మారింది. మితిమీరిన వేగం, ఓవర్టేక్ వల్లే.... జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ముఖ్యకారణం మితిమీరిన వేగం, ఓవర్టేక్ అని చెప్పవచ్చు. తనీఖీలు నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారుడికి రోడ్డు నిబంధనలు పాటించాలని చెబుతున్నాం. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుందని అవగాహన కల్పించినప్పుడు వింటున్నారు. కానీ రోడ్డు ఎక్కగానే మరిచిపోతుండడం ప్రమాదాలకు కారనమవుతోంది రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశముంటుంది. – వెంకటరమణ, జిల్లా రవాణాశాఖాధికారి ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు.. నెల ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు జనవరి 78 25 78ఫిబ్రవరి 79 29 71మార్చి 87 33 61ఏప్రిల్ 80 27 66మే 50 28 80జూన్ 55 20 75 -
టీబీ రహిత సమాజ నిర్మాణానికి కృషి
ఖమ్మంఅర్బన్: సమాజంలో నుంచి టీబీ సమూలంగా నిర్మూలించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఖమ్మం కై కొండాయిగూడెంలో గ్రానైట్ అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశం నుంచి 2025 నాటికి టీబీని తరిమికొట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఏ కొంచెం అనుమానం ఉన్నా.. పరీక్ష చేయించుకుని చికిత్స పొందాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేయడమే కాక మందులు ఇస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం
చింతకాని: పచ్చదనాన్ని పెంపొందించేలా వచ్చేనెల 1నుంచి వన మహోత్సవం నిర్వహించనుండగా లక్ష్యం మేర నాటేందుకు మొక్కలు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. చింతకాని మండలం వందనంలోని నర్సరీని బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. మొక్కలు నాటడంతో పాటు వంద శాతం సంరక్షించడం ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని తెలిపారు. ప్రతీ శాఖకు కేటాయించిన లక్ష్యం మేర రెండు మీటర్ల కంటే ఎత్తు ఉన్న మొక్కలు నాటాలని, ప్రతీ మొక్కను జియోట్యాగ్ చేసి పర్యవేక్షించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ వందనంలోని స్వయంభూ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. డీఆర్డీఓ సన్యాసయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఐకేపీ ఏపీఎం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే ఉన్నత స్థానం చదువుతోనే ఉన్నత స్థాయికి చేరొచ్చని, తద్వారా సమాజంలో గౌరవం లభిస్తుందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వందనంలోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన పరిసరాలు, టాయిలెట్లు, వంటగదితో పాటు 1, 5వ తరగతుల్లో బోధనను పరిశీలించారు. తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగా కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడాలి ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. వేతనాలు అందక ఆస్పత్రి కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యాన కలెక్టర్ బుధవారం ఆస్మత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్యంపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాని వైద్యులకు సూచించారు. ఫార్మసీలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, మెనూ ప్రకారం రుచి, శుచికరమైన ఆహారం అందించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్, ఆర్ఎంఓ రాంప్రసాద్, రాంబాబు పాల్గొన్నారు. -
అంకితభావంతో కృషి చేయాలి..
వైరా: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవడ మే ధ్యేయంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని పలు ప్రభు త్వ పాఠశాలలను బుధవారం సందర్శించిన యూనియన్ నాయకులు సభ్య త్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి నాయకత్వాన పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. అలాగే, ఉపాధ్యాయుల జీపీఎఫ్ పెండింగ్ బిల్లుల విడుదలకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. యూనియన్ నాయకులు డి.సత్యనారాయణ, వెలిశెట్టి నర్సింహారావు, వేమిరెడ్డి గోవర్దన్రెడ్డి, ఎన్.జాన్, కారుమంచి దయాకర్, సుజాత, చంద్రశేఖరరెడ్డి, రమేశ్, సురేశ్, రవికుమార్, ప్రభాకర్, పుల్లారావు, రాఘవరావు పాల్గొన్నారు. పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి కొణిజర్ల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం కృషి చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కొణిజర్ల మండలంలో యూనియన్ సభ్య త్వ నమోదును బుధవా రం ప్రారంభించగా ఆయ న మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస తులు లేక విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోందని తెలిపారు. కాగా, ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి టీఎస్ యూటీఎఫ్ కృషి చేస్తోందని, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, పీఆర్సీ తదితర సమస్యలపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు చిలుకూరి వీరస్వామి, మద్దెల ప్రసాదరావుతో పాటు రత్న సుశీలరాణి, నాగేశ్వరరావు, విజయలక్ష్మి, శ్రీనివాస్, లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, మోహినుద్దీన్, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
అప్రకటిత ఎమర్జెన్సీ అత్యంత ప్రమాదం
● వాజ్పేయి, మోదీ అధికారానికి చంద్రబాబే కారణం ● రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఖమ్మంమయూరిసెంటర్: ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకు లు, సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి పేర్కొన్నారు. ప్రకటిత ఎమర్జెన్సీ కంటే అప్రకటిత ఎమర్జెన్సీ అత్యంత ప్రమాదకరమని, నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఏకైక పార్టీ సీపీఎం అని చెప్పారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్లో బుధవారం ‘ఎమర్జెన్సీకి 50 ఏళ్లు – నేటి నయా ఫాసిస్ట్ ప్రమాదం’, ‘నేటి ప్రజాస్వామ్యం – సవాళ్లు’అంశాలపై నిర్వహించిన సెమినార్లో రవి మాట్లాడారు. ప్రస్తుతం రాజ్యాంగం తీవ్ర స్థాయిలో అణచివేతకు గురవుతోందని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సూత్రాలపై ప్రస్తుత దాడి ప్రమాదకరమైందని, నిరంకుశత్వం వ్యవస్థీకృతం కావడానికి ఇది దారితీసిందన్నారు. అంతేకాక దేశం అన్న భావననే తలకిందులు చేసేలా విషపూరితంగా హిందుత్వ విధానాలను జొప్పిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పాలన వ్యవస్థను తొలగించడం కష్టంగా అనిపించినా, 1970 ఎమర్జెన్సీపై పోరాడిన అనుభవం గుర్తు చేసుకుంటే విశ్వాసమే కనిపిస్తుందని చెప్పారు. కాగా, గతంలో వాజ్పేయి రెండుసార్లు, ఇప్పుడు మోదీ అధికారంలో ఉన్నారంటే చంద్రబాబు బలపర్చడమే కారణమని ఆయన పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కాంగ్రెస్ పాలకులు ప్ర జాస్వామ్య హక్కులను కాలరాశారని, ప్రస్తుతం బీజేపీ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినట్లుగానే నేడు బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు. -
‘కటాఫ్’తో పరిసమాప్తం
● రైతులందరికీ అందని ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ● కటాఫ్ డేట్ పేరుతో జాబితాలో దక్కని చోటు ● ఏటా రూ.6 వేలు కోల్పోతున్న అన్నదాతలు ఎర్రుపాలెం: దేశవ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతు లకు పంటల సాగు పెట్టుబడిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అర్హులందరికీ లబ్ధి జరగడం లేదు. కటాఫ్ డేట్ నిబంధనతో లక్షల మంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 31వ తేదీలోపు పట్టాదారు పాస్పుస్తకాలు కలిగిన రైతులకు ఏటా మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు ఆర్థికసా యం అందిస్తోంది. ఆదాయ పన్ను చెల్లింపుదారు లు, ప్రభుత్వ ఉద్యోగులు, చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యు లు, రాజ్యాంగపదవిలో కొనసాగుతున్న ప్రజా ప్రతినిధులు తదితరులను ఈ పథకం ఆరంభం నుంచి అనర్హులుగా తేల్చారు. జిల్లాలో మొదటి విడతగా 1.94 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం జమ చేయగా, ఆపై విడతల వారీగా అనర్హులను గుర్తిస్తుండడంతో నేడు ఆ సంఖ్య 1.04 లక్షలుగా ఉంది. ఇంకా 2.50 లక్షల మందికి పైగానే 2019 ఫిబ్రవరి నుంచి భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్పుస్తకాలు తీసుకున్న 2.50 లక్షల మంది సన్న చిన్న కారు రైతులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందడం లేదు. కటాఫ్ డేట్ నిబంధన కారణంగానే వీరంతా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. 2019 నాటికి పథకం ద్వారా నగదు తీసుకుంటున్న రైతుల్లో ఎవరైనా చనిపోతే వారి వారసులకు మాత్రం సాయం అందుతోంది. అంతేతప్ప కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పాస్పుస్తకాలు తీసుకున్న రైతులకు మాత్రం లబ్ధి జరగడం లేదు. దీంతో 2019 ఫిబ్రవరి తర్వాత భూములు కొనుగోలు చేసిన రైతులు పాస్పుస్తకాలతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం సాయం కోసం మీ సేవా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవడం, ఏఈఓల లాగిన్కు వెళ్లగానే తిరస్కరించడం పరిపాటిగా మారింది. ఫిబ్రవరిలో 1.04 లక్షల మంది రైతులకు 19వ విడత ఆర్థికసాయం అందింది. ఇక జూన్లోనే 20వ విడత ఆర్థికసాయం జమ కావాల్సి ఉన్నా ఇంకా జరగలేదు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో పలువురు కొత్త పట్టాదారుపాస్ పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలోనూ అర్హులకు పాస్పుస్తకాలు జారీ చేస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో అర్హుల సంఖ్య పెరగనుంది. అయితే, ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రతీ ఐదేళ్లకోసారి తిరిగి కొత్త రైతులను గుర్తించి కటాఫ్ డేట్ నిర్దేశించాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అర్హులైన లక్షలాది మంది పెట్టుబడి సాయం కోల్పోతున్నారు. మేమేం పాపం చేశాం.. 2019 తర్వాత భూములు కొనుగోలుచేసిన చేసిన రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందకపోవడంతో తామేం పాపం చేశామని వాపోతున్నారు. కటాఫ్ డేట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తమను విస్మరించడంపై ఆవేదన చెందుతున్నారు. ఆరేళ్లలో ఏటా రూ.6 వేల ఆర్థికసాయం కోల్పోతున్న తమను ఇకనైనా పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పథకం నిబంధనల మేరకు ఐదేళ్లకోసారి కొత్త రైతులను గుర్తించాల్సి ఉన్నందున అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధత
ఖమ్మంసహకారనగర్: గత ఏడాది మాదిరి వరదలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో పోలీస్ కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి విపత్తుల నిర్వహణపై బుధవారం ఆయన సమీక్షించారు. గతంలో ముంపునకు గురైన ప్రతీ హ్యాబిటేషన్లో పరిశీలించి మళ్లీ వరద వస్తే ఎక్కడకు తరలించాలనే అంశంపై ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్ సిద్ధం చేయాలని, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో నీటి వనరుల్లో చేరే వరదను గమనిస్తుండాలని చెప్పారు. సీపీ సునీల్దత్ మాట్లాడుతూ.. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముందు జాగ్రత్త చర్యలు కీలకమని తెలిపారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడగా డీఆర్వో ఎ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు ఇసుక ఖమ్మంఅర్బన్: జిల్లాలో అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుక కొరత రాకుండా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో మైనింగ్, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, ప్రాధాన్యత కార్యక్రమాలకు ఇసుక కొరత రాకుండా పర్యవేక్షించాలని తెలిపారు. టీజీఎండీసీ ఆధ్వర్యాన ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లుగానే మధిర మార్కెట్ యార్డు, పాలేరు తహసీల్, కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయం, సత్తుపల్లి మార్కెట్లలోనూ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటి నిర్వహణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించి పర్యవేక్షించాలని సూచించారు. మైన్స్ ఏడీ సాయినాథ్, టీజీఏడీసీ పీఓ జి.శంకర్నాయక్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఎస్ఈలు యాకూబ్, ఎం.వెంకటేశ్వర్లు, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఈఈలు రంజిత్, వాణిశ్రీ పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
స్పోర్ట్ ్స స్కూళ్లలో ప్రవేశానికి పోటీలు
ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బుధవారం జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీలకు 40 మంది బాలురు, 15 మంది బాలికలు హాజరయ్యారు. పరుగు పందెం, మెడిసిన్ బాల్ త్రో, స్టాండింగ్ బ్రాండ్ జంప్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించడమే కాక ఎత్తు, బరువు పరీక్షించారు. ఇందులో 10మంది చొప్పున బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జూలై 3వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. పోటీలను డీవైఎస్ఓ తుంబూరు సునీల్రెడ్డి పర్యవేక్షించగా మేనేజర్ ఉదయ్కుమార్, శాప్ పరిశీలకులు బి.రాంబాబు, కోచ్లు ఎం.డీ.గౌస్, పరిపూర్ణాచారి, చంద్రకాంత్, కై లాష్, నగేష్, సిరి పాల్గొన్నారు. -
పరిశుభ్రమైన నగరమే లక్ష్యం
● సిబ్బందికి ప్రజలు సహకరించాలి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం అర్బన్: పరిశుభ్రత, తద్వారా ఆరోగ్యవంతమైన నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దడంలో అందరూ సహకరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం 11వ డివిజన్ వరదయ్యనగర్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో పాల్గొన్న మంత్రి డ్రెయిన్లో మురుగు తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరవై రోజుల నుంచి నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నందున ప్రజలు కూడా రోడ్ల వెంట, డ్రెయినేజీల్లో చెత్త వేయకుండా సిబ్బందికి సహకరించాలని తెలిపారు. నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యం సొంతమవుతుందని చెప్పారు. అనంతరం 4వ డివిజన్ రాజీవ్నగర్ గుట్టలో రూ.50 లక్షల టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పేదలు నివాసముంటున్న ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడగా వరదయ్య నగర్లో మంత్రి సహా అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ఈఈలు వి.రంజిత్, కృష్ణలాల్, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు, అటవీశాఖ అధికారి బెల్లం రాధిక, కార్పొరేటర్లు సరిపూడి రమాసతీష్, దండాజ్యోతిరెడ్డి, కమర్తపు మురళి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, చావా మాధురినారాయణరావు, సొసైటీ చైర్మన్ రావూరి సైదబాబుతో పాటు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు తాతా రఘురాం, కీసర పద్మజారెడ్డి, బోడా శ్రావణ్కుమార్, సాధు రమేష్రెడ్డి, ఏలూరి శ్రీనివాసరావు, పల్లెబోయిన చంద్రయ్య, లోడుగు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. రైతుల అభివృద్ధి కోసమే బ్యాంకు వేంసూరు: పంటలతో పాటు ఇతర అవసరాలకు రుణాలు ఇస్తూ రైతులకు డీసీసీబీ ద్వారా సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వేంసూరు మండలం అడసర్లపాడు, కందుకూరు గ్రామాల్లో డీసీసీబీ బ్రాంచ్లను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు రుణమాఫీ చేయడమే కాక వరి నాట్లకు ముందే రైతుభరోసా నిధులు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ రాజేంద్రగౌడ్, డీసీసీబీ డీజీఎంలు వేణుగోపాల్రావు, సర్వేశ్వరరావు, ఏజీఎం చందురావు, మేనేజర్లు నాగలక్ష్మి, రజిత, అలీమ్, నాయకులు వెల్ది జగన్మెహన్రావు, గొర్ల సంజీవరెడ్డి, ఎం.డీ.పైజుద్దీన్, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
వరుణుడి కటాక్షం
ఖమ్మంవ్యవసాయం: ఎట్టకేలకు వరుణుడు కటాక్షించాడు. ఈనెల 22వ తేదీన ఆరుద్ర కార్తె ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గడమే కాక ఆకాశం మేఘావృతమవుతోంది. ఇందులో భాగంగానే మూడు రోజుల నుంచి జిల్లాలోని పలుచోట్ల వర్షపు జల్లులు, అక్కడక్కడా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక బుధవారం సాయంత్రం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షం మొదలైంది. సాయంత్రం 4గంటలకు ఓ మోస్తరుగా మొదలైన వాన అంతకంతకూ పెరుగుతూ రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 7గంటలకు వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం అత్యధికంగా వేంసూరులో 54.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, సదాశివునిపాలెంలో 38.5, వైరాలో 38, గుబ్బగుర్తిలో 35.5, కుర్నవల్లిలో 33.5, ఖమ్మం ఖానాపురం, రావినూతలో 30.5, బచ్చోడులో 29, పల్లెగూడెంలో 28, సత్తుపల్లిలో 26.8, కొణిజర్ల 26.5, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 26.3, తిరుమలాయపాలెంలో 25, ఖమ్మం ప్రకాష్నగర్లో 24.8, పెనుబల్లిలో 24.3, ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్హౌస్ వద్ద 23.5, రఘునాథపాలెంలో 21.8, తల్లాడ 20.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. పంటల సాగుకు దోహదం ప్రస్తుతం కురుస్తున్న వర్షం పంటల సాగుకు దోహదపడుతుంది. మెట్ట పంటలను విత్తుకునేందుకు 60 – 70 మి.మీ.ల వర్షపాతం అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, మే చివరి వారం రోహిణి కార్తె ఆరంభంలో వర్షం కురవగా, రైతులు పత్తి, పెసర, కంది, మొక్కజొన్న విత్తారు. కానీ జూన్ ఆరంభం నుంచి వానలు లేకపోగా ఆశించిన మేర విత్తనాలు మొలకెత్తలేదు. ప్రస్తుతం కురుస్తున్న వాన పంటల సాగుకు దోహదపడుతుందని రైతులు ఆశిస్తున్నారు. పత్తిని మళ్లీ విత్తాల్సిందేనా? జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తి ఒకటి. ఈ పంట జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే 2లక్షల ఎకరాల్లో నాటినట్లు తెలుస్తుండగా.. సరిపడా వర్షం లేక చాలాచోట్ల పూర్తి స్థాయిలో మొలకెత్తలేదు. మొలకెత్తని చోట తిరిగి మరోమారు పత్తి విత్తనాలు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వచ్చేనెల 20వరకు పత్తి విత్తనాలు వేసే అవకాశమున్నందున రైతులు ముందడుగు వేస్తున్నారు. ఇక గత ఏడాది మిర్చి దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు పత్తి వైపే దృష్టి సారించారు. ఇంకొందరు మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కారేపల్లి : పత్తి చేనులో పాటు చేస్తున్న రైతు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వాన ఊపందుకోనున్న పంటల సాగు -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కామేపల్లి/కారేపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. కారేపల్లి మండలం భాగ్యనగర్తండాకు చెందిన వాంకుడోత్ సాయికుమార్ (22) తన స్నేహితుడైన భూక్యా కుమార్తో కలిసి పనినిమిత్తం బైక్పై మంగళవారం ఖమ్మం వెళ్లారు. తిరిగి రాత్రి బైక్పై వస్తుండగా కామేపల్లి మండలం మర్రిగూడెం స్టేజీ సమీపాన గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ వాహనం సాయికుమార్ పొట్ట మీదుగా వెళ్లడంతో పొట్టభాగం నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడిన కుమార్ను స్థానికులు అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. చెల్లని చెక్కు కేసులో మూడు నెలల జైలుశిక్ష ఖమ్మంలీగల్: చెల్లించాల్సిన అప్పు కింద ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో మూడు నెలలు జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి బెక్కమ్ రజని బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం పాకబండబజార్కు చెందిన తనుకు వెంకటేశ్వర్లు వద్ద చిట్టుమొదు వెంకటేశ్వర్లు 2022 జనవరిలో రూ.3.20లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2022 జూలైలో చెక్కు ఇవ్వగా, తనుకు వెంకటేశ్వర్లు బ్యాంకు ఖాతాలో జమ చేస్తే చిట్టుమొదు వెంకటేశ్వర్లు ఖాతాలో సరిపడా నగదు లేనందున తిరస్కరణకు గురైంది. దీంతో బాధితుడు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయగా విచారణ అనంతరం జైలుశిక్షతో పాటు ఫిర్యాదికి రూ.3.20 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్కు గాయాలు ముదిగొండ: ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్కు గాయాలయ్యాయి. నేలకొండపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆటోకు ముదిగొండ సమీపాన జాతీయ రహదారిపై కుక్క అడ్డొచ్చింది. దీంతో అదుపు తప్పిన ఆటో పల్టీకొట్టగా డ్రైవర్ సాయికి గాయాలయ్యాయి. స్థానికులు 108లో క్షతగాత్రుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
అటవీ అభివృద్ధి, సంరక్షణపై ప్రత్యేక దృష్టి
సత్తుపల్లిటౌన్: జిల్లాలో అటవీ అభివృద్ధి, సంరక్షణపై ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచించారు. సత్తుపల్లిలో బుధవారం పర్యటించిన ఆయన సింగరేణి స్వాధీనంలో ఉన్న అటవీ భూముల లీజ్ నిబంధనలపై సింగరేణి అధికారులతో చర్చించారు. అలాగే, సింగరేణి బొగ్గు గనులు, కిష్టారం, కొమ్మేపల్లి బీట్ పరిధిలోని ప్లాంటేషన్లు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని అటవీ భూములను పరిశీలించారు. అనంతరం చంద్రాయపాలెంలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్న అటవీ భూమిని పరిశీలించాక డీఎఫ్ఓ మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది అటవీశాఖ ఆధ్వర్యాన 5,47,200 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఎఫ్డీఓ వాడపల్లి మంజుల, రేంజర్ స్నేహలత, సింగరేణి పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, వైల్డ్లైఫ్ నిపుణుడు నారాయణ్, ఎఫ్ఎస్ఓలు నర్సింహ, నాగరాజు, కొండారెడ్డి, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.పారదర్శకంగా ఎరువుల విక్రయంరఘునాథపాలెం: జిల్లాలోని డీలర్లు యూరియా, డీఏపీ అమ్మకాల్లో పారదర్శకత పాటిస్తూ ఎప్పటికప్పుడు వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. అంతేకాక పీఓఎస్ మిషన్ ద్వారానే విక్రయాలు జరపాలని తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎరువుల షాప్లను బుధవారం ఆయన తనిఖీ చేశారు. డీలర్ల వద్ద రిజిస్టర్ల ఆధారంగా స్టాక్, విక్రయాలను పరిశీలించిన ఆయన సూచనలు చేశారు. మండల వ్యవసాయ అధికారి కర్నాటి ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.నియోనాటల్ వాహనంలో అధునాతన పరికరాలునేలకొండపల్లి: అధునాతన పరికరాలతో కూడిన నియోనాటల్ వాహనం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఉమ్మడి జిల్లా పోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్సీ వద్ద బుధవారం నియోనాటల్ వాహనంలో పరికరాల పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ జిల్లాకు తొలిసారిగా ఈ వాహనాన్ని కేటాయించగా అత్యాధునిక పరికరాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రత్యేకంగా నవజాత శిశువుల సంరక్షణకు ఈ వాహనం సమకూర్చారని చెప్పారు. కాగా, 108 అంబులెన్స్లు ఖమ్మం జిల్లాలో 21, భద్రాద్రి జిల్లాలో 28 ఉండగా, ఒక్కో వాహనంలో కనీసం నెలకు 120 ట్రిప్పుల ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ అధికారి దుర్గాప్రసాద్, 108 సిబ్బంది అజీమ్, పుష్పలత పాల్గొన్నారు.పీజీ లాసెట్లో 9వ ర్యాంకు.. ప్రతిభ చాటిన జిల్లా యువతి భవ్యశ్రీఖమ్మం సహకారనగర్: తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా పీజీ లాసెట్లో ఖమ్మం నగరానికి చెందిన యరమల భవ్యశ్రీ రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. ఈమేరకు ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఓయూలో ఎల్ఎల్బీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉపాధ్యాయుడైన తండ్రి బాలస్వామి, తల్లి నాగేంద్రమ్మతో పాటు కళాశాల అధ్యాపకుల సహకారంతో పీజీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. పేదలకు న్యాయ సాయం అందించాలనేదే లక్ష్యమని వెల్లడించింది. కాగా, భవ్యశ్రీ 1నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలోని కేంద్రియ విద్యాలయంలో, ఇంటర్మీడియట్ పాలేరు నవోదయలో పూర్తిచేసింది. -
ఆవేతనలో గోపాలమిత్రలు..
● 9 నెలలుగా వేతనాల కోసం ఎదురుచూపులు ● అర్ధాకలితో విధులు నిర్వహిస్తున్న వైనం ● జీవాలకు చికిత్స చేసేలా 2000 సంవత్సరంలో నియామకం నేలకొండపల్లి: మేలు రకం పశువుల సంతతి పెంచడమే లక్ష్యంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమా న్ని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డాల్డా) అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2000 సంవత్సరంలో రాష్ట్రంలోనే మొదటిసారి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారాంలో గోపాలమిత్ర వ్యవస్థను ప్రారంభించారు. తొలుత జిల్లాలో నలుగురికి శిక్షణ ఇచ్చి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 255 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ వీరికి గతేడాది సెప్టెంబర్ నుంచి గౌరవ వేతనం అందక అర్ధాకలితో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. విధులు ఇలా.. గోపాలమిత్రలకు పలు రకాల విధులను అప్పగించారు. కృత్రిమ గర్భధారణ కోసం మేలు రకం జాతి పశువుల వీర్యాన్ని సేకరించి పశువులకు ఇవ్వడం ప్రధాన విధి. అంతేకాక పాల దిగుబడి పెరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే, జీవాలకు క్షేత్రస్థాయిలోనే ప్రథమ చికిత్స చేయాలి. ఈ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తుండడంతో విడతలుగా వీరి గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.11,050 అందుతుండగా.. గతేడాది ఆగస్టులో చివరిసారిగా వేతనాలు జమఅయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వేతనాలు అందకపోవడం గమన్హారం. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో గోపాలమిత్రలకు దాదాపు రూ.2.60 కోట్ల మేర బకాయి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో గోపాలమిత్రలు కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారు. బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలి సకాలంలో వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారింది. తొమ్మిది నెలలుగా వేతనాలు రాక అవస్థ పడుతున్నాం. కనీసం బైక్ పెట్రోల్ ఖర్చులకూ ఇబ్బందిగా ఉంది. ఇకనైనా పెండింగ్ వేతనాలు విడుదల చేయడమే కాక నెలనెలా వేతనాలు చెల్లించాలి. –బోయపాటి నారాయణ, గోపామిత్రల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. గోపాలమిత్రల వేతనాలు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే. ప్రతీనెలా మా కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపుతున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే విడుదల అవుతాయని అనుకుంటున్నాం. నిధులు రాగానే చెల్లింపులు చేపడుతాం. –రూప్కుమార్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ లక్ష్యం చేరకపోతే వేతనంలో కోత నిర్దేశిత సంఖ్యలో పశువులకు కృత్రిమ గర్భధారణ కోసం గోపాలమిత్రలు ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీనెలా తమ పరిధిలో 80 – 100 పశువులకు చేయాలనేది లక్ష్యం. ఇందుకోసం రైతుల నుంచి ప్రతీ పశువుకు రూ.40 చొప్పున వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి. అయితే, లక్ష్యం మేరకు చేయకపోతే ఎన్ని పశువులు తగ్గుతాయే అంత మేర గోపాలమిత్రల వేతనం నుంచి మినహాయిస్తున్నారు. ఇచ్చేదే అరకొర వేతనం కాగా, ఆపై లక్ష్యాల పేరిట కోత విధిస్తుండడం, ఇప్పుడు తొమ్మిది నెలలుగా అసలు వేతనాలు చెల్లించకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. -
అప్రమత్తంగా ఉన్నాం..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో మలేరియా, చికున్గున్యా లేవు. గత ఏడాది డెంగీ కేసులు నమోదైనందున ఈసారి పునరావృతం కాకుండా ప్రణాళికా యుతంగా వ్యవహరిస్తున్నాం. గత ఏడాది మున్నేటి వరదల దృష్ట్యా ఈసారి ముందస్తు రక్షణ చర్యలపై దృష్టి సారించాం. వ్యవసాయ పనులు ప్రారంభమైనందున రైతులకు ఎరువులు, విత్తనాలు సమకూర్చగా.. భూభారతి సదస్సుల్లో అందిన 75 వేల దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. వచ్చేనెల 1నుంచి వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాక జిల్లాలో అందరికీ మెరుగైన విద్య, వైద్యం అందేలా కార్యచరణ రూపొందించాం’ అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనుదీప్ తొలిసారి మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...● హాట్స్పాట్లను గుర్తిస్తున్నాం..జిల్లాలో మలేరియా, చికున్గున్యా లేకపోగా.. గత ఏడాది డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల్లో ఈ కేసులు అధికంగా వచ్చాయి. ఆయా ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశిం చాం. ఫ్రైడే– డ్రైడే ద్వారా ఇంటింటా అవగాహన కల్పిస్తాం. డ్రెయిన్లు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా, ఆయిల్బాల్స్ వేయిస్తాం. ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేసి అనుమానితులకు పరీక్షలు చేస్తారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ, చికున్గున్యా కేసులు నమోదైతే వెంటనే సమాచారం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తాం.● ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు అవగాహనజిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇప్పటికే 12వేల మందికి ఇళ్లు మంజూరు చేశాం. కొన్ని ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇళ్లు మంజూరైన ప్రజలు సంతోషంగా ఉన్నారు. నేను రెండు గ్రామాలు పరిశీలించగా ఇసుక కొరత ఉందని చెప్పారు. దీంతో కూపన్ల ద్వారా ఇసుక పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. మంజూరైన ఇళ్లు త్వరగా కట్టుకోవాలని అవగాహన కల్పిస్తూనే ఎప్పటికప్పుడు నగదు జమ అయ్యేలా పర్యవేక్షిస్తున్నాం.● 15 ఎకరాల్లో అవెన్యూ ప్లాంటేషన్వచ్చేనెల 1వ తేదీ నుంచి వన మహోత్సవం ప్రారంభమవుతుంది. అప్పటిలోగా వర్షాలు జోరందుకుంటాయని భావిస్తున్నాం. 10 – 15 ఎకరాల విస్తీర్ణంలో అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుకు నిర్ణయించాం. ఇందుకోసం తిరుమలాయపాలెం, రఘునాథపాలెం మండలాల్లో స్థలాలను గుర్తించాం. అక్కడ మొక్కలు నాటి సంరక్షిస్తూ చిట్టడవిని తలపించేలా తీర్చిదిద్దుతాం. అన్ని ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వామ్యం చేస్తాం.విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టిజిల్లాలో ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెట్టాం. పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల మరమ్మతులకు అంచనాలు సిద్ధమవుతున్నాయి పాఠశాలల్లో పారిశుద్ధ్యం బాగుండేలా చూస్తున్నాం. ప్రతీ విద్యార్థికి పౌష్టికాహారం అందిస్తూనే వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులకు కేఎంసీ సిబ్బందిని సమకూర్చాం. రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రి కార్మికులకు వేతనాలు అందేలా చూస్తాం.కారణాలు వివరిస్తాం..భూభారతి సదస్సుల్లో 75 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొన్నింటిని పరిశీలించాం. దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించాక సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తున్నాం. ఒకవేళ ఏదైనా దరఖాస్తును పరిష్కరించలేకపోతే అందుకు కారణాలను దరఖాస్తుదారుడికి వివరిస్తాం. సాదాబైనామా దరఖాస్తులపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.వరదలపై అవగాహన కల్పిస్తున్నాం..గత ఏడాది వచ్చిన వరదను దృష్టిలో పెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించడమే కాక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించా. ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగానే పునరావాస కేంద్రాలను గుర్తిస్తున్నాం. ఎగువ ప్రాంతాల్లో వరదలు మొదలుకాగానే సమాచారం ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించాం. అలా సమాచారం రాగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తాం. అంతేకాక వానాకాలం రెండు నెలలు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇక్కడే ఉండి ఆపద ఎదురుకాగానే రంగంలోకి దిగనుంది.సరిపడా విత్తనాలు, ఎరువులుఈ వానాకాలం సీజన్లో అన్నీ కలిపి 6.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. ఇందులో 3లక్షల ఎకరాల్లో వరి, 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, 65 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని భావిస్తున్నాం. ఇందుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అన్ని షాపుల్లో అమ్మకాలను ప్రతిరోజు ఆరా తీస్తున్నాం. ఏఈఓ మొదలు జిల్లా అధికారుల వరకు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నందున డీలర్లు అవకతవకలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. -
అంతరపంటలతో అదనపు ఆదాయం
● నాటడానికి ఇదే సరైన అదును ● విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు, శుద్ధి తప్పనిసరి ● మధిర ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రుక్మిణీదేవి సలహాలు, సూచనలుమధిర: వానాకాలం సీజన్లో పెద్దసంఖ్యలో రైతులు అపరాల పంటలు సాగు చేస్తారు. ఇందులో పెసర, మిను ము, కంది ప్రధానంగా నిలుస్తున్నా యి. పప్పు ధాన్యాల సాగుతో భూసా రం పెరుగుతుంది. అంతేకాక ప్రధాన పంటగా పత్తిలో అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ మేరకు అపరాల సాగుకు విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలను మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.రుక్మిణీదేవి వెల్లడించారు. అనువైన రకాలు మినుము: ఎంబీజీ –207, ఎంబీజీ– 1070, డబ్ల్యూబీజీ– 26, పీయూ– 31, ఎల్ బీజీ– 752, ఎల్ బీజీ –787, టీబీజీ–104, జీబీజీ– 11. పెసర: ఎంజీజీ–95, ఎంజీజీ –385, ఎంజీజీ–348, ఎంజీజీ– 347, డబ్ల్యూజీజీ –42, డబ్ల్యూజీజీ –37, టీఎమ్– 96–2, వీపీఎమ్–2–14. నేల తయారీ, విత్తనశుద్ధి మినుము, పెరస సాగుకు జూన్ 1 నుంచి జూలై 15 వరకు అవకాశం ఉంటుంది. ఇందులో పెసర హెక్టార్కు 15–16 కిలోలు, మినుము 18–20కిలోల విత్తనాలు అవమసరమవుతాయి. ము రుగునీరు వెళ్లే వసతితో పాటు తేమను నిలుపుకోగలిగిన భూ ములు ఈ పంటల సాగుకు అనుకూలం. చౌడు భూములు పని కి రావు. వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో నేలను మెత్తగా తయారు చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో హె క్టార్కు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఎరువులను హె క్టార్కు వేసి కలియదున్నాలి. ఆపై కిలోవిత్తనాలను 3 గ్రా ముల థైరమ్ లేదా కాప్టాన్ లేదా మ్యాంకోజబ్ మందుతో శుద్ధి చేశాక 5 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 5 మి.ల్లీ. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధిచేసుకోవాలి. ఆపై విత్తేముందు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 10కిలోల విత్తనానికి పట్టిస్తే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. కంది : అనువైన రకాలు, జాగ్రత్తలు కంది సాగు చేసే రైతులు ఎంఆర్జీ–1004, ఐసీపీఎల్ –87119, పీఆర్ జీ–176, పీఆర్ జీ– 158, ఐసీపీ– 8863, డబ్ల్యూఆర్ జీ –121, డబ్ల్యూఆర్ జీ– 65, టీడీఆర్ జీ–4, డబ్ల్యు ఆర్ జీ–93, డబ్ల్యూఆర్ జీ– 255, టీడీఆర్ జీ–59 రకాలను ఎంచుకోవచ్చు. వెర్రి తెగులు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ఎల్ఆర్ జీ–105, టీఆర్ జీ–59, బీఎస్ఎంఆర్ –736, ఐసీపీఎల్–87119 రకాల సాగు మంచిది. అలాగే, గత పంట తాలూకు వెర్రి తెగులు సోకిన మొక్కలు, వాటి అవశేషాలను సమూలంగా నాశనం చేసేలా దుక్కులు చేయాలి. ఈ పంట సాగుకు మురుగునీరు వెళ్లే వసతిగల భూములు అనువైనవి. వేసవిలో తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో మెత్తగా దున్నాక ఆఖరి దుక్కిలో హెక్టార్కు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరముం ఇచ్చే ఎరువులు వేసి కలియదున్నాలి. విత్తడానికి ముందు 10కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చ ర్ పట్టించాలి. విత్తనాలు వేయడానికి జూన్, జూలై మాసాలు అనువైనవి. ఆగస్టు వరకు కూడా విత్తుకునే అవకాశం ఉన్నా మొక్కలు, సాళ్ల మధ్య దూరం తగ్గించాలి. ఎకరాకు 5–6 కిలో ల విత్తనాలు అవసరమవుతాయి. ఇక కంది పైరును 40–50 రోజులవరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. మొదట రెండు నెలల వరకు తరచుగా గొర్రు /దంతి సాయంతో అంతర కృషి చేయడం ద్వారా కలుపు నివారించవచ్చు. కలుపు బెడద ఎక్కువగా ఉంటే విత్తాక 24 గంటల్లోపు ఎకరానికి 1.0– 1.4 లీటర్ల పెండిమిథాలిన్ 200లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయా లి. అలాగే, కందిలో అంతర పంటగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, పెసర, మినుము, వేరుశనగ, సోయాచిక్కుడు, పత్తి లేదా పసుపు సాగు చేసుకోవచ్చు.అంతర కృషి, సస్యరక్షణ పెసర, మినుము పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. 20–30 రోజుల దశలో గొర్రు / దంతి ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారించడమే కాక తేమను నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూముల్లో విత్తగానే 24 గంటల్లోపు ఎకరాకు 1.0–1.40 లీటర్లు పెండిమిథాలిన్ 80శాతం ఈసీ 200 లీటర్లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాక తొలి దశలో చిత్తపురుగులు, తామర పురుగులు, తెల్ల దోమ, పేనుబంక, కాండపు ఈగ ఆశించే అవకాశముంది. ఇందులో కాండపు ఈగ నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లేదా డైమిథోయేట్ 2 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లేదా పిప్రోనిల్ 1.5 మి.లీ. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ.ను లీటర్ నీటికి, తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి ఎసిటామాప్రిడ్ 0.2 గ్రాములు, పేనుబంక నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ.ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే ఫలితం ఉంటుంది. -
ప్రైవేట్ పాఠశాల గోదాం సీజ్
సత్తుపల్లి: సత్తుపల్లిలోని నారాయణ స్కూల్లో అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ విషయమై తొలుత ఏఐఎస్ఎఫ్ నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఎంఈఓ తనిఖీలు చేపట్టి పుస్తకాలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించి గోదాంను సీజ్ చేశారు. ఈమేరకు ఎంఈఓ రాజేశ్వరరావు మాట్లాడుతూ నారాయణ స్కూల్తో సహా మరికొన్ని విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. నారాయణ స్కూల్పై ఫిర్యాదు అందడంతో గోదాంను సీజ్ చేసి డీఈఓకు నివేదిక ఇచ్చామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, టై, బెల్ట్లు, షూలు విక్రయిస్తున్నారని తెలిపారు. కాగా, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్ అమ్మకుండా అధికారులు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో శివనాయక్, వంశీ, మనోజ్, అన్నవరపు ఉపేంద్ర, రామకృష్ణ, దేవేందర్, రామ్చరణ్ పాల్గొన్నారు. అయితే, సత్తుపల్లిలోని పలు పాఠశాలల్లో నోట్పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్, టైలు, బెల్డ్లు, షూ అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తేనే తనిఖీలు చేపట్టడం, మిగతా స్కూళ్లపై దృష్టి సారించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే, పాఠశాలల తీరుతో తాము ఉపాధి కోల్పోతున్నామని దుకాణాల యజమానులు వాపోతున్నారు. -
సులువుగా కాపాడేలా..
● అగ్నిమాపకశాఖకు రెండు రెస్క్యూ బోట్లు ● శిక్షణ పొందుతున్న ఉద్యోగులుఖమ్మంక్రైం: గత ఏడాది మున్నేటికి అనూహ్యంగా వచ్చిన వరద ఖమ్మం కార్పొరేషన్తో పాటు ఖమ్మం రూరల్ మండలాల్లోని పలు కాలనీల ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో సహాయక చర్యలు చేపట్టడానికి బోట్లు, ఇతర సామగ్రి లేక యంత్రాంగానికి ఇక్కట్లు ఎదురయ్యాయి. ఈనేపథ్యాన ఈసారి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద ముంచెత్తితే ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా రాష్ట్ర అగ్నిమాపక శాఖ జిల్లాకు రెండు ప్రత్యేక రెస్క్యూ బోట్లను కేటాయించింది. జిల్లాకు రెండు ఐఆర్బీ బోట్లు... గత ఏడాది పరిస్థితుల దృష్ట్యా జిల్లా అగ్నిమాపక శాఖకు ఉన్నతాధికారులు రెండు ఐఆర్బీ(ఇన్ప్లేటబుల్ రెస్క్యూ బోట్లు)లను సమకూర్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బోట్ల ద్వారా నదులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నా అందులో చిక్కుకున్న వారిని సులువుగా తీసుకురావడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఒక్కో బోట్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వెళ్లి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చే అవకాశముంది. అంతేకాక బోట్లు, ఇతర సామగ్రిని వరద ప్రభావిత ప్రాంతాలకు చేర్చేలా ఒక వాహనాన్ని సైతం అగ్నిమాపక శాఖ కేటాయించింది.ఉద్యోగులకు శిక్షణ బోట్ల నిర్వహణ, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి తీసుకురావంతో ఇటీవల హైదరాబాద్లోని ఎన్డీఆర్ఎఫ్ కేంద్రంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పలువురికి విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. అంతేకాక స్థానిక పరిస్థితులు అవగాహన వచ్చేలా ఖమ్మంలోని మున్నేరుతోపాటు లకారం తదితర పెద్ద చెరువుల్లో బోట్ల ద్వారా శిక్షణ పొందుతున్నారు. మరిన్ని బోట్ల కోసం ప్రతిపాదించాం.. గత ఏడాది మున్నేరుకు వచ్చిన వరదల దృష్ట్యా జిల్లాకు ప్రత్యేక బోట్లు కావాలని కోరడంతో అగ్నిమాపకశాఖ అడిషనల్ డీజీ ినాగిరెడ్డి రెండు ప్రత్యేక బోట్లు కేటాయించారు. అయితే, జిల్లాకు మరిన్ని బోట్లు కావాలని కోరగా సానుకూలంగా స్పందించారు. వీటి ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంపై ఉద్యోగులకు శిక్షణ కొనసాగుతోంది. – అజయ్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి -
పెద్దాస్పత్రిలో లీకేజీలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో పలుచోట్ల పైపుల నుండి నీరు లీక్ అవుతోంది. వేతనాలు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో డ్రెయినేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. పైపుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి పలు వార్డుల్లో నీరు లీకేజీ అవుతోంది. కేవీకే కోఆర్డినేటర్ రవికుమార్ బదిలీ● వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్గా నియామకం వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ కె. రవికుమార్ బదిలీ అయ్యారు. ఆయనను భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్గా నియమించారు. అయితే, రవికుమార్ స్థానంలో కేవీకే కోఆర్డినేటర్గా ఎవరినీ నియమించలేదు. కేవీకేలో సీనియర్ శాస్త్రవేత్తకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఎస్బీఐ ఆధ్వర్యాన రక్తదానంఖమ్మంగాంధీచౌక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 70వ వ్యవస్థాపక వేడుకల్లో భాగంగా మంగళవారం ఖమ్మం మమత కాలేజ్ రోడ్డు బ్రాంచ్లో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 123 మంది ఎస్బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంక్ రీజినల్ మేనేజర్ బి.రాజేఖర్ మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడంలో రక్తదానం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మోహన్నాయక్, బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ ఏజీఎస్ షేక్ ఇబ్రహీం, రీజనల్ సెక్రటరీ ఆర్.శివకుమార్, హెచ్ఆర్ మేనేజర్ ఉదయ్, స్టాఫ్ యూనియన్ వైస్ ప్రసిడెంట్ నందన్, రీజనల్ సెక్రటరీ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొర్రెలు, గుర్రాల చోరీకి యత్నంముదిగొండ: మహబూబ్నగర్నుంచిమేత కోసం జీవాలను తీసుకురాగా, వాటిని చోరీ చేసేం దుకు దుండగులు యత్నించిన ఘటన ఇది. వివరాలి లా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పెంపకందారులు మేత కోసం తీసుకురాగా, మండలంలోని బాణాపురంలో ఓ రైతు పొలంలో సో మవారం రాత్రి నిద్రించారు. ఈక్రమాన టాటా ఏస్ వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు పెంపకందారుల వెంట ఉన్న రెండుగుర్రాలతో పాటు గొర్రెల చోరీకి యత్నించారు. గొర్రెల కాళ్లకు తాళ్లు కట్టి వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా కాపలాదారులు నిద్రలేచారు. దీంతో కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఆపై టాటా ఏస్ వాహనాన్ని కాపలాదారులు ద్విచక్రవాహనంపై వెంబడించి వల్లభి వద్ద అడ్డుకున్నా రు. దీంతో డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారు కాగా మంగళవారం పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో పాడిగేదెలు మృతికారేపల్లి: తెగి పడిన విద్యుత్ తీగలను తాకడంతో రెండు పాడిగేదెలు మృత్యువాత పడ్డాయి. కారేపల్లికి చెందిన రైతు ఇమ్మడి సీతారాములు తన రెండు పాడిగేదెలను సోమవారం మేతకు వదలగా సుబ్బయ్యకుంట చెరువు సమీపానికి వెళ్లాయి. అయితే, రాత్రి గేదెలు రాకపోవటంతో రైతు కుటుంబం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే, సుబ్బయ్యకుంటకు కాస్త దూరాన విద్యుత్ తీగలు తెగిపడి ఉండటం, వీటిని తాకిన పాడిగేదెలు మృతి చెందినట్లు మంగళవారం గుర్తించిన స్థానికులు సీతారాములుకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం గాలివానకు తీగలు తెగిపడి ఉంటాయని, మేతకు వెళ్లిన గేదెలు వాటిని తాకి మృత్యువాత పడ్డాయని భావిస్తున్నారు. వైన్స్ వద్ద ఘర్షణ, కత్తిపోట్లుఖమ్మంఅర్బన్: వైన్స్ వద్ద మందుబాబుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. ఖమ్మం విజయ డెయిరీ ఎదురుగా ఉన్న వైన్స్ వద్ద ఇందిరానగర్కు చెందిన మనీశ్ వైన్స్ వద్ద మద్యం సేవిస్తూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో టేకులపల్లి లక్ష్మీనగర్కు చెందిన మేడరాజుల వెంకటేశ్వర్లు ఇదేమిటని ప్రశ్నించగా వాగ్వాదం తలెత్తినట్లు సమాచారం. ఈక్రమంలోనే మనీష్కు ఆయన స్నేహితులు తోడై వెంకటేశ్వర్లుపై దాడి చేశారు. ఆపై వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మనీష్పై దాడి చేయగా ఆయన మెడపై తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత వెంకటేశ్వర్లు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కాగా, ఈ గొడవతో ఆ ప్రాంతంలో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. -
మున్సిపాలిటీల్లో పదోన్నతులు, బదిలీలు
● కేఎంసీ ఏఎంసీగా అనిల్కుమార్ ● మధిర, వైరా కమిషనర్లకు పూర్తిస్థాయి పోస్టింగ్ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలువురు ఉద్యోగులను బదిలీచేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. అలాగే, గ్రేటర్ వరంగల్ ము న్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ జె. అనిల్కుమార్కు పదోన్నతి కల్పించి కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు. అంతేకాకుండా మధిర, వైరా కమిషనర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఏ.సంపత్కుమార్, సీహెచ్.వేణును అక్కడే పూర్తి స్థాయి కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. గ్రేడ్–3 కమిషనర్గా పదోన్నతి పొందిన బి.నాగరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కమిషనర్గా నియమించారు. అంతేకాక పలు మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. కొత్తగూడెంలో పనిచేస్తున్న జె.సుజితకు కేఎంసీలో సీనియర్ అసిస్టెంట్గా, ఇల్లెందులో పనిచేస్తున్న బి.సుధీర్కు వైరాలో, కేఎంసీలో పనిచేస్తున్న డి.నాగరాజుకు కొత్తగూడెం కార్పొరేషన్లో, సత్తుపల్లిలో పనిచేస్తున్న బి.రామచంద్రుకు కేఎంసీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలాగే, ఇల్లెందులో పనిచేస్తున్న ఎం.వీరకుమారి, మధిరలో పనిచేస్తున్న ఆర్.నాగలక్ష్మి, కొత్తగూడెంలో పనిచేస్తున్న మూడ్ అశోక్, పి.సరస్వతికి పాత కేంద్రాల్లోనే పోస్టింగ్ ఇవ్వగా, మహబూబాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న కే.పీ.దిలీప్కుమార్ను సత్తుపల్లి సీని యర్ అసిస్టెంట్గా నియమించారు. -
గంజాయి రవాణాలో యువతులు
ఖమ్మంక్రైం: పోలీసులు, ప్రయాణికులకు అనుమానం రాకుండా అమ్మాయిలతో కొందరు అక్రమార్కులు గంజాయి రవాణా చేయిస్తునట్లు తేలింది. గంజాయి రవాణా సమాచారంతో ఎక్సైజ్ ఏఈఎస్ తిరుపతి ఆధ్వర్యాన మంగళవారం ఖమ్మం కొత్త బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక యువకుడు, ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగ్ల్లో పరిశీ లించగా రూ.2.50లక్షల విలువైన గంజాయి బయటపడింది. ఒడిశా నుంచి గంజాయితో బయలుదేరిన వారు బస్సులు మారుకుంటూ ఖమ్మం చేరుకుని, బెంగళూరుకు వెళ్లడానికి సిద్ధమైనట్లు గుర్తించారు. నిందితులు ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాకు చెందిన శుభకర్మండల్, కాజల్మండల్, శుశు లిశిల్గా గుర్తించిన ్సజ్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీహరిరావుతో పాటు ఉద్యోగులు కరీం, హరీష్, వెంకట్, సుధీర్, విజయ్కుమార్, ఉపేందర్, వీరబాబు, స్వరూప పాల్గొన్నారు. ఖమ్మం కొత్త బస్టాండ్లో పట్టుబడిన నిందితులు -
మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
ఖమ్మంక్రైం/ఖమ్మం అర్బన్: మాదక ద్రవ్యాల నిర్మూలనను అందరూ బాధ్యతగా భావించాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు సూచించారు. మాద క ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఖమ్మంలోని ఎస్ఆర్ కళాశాల, ఇంది రానగర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం స్లోగన్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు వారితో ప్రతిజ్ఞ చేయించాక అడిషనల్ డీసీపీ మాట్లాడారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితంలో సర్వం కోల్పోయినట్లేనని తెలిపా రు. ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. టీజీఎన్బీ డీఎస్పీ శ్రీధర్, సీఐలు విజయ్, భానుప్రకాష్ పాల్గొన్నారు. అలాగే, ట్రాఫిక్ పోలీసు ల ఆధ్వర్యాన న్యూవిజన్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారాయణ ఆర్ఐ సాంబశివరావు, ఎస్ఐలు రవి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
● సర్వర్ సతాయించింది..
సత్తుపల్లి: మూడు నెలలకు సరిపడా ఒకేసారి రేషన్ బియ్యం పంపిణీ క్రమాన సర్వర్ సతాయించడంతో డీలర్లు, లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. సత్తుపల్లిలోని చింతలపాటి వెంకటేశ్వరరావు రోడ్డులోని సాయికృష్ణ రేషన్షాపు పరిధిలో 815 రేషన్కార్డులు ఉన్నాయి. పోర్టబులిటీ విధానం అమలులో కొందరు ఇతర ప్రాంతాల్లో, బయటి వారు ఇక్కడ బియ్యం తీసుకుంటున్నారు. మంగళవారం వరకు 70 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండగా.. ఈ నెలాఖరు వరకు పంపిణీ చేస్తామని డీలర్ తెలిపారు. రోజూ కొద్ది మందే వస్తున్నారని పేర్కొన్నారు. -
రైతు భరోసా సంపూర్ణం
● తొమ్మిది రోజుల్లో పెట్టుబడి సాయం జమ ● జిల్లాలో 3.53లక్షల మంది రైతులకు రూ.436.84 కోట్లు ● రైతువేదికల్లో సీఎం ప్రసంగాన్ని వీక్షించిన అన్నదాతలు ఖమ్మంవ్యవసాయం: పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా పథకం ద్వారా జిల్లాలో అర్హులైన రైతులకు నగదు జమ అయింది. ఈనెల 16న ఎకరాకు రూ.6వేల నగదు జమ చేయడం మొదలుపెట్టగా తొమ్మిది రోజుల్లో మంగళవారం నాటికి పూర్తయింది. జిల్లాలో రైతు భరోసా పథకానికి 3,53,794 మంది రైతులను అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం, వారికి ఉన్న సాగు భూమి ఆధారంగా రూ.436,84,65,365 కోట్లను కేటాయించింది. సోమవారం నాటికి 15ఎకరాల వరకు భూమి కలిగిన 3,31,397 మంది ఖాతాల్లో రూ.406,36,62,570 జమ చేసిన ప్రభుత్వం మిగిలిన 22,397మంది రైతుల ఖాతాల్లో రూ.30,48,02,795 నగదును మంగళవారం జమ చేసింది. రైతు వేదికల ద్వారా విజయోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం జమ చేసిన సందర్భంగా మంగళవారం రైతు వేదికల ద్వారా విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. హైదరాబాద్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు పాల్గొనగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతువేదికల్లో వీక్షణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైతు వేదికల ద్వారా రైతులు, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కూసుమంచిలోని రైతు వేదికలో కలెక్టర్ అనుదప్ దురిశెట్టి, జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరోపక్క కాంగ్రెస్ ఆధ్వర్యాన గ్రామాల్లో సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం కూసుమంచి: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యాన జిల్లా రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కూసుమంచిలోని రైతు వేదికలో రైతు భరోసా సంబురాలకు హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3.53లక్షల మందికి రైతులకు పెట్టుబడి సాయంగా రూ.430 కోట్ల మేర జమ అయ్యాయని చెప్పారు. ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడైనా సమస్య ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే, రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య, సెరి కల్చర్ అధికారి ముత్యాలు, ఏడీఏ సరిత, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. -
తిప్పలు.. తప్పడం లేదు
● రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల అవస్థలు ● సర్వర్ సమస్యతో బియ్యం పంపిణీలో జాప్యం ● ఇంకొన్ని షాప్లకు స్టాక్ చేరక ఎదురుచూపులుసాక్షిప్రతినిధి, ఖమ్మం: రేషన్ దుకాణాల ద్వారా ఒకేసారి మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నా.. పంపిణీలో జాప్యం మాత్రం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. తొలుత ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడం, ఆతర్వాత సర్వర్ మొరాయింపు, స్టాక్ లేకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులు ఈనెల 20 వరకు తిప్పలు పడ్డారు. కొన్నిరోజుల పాటు చాలా దుకాణాలు మూసేసి ఉండడం, మరికొన్ని దుకాణాల్లో స్టాక్ లేకపోవడంతో షాప్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చింది. ఈనెల 30 వరకు బియ్యం పంపిణీ చేస్తామని చెబుతున్నా... ఈ–పాస్ యంత్రంలో మాత్రం ఈనెల 29 వరకే సరఫరా జరుగుతుందంటూ డిస్ప్లే వస్తుండడం గమనార్హం. ఈనేపథ్యాన జిల్లాలోని పలుచోట్ల రేషన్షాప్ల్లో ‘సాక్షి’ పరిశీలించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి. 85 శాతం పంపిణీ.. రేషన్ దుకాణాల ద్వారా మంగళవారం సాయంత్రం వరకు 85.22 శాతం లబ్ధిదారులకు బియ్యం పంపిణీ పూర్తయింది. జిల్లాలో మొత్తం 4,15,904 రేషన్కార్డులు ఉండగా.. 3,54,466 మంది కార్డుదారులకు బియ్యం అందించారు. అయితే, జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాల వారు పెద్దసంఖ్యలో స్థిరపడగా వారు పోర్టబులిటీ విధానంలో బియ్యం తీసుకున్నారు. దీంతో చాలా షాపుల్లో స్టాక్ అయిపోయి మిగతా లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈమేరకు డీలర్లు అదనపు స్టాక్ కోసం ఇండెంట్ పంపినా సరఫరాలో జాప్యం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనట్లు ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడం.. అదీ సన్నబియ్యం కావడంతో లబ్ధిదారులు దుకాణాల వద్ద బారులు దీరుతున్నారు. ఈనెల 20వరకు ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లు కనిపించాయి. జిల్లా కేంద్రంతో పాటు సమీప మండలాల్లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంటోంది. కాగా, కొందరు లబ్ధిదారులు రద్దీ తగ్గాక తీసుకోవాలనే భావనతో వేచిఉండగా ఇప్పుడు వారి సమీపంలోని షాప్లు మూతపడడంతో బియ్యం ఎప్పుడొస్తాయని ఆరా తీస్తున్నారు. -
ధాన్యం బోనస్.. మైనస్
ఏప్రిల్లో అమ్మినా... ఈ రైతు నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన మరికంటి శంకర్. రబీలో సన్నధాన్యం సాగు చేసిన ఈయన నేలకొండపల్లి మార్కెట్లో 150 క్వింటాళ్ల ధాన్యం అమ్మాడు. గత ఏప్రిల్లో విక్రయించగా మే నెలలో ధాన్యానికి సంబంధించి నగదు ఖాతాలో జమ అయింది. కానీ బోనస్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. వానా కాలం సాగు పనులు సాగుతున్నందున ఇప్పటికై నా బోనస్ చెల్లిస్తే పెట్టుబడికి ఉపయోగపడుతుందని ఎదురుచూస్తున్నాడు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గడిచిన యాసంగి సీజన్లో సన్న ధాన్యం సాగు చేసి ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. ధాన్యం సేకరణ పూర్తయి, కేంద్రాలు మూసివేసినా బోనస్ రాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. సీజన్లో 18,855మంది రైతులు 12,70,653 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని అనేక సమస్యల నడుమ విక్రయించారు. మద్దతు ధరకు తోడు బోనస్ వస్తుందని ఆశిస్తే ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు. జిల్లా రైతులకు రూ.63,53,26,800 చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడైనా విడుదల చేస్తే వానాకాలం పంటల సాగు అవసరాలకు ఉపయోగపడుతుందని నిరీక్షిస్తున్నారు. బోనస్తో పెరిగిన సాగు రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ చెల్ల్లిస్తామన్న ప్రకటనతో రైతులు యాసంగిలో సన్న రకాలే ఎక్కువగా సాగు చేశారు. సహజంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తుండగా, రైతులు తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. కానీ బోనస్ ప్రకటనకు తోడు నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు నాన్ ఆయకట్టులోని బోర్లు, బావుల కింద 2,10,830 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో సన్న రకాలే 1,29,064 ఎకరాల్లో సాగవయ్యాయి. 12.70 లక్షల క్వింటాళ్లు సేకరణ యాసంగిలో ఈసారి సన్న రకం, దొడ్డు రకం కలిపి 54,51,516 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోగా 25,84,928 క్వింటాళ్ల సన్న, దొడ్డు ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సన్న రకాలు 18,53,370 క్వింటాళ్లు ఉండగా.. 18,855 మంది రైతుల నుంచి 12,70,653.60 క్వింటాళ్ల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరించింది. ఆసరా అవుతుందని.. కష్టనష్టాల నడుమ సన్న రకాలు సేద్యం చేయగా, ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో అవస్థ పడ్డారు. అయినా రూ.500 బోనస్ వస్తుందని భావిస్తే నెలలు గడుస్తున్నా జమ కాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బోనస్ విషయమై విస్తృత ప్రచారం చేసిన ప్రభుత్వం అమ్మకాలు పూర్తికాగానే జమ చేస్తామని వెల్లడించింది. అయినా జిల్లా రైతులకు రూ.63,53,26,800 అందకపోగా, వానాలం సీజన్ ప్రారంభమైన తరుణాన స్పందించాలని కోరుతూ ప్రతిరోజు బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ చూసుకోవడం పరిపాటిగా మారింది.యాసంగి సీజన్ నగదు జమ కాక ఎదురుచూపులు జిల్లా రైతాంగానికి రూ.63.53 కోట్ల బకాయి ఎప్పుడు జమ అవుతుందోనని నిరీక్షణజిల్లాలో అత్యధికంగా బోనస్ కావాల్సిన మండలాల వివరాలు... మండలం రైతులు ధాన్యం (క్వింటాళ్లలో) రావాల్సిన నగదు నేలకొండపల్లి 3,450 2,39,889.60 రూ.11,99,44,800 తల్లాడ 1,888 2,32,940 రూ.11,64,70,000 కూసుమంచి 2,201 1,38,829.60 రూ.6,94,14,800 కల్లూరు 1,305 1,29,354.00 రూ.6,46,77,000 ముదిగొండ 1,979 1,00,090.80 రూ.5,00,45,400 వేంసూరు 1,410 74,749.60 రూ.3,73,74,800 పెనుబల్లి 1,052 67,555.60 రూ.3,37,77,800 తిరుమలాయపాలెం 1,282 66,666.40 రూ.3,33,33,200 సత్తుపల్లి 1,050 62,449.60 రూ.3,12,24,800 ఖమ్మంరూరల్ 983 40,340.40 రూ.2,01,70,200 అష్టకష్టాల నడుమ... సన్నధాన్యం విక్రయం సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంటాలు ఆలస్యమవుతుండడంతో రోజుల తరబడి పడిగాపులు కాశారు. ఇక తేమ శాతం పేరుతో క్వింటాకు 3 – 5 కేజీల వరకు తరుగు తీస్తామని మిల్లర్లు చెప్పగా, కాంటా పూర్తయ్యాక లారీలు అందుబాటులో లేక ఎదురు చూడాల్సి వచ్చింది. అదే సమయాన అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో మళ్లీ ఆరబెట్టారు. ఇలా అనేక అవాంతరాలు ఎదురైనా క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందనే ఆశలతో ప్రభుత్వ కేంద్రాల్లోనే ఎక్కువ మంది ధాన్యం విక్రయించారు. కొందరు మాత్రమే ఈ ఇబ్బందులు భరించలేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. -
ఏదులాపురం.. ఎప్పుడూ అంతే
● పీఏసీఎస్పై ఆది నుంచి ఆరోపణలు ● అవినీతితో గత చైర్మన్ సస్పెండ్ ● ప్రస్తుత చైర్మన్ రైతుల పేరిట రుణాలు తీసుకున్నాడనే ఆరోపణలతో విచారణఖమ్మంరూరల్: రూరల్ మండలంలోని ఏదులాపురం పీఏసీఎస్కు ఎంపికవుతున్న పాలకవర్గాల తీరుతో తరచుగా విమర్శలు వస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, మారుపేర్లతో రుణాల స్వాహా, రైతులకు రుణ మంజూరుకు పర్సంటేజీల వసూళ్లతో సొసైటీకి మచ్చలే మిగులుతున్నాయి. పాలకవర్గంలోని పలువురు ‘నీకు ఇంత.. నాకు ఎంత’ అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుత చైర్మన్ సొసైటీ పరిధిలోని పలువురు రైతులను మచ్చిక చేసుకుని రుణాలు ఇప్పించి.. ఆపై వాటా తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత చైర్మన్ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందగా చైర్మన్తో పాటు సీఈఓపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత చైర్మన్ నిర్వాకం ఏదులాపురం సొసైటీ నుంచి తమ పేరుతో చైర్మన్ జర్పుల లక్ష్మణ్నాయక్ రుణాలు తీసుకున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్న విషయం విదితమే. రైతుల సంతకాలు తీసుకుని రుణాలు ఇప్పించినా, వారికి చెప్పిన దాని కంటే ఎక్కువ రుణం తీసుకున్నట్లు ఆలస్యంగా గుర్తించారు. అంతేకాక ఆ రుణం చెల్లించాల్సిన పని లేదని, మాఫీ అవుతుందని ఆయన నమ్మబలికినట్లు సమాచారం. కానీ మాఫీ కాకపోవడంతో బకాయిలు చెల్లించాలని సొసైటీ ఉద్యోగులు నోటీసులు జారీ చేస్తుండగా రైతులు ఆందోళనతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ తాము రూ.50వేల రుణమే తీసుకుంటే రూ.లక్ష రుణం అప్పుగా చూపిస్తుండడంతో ఎటూ పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నామని వాపోయారు. సొసైటీ పరిధిలోని గుండాలతండా, గూడురుపాడు తదితర గ్రామాల రైతుల పేరిట దాదాపు రూ.50లక్షల మేర రుణాలను చైర్మన్ లక్ష్మణ్నాయక్ తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సొసైటీల అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉషశ్రీని విచారణకు నియమించడంతో ఆమె వారం క్రితం సొసైటీకి వచ్చి రైతుల వద్ద స్టేట్మెంట్ రికార్డు చేశారు. రైతుల పేరిట అందిన దరఖాస్తులు, వారికి మంజూరైన రుణం, అందులో ఎంత మేర చైర్మన్ తీసుకున్నాడనే వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణలో పురోగతి లేకపోవడంతో చైర్మన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తేలలేదు. మరోపక్క బాకీ చెల్లించాలని సొసైటీ ఉద్యోగుల నుంచి నోలీసులు వస్తుండడంతో ఉన్నతాధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.ఉన్నతాధికారులకు నివేదిక.. సొసైటీ చైర్మన్ లక్ష్మణ్నాయక్పై వచ్చిన ఆరోపణల మేరకు విచారణ చేపట్టాం. ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరించి స్టేట్మెంట్ రికార్డు చేశాం. ఆపై పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాం. తదుపరి చర్యలపై ఆదేశాలు రావాల్సి ఉంది. – ఉషశ్రీ, అసిస్టెంట్ రిజిష్ట్రార్ -
ప్రజావాణికి బారులు...
ఖమ్మం సహకారనగర్: సమస్యలపై ఫిర్యాదులు, ప్రభుత్వ పథకాల కోసం వినతిపత్రాలు స్వీకరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డే(ప్రజావాణి)కు జనం పోటెత్తుతున్నారు. మండల స్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నా జిల్లా కేంద్రంలోనైతే కలెక్టర్ దృష్టికి నేరుగా సమస్యను తీసుకెళ్లవచ్చని భావిస్తుండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో వారం వారం ఇక్కడ ఫిర్యాదులు, వినతుల సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇందులోనూ చాలా మంది రెండు, మూడుసార్లు విన్నవించినా పరిష్కారం కాక అదే సమస్యపై మళ్లీమళ్లీ ఫిర్యాదులు ఇస్తుండడం గమనార్హం. ప్రజావాణి ఇలా... కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి బాధ్యతలు స్వీకరించాక గత సోమవారం తొలిసారి ప్రజావాణికి హాజ రయ్యారు. ఈక్రమంలో ఆయన ఫిర్యాదుల ఆన్లైన్, పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. మండల స్థాయిలో సమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులు సమీక్షించాలని తెలిపారు. ఏవైనా సమస్యలు పరిష్కరించలేకపోతే అందుకు కారణాలను వివరించాలని సూచించారు. అంతేకాక ప్రతీ సోమవారం ప్రజావాణికి ముందు గత వారం ఫిర్యాదులపై సమీక్షించాలని ఆదేశించారు. దీంతో ఈ వారం అధికారులు సమీక్షించి పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. ఇక సోమవారం సైతం గ్రీవెన్స్ డేకు హాజరైన కలెక్టర్ అనుదీప్.. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు కొన్ని.. ● ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డులో కొప్పు ప్రభావతి, కొప్పు పద్మావతి, కొప్పు సంపత్కుమార్కు 4,716 చదరపు గజాల స్థలం ఉండగా, అందులో 616 గజాల్లో నగరపాలక సంస్థ అధికారులు పార్క్ నిర్మించారని ఫిర్యాదు చేశారు. తమ భూములు తిరిగి ఇప్పించాలని కోరారు. ● చింతకానికి చెందిన దివ్యాంగుడు పి.జగన్నాథం సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరారు. ● పువ్వాడ ఉదయ్నగర్ కాలనీ గ్రామకార్యదర్శి అక్రమాలకు పాల్పడుతుండగా, గతంలోనూ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వీర నారీమణుల ఆశయసాధన సమితి బాధ్యులు తెలిపారు. ఆయనను బదిలీ చేయాలని వినతిపత్రం అందజేశారు. రెండు గదుల్లో ఏడుగురం.. నేను కూలీ పనులతో జీవనం సాగిస్తున్నా. రెండు గదులు ఉన్న అత్త గారింట్లో ఉంటుండగా... ఇందిరమ్మ ఇంటి పథకంలో నన్ను ఎల్–3 కింద చేర్చారు. రెండు గదుల్లో ఏడుగురు ఉంటూ ఇబ్బంది పడుతున్నందున మొదటి విడతలో ఇల్లు మంజూరు చేయాలి. – రేగళ్ల నాగమణి, తాటిపుడి, వైరా మండలంస్థలం ఆక్రమణ, అమ్మకం వారసత్వంగా నాకు, నా సోదరుడికి ఆరు కుంటల ఇంటి స్థలం రావాల్సి ఉంది. కానీ ఇంకో సోదరుడు, ప్రభుత్వ ఉద్యోగి హలావత్ వెంకన్న మమ్ముల్ని బెదిరించి స్థలాన్ని ఇతరులకు అమ్మాడు. అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – హలావత్ సీత్లా, రత్యా, కోక్యాతండానా భూమి ఇప్పించండి చింతకాని మండలం అనంతసాగర్లో ఎనిమిది కుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి 277 సర్వేనంబర్లో ఉంటే, 278గా చెబుతూ సైదులు ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావుకు విక్రయించాడు. అధికారులు పరిశీలించి భూమి ఇప్పించాలి. – పాశం సైదులు, రామకృష్ణాపురం కొన్ని సమస్యలపై పదేపదే ఫిర్యాదులు అయినా పరిష్కారం కాక ఆవేదన -
అదుపు తప్పిన ద్విచక్రవాహనం
కారేపల్లి: ద్విచక్రవాహనం అదుపుతప్పగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని ఉసిరి కాయలపల్లికి చెందిన ఎస్డీ.అమీర్(52), భాగ్యనగర్తండా గ్రామానికి చెందిన గుగులోతు మంగు సోమవారం మాదారం జరగనున్న సీపీఐ మండల మహాసభ ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం బైక్పై వెళ్లారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వారిద్దరు ఉసిరికాయలపల్లి వైపు వస్తుండగా జమాళ్లపల్లి వద్దద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది.ఈ ఘటనలో అమీర్ అక్కడికక్కడే మృతి చెందగా, మంగుకు తీవ్రగాయాలై స్పృహ కోల్పోయాడు. అర్ధరాత్రి కావడంతో ఆ మార్గంలో ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. సోమవారం ఉదయం మంగుకు స్పృహ రాగా 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చేరుకుని అమీర్ మృతదేహంతో పాటు మంగును ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. మృతుడు అమీర్ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తుండగా, మంగు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. కాగా, అమీర్ మృతితో సీపీఐ మండల మహాసభను వాయిదా వేయగా, ఆయన మృతదేహం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. నాయకులు భాగం హేమంతరావు, యర్ర బాబు, ఏపూరి లతాదేవి, శివరామ్, సారయ్య, ఉంగరాల సుధాకర్, ధన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒకరు మృతి, మరొకరికి గాయాలు -
చిరు వ్యాపారులతో సంఘాలు
● కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కొత్త సీఐజీల ఏర్పాటు ● మెప్మా ఆధ్వర్యాన సంఘాల నిర్మాణంఖమ్మంమయూరిసెంటర్: పట్టణ పేదల జీవనోపాధిని మెరుగుపర్చడమే లక్ష్యంగా మెప్మా తమ 100 రోజుల ప్రణాళికలో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీధి వ్యాపారుల కోసం కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్లు (సీఐజీ) ఏర్పాటు చేయించడం ఈ కార్యక్రమ లక్షంగా చెబుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వీధి వ్యాపారులకు సంఘాల ఏర్పాటుతో వారి జీవితాల్లో మార్పులు వస్తాయని, ఆర్థిక స్వావలంబనకు మార్గం ఏర్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 284 సీఐజీల ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 57 గ్రూప్లను ఏర్పాటు చేశారు. పదేసి మందితో... ఒకే రకమైన వ్యాపారం చేసేవారు లేదా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేసే వీధి వ్యాపారులను కలిపి గ్రూప్గా ఏర్పాటుచేస్తారు. కూరగాయలు, పండ్లు, చిరుతిళ్లు, వస్త్రాలు ఇలా ఒకే కేటగిరీకి చెందిన వారు, ఒకే వీధిలో తోపుడు బండ్లు, చిన్న బడ్డీ కొట్ల ద్వారా వ్యాపారం చేసేవారిపై దృష్టి సారించారు. ఒక్కో గ్రూప్లో ఐదు నుంచి 10 మంది సభ్యులు ఉండేలా చూస్తున్నారు. ఆర్థిక సాయం.. వీధి వ్యాపారులతో సీఐజీలను ఏర్పాటుచేశాక మెప్మా ఆధ్వర్యాన బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించే వీలుంటుంది. వీధి వ్యాపారులు వ్యక్తిగత రుణం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యాన సంఘంగా ఏర్పడితే బ్యాంకుల నుండి లింకేజీ రుణాలు సులువుగా మంజూరు కానున్నాయి. ఒక్కో గ్రూప్కు రూ.లక్ష వరకు రుణం మంజూరయ్యే అవకాశమున్నందున వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాక సీఐజీలు ఏర్పడ్డాక వీధి వ్యాపారులకు వ్యాపార నైపుణ్యాలు, కొత్త పద్ధతులపై శిక్షణ ఇప్పిస్తారు. అలాగే, ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్న వ్యక్తులు గ్రూప్గా ఏర్పడడం ద్వారా మానసిక మద్దతు ఇచ్చిపుచ్చుకుంటారని.. వారి సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకునేలా వీలు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సీఐజీల లక్ష్యం, ఏర్పాటు స్థానిక సంస్థ సీఐజీల ఏర్పాటైన లక్ష్యం సీఐజీలు ఖమ్మం కార్పొరేషన్ 218 30 మధిర 23 08 సత్తుపల్లి 22 09 వైరా 21 10 -
నెమలి!
నగర వీధుల్లో ఖమ్మం 15వ డివిజన్ పుట్టకోట వీధుల్లోకి తరచుగా ఓ నెమలి వస్తోంది. పుట్టకోట శివార్లలో ఉన్న వెలుగుమట్ల అటవీ పార్క్ ప్రాంతం నుంచి ఈ నెమలి వస్తోందని భావిస్తున్నారు. ప్రస్తుత వాతావరణంతో పరిస్థితుల్లో పురివిప్పి తిరుగుతున్న నెమలిని స్థానికులు ఆసక్తిగా చూస్తూ సెల్ఫోన్ కెమెరాల్లో బంధిస్తున్నారు. – ఖమ్మం అర్బన్ -
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
పోలీసు కమిషనర్ సునీల్దత్ ఖమ్మంక్రైం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తద్వారా మంచి భవిష్యత్ ఏర్పర్చుకోవచ్చని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా ఖమ్మం రిక్కాబజార్ పాఠశాలలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిగరెట్లు, గంజాయి, మద్యం వంటివి సరదాగా మొదలైనా ఆ తర్వాత వాటికి బానిసలైతే జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే సమాజం ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందని చెప్పారు. ఈమేరకు మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎక్కడైన గంజాయి, డ్రగ్స్ వంటి వినియోగం, అమ్మకాల సమాచారం తెలిస్తే 1908, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో నగర ఏసీపీ రమణమూర్తి, సీఐ బాలకృష్ణ, ఎంఈఓ శైలజలక్ష్మి, హెచ్ఎం విశ్రాంత, ఉపాధ్యాయులు కట్టా శేఖర్రావు, సుజాత, ఉమాదేవి, పోలీసు ఉద్యోగులు పాల్గొన్నారు. -
క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయికి ఎదగాలి
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదిగి సత్తా చాటాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం వద్ద ఒలింపిక్ డే రన్ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ నిరంతర శిక్షణ ద్వారా ప్రతిభ కనబర్చాలని తెలిపారు. అనంతరం డీవైస్ఓ టి.సునీల్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్య మాట్లాడారు. కాగా, పటేల్ స్టేడియం వద్ద మొదలై ఇల్లెందు క్రాస్ రోడ్, కోర్టు, మమత హాస్పిటల్ రోడ్డు మీదుగా లకారం ట్యాంక్ బండ్ వరకు కొనసాగగా పెద్దసంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఐఈఓ రవిబాబు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్ బాబుతో పాటు క్రీడాసంఘాల ప్రతినిధులు ఎన్.ఉప్పల్రెడ్డి, సీహెచ్.రవికుమార్, రఘునందన్, గోవిందరెడ్డి, ఎన్.రాధాకష్ణ, కె.ఆదర్శ్కుమార్, వీవీఎస్.మూర్తి, ఎం.డీ.మతిన్, శ్రీనివాస్, ఎం.డీ.గౌస్, సురేష్, పరిపూర్ణాచారి, కొంల్, నగేష్, చంద్రాకాంత్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ రన్లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
అమెరికాది యుద్ధోన్మాదం..
వైరా: సామ్రాజ్యవాద ఆధి పత్యం కోసమే కాక యుద్ధోన్మాదంతో ఇరాన్పై అమెరికా దాడులకు పాల్ప డిందని.. ఈ దాడులు అంతర్జాతీయ ఉద్రిక్తతలను పెంచుతుండగా, భారతీయులు సైతం నష్టపోయే ప్రమాదం ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. వైరా పట్టణ, కొణిజర్ల మండల పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణా తరగతులను సోమవారం ఆయన వైరాలో ప్రారంభించి ప్రసంగించారు. ఇరాన్ ఆణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు అధారాలు లేవని అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థలు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించినా ట్రంప్ ఇజ్రాయిల్కు మద్దతుగా ట్రంప్ ఇరాన్పై దాడులు చేయించాడని ఆరోపించారు. ఇరాన్ను ధ్వంసం చేసి పశ్చిమాసియాను ఆక్రమించుకోవడం ద్వారా అంతర్జాతీయ చమురు వనరులను దోచుకుని ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనేది అమెరికా లక్ష్యంగా తెలుస్తోందన్నారు. అయితే, ఈ దాడులను పలు దేశాలు ఖండించినా భారత ప్రధాని మోదీ స్పందించకపోవడం బీజేపీ ధ్వంద్వ నీతికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేయడంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువులపై ప్రభావం పడుతుందని వీరభద్రం పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, నాయకులు తాళ్లపల్లి కృష్ణ, మాచర్ల భారతి, బండి రమేష్, చింతనిప్పు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికవర్గాన్ని విస్మరిస్తే పతనం తధ్యంసత్తుపల్లిరూరల్: కార్మిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి చలమాల విఠల్రావు పేర్కొన్నారు. వచ్చేనెల 9న జరనున్న సార్వత్రిక సమ్మె విజయవంతానికి సత్తుపల్లి లో సోమవారం నిర్వహించి న సమావేశంలోసాయన మాట్లాడారు. కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగులతో పాటు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈమేరకు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈసమావేశంలో నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, మోరంపూడి పాండురంగారావు, మట్టపర్తి సత్యనారాయణ, ఎలగం కృష్ణ, శ్రీనివాసరావు, సైదా, యాకోబు, మస్తాన్, రవి, రాము, సత్యనారాయణ, భాస్కర్, రమేష్, సురేష్ పాల్గొన్నారు. కోల్డ్ స్టోరేజ్ల్లోనే మిర్చి అమ్ముకుంటాం..తల్లాడ: మార్కెట్లోనే మిర్చి విక్రయించాలని రైతులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని పలువురు పేర్కొన్నారు. ఈమేరకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యాన మండలంలోని అన్నారుగూడెం కోల్డ్స్టోరేజీల వద్ద మంగళవారం జరిగిన రాస్తారోకోలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సంఘ్ రాష్ట్ర కార్యదర్శి మందరపు రామారావు, జిల్లా అధ్యక్షుదు శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు కోల్డ్ స్టోరేజ్లో మిర్చి అమ్మితే రూ.లక్షకు రూ.1.50 కమీషన్ తీసుకొని నగదు చెల్లిస్తున్నారని తెలిపారు. అదే వైరా మార్కెట్కు వెళ్తే శాంపిళ్లు తీసుకెళ్లాక నచ్చితే మరుసటి రోజు తీసుకురావాలని సూచిస్తుండగా, లక్షకు రూ.3 నుంచి రూ.5 కమీషన్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈమేరకు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో అమ్ముకునే అవకాశం కల్పించాలని, మార్కెట్ యార్డ్ నుంచి కోల్డ్ స్టోరేజీలకు పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రాస్తారోకోతో పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోగా పోలీసులు నచ్చచెప్పి విరమింపజేశారు. ఆతర్వాత అనుమతి లేకుండా రాస్తారోకో చేయడంపై నాయకులు మందరపు రామారావు, ప్రగడవరపు శ్రీనివాసరావుతో పాటు కట్టా ఖాదర్బాబా, బండారు సత్యనారాయణ, కొండపల్లి నరేష్పై తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. -
కలెక్టర్ను కలిసిన ఉద్యోగ సంఘాల బాధ్యులు
ఖమ్మం సహకారనగర్: కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ దురిశెట్టిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యాన టీజీవోస్, టీఎన్జీవోస్ బాధ్యులు కలిశారు. కలెక్టరేట్లో సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదన శ్రీని వాస్, టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులుగా నాగిరెడ్డిఖమ్మం సహకారనగర్: టీపీటీఎఫ్ వెలువరించే ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులుగా పి.నాగిరెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. గతంలో నాగిరెడ్డి టీపీటీఎఫ్ మండల, జిల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈసందర్భంగా ఆయనకు టీపీటీఎఫ్ నాయకులు మనోహర్రాజు, రామారావు, ఎస్.విజయ్ అభినందనలు తెలిపారు. ఐఎఫ్ఎస్గా ఎంపికై న యువకుడికి సన్మానంవైరారూరల్: మండలంలోని రెబ్బవరం గ్రా మానికి చెందిన చరణ్తేజ ఇటీవల విడుదలైన యూపీపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో 231 ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్గా ఎంపికయ్యా డు. ఈ సందర్భంగా ఆయనను సోమవారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయులు, స్థానికులు సన్మానించారు. అనంతరం చరణ్తేజ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేలా శ్రమించాలని సూ చించారు. ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ హెచ్ఎం గంగవరపు వెంకట్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పబ్లిక్ స్కూళ్ల పేరుతో విలీనం సరికాదుఎర్రుపాలెం: పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటుచేస్తామంటూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం గర్హనీయమని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు పేర్కొన్నారు. విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యేలా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం పీఆర్టీ యూ సభ్యత నమోదు ప్రచారం చేశారు. ఈసందర్భంగా రంగారావు మాట్లాడుతూ కొత్త పింఛన్ విధానం రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తోందని తెలిపారు. పీఆర్టీయూ మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మదన్మోహన్రెడ్డి, ఎం.బాబురావుతో పాటు ఆర్.బ్రహ్మారెడ్డి,జంగాగురునాధరెడ్డి, శెట్టిపల్లి సం గిరెడ్డి, డి.లింగయ్య, లక్ష్మారెడ్డి, అప్పిరెడ్డి, శ్రీని వాసరెడ్డి, వెంకటనారాయణ, నర్సింహారా వు, రాఘవరావు, నాగరాజు, రమేష్ పాల్గొన్నారు. ఆయిల్పామ్ మొక్కలపై సమగ్ర నివేదిఅశ్వారావుపేట: ఉమ్మడి జిల్లాలోని అశ్వారావు పేట, సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీల ద్వారా రైతులకు పంపిణీ చేసిన ఆయిల్పామ్ మొక్కలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ సూచించింది. ఈ రెండు నర్సరీల ద్వారా ఇచ్చిన మొక్కల్లో ఆఫ్టైప్ రావడంతో రూ.లక్షల్లో నష్టపోయామని పలువురు రైతులు ఎస్టీ కమిషన్కు ఇటటీవల ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం హైదరాబాద్లో ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ విచారణ చేపట్టారు. ఆయిల్ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో పాటు బాధిత రైతులు హాజరవగా 2016 – 2022 మధ్యలో పంపిణీ చేసిన ఆయిల్పామ్ మొక్కల ఎదుగుదల, దిగుబడిపై సమగ్ర నివేదిక నెలలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి సందర్శనకు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ విచారణకు ఉద్యానశాఖ కమిషనర్ యాష్మిన్ బాషా, ఆయిల్ఫెడ్ ఎండీ శంకరయ్య, ఓఎస్డీ అడప కిరణ్, ప్రవీణ్రెడ్డితో పాటు జిల్లా రైతులు కారం శ్రీరాములు, మడివి బాలరాజు, కొండ్రు మురళి, చెలికాని వెంకట్, తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
వాటాధనం నుంచి వాటా..
● సొసైటీలకు ఆరు శాతం డివిడెంట్గా చెల్లించేందుకు నిర్ణయం ● ఫలితంగా రూ.103 కోట్లలో రూ.6 కోట్లు అందే అవకాశం ● రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం డీసీసీబీలో అమలుఖమ్మంవ్యవసాయం: సహకార బ్యాంకుల మనుగడకు మూలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)ల బలోపేతానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నడుం బిగించింది. సహకార వ్యవస్థలో కీలకమైన పీఏసీఎస్లకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాటాధనంలో కొంత మేర చెల్లించాలని నిర్ణయించింది. సహకార సంఘాల సభ్యులకు డీసీసీబీ నుంచి ఏటా పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు మధ్య కాలిక, దీర్ఘ కాలిక రుణాలను ఇస్తున్నారు. ప్రతీ రుణంలో 10 శాతం వాటాధనాన్ని అప్పులో భాగంగా తమ వద్దే డిపాజిట్ చేస్తారు. ఇందులో నుంచి ఆరు శాతాన్ని డివిడెంట్ రూపంలో పీఏసీఎస్లకు అందించాలని డీసీసీబీ పాలకవర్గం తాజాగా నిర్ణయించింది. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ఖమ్మం జిల్లాలో 75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రెండేసీ పీఏసీఎస్లతో పాటు 176 వ్యవసాయేతర పరపతి సంఘాలు ఉన్నాయి. అంతేకాక బ్యాంకు 50 బ్రాంచ్లతో రూ.3,600 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. ఏటా సుమారు రూ.1,200 కోట్ల పంట రుణాలు, రూ.900 కోట్లు డిపాజిట్లు కొనసాగుతుండగా, వ్యవసాయ అవసరాలకే కాక బంగారు తాకట్టుపై, గృహ నిర్మాణం, వాహన, విద్య అవసరాలకు కూడా రుణాలు ఇస్తున్నారు. డివిడెంట్గా ఆరు శాతం సహకార సంఘాల ద్వారా అందించిన పంట రుణాలు, ఇతర మధ్య కాలిక, దీర్ఘ కాలిక రుణాల ద్వారా వాటాధనంగా రూ.103 కోట్ల నిధులు ఉన్నాయి. ఇందులో నుంచి ఆరు శాతం అంటే రూ.6 కోట్ల మేర సహకార సంఘాలకు డివిడెంట్ రూపంలో చెల్లించేలా తీర్మానించారు. ఈ నిధులతో సంఘాలు తిరిగి సంఘ సభ్యులకే లబ్ధి జరిగేలా ఖాతాల్లో అప్పు కింద జమ చేసుకునే అవకాశం ఉంది. లేదంటే దీర్ఘకాలిక అవసరాల కోసం గోదాంలు, కోల్డ్ స్టోరీజీలు నిర్మించే ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. 100 సంఘాలకు ప్రయోజనం వాటాధనం నుంచి ఆరు శాతం డివిడెంట్ రూపంలో డీసీసీబీ చెల్లిస్తుండగా, బ్యాంకు పరిధిలోని 100 సహకార సంఘాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. వాటాధనంగా జమ అయిన మొత్తం రైతులు తీసుకున్న పంట రుణాల ద్వారా సమకూరగా, ఆ వాటాధనం రైతులదే కావడంతో అన్నదాతలతో పాటు సహకార సంఘాలకు ప్రయోజనం కలిగేలా డీసీసీబీ పాలక వర్గం డివిడెంట్ చెల్లింపునకు నిర్ణయించింది. సొసైటీల బలోపేతమే లక్ష్యం పీఏసీఎస్ల బలోపేతమే లక్ష్యంగా సంస్కరణలు అమ లు చేస్తున్నాం. బ్యాంకు ఎదుగుదలకు కీలకమైన పీఏసీఎస్ల నుంచి రైతులు తీసుకున్న రుణాల్లో వాటాధనం సేకరిస్తున్నాం. అందులో నుంచి ఆరు శాతం డివిడెంట్గా సంఘాలకు చెల్లించేందుకు పాలకవర్గం నిర్ణయించింది. –ఎన్.వెంకటఆదిత్య, సీఈఓ, డీసీసీబీ తొలిసారి ఇక్కడే.. రాష్ట్రంలో తొమ్మిది డీసీసీబీలు ఉండగా, ఖమ్మం డీసీసీబీ మాత్రమే వాటాధనంలో ఆరు శాతాన్ని సహకార సంఘాలకు డివిడెంట్గా చెల్లించాలని నిర్ణయించడం విశేషం. 105 ఏళ్ల చరిత్ర కలిగిన డీసీసీబీ అనేక సంస్కరణలను తీసుకురాగా, ఒడిదుడుకులు, లాభ నష్టాలను అధిగమిస్తూ రైతులు, ఇతర వర్గాలకు అండగా నిలుస్తోంది. 2023 – 24 నుంచి బ్యాంకు లాభాల్లో పయనిస్తుండగా, 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో రూ.9.64 కోట్ల లాభాలు గడించింది. ఈ నేపథ్యాన బ్యాంకు మనుగడకు మూలమైన పీఏసీఎస్లకు ప్రయోజనం కలిగేలా వాటాధనం చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. -
ఇక నిశ్చింతగా ఉండేలా..
కుటుంబీకులతో మాట్లాడేలా.. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మొత్తం 34 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉండగా వాటిలో 9 బాలుర, 25 బాలికల పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఫోన్ సౌకర్యాన్ని కల్పించింది. తొలిసారిగా ఇంటిని వదిలి గురుకులాల్లో చేరే వారు ఒత్తిడికి గురవుతుంటారు. ఒంటరిగా ఉన్నామని బాధపడుతుంటారు. వీరి బాధలను గుర్తించిన సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి ఫోన్మిత్రను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉండనుంది. ప్రతీ విద్యార్థికి కాలింగ్ కార్డు.. ప్రతీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టెలిఫోన్ బాక్స్లను ఏర్పా టు చేశారు. విద్యార్థులకు కాలింగ్ కార్డులను కేటా యించారు. దీని ద్వారా ముందుగా నమోదు చేసుకున్న తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల యోగక్షేమాలను తెలుసుకోవచ్చు. అధికారుల దృష్టికి.. గురుకులాలలో ఏర్పాటు చేసిన ఫోన్ సౌకర్యం కేవలం ఫోన్ చేసుకోవడానికే కాదు.. విద్యార్థులకు ఒక సైకా లాజికల్ సేఫ్టీ నెట్గా ఉపయోగపడనుంది. కార్డులో ఏఐ ఆధారిత చాట్ బాక్స్తో ఉన్న నంబర్ ఆధారంగా ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు ఉంటే సంబంధిత అధికారికి నేరుగా సందేశం పంపవచ్చు. లేదంటే సొసైటీ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్కు ఫోన్ వెళ్తుంది. తద్వారా సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. ‘ఫోన్మిత్ర’ పేరిట గురుకులాలలో ఫోన్ సౌకర్యం ఇందుకు విద్యార్థులకు కాలింగ్ కార్డుల అందజేత తీరిన తల్లిదండ్రుల బాధలు ఉమ్మడి జిల్లాలో 34 గురుకులాల్లో ఏర్పాటుఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించాక ఇంటిబాట పట్టిన సమయాన వారితో కనీసం మాట్లాడటానికి ఫోన్ కూడా లేదని ఎంతో మదనపడేవారు. అలాగే విద్యార్థులు సైతం తల్లిదండ్రుల సమాచారం కోసం బెంగపడేవారు. కొందరు అక్కడ ఉండలేక ఇంటిబాట పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే కాలానుగుణంగా ప్రభుత్వం గురుకులాల్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పించి నాణ్యమైన బోధన అందించడంతో పాటు విద్యార్థుల యోగక్షేమాలు, ఇతర విషయాలను తల్లిదండ్రులకు చేరవేసేందుకు ఫోన్మిత్ర పేరిట ఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతీ విద్యార్థికి ఒక కాలింగ్ కార్డు ఇవ్వనుంది. – నేలకొండపల్లి -
కొన్నే భళా.. మరిన్ని డీలా
● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు అంతంతే ● జిల్లా కేంద్రంలో మాత్రం ఆశాజనకంగా చేరికలు ● మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో దక్కని ఫలితం ప్రవేశాలు పెంచేలా చర్యలు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా కొన్ని అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. –రవిబాబు, డీఐఈఓ ప్రచారం చేస్తున్నాం.. విద్యార్థుల ప్రవేశాలు పెంచేలా ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. దీని ద్వారానే ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో అందుతున్న విద్య, పాఠ్యపుస్తకాలు, సౌకర్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రవేశాలు పెంచుతున్నాం. –ఆర్.గోవిందరావు, ప్రిన్సిపాల్, శాంతినగర్ జూనియర్ కళాశాల, ఖమ్మంఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగడం లేదు. అధికారులు ఆది నుంచీ ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు రావడం లేదు. పలు కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది గతేడాది చివరి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని పదో తరగతి విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే ఖమ్మం నగరంలోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు అధికంగా ఉండగా.. మిగతా చోట్ల మాత్రం అరకొరగానే నమోదయ్యాయి. 1,632 మంది చేరిక.. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. ఇప్పటి వరకు 1,632 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. ఇందులో జనరల్ విభాగంలో 1,127, ఒకేషనల్లో 505 మంది విద్యార్థులు చేరారు. ఖమ్మంలోని ఏఎస్ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో 310 మంది చేరగా.. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 186 మంది, నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 166 మంది, కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 161 మంది, నయాబజార్ జూనియర్ కళాశాలలో 131 మంది ప్రవేశాలు పొందారు. కాగా, గతేడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాంతినగర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి ప్రతిభ చాటారు. దీంతో ఈ కళాశాలకు ఈసారి ఆదరణ లభించినట్లు తెలుస్తోంది. 31 వరకే గడువు.. గత నెల నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు విస్తృత ప్రచారం నిర్వహించిన అధ్యాపకులు.. ఈనెల ఒకటో తేదీ నుంచి కళాశాలలను పునఃప్రారంభించారు. కాగా, ప్రవేశాల గడువు ఈ నెల 31 వరకే ఉంది. జిల్లాలోని 21 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులతోపాటు ఒకేషనల్కు సంబంధించి మొత్తంగా 8,882 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉండగా.. ఇప్పటి వరకు 1,632 మంది మాత్రమే చేరడం గమనార్హం. గతేడాది సుమారు 3,500 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందగా.. ఈసారి అంతమంది విద్యార్థులు చేరే అవకాశం లేదనే చర్చ సాగుతోంది. సమయం గడుస్తున్నా అడ్మిషన్లు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. అతి తక్కువ ఇక్కడే.. జిల్లాలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో చాలా తక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు ఇద్దరే చేరగా.. కామేపల్లి జూనియర్ కళాశాలలో ఐదుగురు, కందుకూరు బండి సీతారత్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 మంది, కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 15 మంది, ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 29 మంది, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కళాశాలలో 33 మంది, సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 48 మంది మాత్రమే చేరారు. మిగతా కళాశాలల్లో 50కి పైగా ప్రవేశాలు జరిగినా కేటాయించిన సీట్లతో పోలిస్తే పావు వంతు కూడా చేరలేదు. అయితే అధికారులు మాత్రం కొన్ని అడ్మిషన్లు ఆన్లైన్ చేయాల్సి ఉందని చెబుతుండటం గమనార్హం. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. కూచిపూడి నృత్యంలో చిన్నారి ప్రతిభఖమ్మంరూరల్ : మండలంలోని సూర్యనగర్కు చెందిన చిన్నారి గండికోట భువనచంద్రిక కూచిపూడి నృత్యంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్లో జరిగిన నృత్య పోటీల్లో పాల్గొన్న భువన.. మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో బాసర సరస్వతి అమ్మవారి అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా భువనను పలువురు అభినందించారు.మధిర – విజయవాడ బస్సు సర్వీస్ షురూ మధిర: మధిర డిపో పరిధిలోని జమలాపురం నుంచి మైలవరం మీదుగా విజయవాడకు నూతన బస్సు సర్వీస్ను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ డి.శంకర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ట్రిప్పులు సర్వీస్ ఉంటుందని, మధిర నుంచి ఉదయం 6, 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బయలు దేరుతుందని, విజయవాడ నుంచి ఉదయం 8.30,మధ్యాహ్నం 1.30, సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. బైక్ను ఢీకొట్టిన కారు చింతకాని: మండలంలోని నాగులవంచ సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఏపీలోని చిల్లకల్లు, చిట్యాల దేవాలయాల్లో పనిచేస్తున్న పూజారి వెంకటేశన్కు గాయాలయ్యాయి. వెంకటేశన్ ద్విచక్ర వాహనంపై ఖమ్మం వస్తుండగా నాగులవంచ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. గాయపడిన ఆయన్ను 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంజాయి పట్టివేత ఖమ్మంక్రైం: నగరంలోని త్రీటౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మోహన్బాబు కథనం ప్రకారం.. అగ్రహారం కాలనీకి చెందిన రాయల భోగి అలియాస్ యోగి, దానవాయిగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో నివసించే బానోత్ సాయి కలిసి బైక్పై వెళ్తుండగా.. మోతీనగర్ పార్కు వద్ద పోలీసులు తారపడ్డారు. దీంతో వారు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకుని, తనిఖీ చేయగా 200 గ్రాముల గంజాయి దొరికింది. వారిద్దరు అగ్రహారం కాలనీలో ఉండే నాగేంద్రబాబు (పండుఝ) నుంచి కొన్ని రోజుల కిందట 300 గ్రాముల గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు. -
చిక్కుముడి
మాఢవీధుల విస్తరణకు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అభివృద్ధికి చేపట్టిన మాఢవీధుల విస్తరణకు అడ్డు తొలగడం లేదు. దాదాపు అందరూ ఖాళీ చేసినా ఓ రెండు కుటుంబాల పేచీతో భూ సేకరణ పూర్తి కాలేదు. భూ సేకరణ పూర్తయితేనే రామాలయ అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. దీంతో భక్తులకు ఎదురుచూపులు తప్పడంలేదు. మేము నష్టపోయామంటున్న నిర్వాసితులు ప్రభుత్వంపై నమ్మకంతో రామాలయ అభివృద్ధికి సహకరించేందుకు ఆలయానికి పడమర, దక్షిణం వైపున ఉన్న చిరు వ్యాపారులు, ఇళ్ల యజమానులు గత నెల 10వ తేదీ తర్వాత ఖాళీ చేశారు. నష్టపరిహారం పూర్తిగా అందించలేదని, ప్రత్యామ్నాయఇంటి స్థలం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే తమ నివాసాలను ఖాళీ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వారు జేసీబీలతో ఇళ్లను కూల్చేశారు.నెల రోజులు దాటినా ఇతర ఇళ్లను ఖాళీచేయించలేదు. దీంతో తాము వ్యాపారం నష్టపోయామనిఖాళీ చేసిన నిర్వాసితులు పేర్కొంటున్నారు. పుష్కరాల నాటికై నా అవుతాయా..? రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అంటున్నా ప్రభుత్వ చిత్తశుద్ధిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు కావొస్తున్నా అభివృద్ధిలో కీలక ఘట్టమైన మాఢ వీధుల విస్తరణ భూ సేకరణకే నెలలపాటు సమయం తీసుకోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. భూ సేకరణ పూర్తయి, మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం ఆమోదించి, విడతలవారీగా బడ్జెట్ విడుదలైతేనే పనులు పూర్తవుతాయి. ఆ పనులన్నీ అయ్యేదెప్పుడు.. ఆలయంఅభివృద్ధి చెందేదెప్పుడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం గోదావరి పుష్కరాల నాటికై నా ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భూ సేకరణ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. భద్రాచల రామాలయ అభివృద్ధికి ఆటంకం! స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించని రెండు కుటుంబాలు భూ సేకరణ పూర్తయితేనే పనులు ప్రారంభం -
‘రాజీవ్ స్వగృహ’ సాధనకు కృషి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని గెజిటెడ్ అధికారులకు ఇళ్ల స్థలాలకు బదులు రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ఇప్పించేలా కృషి చేస్తామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం తీసుకుంటామని చెప్పారు. ఖమ్మంలోని టీజీఓ కార్యాలయంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏలూరి మాట్లాడారు. ఫ్లాట్స్ కోసం ఇప్పటికే మంత్రులను కలిసి విన్నవించామని తెలిపారు. బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలని, హైదరాబాద్ స్థాయిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఖమ్మంలోని గెజిటెడ్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు చెప్పారు. సమావేశంలో హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా కిషోర్, పి.విజయ్కుమార్, టీజీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, టీజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి -
యాదవులను నిర్లక్ష్యం చేయొద్దు..
ఖమ్మంవ్యవసాయం: యాదవులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని అఖిలభారత యాదవ మహాసభ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న రామకృష్ణ ఫంక్షన్ హాల్లో మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం సమావేశం నిర్వహించగా అఖిల భారత యాదవ మహాసభ గౌరవ అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే గొర్రెల పథకాలు వచ్చాయని, సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో యాదవులకు సముచిత స్థానం దక్కుతుందనే ఆశలో ఉన్నామన్నారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకల వెంకటనర్సయ్య, జిల్లా యాదవ యువజన సంఘం అధ్యక్షుడు చిత్తారు సంహాద్రి మాట్లాడారు. సమావేశంలో యాదవ సంఘాల ప్రతినిధులు పుచ్చకాయల వీరభద్రం, చిన్నం మల్లేశ్, పగడాల మధు, దుబాకుల శ్రీనివాస్, అల్లిక అంజయ్య, మల్లెబోయిన ఉపేందర్, మంద నాగేశ్వరరావు, మేకల సైదులు, మెండె వెంకటేశ్, గోపిరాజు యాదవ్, వర్లబోయిన నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
నీటి చుక్క నిలవక..
మైదానాన్ని తలపిస్తున్న పెదవాగు ప్రాజెక్ట్ వానాకాలం సీజన్లో ఏటా సాగునీటితో నిండే పెదవాగు ప్రాజెక్ట్ ఈ ఏడాది మాత్రం పచ్చదనం పర్చుకుంది. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లివద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆనకట్టకు భారీ గండి కోతకు గురైంది. ఈ ఏడాది వానాకాలం సీజన్కు ముందే ప్రాజెక్ట్ను తిరిగి నిర్మిస్తామని పాలకులు హామీ ఇచ్చారు. వరద ఉధృతికి ఆనకట్ట కొట్టుకుపోయినట్లే ఆ హామీ కూడా కొట్టుకుపోయి గోదారిలో కలిసింది. దీంతో ప్రాజెక్ట్లో సాగునీరు నిలవక పచ్చదనంతో నిండి క్రికెట్ మైదానంలా కనిపిస్తోంది. మరోవైపు ఆయకట్టు రైతులు సాగునీటి కోసం మనోవేదన చెందుతున్నారు. –అశ్వారావుపేటరూరల్ -
మొరాయించిన స్పీడ్ బోటు
కిన్నెరసాని జలాశయం మధ్యలో పర్యాటకుల ఆందోళన పాల్వంచరూరల్: పర్యాటకులు ఆదివారం జలవిహారం చేస్తుండగా స్పీడ్ బోటు కిన్నెరసాని రిజర్వాయర్ మధ్యలో మొరాయించింది. జలాశయంలో మొసళ్ల సంచారం ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందారు. నెల క్రితమే బోటుకు మరమ్మతులు చేపట్టినా ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది. డ్రైవర్ మరమ్మతులు నిర్వహించగా తిరిగి స్టార్ట్ కావడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక రోజు ఆదాయం రూ. 50 వేలు... కిన్నెరసానికి పర్యాటకల రాకతో ఆదివారం ఒక్కరోజూ రూ. 50 వేల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 684 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.36,090 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.14,040 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొరవడిన పర్యవేక్షణ బోటింగ్ పాయింట్ వద్ద టూరిజం కార్పొరేషన్ మేనేజర్ నిత్యం పర్యాటకుల భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఆదివారం మేనేజర్ విధులకు రాలేదు. స్పీడ్ బోటు జలాశయం మధ్యలో నిలిచిపోవడంతో బోటింగ్ సమస్యపై ఎవరికీ ఫిర్యాదు చేయాలో అర్థం కాలేదని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు. అనంతరం కొందరు ఏజీఎంకు సమస్యను విన్నవించారు. ఈ విషయమై మేనేజర్ దుర్గాప్రసాద్ను వివరణ కోరగా.. అనారోగ్య సమస్యలతో విధులకు రాలేదని తెలిపారు. -
బ్లాస్టింగ్తో ఉలిక్కిపడిన చెన్నారంవాసులు
నేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో పొలాల్లోని బండరాళ్లను బ్లాస్టింగ్ చేయగా పరిసర ప్రాంతంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆదివారం పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్లాస్టింగ్ చేయడంతో ప్రజలు ఏంజరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. పెద్ద బండ రాళ్లు ఇళ్లపై పడ్డాయి. గంజికుంట్ల వరలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబానికి పరిహారం అందజేతరఘునాథపాలెం: మండలంలోని వేపకుంట్ల గ్రామానికి చెందిన మేక వెంకన్న విద్యుదాఘాతంతో మృతిచెందగా.. ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ఆదివారం అందించారు. వెంకన్న 2024 నవంబర్ 21న విద్యుదాఘాతంతో మృతిచెందగా విద్యుత్ శాఖ నుంచి నష్టపరిహారం మంజూరైంది. చెక్కును మాజీ సర్పంచ్ రమేశ్ అందించారు. ఇరాన్పై దాడి హేయమైన చర్యఖమ్మంమయూరిసెంటర్: మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోసం ఇజ్రాయిల్కు అండగా ఉంటూ అమెరికా నేరుగా ఇరాన్పై దాడి చేయడాన్ని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ తీవ్రంగా ఖండిస్తోందని, ఇది హేయమైన చర్య అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది యుద్ధ ఉన్మాద దురాక్రమణ చర్య అని, ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి అని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం అమెరికా ఎన్నో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు చేస్తోందని, పాలకులను అనుకూలంగా మార్చుకుంటోందని, స్వతంత్రంగా వ్యవహరించే వారిని హతమారుస్తోందని ఆరోపించారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి ఏన్కూరు: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన మండలంలోని టీఎల్ పేటలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామవాసి షేక్ సైదులుకు చెందిన ఎద్దు పొలంలో మేత మేసేందుకు వెళ్లి.. అక్కడే తెగి పడి ఉన్న 11 కేవీ విద్యుత్ వైరును తగిలి షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్శాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. కాగా, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
శిశువుకు ఆరోగ్య రక్ష
● నేటి నుంచి మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాలు ● మిస్సింగ్, డ్రాపౌట్ చిన్నారులకు వ్యాక్సినేషన్ ● 12 రకాల వ్యాధులకు 11 రకాల టీకాలుఏ టీకా ఎప్పుడు.. ●శిశువు జన్మించగానే టీబీ రాకుండా బీసీజీ, పోలీయో రాకుండా ఓపీవీ, కాలేయ సమస్యలు రాకుండా హెపటైటీస్ బీ టీకా వేస్తారు. ●ఆరు వారాలకు పెంటావాలెంట్, రోటావైరస్, ఓరల్ పోలియో, పీసీవీ, ఐపీవీ టీకాలు ఇస్తారు. ●పది వారాలకు పెంటావాలెంట్, ఓరల్ పోలియో, రోటావైరస్ టీకా ఇస్తారు. ●14 వారాలకు పెంటా వాలెంట్, రోటావైరస్, ఓరల్ పోలియో, పీసీవీ టీకా వేస్తారు. ●9 నుంచి 12 నెలల మధ్య మిజిల్స్, రుబెల్లా, జపనీస్ ఎన్సప్లైటీస్, పీసీవీ, ఐపీవీ టీకా ఇస్తారు. ●16 నుంచి 24 నెలల మధ్య ఎంఆర్, జేఈ, ఓరల్ పోలియో, డీపీటీ టీకా ఇస్తారు. ●5 నుంచి ఆరేళ్ల మధ్య డీపీటీ బూస్టర్–2 ●పదేళ్లకు టెటనస్ అండ్ డిఫ్తీరియా(టీడీ) వ్యాక్సిన్ ఇస్తారు. ●16 ఏళ్లకు టెటనస్ అండ్ డిఫ్తీరియా(టీడీ) వ్యాక్సిన్ వేస్తారు. ●గర్బిణీలకు టీడీ1, టీడీ2 లేదా టీడీ బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తారు.ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం సోమవారం నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. 12 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు 11 రకాల టీకాలు వేయనున్నారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. మిస్సింగ్, డ్రాపౌట్ పిల్లలను గుర్తించి టీకాలు ఇవ్వనున్నారు. గతంలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం ద్వారా ఏడు రకాల వ్యాధులకు టీకాలు వేయగా ప్రస్తుతం 12 రకాలకు పెంచారు. పోలియో, టీబీ, డిఫ్తీరియా, పెర్టుసిస్(వూపింగ్ దగ్గు), టెటనస్, పొంగు, రుబెల్లా, హెపటైటిస్ బీ, మెనింజైటిస్, హిమోఫిలస్ ఇన్ఫ్లూఝెంజా బీ(హెచ్ఐబీ), న్యూమోనియా, రోటా వైరస్, గ్యాస్ట్రోంటెరిటిస్ వ్యాధులు సంక్రమించకుండా టీకాలు అందిస్తారు. టీకాలు వేస్తూ.. అవగాహన కల్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం పిల్లల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తోంది. సాధారణంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం ఈ టీకాలు వేస్తుంటారు. పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో ప్రతీ బుధవారం టీకాలు వేస్తారు. మిగతా చోట్ల ప్రతీ శనివారం వేస్తారు. అయితే కొందరు తల్లిదండ్రులు వీటిపై అవగాహన లేక, మరిచిపోయి పిల్లలకు టీకాలు వేయించకుండా ఉంటారు. కాగా, ప్రతి సంవత్సరం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంతో అలాంటి వారిని గుర్తిస్తూ టీకాలు వేయడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. గర్భిణులకూ టీకాలు.. జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కోసం డ్రాపౌట్స్, మిస్సింగ్, లెఫ్ట్ ఔట్ శిశువులపై జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 904 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులకు కూడా టీకాలు వేయనున్నారు. ఇప్పటివరకు 214 మంది గర్భిణులను గుర్తించారు. ప్రత్యేకంగా సంచారజాతులు, మురికి వాడలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, రవాణా సౌకర్యంలేని తదితర ఏరియాలపై దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సద్వినియోగం చేసుకోవాలి మిషన్ ఇంద్రధనుష్ ద్వారా అందించే టీకాలు చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. ప్రాణాంతకమైన 12 రకాల వ్యాధులు రాకుండా కాపాడుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు నిర్దిష్ట సమయాల్లో సూచించిన టీకాలు వేయిస్తే ఆరోగ్యంగా ఉంటారు. సోమవారం నుంచి నిర్వహించే ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. – రమణ, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ -
కార్మికవర్గ ఐక్యతే ఎస్డబ్ల్యూఎఫ్ లక్ష్యం
● ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధనకు ఉద్యమించండి ● సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్ఖమ్మంమయూరిసెంటర్ : ఆర్టీసీ కార్మికుల ఐక్యతకు వారధిగా.. పోరాటాల సారథిగా, కార్మికవర్గ ఐక్యతే లక్ష్యంగా ఎస్డబ్ల్యూఎఫ్ పని చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఖమ్మం ఐఎంఏ హాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు నష్టం కలిగించే ప్రభుత్వ, యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడే సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ ఒక్కటేనని చెప్పారు. సంస్థలో 55 రోజుల పాటు జరిగిన సమ్మెకు సీఐటీయూ అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీని పరిరక్షించేది ఐక్య పోరాటమేనని పిలుపునిచ్చారు. కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు, ఆర్టీసీ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్ విధానాలు, ఎలక్ట్రికల్ బస్సులు, పెరిగిన పనిభారాలు అన్నీ కూడా ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితమేనని విమర్శించారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మహాసభలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఉమెన్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్వీ రమ, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి అర్ముగనాయర్, ఏపీ ఎస్డబ్ల్యూఎఫ్ కోశాధికారి దివాకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వరరావు, పిట్టల సుధాకర్, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి, ఆర్టీసీ శ్రామిక మహిళా కమిటీ నాయకులు పద్మావతి, వివిధ విభా గాల నాయకులు మాధవరావు, రోశయ్య, పగిళ్లపల్లి నరసింహారావు, గడ్డం వెంకటయ్య, వి.రమేష్, బుగ్గవీటి లింగమూర్తి, భాగ్యలక్ష్మి, మల్లికాంబ, పద్మ, విజయలక్ష్మి, సరిత, సీతారామారావు పాల్గొన్నారు. -
ఆదర్శవంతంగా ఏదులాపురం
ఖమ్మంరూరల్ : నూతనంగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు రహదారుల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పథకాలను అందిస్తున్నామని, తద్వారా పేదలు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం చారిత్రక నిర్ణయమని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబ్్, ఈఈ యుగంధర్, ఆర్డీఓ నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ -
సాఫీగా సాగేదెలా?
ఖమ్మం అర్బన్: జిల్లాలో సాగునీటికి ప్రధాన ఆధారమైన నాగార్జున సాగర్ ఎడమకాల్వలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ వానాకాలంలో సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం నెలకొంది. జిల్లాలో అధికారికంగా 2.54 లక్షల ఎకరాలు, లిఫ్ట్ల పరి ధిలో ఆయకట్టు కలిపితే మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సిన ప్రధాన కాల్వలపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు చేరకపోవచ్చనే ఆందోళన రైతుల్లో పెరుగుతోంది. గతేడాదే ఇబ్బంది పడ్డామని, ఈ సంవత్సరమైనా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పంటలకు సక్రమంగా నీరందించాలని రైతులు, వివిధ సంఘాల నాయకులు ఇటీవల కలెక్టరేట్ ఎదుట అందోళన చేశారు. తాత్కాలిక మరమ్మతులే.. గత వానాకాలంలో పాలేరు నుంచి సాగర్ ప్రధాన కాల్వలో పలు చోట్ల తీవ్రంగా గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు. ప్రధాన కాల్వ లతోపాటు బ్రాంచ్, మేజర్, మైనర్ కాల్వల్లో పూడిక పేరుకుపోయి, తూములు, షట్టర్లు ధ్వంసమై, చెట్లు పెరిగి నీరు సక్రమంగా వెళ్లే పరిస్థితి లేదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా జలవనరుల శాఖ అధికారులు సరైన దృష్టి పెట్టకపోవడం, అంచనాలకు తగ్గట్టుగా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు అసంతృప్తికి లోనవుతున్నారు. అన్ని చోట్లా అంతే.. కల్లూరు సర్కిల్ పరిధిలోని కల్లూరు, మధిర, సత్తుపల్లి డివిజన్లలో సాగర్ ఎడమ కాల్వ ఆధారంగా పంటలు వేస్తుంటారు. అయితే కాల్వల్లో పూడిక, చెత్త, పిచ్చిమొక్కలు పెరగడంతో చివరి భూములకు నీరందడం లేదు. ఏన్కూరు, కొణిజర్ల, మధిర, తల్లాడ మండలాల్లో కాల్వలు మరీ దయనీయ స్థితిలో ఉన్నాయి. ఏన్కూరు మండలంలోని మేడేపల్లి, రఘునాథపాలెం మండలం మూలగూడెం మధ్య 22 కిలోమీటర్ల మేర కంపచెట్లు ఉన్నాయి. వంతెనలు కూడా శిథిలావస్థకు చేరాయి. రెగ్యులేటర్ షట్టర్లు ధ్వంసమై నీరు బయటకు వెళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నిధులతో కాల్వ లకు ఆధునికీకరణ పనులు చేయగా, ఆ తర్వాత నామమాత్రంగానే పనులు జరగడం, కొత్తగా నిధులు మంజూరు కాకపోవడంతో మరమ్మతుల కోసం నిరీక్షిస్తున్నాయి. మధిర మండలంలో మేజర్ కాల్వల్లో చెట్ల్లు పెరిగి, పూడిక పేరుకుపోయి నీరు పారే పరిస్థితి లేదు. తూములు, షట్టర్లు ధ్వంసమై సాగునీరు వృథాగా వాగుల్లోకి వెళ్తుండగా పంటలు ఎండిపోతున్నాయి. పాలేరు – సాగర్ ప్రధాన కాల్వ లో గతేడాది ఏర్పడిన గండ్లకు ఇప్పటికీ పూర్తిగా మరమ్మతులు చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించకుంటే వానాకాలం పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. రూ.కోటితో ప్రధాన కాల్వ మరమ్మతులు.. సాగర్ ప్రధాన కాల్వ జిల్లా సరిహద్దు నుంచి ఏపీ సరిహద్దు వరకు ఖమ్మం, కల్లూరు సర్కిళ్ల పరిధిలో జంగిల్ క్లియరెన్స్ (కంపచెట్లు తొలిగింపు)యూటీ, హెడ్ వర్క్స్ మరమ్మతులకు రూ.కోటి మంజూరయ్యాయి. ఖమ్మం సర్కిల్లో రూ.40 లక్షల విలువైన పనులు సాగుతుండగా, కల్లూరు పరిధిలో రూ. 60 లక్షల విలువైన పనులకు టెండర్ల దశలోనే ఉన్నట్లు తెలిసింది. జంగిల్ తొలగించాక బలహీనంగా ఉన్న కాల్వకట్టలు, పూడికలను గుర్తించి మరమ్మతులు చేస్తామని అధికారులు చెబుతున్నారు.మరమ్మతులకు నోచుకోని సాగర్ కాల్వలు నీటి సరఫరాకు అడుగడుగునా అడ్డంకులే మెయిన్ కెనాల్లో జంగిల్ క్లియరెన్స్కు రూ.కోటి నిధులతో అంచనా ఖమ్మం సర్కిల్లో మొదలు.. కల్లూరులో ఖరారు కాని టెండర్లు పనులు సాగుతున్నాయి.. వరద కారణంగా దెబ్బతిన్న యూటీ మరమ్మతు పనులు వేగంగానే సాగుతున్నాయి. సాగర్ ప్రధాన కాల్వకట్టలపై చెట్ల తొలిగింపు పనులు చేస్తున్నాం. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు ఖమ్మం సర్కిల్ ఎస్ఈఆయకట్టుకు ఇబ్బంది రానివ్వొద్దు రైతులు సాగు మొదలు పెట్టిన తర్వాత కాకుండా ముందస్తుగానే సాగర్ ఆయకట్టు వరకు నీరందేలా అవసరమైన మరమ్మతులు చేయాలి. కాల్వల్లో చెట్లు పెరగడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాదైనా ఆ సమస్య లేకుండా చూడాలి. –బొంతు రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శియూటీ మరమ్మతులు.. గత ఏడాది వరదతో తెగిన యూటీ వద్ద రూ.14 కోట్ల అంచనాలతో పనులు కొనసాగుతున్నాయి. నీటి విడుదల నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈలోపు వానలు, వరదలు అడ్డంకిగా మారకుంటే పనులు పూర్తవుతాయి. లేదంటే మళ్లీ కష్టాలు తప్పవు. అధికారులు మాత్రం యూటీ మరమ్మతులు జూలై మొదటి వారం కల్లా పూర్తి చేస్తామని అంటున్నారు. -
భూభారతీ.. భారం మీదే
జిల్లాలో అత్యధిక దరఖాస్తులు వచ్చిన మండలాలు మండలం దరఖాస్తులు కారేపల్లి 6,114 కొణిజర్ల 5,539 ఏన్కూరు 4,994 కల్లూరు 4,866 పెనుబల్లి 4,653 తల్లాడ 4,567 కామేపల్లి 4,527 కూసుమంచి 3,877 వేంసూరు 3,830 రఘునాథపాలెం 3,534 వైరా 3,344 తిరుమలాయపాలెం 3,097 ఎర్రుపాలెం 3,040సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా ఈనెల 3నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు శుక్రవారం ముగిశాయి. అధికారులు బృందాలుగా విడిపోయి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో సమస్యల పరిష్కారం కోసం రైతులు 67,378 దరఖాస్తులు అందజేశారు. తొలిదశలో పైలట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో కలిపి 6,085 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా మొత్తం 73,463 దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అయితే, నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో అందిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం ఇప్పటికే కొనసాగుతోంది. మిగిలిన మండలాల్లో అందిన ఆర్జీలపై త్వరలోనే దృష్టి సారించనున్నారు. అయితే, మొత్తంగా అందిన దరఖాస్తుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే ఉండడం విశేషం. ఆ రెండు మండలాల్లో తొలుత.. భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన పైలట్ మండలాల్లో నేలకొండపల్లి కూడా ఉంది. దీంతో ఈ మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించగా 3,224 మంది రైతులు దరఖాస్తులు ఇచ్చారు. రెండో విడతలో బోనకల్ మండలాన్ని ఎంపిక చేయగా ఇక్కడ 2,861 దరఖాస్తులు వచ్చాయి. రెండు మండలాల్లో సాదాబైనామాపైనే దరఖాస్తులు ఎక్కువగా అందాయి. వీటిని పక్కన పెట్టి మిగతా దరఖాస్తులకు సంబంధించి నేలకొండపల్లి మండలంలో 354 పరిష్కరించగా, బోనకల్ మండలంలోనూ క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతోంది. తుది నిర్ణయం వచ్చాకే.. రైతులు వివిధ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వగా అత్యధికంగా 40,872 దరఖాస్తులు సాదాబైనామాలపైనే రావడం గమనార్హం. ఇక సర్వేనంబర్లు తప్పుగా నమోదయ్యాయని 4,390, మ్యుటేషన్ కోసం 956 దరఖాస్తులు ఇచ్చారు. అలాగే, పాస్ పుస్తకాల్లో పట్టేదారు వివరాల నమోదుకు 187, ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగింపునకు 355 దరఖాస్తులు వచ్చాయి. అయితే, సాదా బైనామాలకు సంబంధించిన ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉండడంతో అధికారులు వీటి పరిశీలన మొదలుపెట్టలేదు. దీంతో రైతులు ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. పరిశీలనకు కసరత్తు జిల్లాలో నిర్వహించిన సదస్సుల్లో అందిన దరఖా స్తులను ఆన్లైన్లో నమోదు చేసి పరిశీలించాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో ఆన్లైన్ నమోదు ప్రక్రియ ముగి యగా పరిశీలన, పరిష్కారం ఊపందుకున్నాయి. మిగిలిన మండలాల్లోనూ అధికారులు సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాక పరిష్కా రంపై దృష్టి సారించనున్నారు. ఓసారి నిర్ణయం వెలు వరించాక భవిష్యత్లో మరోసారి వివాదం, ఘర్షణ జరగొద్దనే భావనతోనే పకడ్బందీగా పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల ఆన్లైన్, పరిశీలనపై అధికారుల దృష్టి నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహణ మిగతా 19మండలాల్లో 67,378 దరఖాస్తుల స్వీకరణ సాదాబైనామా కోసం అత్యధికంగా 40,872..19 మండలాలు..339 గ్రామాలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రెండు మండలాలు మినహా మిగిలిన 19 మండలాల్లో ఈనెల 3 నుంచి భూభారతి చట్టం అమలు ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాల్లో శుక్రవారం వరకు కొనసాగాయి. అధికారుల బృందం 339 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూభారతి చట్టంతో ఉపయోగాలు, రైతుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో అవగాహన కల్పించారు. దీంతో ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు వెల్లువలా 67వేలకు పైగా దరఖాస్తులు సమర్పించగా అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూల విరాట్తో పాటు శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాలు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల పరిధిలో రోడ్ల విస్తరణ, బీటీ రోడ్లు నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత నల్లగొండ జిల్లా నకిరేకల్లో పర్యటనకు మంత్రి పొంగులేటి బయలుదేరతారు. 26న డాక్ అదాలత్ ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు ఈనెల 26వ తేదీన ఆన్లైన్ విధానంలో డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని తపాలా సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఫిర్యాదులను ఈనెల 24వ తేదీలోగా ‘డాక్ అదాలత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, ఖమ్మం–507003’ చిరునామాకు పంపించాలని సూచించారు. ఫిర్యాదుతో పాటు మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ జత చేస్తే, అదాలత్ సమయాన వారిని లింక్ చేసి సమస్యను చర్చిస్తామని తెలిపారు. డిగ్రీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని మహా త్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కాలేజీలో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 25న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపా రు. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో సీట్లను రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయనుండగా 25న ఉదయం 11గంటలకు స్పాట్ కౌన్సెలింగ్ మొదలవుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, టీసీ, కుల, ఆదా య, ఫిట్నెస్, స్థానికత ధ్రువపత్రాలతో పాటు పది పాస్పోర్ట్ సైట్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. వివరాలకు 99639 30931, 70326 32863 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. యూపీఎస్సీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: యూపీఎస్సీ సివిల్స్కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు హైదరాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనుండగా, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రతులను ‘డైరెక్టర్, టీజీఎస్సీ స్టడీ సర్కిల్, రోడ్డు నంబర్ 14, కేబీఆర్ పార్కు ఎదుట, బంజారాహిల్స్, హైదరాబాద్’ చిరునామాలో వచ్చేనెల 7లోగా అందజేయాలని సూచించారు. వచ్చేనెల 13న ఇంగ్లిష్ మీడియంలో నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 040–23546552, 81216 26432, 90320 77276 నంబర్లలో సంప్రదించాలని డీడీ సూచించారు. 9ఎకరాల వరకు పెట్టుబడి సాయం జమ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రపభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా శనివారం నాటికి తొమ్మిది ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయింది. జిల్లాలో 3,53,794 మంది రైతులను అర్హులుగా గుర్తించగా, రూ. 436,84,65,365 అందాల్సి ఉంది. ఇందులో శనివారం నాటికి 3,20,105 మంది రైతుల ఖాతాల్లో రూ.347,18,42,096 జమ అయ్యాయని డీఏఓ పుల్లయ్య తెలిపారు. -
వన మహోత్సవానికి సిద్ధం
● 571 నర్సరీల్లో 25లక్షల మొక్కలు రెడీ ● ఈసారి 3.50 లక్షల తాటి, ఈత మొక్కలు ప్రత్యేకం ● ప్రభుత్వ ఆదేశాలు రాగానే ప్రారంభం ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవానికి సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ఆధ్వర్యాన నర్సరీల్లో మొక్కలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈసారి పర్యావరణ పరిరక్షణతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాటి, ఈత మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. జిల్లాలోని 20మండలాల్లో 571 నర్సరీల్లో 25 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 3.50 లక్షల తాటి, ఈత మొక్కలు సిద్దం చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాల అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షలో తాటి, ఈత మొక్కల పెంపకంపై చేసిన సూచనలతో అధికారులు జిల్లాలో లక్ష్యం మేరకు నాటాలని నిర్ణయించారు. పర్యావరణం.. జీవనోపాధి గతంలో హరితహారం, వన మహోత్సవంలో నీడనిచ్చే మొక్కలతో పాటు పూలు, పండ్లు, మూలికల మొక్కలే నాటారు. ఈసారి తాటి, ఈత మొక్కలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మొక్కలు నేల కోతను సమర్థవంతంగా అరికట్టి భూగర్భ జలాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాతావరణ సమతుల్యత కాపాడడమే కాక కార్బన్ డై ఆకై ్సడ్ను తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి. తాటి, ఈత చెట్లు దీర్ఘకాలం జీవిస్తూ పర్యావరణ పరిరక్షణకే కాక ఉపాధికి ఊతమిస్తాయి. వీటి నుంచి లభించే కల్లు, తాటి బెల్లం, ఈత పళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పలువురికి జీవనోపాధిని కల్పిస్తాయి. ప్రణాళికాయుతంగా నిర్వహణ వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో డీఆర్డీఏ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేలా అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంగణాలు, గ్రామీణ రోడ్ల పక్కన ఖాళీ స్థలాలే కాక సామూహిక భూములను ఎంపిక చేస్తున్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేలా అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ చేయడం, క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ప్రతీ మొక్కను బతికించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. హరిత స్ఫూర్తితో ముందుకు.. వన మహోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగానే కాక జిల్లా వాసుల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా కనీసం ఒక మొక్క అయినా నాటి సంరక్షించాలని కోరుతున్నారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల బాధ్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా కార్యాచరణ రూపొందించారు. పచ్చదనం పెంచడం వ్యక్తిగత కృషి మాత్రమే కాక సామాజిక బాధ్యత కూడా అని అవగాహన కల్పించనున్నారు. -
సాహిత్యంలో ధిక్కార స్వరాలు
● రచనలతో చైతన్యపరిచిన దాశరథి, ఆరుద్ర ● జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఘంటా చక్రపాణి ఖమ్మం సహకారనగర్: సామాజిక పరిణామాలపైనే కాక స్వాతంత్య్రానంతరం దేశంలోని మార్పులపై తమ సాహిత్యం, రచనల ద్వారా దాశరథి, ఆరుద్ర ధిక్కార స్వరం వినిపించారని డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. అంతేకాక తమదైన రచనా శైలితో ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. ఖమ్మంలోని ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన ‘శతజయంతి సాహితీమూర్తులు – దాశరథి, ఆరుద్ర జీవితం – సాహిత్యం’పై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చక్రపాణి మాట్లాడుతూ దాశరథి తెలంగాణ జీవన స్వరమన్నారు. ఖమ్మంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన పాదముద్రలు పడిన ఖమ్మంలో శతజయంతి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన సాహిత్యం, పాటలు ఉత్తేజం, స్ఫూర్తిని కలిగించాయన్నారు. ఇక ఆరుద్ర గొప్ప పరిశోధకుడిగా, కవిత్వంలో ప్రయోగాలకు ఆధునికుడిలా నిలిచారని తెలిపారు. సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం, నిజాం నిరంకుశ పాలన కాలపు బడుగుల కన్నీళ్లను అక్షరబద్ధం చేశారన్నారు. స్వీయ అనుభవాలు, సామాజిక పరిణామాలు దాశరథి ప్రతీ రచనలో కనిపిస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ పూర్వ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఖమ్మం సాహిత్య గుమ్మం అని, ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సు చరిత్ర పుటల్లో నిలుస్తుందని చెప్పారు. అనంతరం బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ ఈ తరం విద్యార్థులు దాశరథి, ఆరుద్రల సాహిత్య సారాంశాన్ని తప్పక అధ్యయనం చేయాలని సూచించారు. సాహిత్య విశ్లేషకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ దాశరథి తెలంగాణకు సాహిత్య దీపదారిగా నిలవడమేకాక తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపారని వెల్లడించారు. స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎన్.కిషోర్రెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూక్యా భాంగ్యా, సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.రవికుమార్ మాట్లాడగా డాక్టర్ సీతారాం, రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికచట్టాల రక్షణకు పోరాటం
● జూలై 9న జాతీయ సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలి ● ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా రవాణా రంగంతో పాటు కార్మిక చట్టాలను కాపాడుకునేలా ప్రజా ఉద్యమాలకు రూపకల్పన జరగాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య(ఏఐఆర్డబ్ల్యూఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య అన్నారు. ఇందుకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) మహాసభలు వేదికగా నిలవాలని సూచించారు. ఖమ్మంలో శనివారం ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు మొదలుకాగా, రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు జెండా ఆవిష్కరించాక అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూనే సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేయాలని సూచించారు. వచ్చేనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికవర్గం పాల్గొని నిరసన తెలపాలని కోరారు. వివిధ సంఘాల నాయకులు అశ్వద్ధామరెడ్డి, పాటి అప్పారావు, థామస్రెడ్డి, బత్తినేని హనుమంతరావు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తామని ప్రకటించారు. ఈసమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.ఎస్.రావుతో పాటు కళ్యాణం వెంకటేశ్వరరావు, పి.శ్రీకాంత్, సీహెచ్.సుందరయ్య, ఎంఎన్.రెడ్డి, రాములు, ఎంవీఎస్ఎస్.నారాయణ, గుండు మాధవరావు, గడ్డం లింగమూర్తి, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, పద్మావతి, పి.రవీందర్రెడ్డి, బిక్షపతిగౌడ్, బత్తుల సుధాకర్, పిట్టల సుధాకర్, విక్రం, జిల్లా ఉపేందర్, రోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రక్తంగా జరిపించారు. ఈ – టికెట్లపై భక్తులకు అవగాహన భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు దర్శనం, ప్రసాదాలు ఇతర సేవలకు గాను రామాలయంలో ఏర్పాటు చేసిన మిషన్లపై ఈఓ ఎల్.రమాదేవి శనివారం భక్తులకు అవగాహన కల్పించారు. తొలుత ఈ మిషన్లకు పూజలు నిర్వహించాక యంత్రాల్లో ఉన్న సదుపాయాలు, ఈ టికెట్లు పొందే విధానం గురించి వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. భక్తులు సైతం ఈ టికెట్లు తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీందర్, ఏఈఓ భవాని రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు. -
అధిక ఫీజులు, పుస్తకాల అమ్మకంపై ఏఐఎస్ఎఫ్ ఆందోళన
ఖమ్మం మామిళ్లగూడెం: అధిక ఫీజు వసూళ్లు, అక్రమంగా పుస్తకాల అమ్మకంపై ప్రశ్నించినందుకు నారాయణ విద్యాసంస్థల బాధ్యులు తమపై దాడి చేశారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ ఆరోపించారు. ఖమ్మం జమ్మిబండ రోడ్డులోని నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజు వసూలు చేస్తున్నారని, స్టేషనరీ పేరుతో పుస్తకాలు అమ్ముతున్నారంటూ శనివారం ఆందోళనకు చేశామని పేర్కొన్నారు. ఈమేరకు ప్రిన్సిపాల్, సిబ్బంది దూషిస్తూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆపై ఖమ్మం వన్ టౌన్ పోలీసులు చేరుకుని తమ నాయకులను అదుపులోకి తీసుకున్నారన్నారు. నారాయణ విద్యాసంస్థల్లోని గోదాంను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసినా దొడ్డిదారిలో పుస్తకాలు అమ్ముతుండడాన్ని ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆరోపించారు. కాగా, నారాయణ పాఠశాలలో ప్రైమరీ సెక్షన్కు అనుమతి లేకున్నా, చట్టాలను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు లోకేష్, షేక్ నాగుల్మీరా, మధు, కౌశిక్, మనోజ్, వినయ్, గౌతమ్, అఖిల్, నాగరాజు, నరేష్, ప్రతాపు, గోపి, రాజేష్ పాల్గొన్నారు. -
ప్రాణదాతగా మాధాపురం వాసి
ముదిగొండ: మండలంలో మాధాపురానికి చెందిన భువనగిరి లక్ష్మీనారాయణ(44) ఈనెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స చేయించే క్రమాన బ్రెయిన్డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు కుటుంబీకులు అవయవదానానికి అంగీకరించడంతో మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేసినట్లయింది. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 16న లక్ష్మీనారాయణ టెట్ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆటోలో మాదాపురం నుంచి ఖమ్మం వెళ్తుండగా రహదారి పక్కన ఉన్న చెట్టు ఆటోపై పడింది. దీంతో లక్ష్మీనారాయణ తలకు గాయాలు కాగా ఖమ్మంలో చికిత్స చేయించినా ఫలితం లేకపోగా వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఈమేరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ శనివారం ఉదయం ఆయన గుండె, నేత్రాలు, ఊపిరితిత్తులు, కిడ్నీలను సేకరించిన వైద్యులు అవసరమైన వారికి అమర్చారు. దీంతో లక్ష్మీనారాయణ మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేసినట్లయింది. ఈమేరకు ఆయన మృతదేహం వద్ద గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు నివాళుర్పించి, అవయవదానానికి అంగీకరించిన కుటుంబీకులను అభినందించారు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాల దానం -
లాకులకు లీకులు..
● పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోని గేట్లు ● నిధులున్నా టెండర్లకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు ● కిన్నెరసాని ప్రాజెక్ట్కు పొంచి ఉన్న ముప్పు ● ప్రమాదమేమీ లేదని కొట్టిపారేస్తున్న జెన్కో అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచాం.. కిన్నెరసాని గేట్ల మరమ్మతుల కోసం రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గత నెల 6న, 22న, ఈ నెల 3న... మూ డు సార్లు టెండర్లు పిలిచాం. కానీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందురావడంలేదు. డ్యామ్లో నీటిమట్టం 393 అడుగులు ఉంటేనే మరమ్మతులు చేసే అవకాశంఉంటుంది. గేట్ల మధ్య సీల్స్ ఏర్పాటు, రోప్ మార్పు, పెయింటింగ్ పనులు నిర్వహిస్తాం. డ్యామ్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. – ప్రభాకర్రావు, కేటీపీఎస్ 5వ దశ సీఈపాల్వంచరూరల్: పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చడంతోపాటు తాగు, సాగునీరు అందించే కిన్నెరసాని ప్రాజెక్ట్కు ప్రమాదం పొంచిఉంది. పదేళ్లుగా ప్రాజెక్ట్ గేట్లు(లాకులు) మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో గేట్ల మధ్య లీకులు ఏర్పడి జలాశయం నుంచి నీరు వృథాగా పోతోంది. రెండు, మూడేళ్లుగా గేట్ల రబ్బర్ సీల్స్ లీకై నీళ్లు బయటకు వస్తున్నాయి. లీకేజీ చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు, పరీవాహక ప్రాంతాల ప్రజ లు పేర్కొంటున్నారు. గేట్లకు సంబంధించిన పిల్ల ర్లు కూడా దెబ్బతింటున్నాయి. మరమ్మతులకు అవసరమైన నిధులున్నా పనులు చేపట్టడంలేదు. ప్రా జెక్ట్ నిర్వహణ చూస్తున్న జెన్కో (కేటీపీఎస్) అధి కారులు మేల్కొనకపోతే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు కిన్నెరసాని రిజర్వాయర్ నిర్మాణం 1962లో ప్రారంభించి 1972లో పూర్తిచేశారు. 13క్రస్ట్గేట్లతో 407 అడుగుల గరిష్ట నీటిమట్టంతో 8.4 టీఎంసీల నిల్వసామర్థ్యంతో జలాశయం నిర్మిం చారు. తొలుత ప్రాజెక్ట్ను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షించగా, 1998 ఏప్రిల్ 1 నుంచి జెన్ కో పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్ట్ నిర్మించి ఆరు దశాబ్దాలు గడుస్తుండగా మధ్యలో జెన్కో అధికారులు కరకట్టను పటిష్టపరిచే పనులు చేపట్టారు. 2014లో రూ.60 లక్షలతో 13 క్రస్ట్ గేట్లకు రోప్ వే, సాకెట్లను మార్చారు. దీంతో వీటిని మరో పదేళ్లు మార్చాల్సిన అవసరం లేదు. కాగా కిన్నెరసాని జలాశయం విస్తీర్ణం 515 చదరపు మీటర్లు, డ్యామ్ ఎత్తు 39మీటర్లు, పొడవు 2.4 కిలోమీటర్లుగా ఉంది. కేటీపీఎస్లో విద్యుదుత్పత్తికి, ఎన్ఎండీసీ, నవభారత్, కర్మాగారాలకు కిన్నెరసాని నీరు సరఫరా చేస్తారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు తాగునీరు ఇక్కడి నుంచే వెళ్తుంది. పాల్వంచ మండలంలో మూడు వేలు, బూ ర్గంపాడు మండలంలో 7వేల ఎకరాల భూమికి సాగునీరు కూడా అందిస్తోంది. పదేళ్ల క్రితం మరమ్మతులు గేట్లకు పదేళ్లక్రితం మరమ్మతులు నిర్వహించారు. నా లుగైదు ఏళ్లకోసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా జెన్కో అధికారులు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్లోని నీటిమట్టం 393 అడుగుల లోపు ఉంటేనే మరమ్మతు పనులు చేపట్టేందుకు వీలవుతుంది. అంతకంటే ఎక్కువగా పెరిగితే పనులు సాధ్యం కావని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఒకటోగేటు నుంచి నాలుగో గేటు వరకు, 13వ నంబర్ గేట మధ్య పిల్లర్లకు బీటలు వారాయి. దీంతో పిల్లర్ల మధ్య నీటి చెమ్మ అధికంగా కన్పిస్తోంది. గేట్ల మధ్య రబ్బర్ సీల్స్ కూడా లీకవుతుండటంతో రిజర్వాయర్ నుంచి నీరు వృథాగాపోతోంది. అయితే ఈ లీకులతో ప్రమాదమేమీ లేదని కేటీపీఎస్ అధికారులు చెబుతున్నా రు. రిజర్వాయర్లోనీటిమట్టం 400అడుగులకు మిం చి పెరిగినప్పుడే బీటలనుంచి నీళ్లు బయటకు వస్తుందని పేర్కొంటున్నారు. పరీవాహక గ్రామాల ప్రజ లు, ఆయకట్టు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే మరమ్మతులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం జరిగే అవకాశముందనిఆవేదన చెందుతున్నారు. కాగా పిల్లర్ల మరమ్మతులు, ఇతర పనులకు ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ పథకం డ్రిప్ ఇరిగేషన్ కింద రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. కట్ట పటిష్టతకు రూ.1.90 కోట్లు కిన్నెరసాని జలాశయం కరకట్ట పటిష్టతకు రూ.1.90కోట్లు, గేట్ల మరమ్మతులకు రూ.1.20 కోట్లను జెన్కో మంజూరు చేసింది. పుణేలోని సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీడబ్ల్యూపీఆర్ఎస్) నుంచి నిపుణులు వచ్చి అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాకే పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులతోపాటు భవిష్యత్లో ఎదురయ్యే పరిణామాలను తట్టుకునేలా నిపుణులు అధ్యయనం చేసి సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. ఇక గేట్ల మరమ్మతులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. -
వృద్ధుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంఅర్బన్: వృద్ధుల మానసిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించా ల ని, తద్వారా వారిని కాపాడుకోవచ్చని మాజీ మంత్రి, మమత విద్యాసంస్థల చైర్మన్ పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో ‘వృద్ధుల మానసిక ఆరోగ్యం’ అంశంపై ఏర్పాటుచేసిన రాష్ట్ర మానసిక వైద్యుల సదస్సును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారిలో ఒంటరితనం, మతిమరుపు సమస్యలపై చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. పరిశోధకులు, వైద్యులు, వైద్యవిద్యార్థులు ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణశాఖ అధ్యక్షుడు డాక్టర్ అశోక్, మమతా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ నరేన్రాజ్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ దక్షిణ మండల శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఉమాశంకర్తో పాటు డాక్టర్ ప్రసాద్రావు, డాక్టర్ జార్జ్రెడ్డి, డాక్టర్ సతీష్బాబు, డాక్టర్ నారా యణరావు, డాక్టర్ ఆకుల విశాల్, డాక్టర్ రాయిరాల అనిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలి ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీ య స్థాయికి ఎదిగిన క్రీడాకారులను వర్ధమాన క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకుని సత్తా చాటాలని ఖమ్మం మేయర్ పి.నీరజ సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీ రక దృఢత్వంతో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. బాడ్మింటన్ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నాటి వీరభద్రం మాట్లాడగా కార్పొరేటర్ కమర్తపు మురళి, అసోసియేషన్ బాధ్యులు దుద్ధుకూరి సత్యనారాయణ, వి. చంద్రశేఖర్, సిరిపురపు సుదర్శన్రావు, పాటిబండ్ల యుగంధర్, నల్లమోతు రఘు పాల్గొన్నారు. విజేతలు వీరే.. జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతల వివరా లను నిర్వాహకులు ప్రకటించా రు. బాలుర అండర్–13 సింగిల్స్లో బి.రేవంత్కుమార్, వి.అశ్వినిరాజ్, డబుల్స్లో బి.రేవంత్కుమార్ – అశ్వినిరాజ్, శశివర్ధన్ – సాహిత్, బాలికల అండర్–13 సింగిల్స్లో ఎం.చరితశ్రీ, జి.నిత్యసంతోషిని, డబుల్స్లో జి. నిత్య – ఎం.చరితశ్రీ, టి.నవియా, ఓంశ్రీల వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అలాగే, అండర్–15 బాలుర సింగిల్స్లో వి.మేఘవర్షిత్, ఎస్.స్వప్నిల్, డబుల్స్లో కె.విశ్వతేజ – స్వప్నిల్, కె.నిశాంత్సాయి– బి.అభినవ్, అండర్–17 బాలుర సింగిల్స్లో ఏ.వినయ్, తేజస్ వివేక్, డబుల్స్లో ఏ.వినయ్ – డి.తేజస్ వివేక్, విశ్వతేజ్ – ఎస్.నిఖిల్, బాలికల సింగిల్స్లో హర్షిత, బి.ధరణి, బాలికల అండర్–15 సింగిల్స్లో వై.హోషిత, జె.అన్విత, బాలుర అండర్–19 సింగిల్స్లో డి.తేజస్ వివేక్, ఏ.వినయ్, డబుల్స్లో యశ్వంత్ – ప్రర్థవిన్, ఎం.రాజీవ్ – ఎస్.నిఖిల్, బాలికల సింగిల్స్లో వి.వేదస్వి, హర్షిత మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నారు. సంస్కృత పండితుడికి సన్మానంభద్రాచలంటౌన్: భద్రాచల దేవస్థానంలో సంస్కృత పండితుడిగా పనిచేస్తున్న ఎస్టీజీ శ్రీమన్నారాయణ ఆచార్యులును భద్రాద్రి దేవస్థానం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో శనివారం ఘనంగా సన్మానించారు. వేలాది మంది విద్యార్థులకు సంస్కృత భాషను బోధించిన ఆయన ఇటీవల ప్రాచ్య విద్య విభూషణం బిరుదు అందుకున్నారు. ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్. రమాదేవి, ఏఈఓలు శ్రవణ్ కుమార్, భవాని రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మానసిక వైద్యుల సదస్సులో మాజీ మంత్రి పువ్వాడ -
ఎదురెదురుగా బస్సు, ఆటో ఢీ
కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్ల క్రాస్ సమీపాన శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు... మహబూబాబాద్ జిల్లా గార్ల నుంచి లింగాల మీదుగా ఖమ్మం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఖమ్మం నుంచి నలుగురు ప్రయాణికులతో ఇల్లెందు వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సలీంతో ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ మహబూబ్, హలీమా, సోందుబీ, జర్పుల కమలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎస్సై సాయికుమార్, సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను 108లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చెందిన షేక్ సోందుబీ(68) మృతి చెందింది. అలాగే చికిత్స చేయిస్తుండగా గాదెపాడుకు చెందిన అంగన్వాడీ టీచర్ షేక్ మహబూబ్(48) కన్నుమూసింది. అంతేకాక అలాగే, సలీం(ఇల్లెందు) పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, కమల(గాదెపాడు)కు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యసత్తుపల్లిరూరల్: కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డా డు. మండలంలోని కాకర్లపల్లికి చెందిన మట్టా మురళీకృష్ణ(45) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నాక ఫలితం లేక శుక్రవారం రాత్రి ఆయన పురుగుల మందు తాగగా ప్రభుత్వాస్పత్రి తరలించా రు. అక్కడే చికిత్సపొందుతూ మృతిచెందాడు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేజీ గంజాయి స్వాధీనంతిరుమలాయపాలెం: ఒడిశా నుంచి గంజాయి తీసుకొస్తున్న ఓ వ్యక్తిని శనివారం తిరుమలాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గ్యామాతండాకు చెందిన ఆటో డ్రైవర్ లూనావత్ ప్రవీణ్కుమార్ అలియాస్ తాజ్ ఒడిశా నుండి మోటార్ సైకిల్పై కేజీ గంజాయితో వెళ్తున్నాడు. ఈక్రమాన తిరుమలాయపాలెం సమీపాన కొక్కిరేణి స్టేజీ వద్ద ఎస్ఐ కూచిపూడి జగదీష్ ఆధ్వర్యాన వాహనాల తనిఖీ చేస్తుండగా తాజ్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయన వద్ద పరిశీలించగా కేజీకి పైగా ఎండు గంజాయి లభించింది. ఈమేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు మహిళల మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం -
అటవీ కార్యాలయంలో రక్తదాన శిబిరం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని జిల్లా అటవీ కార్యాలయంలో శనివారం రక్తదాన శిబరం నిర్వహించారు. తలసేమియా బాధితుల కోసం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రంసింగ్ ఆధ్వర్యాన ఈ శిబిరం ఏర్పాటుచేయగా డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉన్న 18–65 ఏళ్ల మధ్య వయస్సు వారంతా రక్తదానం చేయొచ్చని, తద్వారా తలసేమియా బాధితులతో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఎఫ్ఓ హరిప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చందూనాయక్, డాక్టర్ నారాయణమూర్తి, సంకల్ప స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు ప్రొద్దుటూరి అనిత, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15వరకు ఇన్స్పైర్ దరఖాస్తులుఖమ్మం సహకారనగర్: ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్పైర్ అవా ర్డు స్కీమ్(ఈ–ఎంఐఏఎస్) సిస్టమ్ ద్వారా ఆన్లైన్ నామినేషన్లు సెప్టెంబర్ 15వ తేదీ వరకు స్వీకరిస్తామని డీఈఓ సామినేని సత్యనారాయణ తెలిపారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో మేధస్సు పదును పెట్టడానికి, వారిలో వినూ త్న ఆలోచనల ద్వారా నూతన ఆవిష్కరణలు వెలికితీయడంతో పాటు సమాజంలో అపరి ష్కృత సమస్యల పరిష్కారానికి ఇన్స్పైర్ మానక్ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈమేరకు కు www. inspireawards-dst. gov.in ద్వారా 6నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఉత్తమ ఆలోచనలను దరఖాస్తు చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి(94403 54528)ని సంప్రదించాలని డీఈఓ తెలిపారు. రూ.1.62కోట్లు కొల్లగొట్టిన కేసులో ఇంకొకరి అరెస్టుఖమ్మం క్రైం: ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ.1.62 కోట్ల మేర మోసం చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. బోనకల్ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఫోన్ చేసిన ముఠా సభ్యులు దితులు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వాట్సప్, ట్రేడింగ్ లింక్ల ద్వారా సుమారు రూ.1.62 కోట్లు జమ చేయించారు. ఆతర్వాత ముఖం చాటేయడంతో మోసపోయిన గుర్తించిన బాధితుడు ఖమ్మం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డబ్బు జమ అయిన అకౌంట్ ఆధారంగా ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, నేనావత్ అఖిల్ను నాగర్కర్నూల్ జిల్లాలో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరుపర్చాక రిమాండ్కు తరలించినట్లు సీపీ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైం డీఎస్పీ ఫణీందర్, ఎస్సైలు రంజిత్కుమార్, విజయ్కుమార్, సిబ్బందిని ిసీపీ అభినందించారు. విద్యార్థులపై శ్రద్ధ చూపాలి పాల్వంచరూరల్: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో సోమవారం నాటికి వందశాతం హాజరు ఉండాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. పాల్వంచలోని గిరిజన బాలికల పోస్టు మెట్రిక్ వసతి గృహం, బాలుర ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలకు చేరుకునేలా హెచ్ఎంలు, వార్డెన్లు చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పిల్లలకు రక్షిత తాగునీరు అందించాలని చెప్పారు. నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో వార్డెన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీఓ ఈ సందర్భంగా సూచించారు. -
కార్మికుల రేట్లపై చర్చలు వాయిదా
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్మికుల రేట్లు సవరించేందుకు శనివారం పాలకవర్గం, అధికారులు, సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం తుది నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడింది. మార్కెట్లో పనిచేసే హమాలీలు, రెల్లుడు కూలీలు, స్వీపర్లు, దడవాయిలు తదితరులకు రెండేళ్లకోసారి కూలీ రేట్లు పెంచ డం ఆనవాయితీ. ఈమేరకు కార్మిక సంఘాల ప్రతినిధులు 25 శాతం పెంచాలని కొన్నాళ్ల క్రితం లేఖ ఇచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు శనివా రం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు అధ్యక్షతన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పాటు దిగుమతి శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈమేరకు కార్మిక సంఘాల ప్రతినిధులు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమకు కూలీ ధరలు పెంచాలని కోరగా, రైతు సంఘాల ప్రతినిధులు మాత్రం ఈ ఏడాది పంటల ధరలు ఆశాజనకంగా లేనందున మరికొంత కాలం వాయిదా వేయాలన్నారు. దీంతో వారం తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలనే భావనకు రావడంతో రేట్ల పెంపు వాయిదా పడింది. మార్కెట్ ఉపాధ్యక్షులు తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో పాటు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్రావు, దొండపాటి రమేష్, వేణు, మీరా, లక్ష్మీనారాయణ, మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బడిలో సెల్కు చెల్లు
● తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్ మాట్లాడొద్దు ● స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ● పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని నిర్ణయంవైరా: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇకపై తరగతి గదిలో సెల్ఫోన్ మాట్లాడడం నిషేధం. ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం కొద్దిరోజుల క్రితం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తరగతి గదిలో ఉన్న సమయాన సెల్ఫోన్లో మాట్లాడితే చర్యలు ఉంటాయని అందులో వెల్లడించింది. రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఫోన్లు మాట్లాడడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని నిపుణుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఉపాధ్యాయులు స్వీయ నియంత్రణ పాటిస్తూ సెల్ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని సూచించింది. సమయం వృథా కాకుండా.. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్ మాట్లాడడం ద్వారా సమయం వృథా అవుతుందని, విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతింటుందని చెబుతున్నారు. అంతేకాక ఫోన్లో మాట్లాడగానే అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు వెంటనే పాఠ్యాంశంలో నిమగ్నం కావడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. ఈ విషయమై విద్యావేత్తల నుంచి అందిన సమాచారంతో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా, ఉపాధ్యాయులు తరగతి గదిలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకో వాలి. రాగానే స్టాఫ్రూమ్లో పెట్టడం.. విరామ సమయాల్లోనూ చూసేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కఠిన చర్యలు తీసుకుంటాం.. ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దు. పాఠం మధ్యలో ఫోన్ మాట్లాడినట్లు తేలితే చర్యలు తప్పవు. స్కూల్కు ఫోన్ తీసుకొచ్చినా హెచ్ఎంకు అప్పగించాలి. మధ్యలో వినియోగిస్తే బోధనలో ఏకాగ్రత దెబ్బతింటుంది. – సామినేని సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి ప్రభుత్వ నిర్ణయం మంచిదే.. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనివేళల్లో సెల్ఫోన్ వాడకుండా తీసుకున్న నిర్ణయం మంచిదే. తద్వారా విద్యార్థులు, బోధనకు పూర్తి సమయాన్ని కేటాయించొచ్చు. విద్యార్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. – దొడ్డా వరప్రసాద్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
సన్నగా సర్దేస్తున్నారు
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం కొద్దినెలలుగా సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుండడం అక్రమార్కులకు అవకాశంగా మారింది. కొందరు డీలర్లు, వ్యాపారులు ముఠాగా ఏర్పడి బియ్యాన్ని అధిక ధరలతో ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క లబ్ధిదారులు కూడా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేసిన సమయాన సాగిన అక్రమాలు ఇప్పుడు ఆగకపోగా.. పౌర సరఫరాల శాఖ అధికారులు నిఘా నేత్రాన్ని దాటి అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంఏళ్లుగా వేళ్లూనుకుని.. రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరించింది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యం పక్కదారి పడుతున్నాయి. అయితే, దొడ్డు బియ్యం పంపిణీ సమయాన లబ్ధిదారులు తినలేక.. డీలర్లు, ఇతరులకు అమ్మేవారు. ఇక కొందరు వ్యాపారులు రేషన్ షాప్ల్లో మిగిలిన, లబ్ధిదారుల వద్ద సేకరించిన బియ్యాన్ని ప్రాసెస్ చేయించి అధిక ధరకు విక్రయించేవారు. కొందరు బడా వ్యాపారులు.. మిల్లర్లు, ఇతరుల నుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యం సేకరించి పాలిష్ చేయించాక విదేశాలకు ఎగుమతి చేశారు. కొన్ని సందర్భాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు బియ్యం లారీలను పట్టుకున్నా దందా మాత్రం ఆగలేదు. సన్న బియ్యంతో చెక్ పెట్టాలని.. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయగా వాటిని తినేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. మధ్య తరగతి ప్రజలైతే బియ్యం అసలే తీసుకోలేదు. ఇదే అదునుగా బడా వ్యాపారుల జేబులు నింపుకున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు కచ్చితంగా తింటారనే భావనతో ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్షాప్ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. తొలి నెలలో బియ్యాన్ని లబ్ధిదారులు అధిక సంఖ్యలో తీసుకెళ్లి తినడానికి వీలుగా ఉన్నాయని తెలిపారు. తద్వారా అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని పౌర సరఫరాల శాఖ అధికారులు భావించారు. కఠిన చర్యలు తీసుకుంటేనే.. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడమే కాక లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకున్నట్లు తెలిస్తే కేసు నమోదు చేయడమే కాక రేషన్కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే బియ్యం అమ్మిన, కొనుగోలు చేసిన వారిపైనా కేసులు పెడతామని చెబుతున్నారు. ఈక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. అయితే, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు రేషన్షాప్లపైనా నిఘా పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.అక్రమంగా కొనుగోళ్లు, తరలింపు వ్యాపారులకు సహకరిస్తున్న కొందరు డీలర్లు అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న వ్యాపారం తనిఖీలు ముమ్మరం చేస్తున్న పౌర సరఫరాల శాఖ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తల్లాడ: వచ్చే మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతీ పేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తల్లాడ మండలం నారాయణపురం నుంచి కొడవటిమెట్ట వరకు రూ.5.50 కోట్లతో నిర్మించిన రహదారిని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ పాలన సాగిస్తోందని తెలిపారు. గత పాలకులు అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల వేళ తాము ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని చెప్పారు. భవిష్యత్లో మరి న్ని పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబ్, ఈఈ తానేశ్వర్, ఆర్డీఓ రాజేందర్, డీఈ ఖలీల్అహ్మద్, తహసీల్దార్ సురేష్కుమార్, ఎంపీడీఓ సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. రైతును రాజును చేసింది మనమే... కల్లూరు/తల్లాడ: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు, తల్లాడలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, సన్నబియ్యం పంపణీ చేస్తుండడమే కాక యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, బోనస్ ఇస్తున్నామని తెలిపారు. అంతేకాక భూభారతితో సమస్యలు పరిష్కరిస్తుండడం ద్వారా రైతులను రాజుగా చేస్తున్నామన్నారు. కాగా, కాంగ్రెస్ అమలుచేస్తున్న పథకాలు, గత ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఈనేపథ్యాన కార్యకర్తల్లో విబేధాలు ఉన్నా పక్కన పెట్టాలని తెలిపారు. ఈ సమావేశాల్లో ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవితో పాటు నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కాపా సుధాకర్, తూము వీరభద్రరావు, దగ్గుల రఘుపతిరెడ్డి, మారెళ్ల లక్ష్మణ్రావు, వీరారెడ్డి, కిషోర్, పోట్టేటి సంధ్యారాణి, బ్రహ్మారెడ్డి, గొడుగునూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీరెడ్డి, జనార్దన్రెడ్డి, గుర్రం శ్రీనువాసరావు, తుమ్మపల్లి రమేష్, ఆనంద్బాబు, వెంకటనారాయణరెడ్డి, పొట్టేటి జనార్దన్రెడ్డి, వీరా రెడ్డి, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, భాగం ప్రభాకర్రావు, ఏనుగు సత్యంబాబు, పెద్దబోయిన శ్రీను, ఎల్.పుల్లారావు, భూక్యా శివకుమార్ నాయక్, యాసా వెంకటేశ్వరరావు, నోటి కృష్ణారెడ్డి, దామాల రాజు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పాలన తల్లాడలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి కల్లూరు, తల్లాడ కాంగ్రెస్ సమావేశాలకు హాజరు -
లక్ష్యాన్ని చేరలేదు..
ప్రభుత్వ స్కూళ్లలో తరగతుల వారీగా విద్యార్థులు 28–04 20–06 –2024 –2025 1వ తరగతి 5,448 4,724 2వ తరగతి 5,486 6,116 3వ తరగతి 6,361 6,348 4వ తరగతి 7,675 7,103 5వ తరగతి 5,348 7,526 6వ తరగతి 6,820 4,842 7వ తరగతి 7,125 7,158 8వ తరగతి 7,500 6,919 9వ తరగతి 7,433 7,430 10వ తరగతి 7,093 7,388మొత్తం 66,289 65,554ఖమ్మం సహకారగనర్: ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన భవనాలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండడమే కాక విద్యార్థులకు ఉచితంగా విద్య, పాఠ్య, నోట్పుస్తకాలు, యూనిఫామ్ అందుతోంది. అలాగే, నాణ్యమైన మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్నారు. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి మక్కువ చూపడం లేదని తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఈనెల 3నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించారు. అయితే, కార్యక్రమం ముగిశాక నమోదైన ప్రవేశాల ఆధారంగా లెక్కలు వేస్తే గత విద్యాసంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉండడంతో బడిబాట ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. 735మంది తక్కువ... గత విద్యాసంవత్సరం ముగిసే నాటికి(ఏప్రిల్ 24న) జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి వరకు 66,289మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 10తరగతి విద్యార్థులు వెళ్లిపోగా, ఇతర పాఠశాలలకు మారిన వారిని కూడా మినహాయించి కనీసం అదే సంఖ్యలోనైనా విద్యార్థులు ఉండేలా ప్రవేశాలకు కృషి చేశారు. కానీ శుక్రవారం గణాంకాలను పరిశీలిస్తే విద్యార్థుల సంఖ్య 65,554మందిగా తేలింది. ఆదిలోనే గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య 735 తక్కువ ఉండగా.. వీరంతా కొనసాగుతారా.. ఇంకొందరు ఇతర పాఠశాలలకు వెళ్తే పరిస్థితి ఏమిటన్నది తెలియరావడం లేదు. సహకారం అందలేదా? రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో బడిబాట నిర్వహించాలని ఆదేశించింది. అయితే, చాలా శాఖల అధికారుల నుంచి సహకారం లభించలేదని విద్యాశాఖ వర్గాలు చెబు తున్నాయి. మండల ప్రత్యేక అధికారులు బడిబాట కార్యక్రమానికి నోడల్ అధికారులుగా ఉండగా... చాలాచోట్ల పాల్గొనలేదని సమాచారం. తద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తక్కువే.. గతేడాదితో పోలిస్తే పడిపోయిన విద్యార్థుల సంఖ్య ఆశించిన ఫలితాలు ఇవ్వని ‘బడి బాట’లక్ష్యసాధనకు కృషి చేస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మరింత పెరిగేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే మూతపడిన 12పాఠశాలలు తెరిపించాం. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రవేశాలు నమోదయ్యాయి. అయితే, గతేడాది కంటే విద్యార్థులు తగ్గకుండా మరిన్ని ప్రయత్నాలు చేస్తాం. – రాజశేఖర్, విద్యాశాఖ సీఎంఓ -
విపత్తుల నిర్వహణకు పకడ్బందీ ప్రణాళిక
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం సహకారనగర్: విపత్తుల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుని ఈసారి మూడు నెలల పాటు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయని తెలిపారు. తద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలకు వీలవుతుందని చెప్పారు. ఈమేరకు అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాక పునరావాస కేంద్రాలను గుర్తించాలని, అవస రమైన సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం కమాండర్ ఎస్.గౌతమ్, ఉద్యోగులు మద్దిలేటి, జగదీష్, సురేష్కుమార్, రియాజుద్దీన్, జనార్దన్ పాల్గొన్నారు. ఏఐతో సులువుగా పనులు అధికారులు విధినిర్వహణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఉపయోగిస్తూ సులువుగా పనులు చేసేలా త్వరలోనే వర్క్షాప్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన విధి నిర్వహణపై సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు ఫైళ్లు పరిష్కరించాలని, ఉద్యోగులు బృందంగా పని చేస్తేనే ఫలితాలు వస్తాయని తెలిపారు. అందరూ సమయపాలన పాటించాలని, గైర్హాజరైతే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆపై కలెక్టరేట్ నిర్వహణ, ప్రొటోకాల్ అంశాలపై సూచనలు చేశారు. -
మేరునగధీరులు.. దాశరథి, ఆరుద్ర
ఖమ్మం సహకారనగర్: తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన దాశరథి, ఆరుద్ర తెలుగు సాహిత్య చరిత్రలో మేరునగధీరులుగా నిలిచారని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన ‘శతజయంతి సాహితీమూర్తులు’ పేరిట దాశరథి – ఆరుద్రజీవితం సాహిత్యంపై నిర్వహించే రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎల్. ఎన్.శాస్త్రి అధ్యక్షత వహించగా దాశరథి, ఆరుద్ర చిత్రపటాల వద్ద నివాళులర్పించాక వీసీ సూర్య ధనుంజయ్ తదితరులు మాట్లాడారు. తెలంగాణ పీడిత ప్రజల పక్షాన నిలిచి అక్షరమే ఆయుధంగా పోరాడిన యోధుడిగా దాశరథి తిమిరంతో సమరం చేశారని చెప్పారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడిన బడుగు వర్గాలకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఇక ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య పరిశోధనతో చరిత్రను లోతుగా అధ్యయనం చేసి అరుదైన పరిశోధకుడిగా నిలిచారని కొనియాడారు. నేటి యువత వీరిద్దరి సాహిత్యంపై అధ్యయనం చేయాలని సూచించారు. అనంతరం దాశరథి, ఆరుద్ర సాహిత్యంపై ఓయూ తెలుగు శాఖాధిపతి ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, సాహిత్య విమర్శకులు కవి రెంటాల వెంకటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. ఈకార్యక్రమంలో కేయూ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్రా రాజుతో పాటు రవిమారుత్, ప్రసేన్, బానోత్ రెడ్డి, డాక్టర్ సునంద, డాక్టర్ పి.రవికుమార్, డాక్టర్ సీతారాం, డాక్టర్ జె.అనురాధ, కిరణ్కుమార్, డాక్టర్ ఎం.వీ.రమణ, డాక్టర్ కార్తీక్, కోటమ్మ, శ్రీ నివాస్ మాట్లాడగా వివిధ ప్రాంతాల అధ్యాపకులు 30మంది పత్రాలు సమర్పించారు.జాతీయ సదస్సులో వక్తలు -
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
ఖమ్మంక్రైం: మాదక ద్రవ్యాల వినియోగంతో నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి, సమూలంగా నిర్మించడమే లక్ష్యంగా పోలీసులు అధికారులు కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈనెల 26వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా స్థాయిల్లో అవగాహన సదస్సులతో పాటు యోగా, ధ్యానం, ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, పోటీలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈమేరకు ఖమ్మం కమిషనరేట్లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను సీపీ సునీల్దత్ వివరించారు. ఇంకా ఈ వీసీలో అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, సీఐ స్వామి పాల్గొన్నారు.టీకాలతోనే ఆరోగ్య సంరక్షణఖమ్మంవైద్యవిభాగం: మిషన్ ఇంద్రధనస్సు ద్వారా జిల్లాలో వంద శాతం గర్భిణులు, 0–5ఏళ్ల చిన్నారులకు టీకాలు వేయాలని, తద్వారా ఆరోగ్య సంరక్షణ సాధ్యమవుతుందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చంద్రూనాయక్ తెలిపారు. మిషన్ ఇంద్రధనస్సు, యోగా డే, డయేరియా నియంత్రణ కార్యక్రమాలపై శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనస్సు ద్వారా గర్భిణులు, చిన్నారులను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి టీకాలతో ప్రయోజనాలను వివరించాలని సూచించారు. అలాగే, డయేరియా నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలని, చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు అందించాలని తెలిపారు. కాగా, యోగా డే సందర్భంగా శనివారం ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని డీఐఓ సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ రామారావు, అదనపు డీఎంహెచ్ఓ బిందుశ్రీ, డీ.వీ.ఎల్ ఎం.రమణ తదితరులు పాల్గొన్నారు.అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలిఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను శుక్రవారం ఖమ్మంలోని డీపీఆర్సీ హాల్లో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బీఏఎస్లో సీటు రాని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, సంక్షేమ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ బీఏఎస్ పథకం ద్వారా ఒకటో తరగతిలో డే స్కాలర్లుగా 343దరఖాస్తులు అందగా 131 మందిని, ఐదో తరగతి(రెసిడెన్షియల్) ప్రవేశాలకు 219 దరఖాస్తులు అందితే 128 మందిని డ్రా ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సామినేని సత్యనారాయణ, ఎస్సీ డీడీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీఖమ్మంమయూరిసెంటర్: పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. స్థాయీ సంఘం ఆధ్వర్యాన నాలుగు రోజుల అధ్యయన యాత్ర కర్ణాటకలోని మంగళూరులో శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్రకు చైర్మన్ సునీల్ తర్కరే అధ్యక్షత వహించగా, పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల ధరలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే కార్యాచరణపై చర్చించారు. -
●పక్కాగా పక్కదారి..
ప్రభుత్వం, అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ కొందరు వ్యాపారులు సన్న బియ్యాన్ని సైతం పక్కదారి పట్టిస్తునట్లు తెలుస్తోంది. మొదటి నెల పూర్తిగా లబ్ధిదారులు బియ్యం తీసుకోగా, ఆతర్వాత నెల నుంచి సొమ్ము చేసుకోవడానికి అక్రమార్కులు యత్నాలు ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యంతో రూ.లక్షలు కొల్లగొట్టిన వ్యాపారులు.. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో ప్రణాళికతో పక్కదారి పట్టించే కుట్రకు తెరలేపారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు తీసుకోకపోగా మిగిలిన సన్న బియ్యం, ఇంకొన్ని చోట్ల లబ్ధిదారుల నుంచే నేరుగా సేకరించడం మొదలుపెట్టారు. దొడ్డు బియ్యం కన్నా ఎక్కువ డబ్బు ముట్టచెబుతుండటంతో పలుచోట్ల లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలా సేకరించిన సన్నబియ్యాన్ని తరలిస్తుండగా జిల్లాలో కొన్నిచోట్ల పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. తాజాగా గురువారం కల్లూరు నుంచి 145 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని లారీలో హైదరాబాద్కు తరలిస్తుండగా వైరా వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇవే కాకుండా రెండు నెలల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం తరలించినట్లు తెలుస్తోంది. -
వాడీవేడిగా డీసీసీబీ మహాజన సభ
● మినిట్స్ బుక్ లేకపోవడంపై సభ్యుల మండిపాటు ● డిపాజిట్లు, ఇతర అంశాలపై ప్రశ్నల వర్షం ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) 127వ మహాజన సభ వాడీవేడిగా సాగింది. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించగా, తొలుత వార్షిక నివేదిక ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా సహకార సంఘాల చైర్మన్లు పలువురు తీర్మానాలను మినిట్స్ బుక్లో రాయాలని సూచించగా.. అధికారులు బుక్ తీసుకురాలేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాజన సభకు మినిట్స్ బుక్ లేకుండా హాజరుకావడం ఏమిటంటూ సమోసాలు, టీ కోసం వచ్చామా అని ప్రశ్నించారు. కాగా, 2007–08లో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారి నుంచి రూ.90 కోట్లు డిపాజిట్లు సేకరిస్తే, ఆ డిపాజిట్ల చెల్లింపుపై గత సభలో చేసిన తీర్మానం అమలుకు నోచుకోలేదని పలువురు తెలిపారు. వడ్డీ కలిపి రైతులకు చెల్లించాల్సి ఉందని చెప్పడంతో త్వరలోనే చెల్లిస్తామని బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్య బదులిచ్చారు. కాగా, పీఏసీఎస్లు పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో డీసీఎంఎస్, ఇతర సంస్థల ద్వారా ధాన్యం కొనుగోలుపై అవకాశం కల్పించటం సరికాదని పేర్కొన్నారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల సమయాన నియమించే సిబ్బంది వేతనాల విషయమై ప్రశ్నించగా కమీషన్ నుంచి వేతనాలు చెల్లించవచ్చని జిల్లా సహకార అధికారి గంగాధర్ తెలిపారు. అలాగే, బ్యాంకు రుణాల నుంచి వసూలు చేసే వాటాధనంలో సహకార సంఘాలకు భాగం ఇచ్చేలా తీర్మానానికి పలువురు పట్టుబట్టారు. అంతేకాక 2023 నుంచి మొక్కజొన్నల కొనుగోళ్లపై రూ.లక్షల్లో రావాల్సిన కమీషన్ చెల్లించాలని కోరగా రాష్ట్ర మార్క్ఫెడ్ సమావేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని మార్క్ఫెడ్ జీఎం సునీత తెలిపారు. ఇంకా భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఎరువుల స్టాక్ పాయింట్ ఏర్పాటు, సహకార సంఘాల ఉద్యోగుల బదిలీలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, బ్యాంకు డైరెక్టర్లు గొర్ల సంజీవరెడ్డి, లక్కినేని సురేందర్రావు, లక్ష్మణ్రావు, ప్రసాద్, సైదులు, డీఆర్డీఓ అవధానుల శ్రీనివాసరావు, అధికారులు, పీఏసీఎస్ల చైర్మన్లు పాల్గొన్నారు. సభ్యులకు బీమా పెంపు పీఏసీఎస్ల నుంచి పంట రుణాలు తీసుకునే సభ్యులకు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పరిమితిని పెంచుతూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న బీమా పరిమితిని రూ.లక్షకు పెంచారు. అలాగే, 2024–25లో బ్యాంకు గడించిన లాభాల్లో రూ.530.55 కోట్లను సహకార సంఘాలకు డివిడెంట్(ఆరు శాతం)గా చెల్లించాలని నిర్ణయించింది. అంతేకాక ఉద్యోగులకు 8–12 శాతం(దూరం ఆధారంగా) అలవెన్స్ చెల్లింపునకు నిర్ణయించారు. అక్రమాలపై విచారణకు నిర్ణయం ఇళ్ల స్థలాలకు సంబంధించి నకిలీ ధ్రువ పత్రాలు సమర్పించి రూ.6 కోట్ల రుణాలు తీసుకున్న వ్యవహారంపై విచారణ చేపట్టాలని డీసీసీబీ పాలకవర్గం నిర్ణయించింది. మహాజన సభకు ముందుగా బ్యాంకు పాలకవర్గ సమావేశం జరగగా ఈ అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించారు. దీంతో బ్యాంకు సొమ్మును పక్కదారి పట్టించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా విచారణకు నిర్ణయించారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం
తిరుమలాయపాలెం: మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న ఏలువారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. గ్రామంలో ఇళ్లను శుక్రవారం పరిశీలించిన ఆమె లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడారు. ఆతర్వాత హైదర్సాయిపేట, పడమటితండా ఇసుక రీచ్లను పరిశీలించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక కూపన్లు సకాలంలో జారీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎంపీడీఓ ఎస్.కే.సిలార్ సాహెబ్, తహసీల్దార్ జి.లూథర్ విల్సన్, ఎంపీఓ పి.సూర్యనారాయణ, ఉద్యోగులు వీరయ్య, మిథున్, సునీత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యంతో మన్ననలు పొందాలి
మధిర: మధిర ప్రాంత వాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా అత్యాధునిక పరికరాలతో ఆస్పత్రిని ఏర్పాటుచేసిన హైకేర్ ఆస్పత్రి యాజమాన్య బాధ్యులు అభినందనీయులని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మధిరలో హైకేర్ ఆస్పత్రి భవనాన్ని శుక్రవారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ వారి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఆస్పత్రి అధినేత డాక్టర్ జంగా నవీన్రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్రెడ్డితో పాటు డాక్టర్ రామనాథం, డాక్టర్ కనకపూడి అనిల్, మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, సూరంశెట్టి కిషోర్, తూమాటి నవీన్రెడ్డి, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్, అద్దంకి రవికుమార్, ఏలూరు నాగేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు పాల్గొన్నారు. సింహాసనంపై ఒకరు.. ప్రజల గుండెల్లో మరొకరు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాహుబలి సినిమా మాదిరిగా ఉందని ఆ రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. హైకేర్ ఆస్పత్రి ప్రారంభానికి హాజరైన ఆయన జంగా నవీన్రెడ్డి, జంగా ప్రవీణ్రెడ్డిని అభినందించి మాట్లాడారు. ఆంధ్రాలో సింహాసనంపై ఒకరు కూర్చుంటే, ప్రజల గుండెల్లో మాత్రం మరొకరు (వైఎస్.జగన్మోహన్రెడ్డి) ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల ప్రేమ జగన్మోహన్రెడ్డిపై ఇలాగే ఉండాలని, ఈ ప్రేమ నిలబెట్టుకునేలా 24 గంటలు కష్టపడతామని తెలిపారు. -
మా కల నెరవేరుతోంది..
దాదాపు 40ఏళ్ల క్రితం ఖమ్మంలో తొలిసారి యోగా కేంద్రాన్ని ప్రారంబించాం. అప్పట్లో కేవలం పది మందే వచ్చేవారు. ఇప్పుడు అశించిన స్థాయిలో సాధకులు వస్తున్నారు. అంతేకాక మరిన్ని కేంద్రాలు ఏర్పాటుకావడం, ప్రభుత్వం సైతం గుర్తించడంతో మా కల నెరవేరుతోంది. – జీవీకే.శర్మ, పతంజలి యోగా కేంద్రం, ఖమ్మం సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్యం ప్రతీ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుటుంటారు. ఇందుకోసం యోగా, ధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించే శక్తి యోగాకు ఉంది. ఆడ, మగ బేధం లేకుండా సాధన చేయొచ్చు. – కోదండరావు, సిద్ధార్థ యోగా కేంద్రం, ఖమ్మం యోగాను విస్తృత పరుస్తాం సర్థార్ పటేల్స్టేడియంలో యోగా కేంద్రం ఏర్పాటుకు మా వంతుప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే యోగాలో జాతీయ, రాష్ట్రస్థాయిలో పలువురు రానించారు. వీరితో పాటు ఔత్సాహికుల కోసం ప్రత్యేక యోగా కేంద్రం ఏర్పాటు చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓ● -
ముగ్గురికి ఎస్సైలుగా పదోన్నతి
ఖమ్మంక్రైం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పదోన్నతిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించిన ఎం.సూర్యనారయణ, బేగ్, రాఘవయ్యను కమిషనర్ సునీల్దత్ శుక్రవారం సన్మానించారు.జూనియర్ ఫుట్బాల్ జట్టు ఎంపికఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్స్ ఫుట్బాల్ జట్టును ఎంపిక చేశారు. ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు రెండు జిల్లాల నుంచి 35 మంది క్రీడాకారులు హాజరయ్యా రు. వీరిలో ప్రతిభ చాటిన వారితో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశామని అసోసియేషన్ కార్యదర్శి కె.ఆదర్శ్కుమార్ తెలిపారు. ఈ జట్టు 28నుంచి జూలై 1వరకు నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని వెల్లడించారు.టేబుల్ టెన్నిస్ జట్లు..ఖమ్మం సర్దార్ పటేల్స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ జట్లను ఎంపిక చేశారు. ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న ఈ జట్ల ఎంపికను టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్కుమార్, వీవీఎస్.మూర్తి పర్యక్షించారు. బాలుర అండర్–13లో షేక్ సాహెల్ ఫజల్, అండర్–15లో గౌరిశెట్టి చార్విక్ స్థితప్రజ్ఞ, అండర్–17లో పరిటాల జ్వలిత్, ఎం.డీ.అనస్, సాత్వి క్, రాధాకృష్ణ, అండర్–19లో పిట్టల మోహిత్కృష్ణ ఎంపికయ్యారని తెలిపారు. అలాగే, బాలి కల విభాగం అండర్–13లో బొంతు సాయి, శివానీ, అండర్–17లో అమృత, గద్దల సిరి ఎంపిక కాగా అసోసియేషన్ బాధ్యులు షేక్ మజ్హార్, పరిటాల చలపతి, గద్దల రామారావు, రెడ్డి సాయి, శివ, అజయ్ పాల్గొన్నారుఉద్యోగుల సమస్యలు పరిష్కరించండిఖమ్మం సహకారనగర్: ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఉద్యోగ సంఘాల జేఏసీ బాధ్యులు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఆయను కలిసి పలు సమస్యలను వివరించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారుల సంఘం నాయకుడు రవీంద్రరెడ్డి, టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.గిరిజన సంక్షేమ శాఖలో సీఆర్టీల బదిలీభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పాఠ శాలల్లో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న ఉపాధ్యాయుల(సీఆర్టీ)ను బదిలీ చేశారు. ఆశ్ర మ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న 64 మంది సీఆర్టీలకు సబ్జెక్టుల వారీగా శుక్రవారం ఐటీడీఐ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్ ఇచ్చినట్లు డీడీ విజయలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత బెస్ట్ అవైలబు ల్ పాఠశాలల్లో 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి అందిన దరఖాస్తుల ఆధారంగా తల్లిదండ్రులు, కమిటీ సభ్యుల సమక్షాన డ్రా ద్వారా విద్యార్థుల ను ఎంపిక చేశామని డీడీ వెల్లడించారు. కార్యక్రమాల్లో వైరా ఏటీడీఓ జహీరుద్దీన్, ఏఓ నారాయణరెడ్డి, ఏసీఎంఓలు రాములు, రమేశ్, హెచ్డబ్ల్యూఓలు హన్మంతరావు, రాంబాబు, రాజేందర్, నర్సింహారావు, శ్రీనివాసరావు, ధనుశ్, భద్రాచలం ఎంఈఓ రమతో పాటు అలివేలు మంగతాయారు, రంగయ్య, ప్రసాద్, శ్రీధర్, మణికుమార్, సురేశ్, భద్రం పాల్గొన్నారు.ఉసురు తీసిన క్షణికావేశంఖమ్మంక్రైం: భార్యాభర్తల మధ్య తలెత్తిన వివా దంతో ఒకరి ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఖమ్మం ప్రకాష్నగర్కు చెందిన కొత్తపల్లి నాగేశ్వరరావు, త్రివేణి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై 13వ తేదీన వివాదం తలెత్తడంతో క్షణికావేశాని కి లోనైన నాగేశ్వరరావు నిద్రమాత్రలు మింగాడు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేర్పించగా.. సపర్యలు చేస్తున్న త్రివేణి ఈనెల 15న ఇంట్లో ఎలుకల మందు తాగింది. ఈమేరకు ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతే శుక్రవా రం మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. -
రాజకీయాల్లో యువత పాత్ర కీలకం
ఖమ్మంమయూరిసెంటర్: రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో కీలకమని గుర్తించి సమాజ మార్పునకు ముందుకు రావాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్రెడ్డి సూచించారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేజెండ్ల సాయికుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అంతేకాక ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఇదే సమయాన యువతకు అత్యధిక సీట్లు ఇచ్చేలా నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జిల్లా ఇన్చార్జి దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ కష్టపడి పని చేసే వారికి పదవులు తప్పక వస్తాయని తెలిపారు. తొలుత మయూరి సెంటర్లోని రాజీవ్గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శి జెర్రిపోతుల అంజనీకుమార్, నాయకులు యడ్లపల్లి సంతోష్, ఖలీల్ పాషా, బెజ్జం గంగాధర్, బానోత్ కోటేష్ పాల్గొన్నారు. కాగా, సభ్యత్వ నమోదులో ప్రతిభ కనబరిచిన యూత్ కాంగ్రెస్ నాయకుడు కె.క్రాంతికుమార్ను శివచరణ్రెడ్డి సత్కరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి -
1998లో స్థాపించాం..
సత్తుపల్లిలోని శ్రీరామకృష్ణ యోగా సమితిని 1998లో స్థాపించి యోగాసనాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నాం. రాజారత్నచారి, గువ్వల కృష్ణారెడ్డితో కలిసి ఏటా సుమారు వేయి మందికి కళాభారతి వేదికగా యోగాసనాలు నేర్పిస్తున్నాం. విద్యార్థులు, జైలు ఖైదీలకు కూడా శిక్షణ ఇచ్చాం. – చల్లగుళ్ల అప్పారావు, శ్రీరామకృష్ణ యోగా సమితి, సత్తుపల్లిధ్యానంతో ప్రశాంతత.. ధ్యానంతో ఒడిదుడుకులు, కోపాన్ని జయించవచ్చు. భౌతిక, అధ్యాత్మిక జీవనంలో సమతుల్యత ఏర్పడుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే ఏటా ‘హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ లైఫ్ పొటెన్షియల్’ పేరిట విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ఉప్పన శ్రీనివాసరెడ్డి, శ్రీరామచంద్ర మిషన్, సత్తుపల్లి 15 ఏళ్లుగా ధ్యాన శిక్షణ శ్వాసపై ధ్యాస కలిగేలా ధ్యానంపై శిక్షణ ఇస్తున్నాం. సత్తుపల్లిలో 15 ఏళ్లుగా పిరమిడ్ కేంద్రం నిర్వహిస్తున్నాం. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పలువురు ఇక్కడకు వస్తున్నారు. నిత్య సాధనతో మానసిక సమతుల్యత, ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తుంది. – బెల్లంకొండ సుశ్మిత, పిరమిడ్ సొసైటీ, సత్తుపల్లి● -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతసాగర్కు చెందిన వట్టికూటి జగదీష్(27) మృతి చెందాడు. ఆయన ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి అనంతసాగర్ వస్తుండగా పందిళ్లపల్లి సేషన్ సమీపాన ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తండ్రి నాసరయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు. రూ.63లక్షలకు ఐపీ దాఖలు ఖమ్మం లీగల్: ఖమ్మం సంభానీనగర్కు చెందిన షేక్ అన్వర్జానీ రూ.63 లక్షలకు దివాలా పిటిషన్(ఐపీ) దాఖలు చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా పలువురి వద్ద నగదు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ పది మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా శుక్రవారం ఖమ్మం సీనియర్ సివిల్జడ్జి కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశాడు. చెల్లని చెక్కుల కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వరంగల్కు చెందిన తొడుకునూరి రత్నాకర్, మహమ్మద్ హిమాయత్ అలీకి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బిక్కం రజిని తీర్పు చెప్పారు. శుక్రవారం వెలువరించిన ఈ తీర్పు వివరాలు... ఖమ్మం పంపింగ్వెల్ రోడ్డుకు చెందిన చుక్కల సరళాదేవికి చెందిన స్థలాలను కమీషన్ పద్ధతిపై అమ్ముతామని నమ్మించిన రత్నాకర్, అలీ జీపీఏ చేయించుకున్నారు. ఆపై స్థలాలు అమ్మినా సరళకు డబ్బు ఇవ్వకపోగా, పలుమార్లు అడిగాక చెరో రూ.30 లక్షల చొప్పున చెక్కులు జారీ చేశారు. కానీ వారి ఖాతాల్లో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం ఇద్దరికి ఏడాది జైలుశిక్ష విధించడమే తో పాటు ఫిర్యాదికి చెరో రూ.30 లక్షలు చెల్లించాలని న్యాయవాధికారి తీర్పు చెప్పారు. పాఠశాలలో విగ్రహాలు ధ్వంసం నేలకొండపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన గాంధీ, సరస్వతీదేవి విగ్రహాలను గుర్తుతెలి యని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉపాధ్యాయులు, స్థానికులు గుర్తించా రు. ఈమేరకు పోలీసులు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పసుమర్తి శ్రీనివాస్ తదితరులు కోరారు. -
దర్శనం, ఆర్జిత సేవలకు ఇక ఈ–టికెట్లు
● ట్రయల్ రన్ నిర్వహించిన దేవస్థానం ఈఓ ● ఇప్పటికే రామాలయంలో డిజిటల్ సేవలు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో డిజిటల్ సేవలు భక్తులకు మరింత చేరువ అవుతున్నాయి. ఇప్పటికే పలు విభాగాల్లో డిజిటల్ సేవలు అందుతుండగా తాజాగా స్వామివారి దర్శన, ఆర్జిత టికెట్లు పొందేందుకు మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం ఆలయంలో ట్రయల్ రన్ నిర్వహించారు. మూడు మిషన్లను ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఉచితంగా అందించగా, పడమెర మెట్ల వైపు ఒకటి, లడ్డూ కౌంటర్ల వద్ద రెండు మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. యంత్రాలతో భక్తుల సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. మరికొన్ని మిషన్లను దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు బ్యాంకర్లతో దేవస్థానం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేర్మేషన్ యాప్.. రామాలయ సమస్త సమాచారం లభించేలా భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేషన్(బీటీఐ) యాప్ రూపొందించారు. తెలంగాణలోనే తొలిసారిగా యాప్ను రూపొందించి భక్తులకు చేరువైన దేవస్థానంగా రామాలయం నిలిచింది. ఇందులో ఆలయానికి సంబంధించిన 22 రకాల సేవల వివరాలు లభ్యమవుతాయి. సేవలు పొందే ప్రదేశాలతో గూగుల్ మ్యాప్ను అనుసంధానించారు. భద్రాచలంతోపాటు చుట్టు పక్కల ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఉపాలయాలు, సందర్శనీయ స్థలాల వివరాలు కూడా పొందుపర్చారు. త్వరలో అకౌంట్లు సైతం.. త్వరలో అకౌంటింగ్ సెక్షన్ను సైతం డిజిటల్గా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రికార్డుల నిర్వహణలో ఉద్యోగుల చేసే తప్పులకు ఆడిటింగ్ సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రికార్డులను కంప్యూటరైజ్డ్ చేయనున్నారు. దీంతో ఉద్యోగులకు పని ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఈఓ రమాదేవి సాఫ్ట్వేర్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. మరో నెల రోజుల్లో రికార్డులు సైతం కంప్యూటరైజ్డ్ చేసే అవకాశం ఉంది. డిజిటల్మయంగా రామాలయం రామాలయం డిజిటల్మయంగా మారుతోంది. తొలుత దేవస్థాన వెబ్సైట్ ఆధునికీకరించారు. లడ్డూ కౌంటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్ చేశారు. నిత్యన్నదానం, గోశాలకు విరాళాలు ఇచ్చే వారి వివరాలు నమోదుతో పాటు దాతలకు ఆన్లైన్ రశీదులు అందజేస్తున్నారు. స్వామివారి వస్త్రాల విక్రయాలకు బార్కోడ్ రూపొందించారు. ప్రొటోకాల్ దర్శనానికి వచ్చే వారికి స్కాన్తో ఫొటో తీసి ఎంట్రీ టికెట్ అందజేస్తున్నారు. అన్నదానానికీ ఈ–టోకెన్ ఇస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో డిజిటల్ సేవలను విస్తరింపజేశారు.సులభంగా సేవలు పొందేలా.. ఒక్కొక్కటిగా భక్తులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. భక్తులకు సమయం ఆదా, సులభరీతిలో సేవలు అందేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. యాప్, ఆన్ల్లైన్లో సేవలతోపాటు తాజాగా కియోష్కి మిషన్లు ద్వారా దర్శన, ప్రసాద టికెట్లు విక్రయించే చర్యలు చేపట్టనున్నాం. వీటిపై ట్రయల్రన్ నిర్వహించాం. – ఎల్.రమాదేవి, రామాలయ ఈఓ -
నేడు యోగా దినోత్సవం
● యోగా సాధనకు పెరుగుతున్న ఆదరణ ● జిల్లాలో పలు సంస్థల ఆధ్వర్యాన కేంద్రాలు, ఉచిత శిక్షణ ● ఆసక్తిగా హాజరవుతున్న సాధకులు 40ఏళ్ల క్రితమే కేంద్రం వందల ఏళ్ల క్రితమే యోగా మనుగడలో ఉన్నట్లు తెలుస్తుండగా గత పది, పదిహేనేళ్ల నుంచి మాత్రం విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో కొన్ని సంస్థల ద్వారా జిల్లా, మండల కేంద్రాల్లో యోగా ఉచిత శిక్షణ ఇస్తుండగా ఔత్సాహికులు హాజరవుతున్నారు. ఖమ్మంలో దాదాపు 40 ఏళ్ల క్రితం పతంజలి యోగా కేంద్రాన్ని తొలిసారిగా స్థాపించారు. ఇందులో శిక్షణ పొందిన పలువురు రాష్ట్ర, జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటడం విశేషం. అంతేకాక జిల్లాలో శ్రీరామకృష్ణ యోగా సమితి, శ్రీరామచంద్ర మిషన్, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, బ్రహ్మకుమారీల ద్వారా శిక్షణ కొనసాగుతోంది. ఈమేరకు నేడు (శనివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్థల నిర్వాహకులు, సాధకుల అభిప్రాయాలు. -
వైస్ చైర్మన్గా శ్రీనివాస్యాదవ్
కామేపల్లి: రాష్ట్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల అభివృద్ధి మండలి వైస్ చైర్మన్గా జాలె శ్రీనివాస్యాదవ్ నియమితులయ్యారు. కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన ఆయనకు శుక్రవారం ఢిల్లీలో జాతీయ మండలి అధ్యక్షుడు రాహుల్ ద్వివేది నియామకపత్రం అందజేచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ, అటవీ సంబంధిత విధానాలు, కార్యక్రమాల ప్రణాళికలు విస్తరించడం, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వరిస్తానని తెలిపారు. పాత విధానంలోనే పంట రుణాలు ఇవ్వాలి ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1/70 చట్టం కారణంగా రైతులకు పంట రుణాల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నందున, గతంలో మాదిరి పహానీల ఆధారంగా రుణా లు ఇవ్వాలని పలు పీఏసీఎస్ల చైర్మన్లు కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో శుక్రవారం జరిగిన డీసీసీబీ మహాసభలో జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ వెంకట్ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. అలాగే, ఏజెన్సీ రైతులు సహకార బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేయించాలని కోరారు. కార్యక్రమంలో పాల్వంచ, కొత్తగూడెం, మేడేపల్లి, కొణిజర్ల పీఏసీఎస్ల చైర్మన్లు కొత్వాల శ్రీనివాసరావు, మండే హన్మంతరావు, సామినేని వెంకటేశ్వరరావు, చెరుకుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవులు ఇవ్వకుంటే గుణపాఠం చెబుతాం
ఖమ్మం మామిళ్లగూడెం: యాదవులు, మున్నూరు కాపులతో పాటు ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుంటే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షుడు డి.రాజారాంయాదవ్ హెచ్చరించారు. ఖమ్మంలో గురువారం ‘బీసీల రిజర్వేషన్లు, మంత్రి పదవుల కేటాయింపు’అంశంపై తెలంగాణ యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి గుమ్మా రోశయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యాదవులు, మున్నూరుకాపులు, ఎంబీసీలు సహకరించగా, యూపీఏ–1, 2 ప్రభుత్వం మనుగడలోనూ ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ కృషి ఉందని తెలిపారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి యాదవజాతిని నిర్లక్ష్యంగాచూడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సూచనల మేరకు ఇకనైనా మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 30వ తేదీన యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రాజారాం కోరారు. సదస్సులో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్నూరు కాపు సంఘం నాయకుడు గుండాల కృష్ణ, గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమరగాని వెంకన్నగౌడ్, తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య యాదవ్తో పాటు వివిధ సంఘాల నాయకులు ఎర్రబోయిన గోవిందరావు, గోవర్దన్, మేకల కృష్ణ, మధు, బారీ మల్సూర్, చిత్తారు ఇందుమతి, జడ మల్లేష్, జంగా సత్యనారాయణ, మీగడ రామారావు తదితరులు పాల్గొన్నారు.