breaking news
Khammam District Latest News
-
బ్యాంక్ ఖాతా నుంచి రూ.లక్ష మాయం
ఖమ్మంక్రైం: ఓ ప్రైవేట్ ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి రూ.లక్ష మాయమైన ఘటనపై శనివారం ఖమ్మం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మామిళ్లగూడెంకు చెందిన సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ.1.05 లక్షలు డ్రా అయినట్లు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోగా సైబర్ నిందితుల పనేనని భావిస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి రఘునాథపాలెం: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సాగర్ ప్రధాన కాల్వలో పడి మృతి చెందాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన కొత్తపల్లి పృథ్వీ (35) చేపలు పట్టేందుకు శుక్రవారం సాగర్ ప్రధాన కాల్వ డీప్కట్ వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా కాల్వ గట్టుపై దుస్తులు, చెప్పులు కనిపించాయి. దీంతో స్థానికుల సాయంతో గాలించగా శనివారం మృతదేహం బయటపడింది. ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కాల్వలో పడగా, లోతు ఎక్కువగా ఉండడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఘటనపై పృథ్వీ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. -
ఎయిర్పోర్టు ఆశలకు మళ్లీ రెక్కలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దశాబ్దాలుగా జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కల సాకారం దిశగా మరో ముందడుగు పడింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫీజుబులిటీ నివేదిక రూపొందించింది. ఆ వివరాలను పరిశీలించాలంటూ కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ రాశారు. చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆది నుంచి చొరవ చూపిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడిని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేయగా.. ఫీజుబులిటీ రిపోర్టును పది రోజుల్లో తయారు చేయాలని ఆయన గత నెల 23న ఆదేశించారు. కేంద్రం నుంచి చర్యలు మొదలుకాక ముందే రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. గతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పరి శీలించిన స్థలాలు ఒకసారి ఎకనామికల్గా, మరో సారి టెక్నికల్గా అనువుగా లేవని తేలాయి. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజ్ టెక్నాలజీస్ అనే థర్డ్ పార్టీ సంస్థ చేత ఫీజుబులిటీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించింది. ఆరు స్థలాల పరిశీలన ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆరు స్థలాలను ఎంపిక చేసింది. అవి వరుసగా దుమ్ముగూడెం, పాల్వంచ, చాపరాలపల్లి (ములకపల్లి మండలం), పెనగడప (చుంచుపల్లి మండలం), సుజాతనగర్ మండలంలో సీతంపేట, సుజాతనగర్ గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఫారెస్టు స్థలాలు, కొండలు గుట్టలు, వాగులు వంకలు తదితర వివరాలను పేర్కొంటూ ఫీజుబులిటీ సర్వే రూపొందిచారు. ఆ నివేదిక ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అత్యంత అనువైన ప్రాంతాలుగా సీతంపేట, సుజాతనగర్లు సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచాయి. త్వరలో రంగంలోకి కేంద్రం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రాజ్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన ఫీజుబులిటీ రిపోర్టును జత చేస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం మరో సారి లేఖ రాశారు. థర్డ్పార్టీ రూపొందించిన నివేదికను ఫీజుబులిటీ రిపోర్టుగా భావించి, తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తీసుకునే చర్యలకు రారష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఎయిర్పోర్టుకు సంబంధించి కేంద్ర తరఫున అధికారిక చర్యలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేంద్రం ఈ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటే తదుపరి చర్యగా టెక్నికల్ కమిటీని ఇక్కడకు పంపించే అవకాశం ఉంది. లేకపోతే ఏవియేషన్ శాఖ ద్వారా తానే ఫీజుబిలిటీ రిపోర్టు తెప్పించుకునే అవకాశం ఉంది.కొత్తగూడెం ఎయిర్పోర్ట్ (ఏఐ చిత్రం)ఫీజుబులిటీ సర్వే నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం సీతంపేట, సుజాతనగర్ల దగ్గర సుమారు 667 ఎకరాల స్థలం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనువుగా ఉన్నట్టు ప్రాథమిక సర్వేలో తేలింది. 80 సీట్ల సామర్థ్యం కలిగిన ఏటీఆర్–72–600 తరహా విమానాలు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా ఇక్కడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నట్టు తేలింది. స్థల లభ్యత, భూతల స్వరూపం, రన్వే దిశ, ఎత్తు పరిమితి ఉపరితలాలు (అబ్స్టకల్ లిమిటేషన్ సర్ఫేసెస్), పర్యావరణ అంశాలు, రవాణా సౌకర్యాలు వంటి అంశాల్లో సీతంపేట, సుజాతనగర్లు ముందు వరుసలో నిలిచాయి. ఈ స్థలాన్ని పరిగణనలోకి తీసుకుంటే తదుపరి దశలో ఏవియేషన్ శాఖ నిర్వహించే సాంకేతిక పరీక్షలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావనే నమ్మకం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొంది. -
విప్లవ రాగానికి వీడ్కోలు
కడదాకా పీడిత జనం సమస్యలపై విప్లవ రాగాలతో ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ అగ్రనేత నాగన్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన శుక్రవారం కన్నుమూయగా, శనివారం ఖమ్మంలోని న్యూడెమోక్రసీ కార్యాలయం వద్ద సంతాప సభ ఏర్పాటుచేశారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, ఉద్యమకారులు పాల్గొని నివాళులర్పించారు. ఆతర్వాత ఆయన పాటలు, కళారూపాల నడుమ ఊరేగింపు నిర్వహించి నాగన్న మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. – ఖమ్మం మయూరిసెంటర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నాగన్న మృతదేహం అప్పగింతనాగన్న చిత్రపటం వద్ద గోరెటి వెంకన్న, సంధ్యక్క -
కట్టుకాచారం పీఎస్లో ‘విద్యా ప్రవేశ్’ ప్రారంభం
నేలకొండపల్లి: పిల్లల్లో పాఠశాలలపై భయం పోగొట్టి, ఆటపాటలతో బోధించేందుకు ప్రవేశపెట్టిన ‘విద్యా ప్రవేశ్’ కార్యక్రమాన్ని నేలకొండపల్లి మండలం కట్టుకాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ బి.చలపతిరావు ప్రారంభించి మాట్లాడుతూ భయం పోగొట్టి ప్లిలను బడికి అలవాటు చేసేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం 12వారాల పాటు కొనసాగుతుందని తెలిపారు. పిల్లల శారీరక, మానసిక వికాసం, సామాజిక భావోద్వేగం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని వెల్లడించారు. పుస్తకాల్లోని పాఠాలు కా కుండా మూడు నెలల పాటు ఇండోర్, ఔట్డోర్ ఆటలు, బొమ్మలు గీయడం, మట్టితో వస్తువులు తయారు చేయించడంతో పాటు కథల ద్వారా బోధ న సాగుతుందని తెలిపారు. కాగా, విద్యాప్రవేశ్ కార్యక్రమ అమలుకు అవసరమైన సామగ్రి సమకూర్చిన ఉపాధ్యాయుడు ఇటిక్యాల సురేష్ను అభినందించారు. ప్రధానోపాధ్యాయులు నరేందర్, రాందాసు, ఉపాధ్యాయులు కళ్యాణి, నారాయణ పాల్గొన్నారు. -
రెట్టింపు డబ్బు పేరిట మోసంలో మరో ముగ్గురు అరెస్టు
వేంసూరు: ఒకటికి నాలుగు రెట్ల డబ్బు ఇస్తామని పలువురిని మోసగిస్తూ దోపిడీకి పాల్పడుతున్న ముటాలో మరో ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేయగా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో గతనెల 30న వేంసూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈమేరకు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం నేతృత్వాన ప్రత్యేక బృందాలు దర్యాప్టు చేపట్టగా ఇప్పటికే చంటిబాబు, కానిస్టేబు ల్ వర్ధన్ను తదితరులను ఈనెల 2న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ తెలిపారు. కాగా, శనివారం మధ్యాహ్న వేంసూరు– లంకపల్లి రోడ్డులో మామిడి తోటలో తలదాచుకున్న నిందితులు వాడపల్లి విజయ్, గుమ్మళ్ల సుమంత్, కొంగల వంశీని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈసమావేశంలో ఎస్ఐ టి.కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
166 కేజీల గంజాయి స్వాధీనం
సత్తుపల్లిటౌన్: ఒడిశా నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 166.300 కేజీల గంజాయిని సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టణ సీఐ శ్రీహరి శనివారం వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా దొరగుడాలోని గుంతవాడకు చెందిన ప్రబిన్భాత్ర కారుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు రూ.89.13 లక్షల విలువైన గంజాయి అప్పగించిన బికారి అలియాస్ రోహన్ హైదరాబాద్లో తాను చెప్పిన వ్యక్తికి అందించాలని రూ.10 వేల కిరాయి ఖరారు చేశాడు. దీంతో ప్రబిన్ కారులో దారకొండ జంక్షన్ నుంచి బయలుదేరి రాజమండ్రికి, ఆపై గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా వస్తూ శుక్రవారం సత్తుపల్లి చేరుకున్నాడు. ఇక్కడ భోజనం చేశాక హైదరాబాద్ వెళ్లాలని భావించి ఆగాడు. ఈ మేరకు పక్కా సమాచారంతో ఏసీపీ వసుంధరయాదవ్ సూచనల మేరకు ఈగల్ టీం, సత్తుపల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కారులో గంజాయి లభించింది. దీంతో గంజాయి, కారును సీజ్ చేసి ప్రబిన్ను శనివారం కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐలు వీరప్రసాద్, ప్రదీప్, సిబ్బంది పాల్గొన్నారు.ఒకరి అరెస్టు.. కారు సీజ్ -
పంట మార్పిడికి ప్రత్యేక కార్యాచరణ
● ప్రజారోగ్యం, వరదలపై అప్రమత్తంగా ఉండాలి ● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఖమ్మం సహకారనగర్: పంట మార్పిడి చేయడమే కాక ఆయిల్ పామ్ సాగుకు ముందుకొచ్చేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వానాకాలం పరిస్థితులు, తాగునీటి సరఫరా, ఎరువులు–విత్తనాల లభ్యత, ప్రజారోగ్యం, వరదల సన్నద్ధత, విద్యాశాఖపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించినందున జిల్లాల వారీగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా నుంచి వీసీలో కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మున్నేరు, పాలేరు, వైరా రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు తగినంత నీరు అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే, విత్తనాలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల కట్టడి, వరదల సన్నద్ధత, విద్యాశాఖలో అమలుచేస్తున్న కార్యక్రమాలను వివరించారు. పనులు త్వరగా పూర్తి చేయండి జిల్లాలో రహదారులు, వంతెనలు, ఇతర నిర్మాణాలు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన ఆర్అండ్బీ పరిధిలో పనులపై అధికారులతో సమీక్షించారు. పనులకు ఆటంకాలు రాకుండా పర్యవేక్షించాలని, సీఆర్ఎఫ్ నిధులతో చేపట్టే రహదారి నిర్మాణాల సందర్భంగా ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలని తెలిపారు. ఖమ్మం కేబుల్ బ్రిడ్జి వద్ద రహదారి, ముదిగొండ–వల్లభి నాలుగు లేన్ల రహదారి, బోనకల్ – ఆళ్లపాడు రహదారి పనులపై సూచనలు చేశారు. ఇక ఈనెలలో సీఎం జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆర్ అండ్ బీ ఎస్ఈ యుగంధర్, ఈఈ బషీర్, సీతారామయ్య, డీఈ భగవాన్ పాల్గొన్నారు. మాజీ సీఎం రోశయ్యకు నివాళి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన కొణిజేటి రోశయ్య జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ దివాకర పూలమాల వేసి నివాళులర్పించాక మాట్లాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా బడ్జెట్ రూపకల్పనలో రోశయ్య ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీని వాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా, చురుగ్గా కొనసాగుతోందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని జాబితా నుండి తొలగిస్తూ అవసరమైన సవరణలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 1,460 మంది బూత్ లెవల్ అధికారులను నియమించగా, ఇప్పటివరకు 12,29,139 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీతో 98.82 శాతం పూర్తయిందని తెలిపారు. అంతేకాక ఓటర్ల నుంచి అందిన వాటిలో 1,47,344 ఫారాల (11.85 శాతం) డిజిటలైజేషన్ చేశామని పేర్కొన్నారు. ఓటర్ల సందేహాలు నివృత్తి చేయడానికి మునిసిపల్, మండల కేంద్రాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. -
రూ.కోటితో ఆలయ నిర్మాణం
● నేడు అభయాంజనేయ స్వామి, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన తల్లాడ: మండలంలోని గొల్లగూడెంలో నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఆదివారం జరగనుంది. గ్రామంలో ఇప్పటికే ఉన్న రామాలయానికి సమీపాన గ్రామస్తులు, దాతల చేయూతతో రూ.కోటి నిధులు వెచ్చించి అభయాంజనేయ స్వామి ఆలయాన్నినిర్మించారు. ఈ మేరకు ఆదివారం ఆలయంలో అభయాంజనేయ స్వామి విగ్రహంతో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, నాగేంద్రుడు, లక్ష్మీదేవి విగ్రహాల ప్రతిష్ఠాపన జరగనుంది. అర్చకులు కంచెల సతీశ్శర్మ ఆధ్వర్యాన ఈ పూజలు జరగనుండగా, గ్రామంలో బొడ్రాయి, ముత్యాలమ్మ ప్రతిష్ఠాపనకు సైతం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు వీక్షించేందుకు గ్రామంలోని అందరి ఇళ్లకు బంధువులు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు ● ఇద్దరు జీపీఓలపై ఆర్డీఓ విచారణ వైరారూరల్: రెవెన్యూశాఖకు సంబంధించి క్షేత్రస్థాయిలో కీలకమైన గ్రామపాలన అధికారులు (జీపీఓ) విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఖమ్మం ఆర్డీఓ ఎన్.శ్రీనివాసరావు హెచ్చరించారు. మండలంలోని గొల్లపూడి, సోమవరం జీపీఓలపై ఫిర్యాదులు అందడంతో ఆయన వైరా తహసీల్లో విచారణ చేపట్టారు. ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో జారీ చేయడం లేదనే తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆర్డీఓ విచారించారు. అనంతరం మండలంలోని జీపీఓలందరితో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. పనితీరు మార్చుకుని విధుల్లో అలసత్వాన్ని వీడాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. వైరా తహసీల్దార్ సీహెచ్ సురేశ్బాబు పాల్గొన్నారు. ఫోరెన్సిక్ సైన్స్పై న్యాయవాదులకు సెమినార్ ఖమ్మంలీగల్: సివిల్, క్రిమినల్ న్యాయ వ్యవహారాల్లో కీలకమైన వేలిముద్రల సేకరణ, పోస్టుమార్టం వివరాల పరిశీలనలో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్పై న్యాయవాదులకు అవగాహన కల్పించేందుకు శనివారం సెమినార్ నిర్వహించారు. బార్ అసోసియేయేషన్ ఆధ్వర్యాన హైదరాబాద్లోని ‘ప్రోబ్’ఫోరెన్సిక్ ల్యాబ్ సహకారంతో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో సైబర్ క్రైమ్లు పెరుగుతున్న నేపథ్యాన సాంకేతిక పరిజ్ఞానంపై న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇందుకోసం ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ‘ప్రోబ్’ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ ఎర్రగొల్ల మురళి పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్లపల్లి రమేశ్, కొప్పుల రవికుమార్తో పాటు న్యాయవాదులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఏడీగా డీఈఓ కార్యాలయ ఉద్యోగికి పదోన్నతి ఖమ్మంసహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ సూపరింటెండెంట్ చావా శ్రీనివాసరావుకు పదోన్నతి లభించింది. ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పదోన్నతి కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఆయనను నిర్మల్ డీఈఓ కార్యాలయం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోదరి, కోడలిపై దాడి.. హత్యాయత్నం ● సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్ ఖమ్మంఅర్బన్: అప్పుగా తీసుకున్న రూ.35 లక్ష లు, బంగారు ఆభరణాల వివాదంలో సోదరి, మేనకోడలిపై దాడి చేయడమే కాక సోదరికి బలవంతంగా పురుగులమందు తాగించిన ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను ఖమ్మం అర్బన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఖమ్మంలో నివాసముండే కేలోతు రమేశ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన సోదరి పద్మ, ఆమె కుమార్తె గుగులోత్ వాణి వద్ద సుమారు రూ.35లక్షల నగదు, ఆభ రణాలు అప్పు పేరిట తీసుకుని ఇంటి నిర్మాణానికి వినియోగించినట్లు సమాచారం. అయితే, ఈ నగదు, ఆభరణాలు తిరిగి ఇవ్వాలని వారిద్దరు కోరగా జూన్ 28న ఇంటికి పిలిపించి వారి నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులను బలవంతంగా లాక్కొని దాడి చేశాడు. అంతేకాక పద్మకు బలవంతంగా పురుగులమందు తాగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేలోతు రమేశ్ను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. -
విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ కుట్ర
ఖమ్మంవైరారోడ్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా కుట్ర పన్నిందని ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ముప్ఫై నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.9 వేల కోట్లు చెల్లించకపోవడం ప్రభుత్వ తీరును తెలియజేస్తోందని తెలిపారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యాన ఖమ్మంలో శనివారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్రెడ్డి కనీస సమీక్షలు కూడా చేయడం లేదన్నారు. 2014లో కేసీఆర్ సీఎం కాగానే ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బకాయిలు సైతం చెల్లించారని తెలిపారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీకి ఉన్న నిధులు.. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు రాకపోవడం గర్హనీయమని చెప్పారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్లో అంకెల గారడీ చేస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల భవనాలు నిర్మిస్తుండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలన్నారు. అనంతరం రాకేశ్రెడ్డి మాట్లాడుతూ బకాయిలు విడుదల చేయకపోగా, ప్రశ్నించిన కళా శాలల యాజమాన్యాలను విజిలెన్స్ తనిఖీల పేరిట వేధించడం సరికాదని తెలిపారు. అనంతరం పలు పార్టీల నాయకులు గుండాల కృష్ణ, రావి శివరామకృష్ణ, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, ఆవుల అశోక్, బషీర్ మాట్లాడగా, నాయకులు వల్లే శ్రీని వాస్, భూక్యా భద్రు, మేగడ రామారావు, వెంటకటరమణ, రామ్మూర్తి, ఇటికాల రామకృష్ణ, రాకేశ్, వివిధ కళాశాలల యాజమానులు పాల్గొన్నారు.రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ మధు, మాజీ మంత్రి పువ్వాడ -
డిగ్రీ విద్యార్థులే ‘అన్న–అక్క’లు!
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం డిగ్రీ విద్యార్థుల కోసం వినూత్నంగా ‘అన్న–అక్క’ పేరిట మెంటార్షిప్ టీచింగ్, లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. ఇందులో భాగంగా తమ కళాశాల ఐదో సెమిస్టర్ విద్యార్థులు 350మంది ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్లో శిక్షణ పొందారని వెల్లడించారు. వీరు ఎంపిక చేసిన 59 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘అన్న – అక్క’ కార్యక్రమంలో భాగంగా ఏఐతో పాటు ఇతర అంశాలు బోధిస్తారని తెలిపారు. విడతల వారీగా సెప్టెంబర్ 5వ తేదీలోగా 30 గంటల పాటు బోధించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగేశ్వరరావు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. తొలుత కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి.సర్వేశ్వరరావు, డాక్టర్ డి.శ్రీనివాస్, డాక్టర్ పి.వేణుమాధవ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో శిక్షణ పొందాక.. ఇక్కడ అధ్యాపకులు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని వెల్లడించారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన -
రైతు డిస్కం వస్తోంది!
● లైసెన్సు కోసం ప్రభుత్వం కసరత్తు ● ఉద్యోగుల బదలాయింపుపై చర్చ ● జిల్లా నుంచి 80 మంది ఉద్యోగుల దరఖాస్తు ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం రూపు దాల్చుకుంటోంది. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, ఇతర ప్రభుత్వ, మున్సిపల్ నీటి సరఫరా పథకాలతో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ కోసం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఆర్పీడీసీఎల్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2 వేల మంది ఉద్యోగులు అవసరమని గుర్తించగా, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ మేరకు 3 వేల మంది పలు కేటగిరీల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది, ఎస్పీడీసీఎల్ నుంచి 712 మంది, జెన్కో నుంచి 446, ట్రాన్స్కో నుంచి 166 మందితో ఇంకొన్ని విభాగాల వారు ఉన్నారు. ఇదే సమయాన విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మాత్రం సరైన విధివిధానాలు ప్రకటించకుండా నూతన డిస్కం ఏర్పాటు సరికాదని ఆందోళన చేయడంతో ప్రక్రియకు బ్రేక్లు పడ్డాయి. కానీ ప్రభుత్వం మాత్రం డిస్కం ఏర్పాటుపై నిపుణులతో చర్చించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) లైసెన్సు జారీకి కసరత్తు చేస్తుండడంతో త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలిసింది. ఈ సీజన్లో సరికాదు.. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వేళ రైతు డిస్కంను ఎలా అమల్లోకి తీసుకొస్తారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బోరు బావులు, ఎత్తిపోతల పథకాలు, బావుల కింద పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న సంస్థ నుంచి వ్యవసాయ కనెక్షన్లను రైతు డిస్కంకు మార్చడం ఇబ్బందిగా ఉంటుంది. అసలే ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండవని చెబుతున్నారు. దీంతో బావులు, ఇతర వనరుల్లో ఉన్న నీటిని మోటార్ల ద్వారా సాగు అవసరాలకు ఉపయోగించుకోవాలని రైతులు భావిస్తుండగా, నూతన డిస్కం ఏర్పాటు పనులు మొదలుపెడితే తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ మేరకు వానాకాలం, యాసంగి సీజన్లలో డిస్కం ప్రణాళికలు సిద్ధం చేసి.. వచ్చే వేసవి ఏప్రిల్ నుంచి కనెక్షన్ల మార్పు, ఇతర పనులు చేపడితే మంచిదనే సూచనలు వస్తున్నాయి. ఇక ప్రత్యేక డిస్కం ఏర్పాటుతో ట్రాన్స్ఫార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తుండగా, ఎంత మేర ప్రభావం ఉంటుందని రైతుల్లో చర్చ జరుగుతోంది. ఉద్యోగుల బదలాయింపుపై చర్చ ప్రస్తుతం నిర్వహణలో ఉన్న విద్యుత్ సంస్థల నుంచి పలు నిష్పత్తుల్లో ఉద్యోగుల బదలాయింపునకు నూతన సంస్థ రైతు డిస్కం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ నుంచి 40 శాతం చొప్పున, జెన్కో, ట్రాన్స్కో నుంచి 10 శాతం చొప్పున ఉద్యోగులను బదలాయించే అవకాశం ఉన్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించాక ప్రస్తుత సంస్థల నుంచి రైతు డిస్కంలోకి బదలాయించే అవకాశముంది. ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది రైతు డిస్కంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో ఖమ్మం సర్కిల్ నుంచి పలు కేటగీరీల్లో 80 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల బదలాయింపు అంశంపై విద్యుత్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, బదలాయింపు పూర్తయ్యాక విద్యుత్ సంస్థల్లో బదిలీల ప్రక్రియ చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. -
జమలాపురంలో శాంతి కల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి మహా కుంభాభిషేకం స్వర్ణోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల శాంతి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్ తుళ్లూరి నిర్మలకుమారి – కోటేశ్వరరావు దంపతులు కల్యాణం నిర్వహించగా, శివపార్వతుల స్వరూపాలుగా భావిస్తూ లోక కల్యాణార్ధమై గోమాత – వృషభ కల్యాణాన్ని సొసైటీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు – స్వప్న దంపతుల చేతుల మీదుగా పూర్తిచేశారు. ఈమేరకు పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విప్లవ రాగానికి వీడ్కోలు
● ప్రశ్నించే గొంతుకలు వెళ్లిపోతుంటే బాధేస్తోంది ● అరుణోదయ నాగన్న సంతాప సభలో కళాకారులు, నాయకులు ● ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత ఖమ్మంమయూరిసెంటర్: కంచుకంఠంతో పీడిత జనం గుండెల్లో విప్లవ రాగాల గోదారి పారించిన ప్రజా గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ అగ్రనేత నాగన్నకు పలువురు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసిన విషయం విదితమే. ఈ సందర్భంగా శనివారం ఖమ్మంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయం వద్ద నిర్వహించిన నాగన్న సంతాప సభలో పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, ఉద్యమకారులు పాల్గొని నివాళులర్పించారు. నాగన్న గళం.. ప్రజా పోరాటాలకు ఊపిరి ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం, అరుణోదయ విమలక్క, కవి జయరాజు, ఏపూరి సోమన్న, పీవీ శ్రీనివాసరావు, సృజన తదితరులు మాట్లాడారు. ప్రస్తుత ప్రజా కార్యక్రమాలు, విప్లవ ఉద్యమాలకు ఊపిరి పోసిన కంచుగళం నాగన్నదని తెలిపారు. ఎన్నో సభల్లో ఆయన పాడిన రామనరసయ్య పాటలు, బురక్రథలు వింటూ ఉత్తేజం పొందామని చెప్పారు. నాగన్న కేవలం కళాకారుడే కాదని, విప్లవోద్యమ సాంస్కృతిక రంగాన్ని నమ్ముకుని జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని కొనియాడారు. పెద్ద చదువులు లేకున్నా భార్య లక్ష్మక్క తోడుతో అరుణోదయంలో ఆయన పోషించిన పాత్రను ఎవరూ మరవలేరని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా తన కుమారుడి పేరు రాయడానికి ఒప్పుకోని నిస్వార్థపరుడు నాగన్న అని తెలిపారు. అయితే, సమాజం కోసం పుట్టి, విప్లవోద్యమంలోనే ఒరిగిపోయిన ఆయనతో పాటు ప్రశ్నించే గొంతులన్నీ మూగబోతుంటే బాధ కలుగుతోందని పేర్కొన్నారు. నివాళులర్పించిన ప్రముఖులు.. నాగన్న మరణ వార్త తెలుసుకుని తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల కవులు, కళాకారులు, వామపక్ష పార్టీల నాయకులు ఖమ్మం తరలి వచ్చారు. ఈ సందర్భంగా నాగన్న మృతదేహం వద్ద నివాళులర్పించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి జయరాజుతో పాటు పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఆవునూరి మధు, ఏపూరి సోమన్న పీపీ ప్రసాద్, చెరుకు సుధాకర్, సంధ్యక్క, ఝాన్సీ, యశ్పాల్, గోవర్దన్, స్పర్శ భాస్కర్, పుష్ప, జ్వాల వెంకటేశ్వర్లు, గాదె రామనర్సయ్య, బండారు ఐలయ్య, కోల లక్ష్మీనారాయణ తదితరులు నాగన్న భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కాగా, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. అంతేకాక దొడ్డి కొమరయ్య సినిమా బృందం సేనాపతి, షేక్ అబ్దుల్ రహిమాన్, కాయితోజు వెంకటేశ్వర్లుతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కేవీ కృష్ణారావు తదితరులు కూడా నివాళులర్పించారు. ఆ తర్వాత ఖమ్మంలో భారీ ఊరేగింపుగా వెళ్లి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చేరుకుని నాగన్న భౌతికకాయాన్ని అప్పగించారు. ఈ క్రమాన కళాకారులు గోదారి నదిలా గెంతులేసే పాట.. నాగన్న పాట విప్లవాల పాట.., ఏ దారి లేనోళ్లనొకటి చేసే పాట.. పేదోళ్ల పాట నాగన్న నోట.. అంటూ పాటలు పాడడమే కాక కళారూపాలు ప్రదర్శించారు. -
ఈనెల 18న ప్రత్యేక లోక్అదాలత్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు ఖమ్మంలీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు తెలిపారు. ఈమేరకు శనివారం బ్యాంకర్లు, చిట్ఫండ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులు పరిష్కరించుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.శివరంజని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.రమేష్, న్యాయవాది ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు నేలకొండపల్లి మండలం బోదులబండలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటలకు కల్లూరు మండలం చిన్న కోరుకొండిలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాక, కల్లూరు మున్సిపాలిటీ పరిధి పుల్లయ్య బంజరలో లోకవరం–పెనుబల్లి మార్గంలో హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ఆతర్వాత కల్లూరు అంబేద్కర్ సెంటర్లో డ్రెయిన్లు, ఖమ్మం–అశ్వారావుపేట హైవేపై కల్లూరు జంక్షన్ అభివృద్ధి పనులు, సాయంత్రం 3గంటలకు సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ కళాశాలలో రన్నింగ్ ట్రాక్, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద బుగ్గపాడు–యాతాలకుంట ఆర్అండ్బీ రోడుడపై హై లెవల్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభిస్తారు. ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీడబ్ల్యూఓ జి.జ్యోతి ఒక ప్రకటనలో సూచించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ జమ అయ్యేలా అకౌంట్ వివరాలు నమోదు చేయాలని తెలిపారు. అంతేకాక ప్రతీ విద్యార్థి అకౌంట్కు ఆధార్ నంబర్ అనుసంధానం చేయించుకోవాలని ఆమె ఓ ప్రకటనలో సూచించారు. కొనసాగుతున్న ‘రైతు భరోసా’ జమ ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతుభరోసా ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు శనివారం ఆరు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయింది. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,25,505 మంది రైతుల ఖాతాల్లో రూ.333.46 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 85,803 మంది రైతులకు రూ.86.36 కోట్లు జమ అయ్యాయి. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో 81,485 మందికి రూ.81.92కోట్లు, పాలేరులో 76,628 మందికి రూ.74.02 కోట్లు, వైరాలో 62,657 మందికి రూ.71.06 కోట్లు, ఖమ్మం నియోజకవర్గంలో 17,729 మందికి రూ.19.06 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలంలో 1,203 మంది రైతులకు రూ.1.04 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. కేయూ దూరవిద్యలో ప్రవేశానికి దరఖాస్తులు ఖమ్మంసహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్(గతంలో ఎస్డీఎల్సీఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి.గోపి తెలిపారు. బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ మ్యాథ్స్, బీఎల్ఐసీతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని తెలిపారు. వివరాలకు 80088 11998 నంబర్లో లేదా కేయూ వెబ్సైట్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
మాజీ ఎమ్మెల్యే లింగయ్యదొరకు గౌరవ డాక్టరేట్
కరకగూడెం: మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఆదివాసీ హక్కుల జాతీయ నాయకుడు చందా లింగయ్యదొరకు అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్, ఎక్స్లెన్స్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. సామాజిక సేవ, నాయకత్వ రంగాల్లో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్, లీడర్షిప్ గౌరవ డాక్టరేట్ను శనివారం పుదుచ్చేరిలో నిర్వహించిన యూనివర్సిటీ కాన్వొకేషన్ కార్యక్రమంలో అందజేశారు. గిరిజన, ఆదివాసీ, బహుజన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అనేక దశాబ్దాలుగా నిరంతరంగాపోరాడుతున్న చందా లింగయ్యదొర ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సమయంలో గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమం, విద్యా అవకాశాల విస్తరణ, సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. -
న్యాయవాదులు ఆరోగ్యం కాపాడుకోవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): న్యాయవాదులు ఆరోగ్యం కాపాడుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. తొలుత న్యాయమూర్తికి డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ జస్టిస్కు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రథమ చికిత్స కేంద్రం సిబ్బందికి అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం న్యాయవాదుల మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఫ్యామిలీ కోర్టు, ఎకై ్సజ్ కోర్టు, లేబర్ కోర్టుల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేట, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు నుంచి హాజరైన న్యాయవాదుల సంఘ కార్యవర్గ సభ్యులు వినతి పత్రాలు అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.ప్రేమలత, న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు -
సింగరేణిలో ఎస్కార్ట్ క్రేన్
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్ ఓసీకి రూ.22.69 లక్షల విలువైన 12 టన్నుల సామర్ధ్యం గల ఎస్కార్ట్ క్రేన్ సమకూరింది. ఈ క్రేన్ను శుక్రవారం ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ క్రేన్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వాహనాల తరలింపు, ఇతర పనులు సులవవుతాయని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు ప్రహ్లాద్, బొల్లం శ్రీనివాస్, కె.సోమశేఖర్రావు, డి.శ్రీని వాసరావు, బి.రాజేశ్వరరావు, జి.కల్యాణ్రామ్, గోవింద్, ముక్కా శ్రీను, పి.గోపి, జగదీష్, నాయకులు ఎస్.సుధాకర్, బి.కోటేశ్వరరావు, కావ్య, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆంధ్రా టు తెలంగాణ
ఇసుక తరలిస్తుండగా లారీలు సీజ్ వైరా: ఆంధ్రప్రదేశ్ నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు లారీలతో పాటు ఎస్కార్ట్గా వస్తున్న కారును వైరా పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వైరా మండలం సోమవరం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమాన నల్లగొండ జిల్లాకు చెందిన ఇస్లావత్ భిక్షు, ముక్కుమాల యాదయ్య, దామ సైదులు, వాంకుడోత్ లింగానాయక్ మూడు లారీల్లో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారు. అంతేకాక ఎస్కార్ట్గా వచ్చిన కారు, అందులో మార్చేందుకు సిద్ధం చేసిన నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నలుగురిని రిమాండ్కు తరలించగా, బచ్చుబోయిన యాదయ్య పరారీలో ఉన్నారని ఎస్ఐ రామారావు తెలిపారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది పవన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రీ ప్రైమరీ స్కూళ్ల ప్రారంభానికి సిద్ధం కావాలి
ఎర్రుపాలెం: జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ స్కూళ్లు ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి సదానందం సూచించారు. ఎర్రుపాలెం మండలం రాజుల దేవరపాడు, చొప్పకట్లపాలెంలోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలల నిర్వహణ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, సామగ్రిని పరిశీలించాక విద్యార్థుల నమోదుపై ఆరా తీశారు. అలాగే, చొప్పకట్లపాలెం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా.. నాణ్యత లేకపోడంపై ఏజెన్సీ బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓ బి.మురళీమోహన్రావు, హెచ్ఎంలు నండ్రు వెంకటేశ్వరరావు, మారపాక బాబూరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఉపయోగించుకోండి ఖమ్మంరూరల్: వరదలు, ఇతర విపత్తుల సమయాన ఎన్డీఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి జి.సదానందం తెలిపారు. మండలంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ మహిళా కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరదలు, అగ్నిప్రమాదాల సమయాన వ్యవహరించాల్సిన తీరు, బాధితులను కాపాడడంపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేడెట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఈఓ మాట్లాడగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్ పలు శాఖల అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగులు పెసర ప్రభాకర్రెడ్డి, చావా శ్రీనివాసరావు, వినయేందర్రెడ్డి, బీటెన్ సింగ్, సందీప్కుమార్, అజయ్శర్మ, రాజు తదితరులు పాల్గొన్నారు. డీఈఓ సదానందం -
సైబర్ కేసు నిందితురాలు, కేరళ వాసి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సుమా రు రూ.15 లక్షల మేర మోసం చేసిన కేసులో నిందితురాలిని ఖమ్మం సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో అరెస్ట్ చేయగా, శుక్రవారం ఖమ్మంలో వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్లో పరిచయమైన నిందితురాలు ఆన్లైన్లో ట్రేడింగ్, పెట్టుబడిద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి పలు మార్లు రూ.15లక్షలు జమ చేయించింది. ఇలాగే, పలు రాష్ట్రాల్లో మరికొందరి నుంచి నగదు జమ చేయించగా, రూ.3కోట్ల మేర లావాదేవీలు త్రివేండ్రంకు చెందిన ఆర్యదాస్ శైలజ ఖాతా ద్వారా జరిగాయని గుర్తించారు. ఈ మేరకు త్రివేండ్రంలో ఆమెను అరెస్ట్ చేసిన ఖమ్మం సైబర్క్రైం పోలీసులు ఇక్కడకు తీసుకొచ్చి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, సీఐ రవికుమార్, ఎస్ఐలు రంజిత్కుమార్, విజయ్కుమార్, సిబ్బందిని సీపీ సునీల్దత్ అభినందించారు. -
సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేస్తాం..
● త్వరలోనే కుడి, ఎడమ కాల్వల్లో పూడికతీత ● రిజర్వాయర్ ఆయకట్టు రైతులతో భేటీలో ఎమ్మెల్యే రాందాస్ వైరా: వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో నారుమళ్లు పోసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కానీ నీరు విడుదల చేస్తారా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఈమేరకు రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పరిధి ఆయకట్టు రైతులతో వైరాలో శుక్రవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీరు సాఫీగా సాగేలా కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీయించా లని రైతులు కోరగా పది రోజుల్లో పనిచేయిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఇంకొందరు మాట్లాడుతూ.. గతంలోనూ వర్షాభావ పరిస్థితి ఎదురైనా నీరు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. మరికొందరు రైతులు రిజర్వాయర్లో సరిపడా నీళ్లు లేనందున వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తామని తెలిపారు. ఎడమ కాల్వ పరిధి రైతులకు మరో పది రోజుల్లో నారుమడులకు నీరు ఇస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు. ఆ తర్వాత వర్షాలు కురవకపోయినా నష్టాన్ని తామే భరిస్తామంటూ వెల్లడించారు. పరిస్థితులు అనుకూలిస్తే.. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.50 కోట్లతో కాల్వల ఆధునికీకరణ పనులు చేపడుతుండగా, రూ.100 కోట్లతో నిర్మిస్తున్న రాజీవ్ కెనాల్ ద్వారా రిజర్వాయర్కు గోదావరి నీరు విడుదల అవుతుందని చెప్పారు. కానీ, ప్రస్తుతం గోదావరి, సాగర్లో నీరు లేక రెండు చోట్ల నుంచి వచ్చే పరిస్థితి లేదన్నారు. అయినప్పటికీ వాతావరణం అనుకూలిస్తే నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఐబీ డీఈ శ్రీనివాస్, నాయకులు కట్ల రంగారావు, బోళ్ల గంగారావు, దాసరి దానియేలు, శీలం వెంకటనర్సిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. సాగర్లో నీళ్లు లేక వైరా రిజర్వాయర్కు విడుదల చేయడం లేదు. పంటల విషయంలో రైతులు తొందరపడకుండా సంయమనం పాటిస్తేనే మేలు. –బాబూరావు, ఈఈరిజర్వాయర్ కాల్వల పరిధిలో సిల్ట్ తొలగించాలి. తద్వారా ఏ మాత్రం నీరు విడుదల చేసినా చివరి వరకు అందుతాయి. వృథా కూడా కాదు. అధికారులు తొలుత ఆ పని చేస్తేనే అందరికీ మంచిది. –బసవయ్య, బ్రాహ్మణపల్లి ఆయకట్టుకు రైతులు పంటలు పండిస్తేనే జీవనాధారం. ప్రస్తుతం ఉన్న నీటిని నారుమళ్లకు ఇస్తే ఏ ఇబ్బంది ఉండదు. వర్షాభావ పరిస్థిఽతులు ఉన్నప్పటికీ గతంలో నీరు విడుదల చేశారు. –మోత్కుపల్లి రామారావు, విప్పలమడక -
విజయ డెయిరీ ఆధునికీకరణకు అడుగులు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విజయ డెయిరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య స్పష్టం చేసింది. జూన్ 25న ‘విజయ డెయిరీపై నీలినీడలు’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అందులో ఖమ్మం యూనిట్లో ప్యాకింగ్ సెక్షన్ నిలిపివేత, కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యంపై వివరించగా పలు పార్టీల నాయకులు డెయిరీని రక్షించాలంటూ ఆందోళనలు చేశారు. దీంతో పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ మధుసూదన్రావు ఓ ప్రకటన విడుదల చేశారు. యాభై ఏళ్లు పైబడిన డెయిరీలో పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ పరికరాల నాణ్యత లోపించి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు తాత్కాలికంగా పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ నిలిపివేసి హైదరాబాద్లోని మెగా డెయిరీ నుంచి పాలు, పాల ఉత్పత్తుల సరఫరాకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. యూనిట్ ఆధునికీకరణకు రూ.5 కోట్ల నిధులు అవసరం కాగా, శిథిలావస్థకు చేరిన భవనాన్ని పునరుద్ధరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఖమ్మం డెయిరీని ఆధునికీకరించాక ఇక్కడి నుంచే పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తామని వెల్లడించారు. రూ.5 కోట్లతో అభివృద్ధికి ప్రతిపాదన -
రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు
ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 5వ తేదీన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలస్థాయి అండర్–14, 16 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకట్, కోఆర్డినేటర్ ఎండీ మసూధ్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్కార్డుతో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. వివరాలకు ఎండీ ఫారుఖ్ను 79818 81095 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జెడ్పీహెచ్ఎస్లో ఆర్జేడీ పరిశీలన ఏన్కూరు: ఏన్కూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వరంగల్ ఆర్జేడీ మదన్మోహన్ శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఉన్న వసతులు, భవనాల లభ్యతపై ఆరా తీశారు. తరగతి గదులు, విద్యుత్, తాగునీటి సౌకర్యంపై వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ వాసవీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘గోదావరి లోయ’ మూగబోయింది..
● అరుణోదయ నాగన్న కన్నుమూత ● పాటే ఆయుధంగా సాగిన ప్రజాపోరు ప్రస్థానం ● మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ చెరగని ముద్ర ఖమ్మంమయూరిసెంటర్: తెలుగు నేలపై ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల గొంతుకగా నిలిచిన ప్రముఖ విప్లవ ప్రజాగాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పూర్తికాల కార్యకర్త, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు పరకాల నాగన్న (అరుణోదయ నాగన్న) కన్ను మూశా రు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ‘కళ.. కళ కోసం కాదు, ప్రజలు, ప్రగతి కోసం’అన్న నానుడికి నిదర్శనంగా నిలిచిన నాగన్న.. ఇంటి పేరునే అరుణోదయగా మార్చుకొని చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచారు. కాగా, నాగన్న కళ్లను నేత్ర నిధికి దానం చేయగా.. ఆయన మృతదేహాన్ని శనివారం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించాలని కుటుంబ సభ్యులు, నాయకులు నిర్ణయించారు. ఎమర్జెన్సీకి ముందు నుంచే.. ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం రాజారంలో నిరుపేద కుటుంబానికి చెందిన పరకాల లచ్చుమమ్మ – పాపయ్య దంపతులకు నాగయ్య జన్మించారు. యుక్త వయసులో పశువుల కాపరిగా, కూలి పనులు చేస్తూనే మద్ది వెంకటరెడ్డి (మహేశ్ అన్న) ఇచ్చిన ప్రోత్సాహంతో కళాకారుడిగా జీవనయాత్ర ప్రారంభించారు. స్వగ్రామానికి చెందిన శ్రీపాద శ్రీహరి, పోట్ల రామనర్సయ్య, మంగన్న స్ఫూర్తితో దేశంలో ఎమర్జెన్సీకి ముందే విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత కానూరు వెంకటేశ్వరరావు, సుంకన్న, అరుణోదయ రామారావు బుర్రకథా దళాలతో ప్రేరణ పొంది, అరుణోదయలో పూర్తికాల సభ్యుడిగా చేరారు. విరసం సభ్యుల రచనలు, కాశీపతి ఉపన్యాసాల ప్రభావంతో 1980 నుంచి అరుణోదయ రాష్ట్రస్థాయి కమిటీల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. రామారావు – నాగన్న ద్వయం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో కానూరి వెంకటేశ్వరరావు దళంలో రామారావు, నాగన్న జోడి విప్లవ సాంస్కృతిక ఉద్యమాల్లో ఉర్రూతలూగించేది. కానూరితో కలిసి రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ప్రకాశం, నెల్లూరు, వైజాగ్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం వంటి ప్రాంతాల్లో అరుణోదయ దళాల నిర్మాణానికి నాగన్న కృషి చేశారు. విమలక్క, జయరాజ్, సృజన వెంకట్రాముడు, నాతని హనుమంతరావుతో కలిసి కళారూపాలను ప్రదర్శించారు. 1990 తర్వాత ప్రజా రచయితల సంఘం ఏర్పాటులోనూ నమ్ము జీవన్, అద్దేపల్లి రామ్మోహన్రావు, సతీశ్ చందర్ తదితరులతో కలిసి కీలకపాత్ర పోషించారు. ‘ప్రతిఘటన’లో అగ్రభాగాన.. 1980 నుంచి 1995 వరకు అరుణోదయ ఇన్చార్జ్గా ఉన్న పెద్ద చంద్రన్న మార్గదర్శకత్వంలో, ఆ తర్వాత వైఎస్ఆర్, వీ.వీ. తదితరుల సహకారంతో సంస్థను నడిపించారు. గుంటూరు మిర్చి యార్డు రైతుల పోరాటం, పత్తి రైతుల ఆత్మహత్యల సందర్భాల్లో నాగన్న ప్రజా చైతన్యాన్ని రగిలించారు. పోరాటాల్లో అమరులైన దొరన్న, విక్రమ్, కట్టా నరసింహారెడ్డి, నీలం రామచంద్రయ్య, పంచాది నిర్మలతో పాటు సిక్కోలు అమరవీరుల త్యాగాలను తన పాటల రూపంలో వినిపించారు. నిర్బంధాలను ఎదిరించి.. నాగన్న తన మేనత్త కూతురైన లక్ష్మిని వివాహం చేసుకోగా, ఆమె జీవిత భాగస్వామిగానే కాక ఉద్యమ సహచరిగానూ తోడయ్యారు. అరుణోదయ, పీఓడబ్ల్యూ(ప్రగతిశీల మహిళా సంఘం) సంస్థల్లో పనిచేస్తూ పోలీసు నిర్బంధాలు, అరెస్టులు, జైలు జీవితాలను సైతం లెక్కచేయలేదు. వీరికి కుమారుడు అజయ్ ఉండగా, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోనూ ప్రజా ఉద్యమాలకే ప్రాధాన్యతనిచ్చారు. ప్రస్తుతం అజయ్ కూడా సాంస్కృతిక రంగంలోనే నడుస్తున్నారు. సమాజానికి ఆదర్శం సిద్ధాంతం, ఆచరణ వేర్వేరు కాదంటూ ఖమ్మం మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో చిన్న రేకుల షెడ్డులో బడ్డీకొట్టు నడుపుకుంటూ నాగన్న నిరాండబరంగా జీవించారు. దేశంలో కుల నిర్మూలనే ప్రగతికి మార్గమని, బహుజన రాజ్య స్థాపనను కాంక్షించిన ఆయనకు పలు సత్కారాలు లభించాయి. మాస్లైన్, న్యూడెమోక్రసీ కార్యాలయాల్లో.. నాగన్న మృతదేహాన్ని తొలుత సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యాలయమైన రామనర్సయ్య విజ్ఞాన కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ మాస్లైన్ రాష్ట్రకార్యదర్శి పోటురంగారావు, గుర్రం అచ్చ య్య, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్ తదితరు లు నివాళులర్పించగా.. పోటు రంగారావు మాట్లా డుతూ.. తెలుగునాట విప్లవ గానం, పాట, అరుణో దయకు చిరునామాగా ఐదు దశాబ్దాలపాటు నిలిచిన నాగన్న మృతి విప్లవ కళా సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయానికి నాగన్న మృతదేహాన్ని తరలించగా.. అక్కడ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం, అవునూరి మధు, బండారి ఐలయ్య తదితరులు నివాళులర్పించి విప్లవ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంతేకాక సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, దండి సురేశ్, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, సామాజిక కార్యకర్తలు స్పర్శ భాస్కర్, దేవిరెడ్డి విజయ్తో పాటు రచయితలు తదితరులు నాగన్న మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా, నాగన్న మృతి తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగానికి తీరని లోటని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంతాపాన్ని ప్రకటించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవులతో కలిసి అనేక ‘ధూమ్ ధామ్’కార్యక్రమాల్లో నాగన్న తన ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ఆర్.నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన దండోరా సినిమా కోసం కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ.. కొడవండ్లు చేపట్టవే పాట పాడారు. అక్షరదీపంలో బావ నేను బడికిపోతా, సారా వ్యతిరేక ఉద్యమంలో పెద్దత్తో దాన్ని పయనం చెయ్యి వంటి పాటలతో సామాజిక మార్పులోనూ భాగం పంచుకున్నారు. అన్నా అమరుడు రామ నరసయ్య, ఉయ్యాలలూగింది శిశువు, దొరన్న మాటంటే మాటేరో, పొద్దు పొడిచే.. పొద్దు పొడిచే ఇల్లందు మీద ఎల్లన్న పాట, ఎగిసెగిసి పడుతోంది గోదావరి ఎర్రజెండా.. ఎగిసింది గోదావరి వంటి విప్లవ గేయాలతో ప్రజలను చైతన్యపరిచారు. వాగ్గేయకారుడు అరుణోదయ రామారావు మరణాంతరం నాగన్న ఆలపించిన ‘నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయంతా ఊగింది ఉయ్యాల’పాట విప్లవ చరిత్రలో అమరత్వమై నిలిచింది. -
దరఖాస్తు ఒకటే !
కనెక్షన్లు ఎన్నయినా.. ● అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తులకు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ● ఎన్పీడీఎసీఎల్లో అమల్లోకి వచ్చిన నూతన విధానం ఖమ్మంవ్యవసాయం/సూపర్బజార్(కొత్తగూడెం): విద్యుత్ వినియోగదారులకు సులభమైన, వేగవంతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో టీజీ ఎన్పీడీసీఎల్ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల కోసం ‘బల్క్ / మల్టిపుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఒకే భవనానికి ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు అవసరమైతే విడివిడిగా కాకుండా ఒకే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. తద్వారా బిల్డర్లు, డెవలపర్లు, భవన యజమానులు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వాహకులకు సమయం కలిసిరానుంది. ఈ విధానం అమలు, ప్రయోజనాలను శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం ఎస్ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, గొట్టిముక్కుల మహేందర్ వేర్వేరు ప్రకటనల్లో వివరించారు. అపార్ట్మెంట్లు, మల్టీ స్టోర్డ్ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకు అవసరమైన ఎల్టీ కేటగిరీ–1, 2 కనెక్షన్లకు కొత్త విధానం వర్తిస్తుంది. మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా చార్జీలు నిర్ణయిస్తారు. 20 కిలోవాట్ల వరకే డెవలప్మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తిస్తాయి. 20 కిలోవాట్లకు పైగా కేవలం సర్వీస్ లైన్ చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. ఒక కిలోమీటర్ లోపు విద్యుదీకరణ ఉన్న నెట్వర్క్ నుంచి ఓవర్ హెడ్ లైన్లకు మాత్రమే వర్తిస్తుంది. అవసరమైన ట్రాన్స్ఫార్మర్ను వినియోగదారుల నుంచి అదనపు వ్యయం లేకుండానే ఏర్పాటు చేస్తారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) రెగ్యులేషన్ ప్రకారం ఏకరీతిలో చార్జీలు వర్తిస్తాయి. బల్క్ / మల్టిపుల్ అప్లికేషన్ నమోదు సమయంలోనే సర్వీస్ లైన్ చార్జీలు పూర్తిగా చెల్లించాలి. తద్వారా దరఖాస్తుల పరిశీలన, కనెక్షన్ల మంజూరు త్వరగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు ఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్ ద్వారా బల్క్/మల్టిపుల్ అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తద్వారా కనెక్షన్ల మంజూరులో ఆలస్యం తగ్గి అపార్ట్మెంట్లు, గృహ నిర్మాణ, వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవలు అందుతాయి. అలాగే, దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వివరాల కోసం 1912 లేదా 1800–425–0028 టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించవచ్చని ఎస్ఈలు వివరించారు. -
వైభవంగా మహా కుంభాభిషేకం
ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి మహా కుంభాభిషేకం స్వర్ణోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి పాల్గొని శ్రీవారు, అమ్మవార్లకు పూజలు చేశారు. అలాగే, స్వామి వారు, ఆలయ విమాన గోపురానికి మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆతర్వాత భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కాగా, ఉత్సవాలకు పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు చేసిన గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం.వీరస్వామి, సర్పంచ్ తుళ్లూరు నిర్మలకుమారి, ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వకుళామాత స్టేడియం దాత తుళ్లూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎర్రుపాలెంలోని శ్రీబాలాత్రిపుర సమేత శ్రీచంద్రమౌళేశ్వరస్వామి వారి ఆలయాన్ని శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి సందర్శించారు. స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించాక భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయ చైర్మన్ మగినం విజయ–వీరభద్రం, అర్చకులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.హాజరైన శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామి -
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
● కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యే రాగమయి ● సత్తుపల్లిలో భారీ ర్యాలీ, వనమహోత్సవంసత్తుపల్లిటౌన్: భావితరాల సంక్షేమం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని.. తద్వారా వాతావరణ మార్పులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన వనమహోత్సవం నిర్వహించగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్తో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వన మహోత్సవం అంటే మొక్కలు నాటడమే కాదని, సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం వనమహోత్సవం ద్వారా ఏటా కోట్లాది మొక్కలు నాటుతుండగా, రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. ప్రజలు కూడా ఇళ్లలోనే కాక రహదారుల వెంట మొక్కలు నాటే బాధ్యత స్వీకరించాలని చెప్పారు. అనంరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ వనమహోత్సవం ప్రభుత్వ కార్యక్రమమే కాదని, భావితరాలకు మంచి భవిష్యత్ను ఇచ్చే సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు. తొలుత నాయకులు, విద్యార్థులతో కలిసి జేవీఆర్ కళాశాల నుంచి పాతసెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే, జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సింగరేణి సహకారంతో ఏర్పాటుచేసిన 12 కంప్యూటర్ల ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ మట్టా దయానంద్, మున్సిపల్ చైర్పర్సన్ ఎండి రెహానాబేగం, సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహ, మార్కెట్ చైర్మన్లు దోమ ఆనంద్బాబు, నీరజాదేవి, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు గాదె చెన్నారావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, బొంతు సుమలత, ఎం.డీ.కమల్పాషా, నాయుడు వెంకటేశ్వరరావు, సందీప్ గౌడ్ పాల్గొన్నారు. -
పాలనను గాలికొదిలేసిన మంత్రులు
● కేటీఆర్, హరీష్, ఆర్ఎస్ అరెస్ట్ అక్రమం ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్సాక్షిప్రతినిధి, ఖమ్మం: రా.. చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్న మంత్రులు పాలనను గాలికొదిలేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధ్వజమెత్తారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించాక విలేకరులతో మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరి ఓటు కాపాడడమే ధ్యేయంగా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ భవన్లో చర్చకు సిద్ధమన్న మంత్రి జూపల్లి కృష్ణారావు తీరా సమయానికి గాంధీభవన్కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సవాల్ విసిరిన మంత్రి కోసం కేటీఆర్ వేచి ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కేటీఆర్, హరీష్రావు, ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ను గృహనిర్బంధం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న కాలంలో మరిన్ని సెల్ఫ్గోల్స్ వేసుకోవడం ఖాయమని తెలిపారు. ఖమ్మంలో చీకటి పాలన ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని పువ్వాడ విమర్శించారు. నగరంలో రోడ్లు అధ్వానంగా మారగా, శానిటేషన్ లోపించి, వీధిదీపాలు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఖమ్మంలో ప్రస్తుతం చీకటిపాలన సాగుతోందన్నారు. ‘సర్’లో భాగంగా రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్న వారు నిబంధనల ప్రకారం ఒకే చోట ఓటు ఉంచుకోవాలని సూచించారు. మ్యాపింగ్ కాని ఓట్ల విషయంలో సాంకేతిక ఇబ్బందులను ఈఆర్ఓ, ఆర్ఓల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కాగా, ప్రతీ పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ తరుపున బీఎల్ఏలను నియమించామని తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, శీలం శెట్టివీరభద్రం, తోట రామారావు, బత్తుల మురళి, కర్నాటి కృష్ణ, మక్బూల్, బచ్చు విజయ్కుమార్, నాగండ్ల కోటి, కూరాకుల వలరాజు, దేవబత్తిని కిషోర్, షేక్ షకీనా, ఆరెంపుల వీరభద్రం ఉన్నారు. బీఎల్ఓకు ఎన్యుమరేషన్ ఫారం ఖమ్మంమయూరిసెంటర్: ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలు నింపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఉద్యోగులకు అందజేశారు. ఆయన శుక్రవారం తన నివాసంలో ఫారంను నింపి కేఎంసీ ఏఎంసీ అనిల్కుమార్, ఆర్ఓ ఏ.సుధాకర్ సమక్షాన బీఎల్ఓ షాహీన్ కమల్కు అందజేయగా, ఓటర్లు తప్పనిసరిగా ఫారాలు నింపాలని సూచించారు. -
‘గోదావరి లోయ’ మూగబోయింది..
వాతావరణ ం జిల్లాలో శనివారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.అరుణోదయ నాగన్న కన్నుమూత●కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా.. అని ఆయన పాడితే జనం ఉర్రూతలూగారు.. ●బావ నేను బడికిపోతా.. అని గొంతెత్తితే బడి బాట పట్టారు.. ●ఎగిసెగిసి పడుతోంది గోదావరి ఎర్ర జెండా.. అంటూ పాడితే ఉద్యమంలో కొత్త తరం చేరింది ●వందలాది పాటలతో ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలవడమే కాక చైతన్యం కల్పించడంలోనూ కీలక పాత్ర పోషించిన నాగన్న.. మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటను జత చేశారు. అరుణోదయనే ఇంటి పేరుగా మార్చుకున్న నాగన్న కన్నుమూయడంతో విప్లవం, విప్లవగీతాల ప్రస్థానంలో ఒక శకం ముగిసింది. – ఖమ్మం మయూరిసెంటర్ -
ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు మెరుగు
● అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఏన్కూరు: ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. ఏన్కూరు మండలం భగవాన్నాయక్ తండాలో ఇంకుడు గుంతల నిర్మాణాల ను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నీరు వృథా కాకుండా భూమిలో ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు పెరిగి ఇక్కట్లు రావని తెలిపారు. ఈమేరకు ఇళ్లలోనే కాక పొలాల్లో కూడా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కె.శ్రీరామ్, సర్పంచ్ ధరావత్ మణి, వివిధ శాఖల ఉద్యోగులు కరుణశ్రీ, జీవీఎస్.నారాయణ, నర్సింహారావు, సూరయ్య, మౌనిక పాల్గొన్నారు. ఐదెకరాల వరకు పెట్టుబడి సాయం జమ ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం జమ కొనసాగుతోంది. రైతు భరోసా ద్వారా శుక్రవారం ఐదెకరాల వరకు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో సాయం జమ అయింది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తంగా 3,17,212 మంది రైతుల ఖాతాల్లో రూ.306.34 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఖమ్మంలో 17,272 మంది రైతులకు రూ.17.58 కోట్లు, సత్తుపల్లిలో 79,338 మంది రైతులకు రూ.74.87 కోట్లు, పాలేరులో 74,981 మంది రైతులకు రూ.68.68 కోట్లు, మధిరలో 83,580 మంది రైతులకు రూ.79.09 కోట్లు, వైరా నియోజకవర్గంలో 60,842 మంది రైతులకు రూ.65.10 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గం(కామేపల్లి మండలం)లో 1,199 మంది రైతుల ఖాతాల్లో రూ.1.02 కోట్లు జమ అయ్యాయని వివరించారు. ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యాన స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముహమ్మద్ ముజాహిద్ తెలిపారు. అర్హులైన క్రిస్టియన్ మైనార్టీలు కుట్టు మిషన్, చిరువ్యాపారం, ఈ–బైక్, ఈ–స్కూటీ, మోటార్ బైక్ కోసం ఈనెల 18లోగా tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల వారైతే వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉండాల ని తెలిపారు. కుట్టు మిషన్, చిరువ్యాపారాలకు 21 – 55 ఏళ్లు, ఇతర పథకాలకు 21 – 50 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 97040 03002 నంబర్లో సంప్రదించాలని ఓ ప్రకటనలో సూచించారు. జిల్లా మలేరియా అధికారిగా వెంకటేశ్వర్లు ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా మలేరియా అధికారిగా కె.వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన హనుమకొండ జిల్లాలో జపనీస్ మెదడు వాపు, వాహక వ్యాధుల నియంత్రణ విభాగంలో సీనియర్ ఎంటమాలజిస్ట్గా, జీహెచ్ఎంసీలో జీవశాస్త్ర నిపుణుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఖమ్మం పట్టణ మలేరియా పథకంలో సీనియర్ ఎంటమాలిజిస్ట్గా పనిచేస్తూ జిల్లా మలేరియా అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను డీఎంహెచ్ఓ అభినందించగా, మలేరియా, డెంగీ నివారణ, నియంత్రణ చర్యలపై సూచనలు చేశారు. ప్రభుత్వ వైద్యసేవల్లో నాణ్యతపై దృష్టి ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా అన్ని ఆస్పత్రుల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డీఎంహెచ్ఓ డి.రామారావు తెలిపారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని వేగ హోమియోకేర్ క్లినిక్ను శుక్రవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం జిల్లా జనరల్ ఆస్పత్రిలో క్షయ వ్యాధి నివారణ కేంద్రం, పోలియేటివ్ కేర్ సెంటర్, డయాబెటిక్ సెంటర్, రేడియాలజీ విభాగాలను పరిశీలించిన డీఎంహెచ్ఓ.. వైద్యసేవలు, మౌలిక వసతులు, మందుల లభ్యతపై ఆరా తీశారు. రోగులు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తూ సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. -
సర్పై అపోహలు వద్దు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ప్రజలు అపోహలు విడనాడాలి. ఎలాంటి భయం లేకుండా అందరూ భాగస్వామ్యం అవ్వాలి. 2002 ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ప్రస్తుత జాబితాతో మ్యాపింగ్ చేసుకోవాలి. లేకపోతే 11 డాక్యుమెంట్లలో కావాల్సిన పత్రం కోసం రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్ను ఎన్యుమరేషన్ ఫామ్కు జత చేసి సమర్పిస్తే సరిపోతుంది’. అని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, క్షేత్ర స్థాయి పరిస్థితులపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే... వారం రోజుల్లో 98 శాతం జిల్లాలో 12,43,781 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 12,21,533 మంది(98.21 శాతం)కి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది. గతనెల 25 నుంచి ఈ ప్రక్రియ మొదలుకాగా ఈ వారమంతా ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీపైనే దృష్టి సారించాం. ప్రస్తుతం ఓటర్లు నింపిన ఫామ్స్ను బీఎల్ఓలు సేకరిస్తుండగా 70,700 ఫామ్స్ అందాయి. వీటి డిజిటలైజేషన్ కూడా మొదలైంది. జిల్లాలో మ్యాప్, అన్ మ్యాప్, అనామలిస్ జాబితా ఉండడం వల్ల పని వేగంగా జరుగుతోంది. రానున్న పది రోజుల్లో ఫామ్స్ సేకరణపై ఫోకస్ పెడతాం. ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లినవారు, ఇళ్లలో ఉండని వారికి ఫోన్లు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 10, 11 తేదీ వరకు ఫామ్స్ సేకరణ పూర్తి చేసి.. ఎవరైనా మిగిలిపోతే మ్యాపింగ్ చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడంపై దృష్టి సారిస్తాం. మండలానికి ఒక హెల్ప్డెస్క్ ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో నిరక్షరాస్యులు, వృద్ధులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాం. అవగాహన కల్పించడానికి మండలానికి ఒకటి చొప్పున 21 హెల్ప్డెస్క్లు ఏర్పాటుచేశాం. ఈఆర్ఓ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటుచేయడంతో పాటు కలెక్టరేట్లో కాల్సెంటర్ ఉంది. 08742–221951కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసినా అనుమానాలు తీరుస్తారు. ఇంటింటికీ తిరుగుతున్న బీఎల్ఓలు సైతం ఫారాలు ఎలా నింపాలో ఓటర్లకు అవగాహన కల్పిస్తారు. ఈ విధానంపై వీడియో కూడా రూపొందించాం. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లాలే తప్ప ఒకే దగ్గర కూర్చుని ఫామ్స్ పంపిణీ, సేకరణ చేయకూడదు. మ్యాపింగ్ కాకపోతే.. ఓటరు పేరు డేటాబేస్తో సరిపోలకపోతే వారికి ఈఆర్ఓ నోటీసు జారీ చేస్తారు. నోటీసు అందాక నిబంధనల మేరకు పత్రాలు అందించాలి. 1987 జూలై 1కు ముందు జన్మించిన వారైతే పుట్టిన తేదీ, జన్మస్థలాన్ని ధ్రువీకరిస్తూ 11 డాక్యుమెంట్లలో ఒకటి జత చేయాలి. 1987 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మిస్తే పుట్టినతేదీ, పుట్టిన స్థలాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్తోపాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఒక సర్టిఫికెట్ సమర్పించాలి. ఇక 2004 తర్వాత జన్మించినట్లయితే ఓటరు పుట్టిన తేదీ, జన్మస్థల పత్రాలే కాక తల్లిదండ్రులిద్దరి పుట్టినతేదీ, పుట్టిన స్థలం ధ్రువీకరిస్తూ 11 రకాల డాక్యుమెంట్ల నుంచి చెరొకటి జత చేయాలి. బీఎల్ఏల సాయం పొందొచ్చు.. ‘సర్’ ప్రక్రియను పర్యవేక్షించడానికి రాజకీయ పార్టీలు బీఎల్ఏ(బూత్ లెవెల్ ఏజెంట్లు)ను నియమించుకున్నాయి. ఎన్యుమరేషన్ ఫారం నింపేందుకు ఓటర్లు వారి సాయం తీసుకోవచ్చు. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నా తెలిసిపోతుంది. బీఎల్ఏలు కూడా చురుగ్గా పాల్గొంటేనే ఈ ప్రక్రియపై అపోహలు తొలగిపోతాయి. ఒక్కో బీఎల్ఏ రోజుకు 50 ఫారాలు నింపి ఇవ్వొచ్చు. ఓటర్లు అర్థం కావడం లేదు, తెలియడం లేదని అని అనుకోకుండా అందరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలి.అర్హులైన పౌరులకు ఓటు హక్కు కల్పించడమే కాక.. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారితో పాటు నకిలీ ఓట్లను తొలగించడమే ‘సర్’ లక్ష్యం. గ్రామంలో ఓ ఓటు, మరో ఓటు నివాసముండే చోట ఉంటే ఒకే ఓటు కొనసాగించాలి. ఓటు కావాల్సిన చోటే ఎన్యుమరేషన్ ఫారం నింపి ఇవ్వాలి. అలా కాకుండా రెండుచోట్ల ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం నేరం అవుతుంది. అలాంటి వాళ్లకు శిక్ష ఉంటుంది. చాలామంది ఒకేచోట ఓటు హక్కు ఉంచుకుంటామని డిక్లరేషన్ ఇస్తున్నారు.‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
యూరియా.. ఢోకా లేదయా!
● యాప్ ద్వారా బుకింగ్, కొనుగోళ్లు ● ఇప్పటివరకు 1,60,316 బస్తాల అమ్మకం ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో వానాకాలం సాగుకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య వెల్లడించారు. నిల్వలు, యాప్ ద్వారా బుకింగ్కు ఉన్న అవకాశాలు, ఇప్పటివరకు అమ్మకాల వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో ప్రభుత్వం జిల్లాకు 35,267 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని తెలిపారు. ఇప్పటి వరకు యాప్ ద్వారా 56,926 మంది రైతులు 1,80,738 బస్తాల కోసం బుక్ చేసుకోగా, 1,60,316 బస్తాలు కొనుగోలు చేశారని వివరించారు. మిగతా రైతులు కూడా యాప్ ద్వారా బుక్ చేసుకుని, సులువుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. ప్రతీ మండల పరిధి పీఏసీఎస్ల్లో యూరియా నిల్వలు ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. -
మిర్చి ధర ముందడుగు
● క్వింటా ధర రూ.22 వేల దరిదాపుల్లోకి.. ● దేశీయ మార్కెట్తో పాటు ఎగుమతుల ప్రభావం ● మోడల్ మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరలో కదలిక వచ్చింది. ఎగుమతులకు అనుకూలమైన ‘తేజా’ రకం మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. పంట సీజన్ మార్చి, ఏప్రిల్ నెలల్లో క్వింటాకు రూ.21 వేల వరకు పలికిన ధర జూన్లో రూ.21,500లకు చేరింది. ఇక గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జెండా పాట ధర రూ.21,900, మోడల్ ధర రూ.20,500గా పలికింది. గత ఏడాది సగటున రూ.15 వేలు దాటకపోగా ఈసారి మాత్రం తేజా రకానికి డిమాండ్ పెరిగింది. అయితే, గత ఏడాది ఆశించిన ధర లేని కారణంగా ఈసారి రైతులు సాగు విస్తీర్ణం తగ్గించడంతో ధరకు రెక్కలు వస్తున్నాయని భావిస్తున్నారు. ఎగుమతులు కూడా.. ‘తేజా’ మిర్చికి ప్రస్తుతం దేశీయ మార్కెట్తో పాటు బంగ్లాదేశ్లో ఉన్న డిమాండ్ ఆధారంగా వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారు. ఏటా చైనాకు ఎగుమతి చేసే వ్యాపారులకు ఈసారి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేవు. దీంతో దేశీయ మార్కెట్పై ఆధారపడి కొనుగోలు చేస్తుండగా, బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు రావడం ధర పెరుగుదలకు కారణమైంది. సీజన్తో పోలిస్తే ప్రస్తుతం రూ.వేయి ఎక్కువ పలుకుతుండగా, మరింత పెరిగే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. ఇక వానాకాలం సాగు సీజన్ కావడంతో రైతులు పెట్టుబడుల కోసం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి విక్రయానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ధర రూ.22 వేల దగ్గరకు చేరడంతో ఇంకొందరు రైతులు మాత్రం వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం. ఒక షెడ్లో కొనుగోళ్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న మోడల్ మార్కెట్లో గురువారం నుంచి మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఓ పక్క పనులు కొనసాగుతున్నా, వ్యాపారుల వినతితో ఆరో నంబర్ షెడ్డును సిద్ధం చేసి కొనుగోళ్లకు మార్కెట్ కమిటీ అవకాశం కల్పించింది. తొలిరోజు జెండాపాటతో ప్రారంభించారు. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేశ్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి సోమ నరసింహారావుతో పాటు బత్తిని నరసింహారావు, బాదె రవి, యడ్లపల్లి సతీశ్, మెంతుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
సుదర్శన చక్రం గిరగిరా!
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా గోదావరి తీరాన సుదర్శన చక్రం ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. ఆ తర్వాత ఈ అంశాన్ని తొలగించినా.. మళ్లీ తెరపైకి తీసుకొచ్చేలా అధికారులు సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం మొదటి దశలో గోదావరి ఘాట్ల వద్ద పలు అభివృద్ధి పనులను చేపట్టేలా మాస్టర్ప్లాన్ ప్రకటించింది. ఇందులో రూ.9 కోట్లతో సుదర్శన చక్ర స్నాన తీర్థంగా ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. అయితే, టెండర్ల సమయాన ఆలయ కాంప్లెక్స్ నిర్మాణ పనులకే రూ.200 కోట్లకు టెండర్లను ఖరారు చేశారు. అంతే కాక సుదర్శన చక్ర ప్రాజెక్టుగా నామకరణం చేసిన గోదావరి ఘాట్ల వద్ద పనులను రూ.75 కోట్ల నుంచి రూ.46 కోట్లకు కుదించారు. ఈ మేరకు సుదర్శన చక్ర నిర్మాణాన్ని ప్లాన్ నుంచి తొలగించారు. కానీ, భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు గోదావరి ఒడ్డున ఎలాంటి కట్టడాలు లేకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం నుంచి బడ్జెట్ పెంచేలా అనుమతి తీసుకున్నాక ఇరిగేషన్ శాఖ మరోమారు టెండర్లు పిలిచి ఖరారు చేయాల్సి ఉంది. భక్తులు మాత్రం ప్రభుత్వం సుదర్శన చక్రం ప్రాజెక్టును ఆమోదించాలని కోరుతున్నారు. స్టేడియంలో నిత్యకల్యాణం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు చేపట్టనున్నారు. ఈ క్రమాన భక్తులకు ఇబ్బంది రాకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా బేడా మండపంలో జరుగుతున్న నిత్యకల్యాణం కోసం తొలుత దక్షిణ భాగం వైపు నిర్మించాలని భావించారు. కానీ, మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో వచ్చిన సూచనల మేరకు మిథిలా స్టేడియంలోనే తాత్కాలిక కల్యాణ వేదిక ఏర్పాటుకు నిర్ణయించారు. తాత్కాలిక వేదికకు రూ.50 లక్షలను కేటాయించగా పనులు మొదలుకానున్నాయి. అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి పనులను వచ్చే ఏడాది మార్చిలోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రసిద్ధ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో వ్యూ పాయింట్ కీలకంగా ఉంటుంది. భద్రాచలం క్షేత్రంలో ఇలాంటివేవీ లేవు. ఈ నేపథ్యాన అభివృద్ధి పనుల్లో అధికారులు ఈ కొరతను తీర్చాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కుసుమ హరినాథబాబా ఆలయం కింద మట్టి తొలగించే పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయం ఎత్తుగా ఉండడంతో అక్కడ నుంచి రామాలయం, గోదావరి ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యాన హరిబాబా ఆలయాన్ని కిందకు మార్చి అక్కడ పార్క్, వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. దీనికి నిర్మాణ సంస్థ బాధ్యులు అంగీకరించినట్లు తెలిసింది. అంతేకాక పురాతన కుసుమహరినాథ ఆలయం ప్రాశస్త్యానికి ఇబ్బంది లేకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆకర్షణీయంగా కొత్త ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. కొత్త ఆలయం నిర్మించేవరకు శివాలయం ప్రాంగణంలో బాలాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా అమలైతే భద్రాచలంలో భక్తులు, పర్యాటకులకు అందమైన వ్యూ పాయింట్ అందుబాటులోకి వస్తుంది.ప్రస్తుతం రంగనాయకుల గుట్టపై కాటేజీలు, ఉపాలయాలు, భక్త రామదాసు ధ్యాన మందిరానికి చేరాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కానీ, రామాలయం నుంచి రంగనాయకుల గుట్టపైకి నేరుగా రహదారి నిర్మిస్తే దూరం తగ్గుతుంది. ఈ విషయమై ‘సాక్షి’లోనూ కథనాలు రావడం, శివాలయం నుంచి రోడ్డును ఏర్పాటు చేస్తే రంగనాయకుల గుట్ట మరో దర్శనీయ స్థలంగా మారే అవకాశం ఉంది. దీంతో గుట్టపై కాటేజీ నిర్మిస్తున్న నాగార్జున సిమెంట్ కన్స్ట్రక్షన్స్ బాధ్యులను సంప్రదించగా వారు సూత్రప్రాయంగా ఆమోదించినట్లు సమాచారం. భద్రగిరి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులో తిరిగి స్థానం? -
చిరుత సంచరిస్తోందని ఆందోళన
ఏన్కూరు/జూలూరుపాడు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అంకినాపురంతండా–భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ అటవీ బీట్లో చిరుత సంచరిస్తోందని గురువారం ప్రచా రం జరిగింది. ఏన్కూరు మండలం అంకినాపురంతండాకు చెందిన ఓ రైతు పొలానికి వెళ్లగా అక్కడ పాదముద్రలు ఉండడం, చెట్టు ఎక్కిన ఆనవాళ్లు ఉండడంతో చిరుత పులిగా భావించి అటవీశాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడు. దీంతో బీట్ ఆఫీసర్ బి.బాలాజీ, సిబ్బంది స్థానికులతో కలిసి పాదముద్రలను పరిశీలించారు. పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం ఆ పాదముద్రలు చిరుతవి కాదని, నక్క తిరిగినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ మేరకు రైతులు, ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.నక్కగా తేల్చిన అటవీ అధికారులు! -
కళలు, సంస్కృతిపై న్యూఢిల్లీలో శిక్షణ
కల్లూరురూరల్: న్యూఢిల్లీలో 21 రోజుల పాటు జాతీయస్థాయిలో నిర్వహించిన ఓరియంటేషన్ కోర్సులో కల్లూరు మండలం చెన్నూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు దిగుమర్తి శిరీష పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మరికొందరు ఉపాధ్యాయులు పాల్గొనగా, జిల్లా నుంచే శిరీష ఒకరే ఎంపికయ్యారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం, విలువలు, సంగీతం, జానపద గీతాలు, చిత్రలేఖనం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆమె మాస్టర్ ట్రెయినీగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాల్గొనగా, జిల్లా నుంచి తాను హాజరయ్యానని తెలిపారు. ఇక్కడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఢిల్లీ శిక్షణలో నేర్చుకున్న అంశాలపై తర్ఫీదు ఇవ్వనున్ననట్లు వెల్లడించారు.జిల్లా నుంచి ఒకే ఉపాధ్యాయురాలికి అవకాశం -
కాంగ్రెస్వి దిగజారుడు రాజకీయాలు
● హామీలు నెరవేర్చలేక కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు ● ఎమ్మెల్సీలు రవీందర్రావు, మధుఖమ్మంమయూరిసెంటర్: అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంపై అపవాదులు వేయడమే పనిగా పెట్టుకుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ నేతలు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో మొదటి స్థానాన నిలపడమే కాక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం అప్పులు చేశామే తప్ప సంపదను వృథా చేయలేదని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ మాత్రం రైతు భరోసా, యాసంగి సాయం, రుణమాఫీ, బోనస్ అమలు చేయకపోగా, యూరియా సరఫరా చేయలేకపోతోందని ఆరోపించారు. వీటిపై చర్చ జరగొద్దనే కుట్రతోనే ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ.. హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక మంత్రులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అయితే, వారి బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, నాయకులు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, షేక్ మక్బూల్, బచ్చు విజయ్కుమార్, బిచ్చాల తిరుమల్రావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా జడ్జిని కలిసిన సీపీ
ఖమ్మంలీగల్: ఇటీవల జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.నాగరాజును పోలీస్ కమిషనర్ సునీల్దత్ గురువారం కలిశారు. జిల్లా కోర్టులో జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. 6లోగా సొసైటీల పత్రాలు అందజేయాలి ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికల దృష్ట్యా రిజిస్టర్ అయిన సంఘాల బాధ్యులు ఈ నెల 6వ తేదీలోగా పత్రాలు సమర్పించాలని ఎన్నికల అధికారి గుడిమెట్ల బాలసైదులు సూచించారు. రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే నమోదైన మండల సంఘాలు, క్లబ్ల బాధ్యులు వివరాలు సమర్పించాలని, వివరాలకు కె.క్రిస్టోఫర్బాబు 73966 69337 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కల్లూరు ఎస్ఈ వాసంతికి సీఈగా పదోన్నతి ● ఈ స్థానంలో శ్రీకాంత్ నియామకం ఖమ్మంఅర్బన్: జలవనరులశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎస్ఈలు, ఇతర కేడర్ల అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కల్లూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) జి.వాసంతికి సైతం చీఫ్ ఇంజనీర్ పదోన్నతి లభించింది. ఈ స్థానంలో జి.శ్రీకాంత్ను ఎస్ఈగా నియమించారు. ఆయన ప్రస్తుతం కల్వకుర్తి ఐడీ–6లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తుండగా ఎస్ఈగా పదో న్నతి కల్పించి కల్లూరులో పోస్టింగ్ ఇచ్చారు. అధిక సాంద్రత పద్ధతిలో అధిక దిగుబడి రఘునాథపాలెం: అధిక సాంద్రత, దగ్గర సాళ్ల పద్ధతిలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా ఉచిత పత్తి విత్తనాల పంపిణీని రఘునాథపాలెం రైతువేదికలో ఆయన గురువారం ప్రారంభించి, ప్రసంగించారు. ఈ విధానంలో పత్తి మొక్కలు ఒకేసారి పూత, కాయ దశకు వస్తాయని, కాయలు ఒకేసారి పక్వానికి రావడంతో కోత, ఏరడం సులభమవుతుందని తెలిపారు. అంతేకాక నవంబర్ చివరి నాటికి పంట కాలం పూర్తయి.. అపరాలు లేదా నూనెగింజల పంటలు సాగు చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ సరిత, డీఏఓ కొంగర వెంకటేశ్వరరావు, ఆత్మ, సొసైటీ చైర్మన్లు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతా రఘురాం, ఏఓ కర్నాటి ఉమామహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. బోధన, భోజనం అమలుపై ప్రత్యేక శ్రద్ధ బోనకల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన చేయడమే కాక మధ్యాహ్న భోజనం అమలుపైనా శ్రద్ధ వహించాలని డీఈఓ సదానందం సూచించారు. బోనకల్ ఎంఆర్సీ భవనంలో గురువారం ఆయన మండలంలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలతో సమావేశమయ్యారు. విద్యార్థులను చేర్పించడంతో పాటు వంద శాతం హాజరయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు నమోదయ్యేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు. ఎంఈఓ దామాల పుల్లయ్య, హెచ్ఎంలు గోపీచంద్, ముంతాజ్బేగం తదితరులు పాల్గొన్నారు. -
యాక్సిల్ విరగడంతో ఊడిన బస్సు టైరు
వైరారూరల్: ఆర్టీసీ బస్సు యాక్సిల్ విరగడంతో ముందు టైరు ఊడిపోయింది. ఈ సమయాన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. భద్రాచలం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు(టీఎస్28 టీఏ 9910) 25 మంది ప్రయాణికులతో గురువారం ఖమ్మం వస్తోంది. మార్గమధ్యలో వైరా మండలం స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపైకి వచ్చేసరికి బస్సు ముందు టైరు యాక్సిల్ విరగడంతో కుడి వైపు టైరు ఊడిపోయింది. దీన్ని డ్రైవర్ గుర్తించి ఒక్కసారిగా బస్సు ఆపేయడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడితే భారీ ప్రమాదం జరిగేది. కాగా, వంతెన మధ్యలో బస్సు ఆగిపోవడంతో జాతీయ రహదారిపై సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు చేరుకుని బస్సును పక్కకు తొలగించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. కాగా, భద్రాచలం డిపో ఉద్యోగులు సరిగ్గా పరిశీలించకపోవడంతో ఈ ఘటన జరిగిందని పలువురు పేర్కొన్నారు.డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం -
సందర్శకులు పెరిగేలా ఏర్పాట్లు
సత్తుపల్లిటౌన్/తల్లాడ: సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్కు సందర్శకులు పెరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అటవీ శాఖఅధికారి అనూజ్ అగర్వాల్ ఆదేశించారు. పార్క్ను గురువారం పరిశీలించిన ఆయన వాచ్ టవర్, లైబ్రరీ వివరాలు తెలుసుకున్నారు. పార్క్ ఆహ్లాదకరంగా ఉన్నందున ఎకో క్లబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. తొలుత తల్లాడలో రూ.19.75లక్షలతో నిర్మిస్తున్న పులిగుండాల ఎకో టూరిజం రిసెప్షన్ సెంటర్ పనులను కూడా డీఎఫ్ఓ అనూజ్ పరిశీలించారు. రేంజర్ సీహెచ్. ఎల్లయ్య, డీఆర్ఓ సుజన్కుమార్, ఉద్యోగులు ఉమ, కోటేశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు.జిల్లా అటవీ శాఖాధికారి అనూజ్ అగర్వాల్ -
తెలంగాణ పురావస్తు శాఖతో ఎంఓయూ
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ పురావస్తుశాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమేరకు హైదరాబాద్ నాంపల్లిలోని పురావస్తు శాఖ మ్యూజియంలో శాఖ డైరెక్టర్ నాంపల్లి అర్జున్ రావు, కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ విజయలక్ష్మి గురువారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కళాశాల విద్యార్థులకు చారిత్రక వారసత్వ పరిరక్షణ, వారసత్వ పరిశోధన, పురావస్తు అధ్యయన పర్యటనలు, శిక్షణకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ ఎన్.గోపి తెలిపారు. వైభవోపేతంగా ధ్వజ స్తంభాల ప్రతిష్ఠ ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేక స్వర్ణోత్సవాలు గురువారం నాలుగు రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అర్చకులు యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత అలివేలు మంగ, పద్మావతి, సోమేశ్వరస్వామి వారి ఆలయాల జీర్ణోద్ధరణ, ధ్వజ స్తంభాల ప్రతిష్ఠాపనను వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పూర్తిచేశారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు చేసిన గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం.వీరస్వామి, ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, దాత తుళ్లూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇందిరా డెయిరీని పరిశీలించిన ఢిల్లీ బృందం బోనకల్: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్ను ఢిల్లీకి చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీపీ) బృందం సభ్యులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డెయిరీకి కేటాయించిన 9.20 ఎకరాల స్థలంలో మట్టి, నీటి నమూనాలు సేకరించి నిర్మాణానికి అనువుగా ఉంటుందా, లేదా అని ఆరా తీశారు. అలాగే, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సభ్యులు సుందర్రావు, డాక్టర్ అభిజిత్, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ అంజనా స్నేహ, డాక్టర్ అరుణ్, ఆర్డీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ శ్రీరామ్, ఏపీడీ జయశ్రీ, ఏపీఓ లక్ష్మీనర్సింహారావు, లక్ష్మణ్రావు, తహసీల్దార్ సుధాకర్, డెయిరీ అధ్యక్ష, కార్యదర్శులు లలిత, చాంద్బీ పాల్గొన్నారు. కొనసాగుతున్న పెట్టుబడి సాయం జమ ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతుభరోసా పథకం ద్వారా జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈమేరకు గురువారం నాలుగెకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. జిల్లాలో 2,98,513 మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.255.75 కోట్లు జమ అయ్యాయని డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం నియోజకవర్గంలో 16,197 మందికి రూ.14.69 కోట్లు, పాలేరు నియోజకవర్గంలో 71,029 మంది రైతులకు రూ.58.08 కోట్లు, సత్తుపల్లి నియోజకవర్గంలో 74,682 మంది రైతులకు రూ.62.19 కోట్లు, మధిర నియోజకవర్గంలో 78,832 మంది రైతులకు రూ.66.28 కోట్లు, వైరా నియోజకవర్గంలో 56,673 మంది రైతులకు రూ.53.78 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలంలోని 1,100 మంది రైతులకు రూ.73 లక్షలు అందాయని వివరించారు. -
విద్యార్థుల సంఖ్యే కీలకం
కొణిజర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడమే కీలకమని, ఇందుకోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కొణిజర్ల మండలం పల్లిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశాక మాట్లాడారు. మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా ఇప్పటినుంచే తర్ఫీదు ఇవ్వాలని తెలిపారు. తహసీల్దార్ ఎన్.అరుణ, ఎంఈఓ డి.అబ్రహం, హెచ్ఎం సుజాత, కౌన్సిలర్ బలరామయ్య తదితరులు పాల్గొన్నారు. ●వైరా: వైరాలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ దివాకర పరిశీలించారు. మొత్తం 11 బ్లాక్లకు ఏడు బ్లాక్ల్లో డార్మెటరీ నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడొద్దని తెలిపారు. అనంతరం 2వ వార్డులో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని ఆయన పరిశీలించారు. తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు పాల్గొన్నారు కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
ధైర్యం‘గుండె’లా భరోసా..
రుద్రంపూర్: సింగరేణి కార్మికులు ఇక నుంచి గుండె మీద చేయివేసుకుని ఉండేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గుండె సంబంధిత రుగ్మతలకు అత్యాధునిక వైద్యసేవలు అందించే క్యాథ్ల్యాబ్ను ఆర్జీ–1 (రామగుండం–1) ఏరియాలో ఏర్పాటు చేసింది. దీనిని త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే (సుమారు 32 వేల మంది) గోదావరి ఖని ప్రాంతంలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేయటం అభినందనీయమని కార్మికులు, కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గోల్డెన్ అవర్ కోసం.. ప్రస్తుతం వయోభేదం లేకుండా గుండెపోటు (హార్ట్ ఎటాక్/కార్డియాక్ అరెస్ట్) వస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అది ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేం. ఈ సమస్య తలెత్తిన తర్వాత తొలి గంట సమయాన్ని గోల్డెన్ అవర్గా పేర్కొంటారు. ఇది చాలాకీలకమైన సమయం. అప్పుడే చికిత్స అందితే ప్రాణాలు నిలుస్తాయి. ఈ చికిత్స కోసమే గోదావరి ఖనిలో అత్యాధునిక క్యాథ్ల్యాబ్ను సింగరేణి ఏర్పాటు చేసింది. కోల్బెల్ట్ ప్రజలకు సకాలంలో తక్కువ వ్యవధిలో అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించింది. ఏటా రూ.300 కోట్లు ఖర్చు కార్మికుల ఆరోగ్యం కోసం సంస్థ ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ప్రధానంగా కార్పొరేట్ ఆస్పత్రుల రిఫరల్ కోసం అధిక మొత్తం నిధులు కేటాయిస్తోంది. హృద్రోగ బాధితులు, సుమారు 3 వేల మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి, బెల్లంపల్లి, రామగుండం, రామకృష్ణాపూర్ ప్రాంతాల నుంచి హైదరాబాద్తోపాటు ఇతర నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేశారని గణాంకాలు చెబుతున్నాయి. ఇకనుంచి అలాంటి వారికి చికిత్స అందించేందుకు 5 బెడ్లతో ఇన్సెంటివ్ కార్డియాక్ కేర్ యూనిట్, 10 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్తోపాటు నిపుణులైన వైద్యులతో ల్యాబ్ ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ క్యాథ్ల్యాబ్ కోసం సింగరేణి సంస్థ దాదాపు రూ.50 కోట్లను ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల టారీఫ్ల మేరకు అతి తక్కువ ఖర్చుతో స్థానికులకు కూడా అత్యాధునిక వైద్య సేవలను అందించే సాకర్యం కల్పించింది. ప్రతినెల సుమారు 3 వేల మందికిపైగా ఈ సేవలను వినియోగించుకుంటారని అధికారుల అంచనా. అయితే, క్యాథ్ల్యాబ్లో ఉన్న బెడ్లలో 50 శాతం సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించారు. గుండె సంబంధిత రుగ్మతలకు చికిత్స -
ఓట్లు తొలగించే కుట్రలను అడ్డుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో తొలగించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఐక్యంగా అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, దండి సురేశ్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, మాస్లైన్ జిల్లా నాయకుడు ఆవుల అశోక్ మాట్లాడారు. బీజేపీ స్వార్థంతో వ్యవహరిస్తూ అర్హుల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఓటరు జాబితా సవరణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇదే సమయాన బీఎల్ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ ర్యాలీలో పలు పార్టీల నాయకులు నాగండ్ల దీపక్చౌదరి, వై.విక్రమ్, జి.రామయ్య, షేక్ జానీమియా, కమర్తపు మురళి, దొబ్బల సౌజన్య, జితేందర్రెడ్డి, యర్రా శ్రీనివాసరావు, ఎస్.నవీన్రెడ్డి, సీవై పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన భారీ ప్రదర్శన -
ఆయిల్పామ్తో లాభాలు
ఏన్కూరు: వరి, పత్తికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ సాగు చేస్తే ప్రభుత్వం నుంచి రాయితీలు అందడమేకాక రైతులకు లాభాలు వస్తాయని కలెక్టర్ దివాకర తెలిపారు. ఏన్కూరు మండలం గార్లొడ్డులో ఆయిల్ పామ్ తోటను పరిశీలించగా.. పది ఎకరాల్లో సాగు చేస్తుండగా, ఎకరాకు రూ.80వేల ఆదాయం వస్తోందని రైతు కట్టా రాంబాబు చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మరింత మంది రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించడంతో అంతర పంటల సాగుతో లాభాలను వివరించాలని ఉద్యాన అధికారి ఆకుల వేణుకు సూచించారు. తహసీల్దార్ శేషగిరిరావు, రైతులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వాల వైఫల్యాలతోనే యువత నిర్వీర్యం’
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు సరిపడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయని, ఫలితంగా యువత పక్కదారి పట్టి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీ రాకేశ్, జిల్లా కార్యదర్శి జక్కుల భరత్ పేర్కొన్నారు. ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు జాటోత్ ప్రేమ్సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను వంచించగా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరించిందని విమర్శించారు. ఫలితంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత మానసిక క్షోభతో పక్కదారి పడుతున్నారని తెలిపారు. ఇకనైనా ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయడంతో పాటు కొత్త పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అలాగే మత్తు పదార్థాల అమ్మకాలను అరికట్టాలని కోరారు. సమావేశంలో పీవైఎల్ నాయకులు సీహెచ్ ధరణికృష్ణ, మామిడాల వెంకటేశ్, తోట రమేశ్, మక్కా రవీందర్, ఇస్లావత్ రమేశ్ పాల్గొన్నారు. -
కారు విలువ చెల్లించాలని తీర్పు
ఖమ్మంలీగల్: ప్రమాదంలో నుజ్జయిన కారు విలువ రూ.6.31 లక్షలతోపాటు అదనంగా రూ.30 వేల పరిహారం చెల్లించాలని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశిస్తూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గురువారం తీర్పు వెలువరించింది. గత ఏడాది మే 4న రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన మద్దినేని ఉపేందర్కు చెందిన హ్యుందాయ్ ఆరా కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఉపేందర్ కారు మరమ్మతు కోసం హ్యుందాయ్ సర్వీస్ సెంటర్కు తరలించగా రూ.10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అయితే, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ బీమా పాలసీ ఉండడంతో సదరు కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా, ప్రమాద సమయంలో కారు నడిపిన డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడంటూ ఓ దినపత్రికలో వచ్చిందని క్లెయిమ్ను తిరస్కరించారు. దీంతో ఆయన న్యాయవాది ద్వారా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా విచారణ అనంతరం కారు విలువతో పాటు పరిహారం చెల్లించాలని కమిషన్ ప్రెసిడెంట్(ఎస్ఏసీ) వి.లలిత, మెంబర్ ఎ.మాధవీలత తీర్పు చెప్పారు. -
‘సర్’ సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్
ఖమ్మంసహకారనగర్: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా ఓటర్లకు ఇంటింట ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కొనసాగుతోంది. ఈ నేపథ్యాన ఓటర్ల సందేహాలు నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు భర్తీ చేసే అంశంపై ఓటర్లకు సలహాలు ఇస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఆస్తివివాదంతో సామగ్రి ధ్వంసం రఘునాథపాలెం: ఆస్తివివాదం నేపథ్యాన ఓ ఇంట్లోని సీసీ కెమెరాలు, విద్యుత్, ఇతర సామగ్రి ధ్వంసం చేసిన ఇద్దరిపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని వి.వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన కుతుంబాక రవికుమార్కు ఏడెకరాల భూమి ఉంది. ఆ భూమిలో నిర్మించిన గదిలో పరిటాల గంగరాజు వాచ్మన్గా ఉంటున్నా డు. ఇటీవల రవికుమార్ బంధువైన సత్యనారాయణ, సతీశ్ వచ్చి భూమి తమదేనని గంగరాజును దుర్భాషలాడి వెళ్లగొట్టారు. అంతేకాక అక్కడ సీసీ కెమెరాలు, మోటారు మీటరు తదితర సామగ్రిని ధ్వంసం చేశారని అందిన ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. -
మొక్కలతో పర్యావరణ సమతుల్యత
● పోలీసు కమిషనర్ సునీల్దత్ ఖమ్మంక్రైం: ప్రతీఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో భాగస్వాములు కావాలని సీపీ సునీల్దత్ సూచించారు. ఖమ్మం అంబేద్కర్ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి బుధవారం ఆయన మొక్కలు నాటి మాట్లాడా రు. ఇళ్లలోనే కాక పరిసరాల్లో మొక్కలు నాట డం, సంరక్షించడాన్ని బాధ్యతగా తీసుకోవాల ని తెలిపారు. ఇందుకోసం కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, రోడ్లకిరువైపులా సామూహిక డ్రైవ్ చేపట్టనున్నట్లు సీపీ వెల్లడించారు. ఏసీపీ రమణమూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ కనకవల్లి, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్ పాల్గొన్నారు. జిల్లా రిజిస్ట్రార్గా శ్రీనివాస్ ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా నూతన రిజిస్ట్రార్(డీఆర్)గా ఏ.శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. చేవెళ్ల సబ్ రిజి స్ట్రార్(గ్రేడ్–1)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు ప్రభుత్వం జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి కల్పించి ఖమ్మంకు కేటాయించింది. అంతేకాక వరంగల్ జిల్లా రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతల(మార్కెట్ విలువలు అండ్ ఆడిట్)లను కూడా ఆయనకు అప్పగించగా విధుల్లో చేరారు. ఇక ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్గా ఉన్న ఎం.రవీందర్రావు రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్గా బదిలీ అయ్యారు. ఈమేరకు కొత్త రిజిస్ట్రార్ శ్రీనివాస్, బదిలీ రిజిస్ట్రార్ రవీందర్రావు ను కార్యాలయ ఉద్యోగులు సన్మానించారు. ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సర్వర్ సమస్యతో నాలుగు రోజులుగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కొత్త సాఫ్ట్వేర్ అమలు నేపథ్యాన ఈ పరిస్థితి నెలకొనగా, బుధవారం సర్వర్ అందుబాటులోకి రావడంతో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం 50డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే, వివాహ రిజిస్ట్రేషన్ల సమస్య కొనసాగినట్లు తెలిసింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఖమ్మం రాపర్తినగర్: పాపటపల్లి – డోర్నకల్ స్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, లైన్ల మరమ్మతు పనుల కారణంగా బుధవారం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు ఖమ్మం నుంచి వరంగల్, విజయవాడ వెళ్లే పలు రైళ్లు నిలిచిపోయాయి. ఖమ్మం స్టేషన్లో శాతవాహన, గోల్కొండ, కోణార్క్ తదితర రైళ్లను కాసేపు నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రైళ్లను ఒక్కటొక్కటిగా నడిపించామని అధికారులు వెల్లడించారు. పందిళ్లపల్లి రేక్ పాయింట్కు చేరిన యూరియా చింతకాని: మూడు జిల్లాల అవసరాలకు గాను చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు బుధవారం 2,579 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 579 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు. అలాగే, మహబూ బాబాద్ జిల్లాకు 1,400 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, మరో 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేశామని వెల్లడించారు. -
మెరుగైన ఫలితాల్లో ఉపాధ్యాయులే కీలకం
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే విద్యార్థులకు మెరుగైన విద్య అందడంతో పాటు ఉత్తమ ఫలితాలు నమోదవుతాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని విద్యారంగంలో జిల్లాను ఆదర్శంగా నిలిపేలా కృషి చేయాలని సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా ప్రమాణాల మెరుగుదల, హాజరు, యూనిఫారాల పంపిణీ, ఎఫ్ఆర్ఎస్ హాజరుపై ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. అన్ని తరగతుల్లో విద్యార్థుల ప్రవేశాలు, హాజరు పెరిగేలా కృషి చేయాలని తెలిపారు. ఎంఈఓలు తమ పరిధిలోని ప్రతీ పాఠశాలను తరచూ సందర్శించడం ద్వారా పరిస్థితులు మెరగువుతాయని చెప్పారు. విద్యార్థులు సొంతంగా చదవడం, మాట్లాడడమే కాక నేర్చుకున్న విషయాలను సృజనాత్మకంగా వ్యక్తీకరించేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఇన్చార్జ్ డీఈఓ సదానందం, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్ రామకృష్ణ, ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, సీఎంఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళిక విపత్తులను ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్లో ఆయన ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు, వరదల సమయాన ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని తెలిపారు. డీఆర్ఓ రామ్మూర్తి, కలెక్టరేట్ ఓఎస్డీ వెంకటేశ్వర్లు, అగ్నిమాపక శాఖాధికారి రామిరెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ బిటన్సింగ్, ఉద్యోగులు సందీప్రెడ్డి, ఆంజనేయులునాయక్ పాల్గొన్నారు. ‘సర్’లో బీఎల్ఏలు పాల్గొనాలి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ)లు పాల్గొని ఉద్యోగులకు సహకరించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్తో కలిసి ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నింపడంపై అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 95.78 శాతం పూర్తయిందని చెప్పారు. ఎస్డీసీ సదానందం, డీటీ అన్సారీ, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.విద్యాశాఖపై సమీక్షలో కలెక్టర్ దివాకర -
ఆన్లైన్లో పోస్టాఫీస్!
ఖమ్మంగాంధీచౌక్: వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే తపాలా శాఖ కూడా వినియోగదారులకు చేరువయ్యేలా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్టాఫీస్ వద్ద క్యూలైన్లలో వేచి ఉండడం, చెల్లింపుల కోసం నిరీక్షించాల్సిన ఇబ్బంది లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో అందించేలా చర్యలు తీసుకుంది. అందరికీ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరుణాన పోటీలో వెనకబడకుండా వినియోగదారుల సౌలభ్యం, సంస్థ మనుగడను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతను అంది పుచ్చుకుంటోంది. తపాలా వ్యవస్థ విస్తృతంగా ఉండడం, గ్రామగ్రామాన పోస్టాఫీస్లు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)ను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రతీ పోస్టాఫీస్లో తపాలా సేవలతో పాటు బ్యాంకింగ్ సేవలు కూడా అందుతున్నాయి. ఐపీపీబీలో ఖాతా ఉంటే చాలు.. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)లో ఖాతా కలిగి ఉంటే అన్నిరకాల తపాలా సేవలు సులభతరంగా అందుతాయి. ఇందులో రూ.200 డిపాజిట్తో ఖాతా తెరిచే సౌకర్యం కల్పించారు. పోస్టాఫీస్ల ద్వారా, పోస్ట్మెన్ల ద్వారా కూడా ఈ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఐపీపీబీ ద్వారా ఇంటి ముంగిట్లోకి చేరుతున్నాయి. పదేళ్ల వయస్సు నిండి, ఆధార్కార్డు ఉన్న వారంతా ఈ బ్యాంకులో ఖాతా తెరిచే సౌలభ్యం ఉంది. యాప్తో సులభంగా.. తపాలా బ్యాంకింగ్ సేవలను విస్తృతపర్చడం, వినియోగదారులకు చేరువ చేసేందుకు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) యాప్ను ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్లోని రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ల చెల్లింపు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్పీఎల్ఐ ప్రీమియం చెల్లింపులను ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ ఖాతా కలిగి ఉంటే ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ యోజన, ఉపాధి పథకం, రైతు భరోసా, పెన్షన్ల జమ అయ్యే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఖాతాలు తెరిచేలా అధికారులు ప్రచారం చేస్తున్నారు. 823 పోస్టాఫీసుల్లో సేవలు ఖమ్మం తపాలా డివిజన్ పరిధి ఉమ్మడి జిల్లాలో 823 పోస్టాఫీస్లు ఉన్నాయి. వీటి ద్వారా ఐపీపీబీ సేవలందిస్తోంది. ఐపీపీబీ ప్రధాన కార్యాలయం ఖమ్మం గాంధీచౌక్లో ఉండగా, ఇప్పటి వరకు 41,500 ఖాతాలు తెరిచారు. అలాగే, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ విధానం(ఏపీఈఎస్)లో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో 1.20 లక్షల లావాదేవీలు జరిగాయి. తపాలా సేవలు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఐపీపీబీ ఖాతా కలిగి ఉంటే అన్ని రకాల సేవలు అందుతాయి. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. పొదుపు పథకాలు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్ కూడా చెల్లించవచ్చు. – వి.వీరభద్రస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్, ఖమ్మం డివిజన్ -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్బాబా మధిర/ఎర్రుపాలెం: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఖాదర్బాబా వెల్లడించారు. మధిర, ఎర్రుపాలెంలోని గ్రంథాలయాలను బుధవారం పరిశీలించిన ఆయన భవనాలు, సౌకర్యాలు, అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలు తెలుసుకున్నారు. మధిర గ్రంథాలయ భవనానికి మరమ్మతులు చేపట్టి పెరుగుతున్న పాఠకుల దృష్ట్యా నూతన భవన నిర్మాణం చేపట్టాలని పలువురు కోరారు. అంతేకాక ఉద్యోగ పోటీ పరీక్షల పుస్తకాలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఎర్రుపాలెం లైబ్రరీలో లైబ్రేరియన్ శ్రీనివాసరావుతో చర్చించగా, భవనానికి ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ ఖాదర్ మాట్లాడుతూ.. సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి నూతన భవనాల నిర్మాణంతో ఇతర వసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో మధిర మున్సిపల్ వైస్ చైర్మన్ కోనా ధనికుమార్, కౌన్సిలర్లు నకిరికంటి రాజేశ్వరి, షేక్ రసీదున్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పారుపల్లి విజయ్కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, మిర్యాల వెంకటరమణగుప్తా, మోదుగు బాబు, షేక్ ఇస్మాయిల్, షేక్ జానీబాషా, గుడేటి బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
శానిటేషన్.. పరేషాన్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విపరీతమైన ఎండల అనంతరం అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో వాతావరణం కాస్త చల్లపడుతోంది. ఇదే సమయాన వర్షాలతో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా ప్రబలే ప్రమాదముంది. జిల్లాలోని పలు గ్రామపంచాయతీలతోపాటు మండల, పట్టణ కేంద్రాల్లోనూ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో నీరు రహదారులపై నిలిచి దోమల వృద్ధికి కారణమవుతోంది. పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడమే కాక డెంగీ పంజా విసరకముందే వైద్యశాఖ అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాల్సిన అవసరముంది. ముందస్తు చర్యలతోనే.. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడితేనే వ్యాధుల కట్టడి సాధ్యమవుతుంది. జిల్లాలో ఇంకా వర్షాలు ఊపందుకోలేదు. ఈ క్రమంలోనే డ్రెయినేజీలు శుభ్రం చేయించడం, సిల్ట్ తొలగింపు పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెత్తాచెదారం తొలగించాలి. ఇందుకోసం ప్రత్యేకడ్రైవ్ నిర్వహిస్తే భారీ వర్షాలు కురిసినా ఇబ్బందులు ఉండవు. ఏటా మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు ఫ్రై డే – డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కూడా మొదలుపెట్టి ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. డెంగీ కేసులు నమోదు ఏటా జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలడం ఆనవాయితీగా వస్తోంది. చెత్తాచెదారం నిల్వతో దోమలు ప్రబలి అంటువ్యాధులు సంక్రమిస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అంతేకాక మలేరియా, డయేరియా వంటి వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన ఓ వ్యక్తి ఇతర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటుండగా డెంగీ సోకి గతనెల 18న మృతి చెందాడు. అలాగే, కారేపల్లిలోని భరత్నగర్ కాలనీలోనూ గత నెల 19న డెంగీ కేసు నమోదైంది. ఈక్రమాన కేసులు మరింత పెరగకముందే మున్సిపల్, కార్పొరేషన్, వైద్యశాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరముంది. కీలక ప్రాంతాలపై దృష్టి అంటువ్యాధులు సంక్రమించేందుకు కారణమయ్యే ప్రాంతాలపై సిబ్బంది దృష్టి సారిస్తే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో వరద నీటితో పాటు ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు నెలల తరబడి నిలిచి ఉంటోంది. ఇలాంటి ప్రాంతాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇక మున్నేటి వరద ఏటా ఖమ్మం నగరాన్ని వణికిస్తోంది. వరద అకస్మాత్తుగా రావడంతో గత రెండేళ్లుగా మున్నేరు పరీవాహక ప్రాంత కాలనీలు అతలాకుతలం అయ్యాయి. పారిశుద్ధ్య నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముందస్తుగాశానిటేషన్ సిబ్బందిని సిద్ధం చేసినా మరింత మెరుగైన చర్యలు చేపట్టకపోతే వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదముంది.జిల్లాలోని 571 గ్రామపంచాయతీలకు ఇటీవలే పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యాన వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామపంచాయతీల్లో 2,103 మంది శానిటేషన్ సిబ్బంది పని చేస్తుండగా, 1,480 కి.మీ. డ్రెయినేజీలు ఉన్నాయి. సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చాలాచోట్ల చెత్తాచెదారం నిండి భారీ వర్షాలు కురిస్తే నీరు ముందుకు సాగక రోడ్లపైకి చేరనుంది. ప్రస్తుత వర్షాలతో ఇదే పరిస్థితి ఎదురవుతుండగా, రోడ్డు పక్కన ఉన్న చెత్త కూడా తొలగించకపోవడంతో అది కుళ్లి దోమలు వృద్ధి చెందుతున్నాయి.పలు ప్రాంతాల్లో అధ్వానంగా పారిశుద్ధ్యం -
ఇంటింటికీ వెళ్లడం తప్పనిసరి
● రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వర్రెడ్డి ● పలు మండలాల్లో ఫారాల పంపిణీ పరిశీలనకొణిజర్ల/వైరా రూరల్/కూసుమంచి: సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ(సర్)లో భాగంగా బీఎల్ఓలు తప్పనిసరిగా ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. జిల్లాలోని కొణిజర్ల, వైరా, కూసుమంచి మండలాల్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా కొణిజర్ల మండలం తనికెళ్ల, వైరా మండలం కేజీ సిరిపురంలో పరిశీలించాక ఆయన మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో వైరా డివిజన్ ముందంజలో ఉందని తెలిపారు. అనంతరం మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, మృతులు, గ్రామంలోని వారిని గుర్తిస్తున్న తీరుపై సమీక్షించారు. అంతేకాక ఓటర్లతో మాట్లాడి బీఎల్ఓల పనితీరుపై ఆరా తీశారు. ఈకార్యక్రమాల్లో తహసీల్దార్ ఎన్.అరుణ, ఉద్యోగులు రమేష్, రామచంద్రరావు, రవి, సర్పంచ్లు గడల కళావతి,శెట్టిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక కూసుమంచి మండలం జుజుల్రావుపేటలో ఫారాల పంపిణీని పరిశీలించిన రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ అర్హులు ఓటరు జాబితాలో ఉండేలా ఫారాలు నింపి అందజేయాలని సూచించారు. తహసీల్దార్ సైదులు, ఈఆర్ఓ సదానందం, ఉద్యోగులు రవీందర్, జ్యోతి, రవిశంకర్, నాగమణి పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) గోదాంను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వరరెడ్డి.. కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి తనిఖీ చేశారు. గోదాం వద్ద భద్రత, యంత్రాలు భద్రపరిచిన గదుల సీళ్లను పరిశీలించి సూచనలు చేశారు. ఎస్డీసీ సదానందం, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
బెంగళూరులో ఆర్టీసీ బస్సులకు మరిన్ని స్టాప్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నుండి బెంగళూరుకు నడిచే బస్సులకు అదనంగా స్టాప్లు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. ఈమేరకు బెంగళూరులోని దేవనహళ్లి బైపాస్, బెంగళూరు ఎయిర్పోర్ట్ ప్లాజా, ఎలహంక, ఎస్టీమ్ మాల్, హెబ్బల్, సీబీఐ జంక్షన్, ప్యాలెస్ గుట్ట హల్లి, ఆనందరావు జంక్షన్, కెంపెగౌడ బస్స్టేషన్(మెజెస్టిక్), యశ్వంతపూర్ మెట్రో స్టేషన్, పీనియా స్టాప్ల్లో కూడా ఇకపై బస్సులు ఆగుతాయని వెల్లడించారు. ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో బస్సు ఎక్కడంతో పాటు దిగే అవకాశం ఉందని ఆర్ఎం ఓ ప్రకటనలో తెలిపారు. -
నేటి నుంచి ‘ఉల్లాస్’
మహిళా సంఘాల సభ్యులకు చదవడం, రాయడంలో శిక్షణఖమ్మంమయూరిసెంటర్: పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్(నవ భారత అక్షరాస్యత కార్యక్రమం) గురువారం మొదలుకానుంది. మహిళల్లో విద్యపై అవగాహన కల్పించి వారికి చదవడం, రాయడం నేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈమేరకు ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 3వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు చదవడం, రాయడంతో పాటు ప్రాథమిక అక్షరాస్యత, సాధారణ సంఖ్యా జ్ఞానం(అంకెలు)పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా సంతకాలు చేయడం, బ్యాంకు లావాదేవీలు చూసుకోవడం అలవడనుంది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ, మెప్మా అధికారులు వలంటీర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన పాఠ్యపుస్తకాలు, కిట్లను బుధవారం అందజేశారు. ఆర్పీలు, మెప్మా సిబ్బంది సమన్వయంతో నిర్వహించే శిక్షణను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియో గం చేసుకోవాలని అధికారులు కోరారు. -
వృత్తి సెంట్రింగ్.. ప్రవృత్తి చోరీ
ఖమ్మంక్రైం: రోజంతా నూతన భవనాలకు సెంట్రింగ్ పెట్టడం.. సమయం చిక్కితే ఎక్కడ తాళం వేసి ఇళ్లు ఉన్నాయో గుర్తించడం.. రాత్రి కాగానే అనువైన ఇంట్లో జొరబడి ఉన్నదంతా దోచుకెళ్లడం ఆయన దినచర్య. ఇలా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఖమ్మం సబ్ డివిజన్ పోలీసులు బుధవారం అరెస్ట్చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగర, సీసీఎస్ ఏసీపీలు రమణమూర్తి, సర్వర్ వివరాలు వెల్లడించారు. మధిర మండలం ఆత్కూర్ గ్రామానికి చెందిన కంభంపాటి ఏసోబు అలియాస్ కందుల సురేశ్రెడ్డి సెంట్రింగ్ పనిచేసేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆయన చోరీల బాట పట్టాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని కిటికీల నుంచి చొరబడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించినా తీరు మార్చుకోని ఏసోబు ఖమ్మం నగరంతోపాటు వేంసూరు, వీఎం.బంజర, చిల్లకలు, తిరువూరు తదితర ప్రాంతాల్లో జరిగిన 22 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలులో మరింత శిక్షణ! పలుమార్లు జైలుకు వెళ్లిన ఏసోబు అక్కడ పాత నేరస్తులతో పరిచయం పెంచుకుని ఎక్కడెక్కడ,ఎలా చోరీ చేయాలో మెళకువలు తెలుసుకునేవాడు. ఆపై జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ చోరీలు మొదలుపెట్టేవాడు. ఈ క్రమాన ఖమ్మంకిన్నెర హోటల్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఏసోబును అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవహారం బయట పడింది. ఈ సందర్భంగా రూ.32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.40 వేలవిలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఓ చంద్రహారం ప్రైవైట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. కాగా,సోనోవిజన్లో చోరీకి పాల్పడిన వారిని త్వరలో పట్టుకుంటామని, గాంధీచౌక్లోని చోరీకేసులో రికవరీపై దృష్టి సారించామని ఏసీపీలు తెలిపారు. సమావేశంలో సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్ పాల్గొనగా, నిందితుడిని అరెస్ట్చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐలు వంశీ, రమేశ్, ఉద్యోగులు కె.శ్రీనివాస్, నర్సింహారావు, సుధీర్, సుందర్ను అభినందించారు. -
ఆన్లైన్లో పోస్టాఫీస్ !
వాణిజ్య బ్యాంకులకు దీటుగా పోస్టల్ శాఖ కూడా ఐపీపీబీ ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు, యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ఫొటో తల్లాడ గ్రామపంచాయతీ పరిధి గాంధీనగర్ తండాలోనిది. తల్లాడకు మూడు కి.మీ. దూరాన ఉండే ఈ గ్రామంలో డంపింగ్ యార్డ్ లేదు. మరోపక్క తల్లాడ నుంచి చెత్త వాహనాలు వెళ్లడం లేదు. దీంతో గ్రామస్తులు వ్యర్ధాలను ఊరి చివర రోడ్డు వెంట వేస్తుండడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. తాజా వర్షాలకు పరిస్థితి మరింత అధ్వానంగా మారినందున అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
కొణిజర్ల: పొలానికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లిన ఘటన మండలంలోని అమ్మపాలెంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన తేజావత్ లక్ష్మి కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు బంధువు మోటార్ సైకిల్పై వచ్చింది. రాజ్యాతండా వద్ద దిగి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాగారు. ఈ మేరకు లక్ష్మి ప్రతిఘటించగా రూ.2 లక్షల విలువైన నల్లపూసలతో అల్లిన బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. అభయాంజనేయ స్వామి ఆలయంలో నగదు.. కల్లూరురూరల్: కల్లూరు సమీపాన గనియతండాలోని శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ గ్రిల్స్ పగలగొట్టి లోనకు ప్రవేశించి హుండీ తాళం పగల గొట్టారు. అందులో ఉన్న సుమారు రూ.32వేల నగదుతో పాటు స్వామికి భక్తులు సమర్పించిన 20 గ్రాముల వెండి కళ్లు కూడా ఎత్తుకెళ్లారు. ఆలయ చైర్మన్ బానోతు రంజిత్ ఫిర్యాదుతో కల్లూరు ఎస్ఐ హరిత పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య తల్లాడ: వ్యవసాయ అవసరాలకు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన గాదె మురళి (35).. తనకున్న మూడెకరాలకు తోడు మరో ఐదెకరా లు కౌలుకు తీసుకుని గత ఏడాది మిర్చి, పత్తిసాగు చేశా డు. అయితే, సరైన దిగుబడి రాక రూ.5లక్షల అప్పు మిగిలింది. ఈ అప్పు తీర్చే మార్గం లేక మూడు రోజు లుగా బాధపడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద పురుగులమందు తాగగా కుటుంబీకులు ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మురళి తండ్రి రామచంద్రం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ఆత్మహత్యాయత్నంనేలకొండపల్లి: మండలంలోని ఆచార్లగూడెం గ్రామానికి చెందిన బాలుడు (14) బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న ఎలుకల మందు మింగగా, గమనించిన కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, బాలుడి ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
పేదలను వంచిస్తే గుణపాఠం ఖాయం
ఖమ్మంమయూరిసెంటర్: పేదలను వంచిస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు హెచ్చరించారు. నివాస స్థలాలు లేక పేదలు ఇబ్బంది పడుతున్నా పాలకులు పట్టించుకోకుండా కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. నివాస స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న డిమాండ్తో బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలను విస్మరించిన కారణంగానే ప్రజలు తిరస్కరించారని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం అదే పంథా అవలంబిస్తోందని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాలు లేక పేదలు ఇబ్బంది పడుతుండగా, ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే కూల్చివేస్తున్నారని తెలిపారు. ఇకనైనా కూల్చిన చోటే పేదలకు నివాస స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయాన ఖమ్మంలోని ఎన్నెస్పీ స్థలాలు, ప్రభుత్వ భూములను సంపన్నులు ఆక్రమిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, వామపక్ష పార్టీల నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, బీ.జీ.క్లెమెంట్, జానీమియా, మాదినేని రమేశ్, యర్రా బాబు, సిద్దినేని కర్ణకుమార్, మహ్మద్ సలాం, బొంతు రాంబాబు, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలో సీపీఐ నేత హేమంతరావు -
తమ్మినేనిని పరామర్శించిన బృందాకారత్
ఖమ్మంరూరల్: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడే తమ్మినేని వీరభద్రంను సీపీఎం జాతీయ నాయకురాలు బృందాకారత్ బుధవారం పరామర్శించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దారుపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్న తమ్మినేనిని ఆమె పరామర్శించి ఆరోగ్య వివరాలు వివరాలు తెలుసుకున్నారు. త్వరగా ఆయన కోలుకుని ప్రజాజీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. సీపీఎం నాయకులు ఆశాలత, బండి రమేష్, బండి పద్మ, మాచర్ల భారతి, మెరుగు రమణ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు మేలు జరిగేలా సంస్కరణలుకల్లూరురూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మేలు జరిగేలా విద్యా సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు కోరారు. కల్లూరులో బుధవారం యూనియన్ సభ్యత్వ నమోదు నిర్వహించగా ఆయన మాట్లాడారు. విద్యారంగంలో సంస్కరణల పేరిట ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలల కుదింపునకు ప్రయత్నా లు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాకాకుండా ప్రస్తుత విద్యాసంస్థలను బలోపేతం చేసి ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. పీఆర్సీ కోసం త్వరలో జేఏసీ ఆధ్వర్యాన ఆందోళనల కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాకాల రమేశ్, షేక్ చాంద్సాహెబ్తో పాటు పఠాన్రహీం, టి.సత్యనారాయణరెడ్డి, పోట్రు మధుసూదన్రావు, దంతాల సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొనసాగుతున్న కుంభాభిషేకం ఉత్సవాలుఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి మహా కుంభాభిషేక స్వర్ణోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవా రం యాగశాలలో చతుర్వేదపారాయణం, నవ గ్రహ హోమం, గణపతి పూజ చేయడమే కాక నూతన ధ్వజ స్తంభాలకు శుద్ధి చేశారు. కాగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్ప ల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సర్పంచ్ తుళ్లూరు నిర్మలకుమారి, మధిర మార్కెట్, సొసైటీ చైర్మన్లు బండారు నర్సింహారావు, ముల్పూరి శ్రీనివాసరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, నాయకులు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, వేజండ్ల సాయికుమార్ పాల్గొన్నారు. ఎర్రుపాలెంలో ‘శాతవాహన’కు తాత్కాలిక హాల్టింగ్ ఎర్రుపాలెం: ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లో శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు గురువారం నుంచి తాత్కాలిక హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణ తిరుపతిగా పేరున్న మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీవారి కుంభాభిషేక స్వర్ణోత్సవాలు జరగుతుండటంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు శాతవాహన ఎక్స్ ప్రెస్కు ఎర్రుపాలెంలో హాల్టింగ్ ఇవ్వగా, తా త్కాలికంగా కాకుండా నిరంతరం కొనసాగించాలని మండల వాసులు, భక్తులు కోరుతున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఈ పథకం కింద యూఎస్ఏ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, ఉత్తర కొరియా, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్ దేశాల్లో ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. కుటుంబ వార్షికఆదాయం రూ.5లక్షలు, వయస్సు 35ఏళ్లు దాటొద్దని, కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు పీజీ / పీహెచ్డీ కొరకు సంబంధిత కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, టోఫెల్, ఐఎల్టీఎస్, జీఆర్ఈ, జీమ్యాట్, పీటీఈ పరీక్షల్లో అర్హత సాధించడమే కాక విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అనుమతి పొంది ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు https:// telanganaepass. cgg. gov. in వెబ్సైట్ ద్వారా వచ్చే ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకుని, హార్డ్కాపీకి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన పత్రాలు జత చేసి కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సమర్పించాలని డీడీ ఓ ప్రకటనలో సూచించారు. -
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
ముదిగొండ: గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులు కల్పిస్తూ సమగ్రాభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండలం బాణా పురం, వల్లభి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. బాణాపురంలో రూ.1.30 కోట్లతో నిర్మించే రహదారులు, కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రతీ గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడమే కాక అంతర్గత రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈక్రమంలో గ్రామవీధుల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం, స్థానికులతో మాట్లాడి పథకాల అమలు, సమస్యలపై ఆరా తీశారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టికి వల్లభి, బాణాపురం గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బాణాపురంలో గజమాలతో సన్మానించారు. ఇందిరమ్మ గృహప్రవేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పర్యటనలో భాగంగా బాణాపురం ఎస్సీ కాలనీలో మేడి నీరజ – సుధాకర్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల సంస్థలు, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బాణాపురం సర్పంచ్ తేజావత్ సంధ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క -
అంతకు మించి..
పంట అంచనా సాగు పత్తి 2,36,908 1,60,058వరి 3,05,366 7,753మొక్కజొన్న 4,225 155 చెరకు 1,181 842పెసర 18,174 9.809కంది 451 64ఖమ్మంవ్యవసాయం: గడిచిన జూన్లో జిల్లాలో సగటు వర్షపాతం సాధారణానికి మించి నమోదైంది. ఎల్నినో ప్రభావంతో చాలా జిల్లాల్లో తక్కువ వర్షపాతమే నమోదైనా జిల్లాపై మాత్రం వరుణుడు కరుణ కనబరిచాడు. రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేటతో ఖమ్మం జిల్లాలో అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. జూన్లో జిల్లా సాధారణ వర్షపాతం 131.2 మి.మీ.లు కాగా, 28.8శాతం అధికంగా 168.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. అన్నిచోట్ల కాదు... జిల్లాలోని 21 మండలాలకు గాను 11మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ జాబితాలో బోనకల్, ఏన్కూరు, చింతకాని, ముదిగొండ, తల్లాడ, కల్లూరు, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, వైరా, పెనుబల్లి, కామేపల్లి మండలాలు ఉన్నాయి. ఇక మధిర, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, తిరుమలాయపాలెం, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన కూసుమంచి, సింగరేణి, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక లోటు నమోదైంది. గత జూన్తో పోలిస్తే బాగు గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్ సగటు వర్షపాతం 131.2 మి.మీ.కు గాను గత ఏడాది ఈ నెలలో 123.9 మి.మీ. నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి మాత్రం 168.9 మి.మీ.గా నమోదు కావడం విశేషం. బోనకల్ మండలంలో 118.6 శాతం, ఏన్కూరు మండలంలో 110.3 శాతం, చింతకాని మండలంలో 92.1 శాతం, ముదిగొండ మండలంలో 88.3 శాతం, తల్లాడ మండలంలో 80.4 శాతం, కల్లూరు 79 శాతం, నేలకొండపల్లి మండలంలో 69.6 శాతం, ఖమ్మం రూరల్ మండలంలో 45.6 శాతం, వైరా మండలంలో 40.6 శాతం, పెనుబల్లి మండలంలో 27.6 శాతం, కామేపల్లి మండలంలో 24.4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాగు సంబురం జిల్లాలో అనుకూలించిన వానలతో మెట్ట పంటల సాగు వేగం పుంజుకుంది. ఈ సీజన్లో అన్ని పంటలు కలిపి 5,67,154 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో జూన్ 30 నాటికి 1,78,685 ఎకరాల్లో సాగయ్యాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. అధికంగా పత్తి విత్తనాలు 1,60,058 ఎకరాల్లో నాటగా, పెసర 9,809 ఎకరాల్లో వేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సాగుకు అనుకూలంగా ఉండడంతో పత్తి సాగు విస్తీర్ణం పెరగడమే కాక వరి నార్లు సిద్ధం చేసుకోవడంపై రైతులు దృష్టి సారించారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
వేంసూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండలంలోని మర్లపాడుకు చెందిన బర్ల పుల్లయ్య (71) గతనెల 28న మర్లపాడులోని తిరువూరు రోడ్డు నుంచి మర్లపాడు వైపు బైక్పై వెళ్తున్నాడు. అదే మార్గంలో బైక్పై వెళ్తున్న నాగరాజు వెనుక నుంచి పుల్లయ్యను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన జీపీ కార్మికుడు..సీఎం సభ ఏర్పాట్ల కోసం వెళ్లివస్తుండగా ప్రమాదం కల్లూరురూరల్: చింతకాని మండలంలో సీఎం సభ ఏర్పాట్లకు వెళ్లివస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రామపంచాయతీ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు మండలం మర్లపాడు గ్రామపంచాయతీ కార్మికుడు చాదిరాసుపల్లి పుల్లయ్య (45) మత్కేపల్లి క్రాస్ వద్ద నిర్వహించతలపెట్టిన సీఎం సభ ఏర్పాట్లకు సహాయకుడిగా వెళ్లాడు. అక్కడి సభ రద్దు కావడంతో గత ఆదివారం రాత్రి ఆయన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మర్లపాడు వద్ద గేదె అడ్డు రావడంతో కింద పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన పుల్లయ్యకు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమంచి బుధవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పుల్లయ్య మృతదేహం వద్ద ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది నివాళులర్పించారు. బైక్కు రుణం తీసుకుంటే గేదె రుణం కట్టాలని నోటీసు! నేలకొండపల్లి: రుణం తీసుకోకపోయినా, వెంటనే చెల్లించకపోతే జప్తు చేయాల్సి వస్తుందని పీఏసీఎస్ అధికారులు నోటీసు జారీచేసిన వైనమిది. నేలకొండపల్లి పీఏసీఎస్ ద్వారా మండలంలోని రాయగూడెంకు చెందిన కోసూరి రాజబాబు ద్విచక్ర వాహనానికి రుణం తీసుకున్నాడు. అందులో కొంత చెల్లించగా, ఇంకొంత బకాయి ఉంది. అయితే, అధికారులు మాత్రం గేదె కొనుగోలు తీసుకున్న రుణం వడ్డీతో సహా రూ.74,329 చెల్లించాలని నోటీసు జారీ చేశారు. దీంతో రాజబాబు బుధవారం సొసైటీ మాజీ డైరెక్టర్ పోలంపల్లి నాగేశ్వరరావుతో కలిసి చైర్మన్ తీగ రమణయ్యను కలిశారు. ఈ మేరకు రికార్డులు పరిశీలించాక సాంకేతిక లోపంతో నోటీసులు జారీ అయ్యాయని, సరిచేస్తామని చెప్పడంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు. -
శతవసంత జన్మదినోత్సవం !
మధిర: మధిరకు చెందిన రిటైర్డ్ హిందీ పండిట్ రామిశెట్టి రోశయ్య శత వసంత జన్మదినోత్సవం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రోశయ్య ను సన్మానించి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పడమే కాక బడుగు, బలహీన వర్గాల ప్రజలు, శ్రమజీవుల సమస్యలపై రచనలు చేశారని కొనియాడారు. ఆయన జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో రోశయ్య కుటుంబీకులు దేవరపల్లి సుబ్రహ్మణ్యం, సమత, చైతన్య, డాక్టర్ వంశీకృష్ణ, మానస, రత్నకుమారి, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు లాభసాటిగా ఆయిల్పామ్
రఘునాథపాలెం/కామేపల్లి: సంప్రదాయ పంటల స్థానంలో రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తే దీర్ఘకాలం ఆదాయం లభిస్తుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. రఘునాథపాలెం మండలం లచ్చిరాంతండాలో 45 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్లో ఆయన మొక్క నాటి మాట్లాడారు. కోతులు, ప్రకృతి వైపరీత్యాల బెడద లేకపోగా సుమారు 30 ఏళ్ల పాటు ఆదాయం వస్తుందని తెలిపారు. అనంతరం కామేపల్లి మండలం ముచ్చర్లలో నర్సరీ చట్టంపై ఏర్పాటుచేసిన సదస్సులో మధుసూదన్ మాట్లాడారు. నర్సరీలు నిర్వహించే వారు లైసెన్సు తీసుకోవడమే కాక ఇతర నిబంధనలు పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటించకున్నా, నకిలీ విత్తనాలతో నారు పోసినా రూ.50 వేల జరిమానా విధించడమే కాక ఏడాది జైలుశిక్ష విధించే అవకాశముందని చెప్పారు. ఈకార్యక్రమాల్లో డివిజన్ల ఉద్యాన శాఖాధికారులు నగేష్, డాక్టర్ ఆకుల వేణు, ఏఓ ఉమామహేశ్వర్రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారి సత్యేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ న్యాయవాద పట్టభద్రులకు ఉచిత శిక్షణ ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఎస్సీ న్యాయవాద పట్టభద్రులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మందినే ఎంపిక చేసేవారని, ప్రస్తుతం అర్హులంతా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా.. దశల వారీగా ఎంపిక ఉంటుందని వెల్ల డించారు. అంతేకాక గతంలో నెలకు రూ.వేయి చొప్పున 36 నెలల పాటు ఉపకార వేతనం చెల్లించగా, దాన్ని రూ.3 వేలకు, పుస్తకాలు, స్టేషనరీ కోసం ఇచ్చే నగదును రూ.50 వేలకు పెంచినట్లు తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ న్యాయవాద పట్టభద్రులు ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని, ఆ పథ్రాలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కొనసాగుతున్న మహా కుంభాభిషేకం ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభా భిషేకం స్వర్ణోత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా యాగశాలలో అర్చకులు, వేద పండితులు చతుర్వేద పారాయ ణం, నవగ్రహా హోమం, గణపతి పూజ చేశారు. అనంతరం అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు అష్టోత్తర కలశ పూజ నిర్వహించగా, భక్తులు కలశాలతో అభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాలిక విద్యను ప్రోత్సహించాలి ఏన్కూరు: బాలికలను చిన్నచూపు చూడకుండా చదువుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర విద్యాశాఖ సోషల్ ఆడిటర్ చైతన్యకుమార్ సూచించారు. ఏన్కూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంటగది, తరగతి గదులు, తాగునీరు, తదితర వసతులపై ఆరా తీశాక నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయుడు లక్ష్మాతో చర్చించారు. అనంతరం చైతన్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆగస్టు వరకు తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ భూక్యా లచ్చిరాం ప్రసాద్, ఉపాధ్యాయులు చంద్రిక, నిర్మల, చైతన్య, సత్యావతి, లత, నాగమణి, సదాకోన్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ఫామ్లో...
ఆయిల్పామ్ తోటల సాగులో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,448 మంది రైతులు 2,94,015 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తుండగా.. అందులో 47 శాతం మేర 1,35,569 ఎకరాలు ఇక్కడే ఉండడం విశేషం. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఉమ్మడి జిల్లా దన్నుగా నిలుస్తోంది. ఇక్కడి భూములు, వనరులు అనుకూలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రెండు జిల్లాల్లో కొత్తగా 14,500 ఎకరాల చొప్పున సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
ప్రైవేటీకరణతో ప్రజలపై భారం
పాల్వంచ: విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ చేపడితే ప్రజలపై అదనపు భారం పడుతుందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానించడాన్ని నిరసిస్తూ మంగళవారం పాల్వంచలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం సీఈ కార్యాల యం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణతో ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యం, భద్రత, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ రాజేందర్, కన్వీనర్ యాస్మిన్తో పాటు బ్రహ్మాజీ, ఉమామహేశ్వరరావు, మహేశ్, రఘువీర్, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, సీతారాంరెడ్డి, ప్రభాకర్, నరసింహారావు, సయ్యద్, గిరిధర్, మధుబాబు, కళాధర్, సంపత్, పావని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మణుగూరురూరల్: వైటీపీఎస్లోని పలు విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ టీజీపీఈఏ జేఏసీ చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఈమేరకు పదో రోజైన మంగళవారం బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు బ్యానర్లు, ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీటీజీపీఈఏ కేంద్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.రవిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ యత్నాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్లో బుధవారం జరిగే సమావేశానికి ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. నాయకులు నరేశ్, వి.ప్రసాద్, వెంకట్రాం, సాంబ, టి.శోభన్ తదితరులు పాల్గొన్నారు. -
గుట్ట బడి.. కొత్తగా
● డిప్యూటీ సీఎం భట్టి విద్యాభ్యాసం ఇక్కడే.. ● భవనం అభివృద్ధి చేసి... తిరిగి పాఠశాల నిర్వహణకు ప్రణాళికవైరా/వైరారూరల్: ఆ భవనాన్ని 1955–56 సంవత్సరంలో నిర్మించారు. మధిర తాలుకా పరిధిలో వైరా బ్లాక్ డెవవలప్మెంట్ కార్యాలయం ఇక్కడ కొనసాగింది. గ్రామీణ పరిపాలన అంత కూడా ఈ భవనం నుండే సాగింది. మండల పరిషత్లు మనుగడలోకి వచ్చాక 1960లో ఈ భవనాన్ని ప్రాథమిక పాఠశాలగా మార్చారు. ఎత్తయిన ప్రాంతంలో నిర్మించిన ఈ భవనానికి గుట్టబడి అని పేరు రాగా.. స్నానాల లక్ష్మీపురానికి చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాలినడకన వచ్చి ఈ స్కూల్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. అభివృద్ధిపై సూచనలు కొన్నేళ్ల క్రితం పాఠశాలను మండల వనరుల కేంద్రంలోకి మార్చి, ఇక్కడ మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటుచేశారు. ఆపై మండల పరిషత్కు కొత్త భవనం నిర్మించడంతో అందులోకి తరలించి, ఇక్కడ ఈజీఎస్ కార్యాలయం కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కలిసి చదువుకున్న ప్రస్తుత సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులతో చర్చించే క్రమాన గుట్టబడి ప్రస్తావన వచ్చింది. దీంతో భవనానికి అవసరమైన మరమ్మతులు చేయించి ఒకటి, రెండు తరగతులైనా నిర్వహించాలని ఆదేశించారు. అదీ కుదరకపోతే విద్యాశాఖ అవసరాలకు వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఇందుకోసం ఈజీఎస్ కార్యాలయాన్ని అవసరమైతే పక్కనే ఉన్న మండల పరిషత్ కార్యాలయంలోకి లేదా మరో భవనంలోకి మార్చాలని సూచించారు. గుట్టబడి భవనాన్ని అభివృద్ధి చేయాలన్న డిప్యూటీ సీఎం భట్టి సూచనలతో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మంగళవారం పరిశీలించారు. భవనం అభివృద్ధి, రహదారి వెడల్పు, సెంట్రల్ లైటింగ్, ప్రహరీ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ సీహెచ్.సురేష్, ఎంపీడీఓ సక్రియా, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఆయన వెంట సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, ముళ్లపాటి సీతారాములు, దార్నా రాజశేఖర్, డాక్టర్ శ్యాంబాబు తదితరులు ఉన్నారు. -
హబ్గా ఉమ్మడి ఖమ్మం
సుదీర్ఘకాలంగా ఆయిల్పామ్ సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రికార్డులు సృష్టిస్తోంది. ఇక్కడ 1992 నుంచి ఆయిల్ఫెడ్, గోద్రేజ్ అగ్రో వెట్ సంస్థలు రైతులతో పంట సాగు చేయిస్తున్నాయి. ఇక్కడ సాగుకు అనువైన సారవంతమైన నేలలు ఉండ డం, ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రచారంతో రైతులు దృష్టి సారించారు. మొక్కల సరఫరా కోసం నర్సరీలు ఏర్పాటు చేయడమేకాక, డ్రిప్ ఇరిగేషన్, యాజమాన్యం, అంతరపంటల కోసం ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.46,250ల రాయితీ ఇస్తోంది. అంతేకాక రైతుల నుంచి ఆయిల్పామ్ గెలలు కొనుగోలు చేశాక మూడు రోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ అవుతుంది. గతంలో ఆయిల్పామ్ టన్ను ధర రూ.12,534 ఉండగా.. ప్రస్తుతం రూ.23,852కు చేరింది. ఇక దేశంలోనే రాష్ట్రంలో ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్) 20.01 శాతం సాధించారు. ఉమ్మడి జిల్లాలోని 1,34,698 ఎకరాల్లో ప్రస్తుతం ఆయిల్పామ్ తోటలు ఉన్నాయి. ఇక 2026–27లో రెండు జిల్లాలకు 14,500 ఎకరాల చొప్పున మరో 29 వేల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 9,468 ఎకరాలకు గాను రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో 56 మంది రైతులు 203 ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 178 మంది రైతులు 668 ఎకరాల్లో ఇప్పటికే మొక్కలు నాటడం కూడా పూర్తయింది. దేశీయంగా అవసరమైన పామాయిల్ కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా 15.70 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగులో ఉంది. కానీ దేశం స్వయం సమృద్ధి సాధించాలంటే 70 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు అవసరం. ఈ నేపథ్యాన ఐదేళ్లుగా జాతీయ నూనెగింజల పథకం కింద ఆయిల్పామ్ సాగు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 71,030 మంది రైతులు 2.44 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు వేయగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందంజలో నిలుస్తోంది.ఆయిల్పామ్ సాగయ్యే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు అవసరం. దీంతో సాగు పెరుగుతున్న నేపథ్యాన ప్రభుత్వం వీటి ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నూతనంగా వేంసూరు మండలం కల్లూరుగూడెం, కొణిజర్ల మండలం అంజనాపురంలో సిద్ధమవుతున్న ఫ్యాక్టరీలు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి. ఈ మిల్లుల సామర్థ్యం గంటకు 15 టన్నులు కాగా.. దశల వారీగా గంటకు 60 టన్నులకు పెంచనున్నారు.జిల్లా రైతులు ఎకరాలు ఖమ్మం 11,240 45,892భద్రాద్రి కొత్తగూడెం 22,040 88,806రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సాగు -
ఆ ‘ఖ్యాతి’ చూడకుండానే కన్నుమూత
● బాస్కెట్బాల్ జట్టు గెలుపులో కీలకంగా బాలిక ● అదే సమయాన ఆమె తండ్రి గుండెపోటుతో మృతి కామేపల్లి: ఓ బాలిక క్రీడలపై ఆసక్తి పెంచుకోగా, ఆమె తండ్రి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు. బాలిక కీలకమైన పోటీల్లో పాల్గొనే సమయాన ఆయన గుండెపోటుతో మృతి చెందడంతో జట్టు విజయంలో కుమార్తె పాత్రను కళ్లారా చూడలేకపోయిన ఘటన ఇది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. ఖమ్మం టేకులపల్లికి చెందిన ఈదర మధుసూదన్రావు – అద్దంకి శ్రీరాణి దంపతుల కుమార్తె ఖ్యాతి ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి మధుసూదన్రావు వ్యాపారం చేస్తుండగా, తల్లి శ్రీరాణి కామేపల్లి ఈజీఎస్ ఏపీఓగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి బాస్కెట్బాల్ ఆటపై ఇష్టం పెంచుకున్న ఖ్యాతి జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలకు ఎంపికై ంది. ఈమేరకు హైదరాబాద్లో ముందస్తు శిబిరానికి బాలికతో పాటు ఆమె తండ్రి మధుసూదన్రావు పది రోజుల క్రితం వెళ్లారు. అక్కడ శిక్షణలో ప్రతిభ చాటి వికారాబాద్ మాంబాస్ జట్టులో ఖ్యాతి స్థానం దక్కించుకుంది. జూన్ 28 (ఆదివారం)న వికారాబాద్ మాంబాస్ – వరంగల్ స్టాలిన్స్ జట్ల నడుమ ఫైనల్స్ జరగాల్సి ఉండగా, అదేరోజు మధుసూదన్రావుకు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగానే మృతి చెందాడు. ఈ విషయం తెలియంతో ఖ్యాతి కన్నీరుమున్నీరైనా... సహచరులు అండగా నిలవడంతో మైదానంలోకి దిగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అనంతరం సోమవారం ఖమ్మంలో జరిగిన తండ్రి అంత్యక్రియలకు ఆమె హాజరైంది. -
గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ వంగూరు మోహన్రావు మంగళవారం ఆవిష్కరించారు. సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మాట్లాడుతూ.. జాతిపిత, రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఉద్యోగి పనిచేయా లని సూచించారు. కార్యక్రమంలో ఇంజనీర్లు బాబూరావు, నాగేశ్వరరావు, భద్రుపవార్, రాములు, రామారావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రమేశ్కుమార్, ఖాదర్బాబా, సీహెచ్ నాగార్జున, కోక్యానాయక్, నాగమల్లేశ్వరరా వు, నరేశ్, అధికారులు, యూనియన్ల నాయకులు శ్రీధర్, తిరుపతి, ఎం.సత్యనారాయణ రెడ్డి, శేషగిరిరావు, శ్రీనివాసరావు, ప్రసాద్, విక్రమ్, మూర్తి, కృపాకర్, కిరణ్ చక్రవర్తి, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సన్మానం ఖమ్మంక్రైం: పోలీస్ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన అధికారులను సీపీ సునీల్దత్ మంగళవారం సన్మానించారు. ఖమ్మంలోని సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రంమలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పలు విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులు పోలీస్ శాఖ కు ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో ఎస్ఐలు సుబ్బారావు, లక్ష్మణ్రావు, సుబ్బారావు, కృష్ణ య్య, కృష్ణారావు, రాంప్రకాష్రావు, ఏఎస్ఐలు శ్రీనివాసాచారి, సీహెచ్.వెంకటేశ్వరరావు, అబ్దుహమీద్, హెడ్కానిస్టేబుళ్లు ఎం.వీ.సత్యనారయణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, లాల్సాహెబ్, బుల్లయ్య ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు సాంబరాజు, నర్సయ్య, సీఐలు సర్వయ్య, కామరాజు, నాగుల్మీరా, పోలీస్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 10 నుంచి మూడు రోజులు ‘టీఆర్ఎస్’ బాయిబాటరుద్రంపూర్: తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యా న ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో బాయిబాట నిర్వహిస్తున్నట్లు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మ ద్ తెలిపారు. ఈ మేరకు 10వ తేదీన కొత్తగూ డెం ఏరియాలోనీ పీవీకే–5 ఇంక్లైన్ గని, 11న సత్తుపల్లిలో, 12న మణుగురులో గేట్ మీటింగ్లకు కవిత హాజరవుతారని పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ ఇన్వాలిడేషన్ నిర్వహణ, కొత్త బ్లాక్ల ఏర్పాటులో జాప్యం, భూ నిర్వాసితులను పర్మనెంట్ ఉద్యోగులుగా నియమించడంపై కార్మికులతో చర్చించడమే కాక ఇతర సమస్యలు పరిశీలిస్తారని రియాజ్ ఒక ప్రకటనలో వివరించారు. -
భద్రాచలంలో 6న జాతీయ ఆదివాసీ సదస్సు
భద్రాచలంటౌన్: భద్రాచలంలో ఈ నెల 6వ తేదీన జాతీయ ఆదివాసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీ య ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సాంస్కృతిక రక్షణ సమన్వయ సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్యదొర తెలిపారు. భద్రాచలంలోని హరిత హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐదో షెడ్యూల్ ప్రాంతాల పరిరక్షణ, ఆదివాసీల స్వయం పాలన, అటవీ హక్కుల చట్టం అమలుపై చర్చించనున్నట్లు తెలిపారు. అంతేకాక కోయ భాషను రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడం, ప్రత్యేక మత కోడ్ సాధన, జీఓ 3 పునరుద్ధరణ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, గోదావరి ఇసుక తవ్వకాలు, ఆదివాసీలకు రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో నాయకులు పాయం సత్యనారాయణ, పూనెం కృష్ణ దొర, కుంజా శ్రీనివాసరావు, వర్ష శ్రీనివాసరావు, గొగ్గల రామకృష్ణ, కొమరం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జ్ డీఎస్ఓగా వెంకటేశ్వర్లు
ఖమ్మంసహకారనగర్: జిల్లా సైన్స్ అధికారి (డీఎస్ఓ)గా ఇనుముల వెంకటేశ్వర్లుకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ డీఈఓ సదానందం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సైన్స్ అధి కారి ఆర్.శ్రీనివాసరావు వ్యక్తిగత సెలవుపై అమెరికా వెళ్లారు. దీంతో నేలకొండపల్లి మండలం ఆరెగూడెం పాఠశాల బయోలాజికల్ సైన్స్ టీచర్ వెంకటేశ్వర్లును ఆ స్థానంలో ఇన్చార్జ్గా నియమించారు. ఈ మేరకు ఆయన ఇన్చార్జ్ సైన్స్ అధికారిగా మ్యూ జియం బాధ్యతలు, ఇన్స్పైర్, సైన్స్ఫేర్ తదితర అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాగా, వెంకటేశ్వర్లు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్కు 2017 నుంచి జిల్లా సమన్వయకర్తగా, 2022 నుంచి నేషనల్ గ్రీన్ కాప్స్ జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆరెగూడెం హెచ్ఎం చలపతిరావు, ఉపాధ్యాయులు అభినందించారు. వడ్డీ పేరుతో రూ.1.50 కోట్ల అప్పు, ఆపై మాయంఖమ్మంరూరల్: పెద్ద మొత్తంలో వడ్డీ ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించిన ఓ వ్యాపారి పరారైన ఘటన ఖమ్మంరూరల్ మండలంలోని గోళ్లపాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆర్.దేవేందర్ స్థానికంగా మామిడి తోటలను కొనుగోలు చేసి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అందరితో నమ్మకంతో వ్యవహరించిన ఆయన పెద్ద మొత్తంలో వడ్డీ ఇస్తానంటూ రూ.1.50 కోట్ల మేర అప్పు తీసుకున్నాడు. అనంతరం ఈ నెల 19న భార్యాపిల్లలతో కలిసి సామగ్రి సర్దుకుని ఎవరికీ చెప్పకుండా గ్రామం నుంచి వెళ్లిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆయన సెల్కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. ఈ మేరకు మంగళవారం బాధితులు ఖమ్మంరూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఈహెచ్ఎస్ అమలుకు కృషి
ఖమ్మంసహకారనగర్: సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ తర్వాత ఈహెచ్ఎస్ వర్తించేలా కృషి చేస్తామని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఈహెచ్సీటీ కమిటీ సభ్యుడు దేవరకొండ సైదులు తెలిపారు. ఖమ్మంలోని ఎస్టీఎఫ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత పడుతున్న ఇబ్బందులును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అలాగే, ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన వారికి హెల్త్కార్డుల జారీకి ప్రయత్నిస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన
చర్ల: గిరిజన సంక్షేమ పరిధిలోని పాఠశాలల్లో బాలబాలికల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దీపకం వర్క్ బుక్లోని అంశాలు అర్థమయ్యేలా బోధించాలని భ ద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూ చించారు. చర్ల మండలం చెన్నాపురం, ఉయ్యాలమడుగు గ్రామాల్లోని గిరిజన ప్రాథమిక పాఠశాలలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు పాఠం బోధించడమే కాక ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు. ఉద్దీపకం వర్క్బుక్ ద్వారా బోధనా తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన క ల్పించాలని సూచించారు. చెన్నాపురం పాఠశాలలో 55 మంది పిల్లలు ఉన్నందున మరో ఉపాధ్యాయుడిని కేటాయిస్తామన్నారు. అనంతరం ట్రైబల్ డీడీ చందన తిమ్మిరిగూడెం జీపీఎస్లో తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు రమేశ్, శ్రీనివాస్, బాలకృష్ణ పాల్గొన్నారు. ●భద్రాచలంటౌన్: ఐటీడీఏ పరిధి పట్టు పరిశ్రమ శాఖ అటెండర్ లక్ష్మి ఉద్యోగ విరమణ చేయగా, ఐటీడీఏ కార్యాలయంలో పీఓ రాహుల్ సన్మానించారు. విధినిర్వహణలో చూపిన చొరవ ఎన్నటికీ గుర్తుంటుందని తెలిపారు. ఏపీఓ డేవిడ్ రాజ్, అధికారులు ఉదయ్కుమార్, గన్యా, సంతోష్, ఆదినారాయణ పాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
‘రైతు భరోసా’ విడుదల
● తొలిరోజు రెండెకరాల వరకు పెట్టుబడి సాయం ● జిల్లాలో 2.23లక్షల మందికి రూ.127 కోట్లుఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్ ప్రారంభమైన వేళ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని విడుదల చేస్తోంది. హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెట్టుబడి సాయం నిధులను విడుదల చేశారు. తొలిరోజు ఎకరాకు రూ.6వేల చొప్పున రెండెకరాల వరకు పెట్టుబడి సాయం విడుదలైంది. ఈమేరకు జిల్లాలో 2,23,910 మంది రైతుల ఖాతాల్లో రూ.127,57,81,680 మేర జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. రైతు వేదికల్లో ప్రత్యక్షప్రసారం హైదరాబాద్లో రైతు భరోసా నిధుల విడుదల చేయగా, జిల్లాలో 62 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈమేరకు రైతులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. వైరాలో ఎమ్మెల్యే రాందాస్నాయక్, చింతకాని మండలం నాగులవంచలో కలెక్టర్ దివాకర్ టీ.ఎస్., జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు ధనసరి పుల్లయ్య, ఎం.వీ.మధుసూదన్, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సరిత తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట చింతకాని: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కలెక్టర్ దివాకర తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని నాగులవంచ రైతువేదికలో రైతులతో కలిసి కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడతల వారీగా తొమ్మిది రోజుల్లో నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుందని తెలిపారు. అయితే, వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు పంటమార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, మధుసూదన్, గంగాధర్, మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ నారగాని రాంబాయి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
● యాప్ ద్వారా పారదర్శకంగా సరఫరా ● గోదాంలు, విక్రయ కేంద్రాల తనిఖీలో కలెక్టర్ దివాకరచింతకాని: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా యూరియా అందుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ వెల్లడించారు. జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నందున రైతులకు ఆందోళన అవసరం లేదని తెలిపారు. మండలంలోని నాగులవంచ పీఏసీఎస్లో ఎరువుల గోదాం, విక్రయ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గోదాంలు, విక్రయ కేంద్రాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 18,832.34 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకోగా పాత నిల్వలు కలిపి 24,93.70 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నా రు. ఈ సీజన్లో ఇప్పటివరకు 6,071.13 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఎరువులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా సరఫరా చేసేలా యాప్ ఉపయోగపడుతోందని చెప్పారు. కాగా, యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడడంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యవసాయ, సహకార శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, గంగాధర్, తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, సొసైటీ సీఈఓ శ్రీని వాసరావు, చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు ఖమ్మంమయూరిసెంటర్: సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణంతో పాటు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ట్రెయినీ కలెక్టర్ పారస్కుమార్తో కలిసి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓతో ఆయ న సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో తాగునీరు, విద్యు త్, టాయిలెట్, డార్మెటరీ, ఫర్నిచర్, వంట శాల, డైనింగ్ హాల్, భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయించాలని చెప్పారు. వసతి గృహాలను అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి లోపాలు ఎదురైతే నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే, ప్రతీ ప్రభుత్వ విద్యాసంస్థకు జీరో విద్యుత్ బిల్లు వచ్చేలా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ కాకుండా పర్యవేక్షించాలని, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా బీసీ, సాంఘిక సంక్షేమ అధి కారి జి.జ్యోతి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధి కారి ముజాహిద్, విద్యుత్శాఖ ఏఓ కె.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో ఆత్మహత్య
రఘునాథపాలెం: భార్యతో ఘర్షణ జరగగా, ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. రఘునాథపాలెం మండలం పువ్వాడనగర్కు చెందిన ఏరువ నీహార్ (29) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసైన ఆయన, తల్లి శారద బంధువుల ఇంటికి వెళ్లిన సమయాన మంగళవారం ఉరి వేసుకున్నాడు. ఘటనపై నీహార్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఆటోను ఢీకొట్టిన లారీఆటోడ్రైవర్ మృతి ఖమ్మంరూరల్: మండలంలోని గొల్లగూడెం వద్ద ఆటోను లారీ ఢీకొట్టగా ఆటోడ్రైవర్ కొలికపొంగు రవితేజ(35) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంనకు చెందిన రవితేజ కిరాయి నిమిత్తం వరంగల్ క్రాస్ నుంచి ఆరెంపుల వైపునకు ఆటోతో వెళ్తున్నాడు. మార్గమధ్యలో గొల్లగూడెం వద్ద వరంగల్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనలో ఆటో నడుపుతున్న రవితేజ తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లలో రాగితీగ చోరీ నేలకొండపల్లి: మండలంలోని పైనంపల్లిలోని పొలాల్లో రెండు ట్రాన్స్ఫార్మర్లను మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులో రాగి తీగ చోరీ చేశారు. ఈ మేరకు బాధిత రైతుల ఫిర్యాదుతో ఏఈ జి.రవి పరిశీలించారు. రైతుల నుంచి వివరాలు సేకరించిన ఆయన రైతులు అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఉద్యోగులు హన్మంతరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష ఖమ్మంలీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మద్దెల వెంకటేశ్వర్లుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జికోర్టు న్యాయాధికారి కాకుమాను జ్యోతిర్మయి మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం ధంసలాపురానికి చెందిన మడూరి రాము వద్ద వెంకటేశ్వర్లు 2019 ఫిబ్రవరి లో రూ.3లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి 2020 జనవరిలో చెక్కు ఇచ్చినా సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో రాము తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయగా విచారణ అనంతరం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.4.60 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. చేపల లోడు వ్యాన్ బోల్తా పెనుబల్లి: ట్రాక్టర్ను తప్పించే క్రమాన అదుపుతప్పిన చేపల లోడ్ వ్యాన్ బోల్తా పడింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి పుణె వైపునకు చేపల లోడ్తో మంగళవారం వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో వ్యాన్ డ్రైవర్తోపాటు మరొకరికి గాయాలయ్యాయి. డ్రైవర్ వ్యాన్లో ఇరుక్కోగా స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా, వ్యాన్ బోల్తాతో రోడ్డుపై చేపల బాక్స్లు చెల్లాచెదురుగా పడ్డాయి. ట్రాక్టర్తో ఢీకొట్టి గాయపరిచాడని ఫిర్యాదు కొణిజర్ల: పొలంలో నుంచి వెళ్లొద్దని సూచించినందున ఓ వ్యక్తి ట్రాక్టర్తో ఢీకొట్టి గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని తుమ్మలపల్లికి చెందిన బండి వెంకన్నకు గ్రామ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన ఇజ్జగాని సత్యనారాయణ, ఆయన బావ గుండ్ల ధనమూర్తికి ఇచ్చిన భూమి విషయంలో వెంకన్నతో గొడవ జరిగింది. ఈ నెల 28న సత్యనారాయణ ట్రాక్టర్తో వెంకన్న పొలంలో నుంచి వెళ్తుండగా జీలుగ విత్తనాలు చల్లినందున పాడు చేయొద్దని చెబుతూ వెంకన్న అడ్డుకున్నాడు. అయినా సత్యనారాయణ ముందుకు వెళ్లడంతో వెంకన్న కింద పడగా, ఆయన పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో కాళ్లు, నడుమకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఆయన కుమారుడి ఫిర్యాదుతో మంగళవారం సత్యనారాయణ, ధనమూర్తిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ సూరజ్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న వెంకన్నను వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, నాయకులు సూరంపల్లి రామారావు తదితరులు పరామర్శించారు. నేడు సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నారుద్రంపూర్: సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు జాతీయ కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ప్రతినిధులు తెలిపారు. అంతేకాక సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్లలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కొత్తగూడెంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు. 11వ వేతన ఒప్పందం ముగిసినందున కాలయాపన లేకుండా 12వ వేతన కమిటీని ఏర్పాటు చేసి 40 శాతం ఫిట్మెంట్తో వేతన ఒప్పంద పక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఇవి అమలయ్యే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. జాతీయ కార్మిక సంఘాల నాయకులు కొరిమి రాజ్కుమార్, సి.త్యాగరాజన్, మందా నర్సింహారావు, వంగా వెంకట్, వీరస్వామి, మల్లికార్జున్రావు, రమణమూర్తి, క్రిస్టోఫర్, కత్తెర్ల రాములు, గట్టయ్య, హుమాయిన్, మాతంగి లింగయ్య, బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు, ఆల్బర్ట్, పీతాంబరరావు, విజయగిరి శ్రీనివాస్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహా కుంభాభిషేకానికి అంకుర్పారణ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రీవారి మహా కుంభాభిషేక స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు జీర్ణోద్ధరణ, ధ్వజ ప్రతిష్ఠ సహిత మహా కుంభాభిషేకం సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్ఛరణ నడుమ స్వామి వారు, అమ్మవార్లను యాగశాల ప్రవేశం చేయించారు. అక్కడ గణపతి పూజను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క – నందిని దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఈఓ కె.జగన్మోహన్రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు భట్టి దంపతులకు స్వాగతం పలికి కుంభాభిషేకం ప్రాధాన్యతను వివరించారు. ఆతర్వాత డిప్యూటీ సీఎం దంపతులు స్వామి, అమ్మవార్లకు పూజలు చేయగా అర్చకులు ఆశీర్వచనం, శేషవస్త్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి, గిడ్డంగుల సంస్థలు, సుడా చైర్మన్లు సుంకేట అన్వేష్రెడ్డి, రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సర్పంచ్ తుళ్లూరు నిర్మల, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, వకుళామాత స్టేడియం నిర్మాణదాత కోటేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, జిల్లా, మండల నాయకులు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వి.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.జమలాపురంలో ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
పేదల చదువుకు కలెక్టర్ భరోసా!
ఖమ్మంమయూరిసెంటర్: నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన అమలుచేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకంలో జిల్లా కలెక్టర్ దివాకర తీసుకున్న చొరవ పలువురికి మేలు చేసింది. పెండింగ్ బకాయిల సాకుతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ పథకానికి దూరంగా ఉండడంతో నిరాశలో మునిగిపోయిన పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కలెక్టర్ అండగా నిలిచారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో సీట్లు ఇప్పించడం తల్లిదండ్రుల ఆనందానికి కారణమైంది. నాడు నిరాశ.. నేడు సంబరం బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం కొనసాగుతున్న పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు నిలిచిపోయాయి. దీంతో ఈ ఏడాది ఖమ్మంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలు ఈ పథకం కింద సీట్లు ఇచ్చేందుకు నిరాకరించాయి. కనీసం తమ పాఠశాలల పేర్లు నమోదు చేసుకోలేదు. ఫలితంగా విద్యార్థులకు లాటరీ కేటాయించే కార్యక్రమానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల జాబితా చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయమై అధికారులు ఇచ్చిన సమాచారంతో కలెక్టర్ స్పందించారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి అన్నింట్లో బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించారు. దీంతో లాటరీ వాయిదా వేశారు. పాఠశాలల నమోదుకు చర్యలు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బీఏఎస్ సీట్లు కేటాయించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేయడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పథకంలో స్కూళ్ల పేర్లు నమోదు చేయించి లాటరీ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అంతేకాక విద్యార్థులకు సీట్లు ఇచ్చిన పాఠశాలల పేర్లను బీఏఎస్ పథకంలో నమోదు చేసేలా రాష్ట్ర శాఖకు నివేదిక పంపించారు. విద్యార్థుల ఎంపికకు ముందే పాఠశాలల పేర్లను నమోదు చేయాల్సి ఉన్నా.. ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలతో ఆలస్యమైంది. అప్పుడు 5.. ఇప్పుడు 68 గతంలో ఖమ్మం నగరంలో ఐదు, జిల్లా వ్యాప్తంగా పది లోపు పాఠశాలలే ఈ పథకం ద్వారా సీట్లు కేటాయించేవి. కానీ కలెక్టర్ సూచనలతో ఏకంగా నగరంలోని 68 ప్రైవేట్ పాఠశాలలకు సీట్ల కేటాయింపులు జరిగాయి. ఒకటో తరగతిలో 121మంది విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో సీట్లు కేటాయించగా, 5వ తరగతి విద్యార్థులు 138 మందిని 41 ప్రైవేట్ పాఠశాలలకు కేటాయించారు. ఫలితంగా 1వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 10వ తరగతి వరకు పైసా ఫీజు లేకుండా ఉచితంగా చదువుకునే అవకాశం దక్కింది. వీరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలను కూడా జిల్లా యంత్రాంగం అందించనుంది. ఇక ఐదో తరగతిలో చేరిన విద్యార్థులకు వసతి సౌకర్యం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్తో కూడిన నాణ్యమైన విద్య ఉచితంగా అందుతుంది. బీఏఎస్ పథకానికి మొదటి సారి లాటరీ ఏర్పాటుచేసినప్పుడు తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. దీంతో కలెక్టర్ చొరవ తీసుకోగా ఈ ఏడాది 121 పాఠశాలలు బీఏఎస్ పథకం ద్వారా సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. విద్యార్థులకు ప్రముఖ పాఠశాలల్లో సీట్లు లభించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. – జి.జ్యోతి, ఎస్సీ డీడీ, ఖమ్మంబెస్ట్ అవైలబుల్ సీట్ల కేటాయింపులో చొరవ -
ప్రారంభమైన సహకార వారోత్సవాలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లావ్యాప్తంగా సహకార వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పీఏసీఎస్ల్లో పతాకాన్ని ఆవిష్కరించి సహకార వ్యవస్థ ప్రత్యేకతలను వివరించారు. కాగా, ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో జనరల్ మేనేజర్ వి. వసంతరావు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బ్యాంకు అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఏ పద్మావతి, డీజీఎంలు జి.ఉదయశ్రీ, జి.వేణుగోపాల్, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
సబ్స్టేషన్ను చార్జి చేసిన సీఎండీ
పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి అడుగులుకొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్మిస్తున్న గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని జూలై నాటికి సిద్ధం చేయాలన్న ఉన్నతాధికారుల సూచనలతో పనుల్లో వేగం పెంచారు. ఈమేరకు ఫ్యాక్టరీ కోసం ఏర్పాటుచేసిన సబ్ స్టేషన్ను సోమవారం ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి సాంకేతికంగా చార్జ్ చేశారు. ఆపై ఫ్యాక్టరీలో విద్యుత్ సరఫరా తీరును పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. వర్షాకాలం గాలిదుమారాలకు అవకాశం ఉన్నందున ఉద్యోగులు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే, గ్రామాల్లో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, వైరా డీఈ వై రమేష్కుమార్, ఉద్యోగులు కిరణ్చక్రవర్తి, కిరణ్కుమార్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. బుగ్గపాడు ఫుడ్పార్క్లో పరిశీలనఖమ్మంవ్యవసాయం: సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని ఫుడ్పార్క్లో సీఎండీ వరుణ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్ సరఫరా, లోడ్, భవిష్యత్ విస్తరణ అవకాశాలపై అధికారులతో సమీక్షించారు. అలాగే, యూనిట్లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫుడ్పార్క్లో కొన్నాళ్లు పరిశ్రమ నిర్వహించి మూసేసిన కంపెనీ నుంచి రావాల్సిన బకాయిలపైసీఎండీ ఆరా తీసినట్లు సమాచారం. -
ఏసీపీలుగా నరసింహారావు, హరినాథ్
ఖమ్మంక్రైం: ఖమ్మం కమిషనరేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(సీసీఆర్బీ) ఏసీపీగా అడపా నరసింహారావు నియమితులయ్యారు. అలాగే, సీటీసీ (కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్) ఏసీపీగా బి.హరనాఽథ్బాబును నియమిస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల డీఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వగా ఖమ్మంకు ఇద్దరిని కేటాయించారు. అంతేకాక ఇక్కడ డీఎస్పీలుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన సి.రాజిరెడ్డికి సీఐడీ డీఎస్పీగా, టి.స్వామికి కరీంనగర్ సీసీఆర్బీ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. సైన్స్ మ్యూజియం నిర్వహణపై ఆరా ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని జిల్లా సైన్స్ మ్యూజియాన్ని డీఈఓ సదానందం సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడి ఎగ్జిబిట్లు, నిర్వహణ ఆరా తీశాక మాట్లాడారు. ప్రభుత్వ సెలవుల్లో తప్ప ప్రతిరోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు మ్యూజియం తెరిచే ఉంటున్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది విద్యార్థులు సందర్శించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, మ్యూజియం కోసం నియమించిన ముగ్గురు ఇన్స్ట్రక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, సైన్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజన నిరుద్యోగ యువతకు 3 – 4 నెలల పాటు వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్.విజయలక్ష్మి తెలిపారు. ఖమ్మంలోని ఐటీడీఏ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, బ్యూటీషియన్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ (ఫుడ్ అండ్ బేవరేజ్) లెవల్–4, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ అసోసియేట్ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది పేర్కొన్నారు. వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ అసోసియేట్ కోర్సులకు ఎస్సెస్సీ, అంతకు మించి, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు ఇంటర్, బ్యూటీషియన్ కోర్సుకు 8వ తరగతి ఆపై విద్యార్హత కలిగి ఉండాలని, బ్యూటీషియన్ కోర్సుకు 18–35 ఏళ్ల వయస్సు, మిగిలిన కోర్సులకు 18 – 30 వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం సమకూర్చి యూనిఫామ్, స్టడీ మెటీరియల్ ఇవ్వడమే కాక పూర్తయ్యాక సర్టిఫికెట్ జారీ చేస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు ఆధార్ కార్డు, కుల, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో జూలై 1న ఉదయం 9గంటలకు ఖమ్మం రోటరీనగర్లోని ఐటీడీఏ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో ఇంటర్వ్యూకు హాజరుకావాలని, వివరాలకు 63058 02724 నంబర్లో సంప్రదించాలని డీడీ సూచించారు. అర్హుల ఓట్లు కోల్పోకుండా పర్యవేక్షణ ముదిగొండ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా అర్హుల ఓట్లు తొలగించకుండా పార్టీ బీఓల్ఏలు పర్యవేక్షించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో సోమవారం ఆయన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించి మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, మ్యాపింగ్ వివరాలు తెలుసుకున్న ఆయన ఫారాలు నింపడంపై ఓటర్లకు బీఎల్ఏలు, బీఓల్ఓలు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వల్లాపురంలో పలు కార్యక్రమాలకు ఎమ్మెల్సీ హాజరయ్యారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ కమల్రాజు, నాయకులు సామినేని హరిప్రసాద్, లక్ష్మారెడ్డి, గడ్డం వెంకట్గౌడ్, తోట ధర్మరావు, బంకా మల్లయ్య పాల్గొన్నారు. -
ఇళ్లస్థలాల కోసం ఆందోళన
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్తో సోమవారం సీపీఎం ఆధ్వర్యాన సత్తుపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈమేరకు సీఐ టి.శ్రీహరి ఆధ్వర్యాన పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసనకు యత్నిస్తే పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు మాచర్ల భారతి, శీలం సత్యనారాయణరెడ్డి, చలమాల విఠల్, జాజిరి శ్రీను, జ్యోతి, పాండు, వేలాద్రి, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. అరెస్టులు సరికాదు ఖమ్మంమయూరిసెంటర్: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్తే నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు మద్దతుగా వెళ్లిన తమ పార్టీ నాయకులు పలువురితో పాటు ఇంకొందరిని ఇళ్ల వద్దే అరెస్ట్ చేశారని తెలిపారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం -
జగదభిరాముడికి జ్యేష్ఠ్యాభిషేకం
ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలుభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జ్యేష్ట మాస పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం జగదభి రాముడికి జ్టేష్టాభి షేకం కనుల పండుగా జరిపారు. తొలుత బేడా మండపంలో ఏర్పాటు చేసిన 81 కలశాలలో సమస్త నదీ జలాలను ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం, నదీజలాలతో జ్యే ష్ఠ్యాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారికి హారతి సమర్పించారు. కాగా జ్యేష్ఠ్యాభిషేకాన్ని పురస్కరించుకుని సోమవారం రద్దు నిత్యకల్యాణం రద్దు చేయగా, మంగళవారం నుంచి యథావిధిగా కొనసాగించనున్నారు. ఆలయ ఈఓ దామోదర్రావు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, కోటి రామస్వరూప్, ఇతర అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
సత్తుపల్లిటౌన్: కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకడంతో షాక్కు గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన రెడ్డిపోగు వెంకటేశ్వరరావు(40) సోమవారం ట్రక్ లారీపై జేసీబీని తీసుకుని వస్తున్నాడు. ఈక్రమాన పైన కూర్చున్న ఆయనకు సత్తుపల్లి మండలం చెరుకుపల్లి వద్ద నీలాద్రి రోడ్డులో నుంచి కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకగా షాక్కు గురై స్పృహ కోల్పోయాడు. ఈమేరకు వెంకటేశ్వరరావును సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.రోడ్డు ప్రమాదంలో యువకుడు.. కల్లూరు రూరల్: కల్లూరు మండలం చెన్నూరు పంచాయతీ పరిధిలోని రావికంపాడు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కల్లూరు నుంచి చెన్నూరు వైపుగా బైక్పై కోలా సాయి(19) వెళ్తుండగా రావికంపాడు హైస్కూల్ సమీపాన ఐషర్ ట్రాక్టర్ ఢీట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ సిగ్నల్ ఇవ్వకుండా ఒకేసారి తిప్పడంతో సాయికి తాకి మృతి చెందాడని ఆయన తండ్రి వెంకయ్య సోమవారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కల్లూరు ఎస్సై హరిత తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ.. రఘునాథపాలెం: రఘునాథపాలెంకు చెందిన కందుల నర్మద(38) ఈనెల 14న జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె తన కుమారుడు లోహిత్, కుమార్తె అక్షయతో కలిసి ద్విచక్ర వాహనంపై రఘునాథపాలెంలోని కేటీఆర్ కాలనీకి వెళ్తుండగా, ఇల్లెందు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో పిల్లలు సహా నర్మదకు తీవ్రగాయాలయ్యాయి. ఇందులో అక్షయకు వీపు భాగంలో ఎముక విరగగా, లోహిత్కు కాలికి తీవ్ర గాయమైంది. ఇక నర్మద తలకు బలమైన గాయం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆపై ఈనెల 25న ఖమ్మం మమత ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. ఘటనపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధిరలో గుర్తుతెలియని వ్యక్తి.. మధిర: మధిరలో గుర్తు తెలియని ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. స్థానిక రిలయన్స్ మార్ట్ సమీపాన అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు టౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సూచించారు. -
గైనకాలజిస్టుల నియామకానికి రేపు ఇంటర్వ్యూలు
ఖమ్మంవైద్యవిభాగం: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని మధిర ఏరియా ఆస్పత్రి, కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్టుల నియామకానికి జూలై 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్) కె.రాజశేఖర్గౌడ్ తెలిపారు. అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మధిర ఆస్పత్రి, కల్లూరు సీహెచ్సీలో ఒక్కో గైనకాలజిస్టును నియమించనుండగా ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్ ఉత్తీర్ణులైన వారు అర్హులని, అదనపు అర్హతలు, పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్లు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో జూలై 1న కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీహెచ్ఎస్ ఓ ప్రకటనలో సూచించారు. ఇతర వివరాలు, దరఖాస్తు నమూనా కోసం https:// khammam. telangana. gov. in వెబ్సైట్లో పరిశీలించాలని తెలిపారు. అర్హులైన ఖైదీలకు ఉచిత న్యాయసాయం ఖమ్మంలీగల్: అర్హత కలిగిన ఖైదీలకు అవసరమైన న్యాయసాయం ఉచితంగా అందేలా చూస్తామని జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ఈమేరకు సోమవారం జిల్లా కారాగారాన్ని సందర్శించిన ఆమె ఖైదీలతో మాట్లాడారు. చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయసాయం, ఖైదీల సంక్షేమానికి అమల్లో ఉన్న అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఫిర్యాదుల పెట్టె, న్యాయ సహాయ కేంద్రం హెల్ప్ డెస్క్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శ్రీధర్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆతర్వాత జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి దేవీమానస బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అక్కడి చిన్నారుల సంక్షేమంపై ఆరా తీశారు. ఆతర్వాత మాదకద్రవ్యాలతో ఎదురయ్యే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ ఉమ్మడి జిల్లా ఎస్పీగా రమేష్ ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామోజీ రమేష్ నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు నాన్ క్యాడర్ ఏపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈనేపథ్యాన ఇటీవల ఎస్పీగా పదోన్నతి పొందిన రమేష్కు ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఆయన ఉమ్మడి జిల్లా ఇంటిలిజెన్స్ ఐఆర్ఓ(అడిషనల్ ఎస్పీ)గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పోస్ట్ను ఎస్పీగా స్థాయికి అప్గ్రేడ్ చేయగా, రమేష్ను నియమించారు. 1989 ఎస్ఐ బ్యాచ్కు చెందిన రామోజీ రమేష్ ఉమ్మడి జిల్లాలో చాన్నాళ్లు విధులు నిర్వర్తించారు. ఈమేరకు ఆయనను సీపీ సునీల్దత్, తదితరులు అభినందించారు. రూ.9.67కోట్లకు స్టాక్ మార్కెట్ వ్యాపారి ఐపీ ఖమ్మం లీగల్: ఖమ్మం రాఘవేంద్ర నగర్కు చెందిన స్టాక్ మార్కెట్ వ్యాపారి మైలవరపు నాగసందీప్ రూ.9.67కోట్లకు దివాళా పిటీషన్(ఐపీ) దాఖలు చేశాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కోసం స్నేహితుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయగా, ప్రస్తుతం నష్టాలు రావడంతో తీర్చలేని పరిస్థితి ఎదురైందని పిటీషన్లో పేర్కొన్నాడు. ఈమేరకు 31మందిని ప్రతివాదులుగా చేరుస్తూ తన న్యాయవాది ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సోమవారం ఐపీ దాఖలు చేశాడు. -
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి
ఖమ్మం లీగల్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే కాక పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు. జిల్లా జడ్జిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆయన పరిచయ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఖమ్మం కోర్టు, బార్ అసోసియేషన్ ప్రత్యేకత కలిగి ఉండగా, ఈ అసోసియేషన్లో వేయి మందికి పైగా న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. ఈమేరకు ఖమ్మం న్యాయస్థానాన్ని అన్ని అంశాల్లో అగ్రభాగాన నిలపడానికి కృషి చేస్తానని వెల్లడించారు. న్యాయమూర్తులు కృష్ణార్జున్, సీనయ్య, మహేష్నాథ్, కల్పన, శివరంజని, మురళీమోహన్, దేవీమానస, జ్యోతిర్మయి, రజిని, బిందుప్రియ, నాగలక్ష్మి, ప్రవీణ్తో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్లపల్లి రమేష్, కొప్పుల రవి, బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ, మందడపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు జానీమియా, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా నూతన జడ్జి నాగరాజు -
విస్తారంగా వానలు
● బోనకల్లో 10.92 సెం.మీ.ల వర్షపాతం ● అన్నదాతల్లో ‘ఏరువాక’ ఆనందంఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఈనెల 29వ తేదీ నాటికి నిర్దేశిత సాధారణ వర్షపాతం 124.5 మి.మీ.కు గాను 168.9 మి.మీ.గా నమోదైంది. కామేపల్లి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, వైరా, బోనకల్, మధిర మండలాల్లో సాధారణానికి మించి 20 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల తక్కువే... జిల్లాలోని 12 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైనా రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, వేంసూరు మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. ఇక సింగరేణి, కూసుమంచి, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్ల డించారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సత్తుపల్లి, వేంసూరు మినహా అన్ని మండలాల్లో వర్షం కురవగా, బోనకల్ మండలంలో అత్యధికంగా 109.2 మి.మీ.(10.92 సెం.మీ)ల వర్షపాతం నమోదైందని నివేదికలో వెల్లడించారు. అలాగే, కల్లూరు మండలంలో 74.6, తల్లాడలో 48.6, ముదిగొండలో 44.6, ఖమ్మం రూరల్లో 43.6, తిరుమలాయపాలెంలో 42.8, పెనుబల్లిలో 42.2, మధిరలో 41.2, వైరాలో 39.2, ఏన్కూరులో 35.2, చింతకానిలో 33.6, ఖమ్మం అర్బన్లో 30.8, రఘునాథపాలెంలో 30.6, నేలకొండపల్లిలో 24.2, కామేపల్లిలో 20.2, ఎర్రుపాలెంలో 16.2, కొణిజర్లలో 14.2, కూసుమంచిలో 13.8, సింగరేణిలో 11.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాగు.. వేగిరం వరుణుడి కటాక్షంతో జిల్లాలో పంటల సాగు వేగం పుంజుకోనుంది. ఎల్నినో ప్రభావంతో ఇన్నాళ్లు వర్షాలు కురవకపోగా ఎండల తీవ్రత కొనసాగింది. అయితే, సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా వర్షాలు జోరందుకోవడం అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. జిల్లాలో వానాకాలం సీజన్లో అన్నీ కలిపి 5.67 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఇప్పటి వరకు 92,451 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి విత్తనాలు 83,547 ఎకరాల్లో నాటారు. ప్రస్తుత వర్షాలతో మిగిలిన పంటల సాగు గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈమేరకు రైతులు పత్తి, మిర్చితో పాటు వరి విత్తనాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. -
సహకార సంఘాల బలోపేతానికి కృషి
కల్లూరురూరల్: సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తరఫున కృషి జరుగుతోందని, ఇందుకు రైతులు కూడా సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్లూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన బ్రాంచ్ను మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే బ్యాంకు అభివృద్ధి చెందడమే కాక మరిన్ని రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కల్లూరులో అన్ని కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సముదాయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల సాగర్ నీరు రాకున్నా, పంటలకు గోదావరి జలాలు సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి ఓటరు జాబితా సవరణ నేపథ్యాన అర్హుల ఓట్లు తొలగించకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే రాగమయి సూచించారు. కల్లూరులో ఏర్పాటుచేసిన బీఎల్ఏల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోట్రు అర్జున్రావు, మున్సిపల్ చైర్మన్ మోహన్నాయక్, వైస్చైర్మన్ శీలం కోటేశ్వరి, నాయకులు పసుమర్తి చందర్రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాల్లో రైతులకు ఇస్తున్న రుణాలపై వడ్డీ తగ్గించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంత్రి తుమ్మలను కోరారు. జిల్లా సహకార శాఖ అధికారి గంగాధర్ మాట్లాడుతూ రైతుల సహకారంతో డీసీసీబీ రూ.4500 కోట్ల టర్నోవర్ సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ కల్లూరు మేనేజర్ అనిత, అధికారులు వెంకట్, చందర్, సర్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మోహన్నాయక్, కమిషనర్ సాయికృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవి తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తులు పెండింగ్ ఉండొద్దు
గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్ శ్రీజ ఖమ్మం సహకారనగర్: ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో అందే దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆమె అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి(రెవెన్యూ)తో కలిసి ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన శ్రీజ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో డీఆర్వో రామమూర్తి, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 18.50 అడుగులకు చేరిన పాలేరు కూసుమంచి: సాగర్ నుంచి నీరు విడుదల చేస్తుండడంతో పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం సోమవారం 18.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 23అడుగులకు గాను ఇటీవల 12 అడుగులకు పడిపోయింది. దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా నాలుగు రోజుల నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండగా 18.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం సాగర్ నుంచి 2962 క్యూసెక్కుల నీరు చేరుతుండగా ఇది మరింత పెరుగుతుంది. కాగా, పాలేరు రిజర్వాయర్ను సోమవారం జల వనరులశాఖ సీఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. నీరు వృథా కాకుండా తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని ఉద్యోగులకు సూచించారు. -
●3లక్షల నీళ్ల సీసాలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని చింతకాని మండలంలో బుధవారం జరిగే రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్రెడ్డి పాల్గొనే ఈ సభకు 1.50 లక్షల మంది రైతులు, జనం హాజరవుతారని అంచనా వేశారు. ఈమేరకు హైదరబాద్కు చెందిన ఓ కంపెనీ నుంచి 3లక్షల నీళ్ల బాటిళ్లు తెప్పిస్తున్నారు. అర లీటర్ సామర్థ్యంతో కూడిన ఈ బాటిళ్లు ఆదివారం రాత్రి వరకు 50వేల మేర చేరుకోగా, ఖమ్మంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో నిల్వ చేశారు. సోమవారం మిగతా బాటిళ్లు వచ్చాక సభాప్రాంగణానికి చేరుస్తామని అధికారులు వెల్లడించారు. -
1.04లక్షల మందికి చుక్కల మందు
పల్స్పోలియోను ప్రారంభించిన డీఎంహెచ్ఓ రామారావుఖమ్మంవైద్యవిభాగం: పోలియో నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో ఆదివారం మొదలైంది. జిల్లాలో 0–5 ఏళ్ల వయస్సు గల చిన్నారులు 1,31,642 మంది ఉండగా, సాయంత్రం 6గంటల వరకు 1,04,365 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈమేరకు డీఎంహెచ్ఓ డి.రామారావు ఖమ్మం వెంకటేశ్వరనగర్ యూపీహెచ్లో పిల్లలకు చుక్కలు మందు వేసి మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఖమ్మం రైల్వేస్టేషన్, బస్స్టేషన్లలో ఏర్పాటు చేసిన పాయింట్లను డీఎంహెచ్ఓ పరిశీలించారు. ప్రయాణంలో ఉన్నవారి పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మామిళ్లగూడెం యూపీహెచ్సీలో శిబిరాన్ని కూడా ఆయన పరిశీలించారు. సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి ప్రతాప్, అధికారులు సంపత్కుమార్, వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి ఖమ్మం మామిళ్లగూడెం: ఆర్టీసీ కార్మికులను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మాస్లైన్ కార్యాలయంలో ఆదివా రం జరిగిన యూనియన్ రీజియన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించడమే కాక రిటైర్డ్ అయిన కార్మికుల బకాయిలు చెల్లించకపోతే ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, నిరంజన్ మాట్లాడుతూ కొన్ని సంఘాలు అధికారం కోసమే తప్ప కార్మికులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనంతరం రీజినల్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఏ.ఉప్పలయ్య, ఏ.కృష్ణను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో నాయకులు సత్యం, కృష్ణ, కేఎస్.రెడ్డి, జేఆర్.బాబు, రవి, యుగంధర్, నాగవీర, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి పుల్లంరాజు ఖమ్మం అర్బన్: అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచార సభ(ఏబీఏపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన డాక్టర్ టీ.వీ.పుల్లంరాజు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లా బాసరలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రెండేళ్లకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పుల్లంరాజు ఎన్నికయ్యారు. ఇంకా ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు బెల్లపు హరిప్రసాద్, దుశెట్టి భాస్కర్తో పాటు రాచ రమేష్, బేతి తిరుమలరావు, జి.శేఖర్, తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాలకు రైస్మిల్లులు
● నేలకొండపల్లిలో లాంఛనంగా ప్రారంభిస్తాం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినేలకొండపల్లి: మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా చేయడంలో భాగంగా రైస్ మిల్లులు కూడా మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలంలోని అప్పలనరసింహాపురం, రాజారాంపేట, కోరట్లగూడెం గ్రామాల్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.63 వేల కోట్ల వడ్డీ రుణాలు మంజూరు చేశామని తెలిపారు. అంతేకాక పెట్రోల్బంక్లు, సోలార్ ప్లాంట్లు కేటాయించడంతో పాటు ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయిస్తుండగా, త్వరలోనే రైస్మిల్లులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనతో తొలి మిల్లు నేలకొండపల్లి మహిళా సంఘానికి కేటాయించేలా కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులు పండించిన ప్రతీ గింజతో పాటు తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసి వారంలోపే ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లను రెండు, మూడు, నాలుగు విడతలుగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి మంజూరు చేస్తామన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయని సూచన చేస్తున్నందున రైతులు పంటల సాగులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం రాజారాంపేట గ్రామంలో చిన్నారులకు మంత్రి పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్లు బచ్చలకూరి నాగరాజు, గోవిందరావు, గరిడేపల్లి రామారావు, జెర్రిపోతుల సత్యనారాయణ, మామిడి వెంకన్న, పాకనాటి కన్నారెడ్డి, చెరుకుపల్లి రాజేష్, ఎం.వెంకన్న, కడియాల నరేష్, రాయపుడి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
నో పార్కింగ్
జిల్లా కేంద్రం పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటోంది. రోజురోజుకూ విస్తరిస్తున్న ఖమ్మం కార్పొరేషన్లో ఆ స్థాయి పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్స్లు వెలుస్తున్నా.. వాహనాలు నిలిపే చోటు కరువైంది. దీంతో ప్రధాన రోడ్లు, వాణిజ్య స్థలాలే పార్కింగ్కు అడ్డాగా మారగా ఇతర వాహనదారులు, పాదచారులు అవస్థ పడుతున్నారు. – ఖమ్మం మయూరిసెంటర్వాహన స్టాండ్లుగా రహదారులు ● వాణిజ్య, వ్యాపార భవనాల్లో ఏర్పాట్లు నిల్ ● జిల్లా కేంద్రంలో నానాటికీ తీవ్రమవుతున్న సమస్యఎక్కడైనా అదే పరిస్థితి ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్, రోటరీనగర్ వరకు, ఇటు బోనకల్ రోడ్డు, గాంధీ చౌక్, కాల్వొడ్డు, కమాన్బజార్, కస్పాబజార్, సరిత క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, బస్ డిపో రోడ్డు, మమత రోడ్డు, నెహ్రూనగర్ ఇలా ఏ ప్రాంతంలో చూసినా రోడ్ల వెంట పార్కింగ్ చేసిన వాహనాలే కనిపిస్తాయి. ఇంకొన్ని కాలనీల్లోనైతే నడిరోడ్డుపై డివైడర్ల రూపంలోనూ పార్కింగ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి కమాన్బజార్లోని రైల్వేగేట్ వద్ద ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే, ప్రధాన రోడ్ల వెంట ఫుట్పాత్లను సైతం ద్విచక్ర వాహనాలే ఆక్రమిస్తుండడంతో వృద్ధులు, చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. బ్యాంకులు, ఆస్పత్రులకు వెళ్లిన వారికి వాహనం నిలిపే చోటు లేకపోగా.. ఎలాగోలా పార్కింగ్ చేస్తే నిమిషాల్లో ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తున్నారు. పార్కింగ్ స్థలాలు చూపించకుండా జరిమానా విధించడం ఏమిటన్న నగరవాసుల ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. స్థలం ఉన్నా.. చొరవ లేక.. ఖమ్మంలోని పలుచోట్ల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ‘పే అండ్ పార్క్’ విధానం అమలు చేస్తే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా అధికారులు విఫలమవుతున్నారు. గతంలో రైల్వేస్టేషన్ సమీపాన, వైరా రోడ్డులోని పాత చేపలమార్కెట్, ఇందిరానగర్ ప్రాంతంలో మల్టీ లెవల్ పార్కింగ్ సముదాయాల నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆదిలోనే నిలిచిపోయాయి. నగరం స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న తరుణాన పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఆక్రమణలు తొలగించడంతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరంపై సూచనలు వస్తున్నాయి.బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాళ్లు నిర్మించేటప్పుడు పార్కింగ్కు కచ్చితంగా స్థలం కేటాయించాలనే నిబంధన ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. చాలా భవనాల్లో పార్కింగ్ కోసం చూపించిన సెల్లార్లలో షాపులు, గోదాంలు ఏర్పాటు చేసి యజమానులు అదనపు ఆదాయం గడిస్తున్నారు. దీంతో వాహనదారులకు రోడ్డు తప్ప ఎక్కడా స్థలం ఉండడం లేదు. కేఎంసీ అధికారులు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చామా, లేదా అన్నట్లు వదిలేస్తుండడం సమస్యలకు కారణమవుతోంది.ఉదయం, సాయంత్రం కస్పాబజార్, కమాన్బజార్ల్లో రద్దీ ఉంటుంది. ఇక రోడ్ల వెంట వాహనాల పార్కింగ్తో సమస్య పెరుగుతోంది. ఆ సమయాన వాహనం నడపాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వన్వే ఏర్పాటు చేసినా ఫలితం లేదు. ప్రత్యేక పార్కింగ్ పాయింట్ల ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలి. – బానోత్ రాజేష్, నగర వాసిఖమ్మంలోని వైరా రోడ్డుతోపాటు ప్రధాన మార్గాల్లో పనుల నిమిత్తం వచ్చే వారు రోడ్ల వెంటే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఈ రహదారులు రద్దీగా ఉంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తేనే పాదచారులు, ఇతర వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తీరతాయి. – సాగర్ల సాయికుమార్, వాహనదారుడు -
వర్షం.. హర్షం
● పంటల సాగుకు దోహదం ● పది మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతంఖమ్మంవ్యవసాయం: వరుణిడి కటాక్షం అన్నదాతలకు ఆనందాన్ని కలిగిస్తోంది. రెండురోజులుగా జిల్లా అంతటా కురుస్తున్న వాన పంటల సాగుకు ప్రయోజనకరంగా మారుతోంది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆదివారం ఉద యం వరకు జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 119.3 మి.మీలు కాగా 28వ తేదీ ఉదయం 8–30 గంటల వరకే 134.7 మి.మీ. నమోదైందని వెల్లడించారు. అక్కడ లోటే.. జిల్లాలోని కామేపల్లి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముది గొండ, చింతకాని, ఏన్కూరు, కల్లూరు, తల్లాడ, వైరా, బోనకల్ మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఇక రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, పెనుబల్లి, వేంసూరు, మధిర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సింగరేణి, తిరుమలాయపాలెం, కూసుమంచి, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని నివేదికలో వెల్లడించారు. అయితే, ఆది వారం సాయంత్రం 4 గంటల నుంచి బోనకల్ మండలంలో భారీ వర్షం, మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశముంది. ప్రధానంగా పత్తి విస్తీర్ణం పెరుగనుందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య వెల్లడించారు. పొంగిపొర్లిన డ్రెయిన్లు ఖమ్మంమయూరిసెంటర్/కల్లూరు రూరల్: ఖమ్మం లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి డ్రెయినేజీలు పొంగి పొర్లాయి. వర్షపునీటికి తోడు మురుగు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే, కల్లూరు మండలం చిన్న కోరుకొండిలోని పలువురి ఇళ్లలోకి వర్షపు నీరు చేరగా స్థానికులు ఎత్తిపోయాల్సి వచ్చింది. -
రైతులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు
చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద బుధవారం జరిగే రైతు ఆశీర్వాద సభకు హాజరయ్యే రైతులకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సభ ఏర్పాట్లను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సభకు హాజరు కానున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని తెలిపారు. వర్షసూచనల నేపథ్యాన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, మార్కెట్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, అంబటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, కన్నెబోయిన గోపి, గ్రామసర్పంచ్లు కంచం ద్రౌపతి, తాళ్లూరి స్వప్న తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
‘ఆశీర్వాద సభ’కు రూట్మ్యాప్
● ప్రాంతాల వారీగా చేరుకోవాల్సిన మార్గాల వెల్లడి ● ప్రత్యేక పార్కింగ్ స్థలాల ఏర్పాటుఖమ్మంక్రైం: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద బుధవారం రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల రైతులు, నాయకులు సభావేదిక వద్దకు చేరుకునేలా పోలీసు అధికారులు రూట్మ్యాప్ రూపొందించారు. ఆయా మార్గాల్లో చేరుకుని నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలని వైరా ఏసీపీ సారంగపాణి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పార్కింగ్ మ్యాప్లను విడుదల చేయగా, అందులోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినా నిర్దేశిత ప్రాంతానికి చేరుకోవచ్చని తెలిపారు. ●పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలతో పాటు ముదిగొండ మండలం నుంచి వచ్చే వారు వెంకటగిరి ఎక్స్ వద్ద హైవే ఎక్కి ధంసలాపురం వద్ద దిగి పందిళ్లపల్లి మీదుగా 1 నుంచి 5 వరకు పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలపాలి. ●కారేపల్లి, కామేపల్లి మండలాల నుంచి వచ్చేవారు ఖమ్మం టౌన్ – ముస్తఫానగర్ మీదుగా పందిళ్లపల్లికి చేరుకొని 1 నుంచి 5 వరకు పార్కింగ్ స్థలాలు వినియోగించుకోవాలి. ●సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు మండలాల నుండి వచ్చే వాహనాలు కల్లూరు వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కి చింతకాని మండలం కొదుమూరు వద్ద దిగి చింతకాని మీదుగా చేరుకున్నాక పార్కింగ్ స్థలాలు 7, 8తో పాటు 15లో వాహనాలు పార్క్ చేయాలి. ●వైరా, కొణిజర్ల మండలాల నుంచి వచ్చేవారు బస్వాపురం, పెద్ద గోపతి, నేరేడ, చింతకాని మీదుగా చేరుకుని 7, 8తో పాటు 15 నంబర్ పార్కింగ్ స్థలాలు వినియోగించుకోవాలి. ●ఏన్కూరు, తల్లాడ మండలాల నుంచి వాహనాలు వి.వెంకటాయపాలెం – వందనం – చింతకాని మార్గం ద్వారా వెళ్లి 7, 8, 15నంబర్ పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపాలి. ●ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల నుండి వచ్చే ప్రజలు బోనకల్ – నాగలంచ మార్గం ద్వారా చేరుకుని 10, 11, 12, 13, 14 నంబర్ పార్కింగ్ స్థలాలు వినియోగించుకోవాలి. ●చింతకాని మండలం మత్కేపల్లి నామవరం వైపు ఉన్న ముదిగొండ మండలానికి సంబంధించిన గ్రామాల వారు మత్కేపల్లి క్రాస్ నుంచి పందిళ్లపల్లి ద్వారా 1 నుంచి 5 వరకు పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపి సభకు చేరుకోవాలి. -
సత్వర స్పందనే కీలకం
కొణిజర్ల: 108 వాహనాల సిబ్బంది సమాచా రం అందగానే సత్వరం స్పందించడం ద్వారా బాధితులకు ప్రాణాలకు భరోసా లభిస్తుందని తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రతినిధులు సూచించారు. కొణిజర్ల ఆరోగ్య కేంద్రంలోని 108 వాహనాన్ని ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఫోన్ వచ్చిన ఎంత సేపట్లో ఘటనాస్థలికి ఏరుతున్నారనే అంశాన్ని రికార్డుల ద్వారా పరిశీలించడమే కాక వాహనంలో పరికరాలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధితులకు వైద్యం అందేలా చూడాలని సూచించారు. అధికారులు బ్రహ్మాఽనందరావు, షేక్ నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
భరోసా సెంటర్ను నేరుగా సంప్రదించవచ్చు
లైంగిక దాడులు, లైంగిక యత్నాలకు గురైన మైనర్లు, యువతులు నేరుగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయొచ్చు. పోలీస్స్టేషన్కు వెళ్లకుండానే భరోసా సెంటర్కు వెళ్లినా అక్కడి సిబ్బంది అండగా నిలుస్తారు. ఈ సెంటర్లో పోలీసు, వైద్య, న్యాయ, మానసిక కౌన్సెలింగ్ సేవలు ఒకే గొడుగు కింద అందుతాయి. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు గోప్యంగా సాయం అందేలా చూస్తారు. అలాగే, వైద్యపరీక్షలు, చికిత్స అందించడంతో పాటు నిపుణులైన సైకాలిజిస్టుల ద్వారా కౌన్సెలింగ్తో మనోఽధైర్యాన్ని నింపుతారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు మొదలు కోర్టు విచారణ పూర్తయ్యేవరకు నిపుణుల ద్వారా బాధితులకు ఉచిత న్యాయ సాయం దక్కేలా చూస్తారు. -
కను‘పాప’లు జాగ్రత్త...
ఖమ్మంక్రైం: కొందరు పైకి సూటుబూటు లేదా ఖద్దరు దుస్తులు ధరించి పెద్దమనుషుల్లా చెలామణి అవుతుంటారు. ఇందులో కొందరి మనసు మాత్రం స్వచ్ఛంగా ఉండదు. ఇలాంటి ఓ వ్యక్తే ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో బాలికపై లైంగిక దాడి చేయడమే కాక తన తప్పు బయటపడకుండా ఆమెను భవనం పైనుంచి తోసేయడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో అక్కడకక్కడా వెలుగు చూస్తుండడంతో చిన్నారుల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. అప్రమత్తత తప్పనిసరి అల్లారు ముద్దుగా పెంచుకునే బాలికల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఎవరి ఇంటికి వెళ్తున్నారు, ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరితో ఆడుకుంటున్నారనే అంశాలను నిశితంగా గమనించాలి. ముఖ్యంగా కొత్తవారి వద్దకు చిన్నారులను పంపించకపోవడమే ఉత్తమమని భావించాలి. మానవ మృగాలు అందరి మధ్యలోనే తిరుగుతున్నందున ముద్దు చేస్తున్నామని చెబుతూ చిన్నారులను దగ్గరకు తీసుకుని వెకిలిచేష్టలకు పాల్పడే ప్రమాదముంది. వెనుకడుగు వేయొద్దు ప్రేమ, ఆప్యాయతతో ఉన్నట్లు నటిస్తూనే చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు లేదా భరోసా సెంటర్లో ఫిర్యాదు చేయాలి. ఖమ్మంలోని అపార్ట్మెంట్లో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అంతకు 15 రోజుల ముందు కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఆ సమయంలో నిలదీసి ఉంటే నిందితుడికి బుద్ధి చెప్పినట్లయ్యేది. అందుకే ఎవరిపై ఏ మాత్రం అనుమానం వచ్చినా తల్లిదండ్రులు అప్రమత్తమై హెచ్చరించాలి. అయినా తీరు మారకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఉత్తమం. కాగా, ఖమ్మంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గౌస్కు మొదటి నుంచి నేరచరిత్ర ఉందని తెలిసింది. కొన్నాళ్ల క్రితం మృతి చెందిన అధికార పార్టీ నేత వద్ద డ్రైవర్గా పనిచేసిన గౌస్ నకిలీ నక్సలైట్ అవతారం ఎత్తి డబ్బుల కోసం సదరు నేత కుమారుడినే కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. అంతేకాక ఇంకొన్ని కేసులు కావడంతో పోలీసులు రౌడీషీట్ తెరవగా... ప్రతిపక్ష పార్టీనేతల ద్వారా రౌడీషీట్ను తీయించుకున్నాడని తెలిసింది. ఈనెల 6వ తేదీ: ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో ఉండే తాత వద్దకు వచ్చిన బాలికపై కన్నేసిన పైరవీకారుడైన మహ్మద్ గౌస్ లైంగిక దాడికి ప్పాడ్డాడు. అంతేకాక ఎవరికీ తెలియవద్దని ఆమెను భవనం పైఅంతస్తు నుంచి తోసేయడంతో తీవ్రగాయాల పాలైంది. దీంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈనెల 13వ తేదీ: అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇంటికి ఏపీ నుంచి చిన్నారి వచ్చింది. కూల్డ్రింక్ కొనుగోలు చేయాలని గ్రామంలోని షాప్ వద్దకు వెళ్లగా వృద్ధుడైన నిర్వాహకుడు లైంగిక దాడికి యత్నించాడు. మరో బాలిక చూసి కుటుంబీకులకు చెప్పడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈనెల 17వ తేదీ: అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో యువకులు కొన్నాళ్ల నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో 10 మందిపై పోక్సో కేసు నమోదైంది. -
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..
ఖమ్మంరూరల్: ఆడుకుంటూ తప్పిపోయిన బాలుడిని చేరదీసిన పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డు సుందరయ్యనగర్కు చెందిన అయాన్ ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి దారి తప్పాడు. దీంతో కుమారుడు కనిపించక తల్లిదండ్రులు షేక్ అస్లాం పాషా, ఎండీ తహేరా, బంధువులు గాలింపు మొదలుపెట్టారు. ఇదే సమయాన టీఎన్జీవోస్ కాలనీ సమీపానికి చేరుకున్న అయాన్ను గుర్తించిన ఖమ్మంరూరల్ పోలీసులు చేరదీసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాక ఫొటోలను వాట్సాప్ గ్రూప్ల్లో పోస్ట్ చేశారు. మరోపక్క ఆయన తల్లిదండ్రులు కూడా వాట్సప్ ద్వారా వివరాలు షేర్ చేశారు. ఈ రెండు పోస్టులు వైరల్గా మారడంతో కొద్ది సేపట్లోనే కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో అస్లాం దంపతులు పోలీస్ స్టేషన్కు వెళ్లగా అయాన్ను అప్పగించడంతో ఆనందిస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, సుందరయ్యనగర్ నుంచి బాలుడు ఒంటరిగా టీఎన్జీవోస్కాలనీ వరకు ఎలా వచ్చాడో చెప్పలేకపోవడంతో అది మిస్టరీగానే మిగిలిపోయింది. వాట్సప్ పోస్టులతో చేరిన సమాచారం -
మాజీ ఎమ్మెల్యేకు పలువురి నివాళి
పెనుబల్లి: ఇల్లెందు మాజీ ఎమ్మె ల్యే వంగా సుబ్బారావు మృతి బాధాకరమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నా రు. పెనుబల్లి మండలం ముత్యాలబంజరలోని స్వగ్రామంలో సుబ్బారావు శనివారం మృతి చెందగా, ఆయన మృతదేహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించాక ఆమె మాట్లాడుతూ సుబ్బారావు ఎమ్మెల్యేగా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆమె వెంట వీఎం బంజర సర్పంచ్ భూక్యా ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, నాయకులు మిట్టపల్లి కిరణ్కుమార్, మేకతోటి కాంతయ్య, వంగా నిరంజన్గౌడ్, గోగినేని రమేశ్ తదితరులు ఉన్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. రామయ్య సన్నిధిలో ప్రముఖులు స్వామివారిని ఆదివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నోరి దత్తాత్రేయుడు, ఛత్తీస్గఢ్ అటవీశాఖ మంత్రి కేదార్ కశ్యప్, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ఈఓ దామోదర్రావు, అధికారులు పాల్గొన్నారు. -
రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలుచేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30న చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఈ వేదిక పైనుంచి దాదాపు రూ.9 వేల కోట్ల నిధులను రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారని తెలిపారు. ఈ సభకు రైతులు, జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి మాట్లాడుతూ.. సీఎం సభకు వచ్చే రైతులకు ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్బాబా, నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, కమర్తపు మురళి, దొబ్బల సౌజన్య, మొక్క శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళి భారతరత్న, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం ఆర్అండ్బీ గెస్ట్హౌస్, లకారం ట్యాంక్బండ్ వద్ద ఉన్న పీవీ విగ్రహాలకు నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తా సీతారాములు, రాష్ట్ర ఓబీసీ సెల్ అధ్యక్షుడు వడ్డేబోయిన నరసింహారావు తదితరులు పీవీ చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆయ సేవలను కొనియాడారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు -
ఆరేళ్ల చిన్నారికి నరాల వ్యాధి
రఘునాథపాలెం: అందరితో పాటే ఆడుతూ, పాడుతూ పాఠశాలకు వెళ్లి రావాల్సిన చిన్నారిపై విధి పగపట్టింది. దీంతో మంచానికే పరిమితమైన ఆమెకు ఉన్నదంతా ఊడ్చి చికిత్స చేయించినా ఫలితం లేక దాతల చేయూత కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఆరేళ్ల నవ్య జ్యోత్స్న నరాల సంబంధిత వ్యాధి బారిన పడింది. అప్పటి నుంచి ఆస్పత్రులకు వెళ్తూ పరీక్షలు, చికిత్స చేయిస్తుండగా వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్సకు పెద్దమొత్తంలో నగదు అవసరమని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నవ్య తల్లిదండ్రులు వెనిగళ్ల రామకృష్ణ – రాజేశ్వరి ఆవేదనకు గురయ్యారు. ఎలాంటి ఆస్తులు లేకపోగా, ఇద్దరు కుమార్తెలను పోషించడమే కష్టమైన తరుణంలో ఇప్పుడు నవ్య పరిస్థితి వారికి ఆందోళన కలిగిస్తోంది. ఉన్న కొద్దోగొప్పో నగదు ఖర్చు అయిపోవడంతో దాతలు అండగా నిలిచి తమ కుమార్తెకు జీవితాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.చికిత్సకు చేయూత ఇవ్వాలని తల్లిదండ్రుల వినతి -
సామాజిక బాధ్యత పెంపొందిస్తున్న ‘మన్ కీ బాత్’
ఖమ్మంమామిళ్లగూడెం: ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’కార్యక్రమం ప్రజ ల్లో సామాజిక బాధ్యతనే కాక పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంపొందిస్తోందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నె ఉదయప్రతాప్ అన్నారు. ఖమ్మంలోని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ నివాసంలో ఆదివారం మన్ కీ బాత్ను నాయకులు, స్థానికులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉదయప్రతాప్ మాట్లాడుతూ.. సహజసిద్ధమైన బ్రిడ్జిల విశిష్టత, ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను మోదీ వివరించారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జ్వాలా నర్సింహారావు, మేకల నాగేందర్, దాసరి మధు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. పాస్పుస్తకాలు మంజూరు చేయాలిఏన్కూరు: భూ భారతి ద్వారా సమగ్ర భూసర్వే చేపట్టి కాస్తు ఆధారంగా పట్టాదారు పాస్పుస్తకాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఇకనైనా ప్రభు త్వం శ్రద్ధ చూపాలని కోరారు. అలాగే, జిల్లా లో ఏడు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టు పూర్తికి సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు దుగ్గికృష్ణ, తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, బానోతు బాలాజీ, నరేంద్ర, డి.నాగేశ్వరరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, బాణాల శ్రీనివాసరావు, కాలసాని సాయి, ఏర్పుల రాములు, ఇటికాల లెనిన్, గుండా సత్యనారాయణరెడ్డి, జానీ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలిముదిగొండ: ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముదిగొండ మండలంలోని పెద్దమండవ, మల్లారం సరిహద్దు చెక్పోస్టు వద్ద ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ మురళి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించారు. అర్చకుడు రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారు. రాకేశ్కు ఎన్ఐఎస్ కోచ్గా గుర్తింపుపాల్వంచ: పాల్వంచకు చెందిన బాస్కెట్బాల్ కోచ్ ఉప్పుశెట్టి రాకేశ్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ఐఎస్ (నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్) నుంచి కోచ్గా గుర్తింపు లభించింది. బెంగళూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన కొనసాగుతున్న నేతాజీ సుభాష్ సదరన్ సెంటర్లో ఆయన బాస్కెట్బాల్ కోర్సు పూర్తి చేయడంతో ఎన్ఐ ఎస్ సర్టిఫికెట్ జారీచేశారు. ఆధునిక శిక్షణ విధానాలు, క్రీడావిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వానికి సంబంధించిన అంశాల్లో కోర్సు పూర్తిచేసిన రాకేశ్ను పలువురు క్రీడాకారులు అభినందించారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
రఘునాథపాలెం: మండలంలోని రేగులచలక, కోయ చలక గ్రామాల్లో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహా రం చేసింది. రేగులచలక ఎస్సీకాలనీకి వచ్చిన కుక్క అక్కడ ఇంటి ముందు ఆడుకుంటున్న ఆర్ఎంపీ నార పోగు రాంబాబు కుమారుడు శశీంద్ర ముఖంపై దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. అలాగే, కలకోట కృష్ణ, మరో వ్యక్తిని సైతం కుక్క కరిచింది. అంతేకాక పశువులు, కోళ్లను కూడా కరిచిందని గ్రామస్తులు తెలిపారు. కాగా, శశీంద్రకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆలయ హుండీ తాళాలు ధ్వంసంకేశవాపురం గ్రామంలో ఉద్రిక్తత తల్లాడ: మండలంలోని కేశవాపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ హుండీ తాళాలను ఆదివారం ఓ వర్గం వారు పగలగొట్టారు. వచ్చేనెల మొదటి వారం ఆలయ వార్షికోత్సవం నిర్వహించనుండగా, జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ల క్రితం ఆలయ నిర్వహణ, హుండీ విషయమై గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల సమక్షాన హుండీకి రెండు తాళాలు వేశారు. భవిష్యత్లో అందరూ ఏకతాటిపైకి వచ్చాకే రెండు తాళాలను తెరవాలని నిర్ణయించారు. ఇంతలో ఆదివారం ఓ వర్గం వారు హుండీ తాళాలు తీస్తామని గ్రామంలో చాటింపు వేయించడమే కాక తాళాలను పగలగొట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఎప్పుడేం జరుగుతోందనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై స్థానికులు పలువురు తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
30 పడకలు.. 24 గంటలు
● ఏన్కూరు ఆస్పత్రిని అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ● గిరిజనానికి అందనున్న మెరుగైన వైద్యం ● రెండు జిల్లాల్లోని ఆరు మండలాల ప్రజలకు మేలు ఏన్కూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అప్గ్రేడ్ కానుంది. ఆరు పడకలుగా ఉన్న ఈ ఆస్పత్రిని 30 పడకల వైద్యశాలగా స్థాయి పెంచాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. తద్వారా ఇక్కడ గిరిజనులకు 24 గంటల పాటు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎకరం 20 కుంటల స్థలం ప్రస్తుత ఆరోగ్య కేంద్రం ఆవరణ ఒక ఎకరం 20 కుంటల్లో ఉంది. ఆస్పత్రి అప్గ్రేడ్కు ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యాన వైద్యవిధాన పరిషత్ ద్వారా 30 పడకల ఆస్పత్రి నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆరోగ్యకేంద్రంలో నిత్యం 100 మంది వరకు వైద్యసేవలు పొందుతున్నారు. అయితే, స్థాయి తక్కువ కావడంతో అత్యవసర వైద్యం అందక ఖమ్మం ఆస్పత్రికి సిఫారసు చేయక తప్పడం లేదు. దీంతో అక్కడికి వెళ్లలేక, ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థోమత లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యాన ఏన్కూరులో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటైతే ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, తల్లాడ, కామేపల్లి, ఏన్కూరు, కొణిజర్ల మండలాలతో పాటు భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు మండలంలోని గిరిజనులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. మూడు షిఫ్ట్ల్లో వైద్యం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలుగా అప్గ్రేడ్ చేస్తే 15 మంది వైద్యులు మూడు షిఫ్ట్ల్లో 24 గంటల పాటు వైద్యసేవలు అందిస్తారు. ఇందులో గైనకాలజిస్ట్, ఎముకల డాక్టర్, చిన్నపిల్లల వైద్యుడు, అనస్తీషియన్, జనరల్ ఫిఝీషియన్తోపాటు పలువురు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారు. సర్జరీల నిర్వహణకు కూడా అవకాశం ఏర్పడడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. ఇప్పటికే డయాలసిస్ సెంటర్ ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్యకేంద్రానికి ఇప్పటికే డయాలసిస్ సెంటర్ మంజూరైంది. జిల్లాలో వైరా, తిరుమలాయపాలెం, కల్లూరు, నేలకొండపల్లి, పెనుబల్లితో పాటు ఏన్కూరుకు కూడా కొన్నాళ్ల క్రితం డయాలసిస్ సెంటర్లు కేటాయించారు. వైరా, తిరుమలాయపాలెంలో ఏడేసి పడకలు, కల్లూరు, నేలకొండపల్లి, ఏన్కూరు, పెనుబల్లిలో ఐదు పడకల ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి డయాలసిస్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి.ప్రభుత్వ ఆస్పత్రి 30 పడకలకు అప్గ్రేడ్ అయింది. భవన నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు స్థల పరిశీలన కూడా చేశారు. ఎకరం 20 కుంటల్లో భవనం నిర్మాణం పూర్తయితే, 24 గంటల పాటు అత్యవసర చికిత్సలు, ఆపరేషన్లు జరుగుతాయి. చుట్టుపక్కల గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. – ఎన్.బాలకృష్ణ, ప్రభుత్వ వైద్యాధికారి, ఏన్కూరు -
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు మృతి
పెనుబల్లి/ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు (90) శనివారం మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెనుబల్లి మండలం వీఎం.బంజరలోని స్వగృహంలో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా జలగం వెంగళరావు ఉన్న సమయాన ఇల్లెందు ఎమ్మెల్యే(1972–78)గా కాంగ్రెస్ తరఫున సుబ్బారావు గెలిచారు. ఆ సమయంలో ఆయన సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావుపై 11,826 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతేకాక పలు కార్పొరేషన్లకు చైర్మన్గా కూడా పనిచేశారు. అలాగే, గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) వ్యవస్థాపకుడైన సుబ్బారావు గౌడ కులస్తులను ఒక తాటిపైకి తీసుకురావడంలో కృషి చేశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు సుబ్బారావు మృతదేహం వద్ద నివాళులర్పించగా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఫోన్లో కుటుంబీకులను పరామర్శించారు. అంతేకాక సుబ్బారావు మృతిపై సత్తుపల్లి, ఇల్లెందు ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, బానోతు హరిప్రియ, కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా, ఆదివారం వీ.ఎం.బంజరలో సుబ్బారావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అటు ఏర్పాట్లు.. ఇటు వర్షం
చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద ఆది, సోమవారాల్లో రైతుమేళా, 30వ తేదీన రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు నిర్ణయించారు. రెండు రోజుల పాటు జరిగే రైతుమేళాకు 10వేల మంది రైతులను ఆహ్వానించేలా ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. మరోపక్క సీఎం రేవంత్రెడ్డి పాల్గొనే సభ ఏర్పాట్లలో నిమగ్నం కాగా, శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అంతరాయం ఏర్పడింది. రైతుమేళా, సభ నిర్వహణకు ఖరారు చేసిన స్థలమంతా పొలాలు కావడంతో వర్షానికి చిత్తడిగా మారింది. దీంతో సామగ్రితో వచ్చిన వాహనాలు మైదానంలోకి వెళ్లేందుకు వీలు పడక మత్కేపల్లి రహదారిపైనే నిలిపేశారు. ఈమేరకు ఒక దశలో సభ వాయిదా పడుతుందని భావించినా అధికారులు శనివారం సాయంత్రం స్పష్టత ఇచ్చారు. రైతుమేళాను ఆదివారం రద్దు చేసి సోమవారం మాత్రమే నిర్వహిస్తామని, మంగళవారం సీఎం పాల్గొనే సభ యథావిధిగా జరుగుతుందని ప్రకటించారు. యంత్రాంగమంతా అక్కడే.. రైతుమేళాతో పాటు సీఎం సభ ఏర్పాట్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కమిషనర్ గోపి, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్దత్ శనివారం పరిశీలించారు. రైతుమేళా నిర్వహణకు ఇప్పటికే స్టాళ్లు ఏర్పాటుచేయగా, వివిధ కంపెనీల ప్రతినిధులు సామగ్రిని కూడా తీసుకొచ్చారు. అలాగే, హాజరయ్యే రైతులకు భోజన సదుపాయం కోసం కూరగాయలు, ఇతర సామగ్రి కూడా తెప్పించారు. అయితే, ఆవరణ అంతా వర్షానికి చిత్తడిగా మారడంతో మొరం తెప్పించి చదును చేయించే పనులు మొదలుపెట్టారు. అలాగే, సభా ప్రాంగణం వద్ద పోలీస్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క హెలీప్యాడ్ పనులకు కూడా అంతరాయం కలిగింది. హెలీప్యాడ్ నిర్మాణానికి కావాల్సిన కాంక్రీట్, రహదారి నిర్మాణానికి కావా ల్సిన సామగ్రి తీసుకెళ్లే వాహనాలు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో అప్పటికప్పుడు మట్టి పోయించి చదును చేయించారు. ఒకేరోజు రైతుమేళా ఖమ్మంసహకారనగర్: మత్కేపల్లి క్రాస్ వద్ద రైతుమేళా నిర్వహణకు నిర్ణయించిన స్థలం వర్షానికి చిత్తడిగా మారడం, ఏర్పాట్లలో అవాంతరాలు రావడంతో అధికారులు పరిశీలించారు. ఆతర్వాత ఉన్నతాధికారులతో చర్చించాక ఆది, సోమవారం కాకుండా సోమవారం మాత్రమే రైతు మేళా నిర్వహణకు నిర్ణయించారు. ఇక మంగళవారం రైతు ఆశీర్వాద సభ యథావిదిగా కొనసాగుతుందని కలెక్టర్ శనివారం సాయంత్రం ప్రకటించారు.రైతుమేళా, సీఎం సభా ఏర్పాట్లలో ఆటంకం -
● వర్షాలతో మిర్చి, పత్తి సాగుకు రైతుల సమాయత్తం ● ఇప్పటికే నాటిన విత్తనాలకు ప్రాణం పోసిన వాన ● 83వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసిన రైతులు
ఏపుగా పెరిగిన పత్తి మొక్క సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో జల్లులు కురుస్తున్న నేపథ్యాన రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి అడపాదడపా జల్లులు కురుస్తుండగా.. రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు పొలంబాట పట్టారు. ఇన్నాళ్లు వాతావరణం అనుకూలించక, వర్షాలు అంతంతమాత్రంగానే ఉండడంతో సాగు పనులు ఆశించిన స్థాయిలో సాగలేదు. అక్కడక్కడా మెట్ట పంటల సాగును మాత్రం రైతులు ప్రారంభించారు. భయపెడుతున్న ఎల్నినో పంటల సాగుపై ఎల్నినో మేఘాలు కమ్ముకున్నాయి. మృగశిర కార్తెలో వర్షాలు కురవగానే రైతులు సాగు ప్రారంభిస్తారు. అయితే ఈసారి జూన్ ముగింపు దశకు చేరినా ఆశించిన వర్షం కురవలేదు. దీంతో రైతులు పొడి దుక్కులు దున్ని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొందరు పత్తి విత్తనాలు నాటడంతో పాటు మిర్చి నారు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, ఉక్కపోత ప్రభావానికి చాలాచోట్ల విత్తనాలు మొలకెత్తక మరోసారి కూడా నాటారు. అయితే, వాతావరణ శాఖ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని చెబుతుండడంతో సాగుపై రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. చిరు జల్లులకే పరిమితం వారం, పది రోజుల నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. పంటల సాగుకు అనుకూలమైన వర్షాలు లేక రైతులు వేచి చూస్తున్నారు. కొద్దిరోజులుగా మధ్యాహ్నం వరకు ఎండ కొనసాగుతూ, సాయంత్రం మబ్బు పట్టి కొద్దిపాటి వర్షం కురుస్తోంది. ఫలితంగా భూమి చల్లబడకపోవడంతో పూర్తిస్థాయిలో దుక్కులు దున్నేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. 92 వేల ఎకరాల్లో పంటలు వ్యవసాయ శాఖ ఈ ఏడాది వర్షాకాలంలో అన్నీ కలిపి 5,67,154 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యం మేర పంటలు సాగవుతాయా, లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు 92,451 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి 3,05,366 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. ప్రస్తుతం 3,766 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగుచేయగా, 395 ఎకరాల్లో నాట్లు వేశారు. ఇంకో 13,718 ఎకరాలకు సరిపడా నారుమడులు పెంచుతున్నారు. ఇక పత్తి 2,36,908 ఎకరాలకు గాను 83,547 ఎకరాల్లో విత్తనాలు నాటారు. పెసలు 3,837 ఎకరాల్లో వేశారు. వర్షాలు నిలకడగా కొనసాగి, జూలైలో సమృద్ధిగా కురిస్తే వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటల సాగు అమాంతం పెరిగే అవకాశముంది.జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 3 సెం.మీ., కాకరవాయిలో 2.8, ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో 2, కలెక్టరేట్ వద్ద ఒక సెం.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ వర్షం కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అంతేకాక రానున్న నాలుగైదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం, జూలై నెలలో వర్షాలు కొనసాగితే పంటల సాగుకు డోకా ఉండదని భావిస్తున్నారు..ఐదెకరాల్లో పొడి దుక్కిలోనే పత్తి విత్తనాలు పెట్టా. ఇటీవల అడపాదడపా కురిసిన వర్షాలకు కొంత మొలకెత్తింది. కానీ పది రోజులుగా తీవ్రమైన ఎండలతో మొక్కలు నిలబడవని భయమేసింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం పంటను ఆదుకుంది. వానలు పడతాయనే నమ్మకంతో రూ.వేలు వెచ్చించి పత్తి విత్తనాలు కొని నాటా. మరో రెండు, మూడు వానలు పడితే కొంత వరకు పత్తి నిలబడుతుంది. – షేక్ మౌలానా, కొణిజర్ల -
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
ఖమ్మంమయూరిసెంంటర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధి దానవాయిగూడెంలోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్, బాలికల జూనియర్ కళాశాలలో రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి, మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించడమే కాక అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పనులకు అనుమతి వచ్చినా ఏళ్ల తరబడి పూర్తికాని సందర్భాలు ఉన్నాయని, కానీ ఈ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సొంత పనిగా భావించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువుపై దృష్టి సారించి ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. పాఠశాలలో ఇంకా చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు సమర్పించడంతో పాటు 15 రోజుల్లో క్రీడా మైదానం సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చుని గ్రూప్ఫొటో దిగారు. ఇక పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండలం గోళ్లపాడు, తీర్థాల గ్రామాల సమీపాన ఊటవాగు తండా వద్ద ఆకేరుపై రూ.6.75 కోట్లతో నిర్మించే చెక్ డ్యామ్ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఈఈ బషీర్ తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. చింతకాని మండలంలో ఈ నెల 30న జరిగే సీఎం సభ ఏర్పాట్లను ఉదయం పరిశీలిస్తారు. ఆ తర్వాత నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహపురం, రాజారాంపేట, కోరట్లగూడెం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాక పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్న మంత్రి, అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. -
రేవంత్రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించవు
● ‘సీతారామ’ పూర్తిచేస్తేనే నదీజలాలపై హక్కులు ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్భద్రాచలం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాటలు విని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు కోల్పోయేలా చేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఇదే జరిగితే రేవంత్రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించబోవని తెలిపారు. భద్రాచలంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలని కోరారు. నదీజలాలపై హక్కులు సాధించాలంటే గిరిజన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పూర్తిపై దృష్టి సారించాలన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం, చుట్టుపక్కల గ్రామాలు జలమయం అవుతాయని, అయినా సీఎం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, తాతా మధు మాట్లాడుతూ సొసైటీల పేరుతో కాంగ్రెస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతూ గిరిజనులను మోసం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ఇసుక వాహనాలతో రహదారులను నాశనం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరి ఓట్లను కాపాడాల్సిన బాధ్యత పార్టీ బీఎల్ఏలపై ఉందని సూచించారు. నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, గొడవర్తి నరసింహమూర్తి, బోదెబోయిన బుచ్చయ్య, మాజీ ఎంపీపీ రేసు లక్ష్మి, గంప రాంబాబు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ముదిగొండ: మండ లంలోని బాణాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేశ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలను ఏసీబీ ఉమ్మడి జిల్లా డీఎప్పీ వై.రమేశ్ వెల్లడించారు. బాణాపురం గ్రామానికి చెందిన రైతు కర్నె వీరబాబు 5 కుంటల స్థలంలో రేకులతో గది నిర్మించుకున్నాడు. దీనికి అనుమతి ఇవ్వడంతో పాటు ఇంటి నంబర్ కేటాయించాలని గత నెల 15న గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, పంచాయతీ కార్యదర్శిని పలుమార్లు కలిసినా ఫలితం లేకపోగా, రూ.40 వేలు ఇస్తే అనుమతి వస్తుందని తేల్చిచెప్పాడు. అంత స్థోమత లేదని రైతు బ్రతిమిలాడడంతో రూ.25వేలకు ఒప్పుకున్నాడు. అయితే, డబ్బు కోసం వేధించడంతో తట్టుకోలేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు వారు అన్ని ఆధారాలు సేకరించగా, శనివారం గ్రామంలోని రైతు వేదిక వద్ద వీరబాబు నుంచి రూ.25 వేలు తీసుకుంటున్న సురేశ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయంలో దాదాపు మూడు గంటల పాటు విచారించిన అధికారులు కార్యాలయ లావాదేవీలపై ఆరా తీశారు. కాగా, కార్యదర్శి సురేశ్ను వరంగల్లోని కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ రమేశ్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం కోసం వేధిస్తే 94404 46106 వాట్సప్ నంబర్ లేదా 1068 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.షెడ్డుకు అనుమతి, నంబర్ కోసం రూ.25 వేలు డిమాండ్ -
బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆర్సీఓ సీహెచ్.రాంబాబు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హతల ధృవపత్రాల జిరాక్స్ ప్రతులు, అనుభవ ధ్రువపత్రాలు, ఇతర పత్రాలతో కూడిన దరఖాస్తులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో కార్యాలయ పనివేళల్లో జూలై 2వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా అందించాలని సూచించారు. కాలేజీకి సంబంధించి ఫిజిక్స్ నాలుగు పోస్టులు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, గణితం మూడేసి పోస్టులతో పాటు తెలుగు, ఇంగ్లిష్, సివిక్స్ రెండేసి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇక పాఠశాల స్థాయిలో ఫిజికల్ సైన్స్ ఐదు, బయోలాజికల్ / జనరల్ సైన్స్, గణితం, ఇంగ్లిష్ నాలుగు చొప్పున, తెలుగు రెండు పోస్టులతో పాటు హిందీ, సోషల్ స్టడీస్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని వెల్లడించారు. పాలేరుకు చేరిన సాగర్ జలాలు కూసుమంచి: జిల్లాతో పాటు ఇంకొన్ని ప్రాంతాల తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి గురువారం నీటిని విడుదల చేశారు. ఈమేరకు నీరు పాలేరు రిజర్వాయర్కు శనివారం చేరింది. రిజర్వాయర్కు ప్రస్తుతం 1,500 క్యూసెక్కుల మేర చేరుతున్న నీరు క్రమంగా పెరగనుంది. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 12.80అడుగులకు చేరుకుందని, సాగర్ జలాలతో మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా తాగునీటి అవసరాలను తీర్చనున్నట్లు వెల్లడించారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన శ్రీవారికి పల్లకీ సేవ నిర్వహించారు. కాగా, 29నుంచి ఆలయంలో జరిగే మహా కుంభాభిషేకం కోసం ఈఓ జగన్మోహన్రావు కుటుంబసభ్యులు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ ఉప్పల విజయదేవశర్మకు అందచేశారు. ఈకార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో వన మహోత్సవం ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్లో శనివారం వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, దివంగత వనజీవి రామయ్య సతీమణి జానమ్మ పాల్గొని డీఆర్వో రామ్మూర్తితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని కోరారు. కాగా, కలెక్టరేట్ ముందుభాగంలో నాటిన మొక్కలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి సమకూర్చారని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి అనిత, గార్డెన్ ఇన్చార్జ్ హసీనాబేగం తదితరులు పాల్గొన్నారు. డైట్ ప్రిన్సిపాల్గా వాసంతి ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని డైట్ కళాశాల ప్రిన్సిపాల్గా వాసంతిని నియమించారు. ప్రిన్సిపాల్ పోస్టు ఖాళీగా ఉండడంతో భద్రాద్రి కొత్తగూడెం డీఈఓగా కొనసాగుతున్న ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11–30 గంటల నుంచి కూసుమంచి మండలం దుబ్బతండా, లాల్సింగ్ తండా, మధ్యాహ్నం 12–20 గంటలకు జీళ్లచెర్వుల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే, సాయంత్రం 4–45 గంటలకు ఖమ్మం దానవాయిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అభివృద్ధి పనులకు, ఉత్తవాగు తండాలో ఆకేరుపై చెక్డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కొనసాగుతున్న ఎప్సెట్ కౌన్సెలింగ్ ఖమ్మం సహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో శుక్రవారం స్లాట్ బుక్ చేసుకున్న 650మంది విద్యార్థులకు గాను 630మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకిరుల్లా తెలిపారు. వచ్చే సోమవారం వరకు మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ఆయన వెల్లడించారు. 29నుంచి జమలాపురంలో మహా కుంభాభిషేకం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మహా కుంభాభిషేకం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి, ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు కోరారు. తెలిపారు. ఆలయంలో శుక్రవారం వారు ఏర్పాట్లపై పోలీసు, ఇతర శాఖల అదికారులతో సమీక్షించారు. తొలిరోజైన 29న ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే, 2వ తేదీన అలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లు, శ్రీసోమేశ్వరస్వామి ఆలయ జీవ ధ్వజ స్తంభాల ప్రతిష్ఠ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక 3వ తేదీన శ్రీశృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి చేతుల మీదుగా మహా కుంభాభిషేక సంప్రోక్షణ ఉంటుందని తెలిపారు. వేలాదిగా హాజరయ్యే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈసమావేశంలో సర్పంచ్ తుళ్లూరు నిర్మల, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచింపజేసిన ‘కనకతార’ ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ప్రదర్శించిన ‘కనకతార’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపచేసింది. తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల కేశవదాసు బాల్య వివాహాలు, కన్యాశుల్కం, సీ్త్రల అణచివేత తదితర అంశాల ఆధారంగా రచించిన ఈ నాటికను సురభి భానోదయ నాట్యమండలి కళాకారులు ప్రదర్శించారు. కనకతార తండ్రి డబ్బు ఆశతో వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం, తదితర అంశాలతో రూపొందించిన ఈ నాటికను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. చందాల కేశదాసు కళా పరిషత్ అధ్యక్షుడు కొండపల్లి జగన్మోహన్రావు పర్యవేక్షణలో నాటికను ప్రదర్శించగా, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు తిరుమలరావు, కళాకారులు దయానంద భూషణం, రామాల ప్రకాష్, గులాం దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం
ఖమ్మం క్రైం: మాదకద్రవ్యాలను సమాజం నుంచి సమూలంగా నిర్మూలించే బాధ్యత అందరూ స్వీకరించాలని కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం మమతా రోడ్డు నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసు కమిషనర్ సునీల్దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ప్రారంభించాక కలెక్టర్ మాట్లాడారు. దేశ నిర్మాణంలో కీలకమైన యువత దురలవాట్లకు లోను కాకుండా భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. సీపీ సునీల్దత్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతీఒక్కరు భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని తెలి పారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు జరిగితే 1908 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం యువతతో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంత రం ‘ఐయామ్ యాంటీ డ్రగ్ సోల్జర్’ సైన్ బోర్డుపై సంతకాలు చేశారు. ఏసీపీలు రమణమూర్తి, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.అవగాహన ర్యాలీలో కలెక్టర్, సీపీ -
ఆగస్టు 15న పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం
వేంసూరు: రైతులు సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్పామ్ సాగు చేస్తే స్థిరమైన ఆదాయం వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వేంసూరు మండలం కల్లురుగూడెంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అయిల్పామ్ టన్నుకు రూ.25 వేల ధర నిర్ణయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఆయిల్పామ్ సాగులో అగ్రభాగాన నిలుస్తుందని చెప్పారు. సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యాన ప్రతీ జిల్లాలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైతే రైతులకు రవాణా వ్యయం తగ్గడమే కాక స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక భరోసా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుచ్చకాయల సోమిరెడ్డి, కాసరి చంద్రశేఖర్రెడ్డి, వెల్ది జగన్మోహన్రావు, తుమ్మూరు లక్ష్మారెడ్డి, మామిళ్లపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, ఫైజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.కల్లూరుగూడెంలో పరిశీలించిన మంత్రి తుమ్మల -
ఈసీ ‘డిజిటల్’ అస్త్రం!
పీరీల ఊరేగింపులో పాల్గొన్న నగరవాసులు ‘ఎస్ఐఆర్’లో భాగంగా ఇంటింటి ఓటర్ల సర్వే చేస్తున్న బీఎల్ఓలకు ఎన్నికల సంఘం ప్రత్యేక కిట్లు అందజేసింది. ఈ కిట్లలో క్షేత్రస్థాయి పరిశీలనకు అవసరమైన అన్ని రకాల సామగ్రి సమకూర్చారు. ముందస్తుగా ముద్రించిన ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయించేందుకు వీలుగా ’ఫారం–6’ అప్లికేషన్లను అందించారు. అలాగే, సిబ్బందిని ప్రజలు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక లోగోతో కూడిన టీ–షర్ట్, టోపీ, గొడుగు అందించడంతో పాటు గుర్తింపు కార్డు కూడా జారీ చేశారు. అలాగే, వాటర్ బాటిల్, పెన్సిళ్లు, పెన్నులు, రైటింగ్ ప్యాడ్ తదితర సామగ్రితో పాటు అవగాహన బుక్లెట్లను ప్రత్యేక బ్యాగ్లో అందించారు. ఇవికాక వర్షం వచ్చినా ఇబ్బంది రాకుండా రెయిన్ కోట్, ఫోన్ చార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా సమకూర్చారు.ఖమ్మంమయూరిసెంటర్: పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కొనసాగుతోంది. ఈక్రమాన లోటుపాట్లు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం సరికొత్త సాంకేతికతను జోడించింది. ఇందుకోసం ఇంటింటా వివరాలు సేకరించే బూత్ లెవల్ అధికారు(బీఎల్ఓ)ల కోసం యాప్లోని ‘ఎసినెట్’ అప్లికేషన్లలో మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రీ–డ్రాఫ్ట్, పోస్ట్–డ్రాఫ్ట్ మాడ్యూళ్లను చేర్చారు. అంతా డిజిటలైజేషన్ రాతపూర్వక పద్ధతికి స్వస్తి చెబుతూ, ప్రతీ ఓటరు వివరాల పరిశీలన, మ్యాపింగ్ను ఆన్లైన్ చేశారు. ఇందుకోసం తెలుగుతో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతీయ భాషల్లో యాప్ను రూపొందించారు. ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలకు ముందే బీఎల్ఓలు యాప్ ద్వారా కీలక ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. బూత్ పరిధిలోని మొత్తం ఓటర్లు, అందులో ఎందరికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని మిగిలాయో నమోదు చేయాలి. ఇవికాక ఎందరు ఓటర్లు ఆన్లైన్లో ఫారాలు పూరించారనే వివరాలను కూడా బీఎల్ఓలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక ప్రస్తుత జాబితాలోని ఓటర్ల వివరాలను, గత జాబి తాల్లోని డేటాతో అనుసంధానం చేసే వీలు ఏర్పడింది. గత ఓటర్ల వారసులను కూడా ఈ యాప్ ద్వారా సులభంగా గుర్తించి అనుసంధానం చేయొచ్చు. వారు.. ప్రత్యేకం బీఎల్ఓలు ఓటరు ఇంటికి ఓసారి వెళ్లినప్పుడు లేకపోతే మరో రెండు సార్లు వెళ్లాలి. అయినప్పటికీ అందుబాటులో లేకపోయినా, ఓటరు చనిపోయినా, శాశ్వతంగా వలస వెళ్లినా, ఫారంపై సంతకం చేయడానికి నిరాకరించినా ప్రత్యేకంగా నమోదు చేయాలి. ఇందుకు సంబంధించి వివరాలను 150 అక్షరాల్లో రాసి, ఫారంను యాప్లో అప్లోడ్ చేసి ‘మార్క్ అన్కలెక్టబుల్’గా నమోదు చేయాల్సి ఉంటుంది. పొరపాట్లు జరగకుండా.. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, సవరణల కోసం యాప్లో ప్రత్యేక ఫీచర్లు చేర్చారు. ఓటరు పేరు, బంధుత్వాల పేర్లలో తప్పులు ఉంటే (గత ఓటర్ లిస్ట్తో తండ్రి పేరు సరిపోకపోతే) యాప్ చూపిస్తుంది. దీంతో ఆధారాలను బీఎల్ఓలు అప్లోడ్ చేయడమేకాక, అభ్యంతరాలపై విచారణ నోటీసులకు ఇచ్చిన రశీదులను కూడా నమోదు చేయాలి. విచారణ సమయాన గ్రూప్ ఫొటో, అటెండెన్స్ షీట్ను సైతం లైవ్లో అప్లోడ్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఓటరు గుర్తింపు కార్డులోని పాత ఫొటో స్పష్టంగా లేకపోతే, కొత్త ఫొటోను యాప్ ద్వారా పరిశీలించి అప్డేట్ చేయొచ్చు. ఇక 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, అనుమానాస్పద ఇళ్లల్లో లేని, ఇళ్లు మారిన, చనిపోయిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పక్కాగా నిర్ధారించుకునే సదుపాయం బీఎల్ఓలకు యాప్ ద్వారా కల్పించారు. ఒకే క్లిక్తో అధికారుల డైరెక్టరీ క్షేత్రస్థాయిలో తిరిగే బీఎల్ఓలకు ఎలాంటి అత్యవసర సాయం కావాలన్నా.. ఉన్నతాధికారులను సంప్రదించాలన్నా ‘ఎసినెట్’ యాప్లోనే ప్రత్యేక కాంటాక్ట్ డైరెక్టరీని పొందుపరిచారు. ఇందులో ద్వారా సీఈఓ, డీఈఓ, ఈఆర్ఓ, ఆర్ఓ, ప్రిసైడింగ్ అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఆ నంబర్ల ఆధారంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇలాంటి అనేక సౌకర్యాలతో బీఎల్ఓలు చేపట్టే ప్రక్రియలు సులభంగా మారాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.ఓటర్ల జాబితా సవరణలో కీలకంగా యాప్ -
రేపటి నుంచి రైతుమేళా
● మత్కేపల్లిలో 28, 29వ తేదీల్లో నిర్వహణ ● 150 స్టాళ్లు, రోజుకు 5వేల మంది రైతులకు ఆహ్వానం చింతకాని/ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద ఈనెల 28, 29వ తేదీల్లో మెగా రైతుమేళా నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ ప్రాంతానికి పక్కనే 30వ తేదీన జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన రైతు మేళా నిర్వహణకు నిర్ణయించారు. వ్యవసాయంలో ఆధునికత, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించేలా ఈ మేళాను నిర్వహిస్తారు. ప్రదర్శనలు, అవగాహన వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన పరికరాలు, విత్తనాల ప్రదర్శన కోసం ఐదెకరాల స్థలంలో 150 స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నారు. రోజుకు 5వేల మంది చొప్పున 10 వేల మంది రైతులను ఆహ్వానించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులతో ప్రదర్శనలు ఇప్పిస్తారు. విత్తనాభివృద్ధి సంస్థ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ఆయిల్పామ్, విజయ డెయిరీ, విద్యుత్ శాఖ, రెడ్–కో, బ్యాంకులు, ఫెర్టిలైజర్లు, విత్తన కంపెనీలు, సేంద్రియ ఉత్పత్తులు, యంత్ర పరికరాల ప్రదర్శన ఉంటుంది. అలాగే, వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొని ప్రస్తుత వాతావరణం, ఎల్నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం స్టాళ్లు ఏర్పాటుచేస్తున్న ఆవరణలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు కూడా సిద్ధం చేస్తున్నారు. కాగా, రెండు రోజుల పాటు మేళాకు 10వేల మంది రైతులు హాజరుకానుండగా, వీరికి రవాణా సౌకర్యం కల్పించడమే కాక అల్పాహారం, భోజనం సైతం సమకూరుస్తారు. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కమిషనర్ డాక్టర్ గోపి శనివారమే జిల్లాకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి మత్కేపల్లి క్రాస్ వద్ద రెండు రోజుల పాటు జరిగే రైతుమేళాను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఈనెల 28, 29వ తేదీల్లో జరిగే రైతుమేళాలో ఏర్పాటుచేస్తున్న స్టాళ్లతో పాటు 30వ తేదీన జరిగే సీఎం సభ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. స్టాళ్లు, ప్రధాన వేదిక, భోజనశాలలు, పార్కింగ్ స్థలాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, తాగునీటి వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు మేళాలో 150కు పైగా వివిధ శాఖల ఆధ్వర్యాన అవగాహన కల్పించేందుకు స్టాళ్లు ఏర్పాట్లు చేస్తుండగా, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేళాకు వచ్చే రైతులకు ఇబ్బంది రాకుండా తాగునీరు, వైద్య సదుపాయం, భోజన వసతితో పాటు సమాచార కేంద్రాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, తొలిరోజైన 28వ తేదీన రైతుమేళాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తాగునీటి తంటా తీరేలా..
● వర్షాలు ఊపందుకోక పాలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు ● ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కట్లు ● సమస్య పరిష్కారానికి ఎన్నెస్పీ నీరు విడుదల ● మూడు జిల్లాలకు తప్పనున్న ఇబ్బందులుపాలేరు రిజర్వాయర్లో కనిష్టస్థాయికి చేరిన నీటిమట్టం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్నినో ప్రభావం పంటల సాగుపై పడడమే కాక, తాగునీటి సమస్యకూ కారణమవుతోంది. ఇన్నాళ్లు పాలేరు, వైరా రిజర్వాయర్లలో ఆశించిన స్థాయిలోనే తాగునీటి నిల్వలు ఉండగా.. వర్షాలు లేక, ఎండలు తగ్గక అవి క్రమేణా క్షీణిస్తున్నాయి. దీంతో తాగునీటి కటకట ఏర్పడకుండా నాగార్జునసాగర్ నుంచి ఎడమకాల్వకు నీరు విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం ఒక టీఎంసీకి చేరేవరకు నీరు విడుదల చేయడమే కాక, ఆపై వైరా, లకారం ట్యాంక్బండ్ల్లోకి చేర్చి తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. తాగునీటికి కీలకం జిల్లాతోపాటు ఖమ్మం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎన్నెస్పీ ఉపయోగపడుతోంది. ఇక ఖమ్మం నగరంలోని కొంత మేర, చుట్టుపక్కల ప్రాంతాలకు మున్నేరు నది తాగునీటి వనరుగా ఉంది. అయితే, పాలేరు రిజర్వాయర్ ఆధారంగా మిషన్ భగీరథ పథకం కొనసాగుతోంది. వేసవిలో పాలేరు రిజర్వాయర్లో నిల్వ ఉండే నీటిని సాగు అవసరాలకు కాక, తాగునీటికే సరఫరా చేస్తారు. ఇందులో నీటిమట్టం తగ్గితే సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వకు విడుదల చేస్తూ, దానవాయిగూడెం హెడ్వర్క్స్ వద్ద నిల్వ చేసి సరఫరా చేస్తారు. మూడు జిల్లాల దాహార్తి తీరుస్తూ.. పాలేరు రిజర్వాయర్పై ఖమ్మం, సూర్యాపేట, పాత వరంగల్ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. రిజర్వాయర్ నుంచి కూసుమంచిలోని కొన్ని గ్రామాలు, నేలకొండపల్లి, రఘునాథపాలెం, ఖమ్మంరూరల్, ముదిగొండ, తిరుమలాయపాలెం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలే కాక పాత వరంగల్ జిల్లాలోని 16 మండలాలు, సూర్యాపేట జిల్లాలోని మోతె మండలంలోని కొన్ని గ్రామాలు, జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతన్కల్, తుంగతుర్తి, చెవ్వెంల, ఆత్మకూరు మండలాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఇక వైరా రిజర్వాయర్ ద్వారా ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, కొణిజర్ల, కల్లూరు, తల్లాడ మండలంలోని కొన్ని గ్రామాలు, వైరా మండలం, వైరా మున్సిపాలిటీ, మధిర మండలం, మధిర మున్సిపాలిటీ, దానవాయిగూడెం హెడ్వర్క్స్ నుంచి ఖమ్మం కార్పొరేషన్కు తాగునీరు అందుతోంది. ఈ రిజర్వాయర్లలో నీరు అడుగండితే ఆయా ప్రాంతాలన్నింటికీ ఇక్కట్లు తప్పవు. ఎన్నెస్పీ నుంచి పాలేరుకు.. పాలేరు రిజర్వాయర్లో నిల్వలు తగ్గుముఖం పట్టడంతో ఎన్నెస్పీ అధికారులు ఎడమకాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. రెండు వేల క్యూసెక్కుల నీటిని సాగర్ నుంచి విడుదల చేయగా.. శనివారం పాలేరు రిజర్వాయర్కు చేరనున్నాయి. రిజర్వాయర్లో ఒక టీఎంసీ నీరు చేరేవరకు వారం పాటు సరఫరా జరుగుతుంది. తద్వారా వర్షాలు ఎలా ఉన్నా తాగునీటికి ఎలాంటి సమస్య ఎదురుకాదని భావిస్తున్నారు.ఎల్నినో ప్రభావంతో వేసవిలో ఎండలు మండిపోయాయి. వర్షాకాలం వచ్చినా జల్లులు తప్ప భారీ వర్షం లేకపోగా ఎండలూ తగ్గడం లేదు. దీంతో పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23అడుగులకు గాను ప్రస్తుతం 12.90 అడుగులకు పడిపోయింది. పాలేరు జలాశయంలోని నీటిని ప్రతిరోజూ తాగు అవసరాలకు వినియోగిస్తుండడంతో రోజుకు 0.20 అడుగుల మేర తగ్గుతూ ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరింది. దీంతో ఖమ్మం కార్పొరేషన్తోపాటు ఇంకొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై అయోమయం నెలకొంది.ఇన్ టేక్వెల్ నీటి సరఫరా (క్యూసెక్యుల్లో) పాలేరు – 01 6.4 02 110.16 03 2.34 04 16.56వైరా రిజర్వాయర్ 45.37చనుమోలు 19.4లకారం ట్యాంక్బండ్ 2.48 -
మట్టి తరలింపునకు అనుమతి తప్పనిసరి
నేలకొండపల్లి: అనుమతి లేకుండా చెరువుల నుంచి మట్టి తరలిస్తే సహించేది లేదని జలవనరుల శాఖ సీఈ మంగళపూడి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మండలంలోని కట్టుకాచారంలో చెక్డ్యామ్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. చెరువుల మట్టి వాణిజ్య అవసరాల కోసం కావాల్సిన వారు తగిన రుసుం చెల్లించి అనుమతి తీసుకోవాలన్నారు. రైతులు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉన్నా అనుమతి మాత్రం తప్పనిసరన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగేలా పూడికతీతకు నిర్ణయించామని తెలిపారు. కాగా, రూ.15కోట్లతో కట్టుకాచారాం, సదాశివాపురం, పైనంపల్లి, ఊటవాగుతండాలో చెక్డ్యామ్ నిర్మాణాలు జరుగుతుండగా, ప్రతీ చెక్డ్యామ్ పరిధిలో కనీసం 2వేల ఎకరాల మేర ఆయకట్టు పెరుగుతుందన్నారు. జక్కేపల్లి, జాన్పాడ్తండా చెక్డ్యామ్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, జలవనరుల శాఖలో ఖాళీ పోస్టులను ఆగస్టు నాటికి భర్తీ చేసేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈఈ పొట్టయ్య, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.జల వనరుల శాఖ సీఈ వెంకటేశ్వర్లు -
సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు
ఖమ్మంమయూరిసెంటర్: యువ కార్మికులు ఎదుర్కొంటున్న ఉపాధి, వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, రాష్ట్ర నాయకులు కళ్యాణం వెంకటేశ్వరావు పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఖమ్మంలో గురువారం జరిగిన యంగ్ వర్కర్ల సదస్సులో కార్మికుల సమస్యలు, చట్టాల అమలు, కాంట్రాక్ట్ విధానం, కనీస వేతనాల అమలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మధు మాట్లాడుతూ యువ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం ఉద్యమాలను నిర్మించాలని తెలిపారు. దేశంలో యువతకు శాశ్వత ఉపాధి కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందున, యువ కార్మికులు హక్కుల సాధనకు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కన్వీనర్గా ఎస్.నవీన్రెడ్డి ఈ సదస్సులో జిల్లా స్థాయి యంగ్ వర్కర్ల కమిటీని ఏర్పాటు చేసి, కన్వీనర్గా ఎస్.నవీన్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి, యువజన ఉద్యమాల్లోనే కాక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు బాధిత రైతుల ఉద్యమ నిర్మాణంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఇబ్బంది పడుతున్న యువతను సంఘటితం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బండారు యాకయ్య, పి.మోహన్రావు, దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర నాయకులు మధు, వెంకటేశ్వరావు -
‘సీతారామ’ పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాకు తలమానికంగా నిలిచే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు విమర్శించారు. ఖమ్మంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.18 వేల కోట్ల అంచనా వ్యయం ఇప్పుడు రూ.19 వేల కోట్లకు చేరగా, ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.360 కోట్లే కేటాయించిందని మండిపడ్డారు. జిల్లా నుంచే ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు ఉన్నా ప్రాజెక్టుకు నిధులు రాబట్టలేకపోతున్నారని తెలిపారు. ఇదికాక మంత్రులు రాజీవ్ కెనాల్, జవహర్ కెనాల్, పాలేరు లింక్ కెనాల్ అంటూ తలా ఒక కాల్వపై దృష్టి సారించగా, ప్రధాన ప్రాజెక్టే పూర్తి కానప్పుడు కాల్వలతో రైతులకు ఏం ఉపయోగమని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో తాము చేసిన సుదీర్ఘ పోరాటాలతోనే ఈ ప్రాజెక్టు మంజూరైందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే 104 కి.మీ. పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన రెండు టన్నెళ్ల పనులను పూర్తి చేసి గోదావరి నీళ్లను పాలేరుకు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 2026 ఆగస్టు 15నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని వైరా సభలో చెప్పారని, ఇప్పుడు మరోమారు వస్తున్న సీఎం ఎందుకు పూర్తికాలేదో చెప్పాలని సూచించారు. అంతేకాక ఆశీర్వాద సభ పేరిట నిర్వహించే సమావేశంలో జిల్లాకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని సుదర్శన్రావు ఆందోళన వ్యక్తం చేశారు. చింతకాని మండలంలో సీపీఎం నేత రామారావు హత్య జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా నిందితులెవరో తేల్చకపోగా, నంది అవార్డు గ్రహీత దేవేంద్ర ఇంట్లో రూ.25 లక్షల చోరీ కేసులోనూ పురోగతి లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు వై.విక్రమ్, కళ్యాణం వెంకటేవ్వరరావు, యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సుదర్శన్రావు -
రేపు హనుమకొండ జిల్లాలో జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీన హనుమకొండ జిల్లాలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వివిధ కంపెనీల బాధ్యులు పాల్గొని సుమారు 5వేల మందికి నియామక పత్రాలు ఇచ్చే అవకాశముందని వెల్లడించారు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని కిట్స్ కళాశాలలో జరిగే జాబ్మేళాకు ఇంటర్ నుంచి పీజీ విద్యార్హత కలిగిన వారు హాజరుకావొచ్చని తెలిపారు. గైనకాలజిస్టుల నియామకానికి 1న ఇంటర్వ్యూలు ఖమ్మంవైద్యవిభాగం: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని మధిర ఏరియా ఆస్పత్రి, కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్టుల నియామకానికి జూలై 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్) కె.రాజశేఖర్ గౌడ్ తెలిపారు. అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించే ఉద్దేశంతో జూలై, ఆగస్టు నెలలకు మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మధిర ఆస్పత్రి, కల్లూరు సీహెచ్సీలో ఒక్కో గైనకాలజిస్టును నియమించనుండగా ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్ ఉత్తీర్ణులైన వారు అర్హులని, అదనపు అర్హతలు, పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్లు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో జూలై 1న కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని డీసీహెచ్ఎస్ ఓ ప్రకటనలో సూచించారు. ‘పల్స్ పోలియో’కు సిద్ధం కావాలి చింతకాని: చిన్నారులు పోలియో బారిన పడకుండా కాపాడేలా ఈనెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు ఉద్యోగులు సిద్ధం కావాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు సూచించారు. చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో సమావేశమైన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 0–5 ఏళ్ల వయస్సు పిల్లలందరికీ చుక్కల మందు వేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ఆతర్వాత బూత్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వ్యాక్సిన్ల నిల్వలపై సమీక్షించారు. అంతేకాక ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, ఫార్మసీని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ వైద్యసేవలపై సూచనలు చేశారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్, వైద్యులు శ్రీదేవి, సోహైల్, ఉద్యోగులు ఇస్మాయిల్, కనకతార, సిరాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్లినికల్ అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ–ఫీమేల్) ఒకేషనల్ కోర్సులో మార్చి 2022 నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ఏడాది పాటు జిల్లా ఆస్పత్రిలో క్లినికల్ అప్రెంటిస్షిప్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. శిక్షణకు ఎంపికై న వారు రూ.వేయి డీడీ ఆస్పత్రి పేరిట సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు కూడా ఈసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించిన సొంత చిరునామా కవర్, బయోడేటా ఫారం, సర్టిఫికెట్ల జిరాక్స్లతో కూడిన దరఖాస్తును కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో జూలై 10 లోగా అందజేయాలని డీఐఈఓ ఓ ప్రకటనలో సూచించారు. -
డెయిరీ మూసివేత యత్నాలు సరికాదు
ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంలోని విజయ డెయిరీని మూసివేస్తే సహించేది లేదని బీజేపీ జిల్లా అద్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. వరంగల్ యూనిట్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పాలు, పెరుగు సరఫరా చేయాలని ఆదేశించడంతో ఖమ్మం డెయిరీ మనుగడపై ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు గురువారం డెయిరీ ఎదుట బీజేపీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులకే కాక ప్రజలకు ఉపయోగంగా ఉన్న డెయిరీ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు పాలకులు కుట్ర పన్నారని ఆరోపించారు. జెడ్పీ సెంటర్లో నిరసన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించి 51 ఏళ్లు కావడంతో ఖమ్మం జెడ్పీ సెంటర్లో సంవిధాన్ హత్యాదివస్(ఎమర్జెన్సీ వ్యతిరేక దినం) పేరిట నిరసన తెలిపారు. ఈకార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామలింగేశ్వరరావుతో పాటు నాయకులు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, గుత్తా వెంకటేశ్వరరావు, డీకొండ శ్యామ్, నాయుడు రాఘవరావు, శ్యామ్రాథోడ్, వీరవెల్లి రాజేష్, నకిరేకంటి వీరభద్రం, ఎల్లారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు కల్లా టన్నెల్ పూర్తి చేయండి
సత్తుపల్లిటౌన్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన యాతాలకుంట టన్నెల్ నిర్మాణ పనులను ఆగస్టు మొదటి వారం నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర టీ.ఎస్., అంకిత్ ఆదేశించారు. సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట టన్నెల్ పనులను గురువారం పరిశీలించారు. పనుల పురోగతి, లైనింగ్ నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, నాణ్యతను పరిశీలించాక వారు ఇరిగేషన్ శాఖ టన్నెల్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా, సీఈ ఎస్.శ్రీనివాసరెడ్డి, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ యాతాలకుంట టన్నెల్ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో అదనంగా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే, సత్తుపల్లి ట్రంక్ కాలువకు గోదావరి జలాలు చేరి సత్తుపల్లి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఈమేరకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. భద్రాద్రి కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ టన్నెల్ నిర్మాణ పనులు, నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించడమే కాక నిర్మాణం పూర్తయ్యాక నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బి.కృష్ణ, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర, అంకిత్ -
ఎకై ్సజ్ శాఖలో బదిలీల పర్వం
● డిప్యూటీ కమిషనర్గా సోమిరెడ్డి ● ఏసీగా కిషన్, ఖమ్మం ఈఎస్గా జానయ్య, భద్రాద్రికి శ్రీనివాసరెడ్డిఖమ్మంక్రైం: ఎక్సైజ్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు అధికారులను బదిలీ చేశారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా అధికారులకు సైతం స్థానచలనం కలిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా వి.సోమిరెడ్డిని నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నిజామాబాద్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుండగా, పదోన్నతిపై ఖమ్మంకు కేటాయించారు. అలాగే, ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్గా రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్న ఆర్. కిషన్ను నియమించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న జనార్దన్రెడ్డిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, అసిస్టెంట్ కమిషనర్ గణేష్ను హైదరాబాద్లోని డిస్టిలరీ అసిస్టెంట్ కమిషనర్గా, జిల్లా ఎకై ్సజ్ అధికారి జి.నాగేందర్రెడ్డిని పదోన్నతిపై ఎకై ్సజ్ ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, డిప్యూటీ కమిషనర్గా నియమితులైన సోమిరెడ్డి గతంలో జిల్లా ఎకై ్సజ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆయనతో పాటు అసిస్టెంట్ కమిషనర్గా కిషన్ గురువారం బాధ్యతలు స్వీకరించగా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి జిల్లా నుంచి ఖమ్మంకు... రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లతో పాటు జిల్లాల ఎకై ్సజ్ సూపరింటెండెంట్(ఈఎస్)లను సైతం బదిలీ చేశారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య ఖమ్మం బదిలీ అయ్యారు. అలాగే, శంషాబాద్ ఈఎస్గా విధులు నిర్వర్తిస్తున్న ఏ.శ్రీనివాసరెడ్డిని భద్రాద్రి జిల్లాకు కేటాయించారు. -
మొబైల్ ట్రాన్స్ఫార్మర్ !
● అవసరమైన చోటుకు తీసుకెళ్లేలా ట్రాలీలో ఏర్పాటు ● బ్రేక్డౌన్ ప్రాంతాలు, ప్రభుత్వ సభలకు వినియోగం ఖమ్మంవ్యవసాయం: ఎక్కడైనా సబ్ స్టేషన్లో విద్యుత్ అంతరాయం ఏర్పడితే మరో సబ్స్టేషన్ నుంచి తాత్కాలికంగా సరఫరా చేస్తారు. అదే ట్రాన్స్ఫార్మర్ పాడైతే కొత్తది తీసుకొచ్చి అమర్చే వరకూ ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. ఇలాంటి సందర్భాలతో పాటు వీఐపీల సభలు, ప్రభుత్వ కార్యక్రమాల వద్ద వినియోగించేలా ఎమర్జెన్సీ మొబైల్ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీని ఖమ్మం విద్యుత్ సర్కిల్ అధికారులు రూపొందించారు. ఓ ట్రాలీపై 160 కేవీఏ సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ను అమర్చగా, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినప్పుడు వెంటనే దీన్ని తీసుకెళ్లి తాత్కాలికంగా సరఫరా పునరుద్ధరిస్తారు. అంతేకాక వీఐపీల సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీని అందుబాటులో ఉంచడం ద్వారా సరఫరా సాఫీగా సాగుతుంది. అలాగే, వేసవిలో లోడ్ పెరిగిన ట్రాన్స్ఫార్మర్ల వద్ద దీన్ని లోడ్ రిలీఫ్ కోసం వినియోగిస్తారు. ఈ మొబైల్ ట్రాన్స్ఫార్మర్ను ఖమ్మంలో ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గురువారం ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఖమ్మం టౌన్ డీఈ(ఆపరేషన్స్) నంబూరి రామారావు, ఏడీఈలు సీహెచ్.నాగార్జున, సంజీవ్కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
●ఎన్నాళ్లకెన్నాళ్లకు !
● సాగర్ ఇన్ఫాల్ గేట్ల తొలగింపు ● ఒకటి మరమ్మతు, ఇంకొకటి కొత్తది ఏర్పాటుకూసుమంచి: సాగర్ డ్యామ్ నుంచి ఎడమ కాల్వ ద్వారా మండలంలోని పాలేరు రిజర్వాయర్కు కృష్ణా జలాలు చేరే మార్గంలో నాయకన్గూడెం వద్ద ఉన్న ఇన్ఫాల్ కాల్వ గేట్ల మరమ్మతుకు మోక్షం లభించింది. ఈ కాల్వ వద్ద 1969లో రెండు గేట్లను అమర్చారు. ఆతర్వాత అప్పుడప్పుడు చిన్నచిన్న మరమ్మతులు తప్ప ఇతర పనులు చేపట్టలేదు. కాలక్రమంలో వీటి నిర్వహణలో ఇబ్బంది వస్తుండడంతో, నీరు విడుదలైనప్పుడు అవాంతరం ఎదురైతే పెనుప్రమాదం జరిగే అవకాశముంది. ఈనేపథ్యాన ఒక గేటుకు మరమ్మతు చేయాలని, ఇంకో గేట్ స్థానంలో కొత్తది అమర్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇన్ఫాల్ కాల్వ గేట్లను గురువారం అధికారులు తొలగించారు. భారీ క్రేన్ల ద్వారా వీటిని తొలగించే క్రమాన ఖమ్మం – సూర్యాపేట పాత రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ఈఈ అనన్య పర్యవేక్షణలో ఏఈ శ్రీరాం ఆధ్వర్యాన గేట్ల తొలగింపు చేపట్టగా, త్వరలోనే ఒకటి కొత్తది అమర్చడమే కాక మరొకటి మరమ్మతు చేయించి బిగిస్తామని తెలిపారు. -
పంటల సాగులో ప్రథమ స్థానం
● చింతకాని సభలో రైతుభరోసా, మొక్కజొన్న రైతులకు నిధుల విడుదల ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చింతకాని: దేశంలో అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానాన నిలిచిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2.83 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద ఈనెల 30న జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి గురువారం కలెక్టర్ దివాకర టీ.ఎస్., సీపీ సునీల్దత్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరా నియోజకవర్గ కేంద్రంగా రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేయగా, ఇప్పుడు మధిర నియోజకవర్గం చింతకాని సభలో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను సీఎం రేవంత్రెడ్డి విడుదల చేయనున్నారని తెలిపారు. అంతేకాక మొక్కజొన్న అమ్మిన రైతులకు కూడా ఇదే వేదికపై నగదు జమ చేస్తామని వెల్లడించారు. ఈ సభ ఆవరణలో 28, 29వ తేదీల్లో 150 స్టాళ్లతో రైతు ఎగ్జిబిషన్ ఏర్పాటుచేస్తుండగా, పనిముట్లు, విత్తనాలు, ఎరువులను సమకూర్చి రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు నివృత్తి చేస్తారని తెలిపారు. త్వరలోనే ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహించటంతో రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగైందని, దీన్ని 10లక్షల ఎకరాలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుమ్మల చెప్పారు. త్వరలోనే వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాతావరణ పరిస్థితులు గందరగోళంగా ఉన్నందున రైతులు ఏడు రకాల వరితో పాటు పప్పు దినుసులను సాగు చేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో యూరియా ఆధారంగా పరిశ్రమలు నడిపే కొందరు రైతుల పేరిట కొనుగోలు చేస్తుండగా, ఇంకొందరు బ్లాక్లో అమ్ముకుంటున్నారని చెప్పారు. మరికొందరు రైతులు గత సీజన్లోనే యూరియా నిల్వ చేసుకున్నారన్నారు. ఈమేరకు యూరియా యాప్ ద్వారా విక్రయిస్తుండగా, ఈ విధానాన్ని కేంద్రప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. కాగా, జిల్లా సమగ్రాభివృద్ధికి తార్కాణంగా నిలిచే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, మార్కెట్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అంబటి వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, కన్నెబోయిన గోపి, కంచం ద్రౌపతి, తాళ్లూరి స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాభవాని, నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలకులు విద్యారంగంపై నిర్లక్ష్యాన్ని విడనాడి కొఠారి కమిషన్ సిఫారసుల ఆధారంగా బడ్జెట్ పెంచడంతో పాటు నూతన జాతీయ విద్యా విధానం, నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, అవసరమైన ప్రాంతాల్లో నూతన పాఠశాలలు తెరవాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆతర్వాత వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షమీ, కోశాధికారి వల్లంకొండ రాంబాబు, కార్యదర్శులు, నాయకులు ఉద్దండు షరీఫ్, విజయ్ కుమార్, రమణ, శ్రీనివాసరావు, వీరయ్య, గురవయ్య, లక్ష్మీకుమారి, హైమారాణి, మంగీలాల్, కృష్ణారావు, వీరాస్వామి, ప్రసాదరావు, భాస్కర్, జేవీ., రంగారావు, బాబు, బండి నరసింహారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యాన నిరసన -
టెన్షన్ వద్దు.. ‘సర్’!
● ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ నింపే అవకాశం ● ఇంట్లో కూర్చునే సులువుగా వివరాల ఽధ్రువీకరణ ● ఓటరు జాబితా, ఆధార్ కార్డులో పేర్లు సరిపోతే చాలు.. ఖమ్మం మయూరిసెంటర్: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(ఎస్ఐఆర్)పై చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఇంటింటా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మొదలైంది. ఓటర్ల జాబితాలో పారదర్శకత, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, ఓటర్లు తమ వివరాలను ఽధ్రువీకరించుకోవడానికి బూత్ లెవల్ అధికారుల(బీఎల్ఓ) కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం కల్పించిన వెసలుబాటు ఆధారంగా ఇంటి నుంచే స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్ ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేయొచ్చు. సులభంగా, అత్యంత సురక్షితంగా, వేగంగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముండడంతో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆధార్ ఈ–సైన్ వివరాలన్నీ సరిగ్గా పూరించాక, సిస్టమ్ మిమ్మల్ని ఈ–సైన్ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ ఆధారంగా వచ్చే ఓటీపీ ద్వారా ఫామ్ను సబ్మిట్ చేయాలి. ప్రక్రియ పూర్తయ్యాక మీ ఫామ్ విజయవంతంగా అప్లోడ్ అయినట్లు మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎవరు ఉపయోగించుకోవచ్చు? ఓటర్ల జాబితా, ఆధార్ కార్డులోని పేరు కచ్చితంగా సరిపోలిన ఓటర్లందరూ ఈ ఆన్లైన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓటర్లకు తమ ఓటర్ ఐడీ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. ఒకవేళ మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోతే మొదటగా అదే పోర్టల్లో ‘ఫారం–8’పూరించి మొబైల్ నంబర్ను లింక్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ వీలుకాని పక్షంలో బూత్ లెవల్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఫామ్లు అందజేస్తారు. అయితే ఆన్లైన్ విధానం అత్యంత సులభమైనది, గోప్యతతో కూడినది కావడంతో ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటర్లకు అవగాహన ఎస్ఐఆర్–2026 ప్రక్రియపై అధికారులు ఓటర్లకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ ఓటర్కు రెండేసి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయడంతో పాటు వాటిని నింపే విధానాన్ని వివరిస్తున్నారు. రెండు ఫారాలతో పాటు నమూనా పత్రాన్ని కూడా అందజేస్తున్నారు. దీంతో పాటు ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ నింపడానికి ఉన్న అవకాశాన్ని కూడా తెలియజేస్తున్నారు.ఓటర్లు తొలుత భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in లోకి వెళ్లాలి. అక్కడ ఓటర్ ఐడీ నంబర్ / రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేసి, మొబైల్కు వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ ద్వారా పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత స్క్రీన్పై కనిపించే ఆప్షన్లలో "Fill Enumeration Form' ను ఎంచుకోవాలి. వెబ్పేజీలో మీ పాత రికార్డులకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అవి సరిపోల్చుకుంటూ అడిగిన అవసరమైన తాజా సమాచారాన్ని నమోదు చేయాలి. -
బాధ్యతలు స్వీకరించిన జిల్లా జడ్జి నాగరాజు
ఖమ్మం, లీగల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎం.నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా జడ్జిగా ఉన్న జి.రాజగోపాల్ హైకోర్టు రిజిస్ట్రార్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్)గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు నియమితులయ్యారు. ఈమేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర, నాణ్యమైన న్యాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎడ్లపల్లి రమేష్ కొప్పుల రవితో పాటు పలువురు న్యాయవాదులు జిల్లా జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాదక ద్రవ్యాలతో దుష్పరిణామాలు ఖమ్మంరూరల్/ఖమ్మంలీగల్: మాదక ద్రవ్యా ల వినియోగంతో రుగ్మతలు ఎదురుకావడమే కాక శారీకర, సామాజిక దుష్పరిణామాలు వస్తాయని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఈమేరకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యాన గురువారం జిల్లా కారాగారంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ, సీఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. అనంతరం జైలు ఉద్యోగులు, ఖైదీలతో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శ్రీధర్, జైలర్ సక్రూ, డిప్యూటీ జైలర్ హనుమంతరావు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కండె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో కొత్తగా గుర్తించిన వీధి వ్యాపారులకు మెప్మా ఆధ్వర్యాన గుర్తింపు కార్డులు జారీ చేయడమే కాక పీఎం స్వనిధి రుణాలను మంజూరు చేశారు. ఖమ్మంలోని జెడ్పీ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేఎంసీ, మెప్మా, లీడ్ బ్యాంక్, ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొని వీధి వ్యాపారులకు కార్డులు అందజేశారు. జిల్లాలో కొత్తగా 1,100 మందిని గుర్తించామని అధికారులు వెల్లడించారు. పీఎం స్వనిధి పథకం ద్వారా మొదటి, రెండు, మూడో విడత రుణాలను అర్హులందరికీ అందజేస్తున్నట్లు కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాక గతంలో రుణాలు పొంది డిజిటల్ చెల్లింపుల ద్వారా వ్యాపారాలు చేస్తున్న పది మంది వ్యాపారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ ఎస్.సుజాత, ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, టీఎంసీ జి.సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఖమ్మంసహకారనగర్: ఎస్సెస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. జిల్లా నుంచి 956 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 833 మంది(87.13 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 536 మంది, బాలికలు 297 మంది ఉన్నారు. ఎవరైనా రీ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే వచ్చేనెల 5వ తేదీలోపు పాఠశాల ద్వారా ఆన్లైన్లో రూ.వేయి, రీ కౌంటింగ్ కోసం పేపర్కు రూ.500 చొప్పున చెల్లించాలని డీఈఓ సదానందం సూచించారు. -
‘సర్’.. మొదలైంది
● ఎన్యుమరేషన్ ఫారమ్ పూర్తిచేసిన కలెక్టర్ దివాకర ● ప్రక్రియపై ఉద్యోగులకు సూచనలుఖమ్మంసహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వచ్చేనెల 24 వరకు ఇంటింటి ఎన్యుమరేషన్ను కీలకంగా పరిగణించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. ఇంటింటా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ జిల్లాలో గురువారం మొదలైంది. ఈ సందర్భంగా ఖమ్మం 46వ డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్కు గురువారం బీఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫామ్ అందించగా, ఆయన వివరాలు నమోదుచేసి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఓటర్ల వివరాలు సేకరించి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇది సమర్పించకపోతే జాబితాలో పేరు ఉండదనే విషయాన్ని వివరించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పరిశీలన కొణిజర్ల: సమగ్ర ఓటరు సవరణ(ఎస్ఐఆర్) కొణిజర్ల మండలంలో ప్రారంభమైంది. మండలంలోని 60 పోలింగ్ బూత్ పరిధిలో 75శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, ఇంటింటా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని బీఎల్ఓలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లిపాడులో ఫామ్ల పంపిణీని అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ పరిశీలించి బీఎల్ఓలకు సూచనలు చేశారు. మండలంలో 4,381మంది ఓటర్ల వివరాలు అనామలీస్ జాబి తాలో పెట్టినందున వారి ఆధారాలు సేకరించి ధ్రువీ కరించుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ నారపోగు అరుణ, ఆర్ఐలు రమేష్, నరేష్, ఏఎస్ఓ తిరపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు భరోసా’కు రెడీ..
ఈనెల 15వరకు ‘ఽభూభారతి’లో నమోదైన వారికి అమలుఖమ్మంవ్యవసాయం: అన్నదాతల పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు భరోసా’ పథకం అమలుకు మార్గదర్శకాలను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. ఎకరాకు రూ.6వేల చొప్పున రెండు సీజన్లలో కలిపి రూ.12 వేలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. ప్రస్తుత వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయా న్ని ఈనెల 30న చింతకానిలో జరిగే సభలో సీఎం రేవంత్రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు విధివిధానాలు వెల్లడయ్యాయి. వివరాలు సమర్పించండి ప్రస్తుత వానాకాలం రైతు భరోసా పథకం అందాలంటే ఈనెల 15 నాటికి భూభారతి పోర్టల్లో భూమి వివరాలు నమోదై ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నుంచి అనుమతులు జారీ అయి ఉండాలి. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన వారు కూడా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి అనుమతులు పొంది ఉండాలి. ఆయా శాఖలు అర్హుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆపై ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున ఖాతాలో జమ చేస్తుంది. ఈమేరకు అర్హులైన రైతుల రికార్డులను ఈనెల 30వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశించింది. జిల్లాలో మొత్తం 3.58 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా నమోదయ్యే అవకాశముందని, వీరికి ప్రస్తుత సీజన్లో రూ.460 కోట్ల మేర నిధులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ జాబితాలోనే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన 3,906 మంది ఉన్నారు. -
సభకు సమీకరణ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద ఈనెల 30న నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. సభతో పాటు రైతుమేళా నిర్వహణకు సుమారు 30 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభావేదిక పైనుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సీఎం ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయనుండడం, 2లక్షల మంది జనాన్ని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడే 28, 29వ తేదీల్లో రైతుమేళా నిర్వహించనుండగా ఏర్పాట్లను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర టీ.ఎస్. పరిశీలించారు. రైతు మేళా.. ఆపై సభ మత్కేపల్లి క్రాస్ వద్ద ఈనెల 30న నిర్వహించే సభకు ‘రైతు ఆశీర్వాద సభ’గా నామకరణం చేశారు. తొలుత 28, 29వ తేదీల్లో సభా ప్రాంగణంలో రైతుమేళా నిర్వహిస్తారు. ఇందుకోసం మొత్తం 30 ఎకరాల స్థలంలో ఐదు ఎకరాలను స్టాళ్ల ఏర్పాటుకు కేటాయించారు. మరో ఐదు ఎకరాలు సీఎం కాన్వాయ్, ఫ్లయింగ్ జోన్కు కేటాయించారు. మిగిలిన 20 ఎకరాల్లో సభావేదిక ఇతర ఏర్పాట్లు చేస్తారు. కాగా, సభా వేదిక వద్దే కాక కలెక్టరేట్ వద్ద రెండు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. జన సమీకరణకు ప్రణాళిక సీఎం హాజరయ్యే సభకు జనాన్ని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యాన సభ జరగనున్నా, జన సమీకరణ బాధ్యత మాత్రం కాంగ్రెస్, అనుబంధ సంఘాలు భుజాలపై వేసుకున్నాయి. మధిర నియోజకవర్గం నుంచి లక్ష మంది, వైరా నుంచి 50 వేల మందితో పాటు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి మరో 50 వేల మందిని సమీకరించేలా దృష్టి సారించారు. ఇందుకోసం 3,500 బస్సులు సమకూర్చాలని ఆర్టీసీకి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇవి కాక ప్రైవేట్ వాహనాలు కూడా రానుండగా, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 150 ఎకరాలను కేటాయించారు. ప్రత్యేక దృష్టి రైతు ఆశీర్వాద సభ విజయవంతంపై మంత్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏర్పాట్లపై పలుమార్లు అధికారులకు సూచనలు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్రెడ్డి మొదటిసారి మధిర నియోజకవర్గానికి వస్తుండడంతో భారీ జన సమీకరణకు సిద్ధమవుతున్నారు. వైరాలో రుణమాఫీ, మధిరలో రైతు భరోసా చింతకానిలో జరిగే సభావేదిక పైనుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ‘రైతుభరోసా’ నిధులను సీఎం విడుదల చేయనున్నారు. మొత్తం రూ.9వేల కోట్ల నిధులు విడుదల కానున్నాయి. గతంలో వైరా నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్రెడ్డి రూ.21వేల కోట్ల రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతుభరోసా నిధుల విడుదలకు జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద ఎంపిక చేసిన స్థలంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సభ నిర్వహించే 30 ఎకరాలతోపాటు మరో 150 ఎకరాల భూమిని కూడా డోజర్లు, రోలర్లతో చదును చేయిస్తున్నారు. రైతుమేళా ప్రారంభానికి రెండు రోజుల సమయమే ఉండడంతో వేదికలకు కావాల్సిన సామగ్రి తరలిస్తున్నారు. ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసే స్టాళ్లలో వ్యవసాయ పనిముట్లు, వివిధ రకాల విత్తనాలు, ఇతర వ్యవసాయ సంబంధిత పరికరాలను ప్రదర్శిస్తారు. ఈనెల 28, 29వ తేదీల్లో చింతకాని మండలంలో రైతు మేళా -
నేటి నుంచి సర్
ఖమ్మం సహకారనగర్: జిల్లా ప్రజలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి వివరాలు వెల్లడించారు. జిలాల్లో ‘సర్’కు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేయగా, గురువారం నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపడుతారని తెలిపారు. వీరి వెంట పార్టీలు నియమించిన బీఎల్ఏలు కూడా వెళ్తూ ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు సహకరిస్తారని చెప్పారు. బీఎల్ఓలకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేయగా, బీఎల్ఏలు తమ పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు. విదేశాలు, ఇతర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని, లేదంటే వారి కుటుంబీకులు కూడా ఇవ్వొచ్చని తెలిపారు. వీడియోలు, కరపత్రాలతో అవగాహన ఎన్యుమరేషన్ ఫారాలు నింపే విధానంపై ట్యుటోరియల్ వీడియోలు సిద్ధం చేశామని, ఫారాలతో పాటు కరపత్రాలు కూడా ఇస్తామని కలెక్టర్ తెలిపారు. మ్యాపింగ్ పూర్తయిన వారు కూడా తప్పనిసరి ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాలన్నారు. 2002 ఎస్ఐఆర్ జాబితాలో దేశంలో ఎక్కడ ఓటు నమోదైనా, ఆ వివరాలను ప్రస్తుతం ఉపయోగించవచ్చన్నారు. ముఖ్యంగా వివాహం అనంతరం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న మహిళలకు ఇది ఉపయోగకరమని తెలిపారు. రెండేసి చోట్ల ఓటు ఉన్న వారి గుర్తింపు నిరంతరం జరుగుతుందని, ఒకే పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి వివరాలతో ఉన్న ఎంట్రీలను ఈఆర్ఓ నెట్ ద్వారా గుర్తించి, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకుంటారని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు, తొలగించనుండగా, అర్హులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అన్సారీ పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఓటర్ల జాబితా ప్రక్షాళనలో అత్యంత కీలకమైన ఇంటింట ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గురువారం మొదలుకానుంది. ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల గణన చేపడుతారు. ఇప్పటికే బీఎల్ఓలు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను సరిపోల్చి మ్యాపింగ్ చేశారు. జిల్లాలో దాదాపు 77 శాతం పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, వీరు తమ ఇంటికి వచ్చే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి అందించాల్సి ఉంటుంది. మ్యాప్ కాని వారు ఎన్యుమరేషన్ ఫామ్తోపాటు 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు జరిగే ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. మ్యాపింగ్లో తేడాలు జిల్లాలో ఓటర్ల డేటా మ్యాపింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు 9,65,407 మంది ఓటర్ల(77.62 శాతం) వివరాలు మ్యాపింగ్ కాగా, ఇంకా 2,78,374 మంది మిగిలిపోయారు. అలాగే, 1,81,805 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నియోజకవర్గాల వారీగా ఖమ్మంలో అత్యధికంగా 49,510 ఓటర్ల పేర్లలో తేడాలు ఉన్నాయి. ఆ తర్వాత పాలేరులో 41,206మంది, మధిరలో 32,762మంది, సత్తుపల్లిలో 30,085 మంది ఓటర్లు, వైరాలో 28,242 మంది ఓటర్ల పేర్లలో వ్యత్యాసాలు ఉండగా.. వీటిని సరిచేస్తూ వివరాలను నూరు శాతం పక్కాగా నమోదుకు ఇంటింటి సర్వే ఉపయోగపడనుంది. ప్రతీ ఓటరుకూ రెండేసి పత్రాలు ఓటర్లకు ఇచ్చేందుకు గాను బీఎల్ఓలకు 24,87,562 ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో ఈ ఫారాలు పంపిణీ చేస్తారు. బీఎల్ఓలు ప్రతీ ఇంటికి వెళ్లి తాళం వేసి ఉంటే కనీసం మూడు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. ఓటరుకు ఎన్యుమరేషన్ పత్రాలు రెండు ప్రతులు అందజేస్తారు. ఓటరు అందులో వివరాలను నింపాక సంతకం చేస్తే, బీఎల్ఓ ఒకటి తీసుకుని, రెండో ప్రతిని రశీదు సహా ఓటరుకు అందజేస్తారు. ఇక ఆన్లైన్ ద్వారా voters.eci.gov.in పోర్టల్లో ఓటీపీ ఽధ్రువీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేసే వెసలబాటు ఉంది. పార్టీలకూ భాగస్వామ్యం ఓటర్ల నమోదు, సవరణలో తప్పులు జరగకుండా, పారదర్శకత పెంచేందుకు రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం భాగస్వామ్యం కల్పించింది. ‘సర్’ పర్యవేక్షణకు రాజకీయ పార్టీలు బీఎల్ఏ (బూత్ లెవెల్ ఏజెంట్లు)లను నియమించే వెసులుబాటు కల్పించారు. దీంతో జిల్లాలోని 1,460 పోలింగ్ కేంద్రాల పరిధిలో వివిధ పార్టీల తరఫున మొత్తం 4,720 మంది బీఎల్ఏలను నియమించారు. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్ తరఫున 1,431 మంది, బీఆర్ఎస్ తరఫున 1,449 మంది ఉన్నారు. ఇక బీజేపీ తరఫున 1,188 మంది, సీపీఎం తరఫున 652 మందిని నియమించారు. ఈ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బీఎల్ఓల చేపట్టే ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పరిశీలిస్తూ, ఓటర్లకు కావాల్సిన సలహాలు ఇస్తారు. జూలె 31న ముసాయిదా జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అందులో పేరు లేకున్నా, ఇతర అభ్యంతరాలపై ఆగస్టు 30వరకు దరఖాస్తులు స్వీకరించి, వీటిని సెప్టెంబర్ 28 నాటికి పరిష్కరిస్తారు. ఆపై అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. అయితే, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండవని అధికారులు వెల్లడించారు.ఓటర్ల ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్ఓలు నియోజకవర్గం మొత్తం ఓటర్లు మ్యాపింగ్ శాతం అన్ మ్యాపింగ్ ఖమ్మం 3,28,203 1,78,323 54.33 1,49,880 పాలేరు 2,45,885 2,08,393 84.75 37,492 మధిర 2,26,126 1,95,593 86.5 30,533 వైరా 1,96,475 1,64,345 83.65 32,130 సత్తుపల్లి 2,47,092 2,18,753 88.53 28,339 మొత్తం 12,43,781 9,65,407 77.62 2,78,374జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 29 మంది ఏఈఆర్ఓలు, 30 మంది జిల్లా /అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లు, 153 మంది సూపర్ వైజర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. వీరి సమన్వయంతో 1,460 మంది బూత్ స్థాయి అధికారులు సర్వే చేపడుతారు. జిల్లాలోని మొత్తం 1,460 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 822 ప్రాంతాలలో ఇంటింటి సర్వే సాగనుంది. -
ఎంపీగా రెండేళ్ల పదవీకాలం పూర్తి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం లోక్సభ సభ్యుడిగా రామసహాయం రఘురాంరెడ్డి పదవీకాలం గురువారంతో రెండేళ్లు పూర్తవుతోంది. గడిచిన 24నెలల కాలంలో జరిగిన ఏడు పార్లమెంట్ సమావేశాల్లోనూ పాల్గొన్న ఎంపీ రికార్డు స్థాయిలో 78.5 శాతం హాజరు నమోదు చేసుకున్నారు. అంతేకాక నియోజకవర్గానికి సంబంధించి 130 ప్రశ్నలను సభ దృష్టికి తీసుకెళ్లారు. పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ పునరుద్ధరణకు ఆర్థిక సాయం, పోలవరం ముంపు బాధితులకు న్యాయం, ఉభయ జిల్లాల్లో మిర్చి రైతుల సమస్యలే కాక చారిత్రక నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఎంపీ లాడ్స్ కింద రూ.9.42 కోట్లు, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.18 కోట్లు, ఎస్డీఎఫ్ కింద రూ.4 కోట్ల నిధులను నియోజకవర్గంలో సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, చేతిపంపుల ఏర్పాటు తదితర 176 పనులను మంజూరు చేశారు. అలాగే, ఖానా పురం వద్ద రూ.3.47 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి చొరవ చూపారు. పేదలకు వైద్య సాయం అందేలా సీఎంఆర్ఎఫ్ద్వారా 1,864 మందికి రూ. 5,65,81,500 విలువైన సాయం మంజూరు చేయించారు. ఇక అత్యవసర చికిత్సల కోసం 41 మందికి రూ.79.80లక్షల ఎల్ఓసీలను కేటాయించారు.పలు అంశాలు పార్లమెంట్లో ప్రస్తావించిన రఘురాంరెడ్డి -
జూలై నాటికి ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పూర్తి
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనుల్లో వేగం పెంచి జూలై నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఫ్యాక్టరీ పనులను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించాక మాట్లాడారు. అంజనాపురంలో ఫ్యాక్టరీ మొదలైతే ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు దూరాభారం తగ్గుతుందని తెలిపారు. తహసీల్దార్ ఎన్.అరుణ, ఎంపీడీఓ ఆర్.ఉపేంద్రయ్య, ఆర్ఐ నరేష్, సర్పంచ్ ఏ.కమలమ్మ, గోద్రెజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అక్రమంగా ఏపీ నుంచి ఇసుక రవాణా
రఘునాథపాలెం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం వైపు అనుమతి లేకుండా తరలిస్తున్న 112 టన్నుల ఇసుకను రఘునాథపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఇసుక రవాణాకు ఉపయోగించిన మూడు లారీలు, ఎస్కార్ట్గా వినియోగించిన కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఠా సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం వివరాలు వెల్లడించారు. మండలంలో సోమవారం చేపట్టిన తనిఖీల్లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట రీచ్ నుంచి అనుమతి లేకుండా మూడు లారీల్లో ఇసుకను ఖమ్మం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు నందిగామ, అన్నసాగర్ ప్రాంతాలకు చెందిన పాములపాటి గోపాలకృష్ణ, ఉమ్మినేని గోపి, బండ్ల కృష్ణ, దాసరి రామకృష్ణ, బండ్ల రామకృష్ణతో పాటు లారీ డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేయడమే కాక మూడు లారీలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఏపీలో తక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి, ఖమ్మం సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల్లో పాములపాటి గోపాలకృష్ణపై తెలంగాణ, ఏపీలో ఇప్పటికే 12 కేసులు ఉండగా, పలు కేసుల్లో శిక్ష అనుభవించినా తీరు మారలేదని తెలిపారు. అలాగే దాసరి కృష్ణపైనా కేసులు ఉన్నాయని సీఐ వెల్లడించారు.మూడు లారీలు, ఎస్కార్ట్ కారు స్వాధీనం -
అంగన్వాడీల్లో హడావుడి!
● పదోన్నతులు, బదిలీలకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ● ఇది పూర్తయ్యాక ఖాళీల భర్తీ కూడా.. ● త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు కసరత్తుఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియ తుది దశకు చేరింది. అంగన్వాడీ హెల్పర్లు(ఆయా)గా పనిచేస్తూ అర్హత కలిగిన వారికి టీచర్లుగా పదోన్నతి కల్పించడమే కాక బదిలీల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా పూర్తిచేశాక, మిగిలిన ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్ల డించాయి. పరిశీలన పూర్తి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదోన్నతి, బదిలీలకు సంబంధించి ఈనెల 10నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. గడువు ముగిసిన నేపథ్యాన దరఖాస్తులన్నీ క్రోడీకరించి, అర్హుల జాబితా సిద్ధం చేశారు. రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంపై దృష్టి సారించారు. పీజీలు చేసిన వారూ రేసులో..! ఒకప్పుడు అంగన్వాడీ పోస్టులకు కనీస అర్హత పదో తరగతిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండగా, ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న హెల్పర్లు కూడా టీచర్లుగా పదోన్నతికి అర్హత సాధించారు. అయితే, ఇంటర్ పూర్తయిన వారే కాక ఇంకా ఉన్నత చదువులు చదివిన వారు సైతం హెల్పర్లుగా పనిచేస్తుండడం విశేషం. ఈనేపథ్యాన పీజీ పూర్తి చేసిన వారు, 10 – 18 ఏళ్ల అనుభవం కలిగిన వారూ పదోన్నతి రేసులో ఉన్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ జిల్లాలో ప్రస్తుతం బదిలీల ద్వారా ఐదుగురు టీచర్లు, ఐదుగురు హెల్పర్లకు స్థానం కలుగుతుంది. అలాగే, 21 మంది హెల్పర్లు, టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశముంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జిల్లాలోని కేంద్రాల వారీగాపై ఖాళీలపై స్పష్టత రానుంది. తద్వారా రోస్టర్ ఖాళీల వివరాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆమోదంతో ప్రకటించి, రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రాజెక్ట్ టీచర్ హెల్పర్ కల్లూరు 28 121 కామేపల్లి 17 127 ఖమ్మం రూరల్ 24 132 ఖమ్మం అర్బన్ 10 43 మధిర 35 98 సత్తుపల్లి 24 44 తిరుమలాయపాలెం 05 105జిల్లాలో సీఎం పర్యటన, ఎస్ఐఆర్ తదితర కారణాలతో ఉన్నతాధికారులు వరుస సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. దీంతో అంగన్వాడీల పదోన్నతులు, బదిలీల ఫైల్ కదలికలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే ఈ ఫైల్కు ఆమోదం లభిస్తుందని చెబుతున్నారు. ఆపై కలెక్టర్, అదనపు కలెక్టర్ సూచనల మేరకు అధికారులు ప్రక్రియ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. -
కేసీఆర్ మళ్లీ వస్తేనే ‘సీతారామ’
● ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు ప్రయోజనం లేదు ● బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎస్ఐఆర్ శిక్షణలో మాజీ మంత్రి కేటీఆర్సాక్షిప్రతినిధి, ఖమ్మం/సత్తుపల్లి: ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుచుకుంటాం.. తద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఖమ్మం జిల్లాకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా దుర్మార్గమైన పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలి అని జనం కోరుకుంటున్నారు.’ అని మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. సత్తుపల్లిలో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తలకు ‘ఎస్ఐఆర్’పై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రెండుమెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కల్లూరు, సత్తుపల్లిల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని పేర్కొన్నారు. షాపుల్లో యూరియా స్టాక్ లేకపోగా, యాప్ పెట్టారని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించాం.. కేసీఆర్ హయాంలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ వెల్లడించారు. రూ.10 వేల కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు రూ.8వేల కోట్లు తాము ఖర్చు చేస్తే, 2024 ఆగస్ట్ 15న మంత్రి తుమ్మలతోపాటు ఇతర మంత్రులు వెళ్లి నీళ్లు చల్లుకున్నారన్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ వచ్చాకే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ఖాయమని, తద్వారా సత్తుపల్లిలో 90 వేల ఎకరాల స్థిరీకరణ జరుగతుందని పేర్కొన్నారు. జిల్లాకు ఒనగూరిందేమిటి..? గత ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ గెలిచి, ఆ పార్టీ ప్రభుత్వమే ఏర్పడి రెండున్నరేళ్లు అయినా జిల్లాకు చేసిందేమిటని ప్రజలు ఆలోచించాలని సూచించారు. జిల్లా మంత్రులకు ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ ఇలా కీలకమైన శాఖలు ఉన్నా ప్రజలకు ఏం ఒనగూరిందో ఆలోచన చేయాలన్నారు. రుణమాఫీ 40 పైసలే జరగగా, ఇంకా 60 పైసలు కాలేదన్నారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు అద్భుతంగా చేస్తామని ప్రభుత్వం చెబితే.. రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద 30,40 రోజులు పడిగాపులు కాశారని, కనీసం సంచులు ఇచ్చే దిక్కు కూడా లేదని పేర్కొన్నారు. పేదల కడుపు కొట్టారు.. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేసిన ఒక్క మంచి పని లేదని కేటీఆర్ తెలిపారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను నేలమట్టం చేశారని పేర్కొన్నారు. మంత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డుగా ఉన్నాయని, అందమైన విల్లాలకు అడ్డొస్తున్నాయని వేయి ఇళ్లు తొలగించి పేదల కడుపు కొట్టారని విమర్శించారు. మరోపక్క బుగ్గపాడులో దోపిడీ జరుగుతుండగా, రైతులకు రైతుబంధు రాకపోగా, యూరియా దొరకడం లేదని, అర్హులకు పింఛన్లు రావడం లేదని తెలిపారు. అభయహస్తం అంటూ చెప్పిన కథలు నమ్మి కాంగ్రెస్ను గెలిపించినందుకు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపడితే, ఈ ప్రభుత్వం వచ్చాక పనులు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటామని తెలిపా ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, దిండిగాల రాజేందర్, బొమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
టీపీఎస్లకు ఎస్!
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రప్రభుత్వం విద్యావ్యవస్థల్లో తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల(టీపీఎస్) ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో నర్సరీ నుంచి ఇంటర్ వరకు బోధించనుండగా, ఉమ్మడి జిల్లాలో వచ్చే సంవత్సరం నాలుగు టీపీఎస్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో టీపీఎస్ల ఏర్పాటుకు సరిపడా స్థలం, భవనాలు ఉన్న నాలుగు పాఠశాలలను ఇప్పటికే గుర్తించగా, పాఠశాలల విస్తీర్ణం, తరగతి గదులు, ఏ మండలం, ఏ నియోజకవర్గం పరిధిలో ఉందనే వివరాలో జిల్లా విద్యాశాఖ రూపొందించిన నివేదికలను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు. ఈ నివేదికల ఆధారంగా పరిశీలించడమే కాక ఇంకా ఏమైనా వసతులు కల్పించాలన్న అన్న అంశాన్ని తేల్చేందుకు డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఈమేరకుక్షేత్రస్థాయి పరిశీలన కోసం ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పి.మదన్మోహన్ను నియమించారు. దీంతో ఆయన రెండు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. నివేదికల ఆధారంగా పరిశీలన టీపీఎస్ల ఏర్పాటుకు మధిర మండలం మహదేవపురం, ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూసుమంచి హైస్కూల్తో పాటు భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి హైస్కూల్ను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలతో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా జేడీ మదన్మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ప్రత్యేక ఫార్మాట్లోని వివరాలను సరిపోల్చుకుంటున్నారు. ఈ పరిశీలనలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూడా పాల్గొంటూ, ఇంకా ఏమేం నిర్మాణాలు చేపట్టాలి, అందుకు ఎంత సమయం పడుతుందో కూడా అంచనా వేస్తున్నారు. ఈమేరకు కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశీలించగా, బుధవారం అధికారులు ఖమ్మంలోని నయబజార్ ప్రభుత్వ హైస్కూల్ను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఆవరణలోని ప్రీ ప్రైమరీ పాఠశాల, ప్రైమరీ పాఠశాల, హైస్కూల్ స్కూల్, భవిత కేంద్రాన్ని సందర్శించడమే కాక విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులు, గదులు, టీపీఎస్ మొదలైతే పెరిగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన వసతులపై చర్చించారు. ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులోని హైస్కూల్లో 260, ప్రైమరీ స్కూల్లో 160, భవిత కేంద్రంలో 24మంది, జూనియర్ కళాశాలలో 450మంది వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈక్రమాన విభాగాల వారీగా ఎన్ని భవనాలు, గదులు ఉన్నాయి, ఎంత ఫర్నీచర్ ఉంది.. ఇంకా ఏమేం కావాలో అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.16.05కోట్ల నిధులతో టీపీఎస్ ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చనున్నట్లు తెలిసింది. ఈ పరిశీలనలో జేడీ మదన్మోహన్ వెంట డీఈఓ కార్యాలయం ఏడీ చావా శ్రీనివాసరావు, ఈడబ్ల్యూఐడీసీ(ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఈఈ బుగ్గయ్య, ఏఈ సురేందర్రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి, పాఠశాల హెచ్ఎం ఉషారాణి, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు కార్యాచరణ -
కోలాహలంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ నృసింహుడి గిరి ప్రదక్షణ వైభవంగా సాగింది. స్వామి జన్మ నక్షత్రం(స్వాతి నక్షత్రం) సందర్భంగా బుధవారం ఖమ్మంలోని స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్ట పైనుంచి కిందకు తీసుకొచ్చి పురవీధుల్లో ఊరేగిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామిని తిరిగి ఆలయానికి చేర్చాక, రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని పండితులు వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ఉద్యోగులతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బీఏఎస్ను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల ఎంపికలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: దళిత పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థుల ఎంపిక కోసం కలెక్టరేట్లో బుధవారం లాటరీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బీఏఎస్ పథకం ద్వారా పేద విద్యార్థులు కార్పొరేట్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందుతోందని తెలిపారు. ఎస్సీ డీడీ జి.జ్యోతి మాట్లాడుతూ కలెక్టర్ చొరవతో ఈ ఏడాది జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థులకు సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఈవిద్యా సంవత్సరం 1వ తరగతిలో ప్రవేశానికి 255 మంది దరఖాస్తుదారుల్లో 128 మందిని, ఐదో తరగతిలో ప్రవేశాలకు 163మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ ద్వారా 131 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు ఇసుక ట్రాక్టర్ల సీజ్ తిరుమలాయపాలెం: మండలంలోని ముజాహిదిపురం పరిధి పాలేరు ఏటి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు సీజ చేశారు. అలాగే, ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీష్ తెలిపారు. గంజాయి స్వాధీనంచుంచుపల్లి: మండలంలోని రామాంజనేయ కాలనీ సమీప చెరువు కట్ట ప్రాంతంలో 108 గ్రాముల గంజాయి, ఐదుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించగా, రామాంజనేయ కాలనీకి చెందిన మబ్బు అవినాష్, దొమ్మేటి మధు, కె.సాయిగణేష్, ఖాజా పాషా, రామవరం నాగయ్యగడ్డకు చెందిన భూపతి ఉదయ్ కిరణ్ గంజాయి సేవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.5,800 విలువ చేసే గంజాయి చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. కడుపునొప్పితో చిన్నారి మృతిపాల్వంచరూరల్: కడుపునొప్పితో ఓ చిన్నారి బుధవారం మృతి చెందాడు. ఒడిశా నుంచి వల స వచ్చిన బాగు రాజేష్, సుమిత్ర మండల పరిధిలోని తోగ్గూడెం క్వారీల్లో పని చేస్తున్నారు. వీరి కుమారుడు ఒకటో తరగతి చదివే రుతిక్ కుమార్(6) మంగళవారం నుంచి తీవ్రంగా కడుపునొప్పితో బాధపడుతుండగా ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫలితం లేక వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. -
విజయ డెయిరీపై నీలినీడలు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మంలోని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ) మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. డెయిరీ ఆవరణలోని పాలు, పెరుగు ప్యాకెట్ల తయారీ విభాగాన్ని నిలిపివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ యూనిట్ నుంచి పాల ప్యాకెట్లను ఉమ్మడి జిల్లాకు సరఫరా చేయాలని ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇక్కడ అన్ని వసతులు, మిషనరీ ఉన్నా ప్యాకింగ్ నిలిపివేసి, వరంగల్ నుంచి సరఫరాకు నిర్ణయించడంతో ఖమ్మం డెయిరీ నిర్వహణ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిత్యం ప్యాకింగ్, విద్యాసంస్థలకు సరఫరా ఖమ్మం విజయ డెయిరీలో నిత్యం 10 – 12 వేల పాలు, పెరుగు ప్యాకెట్లను తయారు చేసే మిషనరీ ఉంది. ఉమ్మడి జిల్లాలో సేకరించే పాలతో ప్యాకెట్లు చేసి ప్రభుత్వ హాస్టళ్లు, విద్యాసంస్థలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన సమావేశంలో వరంగల్ యూనిట్ నుంచి పాల ప్యాకెట్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హాస్టళ్లకు సరఫరా చేయాలని ఖమ్మం అధికారులను ఆదేశించారు. అంతేకాక ఇక్కడి కాంట్రాక్టర్కే ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించగా, సదరు కాంట్రాక్టర్ సమ్మతించలేదు. దీంతో మరో కాంట్రాక్టర్ ఎంపికకు సైతం వెనకాడొద్దని చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే ఖమ్మం ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటో తెలియరావడం లేదు. 50ఏళ్ల క్రితం పదెకరాల్లో ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో వనరులు ఉండటంతో 50 ఏళ్ల క్రితం ఇక్కడ పరిశ్రమ నెలకొల్పారు. పాల శీతలీకరణ, పాలు, పెరుగు ప్యాకెట్లను తయారీ, నిల్వ కోసం ఖమ్మం రోటరీనగర్లో ప్రధాన రహదారి వెంట పదెకరాల స్థలంలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ స్థలం విలువే రూ. వందల కోట్లలో ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లా నుంచి దాదాపు 12 వేల మంది రైతులు సీజన్లో 25వేల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేయడమే కాక విక్రయించాక మిగిలిన పాలను హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి తరలిస్తారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో పరిశ్రమ ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక పాల సేకరణ పెరిగేలా పాడి గేదెల కొనుగోలుకు రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని సూచించారు. దీంతో కలెక్టర్ పర్యవేక్షణలో రూ. 2.35 కోట్లతో అభివృద్ధికి నివేదిక సిద్ధం చేశారు. ఇంతలోనే ప్యాకింగ్ సెక్షన్ను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. యూనిట్ను మరో ప్రాంతానికి తరలించి అధునాతన సాంకేతికతతో నిర్మిస్తారా.. లేక సిక్ ఇండస్ట్రీగా పరిగణించి మూసేస్తారా అన్న చర్చ మొదలైంది. -
సభకు భారీగా జన సమీకరణ
చింతకాని: చింతకాని మండలం జగన్నాఽఽథపురం క్రాస్ రోడ్డు వద్ద ఈనెల 30న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈమేరకు సభ విజయవంతానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జగన్నాఽథపురంలో బుధవారం ఆయన సభ ఏర్పాట్లపై అధికారులు, నాయకులతో సమీక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మధిర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మొదటి సీఎం సభ ఇదే అయినందున, భారీగా జనసమీకరణపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి సారించాలన్నారు. రైతులు, ప్రజలకు ఇబ్బంది రాకుండా వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అధికారులకు సైతం డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్., తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మోడల్గా మధిర నియోజకవర్గం బోనకల్: మధిర నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బోనకల్ మండలంలో రూ.21.98కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే బీటీ, సీసీ రహదారుల నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని చిరునోముల–వత్సవాయి మధ్య రూ.3.20కోట్లు, ముష్టికుంట్ల–గార్లపాడు మధ్య రూ.5.50కోట్లు, ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్లు రూ.73లక్షలతో, బోనకల్ ఆర్అండ్బీ రోడ్డు నుండి చిరునోముల వరకు రూ.3.30 కోట్లు, ముష్టికుంట్ల నుంచి సీతంపేట మధ్య రూ.4.50కోట్లు, ముష్టికుంట్ల–నాగులవంచ–చొప్పకట్లపాలెం రోడ్డు రూ.4.75 కోట్లతో చేపట్టనుండగా శంకుస్థాపన చేశాక భట్టి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, విద్యుత్ లైన్ల కోసం పలువురు భట్టికి వినతిపత్రాలు అందజేశారు. అలాగే, పల్లె దవాఖానా శిథిలావస్థకు చేరడంతో జీపీ కార్యాలయంలో వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యాధికారి ప్రియాంక ఆయన దృష్టికి తీసుకెళ్లగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీ.ఎస్., ఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ సుధాకర్, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, సర్పంచ్లు అనుమోలు చంద్రకళ, పిల్లలమర్రి నాగేశ్వరావు, ఇరిగేషన్ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డీఈ వై.పీ.రాజు, నాయకులు బంధం నాగేశ్వరావు, పైడిపల్లి కిశోర్, బంధం శ్రీనివాసరావు, బోయినపల్లి వెంకటేశ్వర్లు, అమిరేశి సీతయ్య, షాజహాన్, ముస్తఫా, నవీన్, చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ కాల్వకు గండి కొట్టిన రైతు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుదిమళ్ల రెవెన్యూలోని సాగర్ కాల్వకు ఓ రైతు గండి కొట్టాడు. దీంతో పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. గుదిమళ్లకు చెందిన ఇద్దరు రైతులు తమ పొలాలకు వెళ్లే బాట విషయమై గొడవ పడ్డారు. దీంతో ఒకరి కాల్వకు అవతలి వైపు ఉండగా, అటు వెళ్లకుండా ఇంకో రైతు తన పొలం పక్కనే కాల్వ పక్కగా గండి కొట్టాడు. ఫలితంగా ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలే కాక రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై గ్రామపెద్దలు రంగంలోకి దిగి రైతులకు నచ్చచెబుతున్నట్లు తెలిసింది. కాగా, ఎన్నెస్పీ ఏఈ సీతారాంప్రసాద్ను వివరణ కోరగా, పంట కాల్వకు, పక్కనే దారికి గండి పెట్టిన విషయం తమ దృష్టికి రాగానే పరిశీలించానని తెలిపారు. మూడు రోజుల్లోగా బాధ్యులే గండి పూడ్చకపోగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


