breaking news
Khammam District Latest News
-
ఓటు కోసమే..
సత్తుపల్లి మండలం కాకర్లపల్లి మా గ్రామం. నేను హైదరాబాద్లో ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్నా. నాకు ఐదు నెలల బిడ్డ ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. –ఈర్ల హరిత, బుల్లితెర నటి, కాకర్లపల్లి ఈ నెల 17న పోలింగ్ ఉందని గ్రామస్తులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అమెరికా నుంచి వచ్చా. ఎంతో సంతోషంగా ఉంది. – చీకటి శ్రీనివాసరావు, ఎన్ఆర్ఐ, అన్నారుగూడెం నేను హైదరాబాద్లో హోటల్ నిర్వహిస్తున్నాను. ఓటు వేసేందుకు కుటుంబ సమేతంగా వచ్చా. ఓట్ల రోజు నా స్నేహితులంతా కలిశారు. ఓటు వేయటం మా ఊరివాడిగా నా బాధ్యత. చాలా ఆనందంగా ఉంది. – చెరుకుమళ్ల రామారావు, కారేపల్లి -
బారులుదీరిన ఓటర్లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 88.84 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు, నామినేషన్లు దాఖలు కానివి మినహా 168గ్రామపంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. కల్లూరు మండలం చెన్నూరు, పెనుబల్లి మండలం సూరయ్య బంజర తండాలో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలుకాగా, పోలింగ్బూత్ల వద్ద ఓటర్లు బారులు దీరారు. వృద్ధులు, మహిళలు, యువత అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, మొదటి విడత ఎన్నికల్లో 90.08శాతం, రెండో విడతకు వచ్చే సరికి మరింత పెరిగి 91.21 శాతం పోలింగ్ నమోదైంది. కానీ మూడో విడతలో మొదటి విడత కంటే తగ్గడం గమనార్హం. ఉదయం నుంచే.. జిల్లాలోని ఏడు మండలాల్లో మూడో విడతగా ఎన్నికలు జరగ్గా.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కట్టారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంతో పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులను వీల్చైర్లతోపాటు ఎత్తుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చారు. పలుచోట్ల ఎన్నారైలు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా వచ్చి ఓట్లు వేశారు. ఏన్కూరు మండలం కొనాయిపాలెంలో ఒకే వార్డుకు ఎన్నికలు జరగగా, ఓటర్ల కోసం సిబ్బంది ఎదురు చూడాల్సి వచ్చింది. కాగా, మొత్తం ఓటర్లు 2,43,983 మందికి గాను పురుషులు 1,05,668 మంది, మహిళలు 1,11,095 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. వీరిలో మొత్తంగా 2,16,765 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ నుంచి ఓటింగ్ సరళిని పర్యవక్షించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తల్లాడ మండలం పినపాక గ్రామంలో జెడ్పీహెచ్ఎస్లోనూ పోలింగ్ను పరిశీలించారు. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కల్లూరు మండలం చెన్నూరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ కేంద్రానికి సమీపాన ఇంటర్నెట్ సెంటర్లో రూ.70 వేల నగదు దొరకడంతో వాటిని నెట్సెంటర్ యజమానివి చెప్పారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల నగదు అని చెబుతూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక పెనుబల్లి మండలం సూరయ్య బంజరతండాలో ఇద్దరు ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరుపక్షాల వారు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ఘర్షణకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. బందోబస్తు ఎన్నికలు జరిగిన గ్రామపంచాయతీల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 318 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతోపాటు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్దే కాక గ్రామాల్లోనూ పహారా నిర్వహించారు. ఇక 63 కేంద్రాల వద్ద అదనంగా సిబ్బందిని నియమించారు. చేశారు. పెనుబల్లి మండలం చింతగూడెం, ఏరుగట్ల, లంకపల్లి, కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్దత్ తనిఖీ చేశారు.మొదటిసారి ఓటు వేసిన యువతి -
వాతావరణ ం
జిల్లాలో గురువారం మంచు, చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.కలెక్టర్ పరిశీలన ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణను కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. పోలింగ్ బూత్ల్లో ఓటింగ్ సరళిని పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాస్, ఈడీఎం దుర్గాప్రసాద్, డీపీఓ ఆశాలతతో పాటు రాంబాబు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఖమ్మంక్రైం: జిల్లాలో మూడో విడత గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెనుబల్లి మండలం చింతగూడెం, ఏరుగట్ల, లంకపల్లి, కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి తదితర పోలింగ్ కేంద్రాలను పోలీసు కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు పహారా కొనసాగించాలని ఉద్యోగులకు సూచించారు. సీపీ కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఉండగా, ఏన్కూరు, కల్లూరు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీలు రామానుజం, ప్రసాద్రావు పరిశీలించారు. వార్డు సభ్యుడిగా తల్లిపై తనయుడి విజయం ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ ఆరో వార్డులో కాంగ్రెస్ మద్దతుతో తల్లి భూక్యా సక్కుబాయి, బీఆర్ఎస్ మద్దతుతో కుమారుడు భూక్యా రవికుమార్ పోటీ పడ్డారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రవికుమార్ తన తల్లిపై 9ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇక పోలారం జీపీ రెండో వార్డులో కాంగ్రెస్ బలపర్చిన బానోత్ రమాదేవి ఒకే ఓటు తేడాతో విజయం సాధించింది. -
ఓటు వేసేందుకు వచ్చా
నేను యూఎస్లోని మిచ్గన్ లారెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఎంఎస్ చదుతున్నా. నెల రోజుల ముందుగా ఐ–94 పర్మిషన్ తీసుకుని, విమాన చార్జీలు రూ.1.90 లక్షలు చెల్లించి మంగళవారం రాత్రి స్వగ్రామం వచ్చాను. నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. – ఆళ్ల సాయి తరుణ్, గుండెపుడి నేనుహైదరాబాద్లో ప్రైవేటు జా బ్ చేస్తున్నా. నాభర్తఅఖిల్సాఫ్ట్వే ర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఓ టు వెంగన్నపాలెంలోఉండటం తో మంగళవారం రాత్రివచ్చేశాం. ఓటు హక్కు వినియోగం అందరూ బాధ్యతగా భా వించాలి. – ముత్యాల హరిచందన, వెంగన్నపాలెం -
కాంగ్రెస్.. తీన్మార్ !
తుది విడతలోనూ కాంగ్రెస్ హవాజిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మెజార్టీ సర్పంచ్ స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులు కై వసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. మూడు విడతలు కలిపి 566 గ్రామపంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఏన్కూరు మండలం నూకాలంపాడు పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయినా అక్కడ ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎన్నిక జరగలేదు. మిగిలిన 565 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 372 సర్పంచ్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ మద్దతుదారులు 121 పంచాయతీలు, సీపీఎం 25, సీపీఐ 11, ఇతరులు 36 స్థానాల్లో గెలుపొందారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో రెబల్స్ బెడదతో కాంగ్రెస్ పార్టీ పలు పంచాయతీలను కోల్పోయింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఏకగ్రీవాలతో బోణీ కొట్టి.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందే తరువాయి ఏకగ్రీవాలతోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయపరంపర మొదలుపెట్టారు. పార్టీ అధికారంలో ఉండడం, స్థానికంగా ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే కావడంతో ఎన్నికలు జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు తిరుగులేకుండా పోయింది. ఇదే మయాన బీఆర్ఎస్, సీపీఎం జిల్లాలో మెజార్టీ పంచాయతీల్లో పొత్తుతో ముందుకెళ్లి కాంగ్రెస్కు గట్టిపోటీ ఇచ్చాయి. అయినా కాంగ్రెస్ మద్దతుదారులు కల్లూరు మండలం మినహా ప్రతీ మండలంలోనూ మెజార్టీ పంచాయతీల్లో పాగా వేశారు. ఏకగ్రీవాలతో మొదలైన ఆ పార్టీ జైత్రయాత్ర మూడో విడత ముగిసే వరకు కొనసాగింది. పొత్తుతో ఆ రెండు పార్టీలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం అవగాహనతో పోటీ చేశాయి. ఆ పార్టీల మద్దతుదారులు పలు స్థానాల్లో గెలుపొందగా, కొన్నిచోట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. మధిర నియోజకవర్గంలోని 34 పంచాయతీల్లో, పాలేరులోని 42 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఇక ఖమ్మం నియోజకవర్గ పరిధి రఘునాథపాలెంలో బీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిచింది. నామినేషన్ల ముందు వరకు బీఆర్ఎస్, సీపీఎం ఒంటరిగా పోటీ చేసేందుకు ప్రాధాన్యతను ఇచ్చాయి. పలుమార్లు చర్చల అనంతరం కలిసి పోటీ చేయడంతో అనుకున్న దాని కన్నా ఎక్కువ స్థానాలు దక్కించుకోగలిగారనే చర్చ సాగుతోంది.సాక్షిప్రతినిధి, ఖమ్మం: తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారుల విజయ పరంపర కొనసాగింది. కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లో బుధవారం ఎన్నికలు జరిగాయి. ఆయా మండలాల్లో ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగిన పంచాయతీలు కలిపి 190 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 119 జీపీల్లో గెలుపొందింది. ఆ తర్వాత బీఆర్ఎస్ 45గ్రామపంచాయతీలను గెలుచుకోగా, సీపీఎం రెండు, సీపీఐ ఒక చోట విజయం సాధించాయి. ఇక ఇతరులు 23పంచాయతీలను దక్కించుకున్నారు. కాగా, సత్తుపల్లి నియోజకవర్గంలోని పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఆ పార్టీ రెబల్స్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈక్రమాన రెబల్స్ పలు జీపీల్లో విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా పోటీ ఇచ్చారు. కల్లూరు మండలంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల కన్నా ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక పెనుబల్లి, వేంసూరు మండలాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ పంచాయతీలు దక్కించుకున్నా.. బీఆర్ఎస్ మద్దతుదారులు సైతం సత్తా చాటారు. తల్లాడ, పెనుబల్లి మేజర్ పంచాయతీలను బీఆర్ఎస్ దక్కించుకోగా, వేంసూరు, వీఎం బంజర మేజర్ పంచాయతీ కాంగ్రెస్ పరమైంది.సత్తుపల్లి నియోజకవర్గంలో రెబల్స్ బెడదమూడు విడతల్లోనూ అధికార పార్టీ ఆధిక్యత నియోజకవర్గం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ సీపీఎం సీపీఐ ఇతరులు మధిర 131 90 21 13 05 02పాలేరు 134 83 34 08 03 06ఖమ్మం 37 26 11 0 0 0సత్తుపల్లి 129 72 40 02 0 15వైరా 110 85 09 02 02 12(జూలూరుపాడు మినహా) ఇల్లెందు 24 16 06 00 01 01(కామేపల్లి మాత్రమే) మొత్తం 565 372 121 25 11 36పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన మెజార్టీ సాధించారు. జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో విజయపరంపర కొనసాగింది. మొదటి, రెండు విడతల్లో ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు కాంగ్రెస్కు జై కొట్టారు. మధిర నియోజకవర్గంలో మొత్తం 131 జీపీలకు 90చోట్ల ఆ పార్టీ మద్దతుదారులు నెగ్గారు. అలాగే, పాలేరు నియోజకవర్గంలో 134 జీపీలకు 83లో, ఖమ్మం నియోజకవర్గంలో 37 జీపీలకు 26 గ్రామపంచాయతీల్లో విజయబావుటా ఎగురవేశారు. ఇక సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు కాంగ్రెస్ మద్దతుదారుల పక్షాన నిలిచారు. మరికొన్ని చోట్ల స్థానికంగా పార్టీలో శ్రేణుల్లో విభేదాలు, టికెట్ రాలేదనే ఉద్దేశంతో పనిచేయకపోవడంతో కొన్ని స్థానాలను కోల్పోయింది. -
వైద్యం వికటించి మృతి చెందాడని ఆందోళన
వైరారూరల్: గ్రామీణ వైద్యుడు చేసిన వైద్యం వికటించడంతోనే విద్యార్థి మృతి చెందాడంటూ ఆయన కుటుంబీకులు ఆందోళనకు దిగారు. మండలంలోని గొల్లపూడికి చెందిన పసుపులేటి వెంకటరామయ్య కుమారుడు గోపి (19) మధిర మండలం కృష్ణాపురంలోని బీసీ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్ చదువుతున్నాడు. రెండు రోజుల కిందట ఇంటికి వచ్చిన గోపి బుధవారం చేతి వేళ్లపై గాట్లు ఉండడంతో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గ్రామీణ వైద్యుడు రాజారావు వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆయన ఇంజక్షన్ చేసి సైలెన్ పెట్టాక గోపికి రియాక్షన్ కావడంతో వైరాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేశారు. ఆయనకు ప్రాణం ఉన్నట్లు గ్రహించిన వైద్యుడు చికిత్స చేస్తుండగానే గోపి మృతి చెందాడు. కాగా, గ్రామీణ వైద్యుడి వైద్యం వికటించడంతోనే తమ కుమారుడు చనిపోయాడని గోపి కుటుబీకులు ఆయన మృతదేహంతో ఆర్ఎంపీ రాజారావు ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ పుష్పాల రామారావు తెలిపారు. -
ఎంపీ పార్థసారధిరెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్సే..
వేంసూరు: హెటిరో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడైన బండి పార్థసారధిరెడ్డి స్వగ్రామం వేంసూ రు మండలం కందుకూరులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడు. ఈ గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపర్చిన మందపాటి వెంకటరెడ్డి 802 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థిపై గెలుపొందారు. వేంసూరు మండలంలోనే అత్యధిక మె జార్టీ ఈ గ్రామంలోనే నమోదు కావడం విశేషం. చెన్నూరులో రూ.90 వేల నగదు స్వాధీనం కల్లూరు/కల్లూరురూరల్: కల్లూరు మండలం చెన్నూరులో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక నెట్ సెంటర్లో రూ.90 వేల నగదు లభ్యమైంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచేందుకే పెట్టారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఆరోపించారు. దీంతో గందరగోళం ఏర్పడి ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ మేరకు అధికారులు నెట్సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. -
బాధ్యత గుర్తించి..
ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. బీటెక్ పూర్తి చేసిన నాకు తొలిసారి ఓటు హక్కు లభించింది. అందుకే ఓటు హక్కు సద్వినియోగం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. –మచ్చ మమత, బీటెక్, పూబెల్లి నేను బెంగళూరులో రైల్వే కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నా. మా ఊరంటే అభిమానం ఎక్కువ. మంచి నాయకత్వంలో గ్రామం అభివృద్ధి చెందాలనే ఆశయంతో కుటుంబ సమేతంగా ఓటేసేందుకు వచ్చా. – అరెం బాబూరావు, వేపలగడ్డ -
ఎన్ని పనులున్నా..
ఎన్ని పనులు ఉన్నా బాధ్యతాయుతంగా నా ఓటు హక్కును వినియోగించుకుంటా. ప్రస్తుతం ఫార్మసీ విభాగంలో స్థిరపడి పుణేలో ఉపాధి పొందుతున్నాను. పోలింగ్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా వచ్చాను. – మచ్చ వీరస్వామి, పూబెల్లి ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్నాను. పల్లెల బాగుకు పంచాయతీ ఎన్నికల్లో సమర్థులే పీఠమెక్కాలి. పనిఒత్తిడి ఉన్నా బాధ్యత గుర్తించి ఓటువేసేందుకు మా వూరు వచ్చాను. – సోలెం ముక్తేశ్వరరావు, బొజ్జాయిగూడెం -
నేడు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలోని గ్రామపంచాయతీల నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను మంత్రి సన్మానిస్తారని క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల.. ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం 14వ డివిజన్ గోపాలపురంలో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత మరికొన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కోర్టు భవన స్థలం పరిశీలించిన జిల్లా జడ్జి రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని జింకల తండా రోడ్డులో జిల్లా కోర్టుల భవన నిర్మాణాల కోసం కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని బుధవారం జిల్లా జడ్జి రాజగోపాల్ పరిశీలించారు. ఈమేరకు భూమి వివరాలు, హద్దులను తహసీల్దార్ శ్వేత, సర్వేయర్ శివ, ఆర్ఐ ప్రవీణ్ ఆయనకు వివరించారు. స్వామి నారాయణన్ పాఠశాలకు కేటాయించిన భూమిని ఆనుకుని భూమిని కోర్టు నిర్మాణానికి అనువుగా గుర్తించి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే, కోర్టుల సముదాయంతో పాటు ఉద్యోగుల క్వార్టర్ల కోసం మరో ఐదు ఎకరాలు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చర్చ జరిగనట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు సముదాయం నిర్మాణం పూర్తయితే జిల్లా న్యాయ వ్యవస్థకు మరింత బలో పేతం కానుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ముస్తాబవుతున్న భద్రగిరిభద్రాచలం: ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఈనెల 20 నుంచి పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అవతరాల దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంచరంగులు, హంసవాహన పనులు వేగంగా సాగుతున్నాయి. బ్రిడ్జి రోడ్డు సెంటర్లో ప్రధాన స్వాగత ద్వారం, అభయాంజనేయస్వామి, సూపర్మార్కెట్ సెంటర్లతో పాటు ఇతర కూడళ్లలో సైతం స్వాగత ద్వారాలు సిద్ధమయ్యాయి. ఈనెల 29వ తేదీ రాత్రి గోదావరిలో తెప్పోత్సవం కోసం వినియోగించే తాత్కాలిక ర్యాంపు నిర్వహణ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన అధికారులు తగు సూచనలు చేశారు. ఆన్లైన్లో 719 టికెట్ల విక్రయం.. కాగా ఉత్తరద్వార దర్శనం కోసం ఆన్లైన్లో 719 టికెట్లను విక్రయించారు. రూ.2వేల విలువగల సెక్టార్ టికెట్లు 353, రూ.1000 విలువైన టికెట్లు 52, రూ.500 విలువైన సెక్టార్ బీ, డీ టికెట్లు 416, రూ.250 విలువైన టికెట్లు 300 ఖాళీగా ఉన్నాయని, వీటిని భక్తులు వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. -
పథకాల అమలులో అగ్రభాగాన వ్యవసాయ శాఖ
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ పథకాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా వ్యవసాయ శాఖ ముందంజలో నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతీ నెల ర్యాంకులు కేటాయిస్తుండగా ఖమ్మం జిల్లా అగ్రభాగాన నిలిచింది. మొత్తం 12 అంశాలకు గాను.. ఒక్కో అంశానికి పది మార్కుల చొప్పున 120 పాయింట్లకు జిల్లాకు 97.67 పాయింట్లు దక్కాయి. పంట నమోదు, పీఎం కిసాన్ ఈకేవైసీ, రైతుబీమా అమలు, రికార్డుల నిర్వహణ, యూరియా, ఎరువుల పరిశీలన, రైతునేస్తం, సాయిల్ హెల్త్కార్డ్స్ తదితర అంశాల ప్రామాణికంగా ఈ పాయింట్లు కేటాయించారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఆధ్వర్యాన ఉద్యోగులు బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలవగా అభినందించారు. -
సరిహద్దుల నుంచి..
నేను కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఎన్నికల సమయంలో లీవ్ తీసుకుని మంగళవారం రాత్రి వచ్చాను. నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. వ్యక్తులను ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. – షేక్ యాకూబ్ పాషా, ఆర్మీ జవాన్ కారేపల్లి నేనుహైదరాబాద్లోని ఓప్రైవేటు కంపెనీలో ఉ ద్యోగం చేస్తున్నాను. ఎన్నికల్లో ఓటువేయటం మన బాధ్యత. ఇప్పటివరకు నేనెప్పుడూ ఓటు మిస్ కాలేదు. మనం ఎక్కడ ఉన్నా మూలాలు మన ఊళ్లోనే ఉంటాయి. – షేక్ సలీమ్ పాషా, ప్రైవేటు ఉద్యోగి కారేపల్లి కారేపల్లి మండలంలో తొలి ట్రాన్స్జెండర్ ఓటరు ను నేనొక్కడినే. ట్రాన్స్జెండర్గా ఓటు హక్కు వచ్చి న తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనటం ఇదే ప్రథ మం. ఓటువేయటం నాకు చాలాఆనందంగాఉంది. – వేమూరి కీర్తి అలియాస్ శ్రీను, కారేపల్లి -
ఆనందంగా ఉంది..
నేను లండన్లో వ్యాపారం చేస్తున్నా. మాది సత్తుపల్లి మండలం కొత్తూరు. పంచాయతీ ఎన్నికలని తెలియడంతో మావూరు వచ్చేశాను. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయటం చాలా ఆనందంగా ఉంది. – పి.రామకృష్ణారెడ్డి, లండన్నేను అమెరికాలోని కాలిఫోర్నియలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాను. ఓటు హక్కు వినియోగంచుకునేందుకు ఎల్లలు దాటి వచ్చా. చాలా సంతోషంగా ఉంది. మాది సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామం. –ఎన్.కృష్ణారావు, అమెరికా మా ఊరు సత్తుపల్లి మండలం గౌరిగూడెం. ఢిల్లీలో ఫోరెన్సిక్ సైన్స్ గ్రూప్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఓటేసేందుకు ఇంటికి వచ్చా. ఓటుతో నిజాయతీగా పని చేసే నాయకుడినే ఎన్నుకోవాలి. – ఎస్.సాయిమనోహర్, ఢిల్లీ -
అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు
జిల్లాలోని ఏడు మండలాల్లో మూడో విడతగా గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం ముగిశాయి. కొన్నిచోట్ల స్వల్ప ఉద్రిక్తత మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పెనుబల్లి మండలం సూరయ్యబంజరలో ఇరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు గుర్తులు చెబుతున్నారని గొడవ చెలరేగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టి బయటకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక కారేపల్లి మండలంలోని పేరుపల్లి హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో పది పోలింగ్ బూత్ల ఏర్పాటుకు సిద్ధం కాగా, ఎనిమిదే గదులు ఉన్నాయి. దీంతో వరండాలో సైడ్ కర్టెన్స్ కట్టి బూత్లు ఏర్పాటు చేశారు. తల్లాడ మండలం మల్లవరంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక కారేపల్లి హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటిగంటకు గేట్లు మూసే సమయాన ఓ ఓటరు రావడంతో అనుమతించారు. కానీ ఆయన మద్యం సేవించి ఉండడంతో ‘నేను ఓటు వేయను’ అని చెబుతూ తిరిగి వెళ్లిపోయారు. అలాగే, ఏన్కూరు మండలం కోనాయపాలెంలో ఎనిమిది వార్డులకు ఏడు ఏకగ్రీవమైతే ఒకే వార్డుకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 140 మంది ఓటర్లు చాలాసేపు రాకపోవడంతో సిబ్బంది ఎదురుచూశారు. చివరకు వారు వెళ్లి నచ్చజెప్పడంతో ఓటింగ్కు వచ్చారు. కాగా, సత్తుపల్లి మండలం సిద్ధారంలో ఓ దివ్యాంగురాలు ఓటు వేసేందుకు రాగా సిబ్బంది వీల్చైర్లో కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్లారు. కానీ, ఓటు వేశాక పట్టించుకోకపోవడంతో ఆమె తల్లే ఇబ్బంది పడుతూ నడిపించుకుని ఆటో వద్దకు వచ్చింది. –సత్తుపల్లి / సత్తుపల్లిరూరల్ / కారేపల్లి / ఏన్కూరు -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం రైల్వేగేట్ సమీపాన బుధవారం రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. చింతకాని గ్రామానికి చెందిన ఇట్టా కనకయ్య (50) పనుల కోసం వెళ్తుండగా ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టింది. ఘటనలో ఆయన తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. తొలుత ఆనవాళ్లు తెలియకపోగా, ఆతర్వాత స్థానికులు పరిశీలించి మృతుడిని కనకయ్యగా గుర్తించారు. ఆయన మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెల్లడించారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి... వైరారూరల్: వైరా మండలంలోని స్టేజీ పినపాక సమీపాన బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఓ యువకుడు మృతి చెందాడు. తల్లాడ మండలం ముద్దునూరుకు చెందిన మండె నాగరాజు (28), నర్రావుల శ్రీకాంత్ వైరా వచ్చి స్వగ్రామానికి వెళ్తున్నారు. శ్రీకాంత్ వాహనం నడుపుతున్నాడు. స్టేజీ పినపాక సమీపాన బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా.. శ్రీకాంత్ ఎడమ చేతికి గాయమైంది. వీరిని 108 వాహనంలో ఖమ్మం ఆస్పపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యలో మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు.. కూసుమంచి: మండలంలోని పాలేరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎడవెల్లి రాంరెడ్డి (55) బుధవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఆయన తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై అదే గ్రామంలో మరోచోట ఉంటున్న తండ్రి వద్దకు వెళ్తున్నాడు. నాయకన్గూడెం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులు ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించేలోగా రాంరెడ్డి మృతి చెందారు. కాగా, రాంరెడ్డి మృతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాలేరు ఏకగ్రీవమయ్యేలా కృషిచేశారని గుర్తు చేశారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కూడా సంతాపం ప్రకటించారు. లారీ ఢీకొని వ్యక్తి.. సత్తుపల్లిటౌన్: రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన తోట వరప్రసాద్(48) సత్తుపల్లిలో బొగ్గు లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. కిష్టారం సమీపంలో రోడ్డు దాటుతుండగా సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపాన బుధవారం రైలు నుంచి జారిపడిన యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న విష్ణువర్దన్రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామమైన పెనుబల్లి మండలం కరాలపాడు వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఖమ్మం చేరుకున్న ఆయన అదే మార్గంలో వెళ్తుందని విజయవాడ వైపు వెళ్లే ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు తెలుస్తోంది. కాసేపయ్యాక గుర్తించిన ఆయన దిగే క్రమాన జారి పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనలో విష్ణువర్దన్కు రెండు కాళ్లు, ఎడమ చేయి విరగగా 108 వాహనంలో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. -
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య, రెడ్డిమల్ల నరేందర్, కొమ్ము శ్రీను, రెడ్డిమల్ల నరేందర్, పగిడిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే ఫలితం మధిర: చిన్నపిల్లల్లో క్షయవ్యాధిని ముందుగానే గుర్తించాలని, తద్వారా మెరుగైన చికిత్స చేయొ చ్చని జిల్లా క్షయ నివారణ అధికారి వరికూటి సుబ్బారావు తెలిపారు. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు చొరవ చూపాలని సూచించారు. మధిర మండలం దెందుకూరు, మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మధిర పరిధిలోని ప్రసూతి సేవల కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మా ట్లాడుతూ.. చిన్నపిల్లల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, క్షయ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు పృథ్వీరాజ్నాయక్, వీరబాబు, రామ్మోహన్నాయక్, ఉద్యోగులు శైలజ, వి.వెంకటేశ్వర్లు, శరత్, సందీప్, లంకా కొండయ్య, సుబ్బలక్ష్మి, శ్రీనివాస్ పాల్గొన్నారు. జనరల్ ఆస్పత్రిలో పరిశీలించిన డీఎంహెచ్ఓ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనర ల్ ఆస్పత్రిని బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ఆర్సీ (పోషకాహార పునరుద్ధరణ కేంద్రం), ఎంసీహెచ్ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న పిల్లలు, గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్తో సమావేశమై ఆస్పత్రిలో వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుద్ధ్య వివరాలపై సమీక్షించారు. ఎన్ఆర్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీత, బయో మెడికల్ ఇంజనీర్ రెడ్యా, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జ్యోతి, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
యూరియా.. దారి తప్పకుండా
పంపిణీ కోసం ప్రత్యేక యాప్ ● స్లాట్ బుకింగ్ విధానంలో సరఫరా ● ఈనెల 20వ తేదీ నుంచి అమలుకు కార్యాచరణ ఖమ్మంవ్యవసాయం: యూరియా పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంటలకు అవసరమైన మేరకే రైతులు యూరియా తీసుకెళ్లేలా ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ప్రత్యేక ప్రణాళిక అమలుచేయనుంది. గత ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడడంతో ఈసారి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు ప్రత్యేక యాప్ను రూపొందించి స్లాట్ బుకింగ్ విధానంలో పంట విస్తీర్ణానికి సరిపడా యూరియా సరఫరా చేయనున్నారు. ప్రత్యేక యాప్ రైతులకు యూరియా సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం ‘యూరియా బుకింగ్ యాప్’ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం వివరాల ఆధారంగా యాప్లో నమోదు చేస్తే భూమి విస్తీర్ణం మేరకు ఎంత ఎరువు అవసరమో తెలుస్తుంది. ఆపై యూరియా కావాలనుకున్నప్పుడు యాప్లో నమోదు చేస్తే రైతు ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని 15 రోజుల వ్యవధిలో మండలంలోని ఎరువుల దుకాణాలు లేదా సహకార సంఘంలో ఎరువులు తీసుకోవచ్చు. ఈక్రమంలో ఏ దుకాణానికి ఎంత ఎరువు కేటాయించారు, ఎంత సరఫరా అయిందో వివరాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన మేర స్టాక్ కేటాయిస్తారు. ఇదే విధానం కౌలు రైతులకు కూడా వర్తించేలా యాప్ను రూపొందించారు. పట్టాదారు రైతు ద్వారా కౌలు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రైతులకు ఉన్న భూవిస్తీర్ణం ఆధారంగా మూడు నుంచి నాలుగు సార్లు స్లాట్ బుకింగ్ ద్వారా ఎరువు పొందే వీలుంటుంది. ఇప్పటికే అవగాహన యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఈనెల 20 నుంచి యాప్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆతర్వాత స్లాట్ బుకింగ్పై రైతులకు వివరించాల్సి ఉంటుంది. జిల్లాకు 82 వేల మెట్రిక్ టన్నులు ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లాలో అన్నీ కలిపి 4,16,609 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 2,46,988, మొక్కజొన్న 1,59,462 ఎకరాల్లో సాగు కానున్నాయి. వీటితోపాటు పప్పు ధాన్యాలు, ఇతర పంటలు జాబితాలో ఉన్నాయి. ఈ పంటల కోసం ప్రభుత్వం 82 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఇదీకాక జిల్లాలో 16 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఈ యూరియాను పంపిణీ చేస్తూ మరింత అవసరమైతే సరఫరా చేసే అవకాశం ఉంది. -
జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉన్నతోద్యోగిపై వేధింపులు
ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఓ మహిళా ఉన్నతోద్యోగిని అదే విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు వేధిస్తుండగా, ఆమె ఫిర్యాదుతో ఖమ్మంవన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమెకు.. ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు వాట్సాప్లో అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో ఆమె ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ‘ట్రెసా’నూతన కమిటీలు ఎన్నిక ఖమ్మంసహకారనగర్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కలెక్టరేట్ యూనిట్, ఖమ్మం డివిజన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులుగా పగడాల రాజేశ్, రవి, ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేశ్, శ్రీనివాస్తో పాటు కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని ఎన్నికల అధికారులు బి.వెంకటేశ్వరరావు, వెంకన్న తెలిపారు. నూతన కార్యవర్గాలను అదనపు కలెక్టర్ పిన్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు సునీల్రెడ్డి, పుల్లయ్య తదితరులు అభినందించారు. ప్రకృతి వ్యవసాయంపై రేపు విజ్ఞాన యాత్ర ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేలా గురువారం విజ్ఞానయాత్ర నిర్వహిస్తున్నట్లు అగ్రి – హార్టి కల్చర్ సొసైటీ ముఖ్య సలహాదారుడు నల్లమల వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రైతులను సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ప్రచారకుడు విజయ్రామ్ ఏపీలోని కృష్ణాజిల్లా పినగూడూరులంకలో నిర్వహిస్తున్న ఐదంచెల ప్రకృతి సేద్య క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉద్యాన శాఖ బస్సులు ఏర్పాటు చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భోజనం కోసం ఉద్యోగుల పాట్లు సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలో బుధవారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా స్టాళ్లలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక మధ్యాహ్నం ఒంటి గంటకే కూరలన్నీ అయిపోవడంతో ప్లేట్లలో భోజనం పెట్టుకుని వేచి ఉండాల్సి వచ్చింది. మరోపక్క నీరు తాగేందుకు గ్లాస్లు కూడా లేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉద్యోగులకు సరిపడా భోజనాలు తీసుకురాకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. రాళ్లదాడిలో ఒకరికి గాయాలు కొణిజర్ల: రహదారి విషయంలో ఘర్షణ పడిన కొందరు.. మరో వ్యక్తిపై రాళ్లతో దాడి చేయడంతో గాయాలయ్యాయి. మండలంలోని లాలాపురం నుంచి వైరా శాంతినగర్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమాన రోడ్డుకు అడ్డుగా ఉన్న కల్వర్టు పైపులు తొలగించడానికి పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు మంగళవారం లాలాపురం చెరువు వద్దకు రాగా అదే గ్రామానికి చెందిన పాసంగులపాటి రమేశ్ ఇప్పుడు కల్వర్టు తొలగిస్తే రైతులకే కాక మత్స్యకారులకు నష్టం ఎదురవుతుందని చెప్పాడు. ఈ సమయాన గ్రామానికి చెందిన పాసంగులపాటి శ్రీనివాస్, పాసంగులపాటి శ్రీనివాసరావు, కట్ట సత్యనారాయణ తదితరులు రమేశ్పై రాళ్లతో దాడిచేయడంతో గాయాలయ్యాయి. ఘటనపై రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ సూరజ్ వెల్లడించారు. -
జనవరి నాటికి ఆర్వోబీ పూర్తి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి కొత్త సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ఖమ్మంలోని ధంసలాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే, ఆర్వోబీ, ఎంట్రీ – ఎగ్జిట్ పాయింట్ల పనులను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఆరాతీస్తూ ఉద్యోగులకు సూచనలు చేశారు. ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, మున్నేటిపై వంతెన నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయిందని తెలిపారు. కాగా, పనుల సమయాన వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని చెప్పారు. నేషనల్ హైవేస్ పీడీ దివ్య, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల విస్తరణకు చర్యలు రఘునాథపాలెం: జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రఘునాథపాలెం మండలం జింకలతండా, పువ్వాడనగర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ)కు కేటాయించిన భూములను కలెక్టర్ పరిశీలించారు. భూవిస్తీర్ణం, సరిహద్దులు, రహదారి అనుసంధానం, మౌలిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించిన కలెక్టర్ మాట్లాడుతూ.. టీజీఐఐసీ ద్వారా కేటాయించిన భూములను సమర్థవంతంగా వినియోగించేలా పర్యవేక్షించాలని సూచించారు. మైనింగ్ ఏడీ సాయినాథ్, పరిశ్రమల శాఖ జీఎం సీతారాంనాయక్, ఆర్డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్ శ్వేత, ఆర్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి ఖమ్మంసహకారనగర్: జాతీయ రహదారుల నిర్మా ణ పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియ, హై వేల నిర్మాణ పురోగతిపై క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఖమ్మం – దేవరపల్లి, ఖమ్మం – కురవి సెక్షన్, నాగపూర్ – అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా భూసేకరణే కీలకమ ని తెలిపారు. ఆర్డీఓ నర్సింహారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీశ్రీనివాసులు, ఎన్హెచ్ఏఐ పీడీ రామాంజనేయరెడ్డి, ఈఈయుగంధర్ పాల్గొన్నారు. హైవే పనుల తనిఖీలో కలెక్టర్ అనుదీప్ -
154 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
●ఓ వ్యాపారి, ఇద్దరు డ్రైవర్లపై కేసు రఘునాథపాలెం: ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రఘునాథపాలెం పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం అర్బన్ సివి ల్ సప్లయీస్ డీటీ మెచ్చు వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. రఘునాథపాలం మండలం రేగులచలకకు చెంది న బియ్యం వ్యాపారి సీహెచ్ నాగేశ్వరరావు రేషన్ బియ్యాన్ని బొలేరో వాహనాల్లో తీసుకొచ్చి సోమవారం అర్ధరాత్రి మరో లారీలోకి లోడ్ చేస్తుండగా రఘునాథపాలెం పోలీసులు తనిఖీ చేశారు. 352 ప్లాస్టిక్ సంచుల్లోని 153.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు అప్పగించినట్లు డీటీ తెలిపారు. ఈ ఘటనలో వ్యాపారి నాగేశ్వరరావుతో పాటు వాహనాల డ్రైవర్లు వెంకటేశ్వర్లు, పవన్కుమార్పై కేసునమోదు చేయడమే కాక మూడు బొలేరో వాహనాలు, ఒక లారీని పోలీస్స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారి నాగేశ్వరరావు ఒప్పుకున్నాడని డీటీ వెల్లడించారు. ఇసుక లారీ సీజ్ అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని మంగళవారం పోలీసులు సీజ్ చేశారు. ఏపీలోని కొవ్వూరు నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి ఇసుక తరలిస్తున్న లారీని అశ్వారావుపేటలో తనిఖీ చేయగా అనుమతి లేదని తేలింది. దీంతో లారీసీజ్ చేయడంతో పాటు సత్తుపల్లిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన డ్రైవర్ మాదు గౌతమ్, యజమాని ఎస్డీ ఫిర్దోష్పై కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ యయాతి రాజు వెల్లడించారు. ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు మృతి ఖమ్మంరూరల్: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడిన యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. హనుమకొండలోని ద్వారకాసాయి కాలనీకి చెందిన బండి పూర్ణచందర్(రిజర్వ్ ఇన్స్పెక్టర్) కుమారుడైన హర్షిత్చంద్ర తన స్నేహితుడైన పూదారి మణికంఠతో కలిసి హైదరాబాద్ నుంచి అరకుకు ద్విచక్రవాహనంపై మంగళవారం వెళ్తున్నాడు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లోని మూలమలుపు వద్ద గేదె అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన హర్షిత్చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చున్న మణికంఠకు గాయాలయ్యాయి. ఘటనపై హర్షిత్ తండ్రి పూర్ణచందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. దిమ్మె పడి వృద్ధురాలు .. సత్తుపల్లిటౌన్: మనవరాలి వద్దకు వచ్చిన ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చనుబండ గ్రామానికి చెందిన షేక్ షకీనాబీ ఆదివారం తన మనమరాలిని చూసేందుకు సత్తుపల్లిలోని వెంగళరావునగర్ వచ్చింది. సోమవారం రాత్రి మనమరాలి ఇంటి సమీపాన ఒక కార్ రివర్స్ చేస్తుండగా ఇంటి గేట్ దిమ్మెను ఢీకొట్టింది. ఆ దిమ్మె వెనకాల షేక్ షకీనాబీ కూర్చొని ఉండగా ఆమైపె కూలిన భాగం పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘గూగుల్’ పోటీల్లో సత్తా చాటిన తెల్లపాలెం యువకుడు
ఎర్రుపాలెం: మండలంలోని తెల్లపాలెం గ్రామానికి చెందిన వేమిరెడ్డి కార్తీక్రెడ్డి గూగుల్ సంస్థ నిర్వహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పోటీల్లో పాల్గొని ద్వితీయ బహుమతిగా రూ.6.50 లక్షల నగదు గెలుచుకున్నాడు. కార్తీక్రెడ్డి ఇంటర్ వరకు ఖమ్మంలో చదివాక భువనేశ్వర్లో ఇంజనీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రూ.18 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఏడాదిపాటు ఉద్యోగం చేశా క అమెరికా వెళ్లి ఎంస్ పూర్తిచేసిన ఆయన వరల్డ్ వైడ్ కేన్సర్ రీసెర్చ్ టీంలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. తాజాగా గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఏఐ అంశంపై నిర్వహించిన పోటీల్లో లక్షలాది మంది పాల్గొనగా ద్వితీయస్థానంలో నిలిచిన కార్తీక్రెడ్డి నగదు బహుమతి గెలుచుకున్నాడు. కాగా, కార్తీక్ తండ్రి భాస్కర్రెడ్డి ఏన్కూరు మండలంలో హెల్త్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సొంతమైన రూ.6.50 లక్షల బహుమతి -
పోలింగ్కు సర్వం సిద్ధం
కారేపల్లి: ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఉద్యోగులు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటిస్తే ఏ ఇబ్బంది ఎదురుకాదని చెప్పారు. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలుపెట్టి, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని సూచించారు. కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, టెంట్లు ఏర్పాటుచేయాలని సూచించారు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి కూడా పరిశీలించగా, మండల ప్రత్యేకాధికారి చందన్కుమార్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పరిశీలన కారేపల్లి: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యాన సింగరేణి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసు కమిషనర్ మంగళవారం పరిశీలించారు. కారేపల్లి పోలింగ్ కేంద్రంలో బందోబస్తుపై ఆరా తీసిన ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓటర్లు కూడా సమన్వయం పాటించాలని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. -
గ్రామాల్లో తిరిగితేనే సమస్యలు తెలుస్తాయి..
కొణిజర్ల: విద్యుత్ ఉద్యోగులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) చైర్పర్సన్ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. తనికెళ్లలోని రైతువేదికలో మంగళవారం చింతకాని, కొణిజర్ల మండలాల విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది గ్రామాలకు రాకపోవడంతో ప్రతీ పనికి ప్రైవేట్ సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు. తనికెళ్ల ఎస్సీకాలనీలో పూర్వ కాలం నాటి ఇనుప స్తంభాలను మార్పించాలని, ఉప్పలచలకలో విద్యుత్ తీగలు సరిచేయాలని రైతు దరియాసింగ్ తదితరులు కోరారు. అంతేకాక తన ఎద్దు మూడేళ్ల క్రితం షాక్తో చనిపోతే ఇంతవరకు పరిహారానికి ప్రతిపాదనలు పంపలేదని మరో రైతు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్పందిస్తూ వినియోగదారుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లను చేతికందేలా కాకుండా భూమి నుంచి 6 – 7 అడుగుల ఎత్తు దిమ్మెలపైనే ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు కె.రమేశ్, ఎన్.దేవేందర్, ఎం.రామారావు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ వేణుగోపాలాచారి -
కేన్సర్ బాధితులకు ఊరట
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కేన్సర్ బాధితులకు వైద్యసేవలు కొంతమేర మెరుగుపడ్డాయి. ఓపీ సేవలతో పాటు రోగనిర్ధారణ, కీమోథెరపీ, ఆలన ద్వారా చికిత్స అందిస్తున్నారు. కేన్సర్ విభాగం లేకపోయినా ఎంఎన్జే సహకారంతో చికిత్స చేస్తూనే మందులు అందజేస్తున్నారు. ప్రస్తుతం కేన్సర్ కేసులు పెరుగుతుండగా, చివరి దశ వరకు గుర్తించకపోవడం పెనుముప్పుగా మారుతోంది. దైనందిన జీవితంలో మారిన అలవాట్లు, ధూమపానం, తంబాకు, గుట్కా తదితర అలవాట్ల మూలంగా కేన్సర్ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన వ్యాధి నిర్ధారణకు కావాల్సిన పరీక్షలు పెద్దాస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 6,222 మంది మహిళలకు పరీక్షలు సాధారణంగా మహిళలు సర్వైకల్, రొమ్ము, చాతి తదితర కేన్సర్ల బారిన పడుతుండగా, మద్యం, ధూ మపానం, తంబాకు, గుట్కా తినేవారు పెద్దపేగు, నోటి కేన్సర్కు గురవుతున్నారు. మహిళలు కేన్సర్ బారినపడకుండా ముందస్తుగా గుర్తించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ‘ఆరోగ్య మహిళ’ కా ర్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 12 పీహెచ్సీ ల్లో 2023 మార్చి 8న ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటి వరకు 6,222 మంది మహిళలను పరీక్షించి, కేన్సర్అనుమానితులను జనరల్ ఆస్పత్రిలో ప్రతీ మంగళ, గురువారం నిర్వహించే పరీక్షలకు పంపిస్తున్నారు. తద్వారా ఇప్పటివరకు 216 మంది మహిళలకు కేన్సర్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో బ్రెస్ట్ కేన్సర్ 89, గర్భాశయ(సర్వైకల్) కేన్సర్ 66, థైరాయిడ్ 19 కేసులు ఉండగా, మిగిలినవి ఇతర రకాల కేన్సర్లు ఉన్నాయి. ఇందులో 37 మంది మృతి చెందగా, పలువురు ఎన్ఎంజేలో చికిత్స తీసుకుంటున్నారు. చివరి దశలో ఉన్న వారికి చేయూత వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన స్క్రీనింగ్ ద్వారా సు మారు 3 వేల వరకు అనుమానిత కేసులు బయటపడ్డాయి. ఇక ప్రైవేట్ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారి గణాంకాలు లేవు. ఎక్కువ మంది బ్లడ్ కేన్సర్, కాలేయ,గర్భాశయ, పెద్దపేగు, నోటి, ఊపిరి తిత్తులు, మెదడు, రొమ్ము తదితర కేన్సర్ల బారిన పడుతున్నారు. ఎమ్ఎన్జే ఆస్పత్రిలో చికిత్స తీసుకు న్నా ఫలితం లేక జీవిత చరమాంకానికి చేరిన వారు జనరల్ ఆస్పత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్ను ఆశ్రయిస్తున్నారు. కొందరు ఇన్పేషంట్లుగా చేరి తే, ఇంకొందరికి ‘ఆలన’ పేరుతో వాహనం ద్వారా మందులు అందిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రతీనెల సుమారు 50 మంది వరకు చికిత్స పొందుతున్నారు. కేన్సర్ తీవ్రత ఆధారంగా వైద్యులు కీమోధెరపీ, రేడియోథెరపీ చికిత్స అందిస్తారు. జిల్లా లో ఈ సేవలు అందుబాటులో లేక హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. గత ఏడాది పెద్దాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి సిబ్బందికి శిక్షణ ఇప్పించాక కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ప్రతీనెల 50 మంది వరకు కీమోథెరపీ చేయించుకుంటున్నారు. అయితే సేవలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రత్యేక కేన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసి రేడియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తే బాధితులకు ఊరట కలగనుంది. పెద్దాస్పత్రిలో ప్రతీ మంగళ, గురువారాల్లో నిర్వహించే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. 130 – 150 మంది చికిత్స కోసం వస్తున్నారు. మామోగ్రామ్, పాప్స్మియర్, ఇతర పరీక్షల ద్వారా కేన్సర్ను నిర్ధారిస్తున్నాం. తొలి దశలో గుర్తిస్తే చికిత్సతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రతీఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్ ప్రేమలత, ‘ఆరోగ్య మహిళ’ నోడల్ ఆఫీసర్ జనరల్ ఆస్పత్రిలో కీమోథెరపీ సేవలు తెలియడంతో ప్రతీనెల 50 మంది వరకు వస్తున్నారు. ఓపీ సేవలకు కూడా వస్తున్నారు. కీమోథెరపీపై నేను, మరికొందరం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. ఎమ్ఎన్జే నుంచి కీమోథెరపీకి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు అందుతుండగా అవసరమైన వారు వినియోగించుకోవాలి. –డాక్టర్ అనూషజిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం కూసుమంచి మండలంలో పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఇటీవల ఎన్నికై న సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులతో కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికై న వారు హాజరుకావాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 1,023 కి.మీ. మేర రోడ్లు ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్వై), ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ పథకాల ద్వారా 1,023 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఈ విషయమై ప్రశ్నించారు. దీనికి మంత్రి కమలేష్ సమాధానం ఇస్తూ.. ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ కింద తెలంగాణకు 146 రహదారి పనులు, 112 వంతెనలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,023 కి.మీ. నిడివికి గాను రూ.681.15 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 478 కి.మీ. మేర 39 రహదారులు, 50 వంతెనల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తెలిపారు. ఇక 2016లో ప్రారంభించిన ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ పథకం ద్వారా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల జిల్లాల్లో రహదారి అనుసంధాన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ‘మీ డబ్బు, మీ హక్కు’పై ఈనెల 20న శిబిరం ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ‘మీ డబ్బు, మీ హక్కు‘ అంశంపై ఈనెల 20న సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 20వ తేదీన ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు కలెక్టరేట్లో జరిగే శిబిరాన్ని క్లెయిమ్ చేసుకోని ఆస్తుల వాస్తవ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లిలోని జిల్లా మహిళా ప్రాంగణంలో వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఈ మేరకు 18 – 35 ఏళ్ల వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ తర్వాత మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. పదో తరగతి అర్హతతో రెండు నెలల పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్(సీహెచ్డబ్ల్యూ), కంప్యూటర్ కోర్సులు, ఎనిమిదో తరగతి అర్హతతో టైలరింగ్, బ్యూటీషియన్ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 20వ తేదీలోగా మహిళా ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొనసాగిన రాష్ట్ర బృందం పరిశీలన ఖమ్మం సహకారనగర్: ‘స్వచ్ఛ’ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్లో జిల్లా స్థాయికి ఎంపికై న ఎనిమిది పాఠశాలలను సోమవారం పరిశీలించిన రాష్ట్ర బృందం మంగళవారం తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లో పర్యటించింది. ఆయా మండలాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించి ఎకో క్లబ్ కార్యక్రమాలు, పచ్చదనం పరిశుభ్రత, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థుల్లో పరిసరాలపై అవగాహన తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకుడు సైదులుతో పాటు బాజోజు ప్రవీణ్ కుమార్, కొత్తగూడెం ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, స్వరూప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణ ం
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత కాస్త పెరిగే అవకాశముంది. రాత్రి మాత్రం చలిగాలుల తీవ్రత ఉంటుంది.కేన్సర్ బాధితులకు ఊరట ‘ఆరోగ్య మహిళ’ ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తూ, జిల్లా ఆస్పత్రిలో కీమోథెరపీ చేస్తుండడంతో దూరాభారం తప్పుతోంది.బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 కారేపల్లిలో పోలింగ్ సామగ్రి తీసుకునేందుకు వచ్చిన ఉద్యోగులు (ఇన్ సెట్) బ్యాలెట్ బాక్స్, సామగ్రితో కేంద్రానికి వెళ్తున్న ఉద్యోగులుబరిలో 3,854మంది మూడో విడతలో 191 గ్రామపంచాయతీలు, 1,742 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు సర్పంచ్ స్థానాలకు 1,025, వార్డులకు 4,085 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆపై 21 గ్రామపంచాయతీల వార్డులతోపాటు సర్పంచ్ స్థానాలు, ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా.. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మొత్తంగా 22 పంచాయతీలు పోగా 168 జీపీల్లో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోగా, 361 ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహా 1,372 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ స్థానాలకు 485 మంది, వార్డులకు 3,369 మంది బరిలో ఉన్నారు. పోలింగ్కు సర్వం సిద్ధం జిల్లాలో ఏడు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో పోలింగ్కు యంత్రాంగం సిద్ధమైంది. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లుచేయడమే కాక మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. 1,564 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను 1,742 బృందాలు పర్యవేక్షిస్తాయి. కేంద్రాల్లో 2,091మంది పీఓలు, 2,493మంది ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. సామగ్రి పంపిణీ తుది విడత ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు మండల స్థాయి కేంద్రాల్లో మంగళవారం సామగ్రి పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలను, ఇతర సామగ్రితో ఉద్యోగులు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కారేపల్లి జూనియర్ కాలేజీలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి పరిశీలించగా, సత్తుపల్లిలో డిప్యూటీ సీఈఓ నాగపద్మజ పరిశీలించారు. కౌంటింగ్కు ఏర్పాట్లు గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోలింగ్ ముగియగానే లెక్కింపు కేంద్రంలో ఓట్ల సంఖ్య ఆధారంగా టేబుళ్లు ఏర్పాటుచేస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కించాక, వార్డు సభ్యుల ఓట్లు, చివరగా సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపడుతారు. కట్టుదిట్టంగా భద్రత ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 318 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆయా కేంద్రాల్లో 23 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు ఎనిమిది మంది ఏసీపీలు, 20మంది సీఐలు, 87 మంది ఎస్సైలు, 1,700 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు.ఫైనల్ ఫైట్.. నేడే !ఏడు మండలాల్లోని జీపీల్లో పోలింగ్ గ్రామపంచాయతీ ఎన్నికలు తుదిదశకు చేరాయి. చివరి విడతగా బుధవారం ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మంగళవారం పోలింగ్ సామగ్రిని తీసుకున్న ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాక, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతూ ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంమండలం జీపీలు వార్డులు పురుషులు మహిళలు ఇతరులతో కలిపి మొత్తం ఏన్కూరు 17 123 9,008 9,746 18,754 కల్లూరు 21 160 16,045 16,774 32,819 పెనుబల్లి 30 247 19,704 20,819 40,523 సత్తుపల్లి 18 168 15,644 16,832 32,478 సింగరేణి 35 255 20,429 21,365 41,796 తల్లాడ 24 205 20,655 21,728 42,385 వేంసూరు 23 214 17,415 18,116 35,531మొత్తం 168 1,372 1,18,900 1,25,380 2,44,286 -
ఎంప్లాయ్మెంట్ హబ్గా ఫుడ్పార్క్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు మెగా ఫుడ్పార్క్ ఎంప్లాయ్మెంట్ హబ్గా మారనుందని, ఇక్కడ ఏర్పాటుచేసే పరిశ్రమలు వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఫుడ్పార్క్లో సంక్రాంతి నాటికి మరికొన్ని పరిశ్రమలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఫుడ్పార్క్ పురోగతిపై మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి తుమ్మల సమీక్షించారు. పొలం నుంచి మార్కెట్కు ఉత్పత్తులు వచ్చేలోగా విలువ పెంచేలా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 26ఎకరాల్లోని 26 ప్లాట్లను పలు కంపెనీలకు కేటాయించగా, తాజాగా దీపక్ నెక్స్జెన్ ఆక్వా ప్రాజెక్ట్కు స్థలం కేటాయించినట్లు వివరించారు. ఈ కంపెనీ రూ.615 కోట్ల పెట్టుబడితో ప్రారంభించే ఆక్వా పరిశ్రమలో 3,200 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈమేరకు అనుమతులు వేగవంతం చేసి సంక్రాంతి నాటికి ప్రారంభించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్కుమార్, టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, ఇండస్ట్రీస్ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ సుష్మ, టీజీఐఐసీ ఈడీ పవన్ కుమార్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సభ్యులు శ్రీరామ్, ఆర్లిన్ తదితరులు పాల్గొన్నారు.సమీక్షలో మంత్రులు శ్రీధర్బాబు, తుమ్మల -
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే...
● సర్పంచ్లు విద్య, వైద్యరంగాలపై దృష్టి సారించాలి ● ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చింతకాని: 1970లో కాంగ్రెస్ ఏక పార్టీగా ఉన్నప్పు డు, 2004 వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పటి తర్వాత మళ్లీ ఇప్పుడే మధిర నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. నియోజకవర్గంలోని 131 స్థానాలకు 90 సర్పంచ్ స్థానాలను గెలవడం అభినందనీయమని తెలిపారు. చింతాని, ముదిగొండ మండలాల జీపీల నుంచి సర్పంచ్లుగా గెలిచిన వారితో చింతకాని మండలం నాగులవంచలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మధిర నియోజకవర్గంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతోనే స్నేహం ఎరుగని గ్రామాల్లో కూడా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న పథకాలతో ప్రజలు పట్టం కడుతున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రుణమాఫీతో పాటుట ఇంటిగ్రేటెడ్ రెసిరెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలతో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. కాగా, నూతన సర్పంచ్ల బాధ్యత ప్రారంభమైందని.. గ్రామపాలనతో పాటు విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిమిత వనరులను ప్రాధాన్యతా పనులకు ఖర్చు చేస్తూ గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామపంచాయతీ అభివృద్ధికి తాను సహకరిస్తానని భట్టి హామీ ఇచ్చారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు కొండబాల కోటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వర్లు, కొమ్మినేని రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా గిరి ప్రదక్షిణ
ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ ఖమ్మం స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాల గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం (స్వాతి నక్షత్రం) సందర్భంగా మంగళవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి పల్లకీపైకి చేర్చారు. అనంతరం గుట్ట చుట్టూ నగర పుర వీధుల్లో గిరి ప్రదక్షిణ చేయగా పెద్దసంఖ్యలో భక్తులు స్వామి వారి కీర్తనలు పాడుతూ ముందుకు సాగారు. అనంతరం గుట్టపై నక్షత్ర జ్యోతిని అర్చకులు వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, దీపక్చౌదరి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
‘మహాలక్ష్మి’తో మహిళలకు ఆదా
● రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి భద్రగిరికి బస్సులు ● ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి భద్రాచలంటౌన్: రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతోందని, ఇప్పటివరకు చార్జీల రూపంలో మహిళలకు రూ.850 కోట్లు ఆదా అయ్యాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. భద్రాచలం ఆర్టీసీ డిపోకు మంగళవారం వచ్చిన ఆయన మెకానిక్ వర్క్షాప్, బస్టాండ్ను పరిశీలించారు. అనంతరం ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పది వేల బస్సులతో రోజుకు సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ గడిచిన రెండేళ్లలో 2,500 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో విలీనమైన భద్రాచలం సమీప మండలాలకు బస్సులు నడపడంతో పాటు తెల్లవారుజామున వెంకటాపురం వరకు బస్సు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం ఉద్యోగులు పలు సమస్యలపై వినతిపత్రాలను అందజేసి, ఎండీని సత్కరించారు. ఖమ్మం ఆర్ఎం సరిరాం, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, డిపో మేనేజర్లు రాజ్యలక్ష్మి, శ్యాంసుందర్, ఉద్యోగులు రవీందర్, రామయ్య, రవీందర్, నాగబాబు పాల్గొన్నారు. -
నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మంఅర్బన్: విద్యార్థులు భవిష్యత్పై నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకుని సాధన చేస్తే విజయాలు వరిస్తాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన విద్యార్థినులు ఎంపీహెచ్డబ్ల్యూ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 2, 4, 5, 7, 8, 10వ ర్యాంకులు సాధించగా వారిని సోమవారం కలెక్టర్ అభినందించి మాట్లాడారు. పేద కుటుంబాలు, ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థినులు ఇక్కడితో ఆగిపోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ర్యాంకులు సాధించిన జబ్బా పావని, మచ్చా శ్రావణి, దేవత్ సంధ్యవిక, చిదిం మౌనిక, బానోతు కల్పన, పగిడిపల్లి రాజేశ్వరితో పాటు మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత, ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, సుధీర్, సుకన్య, మౌనిక, లాలయ్య పాల్గొన్నారు. నైపుణ్యాల సాధనే కీలకం ఖమ్మంరూరల్: విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు సాధిస్తే జీవితంలో విజయాలు సొంతమవుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పోలేపల్లిలోని పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయంలో ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి వారు ఒకేరోజు గొప్పవారు కాలేదని, నిరంతర శిక్షణతోనే ఈ స్థాయికి చేరిన విషయాన్ని విద్యార్థులు గుర్తించి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జానకీ సదనానికి రూ.12 లక్షల విరాళం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు జానకీ సదనం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో భాగమయ్యేలా ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన శ్రీరంగం వకుళాభాష్యం రూ.12 లక్షల విరాళాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్కు దాతలకు రశీదు అందించాక స్వామికి దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచాలి చింతకాని/బోనకల్: విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తూ వారిలో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ సూచించారు. చింతకాని మండలం నాగులవంచ ప్రాథమిక పాఠశాల, బోనకల్లోని కేబీవీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగులవంచలో డీఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్లం, తెలుగు భాషపై పట్టు సాధించేలా అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరి శీలించిన డీఈఓ.. విద్యార్థులకు గుడ్డు పెట్టకపోవడంపై ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందేలా హెచ్ఎం, ఉపాధ్యాయులు పర్యవేక్షించా ల ని ఆదేశించారు. పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం ప్రధానోపాధ్యాయులు శైలజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, బోనకల్ కేజీబీవీ తనిఖీ సందర్భంగా పాఠశాల పరిసరాలు, హాస్టల్లో పరిశీలించిన డీఈఓ, విద్యార్థులతో మాట్లాడి వసతులు, బోధనపై ఆరాతీశారు. ట్యాంక్ స్థలం ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం గ్రామంలో నీళ్ల ట్యాంకు కూల్చివేసిన స్థలం ఆక్రమణకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామంలో పీర్ల చావిడి, దాన్ని ఆనుకుని నీళ్ల ట్యాంకు, బావి ఉండేదని తెలిపారు. పీర్ల చావిడిని గతంలో గ్రామవాసే ఆక్రమించుకోగా, ఇప్పుడు నీళ్లట్యాంకు కూల్చివేసిన 100 చదరపు గజాల స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న స్థలానికి ప్రహరీ నిర్మాణానికి సిద్ధమయ్యారని కలెక్టరేట్తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, పుల్లారావు, బిక్షం, కమలమ్మ, రంగమ్మ, కృష్ణమోహన్, నాగమణి, సీతారాములు, శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంపైకేసు ఖమ్మంఅర్బన్: ఖమ్మం బల్లెపల్లికి చెందిన ఓ వ్యక్తి కానరాకుండా పోయిన ఘటనపై కేసు నమోదైంది. బల్లేపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గండు వెంకన్న(42) గత నెల 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆయన కుమారుడు నవీన్ ఫిర్యాదు ఖమ్మం అర్బన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గోపాలపురంలో మహిళ.. ఖమ్మం గోపాలపురానికి చెందిన మహిళ (23) ఈనెల 13న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. భర్త నుండి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం కానరాలేదు. దీంతో ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. నూతన వార్డుసభ్యుడి మృతి రఘునాథపాలెం: మండలంలోని మంగ్యాతండా గ్రామ వాసి, ఈనెల 11న వార్డుమెంబర్గా ఎన్నికై న కొడకళ్ల వెంకటాచారి(45) మృతి చెందాడు. గ్రామ ఒకటో వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వడ్రంగిగా జీవనం సాగించే ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమేరకు వెంకటాచారి చిత్రపటం వద్ద నూతన సర్పంచ్ మాలోతు భార్గవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, నాయకులు రవికిరణ్, నాగేశ్వరరావు, రమేశ్, నాగాచారి, భాస్కర్ నాయకులు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. -
జమలాపురంలో శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని వకుళామాత స్టేడియంలో సోమవారం తొలిసారి శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం నిర్వహించారు. ఆ తర్వాత చామంతి తదితర పూలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం చేశారు. అలాగే, వేంకటేశ్వరస్వామి వ్రతం నిర్వహించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు– నిర్మల దంపతులు, అర్చకులు రాజీవ్శర్మ, మార్తి వెంకటరమణ, కాసులనాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.నేడు డిప్యూటీ సీఎం పర్యటన మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధిరలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 క్యాంపు కార్యాలయాన్ని రానున్న అధికారులతో సమావేశమవుతారు. ఆతర్వాత నూతనంగా ఎన్నికై న సర్పంచ్లతో మాట్లాడి అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలోనే అందుబాటులోకి వంద పడకల ఆస్పత్రి సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలో రూ.35 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్గౌడ్ తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిని సోమవారం తనిఖీ చేసిన ఆయన ల్యాబ్, పేషెంట్ వార్డులు, డయాలసిస్, సిమాంక్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సూపరిండెంటెంట్ కె.వెంకటేశ్వర్లు, ఉద్యోగులతో సమావేశమైన ఆయన సాధారణ కాన్పులు పెంచడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. డాక్టర్ సురేష్నారాయణ్, ఉద్యోగులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచించారు. రాష్ట్ర చిహ్నాలు, ముఖ్యమైన వణ్య ప్రాణులు, ప్రకృతి సంరక్షణను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచడం, ప్రకృతిపై ప్రేమ, బాధ్యత పెంపొందించడమే లక్ష్యంగా పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ మంజుల, గ్రీన్ వారియర్ జేవీఎస్.చంద్రశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
●నాడు భర్త... నేడు భార్య
నేలకొండపల్లి/తిరుమలాయపాలెం: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మన్నె రాజశ్రీ గెలిచారు. ఇదే పంచాయతీ సర్పంచ్గా ఆమె భర్త మన్నె నగేష్ 2013లో టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు రాజశ్రీ కాంగ్రెస్ నుంచి గెలుపొందడం విశేషం. అలాగే, తిరుమలాయపాలెం మండలం గోల్తండా గ్రామపంచాయతీ సర్పంచ్లుగా భార్యాభర్తలకు అవకాశం దక్కింది. బానోతు అనిల్కుమార్ వైఎస్సార్ సీపీ బలపరచగా 2013 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో అనిల్ భార్య బానోతు సుజాత 282 మెజార్టీతో విజయం సాధించింది. -
రద్దయిన సర్వీసుల పునరుద్ధరణ
● దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ● టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: కోవిడ్ సమయాన గ్రామీణ ప్రాంతాలకు నిలిపేసిన బస్సులన్నీ తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఖమ్మం కొత్త బస్టాండ్లోని కార్గో పాయింట్, ప్లాట్ఫామ్స్, దుకాణాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రాజధాని బస్సులో ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలు, ప్రయాణ సమయం, సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఎండీ మాట్లాడుతూ రెండేళ్లలో మహాలక్ష్మి పథకం ద్వారా 250 కోట్ల ప్రయాణాలు జరగగా, రూ.8,500 కోట్లను ప్రభుత్వం భరించిందని తెలిపారు. ఈ నగదు మహిళలకు ఆదా అయిందని చెప్పారు. భవిష్యత్లో ఎలక్ట్రికల్ బస్సుల ధరలు తగ్గే కొద్దీ డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెడతామన్నారు. మహిళా సంఘాల ద్వారా 600బస్సులను తీసుకుంటామని, సంస్థలో వేయి మంది డ్రైవర్లు, 761 మంది శ్రామిక్ల నియామక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ఖమ్మం రీజియన్ కొంత నష్టాల్లో ఉంది ఖమ్మం రీజియన్లోని అన్ని డిపోల పరిధిలో అవసరమైన రూట్లలో బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు రూట్లలో సర్వీసుల సంఖ్య పెంచాలని ఎండీ వై.నాగిరెడ్డి సూచించారు. ఓ ప్రయాణికుడు బస్టాండ్లోని స్టాళ్లలో ఎంఆర్పీకి మించి వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకోవాలని ఆర్ఎంకు సూచించారు. కాగా, రాష్ట్రం మొత్తంగా చూస్తే ఖమ్మం రీజియన్ కొంత నష్టాల్లో ఉందని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించడం, గ్రామాలకు రహదారులు బాగుంటే కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడంద్వారా ఆదాయం పెంచుకోవాలని అధికారులకు సూచించారు. తొలుత ఆర్ఎం సరిరామ్ ఎండీకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. డిప్యూటీ ఆర్ఎం వి.మల్లయ్య, ఖమ్మం డీఎం ఎం.శివప్రసాద్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎం.రవీందర్, ఉద్యోగులు వి.జ్యోత్స్న, పి.సంపత్, కోటాజీ తదితరులు పాల్గొనగా, అద్దె బస్సుల ఓనర్లు ఎండీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
స్వామి సేవకు వేళాయె...
ఖమ్మంగాంధీచౌక్: ధనుర్మాసంలో నిర్వహించే తిరుప్పావై వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరు మోసిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. ఈ వ్రతం నిర్వహించే ధనుర్మాసం మంగళవారం మొదలుకానుంది. సంక్రాతికి ముందు 30 రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఆలయాల్లో భగవంతుడిని కొలుస్తారు. ఈ మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ధనుర్మాసం మంగళవారం మొదలై జనవరి 14 వరకు ఉంటుంది. ఽఈ నెల పాటు జిల్లాలోని శ్రీ వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈమేరకు ఖమ్మం కమాన్బజార్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, త్రీటౌన్లోని ప్రాచీన శ్రీ కరిగిరి లక్ష్మీరంగనాథ స్వామి ఆలయం, గుట్టపై ఉన్న శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, శ్రీ రామాలయం, కాల్వొడ్డు, ఇతర ప్రాంతాల్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మహా విష్ణువుకు ప్రీతిపాత్రం ధనుర్మాసం శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా నమ్మిక. అందుకే ఈ నెలంతా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, గురువారం మహాలక్ష్మికి పూజలు చేస్తారు. ఇక ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశిగా కూడా పిలిచే ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈనెల 30న ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో స్వామిని ఉత్తర ద్వారాన దర్శించుకుంటారు. అలాగే, ఈనెలలో బాలికలు, మహిళలు ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేయడంతో పాటు ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి మధ్యలో లక్ష్మీదేవి రూపంగా పూలు, పసుపు కుంకుమలతో పూజిస్తారు. నేటి నుంచి ధనుర్మాసం -
బంధువులతోనే పోటీ
నేలకొండపల్లి/కామేపల్లి: నేలకొండపల్లి మండలం కొంగర గ్రామపంచాయతీలో సొంత అక్కాచెల్లెళ్ల మధ్య పోరు నడిచింది. ఈ మేరకు చెల్లె రంగమ్మపై అక్క కృష్ణకుమారి విజయం సాధించారు. ప్రస్తుతం సర్పంచ్గా ఎన్నికై న కృష్ణకుమారి భర్త గత 20ఏళ్ల క్రితం కట్టుకాచారం–కొంగర ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. ఇక కామేపల్లి మండలం జాస్తిపల్లిలో ధరావత్ నాగమణి బీఆర్ఎస్ మద్దతుతో, నాగమణి బావ కుమారై ధరావత్ స్వాతిక కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా బరిలో నిలిచారు. ఈ మేరకు స్వాతికపై 77ఓట్ల మెజార్టీతో నాగమణి విజయం సాధించింది. స్వాతిక విద్యావంతురాలైనా మాత్రం నాగమణివైపే మొగ్గు చూపారు. -
నోటే.. ఓటయింది !
వైరా: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని చెబుతారు. పల్లెలు అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను చూస్తే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు గ్రామాల అభివృద్ధి ఏ మేరకు పాటుపడతారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తికాగా, మూడో దశ గ్రామాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. మొదటి రెండు దశల్లో సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీ పడిన అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బుతో పాటు మద్యం, మాంసం పంపిణీ చేరారని చెబుతున్నారు. ఇక మూడో విడత అభ్యర్థులు సైతం తామేం తీసిపోమన్నట్లుగా అదే బాటలో పయనిస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికలంటే సహజంగానే సందడి ఉంటుంది. కానీ ఆ సందడి అభివృద్ధి హామీలు ఇవ్వడంపై కాకుండా పరస్పర దూషణలు, పోటాపోటీగా తాయిలాలు పంపిణీ చేసేలా ఉండడంపై గతంలో సర్పంచ్లుగా పనిచేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ఎన్నికల విధానం నేటి తరానికి స్ఫూర్తిగా ఉండాల్సిందిగా పోయి ‘నోటుస్వామ్యం’ మాదిరి వర్ధిల్లుతోందని చెబుతున్నారు. డబ్బు, మద్యమే ఎన్నికలను శాసిస్తున్నాయని, పార్టీ రహిత గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులను అద్ది అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.10వేలు ఇచ్చారని, ఇంకో చోట వరుసగా కొన్నిరోజుల పాటు ఇంటికే మటన్, చికెన్ పంపిణీ చేశారనే ప్రచారంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు 10 – 15 ఏళ్ల క్రితం సర్పంచ్లుగా గెలిచిన వారిని పలకరించగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
●పదేళ్ల పాలనకు మళ్లీ పట్టం
●వెంకయ్య కుటుంబానికి మూడోసారి అవకాశం ముదిగొండ: ముదిగొండ మండలం అమ్మపేటకు చెందిన మేకపోతుల వెంకయ్య – భద్రమ్మ చెరోసారి సర్పంచ్గా పనిచేశారు. దీంతో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రమ్మకు సర్పంచ్గా మరోసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. 2006లో మేకపోతుల వెంకయ్య సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. 2013 ఎన్నికల్లో మేకపోతుల భద్రమ్మ గెలించింది. ప్రస్తుతం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో భద్రమ్మ బరిలోకి దిగగా ప్రజలు గెలిపించగా ఆమె రెండోసారి సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. -
పినపాకలో ఇరువర్గాల వాగ్వాదం
తల్లాడ: మండలంలోని పాత పినపాక గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయు ల మధ్య సోమవారం వాగ్వాదం చోటు చేసుకుంది. పినపాకకు చెందిన బీఆర్ఎస్ తరఫున వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్న ఎక్కిరాల నాగేశ్వరరావు, ఎక్కిరా ల అనసూర్య, తేళ్లపుట్ల లక్ష్మి, తేళ్లపుట్ల కుమారి, తేళ్లపుట్ల మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్కు చెందిన గుర్రం నాగేశ్వరరావు, ఆళ్ల శ్రీను, గుర్రం శివరాం, తేళ్లపుట్ల నాగేశ్వర్రావు, నర్వనేని శ్రీను తదితరులు ఎక్కిరాల నాగేశ్వరరావుపై దాడికి యత్నించారని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ నేతలే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎక్కిరాల ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు అందిందని ఎస్సై ఎన్.వెంకటకృష్ణ తెలిపారు. న్యూలక్ష్మీపురంలో ఘర్షణ ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు గ్రామ రహదారిపైకి చేరడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాల వారిని పంపించారు. అయితే, రాళ్లు, కర్రలతో తమపై దాడి చేశారంటూ ఇరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సత్తుపల్లి నుంచి శబరిమలకు సైకిల్యాత్ర
సత్తుపల్లిటౌన్: అయ్యప్ప మాల ధరించిన ఇద్దరు భక్తులు శబరిమలలో స్వామి దర్శనాని కి సైకిల్పై బయలుదేరారు. సత్తుపల్లికి చెందిన బేతిని శేషగిరిరావు, మొండ్రు క్రాంతికుమార్ సోమవారం స్థానిక మెట్టాంజనేయస్వామి ఆలయంలో ఇరుముడి ధరించి సైకిళ్లపై యాత్ర ప్రారంభించారు. ఇందులో శేషగిరిరావు గతంలో ఆరుసార్లు శబరిమల వెళ్లగా, క్రాంతి తొలిసారి వెళ్లున్నారు. వీరికి హరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ బాధ్యులు ద్రోణంరాజు మల్లికార్జున శర్మ, క్రాంతి శ్రీనివాసరావు, బొంతు శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. -
●ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులు
కామేపల్లి: కామేపల్లి మండలం పింజరమడుగు గ్రామపంచాయతీ నుంచి గతంలో, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులను గెలవగా, ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులు ఓడిపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి గుగులోత్ దేవి, కేలోత్ జ్యోతి మధ్య పోటీ జరగగా దేవి విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో దేవి భర్త బాషా, బీఆర్ఎస్ మద్దతుతో జ్యోతి భర్త భాస్కర్ బరిలోకి దిగారు. ఈక్రమాన భాస్కర్పై 117 ఓట్ల మెజార్టీతో బాషా విజయం సాధించాడు. వరుసగా గుగులోత్ దేవి, బాషాకు పీఠం దక్కగా, జ్యోతి, భాస్కర్ ఓటమి పాలయ్యారు. -
భక్తులపైనే భారం..
● భద్రగిరిలో ముక్కోటి వేడుకలకు అందని సర్కారు సాయం ● పగల్పత్తు ఉత్సవాల నిర్వహణకు దాతలకు పిలుపు భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉత్సవాల ఖర్చులు పెరుగు తున్నా ప్రభుత్వ సాయం అందక ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈక్రమాన పగల్ పత్తు ఉత్సవాల్లో రోజుకో సంస్థ ఖర్చు భరించి భాగస్వాములయ్యేలా ప్రతిపాదించారు. దీంతో ఖర్చులు దాతలపై వేస్తున్నందుకు బాధపడాలో, ఉత్సవంలో భాగస్వాములు అవుతున్నందుకు ఆనందించాలో తేల్చుకోలేని సందిగ్ధావస్థ ఎదురవుతోంది. పెరుగుతున్న వ్యయం భద్రాచలంలో ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇందుకు అనుగుణంగా చేసే ఏర్పాట్లకు ఖర్చు పెరుగుతోంది. ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి ఉత్సవాల పనులకు ఇప్పటికే రూ.80 లక్షలకు టెండర్ దాఖలైంది. వీటికి అదనంగా మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతాయని అంచనా. అలాగే, శ్రీరామనవమి, పట్టాభిషేకానికి సుమారు రూ.2 కోట్ల వ్యయాన్నీ హుండీ ఆదాయం నుంచే భరించాల్సి వస్తోంది. ‘పగల్పత్తు’లో భాగం కండి.. ఆలయంపై పడుతున్న భారాన్ని తట్టుకునేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో మొదటి తొమ్మిది రోజులు స్వామి రోజొక అవతారంలో దర్శనమిస్తారు. వీటిని పగల్ పత్తు ఉత్సవాలు అంటారు. ముక్కోటి తర్వాత జరిగే రాపత్తు ఉత్సవాలను ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల వారే ఖర్చు భరించి నిర్వహిస్తున్నారు. ఈసారి పగల్పత్తు ఉత్సవాలనూ రోజొక ధార్మిక సంస్థ లేదా అసోయేషన్లు నిర్వహించేలా వీలు కల్పించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్చంద, ధార్మిక సంస్థలతో సమావేశం నిర్వహించగా రోజుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు భరించేందుకు కొన్నిసంస్థలు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు మారినా.. సాయం సున్నా భద్రాచల క్షేత్రంలో ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ప్రత్యేక నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నా, ఆల యం నుంచి నివేదించినా ఫలితం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఆలయ ఈఓ కె.దామోదర్ రావు మాట్లాడుతూ ముక్కోటి ఉత్సవాల్లో భక్తులను భాగస్వాములను చేసేందుకే దాతలను ఆశ్రయించామని తెలిపారు. తద్వారా దేవస్థానంపై వ్యయ భారం తప్పుతుందని పేర్కొన్నారు. -
తల్లంపాడు ఉపసర్పంచ్ ఎన్నికలో రసాభసా
ఖమ్మంరూరల్: మండలంలోని తల్లంపాడులో ఉప సర్పంచ్ ఎన్నిక విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సోమవారం స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ గ్రామం నుంచి సర్పంచ్గా కుమ్మరి అంబేద్కర్ గెలిచారు. గ్రామంలో 12 వార్డులకు ఏడు బీఆర్ఎస్, సీపీఎం కూటమి, ఐదు వార్డులను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. అయితే, సోమవారం ఎలాంటి సమాచారం లేకుండా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం సరికాదని, మరికొంత సమయం ఇవ్వాలని సర్పంచ్గా గెలిచిన అంబేద్కర్ అధికారులను కోరారు. దీంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో పక్కఎన్నిక నిర్వహించాల్సిందేనని బీఆర్ఎస్ వార్డు మెంబర్లు, నాయకులు పట్టుబట్టారు. అయితే, అధికారులు మాత్రం ఎన్నికను వాయిదా వేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఎన్నిక నిర్వహించాలని బీఆర్ఎస్, సీపీఎం కూటమి నాయకులు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. -
పాఠశాలల రేటింగ్పై రాష్ట్ర బృందం పరిశీలన
ఖమ్మం సహకారనగర్: ‘స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ’ పథకం కింద జిల్లా స్థాయిలో ఎంపికైన ఎనిమిది పాఠశాలలను రాష్ట్రస్థాయి బృందం సోమవారం పరిశీలించింది. సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఆయా పాఠశాలలను పరిశీలించాక రాష్ట్ర పరిశీలకుడు సైదులు మాట్లాడారు. ఎకో క్లబ్ కార్యక్రమాల నిర్వహణ, పచ్చదనం – పరిశుభ్రత, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థుల్లో పరిసరాలపై అవగాహన తదితర అంశాలను పరిశీలించి రేటింగ్ ఇస్తామని తెలిపారు. ఈ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే అత్యధిక రేటింగ్ పొందిన పాఠశాలలు రాష్ట్ర, జాతీయ స్ధాయిలో అవార్డుకు ఎంపికవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యుడు స్వరూప్కూమార్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో జోష్
జిల్లాలో పూర్తయిన మొదటి, రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరుల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలు కై వసం చేసుకున్నారు. మరికొన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ఈ రెండు విడతల్లోనూ వచ్చిన ఫలితాలపై పార్టీ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేస్తూ, మూడో విడత ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు రాబట్టే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంమధిర, పాలేరు నియోజకవర్గాల్లో సత్తా చాటిన పార్టీ మధిరలో కాంగ్రెస్ ఢంకా మధిర నియోజకవర్గ పరిధి మధిర, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో మొదటి విడతగా, ముదిగొండ మండలానికి రెండో విడతలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 131 జీపీ స్థానాలకు 90చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఎర్రుపాలెం మండలంలో 31 స్థానాలకు 26, మధిర మండలంలో 27కు 19, బోనకల్లో 22కు 14, చింతకానిలో 26కు 13 జీపీ స్థానాల్లో నెగ్గింది. ముదిగొండ మండలంలో 25 స్థానాలకు గాను 18లో సత్తా చాటింది. ఏకగ్రీవాలతోపాటు ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కాంగ్రెస్కు ఏకపక్షంగానే ఓటింగ్ జరగగా, పలు మండలాల్లో బీఆర్ఎస్, సీపీఎం పొత్తుతో కొంత ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. పాలేరులోనూ పట్టం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు జెండా పాతారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ మండలాల్లో 134 గ్రామపంచాయతీలకు గాను 83 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్ఎస్ 34 స్థానాల్లో, సీపీఎం ఎనిమిది, సీపీఐ మూడు, ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తుతో కొన్ని స్థానాలను కాంగ్రెస్ స్వల్ప తేడాతో కోల్పోయినా పలు మేజర్ గ్రామపంచాయతీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. స్వల్ప తేడాతో మరికొన్ని.. రెండు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినా, మరికొన్ని స్థానాలను కోల్పోయారు. కొన్నిచోట్ల ఒకటి నుంచి 30ఓట్ల తేడాతో ఓడిపోగా, చాలాస్థానాల్లో కాంగ్రెస్ రెబెల్స్ బరిలో ఉండడం ఇందుకు కారణమైందని చెబుతున్నారు. గ్రామస్థాయి నేతల్లో మనస్పర్థలతో గెలవాల్సిన జీపీలను కూడా కోల్పోయామని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక సీపీఎం, బీఆర్ఎస్ పొత్తుగా పోటీ చేయడం కూడా కొన్ని స్థానాలు కోల్పోవడానికి కారణంగా భావిస్తున్నారు. మూడో విడతలో మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా విభేదాలు లేకుండా పనిచేసేలా నాయకులు సూచిస్తున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే జీపీల్లో ప్రచార గడువు ముగిసినందున కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరిగినా, పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ఓటర్లు తమకు పట్టం కట్టారని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రచారంలో కూడా అభ్యర్థులు ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం మంచి ప్రభావాన్ని చూపిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ఇక ప్రలోభాల పర్వం!
● మూడో విడతకు ముగిసిన ప్రచారం ● గెలుపు కోసం అభ్యర్థుల వ్యూహాలు ● ఏడు మండలాల్లో జోరుగా మద్యం, డబ్బు పంపిణీసాక్షి ప్రతినిధి, ఖమ్మం: మూడో విడత ఎన్నికలు జరిగే ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో సోమవారంతో ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చివరి రోజున అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశాక కొత్త అస్త్రాలను తీసే పనిలో పడ్డారు. పోలింగ్కు ఒకేరోజు సమయం ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలుస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. 168 జీపీల్లో ఎన్నికలు ఏడు మండలాల్లో 191 గ్రామపంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, 22 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 168 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే 1,742 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాని తొమ్మిది, ఏకగ్రీవమైన 361 వార్డులు మినహా 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల నాయకులతో కలిసి చివరి రోజైన సోమవారం వరకు ప్రచారం హోరెత్తించారు. వ్యూహాలకు పదును ప్రచారం ముగియడంతో అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టారు. గ్రామాల్లో ఎందరు ఓటర్లు ఉన్నారు, అందులో ఎవరెవరు తమకు ఓటు వేస్తారు... ఎవరిని ఎలా ప్రసన్నం చేసుకునే అవకాశముందనే అంశాలపై దృష్టి సారించారు. అంతేకాక ఎదుటి వర్గంలో పోటీ చేసే అవకాశం దక్కక నిరాశతో ఉన్నవారిని తమ వైపు తిప్పుకునేలా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో చేతులు కలపడం ద్వారా తమ గెలుపును సునాయాసం చేసుకోవాలనే భావనలో ఉన్నారు. ఓటరు జాబితా ఆధారంగా ప్రతీ ఒక్కరినీ కలిసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈక్రమంలో ఒకరిని మించి ఇంకొకరు మద్యం, డబ్బు పంపిణీ చేస్తుండగా, ఇంటింటికీ మటన్, చికెన్ కూడా చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. -
మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్దే గెలుపు
దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన మెచ్చు ఈదప్ప విజయం సాధించాడు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారుడు పండు సాంబశివరావుపై ఆయన 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంతేకాక పది వార్డులకు ఏడింటిని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ఎమ్మెల్సీ స్వగ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం విజయం తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ స్వగ్రామమైన పిండిప్రోలులో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం సర్పంచ్ అభ్యర్థి కామళ్ల సువార్త 381ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఆమెకు 1,750 ఓట్లు రాగా మాస్లైన్ అభ్యర్థి ఆరెంపుల కేతమ్మకు 1,369 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 12 వార్డులకు గాను కాంగ్రెస్, మాస్లైన్ అభ్యర్థులు నాలుగు వార్డులు కై వసం చేసుకోగా, బీఆర్ఎస్, సీపీఎం కూటమికి ఎనిమిది వార్డులు దక్కాయి. రాజుపేట బీఆర్ఎస్ కై వసం కూసుమంచి: కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు బానోత్ మహేష్ సర్పంచ్గా గెలుపొందాడు. పాలేరు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వగ్రామం ఇదే కావడంతో నాయకులు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మహేష్ కాంగ్రెస్ బలపర్చిన కుర్రా రమేష్పై 23 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. బీటెక్ సర్పంచ్ ! కామేపల్లి: కామేపల్లి మండలం పొన్నేకల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గుగులోత్ భూమిక సర్పంచ్గా గెలిచింది. ఇక్కడ మొత్తం 842 ఓటర్లకు గాను 728 ఓట్లు పోలయ్యాయి. ఈమేరకు భూమిక 603 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. బీటెక్(ఈఈఈ) పూర్తి చేసిన ఆమె 23 ఏళ్ల వయస్సులోనే గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికవడం విశేషం. విద్యావంతురాలినైన తాను గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ప్రచారంలో వెల్లడించింది. -
మేమూ ఓటేశాం..
ఆసక్తి, ఆనందంతో తొలిసారి ఓటు హక్కు వినియోగం ● ఎన్నికల ప్రక్రియలో భాగమైనందుకు యువతీయువకుల్లో హర్షంమొదటిసారి నా ఓటు హక్కు గ్రామపంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అందుకే బాధ్యతగా ఓటేశాను. – కొర్రా అంజలి, కామేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. ఓటు హక్కు ఉంటే మనకు నచ్చిన సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. అందరూ స్వేచ్ఛగా ఓటేయాలి. –పి.నవ్యశ్రీ, పాతర్లపాడు తొలిసారి ఓటు హక్కు లభించిన యువతీయువకులు ఉత్సాహంగా ఓటేశారు. రాజ్యాంగ హక్కును వినియోగించుకుని.. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేశామని.. మొదటిసారి ఓటేయడం బాధ్యతగా భావించడంతోపాటు మధురానుభూతిని కలిగించిందని.. గెలుపులో యువత ఓట్లే కీలకమని.. సమర్థులైన సర్పంచ్ల ఎన్నికల్లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని యువ ఓటర్లు పేర్కొన్నారు. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, పలువురు యువతీ, యువకులు ఆసక్తి, ఆనందంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. – కామేపల్లి / నేలకొండపల్లి / దమ్మపేట / అశ్వారావుపేట రూరల్ / చుంచుపల్లి / పాల్వంచ రూరల్ -
చెదురుముదురు ఘటనలు
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణికి చెందిన పలువురు ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఎన్నికల సందర్భంగా వీరి కోసం ట్రావెల్స్ బస్సు ఏర్పాటు చేయగా ఆదివారం నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో బస్సు నుంచి దిగుతుండగా రెండు పార్టీల అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించేందుకు గుమికూడడంతో గందగోళం నెలకొంది. ఈ మేరకు ఎస్ఐ కూచిపూడి జగదీశ్ ఇరువర్గాల వారిని దూరంగా పంపించారు. ● మండలంలోని పిండిప్రోలులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఇద్దరు ఆర్మీ జవాన్లను అధికారులు అనుమతించలేదు. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసి ఉంటారని చెప్పగా, తాము చేయలేదని జవాన్లు స్పష్టం చేశారు. అప్పటికే ఒక జవాన్ ఓటు వేశాడని ప్రశ్నించడం, ఇరు పార్టీల నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు చెదరగొట్టారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి వివరాలు తెప్పించుకుని పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేదని గుర్తించాక ఇద్దరు జవాన్లతో ఓటు వేయించారు. ● మండలంలోని పిండిప్రోలులో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముదిగొండ: ముదిగొండ నాలుగో వార్డులో ఏజెంట్లు ఓటర్లను మభ్య పెడుతున్నారంటూ పోలీసులను కొందరు ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. వీరికి సర్దిచెప్పి బయటకు పంపించారు. అలాగే, పోలింగ్ కేంద్రం బయట వంద మీటర్ల పరిధిలోపు కాంగ్రెస్, సీపీఎం నేతలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐ రమేశ్ సిబ్బందితో కలిసి వారిని దూరంగా పంపించివేశారు. మల్లారంలో ఓ స్వతంత్ర అభ్యర్థిని తరఫు వ్యక్తి ఇద్దరిపై దాడి చేయగా పోలీసుస్టేషన్కు తరలించారు. ఖమ్మంరూరల్: మండలంలోని తీర్థాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆరెకోడులో కాంగ్రెస్, సీపీఎం వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కూసుమంచి: మండలంలోని రాజుపేటలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఘర్షణ.. నిలువరించిన పోలీసులు -
ఈసారి అంతకు మించి!
పోలింగ్ శాతంసాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. జిల్లాలోని కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరగగా, ఉదయం 7గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు దీరారు. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 91.21 శాతంగా నమోదైంది. మొదటి విడతతో పోలిస్తే ఇది 1.13 శాతం అదనం కావడం విశేషం. తొలి విడత ఎన్నికల్లో 90.08 శాతంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలవగా.. ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకింది. యాదాద్రి భువనగిరి జిల్లా 91.72 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. బారులు దీరిన ఓటర్లు పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు కేంద్రాలకు తరలివచ్చారు. ఆరు మండలాల్లోని దాదాపు అన్ని కేంద్రాల వద్ద ఇదే దృశ్యం కనిపించింది. అభ్యర్థులు ఓటర్లను పోలింగ్కేంద్రాలకు తరలించారు. ఇంకొందరు వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కుటుంబీకుల సాయంతో వచ్చారు. రెండో విడతలో మొత్తం 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 23 జీపీలు, 306 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇంకో వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 160 గ్రామపంచాయతీలు, 1,379 వార్డుల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ పర్యవేక్షణ రెండో విడత పోలింగ్ తీరును కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామారావు ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మంరూరల్ మండలాల్లో, కామేపల్లి మండలం ముచ్చర్లలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. గంటగంటకూ పెరిగిన పోలింగ్ మొదటి విడత మాదిరిగానే రెండో విడత ఎన్నికల్లోనూ పోలింగ్ జోరు కొనసాగింది. మొత్తం 2,48,239 మంది ఓటర్లకు 2,26,417 మంది ఓటు వేశారు. ఇందులో 1,12,160 మంది పురుషులు, 1,14,252 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా 93.76 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇక్కడ 33,851 మంది ఓటర్లకు 31,739 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 2వేల మంది పోలీసులు పహారా కాశారు. క్రిటికల్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఆరు మండలాల పరిధి 304 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అడిషనల్ డీసీపీ పర్యవేక్షణలో బలగాలతో పాటు ప్రత్యేక బృందాలను నియమించారు. ఖమ్మం రూరల్, కామంచికల్, తీర్థాల, గోళ్లపాడు, ముదిగొండ, నేలకొండపల్లి, ముజ్జుగూడెం, రాజేశ్వరపురం, కూసుమంచి, జల్లేపల్లి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం గ్రామాల్లో కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్దత్ పరిశీలించారు.కూసుమంచిలో మొదటిసారి ఓటు వేసిన ఆనందంలో యువతిబ్యాలెట్ బాక్స్లో ఓటు వేస్తున్న యువతి రికార్డు స్థాయిలో 91.21శాతం పోలింగ్ మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం కామేపల్లి 30,349 26,414 87.03 ఖమ్మంరూరల్ 33,851 31,739 93.76 కూసుమంచి 45,420 41,298 90.92 ముదిగొండ 43,877 40,155 91.52 నేలకొండపల్లి 47,420 43,480 91.69 తిరుమలాయపాలెం 47,322 43,331 91.57మొత్తం 2,48,239 2,26.417 91.21 -
చేయి ఎత్తిన పల్లెలు!
● మలివిడతలోనూ మెజార్టీ జీపీలు కాంగ్రెస్ కై వసం ● 113 స్థానాల్లో విజయం ● కాంగ్రెస్ పొత్తుతో సీపీఐకి నాలుగు పంచాయతీలు ● బీఆర్ఎస్కు 42, సీపీఎంకు 13సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మలివిడత ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లోని గ్రామపంచాయతీల్లోనూ సర్పంచ్లుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ముదిగొండ, కామేపల్లి మండలాల్లోని 183 గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. 23గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యా యి. మిగతా160 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్కు 95, బీఆర్ఎస్కు 39, సీపీఎం మద్దతుదారులు 13స్థానాలు దక్కించుకున్నారు. ఇక సీపీఐకి ఒకటి, ఇతరులకు 11 స్థానాలు దక్కాయి. ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగిన జీపీలు కలిపి మొత్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు 113పంచాయతీలు, బీఆర్ఎస్ మద్దతుదారులు 42, సీపీఎం 13, సీపీఐ 4, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్, సీపీఎం పొత్తు పెట్టుకోవడంతో పట్టుఉన్న చోట సత్తా చాటారు. ఏకగ్రీవాలతో కాంగి‘రేసు’.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండతో పాటు కామేపల్లి మండలాలకు రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ దఫాలో ఏకగ్రీవమైన 23 జీపీల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏకగ్రీవ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు 18, బీఆర్ఎస్, మాస్లైన్కు ఒక్కొక్కటి, సీపీఐకి మూడు స్థానాలు దక్కాయి. ‘హస్తం’ హవా మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగింది. ఏకగ్రీవాలతో కలిసి 113స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పల్లె జనం జై కొట్టినట్లు కనిపించింది. ఇక సీపీఐ కామేపల్లి మండలంలో ఒక్క స్థానమే దక్కించుకుంది. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంతో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కలిసి వచ్చిన పొత్తు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం కలిసి బరిలో నిలవగా రెండు పార్టీలు కలిపి 53స్థానాల్లో పాగా వేశాయి. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్వగ్రామం కూసుమంచి మండలం రాజుపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించాడు. అలాగే ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్వగ్రామం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోనూ బీఆర్ఎస్ పొత్తుతో సీపీఎం గెలుపొందింది. కూసుమంచి: మండలంలోని చేగొమ్మ గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠకు రాత్రి పొద్దు పోయాక తెరపడింది. ఇక్కడ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారుడిగా బొల్లికొండ వెంకన్న, బీఆర్ఎస్ మద్దతుదారుడిగా బత్తుల వీరస్వామి పోటీపడ్డారు. అయితే, ఇద్దరికీ సమానంగా 945 ఓట్లు రావడంతో గెలుపు నిర్ణయించేందుకు అధికారులు టాస్ ఎంచుకున్నారు. కానీ అభ్యర్థులిద్దరూ ససేమిరా అనడమే కాక చెరో రెండున్నర ఏళ్లు సర్పంచ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆపై తొలుత ఎవరు సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించాలనే అంశం తేల్చేందుకు టాస్ వేయగా మొదటి రెండున్నరేళ్ల అవకాశం బీఆర్ఎస్ అభ్యర్థి వీరస్వామికి దక్కింది. మండలం జీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సీపీఎం సీపీఐ ఇతరులు కూసుమంచి 41 28 12 00 00 01 నేలకొండపల్లి 32 20 07 02 00 03 తిరుమలాయపాలెం 40 23 10 02 00 05 ఖమ్మంరూరల్ 21 08 05 04 03 01 ముదిగొండ 25 18 02 05 00 00 కామేపల్లి 24 16 06 00 01 01మొత్తం 183 113 42 13 04 11 -
ఎన్నికలకు భారీ బందోబస్తు
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సునీల్దత్ఖమ్మంక్రైం: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు, తీర్థాల, గోళ్లపాడు, ముదిగొండ, నేలకొండపల్లి, ముజ్జుగూడెం, రాజేశ్వరపురం, కూసుమంచి, జల్లేపల్లి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం గ్రామాల్లో పోలింగ్ను సీపీ సునీల్దత్ పరిశీలించి భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామాల్లో సీపీ పర్యటించారు. గ్రామస్తులు చిన్నచిన్న విషయాల్లో గొడవ పడకుండా సమన్వయం పాటించాలని సూచించారు. ఇక గంధసిరి, చేగొమ్మ, చెరువుమాధారం, తల్లంపాడులో పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీ పరిశీలించారు. -
యడవల్లి సర్పంచ్కు అత్యధిక మెజార్టీ
● గిడ్డంగుల సంస్థ చైర్మన్ తండ్రి ఓటమి ముదిగొండ: ముదిగొండ మండలం యడవల్లి సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ఎరకల భారతమ్మ 1,478 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక ఖానాపురంలో కాంగ్రెస్ నుంచే ఇరువర్గాల పోటీకి దిగగా మాజీ జెడ్పీటీసీ పసుపులేటి దుర్గ, పోకల బాబు చేతిలో ఓడిపోయారు. అలాగే, వెంకటాపురంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తండ్రి, 91ఏళ్ల వయస్సు కలిగిన రాయల వెంకటేశ్వర్లు సీపీఎం నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి కందుల బాలచందర్ చేతిలో ఓటమి ఎదురైంది. నాలుగోసారి సర్పంచ్గా... కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్ల సర్పంచ్గా మూడు దఫాలు వ్యవహరించిన జాటోత్ జాయ్లూసీ నాలుగోసారి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచింది. 2004, 2014లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆమె పోటీ ద్వారా సర్పంచ్గా గెలిచింది. 2019లో ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మళ్లీ ఇప్పుడు సర్పంచ్గా గెలవగా.. జాయ్లూసీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా కృషిచేస్తున్న తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఆదివారం జరిగాయి. ఈ పోటీలకు 60 మందికి పైగా పురుషులు, మహిళలు హాజరయ్యారు. మహబూబ్నగర్లో ఈ నెల 25 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ నెట్బాల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయగా, వారం పాటు శిక్షణ అనంతరం జట్టును ప్రకటిస్తామని నెట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ దీప్తి, కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. ఎంపిక పోటీలను ఫాదర్ సంపత్, విహారి, అఖిల్ తదితరులు పర్యవేక్షించారు. ఖమ్మం మీదుగా సంక్రాతికి ప్రత్యేక రైళ్లు ఖమ్మంరాపర్తినగర్: సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగించనున్నాయని సీసీటీఓ రాజగోపాల్ తెలిపారు. సికింద్రాబాద్ – కాకినాడటౌన్ (07261) ఎక్స్ప్రెస్ జనవరి 9, 11, 13వ తేదీల్లో ఉంటుందని, కాకినాడ – సికింద్రాబాద్(07262) ఎక్స్ప్రెస్ 10, 12వ తేదీల్లో ఉంటుందని వెల్లడించారు. అలాగే, వికారాబాద్ – కాకినాడటౌన్ (07271) ఎక్స్ప్రెస్ 10, 12వ తేదీల్లో, కాకినాడటౌన్ – వికారాబాద్(07272) రైలు 11వ తేదీన ఉంటుందని తెలిపారు. ఆయా రైళ్లలో ప్రయాణానికి ఖమ్మం రైల్వేస్టేషన్లో లేదా ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ చేయించుకోవచ్చని పేర్కొన్నారు. కలుపు మందుతో మాడిపోయిన మిర్చి తోట రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో రైతు కేలోతు రామోజీకి చెందిన మిరప తోటపై గుర్తుతెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేశారు. దీంతో తోట కొంత మేర మాడిపోయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈనెల 11న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదనే కక్షతోనే కొందరు రాత్రి ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వైరల్ ఫీవర్తో యువతి మృతి మధిర: మహదేవపురం గ్రామానికి చెందిన ఓ యువతి వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఆదివారం మృతి చెందింది. గ్రామానికి చెందిన కిన్నెర గోపి కుమార్తె మహాలక్ష్మి (17) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను శనివారం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామ నూతన సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు మొండితోక జయాకర్ మహాలక్ష్మి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలు రఘునాథపాలెం: మండలంలో రఘునాథపాలెం–చింతగుర్తి మార్గంలో ఆదివారం ట్రాక్టర్ ఢీకొనగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. మండలంలోని రాంక్యాతండాకు చెందిన బోడ రవి తన భార్య, కుమార్తెతో ఖమ్మం నుండి రాంక్యాతండా వెళ్తున్నాడు. వీరి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టగా ముగ్గురు గాయపడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలించగా, ఘటనపై రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఒక ఓటుతో వరించిన విజయం
కూసుమంచి/తిరుమలాయపాలెం: కూసుమంచి మండలంలోని జుజుల్రావుపేట సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారుడు దాట్ల సలీమ్ ఒక్క ఓటుతో గెలుపొందాడు. కాంగ్రెస్ మద్దతుదారు దాట్ల అనూషపై తొలుత మూడు ఓట్లతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం తెలపగా మూడు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. చివరకు సలీమ్ను ఒక ఓటుతో సర్పంచ్ పదవి వరించింది. ●తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువులోనూ ఒక్క ఓటుతో బీఆర్ఎస్ బలపరిచిన గడుపుడి వెంకటనారాయణ సర్పంచ్గా విజయం సాధించారు. వెంకటనారాయణకు 312 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడుపుడి వీరభద్రంకు 311 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వార్డుల వారీగా బీఆర్ఎస్కు 90 ఓట్ల మెజార్టీ రాగా, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యాడు. ●కూసుమంచి మండలం నేలపట్ల గ్రామపంచాయతీలో కూడా రీకౌంటింగ్ నిర్వహించగా కాంగ్రెస్ మద్దతుదారుడు నూకల శోభన్బాబు నాలుగు ఓట్లతో విజయం సాధించాడు. ఇక కూసుమంచి సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు కొండా కృష్ణవేణి వేయి ఓట్ల మెజార్టీతో గెలవగా.. జీళ్లచెరువు కాంగ్రెస్ అభ్యర్థి ఐతగాని వెంకటరమణ 400పై చిలుకు ఓట్లతో విజయం సాధించింది. మునిగేపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గంగా స్రవంతి 250 ఓట్లతో విజయం సాధించడం విశేషం. -
క్షణక్షణం అప్రమత్తంగా..
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విడత ఎన్నికలు ఆరు మండలాల్లో జరగ్గా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాిస్టింగ్ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. అక్కడ సీసీ కెమెరాల ద్వారా ప్రతీ అంశాన్ని కలెక్టరేట్లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ నుంచి పరిశీలించామని కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా మానిటరింగ్ సెల్లోని ఉద్యోగులు కూడా సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ను పరిశీలిస్తూ అక్కడి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. మానిటరింగ్ సెల్ నుంచి పర్యవేక్షించిన కలెక్టర్ -
● అంతా సజావుగానే..
జిల్లాలో రెండో విడత పోలింగ్ సజావుగానే సాగింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు బారులుదీరారు. వృద్ధులు, ఇతర ఇబ్బందులు కలిగిన ఓటర్లను వీల్చైర్ల ద్వారా సహాయకులు తీసుకొచ్చి ఓటు వేయించారు. కొందరు మహిళలు చంటిబిడ్డలతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ, సీపీ సునీల్దత్, ఎన్నికల అధికారి ఖర్తడే కాళీ చరణ్ సుధామారావుతోపాటు పలువురు అధికారులు సందర్శించి, సిబ్బంది సూచనలు చేశారు. చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. –సాక్షి నెట్వర్క్ -
● అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో పనులు ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి ఖమ్మం అర్బన్: ఖమ్మంలో జరుగుతున్న అభి వృద్ధి పనుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పది కాలాలు మన్నికగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పలు డివిజన్లలో ఆదివారం పర్యటించిన ఆయన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, కార్యాచరణపై ఆరా తీసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షపు నీరు, మురుగునీరు వేర్వేరుగా ప్రవహించేలా స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా చెరువులు కలుషితం కాకుండా రక్షించుకోవచ్చని చెప్పారు. అమృత్ పథకం ద్వారా రూ.249 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు వచ్చే వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే, ఖానాపురం ఊరచెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు 8.5 కి.మీ. మేర ట్రంక్ పైప్లైన్, ధంసలాపురంలో 44 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం, పుట్టకోటలో 9.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ పనులపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి, కేఎంసీ ఎస్ఈ వి.రంజిత్, కార్పొరేటర్లు ఆళ్ల నిరోష అంజిరెడ్డి, చామకూర వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్ప్రతాప్, తహసీల్దార్ సైదులు, కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొన్నారు. గాయత్రీ మహా యజ్ఞంలో మంత్రి ఖమ్మం పెవిలియన్ మైదానంలో నిర్వహించిన 108 కుండముల గాయత్రీ జ్ఞాన మహాయజ్ఞంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పూజలు చేశారు. మాతాజీ జన్మ శతాబ్ది సందర్భంగా చేపట్టిన మహాయజ్ఞంతో ఆధ్యాత్మిక చైతన్యం, నైతిక విలువలు, సద్గుణాలు మరింతగా పెరగాలని ఆకాంక్షించారు. రోడ్డుప్రమాదంలో యువతి మృతి మధిర: మండలంలోని ఖాజీపురం సమీపాన ఆదివారం ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో ఒక యువతి మృతి చెందింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన షేక్ జాన్సైదా కుటుంబానికి చెందిన బంధువుల ఫంక్షన్లో పాల్గొనేందుకు టాటా ఏస్ వాహనం అద్దెకు తీసుకుని ఎన్టీఆర్ జిల్లా ఊటుకూరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఖాజీపురం మీదుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న షేక్ ఆయేషా(17)కి తీవ్ర గాయాలు కాగా.. మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయేషా మృతి చెందింది. ఘటనపై మధిర రూరల్ ఎస్ఐ లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుది విడతకు నేటితో తెర
● ఎన్నికల ప్రచారానికి కొద్దిగంటలే... ● చివరిరోజు అందరినీ కలిసేలా అభ్యర్థుల ప్రణాళికసాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో సోమవారం సాయంత్రం 5గంటలతో ప్రచారం ముగియనుంది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో ఏకగ్రీవాలు, ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రచారం ముగిశాక కూడా ఓటర్లను మెప్పించేలా ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. 168 జీపీల్లో ఎన్నికలు మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలు, 1,742 వార్డులు ఉన్నాయి. అయితే ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ అయినా అక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 22గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే, 1,742 వార్డులకు గాను తొమ్మిది వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 361 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మొత్తం 168 సర్పంచ్ స్థానాలు, 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి పోటాపోటీగా.. బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామపంచాయతీల్లో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడా తగ్గేదే..లే అన్న రీతిలో ఓటర్లను ఆకట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. కొందరు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి అనుబంధాలను గుర్తు చేస్తూ తమకు ఓటు వేయాలని సెంటిమెంట్తో అభ్యర్థిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు యువ ఓటర్లను ఆకట్టుకునేలా వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. పోస్టర్లు, డోర్ స్టిక్కర్లపై తమ గుర్తు ముద్రించడమే కాక వాహనాల్లో మైకులు అమర్చి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెరచాటు ప్రయత్నాలు ఎన్నికల ప్రచారం గడువు సోమవారంతో ముగియనుంది. ఇన్నాళ్లు ఓట్లను రాబట్టుకునేలా ప్రచారాన్ని నమ్ముకోగా.. ఇకపై అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీల్లోని వ్యక్తులను తమ వైపు తిప్పుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. అలాగే, సాధారణ ఎన్నికల స్థాయిలో డబ్బు, మద్యం ఏరులై పారిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న జీపీల్లో ఓటుకు రూ.వేయి, కొన్నిచోట్ల అంతకు మించి పంచేందుకు అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ప్రలోభాలకు గురిచేస్తే ఫిర్యాదు చేస్తా!
నేలకొండపల్లి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే ఎన్నికల సంఘం అధికారులకు కు ఫిర్యాదు చేస్తామంటూ ఓ ఇంటి యజమాని ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన కె.సంతోష్ తమ కుటుంబంలోని ఓట్లను అమ్ముకోబోమని... డబ్బు, మద్యం, మాంసం వంటి బహుమతులు ఇవ్వొద్దని, ఒకవేళ బలవంతంగా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ వివరాలతో ఆయన ఇంటి వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా పలువురు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల అఽధికారి బెదిరించాడని ఫిర్యాదు మధిర: మండలంలోని పరిధిలోని వంగవీడు గ్రామపంచాయతీ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వేల్పుల జయరాజ్పై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి మఽధిర రూరల్ పోలీసుకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈనెల 11న జరిగిన పోలింగ్లో తనకు మూడు ఓట్ల మెజార్టీ రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సిద్దిపోగు ప్రసాద్ రీకౌంటింగ్ కోరారని ఆమె వెల్లడించింది. రీకౌంటింగ్లోనూ తనకు మెజార్టీ వచ్చినా జయరాజ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించాడని తెలిపారు. శనివారం ఉదయం ఆయన తన ఇంటి వద్దకు వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి మళ్లీ ఓట్లు లెక్కిస్తానని చెప్పడంతో వెళ్తుండగా మార్గమధ్యలో బెదిరించాడని వాపోయింది. ఓటమిని అంగీకరిస్తూ సంతకం పెట్టాలని బెదిరించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బకాయిదారులకు రెడ్నోటీస్లు
● కేఎంసీ పరిధిలో పన్నుల వసూళ్లపై దృష్టి ● వంద శాతం ఆదాయం నమోదుకు కార్యాచరణ ● క్షేత్రస్థాయికి వెళ్లేలా సిబ్బందికి ఆదేశాలుఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ము న్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పరిధిలో పన్ను బకాయిలు వంద శాతం వసూలు చేసేలా అధికారులు దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు వేచి చూడకుండా ముందుగానే పన్నులు వసూలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. కేఎంసీ ఖజానా ఖాళీ అవుతుండడం, ఇదిలాగే కొనసాగితే ఉద్యోగుల వేతనాలతో పాటు ఇతర ఖర్చులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఆస్తి పన్నుల వసూళ్లలో వేగం పెంచారు. ఇప్పటికే వార్డు ఆఫీసర్లు, బిల్లు కలెక్టర్లకు సహాయకులను ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బకాయిదారులకు రెడ్నోటీసులు జారీ చేస్తున్నారు. కమిషనర్ ఆదేశాలతో.. పన్నుల వసూళ్లలో పురోగతి లేకపోవడంతో నేరుగా కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య రంగంలోకి దిగారు. వసూళ్ల బాధ్యతలో ఉన్న ఉద్యోగులు కార్యాలయాన్ని వదిలిపెట్టి క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. ఉద్యోగులు ఫీల్డ్లో ఉండడమే కాక రోజువారీ వసూళ్లు వివరాలు తెలపాలని స్పష్టం చేయడంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు సిబ్బందిలో కదలిక వచ్చింది. బకాయిదారుల గుర్తింపు అధికారులు ప్రస్తుతం పన్నుల వసూళ్లతో పాటు, భారీగా బకాయిలు ఉన్న వారిని గుర్తించడంలో నిమగ్నమయ్యారు. భారీగా బకాయిలు ఉండి, ఏళ్ల తరబడి పన్నులు చెల్లించని వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 250 మందిని గుర్తించిన అధికారులు వారిలో 40 మందికి రెడ్నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసుల జారీ తర్వాత కూడా పన్ను కట్టని వారిపై మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా బకాయిదారులపై ఒత్తిడి పెంచి పన్నులు రాబట్టడమే లక్ష్యంగా ఉద్యోగులు కృషి చేస్తున్నారు. కేఎంసీ ఖజానా అడుగంటడంతో ప్రస్తుతం ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులకు వేతనాలు, పారిశుద్ద్య వాహనాలకు ఇంధన ఖర్చులు మాత్రమే చెల్లిస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు, ఈఎండీలు, ఎఫ్ఎస్డీ వంటి బిల్లులను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇంకొన్ని రోజు లు ఇలాగే గడిస్తే వేతనాలు, పారిశుద్ద్య ఖర్చులకు కూడా నిధులు వెచ్చించలేని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు పన్ను వసూళ్లే మార్గమని భావించారు. ఈమేరకు కార్యాలయంలో అదనంగా ఉన్న సిబ్బందిని సహాయకులుగా నియమించి వసూళ్లలో వేగం పెంచేలా పర్యవేక్షిస్తున్నారు. ఖాళీగా ఉన్న సిబ్బందితో పాటు పలు విభాగాల్లోని కొందరు కంప్యూటర్ ఆపరేటర్లను సైతం వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లకు సహాయకులుగా నియమించారు. అయితే, ఇందులో కొందరు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయంలోనే ఉండేలా ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయిస్తున్నట్లు తెలిసింది. -
అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ బస్సులు
భద్రాచలంఅర్బన్: అయ్యప్ప మాలధారులు శబరిమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి బస్సులు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. 36 సీట్లు ఉండే సూపర్ లగ్జరీ, 40 సీట్లు ఉండే డీలక్స్, 49 సీట్లు ఉండే ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు రాజధాని బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. కిలోమీటర్కు డీలక్స్ బస్సుకు రూ. 57, లగ్జరీ బస్సుకు రూ.59, ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.68, ఏసీ రాజధాని బస్సుకు రూ.77 చొప్పున అద్దె చెల్లించాలని అధికారులు తెలిపారు. స్వాములు వంట సామగ్రి తీసుకెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగా అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని బస్సులకు వెయిటింగ్ చార్జి గంటకు రూ.300గా నిర్ణయించారు. ఒక బస్సు బుక్ చేస్తే గురుస్వామితోపాటు ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు మణికంఠ స్వాములు, అటెండర్కు చార్జి మినహాయింపు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేస్తే గురుస్వామికి రోజుకు రూ.300 చొప్పున కమీషన్ చెల్లించనున్నారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లను కేటాయించనున్నారు. బస్సుల కోసం డిపోమేనేజర్లను సంప్రదించాలని, ఇతర తీర్థయాత్రలకూ బస్సులు ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు.అద్దెకు ఇస్తున్న యాజమాన్యం శబరిమల యాత్ర భక్తుల కోసం బస్సులను అద్దెకు ఇస్తున్నాం. కిలోమీటరు చొప్పున, వెయిటింగ్ సమయాన్ని లెక్కగట్టి తగిన ధర నిర్ణయిస్తాం. ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాలి. – జంగయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్, భద్రాచలం -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన శ్రీరామాంజనేయరెడ్డి – శారద దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. రామయ్యను దర్శించుకున్న ఆండవన్స్వామి.. శ్రీరంగంలోని శ్రీ పౌండరీపుర స్వామి ఆశ్రమానికి చెందిన ఆండవన్ స్వామి శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంట ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు రఘునాథపాలెం: మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారంటూ అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపా రు. మండలంలోని వీ.వీ.పాలెంకు చెందిన చండ్ర రమేష్ తనకు చెందిన రెండెకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నాడు. అదేగ్రామానికి చెందిన కుతుంబాకు రాంప్రసాద్ దున్నించి పంటను ధ్వంసం చేశాడని శనివారం రమేష్ ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసినట్లు సీఐ తెలిపారు. -
పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్ : పాల్వంచ మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు జరుపుతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు. ఏఐఎఫ్టీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా సైదులు ఖమ్మంగాంధీచౌక్: ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్(ఏఐఎఫ్టీపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడిగా జిల్లాకు చెందిన ఉల్లిబోయి న సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. కాగా, సైదులు 2019లో జిల్లా జీఎస్టీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఫౌండర్గా, జనరల్ సెక్రటరీగా రెండుసార్లు, వైస్ ప్రెసిడెంట్గా ఒకసారి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికవడంపై పలువురు అభినందించారు. యువకుడి ఆత్మహత్యాయత్నం సత్తుపల్లిరూరల్: వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి మండలం కొమ్ముగూడెంకు చెందిన సోయం అజయ్ కలుపు మందు తాగగా, కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది చేరుకుని బాధితుడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అజయ్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయండిభద్రాచలంఅర్బన్: భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సారపాక ఐటీసీ గెస్హౌస్లో వారు న్యాయమూర్తికి శనివారం వినతిపత్రం అందజేశారు. భద్రాచలం, మణుగూరు ప్రాంతాల నుంచి 600 పైగా సెషన్స్ ట్రయల్ కేసులు కొత్తగూడెంలో పెండింగ్ ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో నివసించే నిరుపేదలు అంతదూరం వెళ్లాలంటే ఆర్థిక భారం అవుతోందని వివరించారు. గిరిజనులకు సత్వర న్యాయం అందించాలంటే భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు అవసరమని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. లేదంటే కొత్తగూడెం నుంచి ఒక అదనపు సెషన్స్ కోర్టును భద్రాచలానికి మార్చాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటా దేవదానం, ఉపాధ్యక్షుడు సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పుసాల శ్రీనివాస్, న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, టి.చైతన్య, మోహన్కృష్ణ, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
ఓసీల్లో మహిళా ఆపరేటర్లు
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో తొలిసారిగా మహిళా ఆపరేటర్లు అడుగుపెట్టనున్నారు. ఆఫీస్ విధులకే పరిమితమైన మహిళలు ఇక నుంచి యంత్రాలతో బొగ్గు తవ్వకాలు చేపట్టడంతోపాటు రవాణా చేయనున్నారు. ఇందుకోసం సంస్థ సీఎండీ బలరాం చొరవ తీసుకున్నారు. జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న మహిళల నుంచి గత సెప్టెంబర్లో దరఖాస్తులు ఆహ్వానించగా, ఓసీల్లో పనిచేసేందుకు 43 మంది ముందుకువచ్చారు. ప్రస్తుతం వారికి సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు, ప్రధాన ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఖాళీల లభ్యత ఆధారంగా ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ–5 డిసిగ్నేషన్తో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అనుకూలమైన యంత్రాలు.. ఓసీల్లో డోజర్లు మహిళా ఆపరేటర్లు పనిచేసేందుకు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తక్కువ వైబ్రేషన్ ఉండటంతో సులభంగా ఆపరేట్ చేసేందుకు వీలుగా ఉంటాయి. రోడ్లను లెవలింగ్ చేసేందుకు ఓసీల్లో గ్రేడర్లను, దుమ్ము, ధూళి లేవకుండా వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తారు. బరువులు ఎత్తడానికి హైడ్రాలిక్ క్రేన్లను ఉపయోగిస్తారు. 35 నుంచి 60 టన్నుల సామర్థ్యం కలిగిన చిన్న డంపర్లు కూడా ఉన్నాయి. ఆయా యంత్రాల్లో ఆటోమేటిక్ వ్యవస్థ, పవర్ స్టీరింగ్ వంటి సౌకర్యాలు ఉండటంతో మహిళలు సులభంగా పనిచేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మైనింగ్ జోన్లలో సేఫ్టీ రెస్పాన్స్ వాహనాలుగా ఉండే అంబులెన్స్లు కూడా మహిళా డ్రైవర్లు నడపవచ్చు. స్టాకర్ రిక్లైయిమర్, కన్వేయర్ సిస్టమ్, క్రషర్ ఆపరేటర్ వంటివి జాయ్స్టిక్, బటన్లతో నడిపే యంత్రాలపై మహిళలు తేలికగా పనిచేయవచ్చని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఒత్తిడి, శక్తి వినియోగంలేని యంత్రాలతో పని -
17ఏళ్ల అనంతరం కుటుంబం చెంతకు...
ఖమ్మంఅర్బన్: కొడుకు దూరమయ్యాడనే బెంగతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కన్నుమూశారు. అలా 17ఏళ్లు గడిచాక ఆ వ్యక్తి కుటుంబం చెంతకు చేరగా.. చనిపోయాడని భావించిన వ్యక్తి తిరిగిరావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాలు... ఈ ఏడాది ఆగస్టులో మహబూబాబాద్ జిల్లా గార్లలో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండగా అక్కడి పోలీసులు ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్కు అప్పగించారు. దీంతో ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఆయనకు చికిత్స చేయిస్తుండగా ఇటీవల కోలుకున్నా డు. తన పేరు షేక్ నయీం అని, మహారాష్ట్ర రాష్ట్రం అమరావతి జిల్లా చమన్నగర్ వాసినని చెప్పగా అక్కడి పోలీసులను సంప్రదించి వారి ద్వారా కుటుంబం ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో శనివా రం నయీం అన్న షేక్హసన్ తదితరులు ఖమ్మం రావడంతో శ్రీని వాసరావు వారికి అప్పగించాడు. కాగా, షేక్ నయీం ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడని, పెళ్లయిన కొన్నాళ్లకే భార్య వదిలేసి వెళ్లడంతో మతిస్థిమితం కోల్పోయిన ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు తెలిపారు. ఈక్రమాన తల్లిదండ్రులు బెంగతో కన్నుమూశారని, ఇప్పుడు అన్నం సేవా ఫౌండేషన్ చొరవతో నయీం తమకు దక్కాడని ఆయన సోదరుడు సంతోషం వ్యక్తం చేశాడు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
● క్రిటికల్ కేంద్రాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికూసుమంచి/కామేపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈమేరకు ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. రెండో విడత గ్రామపంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుండగా కూసుమంచి జెడ్పీ ఉన్నత పాఠశాల, కామేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్యోగులకు సామగ్రి పంపిణీని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కామేపల్లి మండలాల పరిధిలోని సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు పోలింగ్ జరగనుందని తెలిపారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని, నిర్ణీత సమయంలో ఓటర్లు కేంద్రాలకు రావాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు తెలిపారు. కాగా, ఉద్యోగులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసుకుని, లోటుపాట్లు, గందరగోళానికి తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అవసరమైతే సూచనలు చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగానే రెండు గంటలకు లెక్కింపు మొదలుపెట్టి ఫలితాలు వెల్లడించాలని, ఆతర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండలాల ప్రత్యేక అధికారులు ఎం.వీ.మధుసూదన్, శ్రీలత, ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ బి. నివాసులు, తహసీల్దార్లు సుధాకర్, రవికుమార్, ఎంపీడీఓలు రవీందర్, జశ్వంత్కుమార్, ఎంఈఓ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..
ఖమ్మంక్రైం: ఎన్నికలు జరిగే మండలాల్లో 163 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఈమేరకు ఆయా మండలాల్లో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ రెండో విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక 77 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అడిషనల్ డీసీపీ స్దాయి అధికారులతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. కాగా, డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా చేపట్టిన తనిఖీల్లో రూ.22లక్షల నగదు, రూ.12లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే, 1,059 కేసుల్లో 7,129మందిని బైండోవర్ చేశామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు నాయకులు సహకరించాలని సూచించారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ఆవరణలోని స్వామివారి పాదం, మూలవిరాట్కు పంచామృతంతో వేదమంత్రాల నడుమ అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన కల్యాణం నిర్వహించారు. ఆతర్వాత పల్లకీ సేవ నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: సీనియర్స్ విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి పురుషులు, మహిళల నెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయి. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఈ పోటీలు జరుగుతాయని నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు వెంట తీసుకుని ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గం ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మూడేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఆర్.సంపత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి.ఉపేందర్, కోశాధికారిగా ఏ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకాష్ ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా సురేష్, భార్గవ్, సీహెచ్.ప్రభుకిషోర్, సంయుక్త కార్యదర్శులుగా ప్రభుదాస్, కె.కవిత, ప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.ఉమాశంకర్, లోకేష్, వసంత్, ప్రచార కార్యదర్శిగా ఎస్.డీ.గౌసియాబేగం, కార్యవర్గ సభ్యులుగా ఝాన్సీ, సంధ్య, కౌసల్య ను ఎన్నుకున్నారు. ‘నవోదయ’ ప్రవేశ పరీక్షకు 2,995మంది హాజరు కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది చొప్పున, ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేయగా 3,737 మంది విద్యార్థులకు 2,995మంది హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీఈఓ, సింగరేణిలోని పరీక్షా కేంద్రాన్ని పాలేరు విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తనిఖీ చేశారు. -
మలివిడతకు రెడీ
రెడ్నోటీసులు... ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా బకాయిదారులకు రెడ్నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఏకగ్రీవాలు పోగా మిగతా సర్పంచ్ స్థానాలు, వార్డుల్లో పోలింగ్కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాక, ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ల ఎన్నిక ఉంటుంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బ్యాలెట్ పేపర్లు సరి చూసుకుంటున్న సిబ్బంది160 జీపీలు.. 1,379 వార్డుల్లో పోలింగ్ రెండో విడతగా 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డుల్లో ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతనెల 30 నుంచి ఈనెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు 1,055, వార్డులకు 4,160 నామినేషన్లు దాఖలు కాగా 19 గ్రామపంచాయతీల్లో సర్పంచ్లతోపాటు వార్డుస్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. అలాగే, నాలుగు జీపీల్లో సర్పంచ్ స్థానాలే ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 23 స్థానాలు పోగా 160 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇక ఏకగ్రీవమైన 306 వార్డులు, నామినేషన్లు దాఖలు కాని ఒక వార్డు మినహా 1,379 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ స్థానాలకు 451 మంది, వార్డులకు 3,352 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 1,526 కేంద్రాలకు గాను 304 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనుండగా, ఓటర్లకు సౌకర్యాలు కల్పించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వై లెన్స్ సహా 1,526 బృందాలు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తాయి. ఉద్యోగులకు సామగ్రి పంపిణీ మండల స్థాయిలో 20కేంద్రాల ద్వారా సిబ్బందికి బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని శనివారం అందజేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లిరావడానికి బస్సులు కేటాయించారు. కూసుమంచి, కామేపల్లిల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ముదిగొండ, నేలకొండపల్లిల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. ఖమ్మంరూరల్ మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్దత్ పరిశీలించి ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్.. ఆ వెంటనే కౌంటింగ్ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు సజావుగా, పారదర్శకంగా జరిగేలా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తాత్కాలిక స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటుచేయడంతో పాటు సీసీ టీవీలు బిగించారు. పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్లు, ఇతర సామగ్రిని స్ట్రాంగ్రూమ్లో భద్రపర్చి, రెండు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తూ ఫలితాలను ప్రకటిస్తారు. భారీ భద్రత పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రెండు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు కూడా చేరుకున్నాయి. భద్రతను అడిషనల్ డీసీపీలు పర్యవేక్షిస్తూ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్మొబైల్ పార్టీలు, ఐదు ఎఫ్ఎస్టీ బృందాలు, 15 ఎస్ఎఫ్టీ బృందాల ద్వారా నిఘా వేయనున్నారు. మొత్తంగా 304 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి వెబ్కాస్టింగ్కు ఏర్పాటు చేశారు. అలాగే, 77 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్ల దాఖలు నుంచే నిఘా పెంచారు. -
రెండో విడత ఎన్నికలకు సిద్ధం
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడతగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆరు మండలాల్లో ని 160 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు 451 మంది, 1,379 వార్డులకు 3,352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడంతో పాటు 1,831 పోలింగ్ అధికారులు, 2346 మంది ఓపీఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. కాగా, 28 ప్రాంతాల్లో 304 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామ ని వెల్లడించారు. ఈ విడతలో 2,51,327 మంది ఓటర్లు ఓటు హ క్కు వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. భూవివాదాలపై అవగాహన అవసరం భూవివాదాలు, చట్టాలపై పోలీసు అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న ట్రెయినీ ఐపీఎస్లకు భూవివాదాలు, శాంతి భద్రతల నిర్వహణపై కలెక్టర్ అనుదీప్ వీసీ ద్వారా అవగాహన కల్పించారు. ప్రభుత్వ సేవలు, భూ సమస్యల పరిష్కార విధానాలు, కోర్టు వ్యవహారాలు, పోలీసుశాఖతో సమన్వయం, భూభారతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. అనంతరం ట్రెయినీ ఐపీఎస్లు పాలనా పారదర్శకత, బాధ్యత, క్షేత్రస్థాయి సవాళ్లు, భూసంబంధిత అంశాలు, కోర్టు కేసులపై అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. భూవ్యవహారాలకు సంబంధించి పోలీసు అధికారులు కనీస పరిజ్ఞానం, అవగాహన పెంచుకుంటే శాంతిభద్రతల నిర్వహణలో ఉపయోగపడుతుందని తెలిపారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
నెమ్మదిగా రోప్వే పనులు
● ఇంకా లోయర్ స్టేషన్ దగ్గరే కసరత్తు ● పూర్తి కావడానికి రెండేళ్లకు పైగా సమయం ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం పర్యాటక రంగంలో కలికితురాయిగా నిలుస్తుందని భావిస్తూ ఖిల్లాపైకి చేపడుతున్న రోప్ వే నిర్మాణ పనులు ఆలస్యమయ్యే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నరలోగా రోప్వే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా రెండేళ్లు, అంతకు మించి సమయం పడుతుందని తెలుస్తోంది. రోప్వే నిర్మాణం, ఖిల్లాపై సౌకర్యాల కల్పనకు పర్యాటక శాఖ రూ.29 కోట్లు కేటాయించగా, ఇందులో రోప్ వే నిర్మాణానికి రూ.15 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు కోల్కత్తాకు చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకుని ఇటీవల మొదలుపెట్టాడు. కానీ లోయర్ స్టేషన్ ప్రతిపాదిత ప్రాంతం నుంచి అడుగు ముందుకు పడకపోవడం, ఇక్కడే పనులకు మరో నెల పట్టే అవకాశముండగా మొత్తం పనుల్లో ఆలస్యం జరిగే అవకాశముందని భావిస్తున్నారు. 236 మీటర్ల మేర రోప్వే ఖిల్లా కింది భాగం నుంచి పైవరకు 236 మీటర్ల మేర రోప్వే నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే, లోయర్ స్టేషన్ నిర్మించే ప్రాంతంలో ఇళ్లు ఖాళీ చేయించాల్సి రావడం, అక్కడ చాలా లోతు వరకు రాళ్లు ఉండడంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. లోయర్ స్టేషన్ నిర్మించాక ఇతర పనులు వేగంగా జరుగుతాయని చెబుతున్నా ప్రభుత్వం విధించిన 18నెలల గడువులోగా పూర్తవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాళ్ల తవ్వకాలు పూర్తి కాగానే లోయర్ స్టేషన్ నిర్మిస్తామని, ఆపై అప్పర్ స్టేషన్ నిర్మాణం, రోప్వే ఏర్పాటు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తామని అధికారులు చెబుతున్నారు. నాలుగు క్యాబిన్లు.. పైన పార్క్లు రోప్వే నిర్మాణంలో భాగంగా నాలుగు క్యాబిన్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో రెండు పైకి, మరో రెండు కిందకు రాకపోకలు సాగిస్తాయి. అంతేకాక ఖిల్లాపై పిల్లలు, పెద్దలు సేదతీరేలా ఆధునాతనహోటల్, వాటర్ షౌంటెన్లు, అమ్యూజ్మెంట్ పార్క్, మినీ థియేటర్, ఆట పరికరాలు ఏర్పాటుచేయనున్నారు. అంతేకాక విజ్ఞానం పెంపొందించేలా మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదించారు. రోప్వే పూర్తయితే ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా మారనున్నందున పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
ముక్కోటి పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో ఈనెల 29, 30వ తేదీల్లో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల వాల్ పోస్టర్లను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు పూర్తి సమాచారం తెలిసేలా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తామని తెలిపారు. సౌకర్యాల కల్పపై ఈనెల 15న భద్రాచలం సబ్ కలెక్టరేట్లో డివిజన్స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ దామోదర్రావు, అర్చకులు పాల్గొన్నారు.స్వర్ణకవచధారణలో రామయ్యభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవా రుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సే వ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం తదితర పూజలు చేశారు. -
‘వేట’ ముగిసిందా ?!
సత్తుపల్లి: సత్తుపల్లి అర్బన్పార్కులో చుక్కల దుప్పులను తుపాకీతో వేటాడిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు ఆ తర్వాత విచా రణలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందులో ఇతర వేటగాళ్ల పాత్ర ఉందా.. వారికి ఎవరైనాసహకరించారా అన్న కోణంలో విచారణ ముందుకు సాగడం లేదు. అసలు విచారిస్తున్నారా, లేదా అన్న అంశంపై స్పష్టత లేకపోగా, అధికారులు ఏ అంశాన్ని బయటకు వెల్లడించకపోవడం చర్చకు దారి తీస్తోంది. వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ సత్తుపల్లి పార్క్లో దుప్పుల వేట సాగుతోందని, ఓ వ్యక్తి వివాహ విందులో దుప్పి మాంసం వడ్డించారనే సమాచారంతో ‘సాక్షి’లో గతనెల 29న ‘తూటా దూసుకెళ్తోంది..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో విషయం వెలుగులోకి రాగా వరుస కథనాలు వస్తుండడంతో అటవీ శాఖ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తొలుత ఇద్దరిని అరెస్ట్ చేయగా, వారం తర్వాత మరో ఇద్దరు లొంగిపోయారని సత్తుపల్లి ఎఫ్డీఓ మంజుల ప్రకటించారు. ఆపై సైలెన్సర్ బిగించిన తుపాకీతో దుప్పులను వేటాడినట్లు గుర్తించామని, తదుపరి చర్యల కోసం రెండు జిల్లాల పోలీసు అధికారులు, భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు డీఎఫ్ఓ సిద్ధార్ధ విక్రమ్సింగ్ తెలిపారు. జవాబు లేని ప్రశ్నలెన్నో.. దుప్పులను వేటాడినట్లు నలుగురిని అరెస్ట్ చేయగా, ఇంకా అందులో ఎవరి పాత్ర లేదా అన్న ప్రశ్నకు అటవీశాఖ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. సత్తుపల్లి, దమ్మపేట మండలాల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా కొందరు వేటగాళ్లు వచ్చారనే ప్రచారం జరుగుతున్నా స్పష్టత ఇవ్వడంలేదు. ఐదు దుప్పులనే వేటాడారా.. ఇంకా ఎన్నింటిని హతమార్చారు, ఆ మాంసం ఎక్కడ విక్రయించారనే వివరాలు వేటగాళ్లను రిమాండ్కు తరలించే ముందు తెలుసుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేశారా, లేదా అన్నది తెలియరావడం లేదు. ఇక దుప్పి మాంసాన్ని ఓ వివాహ విందులో వడ్డించినట్లు తెలిసినా, ఎవరెవరు హాజరయ్యారు, ఆ ఫంక్షన్ హాల్ పరిసరాల్లో ఆధారాలు సేకరించారా, హతమార్చిన వన్యప్రాణుల చర్మాలను స్వాధీనం చేసుకున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కాగా, వేటలో పాల్గొన్న దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంకు చెందిన మెచ్చా రఘు నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకోగా, ఆయన లైసెన్స్ను దుర్వినియోగం చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అధికారుల బాధ్యత లేదా? సత్తుపల్లి అటవీశాఖ డివిజన్ పరిధిలో ఎఫ్డీఓ, రేంజర్, ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లతో పాటు సుమారు 100 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్బన్పార్కులో వరుస ఘటనలు జరుగుతున్నా.. ఏ ఒక్కరికి కనీస సందేహం రాకపోవడం గమనార్హం. ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న వారిపై నిఘా పెట్టడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. ఎవరిపైనా చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధ్యులుగా చేసి విధుల నుంచి తొలగించిన అధికారులు.. రెగ్యులర్ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. ఈ అంశంపై సత్తుపల్లి ఎఫ్డీఓ వాడపల్లి మంజులను వివరణ కోరగా.. అంతర్గతంగా అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, అది పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
ఈ గెలుపు ప్రజాపాలనకు నిదర్శనం
ఖమ్మం అర్బన్: సర్పంచ్లుగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడం తమ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాపాలనకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెం మండలం నుంచి గెలుపొందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, పాలకవర్గాలను ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సన్మానించి మాట్లాడారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుండగా, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సర్పంచ్లు, పాలకవర్గాలు గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. వివాదాలకు తావు లేకుండా సమన్వయంతో వ్యవహరిస్తూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నిజాయితీతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, ఖమ్మం నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగళ్ల దీపక్చౌదరి, రాష్ట్ర విత్తన గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్, ఆత్మ కమిటీలు, పీఏసీఎస్ల చైర్మన్లు యరగార్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తాతా రఘురామ్, రావూరి సైదుబాబు, నాయకులు పువ్వాళ దుర్గాప్రసాద్, మానుకొండ రాధాకిషోర్, మురళి, చోటా బాబు, గుత్తా వెంకటేశ్వరావు, సండ్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.సర్పంచ్ల సన్మాన సభలో మంత్రి తుమ్మల -
విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం అర్బన్: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. వరదలు, పరిశ్రమలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరదలు వచ్చినప్పుడు, పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై నమూనా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ వీసీకి కలెక్టరేట్ నుంచి హాజరైన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆతర్వాత అధికారులతో సమావేశమయ్యారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు నకుల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్ను విజయవంతం చేద్దాం ఖమ్మం సహకారనగర్: ఖమ్మం బల్లేపల్లిలోని ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో ఈనెల 20, 21వ తేదీల్లో జరిగే జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ను జయప్రదం చేసేలా అందరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ సూచించారు. సైన్స్ మ్యూజియంలో శుక్రవారం జరిగిన సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడుతూ కమిటీల కన్వీనర్లు, సభ్యులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు తమ ఎగ్జిబిట్ల వివరాలను గూగుల్ ఫాం ద్వారా ఈనెల 18వ తేదీ రాత్రి వరకు పంపించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈసమావేశంలో కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, సీఎంఓ ప్రవీణ్ కుమార్, జీసీడీఓ రూబీ, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, ఎంఈఓలు శైలజలక్ష్మి, శ్రీనివాసరావు, రాములు, వెంకటేశ్వర్లు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో పాలుపంచుకోవాలి ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదులో అందరూ చురుగ్గా పాల్గొనాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాస్ సూచించారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయడంతో పాటు 2026 డైరీ రూపకల్పనలో పాలుపంచుకోవాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేయడంతో పాటు ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. నాయకులు జెడ్.ఎస్.జైపాల్, విజయ్ కుమార్, గంగవరపు బాలకృష్ణ, కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, ఎస్.లలితకుమారి, ఎస్.రాధికారెడ్డి, తాళ్లూరి శ్రీకాంత్, భూసా చంద్రశేఖర్, హరికృష్ణ కోణార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకనకదుర్గమ్మకు పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మ వారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని అర్చకులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు
నేలకొండపల్లి: రెండో విడతగా ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. మండలంలోని కొత్తకొత్తూరులో సామగ్రి డిస్ట్రిబ్యూసన్ కేంద్రం, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. నేలకొండపల్లి మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఆదివారం పోలింగ్ జరగనుండగా, నాలుగు జోన్లు, ఆరు రూట్లుగా విభజించినట్లు తెలిపారు. కొత్తకొత్తూరు ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలోని పది కౌంటర్ల ద్వారా ఉద్యోగులకు సామగ్రి పంపిణీ చేసి 27 బస్సుల్లో కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు. నేలకొండపల్లి ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ సీ.హెచ్.శివ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కో తీరు
ఒక్కోచోట..సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడతలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కినా.. ఒక్కో పంచాయతీలో ఒక్కో తీరుగా ఫలితాలు వెలువడ్డాయి. పార్టీ ప్రభావం, సానుభూతి, అభ్యర్థుల వ్యక్తిత్వం, డబ్బు పంపిణీ తదితర అంశాలు ఫలితాలను తారుమారు చేశాయి. మెజార్టీ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలవడానికి అధికారం ‘చేతి’లో ఉండడమే కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే, స్థానిక కుంపట్లతో ఆ పార్టీ పలు పంచాయతీలను కోల్పోగా.. ఇంకొన్నిచోట్ల రెబల్స్ విజయఢంకా మోగించారు. వైరాలో కాంగ్రెస్ సత్తా చాటి.. వైరా నియోజవకర్గంలో వైరా, కొణిజర్ల మండలాల్లో 49పంచాయతీలకు గాను 38 చోట్ల కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్, రెండు సీపీఎం, ఒకటి సీపీఐ మద్దతుదారులు గెలవగా..ఇతరులు నాలుగు పంచాయతీల్లో పాగా వేశారు. మధిర నియోజకవర్గంలోని మండలాలతో పోలిస్తే వైరా, కొణిజర్ల మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. వైరాలో 22పంచాయతీలకు ఏకంగా 20 పంచాయతీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం 37పంచాయతీలకు గాను ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ 26 పంచాయతీలను కై వసం చేసుకోగా బీఆర్ఎస్ 11 పంచాయతీలను దక్కించుకుంది. మూడు పంచాయతీలను బీఆర్ఎస్ మద్దతుదారులు తక్కువ మెజార్టీతో కోల్పోయారు. సానుభూతితో భారీ మెజార్టీ చింతకాని మండలం పాతర్లపాడు జీపీలో 12వార్డులకు గాను బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం బలపరిచిన అభ్యర్థులు 11వార్డులు గెలుచుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా సీపీఎం మద్దతు తెలిపిన ఓబినబోయిన లక్ష్మి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ మద్దతుదారురాలు బొర్రా ఉమపై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఈ గ్రామానికి చెందిన సీపీఎం నేత సామినేని రామారావు హత్యకు గురయ్యాడు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సీపీఎం మద్దతుదారులు ఇంత మెజార్టీతో గెలవడానికి రామారావుపై ఉన్న సానుభూతే కారణమన్న చర్చ జరుగుతోంది. గతంలో పలుమార్లు సీపీఎం ఈ గ్రామపంచాయతీని దక్కించుకున్నా ఇన్ని వార్డులు గెలవలేదు.. ఇంత మెజార్టీ రాలేదు. పోటాపోటీ చింతకాని మండంలోని ఓ పంచాయతీలో ఒక అభ్యర్థి ఓటుకు రూ.7,500, మరో పంచాయతీలో రూ.5 వేల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఓటుకు ఎంత ఇచ్చాడో తెలుసుకుని అంతకన్నా ఎక్కువ ఇచ్చేలా ఇక్కడి అభ్యర్థులు పోటీ పడినట్లు సమాచారం. ఎర్రుపాలెం మండలంలో బీఆర్ఎస్ మద్దతుదారులు ఐదు పంచాయతీల్లో విజయం సాధించారు. ఈ అభ్యర్థులకు ‘స్థానికం’గా బలం ఉండడంతో వీరి గెలుపు సాధ్యమైందన్న రాజకీయ చర్చ జరుగుతోంది. మొదటి విడతలో జనరల్కి రిజర్వ్ అయిన పలు పంచాయతీల్లో ఓటరుకు డబ్బు పంపిణీ పోటాపోటీగా చేసినట్లు తెలుస్తోంది. తక్కువ ఓట్లు.. వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో స్థానిక నేతల మధ్య వర్గపోరుతో పలు పంచాయతీలను తక్కువ ఓట్లతో కోల్పోవడం, మరికొన్ని పంచాయతీల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులకు ఎక్కువ మెజార్టీ తెచ్చిపెట్టాయన్న ప్రచారం జరుగుతోంది. బోనకల్ మండలంలోని ఆళ్లపాడు, లక్ష్మీపురం పంచాయతీలు తక్కువ ఓట్లతో కాంగ్రెస్ కోల్పోయింది. అలాగే మధిర మండలంలోని బయ్యారంలో రెండు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బయటపడింది. ఎర్రుపాలెం మండలంలో పలు పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్స్ పోటీ చేశారు. ఇందులో కొన్ని కాంగ్రెస్ మద్దతుదారులు, ఇంకొన్ని రెబల్స్ గెలిచినా మెజార్టీపై మాత్రం ప్రభావం చూపింది. బోనకల్ మేజర్ గ్రామపంచాయతీని అత్యధికంగా 960 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారురాలు బానోతు జ్యోతి దక్కించుకుంది. ఇక్కడ 3,770 ఓట్లకు 3,406 ఓట్లు పోలయ్యాయి. ఈ పంచాయతీలో కాంగ్రెస్ వర్గ పోరు ఆ పార్టీ మద్దతుదారుల ఓటమికి కారణమైనట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి ముందు రెబల్స్ నామినేషన్లు వేసి ఎవరికి వారు తామే బరిలో ఉంటామని ప్రచారం చేసుకున్నారు. అయితే, నాయకులు, అభ్యర్థులు నచ్చచెప్పడంతో ఉపసంహరించుకున్నా ఆ తర్వాత పట్టనట్లు ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీ మెజార్టీతో గెలవగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారురాలిగా బరిలో నిలిచిన భూక్యా మంగమ్మ ఓటమి పాలైంది. -
అవినీతి పరులపై
● ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్, క్యూ ఆర్ కోడ్తో స్టిక్కర్లు ● ప్రభుత్వ కార్యాలయాల్లో అంటిస్తూ ప్రచారం ● సెల్ఫోన్లో స్కాన్ చేసి ఫిర్యాదుకు అవకాశం ఫిర్యాదు చేయండిపాల్వంచరూరల్: చట్టప్రకారం ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటు చేసింది. ఏసీబీ జిల్లాలో ఇటీవల దాడులు చేస్తూ అవినీతి అధికారులను అరెస్ట్ చేసి, జైలుకు పంపుతోంది. ఈ క్రమంలోనే సులువుగా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూర్ కోడ్ స్కానర్లకు సంబంధించిన స్టిక్కర్లు ఏర్పాటు చేసింది. స్మార్ట్ఫోన్ ద్వారా క్యూర్ కోడ్ను స్కాన్చేసి సులభంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. 2025లో 20 కేసులు నమోదు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఫారెస్టు, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి అధికంగా జరుగుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈఏడాది జనవరి నుంచి ఈనెల 9వ తేదీ వరకు వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 కేసులు నమోదు చేశారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను కటకటాల్లోకి పంపారు. తద్వారాఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నట్లు తేలింది. రెవెన్యూ శాఖలో ఆరు, పోలీసుశాఖలో మూడు, రిజిస్ట్రేషన్, వ్యవసాయశాఖల్లో రెండు చొప్పున, మైనార్టీ సంక్షేమం, ఇరిగేషన్, ఫారెస్ట్, మున్సిపల్, కార్మిక, ఎక్సెజ్, విద్యాశాఖల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇలా ఫిర్యాదు చేయవచ్చు ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు లంచం అడిగితే అదే ఆఫీసులో ఏసీబీ అధికారులు అంటించిన స్టికర్(క్యూర్ కోడ్) స్కాన్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలను నమోదు చేసి సెండ్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్కు ఓటీపీ నంబర్ వస్తుంది. టోల్ఫ్రీ నంబర్ 1064, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేష్ 91543 88981కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో ఏసీబీ అధికారులు సంప్రదించి వివరాలు సేకరించుకుని ఫిర్యాదుదారుని పేర్లను రహస్యంగా ఉంచుతారు. కాగా ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పనుల కోసం అధికారులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరం. అధికారులు ఇబ్బందులు పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరైనా వదిలిపెట్టం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా ఫిర్యాదులు చేయవచ్చు. – వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ -
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
వైరా: బాల్య వివాహాలు లేని సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్(ఎయిడ్) సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ సూచించారు. వైరాలోని మధు జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 2030 నాటికల్లా బాల్య వివాహాలను అరికట్టాలని ప్రభుత్వ శాఖల ద్వారా రెండున్నరేళ్ల నుంచి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఇందులో అందరూ పాలుపంచుకుని బాలికలకు మెరుగైన భవిష్యత్ దక్కలా పాటుపడాలని సూచించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పారాలీగల్ వలంటీర్ మాధవీలత, మధు కళాశాల సెక్రటరీ మల్లెంపాటి వీరభద్రం, కరస్పాండెంట్ రంజిత్, ప్రిన్సిపాల్ రాంబాబు, కే.వీ.చారి తదితరులు పాల్గొన్నారు. -
లెక్క పక్కాగా ఉండేలా..
● ఎరువులు, విత్తనాల వివరాల నమోదుకు పుస్తకం ● పీఏసీఎస్ల ఆధ్వర్యాన రైతులకు పంపిణీనేలకొండపల్లి: వానాకాలం సీజన్లో ఎరువుల కోసం రైతులు పడిన పాట్లు అన్నీఇన్ని కావు. సొసైటీలకు సమయానికి ఎరువులు చేరక, వచ్చిన ఎరువులు ఎవరు తీసుకెళ్లారో లెక్క తెలియకపోవడంతో కొందరు ఎక్కువ ఎరువులు తీసుకెళ్లగా, మరికొందరికి అసలే దక్కక పడిగాపులు కాశారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఏయే రైతు ఎన్ని ఎరువులు, ఎంత మొత్తంలో విత్తనాలు తీసుకున్నారో పూర్తి వివరాలు నమోదు చేసేలా పీఏసీఎస్ల ద్వారా పుస్తకాలు అందించనున్నారు. ఈ పుస్తకంతో రైతు సొసైటీకి వెళ్తే భూవిస్తీర్ణం ఆధారంగా ఎరువులు, విత్తనాలు అందించే అవకాశముంది. పూర్తి వివరాలు పీఏసీఎస్ల వారీగా సభ్యత్వం ఉన్న అన్నదాతలకు ‘రైతు ఎరువుల పాస్పుస్తకం’ పేరిట పుస్తకాలు అందిస్తున్నారు. నేలకొండపల్లి మండలంలోని బోదులబండ పీఏసీఎస్లో ఈ పుస్తకాల పంపిణీని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య ఇటీవల ప్రా రంభించారు. దశల వారీగా అన్ని పీఏసీఎస్ల పరిధి రైతులకు వీటిని అందజేయనుండగా వీటిపై రైతు పేరు, ఆధార్ నెంబర్, గ్రామం, మండలం, జిల్లాతో పాటు ఇతరత్రా వివరాలను నమోదు చేస్తారు. అలాగే, సేల్స్మెన్ ఫోన్ నంబర్లు, కేంద్రం తెరిచి ఉండే సమయం కూడా ముద్రించారు. రైతులు ఈ పుస్తకంతో వెళ్తే వారు తీసుకున్న ఎరువులు, విత్తనాల వివరాలను అందులో నమోదు చేయనున్నారు. భూవిస్తీర్ణం ఆధారంగా వీటిని పంపిణీ చేయనుండగా, పరిమితికి మించి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే పుస్తకంలోని వివరాల ఆధారంగా నిరా కరించే అవకాశముంది. తద్వారా అవసరం మేరకే విత్తనాలు, ఎరువులు తీసుకెళ్తారని, ఫలితంగా అందరికీ అందుతాయని అధికారులు చెబుతున్నారు. రైతులకు ప్రభుత్వం సరఫరా చేసే ఎరువులు, విత్తనాలు ఎంత మేరకు తీసుకున్నారో ఈ పుస్తకంలోని వివరాల ఆధారంగా తెలిసిపోతుంది. అంతేకాక భూవిస్తీర్ణం ఆధారంగానే పంపిణీ చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ పుస్తకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.రాధ, ఏఓ, నేలకొండపల్లి -
భద్రగిరిలో తీవ్ర నిరీక్షణ
● అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యంగా కౌంటింగ్ ● అందరికీ ఓటర్ల స్లిప్లు పంపిణీ చేయలేదనే ఆరోపణలు ● భద్రాద్రి జిల్లాలో భద్రాచలం జీపీలోనే అతి తక్కువ పోలింగ్ శాతం భద్రాచలం: అధికారుల నిర్లక్ష్యంతో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు పడిగాపులు కాశారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు సర్పంచ్ ఫలితాలు వెల్లడికాకపోవడంతో రాత్రంతా అభ్యర్థులు, వారి మద్దతుదారులు, కార్యకర్తలు చలిలో గజగజ వణికిపోయారు. గురువారం ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ముగియాల్సి ఉంది. ఒంటిగంటలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వడంతో కొంత సమయం పట్టింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్స్లు చేర్చి కౌంటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కానీ తీవ్ర జాప్యం జరిగింది. తన ఓటు హక్కును మరొకరు వినియోగించుకున్నారనే ఫిర్యాదుతో వెంకటలక్ష్మి అనే ఓటరుకు టెంపర్ ఓటును కేటాయించారు. ఆ ఓటు కౌంటింగ్, విధి విధానాలు స్థానిక ఎన్నికల అధికారులకు తెలియకపోవడంతో రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమాచారం తెలుసుకున్న అనంతరం బ్యాలెట్ బాక్సులోని ఓట్లను కట్టలు కట్టడం ప్రారంభించారు. దీంతో రాత్రి ఏడు గంటల వరకు కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఈ సమయంలో బయట వేచి చూస్తున్న అభ్యర్థులకు, పార్టీ కార్యకర్తలకు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సోషల్మీడియాలో విమర్శలు సైతం చేశారు. ఇతర పంచాయతీల్లో ఆ సమయానికి సర్పంచ్ ఫలితాలు సైతం వెలువడ్డాయి. అఽధికారుల నిర్లక్ష్యం వల్ల భద్రాచలం పంచాయతీ సర్పంచ్ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున వెలువడింది. అప్పటివరకు చలిలో అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి తక్కువగా భద్రాచలంలో ఓటింగ్ భద్రాద్రి జిల్లా మొత్తం మీదుగా అత్యధిక ఓటర్లు ఉన్న భద్రాచలం గ్రామపంచాయతీలో అతి తక్కువ ఓటింగ్ నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అత్యల్పంగా 48.87 శాతం పోలింగ్ నమోదయింది. ఓటర్లు స్లిప్లు ఇంటింటికీ చేరవేయడంలో ప్రభుత్వం విఫలమయిందనే ఆరోపణలు వచ్చాయి. పాత ఓటర్ల లిస్టు స్థానంలో కొత్త జాబితా విడుదల చేశారు. దీంతో ఓటరు క్రమసంఖ్య మారింది. ఓటరు జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాల వివరాలు ముందస్తుగా ప్రచారం చేయలేదు. దీంతో ఓటర్లు భద్రాచలంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రచారానికి అతి తక్కువ రోజులు ఉండటంతో వార్డు మెంబర్ పోటీదారులు తప్ప సర్పంచ్ పోటీదారులు అన్ని కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేయలేకపోయారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా ప్రభావం చూపలేకపోయారు. ఇతర ప్రాంతాలు, నగరాల్లో ఉంటున్న పట్టభద్రులు, ఉద్యోగులను భద్రాచలం తీసుకురాలేకపోయారు. ఇక ప్రధానంగా పోటీదారులు ఓటుకు నోటునే బలంగా నమ్ముకోవడంతో అత్యధిక ఓటర్లు, వృద్ధులు నోటు తీసుకొని చడీచప్పుడు చేయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో 40,761 ఓట్లకుగాను 19,838 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. -
సత్వర సేవలు..
● బాలింతలు, గర్భిణులకు అండగా ‘102’ ● ఉమ్మడి జిల్లాలో 30 వాహనాల ద్వారా లబ్ధి ● అత్యవసర సేవల్లో మేటిగా ‘108’ వాహనాలు ఖమ్మంవైద్యవిభాగం: అత్యవసర వైద్యసేవలు అందించటంలో 108, 102 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ వాహనాల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేయటంలో 108 వాహనాలు కీలక ప్రాత పోషిస్తుండగా, గర్భిణులు, బాలింతలను క్రమం తప్పకుండా పెద్దాస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించి తిరిగి గమ్యస్థానాలకు చేర్చడంలో 102 వాహనాలదే ప్రముఖ పాత్ర. ఈ వాహనాలు గర్భిణులు, బాలింతలు, అత్యవసర చికిత్స పొందే వారికి సంజీవనిలా ఉపయోగపడుతున్నాయి. అమ్మ ఒడి సేవలతో.. గతంలో గర్భిణులు ప్రతీనెలా వైద్య పరీక్షలతో పాటు ప్రసవ సమయాన ఆస్పత్రులకు వెళ్లటానికి ఇబ్బంది పడేవారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ఇతర వాహనాలు సమకూర్చుకొని అవస్థలు పడుతూనే వెళ్లే వారు. కానీ, 102 అమ్మ ఒడి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి ఇబ్బందులు తప్పాయి. వాహనాల్లో ఆశ కార్యకర్తలు వెంట ఉండి అవసరమైన పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వాహనంలో అత్యవసర చికిత్సకు వైద్య కిట్లు, ప్రసవానికి అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉన్నందున ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ప్రసవానంతరం కొన్ని నెలల వరకు తల్లీబిడ్డలకు అవసరమయ్యే టీకాలు వేయించేందుకు, ఇతర చికిత్స కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేర్చుతున్నారు. ఈ వాహనాల ద్వారా పీహెచ్సీలు, ఆరోగ్య ఉపకేంద్రాల వారీగా గర్భిణులు, బాలింతలకు సేవలందుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 వాహనాలు ఉండగా, గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో 1,89,088 మంది గర్భిణులు, బాలింతలు వీటి ద్వారా వైద్యసేవలు పొందారు. 50,862 మందికి అత్యవసర సేవలు ఉమ్మడి జిల్లాలో అత్యవసర వాహన సేవలు కీలకంగా మారాయి. ప్రమాద బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రులకు చేర్చటంలో 108 వాహనాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రసవ వేదనతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించటంలోనూ ముఖ్య భూమిక ఈ వాహనాలదే. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు ఉండటంతో తరచూ వాహన ప్రామాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయాన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తూ వందలాది మంది ప్రాణాలు నిలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 108 వాహనాలు 49 ఉండగా, భద్రాద్రి జిల్లాలో 28 వాహనాలు, ఖమ్మం జిల్లాలో 21 వాహనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లి అత్యవసర చికిత్స అవసరమైన రోగులను 108 వాహనం ద్వారా తరలిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 50,862 మందికి అత్యవసర చికిత్స అందించి వారి ప్రాణాలు నిలపడంలో 108 వాహనాలు, సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి జిల్లావాసులు 102, 108 వాహన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు సైతం వాహనాలు వెళ్తున్నాయి. 102 వాహనం ద్వారా ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం, బాలింతలకు అవసరమైన పరీక్షలు, చికిత్స అందిస్తున్నాం. ఫోన్ చేసిన పావు గంట లోపే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సమయంలో వాహనంలోనే ప్రసవం చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. – శివకుమార్, 108, 102 వాహనాల ప్రోగ్రామ్ మేనేజర్ -
ఎదురెదురుగా ఎంపీ, మాజీ మంత్రి
పాల్వంచరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పాల్వంచ మండలం దంతలబోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున గురువారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ గ్రామ స్కూల్ సెంటర్ వద్ద ఎదురుపడ్డారు. పరస్పరం అభివాదం చేసుకున్న వారు తిరిగి ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాగా, దంతలబోరు, నాగారం, నాగారంకాలనీ, లక్ష్మీదేవిపల్లి తదితర గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థుల తరఫున ప్రచారంలో ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరగదని గుర్తించి కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. ఇక వనమా వెంకటేశ్వరరావు మండలంలోని దంతలబోరు, తోగ్గూడెం గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. -
బద్ద్యాతండాలో మూడు సార్లు లెక్కింపు
రఘునాథపాలెం/సాక్షి నెట్వర్క్: మండలంలోని బద్ద్యాతండాలో గ్రామపంచాయతీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు తెలిపిన పెంట్యానాయక్ 260ఓట్లు సాధించగా, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కోటేష్కు 259ఓట్లు వచ్చాయి. దీంతో ఒక ఓటు మెజార్టీతో పెంట్యానాయక్ గెలిచినట్లు సాయంత్రం 4–30గంటలకు ప్రకటించే సమయాన చెల్లని ఓట్లు కూడా లెక్కించారంటూ కోటేష్ అభ్యంతరం తెలిపాడు. అక్కడ కాంగ్రెస్ – బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అధికారులు మూడు సార్లు ఓట్లు లెక్కించినా పెంట్యానాయక్కే ఒక ఓటు ఎక్కువ రావడం, అయినా రాత్రి 7గంటల వరకు ఫలితం వెల్లడించకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సమాచారం తెలుసుకున్న సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎస్సై నరేష్ సిబ్బంది చేరుకుని పరిస్థితిని అదుపు చేయగా, పెంట్యానాయక్ విజయం సాధించినట్లు ప్రకటించారు. అక్కడకు నగర ఏసీపీ రమణమూర్తి చేరుకుని వివరాలు ఆరా తీశారు. -
సర్పంచ్లుగా యువత, విద్యావంతులు
రఘునాథపాలెం: మండలంలోని పలు గ్రామపంచాయతీల సర్పంచ్లుగా యువత, విద్యావంతులు విజయం సాధించారు. గ్రామాలను అభివృద్ధి చేసేలా తమకు అవకాశం ఇవ్వాలని కోరడంతో ప్రజలు వారికి పట్టం కట్టారు. పారదర్శక పాల న, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని వారు ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. వీఆర్ బంజర్ సర్పంచ్గా ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన భూక్యా రమణ, చింతగుర్తి సర్పంచ్గా బీటెక్ పూర్తి చేసిన తమ్మినేని ప్రియాంక విజయం సాధించారు. ఇక జీకే బంజర నుంచి పీజీ చదివి ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకురాలిగా చేసిన మాలోత్ జ్యోతి ఎన్నికయ్యారు. అంతేకాక కొర్లబోడు తండా సర్పంచ్గా యువకుడు భూక్యా చిన్నయ్య విజయం సాధించారు. -
రెండో విడతకు నేటితో తెర
● చివరిరోజు జోరుగా సాగనున్న ప్రచారం ● ఆపై ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలకు పదునుసాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లో శుక్రవారం సాయంత్రం 5గంటలతో ప్రచారం ముగియనుంది. కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనుండగా గుర్తులు కేటాయించినప్పటి నుంచి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక చివరి రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ప్రచారం ముగిశాక పోలింగ్కు ఒకేరోజు సమయం ఉండడంతో ఓటర్లతోపాటు ప్రత్యర్థి శిబిరంలోని నాయకులను ప్రసన్నం చేసుకునేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. 160 జీపీల్లో ఎన్నికలు కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలు, 1.686 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ వెలువడింది. అయితే ఆరు మండలాల్లో 23 సర్పంచ్ స్థానాలు, 306 వార్డులు ఏకగ్రీవం కాగా.. ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 160 జీపీలు, 1,379 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 451 మంది, వార్డుసభ్యులుగా 3,352 మంది బరిలో ఉన్న ఈ జీపీల్లో 14న పోలింగ్ జరగనుంది. ప్రచార హవా.. రెండో విడత ఎన్నికలకు గత నెల 30నుంచి ఈనెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 6వ తేదీన ఉపసంహరణల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారాన్ని షురూ చేశారు. సర్పంచ్, వార్డుల అభ్యర్థులు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను పలకరించి తమ గుర్తును వివరిస్తూ ఓటు వేసి ఆశీర్వదించాలంటూ కోరారు. అలాగే ఫ్లెక్సీలు, పోస్టర్లు, స్టిక్కర్లతో ప్రచారం ముమ్మరం చేశారు. అభ్యర్థులు ఎక్కువగా తమ గుర్తును ఓటర్లకు పరిచయం చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే తమకు మద్దతు ఇస్తున్న పార్టీల్లోని మండల, గ్రామస్థాయి నేతలను ప్రచారంలోకి దింపారు. ఇక చివరిరోజైన శుక్రవారం ప్రచారం హోరెత్తించేలా అభ్యర్థులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. -
‘నమస్తే’తో వారికి గౌరవం
ఖమ్మంమయూరిసెంటర్: పారిశుద్ధ్య రంగంలో పనిచేసే కార్మికులకు భద్రత, గౌరవం కల్పించడంతో పాటు చేతితో శుభ్రం చేసే పనులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నమస్తే’(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డ్రెయినేజీలు, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత పనులు చేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మికులు అనారోగ్యంతో మరణించొద్దనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేయాల్సిన ఈ పథకంపై కార్మికుల్లో అవగాహన కల్పించడంలో ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధికారులు వెనుకబడ్డారనే విమర్శలున్నాయి. పథకాన్ని మార్చి కొత్తగా.. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘నమస్తే’ను 2022లో ప్రారంభించారు. గతంలో అమలైన ‘మానవ మల స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం (ఎస్ఆర్ఎంఎస్)’స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. నేషనల్ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దృష్టి సారిస్తే మేలు పీఎఫ్, ఈహెచ్ఎస్ వంటివి లేక, సరైన వేతనాలు అందకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. వారి వివరాల నమోదులో అధికారులు వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో కార్మికుడి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు లాగిన్ ఐడీల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు లాగిన్ ఐడీలు తీసుకున్నా.. కార్మికుల వివరాలు నమోదు చేయడం లేదని తెలుస్తోంది. కేఎంసీలో 700 మందికి పైగా కార్మికులు ఉంటే 74 మంది ప్రొఫైలింగ్ మాత్రమే పూర్తయింది. మిగతా వారి వివరాలను నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయోజనాలు ఇవే.. ‘నమస్తే’పథకం ద్వారా కార్మికులకు దక్కే లబ్ధి భద్రతకే పరిమితం కాక ఆర్థిక స్వావలంబనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కలిపి ఆయుష్మాన్ భారత్ – పీఎం జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే, వృత్తిపరమైన భద్రత, యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తూ ఆ సమయాన నెలకు రూ.3 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. కార్మికులు సొంతంగా పారిశుద్ధ్య వ్యాపారాలు ప్రారంభించేలా వాహనాలు, పరికరాల కొనుగోలుకు రూ.5 లక్షల ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాయితీ లభిస్తుంది. తక్కువ వడ్డీ రేటు (మహిళలకు 5 శాతం, పురుషులకు 6 శాతం)తో ఇచ్చే ఈ రుణం తిరిగి చెల్లించేందుకు ఏడేళ్ల గడువు ఇస్తారు. అలాగే, కార్మికులకు వ్యక్తిగత రక్షణ కిట్లు, బూట్లు, యాప్రాన్లు ఉచితంగా పంపిణీ చేస్తారు.నిర్ణీత కాల వ్యవధిలోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధి కార్మికులకు ఈ పథకంలో చోటు కల్పించేలా రిజిస్ట్రేషన్ చేయాలి. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్లతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు, మణు గూరు మున్సిపాలిటీల పరిధిలో మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులను గుర్తించి ప్రొఫైలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేఎంసీ పరిధిలో 74, మధిర, వైరా ముగ్గురు చొప్పున, సత్తుపల్లిలో ఇద్దరు, కొత్తగూడెంలో 20 మంది, ఇల్లెందులో 10 మంది, మణుగూరులో ఇద్దరి ప్రొఫైల్ను పూర్తి చేసి పథకం అమలు చేస్తున్నారు. అలాగే, మున్సిపాలిటీకి అనుబంధం కాకుండా, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్న ‘వేస్ట్ పిక్కర్ల’ప్రొఫైలింగ్ కొనసాగుతోంది. వీరిలో బయట రాక్ పిక్కర్లు, వెంట్రుకలు ఏరుకునే వాళ్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు వంటి వారు ఉన్నారు. ఆన్లైన్ పరిశీలన పూర్తయ్యాక వీరిందరికీ పథకం ప్రయోజనాలు దక్కుతాయి. ప్రొఫైలింగ్ పూర్తయిన ప్రతీ కార్మికుడికి గుర్తింపు కార్డును జారీ చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం, భద్రత -
మెప్మా పీడీ కార్యాలయం పునఃప్రారంభం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మయూరిసెంటర్లో రైల్వే బ్రిడ్జి ప్రక్కన మెప్మా పీడీ కార్యాలయాన్ని గురువారం పీడీ జి.నళిని పద్మావతి ప్రారంభించారు. మరమ్మతుల కారణంగా మూడేళ్ల క్రితం మెప్మా కార్యాలయాన్ని కేఎంసీ భవనంలోకి మార్చారు. ఇటీవల మరమ్మతులు పూర్తవడంతో మెప్మా పీడీ, డీఎంసీ చాంబర్లను మెప్మా భవనానికి మార్చారు. అయితే, టౌన్ లెవల్ ఫెడరేషన్(టీఎల్ఎఫ్) మాత్రం కేఎంసీలోనే కొనసాగుతుందని పీడీ నళిని పద్మావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ఎస్.సుజాత, టీఎంసీ జి.సుజాత, ఉద్యోగులు పాల్గొన్నారు. 13న నవోదయ ప్రవేశపరీక్ష కూసుమంచి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 13న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది చొప్పున, ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,737 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లపై ఆరా ఖమ్మంవ్యవసాయం: పత్తి విక్రయాల్లో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యాన మార్కెటింగ్ శాఖ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ వి.పద్మావతి గురువారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మద్దులపల్లి మార్కెట్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్, జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోళ్లు, ఆన్లైన్లో వివరాల నమోదును ఆమె పరిశీలించారు. అలాగే, పత్తి విక్రయానికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన డీడీ క్రయవిక్రయాలు సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీమ్, సీసీఐ బయ్యర్ వరప్రసాద్, మిల్లుల యాజమానులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల పరీక్ష13, 14 తేదీల్లో ఏర్పాటు పాల్వంచ: విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదోన్నతుల కోసం పాల్వంచలోని జెన్కో ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 13, 14 తేదీల్లో (డిపార్ట్మెంట్ అకౌంట్స్ టెస్ట్) పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కం సంస్థల్లో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ (జేఏఓ), ఏఈలు సైతం పదోన్నతులు రావాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం పాల్వంచలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు. 16 నుంచి క్రికెట్ టోర్నీరుద్రంపూర్: ఈనెల 16 నుంచి 18 వరకు కొత్తగూడెంలోని జయశంకర్ మైదానంలో కంపెనీ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఏరియా జీఎం ఎం.శాలేంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం – కార్పొరేట్, ఇల్లెందు – మణుగూరు, భూపాలపల్లి, రామగుండం రీజియన్, శ్రీరాంపూర్, బెల్లంపెల్లి – మందమర్రి ఏరియాలను కలుపుతూ ఆరు టీమ్లుగా ఏర్పాటు చేశామని వివరించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. -
గ్రామం ఇక్కడ, ఓటర్లు అక్కడ..!
చుంచుపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేశ్ఖని గ్రామపంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఓటర్లందరూ ప్రస్తుతం స్థానికంగా నివసించడం లేదు. రెండు నెలల క్రితం సింగరేణి అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడి 70 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. దీంతో ఇక్కడ ముగ్గురు, నలుగురు ఓటర్లు మాత్రమే మిగిలిపోయారు. ఈ గ్రామపంచాయతీకి 2014 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 2018 ఎన్నికల్లో కేవలం 146 ఓట్లతో ఇక్కడ పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నారు. ఇటీవల వరకు ఈ గ్రామపంచాయతీ పరిధిలో 256 మంది జనాభా ఉండగా, తాజా ఓటర్ల జాబితాలో ఇక్కడ 183 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 93 మంది మహిళలు కాగా, 90 మంది పురుషులు ఉన్నారు. అయితే, సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా బ్లాస్టింగ్ జోన్కు ఆతిదగ్గరలో ఉండడంతో అధికారులు ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతోపాటు గంగహుస్సేన్బస్తీలో ప్రత్యేక స్థలాలను ఇచ్చారు. దీంతో ఇక్కడ ఉన్న ఊరు ఖాళీ అయింది. ఇక్కడి కుటుంబాలు స్థానికంగా ఉన్న రామవరం, రుద్రంపూర్, పెనగడప, గౌతంపూర్ ప్రాంతాలకు తరలి వెళ్లాయి. కేవలం ఒక కుటుంబంలోని ముగ్గురు, నలుగురు ఓటర్లు మాత్రమే ప్రస్తుతం ఊరిలో ఉన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లు అందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటు వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు రిజర్వేషన్ చేశారు. మిగిలిన 4 వార్డులను ఎస్టీ జనరల్కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి కేటాయించారు. ఇక్కడ జనాభాతో పాటు ఓటర్లు సైతం లేకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం చూడా చేయడం లేదు. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లను వెతికి పట్టుకోవాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. చిరునామా కనుక్కొని వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న రెండో విడతలో వెంకటేశ్ఖని పంచాయతీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న 183 మంది ఓటర్లను ఇక్కడే ఓటు వేసే విధంగా అధికారులు చర్య లు చేపడుతున్నారు. వెంకటేశ్ఖనిలో విచిత్ర పరిస్థితి -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, శ్రీ సీతారామచంద్ర స్వామిని విశాఖపట్నంలోని డీఎస్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.సూర్యప్రకాష్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్సీసీతోనే క్రమశిక్షణ
కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్కుమార్ భద్రటేకులపల్లి : యువతలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి వంటివి ఎన్సీసీతోనే పెంపొందుతాయని, ఈ మేరకు శిక్షణ ఇస్తామని 11 టీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర అన్నారు. టేకులపల్లిలోని ఏకలవ్య(ఈఎంఆర్ఎస్) పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్సీసీ ప్రాథమిక శిక్షణలో డ్రిల్, రైఫిల్ డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, ిఫీల్డ్ క్రాఫ్ట్, రాక్ క్లైంబింగ్, మౌంటనీరింగ్, ట్రెక్కింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాఠశాలలో ఎన్సీసీ ఏర్పాటుకు ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. ఎన్సీసీ కేడెట్ల ఆసక్తి, క్రమశిక్షణ చూసి అభినందించారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్పై సంపూర్ణ అవగాహన
● తద్వారా కేన్సర్ రహిత సమాజస్థాపన ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మంవైద్యవిభాగం: హెచ్పీవీ వ్యాక్సిన్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలోని జెడ్పీ సమావేశ మందిరంలో హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్పై గురువారం ఉద్యోగులకు ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ కీలకమని, 14ఏళ్ల లోపు బాలికల్లో సర్వైకల్ కేన్సర్ నివారించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా చికిత్స వ్యయ భారం, మరణాలను తగ్గించే అవకాశమున్నందున ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అంకాలజిస్ట్ సిద్ధార్థ ముఖర్జీ రచించిన ’ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్ ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్ ’ పుస్తకాన్ని చదివితే కేన్సర్ మూలాలు, శాసీ్త్రయ పురోగతి, శస్త్రచికిత్స, కీమోథెరపీపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. కాగా, వ్యాక్సిన్ ఆవశ్యకతపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడానికి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సహజంగా కొత్త వ్యాక్సిన్ వస్తున్నప్పుడు ప్రజల్లో భయాలు ఉంటాయని వాటిని దూరం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. త్వరలోనే కేంద్రప్రభుత్వం వ్యాక్సిన్ పంపిస్తుందని, ఆలోపు అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంహెచ్ఓ డి.రామారావు మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ద్వారా నోరు, గొంతు కేన్సర్లను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణు మాధవరావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.నరేందర్, వైద్యులు, అధికారులు కృపాఉషశ్రీ, ఎం.ప్రదీప్బాబు, అరుణాదేవి, ప్రతాప్ సంపత్కుమార్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ మురారీ, సుబ్రహ్మణ్యం, శేషుపద్మ, అన్వర్, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
హస్తందే హవా..
పల్లె పోరు తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో మెజార్టీ గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులు ఆ పార్టీ మద్దతుదారుల వశమయ్యాయి. తొలి విడతలో 20 ఏకగ్రీవాలు పోగా మిగిలిన 172 జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తే అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 136 సర్పంచ్ పదవులు ‘చే’జిక్కించుకున్నారు. దీంతో ఫలితాలు వెలువడుతుండగా ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక బీఆర్ఎస్, సీపీఎం పొత్తు ఆయా పార్టీల మద్దతుదారులకు కొన్నిచోట్ల కలిసొచ్చింది. బీఆర్ఎస్ 34, సీపీఎం పది, సీపీఐ ఆరు, ఇతరులు ఆరు సర్పంచ్ స్థానాల్లో పాగా వేశారు. ఒకటి, రెండు జీపీల్లో ఒక్క ఓటు తేడాతో అభ్యర్థులను విజయం వరించగా.. సమాన ఓట్లు వచ్చిన జీపీల్లో రీకౌంటింగ్ నిర్వహించారు. ఆందోళనల తర్వాత డ్రా తీసి విజేతలను ప్రకటించారు. కొన్ని గ్రామపంచాయతీల్లో అభ్యంతరాల కారణంగా రాత్రి 11 గంటల వరకు లెక్కింపు కొనసాగింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంకాంగ్రెస్లో జోష్ జిల్లాలో మొదటి విడతగా రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయంలోనే ఏకగ్రీవాలు ఆ పార్టీలో జోష్ నింపాయి. మొత్తం 192జీపీలకు గాను 20పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో ముందుగానే పార్టీ జిల్లా, మండల స్థాయి నేతలు బరిలో ఉందామనుకున్న ఆశావహులతో చర్చించి ఏకగ్రీవం చేశారు. గ్రామాభివృద్ధి, పెండింగ్ సమస్యల పరిష్కారం తదితర హామీలతో ఏకగ్రీవానికి అటు ఆశావహులు, ఇటు ప్రజలు అంగీకరించారు. బీఆర్ఎస్, సీపీఎం పొత్తుతో ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు పలు పంచాయతీలపై ప్రభావం చూపింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఆ రెండు పార్టీలు పోటీపై ఒక నిర్ణయానికి వచ్చి తమ మద్దతుదారునుల బరిలోకి దింపాయి. దీంతో మధిర నియోజవకర్గంలో ఎన్నికలు జరిగిన నాలుగు మండలాల్లోని పలు పంచాయతీల్లో ఈ పార్టీల మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో కచ్చితంగా గెలుస్తామనుకున్న పంచాయతీల్లో విజయంపై కాంగ్రెస్ పార్టీ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇక పలు పంచాయతీల్లో సీపీఎం, బీఆర్ఎస్ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎర్రుపాలెం మండలంతో పాటు మిగతా మండలాల్లోని పలు పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు గెలిచారు. ఖమ్మం నియోజకవర్గంలోని ఒకే ఒక్క మండలమైన రఘునాథపాలెంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఐదు కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం కాగా, 32 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ 26, బీఆర్ఎస్ 11 సర్పంచ్ స్థానాలను దక్కించుకుంది. మధిర నియోజకవర్గంలో ముదిగొండ మినహా చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నాలుగు మండలాల్లో మొత్తం 106 జీపీల్లో 11 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 10 కాంగ్రెస్, ఒకటి సీపీఐ ఖాతాలో పడ్డాయి. మిగిలిన 95 జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తే ఏకగ్రీవాలతో కలిపి 72సర్పంచ్ స్థానా లను కాంగ్రెస్ మద్దతుదారులు, 19 స్థానాల్లో బీఆర్ఎస్, సీపీఎం ఎనిమిది, సీపీఐ మద్దతుదారులు ఐదు, ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల మండలాల్లోని గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వైరా మండలంలో 22 జీపీలకు గాను తొలుత నాలుగు ఏకగ్రీవం కాగా ఇవన్నీ కాంగ్రెస్కే దక్కాయి. మిగతా 18పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ మద్దతుదారులు 16, బీఆర్ఎస్ ఒకటి, సీపీఎం ఒక చోట సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నాయి. కొణిజర్ల మండలంలో 22పంచాయతీలకు అన్ని చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ మూడు, సీపీఎం, సీపీఐ ఒక్కో పంచాయతీ, ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల విజేతలుగా నిలిచారు.తొలి విడత మెజార్టీ జీపీలు కాంగ్రెస్ ఖాతాలోనే.. -
రేషన్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
ఖమ్మంఅర్బన్: ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా అందిస్తున్న సన్నబియ్యాన్ని కొందరు డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యాన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ నుంచి విజిలెన్స్ ఓఎస్డీ, డీఎస్పీ అంజయ్య నేతృత్వాన జిల్లాకు వచ్చిన నాలుగు బృందాలు మంగళ, బుధవారం 40 రేషన్ షాపుల్లో తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఖమ్మం లోని 91వ రేషన్ షాపును తనిఖీ చేయడానికి అధికారులు రాగా తాళం వేసి ఉండడం, పలుమార్లు ఫోన్ చేసినా డీలర్ వెంకటేశ్వర్లు స్పందించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో షాప్నకు సీల్ వేసిన అధికారులు, డీలర్ వచ్చాక తెరిచి అదనంగా కానీ తక్కువ కానీ బియ్యం ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేయాలని సివిల్ సప్లయీస్ అధికారులకు సూచించారు. టేకులపల్లిలో మరో రేషన్ షాపును తనిఖీ చేయగా రికార్డుల కన్నా అదనంగా బియ్యం ఉన్నట్లు విజిలెన్స్ బృందం గుర్తించినట్లు తెలిసింది. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీలు మెచ్చు వెంకటేశ్వర్లు, విజయ్బాబు, నాగలక్ష్మి, తహసీల్దార్ బాషా, టాస్క్ఫోర్స్ ఏఎస్సై వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో ఓ షాప్నకు సీల్ -
ఏకగ్రీవ పంచాయతీలు.. 65
● రెండో విడత జీపీల్లో అత్యధికం ● మిగతా చోట్ల మూడు దశల్లో ఎన్నికలుసాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్య తేలింది. మొత్తం 566 జీపీల్లో 65 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వు కాగా.. ఆ కేటగిరీ ఓటర్లు లేకపోవడంతో అక్కడ ఎన్నిక జరగడం లేదు. ఇవిపోగా 500 సర్పంచ్ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. అలాగే, 5,168 వార్డుల్లో ఏకగ్రీవాలు, నామినేషన్లు దాఖలు కానివి మినహా 4,166 వార్డుల్లో ఎన్నిక నిర్వహించనున్నారు. విడతల వారీగా ఇలా ●తొలి విడత : కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో తొలి విడతగా 192 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 172 పంచాయతీల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 1,740 వార్డులకు గాను 323 వార్డులు ఏకగ్రీవం కాగా, రెండు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యాన 1,415 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ స్థానాలకు 488 మంది, వార్డుల్లో 3,424 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ●రెండో విడత : కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 జీపీలకు, 1,686 వార్డులకు రెండో విడత ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. ఈ దశలో ఏకగ్రీవమైన 23 సర్పంచ్ స్థానాలు పోగా మిగతా 160 జీపీల్లో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనుండగా, సర్పంచ్ స్థానాలకు 451 మంది పోటీ పడుతున్నారు. అలాగే, 306 వార్డులు ఏకగ్రీవం కాగా ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 1,379 వార్డుల్లో జరిగే ఎన్నికల బరిలో 3,352 మంది అభ్యర్థులు ఉన్నారు. ●మూడో విడత : ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లోని 191 గ్రామపంచాయతీలు, 1,742 వార్డుల్లో మూడో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ అయినా ఆ కేటగిరీ ఓటర్లు లేకపోవడంతో ఎన్నికకు బ్రేక్ పడింది. ఇదికాక 22 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 168 సర్పంచ్ స్థానాలకు ఈనెల 17న జరిగే ఎన్నికల్లో 485 మంది బరిలో ఉన్నారు. ఇక 1,742 వార్డులకు గాను 9వార్డులకు నామినేషన్లు రాకపోగా, 361 ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహా 1,372 వార్డుల్లో జరిగే ఎన్నికకు 3,369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.విడత మొత్తం ఏకగ్రీవం ఎన్నికలు జీపీలు (నామినేషన్లు జరిగేవి దాఖలు కానివి) మొదటి 192 20 172 రెండు 183 23 160 మూడు 191 22 (1) 168మొత్తం 566 66 500 విడత మొత్తం ఏకగ్రీవం ఎన్నికలు వార్డులు (నామినేషన్లు జరిగేవి దాఖలు కానివి) మొదటి 1,740 323 (2) 1,415 రెండు 1,686 306 (1) 1,379 మూడు 1,742 361 (9) 1,372మొత్తం 5,168 1,002 4,166 -
చలి.. చలిగా..
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లావాసులను కొద్ది రోజులుగా చలి వణికిస్తోంది. గత ఐదారు రోజుల నుంచి చలి ప్రభావం మరింత పెరిగింది. ఉదయం 10గంటల వరకు చలిగాలులు వీస్తుండగా.. సాయంత్రం 5గంటల నుంచే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రి సమయాన చలి గాలులు తీవ్రంగా ఉంటుండడంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోగా, వృద్ధులు, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. బయటకొస్తే వణుకు నిన్న మొన్నటి వరకు తుపాన్లతో ఉక్కిరిబిక్కిరైన జనం ఇప్పుడు చలిగాలుల తీవ్రతతో ఇబ్బంది పడుతున్నారు. కొద్దిరోజులుగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం 10గంటల్లోపు.. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వస్తే స్వెట్టర్లు, జాకెట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, పిల్లలు చలితీవ్రతతో అనారోగ్యానికి గురవుతున్నారు. పగలు 29.. రాత్రి 15 డిగ్రీలు పగలు, రాత్రి వేళ ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తోంది. ఉదయం 10గంటల వరకు వాతావరణం చల్లగానే ఉంటోంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 18డిగ్రీలకు మించడం లేదు. ఇక మధ్యాహ్నం 12గంటలయ్యే సరికి ఒక్కసారిగా సూర్యుడు విజృంభిస్తున్నాడు. మధ్యాహ్నం సమయాన ఉష్ణోగ్రత 29డిగ్రీల వరకు నమోదవుతోంది. సాయంత్రం 4గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుండగా.. ఆతర్వాత నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు గంటల సమయాన 20డిగ్రీలుగా, ఆతర్వాత రాత్రికి మరింత పడిపోయి 15డిగ్రీల మేర నమోదవుతోంది. ప్రస్తుత తరుణంలో ఉదయం, రాత్రి సమయాల్లో మంచు కమ్మేస్తోంది. పొగమంచు కారణంగా విపరీతమైన చలి ఉంటోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. దీంతో వాహనదారులు ప్రయాణానికి ఇబ్బంది పడుతున్నారు. లారీలు, బస్లు, ఇతర వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఉపశమనం కోసం కొందరు చలి మంటలు వేసుకుంటుండగా.. స్వెటర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. -
యూజీడీ పనులు సకాలంలో పూర్తిచేయాలి
● నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దు ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర: మధిర నియోజకవర్గ కేంద్రంలో మురుగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్పెట్టేలా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులపై బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పనులను ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవాంతరాలు ఎదురైతే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాలని సూచించారు. వీటిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే పనులు సాఫీగా సాగుతాయని తెలిపారు. పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించడం ఎంత ముఖ్యమో నాణ్యత కూడా అంతే ప్రధానమని స్పష్టం చేశారు. నాణ్యతలో రాజీ పకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీతో తనిఖీ చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ క్రమంలో స్థానికులు తాగునీరు, వాహనాల రాకపోకల విషయంలో ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని తెలిపారు. మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయని భట్టి హెచ్చరించారు. అనంతరం మధిర మున్సిపాలిటీ కార్యాలయానికి సంబంధించి నూతన భవన నమూనాలను భట్టి విక్రమార్క పరిశీలించారు. -
స్వగ్రామంలో మంత్రి పొంగులేటి
కల్లూరురూరల్: స్వగ్రామమైన కల్లూరు మండలంలోని నారాయణపురానికి బుధవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్రెడ్డితో కలిసి తమ తండ్రి రాఘవరెడ్డి ఐదో ఆబ్దికంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రాఘవరెడ్డి స్మృతివనంలో కుటుంబసభ్యులతో కలిసి మంత్రి నివాళులర్పించారు. సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు ఖమ్మంలీగల్: చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, పోక్సో కేసుల విచారణకు ఏర్పాటైన ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులో మార్చి 2026 వరకు తాత్కాలిక పద్ధతిపై పనిచేసేలా సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ను నియమించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. 65ఏళ్లు నిండని రిటైర్డ్ జ్యుడీషియల్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జనరల్ అభ్యర్థులైతే 18 – 34 లోపు వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని, ఓఎస్ పోస్టుకు 7 నుంచి 10వ తరగతి వరకు అర్హతతో పాటు డ్రైవింగ్, ఎలకి్ట్రకల్, ఫ్లంబింగ్, వంటలో నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 20 సాయంత్రం 5గంటల లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా జడ్జి ఓ ప్రకటనలో సూచించారు. బాలికల కరాటే శిక్షణకు నిధులుకేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి రూ.33.60లక్షలు ఖమ్మం స్పోర్ట్స్: సమగ్ర శిక్షా ఆత్మ రక్షణ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ఏడాదికి రూ.29.10లక్షలు కేటాయించగా, ఇదే పథకం కింద కేంద్రప్రభుత్వం మరో 25 పాఠశాలలకు రూ.4.50లక్షలు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని 194 పాఠశాలలను ఎంపిక చేశారు. కేంద్రప్రభుత్వం మరో 25 పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ కోసం నిధులు మంజూరు చేసింది. గతంలో ఈ పథకం నిర్వహించినప్పుడు కొన్ని పాఠశాలల్లో శిక్షణ ఇవ్వకున్నా తప్పుడు రికార్డులతో నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి 72 కరాటే తరగతులు నిర్వహించడంతో పాటు హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థినుల వివరాలతో రిజిస్టర్ నిర్వహిస్తేనే శిక్షణ ముగిశాక కోచ్లకు గౌరవ వేతనం అందజేస్తారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లోనూ శిక్షణకు గౌరవ వేతనం చెల్లిస్తారు. మతిస్థిమితం లేని వ్యక్తి చేరదీత భూపాలపల్లి రూరల్: మతిస్థిమితంలేని వ్యక్తిని ఖమ్మంకు చెందిన అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు చేరదీశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి – కాళేశ్వరం సమీపాన అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఒంటరిగా తిరుగుతున్నాడు. అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు బుధవారం కాళేశ్వరం మీదుగా ఖమ్మం వెళ్తుండగా సదరు వ్యక్తిని గుర్తించారు. అనంతరం ఆయనను పోలీసుల సమక్షాన అంబులెన్స్లో ఖమ్మం తీసుకెళ్లారు. వైద్యం చేయించి కోలుకున్నాక చట్టపరంగా కుటుంబా నికి అప్పగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
భవితవ్యం మీ చేతుల్లోనే..
● ప్రలోభాలకు కాదు.. ప్రగతికి ఓటేద్దాం ● నేడు గ్రామపంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కరకగూడెం: ప్రజాస్వామ్యానికి ప్రాథమిక ఆధారమైన గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చేశాయి. జిల్లాలో తొలి విడతగా ఏడు మండలాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. అయితే, ఇది కేవలం ఓటు హక్కు వినియోగం మాత్రమే కాదు.. గ్రామ భవిష్యత్ను చక్కదిద్దుకునేందుకు వచ్చిన అవకాశంగా భావించాలని పలువురు సూచించారు. ఈ ఓటుపైనే గ్రామాభివృద్ధి ఆధారపడి ఉన్నందున ప్రతీ పౌరుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈనేపథ్యాన ఓటర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలు.... బంధుత్వం కాదు.. బాధ్యత గ్రామాల్లో కులం, బంధుత్వం, పార్టీ అభిమానం ఆధారంగా ఓటేస్తుంటాం. అలా కాకుండా మనం వేసే ఓటు.. రోడ్లు వేయించడం, తాగునీటి సమస్య పరిష్కరించడం, వీధి దీపాలు వెలిగించడం వంటి మౌలిక వసతులు తీర్చేదిగా ఉండాలి. గ్రామాభివృద్ధికి కట్టుబడే నాయకుడిని ఎన్నుకుంటేనే ఇవన్నీ నెరవేరుతాయి. లేదంటే రాబోయే ఐదేళ్లు గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతుంది. అవగాహన ఉన్న నాయకులైతేనే.. నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతడికి ఎంత డబ్బు ఉందని చూడకుండా విద్య, పని చేయగల సామర్థ్యం, సమస్యలు అర్థం చేసుకునే గుణం, ప్రభుత్వ పథకాలు, నిబంధనలపై అవగాహన ఉన్న వారిని గుర్తించాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వారికే ఓటు వేయాలి. అమ్ముకోవద్దు.. ఒకరోజు సంతోషం కోసం ఓటు అమ్ముకోవడం ప్రమాదకరం. వారిచ్చే డబ్బు, మద్యం తీసుకుని ఓటేస్తే గెలిచిన అభ్యర్థి ఐదేళ్ల పాటు ప్రజాప్రయోజనాలు కాకుండా.. అధికారాన్ని తన సొంతానిని వినియోగించుకుంటాడు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడంతో పాటు గ్రామ భవిష్యత్తే దెబ్బతింటుంది. యువత, మహిళల పాత్ర కీలకం గ్రామాల్లో మహిళా ఓటర్లు, యువకులు ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలి. పోటీ చేసే అభ్యర్థిగ్రామానికి ఏం చేస్తారో ప్రశ్నించాలి. అలాగేతాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపైమహిళల నిర్ణయాధికారం పెరుగుతోంది. అందుకే ప్రలోభాలకు లొంగకుండా తమ కుటుంబ సంక్షేమం కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. శాంతి, సామరస్యం.. ఎన్నికల తర్వాత కూడా గ్రామాభివృద్ధి నిరంతరం సాగాలంటే ఎన్నికల సమయంలో శాంతి, సామరస్యాలు పాటించాలి. గొడవలు గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. అలా కాకుండా రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే గ్రామంలో ఏ పనైనా సాధ్యమవుతుంది. -
ఎన్నికల నిర్వహణలో అధికారులే కీలకం
కొణిజర్ల/వైరా/చింతకాని/బోనకల్/ఎర్రుపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో అఽధికారుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పేర్కొన్నారు. మొదటి దశగా గురువారం ఎన్నికలు జరగనున్న కొణిజర్ల, వైరా, చింతకాని, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సామగ్రి పంపిణీపై సూచనలు చేసిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పూర్తిస్థాయి సామగ్రితో ఉద్యోగులను పోలింగ్ కేంద్రాల చేర్చడంతో పాటు లెక్కింపు పూర్తయ్యాక తిరిగి వచ్చేలా రూట్ ఆఫీసర్లు బాధ్యత వహించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కాగా, ఎర్రుపాలెం సెంటర్ను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ.. సిబ్బందికి భోజనాలు సమయానికి ఏర్పాటు చేయలేదని గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సర్దిచెప్పి భోజనాలు తెప్పించగా వారు సామగ్రితో పోలింగ్ బూత్లకు బయలుదేరారు.అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ -
కలెక్టరేట్లో మానిటరింగ్ సెల్
● క్రిటికల్ కేంద్రాల్లో పోలింగ్పై ఆరా తీసేలా ఏర్పాటు ● ఏడు స్క్రీన్ల ద్వారా పోలింగ్ సరళి పరిశీలన ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుండగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ మానిటరింగ్ సెల్ను బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఏడు మండలాల్లో జరగనుండగా 360 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళిని సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించేందుకు కలెక్టరేట్లో ఏడు స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఈడీఎం దుర్గాప్రసాద్, టెక్నికల్ టీం సభ్యుడు హనుమాచారి తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు రఘునాథపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఓటు వేసేలా ఉద్యోగులు పర్యవేక్షించాలని సూచించారు. రఘునాథపాలెం రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలింగ్, పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులకు సీల్ వేయడం, ఓట్ల లెక్కింపు, సర్పంచ్లకు ఎన్నిక పత్రాలు ఇచ్చే విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, కూర్చునే సౌకర్యాలు కల్పించడమే కాక ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్లకు సహాయంగా నివాలని సూచించారు. ఖమ్మం ఆర్డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ ఆశోక్కుమార్, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
‘క్లరికల్’ పరీక్ష ఊసేది..?
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ రాతపరీక్ష కోసం ఇంటర్నల్ అభ్యర్థులు 20 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రిక్రూట్మెంట్సెల్ జీఎంలు ముగ్గురు మారినా పరీక్ష నిర్వహణ ఊసే లేదు. దీంతో అర్హులైన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణివ్యాప్తంగా 8 విభాగాల్లో సుమారు 360 పోస్టుల భర్తీకి యాజమాన్యం 2014, మార్చిలో ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు విభాగాల్లో రాత పరీక్ష నిర్వహించి, భర్తీ ప్రక్రియ పూర్తిచేసింది. క్లరికల్ విభాగంలో జూ నియర్ అసిస్టెంట్ పోస్టులు 177 ఉండగా, 6,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష నిర్వహించకుండా జాప్యం చేస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న అంతర్గత ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. నోటిఫికేషన్ విడుదల చేశాక రిక్రూట్మెంట్ సెల్ జీఎంలు ముగ్గురు మారారు. డైరెక్టర్(పా)గా కూడా ముగ్గరు మారారు. అయినా పరీక్ష మాత్రం నిర్వహించలేదు. కాలయాపన చేస్తున్న యాజమాన్యం సంస్థలో 2018 నుంచి సుమారు 18 వేల మంది మెడికల్ అన్ఫిట్ అయ్యారు. వారి వారసులు(డిపెండెంట్లు) సుమారు 16వేల మంది ఉద్యోగాల్లో చేరారు. వారిలో 98శాతం డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, కంప్యూటర్పై అవగాహన కలిగినవారు ఉన్నా రు. ఈ నేపథ్యంలో డిపెండెంట్లకు బదిలీ వర్కర్గా పోస్టింగ్ ఇచ్చినా యాజమాన్యం క్లరికల్ పనులు చేయిస్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై యాజమాన్యం శ్రద్ధ చూపడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి రాత పరీక్ష నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. గొంతుకోసుకున్న వ్యక్తికి శస్త్రచికిత్సపాల్వంచ: కుటుంబ సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయన ప్రాణం కాపాడారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని నూడుల్స్ పాయింట్లో వంట మాస్టర్గా పనిచేసే వెస్ట్ బెంగాల్కు చెందిన 35 ఏళ్ల బిశాల్ తమంగ్ మంగళవారం సాయంత్రం కత్తితో గొంతు కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ సమాచారం అందడంతో బాధితుడిని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని జిల్లా ప్రధాన ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి.రవిబాబు సూచించారు. ఈఎన్టీ వైద్యుడైన రవిబాబు అక్కడకు చేరుకుని, జనరల్ సర్జన్ సోమరాజు దొర, మత్తు వైద్య నిపుణుడు రాంప్రసాద్, సిబ్బందితో కలిసి ఆపరేషన్ విజయవంతం నిర్వహించారు. అనంతరం ఐసీయూ సేవల కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. కాగా, శస్త్రచికిత్స చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
నేడే తొలి పోరు
అధికారులే కీలకం ఎన్నికల పోలింగ్ సాఫీగా ముగిసేలా అధికారులు కీలకంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు.గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బ్యాలెట్ బాక్స్, సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఉద్యోగులు టీకాలు సకాలంలో వేయించాలి చింతకాని: పిల్లలు, గర్భిణులకు సకాలంలో టీకాలు వేయించాలని, తద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించవచ్చని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సీహెచ్.రమణ వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని చింతకాని, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం ఆయన వ్యాక్సినేషన్ను తనిఖీ చేసి మాట్లాడారు. బిడ్డకు తల్లిపాలు ప్రథమ టీకా అని, పాలతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అలాగే, రెండేళ్ల లోపు పిల్లలను 12రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు 11 టీకాలను వేస్తున్నట్లు తెలిపారు. ఈ టీకాల ఆవశ్యకతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్, ఉద్యోగులు వీరేందర్, నాగేశ్వరరావు, రేఛల్రాణి తదితరులు పాల్గొన్నారు. 20, 21న జిల్లా స్థాయి సైన్స్ఫేర్ ఖమ్మం సహకారనగర్: జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫేర్) ఈనెల 20, 21వ తేదీల్లో బల్లేపల్లిలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. పాఠశాలల విద్యార్థులు ఈనెల 18వ తేదీన రాత్రి 9గంటల్లోగా తమ ఎంట్రీలను గూగుల్ ఫారంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీ పాఠశాల నుంచి ఒక థీమ్లో ఒకే ఎంట్రీ అనుమతిస్తామని తెలిపారు. కేవలం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుందని, ఆఫ్లైన్ ఎంట్రీ ఉండదని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా ఎగ్జిబిట్ తీసుకొచ్చిన వారికి అనుమతి ఉండదని డీఈఓ తెలిపారు. పల్లె దవాఖానాలో డీఎంహెచ్ఓ తనిఖీ ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఖానాపురంలోని పల్లె దవాఖానాను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇమ్యూనైజేషన్ కార్యక్రమ అమలుపై ఆరాతీసిన ఆయన బాలింతల వద్ద ఉన్న మాతా–శిశు సంరక్షణ కార్డులను పరిశీలించారు. పిల్లలకు నిర్దేశిత సమయంలో టీకాలు వేయించాలని సూచించారు. టీకాల ఆవశ్యకతపై వైద్యులతో పాటు ఏఎన్ఎంలు, సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు. ఆతర్వాత ఆస్పత్రి ఆవరణలో పరిశీలించిన డీఎంహెచ్ఓ రిజిస్టర్ల నిర్వహణ, ఆన్లైన్లో వివరాల నమోదుపై సూచనలు చేశారు. పల్లె దవాఖానా వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రామయ్యను దర్శించుకున్న పరిక్రమణ సమితి భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గోదావరి నది పరిక్రమణ(ప్రదక్షిణ) సమితి బృందం బుధవారం దర్శించుకుంది. బృందం సభ్యులకు ఈఓ దామోదర్రావు, అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రదక్షిణలో భాగంగా స్వామి వారిని దర్శించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, సాధువుల బృందం తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 172గ్రామపంచాయతీలు, 1,415 వార్డులకు గురువారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించడంతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్దత్ పర్యవేక్షణలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం488 మంది సర్పంచ్ అభ్యర్థులు మొదటి విడతలో 192గ్రామపంచాయతీలు, 1,740 వార్డుల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గతనెల 27నుంచి 29వరకు నామినేషన్లు స్వీకరించగా సర్పంచ్ స్థానాలకు 1,142, వార్డులకు 4,054 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 3వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసే నాటికి 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గురువారం 172 గ్రామపంచాయతీలకు జరిగే ఎన్నికల్లో 488 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,740 వార్డులకు రెండు వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోగా, 323 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1,415 వార్డులకు 3,424 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏర్పాట్లు పూర్తి గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది నియామకం, సున్నితమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకం పూర్తయింది. మొదటి విడత ఎన్నికలు జరిగే 1,582 కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కేంద్రాల్లో 1,899 మంది పీఓలు, 2,321 మంది ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. సామగ్రి పంపిణీ తొలి విడత ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు బుధవారం సామగ్రి పంపిణీ చేశారు. మండల స్థాయిలో 20 కేంద్రాలు ఏర్పాటుచేసి బ్యాలెట్ బాక్స్లు, పత్రాలతో పాటు ఇతర సామగ్రి అందించగా ఉద్యోగులు 139 బస్సుల్లో కేంద్రాలకు సాయంత్రంకల్లా చేరుకున్నారు. రఘునాథపాలెం మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ అనుదీప్, చింతకాని, బోనకల్, వైరా, కొణిజర్ల, ఎర్రుపాలెంలో అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిశాక అక్కడే ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తిచేసేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోనే తాత్కాలిక స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటుచేసి పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లు, సామగ్రిని అందులో భద్రపర్చనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. కట్టుదిట్టంగా బందోబస్తు ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడు మండలాల్లో 360 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో 21మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించడమే కాక వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేశారు. అలాగే, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో సాయుధ బలగాలను మోహరించారు. ఇక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీలు, ఐదు ఎఫ్ఎస్టీ, 15ఎస్ఎఫ్టీ బృందాల ద్వారా నిఘా పెట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో నామినేషన్లు దాఖలైనప్పటి నుంచే ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యాన పర్యవేక్షిస్తున్నారు.172 జీపీలు, 1,415 వార్డుల్లో ఎన్నికలు -
●ఓటర్లకు భరోసా కల్పించండి
ఖమ్మంవైరారోడ్: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను కేటాయించాలని బీఆర్ఎస్, సీపీఎం నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం వారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్కు వినతిపత్రం అందజేశారు. గత అనుభవాలు, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న గ్రామపంచాయతీల జాబితాను సీపీకి సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు నున్నా నాగేశ్వరరావు, బెల్లం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. -
‘మహాలక్ష్మి’కి రెండేళ్లు !
● రీజియన్లో 8.91కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం ● చార్జీల రూపంలో రూ.420 కోట్లు ఆదాఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు నిండాయి. మహిళా ప్రయాణికులకు వరంలా మారిన ఈ పథకం ద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గింది. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకం ప్రారంభం కాగా, ఇప్పటివరకు రెండేళ్లలో ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా మహిళలకు టికెట్ల రూపంలో రూ.420.05 కోట్లు ఆదా అయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో ప్రయాణాలు మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గ్రామాల నుండి వివిధ పనులు, ఉపాధి నిమిత్తం పట్టణాలు, నగరాలకు వెళ్లే మహిళలు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. కూలీలు, చిరు ఉద్యోగులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పథకం వారికి ఊరటగా మారింది. ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో గత రెండేళ్లలో ఏకంగా 8.91 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విని యోగించుకున్నారు. రోజుకు సగటున 1,23,605 మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. తద్వారా వారికి చార్జీలు ఆదా అవుతుండగా, ఈ నగదును నిత్యావసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. తద్వారా ఈ పథకం మహిళా ప్రయాణికులకు ‘ఆర్థిక స్వేచ్ఛ’ను ఇస్తోందని పలువురు అభివర్ణిస్తున్నారు. సౌకర్యాల కల్పనపై దృష్టి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యాన బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యాన ఆర్టీసీకి మహిళా సంఘాల ద్వారా బస్సులను సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం ద్వారానే స్వయం సహాయక సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన సంస్థకు అప్పగిస్తున్నారు. ఇక డ్రైవర్లు, కండక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తుండడంతో సిబ్బంది కొరత తీరుతోంది.ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఉమ్మడి జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఆర్టీసీకి ఆదరణ పెరిగింది. మహిళా ప్రయాణికులతో పాటు ఇతరులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. ఇదే సమయాన మరిన్ని సౌకర్యాలు కల్పించేలా సంస్థ చర్యలు చేపడుతోంది. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
●వీధికి ఇరుపక్కలా రెండు జిల్లాలు!
ఓ పక్కే ఎన్నికల సందడికామేపల్లి మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ పరిధి లచ్చతండా ఖమ్మం – మహబూబాబాద్ జిల్లాలకు సరిహద్దుగా ఉంటుంది. ఒకే వీధి కలిగిన ఈ తండాలో సీసీ రోడ్డు ఉంది. రోడ్డుకు ఓ పక్క ఖమ్మం జిల్లా లచ్చుతండా పరిధిలోకి వస్తుండగా, ఇంకో పక్క మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. దీంతో ఇటుపక్క 130మంది ఓటర్లు కలిగిన వీధిలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోపక్క మాత్రం డోర్నకల్ మున్సిపాలిటీ కావడంతో సందడి కానరావడం లేదు. – కామేపల్లి -
కార్యదర్శులకు కష్టమొచ్చింది..
● తడిసి మోపెడవుతున్న పంచాయతీ ఎన్నికల ఖర్చు ● ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఇక్కట్లువైరా: జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూడో విడ త ఎన్నికలు జరిగే జీపీల్లోనూ నామినేషన్ల ఉపసంహరణ పూర్తికాగా.. తొలిదశ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈమేరకు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల బాధ్యత కార్యదర్శులు చూస్తున్నారు. ఇంత వరకు బాగానే ప్రతీసారి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేస్తుంది. కానీ ఈ నిధులు నిధులు కేటాయించకపోవడంతో కార్యదర్శుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో రెంఎడేళ్ల నుంచి పాలకవర్గాలు లేక పారిశుద్ధ్య పనులు, ఇతరత్రా అవసరాలకు కార్యదర్శులే అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెడుతున్నారు. ఇంతలోనే ఎన్నికలు రావడం, ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. భారంగా ఖర్చులు... పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ మొదలు లెక్కింపు వరకు గ్రామస్థాయిలో కార్యదర్శులే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు ఉద్యోగుల భోజన ఏర్పాట్లు చూడాల్సి వస్తోంది. కేంద్రాల వద్ద టెంట్లు కూడా వేయించాల్సి ఉండడంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శికి రూ.30వేల నుంచి రూ.40 వేలకు పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇప్పటికే ఖర్చు రూ.25 వేలు దాటిందని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో... జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనుండగా, మొదటి దశలో 192, రెండో విడతలో 183, మూడో విడతలో 191 గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఎన్నికల నిర్వాహణ ఖర్చులన్నీ అప్పు తెచ్చి మరీ తామే భరిస్తున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితిలో ఏర్పాట్లు చేస్తుండగా.. మరింత భారం పడకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. ఓ కార్యదర్శి ఆవేదన... పంచాయతీ ఎన్నికల ఖర్చు మాకు భారంలా మారింది. ఒక్కో పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు తప్పడం లేదు. అధికారుల ఆదేశాలతో చేసేదేం లేక ఖర్చు పెడుతున్నాం. ఈ నిధులు విడుదల చేస్తే మా ఇక్కట్లు తీరతాయి.‘పంచాయతీ ఎన్నికల వేళ గ్రామ కార్యదర్శులపై వ్యయభారం పడకుండా చర్యలు తీసుకుంటాం. అయితే, మౌలిక సదుపాయాలతో పాటు సిబ్బందికి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. నిధుల విషయంలో ఇక్కట్లు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఓ ఎంపీడీఓ తెలిపారు. -
కాషాయ జెండా ఎగరడం ఖాయం
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది నూటికి నూరు శాతం బీజేపీ ప్రభుత్వమేనని.. ఈ చారిత్రక మార్పును ఎవరూ అడ్డుకోలేరని పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ తెలిపారు. ఖమ్మంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాక పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని సూచించారు. బూత్ స్థాయి నుంచే పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకుంటే మంచి ఫలితా లు వస్తాయని తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోగా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బాటలో పయనిస్తోందని ఆరోపించారు. కేవలం మూడు రాష్ట్రాల్లో తప్ప ఉనికి లేని కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా మనుమరుగవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్చార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి, నాయకులు దేవకీ వాసుదేవరావు, సన్నె ఉదయప్రతాప్, నాయుడు రాఘవరావు, ప్రవీణ్ కుమార్, దొంగల సత్యనారాయణ, నెల్లూరి బెనర్జీ, తాండ్ర వినోద్రావు, కె.శ్రీధర్రెడ్డి, గల్లా సత్యనారాయణ, నున్నా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ -
సందఢీ
పల్లెలు మైకుల హోరు.. అభ్యర్థుల హామీలతో మార్మోగిపోతున్నాయి. అన్నిచోట్లా ప్రచారం వాడివేడిగా సాగుతుండగా.. మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో మంగళవారం సాయంత్రం 5గంటలతో ప్రచారానికి తెరపడింది. దీంతో ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు తెరచాటు రాజకీయాలను మొదలుపెట్టారు. ఇక రెండో విడత ఎన్నికల ప్రచారానికి 12వ తేదీ వరకు గడువు ఉండగా అభ్యర్థులు వేగం పెంచారు. మరోవైపు మూడో విడత ఎన్నికలు జరిగే చోట నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగియగా అభ్యర్థులు గుర్తులతో ప్రచారానికి సిద్ధమయ్యారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంపంచాయతీ.. చివరిరోజు చుట్టేశారు.. మొదటి విడత ఎన్నికలు కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో జరగనున్నాయి. ఆయా మండలాల్లో 192 గ్రామపంచాయతీలు, 1,740 వార్డులకు గాను 20 గ్రామపంచాయతీలు, 323 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇంకో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 172 సర్పంచ్ స్థానాలు, 1,415 వార్డుల్లో గురువారం పోలింగ్ జరగనుంది. ఈ గ్రామాల్లో ప్రచారం మంగళవారం ముగియగా చివరి రోజున అభ్యర్థులు జోరు పెంచారు. ఇంటింటా ఓటర్లను కలిసి తమ గుర్తుతో ముద్రించిన కరపత్రాలు ఇస్తూ తమను గెలిపిస్తే నెరవేర్చనున్న హామీలను వివరించారు. అభ్యర్థుల తరఫున మద్దతు ఇస్తున్న పార్టీల జిల్లా స్థాయి నాయకులు రంగంలోకి దిగారు. ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. రెండో విడతలో నువ్వా.. నేనా! రెండో విడత ఎన్నికలు జరిగే కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని జీపీల్లో ప్రచారం ఉధృతమైంది. ఈనెల 6న ఉపసంహరణ గడువు ముగిశాక అభ్యర్థుల సంఖ్య తేలడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక్కడ ఈనెల 14న ఎన్నికలు జరగనుండగా, 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచార గడువు ఉంది. ఆలోగా వీలైనన్ని సార్లు ఓటర్లను నేరుగా కలవడంతో పాటు గుర్తును అందరికీ తెలియచేసేలా పోస్టర్లు, మైక్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ముగిసిన ఉపసంహరణలు జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో మూడో విడతగా ఈనెల 17న పోలింగ్ జరగనుంది. ఈ మండలాల్లోని జీపీల్లో మంగళవారం మధ్యాహ్నం ఉపసంహరణల గడువు ముగిసింది. దీంతో ఏకగ్రీవమైన జీపీలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులు ముందుగానే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఇప్పుడు గుర్తులు కూడా కేటాయించడంతో బుధవారం నుంచి మరింత ఉధృతం చేసేలా సన్నాహాలు చేసుకున్నారు.తొలి దశ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం ముగియడంతో అభ్యర్థుల అమ్ములపొది నుంచి నుంచి అస్త్రాలు తీసేందుకు సిద్ధహయ్యారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు షురూ చేశారు. ఇన్నాళ్లు ఓటర్లకు హామీలతో సరిపెట్టిన వారు ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కీలకంగా ఉన్న వారిని కలిసి పరోక్షంగా సహకరించాలని కోరుతున్నారు. అలాగే, ఓటర్లకు ఎంతో కొంత ముట్టచెప్పి తమకే ఓటు వేసేలా హామీ తీసుకుంటున్నారు. అలాగే మద్యం, ఇతర విలువైన వస్తువులు పంపిణీ చేసేలా గ్రామాల్లో డంప్ చేశారు.మొదటి విడత జీపీల్లో ముగిసిన ప్రచారం -
●నాడు పతులు.. నేడు సతీమణులు
కామేపల్లి: కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ఇద్దరు మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో గ్రామానికి చెందిన బానోత్ రవి బీఆర్ఎస్ తరఫున, బానోత్ దేవాలాల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా రవి విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో బానోత్ రవి భార్య శాంతి, దేవాలాల్ భార్య కమల బరిలో ఉన్నారు. ఒకరు చేసిన అభివృద్ధిని వివరిస్తూ, ఇంకొకరు గత ఎన్నికల్లో ఓడిపోయినందున ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. -
కాంగ్రెస్తోనే తెలంగాణ ఏర్పాటు
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్తో పాటు పార్టీ అగ్రనాయకురాలు సోని యా గాంధీ కృషి మరువలేనిదని కాంగ్రెస్ జిల్లా, ఖమ్మం నగర అధ్యక్షులు నూతి సత్యనా రాయణ, నాగండ్ల దీపక్చౌదరి అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకల్లో వారు మాట్లాడారు. సోనియా పుట్టినరోజును తెలంగాణ తల్లి అవతరణ దినో త్సవంగా ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కార్పొరేటర్ లకావత్ సైదులు, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ జావేద్, వడ్డెబోయిన నరసింహరావు, యర్రం బాలగంగాధర్ తిలక్, కొత్తా సీతరాములు, పుచ్చకాయ ల వీరభద్రం, మొక్క శేఖర్గౌడ్, కన్నం ప్రసన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తక్కువ ప్రీమియంతో పోస్టల్ బీమా పథకాలు ఖమ్మం మామిళ్లగూడెం: ఇతర సంస్థలతో పోలిస్తే అతితక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పొందే పథకాలు తపాలాశాఖలో అందుబాటులో ఉన్నాయని ఖమ్మం సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. ఖమ్మం ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ రూ. 550తో సంవత్సరానికి రూ.10లక్షలు, రూ. 750తో రూ.15 లక్షల బీమా అమల్లో ఉంటుందని వెల్లడించారు. అలాగే, సేవింగ్స్ ఖాతాను రూ.500తో ప్రారంభిస్తే ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. అంతేకాక సుకన్య సమృద్ధి పథ కం ద్వారా పదేళ్ల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారు రూ.250 మొదలు రూ.లక్షన్నర వరకు జమ చేయవచ్చని వెల్లడించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ)రాష్ట్రప్రధాన కార్యదర్శి కట్టెకోల రాంనారాయణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావుతో పాటు కోశాధికారి కళ్యాణ్చక్రవర్తి, నామా పురుషోత్తం, తపాలా శాఖ ఉద్యోగి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ పార్క్లో పటిష్ట రక్షణ ఏర్పాట్లు సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి అర్బన్పార్కులో వన్యప్రాణుల రక్షణ కోసం పటిష్ట ఏర్పాట్లు చేయనున్నట్లు ఎఫ్డీఓ వాడపల్లి మంజుల తెలిపారు. సింగరేణి ఏజీఎం రామకృష్ణతో కలిసి మంగళవారం ఆమె పార్కు ప్రహారీ, ఫెన్సింగ్ను పరిశీలించారు. సుమారు మూడు కి.మీ. మేర పది అడుగుల ఎత్తుతో సింగరేణిగా ఆధ్వర్యాన ప్రహారీ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో రేంజర్ పి.స్నేహలత, ఎఫ్ఎస్ఓ అరుణ్కుమార్, సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పరిశీలన కారేపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటుచేస్తుండగా జెడ్పీ సీఈఓ దీక్షరైనా మంగళవారం పరిశీలించారు. మండలంలోని 41గ్రామపంచాయతీల పరిధిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇక్కడే సామగ్రి పంపిణీ చేయనుండగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని కూడా సీఈఓ పరిశీలించారు. తహసీల్దార్ అనంతుల రమేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్రప్రసాద్ ఉన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఓటరు స్లిప్ సమాచారం కోసమేనని, ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తెచ్చుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి గంట ముందు ఏజెంట్ల సమక్షాన మాక్ పోలింగ్ నిర్వహణ, పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టేలా ఉద్యోగులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా నుంచి ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామారావు మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు జరుగనున్న ఏడు మండలాల్లో విధులకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయిందని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లను సీపీ సునీల్దత్ వివరించగా.. వీసీలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీసీఓ గంగాధర్, ఆర్టీఓ వెంకటరమణ, డీపీఓ ఆశాలత, డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, జిల్లా ఉపాధి అధికారి కె.శ్రీరామ్, ఆర్డీఓ నర్సింహారావు పాల్గొన్నారు. 2,41,137 మంది ఓటర్లు ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డుస్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వివరించారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, ఆతర్వాత అక్కడే లెక్కింపు చేపడుతామని తెలిపారు. ఆయా పంచాయతీల్లో 2,41,137 మంది ఓటర్లకు గాను 1,16,384 మంది పురుషులు, 1,24,743 మంది మహిళలు, ఇతరులు 10 మంది ఉన్నారన్నారు. తొలి విడత ఎన్నికలకు 2,089 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తుండగా, 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఇతర ఉద్యోగులను నియమించామని తెలిపారు. అలాగే, ఏడు చొప్పున డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.చింతకాని/బోనకల్: మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనుండగా రిటర్నింగ్ అధికారులు, ఇతర ఉద్యోగులు విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. చింతకాని, బోనకల్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలు, సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశాారు. సామగ్రి పంపిణీ, పోలింగ్, మాక్ పోలింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్కు ముందు రోజు ఎన్నికల సిబ్బంది కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షించాలని చెప్పారు. అనంతరం నాగులవంచలోని పోలింగ్, కౌంటింగ్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని -
నేడు డిప్యూటీ సీఎం పర్యటన
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం మధిరలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మధిర చేరుకోనున్న ఆయన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 3నుంచి 5గంటల వరకు పార్టీ నాయకులు, ప్రజలతో సమావేశం కానున్న భట్టి హైదరాబాద్ బయలుదేరతారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయింపు ఖమ్మం సహకారనగర్: ఖరీఫ్ సీజన్కు సంబంధించి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయించాలంటే బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కేటాయింపు, పెండింగ్ సీఎంఆర్ అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు సరఫరా చేసే ధాన్యం విలువకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సిందేనని తెలిపారు. కాగా, 2024–25 యాసంగి పంటకు సంబంధించి జిల్లాలో 1,07,676 మెట్రిక్ టన్నుల సీఎంఆర్కు గాను 95,100 మెట్రిక్ టన్నులు అందించారని, మిగతా బియ్యం కూడా త్వరగా అందజేయాలని సూచించారు. ఈసమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2.20 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు నేలకొండపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లా అంతటా 2.20 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుకు అవకాశముందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని ముజ్జుగూడెంలో మొక్కజొన్న సాగుతో పాటు బోదులబండలో డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగును మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 3.5లక్షల్లో వరి సాగు కాగా, యాసంగిలో 3లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈమేరకు సరిపడా యూరియా సిద్ధం చేసి, రైతులకు ప్రత్యేక పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా పంపిణీ పారదర్శకంగా సాగుతుందని వెల్లడించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు రైతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డీఏఓ సూచించారు. నేలకొండపల్లి ఏఓ ఎం.రాధ, ఏఈఓలు పాల్గొన్నారు. పర్యాటకుల కోసం బ్యాటరీ వాహనాలు కల్లూరురూరల్: పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం బ్యాటరీ ఆటోలను సమకూర్చింది. ఈమేరకు రెండు ఆటోలు కల్లూరులోని అటవీశాఖ కార్యాలయానికి చేరాయి. పులిగుండాల ప్రాజెక్టును అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యాన అభివృద్ధి చేస్తుండడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యాన రాకపోకలు సులువయ్యేలా బ్యాటరీ ఆటోలను కేటాయించారు. 26లోగా పరీక్ష ఫీజు చెల్లించండి ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంగపతిరావు సూచించారు. పదో తరగతి థియరీ, ప్రాక్టికల్స్ ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు రూ.150 చొప్పున చెల్లించాలని తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో లేదా మీ సేవ, టీ సేవ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు. -
పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు పరిశీలించారు. ఈమేరకు 1,899 పోలింగ్ అధికారులు, 2321 ఓపీఓలను కేటాయించి, 20శాతం మందిని రిజర్వ్ చేశామని తెలిపారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడగా అదనపు కలెక్టర్ శ్రీజ, సీపీఓ శ్రీనివాస్, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, ఈడీఎం దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. -
ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
తల్లాడ/కల్లూరు రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. తల్లాడ మండలం మల్లారం, కల్లూరు మండలం లింగాలలోని నామినేషన్ల ఉపసంహణ, పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తూ పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. తల్లాడ మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్, తహసీల్దార్లు కరుణాకర్రెడ్డి, పి.సాంబశివుడు, ఎంపీడీఓలు సురేష్బాబు, చంద్రశేఖర్, ఎంపీఓ పి.రాజారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, కల్లూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటుచేస్తుండగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మంగళవారం పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. ‘గోపా’ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుడిద శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బండి సాయన్నగౌడ్, జీ.వీ. శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర కోశాధికారి ఎం.రఘునాథ్గౌడ్ ఖమ్మంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేయగా, నాయకులు సాయివేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విమానం ఎగిరేనా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియ ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎయిర్పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాలను త్వరగా ఎంపిక చేసి, ఫీజుబులిటీ సర్వే నిర్వహిస్తేనే రాబోయే మూడేళ్లలో కొంత ప్రగతి సాధ్యమవుతుంది. లేదంటే ఎప్పటిలాగే విమానాశ్రయం ప్రకటనలకే పరిమితమవుతుంది.రెండు దశాబ్దాల కల.. కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతు న్నాయి. గతంలో లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడు చెలక, పాల్వంచ మండలం బంగారుజాల – గుడిపాడు ప్రాంతాల్లోని భూములను పరిశీలించినా ఆ స్థలాలు అనుకూలంగా లేవని తేలింది. దీంతో ప్రభుత్వం గతేడాది కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించింది. ఆయా మండలాల పరిధిలో గరీబ్పేట పరిసరాల్లో 950 ఎకరాలు ఎంపిక చేసినట్లు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. మళ్లీ మొదటికొచ్చిన కథ.. గరీబ్పేట పరిసర ప్రాంతాల్లో ఎంపిక చేసిన 950 ఎకరాల స్థలాన్ని పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన టెక్నికల్ టీమ్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించింది. ఈ బృందం జనవరి 23న క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎంపిక చేసిన స్థలం సమీపంలో ఎత్తయిన గుట్టలు ఉండటం, గాలి వీచే దిశ, వేగం తదితర అంశాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా లేవంటూ ఆ బృందం ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చింది. అదే సమయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ పురోగతిపై మార్చిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నివేదిక వెల్ల డించగా.. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ కేంద్రం ప్రకటన చేసింది. దీంతో కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విమానాశ్రయ నిర్మాణానికి ఎంపిక చేసే ప్రదేశానికి సంబంధించిన వాతావరణ (మెటీయోరాలాజికల్) నివేదికలు, విండ్రోజ్ డయాగ్రమ్ తదితర సాంకేతిక అంశాలు కీలకంగా ఉంటున్నాయి. అదే విధంగా సదరు స్థలంలో ఉన్న ఎత్తయిన కొండలు, నిర్మాణాలు, వాగులతో విమాన రాకపోకలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అనే అంశాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. గతంలో ఎంపిక చేసిన బంగారుజాల – గుడిపాడు విషయంలోనూ ఎత్తయిన కొండలు, కేటీపీఎస్ చిమ్నీలు ఇబ్బందిగా మారాయి. తాజాగా గరీబ్పేటలోనూ భౌగోళిక పరిస్థితులే అడ్డుగా నిలిచాయి. అందుకే మరోసారి స్థలాన్ని గుర్తించేప్పుడు భౌగోళిక అంశాల్లో మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికై తే పాల్వంచ, బూర్గంపాడు మండలాల పరిఽధిలో కొండలు, గుట్టలు, వాగులు లేని రెవెన్యూ స్థలాలను జిల్లా యంత్రాంగం గుర్తించినట్టు సమాచారం. మరో సర్వే ఎప్పుడో కొత్తగూడెం ఎయిర్పోర్టు అంశంపై విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడుతో సెప్టెంబర్ 16న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో కాకుండా మరో చోట స్థలాన్ని ఎంపిక చేస్తామని, అక్కడ ఫీజుబు లిటీ సర్వే చేపట్టాలని కోరారు. ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్సింగ్ యూనివర్సిటీ ప్రారంభం, అడ్మిషన్లు, మౌలిక వసతుల కోసం ప్రణాళిక తయారీ తదితర అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ అంశం మరుగునపడింది. ఇటీవల ఈ యూనివర్సిటీని సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ విషయంలో కేంద్రం తన స్పందనను స్పష్టం చేసింది. ఇకనైనా ఎయిర్పోర్ట్కు ప్రత్యామ్నాయ స్థలాల ఎంపికపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్పై ఏర్పాటుపై సందిగ్ధత -
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
ఖమ్మంరూరల్/తిరుమలాయపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అభ్యర్థులు, పార్టీల నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని జీపీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సమావేశాలు మంగళవారం నిర్వహించగా ఆయన మాట్లాడారు. అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరిస్తే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగుస్తాయని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కేసులు నమోదవుతాయని సీపీ హెచ్చరించారు. కాగా, ఫలితాల అనంతరం ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈసమావేశాల్లో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, అడిషనల్ డీసీపీ విజయబాబు, ఏసీపీలు తిరుపతిరెడ్డి, నర్సయ్య, సీఐలు ముష్క రాజు, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు కూచిపూడి జగదీష్, రామలింగారెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2వేల మంది సిబ్బందితో బందోబస్తు ఖమ్మంక్రైం: గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని సీపీ సునీల్దత్ తెలిపారు. అడిషనల్ డీసీపీలు, ఏసీపీల పర్యవేక్షణలో వీరు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాల్లో సాయుధ పోలీస్ బలగాలను మోహరించడంతో పాటు ప్రత్యేక బృందాలతో డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా 16 సరిహద్దు చెక్పోస్టుల ద్వారా తనిఖీలు ముమ్మరం చేశామని వెల్లడించారు. కాగా, 953 బైండోవర్ కేసుల్లో 6,403మందిని తహసీల్దార్ల ఎదుట హాజరుపర్చడమే కాక 207మంది రౌడీషీటర్లు 1,100 మంది పాతనేరస్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన రూ.12లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామని తెలిపారు. అంతేకాక 86మంది తమ ఆయుధాలను అప్పగించారని సీపీ వివరించారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
‘విధుల కేటాయింపులో లోపించిన పారదర్శకత
ఖమ్మం సహకారనగర్/ఏన్కూరు: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధుల కేటాయింపులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఆరోపించారు. కొందరికి రెండు, మూడు విడతల విధులు కేటాయించగా, మరికొందరిని పూర్తిగా తొలగించారని తెలిపారు. అంతేకాక కొన్నిచోట్ల సీనియర్లను ఓపీఓలుగా నియమించి, అత్యంత జూనియర్లను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు ర్యాండమైజేషన్ విధానం పాటించామని చెబుతున్నారని తెలిపారు. ఇకనైనా మూడు విడతల డ్యూటీ ఇచ్చిన వారిని ఒక విడత నుంచి తప్పించాలని, విధుల మరుసటి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని వారు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కాగా, మూడు విడతల ఎన్నికలకు విధులు కేటాయించిన ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని, పోలింగ్ మరుసటి రోజు ఓడీ సౌకర్యం కల్పించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్రావు, ఆర్.రంగారావు కలెక్టర్ అనుదీప్ను కోరారు. అలాగే, ఏన్కూరులో టీఎస్ యూటీఎఫ్ మండలల అధ్యక్షుడు బి.రాంచందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి డీఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు ఇకనైనా ఎన్నికల విధుల విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు సింగ్యా, రమేష్, శ్యామల, సుశ్మిత, ఎం.పుల్లయ్య, జె.పుల్లయ్య, శంకర్రావు, రాఘవరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆయకట్టుకు ఢోకా లేకుండా..
ఖమ్మంఅర్బన్: రానున్న రబీ సీజన్లో సాగర్ ఆయకట్టు కింద పంటల సాగు సాఫీగా సాగేలా నీటి విడుదలకు జలవనరుల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి వారబందీ విధానంలో నీటి విడుదలకు నిర్ణయించిన అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. వానాకాలంలో 42టీఎంసీలు గడిచిన వానాకాలం పంటల సీజన్లో సాగర్ ఆయకట్టు కింద 4.10లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఇందులో 1.40 లక్షల ఎకరాల్లో వరి, 2.69 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీరు అందినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నారు. ఇందుకోసం 42 టీఎంసీల నీటిని వినియోగించారు. అలాగే, సాగర్ కాల్వలపై ఉన్న ఎత్తిపోతల పథకం ద్వారా మరో 25వేల ఎకరాలకు నీరు అందించినట్టు చెబుతున్నారు. సీజన్లో అధిక వర్షాలు ఉండడంతో పంటలకు ఏ సమస్య రాకుండా నీరు విడుదల చేయగలిగారు. రబీ సీజన్ కోసం.. రానున్న రబీ సీజన్లో జిల్లాలో 3.84లక్షల ఎకరాల్లో పంటలు సాగవనుండగా, వరి, ఆరుతడి పంటలకు 49.18 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా సాగర్ జలాల ద్వారా పంటలు సాగయ్యే అవకాశముంది. ఈమేరకు సాగర్ ప్రధాన కాల్వ ద్వారా 2.54లక్షల ఎకరాలకు నీరు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. పంటల అవసరాలు, కాల్వలో పారే సమయాన ఆవిరి, లీకేజీలన్నీ లెక్కించి సుమారు 31.84 టీఎంసీల సాగర్ జలాల కేటాయింపునకు ప్రతిపాదించినట్లు తెలిసింది. 24 రోజులు నిరంతరం.. ఆతర్వాత వారబందీ సాగర్ ఆయకట్టు మొత్తానికి 31.84 టీఎంసీల నీరు అవసరమని అంచనా వేశారు. ఈమేరకు ఖమ్మం, కల్లూరు సర్కిళ్లకు ఏడు రోజుల చొప్పున సరఫరా చేయాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. ఒక సర్కిల్లో ఏడు రోజులు, ఆతర్వాత ఏడు రోజులు ఇంకో సర్కిల్కు సరఫరా చేస్తూ వారబందీ విధానం అమలుచేయనున్నట్లు సమాచారం. తొలుత రైతులు ఇబ్బంది పడకుండా ఈనెల 15 నుంచి వరుసగా 24 రోజులు మాత్రం నిరంతరాయంగా నీరు సరఫరా చేసి, ఆతర్వాత వారబందీ విధానం అమలుచేసే అవకాశముంది. సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నందున రబీ పంటల సాగుకు నీటి విడుదలలో అవాంతరాలు ఎదురుకావని రైతులు భావిస్తున్నారు. ఈమేరకు అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తే ఆయకట్టుకు నీరందనుంది. కాగా, ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని రైతులు వరి నార్లు పోయడంతో పాటు మొక్కజొన్న తదితర ఆరు తడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. -
●అక్రమంగా సంపాదిస్తే ఆస్తి జప్తు చేయండి
●బాండ్ పేపర్తో సర్పంచ్ అభ్యర్థి ప్రచారం రఘునాథపాలెం: గ్రామపంచాయతీ ఎన్నిక ల ఎన్నికలవేళ కొందరు అభ్యర్థులు వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రఘునాథపాలెం మండలం పువ్వాడనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా సీపీఎం మద్దతుతో బరిలోకి దిగిన కూచి పూడి నరేష్ కూడా ఇదే కోవలోకి వస్తారు. ‘సర్పంచ్గా ఎన్నికయ్యాక నేను రూపాయైనా అక్రమంగా సంపాదిస్తే ఆస్తిమొత్తం గ్రామపంచాయతీ అధికారులు, గ్రామప్రజలు స్వాధీనం చేసుకోవచ్చు. ప్రజల కోసం పనిచేయడమే నా ధర్మం’ అంటూ బాండ్ పేపర్ రాయించిన ఆయన ఆ ప్రతులను ఓటర్లకు అందిస్తున్నాడు. నిజాయితీపరులకే ఓటర్లు పట్టం కట్టాలని కోరుతున్నాడు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేయండి
ఖమ్మం లీగల్: ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి,రాజగోపాల్ సూచించారు. ఖమ్మంలోని న్యాయ సేవా సదన్లో ఇంచార్జ్ కార్యదర్శి ఎం.కల్పన అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యధిక కేసులు పరిష్కరించడం ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటిరకు 695 క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు 450, బ్యాంకు కేసులు వంద, భార్యాభర్తలకు సంబంధించినవి 150, మోటర్ ప్రమాద కేసులు 180, సివిల్ దావాలు 295తో పాటు ఇతరత్రా 2వేల కేసులను గుర్తించామని జిల్లా జడ్జి తెలిపారు. ఈ సమావేశంలో రెండో అదనపు న్యాయమూర్తి వెంపటి అపర్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్, న్యాయవాదులు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, గంగాధర్, సీత రామారావు, రాము, గుప్తా, పోలీసు ఉద్యోగులు పాల్గొన్నారు. బస్టాండ్లలో తనిఖీ చేసిన ఆర్ఎం ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త, పాత బస్టాండ్ల పాటు వైరా బస్టాండ్ను ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ సోమవారం తనిఖీ చేశారు. ఆయా బస్టాండ్ల నుంచి బస్సుల ఆపరేషన్ను పర్యవేక్షించారు. బస్టాండ్లో ప్రయాణికుల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఖమ్మం పాత బస్టాండ్లో రద్దీ సమయాన చోరీలు జరుగుతున్న నేపథ్యాన భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండడతో తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఆర్ఎం తెలిపారు. ‘ఐఈఎల్టీఎస్’ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన ఐఈఎల్టీఎస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విదేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు, స్కాలర్షిప్ పొందేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్హులైన వారు టీజీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ www. tgbcstudycircle. cgg. gov. in ద్వారా ఈ నెల 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 08742–227427, 94419 31359, 96521 61850, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. రిటైనింగ్ వాల్ పనులకు బ్రేక్? బిల్లుల జాప్యమే కారణంఖమ్మంఅర్బన్: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలోని కాలనీలు గ్రామాలను మున్నేటి వరద ముప్పు నుంచి రక్షించేలా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఆగిపోయినట్లు తెలిసింది. రూ.690 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టగా రెండు నెలల క్రితం వరదల కారణంగా బ్రేక్ పడింది. ఆతర్వాత ఇసుక కొరతతో కొన్ని రోజులు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సంస్థకు బిల్లులు రాకపోవడంతో మరోసారి పనులు నిలిచిపోయినట్లు సమాచారం. మున్నేటికి ఇరువైపులా 17 కి.మీ. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో రూ.90 కోట్ల బిల్లులే చెల్లించడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భూసేకరణ సమస్యల కారణంగా పలుచోట్ల పనులు ఆలస్యమవుతున్నాయి. భూసమస్య లేని ప్రాంతాల్లో పనులు వేగంగా చేపట్టే అవకాశం ఉన్నా పనులు ఆగిపోవడంతో వచ్చే సీజన్కై నా రిటైనింగ్ వాల్ పూర్తవుతందా, లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
రామనామంతో మార్మోగిన భద్రగిరి
భద్రాచలం: భద్రగిరి మాఢ వీదులు జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు చేపట్టిన శ్రీరామ పునర్వసు దీక్షను సోమవారం విరమించారు. ఆలయ ఈఓ కె.దామోదర్రావు దంపతులు శ్రీరామ పాదుకలను శిరస్సుపై ధరించగా.. మంగళ వాయిద్యాల నడుమ గిరిప్రదక్షిణ నిర్వహించారు. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాలలు అలంకరించారు. అనంతరం బేడా మండపంలో శ్రీరామ దీక్షా విరమణ పూజలు, సంక్షిప్త రామాయణ హవనం జరిపారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామికి పంచామృతాలతో స్నపన తిరుమంజనం జరిపించారు. ఆలయానికి రూ.లక్ష విలువైన టేబుల్ మధిర: మధిరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి కల్యాణానికి ఉపయోగించే రూ.లక్ష విలువైన టేబుల్ను మేళ్లచెరువు పృధ్వీకృష్ణ – దేవి ప్రియాంక దంపతులు సోమవారం అందజేశారు. అనంతరం స్వామిని దర్శించుకుని పూజలు చేయగా, ఆలయ కమిటీ బాధ్యులు వారిని సన్మానించారు. ఆచార్లగూడెం ఫొటోగ్రాఫర్కు అవార్డు నేలకొండపల్లి: మండలంలోని ఆచార్లగూడెంకు చెందిన ఫొటోగ్రాఫర్ నవీన్కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ‘తెలుగు ఆర్ట్ ఫొటోగ్రఫీ’ సొసైటీ ఆధ్వర్యాన ఇటీవల నిర్వహించిన పోటీల్లో 60 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొనగా, ‘మదర్ అండ్ చైల్డ్’ విభాగంలో నవీన్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మొదటి బహుమతి అందుకున్న ఆయనను పలువురు అభినందించారు.వైభవంగా పునర్వసు దీక్ష విరమణ -
●రెబల్స్కు మద్దతు ఇస్తే చర్యలు
సత్తుపల్లిటౌన్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థులపై పోటీ చేస్తున్న రెబల్స్, వారికి సహకరించే వారిపైనా క్రమశిక్షణా చర్యలు తప్పవని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ హెచ్చరించారు. సత్తుపల్లిలో సోమవారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్తో కలిసి మాట్లాడారు. పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరించే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కాగా, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు పాటుపడాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కట్టుపడే వారికి భవిష్యత్లో పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, శివవేణు, నాయకులు తోట సుజలరాణి, పింగళి సామేలు, చల్లారి వెంకటేశ్వరరావు, భాగం నీరజ, పసుమర్తి చందర్రావు, నాగుల్మీరా, మానుకోట ప్రసాద్, ప్రభాకర్, దూదిపాల రాంబాబు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ -
వనమా.. 18ఏళ్లు జీపీలో
పాల్వంచరూరల్: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గ్రామపంచాయతీ వార్డుసభ్యుడిగా, సర్పంచ్గా గెలవడంతో పాటు మంత్రి స్థాయికి ఎది గారు. పాల్వంచ మేజర్ గ్రామపంచాయతీలో 18ఏళ్ల పాటు వార్డు సభ్యుడిగా, సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవాలు ఆయన మాటల్లోనే.. పాల్వంచ గ్రామపంచాయతీ మొదటి వార్డు నుంచి సభ్యుడిగా పోటీ చేసినప్పుడు రూ.100 నామినేషన్ ఫీజు ఉండేది. ఆ తర్వాత సర్పంచ్గా బరిలోకి దిగితే అప్పట్లో వార్డు సభ్యుల ద్వారా సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉండేది. మెజార్టీ సభ్యులు జలగం వెంగళరావు వర్గంలోని నావైపే మొగ్గు చూపినా చేకూరి కాశయ్య వర్గంగా రేఖ సత్యం కూడా పోటీ పడ్డారు. అయినా నేనే గెలిచా. ఆ తర్వాత రకరకాల పదవులు నిర్వర్తించి 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచా. 2008లో డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించా. నేను సర్పంచ్గా చేసిన అభివృద్ధికి 1980లో అప్పటి గవర్నర్ కుముద్బేన్జోషీ చేతుల మీదుగా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు అందుకోవడం మరిచిపోలేని అనుభూతి. -
ప్లాస్టిక్పై సమరం
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్కు బదులు డిగ్రటేబుల్ బ్యాగ్లను వాడకంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు.వాతావరణ ం జిల్లాలో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సాయంత్రం తర్వాత చలి ప్రభావం ఉంటుంది.కామేపల్లి: కామేపల్లి మండలం పాతలింగాలకు చెందిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గ్రామ సర్పంచ్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. స్వగ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై న వెంకటరెడ్డి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 1967లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి పంచాయతీగా లింగాల సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. 1977లో ఏకగ్రీవం కాగా.. పదేళ్లు సర్పంచ్గా పని చేశారు. 1996లో సుజాతనగర్లో ఉప ఎన్నిక రావడంతో అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే, 2009లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, 2016లో అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. -
పల్లె నుంచే ప్రథమం
ఇల్లెందు: ‘ఆనాడు గ్రామపంచాయతీ సర్పంచ్గా బరిలోకి దిగిన నా నామినేషన్ ఫీజు పార్టీ చెల్లించగా.. ఇతరత్రా పైసా ఖర్చు పెట్టకుండా గెలిచాను’ అని గుమ్మడి నర్సయ్య వెల్లడించారు. ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన సర్పంచ్గా తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఇల్లెందు తాలూకాలోని టేకులగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్గా 1981 ఎన్నికల్లో పోటీ చేశా. అప్పటి ప్రజాపంథా తరఫున బరిలోకి దిగగా, నామినేషన్ ఫీజు కూడా పార్టీయే చెల్లించింది. ఆ ఎన్నికల్లో నాతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఉసిరికాయలపల్లి ఏరియా ఓట్లు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు పోల్ కాగా టేకులగూడెం ఏరియా ఓట్లు నాకు రావడంతో 40 ఓట్ల మెజార్టీతో గెలుపొందా. రెండేళ్ల పాటు టేకులగూడెం గ్రామపంచాయతీకి ప్రభుత్వం నుంచి పైసా విడుదల కాలేదు. ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున ఇంటి పన్నులు వసూలు చేయొద్దని ఆనాడు పార్టీలు పిలుపునివ్వడంతో రాబడి నిలిచిపోయింది. దీంతో పంచాయతీ సభలు, సమావేశాలకే పరిమితం కావాల్సి వచ్చేది. సర్పంచ్గా రెండేళ్లు పూర్తి కాకముందే 1983లో పార్టీ నన్ను ఎమ్మెల్యేగా పోటీలో నిలిపింది. నేను సర్పంచ్గా బరిలో ఉన్నప్పుడు ఇంటింటి ప్రచారం మినహా కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు, మైకుల హోరు లేదు. కానీ ఇప్పుడు రూ.లక్షలు ఖర్చు చేస్తే తప్ప సర్పంచ్గా ఎన్నికయ్యే అవకాశం దక్కడం లేదు. అంతేకాక ఆనాటి పెద్ద పంచాయతీలు ఇప్పుడు పదికి పైగా విడిపోయాయి.సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ఆరంభం -
తాటి.. పెద్దకాపు చెబితే ఓట్లు
అశ్వారావుపేట: ఉమ్మడి రాష్ట్రంలోని పూర్వ ఖమ్మం జిల్లా, ప్రస్తుతం ఏపీలోని ఏలూరు జిల్లాలో ఉన్న వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము 1981లో గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఆ గ్రామ తొలి సర్పంచ్గా సీపీఐ నుంచి ఎన్నికై న తాటి వెంకటేశ్వర్లు.. ఆ తర్వాత టీడీపీలో చేరి బూర్గంపాడు, అశ్వారావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాలు.. 1981లో తాట్కూరుగొమ్ము గ్రామపంచాయతీ ఏర్పడగా సీపీఐ నుంచి సర్పంచ్గా పోటీ చేశా. అప్పట్లో పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలకు సైకిల్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉండడంతో కాలినడకే ఎంచుకునేవాళ్లం. ఒక గ్రామానికి వెళ్లగానే గ్రామ పెదకాపు(గ్రామపెద్ద) గ్రామస్తులందరినీ పిలిపిస్తే ఎవరి మంచం వాళ్లు తెచ్చుకుని కూర్చునేవాళ్లు. అంతా కలిసి ఫలానా వ్యక్తికి ఓటు వేయాలని పెదకాపు తీర్మానిస్తే అంతా సరేననే వారు. అప్పట్లో కరపత్రాల కోసం ఓ మనిషి రాజమండ్రి వెళ్లి రాత్రి అక్కడే నిద్రించి మరుసటి రోజు వచ్చేవారు. ఎర్రబట్ట కొని జెండాలు కుట్టించుకుని ప్రచారానికి వెళ్లే వాళ్లం. ప్రచారంలో పాల్గొనే వారు ఇంట్లోనే అన్నం తిని వచ్చేవాళ్లు. అందుకే ఖర్చు పెద్దగా కాలేదు. పంచాయతీ పరిధిలోని పొగాకు బ్యారన్ల నుంచి రూ.2వేల పన్ను మాత్రమే ఆదాయం ఉండగా, నా గౌరవ వేతనం రూ.200, గుమస్తా జీతం పోను మిగిలిన డబ్బుతో పనులు చేపట్టేవాళ్లం. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పువ్వాడ నాగేశ్వరరావుకు ఓటు వేశాం. బూర్గంపాడు సమితి ఎన్నికల్లో కూడా ఓటు వేశా. -
మెచ్చా.. రెండు సార్లు సర్పంచ్
అశ్వారావుపేట: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం సర్పంచ్గానే మొదలైంది. దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెం సర్పంచ్గా రెండు సార్లు ఎన్నికై న ఆయన 2019లో కాంగ్రెస్ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా అశ్వారావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న మెచ్చా వెల్లడించిన వివరాలు.. రెండు సార్లు టీడీపీ బలపరచిన అభ్యర్థిగా సర్పంచ్గా గెలుపొందా. మొదట 1995లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచినా, రెండో సారి ఏకగ్రీవమైంది. ఒకే గ్రామంలో ఓటర్లు ఉండటంతో కాలి నడకనే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసేవాళ్లం. అప్పట్లో మైకులు, ప్లెక్సీలు లేకపోగా బ్యానర్లు కూడా కట్టలేదు. వాల్పోస్టర్లు సత్తుపల్లి నుంచి తెచ్చుకుని ఇంటింటికీ అతికించేవాళ్లం. అవి కూడా పార్టీలో ఎవరైనా వాళ్ల డబ్బుతోనే ముద్రించి ఇచ్చేవాళ్లు. ప్రచారంలో పాల్గొనే పార్టీ కార్యకర్తలకు, గ్రామంలో అంతా తెలిసిన వాళ్లే కావడంతో ఏ వీధిలో వాళ్లు అక్కడే అభ్యర్థితో ప్రమేయం లేకుండా వాగ్దానం తీసుకుని ఓట్లు వేయించేవారు. ఒక్క సారి మాత్రమే నేను వెళ్తే మిగతా సమయమంతా పార్టీ వాళ్లే చూసుకునేవారు. అప్పట్లో బ్యాంకు ఖాతా నిబంధన లేకపోగా, ఖర్చు వివరాలు కూడా అడిగే వారు కాదు. -
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి.రామారావు సూచించారు. ఖమ్మం పాండురంగాపురంలోని బస్తీ దవాఖానాను సోమవారం తనిఖీ చేసిన ఆయన వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించి మాట్లాడారు. సికిల్ సెల్ పేషంట్ల వివరాలను పోర్టల్లో నమోదు చేసి ప్రతీనెల మందులను ఇవ్వాలని సూచించారు. అనంతరం మామిళ్లగూడెం యూపీహెచ్సీని కూడా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వైద్యులు ఎం.అనిరుధ్, కృష్ణచైతన్యతో పాటు ఉద్యోగులు శ్రీలత, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు తోడ్పాటు
కరకగూడెం: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో చదువుతున్న విద్యార్థినులు పోటీ పరీక్షల్లో రాణించేలా, రాష్ట్ర, జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థినుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 14 కేజీబీవీలు ఉండగా, వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 3,700 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఖమ్మంలో జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా, 4,300 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఆరు కేజీబీవీల్లో శిక్షణ కేంద్రాలు రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం ప్రతీ జిల్లా నుంచి మూడు కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ శిక్షణ కేంద్రాలు(వైఐఐఓఈ)గా ఎంపిక చేసింది. వీటిల్లో పోటీ పరీక్షలపై కోచింగ్ ఇస్తారు. ఉమ్మడి జిల్లాలో ఆరు కేజీబీవీలను ఎంపిక చేయగా, ఆన్లైన్ పద్ధతిలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. భద్రాచలం, రఘునాథపాలెం పాఠశాలల్లో ఐఐటీ–జేఈఈ ప్రవేశ పరీక్షలపై, పాల్వంచ, ఖమ్మం రూరల్ కేజీబీవీల్లో నీట్, ఈఏపీసెట్, కూసుమంచి, చండ్రుగొండ పాఠశాలల్లో క్లాట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నారు. వారానికోసారి రాత పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఖాన్ అకాడమీ భాగస్వామ్యంతో బాలికలకు భౌతికశాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం వంటి సబ్జెక్ట్ల్లో ఆన్లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఫిజిక్స్ వాలా సహకారంతో 9 నుంచి 12వ తరగతులకు ఫిజిక్స్, గణితంలలో ఆన్లైన్ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మెరుగైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణలతో కేజీబీవీలకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లో శిక్షణ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. కేజీబీవీ విద్యార్థినుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసింది. పేదరికం వల్ల ప్రతిభ కోల్పోకుండా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. నెల రోజుల క్రితం శిక్షణ తరగతులు ప్రారంభం కాగా, పోటీ పరీక్షల సమయం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. –అన్నామణి, జీసీడీఓ -
గొర్రెల చోరీకి యత్నం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లి డైట్ కళాశాల సమీపాన సోమవారం గొర్రెల దొంగతనానికి కొందరు యత్నంచారు. డొంకరోడ్డు ప్రాంతంలో పొలాల వద్దకు యరదేశి మల్లయ్య, వెంకటేశ్వర్లు తమ గొర్రెలను మేతకు తీసుకెళ్లగా ఆటోలో వచ్చిన ఐదుగురు జీవాలను ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు తెలిసింది. అప్రమత్తమైన కాపరులు తమ గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి నిందితులను పట్టుకుని ఖమ్మం అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా విచారణ చేపడుతున్నామని సీఐ భానుప్రకాశ్ వెల్లడించారు. -
●44ఏళ్ల తర్వాత పాలేరు ఏకగ్రీవం
కూసుమంచి: మండలంలో పెద్ద గ్రామపంచాయతీల్లో ఒకటైన పాలేరు గ్రామపంచాయతీ 44 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన బానోత్ నాగేశ్వరరావును ఏకగ్రీవ సర్పంచ్గా గ్రామస్తులు ఎన్నుకున్నారు. గతంలో 1981లో గోపె మోతెయ్య వార్డు సభ్యులు ఎన్నకునే పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో కమ్యూనిస్టు కంచుకోటగా ఉన్న పాలేరులో 1959లో తొలి సర్పంచ్గా సీపీఎం నుండి బజ్జూరి పుల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నుండే పలువురు సర్పంచ్లుగా గెలిచారు. 2019 ఎన్నికల్లో 75ఏళ్ల వయస్సు కలిగిన ఎడవెల్లి మంగమ్మ సీపీఎం తరఫున సర్పంచ్గా గెలవగా, ఆమె హయాంలో గ్రామపంచాయతీ గుడ్ గవర్నెస్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. పాలేరు అనగానే రిజర్వాయర్, నవోదయ విద్యాలయ గుర్తుకొస్తాయి. ఈ పంచాయతీలో 2,798 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఈ గ్రామంలోని 12వార్డులకు గాను తొమ్మిది ఏకగ్రీవమయ్యాయి. -
హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు
కారేపల్లి: పట్టించుకునే వారెవరూ లేకపోవడంతో పలువురు విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లగా.. రోడ్డుప్రమాదంలో ఒకరికిగాయా లైన ఘటన ఇది. మండలంలోని ఉసిరికాయలపల్లి బాలుర ఆశ్రమపాఠశా ల వార్డెన్ బాల్సింగ్ తన స్వగ్రామానికి, హెచ్ఎం ధర్మా ఎన్నికల విధులకు వెళ్లారు. ఇన్చార్జి హెచ్ఎం రమేష్, మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఆది వారం హాస్టల్లో విధులు నిర్వర్తించగామధ్యాహ్నం ఇద్దరు ఉపాధ్యాయులు విధులు ముగించుకుని వెళ్లిపోయారు. ఆతర్వాత వార్డెన్ లేకపోవడంతో పలువురు విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. రహదారిపై ద్విచక్రవాహనదా రులను లిఫ్ట్ అడిగి ఇల్లెందు చేరుకుని కాసేపు గడిపాక తిరిగి ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడుగు తూ బయలుదేరారు. ఈక్రమాన 9వ తరగతి చదువుతున్న రఘునాథపాలెం మండలం దోనబండకు చెందిన భూక్యా సాగర్ ఒకరి వాహనంపై వస్తుండగా, ఇల్లెందులో మరో వాహనం ఢీకొట్టగా సాగర్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఇల్లెందు ఆస్పత్రికి తరలించి ఇన్చార్జి హెచ్ఎం రమేష్కు సమాచా రం ఇచ్చారు. ఆయన కొత్తగూడెంకు, ఆపై ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఖమ్మం ఏటీడీఓ రమేష్ సోమవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా హాస్టల్ వా ర్డెన్, ఇన్చార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరి గిందని సాగర్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆయన కన్ను, తలభాగంలో తీవ్రగాయాలు కాగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించడం వైద్యఖర్చులు తానే భరిస్తానని వార్డెన్ ఒప్పుకున్నట్లు తెలిసింది.రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు -
నేటితో తెర..
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని రెండేళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూసిన ఆశావాహులు తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనుండగా మొదటి దశలో ఏడు మండలాలు ఉన్నాయి. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఈనెల 3న ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. ప్రచార హోరు తొలి విడతకు సంబంధించి ఏడు మండలాల్లోని 192 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 20 మంచాయతీలు, 172 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 172 గ్రామపంచాయతీలు, 1,582వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో ప్రచారం మోత మోగుతోంది. అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రతీ ఇంటికి ఒకటికి రెండు సార్లు వెళ్లి తమను గెలిపించాలని కోరుతున్నారు. ఇంటింటి ప్రచారంతోపాటు పోస్టర్లు, స్టిక్కర్లు, మైక్ల ద్వారా ప్రచారం ఉధృతం చేశారు. ప్రచారంలో అగ్ర నాయకులు తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల తరఫున అన్ని పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున రఘునాథపాలెం మండలంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక సీపీఐ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరవుతున్నారు. అలాగే, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ తదితరులు పాల్గొంటున్నారు.మొదటి దశగా గ్రామాల్లో ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆయా గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగించాలి. దీంతో ఆదివారం నుంచి అభ్యర్థులు, వారి మద్దతుదారులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక మంగళవారం సాయంత్రంతో గడువు ముగిశాక చేపట్టాల్సిన కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ ముందు ఇచ్చే హామీలు, చేసే ప్రచారం, ఓటర్లను మచ్చిక చేసుకునే అంశంపైనే గెలుపోటములు ఆధారపడి ఉండడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. -
రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో జిల్లా జట్ల ప్రతిభ
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల బీచ్ వాలీబాల్ పోటీలను ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్లోని కృత్రిమ బీచ్లో సోమవారం జరిగాయి. పోటీలకు పాత పది జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈమేరకు బాలుర విభాగంలో ఖమ్మం జట్టు విజేతగా నిలవగా, రెండు, మూడో స్థానాల్లో మెదక్, నిజామాబాద్ జట్లు నిలిచాయి. ఇక బాలికల విభాగంలో ప్రథమస్థానం నిజామాబాద్ జట్టు సాధించింది. ద్వితీ య, తృతీయ స్థానాల్లో ఖమ్మం, హైదరాబాద్ జట్లు నిలిచాయి. విజేతల జట్లకు పోటీల రాష్ట్ర పరిశీలకులు మధు అందజేయగా, వాలీబాల్ అసోసియేషన్జిల్లాకార్యదర్శి బి.గోవిందా రెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావుతో పాటు డి.సైదులు, ఆదర్శ్కుమార్, నాగూల్మీరా, చిన్ని, అంజయ్య పాల్గొన్నారు. విధుల్లో చేరిన విద్యుత్ ఎస్ఈ ఖమ్మం వ్యవసాయం: వ్యక్తిగత సెలవులో ఉన్న విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ఈ శ్రీనివాసాచారి సోమవారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు కొత్తగూడెం ఎస్ఈ ఇన్చార్జిగా ఇక్కడ విధులు నిర్వర్తించారు. ‘కంపా’ నిధులు ఎన్ని కేటాయించారు? ఖమ్మంమయూరిసెంటర్: సాగునీరు, విద్యుత్ సహా వివిధ రకాల ప్రాజెక్టుల కోసం తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కాంపెన్సేటరీ అఫారేస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ(కంపా) నిధులను ఎంత మేర కేటాయించారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారని ఆయన సోమవారం లోక్సభలో అడిగారు. దీంతో ‘కంపా’ నిధుల్లో భాగంగా తెలంగాణకు ఇప్పటివరకు రూ.3,852.61 కోట్లు అందించినట్లు కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. పంట అవశేషాలను కాల్చొద్దు మధిర: రైతులు పంట కోతకాలం పూర్తయ్యాక అవశేషాలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాఽధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని ఖమ్మంపాడులో సోమవారం పర్యటించిన ఆయన రైతులతో మాట్లాడారు. పత్తి, వరి పంటల అవశేషాలను కాలిస్తే అనేక నష్టాలు ఎదురవుతాయని చెప్పారు. అలాకాకుండా భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుందని వివరించారు. మండల వ్యవసాయాధికారి కనకం సాయిదీక్షిత్, ఏఈఓ సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్పై సమరం
● ఖమ్మంలో ‘డిగ్రడేబుల్’ కవర్ల వినియోగం ● అన్నిచోట్ల విక్రయించేలా కేఎంసీ చర్యలు ● మొదటకేజీ చొప్పున ఉచితంగా పంపిణీఖమ్మంమయూరిసెంటర్: పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ కవర్లను సమూలంగా నిర్మూలించేలా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా డిగ్రడేబుల్ (బయో కంపోస్ట్బుల్) సంచులు మాత్రమే వినియోగించేలా పర్యవేక్షణకు నడుం బిగించారు. నగర ప్రజలు వీటినే వినియోగించేలా, షాపుల్లో అమ్మేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఖమ్మంలోని ప్రముఖ హోటళ్లు, స్వీట్ షాపుల నిర్వాహకులు ఈ సంచులను వినియోగిస్తుండగా.. మిగతా వారిని కూడా ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రత్యామ్నాయంగా.. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా డిగ్రడేబుల్ (కంపోస్ట్బుల్) సంచులను తీసుకొచ్చేందుకు అధి కారులు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు సింగిల్ యూజ్డ్ కవర్లు అమ్మే వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ జరిమానా కూడా విధిస్తున్నా రు. ప్రస్తుతం ఉన్న స్టాక్ను వెనక్కి పంపించి ప్రతీ వ్యాపారి డిగ్రడేబుల్ సంచులే విక్రయించాలని సూ చిస్తున్నారు. ఆపై జనవరి 1నుంచి ప్లాస్టిక్ కవర్లు అమ్మడం, వాడడంపై పూర్తిస్థాయిలో నిషేధం అమ ల్లోకి వస్తుందనే ప్రచారం చేస్తున్నారు. గడువు తర్వా త స్పందించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మొక్కజొన్న స్టార్చ్తో తయారీ ప్లాస్టిక్ కవర్లు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారై పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతుంటే, డిగ్రడేబుల్ కవర్లు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవిగా చెబుతున్నారు. ఇవి మొక్కజొన్న స్టార్చ్ నుంచి తీసిన గుజ్జు ద్వారా తయారవుతాయి. ప్రస్తుతానికి ఈ సంచులు హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ ద్వారా సరఫరా అవుతున్నాయి. ఈ కవర్లు భూమిలో వేసిన కేవలం రెండు నెలల్లో విచ్ఛిన్నమై చెత్త పేరుకుపోకుండా చేస్తాయి. అంతేకాక ఐదు కిలోల బరువు తీసుకెళ్లే సామర్ధ్యంతో ఉండడం విశేషం. కేఎంసీ నుంచి పంపిణీ వ్యాపారులు, ప్రజలకు డిగ్రడేబుల్ సంచులను పరి చయం చేసేలా కేఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కేఎంసీ తరఫున ప్రతీ దుకాణానికి కేజీ కవర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. డిగ్రడేబుల్ సంచులు కేజీ రూ.180 వరకు ఉండగా, అందరూ వీటిని వినియోగిస్తే ప్లాస్టిక్ సంచుల ద్వారా ఎదురయ్యే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. నగరంలో ప్రతీ వ్యాపార సముదాయంలో డిగ్రడేబుల్ సంచులను మాత్రమే వినియోగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేయర్ పునుకొల్లు నీరజ సోమవారం కేఎంసీలో డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, ఏఎంసీ అనిల్ కుమార్, పారిశుద్ద్య విభాగ అధికారులతో కలిసి డిగ్రడేబుల్ సంచుల తయారీ సంస్థల బాధ్యులతో భేటీ అయ్యారు. ప్రజలు వినియోగానికి తగిన విధంగా సంచులు తయారు చేసి సమకూర్చాలని సూచించారు. -
పరిశ్రమల బలోపేతానికి కృషి
● గ్రానైట్ పరిశ్రమ పునరుద్ధరణకు కార్యాచరణ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మం అర్బన్: జిల్లాలో గ్రానైట్ రంగం నిలబడితే వేలాది కుటుంబాల జీవనోపాధి సుస్థిరంగా ఉండనున్నందున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పరిశ్రమల అభివృద్ధిపై సమగ్ర చర్యలు తీసుకునేలా త్వరలోనే ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖమ్మం ఖానాపురంలోని పారిశ్రామిక ప్రాంతంలో గ్రానైట్ యూనిట్లను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఉత్పత్తి, ప్రాసెసింగ్ కార్యకలాపాలను పరిశీలించి నిర్వాహకులు, కార్మికులతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు, ఎగుమతి సమస్యలు, రవాణా తదితర అంశాలపై ఆరా తీశాక కలెక్టర్ మాట్లాడారు. గ్రానైట్ పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం ముందడుగు వేసిన నేపథ్యాన విస్తరణ, కార్మికుల సంక్షేమం, వసతుల మెరుగుదలకు జిల్లా యంత్రాంగం సహరిస్తుందని తెలిపారు. పరిశ్రమలు బలోపేతమైతే ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. కాగా, గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు వాతావరణ కాలుష్యం జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సీతారాం నాయక్, ఆర్డీఓ నరసింహారావు, టీజీఐఐసీ డీఈ స్మరత్చంద్ర, జేఈ శివకుమార్, తహసీల్దారు సైదులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, రాజకీయ ప్రతినిధులతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాం గోడలపై పగుళ్లకు మరమ్మతు చేయించాలని సూచించారు. ఉద్యోగులు ఎం.ఏ.రాజు, లఖన్నాయక్, లలిత, అన్సారీ తదితరులు పాల్గొన్నారు. అవినీతిపై ఫిర్యాదు చేయండి ఖమ్మంక్రైం: ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా అవినీతి నిరోధక శాఖ రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టర్ విడుదల చేసి మాట్లాడారు. టోల్ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ డీఎస్పీ 91543 88981, హైదరాబాద్ ప్రధాన కార్యాలయం 91543 88989కు లేదా వాట్సాప్ నంబర్ 94404 46106 ద్వారా ఫోన్ చేయొచ్చని సూచించారు. -
తుది విడతలో అడవి రామారం
ఆళ్లపల్లి మండలంలోని అడవి రామారం ఉమ్మడి జిల్లాలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ గ్రామపంచాయతీగా నిలిచింది. ఇక్కడ 107 మంది మాత్రమే జనాభా ఉంది. కేవలం 85 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 40 మంది, పురుషులు 45 మంది ఉన్నారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించగా, నాలుగు వార్డుల్లో నాలుగు ఎస్టీలకే ఖరారు చేశారు. గ్రామ పంచాయతీకి తుది విడతలో ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. అడవి రామారం పినపాక నియోజకవర్గంలో అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి రహదారి సౌకర్యం లేని కుగ్రామం. 2018లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా మర్కోడు గ్రామం నుంచి విడదీసి అడవి రామారాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇక గతంలో దొంగతోగు గ్రామం రాష్ట్రంలోనే అతిచిన్న పంచాయతీగా నిలిచింది. ఇది గుండాల నుంచి విడిపోయి 2018లో కొత్తగా ఏర్పాటైంది. తాజా లెక్కల ప్రకారం దొంగతోగు గ్రామపంచాయతీ 88 మంది ఓటర్లతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఇందులో పురుషులు 48మంది, మహిళలు 40 మంది ఉన్నారు. -
రాజుపేటలో ‘రాజు’ ఎవరో..?
● ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల గ్రామంలో పోరు రసవత్తరం ● సర్పంచ్ బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు సాక్షిప్రతినిధి, ఖమ్మం : కూసుమంచి మండలం రాజుపేట పంచాయతీలో సర్పంచ్ పోరు రసవత్తరంగా ఉంది. ఇది మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల స్వగ్రామం. ఈ పంచాయతీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. 1995లో పెరికసింగారం పంచాయతీ నుంచి విడిపోయి రాజుపేట గ్రామ పంచాయతీగా ఏర్పడింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏకగ్రీవం కాలేదు. అయితే ఈ దఫా సర్పంచ్ బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామం కావడం, ఇది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఉండడంతో ఇక్కడ విజయం ఏ పార్టీ మద్దతుదారుడిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..? రాజుపేట గ్రామంలో 756 మంది ఓటర్లు ఉన్నారు. 1995 నుంచి పరిశీలిస్తే ఈ గ్రామంలో తొలుత సర్పంచ్గా కంపసాటి గోవింద్ (సీపీఎం), ఆ తర్వాత దారావత్ వెంకట్రాం (టీడీపీ), మోదుగు జ్యోతి (టీడీపీ), కందాల సురేందర్రెడ్డి (కాంగ్రెస్), వాసంశెట్టి అరుణ (కాంగ్రెస్) సర్పంచ్లుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ మద్దతుతో కొర్రా రమేష్, బీఆర్ఎస్ బలపర్చిన బానోతు మహేష్తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా కొర్రా నాగులు పోటీలో ఉన్నారు. 8 వార్డుల్లో ఏడు వార్డులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు పోటీలో నిలిచారు. 8వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు మరో అభ్యర్థి బరిలో ఉన్నారు. రెండో విడతలో భాగంగా ఈనెల 14న ఇక్కడ పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ శనివారం ముగియడంతో ఈ పంచాయతీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మద్దతు, మరో వైపు మంత్రి మద్దతు ఉన్న అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఈగ్రామ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది హాట్టాపిక్గా మారింది. -
ఓట్లు పడాలంటే..
● ప్రభుత్వ పథకాల ఎర ● విందులు, వినోదాలు.. వైరా: పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ.. ప్రభుత్వ పథకాలను ఆశగా చూపిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. వృద్ధాప్య, వితంతు ఫించన్లతో పాటుగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చి రెండో పర్యాయం నామినేషన్లు వేసిన అభ్యర్థులు గ్రామాల్లో తమ హయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కొత్తగా బరిలో నిలిచిన అభ్యర్థులు గ్రామాల్లో పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలను ఎత్తి చూపుతూ తమను సర్పంచ్గా గెలిపిస్తే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కారం చేస్తామని ఓట్లు అడుతున్నారు. ఓటర్లను ఆకర్షించడ మే లక్ష్యంగా హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. మహిళ అభ్యర్థులు సైతం తామేమి తక్కువ కాదన్నట్లు సమస్యల పరిష్కారం తమతో సాధ్యం అవుతుందని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రత్యేక విందులు పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన అంశా లు కానున్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్ల కు మద్యం పంపిణీ చేస్తూ పార్టీలు ఇవ్వడం గ్రామా ల్లో నిత్యం కనిపిస్తునే ఉంది. ప్రతిరోజూ మద్యంతో పాటుగా చికెన్ దుకాణాల్లో ఏరోజుకు ఆ రోజు కేజీల కొద్ది మాంసాన్ని పంపిణీ చేస్తుండడం విశేషం. ప్రచా రం చివరి రోజుల్లో డబ్బులు, మద్యం బాటిళ్లు వెదజల్లి ఓట్లుదండుకోవచ్చనే ఉద్దేశం తో అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ప్ర చారం నిర్వహించే యువకులకు నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకోసం పడరాని పాట్లు పడుతూ విజయ మే పరమావధిగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. -
అంతర్జాతీయ సదస్సులో వైరా వాసి
వైరా/కొణిజర్ల: ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో వైరాకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పరిశోధనా గ్రంథాన్ని సమర్పించారు. వైరాకు చెందిన మొండ్రు భాస్కర్ కొణిజర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు ఢిల్లీ యూనివర్సిటీలో కంపారిటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ( సీఈఎస్ఐ) వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘తెలంగాణలోని గ్రామీణ విద్యార్థుల్లో ప్రజాస్వామిక విలువలను పెంపొందించడం – ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడి అనుభవాలు’ అనే పత్రాన్ని భాస్కర్ సమర్పించారు. ఈ సదస్సులో పాల్గొనడానికి జిల్లా నుంచి అవకాశం లభించిన ఏకై క ఉపాధ్యాయడు ఆయనే కావడం విశేషం. ఈ సందర్భంగా భాస్కర్ను పలువురు అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు. 17 మంది హెడ్కానిస్టేబుళ్లకు పదోన్నతిఖమ్మంక్రైం : ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 17 మంది హెడ్కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదో న్నతి కల్పిస్తూ భద్రాద్రి జోన్ డీఐజీ సన్ ప్రీత్సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి లో ఏడుగురు ఖమ్మం జిల్లాకు చెందిన వారు కాగా, 10మంది భద్రాద్రి జిల్లా వారు ఉన్నారు. సీనియర్లను టెట్ నుంచి మినహాయించాలి● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి సత్తుపల్లిటౌన్: ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణులు కావాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయితే సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి కోరారు. ఆదివారం సత్తుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అశాసీ్త్రయమైన గురుకుల టైం టేబుల్ మార్చాలని, 010 పద్దు ద్వారా గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులను పదోన్నతల ద్వారా భర్తీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడంతో పాటు ఈ–కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, చెరుకు శ్రీనివాసరావు, సూరయ్య, అశోకచక్రవర్తి, శేషు తదితరులు పాల్గొన్నారు. అలరించిన ‘భలే మంచిరోజు’ఖమ్మం గాంధీచౌక్ : ప్రసిద్ధ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా సుధాస్ ఎంటర్టైన్మెంట్స్, సునాద వినోదిని సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన భలే మంచిరోజు కార్యక్రమం అలరించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హెచ్.అరుణ్కుమార్ మాట్లాడుతూ ఖమ్మంలో 29 ఏళ్లుగా భలే మంచి రోజు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ అధ్యక్షులు డాక్టర్ వాసుదేవ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి సంగీత విభావరి నిర్వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. సంస్థ ప్రధాన కార్యదర్శి శఠగోపం సుదర్శన్ మాట్లాడుతూ 1997 నుంచి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైన్నెకి చెందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాల్యమిత్రులు జి.వి.మురళి, తెలుగు, హిందీ, కన్నడ సినీ గీత సాహిత్య విశ్లేషకులు జి.వి. శేషుబాబుతో పాటు మహ్మద్ అజీజ్, మహ్మద్ జాన్ సాహెబ్, కాళ్ల పాపారావు, కాటమనేని రమేష్, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగబత్తిని రవి, వినీలా సుదర్శన్ పాల్గొన్నారు. -
ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీషో
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లా క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్పో ఆదివారంతో ముగిసింది. ఆదివారం క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సందర్శించారు. వినియోగదారుల నమ్మకాన్ని నిర్వాహకులు పొందడంతోనే మూడేళ్లుగా విజయవంతంగా ఎక్స్పోను నిర్వహిస్తున్నారని కొనియాడారు. రెండు రోజుల పాటు నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ షోకు నగర ప్రజలతో పాటు హైదరాబాద్, ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఆదరణ లభించిందని క్రెడాయ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బండి జయకిశోర్ తెలిపారు. కార్యక్రమంలో చెరుకుమల్లి వెంకటేశ్వర్లు, పెద్ది కేశవ్రావు, వేములపల్లి నగేశ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గంటగంటకూ లక్కీడ్రాలో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఖమ్మంలో ఉమ్మడి జిల్లా డ్రైవర్ల సంఘం సమావేశంఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నగరంలోని సంఘం కార్యాలయంలో నిర్వ హించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జహీంగీర్అలీ, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ఎండీ సలీం, జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా డ్రైవర్లకు ప్రతి సంవత్సరం లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తామన్నారు. ఖమ్మం జిల్లా సంఘానికి వాహ నం కొనుగోలు చేసినందుకు సభ్యులు ఆమోదించారని చెప్పారు. ఇళ్ల స్థలాలు త్వరలోనే వస్తాయని హామీఇచ్చారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి వేణుగోపాల్, భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కోకన్వీనర్ రాఘవులు, నాగరాజు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. భద్రాద్రి చిన్నారికి అవార్డు భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని యమజాలనగర్ కాలనీకి చెందిన చిన్నారి శ్రీ యాన్వి భగవద్గీత శ్లోకాలను అలవోకగా చెప్పి ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’వర్సెస్ బ్లూమ్ అవార్డ్స్ ను దక్కించుకుంది. హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందించారు. చిన్నారి తల్లి సత్య నాగలక్ష్మి గతంలో భగవద్గీత శ్లోకాలపై శృంగేరిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించగా.. ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న నాలు గేళ్ల శ్రీ యాన్వి గత ఆరు నెలలుగా శ్లోకాలను నేర్చుకుంది. శ్రీయాన్వి భగవద్గీతలోని 50 శ్లోకాలను, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, బాల రామాయణంలోని కొన్ని శ్లోకాలను ఏకధాటిగా చెప్పే నైపుణ్యాన్ని గుర్తించిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్ సంస్థ చిన్నారికి అవార్డు బహూకరించింది. -
ఏడు నెలలుగా ఇక్కట్లే..
ఖమ్మంవైద్యవిభాగం : గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలు అందించిన 104 వ్యవస్థకు గత ప్రభుత్వం మంగళం పలికింది. దీంతో వాహనాల్లో పనిచేసిన ఉద్యోగులను పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రుల్లో సర్దుబాటు చేశారు. వారి సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం.. వేతనాల విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏడు నెలలుగా ఏడుపే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 143 మంది ఉద్యోగులు వివిధ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 85 మంది పనిచేస్తుండగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు కలిపి 43 మంది డీఎంఈ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా 42 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేస్తున్నారు. వీరందరికీ గత ఏడు నెలలుగా వేతనాలు అందడం లేదు. భద్రాద్రి జిల్లాలో 58 మంది పనిచేస్తుండగా వారికి 8 నెలల జీతాలు రావాల్సి ఉంది. వీరిలో 35 మంది డీఎంఈ పరిధిలో, 23 మంది వైద్యారోగ్య శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 23 వాహనాల ద్వారా నిరాటంకంగా లక్షలాది మందికి సేవలందించిన 104 సిబ్బంది.. ఆ వాహనాలను తొలగించిన తర్వాత దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.చాలా కాలంగా సకాలంలో జీతాలు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది ఉద్యోగులకు కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పు చేసి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు ఇంటి అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా ఉద్యోగులకు ఏడు నెలలుగా, భద్రాద్రి జిల్లా వారికి ఎనమిది నెలలుగా వేతనాలు రావాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చొరవ చూపి వెంటనే జీతాలు చెల్లించేలా చూడాలి. – మన్మథరావు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షడుదివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశారు. ముఖ్యంగా వైద్యం అందక నిరుపేదలు పడుతున్న కష్టాలను గమనించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టిన వెంటనే 104 వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ గ్రామానికి వాహనం వెళ్లి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఆయన ఉన్నంత కాలం గ్రామాల్లో 104 ద్వారా రోగులకు వైద్య సేవలతో పాటు మందులు కూడా సక్రమంగా అందేవి. ఆ తర్వాత 104 సేవలకు క్రమంగా గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం ఈ సేవలను పూర్తిగా రద్దు చేసి, వాహనాలను వేలం ద్వారా విక్రయించింది. దీంతో 104 సేవలు పూర్తిగా కనుమరుగయ్యాయి. కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డీఎంఈ ఆస్పత్రుల్లో సర్దుబాటు చేశారు. -
50 ఏళ్ల తర్వాత కలయిక
ఖమ్మంసహకారనగర్: వారంతా 50 సంవత్సరాల క్రితం ఒకేచోట శిక్షణ పొందారు. అంతేకాదు టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (టీటీసీ)కు సంబంధించి ఖమ్మం జిల్లాలో వారిదే మొదటి బ్యాచ్. వీరంతా ఉపాధ్యాయులుగానే కాకుండా ప్రభుత్వ రంగంలో వివిధ విభాగాల్లో సుదీర్ఘకాలం సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందారు. వారంతా ఒక చోట కలుసుకుని, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1975–76లో టీటీసీ శిక్షణ మొదలు కాగా తొలి బ్యాచ్ అ‘పూర్వ’కలయిక ఆదివారం నగరంలోని శుభవేళ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మిత్రులందరికీ జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. ఇందులో కొందరు ఉపాధ్యాయ వృత్తితో ప్రారంభమై జాయింట్ కలెక్టర్ స్థాయికి ఎదిగిన వారు కూడా ఉండటం గమనార్హం. కార్యక్రమానికి అలపాటి అంకుప్రసాద్ అధ్యక్షత వహించగా నాటి టీటీసీ బ్యాచ్ ప్రముఖులు బూర్లె లక్ష్మీనారాయణ, ఎస్.కామేశ్వరరావు, ఎ.రాఘవరావు, కనపర్తి వెంకటేశ్వర్లు, పి.కోటేశ్వరరావు, ఎ.రవీంద్రబాబు, ఫణీంద్రకుమారి, బక్రుద్దీన్, హెచ్ఎల్ ప్రసాద్బాబు, ముదిగొండ శ్రీరామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
‘నవోదయ’లో ముగిసిన సమ్మేళనం
కూసుమంచి : పాలేరు జవహర్ నవోదయ విద్యాలయలో 2000 – 2007 విద్యా సంవత్సరంలో చదివిన 14వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ముగిసింది. వివిధ హోదాల్లో స్థిరపడిన పలువురు హాజరు కాగా, రెండు రోజుల పాటు విద్యాలయలో సందడి నెలకొంది. విద్యాలయలో గతంలో పని చేసిన ప్రిన్సిపాళ్లు, ఆధ్యాపకులు సైతం హాజరై విద్యార్థులకు సందేశం అందజేశారు. పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన గెస్ట్ రూమ్ను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అలరించారు. -
సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
● మామిడిలో కొమ్మ కత్తిరింపులు కీలకం ● జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్ సూచనలు ఖమ్మంవ్యవసాయం: మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపుల ద్వారా పంట త్వరగానే కాక ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎంవీ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు మామిడి సాగు చేస్తున్న రైతులు పూత, పిందె దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై ఆయన చేసిన సూచనలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం పూత దశ జిల్లాలో 31,241 ఎకరాల మామిడి తోటలు ఉన్నా యి. ప్రస్తుతం చాలా చెట్లు పూత దశలో ఉన్నాయి. పూత ప్రారంభ దశలోనే ఇమిడాక్లోప్రిడ్ (0.5 మి.ల్లీ/లీ) లేదా థయోమిథాక్సాం (0.4 గ్రా/లీ) మందును నీటిలో కరిగే గంధకం (3 గ్రా/లీ)లో కలిపి పిచికారీ చేస్తే తేనెమంచు పురుగు, బూడిద తెగులును అరికట్టవచ్చు. ఈ మందులను రైతులు ఈపాటికే పిచికారీ చేసి ఉండాలి. లేకుంటే చీడపీడల కారణంగా పూత రాలిపోవడం లేదా పిందెలు సరిగా ఏర్పడకపోయే ప్రమాదముంది. కాగా, పూత పూర్తిగా వచ్చాక ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయొద్దు. అలా చేస్తే పిందెలు ఏర్పడడానికి సాయపడే తేనెటీగలు, కీటకాలు చనిపోతాయి. పిందెలు ఏర్పడే దశలో చీడపీడల నివారణ మామిడిలో చిన్న పిందెలు ఏర్పడే దశలో తేనెమంచు పురుగు, తామరపురుగులు, బూడిద తెగులు, మచ్చ తెగులు ఆశించే ప్రమాదముంది. ఈ సమస్య ల నివారణకు ఫిప్రోనిల్ (2 మి.లీ/లీ) లేదా రోగార్ (2 మి.లీ/లీ) పురుగు మందుల్లో ఒకటి, హెక్సా కొనజోల్ (2 మి.లీ/లీ) లేదా సాఫ్ (2 గ్రా/లీ) మందుల్లో ఒకదానికి ప్లానోఫిక్స్ అనే హార్మోన్ మందును (1 మి.లీని 4.5 లీటర్ల నీటిలో) కలిపి పిచికారీ చేయాలి. కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నపుడు పాస్పోమిడాన్ (లీటరు నీటికి 2.5 మి.లీ) లేదా మెనోక్రోటోఫాస్ (లీటరు నీటికి 2 మి/లీ) మందుల్లో ఒక దానికి వేప సంబంధిత మందును (లీటరుకు 5మి.లీ) కలిపి పిచికారీ చేస్తే టెంక పురుగు, కాయ తొలిచే పురుగుతో పాటు పండు ఈగల బెడదను నివారించవచ్చు. పిందెలు రాలకుండా నీటి తడులు మామిడిలో ఏర్పడిన పిందెలు రాలిపోయే అవకాశముంది. నీటి ఎద్దడి, హార్మోన్లు, పోషక లోపాలవల్ల ఇలా జరుగుతుంటుంది. పిందెలు ఏర్పడే దశలో, తిరిగి 15–20 రోజుల వ్యవధిలో చెట్లకు 2–3 నీటి తడులు ఇవ్వాలి. తద్వారా పిందెలు రాలడం తగ్గడమే కాకుండా కాయలు పెద్దసైజులో నాణ్యతగా వస్తాయి. అలాగే, పిందెలు ఏర్పడి పెరిగే దశలో చెట్ల సైజు ఆధారంగా 500–100 గ్రా. యూరియా, 500–1000 గ్రా. పొటాష్ ఎరువులను రెండు కిలోల వేపపిండితో కలిపి ప్రతీ చెట్టుకూ వేయడం వల్ల కాయ సైజు పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయి. చీడపీడల నివారణలో ఉత్తమ ఫలితాల కోసం రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత మేరకు ఒకసారి చల్లిన మందులను మరోసారి చల్లవద్దు. అలాచేస్తే పురుగులు మందులను తట్టుకొనే శక్తి సంపాదించే ప్రమాదముంది. ఇక మామిడిలో సింథటిక్ పైరిత్రాయిడ్ పురుగు మందులు వాడకపోవడమే మంచిది. విధిలేని పరిస్థితుల్లో, ఆఖరి అస్త్రంగానే తప్ప అలవాటుగా వీటిని ఉపయోగించడం మంచిది కాదు. ఇక పంటపై మందు చల్లే క్రమాన అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలి. -
తొలిపోరుకు సిద్ధం
ఈనెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ● 172 సర్పంచ్ స్థానాలకు, 1,582 వార్డులకు పోలింగ్ ● 20 మంది సర్పంచ్లు, 158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం ● ఎన్నికల విధుల్లో 4,220 మంది అధికారులు, సిబ్బందిఖమ్మం సహకారనగర్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి రోజురోజుకూ వేడెక్కుతోంది. జిల్లాలో 20 మండలాల పరిధిలో 574 గ్రామ పంచాయతీలు ఉండగా తొలి విడతలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల పరిధిలో 192 సర్పంచ్ స్థానాలు, 1,740 వార్డులు ఉన్నాయి. ఇందులో 20 మంది సర్పంచ్ అభ్యర్థులు, 158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 172 సర్పంచ్ స్థానాలకు, 1,740 వార్డులకు 158 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోగా 1,582 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1,582 బ్యాలెట్ బాక్సులు.. ఏడు మండలాల పరిధిలో జరిగే పంచాయతీ ఎన్నిక ల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. 20 శాతం మంది రిజర్వ్తో కలిపి మొత్తంగా 1,899 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది 2,321 మంది విధులు నిర్వహించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కోబూత్ చొప్పున ఉంటుండగా.. 1,582 బ్యాలె ట్ బాక్సులను వినియోగించనున్నారు. ఈనెల 11వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2గంటల కు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. -
సామాజిక మార్పునకు మార్క్సిజమే మార్గం
ఖమ్మంమయూరిసెంటర్: అనేక రుగ్మతలతో కూడిన ప్రస్తుత దోపిడీ సమాజ మార్పునకు మార్క్సిజమే మార్గమని నమ్మిన వ్యక్తి ఇనుపనూరి జోసఫ్ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం స్థానిక మంచికంటి భవనంలో బీవీకే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జోసఫ్ సంస్మరణ సభలో తమ్మినేని మాట్లాడారు. మార్క్సిస్టు సైద్ధాంతిక విషయాలను అధ్యయనం చేయడం, వాటిని నిత్యజీవిత కార్యాచరణకు అన్వయించడంలో జోసఫ్ క్రమశిక్షణ పాటించేవారని కొనియాడారు. వృతి్త్ రీత్యా ఉపాధ్యాయుడైనా.. మంచి మార్క్సిస్టు ప్రచారకుడిగా కృషి చేశారని తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత అనేక సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ సభ్యులుగా, ఆదివారం మీకోసం కార్యక్రమ నిర్వాహకులుగా సేవలు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా జోసెఫ్ కుటుంబసబ్యులకు సానుభూతిని తెలిపారు. సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు పి.సోమయ్య, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, మాదినేని రమేష్, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, బండారు రమేష్, నందిపాటి మనోహర్, ఎస్కే మీరా తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని -
‘స్మార్ట్’గా ప్రచారం
భద్రాచలంఅర్బన్: మొదటి, రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎక్కువగా వాల్, డోర్ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. ఇప్పుడు అక్కడక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా ఎక్కువగా సోషల్మీడియా ద్వారానే ప్రచారం చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోనే ప్రచార ఆయుధంగా మారిపోయింది. పంచాయతీలు, వార్డీల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థులపై పాటలు, గ్రామానికి గతంలో చేసిన సేవలు, ఇచ్చే హామీలను వివరిస్తూ ఆడియో, వీడియో పోస్టులు పెడుతున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు, మైకులతో ప్రచారానికి అనుమతులు తీసుకోవాలి. కానీ సోషల్ మీడియాలో పెద్దగా అనుమతులు లేకపోవడంతో అభ్యర్థులు, వారి అనుచరులు పోస్టులతో గ్రూపులను పోటెత్తిస్తున్నారు. సోషల్ మీడియాపై నిఘా ఒకవైపు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. రెచ్చగొట్టే, ఇతరులను నిందించే, అసభ్యకరంగా ఉండే పోస్టులు పెడితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు


