breaking news
Khammam District Latest News
-
కారు ఢీకొని లారీ క్లీనర్ మృతి
మోతె: కారు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాల పాలైన లారీ క్లీనర్ మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి బొగ్గు లోడ్తో హైదరాబాద్ వెళ్తున్న లారీ డ్రైవర్, క్లీనర్ రాఘవాపురం స్టేజీ వెంట ఉన్న హోటల్ వద్ద ఆగారు. సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన క్లీనర్ పాలకుర్తి జయరాజు(45) భోజనం చేసేందుకు రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్ వైపు నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఘటనలో జయరాజు అక్కడికక్కడే మృతి చెందగా, అంతలోనే మరో కారు ఆయన మృతదేహం పైనుంచి వెళ్లడంతో ఛిద్రమైంది. ఈమేరకు లారీ డ్రైవర్ దైద రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు మోతె ఎస్ఐ బి.లచ్చిరెడ్డి తెలిపారు. డ్రైవర్ క్యాబిన్పై పడిన గ్రానైట్ రాయినేలకొండపల్లి: లారీ డివైడర్ను ఢీకొనగా వెనుక భాగాన సరైన రక్షణ చర్యలు లేకుండా అమర్చిన గ్రానైట్ బండ డ్రైవర్ క్యాబిన్పై పడిన ఘటన ఇది. నేలకొండపల్లి నుంచి ఖమ్మం వైపు బుధవారం తెల్లవారుజామున గ్రానైట్ లారీ వెళ్తుండగా గువ్వలగూడెం – గోకినేపల్లి మధ్య జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు డివైడర్ను డీకొట్టింది. దీంతో గ్రానైట్ రాళ్లు క్యాబిన్పై పడటంతో డ్రైవర్ నాగరాజు అందులో ఇరుక్కున్నారు. నేషనల్ హైవే సిబ్బంది చేరుకుని అద్దాలు పగలగొట్టి గాయపడిన డ్రైవర్ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. టైర్ పంక్చర్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నా, లారీల్లో అధిక లోడ్, సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా గ్రానైట్ తరలిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. బిర్యానీ సెంటర్ యజమానిపై దాడి సత్తుపల్లి: సత్తుపల్లి పాత సెంటర్లోని సిద్దారం రోడ్డు పక్కన ఉన్న సలామ్ దమ్ బిర్యానీ హోటల్లో మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణపై కేసు నమోదైంది. కిష్టారం గ్రామానికి చెందిన పలగాని ఉపేందర్ హోటల్లో నాలుగు లెగ్ పీసులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లగా ఒకటి దుర్వాసన వచ్చింది. దీంతో ఆయన సెంటర్ నిర్వాహకుడు రామనాథ ఏడుకొండలుతో వాగ్వాదానికి దిగి దాడి చేయడమే కాక సెంటర్లోని బిర్యానీ రోడ్డుపై వేసి కుర్చీలు, కౌంటర్ ధ్వంసం చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాక పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఉపేందర్పై బుధవారం కేసు నమోదు చేశారు. -
చకచకా భూముల రీసర్వే
● బేతుపల్లిలో కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణ ● నేడు సమీక్షించనున్న మంత్రి పొంగులేటీసత్తుపల్లి: పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూలో భూముల రీ సర్వే వేగంగా సాగుతోంది. రెవెనూ పరిధిలోని 12,047 ఎకరాలకు గాను ఇప్పటికే 6,110 ఎకరాలు ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేశారు. మరో 5,937 ఎకరాల సర్వే కూడా త్వరగా పూర్తిచేసేలా ఉద్యోగులు శ్రమిస్తున్నారు. ఇక్కడ 12,047 ఎకరాలకు గాను రెవెన్యూ రికార్డుల్లో 17వేల ఎకరాలుగా నమోదవడంతో అర్హులైన రైతులకు పాస్పుస్తకాలు రాక ఇబ్బంది పడుతున్నారు. భూప్రక్షాళన సమయంలో ధరణి పోర్టల్లో అదనంగా 5వేల ఎకరాలకుపైగా నమోదు కావడం సమస్యకు కారణమైంది. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యల పరిష్కారం కోసం రీ సర్వే చేస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, ఆధునిక పరికరాలతో చేపడుతున్న రీ సర్వే పూర్తయ్యాక భూయజమానులకు కచ్చితమైన సరిహద్దులు, ఇతర వివరాల మ్యాప్తో పాస్బుక్ జారీ చేయడమే కాక భూ ఆధార్ నెంబర్ జారీ చేస్తారు. నిత్యం కలెక్టర్ ఆరా బేతుపల్లి రెవెన్యూ రీ సర్వే పకడ్బందీగా సాగేలా కలెక్టర్ దివాకర నిత్యం ఆరా తీస్తున్నారు. అంతేకాక ఇప్పటివరకు ఐదు సార్లు ఆయన సత్తుపల్లిలో తహసీల్లో సమీక్షంచడమే కాక రెండు సార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. అలాగే, ప్రతీరోజు సర్వే ఆరా తీస్తూ రెవెన్యూ, సర్వే బందాలకు సూచనలు చేస్తున్నారు. పరిశీలించనున్న మంత్రి పొంగులేటి ఇటీవల సత్తుపల్లిలో జరిగిన ప్రజాదర్బార్లో బేత్తుపల్లి భూముల సమస్యను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వివరించారు. దీంతో రీ–సర్వేకు ఆదేశించగా.. 10 సెక్టార్లుగా విభజించి ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి, చెరువులు, కుంటలు, రోడ్లు, గ్రామ నక్షాల సర్వే మొదలుపెట్టారు. ఇప్పటికే 2,651 మంది రైతుల 6,110 ఎకరాల వ్యవసాయ భూముల సర్వే పూర్తి చేశారు. కాగా, గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాక అధికారులు, రైతులతో సమీక్షించనున్నారు. -
మైనర్లపై గంజాయి పంజా
● యువతతో రవాణా, అమ్మకాలు ● ఐదు నెలల్లో నమోదైన కేసుల్లో 20 మంది పిల్లలు ● తల్లిదండ్రులు అప్రమత్తం కాకపోతే ముప్పే.. ఖమ్మంక్రైం: మునుపటితో పోలిస్తే జిల్లాలో గంజాయి మహమ్మారి మరింతగా విషం చిమ్ముతోంది. ఫలితంగా యువకులే కాక మైనర్లు కూడా బానిసలుగా మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన ఈగల్ టీమ్ బృందం కూడా జిల్లాలో గంజాయి రవాణా పెరిగిందని... మైనర్లు బానిసలుగా మారుతున్నారని పోలీస్, ఎక్సైజ్ శాఖలను హెచ్చరించినట్లు సమాచారం. ఈ సమయంలోనే నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో గంజాయికి అలవాటు పడిన ముగ్గురు విద్యార్థులను మందలించడంతో కక్ష కట్టి ప్రిన్సిపాల్ను హత్య చేసినట్లు బయటపడడం సంచలనం కలిగింది. చాలా కేసులో మైనర్లు గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టడానికి పోలీసు, ఎకై ్సజ్ అధికారులే కాక తరచూ ఈగల్ టీమ్ జిల్లాలో విస్తృత తనిఖీలు చేపడుతున్నాయి. ఈక్రమాన పట్టుబడుతున్న వారిలో ఒకరైనా మైనర్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన ఐదు నెలల్లో నమోదైన కేసుల్లో 20మంది మైనర్లు ఉండడం గమనార్హం. ఆశ చూపించి అలవాటు... ఒడిశా – ఏపీ సరిహద్దు(ఏఓబీ)ల్లో భారీగా గంజాయి సాగవుతున్నట్లు తెలుస్తోంది. ఈ గంజాయిని హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలించే క్రమాన నిందితులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈక్రమంలో అసలు నిందితులు బయటపడకుండా, ఎవరినీ అనుమానం రాదనే భావనతో గంజాయి రవాణా కోసం మైనర్లను ఉపయోగించుకున్నట్లు సమాచారం. బైక్లు కొనిస్తామని, డబ్బు ఇస్తామనే ఆశ చూపుతుండడంతో చదువు మానేసిన యువకులు, విద్యార్థులు ఆ వలలో చిక్కుకుంటున్నట్లు తెలిసింది. తొలుత గంజాయి రవాణాకే పరిమితమవుతున్న కొందరు ఎన్నడూ చూడనంత డబ్బు రాగానే క్రమంగా గంజాయి వినియోగానికి అలవాటు పడతున్నట్లు సమా చారం. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం ప్రకాష్నగర్కు చెందిన ఓ రౌడీషీటర్ ఓ విద్యార్థితో గంజాయి సరఫరా చేయిస్తుండగా ఇటీవల పట్టుబడ్డాడు. బానిసలుగా మార్చి... గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్న మైనర్లను విచారించగా అసలు నిందితులు కాదని గుర్తించినట్లు సమాచారం. కొందరు మాత్రం చిన్నతనం నుంచే గంజాయికి అలవాటై డబ్బు కోసం అమ్మకాలు చేపడుతున్నట్లు తేలిందని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చేందుకు మైనర్లును ఉపయోగిస్తున్న నిందితులు.. ఆపై వారిని గంజాయికి బానిసలుగా మార్చి తమ వెంట తిప్పుకుంటున్నారని సమాచారం. ప్రధానంగా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేనివారు, బంధువుల చెంతన బతుకుతున్న మైనర్లను లక్ష్యంగా చేసుకుని వారిని ఈ ఊబిలో దింపుతున్నట్లు తెలిసింది. పాఠశాల గదిలో గంజాయి?భద్రాచలంలో డీ అడిక్షన్ సెంటర్ – 8లో..పిల్లలు గంజాయి మహమ్మారి బారిన పడకుండా తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలి. యువకులు, మైనర్ల కదలికలను నిరంతరం పరిశీలిస్తూ ఎవరితో తిరుగుతున్నారో చూడాలి. తొలి దశలోనే అడ్డుకట్ట వేయాలి. చెడు మార్గాల్లో నడిస్తే ఎదురయ్యే అనర్థాలను వివరించాలి. కేసుల పాలయ్యాక బాధపడే బదులు ముందే అప్రమత్తంగా ఉంటే మేలు. – ఎస్.వీ.రమణమూర్తి, ఖమ్మం ఏసీపీ -
ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్దే
నేలకొండపల్లి: నాడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తే.. నేడు రేవంత్రెడ్డి నేతృత్వాన మళ్లీ తమ ప్రభుత్వమే ఉచిత విద్యుత్ అందిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కొంగర, బుద్ధారంలో పలు అభివృద్ధి పనులకు ఆయనకు శంకుస్థాపన చేశారు. అలాగే, చెరువుమాదారంలోని పలువురి ఇళ్లపై సోలార్ ప్యానళ్లను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తూనే, పైలట్ గ్రామాల్లో ఇళ్లు, రైతుల పంపుసెట్లకు సోలార్ ప్యానళ్లు బిగిస్తున్నామని చెప్పారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ చెరువుమాధారంలో తొలిదశగా 713 ఇళ్లపై సోలార్ ప్లాంట్లు బిగిస్తున్నామని తెలిపారు. కాగా, కొంగర సర్పంచ్ కృష్ణకుమారి, పలువురు వార్డు సభ్యులు మంత్రి సమక్షాన కాంగ్రెస్లో చేరారు. విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసచారి, రెడ్కో జిల్లా మేనేజర్ పి.అజయ్కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ వి.సీతారాములు, సర్పంచ్లు యల్లయ్య, బి.వేణు, కట్టెకోల నాగార్జున, సత్యం, నాయకులు బచ్చలకూరి నాగరాజు, కొడాలి గోవిందరావు, శ్రీనివాసరెడ్డి, జెర్రిపోతుల అంజని, మామిడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
కీలకంగా సోషల్ మీడియా
● ప్రత్యర్థుల దాడిని తిప్పి కొట్టడానికి సరైన ఆయుధం ● కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో మంత్రి పొంగులేటి ● పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యేలుఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా రాష్ట్రప్రభుత్వంపై చేస్తున్న అసత్య విమర్శలను తిప్పి కొట్టడానికి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా పీఏసీ సమావేశం బుధవారం ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటిపై చర్యలు, పురోగతిని సమీక్షించాక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని ప్రధానిగా చేసేలా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సచిన్ సావంత్ ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) రెండో దశపై దిశానిర్దేశం చేసి మాట్లాడుతూ అసెంబ్లీ కోఆర్డినేటర్లు, మండల, డివిజన్ అధ్యక్షులు, బూత్ లెలల్ సూపర్వైజర్లు, ఏజెంట్లకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల 25 నాటికి మండల, టౌన్, గ్రామ స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా భయపడేలా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని సూచించారు. భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన కోసం కోర్ టీమ్ను ఏర్పాటు చేసి, ప్రతీనెలా ప్రగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ భద్రాద్రి, ఖమ్మం జిల్లా, నగర అధ్యక్షులు దేవీప్రసన్న, నూతి సత్యనారాయణ గౌడ్, నాగండ్ల దీపక్చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్నాయక్, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్రెడ్డి, సుడా, గ్రంథాలయ సంస్థ, మార్కెట్ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్ బాబా, యరగలర్ల హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్లు కాపా చంద్రకళ, ధరావత్ మోహన్నాయక్, రెహనాబేగం, నాయకులు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, డాక్టర్ కాపా మురళీకృష్ణ సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
గోసంరక్షణకు రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన గోసంరక్షణ పథకానికి ఖమ్మంకు చెందిన భక్తులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఖమ్మంకు చెందిన గుంటుపల్లి విశ్వేశ్వరరావు, ఊర్మిళ, కుటుంబ సభ్యులు బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గోసంరక్షణ నిమిత్తం రూ.1,01,116 విరాళాన్ని అధికారులకు అందజేయగా, ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ముగిసిన మత్స్య రైతుల శిక్షణ కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్య రైతులు, మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ బుధవారంతో ముగిశాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలకు చెందిన మత్స్యకారులకు బయోఫ్లాక్ విధానంలో చేపల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. చివరిరోజు సమావేశంలో కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టక్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ చేపల పెంపకంలో బయోఫ్లాక్ విధా నం అవలంబిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు. అనంతరం యూనియన్ బ్యాంక్ పాలేరు మేనేజర్ ప్రవీణ్కుమార్తో కలిసి శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఎఫ్బీఓ నవీన్ కుటుంబానికి చేయూతకారేపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులకు తగిలి మృతి చెందిన ఎఫ్బీఓ బానోతు నవీన్కుమార్ సంస్మరణ సభ ఆయన స్వగ్రామమైన మండలం వెంకిట్యాతండాలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ భీమానాయక్, కొత్తగూడెం, ఖమ్మం డీఎఫ్ఓ లు సిద్ధార్థ విక్రమ్సింగ్, అనూజ్ అగర్వాల్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే, నవీన్ కుటుంబానికి తెలంగాణ జూని యర్ ఫారెస్టు ఆఫీసర్ల అసోసియేషన్ ఖమ్మం, సత్తుపల్లి యూనిట్ల ఆధ్వర్యంలో రూ.46వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు, ఉద్యోగులు లకా వత్ సురేష్, డానియేల్, రమేష్, కన్నయ్య, గాంధీ, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. 27న మహాధర్నాజేఏసీ జిల్లా కోచైర్మన్ నాగేశ్వరరావు ఖమ్మం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈనెల 27న జిల్లా కేంద్రంలో నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీ జిల్లా కో చైర్మన్ పారుపల్లి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ పాఠశాల సముదాయంలో ఆయన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సమావేశమమై మాట్లాడారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బిల్లుల విడుదల తదితర డిమాండ్లతో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్లో మహా ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈమేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు హాజరై ఉద్యమాలకు అండగా నిలిచి హక్కులను కాపాడుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సతీష్, రంగారావు, శ్యామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకులకు ముగిసిన శిక్షణఖమ్మం సహకారనగర్: ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాలలో అధ్యాపకులకు ఇస్తున్న మూడో విడత శిక్షణ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా డీఐఈఓ రవిబాబు మాట్లాడుతూ ‘అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు భవిష్యత్ సంసిద్ధ విద్య’ అంశంపై అధ్యాపకులకు వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఏర్పాటుచేశామని తెలిపారు. శిక్షణ, మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకులు బోధనలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమ నోడల్ ఆఫీసర్గా కళాశాల ప్రిన్సిపాల్ ధనమ్మ వ్యవహరించారు. -
జీవితానికి భరోసా..
● భద్రాచలం డీ అడిక్షన్ సెంటర్లో వ్యసనపరులకు ఉచితంగా చికిత్స ● ఇప్పటివరకు 200 మందికి సేవలు.. 180 మంది డిశ్చార్జ్ ● ఏజెన్సీ యువతలో మాదకద్రవ్యాలతో నష్టాలపై అవగాహనభద్రాచలంఅర్బన్: గంజాయి, మద్యం వ్యవసనపరులను సాధారణ స్థితికి తీసుకురావడం కుటుంబాలకు సవాల్గా మారుతోంది. అయితే, భద్రాచలంలోని దక్షత సొసైటీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న డీ అడిక్షన్ కేంద్రం బాధితులను మామూలు స్థితికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ కేంద్రాన్ని శాంతినగర్లో 2025 ఏప్రిల్ 1న ప్రారంభించగా, మాదకద్రవ్యాల బారిన పడిన పురుషులకు ఉచితంగా వసతి, భోజనం కల్పించి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఇక్ర్రా, సీపీఎల్ఐ, ఓడీఐసీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 200 మందికి చికిత్స అందగా, 180 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏజెన్సీవారే ఎక్కువ కేంద్రానికి వచ్చేవారిలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారి సంఖ్యే అధికంగా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 15 మందిలో 18 – 50 ఏళ్ల వయస్సుల వారు ఉన్నారు. వీరిలో 12 మంది గంజాయి, ముగ్గురు మద్యం వ్యసనంతో బాధపడుతుండగా చేర్పించారు. వ్యక్తిగత, గ్రూప్, కుటుంబ కౌన్సెలింగ్తోపాటు అవసరాన్ని బట్టి వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నారు. యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తున్నారు. రెండేళ్ల వరకు బాగోగులు తెలుసుకుంటూ.. కేంద్రంలో నెల పాటు చికిత్స అందించాక ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత కూడా రెండేళ్ల పాటు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగిస్తూ పరిస్థితులు సమీక్షిస్తారు. అవసరమైతే తిరిగి కేంద్రానికి రప్పించే అవకాశం ఉంది. చికిత్స పొందిన 180 మంది డిశ్చార్జ్ కాగా, వీరిలో 70 శాతం మంది పూర్తిగా వ్యసనానికి దూరమయ్యారని నిర్వాహకులు తెలిపారు. అనువైన భవనం కోసం భద్రాచలంలోని కేంద్రంలో ప్రస్తుతం 15 మంది ఉన్నారు. చికిత్స అవసరమైన వారి సంఖ్య ఎక్కువగా కావడంతో వసతులు సరిపోవడంలేదు. అనువైన భవనం కోసం ప్రభుత్వ స్థలాన్ని, లేదా ఎక్కువ మంది బాధితులు వచ్చినా సరిపోయే ప్రభుత్వ భవనం కోసం వేచిచూస్తున్నారు. అంతేకాక వైద్య, మానసిక ఆరోగ్య నిపుణుల సేవలు కూడా అవసరమని చెబుతున్నారు. గంజాయి మహమ్మారిని అడ్డుకునేందుకు సీపీఎల్ఐ ద్వారా స్థానిక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండే విధానం, ఇతరులను ఎలా అప్రమత్తం చేయాలనే అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఆరు బ్యాచ్లలో మొత్తం 1,320 మంది శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పొందిన విద్యార్థులు తమ పరిధిలో మరో పది మందికి అవగాహన కల్పించే విధానం అమలులో ఉంది. ఓడీఐసీ ద్వారా స్లమ్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన వారిని కౌన్సెలింగ్, చికిత్స కోసం రిఫర్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా కుటుంబాలు, విద్యాసంస్థల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు కలిసి పనిచేయాలి. వ్యసనానికి గురైన వారిని గుర్తించి డీ ఎడిక్షన్ కేంద్రానికి పంపిస్తున్నాం. – బి.రోహిత్రాజు, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం కేంద్రానికి వచ్చే వారి శారీరక, మానసిక పరిస్థితిని అంచనా వేసి చికిత్స అందిస్తాం. డీటాక్సిఫికేషన్ సమయాన ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తాం. మందులతోపాటు కౌన్సెలింగ్, కుటుంబ సహకారం చికిత్సలో కీలకమే. డిశ్చార్జ్ అయ్యాక కూడా కుటుంబీకులు శ్రద్ధ చూపాలి. – ఈట ఉదయ్, డీ అడిక్షన్ కేంద్రం వైద్యుడు -
కట్లేరుకు గోదావరి జలాలు
ఎర్రుపాలెం: భద్రాద్రి జిల్లా బీజీ.కొత్తూరులోని పంప్హౌస్ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు ఎర్రుపాలెం మండలం కట్లేరులోకి బుధవారం చేరాయి. ఈ సందర్భంగా బీమవరంలోని కట్లేరు ప్రాజెక్టు వద్ద భీమవరం, మామునూరు సర్పంచ్లు వంగల నాగేశ్వరరావు, షేక్ పెద్దబాబు సాహెబ్, నాయకులు గోదావరి జలాలకు పూజలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన కట్లేరుకు గోదావరి జలాలు రావడంతో నీటి కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు శీలం శ్రీనివాసరెడ్డి, అనుమోలు కృష్ణారావు, వెల్ల టూరి సత్యనారాయణచారి, గుర్రాల శ్రీనివాసరెడ్డి, మారబత్తుల స్వామి పాల్గొన్నారు. శాసీ్త్రయ విధానాలతో నాణ్యమైన ఉత్పత్తి వైరారూరల్: పట్టు పురుగుల పెంపకంలో రైతులు శాసీ్త్రయ విధానాలు అవలంబిస్తే నాణ్యమైన ఉత్పత్తి సాధ్యమవుతుందని రాష్ట్ర సెరికల్చర్ శాఖ జాయింట్ సెక్రటరీ, సీనియర్ సైంటిస్ట్ జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. వైరా మండలం రెబ్బవరంలో ‘మేరా రేషమ్.. మేరా అభిమాన్’లో భాగంగా కేంద్ర పట్టు మండలి ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన సదస్సుకు 40 మంది పట్టు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పట్టు పురుగుల పెంపకంలో పరిశుభ్రత, పరికరాల క్రిమిసంహారక చర్యలు కీలకమని తెలిపారు. శాసీ్త్రయ పద్ధతులు, సాంకేతిక సూచనలు పాటిస్తే ఆరోగ్యకరమైన పట్టు పురుగుల పెంపకం, నాణ్యమైన ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు. ఇంకా ఈ సదస్సులో పట్టు పరిశ్రమ అభివృద్ధి సంస్థ జాయింట్ డైరెక్టర్ అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 28 గ్రామాలకు ‘సోలార్’ నేలకొండపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 28 సోలార్ మోడల్ గ్రామాలను ఎంపిక చేసినట్లు టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ పి.ఆజయ్కుమార్ తెలిపారు. మండలంలోని చెరువుమాధారంలో సోలార్ ప్లాంట్ల పనులను బుధవారం పరిశీలించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన 28 గ్రామాల్లో సర్వే అనంతరం 17,426 సర్వీసులను గుర్తించగా, ఇందులో 4,669 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటుకు తొలుత గృహజ్యోతి లబ్ధి దారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి 7.5 కిలోవాట్లు, గృహా లకు 2 కిలోవాట్ల రూప్టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేసే పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెరుగుతుందని, అదనపు విద్యుత్ను గ్రిడ్కు అందజేస్తే ప్రజలకు ఏటా కనీసం రూ.20 వేల వరకు ఆదాయం వస్తుందని వెల్లడించారు. ఈమేరకు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రజలు, రైతులు సహకరించాలని మేనేజర్ కోరారు. ఇద్దరు కార్యదర్శులు, ఆపరేటర్కు నోటీసులు● విధుల్లో నిర్లక్ష్యం, రికార్డుల్లో లోపాలతో చర్యలు కామేపల్లి: కామేపల్లి మండలం పింజరమడుగు, బర్లగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ దివాకర బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయా జీపీలను డీపీఓ వినోద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శులు అభివృద్ధి పనుల రికార్డులను, నిధుల పత్రాలను నిబంధనల ప్రకారం నిర్వర్తించడం లేదని తేలింది. దీంతో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ పింజరమడుగు, బర్లగూడెం కార్యదర్శులు గోపమ్మ, రాంబాబు కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే, బర్లగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈమేరకు కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ కూలీల ఖాతాలకు బదులుగా మృతుల ఖాతాల్లోని వేతనాలు బదిలీ చేశారని, పోర్టల్లో సంబంధం లేని ఫొటోలను అప్లోడ్ చేసినట్లు తేలడంతో వివరణ ఇవ్వాలంటూ ఆయనకు కలెక్టర్ నోటీసు జారీ చేశారు. -
నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య
వైరారూరల్: అనారోగ్య సమస్యలు తాళలేక పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, భర్త నుంచి దూరంగా ఆమె ఆత్మహత్యకు మరో వ్యక్తి కారణ మంటూ కుటుంబీకులు ఆందోళనకు దిగగా పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విడివిడిగా దంపతులు వైరా మండలం గొల్లెనపాడు గ్రామానికి చెందిన మామిడాల నాగమణి(36)కి ఖమ్మం అర్బన్ మండలం అల్లిపురం గ్రామానికి చెందిన మామిడాల ఉపేందర్రావుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించగా, గొడవలు జరుగుతుండడంతో ఆరేళ్ల క్రితం విడిపోరయారు. వీరి కుమార్తె హర్షిత తల్లి నాగమణి వద్ద, కుమారుడు తండ్రి వద్ద ఉంటున్నాడు. నాగమణి కూలీ పనులు చేస్తూ కుమార్తెను గురుకుల కళాశాలలో డిగ్రీ చదివిస్తోంది. అయితే, కొద్దినెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె ఈనెల 17న రాత్రి నొప్పి భరించలేక పెట్రోల్ పోసుకోని నిప్పంటించుకుంది. దీంతో బంధువులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి, అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా 18వ తేదీన సాయంత్రం మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం నాగమణి మృతదేహాన్ని బుధవారం గొల్లెనపాడు తీసుకురాగా, అదేగ్రామానికి చెందిన కంకణాల సురేష్ మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆయన చేతులకు కూడా కాలిన గాయాలు ఉండడంతో నాగమణిపై ఆయనే పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటాడని ఆరోపించారు. దీంతో ఎస్సై పి.రామారావు, సిబ్బందితో చేరుకుని మాట్లాడారు. కిడ్నీ నొప్పి భరించలేక నాగమణి ఆత్మహత్య చేసుకుందని కుమార్తె హర్షిత ఫిర్యాదు చేయగా, ఆమె కూడా వరంగల్ ఎంజీఎంలో తన చావుకు ఎవరు కారణం కాదని వాంగ్మూలం ఇచ్చిందని వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేశామని నచ్చచెప్పడంతో బంధువులు శాంతించారు. మరో వ్యక్తి కారణమని కుటుంబీకుల ఆందోళన -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
కల్లూరు రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరుకు చెందిన బానోతు వీరు(36) గత శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హనుమ తండా సమీపాన ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ఆయనను హైదరాబాద్ తరలించగా బుధవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై వీరు భార్య రేణుక ఫిర్యాదుతో కల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి.. చింతకాని: మండలంలోని నాగిలిగొండకు చెందిన మార్కపూడి కొండలరావు (40) బుధవారం చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. గాలాలతో చేపలు పట్టడానికి బావి వద్దకు వెళ్లిన ఆయన కాలుజారి బావిలో పడ్డాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మోటారు వైరే యమపాశమై..విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అంగడాల వీరబాబు(32)బుధవారం విద్యుఘాతంతో మృతి చెందాడు. రోజులాగే ఆయన గొర్రెలను మేత కోసం చొప్పకట్లపాలెం సమీప పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ పొలం ఫెన్సింగ్పై మోటార్ వైరు తెగిపడి ఉన్న విషయాన్ని గమనించిన వీరబాబు వైర్ను తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్కుమార్ తెలిపారు. -
కబ్జా నుంచి భూములకు విముక్తి
● ఆపై పేదల ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తాం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించిన వారి నుంచి స్వాధీనం చేసుకుని, అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈమేరకు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్ను ఆదేశించారు. పల్లెగూడెంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించాక మంత్రి మాట్లాడారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం అవసరమైన భూములను సమీకరించి పేదలకు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, పల్లెగూడెంలో రూ.61.76 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతుండగా, ఇప్పటికే సీసీ రోడ్లు, ఇతర పనులు పూర్తయ్యాయని తెలిపారు. జీపీ భవనాన్ని రెండు నెలల్లోనే నాణ్యతగా పూర్తి చేయడంపై ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అభినందించారు. గ్రామస్తుల వినతితో అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 31వరకు పింఛన్ దరఖాస్తు అర్హులైన వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. కూసుమంచి: దివ్యాంగులు లోపాలను చూసుకుని బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే అందరితో సమానంగా అభివృద్ధి చెందుతారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని పలువురు దివ్యాంగులకు కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మూడు చక్రాల మోటార్ సైకిళ్లను సీపీ సునీల్దత్తో కలిసి మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అనుకూలమైన రంగాల్లో రాణించాలని సూచించారు. డీడబ్ల్యూఓ ప్రమీల, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
సమాచారం లేకుంటే ఏం ఉపయోగం?
ఖమ్మంమయూరిసెంటర్: అధికారుల వద్ద శాఖల సమాచారం లేకుంటే ఉపయోగం ఏమిటని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. కలెక్టరేట్లో బుధవారం ఎంపీ అధ్యక్షతన ‘దిశ’ కమిటీ సమావేశం నిర్వహించగా వివిధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఈక్రమాన పరిశ్రమల శాఖ అధికారులు పీఎంఈజీపీ పథకంపై సమగ్ర సమాచారం చెప్పకపోవడంతో ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారమంతా ఆన్లైన్లో ఉందని, ఈ–ఫైల్ ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించగా, కలెక్టర్ దివాకర టీ.ఎస్. జోక్యం చేసుకొని సాంకేతిక సమస్య వచ్చినా ఇబ్బంది పడకుండా ఆఫీస్ ఫైళ్లు కూడా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు ప్రయోజనం జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిధులు, అనుమతులకు సంబంధించి సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖలో పనులు, వీఓ భవనాల నిర్మాణం, ఎంపీ ల్యాడ్స్ ద్వారా తాగునీటి కోసం మంజూరైన పనులు, డీఎంఎఫ్టీ నిధుల వినియోగం, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల లోటుపాట్లపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, గ్యాస్ కనెక్షన్లకు అర్హత ఉన్న కుటుంబాల సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలన్నారు. అలాగే, ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నీ పరిష్కరించాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలు చేయండి జిల్లాలోని అన్ని గురుకులాలు, వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎంపీ రఘురాంరెడ్డి ఆదేశించారు. దమ్మపేటలో గురుకులాన్ని తాను తనిఖీ చేయగా అనేక లోపాలు కనిపించాయని తెలిపారు. ఈమేరకు విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, సన్నబియ్యం పంపిణీని నిశితంగా పర్యవేక్షించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలు, తాగునీటి పనులు, ఖమ్మం రైల్వే స్టేషన్లో పార్కింగ్ సౌకర్యం, అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ వరంగల్ – ఖమ్మం హైవే పనులు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని వెల్లడించడమే కాక కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు వివరాలు వెల్లడించారు. కాగా, కల్లూరు, వైరా మున్సిపాలిటీల్లో డంపింగ్యార్డ్ సమస్య ఉందని చైర్మన్లు చెప్పగా పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు ఇవ్వాలని, వీఓ భవనాల బిల్లులు మంజూరు చేయాలని, టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని వెంకటాయపాలెం సర్పంచ్ కోరారు. ఈసమావేశంలో సీపీ సునీల్ దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన నారుతోనే రైతులకు మేలు
కొణిజర్ల: మిర్చి సాగు చేసే రైతులకు నాణ్యమైన నారు సరఫరా చేస్తే మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎం. వీ. మధుసూదన్ తెలిపారు. కొణిజర్ల మండలంలోని పలు నర్సరీలను బుధవారం ఆయన ఆయన తనిఖీ చేశారు. అనంతరం నర్సరీల నిర్వాహకులతో సమావేశమై మాట్లాడుతూ కల్తీని అరికట్టి రైతులకు నాణ్యమైన నారు సరఫరా చేయాలనే లక్ష్యంతో నిత్యం తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. అయితే, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు మిర్చి పునరాలోచన చేసి, నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు ఎంచుకోవాలని సూచించారు. అనంతరం పలు గ్రామాల్లో ఆయిల్పామ్ తోటలను కూడా మధుసూదన్ పరిశీలించారు. వైరా డివిజన్ ఉద్యాన అధికారి ఆకుల వేణు, ఆయిల్పామ్ విస్తరణాధికారి విశ్వ పాల్గొన్నారు. -
పీడీఎస్ బియ్యం రవాణా కేసులో పీడీ యాక్ట్
ఖమ్మంక్రైం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు, నిల్వ చేయడమే కాక ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాజా రామారావుపై పీడీయాక్ట్ నమో దు చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలి పారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలానికి చెందిన రేషన్ డీలర్ రామారావు పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా సేకరించేలా లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలను దుర్వి నియోగం చేయడమే కాక ఏజెంట్ల సాయంతో కొనుగోలు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఆయనపై ఈ ఏడాది ఏప్రిల్ 28నుంచి మే 26వ తేదీ వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కల్లూరు, తల్లాడ, ఎర్రుపాలెం, చండ్రుగొండ పోలీసుస్టేషన్లలో ఐదు కేసులు నమోదు కాగా, 2024లో కూడా తల్లాడు, కల్లూరులో రెండు కేసులు నమోదయ్యా యి. అయినా తీరు మార్చుకోకపోవడంతో రామారావుపై నమోదైన పీడీ యాక్టు ప్రతులను బుధవారం హైదరాబాద్ చంచలగూడ జైలులో ఆయనకు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తలింగం అందజేశారు. కాగా, పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు, నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. అయితే, రామారావుకు సంబంధించి ఏజెంట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్నందున పోలీసులు నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.కేసులు నమోదైనా మారని డీలర్ తీరు -
హబ్లో పరీక్షలకు గ్రహణం
సగానికి పైగా నిలిచిన రోగ నిర్ధారణ పరీక్షలు ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ నిర్వహణకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సగానికి పైగా రోగనిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో హబ్లో ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో, ఏది నిలిచిపోతుందో తెలియక క్షేత్ర స్ధాయిలోని వైద్య సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. జనరల్ ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్కు జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల నుంచి నిత్యం రక్త నమూనాలు వస్తుంటాయి. శాంపిళ్లను ప్రత్యేక వాహనాల్లో హబ్కు చేరవేస్తుండగా.. పరీక్షలు చేసి నివేదిక పంపించాలి. తీరా నమూనాలు తీసుకొచ్చాక పరీక్షలు నిలిచిపోయి రోజుల తరబడి నివేదికలు రాకపోవడంతో అత్యవసరమైన వారు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించి నష్టపోతున్నారు. 134 పరీక్షల్లో చేసేది 55 పరీక్షలే గత ప్రభుత్వం ప్రతీ జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్లను ఏర్పాటు చేసింది. ఖమ్మంలోని హబ్లో తొలుత రోగ నిర్ధారణ పరీక్షలు సజావుగానే సాగినా, రానురాను అవాంతరాలు సాధారణమయ్యాయి. ఒక్కోసారి రక్తపరీక్షలు నిర్వహించటానికి అవసరమైన రీఏజెంట్ల కొరత, ఇంకొన్ని సార్లు హబ్కు నీటి సరఫరా చేసే ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులతో ఇబ్బంది వస్తోంది. గంటకు 1,200 టెస్టులు చేసే కెమిస్ట్రీ అనలైజర్, ఇమ్యూనో అనలైజర్ మిషన్లు పాతవి కావడం ప్రస్తుత అవాంతరానికి కారణమని తెలుస్తోంది. కొత్త యంత్రాలు పంపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా జాప్యం చేస్తుండడంతో హబ్ ద్వారా చేయాల్సిన 134 రకాల పరీక్షలకు గాను ప్రస్తుతం 55 పరీక్షలే నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానమైన లిపిడ్ ప్రొఫైల్, వివిధ రకాల విటమిన్ టెస్టులు లేకపోవడం గమనార్హం. -
‘కల్యాణం’.. కల్లోలం!
ఖమ్మంమయూరిసెంటర్: పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై న్యాయస్థానం స్టే విధించడంతో పాటు తదుపరి విచారణ వరకు ఎలాంటి నగదు చెల్లింపులు జరపొద్దని ఆదేశించడంతో వేలాది కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేయగా.. ఆమోదం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నిలిచిన ప్రయోజనాలు.. జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల నుంచి మొత్తం 65,782 దరఖాస్తులు వచ్చాయి. తహసీల్దార్ స్థాయిలోనే ఇంకా 877 దరఖాస్తులు పరిశీలనలో ఉండగా.. తహసీల్దార్ పరి శీలన అనంతరం ప్రజాప్రతినిధుల ఆమోదం కోసం 1,496 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ప్రజాప్రతినిధుల ఆమోదం పొంది ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సినవి 426వరకు ఉన్నాయి. ఇక సాంకేతిక, అర్హతల కారణాలతో తహసీల్దార్ స్థాయిలో 2,972, ప్రజాప్రతినిధుల వద్ద 46 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కాగా, జిల్లాలో మొత్తం 65,782 దరఖాస్తులకు గాను 59,768 మందికి ట్రెజరీ ద్వారా బిల్లులు మంజూరయ్యాయి. ఖమ్మం అర్బన్లోనే అత్యధికం.. ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోనే అత్యధికంగా 50,068 దరఖాస్తులు నమోదు కాగా, ఒక్క ఖమ్మం అర్బన్ పరిధిలోనే 10,077 దరఖాస్తులు ఉన్నాయి. ఖమ్మం అర్బన్లో 294 దరఖాస్తులు ఎమ్మార్వో వద్ద, 339 దరఖాస్తులు ఎమ్మెల్యే ఆమోదం కోసం నిలిచిపోయాయి. ఖమ్మం రూరల్లో 71 దరఖాస్తులు తహసీల్దార్ వద్ద పరిశీలనలో ఉన్నాయి. కల్లూరు డివిజన్ పరిధిలో మొత్తం 15,714 దరఖాస్తులకు గాను, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో 25 చొప్పున దరఖాస్తులు తహసీల్దార్ వద్ద పరిశీలన దశలో నిలిచిపోయాయి. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం అప్పులు చేసి, ప్రభుత్వం అందించే రూ.1,00,116 ఆర్థిక సాయంతో ఆ అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడ్డ పేద కుటుంబాలకు హైకోర్టు ఉత్తర్వులు మింగుడు పడటం లేదు. సెప్టెంబర్ 9 వరకు తదుపరి విచారణ వాయిదా పడటంతో, ప్రభుత్వం తక్షణమే స్పందించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి, లబ్ధిదారులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పది నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా..
వైరారూరల్: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం.. ఆపై తాపీ మేసీ్త్రగా జీవనం సాగిస్తూ ఇంకో పది నిమిషాల్లో ఇంటికి వెళ్తాడనుకునేలోగా రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకానికి చేరాడు. ఎస్సై–2 వెంపటి పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోస్తాల గ్రామానికి చెందిన వేముల భాస్కర్ (56) సుతారీ మేసీ్త్రగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ మేరకు పని ముగించుకుని మంగళవారం రాత్రి తన బైక్ మీద ఇంటికి వెళ్తుండగా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం ప్రాథమికోన్నత పాఠశాల ఎదురుగా కొండకొడిమ నుంచి వైరా వైపు వస్తున్న దారెల్లి అశోక్ బైక్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వేముల భాస్కర్కు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికకక్కడే మృతిచెందాడు. దారెల్లి అశోక్కు కాళ్లు విరగడంతో 108 అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వాప్పత్రికి తరలించారు. పనిముగించుకుని ఇంటికి వస్తాడనుకున్న భాస్కర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తాపీమేసీ్త్ర మృతి -
అన్నదాతల ‘యాప్’సోపాలు..
● ఎఫ్ఎఫ్ఎస్లో సాంకేతిక సమస్యలు ● ఎరువుల బుకింగ్ కాక అవస్థలు ● పరిష్కారానికి చర్యలు: ధనసరి పుల్లయ్య జిల్లా వ్యవసాయాధికారి ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఎఫ్ఎఫ్ఎస్(ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) అమలులో సాంకతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఎరువుల బుకింగ్ ఆలస్యమవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బుకింగ్లో 20కి పైగా సమస్యలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ గుర్తించగా.. ప్రధానంగా ఫార్మర్ రిజిస్ట్రీలో ల్యాండ్ సింక్రనైజేషన్ కాకపోవటం, పోడు భూములకు సర్వే నంబర్ లేకపోవడం, మూతపడిన డీలర్ల వద్ద మిగిలిన స్టాక్ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో డెడ్ స్టాక్గా చూపించటం, రిటైలర్ వద్ద స్టాక్ అయిపోయినా అదనపు క్యూఆర్ కోడ్లు జనరేట్ అవటం, ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ కావటం వలన మండల వ్యవసాయాధికారుల లాగిన్లో వివాదాస్పద భూములను ఆమోదించలేకపోవటం, ఆధార్ లింక్ లేకపోవటం, ల్యాండ్ ఇప్పటికే మ్యాప్ అయినట్లు చూపించడం, సర్వే నంబర్లలో తెలుగు అక్షర సఫిక్స్ ఉన్నప్పుడు బుకింగ్ నిలిచిపోవటం, మండల మ్యాపింగ్లో లోపాల కారణంగా స్టాక్ కేవలం 3–5 నిమిషాల్లో అయిపోయినట్లు చూపుతున్నాయి. ఇందులో కొన్ని.. ●సత్తుపల్లి మండలం అయ్యగారిపేట రెవెన్యూ గ్రామం, ఖమ్మం అర్బన్ మండలంలోని పలు రెవెన్యూ గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీలో భూముల ల్యాండ్ సింక్రనైజేషన్ పూర్తి కాకపోవటం వలన రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ●ఎల్జీడీ కోడ్ మిస్మ్యాచ్ కారణంగా తల్లాడ మండలంలోని లక్ష్మీపురం గ్రామం పొరపాటున కల్లూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి మ్యాపింగ్ అయింది. ఇటువంటి సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఎరువులను నూతన యాప్ ద్వారా పొందటంలో ఇబ్బందులు పడుతున్నారు.ఎరువుల బుకింగ్లో యాప్లో ఎదురవుతున్న సమస్యలను ఎఫ్ఎఫ్ఎస్ బృందం దృష్టికి తీసుకెళ్లాం. మొదట్లో సాంకేతిక సమస్యలు రావడం సహజమే అయినా త్వరలోనే పరిష్కరిస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. సమస్య ఎదురైతే స్థానిక డీలర్లు, పీఏసీఎస్ సిబ్బంది లేదా సంబంధిత వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
చివరికి గోదారే దిక్కు..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కృష్ణా జలాలు రాకున్నా.. గోదావరి జలాలు వచ్చాయని ఆశపడి సాగులోకి దిగిన రైతులకు నిరాశే ఎదురైంది. ఈ నీటి విడుదలను నిలిపివేయడంతో సాగు, నాట్ల దశలో ఉన్న పంటలు దెబ్బతింటున్నాయి. పర్యవసానంగా రైతులు కన్నీటి పర్యంతం అవుతూ నీటి విడుదల కోసం అధికారులను వేడుకుంటున్నారు. ప్రస్తుతం గోదావరి జలాలను ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా విడుదల చేస్తున్నప్పటికీ అవి ఎంతకాలం విడుదలవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వైరా, లంకాసాగర్ ప్రాజెక్టుల ద్వారా అనధికారికంగానే గోదావరి జలలను సాగు కోసం వినియోగిస్తున్నారు. పూర్తిస్థాయిలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరుణించని వరుణుడు.. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాల కు తోడు.. ఇటీవల అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా సాగు పనులు చేపట్టారు. బోర్లు, బావులతోపాటు జలాశయా ల పరిధిలో కూడా వరిసాగు ప్రారంభించారు. తుపాను తగ్గిన అనంతరం మళ్లీ ఎండలు యథాతథంగా మండుతున్నాయి. వర్షాల జాడ లేదు. కనీస స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడంతో నారుమళ్లు పోసిన, నాట్లు వేసిన రైతులకు ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉంది. వచ్చేనెల ఇదే పరిస్థితి ఉంటే పంటలను రక్షించుకోవడానికి ఏం చేయాలనే దానిపై రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పంటలను కాపాడుకునేందుకు గోదావరి జలాలను విడుదల చేయాలని రైతులు అభ్యర్థిస్తున్నారు. గత నెలలో విడుదల.. గత నెలలో ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరాయి. ప్రతి ఏటా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే కృష్ణా జలాలు ఈసారి జాడలేవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు నుంచి గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు తరలించారు. ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్లోకి నీరు వచ్చి చేరింది. అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు కోసం ఈ నీటిని వినియోగించారు. ఈ నీరు వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతులకే కాకుండా.. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లోని లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందింది. ఈ నీటి విడుదలతో చాలాచోట్ల రైతులు వరి నాట్లు వేయడంతోపాటు నారుమళ్లు పోశారు. నీళ్లు అందుబాటులో ఉన్నాయని రైతులు సంతోషించే లోపు ఈ నీటి విడుదలను నిలిపివేశారు. ఈ కారణంగా అటు సాగు చేసిన పంటలతో పాటు నారుమళ్లు దెబ్బతిన్నాయి. రైతుల ఆందోళనతో దిగివచ్చినా.. జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటాయి. ఇక సగానికి పైగా చెరువుల్లో 25 శాతం నీళ్లు కూడా లేవు. మరోవైపు రైతులు ఆశలు పెట్టుకున్న గోదావరి జలాలను నిలిపివేశారు. ప్రధానంగా వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 20 వేల ఎకరాల్లో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లిఫ్ట్లు, మోటార్ల ద్వారా ఐదు వేల నుంచి పదివేల ఎకరాల్లో నాట్లు వేశారు. ఈ దశలో గోదావరి జలాల విడుదలను అధికారులు నిలిపివేశారు. నీటి లభ్యత లేకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి. మరోసారి గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, రాజకీయ పార్టీల ఆధ్వర్యాన సోమవారం వైరా నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. తాగునీటికే ఈ నీటిని వినియోగించాలని ఉన్నతాధికారులు చెబుతున్న నేపథ్యాన అనధికారికంగా సాగు అవసరాలకే వినియోగిస్తున్నారు. పూర్తిగా విడుదల చేయాల్సిందే.. సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు గోదావరి జలాలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని రైతులు అర్థిస్తున్నారు. కళ్లెదుట ఎండిపోతున్న పంటలను రక్షించుకునేందుకు అధికారుల కాళ్ల మీద పడుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదలయ్యే అవకాశాలు లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లోనే కాకుండా.. తమ పంటలు చేతికొచ్చే వరకు గోదావరి జలాలు విడుదల చేయాలని రైతాంగం అధికారులను కోరుతోంది. ఈ నీటితో వైరా, సత్తుపల్లి, మధిర మండలాల్లోని ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకుంటారు. ఈ ఏడాది వర్షాలు కురిసే పరిస్థితి లేకపోవడంతో పాటు అధికారులు వైరా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తారో..? లేదో స్పష్టంగా చెప్పలేదు. ఈ కారణాలతో ఐదెకరాలను బీడుగానే ఉంచా. ప్రతి ఏడాది ఈ ఐదెకరాల్లో వరి సాగు చేస్తారు. ఇప్పుడు నీళ్లు ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు. నీరు ఇస్తే మళ్లీ సాగు చేస్తా. – చావా మధు, రెబ్బవరం, వైరా మండలందాసాపురం గ్రామంలో వైరా ఏటిని అనుసంధానం చేసుకుని లిఫ్ట్ల ద్వారా రైతులు వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 500 ఎకరాల్లో వరి సాగవుతుండగా.. అధికారులు వైరా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయకపోతే అవి ఎండిపోయినట్టే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పంటలకు అవసరం మేరకు నీటిని విడుదల చేయాలి. –ఐలూరి శ్రీనివాస్రెడ్డి, దాసాపురం, వైరా మండలంనాట్ల దశలో సాగునీటి కష్టాలు -
పథకం ప్రకారమే రామారావుపై దాడి
ఖమ్మంరూరల్: ముందస్తు ప్రణాళికతోనే మారుతి రామారావును హతమార్చేందుకు కుట్ర చేశారని బీఆర్ఎస్ నేత అల్లిక వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రామారావు కొద్ది రోజుల క్రితం సీపీఐ నుంచి బీఆర్ఎ్స్లో చేరగా.. గతంలో ఓ సీపీఐ నాయకుడికి రామారావుకు సుమారు రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉన్నందున పదేపదే అడగడంతో అతడిని బెదిరింపులకు పాల్పడడంతో తనకు ప్రాణహాని ఉందని రామారావు ఈనెల 14వ తేదీన ఖమ్మం ప్రెస్క్లబ్లో విలేకరులకు విన్నవించినట్లు చెప్పారు. 16న ఖమ్మం నుంచి అదే గ్రామానికి చెందిన బట్టు రామారావుతో కలిసి బైక్పై రాత్రి సమయాన గూడూరుపాడుకు వస్తుండగా.. గ్రామ పొలిమేరలో ఇద్దరు వ్యక్తులు మరో బైక్పై వచ్చి రాడ్లతో దాడి చేశారన్నారు. ఈఘటనలో మారుతి రామారావు తప్పించుకోగా.. బట్టు రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో సోమవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. రామారావును అంతమందించేందుకుగాను 9 మంది సభ్యులు పథకం ప్రకారం కుట్ర పన్నారని, ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను కోరారు. గ్రామంలో గాంజా కేసులలో ఉన్న వారిని ఉసిగొలిపి దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి చర్యలకు ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి అమ్మరాజు, పడగల వెంకటేశ్వర్లు, కుర్రి లింగయ్య, కొర్రి తిరుపతిరావు, పడిగల రాము తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణలక్ష్మి రద్దుకు ప్రభుత్వం కుట్ర
సత్తుపల్లి: నిరుపేదలకు కన్నీళ్లను తుడిచేందుకు కేసీఆర్ మేనమామలా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని, ఏడు వారాల క్రితం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ మేరకు సత్తుపల్లి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ రింగ్సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తున్న తులం బంగారం ఇవ్వలేదని, ఇప్పటి వరకు ఇచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పిల్లలు పుట్టిన తర్వాత ఇచ్చిందన్నారు. ప్రభుత్వం కనువిప్పు కలిగించే విధంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టామన్నారు. రూ.100 కోట్లతో చేపట్టిన రాజీవ్ లింక్ కెనాల్ పనుల లైనింగ్ కొట్టుకుపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మీ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమా, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి్, వీరపనేని బాబీ, ఎండీ.రఫీ, ఎస్కే చాంద్ పాష, అమరవరపు కృష్ణారావు, తడికమళ్ల సాల్మన్ పాల్గొన్నారు.బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా -
ఆటో, లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కొణిజర్ల: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో నడిపి ఓ ఆటో, లారీని ఢీకొట్టిన ఘటన మండల పరిధిలోని తనికెళ్ల సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న మధిర డిపో ఆర్టీసీ హైర్ బస్సు ముందు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో వైరా నుంచి ఖమ్మం వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతోపాటు అదే వేగంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చింతకాని మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన సింగారపు గోపి ఆటోనడుపుతుండగా ఆటో పల్టీలు కొట్టడంతో గోపి చేతికి తీవ్రగాయమైంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటోను పైకి తీయించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడవుల సంరక్షణకు పటిష్ట కార్యాచరణ
చుంచుపల్లి: అటవీ, వన్యప్రాణులు, సహజ వనరుల సంరక్షణ కోసం పటిష్ట కార్యాచరణతో ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర పీసీసీఎఫ్ వినయ్కుమార్ అధికారులు, సిబ్బందికి సూచించారు. భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ భీమానాయక్తో కలిసి మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఎఫ్ఓలు,ఎఫ్డీఓలు, ఇతర అటవీ అధికా రులతో సింగరేణి గెస్ట్హౌస్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, అక్రమవేట నివా రణ, అటవీ నేరాల నియంత్రణ, గస్తీ వ్యవస్థ, ముందస్తు సమాచార సేకరణ, వివిధ శాఖల సమన్వ యం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఫ్రంట్లైన్ సిబ్బంది భద్రత, సిబ్బంది సంక్షేమం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఎఫ్బీఓ నవీన్ మృతి ఘటన మరలా పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక గ్రామస్తులు, ప్రజలు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందస్తు సమాచారాన్ని సేకరించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించాలని, నిరంతర కమ్యూనికేషన్ కొనసాగించాలని సూచించారు. అవసరమైన చోట్ల అటవీ శాఖ–విద్యుత్ శాఖ సంయుక్త క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర విద్యుత్ లైన్లు గుర్తించిన ప్రాంతాల వారీగా వివరాలను నమోదు చేసి, తీసుకున్న చర్యలను క్రమం తప్పకుండా సమీక్షించాలని తెలిపారు. కిన్నెరసాని డివిజన్లో పరిశీలన.. పీసీసీఎఫ్ వినయ్ కుమార్, భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ భీమా నాయక్తో కలిసి కిన్నెరసాని డీర్ పార్క్ ను సందర్శించి, డివిజన్లో చేపడుతున్న అటవీ సంరక్షణ, వన్యప్రాణి పరిరక్షణ కార్యక్రమాలు, సందర్శకుల సౌకర్యాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. కిన్నెరసాని ప్రాంతంలోని సహజ వనరులు, అటవీ సంపద, వన్యప్రాణులను పరిరక్షిస్తూ డీర్పార్క్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, ఖమ్మం డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, పలువురు ఎఫ్డీఓలు, రేంజ్ ఆఫీసర్లు, అధికారులు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘నానో’తోనే మొక్కకు నేరుగా నత్రజని
● డీఏఓ పుల్లయ్య వైరా: రైతులు గుళికల రూపంలో యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వినయోగించాలని, వీటిని నేరుగా ఆకులపై స్ప్రే చేయడంతో మొక్కకు నేరుగా నత్రజని చేరుతుందని జిల్లా వ్యవసాయాధికి ధనసరి పుల్లయ్య అన్నారు. పత్తి పంటలో నానో యూరియా, డీఏపీల వాడకంపై మంగళవారం మండలంలోని బ్రాహ్మణపల్లిలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ వెంపటి కీర్తి, మహేందర్రెడ్డి, రైతులు సైదులు, నరేష్, గోపి పాల్గొన్నారు. మిల్లుల్లో అధికారుల దాడులుతగ్గిన రూ.2.87 కోట్ల విలువైన ధాన్యం ముదిగొండ: మండలంలోని అమ్మపేట, వనంవారి కిష్టాపురంలలోని ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ, వెంకటేశ్వర మోడ్రన్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వరంగల్ రీజియన్ విజిలెన్స్ సీఐ రాకేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తనిఖీలు చేపట్టారు. మిల్లులకు సంబంధించిన గోదాముల్లోని ధాన్యం బస్తాలను కౌటింగ్ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరి శీలించారు. వనంవారికిష్టాపురంలోని వెంకటేశ్వర మోడ్రన్ రైస్ మిల్లులో 270మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు, అమ్మపేటలోని శ్రీ వెంకటేశ్వ ర రైస్ ఇండస్ట్రీలో 800 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు తగ్గినట్లు అధికారులు లెక్కలు తేల్చా రు. ఈ రెండు రైస్ మిల్లుల్లోని తక్కువ టన్నుల నిల్వలు రూ.2.87కోట్ల విలువ ఉంటుందని లెక్కతేల్చారు. తనిఖీల్లో వరంగల్ విజిలెన్స్ తహసీల్దార్ లక్ష్మణ్, సీఐ రాకేష్, సివిల్ సప్లై డీటీలు నాగలక్ష్మి, విజయ్బాబు, టెక్నికల్ అసిస్టెంట్లు, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీలు.. ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అధికా రులు, సిబ్బంది మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వైరా మండలం అష్ణగుర్తి గ్రామంలో బియ్యం వ్యాపారి బలగాని నర్సింహారావు ఒక ఇంట్లో 9.50 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేయగా..అట్టి రేషన్ బియాన్ని సీజ్ చేసి నర్సింహారావుపై కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. అదే విధంగా కొణిజర్ల మండలంలోని పలు రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇలా ప్రతి రోజు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎస్ఓ మల్లిఖార్జున్బాబు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ‘రేషన్’ అక్రమ నిల్వలపై ఉక్కుపాదం నేటి నుంచి పోలీసులు సైతం రంగంలోకి.. ఖమ్మం సహకారనగర్: జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తున్నందున అర్హులందరికీ రేషన్ బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు అక్రమ రేషన్ బియ్యం నిల్వలు, రవాణా తదితర అంశాలపై సివిల్ సప్లయీస్ అధికారులు తనిఖీలు చేపట్టగా నేటి నుంచి పోలీసులు సైతం నిఘా పెంచనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. తహసీల్దార్ల ఆధ్వర్యాన స్మార్ట్కార్డుల పంపిణీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ల ఆధ్వర్యాన రెవెన్యూ సిబ్బంది సహకారంతో రేషన్ డీలర్లు రెండు, మూడు రోజుల్లో స్మార్ట్కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం డీసీఎస్ఓ చందన్కుమార్ సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 748 రేషన్ దుకాణాలుండగా... వాటి పరిధిలో 4,73,271కార్డులున్నాయి. చికిత్స పొందుతున్న ఎలక్ట్రీషియన్ మృతికామేపల్లి: విద్యుత్షాక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన షేక్ లాల్ సాహెబ్ (40) రెండున్నర నెలల క్రితం విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి వరంగల్ ఎంజీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూపరిస్థితి విషమించి మృతి చెందాడు. -
విద్యార్థుల నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీలో కలెక్టర్ దివాకర టీ.ఎస్.కారేపల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కెరీర్ గైడెన్స్, ఉన్నత విద్యపై అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అన్నారు. మంగళవారం కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల ప్రాంగణంలో పరిసరాలను పరిశీలించిన ఆయన విద్యార్థుల ప్రవేశాలు, వారి ఫలితాలు, భోజన సదుపాయాలు, వసతులు, ఉపాధ్యాయుల బోధన తీరుపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించి, వారికి ఇష్టమైన సబ్జెక్టులు, లక్ష్యాలు అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత పాఠశాలలోని లైబ్రరీ, మ్యూజిక్ రూమ్, ఆర్ట్స్ గ్యాలరీ, సైన్స్ ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు వంటి నైపుణ్యాలు ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పాఠశాల నిర్వాహణ, విద్యార్థుల విద్యా ప్రగతి, మౌలిక వసతులు, సిబ్బంది, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఖమ్మం–రేలకాయలపల్లి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పాఠశాల ప్రహరీపై సోలార్ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అదనపు విద్యుత్ లైన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని వివరించగా.. స్పందించిన కలెక్టర్ ఈ అంశాలపై సమగ్ర ప్రతిపాదనలు తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 9.57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 6 నుంచి 12వ తరగతి వరకు జరుగుతున్న విద్యాబోధనను విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్కుమార్, ఆర్ఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు ఉపాధి ఎంచుకోవాలి
● గిరిజన గురుకుల సొసైటీ రాష్ట్ర కార్యదర్శి సీతాలక్ష్మి ● తనికెళ్ల గురుకులంలో ఎంట్రప్రెన్యూర్షిప్కొణిజర్ల: గిరిజన బాలికలు తమ చదువుతోపాటు స్వయం ఉపాధితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ రాష్ట్ర సెక్రటరీ సీతాలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని తనికెళ్లలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామిక వికాసం, ఎంట్రప్రెన్యూర్షిప్ ఎకో సిస్టమ్ కార్యక్రమాన్ని ఆమె భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మి కళాశాల బాలికలకు తయారు చేసిన అగర్ బత్తీలు, వెదురు, జనప నార వస్తువులను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్ కె.రజని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బాలికలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముడానికి ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ కలిపిస్తామన్నారు. విద్యార్థినులు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వంతంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నత స్థాయి కి ఎదగాలన్నారు. తనికెళ్ల కళాశాలలో చదువుతూ జాతీయ, రాష్ట్ర స్థాఽయిలో ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలకు ఎంపికై న బాలికలను సన్మానించారు. రూ.2 లక్షలు ప్రకటించిన పీఓ... తనికెళ్ల గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల బాలికలు తయారు చేస్తున్న వివిధ రకల వస్తువులు పరిశీలించిన ఐటీడీఏ పీఓ బి.రాహుల్ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఐటీడీఏ భద్రాచలం నుంచి రూ.2 లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. కళాశాలలో నిర్వహిస్తున్న ఎంట్రప్రెన్యూర్షిప్లో భాగంగా బాలికలకు టైలరింగ్, మగ్గంవర్క్, బ్యుటీషీయన్ కోర్సు, జ్యూయలరీ మేకింగ్, సీడ్ పెన్ మేకింగ్, తాటిఆకులతో బుట్టలు, పిండి వంటలు, రొట్టెలు, అగర్బత్తీల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి, ఐటీడీఏ పీఓ బి రాహుల్లు బాలికలకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, కళాశాల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. -
కుంటల నిర్మాణం వేగవంతం చేయాలి
ముదిగొండ: గ్రామాల్లో పంటకుంటల నిర్మాణాల్లో రైతుల భాగస్వామ్యం అవసరమని, కుంటల నిర్మాణం వేగవంతం చేయాలని పంచాయతీరాజ్శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత అధికారులకు సూచించారు. మండలపరిధిలోని వెంకటాపురంలో పంటకుంటల నిర్మాణం, సోక్ఫిట్ నిర్మాణం, డ్రైన్ఎండ్, కమ్యూనిటీ సోక్ఫిట్, ఇంకుడుగంతల నిర్మాణాలను మంగళవారం ఆమె పరిశీలించారు. మండలంలో మంజూరైన పంటకుంటల నిర్మాణాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటకుంటలు వల్ల భూగర్భజలాలు పెరగడంతోపాటు రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని, రైతులు వ్యవసాయ భూముల్లో పంటకుంటలు నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. వెంకటాపురం పంచాయతీ కార్యాలయంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను పరిశీలించి కార్యదర్శి స్రవంతికి సూచనలు చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయంను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వినోద్, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, డీఎల్పీఓ విజయలక్ష్మి, ఏపీడీ శ్రీదేవి, ఎంపీడీఓ విజయ, ఏపీఓ రంగనాయకమ్మ, ఎంపీఓ రామకృష్ట, ఏఓ సరిత, వెంకటాపురం సర్పంచ్ కందుల బాలచందర్ పాల్గొన్నారు. -
ప్రాజెక్ట్లు త్వరితగతిన పూర్తి చేయాలి
అశ్వాపురం/ ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీ బృందం అశ్వాపురం మండలంలో సీతమ్మసాగర్ బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టు కెనాల్, బీజీ కొత్తూరు వద్ద పంప్హౌస్, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం, ములకలపల్లిలోని కమలాపురంలో పంపుహౌస్లను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణంలో జాప్యంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్లపై వాస్తవ పరిస్థితులను రైతాంగానికి వివరించేందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నాయకుల బృందం ఈ పర్యటన చేపట్టిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఎనిమిదేళ్లు కావస్తున్నా ప్రాజెక్ట్ పూర్తిచేసి ఇప్పటికీ సాగునీరు ఇవ్వకపోవడం రైతులను చిన్నచూపు చూడడమేనన్నారు. దుమ్ముగూడెం రాజీవ్ప్రాజెక్ట్కు డిజైన్ల మీద డిజైన్లు మారాయి కానీ ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదన్నారు. అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెం, అమ్మగారిపల్లి ప్రాంతాల ప్రజలు ఇప్పటికే పలుమార్లు భూములు కోల్పోయారని, ఇప్పటికీ నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన ప్రతీ నిర్వాసితుడికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ములకలపల్లి మండలంలోని ప్రధాన చెరువులకు ఈ సంవత్సరమే నీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాజెక్టు పనులు, కాలువల నిర్మాణం, భూసేకరణ, నష్టపరిహారం తదితర అంశాల్లో అనేక అనుమానాలు, అవకతవకల ఆరోపణలు వస్తున్నాయని వాటిపై పారదర్శకంగా సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాచర్ల భారతి, అన్నవరపుకనకయ్య, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, విక్రమ్, నాయకులు రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య, లిక్కి బాలరాజు, బండి పద్మ, ఎర్ర శ్రీనివాసరావు, మడిపల్లి గోపాలరావు, మెరుగు సత్యనారాయణ, యలమంచి వంశీకృష్ణ కె.పుల్లయ్య, రేపాకుల శ్రీను, బాలరాజు, వెంకన్న, వంశీ, వెంకటేశ్వర్లు, రాంబాబు, రామూర్తి, ఆదినారాయణ, సర్పంచ్ వగ్గేల రాధ తదితరులు పాల్గొన్నారు.సీతారామ ప్రాజెక్ట్ను పరిశీలించిన సీపీఎం ఉమ్మడి జిల్లా బృందం -
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు కేసులో ఖమ్మంలోని బ్రాహ్మణబజార్కు చెందిన శేషు కుమారికి ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.7.55 లక్షల నష్టపరిహారం చెల్లించి రూ.5 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ న్యాయదికారి కాకుమాను జ్యోతిర్మయి మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా.. ఖమ్మం బోనకల్ రోడ్డు శ్రీరామ్ నగర్కు చెందిన ఎడ్ల లక్ష్మీనారాయణ వద్ద నిందితుడు తన కుటుంబ అవసరాల నిమిత్తం 2018, జనవరి 6న రూ.3లక్షలు అప్పుగా తీసుకొని ప్రాంసరీ నోటు రాసిచ్చాడు. ఆ తర్వాత తన రుణం చెల్లించాలని ఒత్తిడి చేయగా 2020, సెప్టెంబర్ 3న రూ.5 లక్షలకు చెక్కు ఇవ్వగా.. ఫిర్యాది తన బ్యాంక్ ఖాతాలో జమ చేయగా సరిపడా నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో ఫిర్యాది లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో కేసు దాఖలు చేయగా.. విచారించిన న్యాయాధికారి నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పోడు భూమి ఆక్రమణ కేసులో వ్యక్తి అరెస్ట్ రఘునాథపాలెం: అటవీ భూమిని పోడు సాగు పేరుతో ఆక్రమణకు పాల్పడిన కేసులో రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన భూక్యా మోహన్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ డీఆర్ఓ సాల్మన్రాజు తెలిపారు. 2023లో నమోదైన కేసులో మోహన్ను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్బీఓలు కిరణ్, కన్నయ్య, రాంబాబు, వెంకటరమణ పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతవైరారూరల్: ఇంట్లో నిల్వ ఉంచిన రేషన్బియ్యాన్ని సివిల్సప్లయి అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మండలంలోని అష్ణగుర్తి గ్రామంలో బలగాని నర్సింహారావు ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ మేరకు నర్సింహారావు ఇంట్లో నిల్వ ఉంచిన తొమ్మిదిన్నర క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. అనంతరం నర్సింహారావు మీద ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఖమ్మం అర్బన్: ఖమ్మంనగరం ఖానాపురంకు చెందిన అక్కి వీరబాబు (48) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గత ఆరు నెలల క్రితం వీరబాబు భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమాన మద్యానికి బానసై మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారికి వివాహాలు జరిగినట్లు సీఐ పేర్కొన్నారు. -
సెలవిచ్చి ఊరుకోలేదు.. సంక్షేమమూ చూశారు
తెలంగాణ: సెలవు కోసం వచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలితో అవును లేదా కాదని చెప్పి వదిలేయకుండా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆమెను ఆరా తీయడంతో అసలు కారణం బయటపడింది. సదరు కార్మికురాలి మనవరాలు ప్రాణాంతక సమస్యతో బాధపడుతోందని తెలియడంతో చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించగా ఆ పసిబిడ్డ కోలుకుంది.ఖమ్మంకు చెందిన కాంపాటి రాకేష్ – మాధవి దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. పాప పుట్టిన 12 రోజులకే గుండె సంబంధిత తీవ్ర సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్సకు పెద్దమొత్తంలో నగదు కావాలని తెలియడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పసిపాప నానమ్మ నర్సమ్మ కేఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో కార్మికురాలు కాగా, పాప బాగోగులు చూసుకునేందుకు సెలవు కోరేందుకు కమిషనర్ అభిషేక్ అగస్త్యను ఆశ్రయించింది.ఈ సమయంలో తన మనవరాలికి వచ్చిన కష్టాన్ని చెప్పుకోగా అభిషేక్ చొరవ తీసుకున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి వైద్యులతోనే కాక హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. చికిత్స కోసం రూ.14 లక్షలు అవసరమని తెలియడంతో హృదయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో మాట్లాడడంతో పాటు ప్రభుత్వం తరఫున డబ్బులు మంజూరు చేయించారు. దీంతో గతనెల 28న వైద్యులు చిన్నారికి అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ విజయవంతంగా చేయగా పాప కోలుకుంది. నానమ్మ, తల్లిదండ్రుల కోరిక మేరకు పాపకు జస్వికశ్రీ అని కమిషనర్ నామకరణం చేశారు. -
ఎన్డీ నేతలు బహిరంగ విచారణకు సిద్ధమా?
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ కేంద్ర కమిటీ కంట్రోల్ కమిషన్ మాజీ చైర్మన్, రాయల చంద్రశేఖర్ ఆత్మహత్యను ఆసరాగా చేసుకుని తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న న్యూడెమోక్రసీ నాయకత్వం బహిరంగ విచారణకు సిద్ధం కావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల చంద్రశేఖర్ జీవిత సహచరి విమల రాసిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఎన్డీ నేతలు మాస్లైన్ పార్టీపై బురదజల్లేలా మాట్లాడడం సరికాదన్నారు. ఆయన మృతిపై రాద్ధాంతం చేయకుండా, మధ్యవర్తిని పెట్టుకుని బహిరంగ విచారణకు రావాలని సూచించారు. గతంలో ఉమ్మడి న్యూడెమోక్రసీలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ను ఇల్లెందు ప్రాంతానికి రానివ్వకుండా ఆంక్షలు విధించిన వారే ఇప్పుడు తమపై విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. పాలకవర్గాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటం మరచి, మాస్లైన్ ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం అచ్చయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, ఆవుల వెంకటేశ్వర్లు, బందెల వెంకయ్య, ఆర్.శివలింగం, కమ్మకొమ్మటి నాగేశ్వరరావు, టి.ఝాన్సీ, కె.శ్రీనివాస్, తిమ్మిడి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
జూదం.. స్మార్ట్గా!
● జిల్లాలో జోరుగా సాగుతున్న మట్కా? ● ఆన్లైన్లో ఆట.. చేతులు మారుతున్న రూ.లక్షలు ● మధ్యతరగతి జనాలు, కూలీలే లక్ష్యంఖమ్మంక్రైం: ఒకప్పుడు పేకముక్కలు, చీటీల ఆధారంగా నడిచి మట్కా జూదం అంతమైందని అంతా భావించారు. కానీ చేతికి అందిన సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఆన్లైన్లో ఆట మొదలుకావడం.. ఇందుకు పేద, మధ్యతరగతి జనాలు, కూలీలే ఆకర్షితులు అవుతుండడంతో ఏజెంట్లు అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మం మొదలు పల్లెపట్నం తేడా లేకుండా మట్కా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీ చేయగా రహస్యంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ మట్కా కేంద్రాన్ని గుర్తించారు. చాన్నాళ్లుగా ఆన్లైన్లో ఇది నడుస్తోందని.. చేతిలో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆడే అవకాశం ఉండడంతో కొందరు సులువుగా డబ్బు సంపాదించొచ్చనే ఆశతో పనులు వదులుకుని ఇటు మొగ్గు చూపుతున్నారు. అయితే, సంపాదన మాటేమో కానీ ఉన్న నగదు కాస్త పోగొట్టుకుని చివరకు రోడ్డు పాలవుతున్నారు. చిన్నచిన్న షాపులే అడ్డాగా కొందరు.. లాడ్జీలు, హాటళ్లలో గదులు అద్దెకు తీసుకుని ఇంకొందరు ఏజెంట్లు ల్యాప్టాప్లు, సెల్ఫోన్ల ద్వారా మట్కా జూదం నడిపిస్తున్నట్లు సమాచారం. ముంబై, కళ్యాణి కేంద్రాలుగా.. మట్కా ఆట మహారాష్ట్రలోని ముంబై, కళ్యాణి కేంద్రాలుగా దేశ వ్యాప్తంగా ఏళ్ల తరబడి నడుస్తోంది. అయితే గతంలో కొత్తగూడెం కేంద్రంగా ఏజెంట్లు ఉమ్మడి జిల్లా అంతా నడిపించేవారు. కానీ ఇప్పుడు ఎవరూ క్షేత్రస్థాయిలో కనిపించకుండానే బుకీలుగా ఏర్పడి ఆన్లైన్లో సాగిస్తున్నారు. చివరకు నగదు చెల్లింపులకు సైతం డిజిటల్ పేమెంట్ యాప్లో వాడుతుండడంతో... ఎక్కడైనా హోటళ్లు, లాడ్జీల్లో పట్టుబడినా పోలీసులకు ఆనవాళ్లు దొరకడం లేదని తెలుస్తోంది. పైకి పైసా కానరాకున్నా రహస్యంగా సాగే ఈ ఆటలో నిత్యం రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆన్లైన్లో మట్కా జరుగుతోందనే సమాచారంతో పూర్తిస్థాయిలో దృష్టి సారించాం. దందాను గుర్తించి అరికట్టేందుకు ప్రత్యేక బృందం నిరంతరంగా పనిచేస్తోంది. ఆన్లైన్ మట్కాతో పాటు చీటీల ఆధారంగా నడుస్తుందనే సమాచారం తెలిస్తే డయల్ 100కు తెలియజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెల్లడి కావు. – రమణమూర్తి, ఖమ్మం నగర ఏసీపీ రూపాయి పెడితే రూ.100, రూ.100 పెడితే రూ.వేయి వస్తాయంటూ మట్కా దందాలో ఏజెంట్లు ప్రజలను ఆకర్షిస్తుంటారు. ఇందులో వివిధ పేర్లతో ప్యానళ్లు ఉండగా.. ఒకటి, రెండు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయని సమాచారం. రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రితో పాటు అర్ధరాత్రి కూడా క్లోజింగ్ ప్యానల్ ఉంటుందని చెబుతారు. ప్యానళ్ల వారీగా సింగిల్ డిజిట్లో రూ.11కు 100, డబుల్ డిజిట్లోనైతే రూ.11కు 500, త్రిబుల్ డిజిట్లో రూ.11కు రూ.1,400 గెలుచుకోవచ్చని బుకీలు ఆశ చూపిస్తారు. దీంతో కలిసొస్తే ఒకేరోజు రూ.వేలు మొదలు రూ.లక్షల్లో సంపాదించుకోవచ్చన్న ఆశతో సాధారణ ప్రజలు చాలామంది ఆకర్షితులు అవుతున్నారని తెలుస్తోంది. మధ్య తరగతి జనం, కూలీ పనులు చేసుకునే వారే కాక విద్యార్థులు కూడా ఏజెంట్ల మాయలో పడి ఉన్నదంతా పోగొట్టుకోవడమే కాక అప్పుల పాలవుతున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టకపోవడం వల్లే ఆన్లైన్ మట్కా దందా పెరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా పోలీసులు స్పందించకపోతే జూదం మరింత పెరిగే అవకాశమున్నందున ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లావాసులు కకోరుతున్నారు. -
ఎఫ్బీఓ కుటుంబానికి అండగా ఉంటాం..
కారేపల్లి: ఇటీవల మృతి చెందిన ఎఫ్బీఓ నవీన్ కుటుంబానికి అన్నిరకాలుగా అండగా నిలుస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) వినయ్కుమార్ భరోసా ఇచ్చారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులను తాకడంతో ఇటీవల నవీన్ మృతి చెందిన విషయం విదితమే. ఆయన స్వగ్రామమైన కారేపల్లి మండలం వెంకిట్యాతండాకు సోమవారం వచ్చిన పీసీసీఎఫ్ తొలుత నవీన్ చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. నవీన్ కుటుంబానికి శాఖాపరంగా రూ.35లక్షలు, ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి సాయంతో పాటు ఎంటెక్ చదివిన నవీన్ భార్య ప్రమీలకు ఉద్యోగం, 500 గజాల స్థలం త్వరగా అందేలా చూస్తామని చెప్పారు. విద్యుత్ తీగలు అమర్చి నవీన్ మృతికి కారణమైన వారిపై కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు ప్రయత్నిస్తామని పీసీసీఎఫ్ తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లిప్తత వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చే సమయాన సరఫరా ట్రిప్ అవుతుందని.. దీన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులు గుర్తించే అవకాశముందని పీసీసీఎఫ్ వినయ్కుమార్ అభిప్రాయపడ్డారు. అలా గుర్తించకపోవడం, విద్యుత్ ఉద్యోగుల నిర్లిప్తతతో తప్పిదం జరిగిందన్నారు. ఇకపై తనిఖీలకు వెళ్లే సమయాన ఉద్యోగులు జాగ్రత్తలు పాటించడం, మెటల్ డిక్టేటర్ల వాడకంపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు ఆయుధాలు అందించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని పీపీసీఎఫ్ చెప్పారు. కాగా, పీసీసీఎఫ్తో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ ఫోన్లో మాట్లాడి నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. భద్రాద్రి జోన్ సీసీఎఫ్ బీమానాయక్, ఖమ్మం డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ఎఫ్డీఓ భవానీశంకర్, నవీన్ తల్లిదండ్రులు బూలి – దేవ్లానాయక్, సోదరుడు లెనిన్ ఉన్నారు. డీఎఫ్ఓ కార్యాలయంలో పీసీసీఎఫ్ ఖమ్మంవ్యవసాయం: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆప్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) వినయ్కుమార్ సోమవారం ఖమ్మం జిల్లా అటవీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం నవీన్ కుటుంబాన్ని పరామర్శించాక కొత్తగూడెం వెళ్లారు. మంగళవారం అధికారులతో పీసీసీఎస్ సమావేశమవుతారని తెలిసింది. పరామర్శించిన పీసీసీఎఫ్ వినయ్కుమార్ -
సాగర్ ఆయకట్టులో పంటలను కాపాడాలి
అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల ఖమ్మంఅర్బన్: సాగర్ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోకుండా రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న గోదావరి జలాలను జాగ్రత్తగా వినియోగించి ఆయకట్టు చివరి భూముల వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన కాల్వలు, ఉప కాల్వలను నిరంతరం పరిశీలిస్తూ గండ్లు, లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయించాలని తెలిపారు. ఈనెల 15న అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మోటార్లను ప్రారంభించి రాజీవ్ లింక్ కెనాల్కు గోదావరి జలాలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టు పరిధిలోని ప్రధాన చెరువులకు నీరు చేరుతున్నందున రైతులు కూడా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. గోదావరి జలాల విడుదలకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి రైతుల తరఫున మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. రేక్ పాయింట్కు కాంప్లెక్స్ ఎరువులు చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు సోమవారం ఫ్యాక్ట్ కంపెనీకి చెందిన కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో అమ్మోనియం సల్ఫేట్ 319.250 మెట్రిక్ టన్నులు, 20.20.00.13 ఎరువులు 1.018.200 మె.టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు కేటాయించడమే కాక కొంత బఫర్ స్టాక్గా నిల్వ చేశామని వెల్లడించారు. నీటి గుంతలతో భూగర్భ జలాల రక్షణ చింతకాని: ఎల్నినో ప్రఽభావంతో వర్షాభావ పరిస్థితుల నెలకొన్నందున రైతులు తమ పొలాల్లో నీటి గుంతలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత సూచించారు. మండలంలోని బస్వాపురంలో పలువురు రైతుల పొలాల్లో నీటి గుంతల పనులను సోమవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా పొలాల్లో నీటి గుంతల ఏర్పాటుకు అవకాశముందని తెలిపారు. వీటి ద్వారా భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల నర్సింహారావు, జిల్లా పంచాయతీ అధికారి వినోద్, వివిధ శాఖల అధికారులు శిరీష, శ్రీనివాస్, విజయలక్ష్మీ, చుంచు శ్రీనివాసరావు, కోటయ్య, రఘు, కార్తీక్, రామకృష్ణ, నాయకుడు కన్నెబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. మహాబలిపురం నుంచి నాచారానికి విగ్రహాలు ఏన్కూరు: ఏన్కూరు మండలం నాచారంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి, అమ్మవారి ఏకశిలా విగ్రహాలను ప్రతిష్ఠించున్నారు. ఈమేరకు తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో సిద్ధం చేయించిన విగ్రహాలను ప్రత్యేక వాహనంలో సోమవారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో కోలాట నృత్యాలతో స్వాగతం పలకగా, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, మొగిలి శ్రీనివాసరెడ్డి తదితరులు వారితో పాదం కలిపారు. అనంతరం ఏన్కూరు, రేపల్లెవాడ, నాచారం మీదుగా నాచారం దేవాలయం వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఆలయంలో అన్నదానం ఏర్పాటుచేశారు. -
అతివలే అధికం..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తికావడంతో జిల్లాలో ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈమేరకు మొత్తం 10,85,927 మంది ఉన్నట్లు తేలగా, ‘సర్’కు ముందుతో పోలిస్తే 1,57,854 మంది తగ్గారు. ఇందులో మృతులు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారే కాక ఇతర కారణాలతో ఇంకొందరికి స్థానం దక్కలేదు. కాగా, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఖమ్మం అత్యధిక ఓటర్లతో మొదటి స్థానాన నిలవగా, వైరా నియోజకవర్గం తక్కువ ఓటర్లతో చివరి స్థానంలో ఉంది. 12.43 లక్షల నుంచి 10.85 లక్షలకు.. ‘సర్’ ప్రక్రియలో భాగంగా జిల్లా ఓటర్లు తగ్గారు. తొలుత 12,43,781 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 10,85,927 మందికే స్థానం దక్కడంతో 1,57,854 మంది పేర్లు తొలగించినట్లయింది. వీరిలో అత్యధికంగా 1,01,549 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తేల్చారు. ఇక మృతులు 33,380 మంది ఉండగా, రెండేసి ఓట్లు కలిగిన వారు 11,004 మంది, ఎన్యుమరేషన్ ఫారం తీసుకున్నా తిరిగి ఇవ్వని వారు 11,371 మంది, ఇతర కారణాలతో ఫారాలు అందని 550 మంది పేర్లు తొలగించిన జాబితాలో ఉన్నాయి. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 80,663 ఓట్లు తగ్గగా, ఆ తర్వాత మధిరలో 20,638 ఓట్లు, సత్తుపల్లి నియోజకవర్గంలో 20,244, అలాగే పాలేరులో 19,156, వైరాలో 17,153 ఓట్లు తగ్గాయి. వచ్చేనెల 16 వరకు అభ్యంతరాలు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను వచ్చే నెల 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనుండగా, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడంతో పాటు పరిష్కారానికి అక్టోబర్ 10వరకు గడువు విధించారు. ఇదంతా పూర్తయ్యాక అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. కాగా, ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్లు, ఈఆర్ఓ కార్యాలయాల్లో ప్రదర్శించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటర్ల జాబితా అందిస్తున్నారు. జాబితాలో పేర్లు తొలగిపోవడం, ఏమైనా తప్పులు ఉన్నా, మ్యాపింగ్ కాకున్నా ఎన్యూమరేషన్ ఫారాలకు సంబంధించి నోటీసులు జారీ చేస్తారు. బీఎల్ఓలు, ఈఆర్వోలు వీటిని స్వీకరించి విచారణ చేస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియచేయొచ్చు. ఈ అభ్యంతరాలను పరిష్కరించడమే కాక ముసాయిదా జాబితాలో తప్పులు(అనామలిస్), మ్యాపింగ్ కాని ఎన్యూమరేషన్ ఫారమ్లకు సంబంధించి వ్యక్తులకు నోటీసులు జారీ చేసి సవరణలకు అవకాశం ఇచ్చాం. బీఎల్ఓలు, ఈఆర్వోలకు అభ్యంతరాలు ఇవ్వాలి. జిల్లాలో ఓటర్ల నమోదు, మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాం. – దివాకర టీఎస్, కలెక్టర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా సంఖ్యలో ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 1,29,761 మంది, పాలేరులో 1,17,319, సత్తుపల్లిలో 1,16,253, మధిరలో 1,05,796, వైరాలో 91,844 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తర్వాత తుది జాబితాకు వచ్చేసరికి తక్కువ సంఖ్యలో మాత్రమే ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది. -
అన్నిచోట్లా అంతంతే... 9లో...
నేలకొండపల్లి: కుటుంబ సభ్యులు ఆస్తి అనుభవిస్తూ అన్నం పెట్టకుండా గెంటేశారని ఓ వృద్ధురాలు ప్రజావాణిలో అధికారులకు విన్నవించింది. ఎంపీడీఓ ఎం.యర్రయ్య అధ్యక్షతన ప్రజావాణి జరగగా 16 సమస్యలపై దరఖాస్తులు అందాయి. ఎనిమిదింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. హెల్ప్ డెస్క్, వైద్య శిబిరం, తాగునీటి వసతి కల్పించినా.. వీల్చైర్లు లేక దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. చెన్నారం గ్రామానికి చెందిన వృద్ధురాలు సీతమ్మ తన రెండెకరాల భూమి స్వాధీనం చేసుకుని అన్నం పెట్టకుండా వెళ్లగొట్టారని ఫిర్యాదు చేయగా, కోనాయిగూడెం పాఠశాల హెచ్ఎం దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే, రాజేశ్వరపురం ఆలయ భూముల ఆక్రమణ, దివ్యాంగులకు వాహనాల మంజూరు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. -
అజ్ఞానాన్ని పారదోలే ఆయుధమే విద్య
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుఖమ్మం సహకారనగర్: అజ్ఞానాన్ని పార దోలే ఏకై క ఆయుధం విద్య అని.. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి గురువులు, తల్లిదండ్రులను గౌరవించడాన్ని అలవరుచకోవాలని మహాసహస్ర అవధాని గరికపాటి నరసింహారావు సూచించారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో సోమవారం ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఫోన్లు, టీవీ వంటి వ్యాపకాలు మాని వారంలో రెండో రోజులు డిజిటల్ ఉపవాసం అలవర్చుకోవాలని తెలిపారు. తద్వారా చదువుపై దృష్టి సారించొచ్చని చెప్పారు. అంతేకాక గురువులతో చర్చించడంతో ఎలాంటి ఒత్తిడినైనా జయించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన గరికపాటి వారి సందేహాలు నివృత్తి చేశారు. ఆతర్వాత కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ తమ కళాశాలలో ఉన్నత విద్యాప్రమాణాలు పాటిస్తుండడంతో విద్యార్థులు కోర్సులు పూర్తిచేసే లోగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ జి.ధాత్రి, వైస్ చైర్మన్ శ్రీచైతన్య మాట్లాడగా అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్, ప్రిన్సిపాల్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● అధికారులు ఆలస్యం.. అయినా అధికం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి ఉదయం 10గంటలకు తొమ్మిది శాఖల అధికారులే హాజరయ్యారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, అటవీశాఖ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు సమయపాలన పాటించలేదు. ఇక సాంఘిక సంక్షేమ అధికారులు తొలిరోజు ప్రజావాణికి హాజరేకాకపోవడం గమనార్హం. ప్రజావాణి సందర్భంగా ఎంపీడీఓ హాల్ను అలంకరించారు. ఈమేరకు జిల్లాలో అత్యధికంగా సత్తుపల్లిలో 46దరఖాస్తులు అందగా... ప్రజలకు కుర్చీలు, తాగునీటి సదుపాయం కల్పించారు. అంతేకాక ప్రతీ దరఖాస్తుదారుడితో ఎంపీడీఓ చిన్న నాగేశ్వరరావు మాట్లాడి రశీదులు ఇప్పించడమే కాక లిఖిత పూర్వక సమాధానం పంపిస్తామని వివరించారు. అక్కడికక్కడే దరఖాస్తులనును ఆన్లైన్ చేయించి సంబంధిత శాఖలకు పంపించారు.ఇళ్లపై విద్యుత్ తీగల సమస్య ఉంది. ఎంతోకాలంగా ఈ సమస్య వేధిస్తున్నా జిల్లా కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయాలంటే దూరం కావడంతో వేచిచూశాం. ఇప్పుడు మండల కేంద్రంలోనే ప్రజావాణి మొదలుపెట్టడం సంతోషంగా ఉంది. మా సమస్య త్వరగా పరిష్కారం అయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎం.డీ.షైనా, కొత్తూరు, సత్తుపల్లి మండలం -
ఉపకార వేతనాలు ప్రభుత్వ బాధ్యత
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది దానం కాదని, అది సామాజిక బాధ్యత అని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ అన్నారు. పీడీఎస్యూ ఖమ్మం, భద్రాద్రి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో కార్యాలయాల వైపు వస్తుండడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నాన తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతున్నా విద్యార్థుల ఫీజు బకాయిల సమస్యపై స్పందించకపోవడం గర్హనీయమన్నారు. ఫలితంగా పలువురు చదువులకు స్వస్తి చెపాల్సి వస్తున్నందున పెండింగ్ ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు టి.లక్ష్మణ్, భద్రాద్రి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర వీరభద్రం, మునిగల శివప్రశాంత్, నాయకులు సురేష్, హరిచంద్రప్రసాద్, రఘు, రామ్చరణ్, మురళి, మనోజ్, సుశాంత్, గోపి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పృధ్వీ -
మూడు జిల్లాల మత్స్యకారులకు శిక్షణ
కూసుమంచి: మండలంలోని పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన మత్స్యకారులు, మత్స్య రైతులకు తొలిరోజు బయోప్లాక్ విధానంలో చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకాన్ని వృద్ధి చేసుకోవాలని పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. శాస్త్రవేత్తలు రవీందర్, దివ్య పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. రైస్మిల్లులో విజిలెన్స్ అధికారుల తనిఖీ సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మండలం తాళ్లమడలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి రైస్ మిల్లులో సోమవారం వరంగల్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ తహసీల్దార్ లక్ష్మణ్, ఇన్స్పెక్టర్ రాకేష్ తమ సిబ్బందితో కలిసి ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ప్రత్యక్షంగా ఉన్న నిల్వలు, రికార్డుల్లోని వివరాలను సరిచూసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వారు పేర్కొన్నారు. 20న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపికకు ఈనెల 20వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్–14, 16, 18, 20 కేటగిరీల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణపత్రంతో పాటు ఆధార్ కార్డుతో హాజరుకావాలని, ఇక్కడ ఎంపిక చేసే జట్లు ఈనెల 26, 27వ తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ట్రెయినీ డీటీ బలవన్మరణంమహబూబాబాద్ రూరల్: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసముండే డోలి వెంకటేశ్వర్లు – పద్మ దంపతుల కుమార్తె సంధ్య (28) డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికై ంది. ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందుతూ ఉద్యోగం చేస్తున్న ఆమె సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు లేని సమయాన ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కాసేపయ్యాక వచ్చిన తల్లిదండ్రులకు ఇచ్చిన సమాచారంతో టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే, సంధ్య ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
అసత్య ప్రచారాలు సరికాదు
ఖమ్మంమయూరిసెంటర్: నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాతో పాటు ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని, ఆయన చొరవతోనే నగర అభివృద్ధి సాధ్యమైందని చెందిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులతో కలిసి సోమవారం ఆయన మాట్లాడారు. మంత్రి తుమ్మలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు గర్హనీయమని పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలానికి గోదావరి జలాల సాధన, వ్యవసాయ మార్కెట్ ఆధునీకరణ, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు పనులు తుమ్మల చొరవతోనే సాధ్యమయ్యాయని తెలిపారు. అనంతరం దీపక్చౌదరి మాట్లాడుతూ అజయ్కుమార్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ సమావేశంలో రాయల నాగేశ్వరరావు, బాలాజీనాయక్, మొక్క శేఖర్గౌడ్, దొబ్బల సౌజన్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, గాదే ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ -
నిర్లక్ష్యం వీడకపోతే మూల్యం చెల్లించక తప్పదు
ఖమ్మం సహకారనగర్: పీఆర్సీ అమలు, పెండింగ్లో డీఏలు, బిల్లుల విడుదల, సీపీఎస్ విధానం రద్దు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రారంభించి హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో పీఆర్టీయూ ఆధ్వర్యాన ఖమ్మం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్రావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటుతున్నా ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదన్నారు. నిర్లక్ష్య ధోరణి ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ 1 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్రెడ్డి, సుంకర బిక్షంగౌడ్ మాట్లాడుతూ దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా ఆరు డీఏలు పెండింగ్ పెట్టారని, సమస్యలను పరిష్కరించకపోగా ఉపాధ్యాయుల పట్ల సీఎం చులకనగా, వ్యంగ్యంగా మాట్లాడటం గర్హనీయమన్నారు. ఈపీఆర్టీయూ, అనుబంధ సంఘాల నాయకులు పి.వెంకటరెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సతీష్రెడ్డి, చాగర్లముడి శ్రీధర్, సుబ్బయ్య, వేణు, మోత్కూరి మధు, యలమద్ది వెంకటేశ్వర్లు, ఝాన్సీసౌజన్య, రాము, విజయ్, అమృతకుమార్, ఆర్.బ్రహ్మారెడ్డి, టి.రత్నకుమార్, చిత్తలూరి ప్రసాదరావు, కే.వీ. రమణ, జీ.వీ.రమణ, రాయల నరసింహారావు, చెన్నకేశవరెడ్డి, రెబ్బా శ్రీనివాసరావు, సోమ్లా, రవికుమార్, కొమ్ము శ్రీనివాసరావు, గుడిపూడి శ్రీనివాసరావు, లింగం సతీష్ తదితరులు పాల్గొన్నారు.పీఆర్టీయూ ధర్నాలో ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
● 10గంటలకు ఒకే అధికారి!
మధిర: మధిరలో ప్రజావాణికి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాత్రమే సరిగ్గా ఉదయం 10 గంటలకు హాజరయ్యారు. మిగిలిన శాఖల అధికారులెవరూ ఆ సమయానికి రాలేదు. ఇక 10–30 గంటలకు ఎనిమిది శాఖల అధికారులు హాజరయ్యారు. తహసీల్దార్ రాంబాబు కార్యాలయ పనుల నిమిత్తం ఉండగా, మున్సిపల్ కమిషనర్ తీరిగ్గా 11 గంటలకు వచ్చారు. పలు గ్రామాల విలీనంతో ఏర్పడిన మధిర మున్సిపాలిటీలో సుమారు 40 వేల మంది జనాభా ఉండగా.. ప్రజావాణికి హాజరై సకాలంలో హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిన కమిషనర్ ఆలస్యంగా రావడం గమనార్హం. బాధ్యతాయుతమైన అధికారే ఇలా వ్యవహరిస్తే మిగతా వారి పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకున్నారు. ఇంకొన్ని శాఖల అధికారులు ఒక్కరొక్కరుగా వచ్చినా... కాసేపటికి వెనుతిరగా, మరికొన్ని శాఖల అధికారులు పూర్తిగా గైర్హాజరయ్యారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోనే ఆఫీస్ ఉండే ఎంఈఓ రాకపోగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధీనంలోని విద్యుత్ శాఖ నుంచి ఏ అధికారికి హాజరుకాకపోవడం గమనార్హం. స్వచ్ఛంద సంస్థలకు స్థలాలు కేటాయించాలని ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ వినతిపత్రం ఇవ్వగా, రోడ్ల మరమ్మతు, ఆర్టీసీ బస్సు ఏర్పాటు, వయోవృద్ధులకు డేకేర్ సెంటర్ ఏర్పాటుపై స్థానికులు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు మాధవి క్లినిక్, డాక్టర్ హెల్త్ హోమియోపతి, మిత్ర డయాగ్నస్టిక్ సెంటర్లలో తనిఖీ చేసిన ఆయన వైద్యసేవలు, వైద్యులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫైర్ సేఫ్టీ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఔషధాల నిల్వలపై ఆరా తీశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. కాగా, ఆస్పత్రుల్లో తనిఖీ సందర్భంగా లోపాలపై వివరాలు సమర్పించాలని సూచించారు. యాంటీ బయాటిక్స్ వినియోగంలో జాగ్రత్త యాంటీబయాటిక్స్ను అవసరం ఉన్నప్పుడు, వైద్యుల సూచన మేరకు సరైన మోతాదులో వినియోగించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రామారావు సూచించారు. సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరస్ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు స్వయంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా, అనర్థాలు ఎదురవుతాయని తెలిపారు. వ్యాధి ఎక్కువకాలం కొనసాగడం, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురవడంతో పాటు చికిత్స ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈమేరకు వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడొద్దని, సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. -
పోటీపరీక్షలపై నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న యువతకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ఖమ్మం, కొత్తగూడెంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఇచ్చే ఉచిత శిక్షణ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. 2016లోనే పొంగులేటి చొరవతో అందించిన ఉచిత శిక్షణ ద్వారా పలువురు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈసారి హైదరాబాద్కు చెందిన నిపుణులతో బోధన అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పేరు, ఫోన్ నంబర్, గ్రామం, మండలం, నియోజకవర్గం వివరాలను 89850 95599(ఖమ్మం జిల్లా), 89850 96699(భద్రాద్రి జిల్లా) నంబర్లకు వాట్సప్ ద్వారా పంపించాలని మెండెం కిరణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, నాయకులు బొర్రా రాజశేఖర్, కోసూరి శ్రీను, కొప్పుల అశోక్, బజ్జూరి వెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, వెన్నుపూసల సీతారాములు, బానోత్ కిశోర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మొదటి అడుగే తడబాటు !
● ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజావాణి షురూ..● అంతంత మాత్రంగానే దరఖాస్తులుమండలం అధికారులు ఫిర్యాదులు సత్తుపల్లి 20 46తిరుమలాయపాలెం 29 26కల్లూరు 19 26తల్లాడ 24 25వేంసూరు 18 17ఖమ్మం రూరల్ 29 17కూసుమంచి 19 15మధిర 21 13పెనుబల్లి 19 13ముదిగొండ 20 10కొణిజర్ల 24 09బోనకల్ 25 09కారేపల్లి 17 09నేలకొండపల్లి 25 08వైరా 19 08రఘునాథపాలెం 22 07ఎర్రుపాలెం 18 05కామేపల్లి 17 04చింతకాని 17 03ఏన్కూరు 18 02ఖమ్మం సహకారనగర్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజలకు దూరా భారం తగ్గించేందుకు మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సోమవారం కార్యక్రమం మొదలుకాగా, చాలాచోట్ల దరఖాస్తులు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. జిల్లాలోని 20 మండలాలకు గాను 420మంది అధికారులు హాజరు కాగా.... కేవలం 272 ఫిర్యాదులే అందాయి. అత్యధికంగా సత్తుపల్లిలో 46ఫిర్యాదులు, తిరుమలాయపాలెం, కల్లూరు మండలాల్లో 26 చొప్పున, తల్లాడలో 25 ఫిర్యాదులు అందాయి. ఇక కామేపల్లిలో నాలుగు, చింతకానిలో మూడు, ఏన్కూరు మండలంలో కేవలం రెండు ఫిర్యాదులు అందడం గమనార్హం. అనుమానమా... మండల కేంద్రాల్లో ప్రజావాణిపై అధికారులు పెద్దగా ప్రచారం చేయకపోవడంతో స్పందన కరువైంది. మరోపక్క పలుమార్లు మండల అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నా పరిష్కారం కాక కలెక్టరేట్కు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా కూడా ప్రజలు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. -
షాప్ లేదు.. ఆన్లైన్లో ఉంది!
ముదిగొండ: ఎరువుల బుకింగ్ కోసం ముదిగొండ మండల రైతులు కొందరు యాప్ద్వారా ప్రయత్నించగా వల్లభిలో రామ్సాయి పేరుతో ఎరువుల దుకాణం కనిపించింది. అందులో యూరియా స్టాక్ కూడా ఉండడంతో పలువురు బుక్ చేసుకున్నారు. ఆతర్వాత వల్లభికి వెళ్లేసరికి ఆ పేరుతో షాపే లేదని తేలడంతో అవాక్కవాల్సి వచ్చింది. అనంతరం అధికారులను కలిసేందుకు వెళ్లగా వారు అందుబాటులో లేరని వాపోయారు. ఈ విషయమై ఏఓ సరితను వివరణ కోరగా సర్వర్లో లోపాలు ఉన్నాయని, మధిరలో కూడా ఇదే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిదని పేర్కొన్నారు. ఈమేరకు అందుబాటులో ఉన్న షాపుల్లో బుకింగ్ చేసుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రేపు టీటీడీసీలో జాబ్మేళా ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. ఎల్ఐసీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లు, ఇండూ స్ల్యాండ్లో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్, కీర్తన గోల్డ్ లోన్స్లో లోన్ ఆఫీసర్లు, రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు ఆయా కంపెపనీల బాధ్యులు అర్హులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఎస్సెస్సీ మొదలు డిగ్రీ వరకు విద్యార్హత కలిగి, 18 – 40 ఏళ్ల వయస్సు వారు ఖమ్మం టీటీడీసీలో బుధవారం జరిగే జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. వివరాలకు 81434 20505, 96188 90789, 81067 90700 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి ఖమ్మం సహకారనగర్: ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేర్ని వెంకట్రెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని పెన్షనర్స్ భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెన్షనర్ల ఆరోగ్య పథకం అమలులో లోపాలు సరిచేయడంతో పాటు పీఆర్సీ, డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పంచాయతీరాజ్ టీచర్స్ పెన్షనర్ల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్రెడ్డి, సుంకర భిక్షంగౌడ్, జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్రావు, నాయకులు తాళ్లూరి వేణు, వి.శ్రీనివాసరావు, వెంకటనారాయణ, సుబ్బయ్య పాల్గొన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి విక్రయాలకు బ్రేక్ పలువురు వ్యాపారులకు నోటీసులు ఖమ్మంవ్యవసాయం: మిర్చి కొనుగోళ్లలో ఆర్డీ(రేట్ డిఫరెన్స్) వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో రాష్ట్రంలోని కోల్డ్ స్టోరేజీల్లో క్రయవిక్రయాలు, కార్యకలాపాలను వ్యాపారులు నిలిపివేశారు. మిర్చి కొనుగోళ్ల సమయాన వ్యాపారులు ధరలు తగ్గించి నమోదు చేస్తూ మార్కెట్లు, ప్రభుత్వానికి పన్ను తక్కువగా చెల్లిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఖమ్మం మార్కెట్లో నియంత్రించడంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేయగా ప్రభుత్వ ఆదేశాలతో కోల్డ్స్టోరేజీల్లో తనిఖీ చేపట్టారు. అక్రమాలు తేలడంతో ప్రభుత్వానికి ఇవ్వగా చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో కోల్డ్ స్టోరేజీలను మూసివేశారు. ఫలితంగా తనిఖీకి వెళ్లినఅధికారులకు నిరాశ ఎదురవుతోంది. మరోపక్క ఖమ్మం జిల్లాలోని పలు మార్కెట్ల పరిధి కోల్డ్ స్టోరేజీల్లో లైసెన్సు లేని వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు చేసినట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. ఈమేరకు వైరా మార్కెట్ పరిధిలోని ఆరుగురికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పుష్కరాల పనుల్లో వేగంసూపర్బజార్(కొత్తగూడెం): గోదావరి పుష్కరాల పనుల్లో వేగం పెంచాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుష్కరాల సన్నద్ధ తపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించా లని చెప్పారు. అలాగే, భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు వేగంగా చేపడుతూ డిసెంబర్ నాటికి ఉత్తర ద్వార దర్శనం పనులు పూర్తి చేయాలని సూచించారు. భద్రాద్రి కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. -
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్ సూచించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఆయన అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులపైనే ఆశలు.. మండల కేంద్రాల్లో సోమవారం ప్రజావాణి మొదలైనా కలెక్టరేట్లో రద్దీ మాత్రం తగ్గలేదు. మండలాల్లో సమస్యల పరిష్కారంపై నమ్మకం లేకపోగా, నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే త్వరగా పరిష్కరిస్తారనే భావనతో వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీల ప్రతినిధులతో సమావేశం ఓటర్ల ముసాయిదా జాబితా ఆధారంగా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ దివాకర తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సోమవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో 10,85,927 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల చేయగా, ఇందులో అనామలిస్ ఓటర్లు, మ్యాపింగ్ కాని వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు జిల్లావాసులు పోలింగ్ బూత్ల్లో జాబితాలు కానీ, ఆన్లైన్లో కానీ పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలియచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, 2026 అక్టోబరు 1 నాటికి 18ఏళ్లు నిండే వారు ఫారమ్–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎస్డీసీ సదానందం, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ పాల్గొన్నారు. తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు జిల్లాలో ఎక్కడి తాగునీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ దివాకర తెలిపారు. పాలేరు జలాశయంలో ప్రస్తుతం 17.3 అడుగుల నీటిమట్టం ఉండగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల తాగునీటి అవసరాలకు సుమారు 60 రోజుల పాటు సరిపోతుందని పేర్కొన్నారు. వైరా జలాశయంలో 16.8 అడుగుల నీటిమట్టం ఉండడంతో వైరా, మధిర నియోజకవర్గాలకు 135 రోజుల పాటు సరఫరా చేయొచ్చని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యాన తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండగా, రానున్న రోజుల్లో వర్షపాతం, ప్రాజెక్టులకు వచ్చే వరద ఆధారంగా సాగునీటిని విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఆయనో ప్రకటనలో వెల్లడించారు.‘గ్రీవెన్స్ డే’లో కలెక్టర్ దివాకర -
నేటి నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి
● కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఖమ్మం సహకారనగర్: ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ఈ సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. మండల కేంద్రాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయా మండలాల ప్రజలు తమ సమస్యలపై వినతులు, దరఖాస్తులను అక్కడే అధికారులకు అందించాలని సూచించారు. ఈమేరకు దరఖాస్తులను అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. 22న బాల్బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక కల్లూరు రూరల్: ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 22న నిర్వహించనున్నారు. కల్లూరులోని ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో జరిగే పోటీలకు 1–10–2011 తర్వాత జన్మించిన వారు హాజరుకావొచ్చని బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు వేజేల సురేష్, ఉన్నం నాగేశ్వరరావు తెలిపారు. బాలబాలికలు స్టడీ సర్టిఫికెట్ లేక పుట్టిన తేదీ సర్టిఫికెట్తో పాటు ఆధార్కార్డు జిరాక్స్తో హాజరుకావాలని సూచించారు. కడవెండికి ‘వందేభారత్ జాతీయ సమైక్యత’ అవార్డు ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంకు చెందిన ఎకో క్లబ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కడవెండి వేణుగోపాల్కు ‘వందేభారత్ జాతీయ సమైక్యత అవార్డు’ దక్కింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, ఆనందలహరి, వందేభారత్ సినిమా డైరెక్టర్ మల్లం రమేష్ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఆయనకు అవార్డు అందించి సత్కరించారు. దేశ సమగ్రత, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ను పలువురు అభినందించారు. -
కమ్యూనిస్టులంతా ఒక్కటై ఆలోచించాలి
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన వారంతా విభేదాలను పక్కనపెట్టి ఒకతాటిపైకి వచ్చేందుకు ఆలోచించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ప్రజల సమస్యల దృష్ట్యా రానున్న కాలమంతా కమ్యూనిస్టులుదేనని తెలిపారు. విప్లవోద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసిన రాయల చంద్రశేఖర్ జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులపై ఆయన సతీమణి విమల రచించిన ‘ఒక విప్లవ ప్రేమికుడు – కామ్రేడ్ రాయల చంద్రశేఖర్’పేరిట పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకుల సమక్షాన కూనంనేని ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన ఎందరో పెద్ద పదవుల్లో ఉన్నారని తెలిపారు. అనంతరం ఐఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పి.ప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రశేఖర్ ఏడు ప్రాంతాల్లో తిరుగుతూ విప్లవోద్యమంలో పనిచేయగా, ఆయన ఉద్యమ జీవితంలోని వివిధ దశలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఆతర్వాత సతీష్ చందర్ మాట్లాడుతూ.. దాదాపు 50ఏళ్లు విప్లవోద్యమ జీవితాన్ని కొనసాగించిన రాయల ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇంకా పలువురు మాట్లాడుతూ విమల రచించిన పుస్తకం విప్లవ పార్టీలన్నింటినీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాయల విమల, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఏకేఎంఎస్ జాతీయ నాయకుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడగా, మధు, ఎస్పాల్, సృజన, అజయ్, సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఐఎఫ్టీయూ జాతీయ నాయకుడు సాదినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గురుకులంలో గ్యాంగ్వార్..
● ఆటలో ఓడిపోయామని ఇంటర్ విద్యార్థుల ఆగ్రహం ● ఎస్సెస్సీ విద్యార్థులపై దాడి, అడ్డొచ్చిన ఉపాధ్యాయుడికీ గాయాలు కారేపల్లి: కారేపల్లి మండలం గాంధీనగర్లోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల విద్యాలయం, కళాశాలలో శనివారం రాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని క్రీడాపోటీల్లో ఎస్సెస్సీ విద్యార్థులు ఓడిపోగా వారిని ఇంటర్ విద్యార్థులు గేలిచేశారు. మరికొన్ని పోటీల్లో ఎస్సెస్సీ విద్యార్థులు గెలవడాన్ని జీర్ణించుకోలేక ఇంటర్ విద్యార్థులు దాడికి తెగబడ్డారు. భయంతో పదో తరగతి విద్యార్థులు పరుగులు తీసినా వదలకుండా దాడి చేయడంతో 15మంది గాయపడగా, అడొచ్చిన నైట్డ్యూటీ ఉపాధ్యాయుడు గౌష్పాషా, వాచ్మెన్ శ్రీనును నెట్టేయడంతో గౌస్పాషా చేతికి గాయమైంది. ఆటల పోటీలతో గొడవ.. పంద్రాగస్టు సందర్భంగా గురుకులం విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో పోటీలు నిర్వహించారు. వాలీబాల్, ఖో–ఖో పోటీల్లో ఇంటర్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. దీంతో ఎస్సెస్సీ విద్యార్థులపై వారు ఈవ్టీజింగ్కు పాల్పడ్డారు. ‘మీరు ఓడిపోయారు, గాజులు వేసుకోండి రా.. చీరలు కట్టుకోండి రా.. మీరంతా ఆడంగి వాళ్లు’అంటూ ర్యాగింగ్ చేశారు. ఆపై కబడ్డీ పోటీల్లో మాత్రం ఎస్సెస్సీ జట్టు గెలవడంతో ఇంటర్ విద్యార్థుల ముందే వారు వేడుక చేసుకున్నారు. ఈక్రమాన కొందరు విద్యార్థులు గతంలో ఇంటర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో పదో తరగతి విద్యార్థుల చేతులో ఓడిపోవడాన్ని అవమానకరంగా భావిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిశాక శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థులు ఎస్సెస్సీ విద్యార్థుల హాస్టల్ రూమ్లోకి వెళ్లి ర్యాగింగ్కు పాల్పడ్డారు. అంతేకాక విచక్షణా రహితంగా దాడి చేయడంతో భరత్నాయక్, సందీప్, హర్షవర్ధన్, దిలీప్, విజయ్, మోహన్దాస్, అన్వేష్, బాజి, జంపన్న, లక్ష్మీనరసింహా, దేవేందర్ తదితరులకు గాయాలయ్యాయి. దెబ్బలకు తాళలేక పరుగులు.. దెబ్బలకు తాళలేక పదో తరగతి విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వచ్చి సమీపంలోని గుట్టపైకి, రైల్వే స్టేషన్ వైపు, సమీప బస్వాపురం వైపు పరుగులు తీశారు. రాత్రంతా అక్కడే బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. ఈక్రమాన విద్యార్థులు అరుపులు విన్న బస్వాపురం గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకోగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులు పరారయ్యారు. కాగా, ఘర్షణ విషయం తెలియగానే పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం ఉదయం గురకులాలనికి చేరుకుని పిల్లల శరీరంపై గాయాలు చూస్తూ రోదించారు. ‘మేము ఈ స్కూల్లో చదవలేం. ఇక్కడే ఉంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు చంపేస్తారు.. మా సార్లను కూడా కొట్టుతున్నారు’అంటూ విద్యార్థులు రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. దీంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ విషయం తెలిసి కారేపల్లి ఎస్ఐ బి.గోపి, సిబ్బంది చేరుకుని తల్లిదండ్రులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసుస్టేషన్కు వెళ్లగా ఉన్నతాధికారుల సూచనలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పి పంపించారు. -
అనుమతి పత్రాల ట్యాంపరింగ్
● నల్లతుమ్మ స్థానంలో సండ్ర కలప తరలింపు ● ఇద్దరిని అరెస్ట్ చేసిన ఖమ్మం సీసీఎస్ పోలీసులుఖమ్మంక్రైం: కలప తరలింపు కోసం అటవీ శాఖ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని ఖమ్మం సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ తెలిపారు. గతేడాది డిసెంబర్లో ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ నుంచి అందిన ఫిర్యాదుతో ఏసీపీ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ గౌడ్ నేతృత్వాన దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. ఈమేరకు ఏసీపీ ఆదివారం వెల్లడించిన వివరాలు.. తుమ్మ స్థానంలో సండ్ర నల్ల తుమ్మ కర్ర సరఫరా పేరిట అటవీ అధికారులు అనుమతి పత్రాలు జారీ చేశారు. ఈక్రమాన సూర్యాపేట జిల్లా మోతె మండలం గోప్యాతండాకు చెందిన కర్ర వ్యాపారి కొర్ర శివ నేతృత్వాన మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లి, కురవి, సీరోలు, కాంపెల్లి, మహబూబాబాద్ ప్రాంతాల్లో సండ్ర చెట్లను నరికించారు. ఆపై నల్ల తుమ్మ పేరుతో జారీ అయిన అనుమతి పత్రాలపై సండ్ర కర్రగా మార్చారు. ఈ పత్రాల ఆధారంగా కలపను విజయవాడకు చెందిన రాధేశ్యామ్కు విక్రయించాడు. ఆయన మధ్యప్రదేశ్లోని జాబువా పట్టణం ఏఎం ఎంటర్ప్రైజెస్ యజమాని అబ్దుల్ రహేమాన్కు సరఫరా చేసినట్లు తెలిసింది. సండ్ర కర్రను మధ్యప్రదేశ్లోని పాన్ మసాలా తయారీలో వాడుతుండడంతో సుమారు తొమ్మిది లారీల కర్రను సరఫరా చేశాడని గుర్తించారు. ఈమేరకు శివ, రాధేశ్యామ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా.. ఇందులో శివపై నిందితుల్లో గతంలోనూ వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో కేసులు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. అయితే, కేసు విచారణ కొనసాగుతుండగా, ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేస్తామని తెలిపారు. కాగా, కేసులో విచారణలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ సర్వర్, ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ గౌడ్, ఎస్ఐ ఎ.వంశీకృష్ణ, సిబ్బంది శ్రీనివాస్, హరి, జానీ, నరింహారావు, సుధీర్, సతీష్, సుందర్, శ్రీధర్ సిబ్బందిని సీపీ సునీల్దత్ అభిందించారు. -
కాంగ్రెస్వి మోసపూరిత ప్రకటనలు..
● అరాచకాలను ప్రోత్సహిస్తున్న ఖమ్మం నేతలు ● బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మంఅర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం నగరం, నియోజకవర్గం అభివృద్ధి చెందగా.. ఆ పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిన్నారని పేర్కొన్నారు. ఖమ్మంలో గోపాలపురంలో ఆదివారం జరిగిన పార్టీ బీఎల్ఏల సమావేశంలో పువ్వాడ మాట్లాడారు. ఖమ్మం కొత్త బస్టాండ్, గోళ్లపాడు చానల్ బీఆర్ఎస్ హయాంలో జరగగా, మున్నేరుపై తీగల వంతెన, రిటైనింగ్ వాల్, ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు అప్పుడే శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆతర్వాత కాంగ్రెస్ అధికారంలోకి చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా, కేంద్ర ప్రభుత్వం నిర్మించిన దేవరపల్లి – ఖమ్మం హైవేను మంత్రి తుమ్మల తన ఘనతకు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాక ఖమ్మం నియోజకవర్గంలో అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనను విమర్శించిన వారు ఇప్పుడు మంత్రి, ఆయన కుమారుడి పక్కన ఉంటూ ఇసుక, మట్టి, భూముల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కాగా, నాలుగు దశాబ్దాలుగా అనుబంధం కలిగిన ఖమ్మం నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని.. ఈ విషయంలో అసత్య ప్రచారాలను నమ్మొద్దని పువ్వాడ కోరారు. ఇక ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పార్టీ బీఎల్ఏలు, నాయకులు క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేశారని తెలిపారు. అయితే, ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను చివరి వరకు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డీసీసీబీ, సుడా మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, ఆంధ్రాబ్యాంక్ కర్షకసేవా సంఘం చైర్మన్ భీరెడ్డి నాగచంద్రరెడ్డితో పాటు నాయకులు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, దండా జ్యోతిరెడ్డి, బిక్కసాని జస్వంత్, బత్తుల మురళి దేవభక్తిని కిషోర్, వాంకుడోత్ సురేష్, కందాల వీరేందర్గౌడ్, వల్లభనేని రామారావు, షకీనా, గాదె అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెవెలుగు పండగ..
ఖమ్మంమయూరిసెంటర్: కరోనా కాలంలో నిలిపివేసిన పల్లె వెలుగు బస్సు సర్వీసులు మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఖమ్మం రీజియన్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ రవాణా పునరుద్ధరిస్తుండడంతో ప్రజల్ల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బస్సు సౌకర్యం లేక ఇన్నాళ్లు ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు పడరాని పాట్లు పడ్డారు. మహాలక్ష్మి పథకానికి దూరం కాగా, అత్యవసర పనుల కోసం ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. దీంతో గ్రామస్తుల నుంచి వచ్చే వినతులకు తోడు ప్రజాప్రతినిధులు చొరవతో ఆర్టీసీ అధికారులు సర్వీసులను పునఃప్రారంభించడమే కాక కొత్త రూట్లలో బస్సుల ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. 14 సర్వీసులు ప్రారంభం ఉమ్మడి జిల్లాలో ప్రయాణికుల రద్దీ, అవసరాలను దృష్ట్యా కొద్దినెలలుగా 14 బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ సిఫారసులతో ఇల్లెందు, మధిర, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి డిపోల నుంచి ఈ బస్సులను ప్రారంభమయ్యాయి. ఫలితంగా ఇన్నాళ్లు అష్టకష్టాలు పడ్డ ప్రజలు ఆర్టీసీ వైపే మొగ్గు చూపుతుండడంతో పల్లెవెలుగు బస్సులు కళకళలాడుతున్నాయి.రీజియన్లో బస్సు సౌకర్యం లేని గ్రామాలకు సర్వీసుల కోసం ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు అందుతున్నాయి. ఈ లేఖలతో పాటు ప్రజల వినతులను పరిగణనలోకి తీసుకొని రూట్ సర్వేలు చేస్తున్నాం. ఏ డిపో నుంచి ఏ రూట్లో నడిపితే ఎక్కువ మందికి లాభం ఉంటుందో పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 14 రూట్లలో బస్సులు ప్రారంభించాం. – ఏ.సరిరామ్, ఆర్టీసీ ఆర్ఎం, ఖమ్మం రీజినల్ఇటీవల కల్లూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎర్రబోయినపల్లికి చెందిన రెండో తరగతి విద్యార్థి నల్లగట్ల క్రిశాంక్ వచ్చి తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని విన్నవించాడు. దీంతో మంత్రి సూచనల మేరకు సర్వే చేపట్టిన ఆర్టీసీ అధికారులు మధిర నుంచి కల్లూరుకు ఉన్న బస్సును పంద్రాగస్టు సందర్భంగా చెన్నూరు, ఎర్రబోయినపల్లి(కొత్త), లింగాల మీదుగా నడిపించడం మొదలుపెట్టారు.ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి కరోనాకు పూర్వం బస్సు ఉండేది. కరోనా సమయాన రద్దు చేయడంతో ఆ గ్రామంతో పాటు చిరుమర్రి, సువర్ణాపురం, లక్ష్మీపురం, ముదిగొండ నుంచి ఖమ్మం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తుల వినతులు, డిప్యూటీ సీఎం భట్టి సూచనలతో రెండు నెలల క్రితం పమ్మికి బస్సు ఏర్పాటైంది. రోజుకు మూడు ట్రిప్పులు నడుస్తున్న బస్సులో 80 శాతానికి పైగా ఓఆర్ నమోవుతుండగా, సీజన్లో రద్దీ మరింత పెరగనుంది. -
ఈ ఏడాది ఏర్పాటు చేసిన నూతన సర్వీసులు
డిపో రూట్ ఇల్లెందు ఇల్లెందు – ములుగు – హన్మకొండ – భూపాలపల్లి ఇల్లెందు ఇల్లెందు – మహబూబాబాద్ మధిర మధిర – విజయవాడ (వయా ఎర్రుపాలెం, జమలాపురం, రెమిడిచర్ల) మధిర మధిర – జమలాపురం మధిర మధిర – కలకోట – బయ్యారం – బోనకల్ – కలకోట – రాయనపేట – ఆళ్లపాడు – బోనకల్ – ఖమ్మం ఖమ్మం ఖమ్మం – నాగులవంచ – గార్లపాడు రావినూతల – బోనకల్ ఖమ్మం పందిళ్లపల్లి – మత్కేపల్లి – వల్లాపురం – గంధసిరి ఖమ్మం ఖమ్మం – చిన్నమండవ ఖమ్మం ఖమ్మం – పెద్ద మండవ ఖమ్మం ఖమ్మం – పమ్మి ఖమ్మం ఖమ్మం – ముదిగొండ – మేడేపల్లి – రాజేశ్వరపురం సత్తుపల్లి సత్తుపల్లి – అంకపాలెం – వయా బాలరాజుగూడెం, జగ్గారం కొత్తగూడెం అశ్వారావుపేట – తిరుమలకుంతల వయా పాల్వంచ సత్తుపల్లి సత్తుపల్లి – భద్రాచలం వయా ములకలపల్లి, వెంకటాపురం, బూర్గంపాడు -
నిధుల దారి మళ్లింపును అరికట్టాలి
ఖమ్మంమయూరిసెంటర్: భవన, ఇతర నిర్మాణ కార్మికులు చెమటోడ్చి సేకరించిన సెస్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించడాన్ని తక్షణమే అరికట్టాలని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం(టీయూసీఐ) రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పేరబోయిన వెంకన్న ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎస్సీ మెడికల్ టెస్ట్లు, ప్రైవేట్ బీమా పేరుతో కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏటీసీ(ఐటీఐ) పరిధిలోని 65 కాలేజీలకు కార్మికుల సెస్ నుంచి రూ.667 కోట్లు కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇందులో చదివే విద్యార్థులకు సాధారణ బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వాలే తప్ప సెస్ ఎలా వాడతారని ప్రశ్నించారు. అలాగే, 60ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.9 వేల పింఛన్, సహజ మరణానికి ఇచ్చే పరిహారం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు, ప్రసూతి (డెలివరీ), వివాహ ప్రయోజనాన్ని రూ.లక్షకు పెంచాలన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డోనోజి లక్ష్మయ్య, ముద్దాం శ్రీనివాసులు, గాదె లక్ష్మీనారాయణ, బండి రవి, గోస్ పుల్లయ్య, శీలం లెనిన్, గొడుగు విజయ్, కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కీళ్లు అంతే.. కళ్లూ అంతే...
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మోకీలు శస్త్రచికిత్సలు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. దీంతో పెద్దాస్పత్రిపై నమ్మకంతో వచ్చేవారికి నిరాశ ఎదురవుతుండగా.. అత్యవసర పరిస్థితి ఉన్న వారు హైదరాబాద్కు వెళ్లడమో, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించడమో జరుగుతోంది. జనరల్ ఆస్పత్రికి నిత్యం 1,200 – 1,500 మంది వైద్యసేవల కోసం వస్తుంటారు. సీజనల్ సమయాన ఈ సంఖ్య 2వేలకు పైగా నమోదవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాక మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి సైతం ఇక్కడకు వస్తుంటారు. 2022 నుంచి ఆపరేషన్లు మోకాళ్ల మధ్య గుజ్జు అరగడంతో అక్కడి ఎముకలు రాపిడికి గురై విపరీతమైన నొప్పి ఎదురవుతుంది. ఇలాంటి వారికి మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో అరిగిన భాగం వద్ద కొత్త జాయింట్లు వేస్తారు. తద్వారా మళ్లీ రెండు బొక్కల మధ్య ఖాళీ ఏర్పడి సులువుగా నడవడానికి వీలు ఏర్పడి నొప్పి ఎదురుకాదు. ఈమేరకు పెద్దాస్పత్రిలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను 2022 ఆగస్టులో ప్రారంభించారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పుడు చికిత్సలు మొదలుపెట్టగా కొన్నాళ్లకు నిధుల లేమితో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఆస్పత్రి ఆ పరిధిలోకి వెళ్లాక ఎన్ఎంసీ నిబంధల ప్రకారం మోకీలు శస్త్రచికిత్సలు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఓ ఏజెన్సీ ద్వారా ఇంప్లాంట్స్ సరఫరా చేయడంతో 20 మందికి శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. ఆతర్వాత ఏజెన్సీకి బకాయిలు పేరుకుపోవడం, ఆరోగ్యశ్రీ నుంచి నిధులు రాకపోవడంతో ఇంప్లాంట్స్ సరఫరా నిలిచిపోయి శస్త్రచికిత్సలకు గత ఏడాది జూలై నుంచి బ్రేక్ పడింది. రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూపులు పెద్దాస్పత్రి ఆర్థోపెడిక్ విభాగంలో ప్రతీరోజు 150 – 200 వరకు ఓపీ నమోదవుతుంది. ఇందులో పలువురికి మోకీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమైనా, సేవలు నిలిచిపోయాయని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. గత ఏడాదిగా ఆరోగ్యశ్రీ ద్వారా 60 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎదురుచూస్తున్నారు. ఇంకొందరు వేచిచూసే పరిస్ధితి లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు భారం భరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు జరిగిప్పుడు రూ.70వేలకు ఆస్పత్రికి అందేవి. అయితే, ఇంప్లాట్స్ కోసం రూ.90వేలు అవసరం కావడంతో మిగతా రూ.20వేలు ఆస్పత్రి నిధుల నుంచి వెచ్చించేవారు. ఈక్రమాన చేసిన ఆపరేషన్లకే ఆరోగ్యశ్రీ నుంచి నిధులు రాకపోవడంతో పాటు ఆస్పత్రి నిధుల కొరతతో ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి.జిల్లా జనరల్ ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు నిధుల కొరత వల్ల మోకీలు ఆపరేషన్లు నిర్వహించలేకపోతున్నాం. గతంలో ఇంప్లాంట్లు సమకూర్చిన ఏజెన్సీకి ఇంకా బకాయి ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించాము. నిధులు విడుదలైతే తిరిగి ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – ఎం.నరేందర్, మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా జనరల్ ఆస్పత్రిజనరల్ ఆస్పత్రిలో ఆఫ్తాల్మిక్(కంటి) విభాగంపై పట్టింపు కరువైంది. గతంలో మాదిరి శస్త్రచికిత్సలు జరగక జనానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో రెటీనా పరీక్షలు జరగగా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆస్పత్రిలో జనరల్ సర్జరీల తర్వాత ఎక్కువ శస్త్రచికిత్సలు కంటి విభాగంలోనే జరుగుతాయి. ఇందుకోసం ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ ఉండడంతో నిత్యం 12 – 15 వరకు శస్త్రచికిత్సలు జరిగేవి. కానీ ప్రస్తుతం 5 – 6 రెటీనా ఆపరేషన్లు నిర్వహించడమే గగనమవుతోంది. కొందరు వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తెలుస్తుండగా.. పేద ప్రజలు వేచిఉండలేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. పెద్దాస్పత్రి ఓపీలో వైద్యులు ఉదయం 8–30 గంటలకల్లా ఉండాలి. కానీ ఏ విభాగంలోనూ ఆ పరిస్థితి లేకపోగా కొందరు తాపీగా నచ్చిన సమయంలో వచ్చి ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదు. కంటి విభాగంలో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు ఉండగా.. పనులన్నీ ఎక్కువగా సీనియర్ రెసిడెంట్లతోనే నెట్టుకొస్తున్నారు. అంతేకాక ఓపీలో వైద్యులు ఎక్కువ సేపు ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా శస్త్రచికిత్సలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకో ముగ్గురు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడంతో అటు శస్త్రచికిత్సలపై ప్రభావం పడుతుండగా సదరం శిబిరాల్లో వైకల్య పరీక్షలకూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. -
కలప తరలిపోతోంది..
● సామిల్లులే అడ్డాగా దందా ● స్మగ్లర్లతో వ్యాపారుల లోపాయికారీ ఒప్పందాలు ● సమాచారం ఉన్నా నిలువరించలేని స్థితిలో అటవీ శాఖ ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో అక్రమ కలప దందా యథేచ్ఛగా సాగుతోంది. సా మిల్లులే దందాకు అడ్డాలుగా మారడం.. వ్యాపారుల అండదండలతో స్మగ్ల ర్లు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. అడవులు, బీడు భూములు, వ్యవసాయ భూముల్లోని వేప, తుమ్మ, దిరిశె వంటి జాతుల కలపను అనుమతి లేకుండానే రవాణా చేస్తున్నారు. కలప రవాణాకు ఎన్ఓసీ(నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్)తో పాటు పర్మిట్ ఉండాలి. ఈ సమయాన కలప ఆధారంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అనుమతులు తీసుకోకుండా, చార్జీల చెల్లించకుండా చెట్లను నరికి దుంగలుగా మార్చి అక్రమమార్గంలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. మొదటి మిల్లు.. ఆపై బయటకు.. కలప దందాకు స్మగ్లర్లు సా మిల్లులను అడ్డాలుగా మార్చుకుంటున్నారని తెలిసింది. అడవులు, బీడు భూములు, రైతుల భూముల్లోని వేప, తుమ్మ, దిరిశె వంటి చెట్లను నరికి పర్మిట్లు, ఎన్ఓసీ లేకుండా దొడ్డిదారిన మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో 250 వరకు సా మిల్లులు ఉండగా, ఖమ్మం నగర పరిసరాల్లోనే వందకు పైగా ఉంటాయి. తొలుత కలపను స్మగ్లర్లు మిల్లులకు చేర్చాక కలప రూపురేఖలు మార్చేస్తున్నారు. ఆపై మిల్లుల్లో అప్పటికే పర్మిట్ ఉన్న కలపలో కలిపేసి గృహ నిర్మాణాలు, ఇతర అవసరాలకు విక్రయిస్తున్నారు. ఈ తంతు కొత్తదేమీ కాకున్నా అధికారుల పట్టింపు లేనితనంతో నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు అవగాహన సా మిల్లుల యాజమాన్యాలు, కలప వ్యాపారుల సహకారంతోనే స్మగ్లర్లు అక్రమ రవాణాకు తెగబడుతున్నారని సమాచారం. వ్యాపారులు ముందే స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని కలప తరలింపునకు వాహనాలు సైతం సమకూరుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈమేకు కలపను సా మిల్లులకు తీసుకురాగానే రూపురేఖలు మార్చేసి అమ్మాక ఆ కలప డిమాండ్, ధర ఆధారంగా వాటాలు పంచుకుంటారు. ఈక్రమాన ఆయా ప్రాంతాల్లో పనిచేసే అటవీ శాఖ ఉద్యోగులకు ఎంతో కొంత ముట్టచెప్పి తమ జోలికి రాకుండా చూసుకుంటున్నారని సమాచారం.నల్లతుమ్మకు బదులు ‘సండ్ర’ తరలించిన ఇద్దరి అరెస్ట్8లో... -
టీచర్లకూ పాఠాలు !
ఖమ్మంసహకారనగర్: మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాల్లోనూ మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అంతేకాక ప్రైవేట్ స్కూళ్ల నుంచి పోటీ తట్టుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ బోధన అమలు చేస్తున్నారు. ఈనేపథ్యాన విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా ఉపాధ్యాయులకు ఏటా పది రోజుల పాటు విద్యాశాఖ శిక్షణ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా రాష్ట్ర, జిల్లాస్థాయితో పాటు మండల స్థాయిలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది. బోధన పద్ధతులపై.. తొలి దశలో జిల్లా నుంచి ఎంపిక చేసిన నలుగురు రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)కు వృత్యంతర శిక్షణ హైదరాబాద్లో అందించారు. వీరు జిల్లా స్థాయిలో ఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆర్పీలు మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాల్లో బోధనా పద్ధతులపై అవగాహన కల్పించారు. మారుతున్న బోధన విధానం, విద్యార్థుల స్థాయి ఆధారంగా బోధన అభ్యసన ప్రక్రియలు, ప్రణాళికల రూపకల్పన, టీచింగ్ డైరీలు రాయడం, సబ్జెక్టు వారీగా అభ్యసన ఫలితాలు మెరుగుపర్చడం తదితర అంశాలపై ఈ శిక్షణ కొనసాగింది. అన్ని స్థాయిల్లో.. జిల్లాలో సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకే కాక స్పెషల్ ఎడ్యుకేటర్లు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, ఉర్దూ టీచర్లకు సైతం శిక్షణ పూర్తయింది. ఆపై ఖమ్మం డైట్లో ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలకు కూడా శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డైట్ సమీపంలోని టేకులపల్లి గురుకులంలో ఏడు రోజుల వృత్యంతర శిక్షణ ఇవ్వగా, ఇతర వేదికల్లో మిగతా ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగించారు.ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. మారుతున్న పద్ధతులపై టీచర్లకు అవగాహన ఏర్పడి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడం ద్వారా ఫలితాలు మెరుగ్గా వస్తాయి. – పెసర ప్రభాకర్రెడ్డి, విద్యాశాఖ ఏఎంఓఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. జిల్లాస్థాయిలో 13 కేటగిరీల్లో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్య శిక్షణ పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యాన వృత్యంతర శిక్షణ కొనసాగింది. – సదానందం, జిల్లా విద్యాశాఖాధికారిబోధనలో మెళకువలపై శిక్షణ వృత్యంతర శిక్షణ ప్రయోజనకరంగా ఉంది. ప్రతీ విద్యార్థిని అసెస్ చేయడం ద్వారా అభ్యసన సామరా్థ్య్లను గుర్తించి బోధనలో మార్పు చేసుకోవచ్చు. తద్వారా తరగతి గదిలోని విద్యార్థులంతా ప్రగతి సాధించే అవకాశముంటుంది. – దుగ్గిరాల శోభన, గణితం, జెడ్పీహెచ్ఎస్, తిరుమలాయపాలెం -
ఇక ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజావాణి
● జిల్లా కేంద్రానికి వెళ్లే బాధలు తప్పినట్టే.. ● హెల్ప్డెస్క్ల ఏర్పాటు, వసతుల కల్పన ● దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసేలా సిబ్బందికి శిక్షణ నేలకొండపల్లి: ప్రజలు తమ సమస్యల పరిష్కారం, పథకాల కోసం వినతిపత్రాలు ఇచ్చేందుకు ఇన్నాళ్లు కలెక్టరేట్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల్లో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వాల్సి వచ్చేది. ఈ కారణంగా కొన్ని మండలాల వారికి దూరాభారం కావడం, దివ్యాంగులు, ఇతర సమస్యలతో బాదపడే వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్ల నుంచి మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి జరుగుతున్నా అన్ని శాఖల అధికారులు రాకపోవడం, ప్రజల సమస్యలపై స్పందన లేకపోవడంతో మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఇకపై ప్రతీ సోమవారం మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహణకు నిర్ణయించింది. ప్రతీ సోమవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు ప్రజావాణి జరగనుండగా, అందే ప్రతీ దరఖాస్తును పోర్టల్లో నమోదు చేసి పరిశీలన, పరిష్కారంపై జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమం గత వారమో మొదలుకావాల్సి ఉన్నా సెలవు రావడంతో రేపటి నుంచి ప్రారంభించనున్నారు. నోడల్ అధికారులుగా ఎంపీడీఓలు మండల స్థాయిలో జరిగే ప్రజావాణికి నోడల్ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరిస్తారు. ఎంపీడీఓలే మండల స్థాయిలో అన్ని శాఖల శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ప్రజావాణి నిర్వహించాలి. తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, పశు సంవర్ధక శాఖ అధికారి, ఉద్యాన, విద్యా, మత్స్య, గృహ నిర్మాణ, అటవీ, భగీరథ, నీటిపారుదల, అర్అండ్బీ, విద్యుత్, వసతి గృహాల అధికారులతోపాటు ఐసీడీఎస్ ఉద్యోగులు, డిప్యూటీ తహసీల్దార్ కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతీ దరఖాస్తు పోర్టల్లో... ప్రజావాణికి వచ్చే ప్రతీ దరఖాస్తును పోర్టల్ నమోదు చేయాలి. అంతేకాక ఫిర్యాదుదారులకు గుర్తింపు సంఖ్యలో రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం మండల స్థాయి అధికారులు, శాఖల ఆపరేటర్లకు యూజర్ ఐడీ, పాస్వర్ట్లు కేటాయించారు. అలాగే, ఎంపీడీఓ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కూడా చివరి దశకు చేరింది. ప్రజలకు కనీస సౌకర్యాలు ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించడమే కాక వైద్య సేవల కోసం ఆరోగ్య సిబ్బందిని కేటాయించాలి. అలాగే, దివ్యాంగులకు వీల్చైర్లు, అవగాహన కల్పించేందుకు సిబ్బందిని నియమించాలి. వృద్ధులు, గర్భిణీలు, పసిపిల్లలతో వచ్చే బాలింతల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.ఖమ్మం సహకారనగర్: మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 17న సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల ప్రజలు సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల కేంధ్రంలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం మండల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ఇకపై జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని తెలిపారు. -
నైరుతు పవనం..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కారుమబ్బులు కమ్ముకున్నాయి, భారీ వర్షం పడడమే తరువాయి అన్నది గతంలో మాట. ఇప్పుడు ఎల్నినోతో పరిస్థితులు తారుమారయ్యాయి. కారుమబ్బులు పట్టి.. మేఘాలు దిక్కులుపిక్కటిల్లేలా ఉరుములు గర్జించినా చిరుజల్లులు తప్ప భారీ వర్షాలు కురిసిన దాఖలాలే లేవు. ఆకాశంలో మబ్బులు వచ్చినా కొద్ది నిమిషాల్లోనే తేలిపోతున్నాయి. దీనికి తోడు మధ్యాహ్నం వేళ వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. గత నెలలో వరుణుడు కరుణించకపోగా.. ఈ నెలలోనైనా వర్షాలు కురుస్తాయని ఆశిస్తే ఆ పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు కామేపల్లి, కల్లూరు, ఖమ్మంరూరల్ మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఎర్రుపాలెం మండలంలో తీవ్ర వర్షపాత లోటు ఉండగా మిగిలిన 17 మండలాల్లో లోటు వర్షపాతం ఏర్పడింది. రెండున్నర నెలల్లో 33 శాతం లోటు నైరుతి రుతుపవన కాలం జూన్లో మొదలై సెప్టెంబర్తో ముగుస్తుంది. గత ఏడాది జూలై, ఆగస్టులో భారీ వర్షాలు పడి వాగులు, వంకల్లో వరద పారింది. కానీ ఈసారి వరదల మాటేమో కానీ భూమిపై నీరు నిలిచే స్థాయిలోనూ వర్షం కురవలేదు. జూన్ నుంచి ఈనెల 14వ తేదీ వరకు రెండున్నర నెలల్లో ఒక్కో మండలంలో సగటున 47.6 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాలి. కానీ 32.1 సెం.మీ. వర్షపాతమే నమోదు కావడంతో లోటు ఏర్పడింది. ఇక ఈనెల సాధారణ వర్షపాతం 240 మి.మీ. గాను ఇప్పటివరకు కేవలం 93 మి.మీ. మాత్రమే నమోదు కావడం ఎల్నినో తీవ్రతను తెలియజేస్తోంది. గత ఏడాది వద్దంటే వానలు గత ఏడాది వర్షాలు వద్దంటే కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లగా.. కుంటలు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా ఉంది. గత ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణానికి మించి వర్షాలు కురి శాయి. ఆగస్టులో ఒక్కో మండలంలో 24సెం.మీ. సాధారణ వర్షపాతానికి గాను 37.2సెం.మీ. వర్షపాతం నమోదైంది. జూలై, సెప్టెంబర్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ సీజన్కొచ్చే సరికి జూలై, ఆగస్టులో సగటు వర్షపాతమే నమోదు కాకపోవడం గమనార్హం. దీంతో వచ్చే రెండు నెలల్లో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.జిల్లాలో కొద్దిరోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా బోర్లు, బావుల కింద సాగు చేసిన పంటలను బతికించుకోవడం ఎలా అన్న బెంగ రైతులకు పట్టుకుంది. బోర్లు, బావుల కింద సత్తుపల్లి, వైరా, పాలేరు ప్రాంతాల్లో వరి నాట్లు వేశారు. అలాగే, మెట్ట పంటగా పత్తి, పెసర వేశారు. ఈ పంటలు దక్కి, పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రావాలంటే ఈనెల, వచ్చేనెలలో వర్షాలు కురవాలి. వర్షాలతో వాతావరణంలో తేమ శాతం పెరిగి పంటలు చేతికి వస్తాయి. కానీ ఎల్నినో తీవ్రతతో ఎండలు భగ్గుమంటుండడంతో పంటలపై ప్రభావం పడుతోంది. ఎండలు ఇలాగే కొనసాగితే బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతుంది. నైరుతి సీజన్లో వర్షాలకు ఎల్నినో బ్రేక్ వేస్తుండడంతో మున్ముందు పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులకు కొలువుదీర్చారు. స్వా మివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశా రు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
విద్యుదాఘాతంతో పశువులు మృతి
మధిర: మధిర మండలం మాటూరుపేటలో శని వారం మేతకు వెళ్లిన ఐదు గేదెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. గ్రామ రైతులు ధనిశెట్టి భాస్కరరావు, సామినేని శ్రీనివాసరావు, ముది గొండ సీతయ్య, ధనిశెట్టి వెంకటనరసయ్యకు సంబంధించిన నాలుగు పాడి గేదెలు, ముదిగొండ ఈశ్వరరావుకు చెందిన దున్నపోతు మేతకు వెళ్లా యి. అక్కడ తెగిపడిన తీగను తాకడంతో విద్యుత్ ప్రసారం జరిగి మృతి చెందాయి. ఒక్కో గేదె విలువ రూ.1.40 లక్షలు ఉన్నందున, పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి(45) మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోగా, ఆయన అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈమేరకు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సీఐ బాలకృష్ణ సూచించారు. సహజీవనంలో ఘర్షణ.. ఆత్మహత్య ఖమ్మం అర్బన్: ఖమ్మం యూపీఎస్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న అనుముల కార్తీక్(22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొన్నాళ్ల నుంచి ఇద్దరు పిల్లల తల్లితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమాన ఆమె వద్దకు మరో వ్యక్తి వస్తున్నాడనే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సదరు మహిళ పుట్టింటికి వెళ్లిపోగా కార్తీక్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఈమేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. కాగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు. చోరీకి వచ్చి మద్యపానం! ● ఫుల్లుగా తాగి మత్తులోకి జారుకున్న ముగ్గురు ఖమ్మంరూరల్: దాబాలో చోరీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు అక్కడ పెద్దమొత్తంలో మద్యం సీసాలు కనిపించేసరికి వచ్చిన పని మరిచిపోయారు. ఫుల్గా మద్యం తాగి మత్తులో జారుకున్న ఘటన ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఖమ్మం–కురవి రహదారి సమీపాన రమేష్ దాబాలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ కోసం ముగ్గురు చొరబడ్డారు. అక్కడ పెద్ద మొత్తంలో మద్యం కనిపించడంతో అసలు పని పక్కన పెట్టి మద్యం తాగడంలో మునిగిపోయారు. రాత్రంతా మద్యం సేవించాక ముగ్గురూ మత్తులోకి జారుకున్నారు. శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దాబా తెరిచేందుకు యజమాని రాగా లోపల కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి విచారించడంతో చోరీ వివరాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనానికి వచ్చి పోలీసులకు చిక్కకుండా పారిపోవాల్సిన వారు మద్యం మత్తులో చిక్కడంపై సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు సైటెర్లు వేస్తున్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి కామేపల్లి: మండలంలోని ముచ్చర్ల శివారులో టాస్క్ఫోర్స్, కామేపల్లి పోలీసులు శనివారం రాత్రి సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఖమ్మంకు చెందిన పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు పట్టుబడగా, మరో ఎనిమిది మంది పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.53,650 నగదు, ఒక కారు స్వాధీనంచేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
మత్కేపల్లి మార్కెట్ చెక్పోస్ట్ ప్రారంభం
చింతకాని: చింతకాని మండలం రామకృష్ణాపురం క్రాస్ వద్ద ఖమ్మం – బోనకల్ ప్రధాన రహదారిపై మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యాన చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్పోస్టును మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు శనివారం ప్రారంభించి మాట్లాడారు. మత్కేపల్లి మార్కెట్ నిర్మాణం కోసం రూ.42 కోట్లతో ప్రతిపాదించగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ పర్సగాని తిరుపతిరావు, డైరెక్టర్లు బందెల నాగార్జున, నర్శింశెట్టి శ్రీనివాసరావు, రామిరెడ్డి, షేక్ ఖాసీం, మేకపోతుల రేవతి, వడ్డెల్లి వీర రాఘవులు, భుక్యా బాలాజీ, వెంకటప్పయ్య, సత్యం, సింగు లక్ష్మి, మార్కెట్ కార్యదర్శి నామాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆర్థిక పరిస్థితులతో న్యాయానికి దూరం కావొద్దు
ఖమ్మంలీగల్: ఏ ఒక్కరు కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా న్యాయానికి దూరం కావొద్దనేదే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని జిల్లా కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. ఖమ్మం ఎంజేపీటీబీసీ పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అర్హులైన వారికి సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు న్యాయవాది సేవలు అందిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు న్యాయం పొందే హక్కు, ఉచిత న్యాయ సాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమంలో పురోగతి
ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజావాణి జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేకుండా ఇకనుంచి ప్రతీ సోమవారం ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తారు.వాతావరణ ం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచే ఎండ ప్రభావం ఉంటుంది. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడే అవకాశముంది.ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే గర్భగుడిలోని స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జీపీ భవన నిర్మాణానికి రూ.5లక్షల విలువైన స్థల వితరణ బోనకల్: బోనకల్ మండలంలోని సీతానగరంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నల్లమోతు సీతయ్య జ్ఞాపకార్థం రూ.5లక్షల విలువైన 258 చదరపు గజాల స్థలం అందించనున్నట్లు ఆయన కుమారుడు నాగేశ్వరరావు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా స్థల అగ్రి మెంట్ పత్రాలను శనివారం సర్పంచ్ కొమ్మగిరి బిక్షమయ్యకు అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పదేళ్లుగా స్థలం లేకపోవడంతో జీపీ భవనం నిర్మించలేదని, ఇప్పుడు నాగేశ్వరరావు ముందుకురావడంతో సమస్య పరిష్కారమైందన్నారు. ఉపసర్పంచ్ సాదినేని భవాని, వార్డుసభ్యులు బొల్లం నరేష్, గుడారి వెంకయ్య, సంగీతపు కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి వినోద్, తదితరులు పాల్గొన్నారు. కారేపల్లి వాసికి శౌర్యపతకం కారేపల్లి: మండలంలోని భల్లునగర్తండా గ్రామ వాసి, గ్రేహౌండ్స్ ఆర్ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న బానోతు సురేందర్కు విధినిర్వహణలో ప్రతిభకు గాను శౌర్య పతకం లభించింది. హైదరాబాద్లో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయనకు గ్రేహౌండ్స్ డీజీపీ అనిల్కుమార్ పతకం అందజేశారు.సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘విద్యార్థుల విద్య, ఆరో గ్యం, పోషకాహారం, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. సెంట్రలైజ్డ్ కిచెన్లను అన్ని గురుకుల, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు విస్తరిస్తాం. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతుభరోసా, రుణమాఫీ పథకాలు అమలు చేస్తున్నాం.’ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం ఆయన మాటల్లోనే.. వ్యవసాయానికి ప్రాధాన్యత రైతు భరోసా పథకం ద్వారా 3,41,913 మంది రైతులకు రూ.427.97 కోట్లు, రుణమాఫీ కింద 1,31,760 మంది రైతులకు రూ.912.10 కోట్లు, రైతు బీమా ద్వారా 803 మంది కుటుంబాలకు రూ.40.15 కోట్లు జమ చేశాం. 44,568 మంది రైతుల నుంచి రూ.681.49 కోట్ల విలువైన 2,83,956.397 మె.టన్నుల మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేశాం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ జిల్లాలోని 26 పీహెచ్సీలు, ఐదు యూపీహెచ్సీలు, తొమ్మిది బస్తీ దవాఖానాలు ద్వారా ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. జనరల్ ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనాన్ని పూర్తి చేశాం. చకచకా ప్రాజెక్టులు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు లింక్ కాల్వ నుంచి 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. మున్నేరు – పాలేరు లింక్ కాల్వను రూ.107.65 కోట్లతో నిర్మిస్తున్నాం. జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రూ.630.30 కోట్లతో చేపట్టాం. మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు అదనపు నీరు అందించే పనులు పురోగతిలో ఉన్నాయి. కొదుమూరు – వందనం ఎత్తిపోతల పథకం రెండో దశ ద్వారా మరో 2,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. మహిళా డెయిరీతో ఆర్థిక పరిపుష్టి ‘ఇందిరా మహిళా శక్తి’లో భాగంగా 20 వేల స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యుల ఆర్థికస్థితిని పరిపుష్టి చేసేందుకు ఇందిరా మహిళా డెయిరీ స్థాపించాం. పైలట్ ప్రాజెక్ట్గా మధిర నియోజకవర్గంలో సభ్యులకు రూ.2లక్షల విలువైన రెండేసి పాడి గేదెలను సబ్సిడీపై అందించి పాలు కొనుగోలు చేస్తున్నాం. చేయూత పథకం కింద 1,81,828 మంది లబ్ధిదారులకు రూ.83.42 కోట్ల విలువైన పింఛన్లు పంపిణీ చేశాం. వివాదాల పరిష్కారానికి రీసర్వే భూసరిహద్దులతో ఎదురవుతున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి దాదాపు 96 ఏళ్ల తర్వాత ప్రభుత్వం రీ సర్వే ప్రక్రియ చేపట్టింది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, సత్తుపల్లి మండలం బేతుపల్లి, కూసుమంచి మండలం భాగవతవీడులో రీ–సర్వే కొనసాగుతోంది. జిల్లాలోని 70 గ్రామాల్లో రీ–సర్వే దశలవారీగా జరుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పన ఖమ్మం ఆర్ అండ్ బీ సర్కిల్ పరిధిలో 179 అభివృద్ధి పనులు మంజూరు కాగా, 13 పూర్తయ్యాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రూ.1,227.13 కోట్లతో 37 రహదారుల పనులు కొనసాగుతున్నాయి. కోదాడ – ఖమ్మం, ఖమ్మం – దేవరపల్లి, వరంగల్ –ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే పనులు వేగంగా సాగుతున్నాయి. ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దేలా రహదారుల విస్తరణ, డ్రెయినేజీలు, ఫుట్పాత్ల నిర్మాణం చేపడుతున్నాం. ఏదులాపురం మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టిన పనులు 60 శాతానికి పైగా పూర్తవగా, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరుల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీ.ఎస్., పోలీసు కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల అభివృద్ధి సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.నృత్య ప్రదర్శనలో విద్యార్థులు అక్షరాస్యతలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానాన ఉండగా, పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో ఐదో స్థానంలో నిలిచింది. బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 66,882 మంది విద్యార్థులు చేరారు. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది 9శాతం ప్రవేశాలు పెరిగాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేందుకు జిల్లాలో ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.200 కోట్ల చొప్పున వ్యయంతో నిర్మిస్తున్నాం.జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా తొలి విడతలో 16,243 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 10,396 నిర్మాణాలు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు రూ.454.97 కోట్ల ఆర్థిక సాయం అందింది. రెండో విడతలో ఐదు నియోజకవర్గాలకు 7,800 కొత్త ఇళ్లు, 2,600 పైకప్పు మార్పిడి గృహాలు కలిపి మొత్తం 10,400 మంజూరయ్యాయి. -
●అంతా.. గందరగోళం
స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలో ఉత్తమ ఉద్యోగులు, అధికారులుగా ఎంపికై న వారికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈక్రమాన అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో గందరగోళం నెలకొంది. ఫలితంగా ఒకరి ప్రశంసాపత్రాలు ఇంకొంకరికి అందాయి. తీరా వేదిక దిగి చూసుకున్నాక విషయం తెలిసింది. దీంతో తమ సర్టిఫికెట్ కోసం కొందరు ఉద్యోగులు జాబితా చదువుతున్న వారి వద్దకు వెళ్లి ఆరా తీయడం కనిపించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
స్మార్ట్ కార్డులతో భరోసా
ఖమ్మం సహకారనగర్: స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు గాను 1,06,28,092 కుటుంబాల్లో 3.42 కోట్ల మందికి రేషన్షాపుల ద్వారా నెలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త కార్డులు ఇవ్వకపోగా దొడ్డుబియ్యమే పంపిణీ చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి నాయకత్వాన అర్హులకు కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. అంతేకాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. అలాగే, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, గురుకుల విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని వివరించారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో 62 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరుతో సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డీసీఎస్ఓ చందన్కుమార్, ఏసీఎస్ఓ మల్లిఖార్జున్బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
●ఆకట్టుకున్న శకటాలు
అలరించిన విద్యార్థుల ప్రదర్శనలుఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలను వివరించేలా రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. ఇందులో గృహ నిర్మాణ శాఖ, పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, డీఆర్డీఏ, అటవీ తదితర శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. అంతేకాక వ్యవసాయ, ఉద్యానవన శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, మత్స్యశాఖ, పోలీసు శాఖ ద్వారా స్టాళ్లు ఏర్పాటుచేసి పథకాలను వివరించారు. – ఖమ్మం సహకారనగర్ -
నాళ్లబండబోడులో 136మంది ఓటర్లే..
అత్యధిక ఓటర్లు తక్కువ ఓటర్లు నియోజకవర్గం సంఖ్య పీఎస్ సంఖ్య పీఎస్ ఖమ్మం 1165 గోపాలపురం 255 మంగ్యాతండా పాలేరు 1,185 వరంగల్ క్రాస్రోడ్డు 176 రేగులతండా మధిర 1,169 బోనకల్ 264 గట్లగౌరారం వైరా 1,155 అష్ణగుర్తి 136 నాళ్లబండబోడు సత్తుపల్లి 1,184 బేతుపల్లి 232 గట్టుగూడెంఖమ్మం సహకారనగర్: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,460 పోలింగ్ కేంద్రాలకు గాను ఓటర్ల గణాంకాలు ప్రాథమికంగా తేలాయి. జిల్లాలో అత్యధికంగా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం వరంగల్ క్రాస్రోడ్డులోని పోలింగ్ స్టేషన్ పరిధిలో 1,185 మంది ఓటర్లు, అత్యల్పంగా వైరా నియోజకవర్గం నాళ్లబండ బోడు పీఎస్లో కేవలం 136 మంది ఓటర్లే ఉన్నట్లు గుర్తించారు. అయితే, ముసాయిదా జాబితా విడుదల చేశాక అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం ఇందులో మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది. -
రేపు ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా
మధిర: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదలతో పాటు సీపీఎస్ను రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో ఈనెల 17న(సోమవారం) కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు తెలిపారు. మధిరలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఈమేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం కూడా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆర్.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే ధర్నాకు మధిర ప్రాంత ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి, పోలే సుధాకర్, నాయకులు డి.వెంకటేశ్వరరావు, సీహెచ్వీ.రవికుమార్, కొమ్ము శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, పిల్లి నరసింహారావు, జమీర్, శాంతబాబు తదితరులు పాల్గొన్నారు. 12 ఎకరాల ఆయిల్పామ్ తోటకు నిప్పు కొణిజర్ల: గుర్తు తెలియని వ్యక్తులు ఆయిల్పామ్ తోటకు నిప్పంటించడంతో 12 ఎకరాల్లో మొక్కలు కాలిపోయాయి. మండలంలోని గుబ్బగుర్తికి చెందిన రైతు మోత్కూరి వెంకటేశ్వరావు గ్రామ సమీపాన ఏన్కూరు – పల్లిపాడు ప్రధాన రహదారి వెంట 12 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నాడు. దాదాపు నాలుగేళ్లు పూర్తికావడంతో కాపుకు వచ్చే సమయాన శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో చెట్లన్నీ కాలిపోయాయి. అలాగే, డ్రిప్ పైపులు కూడా కాలిపోవడంతో భారీ నష్టం ఏర్పడడంతో కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. రాజ్భవన్ ‘ఎట్ హోం’లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఖమ్మం సహకారనగర్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో జిల్లాకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. గవర్నర్ దంపతుల ఆహ్వానంతో రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి అర్చన సంతోష్(2023), పెసర ప్రభాకర్రెడ్డి, సంపత్ కుమార్(2024), మారం పవిత్ర(2025) హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని డీఈఓ సదానందం తదితరులు అభినందించారు. -
భవిష్యత్పై ఆశలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79ఏళ్లు పూర్తయింది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన సాగుతున్న వేళ సామాన్య ప్రజల ఆశలు, ఆకాంక్షలు కూడా మారుతున్నాయి. ఇన్నేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మొదలు సొంతింటి కల, కుటుంబ, జీవన ప్రమాణాలు మెరుగయ్యాయనే భావన ఉన్నా ఇంకా అవకాశాలు పెరగాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది. అంతేకాక యువతలో దేశభక్తి పెరగాలని కూడా భావిస్తున్నారు. ఈమేరకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ వర్గాల వారిని ‘సాక్షి’ ఆధ్వర్యాన సర్వే చేయగా ఆశలు, ఆకాంక్షలను వెల్లడించారు. – సాక్షి నెట్వర్క్ -
4జీ సాంకేతికతో 45 టవర్లు
ఖమ్మంమయూరిసెంటర్: స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించినట్లు నల్లగొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని మొబైల్ టవర్లను అప్గ్రేడ్ చేయగా, 45 శాచ్యురేషన్ టవర్లు 4జీ టెక్నాలజీతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంతేకాక మరో 30 మారుమూల ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కాగా, స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ ప్లాన్‘ ఆఫర్తో బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉచితంగాఇస్తూ, రూ.1 రీచార్జ్తో 24 డేస్ వ్యాలిడిటీ, రోజూ 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, రూ.2,399 చెల్లిస్తే వ్యాలిడిటీ 365 రోజులకు బదులు అదనంగా 47రోజులు కలిపి 412రోజులకు వర్తింపజేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 12లోగా రీచార్జ్ చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అలాగే, ఫైబర్ ఫ్రీడమ్ ప్లాన్ 1111 ద్వారా 200 ఎంబీపీఎస్ స్పీడ్తో నెలకు 5000 జీబీ డేటా, 25కి పైగా ప్రీమియం ఓటీటీల యాక్సెస్ ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ ద్వారా ఇస్తున్నామని జీఎం తెలిపారు. -
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/బోనకల్: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9–30 గంటలకు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 1–30 గంటలకు కలెక్టరేట్లో పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను భట్టి పంపిణీ చేస్తారు. ఆర్వాత 3–30 గంటలకు బోనకల్ మండలం చొప్పకట్లపాలెం, రామాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా, లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు. నాణ్యమైన వైద్యసేవలు, నిరంతర చికిత్స ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారికి నాణ్యమైన వైద్యం, నిరంతర చికిత్స అందించటమే తమ లక్ష్యమని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) క్లినిక్, యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) కేంద్రాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలు, చికిత్సా విధానం, మందుల లభ్యత, రికార్డులను పరిశీలించారు. అనంతరం హెచ్ఐవీ బాధితులకు అందే వైద్యంపై ఉద్యోగులతో సమీక్షించారు. మందుల కొరత, చికిత్సలో అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారితో మర్యాదగా వ్యవహరిస్తూ అవసరమైన మానసిక ధైర్యం కల్పించాలని, చికిత్స వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. నర్సింగ్ ఆఫీసర్లు రేవతి, రాణి, ఏఆర్టీ విభాగం అధిపతి డాక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉత్తమ విద్యాశాఖ అధికారిగా చింతకాని ఎంఈఓ చింతకాని: చింతకాని మండల విద్యాశాఖాధికారి సలాది రామారావుకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విద్యా శాఖాధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాద్లో గురువారం డీఈఓలు, ఎంఓఈలకు శిక్షణ ఇవ్వగా, పాఠశాలల పర్యవేక్షణ ఇతర అంశాల్లో రామారావు ముందు నిలిచినట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయనకు డీఈఓ సదానందం సమక్షాన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. కొత్తగా 39 సబ్స్టేషన్ల మంజూరు నేలకొండపల్లి: అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేలా అన్నిచర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. మండలంలోని నాచేపల్లికి సబ్స్టేషన్ మంజూరు కాగా అవసరమైన స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా కోసం జిల్లాకు కొత్తగా 39 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని.. అందులో మూడు పూర్తికాగా, ఇంకో తొమ్మిది నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే, ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం అందిన మూడు దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ చింతమళ్ల నాగేశ్వరరావు, ఏడీఈలు నాగమల్లేశ్వరరావు, వెంకట్, ఏఈ జి.రవి తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ హాంఫట్ !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు.. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణలో కీలకంగా నిలవాల్సిన పౌరసరఫరాల సంస్థ అధికారుల పర్యవేక్షణ లేమితో కొన్ని మిల్లుల బాధ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం పక్కదారి పట్టించడమే కాక వేల క్వింటాళ్ల సీఎంఆర్ ఏళ్లుగా ఇవ్వకున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలు మిల్లుల్లో ఇదే పరిస్థితితో ప్రభుత్వం కన్నెర్రజేసి విజిలెన్స్ బృందాలను తనిఖీలకు దింపడంతో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మర ఆడించి ఇవ్వమంటే.. రేషన్షాపుల ద్వారా ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోంది. ఇందుకు కావాల్సిన బియ్యం కోసం ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయిస్తోంది. ఇందులో వంద కేజీల ధాన్యానికి 67 కేజీల బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. మిల్లులకు ధాన్యం కేటాయింపు, మర ఆడించాక సేకరణ, గోదాములకు తరలింపు, ఆపై పంపిణీని పౌర సరఫరాల సంస్థ పర్యవేక్షిస్తుంది. కానీ ధాన్యం మర ఆడించి ఇవ్వాల్సిన బియ్యాన్ని సకాలంలో ఇవ్వకపోగా, కొందరు పక్కదారి పట్టిస్తున్నా సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో మిల్లర్లు ఆడిందే ఆట అయింది. భారీగా పెండింగ్ జిల్లాలో 2021లో 55 రైస్ మిల్లులు ఉండగా, ప్రసుత్తం ఆ సంఖ్య 72కు చేరింది. 2020 –21 వానా కాలం, యాసంగి నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకు ఐదేళ్లలో మిల్లుల నుంచి 22,35,522.79 క్వింటాళ్ల బియ్యం పెండింగ్ ఉన్నాయి. ఇందులో గత వానా కాలం, యాసంగి సీజన్లలో 19,65,405 క్వింటాళ్లు పెండింగ్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోకొన్ని మిల్లులు సీఎంఆర్ పెండింగ్ పెట్టడడంతో ప్రభుత్వం పలుమార్లు గడువు పెంచినా యంత్రాంగం పర్యవేక్షించక ఫలితం దక్కడం లేదు. డీ ఫాల్ట్గా ప్రకటన సీఎంఆర్ సరైన సమయానికి తిరిగి ఇవ్వకపోవడంతో జిల్లాలోని మూడు మిల్లులను పౌరసరఫరాల సంస్థ డీ ఫాల్ట్గా ప్రకటించింది. 2021 – 2024 మధ్య కాలంలో వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ఈ మూడు మిల్లులే రూ.79.09 కోట్ల విలువైన 2,18,026.89 క్వింటాళ్ల సీఎంఆర్ బకాయి పడ్డాయి. ఈమేరకు ప్రభుత్వం సీఎంఆర్ కింద ధాన్యం ఇవ్వడాన్ని నిలిపివేస్తే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. అయినా ఇప్పటి వరకు సీఎంఆర్ మాత్రం తిరిగి ఇవ్వకపోగా, ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలడంతో చివరకు డీ ఫాల్ట్ జాబితాలో చేర్చారు.రైతుల నుంచి కొనుగోలు ధాన్యం సేకరణలో తరుగు, తేమ పేరిట ప్రతీ సీజన్లో మిల్లర్లు నానా కొర్రీలు పెడుతున్నారు. ఇవన్నీ చూసి మిల్లర్ల తీరుపై ప్రభుత్వం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈనేపథ్యాన సీఎంఆర్ బకాయి ఉన్న, ధాన్యం, బియ్యం పక్కదారి పట్టిస్తున్న మిల్లులపై దాడులు చేయాలని విజిలెన్స్ను పురమాయించింది. దీంతో జిల్లాలో పది రోజులుగా తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు మిల్లుల్లో సీఎంఆర్ తేడాను గుర్తించి, మూడు మిల్లులపై కేసులు నమోదు చేశారు. ఇంకొన్ని రోజులు కూడా మిల్లుల్లో తనిఖీలు కొనసాగనున్న తెలిసింది. -
నార్లకు సరి.. నాట్లకు ఎలా?
● వైరా రిజర్వాయర్ కింద సాగుపై సందిగ్ధత ● 10 వేల ఎకరాల్లో వరి నారుమళ్లు ● ప్రస్తుతం నీటి విడుదలకు బ్రేక్వైరా: వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి నారు మళ్లు పోసుకునేందుకు అధికారులు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు విడుదల చేశారు. మొదటి నుంచి వరి సాగు వద్దని చెబుతూనే నీరు విడుదల చేయడంతో రైతులు ధైర్యంగా వరి నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. రోజుకు 40 – 50 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేయగా.. చివరి వరకు విడుదల కొనసాగుతుందా, లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుకున్నట్టుగానే ప్రస్తుతం నీటి విడుదల నిలిపివేయడంతో నాట్లు వేయడంతో పాటు పంట చేతికి వచ్చేవరకు పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. 16.10 అడుగుల మేర నీరు రిజర్వాయర్ ఆయకట్టులో 25 వేల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 10 వేల ఎకరాల్లో నారు పోశారు. రిజర్వాయర్లో ప్రస్తుతం 16.09 అడుగుల మేర నీరు ఉండగా.. రోజుకు 37 క్యూసెక్కుల మేర మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో 11 మండలాలకు 467 గ్రామాలకు విడుదల చేస్తున్నారు. మరోవైపు వానలు ముఖం చాటేశాయి. దీంతో రిజర్వాయర్లోకి వరద చేరడం లేదు. ఇటీవల 15 రోజుల పాటు గోదావరి జలాలను విడుదల చేయడంతో అప్పుడు 13.3 అడుగులు ఉన్న రిజర్వాయర్ నీటిమట్టం 17.3 అడుగులకు చేరింది. గత నెల 13న ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ జిల్లా అధికారులతో మాట్లాడి నారుమళ్లకు నీరు విడుదల చేయించారు. అప్పటివరకు వరి వద్దని అధికారులు అవగాహన కల్పించినా... నారుమళ్లకు నీరు రావడంతో పంట చివరి వరకు నీరు విడుదల చేస్తారో ధీమాతో రైతులు కొందరు నాట్లు వేయడం కూడా మొదలుపెట్టారు. అనుమానించినట్లుగానే... గోదావరి జలాల రాక నిలిచిపోవడం, వరి సాగు వద్దని అధికారులు సూచిస్తుండడంతో ఆయకట్టు రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే వైరా మండలం స్టేజీపినపాక నుండి దాచాపురం వరకు నారుమళ్లు పోసుకున్న రైతులు కొందరు నాట్లు వేయడం కూడా పూర్తిచేశారు. అయితే, డిసెంబర్ వరకు కూడా రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తేనే వరి సాగు సాఫీగా సాగనుంది. ఇప్పటికే ఎకరాకు రూ.5వేల నుంచి రూ. 10 వేల మేర ఖర్చు చేసిన రైతులు ఇంకా పెట్టుబడి పెట్టక తప్పదు. మరోవైపు దాచాపురం, గరికపాడు, గన్నవరం, ఖానాపురం వైరా నది పరివాహక ప్రాంతాల పరిధిలో రైతులు బోర్ల కింద వరి సాగు చేస్తున్నారు. రిజర్వాయర్ కాల్వపైనే ఆధారపడిన వారు మాత్రం నాట్లు వేయాలా, వద్ద అన్న మీమాంసలో ఉండిపోయారు. ఇంతలోనే వారు అనమానించినట్లుగా వైరా రిజర్వాయర్ నుంచి ఎట్టి పరిస్థితులలో సాగు అవసరాలకు నీరు విడుదల చేయొద్దని ఉన్నతాధికారుల సూచనలతో గురువారం రాత్రి కుడి, ఎడమ కాల్వకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయకట్టు పరిధి 10 వేల ఎకరాల్లో సాగుకు సిద్ధమైన రైతులు అయోమయంలో పడ్డారు. అనధికారికమే... ఎమ్మెల్యే రాందాస్నాయక్ సూచనలతో జలవనరులు శాఖ అధికారులు ఇన్నాళ్లుఅనధికారికంగా రోజూ నీరుని విడుదల చేస్తున్నారని తెలిసింది. సుమారు 15 క్యూసెక్కులు విడుదల చేస్తుండడంతో విషయం తెలిసిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయకట్టు రైతులు ఎమ్మెల్యేను కలిసి సాగునీరు విడుదల చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని చెప్పగా ఆయన ఉన్నతాధికారులతో చర్చిస్తానని చెప్పినట్లు తెలిసింది. సొంతంగా ఉన్న ఐదెకరాలకు తోడు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ప్రస్తుతం నాట్లు వేయిస్తున్నా. అధికారులు మధ్యలో నీరు విడుదల నిలిపివేయాలని నిర్ణయించడం సబబు కాదు. పంట చేతికి వచ్చేవరకు నీటి విడుదల కొనసాగించకపోతే పూర్తిగా నష్టపోతాం. – అయిలూరి పూర్ణచందర్రెడ్డి, రైతు, నారపునేనిపల్లి -
సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మం సహకారనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగ పిల్లల తల్లిదండ్రుల సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలు అర్హులందరికీ అందేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మండలాల్లో భవిత కేంద్రాలకు నూతన భవనాల నిర్మాణం కొనసాగుతోందని, కేంద్రాల్లో విద్యార్థులకు మెరుగైన సేవలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం పలువురి నుంచి వినతిపత్రాలను స్వీకరించిన అదనపు కలెక్టర్ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. డీఈఓ జి.సదానందం, సీఎంఓ బాజోజు ప్రవీణ్కుమార్, క్వాలిటీ కోఆర్డినేటర్ ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ శైలజాలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవ్, సీనియర్ పీడియాట్రిషన్ చేతన్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీజ -
గొలుసు చోరీ కేసులో మూడున్నర ఏళ్ల జైలుశిక్ష
ఖమ్మంలీగల్: గొలుసు చోరీ కేసులో ఖమ్మం పాండురంగాపురానికి చెందిన ఈదరబోయిన సుమన్కు చైన్ స్నాచింగ్ కేసులో మూడున్నరేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ అర్వ ప్రవీణ్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఖమ్మం ఖానాపురానికి చెందిన వల్లభి లలిత ఈ ఏడాది జనవరి 8న రాత్రి ట్రంక్ రోడ్ సమీపాన రైల్వే ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు. ఈమేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కేసు నమో దు చేసి విచారణ చేపట్టగా ఈదరబోయిన సుమన్ ను నిందితుడిగా గుర్తించారు. ఆయన ప్రస్తుతం వరంగల్లోని లేబర్ కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. నిందితుడి అరెస్ట్ చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం జైలుశిక్ష, రూ.30వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. దర్యాప్తు అధికారి కె.సురేష్, ప్రభుత్వ న్యాయవాది గాయత్రి, ఉద్యోగులు వి.రామకృష్ణ, కె.శ్రీకాంత్, డి.నాగేశ్వరరావును సీపీ సునీల్దత్ అభినందించారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది.. ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన చెల్లని చెక్కు జారీచేసిన ఖమ్మం మా మిళ్లగూడెంకు చెందిన బబ్బూరి వెంకటేశ్వర్లుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్డు న్యాయాధికారి కాకుమాను జ్యో తిర్మయి శుక్రవారం తీర్పుచెప్పారు. ఖమ్మం మామిళ్లగూడెంకు చెందిన జుజ్జూరి ఉపేందర్ వద్ద 2018 అక్టోబర్లో వెంకటేశ్వర్లు రూ.4లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2019 డిసెంబర్లో రూ.5లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో సరిపడ నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో న్యాయవాది స్వామి రమేష్కుమార్ ద్వారా ఉపేందర్ లీగల్ నోటీస్ జారీచేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈమేరకు నేరం రుజువు కావడంతో వెంకటేశ్వర్లుకు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5.90లక్షలు చెల్లించాలని, రూ.10వేలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని తీర్పు వెలువరించారు. రూ. 3.12 లక్షల విలువైన గంజాయి స్వాధీనం సత్తుపల్లి టౌన్: ఒడిశా నుంచి హైదరాబాద్కు కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని సత్తుపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.12 లక్షల విలువైన 6.360 కేజీల గంజాయితో పాటు కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబా ద్కు కారులో గంజాయి తరలి స్తున్నానే సమాచారంతో సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యాన ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు తాళ్లమడ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమాన కారులో పరిశీలించగా పది ప్యాకెట్లలో గంజాయి బయటపడింది. ఈమేరకు ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగికి చెందిన కామేష్ మారి, కారా రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, రవాణాతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.తనిఖీల్లో ఎస్ఐ ప్రదీప్, ఈగల్ టీమ్, సత్తుపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హారన్ కొట్టినందుకు ఘర్షణనేలకొండపల్లి: సిగ్నల్ పనిచేయకపోవడంతో వాహనం వెళ్లడంలో జాప్యం జరగగా, వెనకాల కారు డ్రైవర్ హారన్ కొట్టడంతో ఘర్షణ చోటుచేసుకుంది. మండలంలోని పైనంపల్లి వద్ద టోల్గేట్ మీదుగా ఖమ్మం నుంచి కోదాడ మార్గంలో శుక్రవారం సిగ్నల్ పనిచేయలేదు. దీంతో ఓ కారులోని వ్యక్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయాన వెనక నుంచి వచ్చిన మరో కారు డ్రైవర్ పదేపదే హారన్ కొట్టడంతో ముందుగా కారులోని వ్యక్తులు నిలదీయడంతో వాదన మొదలై ఘర్షణకు దారి తీసింది. చివరకు టోల్గేట్ సిబ్బంది ఇరువర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
వేగంతో పాటు నాణ్యత తప్పనిసరి
● కలెక్టర్ దివాకర టీ.ఎస్. ● మధిరలో అభివృద్ధి పనుల పరిశీలనమధిర: అభివృద్ధి పనులు గడువులోగా పూర్తిచేయడం ఎంత ముఖ్యమో నాణ్యత పాటించడం కూడా అంతే ప్రధానమని కలెక్టర్ దివాకర టీ.ఎస్. పేర్కొన్నారు. మధిరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ), వైరా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, పురోగతి, నిర్మాణ సామగ్రి నాణ్యతపై ఆరా తీశాక ఆయన మాట్లాడారు. మధిరలో యూజీడీ పనులు పూర్తయితే పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడడమే కాక మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పనుల సందర్భంగా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, పనులు పూర్తవగానే రోడ్లు పునరుద్ధరించాలని ఆదేశించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటిస్తూ, నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఆతర్వాత మధిర వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ అధిక దిగుబడులే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి చేపట్టాలని సూచించారు. పెసర, మినుములో అధిక దిగుబడులు, తెగుళ్లు, పురుగులను తట్టుకునే రకాల అభివృద్ధి, పప్పుధాన్యాల సాగుపై పరిశోధనలు చేయాలని తెలిపారు. అలాగే, మధిర వ్యవసాయ పాలిటెక్నిక్ను కూడా కలెక్టర్ సందర్శించి అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థుల బోధనపై ఆరాతీశారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కె.రుక్మినీదేవి, తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ట్యాంక్బండ్ పరిశీలన బోనకల్: బోనకల్ మండలం కలకోటలోని చెరువు ట్యాంక్బండ్ పనులను కలెక్టర్ దివాకర శుక్రవారం పర్యాటక శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ట్యాంక్బండ్ నిర్మాణానికి రూ.7కోట్లు మంజూరైన నేపథ్యాన పనుల వివరాలను జిల్లా టూరిజం అధికారి సుమన్తో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీరు అవసరమయ్యే పంటలే సాగు చేయాలని సూచించారు. కాగా, కలకోట ఎస్సీ కాలనీ శ్మశానవాటికకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు కలెక్టర్ను కోరారు. తహసీల్దార్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
హల్ద్వాని ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
ఖమ్మంమయూరిసెంటర్: హల్ద్వానీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై జరిగిన అవమానకర చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్, నాగండ్ల దీపక్చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఖమ్మంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగగా వారు మాట్లాడుతూ హల్ద్వానీలో కాంగ్రెస్ ర్యాలీ జరిగిన ప్రదేశంలో హిందూ మితవాద సంస్థలు గంగాజలంతో శుద్ధీకరణ పేరుతో చేపట్టిన చర్య అత్యంత హేయనీయమని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఇలా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ ఖాదర్బాబా, నాయకులు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, ముక్తార్ జోహారా, కమర్తపు మురళి, కన్నం వైష్ణవి ప్రసన్న, రావూరి సైదుబాబు, బాలాజీనాయక్, రంగా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ జిల్లా నగర అధ్యక్షులు సత్యనారాయణ, దీపక్చౌదరి -
రైతులకు ఉచిత న్యాయ సాయం
కామేపల్లి: రైతులు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అగ్రిలీగల్ ఎయిడ్ క్లినిక్లు, డీఎల్ఎస్ఏ ద్వారా ఉచిత న్యాయ సాయం పొందొచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవీమానస పేర్కొన్నారు. కామేపల్లి మండలం ముచ్చర్లలోని రైతువేదికలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి దేవీమానస వ్యవసాయ సంబంధిత చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు, రైతులకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. భూమి హక్కుల రికార్డులు, సరిహద్దు వివాదాలు, ప్రాజెక్టుల కోసం భూమి సేకరించినప్పుడు పరిహారం, హక్కుల వివరాలు తెలియచేయడమే కాక నకిలీ విత్తనాలు, ఇతర కారణాలతో పంట నష్టపోతే పరిహారం పొందే విధానాన్ని వివరించారు. ఆర్థిక సోమత లేని రైతులకు ఉచితంగా న్యాయవాదిని కేటాయిస్తామని తెలిపారు. ఈ సదస్సులో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్సై శ్రీకాంత్, సర్పంచ్ జాటోత్ జాయ్లూసీ, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. సింగరేణిలో 16మంది ఉత్తమ ఉద్యోగుల ఎంపికరుద్రంపూర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా సింగరేణి యాజమాన్యం సంస్థ వ్యాప్తంగా 12 ఏరియాల నుంచి ఉత్తమ ఉద్యోగులు, అధికారులను ఎంపిక చేసింది. వీరిని కొత్తగూడెంలో జరిగే వేడుకల్లో శనివారం సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి సన్మానించనున్నారు. మొత్తం 16మంది ఎంపిక చేయగా, వీరిలో కొత్తగూడెం రీజియన్ నుంచి ఏడుగురు ఉన్నా రు. ఇందులో పి.మధుసూదన్రావు(పీకేఓసీ–2, మణుగూరు ఏరియా), జీ.ఏ.శ్రీనివాసరావు(కోయగూడెం ఓసీ, ఇల్లెందు ఏరియా), జక్కుల గట్టయ్య(ఆర్సీహెచ్పీ, కొత్తగూడెం ఏరియా), కె.శ్రీధర్(జేవీఆర్ ఓసీ సత్తుపల్లి ఏరియా), సీహెచ్.సూర్యనారాయణశర్మ(ఇంటర్నల్ ఆడిట్, కార్పొరేట్ ఏరియా), అధికా రు ల విభాగంలో ఏ.మనోహర్(జీఎం, కార్పొరేట్ ఏరియా), ఎన్.చక్రవర్తి(జీఎం, కార్పొరేట్ ఏరి యా) ఎంపికయ్యారు. వీరితో పాటు ఇతర ఏరి యాల నుంచి మిగతా వారు ఉన్నారు. కాగా, సింగరేణిలో 50 విభాగాలు ఉండగా, 12 విభా గాల నుంచే ఉత్తమ కార్మికులు, ఉద్యోగులను ఎంపిక చేయడాన్ని పలువురు తప్పుపట్టారు. అనుమతి లేకుండా ఏపీకి మట్టి తరలింపు●వాహనాలను అడ్డుకున్న రైతులు నేలకొండపల్లి: జిల్లా నుంచి అనుమతి లేకుండా ఏపీకి మట్టి తరలిస్తున్న కొందరు అక్కడ అమ్మి సొమ్ము చేసుకంటున్నారు. ఈ విషయం తెలిసినా ఎవరూ స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు వాహనాలను అడ్డుకున్నారు. నేలకొండపల్లి మండలం కట్టుకాచారాం గ్రామం నుంచి కొద్దిరోజులుగా ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు అనుమతి లేకుండా వాహనాల్లో మట్టి తరలిస్తున్నారు. ఈ ప్రాంతం హైదరాబాద్ – విజయవా డ హైవేకు కేవలం రెండు కి.మీ. దూరాన ఉండడంతో రాత్రి వేళ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు మీదుగా మట్టి తరలిస్తున్నారని తెలిసింది. ఈక్రమాన శుక్రవారం రాత్రి స్థానికులు కొందరు నిలదీయడంతో తమకు అనుమతి ఉందని దౌర్జన్యానికి దిగారు. దీంతో స్థానిక రైతులు పెద్దసంఖ్యలో శుక్రవారం రాత్రి చేరుకుని వాహనాలను అడ్డగించారు. టిప్పర్లను సీజ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు కదిలేదని లేదని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతోనైనా అధికారులు స్పందిస్తారో, లేదో వేచిచూడాలి. -
బోధన పరిశీలన.. విద్యార్థుల ప్రగతిపై ఆరా
నేలకొండపల్లి: గురుకులంలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించిన ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్కుమార్.. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ వారి ప్రగతిని పరీక్షించారు. నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల పరి శీలన అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనపై సూచనలు చేశారు. అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారి పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టా రు. అలాగే, వంట గదులు, డైనింగ్ హాల్ను పరిశీలించి మెనూ అమలుపై ఆరా తీశారు. ఆతర్వాత పరాస్కుమార్ నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని సందర్శించడమే కాక భక్తరామదాసు ధ్యాన మందిరంలో పూజలు చేశారు. నాణ్యమైన నారే పెంచాలి చింతకాని: నర్సరీల యజమానులు ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలకు చెందిన నాణ్యమైన మిర్చి విత్తనాలతోనే నారు పెంచాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్ సూచించారు. చింతకాని మండలం జగన్నాథపురంలోని నర్సరీలను గురువారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలతో నారు పెంచి రైతులకు సరఫరా చేయాలని, అంతేకాక ప్రతీ రైతుకు పూర్తివివరాలతో కూడిన రశీదు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా, ఎల్నినో నేపథ్యాన రైతులు అధిక నీరు అవసరమయ్యే మిర్చి, వరి సాగు విషయంలో అప్రమత్తంగా వ్యవరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి సాగు తగ్గించి ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మధిర డివిజన్ ఉద్యాన అధికారి ఏ.విష్ణు, తదితరులు పాల్గొన్నారు. రైస్మిల్లులో విజిలెన్స్ తనిఖీలు సత్తుపల్లి టౌన్: జిల్లాలోని రైస్మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీల పరంపర కొనసాగుతోంది. నేలకొండపల్లి, పెనుబల్లి, తల్లాడ, ముదిగొండ మండలాల్లోని మిల్లుల్లో చేపట్టిన తనిఖీల్లో అక్రమాలు బయటపడిన విషయం విదితమే. ఈమేరకు సత్తుపల్లి మండలం తాళ్లమడలోని పీవీఆర్ రైస్ మిల్లులో గురువారం వరంగల్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ తహసీల్దార్ లక్ష్మణ్, ఇన్స్పెక్టర్ జి.రాకేష్ నేతృత్వాన సిబ్బంది మిల్లులోని సీఎంఆర్ ధాన్యం వివరాలు సేకరించి రికార్డుల ఆధారంగా స్టాక్ ఉందా, లేదా అని పరిశీలించారు. అయితే, తనిఖీలకు సంబంధించి వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఎన్పీడీసీఎల్ టోర్నీలో విజేతగా ఉమ్మడి ఖమ్మంఖమ్మంవ్యవసాయం: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) స్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విజేతగా నిలిచింది. ఇటీవల వరంగల్లో జరిగిన టోర్నీలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులతో కూడిన జట్టు విజేతగా నిలవగా గురువారం ఉన్నతాధికారులు కప్ అందజేసి అభినందించారు. ఈమేరకు జట్టు కెప్టెన్గా వ్యవహరించిన బి.రామకృష్ణారావు(ఖమ్మం)తో పాటు సభ్యులైన పి.సతీష్(రఘునాథపాలెం), ఎండీ.అబ్దుల్ ఆసిఫ్(తల్లాడ), కె.చరణ్రాజ్(ఖమ్మం టౌన్), ఎం. వివేక్కుమార్(ఖమ్మం), వి.అశోక్(మణుగూరు), ఎన్.షణ్ముఖాచారి(పల్లెగూడెం), జి.కృష్ణ(అశ్వాపురం), ఎం.రవితేజ(కొత్తగూడెం), కె.జాషువా(భద్రాచలం), ఎం.డి.ఆరిఫ్(జూలూరుపాడు), ఎం.శ్యాంకుమార్(కూసుమంచి), బి.రాంబాబు(జూలూరుపాడు), ఎండీ.రసూల్ఖాన్(కొత్తగూడెం)ను ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, అధికారులు అభినందించారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే చర్యలు ఏన్కూరు: లైసెన్స్ లేకుండా పంటల క్రయవిక్రయాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ రీజియన్ డీడీ పద్మావతి వెల్లడించారు. ఏన్కూరు మార్కెట్ కార్యాలయానికి గురువారం వచ్చిన ఆమె ఉద్యోగులతో సమావేశమై పన్నుల వసూళ్లపై సమీక్షించి సూచనలు చేశారు. అనంతరం డీడీ మాట్లాడుతూ అవకతవకలకు పాల్పడిన కోల్డ్స్టోరేజీలు, జిన్నింగ్ మిల్లుల బాధ్యులు చర్యలు తప్పవని చెప్పారు. ఈమేరకు వైరా, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర ప్రదేశాల్లో కోల్డ్స్టోరేజీలను పరిశీలించినట్లు తెలిపారు. మార్కెట్ కార్యదర్శి నిర్మల, సూపర్వైజర్లు అనూష, రామారావు, హుస్సేన్ పాల్గొన్నారు. -
భూసేకరణతోనే ‘సీతారామ’ పనుల్లో వేగం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను వేగంగా జరిగేలా అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. హైదరాబాద్లో గురువారం ఆయన ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో చర్చించారు. ప్రాజెక్టులోని మూడో పంప్హౌస్ నుంచి నాలుగో పంప్హౌస్ వరకు నీటిని తరలించేందుకు అవసరమైన 532 ఎకరాల భూసేకరణకు రూ.45 కోట్లు అవసరమని తెలిపారు. ములకలపల్లి మండలం కమలాపురంలోని మూడో పంప్హౌస్ నుంచి దమ్మపేట మండలంలోని నాలుగో పంప్హౌస్ వరకు కాల్వ ద్వారా నీటిని తరలించే ప్రతిపాదన ఉందని తెలిపారు. ఆ పంప్హౌస్ నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని చెరువులకు కాల్వలకు బదులు పైప్లైన్ ద్వారా నీరు అందించేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. తద్వారా వ్యయం తగ్గడమే కాక రైతులు తమ భూములను కోల్పోవాల్సిన అవసరం ఉండదని.. దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాలకు గోదావరి జలాలు అందుతాయని వెల్లడించారు. అలాగే, జూలూరుపాడు టన్నెల్ పనులు త్వరగా పూర్తి చేసి పాలేరు జలాశయానికి నీరు అందించాలని, పంటలను రక్షించేందుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా మరోమారు నీరు విడుదల చేయాలని ఉత్తమ్కుమార్రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్తో మంత్రి తుమ్మల భేటీ -
‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లా కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యాన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు జాతీయ జెండాలు చేబూని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండా కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం, దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సర్దార్ జమలాపురం కేశవరావు తదితరులెందరో ఈ గడ్డపై జన్మించారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్రెడ్డి, నాయకులు కొండపల్లి శ్రీధర్రెడ్డి, వాకదాని పుల్లారావుయాదవ్, రామలింగేశ్వరరావు, గల్లా సత్యనారాయణ, గోంగూర వెంకటేశ్వరరావు, రుద్ర ప్రదీప్, సన్నె ఉదయ్ప్రతాప్, నున్నా రవికుమార్, డాక్టర్ శీలం పాపారావు, శ్యామ్రాథోడ్, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
అవయవదానంతో ఇంకొందరికి జీవితం
ఖమ్మం వైద్యవిభాగం: అవయవదానంతో మనిషి మరణించినా మరికొందరికి జీవితాన్ని ప్రసాదించే అవకాశం దక్కుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దేవీమానస పేర్కొన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్బంగా గురువారం ఖమ్మంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరణానంతరం కూడా ఇంకొందరికి జీవితాలకు వెలుగు ఇచ్చే అవకాశం ఉన్న అవయవదానంపై యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్పత్రి మెడిక ల్ సూపరింటెండెంట్ నరేందర్ మాట్లాడగా, డిప్యూ టీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్, ఆర్థో ప్రొఫె సర్ ఎల్.కిరణ్కుమార్, ఆర్ఎంఓ రాంబాబు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. -
●ఖాకీ చేతికి తిరిగొచ్చిన లాఠీ !
సుమారు దశాబ్దం తర్వాత పోలీసుల చేతుల్లోకి లాఠీలు వచ్చాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలులో భాగంగా ధర్నాలు, ర్యాలీ వద్ద పోలీసులు ఇన్నాళ్లు లాఠీలు వాడలేదు. ఇటీవల ఉన్నతాధికారులు అన్ని సమయాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు తప్పనిసరేం కాదని సూచించినట్లు తెలిసింది. దీంతో గురువారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యాన తిరంగా యాత్ర, సీపీఐ ప్రజాచైతన్య యాత్ర ర్యాలీ నిర్వహించగా.. బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది లాఠీలతో కనిపించారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
సంతోషం మరువక ముందే...
● అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి ● మూడు రోజుల క్రితమే చెల్లెలి సీమంతంసత్తుపల్లి: అన్నాచెల్లెలు ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. చెల్లెలి వివాహం జరగగా, ఆమె ప్రస్తుతం గర్భవతి, దీంతో బిడ్డకు తోడు ఉండేందుకు తల్లి కూడా అమెరికాకు వెళ్లింది. అక్కడ తల్లితో కలిసి చెల్లెలికి సీమంతం జరిపించి సంతోషంగా గడిపిన సోదరుడు నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన శాంతినికేతన్ విద్యాసంస్థల బాధ్యుడు ములకలపాటి రవి – లీలావతి దంపతులకు కుమారుడు పార్థసారధి(32), కుమార్తె జాహ్నవి ఉన్నారు. వీరిద్దరు అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్నారు. పార్థసారధి ఉన్నత చదువుల నిమిత్తం పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆతర్వాత వెళ్లిన జాహ్నవి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త వైద్యుడిగా అక్కడే స్థిరపడ్డారు. గర్భవతి అయిన జాహ్నవికి తోడు ఉండేందుకు తల్లి లీలావతి నెల క్రితం అమెరికా వెళ్లింది. జాహ్నవి సీమంతం మూడు రోజుల క్రితం నిర్వహించగా, బుధవారం రాత్రి వరకు కుటుంబంతో ఆనందంగా గడిపాక పార్థసారధి తన గదికి వెళ్లాడు. గురువారం నిద్ర లేపేందుకు ప్రయత్నించగా చలనం లేకపోవడంతో నిద్రలోనే గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని నిర్ధారించారు. ‘చెల్లెలి సీమంతం రోజు పార్థసారధి ఫోన్ చేసి నన్ను కూడా అమెరికాకు రమ్మని చెప్పాడు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకుని స్థిరపడతానని చెప్పాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది’ అని తండ్రి రవి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈమేరకు పార్థసారధి చివరి చూపు కోసం రవి గురువారం రాత్రి అమెరికా బయలుదేరగా, అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, పార్థసారధి మృతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తదితరులు సంతాపం తెలిపారు. ఆయనను కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్, సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి, మున్సిపల్ చైర్పర్సన్ ఎం.డీ.రెహానా బేగం, కమల్ పాషా, బొంతు సుమలత, దోమ ఆనంద్ తదితరులు పరామర్శించారు. -
సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
ఖమ్మంక్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయాలను గుర్తించి తనిఖీలు చేపట్టాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. ఖమ్మంలో గురువారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేషన్ల వారీగా అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. అలాగే, డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుంచి తరిమేసేలా విద్యాసంస్థల్లో సదస్సులు నిర్వహించాలని సూచించారు. అంతేకాక పిల్లలు సైబర్ నేరగాళ్ల బారిన పడడంతో పాటు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. తద్వారా పోక్సో కేసులు పెరుగుతున్నందున పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు జాగ్రత్త వహించేలా అవగాహ న కల్పించాలన్నారు. అలాగే, చోరీ కేసుల దర్యాప్తు, సొత్తు రికవరీ, రాత్రి వేళ గస్తీ తదితర అంశాలపై సీపీ సూచనలు చేశారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు వసుంధరయాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, నరసింహారావు, మహేష్, సాంబరాజు, సత్యనారాయణ, సర్వర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
మాకు ఇదే కామన్ !
ఖమ్మంమయూరిసెంటర్: గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెనూ అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతుంటారు. అంతేకాక ఏరోజు ఏం వడ్డించాలో ముద్రించి హాస్టల్ గోడలపై బోర్డులు తగిలిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో అవేమీ అమలుకావడం లేదు. మెనూ ప్రకారం రోజుకో టిఫిన్ అందించాలని ఉన్నా నిత్యం ఒకే రకమైన ఆహారం వడ్డిస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓచోట కిచిడీ, ఇంకోచోట పులిహోర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో టిఫిన్గా విద్యార్థులకు బోండా, చట్నీ అందించాల్సి ఉంది. కానీ ఖమ్మంలోని పలు హాస్టళ్లను పరిశీలిస్తే ఎక్కడా బోండా కానరాలేదు. ఒక హాస్టల్లో కిచిడీ, రసం వండితే.. మరోచోట పులిహోర, ఇంకో చోట జీరా రైస్, గోధుమ రవ్వ ఉప్మా ఇలా వార్డెన్లకు తోచినట్లు చేయించారని తేలింది. మెనూలో పోషకాలు ఉండే ఆహారానికి బదులు సులువుగా తయారయ్యేలా బియ్యంతో చేసే టిఫిన్ వడ్డిస్తున్నట్లు విద్యార్థుల ద్వారా తెలిసింది. గుడ్లు, చికెన్ పంపిణీ అంతంతే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారానికి ఐదు కోడిగుడ్లు, ఆరు అరటిపండ్లు, రెండుసార్లు చికెన్, శనివారం ప్రత్యేక స్వీటే కాక ప్రతిరోజూ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి. కానీ ఇవేమీ అమలుకాకపోగా.. రికార్డుల ప్రకారం హాజరు, వంటకాల్లో ఉపయోగిస్తున్న చికెన్, ఇతర నిత్యావసర సరుకుల పరిమాణానికి పొంతన ఉండడం లేదు. కొనుగోలు బిల్లులు, వినియోగానికి మధ్య కొండంత వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఖమ్మంలోని ఓ గిరిజన హాస్టల్లో గురువారం ఉదయం మూడు కేజీల గోధుమ రవ్వతో ఉప్మా చేయించారు. ఎందరి కోసమని ఆరా తీస్తే 50 మందికి అని వర్కర్లు చెప్పారు. ఇక ఒకటి, రెండుచోట్ల తప్ప ఎక్కడా వార్డెన్లు కనిపించకపోవడం గమనార్హం. డివిజన్లలోనూ వేర్వేరుగా... జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లన్నింటికీ ఒకే రకమైన బడ్జెట్ ఉంటుంది. అయితే, వైరా డివిజన్ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సాధ్యమైనంత మేర అమలువుతుంటే.. ఖమ్మం డివి జన్లోని గిరిజన కళాశాల వసతిగృహాల్లోనే మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉంటున్నాయి. అధికారుల తనిఖీల సమయాన రికార్డులే పరిశీలిస్తూ మెనూ, విద్యార్థుల హాజరును పట్టించుకోవడం తెలుస్తోంది. ఇకనైనా పేద గిరిజన విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.గిరిజన హాస్టళ్లలో అమలు కాని ఒకే తరహా మెనూ మెనూ ఆదారంగా తమకు టిఫిన్, భోజనంలో కూరలు వడ్డించలేదని ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే వారిపై వార్డెన్లు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది. సీనియర్ విద్యార్థుల ద్వారా భయపెట్టడం, అడ్మిషన్ రద్దు చేస్తామని బెదిరిస్తుండడంతో విద్యార్థులు చేసేదేం లేక వడ్డించిందే తిని ఊరుకుంటున్నారు.సత్తుపల్లిలోని వసతిగృహాల పరిశీలనలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించినట్లు తేలింది. ఖమ్మం డివిజన్లోనూ ఆకస్మిక తనిఖీలు చేస్తాం. మెనూ పరిశీలనకు ప్రత్యేక యాప్ వచ్చింది. ఇక నుంచి వార్డెన్లు విద్యార్థులకు వడ్డించిన భోజనం ఫొటోలను అందులో అప్లోడ్ చేయాలి. మెనూ అమలుపై ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – ఎం.ఫిరంగి, డిప్యూటీ డైరెక్టర్, గిరిజన అభివృద్ధి శాఖ -
ఎఫ్బీఓకు కన్నీటి వీడ్కోలు
● వేటగాళ్ల ఉచ్చుకు బలైన నవీన్ అంత్యక్రియలు పూర్తి ● నివాళులర్పించిన కలెక్టర్ దివాకర ● పాడె మోసిన వైరా ఎమ్మెల్యే, కొత్తగూడెం డీఎఫ్ఓ కారేపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులకు మంగళవారం రాత్రి బలైన ఫారెస్టు బీట్ ఆఫీసర్ బానోతు నవీన్(36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామానికి బుధవారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించగా నవీన్ అమర్రహే, అటవీశాఖ అమరవీరుడికి జోహార్లు అంటూ నినాదాలు చేయడమే కాక ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనుబంధాన్ని చాటుకున్నారు. అనంతరం కలెక్టర్ దివాకర టీ.ఎస్., వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, భద్రాద్రి డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్ తదితరులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను ఓదార్చారు. ఆతర్వాత నవీన్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే రాందాస్, డీఎఫ్ఓ సిద్ధార్థ పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. వెంకిట్యాతండాలో విషాదఛాయలు కారేపల్లి మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన బానోతు దేవ్లానాయక్ – వెంకిట్యాతండా సర్పంచ్ బానోతు బూలి చిన్నకుమారుడైన నవీన్ వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలోగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా చేరుకుని కుటుంబీకులను ఓదార్చారు. ఏళ్లుగా రాజకీయ నేపథ్యం కలిగిన దేవ్లా – బూలి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, పెద్ద కుమారుడు లెనిన్ హైదరాబాద్ ఫార్మా కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్నకుమారుడైన నవీన్కు భార్య కవిత, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, కారేపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్రప్రసాద్, రెండు జిల్లాల ఉద్యోగులు, నాయకులు కూడా నవీన్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
భారీగా తగ్గిన భూగర్భ జలాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆకాశం మేఘావృతమవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి ఎల్నినోప్రభావమే కారణమని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ‘సర్’ ప్రక్రియ, ఎల్నినో, జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయంపై ప్రభావం తదితర అంశాలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశం మాట్లాడారు. రానున్న రెండు, మూడు నెలల్లో ఎల్నినో ప్రభావం మరింత అధికంగా ఉంటుందని.. ఆకాశంలో మేఘాలు ఏర్పడినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం తక్కువేనని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపారు. మరోపక్క గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలమట్టం 6.5 నుంచి 8 అడుగుల మేరకు తగ్గగా, రానున్న నెలలో మరింతగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు తోడు బోర్ల వసతి ఉందని భావించకుండా పంటల విషయంలో రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న భూగర్భ జలాలనే వచ్చే జూలై వరకు తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సబ్సిడీపై విత్తనాలు పొద్దు తిరుగుడు, పప్పుధాన్యాలు, కంది, పెసర తదితర తక్కువ నీరు అవసరమయ్యే పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ దివాకర తెలిపారు. పప్పు ధాన్యాల విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. నీటి లభ్యత ఆధారంగా పంటలు ఎంపిక చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వరి సాగు చేయొద్దని సూచిస్తున్నా సత్తుపల్లి ప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, జిల్లాలో ఇంకుడు గుంతలు, కమ్యూని టీ సోక్పిట్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. సుమారు 80వేల మంది రైతులను ఫామ్ పాండ్ల నిర్మాణానికి గుర్తించగా, వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టేందుకు ప్రభుత్వ భవనాల్లోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికప్పుడు జిల్లాలో తక్కువ వర్షపాతం లేదా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని నిర్ధారించలేమని పేర్కొన్న కలెక్టర్... వర్షాకాలం ముగిశాకే పూర్తి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఎస్ఆర్ఆర్లో 87.31 శాతం ఓటర్లను డిజిటలైజేషన్ చేయడం ద్వారా తొలిదశను విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా సవరణకు మరో నెల సమయం ఉందన్నారు. మొత్తం 1.57 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి రాలేదని, ఇందులో కొందరు మృతి చెందినట్లు గుర్తించామన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారు 1,01,000 మంది ఉండగా 11వేల మంది ఫారాలను తిరిగి ఇవ్వకపోవడానికి కారణాలను అధికారులు సేకరిస్తున్నట్లు వివరించారు. ఇంకో 550 మంది ఓటర్లను గుర్తించలేకపోయినట్లు తెలిపారు. ఒకే ఇంటి నంబర్లతో చాలా ఓట్లు ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎస్ఐఆర్లో వాటిపై ఎలాంటి సవరణ చేయలేదని, త్వరలో యంత్రాంగం దృష్టి పెడుతుందని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సీఈ వాసంతి, ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్రెడ్డి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు.. -
పంద్రాగస్టు ముఖ్యఅతిథి.. డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం సహకారనగర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 15వ తేదీన జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఖమ్మం పరేడ్ మైదానంలో ఆయన 9–30గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. నేర పరిశోధన, నిందితుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి ● పోలీసు కమిషనర్ సునీల్దత్ ఖమ్మంక్రైం: నేరాల పరిశోధన, నిందితుల గుర్తింపు ప్రక్రియ వేగంగా చేట్టేలా ట్రాకింగ్ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు, ఖమ్మం త్రీటౌన్ పోలీసుస్టేషన్ను బుధవారం తనిఖీ చేసిన ఆయన స్టేషన్ నిర్వహణ, కేసుల విచారణ, జనరల్ డైరీ రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఆధునాతన పద్ధతులను అందిపుచ్చుకుంటే పరిశోధన, నేరాల కట్టడి సాధ్యమవుతుందని తెలిపారు. వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్’విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా ఈ–సమన్స్, ఈ–సాక్ష్యా వంటివి విస్తృతంగా ఉపయోగించాలని, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా వేయాలని సూచించారు. నగర ఏసీపీ రమణమూర్తి, సీఐ మోహన్బాబు సిబ్బంది పాల్గొన్నారు.16వరకు ఇగ్నోలో ప్రవేశాలకు అవకాశం ఖమ్మం సహకారనగర్: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో ప్రవేశాలకు ఈనెల 16వ తేదీ వరకు అవకాశం ఉందని రీజినల్ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మంలోని పలు డిగ్రీ కళాశాలలు, జ్యోతిబాపూలే గురుకులాల్లో బుధవారం ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇగ్నోలో కోర్సులు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కే.వీ.రమణారావు తదితరులు పాల్గొన్నారు. కలప స్మగ్లర్లకు ఇంటి దొంగల అండ? ఖమ్మంవ్యవసాయం: అక్రమంగా కలప రవాణా చేస్తుండగా ఖమ్మం నగర శివారులో మంగళవారం రాత్రి వాహనం పట్టుబడింది. దీనివెనుక అటవీ శాఖలోని ఓ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ప్రాంతం నుంచి వాహనంలో అనుమతి లేకుండా తుమ్మ కలప తరలిస్తున్న క్రమాన టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది. అయితే, కలప తరలించే వారు ముందుగానే ఆ ప్రాంత అటవీ ఉద్యోగికి సమాచారం ఇవ్వడమే కాక ఆయన చెప్పిన నంబర్కు రూ.3,500 ఫోన్పే ద్వారా చెల్లించినట్లు తెలిసింది. ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భరోసా ఇవ్వడంతోనే కలప తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ బృందం పట్టుకుంది. ఈ మేరకు విచారణలో అటవీ ఉద్యోగి ప్రమేయాన్ని గుర్తించారని సమాచా రం. ఈ వ్యవహారంపై అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా.. విచారణ జరుగుతోందని దాటవేసే ధోరణిలో సమాధానం ఇచ్చారు. ఇక ఇల్లెందు వైపు నుంచి కలప తరలిస్తూ మరో ట్రాక్టర్ కూడా పట్టుబడగా విచారిస్తున్నారు. చుక్కనీరు వృథా కావొద్దు.. నేలకొండపల్లి/ముదిగొండ: గ్రామాల్లో చుక్క నీరు వృథా అయినా సహించేది లేదని జిల్లా పంచాయతీ అధికారి డి.వినోద్కుమార్ పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం అజయ్తండా, చెరువుమాధారం గ్రామాల్లో బుధవారం తనిఖీ చేసిన ఆయన కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించారు. ఆతర్వాత పలువురి ఇళ్లలో ఇంకుడు గుంతలను పరిశీలించాక మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు వృథా కాకుండా లీకేజీలను అరికట్టడంపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు. అంతేకాక ప్రజలు కూడా ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకుని వర్షపు నీరు భూమిలో ఇంకేలా చూడాలని తెలిపారు. కాగా, జలసిరి పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ గుంతల నిర్మాణం. దోమల నివారణకు ఫాగింగ్ తదితరఅంశాలపై సూచనలు చేశారు. అజయ్తండా పంచాయతీ సర్పంచ్ తేజావత్ శివాజీ, కార్యదర్శి బైరం దినేష్కుమార్ పాల్గొన్నారు. అలాగే, ముదిగొండ మండలం మల్లన్నపాలెం జీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీపీఓ వినోద్కుమార్ రికార్డులు పరిశీలించాక పన్ను వసూళ్ల వివరాలు ఆరా తీశారు. పంచాయతీ కార్యదర్శి తలారి జయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. -
జన్మ భూమి..
కన్నతల్లి!సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,57,845 ఓట్లు తొలగిపోనున్నాయి. అయితే, వీటిని పరిశీలిస్తే రెండేసి చోట్ల ఓటు ఉండి.. ఒకే చోట ఖరారు చేసుకున్న వారి దరఖాస్తులు 1,01,549 ఉన్నాయి. అంటే తొలగించే ఓట్లలో 64 శాతం వరకు ఇవే కావడం గమనార్హం. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉపాధి, వ్యాపారాల నిమిత్తం పట్టణానికి వచ్చిన వారు ఓటు హక్కు స్వగ్రామాల్లోనే కొనసాగించుకోవాలనే నిర్ణయం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రభావం జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మం నియోజకవర్గంతోపాటు మధిర, సత్తుపల్లి, వైరా, పాలేరు నియోజకవర్గ కేంద్రాలపై పడింది. వలస ఓటర్ల ప్రభావం జిల్లాలో వలస ఓటర్ల ప్రభావంతో 1,01,549 ఓట్లు తొలగింపునకు రంగం సిద్ధమైంది. మొత్తం తొలగింపునకు గురయ్యే 1,57,845 ఓట్లలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు పలువురికి అటు పల్లె, ఇటు పట్నంలో ఓటుహక్కు ఉండగా ‘సర్’లో భాగంగా ఇలాంటివి తొలగిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో చాలామంది స్వగ్రామాలకే మొగ్గుచూపారు. ఇప్పటి వరకు ప్రతీ ఎన్నికలో పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదయ్యేది. ప్రస్తుతం ఓటర్ల పరంగా ఎక్కువగానే ఉన్నా.. అత్యధికంగా తొలగింపునకు గురయ్యే ఓట్లు కూడా పట్టణ, మండల కేంద్రాల్లోనే ఉండనున్నాయి. ఖమ్మంలో 80వేల ఓట్లు జిల్లావ్యాప్తంగా తొలగించే ఓట్లను పరిశీలిస్తే.. ఒక్క ఖమ్మం నియోజకవర్గ పరిధిలోనే 80,663 ఓట్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా తొలగించే ఓట్లలో ఇవి 51 శాతానికన్నా పైగానే నమోదయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వచ్చిన వారు ఖమ్మంలోనే ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఓట్లు తొలగింపునకు గురి కానున్నాయి. ఇందులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 56,974 ఓట్లు ఉన్నాయి. అక్కడా అంతే.. జిల్లా కేంద్రమే కాక సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోనూ వలస ఓటర్లు తమ స్వగ్రామాలకే ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాల్లోనే ఓటుహక్కు కొనసాగిస్తూ, పట్టణాల్లోని అదనపు ఓటు తొలగించుకుంటున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గ పరిధి ఖమ్మంరూరల్లో 7,158 మంది ఓట్లు, మధిర నియోజకవర్గ కేంద్రంలో 3,861, వైరా నియోజకవర్గ కేంద్రంలో 3,481, సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో 3,675 ఓట్లు తగ్గనుండడం ఓటర్లు తమ గ్రామాలకు ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా తొలగించే ఓట్లు 1,57,845 ఉండగా.. అందులో ఖమ్మం కార్పొరేషన్తోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఓట్లే 1,05,910 (67శాతం) ఉన్నాయి. ఇక శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు 75,149గా ఉన్నాయి. పల్లె ప్రాంతాల నుంచి పలువురు పట్టణాలు, మండల కేంద్రాలకు జీవనోపాధి కోసం వస్తుంటారు. ఈక్రమాన పలువురికి స్వగ్రామాల్లో ఇల్లు, ఇతర ఆస్తులు, రేషన్కార్డులు ఉన్నాయి. వీరు బతుకుదెరువు కోసం పట్టణాల్లో ఉంటున్నా సొంత గ్రామాలపై మమకారం మాత్రం వీడలేదు. ‘సర్’లో ఇలాంటి వారు ఎక్కువగా స్వగ్రామాల్లోనే ఓటు హక్కు కొనసాగిస్తూ, పట్టణ ప్రాంతాల్లోనూ నమోదు చేసుకున్న ఓటు తొలగించుకునేందుకు సిద్ధమయ్యారు. స్వగ్రామాల్లో ఓటే ఖరారు చేసుకున్న పలువురు -
సత్తుపల్లి డీసీసీబీ బీఎం సస్పెన్షన్
● నిబంధనలకు విరుద్ధంగా రుణాల మంజూరు నిజమేనని నిర్ధారణ ● టెస్కాబ్ విచారణ అనంతరం వేటు సత్తుపల్లి: పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలతో విచారణ అనంతరం అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఈమేరకు డీసీసీబీ సత్తుపల్లి బ్రాంచ్ మేనేజర్ జంగం కిషోర్ను సస్పెండ్ చేసినట్లు బుధవారం సీఈఓ వెంకటఆదిత్య వెల్లడించారు. రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని, పలువురు రుణాలు తీసుకుని యూనిట్లు ఏర్పాటుచేయకున్నా సబ్సిడీ మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలతో ‘సాక్షి’లో వరుస కథనాలు మంజూరయ్యాయి. గతనెల 25న ‘లేనిది ఉన్నట్టు.. కనికట్టు’ కథనంతో సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్లో పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల కుంభకోణం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆతర్వాత వరుసగా అంతా సర్దేస్తున్నారు!, తీసుకుంటున్నాం.. తప్పేంటి, సబ్సిడీ కుంభకోణంపై టెస్కాబ్ విచారణ, యూనిట్లు తాత్కాలికమేనా?! శీర్షికలతో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. టెస్కాబ్ విచారణతో.. సబ్సిడీ రుణాల అవకతవకలపై ‘సాక్షి’ కథనాలతో ప్రభుత్వం సీరియస్గా స్పందించగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెస్కాబ్ విచారణకు ఆదేశించారు. టెస్కాబ్ అధికారులు డీసీసీబీ బ్రాంచ్లో రికార్డులనే కాక యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, అధికారులు వస్తున్న సమాచారం రుణగ్రహీతలకు బ్యాంక్ అధికారులు చేరవేసి అప్పటికప్పుడు యూనిట్లు పెట్టించారనే అంశం కూడా ఆధారాలతో సహా ‘సాక్షి‘ బయట పెట్టింది. దీంతో సబ్సిడీ రుణాలకు సంబంధించిన 76 ఫైళ్లను టెస్కాబ్ డీజీఎం సంపత్కుమార్ హైదరాబాద్ తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాక అవినీతి నిర్ధారణ కావడంతో బ్రాంచ్ మేనేజర్ కిషోర్పై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. సదరు అధికారి ములకలపల్లి బ్రాంచ్లో పని చేసినప్పుడు కూడా అవకతవకలకు పాల్పడి సస్పెన్షన్ గురైనట్లు తెలిసింది. కాగా, కొన్ని ఫైళ్లల్లో తహసీల్దార్ సంతకాలను కూడా ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వస్తున్నందున రుణాల రికార్డులను మరింత లోతుగా పరిశీలించాలని పలువురు కోరుతున్నా. థర్డ్ పార్టీ విచారణపైనా.. పీఎంఈజీపీ సబ్సిడీ రుణాలు మంజూరు అయ్యాక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న పోస్టల్ శాఖ అధికారులతో థర్డ్ పార్టీ విచారణ చేయిస్తారు. అంతా బాగుందని నివేదిక ఇస్తేనే సబ్సిడీ మంజూరవుతుంది. కానీ సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో యూనిట్లు లేకుండానే సబ్సిడీ మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
లింగనిర్ధారణ పరీక్షల కట్టడిపై దృష్టి
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా అడ్డుకట్ట వేయడమే కాక నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ రామారావు సూచించారు. గర్భస్ధ లింగ నిర్ధారణ నిషేధ చట్టం(పీసీపీఎన్డీటీ) 1994 అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం మంగళవారం జరగగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నమోదు, పునరుద్ధరణ, రికార్డుల పరిరక్షణపై సూచనలు చేశా రు. ఆడ శిశువులపై వివక్షను నివారించి, బాలికా జననాలపై ప్రజల్లో విస్తృత అవగాహ న కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అదికారులు డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, బిందుశ్రీ, లక్ష్మీనారాయణ, మోతియా, అధికా రులు వీరయ్య, వెంకటేశ్వరరాజు, నాగరాజు, వేణుమాధవరావు, ప్రదీప్బాబు, మాధవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా మహిళా న్యాయవాదుల క్రీడలు ఖమ్మం లీగల్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. ఈమేరకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మహిళా న్యాయవాదులకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహించగా ఉమారాణి, లిఖిత, కేవీవీ.లక్ష్మి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, టెన్నికాయిట్లో ఉమారాణి, రమణ, షాట్పుట్లో కవితశ్రీ, లక్ష్మి, పావని, డిస్కస్ త్రోలో సంధ్యారాణి, కవితారాణి, ఉమారాణి, రన్నింగ్లో అలేఖ్య, పావని, నందిత గెలుపొందారు. ఇక బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రాజబోయిన శ్రీనివాస్, కొప్పుల కృష్ణ జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. పోటీల ఆర్గనైజర్లుగా శేఖర్ రాజు, ఏడునూతల శ్రీనివాసరావు వ్యవహరించగా, కళ్యాణి, శిరీష, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. రూ.కోటి విలువైన ధాన్యం పక్కదారి ముదిగొండ: సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో జిల్లాలోని రైస్మిల్లుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నేలకొండపల్లి, పెనుబల్లి, తల్లాడ మండలాల్లో మిల్లుల్లో తనిఖీ చేసి అక్రమాలను గుర్తించారు. ఇక మంగళవారం ముదిగొండ మండలం సువర్ణాపురం – ముత్తారం రహదారి వెంట శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీలో వరంగల్ నుంచి వచ్చిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ కిషోర్ ఆధ్వర్యాన చేపట్టిన ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. గోదాముల్లోని ధాన్యం బస్తాలు, రికార్డులను పరిశీలించగా రూ.కోటికి పైగా విలువైన 450 మె. టన్నుల ధాన్యం లెక్కలు తేలకపోవడంతో నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు డీసీఎస్ఓ చందన్ కుమార్ తెలిపారు. కాగా, ముత్తారం రహదారిలో పొలాల మధ్య ఉన్న ఈ మిల్లుపై ఆది నుంచి ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల్లో నేలకొండపల్లి సివిల్ సప్లయీస్ డీటీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కట్లేరు అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలి ● జలవనరుల శాఖ సీఈ వాసంతి ఎర్రుపాలెం: మండలంలోని రూ.36. కోట్ల నిధులతో చేపట్టిన కట్లేరు ఆయకట్టు అభివృద్ధి, మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని జలవనరుల శాఖ సీఈ వాసంతి సూచించారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావుతో కలిసి మంగళవారం ఆమె కట్లేరు కాల్వ లైనింగ్, బ్రిడ్జి పనుల్లో నాణ్యతను పరిశీలించారు. రైతుల సూచనల మేరకు కట్లేరు ఎడమ, కుడి కాల్వల్లో పశువులకు ఉపయోగపడేలా ర్యాంపులు, డ్రాప్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఈ శ్రీకాంత్, ఈఈ మధు, డీఈ సాంబశివరావు, ఏఈలు వనజ, రాజేశ్వరరావు, రాము, వంశీ, సర్పంచ్లు షేక్ పెద్దబాబు సాహెబ్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
అలా అయితేనే కొంటాం...
● ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేత ● ఆర్డీ వ్యవస్థకు సడలింపు లేకపోవడమే కారణంఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేశారు. పంట క్రయవిక్రయాల్లో వ్యాపారులకు ఆర్డీ (రేట్ డిఫరెన్స్) వెసలుబాటును నియంత్రించడం ఇందుకు కారణమైంది. రోజులాగే ఉద యం 7 గంటలకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి శాంపిళ్లను రైతులు మార్కెట్కు తీసుకురాగా మొత్తం 174 లాట్లకు సంబంధించి జెండాపాట నిర్వహించారు. ఇందులో ఖరీదుదారులు, కమీషన్దారులు పాల్గొని గరిష్టంగా రూ.22,750కు పాడా రు. ఆపై శ్యాంపిళ్లను పరిశీలించాక అంతా పక్కకు తప్పుకున్నారు. జెండాపాట ధర నిర్ణయించి పంట ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆరా తీయగా కొందరు వ్యాపారులు బహిరంగంగానే ఇతర మార్కెట్ల మాదిరి ఖమ్మం మార్కెట్లో ఆర్డీకి అవకాశం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. రైతు నుంచి పంట కొనుగోలు ధర, బిల్లింగ్ ధరకు తేడా ఉంటేనే వ్యాపారం చేయగలుగుతామన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ విధానం అనధికారికంగా అమలవుతుండగా, ఖమ్మం మార్కెట్లో లేకపోవటంతో బయ్య ర్లు కూడా ఆర్డర్లు ఇవ్వటం లేదని వెల్లడించారు. ఆర్డీతో పన్నులకు తూట్లు పంటల కొనుగోళ్లలో ఆర్డీకి వెసులుబాటు కల్పిస్తే పన్నులకు తూట్లు పడతాయి. ప్రస్తుతం మిర్చి ధర రూ.22 వేలకు పైగా ఉండగా, వ్యాపారులు బిల్లింగ్లో రూ. 5 నుంచి 6 వేల వరకు తగ్గించాలని కోరుతున్నారు. అంటే రూ.16 వేల నుంచి రూ. 17 వేల చొప్పున బిల్లింగ్ చేస్తే మార్కెట్కు చెల్లించాల్సి ఒక శాతం పన్ను, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీలకు 4 – 5 శాతం పన్నుకు తూట్లు పడుతుంది. ఈ విధానం అన్ని ప్రాంతాల్లో అమలవుతున్నా కొద్ది రోజులుగా ఖమ్మం మార్కెట్లో నియంత్రిస్తున్నారు. దీంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు నిలినివేసిన తమ నిరసన తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఖమ్మం మార్కెట్లోనూ ఆర్డీ వ్యవస్థ అమలుచేయాలని వ్యాపారులు, నిబంధనల ప్రకారమే క్రయవిక్రయాలు చేపట్టాలని మార్కెట్ కమిటీ చెబుతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కాగా, మంగళవా రం పంట కొనుగోళ్లు నిలిపివేయటంతో 6,124 బస్తాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. -
ఈసారైనా ముడిపడేనా?
సత్తుపల్లి: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి రెవెన్యూ పరిధిలో భూ వివాదాలను రీ సర్వే ద్వారా పరిష్కారానికి నిర్ణయించారు. ఇటీవల సత్తుపల్లిలో జరిగిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే రాగమయి చేసిన వినతితో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రీ సర్వేకు ఆదేశాలిచ్చారు. పదేళ్లుగా మూడుసార్లు ఎంజాయ్మెంట్ సర్వే చేసి పాస్ పుస్తకాలు జారీ చేసినా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా రైతులు తహసీల్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. బేతుపల్లి సర్వేనెంబర్ 133, 878/938, 138లో సమస్యలు తీవ్రంగా ఉన్నందున హద్దులు తేల్చడంతోపాటు భవిష్యత్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సర్వే చైన్లతో కాకుండా జియో ట్యాగింగ్తో సర్వే చేస్తున్నారు. పొంతన లేని భూమి వివరాలు బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ఏడు పంచాయతీలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం11,782 ఎకరాలకు గాను రికార్డుల్లో 12,047 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. తద్వారా అదనంగా 265 ఎకరాలకు పాస్ పుస్తకాలు జారీ కావడం సమస్యకు కారణమైంది. క్రయవిక్రయాలు జరిగినప్పుడు భూమి బదలాయింపు జరగక రికార్డులో అలాగే కొనసాగించడం, వారసత్వంగా వచ్చినా రికార్డుల్లో పేర్లు మారకపోవడం పాస్ పుస్తకంలో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో భూమికి వ్యత్యాసం ఉండడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీనికి తోడు ధరణి పోర్టల్లో కొన్ని సర్వే నెంబర్లు పూర్తిగా కనిపించకపోవడం ఇంకొన్ని తప్పుగా నమోదు కావడంతో సరిహద్దు సమస్యలు ఏర్పడి తరచూ ఘర్షణలు తలెత్తున్నాయి. ముప్పై ఏళ్లకొకసారి.. ప్రతీ ముప్పై ఏళ్లకొకసారి రీ–సర్వే జరగాల్సి ఉన్నప్పటికీ 90 ఏళ్లుగా జరగటం లేదు. తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భూ వివాదాల పరిష్కారం కోసం రీ సర్వేకు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో తరచూ వివాదాలు జరుగుతున్న బేతుపల్లి రెవెన్యూను పైలట్గా ఎంపిక చేసింది. సర్వే అనంతరం భూ యజమానుల రికార్డులు ఆధునీకరించి పక్కాగా కంప్యూటరీకరణ చేస్తారు. దీంతో వివాదాలు తగ్గి.. ప్రభుత్వ పథకాలు నేరుగా నిజమైన భూ యజమానికి అందనున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణలో.. కలెక్టర్ దివాకర టీ.ఎస్. పర్యవేక్షణలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ముగ్గురు చొప్పున పది బృందాలను ఏర్పాటుచేశారు. మొత్తంగా సర్వేను 45 రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని 11,782 ఎకరాలను సెక్టార్కు వేయి ఎకరాలు నుంచి 1,100 ఎకరాలు కేటాయించి రీ సర్వే చేపడుతున్నారు. ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి, పట్టా భూమి, గ్రామ కంఠం, రోడ్లు, చెరువుల భూమి నిర్ధారించాక, రైతులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే మిగతా భూమి సర్వే చేస్తున్నారు. అలాగే, పాత విధానం కాకుండా జియో ట్యాగింగ్తో అక్షాంశాలు, రేఖాంశాల (జీపీఎస్) ఆధారంగా సర్వే చేసి రైతుల సమక్షంలోనే నమోదు చేసి భూ ఆధార్ నెంబర్ కేటాయిస్తారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. ఈ సర్వేతోనైనా సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండలం సత్తుపల్లి రెవెన్యూ బేతుపల్లి పంచాయతీలు ఏడు విస్తీర్ణం 11,782 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో 12,047 ఎకరాలు అదనం 265 ఎకరాలు ప్రస్తుతం సర్వే నాలుగోసారి బేతుపల్లి రెవెన్యూలో భూముల రీ సర్వే సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూలో రీ–సర్వేను కలెక్టర్ దివాకర మంగళవారం పరిశీలించారు. భూ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎవరి భూమి అయినా రికార్డుల నమోదు కాకపోతే ఉద్యోగులకు చెప్పి సర్వే చేయించుకోవాలని తెలిపారు. సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్(అమ్ములు), సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, తహసిల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం రైతుల సహకారంతో సర్వే వేగంగా జరుగుతోంది. ఏ రోజుకారోజు వివరాలను సత్తుపల్లి తహసీల్దార్కు, అక్కడి నుంచి ఉన్నతాధికారులకు చేరుతుంది. కలెక్టర్ దివాకర సూచనలతో రీ సర్వే ఎటువంటి ఆటంకాలు లేకుండా చేపడుతున్నాం. త్వరలోనే పూర్తిచేసి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. – వి.నాగభూషణం, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్, కల్లూరు -
బోధించే వారే దారి తప్పారు..
● నకిలీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు ● ఉమ్మడి జిల్లాలో నలుగురి గుర్తింపు, నోటీసులుమధిర: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన వృత్తిలో ఉన్న అధ్యాపకులే దారి తప్పారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ సర్టిఫికె ట్లు సమర్పించినట్లు బయటపడడంతో ఉమ్మడి జిల్లాలో నలుగురు లెక్చరర్లు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వివరణ అందిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసే అవకాశముంది. 2023లో నియామకం గత ప్రభుత్వం 2023 ఏప్రిల్ 4న ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులను ఎంపిక చేసింది. తొలుత నియామకపత్రాలు ఇచ్చిన అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. అయితే, నియామకాల్లో అవకతవకలు జరిగాయని, పలువు రు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని విద్యార్థి సంఘాల నాయకులు, అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఈమేరకు లెక్చరర్లగా నియమితులైన అందరి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్ట గా రాష్ట్రంలో 35మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లానుంచి నలుగురు ఉన్నట్లు తేలడం చర్చనీయాంశంగా మారింది. బిహార్ సర్టిఫికెట్ మధిర జూనియర్ కాలేజీలో నియమితులైన గంటా కృష్ణ అంతకుముందు ములుగు జిల్లా వాజేడులో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత రెగ్యులర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన 2009లో బిహార్లోని బోద్గయలో ఉన్న మగధ యూనివర్సిటీలో పీజీ చేసినట్లు సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే, టాస్క్ఫోర్స్ అధికారులు ఆరా తీయగా మగధ యూనివర్సిటీలో కృష్ణ పీజీ చేయలేదని, తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని అక్కడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో కృష్ణ నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు నిర్ధారిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 7న మధిర కాలేజీకి మెయిల్ పంపించారు. ఈమేరకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేస్తూ, సమాధానం ఆధారంగా చర్యలు తీసుకోవడమే కాక క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై మధిర కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ను వివరణ కోరగా... కృష్ణ నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు మెసేజ్ వచ్చిందని తెలిపారు.ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న గంటా కృష్ణ, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న షేక్ రోషన్బీ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ లెక్చరర్ చాంద్పాషా, పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ యాకయ్య కూడా ఈ జాబితాల ఉండడంతో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
కొణిజర్ల: విద్యార్థులకు బోధన, నాణ్యమైన భోజ నం సమకూర్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. కొణిజర్ల సమీపాన కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చదివే చల్లా హేమశ్రీ ఆది వారం రాత్రి మృతి చెందగా ఎమ్మెల్యే, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మంగళవారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న విద్య, వైద్యం, వసతి సౌకర్యాలపై ఎస్ఓ సౌజన్యతో చర్చించడమే కాక బాలికలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం, భద్రతపై శ్రద్ధ చూపుతూనే ప్రభుత్వం కలిపిస్తున్న సదుపాయాలు అందజేసే బాధ్యత ఉపాధ్యాయులదేని తెలిపారు. ఆతర్వాత గిరిజనఆశ్రమ పాఠశాలలో కూడా ఎమ్మెల్యే తనిఖీ చేశారు. అనంతరం కొణిజర్ల మండలం బస్వాపురంలో విద్యార్థి హేమశ్రీ కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే, సుడా చైర్మన్ పరామర్శించా రు. ఆమె తల్లిదండ్రులు మౌనిక – రమేష్ను పరా మర్శించడమే కాక ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ చల్లా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సవళ్ల నాగేశ్వరరావు, నాయకులు వడ్డె నారాయణ రావు, సూరంపల్లి రామారావు, రాంపూడి రోశయ్య, కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే -
రూ. 17.74 కోట్లతో ఫ్రూట్ మార్కెట్
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలో వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడేలా పండ్ల మార్కెట్కు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఖానాపురంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణంతో పాటు పక్కనే ఉన్న స్థలం కలుపుకుని మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయించారు. వీధి వ్యాపారుల ప్రాంగణం వినియోగంలో లేకపోవడంతో 2.30 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటుచేస్తారు. వ్యవసాయ మార్కెట్ పరిధిలో.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులు అవసరమైన నిర్మాణాలు, నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. పండ్ల మార్కెట్లో యార్డు, వే బ్రిడ్జి, అంతర్గత రహదారులు, ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రహరీ, ఆర్చ్ వంటి నిర్మాణాలకు రూ.17.74 కోట్లు అవసరమని అందులో పొందుపరిచారు. రైతులు, వ్యాపారులకు ప్రయోజనం ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. మామిడి, జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, జీడి మామిడి వంటి పండ్ల తోటలు ఉండగా.. వీటి విక్రయానికి రైతులు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాపారులకు కూడా సరైన హోల్సేల్ మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే దాదాపు 44మంది హోల్సేల్ పండ్ల వ్యాపారులు ఉన్నారు. ఈమేరకు ఖమ్మంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటైతే రైతులకే కాక వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడనుంది.ఖానాపురంలో ఏర్పాటుకు కసరత్తుఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అనుబంధంగా పండ్ల మార్కెట్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఖానాపురంలోని 2.30 ఎకరాల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఇందుకు కావాల్సిన రూ.17.74 కోట్ల మంజూరుకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. – యరగర్ల హన్మంతరావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ -
అక్షరాలా లక్షన్నర !
అనర్హుల తొలగింపునకు... అర్హులైన ఓటర్లను గుర్తించడమే కాక మృతి చెందిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని తొలగించడంతో పాటు ఓటర్ల వివరాల్లో అవసరమైన మార్పుల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను చేపట్టారు. ఈ సందర్భంగా 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత జాబితాతో రివిజన్ చేపట్టారు. 87.31 శాతం డిజిటలైజేషన్ జిల్లాలో 10,85,927 మంది తమ ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందజేయగా సోమవారం అర్ధరాత్రి వరకు డిజిటలైజేషన్ 87.31 శాతంగా నమోదైంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా పాలేరులో 92.21 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఇక్కడ 291 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,45,885 మంది ఓటర్లకు 2,26,729 మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. అతితక్కువగా ఖమ్మం నియోజకవర్గంలోని 355 పోలింగ్ కేంద్రాల్లో 3,28,203 మంది ఓటర్లు ఉండగా.. 2,47,540 మందే ఫారాలు అందజేశారు. దీంతో ఇక్కడ 75.42 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. అలాగే, డిజిటలైజేషన్ చేసిన వాటిలో 43,131 దరఖాస్తుల మ్యాపింగ్ కాకపోవడంతో వీరికి ఈనెల 17 నుంచి నోటీసులు జారీ చేస్తారు. పుట్టిన తేదీని అనుసరించి కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమో, తల్లిదండ్రుల సర్టిఫికెట్లతో సమర్పిస్తే అర్హతల ఆధారంగా ముసాయిదా జాబితాలో చోటు కల్పిస్తారు. తొలగింపులో ఖమ్మం టాప్ జిల్లాలో ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 12,43,781 మంది ఓటర్లకు గాను సర్ అనంతరం 1,57,854 మంది ఓట్లు తొలగించనున్నారు. ఇందులో 33,380 మంది మరణించగా.. 1,01,549 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు 11,004 మంది, చిరునామా లభించని వారు 11,371 మంది ఉండగా.. ఇతర కారణాలతో ఫారాలు అందజేయని వారు 550 మంది ఉన్నారని తేలింది. వీరందరి పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు. కాగా, ఇతర కారణాల జాబితాలో ఉన్న వారెవనైనా అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆధారాలు సమర్పిస్తే పేర్లు కొనసాగుతాయి. మొత్తంగా 1,57,854 మంది ఓట్లు తొలగించనుండగా.. అందులో అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 80,663 మంది ఉన్నారు. తొలగించే మొత్తం ఓట్లలో 51 శాతానికి పైగా ఇక్కడే ఉండడం గమనార్హం. ఆ తర్వాత మధిరలో 20,638 మంది, వైరాలో 17,153 మంది, పాలేరులో 19,156 మంది, సత్తుపల్లి నియోజకవర్గంలో 20,244 మంది ఓట్లు తొలగించనున్నారు. అగ్రస్థానాన వేంసూరు ‘సర్’ డిజిటలైజేషన్ను మండలాల వారీగా పరిశీలిస్తే జిల్లాలోని వేంసూరు అగ్రస్థానాన నిలిచింది. ఇక్కడ 46 పోలింగ్కేంద్రాల పరిధిలో 36,625 మంది ఓటర్లు ఉండగా.. 35,159 ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. అంటే 95 శాతానికి పైగా నమోదైంది. అలాగే నేలకొండపల్లి మండలంలో 95 శాతం పూర్తవగా.. 90 శాతానికి పైగా డిజిటలైజేషన్ అయిన మండలాల్లో తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, కూసుమంచి, ఎర్రుపాలెం, ముదిగొండ, బోనకల్, చింతకాని, జూలూరుపాడు, సింగరేణి, ఏన్కూరు, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాలు ఉన్నాయి. 80 – 90 శాతం లోపు సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మంరూరల్ మండలాలు, 70 – 80 శాతం లోపు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిజిటలైజేషన్ పూర్తయింది. ‘సర్’లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తవడంతో ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అదేరోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాక అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. దీంతో ‘సర్’ ప్రక్రియ పూర్తవుతుంది.జిల్లాలో 1,57,854 ఓట్లు ఫట్ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బీఎల్ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి ఇచ్చే గడువు సోమవారంతో ముగియగా డిజిటలైజేషన్ పూర్తి చేశారు. జిల్లాలోని 1,460 పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,43,781 మందికి గాను అందిన 10,85,927 ఫారాలను డిజిటలైజేషన్ చేయగా జిల్లాలో 87.31 శాతంగా నమోదైంది. దీంతో మిగిలిన 1,57,854 ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు. ఇందులో మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారే అత్యధికంగా ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంవివరాలు ఖమ్మం పాలేరు మధిర వైరా సత్తుపల్లి మొత్తం ఓటర్లు 3,28,203 2,45,885 2,26,126 1,96,475 2,47,092డిజిటలైజ్ చేసినవి 2,47, 540 2,26,729 2,05,488 1,79,322 2,26,848వారసులుగా మ్యాపింగ్ 1,29,583 1,25,415 1,06,733 98,353 1,27,440స్వయంగా మ్యాపింగ్ 95,151 90,951 95,127 77,604 96,432మ్యాపింగ్ కానివి 22,799 10,363 3,628 3,365 2,976మరణించిన వారు 9,155 5,540 6,888 5,604 6,193శాశ్వతంగా వలస 58,952 11,345 10,889 9,659 10,704ఆల్రెడీ ఎన్రోల్డ్ 3,865 1,577 1,871 1,376 2,315అందుబాటులో లేనివారు 8,222 644 989 497 1,019ఇతర కారణాలు 469 50 01 17 13తొలగించే ఓట్లు 80,663 19,156 20,638 17,153 20,244 -
పరిహారం విడుదలలో జాప్యం చేయొద్దు
కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ చట్టం అమలుకు సంబంధించి జిల్లా, మండల, గ్రామ స్థాయిలో గుర్తించిన ప్రతీ సమస్యను పరిష్కరించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన పోలీసు కమిషనర్ సునీల్దత్తో కలిసి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించాక కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై మూడు నెలలకోసారి జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రతీ అంశంపై అధికా రులు చర్యలు తీసుకుని నివేదిక సమర్పించా లని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం త్వరగా అందించాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రతీనెల మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే నిర్వహణ, మానిటరింగ్ కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డుల జారీపై సమీక్షించారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు అట్రాసిటీ చట్టం కింద 62 ఫిర్యాదులు అందగా, విచారణ తర్వాత 53 కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీపీ విజయలక్ష్మి, ఎస్సీ డీడీ జి.జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముజాహిద్, డీఆర్డీఓ శ్రీరామ్, డీఎంహెచ్ఓ రామారావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.సమస్యల పరిష్కారం కోసం నేడు నల్లబ్యాడ్జీలతో నిరసనఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించడంతో పాటు పెండింగ్లో ఉన్న డీఏలు, బిల్లులను చెల్లించాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యాన బుధవారం నిరసన తెలపనున్నట్లు టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్, జిల్లా కార్యదర్శి వెంగళరావు తెలి పారు. ఖమ్మంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల వేతనాల నుంచి మూడు నెలలుగా నగదు మినహాయిస్తున్నా హెల్త్కార్డుల జారీలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం అన్ని తహసీల్దార్ కార్యాల యం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరనన తెలపనుండగా, ఉపాధ్యాయులు అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతంచేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సు సీజ్ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో పరిమితి మించి విద్యార్థులను తీసుకెళ్తుండగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశా రు. ఖమ్మంలో మంగళవారం సదరు బస్సును విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకుని రవాణాశాఖా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఉద్యోగులు తనిఖీ చేసి పరిమితి కన్నా ఎక్కువ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు తేల్చి సీజ్ చేశారు. అంతేకాక ఆ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా లేకపోవడంతో జరిమానా విధించనున్నట్లు ఇన్చార్జ్ ఆర్టీఓ శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా కలప తరలిస్తున్న వాహనాలు స్వాధీనంఖమ్మంవ్యవసాయం: వివిధ ప్రాంతాల నుంచి కలపను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను మంగళవారం రాత్రి అటవీశాఖ టాస్క్ ఫోర్స్ బృందాలు వలపన్ని పట్టుకున్నాయి. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ప్రాంతం నుంచి ఓ బొలేరో వాహనంలో తుమ్మ కలపను తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఇల్లెందు రహదారిలో అనుమతి లేకుండా ఖమ్మం వైపు వస్తున్న ట్రాక్టర్ ను కూడా స్వాధీనంచేసుకుని ఖమ్మం అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ రెండు వాహనాల్లోని కలప విలువను బుధవారం అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని టాస్క్ఫోర్స్ అటవీ అధికారి ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. ‘అక్రమంగా కలప రవాణా?’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో అధికారులు మంగళవారం తని ఖీలు పెంచటంతో రెండు వాహనాలు చిక్కాయి. గురుకులంలో ఎలుకల కాటు..ఆరుగురు విద్యార్థినులకు గాయాలు సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం అడవిమల్లెలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అడవిమల్లెలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను సోమవారం రాత్రి ఎలుకలు కరిచాయి. విద్యార్థినులు మంగళవారం ఈ విషయాన్ని చెప్పడంతో లంకాసాగర్ పీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. అయితే, గురుకుల హాస్టల్లో ఎలుకల బెడద కొత్తేమీ కాదని, గతంలోనూ పలువురిని కరిచినా నివారణ చర్యలు చేపట్టలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఎలుకల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
కొణిజర్ల: ఽదరల నియంత్రణలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం కొణిజర్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా తనికెళ్ల ఆఫీస్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం విధానాల కారణంగా కార్పొరేట్ శక్తులు ప్రజలను దోచుకుంటూ ఎదుగుతున్నారన్నారు. 2014 నుంచి మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకపోగా, అవినీతి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు మతం పేరుతో దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, దొండపాటి రమేష్, గడల భాస్కరరావు, యామాల గోపాలరావు, యాసా వెంకటేశ్వరరావు, లతాదేవి, కళావతి, సీతామహా లక్ష్మి, నరసింహరావు, గోవిందరావు, వెంకటరెడ్డి, ఏదులాపురం కౌన్సిలర్ శ్రీజ సుదర్శన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో హేమంతరావు -
విప్లవోద్యమ నాయకురాలు సీతక్క
●నివాళులర్పించిన మాస్లైన్ నేతలు ఖమ్మంమయూరిసెంటర్: దాదాపు 30 ఏళ్ల పాటు అడవిలో సాయుధ సభ్యురాలుగా పనిచేసిన గంగసాని సీతక్క(సరోజిని) విప్లవోద్యమ నాయకురాలు అని మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందగా ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నివాళులర్పించారు. అనంతరం రంగారావు మాట్లాడుతూ సీతక్క సీని యర్ నేత ధర్మన్న జీవిత సహచరి కాగా, 15 ఏళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య కారణాలతో బయట ఉంటున్నారని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు సభ్యులు జి.రామ య్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, సీహెచ్.శిరోమణి, టీ ఝాన్సీ, పి శోభ, శివకుమార్, కొత్తపల్లి రేణుక, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాయల రవికుమార్, న్యాయవాది కందాల క్రాంతికుమార్తో పాటు పోటు శ్రీనివాస్, గంగసాని కృష్ణ, రమాదేవి తదితరులు కూడా సీతక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
హత్య చేసి.. మృతదేహాన్ని తీసుకొచ్చి !?
●మధిర సమీపాన బిహార్ వాసి మృతదేహం మధిర:మధిరలోని పీవీఆర్ కల్యా ణ మండపం దగ్గర మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సదరు వ్యక్తిని ఇత ర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లు భావి స్తుండగా, మధిర– వైరా ప్రధాన రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మధిర టౌన్ సీఐ రమేష్, సిబ్బంది చేరుకుని పరిశీ లించాక మృతుడి ముఖం, చేతులపై రక్తపు మరకల ను గుర్తించారు. ప్రధానరహదారికి సుమారు 50 అడు గుల దూరాన మృతదేహం ఉండడంతో ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్యేనన్న అంచనాకు వచ్చారు. బిహార్ వాసి.. ఖమ్మంలో నివాసం బిహార్ రాష్ట్రంలోని ముజాఫూర్ జిల్లాకు చెందిన ఎండీ.తలీమ్(45) ఖమ్మం గట్టయ్యసెంటర్లోని ఒక బొటిక్ దుకాణంలో ఎంబ్రాయిడరీ వర్కర్గా పని చేస్తున్నాడు. ఆయన ఇటీవల మద్యానికి బానిస కాగా, ఖమ్మం నుంచి బస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు వెళ్లినట్లు టికెట్ల ద్వారా గుర్తించారు. ఆపై బస్సులో సోమవారం మధిరకు చేరుకున్న ఆయన సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలోని పూల దుకాణం వద్ద తిరగగా 11–30 గంటలకు ఫోన్ స్విచాఫ్ అయినట్లు తేలింది. ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి హత్య చేసి వైరా రోడ్డులోని ఖాళీ ప్లాట్లో మృతదేహాన్ని పడేసి ఉంటారని తెలుస్తోంది. గంజాయి మత్తులో ఎవరైనా హత్య చేశారా, ఇతర కారణాలు ఉన్నాయా అనేది తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, తలీమ్కు భార్య, నలుగురు కుమారులు ఉండగా కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రమేష్ తెలిపారు. -
ఇక్కడా ‘ఇజ్రాయిల్’ సాంకేతికత
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ కార్పొరేషన్ బృహత్తర ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. రూ.160 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు వృథా కాకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ల నుంచి వినియోగదారుడి ఇంటికి నీరు చేరుతుంది. దేశం నుంచి తొమ్మిది మంది ఐఏఎస్లు, తొమ్మిది మంది చీఫ్ ఇంజనీర్లతో కూడిన బృందం ఇజ్రాయిల్లో పర్యటించగా, ఇందులో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉన్నారు. ఎనిమిది రోజుల పాటు అక్కడ జరిగిన అంతర్జాతీయ స్థాయి అర్బన్ వాటర్ సప్లై అండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పట్టణ నీటి సరఫరా, ఆధునిక జల నిర్వహణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించి అంశాలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు, అధ్యయనాల్లో పాల్గొని ఖమ్మం వచ్చిన కమిషనర్ అక్కడి ప్రత్యేకతలు, వాటి ఆధారంగా ఖమ్మంలో చేపట్టే పనులను మంగళవారం వివరించారు. ఆ వివరాలు కమిషనర్ మాటల్లోనే... మన దగ్గర లీకేజీలే సమస్య ఇక్కడ ఇజ్రాయిల్ తరహా నీటి కొరత లేదు. ఖమ్మంలో లకారం, మున్నేరు, పాలేరు, సాగర్ కెనాల్ ద్వారా పుష్కలంగా నీరు లభిస్తోంది. నగరానికి రోజుకు 70 మిలియన్ లీటర్ల నీరు అవసరమైతే, ప్రతిరోజూ అంతే పరిమాణంలో సరఫరా చేస్తున్నాం. అయినా ప్రజలకు రోజు విడిచి రోజు అది కూడా గంట లేదా గంటన్నర మాత్రమే నీళ్లు వస్తున్నాయి. నీటి లీకేజీలు, అనధికారిక కనెక్షన్లు, పాతకాలం నాటి మౌలిక సదుపాయాలే ఇందుకు కారణం. ప్రజలు నేరుగా లైన్మెన్లతో మాట్లాడి, పైపులకు జాయింట్లు వేసి అనధికారికంగా నీటిని తోడేస్తున్నారు. తద్వారా నీరు వృథా అవడమే కాక కేఎంసీకి ఆదాయం రావడం లేదు. అందుకే లీకేజీలను అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.160 కోట్లతో నగరమంతా.. ఖమ్మం నగరం మొత్తంలో 150 డీఎంఏలు ఉన్నాయి. డీఎంఏ అంటే నీటి సరఫరా వ్యవస్థలో నీటి ప్రవాహం, పీడనాన్ని మీటర్ల ద్వారా పర్యవేక్షించి నియంత్రించే ఒక నిర్దిష్ట ప్రాంతం. పైలట్ ప్రాజెక్ట్ విజయంతో కార్పొరేషన్ తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.160 కోట్ల గ్రాంట్ మంజూరు చేయడంతో టెండర్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ఈ నిధులతో నగరంలోని అన్ని డీఎంఏలలో ఆధునిక పైప్లైన్లు, సెన్సార్లు ఏర్పాటు చేసి 24 గంటల నిరంతర తాగునీటి సరఫరాను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం.ఇజ్రాయిల్లో నీటి లభ్యత చాలా తక్కువ. అందుకే వాళ్లు గాలి నుంచి నీటిని తయారు చేయడం, సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చడం లాంటి వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అక్కడ నీటిని అమూల్యమైన సహజ వనరుగా పరిగణిస్తారు. సొంతంగా బోర్ వేసుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రతీ బోర్కు మీటర్ బిగించి నీటి వినియోగానికి తగినట్లుగా బిల్లు చెల్లించాల్సిందే. పైగా లీకేజీలను గుర్తించడానికి భూగర్భ పైప్లైన్లలో ప్రతీ 200 మీటర్లకు ఒక సెన్సార్లు, స్కాడా సిస్టమ్ అమర్చారు. లీకేజీ ఏర్పడగానే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగుతాయి.రూ.160 కోట్లతో నిరంతరం తాగునీటి సరఫరా -
బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆదిమ మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రం సమీపంలోని ఓ బండపై శిలాయుగపు ఆదిమ మానవులు ఉపయోగించినట్లు భావిస్తున్న నూరుడు గుంతలు కనిపించాయి. ఆయుధాలను పదును చేసుకునేలా ఈ గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాక ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు పసుమర్తి శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు చారిత్రక ఆనవాళ్లు కలిగిన పరుపు బండలుఽ ధ్వంసం కాకుండా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుని సంరక్షించాలని కోరారు. -
రేక్ పాయింట్కు 2,635 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,635.47 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,275.47 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 660 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. పార్ట్టైం విధానంలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఫ్యాకల్టీ పోస్టులను పార్ట్టైం విధానంలో భర్తీ చేయనుండగా, అర్హులైన గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డిగ్రీ, పీజీలో 55శాతం మార్కులు కలిగి ఉండి, బీఈడీ, టెట్ ఉత్తీర్హులైన వారు అర్హులని పేర్కొన్నారు. మహిళా విభాగంలో టీజీటీ(హిందీ, గణితం, బయోసైన్స్, సోష ల్), జేఎల్(బోటనీ) ఐదు పోస్టులు ఉండగా, జనరల్ విభాగంలో పీజీటీ(హిందీ, ఇంగ్లిష్, సోషల్), జేఎల్(జువాలజీ) నాలుగు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టి ఫికెట్ల జిరాక్స్లతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా భద్రాచలం ఐటీడీఏలోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 85001 36628 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మార్కులు, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని పీఓ తెలిపారు. గురుకుల డిగ్రీ కళాశాలల్లో.. ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ రాహుల్ తెలిపారు. పీజీలో 55శాతం మార్కులతో పాటు నెట్/సెట్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో కామర్స్ ఆరు, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ రెండేసి పోస్టులతో పాటు గణితం, బోటనీ, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్ ఒక్కో పోస్టు భర్తీ చేస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఈనెల 13న సాయంత్రం 5గంటల్లోగా పాల్వంచ కేఎల్ఆర్ పీజీ కళాశాల ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 98489 65711, 79893 25024 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు. క్రికెట్ మ్యాచ్లో జిల్లా జడ్జి జట్టు విజయం ఖమ్మం లీగల్: రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాదులకు నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా సోమవారం జ్యూడీషియల్ అధికారులు, ఉద్యోగుల జట్టు – న్యాయవాదుల జట్ల నడుమ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జిల్లా జడ్జి జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 99 పరుగులు చేయగా, రావూరి శ్రీను, దిలీప్ చెరో 20 పరుగులు చేశారు. అనంతరం జిల్లా జడ్జి జట్టు 13 ఓవర్లలోనే 103 పరుగులు చేయడంతో విజయం సాధించింది. జట్టులో రాజేష్ అర్ధ సెంచరీ సాధించగా జిల్లా జడ్జి నాగరాజు బ్యాటింగ్, బౌలింగ్లో ప్రతిభ కనబరిచారు. అంతేకాక రావుల వెంకట్ – కె.ఉపేందర్రెడ్డి జట్లు తలపడగా వెంకట్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సీనయ్య, ప్రవీణ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్లపల్లి రమేష్, కొప్పుల రవితో పాటు జానీమియా, కొల్లి సత్యనారాయణ, మందడపు శ్రీనివాసరావు, రామారావు, నారాయణ, రాంబ్రహ్మం, పవన్, వెంకట్ నారాయణ పాల్గొన్నారు. రూ.7.50కోట్ల విలువైన ధాన్యం పక్కదారి తల్లాడ: తల్లాడలోని విజయదుర్గ రైస్ ఇండస్ట్రీలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం చేపట్టిన తనిఖీల్లో భారీగా ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తించారు. వరంగల్ విజిలెన్స్ అధికారులు రైస్ ఇండస్ట్రీలో తనిఖీ చేపట్టి ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించిన విషయం విదితమే. ఈమేరకు రూ.7.50 కోట్ల విలువైన 2449.384 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు తేల్చారు. దీంతో విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో మిల్లు యజమాని బండారు నరసింహారావుపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లువైరా సీఐ వెంకప్రసాద్ తెలిపారు. -
మనోహరం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో రామయ్య కల్యాణం మనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం స్టేడియం ప్రాంగణంలోని రామ సేవామండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. అర్చకులు స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని పూర్తిచేశారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి పాల్వంచలోని బాపూజీ నగర్కు చెందిన కట్టెకోల యాదగిరిరావు రూ.లక్ష విరాళం అందించారు. ఈఓ దామోదర్రావు వారికి రశీదును అందచేశారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్పు అవసరం
కారేపల్లి/కామేపల్లి/రఘునాథపాలెం/కొణిజర్ల: దేశంలో బీజేపీ వ్యవహరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదటంచుకు చేరిందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ పేర్కొన్నారు. ఈమేరకు ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్పు అత్యవసరమని ఆయన తెలిపారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర సోమవారం కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో సురేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్రం రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చకపోగామరింత సంక్షోభంలోకి నెట్టిందని, ఎరువుల ధరలు పెంచి భారం మోపిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తూ ఆ పార్టీ నాయకులకే పథకాలు అందిస్తుండగా మిత్ర ధర్మాన్ని ఎక్కడా పాటించడం లేదన్నారు. కాగా, రఘునాథపాలెం మండలం పాపటపల్లి, చిమ్మపుడి గ్రామాల్లో మహ్మద్ రజబ్ అలీ విగ్రహాల వద్ద నాయకులు నివాళులర్పించారు. కాగా, యాత్ర శనివారం రాత్రి కొణిజర్ల మండలంలోకి ప్రవేశించగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు తదితరులు మాట్లాడారు. ఈ యాత్రలో సీపీఐ రాష్ట్ట్ర, జిల్లా నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, ఏపూరి లతాదేవి, స్వర్ణ రమేష్, అజ్మీరా రామ్మూర్తి, రావి శివరామకృష్ణ, ఆనందరావు, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, రాయల రామారావు, అజ్మీరా నరేష్, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పోటు కళావతి, సింగు నర్సింహారావు, సీతామహాలక్ష్మి, సిద్దినేని కర్ణకుమార్, తాటి నిర్మల, పగడాల మల్లేష్, శాఖమూరి శ్రీనివాసరావు, దొండపాటి రమేష్, ఎం.వెంకటరెడ్డి, గడల భాస్కరరావు, తోటపల్లి సీతారాములుతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. యాత్రలో సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్ -
వాహనాల ఫిట్నెస్.. ఆటోమేటిక్!
ఖమ్మంక్రైం: సరుకు, ప్రజా రవాణా చేసే లారీలు, బస్సులు, లైట్ మోటార్ వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు ఇన్నాళ్లు అధికారులే ప్రత్యక్షం(మ్యాన్వల్)గా చేపడుతుండగా, ఈ విధానానికి చెల్లుచీటి పాడనున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా ఫిట్నెస్ పరీక్షించేందుకు యంత్రాలను వినియోగించనున్నారు. ఈమేరకు తొలిదశగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు(ఏటీఎస్)లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింధి. ఇందులో ఖమ్మం జిల్లా రవాణాశాఖా కార్యాలయానికి కూడా చోటు దక్కడం విశేషం. మొదటి దశలోనే ఖమ్మంలో... రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 37 ప్రాంతాల్లో ఏటీఎస్(ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్)లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో తొలుత 15 ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా ఇందుకోసం రూ.50కోట్లు కేటాయించారు. ఈ జాబితాలో ఖమ్మం కూడా ఉండడంతో ఇక్కడి రవాణా శాఖ కార్యాలయంలో రూ.3కోట్ల విలువైన ఆటోమెటిక్ స్టేషన్ను ఏర్పాచేస్తారు. ఫిట్నెస్ పరీక్షలు ఇలా... ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో ప్రత్యేక పరికరాలు ఉంటాయి. వీటి పరిధిలోకి వాహనం వెళ్లగానే వాహనాల బ్రేక్, ఇంజన్ సామర్థాలే కాక కాలుష్య ఉద్గారాలు, ఇతర అంశాలను సెన్సార్లతో పరీక్ష పూర్తవుతుంది. ఆపై అంతా సక్రమంగా ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. అలా సర్టిఫికెట్ ఉన్న వాహనం వివరాలు నేరుగా కేంద్ర రవాణాశాఖ పరిధిలోని వాహన్ పోర్టల్లో ఆప్లోడ్ అవుతాయి. తద్వారా అవినీతికి ఆస్కారం లేకపోగా, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పెరిగి రోడ్డు భద్రత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏటీఎస్ యంత్రం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రవాణాశాఖా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. యంత్రం నిర్వహణ, పరీక్షలపై రవాణా శాఖ ఉద్యోగులకు శిక్షణ ఉంటుంది. – శ్రీనివాస్, ఇన్చార్జ్ ఆర్టీఓప్రసుత్తం ఫిట్నెస్ పరీక్షలు ఎంవీఐల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వాహనాలను పరీక్షించి ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అయితే, పలు సందర్భాల్లో వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు ఫిట్నెస్ లేనట్టు తేలుతోంది. దీంతో కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్ష సరిగా నిర్వహించకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో నగదు చేతులు మారుతున్నట్లు తెలుస్తుండగా, కొన్ని వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నా అధికారులు నియంత్రించలేకపోతున్నారని తెలుస్తోంది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని మానవ ప్రమేయం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతోనే వాహనాల సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. -
రోడ్డెక్కిన కార్మిక, రైతు లోకం
ఖమ్మం మయూరిసెంటర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, మతతత్వ విధానాలు అనుసరిస్తోందని ఆరోపిస్తూ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపుతో సోమవారం జిల్లా కేంద్రంలో ‘జైల్ భరో’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని క్రమాన నాయకులు, కార్మికులు స్వచ్ఛందంగా పోలీసు వాహనాలు ఎక్కి అరెస్టు అయ్యారు. హక్కులను కాలరాస్తున్నారు.. రాస్తారోకో సందర్భంగా సీపీఎం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్లైన్ జిల్లా కార్యదర్శి సీ.వై. పుల్లయ్య, బీఆర్ఎస్ నాయకుడు పగడాల నాగరాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ, పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఆరోపించారు. అంతేకాక అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ తదితర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుని, జీరో సుంకంతో దిగుమతులను ప్రోత్సహించడం వల్ల దేశ రైతులు దివాళా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఉపాధి హామీ పథకం పేరు మార్పు, పేదలకు ఇచ్చే బియ్యంలో కోత తదితర సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు జి.రామయ్య, తుమ్మ విష్ణువర్ధన్, సింగు నరసింహారావు, తోట రామాంజనేయులు, యర్రా శ్రీనివాస్, వై.విక్రమ్, ఎస్.నవీన్రెడ్డి, గోవిందరావు, వెంకన్న, నరాల నరేష్, ఆవుల అశోక్, కమ్మకోమటి నాగేశ్వరరావు, పాషా, దండ జ్యోతిరెడ్డి, తొట్టి కొమరయ్య, రాంబాబు, కేలోత్ లక్ష్మణ్, శిరోమణి, బండి పద్మ, పి.రమ్య, షకీనా, ఝాన్సీ పాల్గొన్నారు. -
అలా.. ముగిసింది!
● 45 రోజులపాటు సాగిన ‘సర్’ ప్రక్రియ ● చివరి రోజున హడావుడి ● అర్ధరాత్రి వరకు సాగిన డిజిటలైజేషన్సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ జిల్లాలో సోమవారం ముగిసింది. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించడానికి, ఆ ఫారాలను డిజిటలైజేషన్ చేసేందుకు చివరి రోజు కావడంతో హడావుడి కనిపించింది. జిల్లాలో ఆదివారం నాటికి 87.25 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తవగా, పాలేరులో అత్యధికంగా.. ఖమ్మం నియోజకవర్గంలో అతితక్కువగా నమోదైంది. రెండు సార్లు గడువు పొడిగింపు అర్హత ఉన్న వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతోపాటు చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండేసి చోట్ల ఓట్లు కలిగిన వారిని తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఈ ప్రక్రియ జూన్ 25న మొదలైంది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి సేకరణ, డిజిటలైజేషన్ కోసం జిల్లాలో 1,460 మంది బీఎల్ఓలను నియమించారు. ఈమేరకు 12,43,781 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా.. సేకరణ, డిజిటలైజేషన్ పూర్తికి తొలుత జూలై 24 వరకు గడువు విధించారు. ఆతర్వాత ఈనెల 3, మళ్లీ 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఎట్టకేలకు పూర్తి ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్ల చేతికి అందినా వివరాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2002 ఓటరు జాబితాలో పేరు చూసుకోవడం, సీరియల్ ఇతర నంబర్లు తెలుసుకోవడం భారంగా మారింది. చదువుకున్న వారే ఈ విషయంలో తడబడగా.. నిరక్షరాస్యులకు తీరని సమస్యగా మారింది. దీంతో కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామపంచాయతీల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయడంతో ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. అలాగే వివిధ పార్టీల ఆధ్వర్యాన బూత్ లెవల్ ఏజెంట్లను నియమించగా వారు కూడా ఫారాలు నింపడంలో ఓటర్లకు సహకరించారు. 9వ తేదీ నాటికి 87 శాతం జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఆదివారం నాటికి 87.25 శాతం పూర్తయింది. పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 92.17 శాతం పూర్తయింది. అతి తక్కువగా ఖమ్మం నియోజకవర్గంలో 75.25 శాతమే చేయగలిగారు. మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలోనే నమోదైంది. సోమవారంతో ‘సర్’ గడువు ముగియగా గత 45 రోజులుగా పనిచేస్తున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఐఆర్కి సంబంధించి పూర్తి గణాంకాలు మంగళవారం వెల్లడికానున్నాయి.రెండు సార్లు గడువు పెంచినా చాలామంది చివరి రోజైన సోమవారం వరకు కూడా ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. దీంతో బీఎల్ఓలు ఊర్లలో లేని వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మృతిచెందిన వారిని మినహాయించి ఫారాలు ఎవరెవరో ఇవ్వలేదో జాబితా పరిశీలిస్తూ ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. అంతేకాక పలువురి నుంచి ఫారాలు స్వీకరించి అక్కడికక్కడే డిజిటలైజేషన్ చేసే పనుల్లో రాత్రి పొద్దుపోయే వరకు నిమగ్నమయ్యారు. -
తెలంగాణ – ఏపీ పోలీసుల సమన్వయ భేటీ
నేరాల కట్టడికి సంయుక్త తనిఖీలపై చర్చమధిర: రాష్ట్ర సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా కట్టడి చేసేలా తెలంగాణ – ఏపీ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో విధులు నిర్వర్తించనున్నారు. ఈమేరకు మధిరలో సోమవారం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో నేరస్తుల కదలికలు, చోరీలు, ఇసుక అక్రమ రవాణా, జూదం తదితర అంశాలపై సమాచార మార్పిడి చేసుకుంటూ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి నేరాలకు పాల్పడే వ్యక్తులపై దృష్టి సారించేలా సమాచారం వేగంగా ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై చర్చించారు. వైరా, మైలవరం ఏసీపీలు సారంగపాణి, రామచంద్రరావు, మధిర రూరల్, తిరువూరు, మదిర టౌన్, వైరా సీఐలు డి.మధు, గిరిబాబు, దోమల రమేష్, వైవీ.ప్రసాద్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
గ్రీన్ఫీల్డ్ హైవేపై తప్పిన ప్రమాదం
వైరా/సత్తుపల్లి: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరగగా ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వైరా మండలం సోమవరం వద్ద ముందు వెళ్తున్న బోలేరో వాహనాన్ని ఫార్చునర్ కారు ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లిలోని మదర్థెరిస్సా విద్యాసంస్థల ఛైర్మన్ చలసాని సాంబశివరావు ఫార్చునర్లో హైవే మీదుగా ఖమ్మం నుంచి సత్తుపల్లి వస్తున్నారు. ఇదే మార్గంలో ముందు మొక్కల లోడ్తో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి అడ్డదిడ్డంగా వెళ్లినట్లు తెలిసింది. ఈమేరకు వెనుకాల ఉన్న ఫార్చునర్ ఆ వాహనాన్ని ఢీకొట్టగా ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో సాంబశివరావు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనలో బొలేరో వాహనం డ్రైవర్ కాలు విరగగా, ఫార్చునర్ డ్రైవర్కు సైతం గాయాలయ్యాయి. ఘటనపై వైరా ఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేయగా, ప్రమాదం విషయం తెలియడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తదితరులు సాంబశివరావుకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. కాగా, గ్రీన్ఫీల్డ్ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున కారణాలపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు -
ఖమ్మంలో సౌత్ ఏషియా బాడీబిల్డింగ్ చాంపియన్షిప్
ఖమ్మం స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక 17వ సౌత్ ఏషియాన్ బాడీ బిల్డింగ్ అండ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్షిప్ టోర్నీ నిర్వహణకు ఖమ్మంను వేదికగా ఖరారు చేశారు. వచ్చే ఏడాది జూలై, ఆగస్టులో ఈ టోర్నీ జరగనుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి తెలిపారు. ఖమ్మంలో టోర్నీ నిర్వహించాలని సోమవారం ఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయాను కలిసి వినతిపత్రం అందించగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. దేశ రాజధానులకే పరిమితమయ్యే అంతర్జాతీయ స్థాయి పోటీలు ఖమ్మంలో జరగనుండగా.. భారత్, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల నుంచి 150 మంది క్రీడాకారులు, 300 మంది టెక్నికల్ అధికారులు హాజరవుతారని ఎంపీ తెలిపారు. సౌత్ ఏషియాన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జనరల్ బాడీ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్నన్న నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు స్వామి రమేష్ తన దృష్టికి తీసుకురాగా కేంద్ర క్రీడల మంత్రికి వివరించడంతో సానుకూలంగా స్పందించారని వివరించారు. ‘పీఎం – సేతు’ హబ్ కేటాయించాలని వినతి ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాకు ‘పీఎం–సేతు’ హబ్ కేటాయించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని ఎంపీ రఘురామిరెడ్డి కోరారు. పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రాంతాలకే ఐటీఐల ఆధునీకరణ పరిమితం చేయకుండా, గ్రామీణ, గిరిజన ప్రాంతాలకూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం ఐటీఐని హబ్గా గుర్తించి, కొత్తగూడెం తదితర ఐటీఐలను అనుసంధానించాలని కోరారు. అంతేకాక ఖమ్మంలో మిరప ప్రాసెసింగ్, ఫుడ్–ప్రాసెసింగ్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు, కొత్తగూడెంలో ట్రైబల్ స్కిల్ అండ్ ఎనర్జీ – మైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాక ఈవీలు, సోలార్ ఎనర్జీ, డ్రోన్లు, రోబోటిక్ కోర్సులు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తిచేశారు. ఎంపీ వినతితో కేంద్ర క్రీడల మంత్రి సానుకూల స్పందన -
‘సర్’లో బీఎల్ఏల పాత్ర అభినందనీయం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో అధికారులను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏలు) ఓటర్లకు సహకరించారని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. జిల్లాలోని 1,460 బూత్లకు ఇప్పటివరకు 1,276 బూత్ల్లో 95 – 100 శాతం, 172 బూత్ల్లో 90 – 95 శాతం, 12 బూత్ల్లో 80 – 90 శాతం నమోదు పూర్తయిందని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసిన మండల, పపట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు, సూపర్వైజర్లు, ముఖ్య నాయకులకు ఆయన ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. 50 గంటల పాటు ‘ప్రజా కళాజాతర’ ఖమ్మం మామిళ్లగూడెం: యాభై ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 26న ఉదయం 10 గంటల నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు 50గంటల పాటు ‘ప్రజా కళాజాతర’ పేరిట ఆటాపాట నిర్వహిస్తున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క వెల్లడించారు. ఖమ్మంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సంస్కృతి నిర్మాణంలో భాగమైన సంస్థలు, శక్తులను, వ్యక్తులందరినీ ఈ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని విమలక్క పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అరుణోదయ సాంస్కతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్సూర్, పోతుల రమేష్, ఏపీ ప్రధాన కార్యదర్శి సుధాకర్తో పాటు భాస్కర్, విజయ్, దర్శి రాకేష్, అనిత తదితరులు పాల్గొన్నారు. కాపర్ వైర్ల చోరీ కేసులో నలుగురి అరెస్ట్ఖమ్మం రూరల్: వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన మోటార్లు, స్టార్టర్ బాక్సులే కాక ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు సోమవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మంలోని వివిధ కాలనీలకు చెందిన అంగులూరి ఏసుపాల్, షేక్ మహ్మద్ రఫీ, పొగరత్తి వెంకటేష్, వెండి రాము కొంతకాలంగా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తల్లాడ, ఖమ్మం అర్బన్, చింతకాని, కొణిజర్ల, వేంసూరు మండలాల్లోని మోటార్లు, స్టార్టర్ బాక్సులతో పాటు ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ను చోరీ చేస్తున్నారు. ఈమేరకు సోమవారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో వీరు పట్టుబడగా పది మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. నందీశ్వరస్వామికి అభిషేకంపాల్వంచరూరల్: పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాఘమాసం త్రయోదశిని పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ నందీశ్వరస్వామికి పంచామృతా భిషేకం, అష్టోత్తర శతనామార్చన, నీరాజనం, మంత్రపుష్పం పూజ లు నిర్వహించారు. నేడు రుద్రహోమం మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ. 1,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని కోరారు. -
మున్సిపల్, అటవీ శాఖల మధ్య వివాదం
సత్తుపల్లి టౌన్: సత్తుపల్లిలోని విరాట్ నగర్ కాలనీలో జామాయిల్ చెట్ల తొలగింపు విషయంలో అటవీశాఖ, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల ఆ ప్రాంతంలో జామాయిల్ చెట్టు విరిగి ఇంటిపై పడడంతో స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెట్లు నరికించాలని ఆయన ఆదేశించగా మున్సిపల్ కమిషనర్ కొండ్ర నరసింహ, తహసీల్దార్ సత్యనారాయణ సోమవారం విరాట్నగర్ వెళ్లి ఇళ్లకు ఆనుకుని ప్రమాదకరంగా ఉన్న చెట్లను నరికించేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి అటవీ శాఖ సిబ్బంది చేరుకుని అడ్డుకున్నారు. చెట్లు నరికితే కేసులు నమోదు చేస్తామని రేంజర్ ఎల్లయ్య స్పష్టం చేయడంతో కమిషనర్ నరసింహ ‘ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారు... అవసరమైతే తనపై కేసులు నమోదు చేసుకోండి.. చెట్లు మాత్రం నరకాల్సిందే’ అని బదులిచ్చారు. దీనికి తోడు స్థానికులు కూడా చెట్లు నరకాల్సిందేనని పట్టుబట్టగా తహసీల్దార్ సర్దిచెప్పారు. కాగా, ప్రస్తుతం ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి, ఆ తర్వాత నిబంధనల మేరకు అన్నింటినీ తొలగిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. జామాయిట్ చెట్ల తొలగింపు వేళ వాదన -
రెవెన్యూ.. అక్రమాలు
భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించగా కొందరు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అవసరమైన పత్రాలను పరిశీలించకుండానే ఇటీవల ఓ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయగా, ఇదేమిటని అడిగితే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని సర్దిచెప్పారని సమాచారం. చాలాచోట్ల అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.వివాదంలో ఉన్నా.. జిల్లాలో సమగ్ర భూ సర్వే కింద కాకరవాయి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. గ్రామంలోని మొత్తం భూమిని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేయగా.. భూమి వివరాలు పరిశీలంచుకోవాలని రైతులకు నోటీసులు ఇచ్చారు. ఇదేగ్రామంలో ఓ భూమిపై వివాదంలో ఉండడం, కోర్టు పరిధిలో కేసు కొనసాగుతుండగా అది తేలేవరకు ఎలాంటి లావాదేవీలు జరపొద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా వివాదంలో ఉన్న ఈ భూమిని రెవెన్యూ అధికారులు రెండు నెలల క్రితం రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదేమిటని వారసులు అడిగితే కోర్టులో ఉందనే విషయం తమకు తెలియదంటూ దాటవేసినట్లు సమాచారం. నిబంధనలన్నీ బేఖాతర్ కాకరవాయికి చెందిన ఓ వ్యక్తి భార్యకు పసువు కుంకుమ కింద ఆమె తల్లిదండ్రుల నుంచి 10 ఎకరాల వ్యవసాయ భూమి సంక్రమించింది. ఈ దంపతులకు ఉన్న ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె దివ్యాంగురాలు. మిగిలిన ఇద్దరిని వివాహాలు జరిగాయి. సదరు వ్యక్తి భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందగా ఆమె పేరిట ఉన్న భూమిని తన పేరుపైకి మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. అయితే, భూమి పంపకాలపై అప్పటికే కోర్టులో కేసు ఉండగా, విషయాన్ని వారసుల్లో ఒకరు తిరుమలాయపాలెం తహసీల్దార్, కూసుమంచి రిజిస్ట్రార్, ఖమ్మం రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక భార్య పేరిట ఉన్న భూమిని మార్చాలంటే ఫ్యామిలీ సర్టిఫికెట్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదా కోర్టు ఉత్తర్వులు ఉండాలి. అంతేకాక కుటుంబ సభ్యుల ఆధార్కార్డులు ఉండాలి. కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్లో కూతుర్ల పేరు లేకుండా.. కేవలం సదరు వ్యక్తి పేరు మాత్రమే ఉంది. ఇక భూబదలాయింపు సమయాన ఇద్దరు కూతుర్లకు సమాచారం ఇవ్వకపోగా అభ్యంతరాలను స్వీకరించలేదు. ఆయన అన్ రిజిస్టర్డ్ వీలునామా సమర్పించినా అధికారులు చట్టబద్ధతపై విచారణ చేయలేదు. ఆపై రెండు నెలల క్రితం ఆయన పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆ తర్వాత అదే నెలలో ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరిట కొంత, ఇతర వ్యక్తుల పేరుపై కొంత రిజిస్ట్రేషన్, జీపీఏ చేపించాడు. ఇవన్నీ ఒకే రోజు చేయడం విశేషం. కాకరవాయికి చెందని ఓ వ్యక్తి తన భార్య చనిపోయిందని, ఆమె రాసిన వీలునామా ప్రకారం భూమిని తన పేరిట మార్చాలని కోరాడు. కుటుంబంలో ఓ కూతురితో వివాదం ఉందని మొదట నా దృష్టికి రాలేదు. ఈ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నా, ప్రస్తుతం అవి అమల్లో(ఫోర్స్) లేవు. వివాదం తెలియగానే లావాదేవీలు, బదిలీలను పూర్తిగా హోల్డ్లో పెట్టాం. కాకరవాయి పరిధిలో రీ–సర్వే పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్లు, బదిలీలు జరగవు. – లూథర్ విల్సన్, తహసీల్దార్, తిరుమలాయపాలెంరైతులు ఇబ్బంది పడొద్దని ప్రభుత్వం భూసమస్యలకు పరిష్కారం చూపేలా భూభారతి చట్టం తీసుకొచ్చారు. గతంలో ఉన్న ధరణిలో చాలా భూములు నిషేధిత జాబితాలో పడడంతో రైతులు క్రయవిక్రయాలకే కాక రిజిస్ట్రేషన్ల సమయంలోనూ అవస్థ పడ్డారు. అయితే, ఇప్పుడు చట్టంలో మార్పులు తీసుకొచ్చినా రైతుల ఇక్కట్లు తీరడం లేదు. పీఓబీ, ఇతర సమస్యలతో రైతులు అధికారుల చుట్టూ తిరుగుతుండగా, ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డేకు చాలావరకు ఇటువంటి సమస్యలే వస్తున్నాయి. భూ భారతి చట్టం, నిబంధనలు తూచ్ గత ప్రభుత్వ హయాంలో అమలుచేసిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా రెవెన్యూ శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొత్త చట్టంలోని నిబంధనలను విస్మరిస్తున్న కొందరు రెవెన్యూ అధికారులు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేస్తుండడం గమనార్హం. ఇటీవల మృతి చెందిన మహిళ పేరిట ఉన్న భూమిని వారసుల అంగీకారం లేకుండానే ఆమె భర్త పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగు చూసింది. అంతకుముందే వారసులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చినా పరిగణనలోకి తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. భూముల రీసర్వేకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ఈ ఘటన చోటుచేసుకోగా వారసుల్లో ఒకరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
గడువు సమీపిస్తోంది..
● రేషన్, గ్యాస్కు ఈ–కేవైసీ తప్పనిసరి ● రేషన్కార్డుదారులకు 30వరకు, గ్యాస్కు 15 ఆఖరి తేదీ ● జిల్లాలో పలువురు లబ్ధిదారుల పెండింగ్ఖమ్మం సహకారనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సంక్షేమ పథకాలు ఆగిపోకుండా లబ్ధిదారులు ఈ–కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలనే నిబంధన విధించారు. అయితే, జిల్లాలోని రేషన్ లభ్ధిదారులు, గ్యాస్ కనెక్షన్లు కలిగిన పలువురు ఇప్పటివరకు ఈ–కేవైసీ చేయించుకోలేదు. గడువు సమీపిస్తున్నందున త్వరపడకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశం ఉన్నందున ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్లో భేష్.. జిల్లాలో రేషన్కార్డులు 4,73,271 ఉండగా... వీటిలో 13,36,126 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే, కార్డుపై పేరు ఉన్న ప్రతీ వ్యక్తి ఈ–కేవైసీ చేయించుకోవాలి. కానీ ఇప్పటి వరకు 11,09,369 మంది ఈ–కేవైసీ పూర్తి కాగా.. 83.3 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన నిలిచింది. అయినా ఇంకా 2,26,757 మంది మిగిలిపోయాయి. ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉన్నందున లబ్ధిదారులు ముందుకు రావాల్సి ఉంది. ఇలా తెలుసుకోండి... ఈ–కేవైసీ పూర్తయిందో, లేదో లబ్ధిదారులు సులువుగా తెలుసుకునే వీలుంది. ఇందుకోసం https:// smartpds.telangana.gov. in/ src& Trans& int లింక్ తెరిచి రేషన్ కార్డు నెంబర్, క్యాప్చర్ నమోదు చేయాలి. కుటుంబీల వివరాల పక్కన యాక్టివ్ అని వస్తే ఈ–కేవైసీ అయినట్లు, ఇన్ యాక్టివ్ అని ఉంటే కానట్లు భావించాలి. ఈనెల 31వ తేదీ వరకు ఈ–కేవైసీ చేయించు కోకపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే అవకాశంఉందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్కు ఐదు రోజులే... జిల్లాలో చాలా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లకు ఈ–కేవైసీ పూర్తికాలేదు. ఈ కారణంగానే గ్యాస్ బుకింగ్, సరఫరాలో జాప్యం జరుగుతోంది. వంట గ్యాస్ వినియోగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ–కేవైసీ విధానాన్ని 2023లో ప్రారంభించగా, చాలామంది ముందుకు రావడం లేదు. ఈక్రమాన ఈనెల 15వ తేదీన గడువు ముగియనుండగా ఈ–కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో సబ్సిడీ అందకపోగా పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. రేషన్కార్డు, గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వినియోగదారులు నిర్దేశిత గడువులోగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31 తేదీ వరకు రేషన్షాపుల్లో చేయించుకునే అవకాశం ఉంది. గ్యాస్ వినియోగదారులైతే ఏజెన్సీలో కానీ, మొబైల్ యాప్లో కానీ ఈనెల 15వ తేదీలోగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. – చందన్కుమార్, డీసీఎస్ఓ -
రోడ్డు వేస్తే ఆత్మహత్యే శరణ్యం
చింతకాని: నిబంధనలకు విరుద్ధంగా తన పొలంలో నుంచి రోడ్డు వేసేందుకు కాంగ్రెస్ నాయకులు, ఇంకొందరు రైతులు ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఓ రైతు ఆవేదనకు గురయ్యాడు. ఈమేరకు చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్గా మారడంతో పోలీసులు స్పందించి పనులు నిలిపివేయించారు. చింతకాని మండలం నాగులవంచలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగులవంచకు చెందిన రైతు జొన్నలగడ్డ మల్లికార్జున్రావు పొలం మీదుగా రోడ్డు నిర్మాణం చేసేందుకు స్థానిక నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయనపై కొద్దిరోజుల నుంచి ఒత్తిడి తీసుకురావడమే కాక బెదిరిస్తున్నారని రైతు చెబుతున్నాడు. అంతేకాక ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు పనులు చేపట్టి తీరుతామని ఆదివారం పొక్లెయినర్ను పని ప్రదేశంలోకి తీసుకొచ్చారు. భట్టి మా వెంట ఉన్నారని బెదిరింపులు? ఓపక్క బెదిరించడమే కాక రోడ్డు పనులను అడ్డుకుంటున్నాడంటూ గ్రామానికి చెందిన కొందరు రైతులు మల్లికార్జున్రావుపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో రోడ్డు నిర్మాణం తప్పదని భావించిన ఆయన సోమవారం తన పొలంలోనే చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని సెల్పీ వీడియో తీసుకున్నాడు. ‘రోడ్డు వేయాలని గత మూడు రోజుల నుంచి అంబటి వెంకటేశ్వరరావు(మత్కేపల్లి మార్కెట్ చైర్మన్) ఆధ్వర్యాన కొందరు పొలం వద్దకు వచ్చి నాపై దాడి చేస్తామని బెదిరిస్తున్నారు.... మా పొలం దాటాక కిలోమీటర్ రోడ్డు ఉన్నా నాకు ఉన్న ఎకరం చేను వరకే రోడ్డు పోస్తామంటున్నారు.. తాటి చెట్లు సాదుకున్నాం.. నా పట్టా భూమిలో ఉన్న డొంక అది... కేసు పెడతాం, ఎమ్మార్వో, ఎస్సైకు చెబుతామని బెదిరిస్తున్నారు... నేను ఒక్కన్నే అయిపోయిన... మందు తాగుదామనుకుంటున్న... పొక్లెయినర్ డొంకలోకి దిగగానే తాగి చచ్చిపోదామనుకుంటున్నా... భట్టి గారు ఉండు మాకు, మీరు ఏమి చేస్త్తారని నిన్న పొలం దగ్గర బెదిరించారు... పొక్లెయినర్ తీసుకువచ్చి ఇక్కడ పెట్టారు’ అంటూ బాధిత రైతు తీసుకున్న సెల్పీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో స్పందించిన పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలను సేకరించడమే కాక రోడ్డు పనులను నిలిపివేయించారు.కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారని రైతు ఆవేదన -
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి.. కుటుంబీకుల ఆరోపణలు
తెలంగాణ: ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం: ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్న అనంతరం బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. వైద్యంలో భాగంగా అధిక మోతాదులో మందులు, ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించసాగారు.కుటుంబీకుల వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా హేమశ్రీ (13) కొణిజర్ల కస్తూరిబా కళాశాలలో 8వ తరగతి చదువుతోంది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం వరకు గ్రామస్తులు, స్నేహితులతో కలిసి హేమశ్రీ ఉత్సాహంగా గడిపింది. అనంతరం బాలికకు జలుబు, దగ్గు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు ఇంజక్షన్ ఇవ్వడంతో పాటు మందులు అందించారు. కానీ కాసేపటికే బాలిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారగా, విషయాన్ని గ్రహించిన కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు పరిస్థితి విషమించిందని అప్పటికే మార్గం మధ్యలోనే మృతి చెందిందని చెప్పారు.అయితే, ఆర్ఎంపీ డాక్టర్ అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోలీసుల ఆధ్వర్యంలో స్వగ్రామానికి తరలించారు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. అలాగే, బాలిక మృతికి గల అసలు కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. -
జమలాపురంలో ఆషాఢమాస పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయడమే కాక అలివేలు మంగ అమ్మవారికి సర్పంచ్ తుళ్లూరి నిర్మలకుమారి–కోటేశ్వరరావు దంపతులు బోనాలు, సారె సమర్పించారు. అలాగే, అర్చకులు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదం, స్వామి మూలవిరాట్కు అభిషేకం, స్వామి నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీజీలో నాలుగు కొత్త కోర్సులు రేక్ పాయింట్కు చేరిన కాంప్లెక్స్ ఎరువులు చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు ఆదివారం కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో డీఏపీ 394.800 మెట్రిక్ టన్నులు, 20.20.0.13 ఎరువులు 723.250 మె.టన్నులతో పాటు ఎంఓపీ 255.200 మె. టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖా ధికారి డి.పుల్లయ్య వెల్లడించారు. ఈ ఎరువుల ను మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బెటాలియన్లో అదనపు డీజీపీ సత్తుపల్లి: సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక బెటాలియన్ను అదనపు డీజీపీ సంజయ్కుమార్ జైన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏకలవ్యుడి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన బెటాలియన్లోని ఎంటీ గ్యారేజ్, ఆడిటోరియం, బీటీసీ ట్రైనింగ్ సెంటర్, ప్రధాన కార్యాలయం, క్వార్టర్లు, ఫైరింగ్ రేంజ్లను పరిశీలించి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో కమాండెంట్ ఎన్.పెద్దబాబు, వివిధ విభాగాల అధికారులు ఏ.అంజయ్య, బి.వేణుగోపాల్రెడ్డి, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. వరుణ యాగానికి భద్రగిరి వేదపండితులుభద్రాచలంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో సోమవారం నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ముఖ్య వైదిక సిబ్బంది, వేదపండితుల బృందం ఆదివారం ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలన్నీ నిండాలని, తద్వారా పాడిపంటలు వర్ధిల్లి రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఈ మహా యాగాన్ని తలపెట్టింది. హోమాలు, పూజా కార్యక్రమాల్లో భద్రాద్రి రామాలయ అర్చక స్వాములు కీలక పాత్ర పోషించనున్నారు. వేద పారాయణం నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఉప ప్రధాన అర్చకులతో కూడిన వేదపండితుల బృందం బయలుదేరింది. -
ప్రజా సమస్యలపై పోరాటమే యువజన కాంగ్రెస్ లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: యువశక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడడమే యువజన కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం నూతి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిరసించడం, న్యాయం కోరడం యువత హక్కులని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత గొంతుకను అణచివేసే కుట్రలు చేస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. నాయకులు వేజండ్ల సాయికుమార్, బాలాజీనాయక్, కొత్త సీతారాములు, శేఖర్గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, అనిల్, గంగరాజు, షాహెల జావిద్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
శాకంబరి అవతారంలో అమ్మవారు
వాతావరణ ం జిల్లాలో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయి. మధ్యాహ్నం ఎండ పెరిగినా సాయంత్రం తర్వాత చల్లబడుతుంది.ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి అలంకరణలో పెద్దమ్మతల్లి, శాకంబరేశ్వరుడి అలంకరణలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వితరణ చేసిన కూరగాయలు, పండ్లు, పూలతో ఆదివారం పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారిని అలంకరించారు. ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేయగా, భక్తులు ఒడి బియ్యం, పసుపు కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల్లో ఈఓ విజయ్కుమార్, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. – పాల్వంచరూరల్ -
నమ్మాలి... ఇవి నగర రోడ్లే !
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అంతర్గత, ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. కొన్ని రోడ్లు వేసి చాన్నాళ్లు కావడంతో వాహనాల రద్దీతో దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కేబుల్, నీటి పైపు లైన్ల కోసం తవ్వకాలు చేపట్టాక సరిగా కాంక్రీట్ చేయకపోవడంతో గుంతలు పడ్డాయి. వీటిని తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారే తప్ప కొత్త రోడ్లు వేయకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంమొత్త రోడ్లు 1,132 కిలోమీటర్లు.. ఖమ్మం నగరంలోని 60 డివిజన్లకు గాను సీసీ, బీటీ, డబ్ల్యూబీఎం (వాటర్ బౌండ్ మకాడమ్), కచ్చా రోడ్లు అన్నీ కలిపి 1,132 కి.మీ. మేర ఉన్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు సమయాన విలీన గ్రామాల్లో ఇంకా పాత రోడ్లే దర్శనమిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో కొత్తగా రోడ్లు వేస్తున్నా.. పాత రోడ్ల మరమ్మతులను పట్టించుకోవడం లేదు. సీసీ, బీటీ రోడ్లపై ఓ వైపు పగుళ్లు ఏర్పడగా మరో వైపు గుంతలు తేలాయి. ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనల సమయాన తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నా కొత్త రోడ్లకు మోక్షం లభించక.. సీసీ రోడ్లు వేయాలని గత కార్పొరేటర్లు చేసిన ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధాన రహదారులు అంతే.. గ్రీన్ఫీల్డ్ హైవే తెరవకముందు వరకు ఉమ్మడి జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న ఏపీలోని పలు ప్రాంతాలకు వాహనాల రాకపోకలు ఖమ్మం నగరం మీదుగానే సాగాయి. గ్రీన్ఫీల్డ్ రహదారి తెరుచుకున్నా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక వందల సంఖ్యలో వాహనాలు నగరం నుంచే వచ్చివెళ్తున్నాయి. ఇవన్నీ భారీ లోడ్తో వెళ్తుండడంతో రోడ్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. ●పాత బస్టాండ్ నుంచి జెడ్పీసెంటర్ వరకు రహదారి చాలాచోట్ల దెబ్బతిన్నది. రాపర్తినగర్ బైపాస్ రోడ్డు.. కొత్తబస్టాండ్ నుంచి రైల్వే బ్రిడ్జి, మున్నేరు బ్రిడ్జి వరకు పలు చోట్ల గుంతలు ఏర్పడగా నయాబజార్ సర్కిల్ నుంచి ఎఫ్సీఐ గోదాం రోడ్డు గుంతలు తేలి దుమ్ము, ధూళితో ఇబ్బంది ఎదురవుతోంది.కోతకు గురైన అల్లీపురం రహదారిగట్టయ్య సెంటర్లో...ద్వారకానగర్లో...గుట్టల బజార్లో...ఖమ్మం వన్టౌన్ పరిధిలోని బోనకల్ క్రాస్ రోడ్డు, కమాన్బజార్, గౌంధీచౌక్, ఖిల్లా రోడ్డు, బ్రాహ్మణ బజార్, పాత బస్టాండ్ ప్రాంతం, పాకబండ బజార్, ముస్తాఫనగర్, అల్లీపురం రోడ్డు టూటౌన్ ప్రాంతంలోని బస్డిపో రోడ్డు, రాపర్తినగర్, సరిత క్లినిక్ రోడ్డు, మామిళ్లగూడెం, మమతా రోడ్డు త్రీటౌన్లోని పీఎస్ఆర్ రోడ్డు, శ్రీనివాస్నగర్, ప్రకాశ్నగర్, కాల్వొడ్డు రోడ్లు కేబుల్, పైపులైన్ల కోసం ఇష్టారీతిన తవ్వకాలు -
ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● గిరిజన అభివృద్ధి శాఖ డీడీ ఫిరంగి ● ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఖమ్మంమయూరిసెంటర్: ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఫిరంగి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించారు. తొలుత గిరిజన బాలుర కళాశాల పీఎంహెచ్ వసతిగృహంలో జెండా ఎగురవేయగా, జెడ్పీసెంటర్ నుంచి గిరిజన భవనం వరకు ఆదివాసీ సాంస్కృతిక కళారూపాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభలో డీడీ ఫిరంగి మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం ఆదివాసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం సతీష్ మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, 1976 నాటి జీఓ ఆధారంగా పొందుతున్న ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో నిర్వహిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ పి.రమేష్, ఏసీఎంఓ రాములు, వసతిగృహ సంక్షేమ అధికారులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. బంజారా భవనం నుండి.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా లంబాడీల ఆధ్వర్యాన బంజారా భవనం నుండి గిరిజన భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ మాట్లాడారు. ఆదివాసీ విద్యార్థులు, లంబాడీ విద్యార్థులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. లంబాడీ విద్యార్థులు ఉదయం, ఆదివాసీలు మధ్యాహ్నం తర్వాత సభ నిర్వహించుకునేలా సమన్వయం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో సుతారి మేసీ్త్ర మృతి
నేలకొండపల్లి: మండలంలోని అమ్మగూడెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుతారి మేసీ్త్ర మృతి చెందాడు. అమ్మగూడెంనకు చెందిన సుతారి మేసీ్త్ర గండు రంగయ్య (55) తన వాహనంతో పెట్రోల్ బంక్ సమీపాన నిలబడ్డాడు. ఈ క్ర మాన కూసుమంచి నుంచి నేలకొండపల్లి వెళ్తున్న ట్రాలీ ఆటో ఢీట్టడంతో తీవ్రగాయాలైన ఆయనను ఖమ్మం తరలించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఆయన కుమార్తె అనూష ఫిర్యాదుతో డ్రైవర్ ప్రకాష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరినాట్లు వేయిస్తూ కౌలు రైతు..రఘునాథపాలెం: వరినాట్లు వేయిస్తూ కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని చిమ్మపుడి గ్రామానికి చెందిన కటకం వెంకన్న (48) తన సొంత భూమి 30 కుంటలతో పాటు 9 ఎకరాల భూమి ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కూలీలు వరినాట్లు వేస్తుండగా పొలంలో మందు చల్లుతున్న వెంకన్న ఒక్కసారి కూప్పకూలాడు. కుటుంబ సభ్యులు, కూలీలు ఆయనకు సీపీఆర్ చేసి బయటకు తీసుకొచ్చేలోగా మృతి చెందాడు. కాగా, మృతుడికి భార్యతో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యాన్ ఢీకొట్టడంతో రైతు...కూసుమంచి: ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు మాలోత్ సుక్యా (55) మృతి చెందాడు. మండలంలోని భగవత్వీడుతండాకు చెందిన ఆయన టీవీఎస్ మోపెడ్పై ఇంటి నుంచి గంగబండతండాకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాల పాలైన సుక్యా అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటం వల్లే ప్రమాదం జరిగిందని రైతు కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
స్టీల్ బల్లల కోసం రూ.1,00,116 విరాళం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం యూపీహెచ్ కాలనీలోని శ్రీస్వయంభూ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసతుల కల్పనకు గోకుల్ ఏజెన్సీ అధినేత చంద్రకాని శేషగిరిరావు, ఆయన కుమారులు రమేశ్, రంజిత్ రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ నగదుతో ఆలయ అన్నదానం క్యూలైన్లో భక్తులు కూర్చునేలా స్టీల్ బల్లలు తయారీ చేయించాలని ఆలయ నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అల్లిక అంజయ్య తదితరులు దాతలను అభినందించారు. నేటి జైల్ భరోను జయప్రదం చేయండిఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం తలపెట్టిన జైల్భరోను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(టీయూసీఐ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి జి.రామయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నగర ఉపాధ్యక్షుడు కిన్నెర నారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్ నుంచి టూ టౌన్ పోలీస్స్టేషన్ వరకు నిర్వహించే ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు డి.గురవయ్య, బాబు, శ్రీను, సుధాకర్, నాగరాజు, యుగంధర్, సరస్వతి, సత్యవతి, లక్ష్మి, మోహన్, దేవా, ధర్మయ్య, అనిల్, నరసయ్య పాల్గొన్నారు. పీఆర్సీ ప్రకటించి పదోన్నతులు కల్పించాలి ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించా లని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో జిల్లా అధ్య క్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఎంఈఓ, జేఎల్, డైట్, బీఈడీ కాలేజీల్లోని ఖాళీ పోస్టు లను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. అంతేకాక కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చి న హామీ మేరకు పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పాత పింఛన్ విధానం పునరుద్ధరణపై స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా సమస్యల పరిష్కా రంపై ప్రభుత్వం ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12,13 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి, ప్రభుత్వం స్పందించకపోతే 19న కలెక్టరేట్ల వద్ద నిరసనలు, 29న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు బుర్రి వెంక న్న, షమీ, వల్లంకొండ రాంబాబు, బానోత్ రాందాస్, సురేశ్, ఉద్దండ్, నాగేశ్వరరావు, నర్సయ్య, పద్మ, నిర్మలాకుమారి, రామారావు, నాగూర్వలీ, సుధాకర్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు రెండు చోట్ల రూ.32,500 నగదు స్వాధీనం ఎర్రుపాలెం/తల్లాడ: ఎర్రుపాలెం మండలంలోని సఖినవీడు సమీపాన పేకాట కేంద్రంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని ఐదు మోటారు సైకిళ్లు, రూ.23,800 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.రమేశ్కుమార్ తెలిపారు. అలాగే, తల్లాడలోని గొల్లగూడెం వెళ్లే రహదారిలో గుంటు చెరువు సమీపాన ఎస్ఐ వెంకటకృష్ణ, సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతూ పది మంది పట్టుబడగా, రూ.8,700 నగదు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోక్సో కేసులో నిందితుడి రిమాండ్ వైరా: మైనర్ బాలికతో మద్యం మత్తులో శనివారం రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించిన వైరా వాసి గౌరవరపు డేవిడ్ అలియాస్ జగదీశ్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ మేరకు ఆయనను మధిర కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. -
చోరీకి వెళ్లాడు.. వృద్ధురాలిని హతమార్చాడు
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఆదివారం తిరుమలాయపాలెం పోలీస్స్టేషన్లో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వివరాలు వెల్లడించారు. పిండిప్రోలుకు చెందిన ఐతనబోయిన ప్రశాంత్ చికెన్షాపు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిస కావడమే కాక ఆన్లైన్ గేమ్లతో అప్పుల పాలయ్యాడు. షాప్ పక్కనే వృద్ధులైన చెన్న సుగుణ – జనార్దన్ దంపతులు ఉండడం, సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో చోరీకి నిర్ణయించుకున్నాడు. గత నెల 17న అర్ధరాత్రి వ్యాన్ రావడంతో కోళ్లు తీసుకున్న ప్రశాంత్, మాస్క్ ధరించి ఇంటి వెనక వైపు నుంచి వెళ్లి తలుపు కొట్టి నీళ్లుకావాలని అడిగాడు. దీంతో సుగుణ తలుపు తీసి నీళ్లు ఇస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాగాడు. అప్రమత్తమైన ఆమె పక్కనే డబ్బాలోని కారం గుప్పించడమే కాక మాస్క్ తొలగించి ప్రశాంత్ను గుర్తుపట్టింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఇనుపరాడ్డుతో సుగుణ తలపై మోదగా అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు వృద్ధురాలైన సుగుణను హత్య చేశాక ప్రశాంత్ ఆమె బంగారు గొలుసును షాపు పక్కన దాచి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారికల్లా హత్య విషయం బయటపడడంతో ఏమీ తెలియనట్టు స్థానికులతో కలిసి పరిశీలించాడు. అంతేకాక గ్రామంలో దొంగతనాలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన చేయగా.. నిందితుడు అందులో పాల్గొనడం గమనార్హం. ఈ క్రమాన కూసుమంచి సీఐ సంజీవ్ నేతృత్వాన ప్రత్యేక బృందాలు గ్రామాన్ని జల్లెడ పట్టినా క్లూ లభించలేదు. ఆ తర్వాత ప్రశాంత్ 25 గ్రాముల బంగారు గొలుసును తన సమీప బంధువైన మరిపెడ మండలం ధర్మారానికి చెందిన సరగండ్ల మహేశ్కు ఇచ్చి ఆయన ద్వారా తాకట్టు పెట్టాక రూ.1.50 లక్షల నగదు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా పలువురి కాల్డేటా, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తుండగా ప్రశాంత్పై అనుమానం వచ్చింది. దీంతో మహేశ్ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈ మేరకు నిందితుడు ప్రశాంత్తో పాటు బంగారం తాకట్టుకు సహరించిన మహేశ్ను సైతం అరెస్ట్ చేశారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సీఐ సంజీవ్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ ఎస్ఐలు జగదీశ్, సంతోష్, నాగరాజు, హరికృష్ణతో పాటు సిబ్బంది పూర్ణచందర్రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంటా శ్రీనును ఏసీపీ అభినందించిన వారికి రివార్డులు అందజేశారు. కాగా, పిండిప్రోలులో మరో రెండు చోరీ కేసుల్లోనూ విచారణ కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ ఈ సందర్భంగా తెలిపారు. కాల్డేటా, నగదు లావాదేవీల ఆధారంగా నిందితుల అరెస్ట్ -
హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం
మధిర/బోనకల్: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. పార్టీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్ర శనివారం మధిర, బోనకల్ మండలాల్లో కొనసాగింది. మధిర మండలం మల్లవరం, మధిర, మడుపల్లి గ్రామాల్లో నిర్వహించిన సభల్లో హేమంతరావు మాట్లాడారు. రుణమాఫీ, రైతు బీమా, మహిళలకు రూ.2,500 సహా పలు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, బోనకల్ మండలంలోని మోటమర్రి, రాయన్నపేట, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాల్లో జరిగిన యాత్రలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రైతుల ఉద్యమాలకు తలొగ్గి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మళ్లీ దొడ్డిదారిన అమలుకు యత్నిస్తోందని ఆరోపించారు. తొలుత రాయన్నపేటలో తూము ప్రకాష్రావు కాంస్య విగ్రహం, కలకోటలో ఆయన స్తూపానికి సీపీఐ జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు నివాళులర్పించగా, యాత్రకు సీపీఎం నాయ కులు సంఘీభావం తెలిపారు. యాత్రలో సీపీఐ నాయకులు బెజవాడ రవిబాబు, జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కరుణకుమార్, సింగు నర్సింహారావు, సీతామహాలక్ష్మి, ఏనుగు గాంధీ, తోట రామాంజనేయులు, యంగల ఆనంద్రావు, తూము రోషన్కుమార్, కొంగర భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాచైతన్య యాత్రలో సీపీఐ నేత హేమంతరావు -
నిరుద్యోగులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్
ఖమ్మంసహకారనగర్: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏడాది పాటు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆర్సీ ఎగ్జామ్స్ చైర్మన్ మెండెం కిరణ్కుమార్ తెలిపారు. పోస్టర్లను ఆదివారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఆవిష్కరించగా కిరణ్కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలోనే పేరున్న కరీం, కృష్ణారెడ్డి, పాషా తదితర అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఆన్లైన్ కోచింగ్ ఇప్పిస్తామని తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు kiranyuvasena. comలో వివరాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 83990 99499 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
వైరారూరల్: వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామ సమీపాన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగితో పాటు ఆయన కుటుంబీకులు గాయపడ్డారు. వైరా మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన ప్రశాంత్ మణుగూరు ఏరియా కొండాపురం భూగర్భ గనిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం భార్యాపిల్లలతో కలిసి స్వస్థలానికి వచ్చి తిరిగి కారులో వెళ్తూ ముందున్న లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమాన ఎదురుగా వచ్చిన మరో లారీని ఢీకొట్టగా ప్రశాంత్తో పాటు ఆయన భార్య ఆశఅంజని, కుమార్తెలు యవనశ్రీ, నేహాశ్రీ, ధ్వనికశ్రీకి గాయాలయ్యాయి. అయితే, ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి ప్రశాంత్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు, స్థానికులు గంట పాటు శ్రమించి బయటకు తీశారు. ఇదే సమయాన అటుగా వెళ్తున్న వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ అంబులెన్స్ రావడం ఆలస్యంం కావడంతో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. లారీడ్రైవర్ బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు. లారీని ఓవర్టేక్ చేస్తూ ఇంకో లారీని ఢీకొట్టిన కారు -
ముక్కకు తంటా
ధరల మంట..ఖమ్మంవ్యవసాయం: కోళ్ల దాణా ధరలు మండి పోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న దాణా ఖర్చులతో కోళ్ల పెంపకంపై భారం పడుతోంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చు భారం చికెన్ ప్రియులే భరించక తప్పటం లేదు. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధర రూ.320 వరకు చేరడంతో సామాన్యులు మొద లు మధ్య తరగతి కుటుంబాలకు భారమైంది. పెరిగిన దాణా ధరలు దాణా ధరలు కొద్ది రోజుల వ్యవధిలో 25 – 75 శాతం వరకు పెరిగాయి. ఈ ప్రభావంతో ధర 40 శాతం మేర పెరిగింది. రెండు నెలలుగా మొక్కజొన్న, సోయా, బియ్యం తవుడు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కోళ్ల పరిశ్రమ ఒత్తిడికి గురవుతూ.. పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఒక కోడిని పెంచేందుకు గతంలో రూ.70 – రూ.80వరకు ఖర్చయితే ఇప్పుడు అది రూ.100కు చేరింది. ఉత్పత్తి తగ్గించిన రైతులు దాణా ఖర్చు పెరగడంతో నిర్వహణ భారం భరించలేక పౌల్ట్రీ రైతులు కోళ్ల ఉత్పత్తి తగ్గించారు. మరోపక్క ఇటీవల ఏసీ పౌల్ట్రీలు పెరుగుతున్నాయి. వీటిలో తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలోనే కోడి సిద్ధమవుతోంది. వీటితో పోలిస్తే సాధారణ ఫారాల్లో కోళ్ల ఉత్పత్తి ధర ఎక్కువగా ఉండడం నిర్వాహకులపై భారం పడుతోంది. దీనికి తోడు ఇప్పుడు దాణా ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిస్తున్నారు. జిల్లాలో 25 – 30 వరకు పెద్ద పౌల్ట్రీ ఫారాలు ఉండగా, చిన్న పరిశ్రమలు వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి. చికెన్ ప్రియులపై భారం పెరిగిన చికెన్ ధరలు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. కరోనా తర్వాత చికెన్కు ప్రాధాన్యత పెరిగింది. ప్రోటీన్లు ఉండే ఆహారం కావడం.. మటన్ ధర రూ.వేయి దాటడంతో చాలామంది చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాన్యులు మొదలు మధ్య తరగతి, ఉన్నత స్థాయి వర్గాలు వారానికి ఒకసారి చికెన్ తింటున్నారని అంచనా. గతంలో కిలో రూ.200 వరకు ఉన్న చికెన్ ధర ప్రస్తుతం ప్రాంతాల వారీగా రూ.300 నుంచి రూ.320 పలుకుతుండడం సామాన్య, మధ్య తరగతి వారిపై భారమవుతోంది. ప్రస్తుత ధరగత ధరదాణా రకం పెరుగుదలరూ.160 నుంచి రూ.200 ఉన్న కిలో చికెన్ ఇప్పుడు రూ.320కి విక్రయిస్తున్నారు. ఈ ధరతో వారానికి ఒకసారి కొనుగోలు చేయడం భారంగా ఉంది. ప్రొటీన్ ఫుడ్గా చికెన్కు ప్రాధాన్యత ఇస్తున్నా ధరల పెరుగుదల ఇబ్బందికరంగా మారింది. –సోమారపు సుధీర్, ప్రకాష్నగర్, ఖమ్మం దాణాలో మొక్కజొన్నతో పాటు సోయా, బియ్యం తవుడు ధరలు పెరిగి కోడి ఉత్పత్తి ఖర్చు బాగా పెరిగింది. రూ.80 మేర విక్రయించాల్సిన లైవ్ కోడిని రూ.130తో అమ్మినా ప్రయోజనం ఉండడం లేదు. ఫారాల నిర్వహణ ఆశానకంగా లేదు. –రావి బాబూరావు, శ్రీనివాసనగర్, ఖమ్మం -
ఒకరి ఆధార్తో ఇంకొకరికి రుణం
డీసీసీబీ మేనేజర్పై కేసు నమోదు వైరా: ఓ వ్యక్తి ఆధార్కార్డు ఉపయోగించి అదే పేరు కలిగిన ఇంకొకరికి పంట రుణం మంజూరు చేసిన బ్యాంకు మేనేజర్పై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. వైరాలోని డీసీసీబీ మేనేజర్ ఎ.అనిత, ఉద్యో గి నరసింహారావు 2024లో వైరా మండలం గన్న వరం గ్రామానికి చెందిన శీలం ప్రసాద్రెడ్డి ఆధార్కార్డు వినియోగించి అదే గ్రామానికి చెందిన శీలం ప్రసాదరెడ్డి (తండ్రి కృష్ణారెడ్డి)కి రూ.2 లక్షల రుణం మంజూరు చేశారు. ఈ విషయం ఇటీవల బయటపడడంతో అసలు ఆధార్ కార్డు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు మేనేజర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. వరదనీటిలో చిక్కుకున్న భక్తుల కారురైతుల చొరవతో తప్పిన ముప్పు ఏన్కూరు: ఆలయ దర్శనానికి బయలుదేరిన వారి కారు వరదనీటిలో చిక్కుకోగా.. స్థానిక రైతులు అప్రమత్తం కావడంతో క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మానికి చెందిన పలువురు మహిళలు ఆదివారం ఉదయం ఏన్కూరు మండలం లోనినాచారం శ్రీఅద్భుత వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. ఆ తర్వాత పాల్వంచ పెద్దమతల్లి, భద్రాచలంలో రామయ్య దర్శనానికి వెళ్లాలని బయలుదేరారు. అయితే, నాచారం ఆలయం సమీపాన వాగు దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో కారు అందులో చిక్కుకుంది. కారు నుంచి బయటకు దిగే క్రమాన ఓ మహిళ నీటిలో కొట్టుకొనిపోతుండగా స్థానిక రైతులు అప్రమత్తమై కాపాడారు. అంతేకాక కారును కూడా ట్రాక్టర్ సాయంతో వరద నుంచి బయటకు లాగగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
‘నిర్మల్ హృదయ్’ అధినేత సాంబశివారెడ్డి మృతి
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ స్కూల్ కరస్పాండెంట్ వంగా సాంబశివారెడ్డి (80) ఆదివారం మృతి చెందాడు. ఆయన తన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గుంటూరు జిల్లా కాల్లిపర మండలం వలభాపురంలో జన్మించిన సాంబశివారెడ్డి ఎమ్మెస్సీ పూర్తయ్యాక కొత్తగూడెంలోని రామచంద్ర కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత 1978 – 79లో ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్లో ఎన్నెస్పీ పిల్లల కోసం నిర్మల్ హృదయ్ స్కూల్ను ప్రారంభించి.. వేలాది మందిని తీర్చిదిద్దారు. కాగా, సాంబశివారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు సుధాకర్రెడ్డి, రవిభరత్రెడ్డి ఉన్నారు. ఆయన మృతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, పలు పార్టీల నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, దండి సురేశ్, తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం కాంతారావుతో పాటు పలు విద్యాసంస్థల చైర్మన్లు మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య, రవిమారుత్, గుండాల కృష్ణ, వీరన్న, ఉషాకిరణ్కుమార్, వెంకటేశ్వరరావు, సీహెచ్జీకే ప్రసాద్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
నేను కావాలంటే మీ అత్తను చంపేయ్
● మూడో మహిళ కోరిందని రెండో భార్య తల్లి హత్య ● ఆపై మృతదేహాన్ని తగలబెట్టిన నిందితులు సత్తుపల్లి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళను తన అత్త, భార్య తిట్టి, కొట్టి అవమానించారనే కోపంతో వృద్ధురాలిని హత్య చేసిన ఆమె అల్లుడితో పాటు ఆయనతో సంబంధం కలిగిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సత్తుపల్లి పోలీస్స్టేషన్లో ఆదివారం వైరా ఏసీపీ సారంగపాణి వివరాలను వెల్లడించారు. సత్తుపల్లి మండలం తుమ్మూరుకు చెందిన గుండాల వెంకటనరసమ్మ (65) కుమార్తె మంగను వెదుళ్ల తిరుపతిరావు వివాహం చేసుకున్నాడు. అంతకు ముందే మరో మహిళను పెళ్లాడినా ఆమెను వదిలేసి మంగతో పాటు తుమ్మూరులో ఉంటున్నాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన పగుట్ల సునీతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతుండగా, ఇటీవల వెంకటనర్సమ్మ, మంగ కలిసి వెళ్లి దుద్దిపూడిలో పని చేస్తున్న సునీతను తిట్టి, కొట్టారు. దీన్ని అవమానంగా భావించిన సునీత తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలంటే వెంకటనరసమ్మను హతమార్చాలనితిరుపతిరావుకు సూచించింది. ఇంట్లో టీవీ చూస్తుండగా.. ఈ నెల 2వ తేదీన వెంకటనర్సమ్మ ఇంట్లో ఉండడాన్ని గమించిన తిరుపతిరావు, సునీత వెనుక నుంచి వెళ్లి చీర కొంగును ఆమె మెడను బిగించి హత్య చేశారు. అంతేకాక మృతదేహాన్ని అదేరోజు రాత్రి ద్విచక్ర వాహనంపై నారాయణపురం శివారుకు తీసుకెళ్లి అక్కడ చెత్తాచెదారం వేసి బైక్ నుంచి పెట్రోల్ తీసి తగలబెట్టారు. మరుసటి రోజు రాత్రి మళ్లీ వెళ్లేసరికి మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో భాగాలను మరికొంత దూరం తీసుకెళ్లి పూర్తిగా తగలబెట్టారు. తొలుత వెంటనర్సమ్మ కానరావడం లేదని అందిన ఫిర్యాదుతో విచారిస్తుండగా.. ఆమెను హత మార్చినట్లు తిరుపతిరావు గ్రామ సర్పంచ్ వీరబాబు, జీపీఓ లక్ష్మణ్కు చెప్పాడు. దీంతో పోలీసులు తిరుపతిరావు, సునీతను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో సత్తుపల్లి పట్టణ ఎస్ఐ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్ఐలు వీరప్రసాద్, ప్రదీప్ పాల్గొన్నారు. -
ఐకేపీలో వీఓఏల కొరత
చింతకాని: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేరవేయడంలో ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) గ్రామ సంఘాల సహాయకులు (వీఓఏ) కీలకపాత్ర పోషిస్తారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు వెన్నెముకగా నిలవాల్సి ఉంటుంది. మహిళా సంఘాల్లో ఐక్యతను పెంచి క్రమం తప్పక పొదుపు చేసేలా ప్రోత్సహించడం, సీ్త్రనిధి, బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలను ఇప్పించి రికవరీ ప్రక్రియను పర్యవేక్షించడమే కాక సంఘాల ఆర్థిక లావాదేవీలకు నిర్వహణలో చేయూతనిస్తారు. కానీ, జిల్లాలో వీఓఏలు సరిపడా లేకపోవడంతో సంఘాల అభివృద్ధి కుంటుపడుతోంది. సంఘాల ఏర్పాటు, రుణాల మంజూరులోనే కాక అంతర్గత పొదుపు, వసూళ్లు కూడా సక్రమంగా సాఫీగా జరగడం లేదు. మరోపక్క ప్రతీనెల సంఘాల రికార్డులు, బ్యాంక్ పాస్పుస్తకాల తనిఖీ సాఫీగా జరగకపోవడంతో సభ్యులు రుణ వాయిదాలు చెల్లిస్తున్నా లీడర్లు బ్యాంక్లో జమచేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి ఉదంతాలు వెలుగుచూస్తున్నా వీఓఏల నియామకంపై అధికారులు దృష్టిసారించడం లేదు. 24 వేలకు పైగా సంఘాలు.. 921 మంది వీఓఏలు జిల్లాలోని 20 మండలాల్లో 2,42,090 మంది మహిళా సభ్యులతో కూడిన 24,797 స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలను సమర్థవంతంగా నడిపించాలంటే నిబంధనల ప్రకారం 20 సంఘాలకు ఒక వీఓఏను నియమించాలి. అంటే జిల్లాలో 1,240 మంది వీఓఏలు పనిచేయాల్సి ఉండగా, 921 మందే ఉన్నారు. ఫలితంగా కొత్త సంఘాల ఏర్పాటు, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, రుణాల మంజూరు, రికవరీలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా మహిళా సంఘాలు, సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది.ఏయే గ్రామాల్లో అత్యవసరంగా వీఓఏల నియామకం అవసరమో గుర్తించి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం. అంతేకాక డిజిటల్ లావాదేవీలు జరిపేలా సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. నగదు సొంతానికి వాడుకునే సభ్యులపై చర్యలు తీసుకుంటాం. –కొండపల్లి శ్రీరామ్, డీఆర్డీఓ సంఘాల సంఖ్యకు అనుగుణంగా వీఓఏలు లేకపోవడంతో పర్యవేక్షణ సాఫీగా సాగడం లేదు. రికార్డుల నిర్వహణ, రుణాల మంజూరులో వీఓఏలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి నియామకాలు చేపట్టాలి. – గంధం కవిత, చింతకాని మండల సమాఖ్య అధ్యక్షురాలు -
స్నేహితుల కుటుంబాలకు చేయూత
కారేపల్లి: ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. మండలంలోని మాధారం గ్రామానికి చెందిన రమేశ్ తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమాన రమేశ్తో కలిసి మాధారం కేవీ విద్యానికేతన్లో 10వ తరగతి చదివినవారు ఆయనకు శనివారం రూ.27 వేలు అందించారు. అలాగే, గుంపెళ్లగూడెంనకు చెందిన వీరన్న మృతి చెందడంతో ఆయన కుమార్తె పేరిట రూ.1.10 లక్షలను డిపాజిట్ చేసి బాండ్ అందజేశారు. కార్యక్రమంలో కేవీ విద్యానికేతన్ కరస్పాండెంట్ కప్పెర రంగారావు, పూర్వ విద్యార్థులు బాదావత్ రవి, అజ్మీరా నరేశ్, బోడ రమేశ్నాయక్, అజ్మీరా సురేశ్, బట్టు వీరు, బాలు, లచ్చు, బానోతు నగేశ్, దుంపటి గోవింద్, పోతనబోయిన ఉమారావు, రాంబాబు, అజ్మీరా రజిని తదితరులు పాల్గొన్నారు. గురుకులాల సమస్యలు పరిష్కరించాలి మధిర: గురుకులాల్లోని సమస్యలే కాక ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మధిరతో పాటు పలు గురుకులాల్లో శనివారం పరిశీలించిన ఆయన ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉన్న టైం టేబుల్ను మార్చడమే కాక ఉపాధ్యాయులకు నైట్డ్యూటీలు తొలగించి వార్డెన్లను నియమించాలన్నారు. అంతేకాక 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లిస్తూ హెల్త్ కార్డులు ఇవ్వాలని, జూనియర్ కళాశాలల అధ్యాపకులకు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు. సమావేశంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలీతో పాటు దామోదర్, శాంసన్, బండారు నాగరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. టీసీసీబీఈఏ జిల్లా కమిటీ ఎన్నిక ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహాసభ శనివారం ఖమ్మంలో జరిగింది. సమావేశంలో టీసీసీబీఈఏ రాష్ట్ర చైర్మన్ కనకం జనార్దన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే అలీముద్దీన్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పాశం నాగేందర్, ప్రధాన కార్యదర్శి బి.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించగా, సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానం, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మూడేళ్ల కాలానికి గాను జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఈ.శాంతిరాగమయి, కార్యదర్శిగా ఎం.రామకృష్ణ, కోశాధికారిగా ఎన్.నాగేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. పోలీసు సంక్షేమ సంఘం.. ఖమ్మంక్రైం: జిల్లా పోలీస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హేమనాథ్ (హెచ్సీ 2092), ఉపాధ్యక్షులుగా కె.జగదీశ్ (ఎస్ఐ), సురేశ్ (ఎస్ఐ), కార్యదర్శిగా బి.వీరభద్రం (ఏఆర్ ఎస్ఐ) ఎన్నికయ్యారు. అలాగే, సంయుక్త కార్యదర్శిగా కె.సుధాకర్ (పీసీ 2353), ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.అప్పారావు (ఏఆర్ పీసీ 1172), కోశాధికారిగా నరసింహారావు (పీసీ 2668)తో పాటు కార్యవర్గ సభ్యులుగా వై.వెంకటేశ్వర్లు (పీసీ 1073), వి.వినయ్కృష్ణ (పీసీ 498), కె.సురేశ్ (పీసీ 2885), టి.జమలయ్య (ఏఆర్ పీసీ 79), ఎన్.ఏడుకొండలు (ఏఆర్ పీసీ 1387), టి.రేణుక (పీసీ 253) ఎన్నిక కాగా, ఈ కార్యవర్గం మూడేళ్ల పాటు కొనసాగనుంది. గణిత ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఝాన్సీరాణి బోనకల్: బోనకల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు గంటెల ఝాన్సీరాణి తెలంగాణ గణితఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్లో జరిగిన టీఎంఎఫ్ కార్యవర్గ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఝాన్సీరాణిని మండల ఉపాధ్యాయులు అభినందించారు. -
పాఠశాలల క్రీడలు ఎప్పుడు?
ఖమ్మం స్పోర్ట్స్: విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నాయి. అయినా పాఠశాలల క్రీడాపోటీల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ, పాఠశాలల క్రీడా సంఘం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఏటా ఇదే తరహాలో ప్రణాళిక లేకపోవడం, ఆతర్వాత హడావుడిగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తుండడంతో జట్ల ఎంపికల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. క్యాలెండర్ రూపొందించి పోటీలు నిర్వహిస్తేనే అర్హులు, ఔత్సాహిక విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేధిస్తున్న నిధుల కొరత ప్రధానంగా పోటీల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. క్రీడా నిర్వహకులు ప్రతీ విద్యార్థి నుంచి కనీసం రూ.10 వసూలు చేసినా రూ.లక్షల్లో జమ అవుతాయి. కానీ గత ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచే దాదాపు రూ.10లక్షలకు పైగా వసూలు కావాల్సి ఉండగా ఆ స్థాయిలో రాలేదు. కొన్ని స్కూళ్ల బాధ్యులు ఆలసత్వం వహించగా, ఇంకొందరు పూర్తిగా చెల్లించలేదు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగా, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే రుసుము వసూలు చేస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. మండల, జోన్ స్థాయిలో పోటీలు తప్పనిసరి జిల్లా స్థాయి పాఠశాలల క్రీడాపోటీలనుమూడంచెల్లో నిర్వహించాలి. మండల స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించాల్సి ఉన్నా పెద్దగా స్పందన రావడం లేదు. ఆపై కొంతమందిని హడావుడిగా తీసుకొచ్చి, ఆ పోటీలు కాగానే జోన్స్థాయి జట్లను ఎంపిక చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని క్రీడాంశాల్లో నేరుగా జిల్లాస్థాయి ఎంపికకు పంపిస్తుండడం గమనార్హం. భావిస్తున్నారు. జిల్లాస్థాయిలో కనీసం 20 క్రీడాంశాశాల్లో పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేస్తే ఫలితం ఉంటుందని తెలిసినా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల క్రీడాసంఘం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే, క్రీడా సంఘం బాధ్యులు మాత్రం సరైన నిధులు లేక జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కనీసం 30 క్రీడాంశాలకు పైగా అండర్–14, 17 బాలబాలికల జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించాల్సి ఉండడం, క్రీడాకారుల వెంట పీఈటీలు వెళ్లాల్సి రావడం భారం మారుతున్నందున ముందుగా నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. -
భార్య కేసు పెడతానని బెదిరిస్తే..
కొణిజర్ల: గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాకపోగా ఫోన్ చేస్తే కేసు పెట్టి జైలులో వేయిస్తానని బెదిరించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ తెలిపిన వివరాలు.. మండలంలోని తనికెళ్లకు చెందిన పెద్దగౌండ్ల గోపాల్రావు అలియాస్ గోపి(27)కు గతంలోనే వివాహం జరిగినా విభేదాలతో విడిపోయారు. ఆ తర్వాత ఆయన చింతకాని మండలం నేరడకు చెందిన రజనిని వివాహం చేసుకోగా దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా పెద్దలు నచ్చజెప్పినా మార్పు రాలేదు. ఈ క్రమాన 15 రోజుల క్రితం రజని పుట్టింటికి వెళ్లింది. గోపి ఫోన్ చేయగా మరోమారు ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో గోపి రోజులాగే శుక్రవారం ఆటో నడిపిన అనంతరం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం స్థానికులు ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనపై ఆయన తల్లి శాంతమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, గోపి చేతిపై ‘నా చావుకు కారణం భార్య రజని, మామ మట్టా సీతారాములు’అని రాసుకున్నాడని తెలిపారు.ఆందోళనతో యువకుడి ఆత్మహత్య -
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదా నికి అర్చకులు పంచామృతం అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామితో పాటు అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, ఆతర్వాత పల్ల కీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఏఓయూలో డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు సత్తుపల్లి టౌన్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ ప్రవేశాల గడువు ను సెప్టెంబర్ 9వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ చీపు పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఇంటర్, పాలి టెక్నిక్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్, డిప్లొమా పాసై న విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ఎస్టీ కోయ, చెంచు, గోండు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్య అందుతుందని తెలి పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ రెగ్యులర్ డిగ్రీ చేయలేని వారు, గృహిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, రెండు, మూడో సంవత్సరం విద్యార్థులు సెప్టెంబర్ 9 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. వివరాలకు 94918 81910, 81878 37058 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. పక్కా ప్రణాళికతో డెంగీ నియంత్రణ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డెంగీ వ్యాధి నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కేఎంసీలో శనివారం ఆయన అర్బన్ మలేరియా విభాగం సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంఓ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో డెంగీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం ఉపశమనం కలిగిస్తోందన్నారు. 2022లో 272, 2023వ సంవత్సరంలో 129, 2024లో 65, 2025లో 45 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు మూడే నమోదయ్యాయని తెలిపారు. అయినా గత అనుభవాల దృష్ట్యా వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ లార్వా కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. సైడ్ డ్రెయిన్లలో నీరు నిల్వ ఉండకుండా చూస్తూ, ఫాగింగ్ నిర్వహించాలని తెలిపారు. మత్స్య రైతులకు ముగిసిన శిక్షణ కూసుమంచి: మండలంలోని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో హైదరాబాద్కు చెందిన పీ.వీ.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన మత్స్య రైతులకు ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ‘బయోప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై ఇక్కడ మూడు రోజుల పాటు ఇచ్చిన శిక్షణకు ఖమ్మం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, హైదరా బాద్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న మెళకువలు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అలాగే, నాబార్డ్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.శ్యాంప్రసాద్, శాస్త్రవేత్త బి.రవీందర్తో పాటు నాగరాజు తదితరలు మాట్లాడగా శాస్త్రవేత్తలు బానోతు దివ్య, డాక్టర్ కె.అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవోపేతంగా వరుణయాగం
సత్తుపల్లి(పెనుబల్లి): అతివృష్టి, అనావృష్టి లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పెనబల్లి మండలంలోని శ్రీ నీలాద్రీశ్వర దేవస్థానంలో శనివారం వరుణయాగం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో యాగ ప్రాంగణం కిక్కిరిసిపోగా, వేద మంత్రోచ్ఛరణలతో ఆలయం మార్మోగింది. సకాలంలో వర్షం కురవాలని, రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు, అర్చకులు యాగం నిర్వహించారు. అర్చకులు కేతముక్కల పవన్కుమార్శర్మ, మాధవ్ పర్యవేక్షణలో పలు ప్రాంతాల అర్చకులు అనిపెద్ది ప్రసన్నకుమార్శర్మ, సుబ్రహ్మణ్యశర్మ నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆలయ ఈఓ రజనీకుమారి, ఇన్నోవేషన్ కమిటీ చైర్మన్ చీకటి నరసింహారావు, సభ్యులు మిట్టపల్లి నరేంద్ర, మాణిక్యాల ప్రసాద్, గంగిశెట్టి జగదీశ్కుమార్, శ్రీనివాస్, సత్యనారాయణ, దేవాలయ ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.నీలాద్రీశ్వర ఆలయానికి తరలివచ్చిన భక్తులు -
నర్సరీ దాటని నారు
మధిర: వర్షాభావ పరిస్థితులు వరి సాగుపై కాక మిర్చి సాగుపైనా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే నారు పెంచే నర్సరీలు తగ్గగా, అధికారులు సైతం మిర్చి సాగు తగ్గించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఈనెలాఖరు వరకు మిర్చి సాగుకు అవకాశం ఉన్నందున ఆ సమయానికి సాగు విస్తీర్ణంపై స్పష్టత రానుంది. నర్సరీల రెన్యూవల్ అంతంతే... వ్యవసాయ సీజన్ ఆరంభం నుంచే అధికారులు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పిస్తుండడంతో మిర్చి నారు పెంచే నర్సరీల యజమానులు ఆచితూచి వ్యవహరించారు. ఏటా జూన్ చివరి నుంచే నర్సరీల్లో నారు పెంపకం మొదలుపెట్టి ఆగస్టు వరకు విక్రయిస్తారు. కొందరు రైతులు సొంతంగా విత్తనాలు తెచ్చుకుంటే, ఇంకొందరికి నర్సరీల యజమానులే తాము పెంచిన నారు విక్రయించడం ఆనవాయితీ. ఈసారి పరిస్థితుల దృష్ట్యా చాలామంది నర్సరీల యజమానులు రెన్యువల్కే మొగ్గుచూపలేదు. అంతేకాక నారు పెంపకానికి అవసరమైన కోకోపిట్ ధర టన్నుకు గత ఏడాది రూ.5వేలు ఉంటే ఈ ఏడాది రూ.11వేలకు చేరడంతో వెనుకడుగు వేశారు. జిల్లాలోని కూసుమంచి, రఘునాథపాలెం, కారేపల్లి, తల్లాడ, కామేపల్లి, కొణిజర్ల, మధిర తదితర మండలాల్లో ఎక్కువగా మిర్చి సాగవుతుంది. గత ఏడాది 235 నర్సరీల ద్వారా 53.40 కోట్ల మొక్కలను రైతులకు విక్రయించారు. ఈసారి చాలాచోట్ల నర్సరీల్లో నారు సిద్ధం చేసినా... కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. గత వారంగా కురుస్తున్న వర్షాలతో కొందరు రైతులు నారు తీసుకెళ్లి నాటుతున్నా, విస్తీర్ణంపై మాత్రం అంచనాకు రాలేకపోతున్నారు. పెరుగుతుందని భావిస్తే... గత సీజన్ చివరి నుంచి ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో మిర్చి రేటు ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం తేజ రకం క్వింటా రూ.22 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పరిస్థితి తారుమారైంది. 2024–2025 సీజన్లో జిల్లాలో 70 వేల ఎకరాల్లో మిర్చి సాగు కాగా, ఆ ఏడాది సరైన ధర లేక 2025–2026 సీజన్లో 30 వేల ఎకరాలకే సాగు పరిమితమైంది. ఈసారి ధర బాగున్నప్పటికీ ఎల్నినో ప్రభావం.. అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెద్దగా పెరగకపోవచ్చని తెలుస్తోంది. వర్షాభావంతో మిర్చి సాగుపై నీలినీడలు కోకో పిట్ కొరత తీవ్రంగా ఉంది. అంతేకాక గత ఏడాది టన్ను ధర రూ.5వేలు ఉంటే ఈ ఏడాది రూ.11వేలకు చేరింది. వర్షాభావ పరిస్థితులతో మిర్చి సాగు ఎలా ఉంటుందో తెలియడం లేదు. అంతుకే రైతులు విత్తనాలు తీసుకొస్తేనే నారు పెంచుతున్నాం. – కిషోర్, నర్సరీ యజమాని, మధిరఏడు నెలల కాలపరిమితి కలిగిన మిర్చి సాగుకు ప్రతీ దశలో నీరు అవసరం ఉంటుంది. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా మిర్చి సాగు తగ్గించాలని రైతులకు సూచిస్తున్నాం. ఈనెలాఖరు వరకు మిర్చి సాగు చేసే అవకాశమున్నందున ఇప్పుడే అంచనా వేయలేం. – మధుసూదన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, ఖమ్మం -
బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనం
చింతకాని: దశాబ్ద కాలంగా కేంద్రంలో మోదీ అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన జన చైతన్య యాత్ర శనివారం చింతకాని మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ దేశ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల కోసమే పాలన సాగిస్తున్నారని, దేశ సంపదను వారికి దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. రాముడి పేరుతో ప్రజలను వంచిస్తున్న మోదీ, తనను విమర్శించే వారిని మాత్రం దేశద్రోహులుగా చూపుతున్నారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు పేదలకు కాక పైరవీకారులు చెప్పినవారికే మంజూరవుతున్నాయ ని విమర్శించారు. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. కాగా, సీపీఐ నేతల యాత్రలకు పలు గ్రామాల్లో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు స్వాగతం పలికారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎర్రా బాబు, షేక్ జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీరా రాంమూర్తి, పోటు కళావతి, రావి శివరామకృష్ణ, చిన్నవెంకటరెడ్డి, ఏపూరి రవీంద్రబాబు, సీతామహాలక్ష్మి, దూసరి గోపాల్రావు, సర్పంచ్లు పర్సా రామచంద్రరావు, ఏపూరి పద్మ, ఆవుల నర్సింహారావు, కాంపెల్లి కోటమ్మ, నాయకులు దొబ్బల వెంగళరావు, మార్గం శ్రీను, పదిమెల వెంకటనర్సయ్య, గోగుల ఆది, సింగారపు సత్యనారాయణ, పగిడిపల్లి ఏసు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు లో జరిగిన ఓ వృద్ధురాలి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన చెన్న సుగుణ గత నెల 17న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా, ఆభరణాల చోరీ కోసం వచ్చిన వారితో కారం, కత్తిపీటతో ప్రతిఘటించింది. దీంతో అదే కత్తిపీటతో ఆమె తలపై తీవ్రంగా కొట్టగా మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు పోలీసులు గ్రామాన్ని జల్లెడ పట్టి అనుమానితులను విచారించడంతో పాటు పలువురి కాల్డేటాను పరిశీలించారు. ఈ క్రమాన వృద్ధురాలి ఇంటి సమీపాన చికెన్షాపు నిర్వహిస్తున్న ఓ యువకుడి కదలికలపై నిఘా వేసి ఆయన ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలించడంతో నిందితుడిగా తేలినట్లు సమాచారం. ఆయన తన సమీప బంధువు ద్వారా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసినట్లు తేలడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆ యువకుడి సోదరుడు, సమీప బంధువును కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చోరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న నగదు లావాదేవీల ఆధారంగా పోలీసులు కేసు చేధించినట్లు తెలుస్తుండగా, హత్యకు ఉపయోగించిన వస్తువులు, బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. అంతేకాక ఇదే గ్రామంలో జరిగిన ఇంకొన్ని ఘటనల్లో నిందితుల పాత్ర ఉందా అని విచారిస్తున్నట్లు సమాచారం.కాల్డేటా, లావాదేవీల ఆధారంగా గుర్తింపు -
కాలేజీలు కళకళ !
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సౌకర్యాలు కల్పించడమే కాక నాణ్యమైన విద్య అందిస్తూ ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది నోట్బుక్కులు కూడా పంపిణీ చేయగా, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలుచేస్తామన్న ప్రకటనతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ఏడాది 2,862 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది ఇప్పటి వరకు 3,127 మంది ప్రవేశాలు పొందడంతో పలు కాలేజీలు కళకళలాడుతున్నాయి. ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యాన ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. విస్తృత ప్రచారం ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు అధ్యాపకులు, ఉద్యోగులు గత విద్యాసంవత్సరం చివరి సమయం నుంచే విస్తృత ప్రచారం చేశారు. కాలేజీల్లోని సౌకర్యాలు, మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలను కరపత్రాల ద్వారా వివరించా రు. ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ, డిజిటల్ బోధనతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలవుతుందని వివరించడంతో ప్రవేశాలు పెరిగాయి. ప్రవేశాలు ఇలా.. జిల్లాలోని 21కాలేజీలకు గాను అత్యధికంగా ఖమ్మంలోని ఏఎస్ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ కాలేజీలో గత ఏడా ది 361మంది విద్యార్థులు ఉంటే, ఈ ఏడాది ఇప్పటి వరకు 440మంది చేరారు. సత్తుపల్లి బాలికల కళాశాలలో గత ఏడాది 80మంది ఉండగా.. ఈ ఏడాది 126కు పెరిగింది. ఇలా పలు కళాశాలల్లో గతేడాతో పోలిస్తే 20–40మంది వరకు ఎక్కువగా చేరారు. అయితే, కొన్ని కాలేజీల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రవేశాలు కాలేదు. బనిగండ్లపాడు కళాశాలలో గత ఏడాది 67మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది 47మందే ఉన్నారు. నాగులవంచ కళాశాలలో 104 మంది ఉండగా.. ఈసారి 69మంది, ముదిగొండ కళాశాలలో గత ఏడాది 117మంది ఉంటే ఈ ఏడాది 91 మంది, బోనకల్లో గత ఏడాది 96 మంది విద్యార్థులు ఉండగా ఈసారి 70కే పరిమితమైంది.ప్రభుత్వ కళాశాలల్లో గత ఏడా ది కన్నా ఈ ఏడాది ప్రవేశాలు పెరిగాయి. కాలేజీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన విద్య అందించడ మే కాక డిజిటల్ బోధన, ఉచిత పాఠ్య, నోట్పుస్తకాల పంపిణీ తదితర అంశాలు కలిసొచ్చాయి. ఈ నెల 15వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉన్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – రవిబాబు, డీఐఈఓ -
ఆధునికత దిశగా..
పాల్వంచరూరల్: ప్రకృతితో మమేకమై అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించిన ఆదివాసీలు క్రమంగా ఆధునికత వైపు అడుగులు చేస్తున్నారు. ప్రభుత్వ సదుపాయాలు, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ చైతన్యం, ముందడుగు ఆదివాసీ సమాజం మొత్తంలో లేదు. పాలకులు, ఉన్నతాధికారులు, అభ్యుదయ, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే ఆదివాసీలు అందరూ ప్రగతిబాట పట్టే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. తొలుత అడవే వీరి జీవనానికి ప్రధాన ఆధారంగా ఉండేది. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా ఉపాధి పొందేవారు. క్రమంగా వ్యవసాయం చేయడంతోపాటు వివిధ రకాల వృత్తి, పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి కొలువులు కూడా చేపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వస్త్రధారణపైనా ఆసక్తి చూపుతున్నారు. పలువురుఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో, ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీలు చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. ఐటీడీఏ పరిధిలో 32 గురుకుల, ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 14,253 గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60 శాతం మంది ఆదివాసీలే ఉన్నారు. భద్రాచలం: ఆదివాసీ సంప్రదాయ కొమ్మునృత్యం నేడు యువతకు ఉపాధిగా మారింది. కొమ్ము పాగా ధరించి డోలు వాయిస్తూ లయబద్ధంగా చేసే నృత్యం ఆకట్టుకుంటుంది. ఇద్దరు నృత్యకారులు ఎగురుతూ ధరించిన కొమ్ములతో ఢీ కొట్టే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. దీన్నే రేలా నృత్యం అని కూడా పిలుస్తారు. పురుషులు అడవి దున్న లేదా ఎద్దు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేకమైన కిరీటాన్ని తలకు ధరిస్తారు. శరీరంపై నెమలి ఈకలు, వర్ణరంజితమైన దుస్తులు, చేతిలో డప్పు (తుడుము) కనిపిస్తాయి. తొలుత ఆదివాసీ గ్రామాల్లోనే ప్రదర్శించే ఈ నృత్యం ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలలో, ప్రముఖుల పర్యటనల్లో ప్రదర్శిస్తున్నారు. దీంతో కొందరు ఆదివాసీ యువకులు సంస్కృతిని కాపాడుకుంటూనే కొమ్ము నృత్యంతో ఉపాధి పొందుతున్నారు. గొత్తికోయ గిరిజన గ్రామాల్లో మూల ఆదివాసీ సంక్షేమ సంఘం (మాస్ ), గిరిజన పెద్దలు కలిసి ఆదివాసీ పల్లెల్లో డీజేలను వినియోగించొద్దని నిర్ణయించుకున్నారు. సంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తున్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
వలస ఆదివాసీలు
రెండు దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి ఆదివాసీలు వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. వీరిలో ఛత్తీస్గఢ్ వాసులే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో 125 వలస ఆదివాసీ పల్లెలు ఉండగా, 23 వేల మంది జనాభా ఉంది. వీరిలో పదో తరగతి, ఇంటర్ చదువుతున్నవారు గ్రామంలో ఒకరిద్దరి కంటే ఎక్కువగా లేరు. ఇప్పుడిప్పుడే ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. వంట గ్యాస్, ద్విచక్ర వాహనాలు, స్మార్ట్ఫోన్లు, ఇళ్లలో డిష్ టీవీల వినియోగాన్ని అలవర్చుకోవడమే కాక పిల్లలను చదివిస్తున్నారు. పాల్వంచ మండలంలోని పలు పల్లెల్లో ఈ మార్పులు కన్పిస్తున్నాయి. రెడ్డిగూడెం ఎస్టీకాలనీకి చెందిన ఇద్దరు యువకులు ఇంటర్, చిరుతానిపాడులో మరో ఇద్దరు యువతులు ఉన్నత విద్య చదువుతుండగా గంగదేవిగుప్పలో ఓ యువకుడు పీజీ చేశాడు. -
బ్రాండెడ్ పేరిట నకిలీ వైర్లు
ఖమ్మంఅర్బన్: బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఎలక్ట్రిక్ వైర్ల విక్రయాలు సాగుతున్నాయనే సమాచారంతో టాస్క్ఫోర్స్, ఖమ్మం అర్బన్ పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రశాంతినగర్లోని ఓ గోదాంలో భారీగా నకిలీ వైర్లను స్వాధీనం చేసుకోగా, వ్యాపారి పరారైనట్లు సమాచారం. అక్కడ పనిచేస్తున్న రాజస్థాన్కు చెందిన ఇద్దరు, రఘునాథపాలెం మండలం కొర్లబోడుతండాకు చెందిన అనిల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. బ్రాండెడ్ బాక్సుల్లో ప్యాకింగ్ శానిటరీ సామగ్రి నిల్వ పేరిట శ్రాంతినగర్లోని గోదామును రాజస్థాన్కు చెందిన వ్యాపారి కొంతకాలం క్రితం అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడ నకిలీ, నాసిరకం వైర్లను తెప్పించి బ్రాండెడ్ కంపెనీల బాక్సుల్లో ప్యాక్ చేయించి అమ్ముతున్నట్లు తెలిసింది. గోల్డ్మెడల్ కంపెనీ పేరుతో నకిలీ వైర్లను ఎలక్ట్రీషియన్ల ద్వారా ఇళ్ల యజమానులకు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ ఆధ్వర్యాన తనిఖీ చేయగా గుట్టురట్టయింది. అయితే, దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది, నిర్వాహకులెవరనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. టాస్క్ఫోర్స్, అర్బన్ పోలీసుల తనిఖీల్లో గుర్తింపు


