breaking news
Khammam District Latest News
-
ముంపు ప్రాంతాల్లో శాశ్వత చర్యలు
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటనమధిర: భారీ వర్షాల సమయాన నీరు చేరుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపడుతామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిరలో శనివారం పర్యటించిన ఆయన ముంపు ప్రాంతాలైన హనుమాన్, ముస్లిం కాలనీలను అధికా రులతో కలిసి పరిశీలించారు. వరద ముంపునకు శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. స్టామ్ వాటర్ డ్రెయిన్లు, రోడ్ల వెడల్పు పెంచేలా ప్రజలు సహకరిస్తే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేస్తారని తెలిపా రు. అనంతరం మధిర మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. మధిర పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతున్నందున నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు, చెత్త సేకరణపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డీఈ నాగబ్రహ్మం, ఆర్ అండ్ బీ డీఈ శంకర్, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ నాయకులు మల్లాది వాసు, మిర్యాల రమణగుప్త, బాజీ తది తరులు కలెక్టర్ను కలిసి సమస్యలపై చర్చించారు. తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు ఖమ్మం సహకారనగర్: క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబించేలా తుపాన్ నష్టంపై నివేదిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎక్కడా తప్పు జరగకుండా నష్టంపై నివేదికలు తయారుచేయాలని, ఏ పొరపాటు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఆర్ఓ ఏ.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. 6లోగా నష్టం నివేదికలు తుపాన్ నష్టం వివరాల నివేదికను ఈనెల 6వ తేదీలోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. పంట నష్టం వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించాలని, ఇందుకోసం వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని తెలిపారు. అలాగే, రోడ్ల ధ్వంసంపై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులు నివేదిక సిద్ధం చేయాలని, జలవనరుల శాఖ, విద్యుత్ అధికారులు కూడా వారి పరిధిలో నష్టంపై అంచనాలు రూపొందించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లు అందుబాటులో ఉన్న నిధులతో తాత్కాలిక మరమ్మతు చేయించాలని సూచించారు. డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వర్లు, యాకూబ్, వెంకట్రెడ్డి, చందన్కుమార్, పుల్లయ్య, ఆశాలత, అలీమ్, సరిత, రామారావు పాల్గొన్నారు. -
పరిహాసమేనా ?
ఈసారీ..సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తుపాన్లు, వర్షాలతో పంటలు దెబ్బతిన్న సమయాన ప్రభుత్వం ప్రకటించే పరిహారం, విధించే నిబంధనలు అపహాస్యం చేసేలా ఉంటున్నాయనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. గత ఏడాది వర్షాలతో నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించినా చాలామందికి నేటికీ అందలేదు. ఎకరం పత్తి సాగుకు రూ.40వేలు, వరి సాగుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇలా రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నెలల తరబడి శ్రమిస్తే పంట విపత్తులతో నేలమట్టం అవుతోంది. ఈ సమయాన ప్రభుత్వం ఎకరాకు అందించే రూ.10 వేల పరిహారం ఏ మూలకు సరిపోవడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఇప్పుడు రైతులకు పరిహారం ప్రకటించినా పంట నష్టం 33 శాతానికి పైగా ఉంటేనే చెల్లిస్తామనే నిబంధనతో చిన్న, సన్నకారు రైతులకు న్యాయం జరగదనే భావన వ్యక్తమవుతోంది. నేలవాలుతున్న ఆశలు శ్రమకోర్చి, పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసే రైతులు ప్రభుత్వం చెల్లించే అరకొర పరిహారానికి సైతం ఎదురుచూడాల్సి వస్తోంది. గత రెండేళ్లుగా పంటల సీజన్ ప్రారంభంలో అనావృష్టి, చేతికి వచ్చే సమయంలో అతివృష్టి దెబ్బతీస్తోంది. వరి పంట నేలవాలడంతో దిగుబడి తగ్గుతుండగా, పత్తి తడిసి చేన్లలోనే నీరు కారుతోంది. ఫలితంగా వచ్చే తక్కువ పంటకు కూడా మద్దతు ధర దక్కక తీరని నష్టం ఎదురవుతోంది. 109 మంది రైతులకు ఇంకా బకాయి గత ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1న వచ్చిన తుపాను ధాటికి జిల్లాలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించింది. జిల్లాలో 27,693 మంది రైతులకు చెందిన 28,322.34 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. వీరిలో మొదటి దఫా 27,536 మందికి 28,124.29 ఎకరాలకు రూ.28,12,47,250, రెండో విడతలో 48 మంది రైతులకు సంబంధించి 43.09 ఎకరాలకు రూ.43,225 అందాయి. మూడో విడతగా 109 మంది రైతులకు 154.36 ఎకరాలకు సంబంధించి రూ.1,54,09,000 పరిహారం నేటికీ జమ కాలేదు. ‘యాసంగి’ లెక్కే లేదు.. ఈ ఏడాది ఏప్రిల్, మే యాసంగి సీజన్లో అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగించాయి. జిల్లాలో 332 మంది రైతులకు సంబంధించి 548 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు తేల్చినా ఇప్పటికీ పరిహారం అందలేదు. ఈ ఏడాది ఆగస్టులో భారీ వర్షాలతో 3,635 మంది రైతులు పెసరతోపాటు మొక్కజొన్న, ఇతర పంటలు 4,654 ఎకరాల్లో నష్టపోతే ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం మోంథా తుపానుతో 62,400 ఎకరాల్లో నష్టం జరగగా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల పరిహారమే ప్రకటించడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాక 33 శాతం నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన సడలించడమే కాక రైతులను ఆదుకునేలా ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరుతున్నారు.పంట నష్టం రూ.లక్షల్లో.. పరిహారం రూ.వేలల్లో ఆరు ఎకరాల్లో సాగు చేశాను. వరి కోద్దామని మిషన్ మాట్లాడేలోగా తుపాన్తో నేలవాలింది. ఫలితంగా ఎకరాకు రూ.50 వేల వరకు నష్టపోయా. గత ఏడాది ఆరెకరాల్లో పంట మునిగిపోతే ప్రభుత్వ పరిహారం ఇప్పటికీ రాలేదు. – యాసా సత్యనారాయణరెడ్డి, రాజుపేటనాలుగెకరాల్లో పత్తి, ఎకరంలో వరి సాగుకు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టా. పత్తి తీసే సమయానికి తుపాను దెబ్బతీసింది. పత్తి ముద్దయి, మొలకలు వస్తున్నాయి. వరి నేలవాలింది. ప్రభుత్వమే సరైన పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – ఊడుగుల శ్రీనివాస్, పిండిప్రోలు -
బకాయిలు బారెడు..
ఖమ్మంమయూరిసెంటర్: ఉన్నత విద్య అభ్యసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీంతో అటు విద్యార్థులు, ఇటు విద్యాసంస్థల యజమానులు ఆందోళన చెందుతున్నారు. బకాయిలు పేరుకుపోయాయని చెబుతూ కొన్ని సంస్థలు విద్యార్థులే ఫీజు చెల్లించాలని చెబుతుండగా.. ఇంకొన్ని చోట్ల కోర్సులు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యాన కలిపి ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యాసంస్థలకు రూ.144.30 కోట్లు అందాల్సి ఉంటుంది. అంతేకాక పేద విద్యార్థులకు ఉపకారవేతన బకాయిలు రూ.58.46 కోట్లు పేరుకుపోయాయి. మొత్తంగా జిల్లాకు రావాల్సిన నిధులు రూ.202.76 కోట్లకు చేరడం గమనార్హం. సర్టిఫికెట్ల నిలిపివేత.. బకాయిలు చెల్లింపులో తీవ్ర జాప్యంతో విద్యా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీని ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రానందున చదువు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేశాయి. తద్వారా ఉన్నత చదువులు, ఉద్యోగ దరఖాస్తుకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అంతేకాక ఉపకార వేతనాలు సమయానికి అందక పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువు కొనసాగించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంద్కు పిలుపు బకాయిలు విడుదల చేయాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈమేరకు 3వ తేదీ నుంచి విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. బకాయిలను విడుదల చేసే వరకు తరగతులు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు సైతం ఈ విషయంలో ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. తక్షణమే బకాయిలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్ను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్
ఖమ్మం లీగల్: పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈమేరకు 5,536 చెక్ బౌన్స్ కేసులు, 3,651 క్రిమినల్ కాంపౌండ్ కేసులు పరిష్కరించేలా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాక ఖమ్మం, మధిర, సత్తుపల్లి కోర్టుల్లో 15 బెంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్లో అత్యధిక కేసుల పరిష్కారమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక న్యాయవాదులు, కక్షిదారులు, బీమా కంపెనీ ప్రతినిధులు, బ్యాంక్, పోలీసు అధికారులతో ఖమ్మం న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి రాజగోపాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో న్యాయధికారులు కె, ఉమాదేవి, వెంపటి అపర్ణ, ఎం.అర్చనాకుమారి, దేవినేని రాంప్రసాదరావు, ఎం.కల్పన, వి.శివరంజని, టి.మురళీమోహన్, కాసరగడ్డ దీప, బెక్కం రజని, ఏపూరి బిందు ప్రియ, వినుకొండ మాధవి, బి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్ల తర్వాత కుటుంబం చెంతకు...
ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయి ఆరేళ్ల క్రితం ఖమ్మంలో తిరుగుతూ కనిపించిన గుర్తుతెలియని వృద్ధుడిని చేరదీసి కోలుకున్నాక మహారాష్ట్రలో కుటుంబానికి అప్పగించిన అన్నం ఫౌండేషన్ బాధ్యులు మానవత్వాన్ని చాటారు. ఆరేళ్ల క్రితం 60ఏళ్ల వయసు గల మతిస్థిమితం లేని వ్యక్తి ఖమ్మంలో తిరుగుతుండగా పోలీసులు అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో చేర్పించా రు. అప్పటినుంచి వైద్యం చేయించగా ఇటీవల కోలు కున్నాడు. తన పేరు రాజేంద్ర అని, తమది మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కటోలు గ్రామమని చెప్పాడు. అంతేకాక భార్య, కుమారుల పేర్లు చెప్పడంతో కటోలు పోలీసుల ద్వారా ఆరాతీసి కుటుంబాన్ని కనుగొ న్నారు. అయితే, పేదరికం కారణంగా కుటుంబీకులు ఖమ్మం వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఫౌండేషన్ చైర్మ న్ శ్రీనివాసరావు స్వగ్రామానికి తీసుకెళ్లి రాజేంద్రను పోలీసుల సమక్షాన ఆయన భార్య వందన, కుమారు డు మహేష్కు శనివారం అప్పగించారు. ఆరేళ్ల తర్వాత తర్వాత రాజేంద్రను చూసిన కుటుంబీకులు అన్నం ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత బ్యాండ్ చప్పుళ్ల నడుమ ఆయనను ఇంటికి తీసుకెళ్లారు.మహారాష్ట్రలో అప్పగించిన ‘అన్నం’ -
సత్తుపల్లి ఏరియా జీఎంగా శ్రీనివాస్
సత్తుపల్లి: సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎంగా చింతల శ్రీనివాస్ శనివారం క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జేవీఆర్ ఓసీని సందర్శించిన ఆయన బొగ్గు ఉత్పత్తి, రక్షణ చర్యలపై సూచనలు చేశారు. అలాగే, అధికారులతో సమావేశమై రోజువారీ, నెల వారీ లక్ష్యాలను సాధనకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. తొలుత జేవీఆర్ కిష్టారం ఓసీల పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఉద్యోగులు రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, కల్యాణ్రాం, సోమశేఖర్, రామకృష్ణ, దేవదాసు, యూనియన్ల నాయకులు ఎండీ.రజాక్, సముద్రాల సుధాకర్, తీగల క్రాంతి, నర్సింహా రావు తదితరులు జీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. 4న అండర్–17 హ్యాండ్బాల్ ఎంపికలు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఈనెల 4వ తేదీన ఉమ్మడి జిల్లాస్థాయి బాలబాలికల హ్యాండ్బాల్ జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉదయం 10గంటలకు మొదలయ్యే ఎంపిక పోటీలకు క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, ఆధార్కార్డుతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 94417 47772, 99857 71159 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఎస్బీఐటీ అధ్యాపకుడికి డాక్టరేట్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ బీఐటీ కళాశాల సీఎస్ ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గంటెల ప్రభాకర్కు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ‘ఎన్హాన్స్డ్ మెథడాలజీస్ ఫర్ డేటా సెక్యూరిటీ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ మోడ ల్స్’ అంశంపై డాక్టర్ బొబ్బా బసవేశ్వరరావు పర్యవేక్షణలో ఆయనసమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ను కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ, సెక్రటరీ, కరస్పాండెంట్ ధాత్రి, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్కుమార్, శ్రీని వాసరావు, శివప్రసాద్, రవీంద్రబాబు, ప్రిన్సి పాల్ రాజ్కుమార్ అభినందించారు. అండర్–17 వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ జట్లను శనివారం ఎంపిక చేశారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు 60 మంది బాలురు, 25మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన వారి నుంచి జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి వై.రామారావు తెలిపా రు. బాలుర జట్టుకు ఎం.శ్యామ్, బి.రిషి, జి. శేషు, కె.ధనుష్, పి.దివాకర్, సీహెచ్. శరత్చంద్ర, ఎం.భరత్, ఎం.యశ్వంత్, బాలికల జట్టుకు జి.కావ్య, టి.పవిత్ర, ఏ.టోనీశ్రీ, జి.శృతి, సీహెచ్. శ్రీవల్లి, డి.శాంతి, ఎన్.హాసిని ఎంపికయ్యారని వెల్లడించారు. రాళ్లవాగు వరదలో మునిగిన కారు వెలికితీత తిరుమలాయపాలెం: మండలంలోని కేశ్వాపురం– తిప్పారెడ్డిగూడెం మధ్య రాళ్లవాగు ఉధృతిలో గత నెల 29న రాత్రి గల్లంతైన కారు బయటపడింది. ఈ కారు వరదలో మునుగుతుండగా అందులో ప్రయాణిస్తున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన కొప్పుల రమేష్ కుటుంబీకులు ఐదుగురు సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఈ మేరకు గాలిస్తుండగా వాగు కాల్వ సమీపాన బావిలో కారు తేలడంతో జేసీబీ ద్వారా బయటకు తీయించినట్లు ఎస్ఐ కె.జగదీష్ తెలిపారు. -
62వేల ఎకరాల్లో పంట నష్టం
● నేటి నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ● జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్యనేలకొండపల్లి: జిల్లాలో ఇటీవల తుపాన్తో వరి, మిర్చి, పత్తి తదితర పంటలకు 62 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని బోదులబండ, చెన్నారం, మోటాపురం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను శనివారం సందర్శించిన ఆయన రికార్డులు తనిఖీ చేశారు. అలాగే, పలుచోట్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించాక మండ్రాజుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని రకాల పంటలకు 62 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేయగా, కనీసం 33 శాతానికి పైగా పంట దెబ్బతింటేనే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందుతుందని తెలిపారు. కాగా, పంటలు తడిసిన నేపథ్యాన రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచించారు. కాగా, జిల్లాలో 327 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యాన రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించొద్దని తెలిపారు. అలాగే, ఇటీవల దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినందున అన్నదాతలు ఆందోళన చెందొద్దని సూచించారు. మండల వ్యవసాయాధికారి ఎం.రాధ, ఏఈఓలు అవినాష్, అరవింద్, సొసైటీ సీఈవో జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రైతుబంధు పోర్టల్లో నమోదు ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ శాఖ రూపొందించిన రైతుబంధు పోర్టల్(యాప్)లో పంట నష్టం వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించారు. ఈ పోర్టల్లో ఈ–క్రాప్ ప్రొఫార్మా ఉండగా.. ఇటీవల చేపట్టిన పంటల నమోదులో వెల్లడైన రైతులు, పంటల వివరాలే కాక సర్వే నంబర్లు, విస్తీర్ణం నమోదై ఉంటాయి. ఈమేరకు ఆదివారం నుంచి ఏఈఓలు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ ఫొటోలు తీసి గతంలో ఉన్న వివరాల ఆధారంగా పంట నష్టాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారాన్ని ప్రకటించగా.. 33 శాతం, ఆపైన నష్టం జరిగిన పంటలనే పరిగణనలోకి తీసుకుంటారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖ ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి మండలంలోని జక్కేపల్లి, నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెంలో మోంథా తుపాన్ తాకిడికి దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలిస్తారు. అలాగే, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కేబీఆర్.నగర్లో పర్యటించి వరదలతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శిస్తారు. అంతేకాక ఖమ్మంరూరల్ మండలంలోని కామంచికల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు. సెలవులో కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. ఈ నెల 2వ తేదీ(ఆదివారం) నుంచి వారం పాటు ఆయన సెలవులో ఉంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి కలెక్టర్ 10వ తేదీన విధుల్లో చేరతారు. అప్పటి వరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఇన్చార్జి కలెక్టర్గా వ్యవహరించనున్నారు. 11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మంలోని భక్తరామదాసు కళా క్షేత్రంలో ఈనెల 11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజనోత్సవాలు నిర్వహిస్తుండగా, జానపద నృత్యం, జానపదగేయాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పోస్టర్ పెయింటింగ్, కవిత్వం తదితర అంశాల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 15 – 29 ఏళ్లలోపు వారు అర్హులని, జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయికి, ఆ ఆర్వాత జాతీయస్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఎంట్రీలను ఈనెల 10వ తేదీలోగా అందజేయాలని, వివరాలకు సర్దార్ పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో కానీ 9948207271 నంబర్లో కానీ సంప్రదించాలని డీవైఎస్ఓ సూచించారు. స్కాలర్షిప్ దరఖాస్తుల్లో లోపాలను సరిచేయాలి ఖమ్మంమయూరిసెంటర్: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అందిన దరఖాస్తుల్లో లోపాలను సోమవారం లోగా సరిచేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జి.జ్యోతి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరులో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు అందాయని తెలిపారు. ఈమేరకు ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాకు లింక్ లేకపోవడం, కాలేజీలో పరిశీలన పూర్తికాకపోవడం వంటి సమస్యలపై ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఒకవేళ బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉంటే పోస్టాఫీస్లో ఖాతా తెరిపించి పూర్తి వివరాలను జిల్లా కార్యాలయానికి డిజిటల్ కీ ద్వారా సమర్పించాలని సూచించారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో 52జంటలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. అంతేకాక కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా 52జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. ఈఓ జగన్మోహన్రావు, చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నీలాద్రీశ్వరుడికి అన్నాభిషేకం సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం పరిధిలోని నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ కోనేటిలో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా, శనివారం తెల్లవారుజామున 4గంటల నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యాన భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
మధిర: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి చెందాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరుకు చెందిన పొట్నూరి అరుణ్కుమార్ హైదరాబాద్లో పెయింటింగ్ వర్క్ చేస్తుంటాడు. ఆయన శుక్రవారం రాత్రి రైలులో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మధిర – తొండల గోపవరం రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు జారిపడడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. అరుణ్కు భార్య, ఇద్దరు పిల్ల లు ఉండగా సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ..సత్తుపల్లి(పెనుబల్లి): మండలంలోని లంకపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడుకు చెందిన గుర్రం వెంకటదాసు – సంపూర్ణ(45) దంపతులు శనివారం ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వీ.ఎం.బంజరు మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో లంకపల్లి వద్ద వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ టైర్ కిందపడిన సంపూర్ణ అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటదాసుకు గాయాలయ్యాయి. సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగం, ఎస్సై వెంకటేష్ ఘటనాస్థలిని పరిశీలించి మృతురాలి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వాగులో గల్లంతైన వ్యక్తి.. తల్లాడ: మండలంలోని కుర్నవల్లి రాళ్ల వాగు ప్రవా హంలో గల్లంతైన వ్యక్తి మృతి చెందగా మూడు రోజులకు మృతదేహం బయటపడింది. కుర్నవల్లి తూర్పు హరిజనవాడకు చెందిన తాటిపర్తి యేసు(50) గురువారం తన భార్యతో పాటు అత్తగారింటికి బయలుదేరారు. మధ్యలో రాళ్లవాగు సమీపాన పొలంలోని మోటార్ బంద్ చేసి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఆ సమయాన భారీ వర్షంతో రాళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా యేసు తిరిగి రాలేదు. దీంతో ఆయన భార్య తర్వాత వస్తాడని లేదా ఇంటికి వెళ్తాడని భావించి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసే వెళ్లారని కుటుంబీకులు భావించారు. కానీ యేసు వరద ఉధృతికి కొట్టుకుపోగా ఆయన మృతదేహం శనివారం బయటపడింది. సమీప రైతులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా కన్నీరుమున్నీరయ్యారు. కాగా, వాగు వద్దకు చేరేసరికి చీకటి పడడంతో మృతదేహాన్ని ఆదివారం బయటకు తీయించనున్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య ఖమ్మంఅర్బన్: ఖమ్మం ధంసలాపురం కొత్తకాలనీకి చెందిన లింగం భరత్కుమార్(34) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన భార్యస్వప్న శనివారం ఇంట్లో లేని సమయాన ఉరివేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. బాలికపై ఇద్దరు బాలురు, యువకుడి లైంగిక దాడి కొణిజర్ల: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఇద్దరు బాలురు, ఓ యువకుడు లైంగిక దాడికి పాల్ప డ్డారు. మండలంలోని శాంతినగర్ సమీపాన ఓ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం రాత్రి ఒంటిరిగా ఉంది. ఆ సమయాన ఇద్దరు మైనర్లు, ఓ యువకుడు వెళ్లి ఆమైపె లైంగిక దాడిచేశారు. ఆతర్వాతఇంటికి వచ్చిన తల్లికి బాధితురాలు విషయం చెప్పడంతో శనివారం ఉదయం ఫిర్యాదు చేయగా నిందతులపై కేసు నమోదు చేసి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై జి.సూరజ్ తెలిపారు. -
రూ.30 లక్షల విలువైన గంజాయి ఆయిల్ స్వాధీనం
రఘునాథపాలెం: ఇద్దరు వ్యక్తులు 70గ్రాముల గంజాయి ఆయిల్ తీసుకెళ్తూ పట్టుపడగా రఘునాథపాలెం పోలీసులు లోతుగా విచారించడంతో భారీగా ఆయిల్ లభ్యమైంది. ఈమేరకు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపిన వివరాలు... రఘునాథపాలెం సబ్స్టేషన్ వెనక ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఇటీవల తనిఖీ చేపట్టిన పోలీసులు 70గ్రాముల గంజాయి లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా మరికొన్ని ఆధారాలు లభించాయి. దీంతో శనివారం ఆపిల్ సెంటర్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో కారులో ఖమ్మం వైఎస్సార్కాలనీకి చెందిన కొత్తా రాము, ఏపీలోని రాజమండ్రి వాసి జానకీరామయ్య తీసుకెళ్తున్న రూ.30 లక్షల విలువైన 2.395 కేజీల గంజాయి లిక్విడ్(హాషిష్) లభించింది. ఈమేరకు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ తనిఖీల్లో సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎస్ఐ గజ్జెల నరేష్, సిబ్బంది సంజీవ్, శ్రీనివాస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
27ఏళ్ల తర్వాత రూ.2.81 లక్షల పరిహారం
నేలకొండపల్లి: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 27ఏళ్ల తర్వాత ప్రమాద మృతుడి కుటుంబానికి కార్మిక శాఖ నుంచి పరిహారం అందింది. దీంతో తరచుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ ఎదురుచూసిన ఆ వ్యక్తి కుటుంబం వ్యథ తీరినట్లయింది. నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంకు చెందిన కొత్తపల్లి వెంకటేశ్వరరావు 27 ఏళ్ల క్రితం ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటగిరి సమీపాన ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందాడు. ఆయనకు కార్మిక శాఖ బీమా పథకంలో సభ్యత్వం ఉండడంతో కుటుంబీకులు పరిహారం కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రకరకాల కారణాలతో పరిహారం చెల్లింపులో ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు కుటుంబీకులు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరాలేదు. ఇటీవల స్థానిక నాయకులు చొరవ తీసుకుని మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.2,81,321 పరిహారం మంజూరు చేశారు. ఈమేరకు చెక్కులను ఆయన తల్లి భద్రమ్మ, భార్యకు శనివారం కార్మిక శాఖ అధికారి కృష్ణవేణి అందజేశారు. దీంతో పరిహారం రాదని ఆశలు వదిలేసుకున్న వారు అధికారులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ షేక్ జహీరాబీ, నాయకులు బచ్చలకూరి నాగరాజు, కొత్తపల్లి సుబ్బారావు, బచ్చలకూరి ఉదయ్, ప్రతాప్, కొత్తపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. -
జోనల్ వ్యవస్థకు మంగళం
● ఈసారి కొత్తగా మండల స్థాయి పోటీలు.. ● నిధుల లేమితో కొన్నిచోట్లే నిర్వహణ ● ఎస్జీఫ్ బాధ్యుల తీరుపై విమర్శలు ఖమ్మం స్పోర్ట్స్: ఏటా జిల్లాలో నిర్వహించే పాఠశాలల క్రీడా పోటీల్లో లోపాలు క్రీడాకారులకు శాపంగా మారుతున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకుల నడుమ సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. అంతేకాక గత ఆనవాయితీకి భిన్నంగా ఈ ఏడాది జోనల్ స్థాయి పోటీలకు స్వస్తి పలికి మండల స్థాయి క్రీడలకు శ్రీకారం చుట్టారు. ఈ పోటీల నిర్వహణకు 22 మండలాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అదే జోనల్ స్థాయిలోనైతే ఖర్చు తగ్గుతుందని ఈ విధానాన్ని అత్యధిక శాతం పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్ల ఆమోదంతో నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి వీటికి బదులు మండల స్థాయిలో జరపాలనే నిర్ణయాన్ని పలువురు విబేధించినా జిల్లా స్కూల్ గేమ్స్ నిర్వాహకులు బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో జిల్లాలోని సగం మండలాల్లో పోటీలు నిర్వహించినా, మిగతా మండలాల బాధ్యులు విముఖత వ్యక్తం చేయడంతో పోటీలే జరగలేదు. ఫలితంగా ఔత్సాహిక క్రీడాకారుల్లో నిరాశ వ్యక్తమతోంది. కొన్ని అంశాల్లో ముగిసిన రాష్ట్ర పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇప్పటికే రాష్ట్రస్థాయి అండర్–14, 17 విభాగాల్లో సగం మేర అంశాల్లో పోటీలు పూర్తి చేసింది. కానీ జిల్లాలో మండల స్థాయి క్రీడా పోటీలు జరగకపోవడం గమనార్హం. కొన్ని క్రీడాంశాల్లో జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేసి రాష్ట్ర పోటీలకు సిద్ధంగా చేయగా.. ఇప్పుడు మండల స్థాయి పోటీలపైనే తర్జనభర్జన జరుగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లా కమిటీ ఉన్నట్టా.. లేనట్లా? క్రీడా పోటీల నిర్వహణకు జిల్లా క్రీడా కార్యదర్శి ఆధ్వర్యాన ఒక కమిటీని నియమించారు. ఇందులో ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటే కొందరు సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఏటా పోటీలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి కూడా అలాగే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయిస్తే.. పోటీల నిర్వహణపై ముందస్తు సమాచారం లేకుండా జిల్లా కార్యదర్శే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఓ పక్క జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించి... మరోపక్క మండల స్థాయి పోటీల నిర్వహణ ఇంకొందరికి అప్పగించడం సరికాదనే చర్చ జరుగుతోంది. కమిటీల్లో తాము ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచేఉత్తర్వులు అందినా.. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాధ్యులు విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.జిల్లా, మండల స్థాయి టోర్నీలను తీర్మానం మేరకే కేటాయించాం. అయితే, కొన్ని కారణాలతో ఇతరులకు అప్పగించాల్సి వచ్చింది. ఈ విషయం అర్థం చేసుకోలేని వారే విమర్శలు చేస్తున్నారు. నిధులు ఇవ్వకున్న నా సొంత ఖర్చులతో పోటీలు నిర్వహణ, జట్ల ఎంపిక చేస్తున్నా. జిల్లా అధికారుల సహకారంతో జిల్లా, మండలస్థాయి పోటీలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. – వై.రామారావు, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి -
ఉపాధ్యాయుల చొరవతో అల్పాహారం
ఏన్కూరు: మండలంలోని బురద రాఘవాపురం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు శనివా రం నుంచి అల్పాహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, సీఎంఓ బి.ప్రవీణ్కుమార్, హెచ్ఎం పి.నాగిరెడ్డి ప్రారంభించారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షలు పూర్త య్యే వరకు విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల ఆకలి తీర్చేలా అల్పాహారం సమకూర్చేందుకు ఉపాధ్యాయులు ముందుకొచ్చారని హెచ్ఎం తెలిపారు. పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సుపారీ గ్యాంగ్ పనేనా?
● ఏపీలో పథకం రూపొందించినట్లు ప్రచారం ● సీపీఎం నేత హత్య కేసులో పోలీసుల విచారణ చింతకాని: చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం సీనియర్ నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు శుక్రవారం హత్యకు గురికావడం.. ఆయన బంధువులు, పార్టీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులపై విమర్శలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈనేపథ్యాన కేసును త్వరగా చేధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసు కమిషనర్ సునీల్దత్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటచేయగా కేసు విచారణలో నిమగ్నమయ్యారు. అయితే, సుపారీ గ్యాంగే రామారావును హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపాన ఓ పట్టణంలో పథకం రూపొందించారనే సమాచారంతో పోలీసులు దర్యాప్తు సాగిస్తునట్లు తెలిసింది. ఘటనాస్థలిలో లభించిన చెప్పుల జత, నిందితుడి టీ షర్ట్, హత్యకు వినియోగించిన కత్తి పౌచ్ ఆధారంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామనే భరోసాతో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, గ్రామంలో పోలీస్ పికెటింగ్ శనివారం కూడా కొనసాగింది. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్రాజ్ శనివారం సాయంత్రం చింతకానికి వచ్చి పోలీసులతో కేసుపై సమీక్షించారు. -
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
ఖమ్మం మామిళ్లగూడెం: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శతృదేశానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. ఈమేరకు శనివారం ఖమ్మంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశాక ఆయన మాట్లాడారు. భారత సైన్యం దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే సీఎం శతృదేశానికి అనుకూలంగా మాట్లాడడం సరి కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు డాక్టర్ నెల్లూరి బెనర్జీ, వీరెల్లి రాజేష్గుప్తా, నల్లగట్టు ప్రవీణ్, నగరికంటి వీరభద్రం, రవిరాథోడ్, మందడపు సుబ్బారావు, మంద సరస్వతి, రజినీరెడ్డి, పమ్మి అనిత, కొణతం లక్ష్మీనారాయణగుప్తా, రవి గౌడ్, బోయినపల్లి చంద్రశేఖర్, పీవీ.చంద్రశేఖర్, మాధవ్, మార్తి వీరభద్రప్రసాద్, కందుల శ్రీకృష్ణ, రవిగౌడ్ పాల్గొన్నారు. -
‘పుట్లూరి’ సేవలు అభినందనీయం
ఖమ్మం సహకారనగర్: విద్యార్థులను తీర్చిదిద్దడమే కాక ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారానికి పాటుపడిన పుట్లూరి వెంకటేశ్వరరెడ్డి సేవలు అభినందనీయమని పీఆర్టీయు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్రావు, ఆర్.రంగారావు అన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి ఇటీవల ఉద్యోగ విరమణ చేయగా ఖమ్మంలోని కార్యాయంలో చింతకాని మండల శాఖ ఆధ్వర్యాన వెంకటేశ్వరరెడ్డి – భ్రమరాంబ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శేఖర్రావు, రంగారావు మాట్లాడుతూ గత 35ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారని తెలిపారు. పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు, చింతకాని మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెల్లూరి విజయ్భాస్కర్, ప్రభాకర్రెడ్డితో పాటు వెంకటనర్సయ్య, విజయ్, అమృత్, వేముల భిక్షం, రాయల నర్సింహరావు, రమేష్ పాల్గొన్నారు. -
సమగ్ర వ్యవసాయ విధానాలతో నికర ఆదాయం
రఘునాథపాలెం: రైతులు ఎప్పటికప్పుడు ఆధునిక విధానాలు తెలుసుకుని అవలంబించడం ద్వారా పంటల నుంచి నికర ఆదాయం లభిస్తుందని అశ్వారావుపేట వ్యవసాయశాఖల అసోసియేట్ డీన్ హేమంత్కుమార్ తెలిపారు. మండలంలోని చిమ్మపూడిలో శనివారం వ్యవసాయశాఖ, ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యాన మిరప, ఆయిల్పామ్పై ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్పామ్తో పాటు అంతర పంటలు సాగుచేస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చ ని చెప్పారు. అలాగే, మిరపలో విత్తనం దశ నుంచి కోత వరకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించా రు. అనంతరం మల్యాల కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్, ఖమ్మం ఏడీఏ కె.వెంకటేశ్వరరావు, రోటరీక్లబ్ గవర్నర్ మల్లాది వాసు మాట్లాడారు. వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రాంప్రసాద్, నాగాంజలి, నీలిమ, రోటరీక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లభనేని రామారావు, బొడ్డు సుధాకర్రావుతో పాటు కోటేరు వెంకటరెడ్డి, వెంకట్, చందు, ఏఓ కె.ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఉలు పాల్గొన్నారు. -
నేడు ఖమ్మం మార్కెట్లో పంటల కొనుగోళ్లు
ఖమ్మంవ్యవసాయం: వర్షాలు తగ్గిన నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పంటల కొనుగోళ్లు చేపడుతామని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. మోంథా తుపాన్ కారణంగా మార్కెట్కు సెలవులు ప్రకటించారు. అయితే, గురువారం నుంచి తుపాను ప్రభావం లేకపోవడం, వర్షాలు తగ్గడంతో మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గుర్తించాలని సూచించారు. 1.50లక్షల పశువులకు గాలికుంటు టీకాలు కామేపల్లి: పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా టీకాలు తప్పని సరిగా వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమణి సూచించారు. మండలంలోని మర్రిగూడెంలో గాలికుంటు టీకాల పంపిణీని గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 3.33 లక్షల పశువులకు గాను ఇప్పటివరకు 1.50 లక్షల పశువులకు వ్యాక్సిన్ వేశామని తెలిపారు. టీకా ఆవశ్యకతను గుర్తించి రైతులు పశు వైద్యాధికారులకు సహకరించాలని సూచించారు. ముచ్చర్ల పశువైద్యాధికారి గోపాల కృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు. ‘ఓపెన్’ ఫలితాలు విడుదల ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని అదనపు కలెక్టర్, డీఈఓ శ్రీజ తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 279మంది హాజరుకాగా, 128మంది(45.88శాతం), ఇంట ర్ పరీక్షల్లో 248 మందికి 108మంది (43.55శాతం) ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఫలితాలను www.telangana openschool.org వెబ్సైట్లో చూసుకుని రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం నవంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు వెబ్సైట్లో లేదా మీ సేవ సెంటర్లలో ఫీజు చెల్లించాలని సూచించారు. రీ కౌంటింగ్ కోసం ఇంటర్ అభ్యర్థులు పేపర్కు రూ.400, పదో తరగతి వారు రూ.350, రీ వెరిఫికేషన్, జవాబుపత్రం జిరాక్స్ కోసం సబ్జెక్టుకు రూ.1,200 చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్లో వివరాల నమోదు తప్పనిసరి ఖమ్మంవైద్యవిభాగం: వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తున్న సేవలు, వినియోగించుకున్న వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి అదేశించారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్పై గురువారం ఆమె తన కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న సేవలను పోర్టల్లో నమోదు చేస్తున్నా, ప్రైవేట్ ఆస్పత్రుల వివరాలు పూర్తిగా అందడం లేదని తెలిపారు. ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి డేటాను సేకరించాలని, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు. ప్రోగ్రామ్ అధికారులు చందూనాయక్, వెంకటరమణ, జిల్లా మాస్ మీడియా అధికారి వి.సుబ్రహ్మణ్యం, స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్కుమార్, డీఎస్ఓ వేణుమాధవ్ పాల్గొన్నారు. అందుబాటులోకి ధాన్యం ఆరబెట్టే యంత్రం కల్లూరు: వరిలో తేమ తగ్గేలా ఆరబెట్టేందుకు ప్యాడీ డ్రయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు కల్లూరు వ్యవసాయ మార్కెట్కు కేటాయించిన యంత్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతులు నిర్దేశిత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టాలని, లేకపోతే గింజ రంగు మారి నాణ్యత తగ్గుతుందని తెలిపారు. పచ్చి సరుకును తీసుకొచ్చి ఇబ్బంది పడకుండా డ్రయర్లు సమకూరుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కేంద్రాల్లో గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యం క్వింటాకు రూ.2389, సాధారణ రకానికి రూ.2,369 ధర లభిస్తుందని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, డీఎంఓ ఎండీ.అలీమ్, మార్కెట్ చైర్మన్ భాగం నీరజ, ఏఓ ఎం.రూప, మార్కెట్ సూపర్వైజర్ జగదీష్కుమార్, కార్యదర్శి జి.సత్యనారాయణ, నాయకులు పసుమర్తి చందర్రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు. -
కుటుంబ సమస్యలతో ఆత్మహత్య
కారేపల్లి: కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఖమ్మంలో పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరుపల్లికి చెందిన గణపారపు కోటేశ్వరరావు(45) కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందాడు. ఈమేరకు బుధవారం ఖమ్మం వెళ్లిన ఆయన అక్కడే పురుగుల మందు తాగాక కుటుంబీకులకు ఫోన్ చేశాడు. దీంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం మృతి చెందాడు. కోటేశ్వరరావుకు భార్య రమాదేవి, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి కల్లూరురూరల్: మండలంలోని చెన్నూరుకు చెందిన బీటెక్ విద్యార్థి గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొడవటి వెంకటేశ్వరరావు కుమారుడు శేషసాయి ప్రేమ్కుమార్(22) హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. ఆయన నివాసంలో గురువారం ఉదయం గుండెపోటు రాగా అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సాయంత్రం మృతదేహాన్ని చెన్నూరుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించగా తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజదేవి, కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, ఏనుగు సత్యంబాబు, తక్కలపల్లి దుర్గాప్రసాద్, భాగం ప్రభాకర్ తదితరులు ప్రేమ్ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు కామేపల్లి: మండలంలోని పాతలింగాల పెద్ద చెరువు కాల్వ క్రింద చేపలు పట్టేందుకు గురువారం వెళ్లిన గోవింద్రాల వాసి బానోత్ శ్రీను గల్లంతయ్యాడు. చేపలు పట్టే క్రమాన కాలు జారి వరద నీటిలో పడడంతో ఆయన గల్లంతయ్యాడని తెలిసింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, శ్రీనుకు ఈత కూడా రాదని కుటుంబీకులు తెలిపారు. గంజాయి పీలుస్తూ పట్టుబడిన ఇద్దరు సత్తుపల్లిటౌన్: గంజాయి పీల్చడంతో పాటు ఇంకొందరికి అమ్ముతున్న బాలుడు సహా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన కువ్వారపు సతీష్కుమార్, మైనర్ బాలుడు గంజాయి వాడకానికి అలవాటు పడ్డారు. వీరిద్దరు ఒడిశా – ఏపీ సరిహద్దు అవులపాకకు చెందిన భగవాన్ వద్ద ఈనెల 25న అర కిలో గంజాయి కొనుగోలు చేశారు. సతీష్, బాలుడు కలిసి గురువారం సత్తుపల్లి మెట్టాంజనేయస్వామి గుడి సమీపాన గంజాయిని పీల్చి 100 గ్రాముల గంజాయిని విక్రయించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే సమయాన పోలీసులు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వీరిద్దరితో పాటు గంజాయి అమ్మిన భగవాన్పైనా కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు. గంజాయి లిక్విడ్ స్వాధీనం రఘునాథపాలెం: గంజాయి లిక్విడ్ విక్రయిస్తున్న ముగ్గురిని గురువారం అరెస్ట్ చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మండల కేంద్రంలోని సబ్స్టేషన్ సమీపాన కొందరు గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో ఎస్ఐ నరేష్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టగా రఘునాథపాలెంకు చెందిన నెమ్మది అజయ్, పాండురంగపురానికి చెందిన షేక్ ఇస్మాయిల్, సాకేత్ ముగ్గురు 70 గ్రాముల గంజాయి ఆయిల్తో పట్టుబడ్డారు. వీరికి ఖమ్మం వైఎస్ఆర్ కాలనీకి చెందిన రాములు ఆయిల్ అందించగా, ఆయనకు రాజమండ్రి వాసి జానీ సరఫరా చేసినట్లు తేలింది. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లుసీఐ తెలిపారు. -
సదరమ్ శిబిరానికి పోటెత్తారు..
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరమ్ శిబిరాలకు దివ్యాంగులు పోటెత్తుతున్నారు. గతంలో శిబిరం ఏర్పాటుచేసే ముందు రోజే ఆన్లైన్లో స్లాట్ నమోదుకు అవకాశం ఉండేది. అందులో కొందరికే పరీక్షలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఎందరైనా స్లాట్ బుక్ చేసుకునే వీలు కల్పించగా, జిల్లాలో 2వేల మంది వరకు వేచి చూస్తున్నారు. దీంతో పెద్దాస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ వెంటవెంటనే శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. అయితే, కొందరికి అర్హత లేకున్నా స్లాట్ బుక్ చేసుకుంటుండగా, మరికొందరు దళారులను నమ్మి వస్తున్నారు. ఫలితంగా శిబిరానికి వచ్చే వారిలో మూడో వంతు మంది కూడా అర్హత సాధించడం లేదు. కాగా, గురువారం శిబిరానికి 300మంది స్లాట్ బుక్ చేసుకోగా, 165మంది వారి బంధువులతో హాజరుకావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. -
‘సింగరేణి’లో కొత్త ఏరియా!
సత్తుపల్లి: ఎన్నో ఏళ్లుగా సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు, సంస్థ కార్మికులు చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఇన్నాళ్లు సత్తుపల్లిలోని గనులు కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉండగా.. ఇప్పుడు సత్తుపల్లి కేంద్రంగా కొత్త ఏరియా ఏర్పాటైంది. జీఎం సేఫ్టీ(కార్పొరేట్)గా విధులు నిర్వర్తిస్తున్న చింతల శ్రీనివాస్ను ఏరియా జీఎంగా నియమించడంతో ప్రతీ పనికి కొత్తగూడెం వెళ్లాల్సిన ఇక్కట్లు తీరనున్నాయి. రోజుకు 40వేల టన్నుల ఉత్పత్తి సత్తుపల్లి పరిధిలో జేవీఆర్ ఓసీ–2, కిష్టారం ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల నుంచి రోజుకు సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణిలో ఇప్పటివరకు ఉన్న 11 ఏరియాలకు తోడు 12వ ఏరియాగా సత్తుపల్లి ఆవిర్భవించింది. కాగా, సత్తుపల్లిలో ఏరియా జీఎం కార్యాలయానికి 2022 అక్టోబర్ 16 శంకుస్థాపన చేసినా పూర్తికాలేదు. దీంతో ప్రభావిత ప్రాంత ప్రజలు, కార్మికులు సమస్యలు చెప్పుకునేందుకు కొత్తగూడెం వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయమై ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సీఎండీ బలరాంనాయక్ దృష్టికి తీసుకెళ్లగా ఫలితం వచ్చింది. రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జీఎం కార్యాలయం పూర్తయ్యే వరకు సింగరేణి గెస్ట్హౌస్లో కార్యాలయం కొనసాగుతుంది. అలాగే, సేఫ్టీ, ఫైనాన్స్, పర్సనల్, సర్వే, ఎస్టేట్ విభాగాలు తప్ప మిగతావి సత్తుపల్లిలోనే అందుబాటులోకి వస్తాయి. వైఎస్సార్ చేతుల మీదుగా.. సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ను 2005 మార్చిలో నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉండగా జేవీఆర్ ఓసీ–2తో పాటు కిష్టారం ఓసీ ఏర్పాట య్యాయి. జేవీఆర్ ఓసీ–2 మరో 20 ఏళ్లు, కిష్టారం ఓసీ జీవితకాలం మరో నాలుగేళ్లు ఉంది. అంతేకాక బ్లాక్–3 ఓసీకి టెండర్లు దక్కించుకున్న కంపెనీ పనులు చేపట్టాల్సి ఉంది. సింగరేణిలోనే సత్తుపల్లి ఏరియా పెద్దది కాగా, జేవీఆర్ ఓసీలో 1,300 మంది, కిష్టారం ఓసీలో 150 మంది పర్మినెంట్ కార్మికులు, ఔట్సోర్సింగ్లో 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి...
వైరారూరల్: ఎకరాకు రూ.18 వేలు చొప్పున రూ.4.50 లక్షల కౌలు చెల్లించి 25 ఎకరాల్లో వరి సాగు చేశా. ఇతర ఖర్చులు కలిపి పెట్టుబడి రూ.7.75లక్షలు అయింది. ఎకరాకు 35–40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించాను. ఇప్పటికే హార్వెస్టర్ కూడా మాట్లాడగా తుపాన్తో పంట మొత్తం నేలకొరిగింది. చేనులో నీరు చేరడంతో కోత కూడా కష్టమే. అయినా ఎకరాకు 20 బస్తాల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. తుపాన్ కారణంగా పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. – కామినేని రవి, గండగలపాడు, వైరా మండలం -
తుపాన్ తాకిడికి కూలిన విద్యుత్ స్తంభాలు
ఖమ్మంవ్యవసాయం: మోంథా తుపాన్ కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంకొన్ని చోట్ల ఒరిగిపోయాయి. జిల్లాలో 26 స్తంభాలు దెబ్బతినగా, 15 స్తంభాలను తిరిగి ఏర్పాటుచేశారు. కాగా, తుపాను కారణంగా ఖమ్మం విద్యుత్ సర్కిల్కు సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఇక మున్నేటి వరదతో పరీవాహక ప్రాంతాల్లోకి నీరు చేరగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. ఖమ్మంలోని కాల్వొడ్డు, బొక్కలగడ్డ, స్మశాన వాటిక, మోతీనగర్, వెంకటేశ్వరనగర్, ఎఫ్సీఐ గోదాంల ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. పీఆర్సీ నివేదిక వెంటనే ప్రకటించాలి ● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి కారేపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. కారేపల్లి మండలంలో వివిధ పాఠశాలలను గురువారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇవ్వడమే కాక రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలన్నారు. అంతేకాక డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ.కృష్ణారావు, బానోతు మంగీలాల్, ఏటుకూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి
● తుపానుతో వేల ఎకరాల్లో పంట నష్టం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఖమ్మంమయూరిసెంటర్/రఘునాథపాలెం/కారేపల్లి: మోంథా తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తుపాన్తో ఎకరాకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ నేపథ్యాన పత్తిలో 20శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని జాన్వెస్లీ ఆరోపించారు. ఈ నేపథ్యాన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. అలాగే, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.12వేల కోట్లు చెల్లించడమే కాక గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కాకుండా కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక బనకచర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను కూర్చోపెట్టి మాట్లాడించాల్సింది పోయి.. బనకచర్లకు సహకరించాలంటూ కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్, ఎండీ.అబ్బాస్, నున్నా నాగేశ్వరరావు, శ్రీరాంనాయక్, సైదాబాబు, వై.విక్రమ్, మాదినేని రమేష్, వై.శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, పిట్టల రవి, నవీన్రెడ్డి, స్కైలాబ్బాబు, మెరుగు రమణ, కొండెబోయిన నాగేశ్వరరావు, కె.నరేంద్ర, రాయమల్లు, రావూరి వెంకటేశ్వర్లు, బాబు, షేక్ మీరా సాహెబ్, కుటుంబరావు, వర్మ, నాగరాజు, ఇమామ్, నరేష్, రహీం పాల్గొన్నారు. -
అందరినీ ఆదుకుంటాం...
● పంట నష్టంపై అంచనాల సేకరణ ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఖమ్మంఅర్బన్: తుపాన్ కారణంగా ఇళ్లు, పశువులు, పంటలతో పాటు ఇతర ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం కాల్వొడ్డు, తదితర ప్రాంతాల్లో మున్నేటి ముంపు బాధితులను గురువారం పరామర్శించిన ఆయన నయాబజార్ కళాశాల పునరావాస శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యంత్రాంగం అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. మున్నేటి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే ముంపు బాధ తప్పుతుందని ఇందుకోసం ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ పి.నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఉద్యానవన అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ఖమ్మం సహకారనగర్: తుపాన్ నేపథ్యాన యంత్రాంగమంతా ప్రభావిత ప్రాంతాల్లో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పంటల నష్టం అంచనాల రూపకల్పన, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు, తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మున్నేటి వరద కారణంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు, ఇతర చర్యలను వివరించారు. సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డీఆర్ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కీలకంగా ‘ఆపదమిత్ర’లు ఖమ్మం సహకారనగర్: తుపాన్ సహాయక చర్యల్లో ఆపద మిత్రలు కీలకపాత్ర పోషించారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలో 300 మంది యువతకు శిక్షణ ఇవ్వగా, ప్రజలను అప్రమత్తం చేయడమే కాక సామగ్రి తరలింపులో సహకరించారని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి ఖమ్మంమయూరిసెంటర్: మున్నేటికి వరద దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కాల్వొడ్డు వద్ద ప్రవాహాన్ని మేయర్ పునకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించాక ఆయన మాట్లాడారు. ఆతర్వాత నయాబజార్ స్కూల్, నయాబజార్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మోంథా పడగ..
మున్నేటిపైఖమ్మంమయూరిసెంటర్: మోంథా తుపాన్తో కురుస్తున్న వానలు తగ్గినా ఆ ప్రభావం మాత్రం ఖమ్మంను వీడడం లేదు. తుపాన్ ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువన కురిసిన భారీ నుండి అతిభారీ వర్షాలతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతుండడంతో ఎంత వరద వస్తుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద అదే స్థాయిలో ఉండడం ఆందోళన కలిగించింది. గత ఏడాది అనుభవంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించారు. బుధవారం రాత్రి 11గంటలకు ఖమ్మం కాల్వొడ్డు వద్ద 20అడుగుల మేర ప్రవహించిన మున్నేరు క్రమంగా పెరుగుతూ గురువారం సాయంత్రం 5గంటలకల్లా 26అడుగులకు చేరింది. ఆతర్వాత నెమ్మదిగా తగ్గుతూ రాత్రి 10గంటలకు 25అడుగులుగా నమోదైంది. అప్పటికే ఎనిమిది కాలనీలు నీటమునిగాయి. రెండు రోజులుగా.. మున్నేరుకు ఎంత భారీ వరద వచ్చినా 24 గంటల్లో తగ్గుముఖం పడుతుంది. కానీ మోంథా ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన వరద గురువారం సాయంత్రం 26 అడుగులకు చేరింది. కాల్వొడ్డు వద్ద 20 అడుగులకు పైగా వరద 24 గంటలకు పైగా ప్రవహించడం ఇదే తొలిసారి. బుధవారం అర్ధరాత్రి తర్వాత వరద నిలకడగా ఉండడంతో తగ్గుతుందంటూ అధికారులు, ముంపు ప్రాంతాల ప్రజలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం మధ్యాహ్నం 12గంటల నుండి 2.30 గంటల వరకు 25 అడుగుల వద్దే నిలకడగా కనిపించిన మున్నేటి వరద కాసేపటికే పెరగ డం... సాయంత్రం 6 గంటలకు 26 అడుగులుగా నమోదు కావడంతో ఆందోళన చెందారు. ఈమేరకు బుధవారం సాయంత్రం నుంచి కంటి మీద కునుకు లేకుండా మున్నేరు పరీవాహకంలోనే అధికారులు మకాం వేయాల్సి వచ్చింది. అటు మున్నేరు.. ఇటు బ్యాక్ వాటర్ మున్నేటి వరదతో పలు కాలనీలు ముంపునకు గురవుతుండగా.. బ్యాక్ వాటర్ కూడా కాలనీల్లోకి చేరుతోంది. మున్నేరుకు భారీ వరద వస్తుండడంతో వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, పంపింగ్వెల్ రోడ్డు, పెద్దమ్మతల్లి గుడి వెనుక, ధంసలాపురం కాలనీల్లోని పలు వీధుల్లోకి వరద నీరు చేరింది. ఇక బ్యాక్ వాటర్తో మోతీనగర్లోని ఓ ప్రాంతం, సారధినగర్, ధంసలాపురం కాలనీల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. దీంతో ఆయా కాలనీల్లోని పలు ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. అయితే, గురువారం రాత్రి నుంచి వరద తగ్గుముఖం పడుతున్నా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేస్తున్నారు.రెండు రోజులుగా భారీ వరద సమయం వరద (అడుగుల్లో) బుధవారం రాత్రి 8.30 18.5 10 19.25 10.45 19.5 11.30 20.25 అర్థరాత్రి 12.30 గంటలకు 21 గురువారం తెల్లవారుజామున 1.30 21.5 2.30 22 3.30 22.5 4.30 23 ఉదయం 5.30 23.5 6.30 23.8 7 24 8 24.3 9 24.5 10 24.8 11 25 మధ్యాహ్నం 12 25.3 1 గంటకు 25.3 2 25.3 3 25.50 సాయంత్రం 4 25.80 5 25.80 6 26 10 25 -
ఆలయ పునఃనిర్మాణానికి రూ.40లక్షలు
చింతకాని: చింతకాని మండలం లచ్చగూడెంలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆలయ పరిస్థితిని అర్చకుడు ఇంగువ విద్యాసాగర్ శర్మ వివరించారు. దీంతో స్పందించిన భట్టి విక్రమార్క సీజీఎఫ్ నిధుల నుంచి రూ.40లక్షలు మంజూరు చేయగా, ఉత్తర్వుల కాపీని ఆలయ కమిటీ సభ్యులకు ఆత్మ కమిటీ డైరక్టర్ కొప్పుల గోవిందరావు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొడుగు రమేష్, ఆలయ కమిటీ సభ్యులు చొప్పర రంగారావు, వంకాయలపాటి ప్రసాద్, బత్తిన వెంకటేశ్వర్లు, మేకపోతుల నాగేశ్వరరావు, యలమద్ది ప్రసాద్, తాళ్ల రామారావు, కొప్పెర రాంబాబు, గురిజాల నర్సింహారావు, కట్ల కృష్ణయ్య, బోయిన రామారావు, నెర్సుల బక్కయ్య, శ్రీరాముల నాగేశ్వరరావు, జమలయ్య, తదితరులు పాల్గొన్నారు. ఆర్చరీ క్రీడాకారుల ఎంపికపాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులను పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన స్పోర్ట్స్ మోడల్ స్కూల్లో గురువారం ఎంపిక చేశారు. సబ్ జూనియర్ విభాగంలో బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈమేరకు వివరాలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య వెల్లడించారు. బాలుర విభాగంలో కె.రాంచరణ్, ఎం.చరణ్, కె.దిలీప్, కె.వినోద్కుమార్, వి.సంతోష్, జి.విజయవర్దన్, వెంకటయోగేశ్వర్, డి.ఆదిత్యప్రకాశ్, టి.మోహన్రెడ్డి, పి.దేవంత్ స్వామి, శివ శశాంక్, బాలికల విభాగంలో ఇ.అవంతిక, బి.సంజనశ్రీ, పి.హర్షిత, కె.జ్యోత్స్న, ఎం.గౌతమి, జె.సంస్కృతి ఎంపికయ్యారని తెలిపారు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం సత్తుపల్లిరూరల్: తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షంతో సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో నీరు నిలవగా గురువారం కూడా బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. రెండు ఓసీల్లో సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విభాగం కలిగిందని పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తెలిపారు. ఈమేరకు ఓసీల్లో నీటిని తొలగించి బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. జర్మనీలో ఉద్యోగాలకు ఖమ్మంరాపర్తినగర్: తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్కామ్) ద్వారా జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గురువారం రిజిస్ట్రేషన్లు స్వీకరించారు. ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో శిబి రం ఏర్పాటుచేయగా 106మంది పేర్లు నమో దు చేసుకున్నారు. వీరికి రెండు రోజుల్లో ఇంటార్వ్యూ నిర్వహిస్తామని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. దెబ్బతిన్న పంటల పరిశీలన కామేపల్లి: తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, అధికారులు గురువారం పరిశీలించారు. కామేపల్లిలోని వాగు వద్ద నీట మునిగిన వరి పైరును పరిశీలించి రక్షణ చర్యలపై రైతులకు సూచనలు చేశారు. చేన్లలో నిలిచిన నీటిని తొలగించడమే కాక పడిపోయిన పంటను జడలు కట్టడం ద్వారా నష్టం తగ్గుతుందని తెలిపారు. ఏడీఏ కె.వెంకటేశ్వరరావు, ఏఓ తారాదేవి, ఏఈఓ వేదిత, సీఈఓ నాగయ్య పాల్గొన్నారు. -
నైపుణ్యాల పెంపునకే ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’
ఖమ్మం సహకారనగర్: బట్టీ చదువులకు స్వస్తి పలికి విద్యార్థుల్లో చదివే సామర్థ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు బోధన పద్ధతి అవలంబించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పదాలను బోర్డుపై రాసి విద్యార్థులతో చదివించి ఉచ్ఛారణపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి చదివే సామర్థ్యం పెంచాలనేలక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పక్కాగా అమలుచేయాలని సూచించారు. నెల పాటు ప్రతీ విద్యార్థితో గంట సేపు చదివించేలా ప్రత్యేక బుక్లెట్ ఉపయోగిస్తూ వారి సామర్థ్యాలను యాప్లో నమోదు చేయాలని తెలిపారు. సీఎంఓ ప్రవీణ్, ఎంఈఓ శైలజాలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పెద్ద చెరువుకు ముప్పు
● కట్ట భద్రతపై రైతుల్లో ఆందోళన ● పరిశీలించిన అదనపు కలెక్టర్, అధికారులుకామేపల్లి: తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగానే కామేపల్లి పెద్ద చెరువుకు భారీగా వరద చేరడం.. ఆపై పాతలింగాల పెద్ద చెరువుకు చేరడంతో జలకళ సంతరించుకుంది. అయితే, చెరువు కట్టకు బుధవారం బుంగ(గండి) పడి నీరు బయటకు వస్తుండడంతో మరమ్మతులు చేపట్టారు. అయినా రాత్రి వరద ఎక్కువ కావడంతో కట్టకు పగులు ఏర్పడంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మట్టి పోసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఆర్డీఓ నర్సింహారావు గురువారం చేరుకుని పర్యవేక్షించారు. కట్టకు ప్రమాదం జరగకుండా అలుగును తొలగించే ప్రయత్నం చేయించినా సాధ్యం కాలేరు. అలుగును తొలగిస్తేనే కట్ట రక్షణ సాధ్యమవుతుందని భావించి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా, చెరువు కట్ట తెగితే ఆ చెరువుతో పాటు దిగువన ఉన్న కొండాయిగూడెం పెద్దచెరువుకు కూడా ప్రమాదం పొంచి ఉందని రైతులు తెలిపారు. అంతేకాక వేల ఎకరాల్లో పంట కొట్టుకుపోతుందని వాపోయారు. ఎట్టకేలకు అలుగు తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్, ఎస్సై శ్రీకాంత్, ఇరిగేషన్ డీఈఈ శంకర్, ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇంకా బయటపడని డీసీఎం వ్యాన్
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద నిమ్మవాగు వరదలో బుధవారం గల్లంతైన డీసీఎం డ్రైవర్ ఆరేపల్లి మురళీకృష్ణ ఆచూకీ గురువారం సాయంత్రం వరకు కూడా లభించలేదు. ఎస్ఐ జి.సూరజ్ నేతృత్వాన ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం ఉదయం నుంచే గాలించినా వరద కారణంగా డీసీఎంను గుర్తించలేకపోయారు. చివరకు ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు అయస్కాంతాల సాయంతో గాలించగా కొట్టుకుపోయిన స్థలం నుంచి 200 మీటర్ల దూరాన డీసీఎం ఇసుకలో కూరుకుపోయినట్లు తేలింది. ఆపై రెండు భారీ క్రేన్లు తెప్పించి డీసీఎంను లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడో సారి డీసీఎం ట్రక్కుకు చైన్ను తగిలించగా వెనక భాగం ముక్కలు ఊడి వచ్చాయి. అయితే, డీసీఎంలో డ్రైవర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. తిరిగి శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వైరా సీఐ వెంకటప్రసాద్, తహసీల్దార్ నారపోగు అరుణ, ఎంపీడీఓ గుగులోత్ వర్ష, ఎంపీఓ ఆర్.ఉపేంద్రయ్య, ఆర్ఐలు నరేష్, రమేష్ పర్యవేక్షించారు. -
చేయి దాటిన పంటలు
తుపాన్తో ధ్వంసం ● అంతటా నేలపాలైన వరి, పత్తి చేన్లు ● 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో పంట నష్టం ఖమ్మంవ్యవసాయం: మోంథా తుపాను అన్నదాత శ్రమను ఛిద్రం చేసింది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులతో చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసమయ్యాయి. రెండు రోజుల పాటు విరుచుకుపడిన తుపాను తాకిడికి జిల్లాలో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమిక అంచనా వేశాయి. ఈ మేరకు జిల్లాలో 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. వరి, పత్తి, పప్పుధాన్యాలతో పాటు ఉద్యాన పంటలైన మిర్చి, కూరగాయల పంటలకు నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సమగ్ర సర్వే అనంతరం నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉంది. అత్యధికం వరే... జిల్లావ్యాప్తంగా 24,321 మంది రైతులకు చెందిన 36,893 ఎకరాల్లో వరికి నష్టం వాట్లిందని ప్రాథమికంగా గుర్తించారు. అలాగే, 16,544మంది రైతులకు చెందిన 22,574 ఎకరాల్లో పత్తి, 2,234 మంది రైతులకు సంబంధించి 2,923 ఎకరాల్లో ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి. ఇక ఐదుగురు రైతులకు చెందిన 10 ఎకరాల్లో పప్పు ధాన్యాల పంటలకు నష్టం వాటిల్లిందని నివేదికలో పొందుపరిచారు. కాగా, సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లో అత్యధికంగా 41 గ్రామాలకు చెందిన 7,008మంది రైతులు 13,055 ఎకరాల్లో వరి పంట నష్టపోయారు. కూసుమంచి డివిజన్లో 9,018 మంది రైతులు 11,058 ఎకరాల్లో, వైరా డివిజన్లో 5,064 మంది రైతులు 8,092 ఎకరాల్లో, మధిర డివిజన్లో 2,903 మంది రైతులు 4,173 ఎకరాల్లో, ఖమ్మం డివిజన్లో 328 మంది రైతులకు చెందిన 515 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇక పత్తి వైరా డివిజన్లో 7,942 మంది రైతులకు చెందిన 11,334 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మధిర డివిజన్లో 3,620 మంది రైతులకు 5,167 ఎకరాల్లో, కూసుమంచి డివిజన్లో 3,427 మంది రైతులకు చెందిన 4,088 ఎకరాల్లో, సత్తుపల్లి డివిజన్లో 1,555 మంది రైతులకు చెందిన 1,985 ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది. మిర్చి, కూరగాయల పంటలు కూసుమంచి డివిజన్లో 1,769 మంది రైతులకు చెందిన 2,096 ఎకరాల్లో, మధిర డివిజన్లో 271 మంది రైతులకు 532 ఎకరాల్లో, సత్తుపల్లి డివిజన్లో 84 మంది రైతులకు 110 ఎకరాల్లో, వైరా డివిజన్లో 63 మంది రైతులకు చెందిన 110 ఎకరాల్లో, ఖమ్మం డివిజన్లో 47 మంది రైతులకు చెందిన 75 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పప్పుధాన్యం పంటలు ఎర్రుపాలెం మండలంలో ఐదుగురు రైతులకు చెందిన 10 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.జిల్లాలో వరి 2.98 లక్షల ఎకరాల్లో, పత్తి 2.51 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. పత్తి చేతికందుతున్న తరుణంలో తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎకరాకు 4 – 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రాదని భావిస్తుండగా, తుపానుతో ఆ కాస్త ఆశలు కూడా కోల్పోయారు. అలాగే, కోత దశలో ఉన్న వరి నేలవాలగా, కంకి నీటిలో నాని దెబ్బతింటోంది. ఇది యంత్రాలతో కోయడం కూడా సాధ్యం కాదని, కూలీలతో కోయిస్తే అదనపు భారం పడుతుందని వాపోతున్నారు. -
ముగిసిన ‘చాంబర్’ నామినేషన్ల పర్వం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ నామినేషన్ల ఘట్టం బుధవారంతో ముగిసింది. చివరిరోజు పలు పదవులకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు ముగిసే నాటికి మొత్తంగా ఆఫీస్ బేర్లర్లతో పాటు పలు శాఖల్లో 76 పదవులకు 118 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. చివరిరోజు మేళ్లచెర్వు – జీవై నరేశ్ ప్యానల్ బాధ్యులు మద్దతుదారులతో కలిసి ర్యాలీగా వర్తక సంఘానికి చేరు కుని నామినేషన్లు వేశారు. చాంబర్ అధ్యక్ష పదవికి మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పదవికి సోమ నరసింహారావు, ఉపాధ్యక్ష పదవికి బత్తిని నరసింహారావు, సహాయ కార్యదర్శి పదవికి ముత్యం ఉప్పల్రావు, కోశాధికారి పదవికి తల్లాడ రమేశ్, దిగుమతి, మిర్చి, వెండి, బంగారం శాఖ లకు కోలేటి నవీన్, ఆత్మకూరి రామారావు, మెంతుల శ్రీశైలం, యడ్లపల్లి సతీశ్, బందు సూర్యం, నకిరకంటి సతీశ్ తదితరులు నామినేషన్లు సమర్పించారు. ఈ ప్యానెల్కు మద్దతుగా కాళ్ల పాపారా వు, మలిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యా రు. అలాగే, అధ్యక్ష పదవికి కొదుమూరి మధుసూదన్రావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ను దాఖా లు చేశారు. దీంతో అధ్యక్ష పదవికి నలుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు, సహాయ కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసినట్లయింది. గురువారం నామినేషన్లు పరిశీలించనుండగా, శుక్రవారం ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మొత్తం 76 పదవులకు 118 నామినేషన్లు -
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
● అత్యవసర సమయాన 1077, 90632 11298కు ఫోన్ చేయొచ్చు.. ● మున్నేటి పరీవాహకంలో పర్యటించిన కలెక్టర్ అనుదీప్ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం రూరల్: ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యాన అన్ని శాఖల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఇదే సమయాన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అత్యవసర సమయాల్లో కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్, ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలోని మున్నేటి పరీవాహక ప్రాంతాలైన కాల్వొడ్డు, మున్నేరు ఘాట్, గణేష్ నిమజ్జన ఘాట్, బొక్కలగడ్డ, జలగంనగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయనగర్ తదితర ప్రాంతాల్లో కేఎంసీ, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ ఆగస్త్య, శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ పర్యటించారు. పలు కాలనీల ప్రజలతో మాట్లాడిన ఆయన వరద పెరుగుతున్న నేపథ్యాన అధికారులకు సహకరించాలని, ఎప్పుడు చెప్పినా పునరావాస కేంద్రాలకు వెళ్లేలా సిద్ధంగా ఉండాలని తెలిపారు. కాగా, నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేఎంసీ సహాయ కమిషనర్ అనిల్కుమార్, ఆర్డీఓ నర్సింహారావు, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లు సైదులు, పి.రాంప్రసాద్, మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కొణిజర్ల: తుపాన్తో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కొణిజర్ల మండలంలోని తుమ్మలపల్లి, అన్నవరం మధ్య పొంగి ప్రవహిస్తున్న పగిడేరు వాగును పరిశీలించాక మండలంలో వర్షాలు, వాగుల్లో ఉధృతిపై తహసీల్దార్ ఎన్.అరుణ, ఉద్యోగులతో చర్చించారు. -
మున్నేరు ఉధృతి
ఖమ్మం నగరంతో పాటు ఎగువన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మున్నేటిలోకి వరద చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాల్వొడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం 12గంటలకు 10 అడుగుల మేర మాత్రమే ప్రవహించిన వరద రాత్రి 7గంటలకల్లా 18.50 అడుగులకు చేరింది. ఏడు గంటల్లోనే 8అడుగులకు మించి వరద పెరగడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అప్పటికప్పుడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయించి బొక్కల గడ్డ, గంగాభవాని గుడి ప్రాంతం, ధంసలాపురంలో కొందరు ప్రజలను సామగ్రితో సహా పంపించారు. రాత్రికి వరద మరింత పెరగడంతో కేఎంసీ సహా వివిధ శాఖల ఉద్యోగులు ప్రజలను అప్రమత్తం చేశారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
సత్తుపల్లిరూరల్: తుపాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఓసీల్లోకీ నీరు చేరింది. దీంతో రెండు ఓసీల్లో 2లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు, 35వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తెలిపారు. ఈమేరకు భారీ మోటార్ల సాయంతో నీటి తొలగింపు పనులు ముమ్మరం చేశారు. ఖమ్మం మార్కెట్కు సెలవుల పొడిగింపు ఖమంవ్యవసాయం: ‘మోంథా’ తుపాను కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులను పొడిగించారు. తొలుత బుధవారం వరకు సెలవు ప్రకటించగా.. తుపాన్ తీవ్రత నేపథ్యాన శుక్రవారం(31వ తేదీ) వరకు సెలవులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై నవంబర్ 1న శనివారం, 2న ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో నవంబర్ 3వ తేదీ సోమవారం నుంచి పంట కొనుగోళ్లు మొదలవుతాయని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని సూచించారు. పలు రూట్లలో బస్సుల రద్దు ఖమ్మంమయూరిసెంటర్: తుపాను ప్రభావంతో ఖమ్మం రీజియన్ పరిధిలో పలు మార్గాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. రీజియన్ పరిధి ఏడు డిపోల నుంచి 128 బస్సులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల రహదారులపైకి వరద చేరడంతో ముందు జాగ్రత్తగా ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ రూట్లలో బస్సులు నడిపించలేదు. ఖమ్మంతోపాటు మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి వివిధ మార్గాల్లో బుధవారం ఒకేరోజు 60,872 కి.మీ. మేర సర్వీసులు రద్దయ్యాయి. అత్యధికంగా సత్తుపల్లి డిపో నుంచి 35, భద్రాచలం డిపో నుంచి 25, ఖమ్మం నుంచి 22, కొత్తగూడెం నుంచి 15, ఇల్లెందు నుంచి 11, మధిర, మణుగూరు నుంచి పదేసి సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జలాశయాల్లో పెరుగుతున్న నీటిమట్టం ఖమ్మంఅర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోనే కాక సమీప జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా ప్రధాన జలాశయాలు, వాగుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పాలేరు, వైరా, లంకసాగర్ ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరగా, ఆకేరు, మున్నేరు వాగుల్లోనూ నీటి ప్రవాహం గణనీయంగా పెరుగుతోంది. పొలిశెట్టిగూడెం, తీర్థాల వద్ద మున్నేటిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. కాగా, జిల్లాలోని మొత్తం 1,061 చెరువులకు 629 చెరువులు 90శాతానికి పైగా మేర నిండగా, 213 చెరువులు పూర్తిగా నిండడంతో అలుగుపోస్తున్నాయని తెలిపారు. అంతేకాక మరో ఐదు చెరువులు 25–50 శాతం, 54 చెరువుల్లో 50–75 శాతం, 157 చెరువుల్లో 75–90 శాతం మేర నీరు చేరిందని పేర్కొన్నా రు. వర్షం కొనసాగితే జలాశయాల్లోకి మరింత వరద చేరనున్నందున పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. డీఈఈటీ ద్వారా ఉపాధి అవకాశాలు ఖమ్మంమయూరిసెంటర్: గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు డీఈఈటీ వేదికను వినియోగించుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎన్.విజయలక్ష్మి సూచించారు. తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్(డీఈఈటీ) ద్వారా వివరాలు నమోదు చేసుకుంటే అర్హత ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న గిరిజన నిరుద్యోగులు https://deet. telangana.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఐదుగురు ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు రద్దు ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో నలుగురిని డీఈఓ కార్యాలయానికి, వయోజన విద్యాశాఖకు ఒకరిని డిప్యుటేషన్పై ఇటీవల కేటాయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారిని డిప్యుటేషన్ చేసి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఐదుగురు ఉపాధ్యాయులను యథాస్థానాలకు కేటాయిస్తూ అదనపు కలెక్టర్, డీఈఓ శ్రీజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీజేఐపై దాడి దుర్మార్గపు చర్య
ఖమ్మంమామిళ్లగూడెం: విశ్వాసాల ముసుగులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి చేయడం దుర్మార్గపు చర్య అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని గౌరవించని వారు, చట్టాలకు విలువ ఇవ్వని వారు దేశద్రోహులుగా మిగిలిపోతారని తెలిపారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, లైంగికదాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశా రు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడి జరిగి మూడు వారాలు గడుస్తున్నా, ఢిల్లీ పోలీసులు కేసు పెట్టలేద ని, న్యాయ వ్యవస్థ సుమోటోగా తీసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించలేదంటే దేశంలో దళితులకు రక్షణలేదని రుజువవుతోందని చెప్పారు. జస్టిస్ గవాయ్పై దాడి చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ‘విశ్వాసాల పరంగా దాడి చేశాం, అందుకు కట్టుబడి ఉన్నాం’అని చెబుతుండడం గర్హనీయమన్నారు. ఎవరి మతాలను వారు గౌరవించినా.. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు నవంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని మంద కృష్ణ కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కందికట్ల విజయ్, తూరుగంటి అంజయ్య, కూరపాటి సునీల్ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ఖమ్మంక్రైం: భారీ వర్షాల నేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100తో పాటు కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే పోలీస్ కంట్రోల్ నంబర్ 87126 59111కు సమాచారం అందించాలని చెప్పారు. వరద చేరిన రోడ్లను దాటే ప్రయత్నం చేయొద్దని, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. పగిడేరు ఉధృతి పరిశీలన కొణిజర్ల: కొణిజర్ల మండలం లాలాపురం, తీగలబంజర మధ్య ఉన్న పగిడేరు వాగు ఉధృతిని సీపీ సునీల్దత్ పరిశీలించారు. ప్రజలు, వాహనదారులు బ్రిడ్జి దాటకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈమేరకు అందరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
అప్రమత్తంగా యంత్రాంగం
ఖమ్మం సహకారనగర్: తుపాన్ నేపథ్యాన జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత రెండు రోజులుగా వర్షసూచనలు ఉండడంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇక మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాక కలెక్టరేట్లో 1077, 90632 11298 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయించారు. ఆపై మున్నేటి పరీవాహకం, కొణిజర్ల మండలంలో కలెక్టర్ అధికారులతో కలిసి పర్యటించారు. అంతేకాక పదిహేను మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేశారు. కేఎంసీ, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాలు ముంపునకు గురికాగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఇన్చార్జ్లను నియమించినట్లు డీఆర్వో పద్మశ్రీ తెలిపారు. నాలుగు బోట్లు, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఆరు ఫైరింజన్లు, ఏడు డీవాటరింగ్ పంప్లను సిద్ధంచేసి, 105మంది మత్స్యకారులను నియమించినట్లు వెల్లడించారు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెడీ -
‘ముందస్తు’ ముచ్చటేది?
భద్రగిరి ముక్కోటి, నవమి ఉత్సవాలతో పాటు పుష్కరాల నిర్వహణపై యంత్రాంగం ముందస్తుగా దృష్టి సారించడం లేదు.భారీ వర్షాలతో పాలేరు రిజర్వాయర్కు ఎగువ నుంచి వస్తున్న వరద పెరుగుతోంది. బుధవారం ఉదయం 862 క్యూసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 10,480 క్యూసెక్కులకు చేరింది. దీంతో పాటు సాగర్ నుంచి మరో 1,276 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండగా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టమైన 23 అడుగులకు చేరింది. అయితే, ఎడమ, పాలేరు కాల్వల భద్రత దృష్ట్యా నీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యాన రిజర్వాయర్లో నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తూ వచ్చిన వరద వచ్చినట్లుగా గేట్ల ద్వారా ఏటిలోకి మళ్లిస్తున్నారు. రిజర్వాయర్, అలుగుల ప్రాంతాన్ని జలవనరుల శాఖ ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, అధికారులు వెంకట్రాం, రమేష్రెడ్డి, అనన్య పరిశీలించి భద్రతపై సూచనలు చేశారు. – కూసుమంచి -
ఇద్దరిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
కొణిజర్ల: పోలీసులు, స్థానికులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ద్విచక్ర వాహనంపై వరద దాటేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులు పడిపోగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు కాపాడారు. కొణిజర్ల మండలం తీగలబంజర సమీపాన పగిడేరు ఉధృతంగా ప్రవహిస్తుండగా బుధవారం మధ్యా హ్నం పోలీసులు ట్రాక్టర్ అడ్డు పెట్టి రాకపోకలు నిలిపేశారు. ఇంతలోనే ఇద్దరు యువకులు పోలీసులను ఖాతరు చేయకుండా వాగు దాటే క్రమాన వరద ఉధృతికి వాహనం జారి పడబోయింది. అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించి తాళ్ల సాయంతో ద్విచక్రవాహనం సహా యువకులను బయటకు లాగడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
మున్నేటి పరీవాహకంలో అలర్ట్
● రాత్రి 11 గంటలకు 20 అడుగుల మేర వరద ● లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు ● పలుచోట్ల పునరావాస కేంద్రాల ఏర్పాటు, ఉద్యోగుల పర్యవేక్షణఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంతో పాటు ఎగువన మున్నేరు పరీవాహకంలో భారీ వర్షం కురవడంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం కాల్వొడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం 12గంటలకు 10 అడుగుల మేర మాత్రమే ప్రవహించిన వరద సాయంత్రం 5గంటల వరకు 18 అడుగులకు చేరింది. ఐదు గంటల్లో దాదాపు ఎనిమిది అడుగుల మేర వరద పెరగడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మున్నేటికి ఇరువైపులా ప్రజలను అప్రమత్తం చేయించారు. ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని తెలిపారు. కలెక్టర్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మున్నేటిని పరిశీలించాక ధంసలాపురం పాఠశాల, నయాబజార్ కళాశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించారు. అంతేకాక పలు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు వాహనాల్లో తరలించారు. రాత్రి 11గంటలకు కాల్వొడ్డు వద్ద మున్నేటి వరద 20అడుగులకు చేరింది. ఆపై నెమ్మదిగా పెరుగు తుండడంతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కుండపోత వర్షం మోంథా తుపాన్ ప్రభావంతో నగరంలో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం 8–30 గంటల వరకు 5.2 సెం.మీ., బుధవారం ఉదయం 8–30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 3.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాపర్తినగర్ వద్ద మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్ రాపర్తి శరత్కుమార్ జేసీబీతో కాల్వ తీయించి నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. అలాగే, రాపర్తినగర్ బైపాస్, డిపో రోడ్డులో, చెరువుకట్ట ప్రాంతంలో ఇళ్ల వద్దకు నీరు చేరగా డ్రెయినేజీల్లో అడ్డుపడిన వ్యర్థాలను తొలగించడంతో నీరు సాఫీగా సాగింది. అధికారులంతా అక్కడే.. మున్నేటి వరద ప్రమాదకర స్థాయిలో ఉండడంతో కలెక్టర్ అనుదీప్, మేయర్ పి.నీరజ, కమిషనర్ అభిషేక్ సహా అధికారులంతా పరీవాహకంలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పడంతో స్థానికులు సామగ్రి సర్దుకున్నారు. ఇక బొక్కల గడ్డ, గంగాభవాని గుడి, ధంసలాపురం ప్రాంతంలోని పలు ఇళ్లను ఖాళీ చేయించి నయాబజార్ కళాశాల పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే, రెండు కేంద్రాల్లో వేయి మందికి సరిపడా భోజనం సిద్ధం చేశారు. కమిషనర్ అభిషేక్ నయాబజార్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఏఎంసీ అనిల్కుమార్, ఈఈ కృష్ణాలాల్, డీఈఈలు నవ్యజ్యోతి, ధరణికుమార్, శ్రీనివాస్తో పాటు ఏఈఈలు కూడా పర్యవేక్షించారు. -
వాతావరణ ం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షసూచనలు ఉన్నాయి. రోజంతా ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తాయి.ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వైరా రిజర్వాయర్లోకి భారీగా వరద చేరుతోంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా, ఒకే రోజులో 18.1 అడుగుల నుంచి 20అడుగులకు చేరింది. రిజర్వాయర్లోకి 4,678 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఐదు అలుగుల ద్వారా 4,548 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇక వైరాలో ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా పలు రహదారులు జలమయం అయ్యాయి. రాజీవ్ నగర్, ఇందిరమ్మ కాలనీల్లోకి వరద చేరగా, ఠాగూర్ విద్యాలయం సమీపాన చేరుతున్న వరదను మున్సిపల్ కమిషనర్ గురులింగం ఆధ్వర్యాన సిబ్బంది వెళ్లి జేసీబీతో కాల్వలు తీసి మళ్లించారు. అలాగే, ముంపు ప్రాంతాల్లో ఎస్సై రామారావు పర్యటించి స్థానికులను అప్రమత్తం చేశారు. – వైరా -
నిమ్మవాగులో కొట్టుకు పోయిన డీసీఎం
కొణిజర్ల/అశ్వారావుపేటరూరల్: కొణిజర్ల మండలం అంజనాపురం సమీపాన నిమ్మ వాగులో బుధవారం ఓ డీసీఎం కొట్టుకుపోగా డ్రైవర్ గల్లంతయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి మారుతినగర్కు చెందిన ఆరేపల్లి మురళి (32) మూడు రోజుల క్రితం అదే మండలం నారావారిగూడెం వాసి మునుగొండ వెంకటముత్యం డీసీఎం వ్యాన్కు డ్రైవర్గా వచ్చాడు. సుజాతనగర్లో పత్తి లోడ్ తీసుకుని వరంగల్ జిల్లాలో దిగుమతి చేసి బుధవారం వస్తుండగా అంజనాపురం వద్ద నిమ్మవాగు వరద బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తోంది. కొణిజర్ల వైపు నుంచి డీసీఎంలో వస్తున్న మురళి వరద దాటేందుకు యత్నిస్తుండగా మరో వైపు ఉన్న స్థానికులు, ఏన్కూరు పోలీసులు వారించారు. అయినా వినకుండా ముందుకు సాగడంతో వరద ఉధృతికి వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ గల్లంతయ్యాడనే సమాచారం తెలియంతో ఎస్ఐ జి.సూరజ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించి గాలించగా సాయంత్రం వరకు కూడా ఆచూకీ తెలియరాలేదు. కాగా, మురళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గల్లంతయ్యాడనే సమాచారం తెలియడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబానికి వృద్ధురాలి అప్పగింత వైరా: ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన వృద్ధురాలిని గుర్తించిన పోలీసులు తిరిగి ఆమెను కుటుంబీకులకు అప్పగించారు. వైరా మున్సి పాలిటీ పరిధి శాంతినగర్కు చెందిన ధరావత్ సుశీల (60) మంగళవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించ గా ఎస్ఐ పి.రామారావు నేతృత్వాన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆమె విజయవాడ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో ఆమెను వైరా తీసుకొచ్చి కుటుంబానికి అప్పగించారు. వరదలో గల్లంతైన డ్రైవర్ -
పకడ్బందీగా మెడికల్ వ్యర్థాల తరలింపు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ఆస్పత్రుల నుంచి బయో మెడికల్ వ్యర్థాల తరలింపు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ, సురక్షితంగా తరలించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని రక్షించొచ్చని తెలిపారు. జిల్లాలో 37 ప్రభుత్వ, 592 ప్రైవేట్ ఆస్పత్రు లు, ఒక వెటర్నరీ ఆస్పత్రి పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి లైసెన్స్ పొందాయని చెప్పారు. బయో మెడికల్ వ్యర్థాల సేకరణ కోసం వాహనాలు అందుబాటులో ఉండగా కేటగిరీల వారీగా వ్యర్థాలను ఆస్పత్రుల్లో వేరుచేసేలా సూచనలు చేయాలని అధి కారులను ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ కళావతిబాయి, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, ఐఎంఏ కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్, అధికారులు చందునాయక్, వెంకటరమణ, పి.రామారావు, రవీందర్, షారూఖ్ గజ్దర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ధంసలాపురం వాసికి డాక్టరేట్ ఖమ్మంఅర్బన్: ఖమ్మం ధంసలాపురం కొత్తకాలనీవాసి వంగూరి చిరంజీవికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ లభించింది. ఆయన విక్రమ్సింగ్ రాథోర్ పర్యవేక్షణలో పరిశోధనాపత్రం సమర్పించారు. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జే.ఎస్. విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్న చిరంజీవిని కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, ఆళ్ల నిరీషాఅంజిరెడ్డి తదితరులు అభినందించారు. 2న అండర్–19 నెట్బాల్ ఎంపికలు ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల నెట్బాల్ జట్లను వచ్చేనెల 2న ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక పోటీలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో జరుగుతాయని జూనియర్ కళాశాల క్రీడా సంఘం కార్యదర్శి ఎండీ మూసాకలీం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 98483 41238 నంబర్లో సంప్రదించాలని సూచించారు. వరద ఉధృతిని పరిశీలించిన డీపీఓ తల్లాడ: మండలంలోని మాచవరం వాగు ఉధృతితో బుధవారం రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోగా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఆశాలత పరిశీలించారు. మాచవరం వాగు లోలెవల్ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండగా బిల్లుపాడు, రామచంద్రాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాక రామచంద్రాపురం వాసులకు తల్లాడతో సంబంధాలు తెగిపోయాయి. ఈనేపథ్యాన గ్రామంలో పరిస్థితులపై ఆరా తీసిన డీపీఓ భద్రతపై గ్రామ కార్యదర్శులకు సూచనలు చేశారు. ఎంపీడీఓ సురేశ్బాబు, గ్రామ కార్యదర్శి సాయికుమార్, మాజీ ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం పాల్గొన్నారు. వన్యప్రాణుల ఉత్పత్తుల వ్యాపారంపై విచారణ ఖమ్మంవ్యవసాయం: వణ్యప్రాణుల ఉత్పత్తుల అక్రమ వ్యాపారంపై అటవీ శాఖ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నిషేధిత అటవీ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులను కొందరు విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల నుంచి హతజోడి తదితర మొక్కలతో పాటు పులి గోర్లు, ఇతర జంతువుల శరీర భాగాలు, నల్లమల, శ్రీశైలం, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి జంతువుల ఉత్పత్తులను సేకరించి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అంతేగాక నేపాల్, హిమాచల్ప్రదేశ్, కశ్మీర్ రుద్రాక్షల పేరిట అమ్ముతున్నారు. వీటితో పాటు సముద్రాల్లో లభమయ్యే ఆల్చిప్పలు, ముత్యాలు, పగడాలను జిల్లాలోని కొందరు జ్యూయలరీ షాపుల వ్యాపారులు మధ్యవర్తుల ద్వారా తెప్పించి అమ్ముతున్నట్లు బయటపడింది. ఈ మేరకు చైన్నెలోని వైల్డ్లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) అధికారులు, జిల్లా అటవీ టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి మంగళవారం తనిఖీలు చేపట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నిషేధిత అటవీ, జంతు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోగా విచారణ ముమ్మరం చేశారు. అయితే, వీరికి ఉత్పత్తులు అందజేసిన మధ్యవర్తులు రూ.కోట్లలో వ్యాపా రం చేస్తున్నట్లు గుర్తించారని సమాచారం. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో కీలక వ్యక్తులను గుర్తించే అవకాశముందని తెలిసింది. కాగా, వ్యాపారులు పట్టుబడినట్లు తెలియడంతో మధ్యవర్తులు సెల్ఫోన్లు స్విచాఫ్ చేయగా, ఎవరికీ అందుబాటులో లేరని సమాచారం. -
మరికొన్ని దారి మళ్లింపు
పలు రైళ్ల రద్దు.. ఖమ్మంరాపర్తినగర్: మోంథా తుపాన్ ప్రభావంతో ఖమ్మం మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. ఇంకొన్నింటిని ఇతర మార్గాల్లో మళ్లించారు. విజయవాడ – డోర్నకల్(67768), డోర్నకల్ – కాజీ పేట (67766), వికారాబాద్ – గుంటూరు (12748), చర్లపల్లి – తిరుపతి (07001, తిరుపతి – చర్లపల్లి (070002), చర్లపల్లి – త్రిచూర్ (07251), త్రిచూర్ – చర్లపల్లి (07252), విజయవాడ – భద్రాచలంరోడ్ (67215) భద్రాచలంరోడ్ –విజయవాడ (67216), గుంటూరు – సికింద్రాబాద్ (12705) రైళ్లను రద్దు చేశారు. అలాగే, సికింద్రాబాద్ – గుంటూరు (12706), సికింద్రాబాద్ – విజయవాడ(12714) తదితర రైళ్లు స్టేషన్లలో వరద కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అలాగే, విశాఖపట్నం– సికింద్రాబాద్(20833)రైలును విజ యవాడ, గుంటూరు, పగడిపల్లి మీదుగా సికింద్రాబాద్కు నడిపించారు. అంతేకాక నర్సాపూర్ – నాగర్సోల్(12787), షిర్డీసాయినగర్ – కాకినాడపోర్ట్(12705),సికింద్రాబాద్ – గుంటూరు (12702), తిరుపతి – ఆదిలాబాద్(17405), బరౌ ని– ఎర్నాకులం(12521), హజ్రత్నిజాముద్దీన్ – చైన్నె సెంట్రల్ వెళ్లే ఎక్స్ప్రెస్, తిరువనంతపు రం – న్యూఢిల్లీ (12625) రైలు, తిరువనంతపురం – నిజాముద్దీన్(12643) ఎక్స్ప్రెస్నుదారి మళ్లించారు. అత్యవసమైతేనే ప్రయాణించండి ఖమ్మం నుంచి విజయవాడ, వరంగల్ మార్గంలో అత్యవసరమైతేనే రైలు ప్రయాణం ఎంచుకోవాలని ఖమ్మం చీఫ్ కమిర్షియల్ అధికారి రాజ్గోపాల్ కోరారు. తుపాన్ కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్ మార్గంలో బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 90633 25169లో సంప్రదించాలని సూచించారు. మధిరలో నిలిచిన షిర్డీ ఎక్స్ప్రెస్ మధిర: పలుచోట్ల రైల్వేస్టేషన్లలోకి వరద చేరడంతో రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ముందుకు వెళ్లే పరిస్థితి లేక కాకినాడపోర్ట్ – షిర్డీ సాయినగర్ ఎక్స్ప్రెస్ను బుధవారం మఽధిర రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సుమారు రెండు గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, చిన్నారులు తాగునీరు, ఇతర అవసరాలకు ఇబ్బంది పడ్డారు. మధిర ప్రెస్క్లబ్ బాధ్యులు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ప్రెస్క్లబ్ గౌరవ సలహాదారుడు మిరియాల శ్రీనివాసరావు, అధ్యక్షుడు పాగి బాలస్వామితో పాటు బాధ్యులు సుంకర సీతారాం, పల్లపోతు ప్రసాదరావు, దుబాసి రాజేశ్, వేముల నవీన్కుమార్, దోసపాటి విజయ్, గణేశ్, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి, సీసీఎస్ సత్యనారాయణ, కమర్షియల్ ఇన్స్పెక్టర్ రమేశ్, వివిధ సంఘాల బాధ్యులు సురేశ్, సాయి, సతీశ్, వనమా కిరణ్, కోనా జగదీశ్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
సత్తుపల్లి(పెనుబల్లి)/రఘునాథపాలెం: పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ స్కూల్లో పదో తరగతి చదివి 579 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన శీలం జయశ్రీకి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతిభా పురస్కారం లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి ఉత్తమ మార్కులు సాధించిన వారికి పురస్కారాలు ప్రకటించగా జయశ్రీ రూ.30 వేల నగదు బహుమతి, జ్ఞాపిక అందుకుంది. ఆమెను ప్రిన్సిపాల్ టీబీ రూపన్, ఉపాధ్యాయులు అభినందించారు. అలాగే, రఘునాథపాలెంలోని గిరిజన గురుకుల ప్రతిభా పాఠశాల విద్యార్థి డేగావత్ సంజీవ్కు సైతం పురస్కారం లభించింది. 576 మార్కులతో మండల టాపర్గా నిలిచిన ఆయనకు నగదు బహుమతి, జ్ఞాపిక అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లగట్టుతండాకు చెందిన శంకర్ – మంగమ్మ దంపతుల కుమారుడైన సంజీవ్.. తండ్రి మరణించినా తల్లి రెక్కల కష్టంతో చదువు కొనసాగించాడు. సంజీవ్ను ప్రిన్సిపాల్ మల్లెల బాలస్వామి, వైస్ ప్రిన్సిపాళ్లు నర్సింహారావు, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు బుధవారం సన్మానించారు. -
‘ముందస్తు’ ముచ్చటేది ?
● భద్రగిరిలో ముక్కోటి, నవమి, పుష్కరాలపై కనిపించని కసరత్తు ● శాశ్వత పనులపై శ్రద్ధచూపని అధికారులు ● ప్రణాళిక, అభివృద్ధిని పట్టించుకోని ప్రజాప్రతినిధులు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే ముఖ్యమైన మూడు పండుగలు ముందే ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 29న తెప్పోత్సవం, 30న ముక్కోటి ఏకాదశి, వచ్చే ఏడాది మార్చి 27న శ్రీరామనవమి పండుగలు జరుగనున్నాయి. ఇక 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు ఉంటాయి. అయితే ఈ పండుగలపై ఇంతవరకు ముందస్తు సమీక్ష, ప్రణాళికలు చేపట్టలేదు. భక్తులకు కల్పించాల్సిన శాశ్వత పనులపై ప్రణాళికాయుతంగా ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే తప్ప ఉత్సవాల నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. సమీక్షా సమావేశాల నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నిధులు విడుదల చేయించేలా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ఉత్సవాలకు ఎనలేని విశిష్టత.. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలకు ఎనలేని విశిష్టత ఉంది. పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వేడుకలకు తరలి వస్తుంటారు. అలాగే 12 ఏళ్లకు ఓసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027 ఆగస్టులో జరగనున్నాయి. అయితే ప్రతి ఏడాది జరిగే ఈ ఉత్సవాలతో పాటు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా భద్రాచలంలో కల్పించే వసతి సౌకర్యాలు మెరుగుపడతాయని అంటున్నారు. ప్రణాళికపై అధికారుల నిర్లక్ష్యం.. ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. ఇందుకోసం మిథిలా స్టేడియం పక్కనున్న వేదిక ముందు సెక్టార్లుగా విభజించి టికెట్లు విక్రయిస్తారు. అయితే వీవీఐపీ, వీఐపీ సెక్టార్లతో పాటు ఇతర ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేసిన సెక్టార్లు భక్తులతో నిండిపోతాయి. దీంతో ఇతర సాధారణ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడం కష్టమే. ప్రతీ ఏడాది ఇది పరిపాటిగా మారుతోంది. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శ్రీరామనవమి రోజునా ఇదే సమస్య ఎదురవుతోంది. సీఎం సెక్టార్తో పాటు వీవీఐపీ సెక్టార్లు నిండిపోయి వెనుక, చుట్టుపక్కల ఉండే భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించలేకపోతున్నారు. ఇక గోదావరి పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో ముందస్తు అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక వసతుల కల్పన అత్యవసరం. కానీ నేటి వరకు అటు ప్రజాప్రతినిధులు, ఇటు జిల్లా ఉన్నతాధికారులు ముందుస్తు సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం శోచనీయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానఘాట్ల సంఖ్య పెంచడం, ప్రస్తుతం ఉన్న ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, రోడ్ల విస్తరణ, భక్తులకు సర్వ దర్శనం, వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అంటున్నారు. మార్చి 27నే భద్రగిరిలో కల్యాణం.. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మార్చి 27వ తేదీనే నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అస్పష్టత నెలకొని ఉంది. 26, 27 తేదీల్లో ఘడియలు వచ్చినప్పటికీ దేవస్థానంలో మిగులు గడియల్లోనే కల్యాణం జరపనున్నట్లు వైదిక సభ్యులు, ఆలయ అధికారులు చెబుతున్నారు. కాగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం 26, 27 తేదీల్లో విరామం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముక్కోటి, శ్రీరామనవమి, గోదావరి పుష్కరాల ఉత్సవాలు భద్రాచలంలో జరగనున్న నేపథ్యంలో శాశ్వత పనుల ప్రణాళికపై అధికారులు వెంటనే సమావేశాలు నిర్వహించాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు అధికారులు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటి నుంచే పనులు ప్రారంభించకుంటే పుష్కరాల నాటికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారు. – పోతురెడ్డి సుబ్బారెడ్డి, సారపాక -
తుపాన్
పంజా విసిరినమోంథా తుపాను జిల్లాను కుదిపేసింది. మంగళవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో వాగులు, జలాశయాలు పొంగి ప్రవహించగా.. కొన్ని చోట్ల రహదారులపైకి వరద చేరింది. దీంతో ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. అలాగే, చేతికందే దశలో ఉన్న వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. – ఖమ్మంవ్యవసాయంబోనకల్లో అత్యధికం తుపాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. మంగళవారం ఉదయం 8–30 నుంచి బుధవారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లా సగటు వర్షపాతం 57 మి.మీ.గా నమోదైంది. బోనకల్లో అత్యధికంగా 93.4 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా తల్లాడ, వైరా, పెనుబల్లి, మధిర, కల్లూరు, ఎర్రుపాలెం, ఖమ్మంరూరల్, రఘునాథపాలెం, కామేపల్లి, చింతకాని, కొణిజర్ల మండలాల్లోనూ ప్రభావం కనిపించింది. ఖమ్మంలో 52.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, బుధవారం ఉద యం 8–30 నుంచి సాయంత్రం వరకు అత్యధికంగా తిరుమలాయపాలెంలో 94.3 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, లింగాల, బచ్చోడు, గేటు కారేపల్లి, కాకరవాయి, మంచుకొండ, పల్లెగూడెం, రఘునాథపాలెం, ఖమ్మం , కూసుమంచి, తిమ్మారావుపేట, తల్లాడ, నేలకొండపల్లిలో వర్షం కురిసింది. రహదారులను కమ్మేసిన వరద భారీ వర్షాలతో వాగులు నిండి వరద రహదారులు, లో లెవల్ చప్టాలపైకి చేరింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొణిజర్ల మండలం లాలాపురం తీగలబంజర వద్ద పగిడేరు వాగు ఉప్పొంగగా, చింతకాని మండలం బండిరేవు వాగు ప్రవాహంతో నాగులవంచ–పాతర్లపాడు, అష్ణగుర్తి–పొద్దుటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం రూరల్ మండలంలో ఆకేరు ఉధృతితో గొల్లగూడెం–మంగళగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కారేపల్లి మండలంలోని కస్తూర్బా స్కూల్లోకి మద్దుల వాగు నీరు చేరగా అధికారులు అప్రమత్తమయ్యారు. అంతేకాక బోనకల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో కూడా వాగుల ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ–ఖమ్మం రహదారిపై పెద్ద వృక్షం నేలకూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. కల్లూరు మండలం చంద్రుపట్లలో ఓ పెంకుటిల్లు కూలింది. జలమయం ఎగతెరిపి లేని వర్షంతో ఖమ్మం నగరంతో పాటు అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఖమ్మం బైపాస్ రోడ్డు హెచ్పీ బంక్ ఏరియా, కొత్త బస్టాండ్, కమాన్బజార్, కస్బా బజార్, మయూరి సెంటర్, పాత బస్టాండ్, వైరా రోడ్డు, ఇల్లెందు క్రాస్, ఐటీ హబ్ ఏరియా, గాంధీచౌక్, వర్తక సంఘం ఏరియా, పొట్టి శ్రీరాములు రోడ్, హర్కారాబావి ఏరియా, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరింది. వర్షపు నీటికి తోడు డ్రెయిన్లు పొంగి రహదారులపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దెబ్బతిన్న పత్తి, వరి పంటలు తుపాను కారణంగా జిల్లాలో పత్తి, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జోరుగా పత్తితీతలు సాగుతున్న వేళ కురిసిన వర్షం నేలపాలు చేసింది. 2.51 లక్షల ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లినట్లు అంచనా. అలాగే, 2.98 లక్షల ఎకరాల్లో సాగైన వరి కంకి దశ నుంచి కోత దశలో ఉంది. ఈదురుగాలులకు తోడు వర్షంతో కోత దశలో వరి పైర్లు నేలవాలడమే కాక వరి కంకి మునగడంతో పంట దెబ్బతింటోంది.‘మోంథా’ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం -
పత్తి విక్రయాలపై వాన దెబ్బ
● ఇదే అదునుగా వ్యాపారుల దగా ● తేమ, నాణ్యత పేరిట ధర తక్కువగా నిర్ణయం ఖమ్మంవ్యవసాయం: పత్తి విక్రయాలకు మెంథా తుపాన్ ఆటంకంగా మారింది. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మంగళవారం పంట తీసుకొచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. కొందరు రైతులు షెడ్లలో, ఇంకొందరు యార్డు ఆరు బయట బస్తాలు దింపగా... వర్షం నుంచి రక్షించుకునేందుకు టార్పాలిన్లు కప్పారు. అయినా కొందరు రైతుల పత్తి తడిసింది. అయితే, రైతుల ఇక్కట్లను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు తేమ పేరిట దగా చేయడం గమనార్హం. మద్దతు ధరే లేదు... కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పొంతన లేకుండా వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేశారు. ఈ ఏడాది కేంద్రం పత్తి క్వింటాకు గరిష్టంగా రూ.8,110 ధర నిర్ణయించింది. కానీ వ్యాపారులు రూ.7వేలకు మించి చెల్లించడం లేదు. ఇప్పుడు తుపాన్ నేపథ్యాన మరికొంత కోత పెట్టారు. ఇదేమిటని అడిగితే పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పినా.. ఎక్కడా యంత్రాలతో పరీక్షించలేదు. ఖమ్మం మార్కెట్లో మంగళవారం మోడల్ ధర రూ.6,500గా పకలడంతో కేంద్రం నిర్ణయించిన ధరతో పోలిస్తే క్వింటాకు రూ.1,610 మేర రైతులు నష్టపోయారు. ఇక సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లినా తేమ శాతం అడ్డంకిగా నిలుస్తుండడంతో రైతులు చేసేదేం లేక వచ్చిన ధరకు అమ్ముకుని ఇంటిముఖం పట్టారు. అసలే ఈ ఏడాది దిగుబడి లేకపోగా, ఇప్పుడు ధర కూడా దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. ఖమ్మంలోని టపాలగూడెం బస్తీ దవాఖానాను మంగళవారం తనిఖీ చేసిన ఆమె ఓపీ, ఇమ్యూనైజేషన్ రిజిస్టర్లను పరిశీలించాక చికిత్స కోం వచ్చిన వారితో మాట్లాడారు. ఆతర్వాత వైద్యులు, సిబ్బందితో సమావేశమైన డీఎంహెచ్ఓ పనితీరు, ఆన్లైన్లో వివరాల నమోదుపై సూచనలు చేశారు.అనంతరం మల్లెమడుగు ఆమ్ సెంటర్ను సైతం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఖమ్మంమయూరిసెంటర్: మైనార్టీ విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం డిసెంబర్ 31లోగా ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహమ్మద్ ముజాహిద్ సూచించారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధులు, జైనులు, పార్సీలు అర్హులని తెలిపారు. ఈమేరకు www. telanganaepass. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 1న అండర్–14 ఫుట్బాల్ జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14 బాలబాలికల ఫుట్బాల్ జట్లను వచ్చేనెల 1న ఎంపిక చేయనున్నట్లు జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలోని సెడార్ వ్యాలీ స్కూల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని, వివరాలకు 99896 47696 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జర్మనీలో ఉద్యోగ అవకాశాలు ఖమ్మంరాపర్తినగర్: జర్మనీ దేశంలో ఉద్యోగావకాశాలు ఉన్నందున నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ సూచించారు. ఐటీఐ పూర్తిచేసి 19 – 30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఎలక్ట్రీషియన్లుగా అర్హులని తెలిపారు. తెలంగాణ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్కాం) ద్వారా ఈనెల 30న టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో జరిగే ఇంటర్వ్యూకు అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఎస్బీఐటీ అధ్యాపకురాలికి డాక్టరేట్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్బీఐటీ అధ్యాపకురాలు కె.యోజనకు తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ‘డీప్ లెర్నింగ్ బేస్డ్ అప్రోచ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆఫ్లాల్మిక్ ఇమేజెస్’ అంశంపై డాక్టర్ ఎల్.ధిలైరాని పర్యవేక్షణలో ఆమె సమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా యోజనను కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ, సెక్రటరీ, కరస్పాండెంట్ జి.ధాత్రి, డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్, జె.రవీంద్రబాబు, ప్రిన్సిపాల్ రాజ్కుమార్ అభినందించారు. కుటుంబ సభ్యులకు విద్యార్థిని అప్పగింత ముదిగొండ: ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన విద్యార్థిని ఆచూకీని ముదిగొండ పోలీసులు గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. నేలకొండపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ముదిగొండ మండలంలోని తన మేనత్త ఇంటికి రాగా, వచ్చి సోమవారం కానరాకుండా పోయిన విషయం విదితమే. ఈమేరకు సీఐ మురళి రెండు బృందాలు ఏర్పాటు చేసి గాలించగా మంగళవారం ఆమె కోదాడ బస్టాండ్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎస్సై హరిత, సిబ్బంది వెళ్లి విద్యార్థినిని తీసుకొచ్చి కుటుంబానికి అప్పగించారు. -
గ్రామీణులే లక్ష్యంగా మోసాలు
● పంజా విసురుతున్న సైబర్ నేరగాళ్లు ● ప్రభుత్వ పథకాల పేరిట రూ.లక్షల్లో స్వాహా ● భారీగా నష్టపోతున్న జిల్లా ప్రజలు ఖమ్మంక్రైం: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడని వారెవరూ కనిపించడం లేదు. అందరి చేతుల్లో ఇంటర్నెట్తో కూడిన ఫోన్ ఉండడమే కాక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం నిత్యావసర వస్తువుగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేరిట నమ్మిస్తూ నగదు స్వాహా చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ మోసాలకు పట్టణ వాసులే బలికాగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి ఫోన్ చేయడం.. రుణాలు, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామని నమ్మబలికి లింక్లు పంపిస్తున్నారు. అవి ఓపెన్ చేయగానే ఖాతాలోని నగదు మాయమవుతోంది. ఈనేపథ్యాన పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను ఇటీవల జరుగుతున్న ఘటనలు తెలియచేస్తున్నాయి. 258 కేసులు, రూ.12.80కోట్లు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నగదు మోసాలపై జిల్లాలో 258 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు రూ.12.80కోట్ల మేర నగదు కోల్పోయారు. ఇందులో రూ.3.60కోట్ల మేర పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు రికవరీ చేసినా మిగతా నగదు వస్తుందా, రాదా అన్న సంశయం నెలకొంది. ● సత్తుపల్లికి చెందిన ఓ కిరాణం వ్యాపారికి బ్యాంక్ మేనేజర్గా చెబుతూ వీడియో కాల్ చేసిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం మంజూరైందని నమ్మించాడు. అకౌంట్లో నగదు జమ చేసేందుకు ఓటీపీ చెప్పాలని సూచించడంతో సదరు చిరు వ్యాపారి ఓటీపీతో పాటు ఖాతా వివరాలు చెప్పగానే అకౌంట్లో రూ.70వేలు విత్డ్రా అయ్యాయని మెసేజ్ వచ్చింది. ● మధిర మండలంలోని ఓ గ్రామ రైతుకు ఫోన్ చేసిన వ్యక్తి పాల వ్యాపారానికి తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా రుణం ఇస్తామని చెప్పాడు. వీడియో కాల్ చేసిన వ్యక్తి మెడలో గుర్తింఉ కూడా ఉండడంతో నమ్మిన రైతు తన బ్యాంక్ ఖాతాపుస్తకం ఫొటోను వాట్సాప్ చేశాడు. సరిగ్గా పది నిమిషాల్లో ఆయన ఖాతా నుంచి రూ.లక్ష డ్రా అయినట్లు మెసేజ్ అందింది. ● రఘునాథపాలెం మండలానికి చెందిన ఒక రైతుకు పీఎం కిసాన్ పేరిట ఫోన్కు మెసేజ్ రూపంలో లింక్ రాగా ఓపెన్ చేయటంతో ఖాతా నుంచి రూ.50వేలు, అదే మండలంలోని ఇంకో రైతు ఖాతా నుంచి రూ.82వేలను సైబర్ నేరగాళ్లు మాయం చేశారు.సైబర్ నేరగాళ్ల రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల పేరిట లింక్లు పంపించడం, బ్యాంక్ ఖాతా, ఓటీపీ చెప్పాలని అడిగి క్షణాల్లో నగదు స్వాహా చేస్తున్నారు. అంతేకాక డిజిటల్ అరెస్ట్ పేరిట పోలీసు యూనిఫామ్లో ఉండి ఫోన్లు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా ప్రజలు స్పందించొద్దు. బ్యాంకు, ప్రభుత్వ శాఖల అధికారులు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడగరు. ఈ విషయాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. అంతేకాక సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తిస్తే మొదటి గంటలో పోలీసులకు సమాచారం ఇస్తే నగదు రికవరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. – ఫణీందర్, సైబర్ క్రైం డీఎస్పీ -
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
ఖమ్మంమయూరిసెంటర్: వచ్చేనెల 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఈ బస్సులో 36 పుష్బ్యాక్ సీట్లు ఉండగా, ఖమ్మం బస్స్టేషన్ నుంచి నవంబర్ 3వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. నవంబర్ 4వ తేదీ ఉదయం కాణిపాకంలో వినాయకుడి దర్శనం, గోల్డెన్ టెంపుల్(వెల్లూరు) దర్శనం అనంతరం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, శ్రీ స్వామి దర్శనం ఉంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.2,530గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వివరాలకు 91364 46666, 99592 25979, 99592 25965 నంబర్లలో సంప్రదించాలని ఆర్ఎం సూచించారు. -
రెండోరోజు 44 నామినేషన్ల దాఖలు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా44 నామినేషన్లు దాఖలయ్యాయి. కురువెళ్ల–గొడవర్తి ప్యానల్ అభ్యర్థులు మద్దతుదారులతో కలిసి ర్యాలీకి వర్తక సంఘం భవనానికి చేరుకున్నారు. అధ్యక్ష పదవికి కురువెళ్ల ప్రవీణ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్ష పదవికి కురువెళ్ల కాంతారావు, సహాయ కార్యదర్శి పదవికి బాదె రవి, కోశాధికారిగా తూములూరి లక్ష్మీనరసింహారావుతో పాటు మిర్చి, వెండి, బంగారం శాఖ పదవులకు బండారు వీరబాబు, చింతల రామలింగేశ్వరరావు, విజయగిరి సదానందచారి, బూర్లె లక్ష్మీనారాయణ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, అధ్యక్ష పదవికి కొప్పుల కోటేశ్వరరావు స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. కురువెళ్ల– గొడవర్తి ప్యానెల్కు ప్రస్తుత అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, గుర్రం ఉమామహేశ్వరరావు, చెరుకూరి కృష్ణమూర్తి, వేములపల్లి వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు కొప్పు నరేష్ తదితరులు మద్దతు తెలిపారు. తొలిరోజు 37, రెండో రోజు 44 కలిపి 81 నామినేషన్లు దాఖలు కాగా, బుధవారంతో గడువు ముగియనుందని ఎన్నికల అధికారి పీబీ.శ్రీరాములు తెలిపారు. ఆపై గురువారం పరిశీలించి, శుక్రవారం ఉపసంహరణ గడువు ముగిశాక బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఎన్నికల్లో నా జోక్యం లేదు ఖమ్మంఅర్బన్: చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రచారానికి కొందరు తన పేరు ఉపయోగిస్తుండడంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా తాను యూనియన్లు, సంఘాల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా అదే వైఖరి ఉంటుందని స్పష్టం చేశారు. చాంబర్ ఎన్నికల్లో ఎవరికీ తాను మద్దతు తెలపలేదనే విషయాన్ని గుర్తించాలని మంత్రి ఓ ప్రకటనలో సూచించారు. -
● బస్సుల్లో భద్రతపై ఆరా
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యాన ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి బయలుదేరుతున్న బస్సులను మంగళవారం తనిఖీ చేయడంతో పాటు రక్షణ చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు బయటకు వచ్చే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ పనితీరు, మంటలను ఆర్పేందుకు ఉపయోగించే సిలిండర్, అద్దాలు పగలగొట్టేందుకు సుత్తి ఉపయోగాన్ని వివరించారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
పశువుల వ్యాక్సినేషన్ పరిశీలన
వైరా: వైరా మున్సిపాలిటీ శివారు గండగలపాడులో పశువులకు గాలికుంటు వ్యాఽధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్యాధికారి బోడేపూడి శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా ఎన్ని పశులకు టీకాలు వేశారు, ఇంకా ఎన్నింటికి వేయాలనే అంశాన్ని రికార్డుల ఆధారంగా ఆరా తీశారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువుల్లో పాలదిగుబడి తగ్గిపోతుందనే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండల పశు వైద్యాధికారి రాకేష్కుమార్, ఉద్యోగులు కృష్ణకుమార్, సురేష్, రామలింగస్వామి, రాము, చుక్కారావు, రవీందర్, ఐవీ.ప్రకాశ్, గోపాలమిత్రలు పాల్గొన్నారుకోతుల గుంపు దాడితో ఆటో బోల్తా కల్లూరురూరల్: మండలంలోని ముగ్గు వెంకటాపురం శివారులో కోతుల గుంపు ఒక్కసారి రావడంతో అదుపు తప్పిన ఆటో బోల్తా పడింది. కుర్నవల్లి నుంచి ముత్తగూడెం వైపు మంగళవారం వెళ్తున్న ఆటో ముగ్గవెంకటాపురం శివార్లలోకి రాగానే రహదారి పక్కన ఉన్న కోతుల గుంపు ఆటోపైకి వచ్చింది. దీంతో డ్రైవర్ ఆందోళన చెందగా ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా స్థానికులు ముత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. ఐదు ఇసుక లారీలు సీజ్ ఖమ్మంక్రైం: ఖమ్మంలో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదు లారీలను మంగళవారం రాత్రి త్రీటౌన్ పోలీసులు సీజ్ చేశారు. ప్రకాష్నగర్ బ్రిడ్జి వద్ద సీఐ మోహన్బాబు ఆధ్వర్యాన తనిఖీ చేస్తుండగా లారీలు పట్టుబడ్డాయి. ఈమేరకు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో చోరీ సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం ప్రకాష్నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు భవనాల తాళాలు, తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. పాఠశాలలోని బీరువాలను పగులగొట్టగా, అంగన్వాడీ కేంద్రంలో పాల పాకెట్లు, నూనె, బాలామృతం ప్యాకెట్లు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులు సమాచారం ఇవ్వగా వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య తిరుమలాయపాలెం: కడుపునొప్పి తాళలేక ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని రఘునాథపాలెంకు చెందిన గౌని లింగరాజు(28) తల్లి అచ్చమ్మ వద్ద ఉంటూ కూలీ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో సోమవారం గడ్డి మందు తాగాడు. దీంతో లింగరాజును ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందడంతో, ఆయన కుటుంబీకుల పిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. -
నైరుతి సీజన్ తొలినాళ్లలో కొంత వెనకబాటు ఎదురైనా ఆ తర్వాత పుంజుకోవడం, ఆపై సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో జిల్లాలో వానాకాలం పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది. ప్రధానంగా వరి, పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయి. అయితే, పంట చేతికొచ్చే సమయాన నెలకొన్న వాతా
మెడపై కత్తిలా మోంథా...లక్ష్యానికి మించి సాగు జిల్లాలో జలవనరుల లభ్యతతో అన్ని పంటలు కలిపి 5,74,112.18 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 2,98,773.34 ఎకరాల్లో వరి, 2,51,980.28 ఎకరాల్లో పత్తి, 1,816.12 ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యాయి. కాపాడుకోవడం ఎలా? తుపాను ప్రభావం నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. సత్తుపల్లి, కూసుమంచి వ్యవసాయ డివిజన్లలో ముందుగా సాగు చేసిన వరి కోతలు ప్రారంభమయ్యాయి. సత్తుపల్లి వ్యవసాయ డివిజన్లో అత్యధికంగా 1.28 లక్షల ఎకరాల్లో, కూసుమంచి డివిజన్లో 74,969 ఎకరాల్లో వరి సాగైంది. ఈ డివిజన్లలోని కొన్నిచోట్ల పంట కోసి కల్లాల్లో ఆరబెడుతున్నారు. మరికొందరు మాత్రం తుపాను హెచ్చరికల నేపథ్యాన కోతలు వాయిదా వేస్తున్నారు. తుపాన్ పంజా మోంథా తుపాను జిల్లాపై విరుచుకుపడుతుందనే సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మంగళవారం, బుధవారంతోపాటు గురువారం ఉదయం వరకు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఉరుములతో కూడిన వర్షంతోపాటు 40 – 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించగా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాక రిజర్వాయర్లలోకి ఇన్ఫ్లో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాటుచేశారు. ఇక రైతులు కోసిన వరి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పుతున్నారు. పత్తి కూడా తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జిల్లాలో పత్తి, వరిపై తుపాన్ ప్రభావం నాలుగెకరాల్లో వరి కోతకు వచ్చింది. మబ్బులు చూస్తే వరి కోయించాలంటే భయమేస్తోంది. ఒకవేళ కోసినా ఎక్కడ ఆరబోయాలో తెలియడం లేదు. అధికారులు త్వరగా కొనుగోళ్లు మొదలుపెట్టడమే కాక టార్పాలిన్లు అందించాలి. – మరికంటి శంకర్, భైరవునిపల్లి, నేలకొండపల్లి మండలంఅకాల వర్షాలతో ఆరపెట్టే సమయం లేక పచ్చిఽ ధాన్యమే అమ్మాను. ప్రభుత్వం కేంద్రాల్లో క్వింటాకు రూ.2,389కు తోడు రూ.500 బోనస్ ఇస్తున్నా తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో వ్యాపారులకు క్వింటా రూ.1,400 చొప్పున కల్లంలోనే అమ్మేశా. – కందుల లక్ష్మణరావు, చెన్నూరు, కల్లూరు మండలం -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● మధిరలో భూగర్భ కేబుల్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన మధిర: రాష్ట్రమంతా భారీ వర్షాలు, తుపాన్ వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలో రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టే భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం నెరవేరడంలో విద్యుత్ శాఖే కీలకమని తెలిపారు. ఏ రంగం అభివృద్ధి సాధించాలన్నా నాణ్యమైన విద్యుత్ అవసరమని, అందుకే రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తూ బలోపేతం చేస్తున్నామని చెప్పారు. దశల వారీగా... మధిర ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తొలిదశలో రూ. 27.76కోట్లతో 3.5 కి.మీ. మేర 33 కేవీ లైన్, 17.3 కి.మీ. మేర 11 కే.వీ. లైన్, 15 కిలోమీటర్ల నిడివితో ఎల్టీ లైన్ను భూగర్భంలో వేస్తామని చెప్పారు. అలాగే, సబ్స్టేషన్ నుంచి ఆత్కూరు రింగ్ రోడ్డు, విజయవాడ రోడ్డులోని గ్యాస్ గోదాం(రెండు వైపులా), వైఎస్సార్ విగ్రహం నుంచి అంబారుపేట చెరువు వరకు ప్రస్తుతం ఉన్న 11 కే.వీ. ఓవర్ హెడ్ లైన్లను భూగర్భంలో మార్చేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అంతేకాక నందిగామ బైపాస్ రోడ్డు హెచ్పీ బంక్ నుండి డంప్ యార్డ్ వరకు భూగర్భ విద్యుత్ లైన్ పనులు చేపడతామన్నారు. తద్వారా విద్యుత్ తీగలు బయటకు ఎక్కడా కనిపించవని, విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరగవని తెలిపారు. అంతేకాక రోడ్ల వెంట మొక్కల పెంపకానికి అవకాశం ఏర్పడడంతో పాటు భారీ వర్షాలు, తుపాన్ల సమయాన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని చెప్పారు. కాగా, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వెళ్లేలా విద్యుత్ అంబులెన్స్లను సమకూర్చగా, 1912 నంబర్కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఆతర్వాత మడుపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, ఆర్అండ్ బీ ఈఈ తానేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బైపాస్ రోడ్డులో బారులు
● నిత్యం ట్రాఫిక్ సమస్యతో జనం ఇక్కట్లు ● నెలల తరబడి ఇదే పరిస్థితి ఖమ్మంరూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు మీదుగా ప్రయాణమంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సమయం, సందర్భం లేకుండా నిత్యం ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో గమ్యానికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఖమ్మం కాల్వొడ్డులోని పాత బ్రిడ్జి వద్ద తీగల వంతెన నిర్మాణంతో ద్విచక్ర వాహనాలనే అనుమతిస్తున్నారు. దీంతో మిగిలిన వాహనాలన్నీ కరుణగిరి బ్రిడ్జి పైనుంచే బైపాస్ రహదారిపైకి వచ్చివెళ్లాల్సి వస్తోంది. అన్ని వాహనాలు ఇటే... హెదరాబాద్, ఇతర జిల్లాల నుండి ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చే వాహనాలే కాక ఏపీ, ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిన వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్లాలి. అంతేకాక ఖమ్మం నగరానికి వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుండి వచ్చే ఆటోలు, కార్లు, ఇతర వాహనాలకు కూడా ఇదే ప్రధాన రహదారిగా కావడంతో కరుణగిరి వద్ద మున్నేటిపై బ్రిడ్జి, బైపాస్ రోడ్డులో నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అటు నాయుడుపేట సెంటర్ వరకు, ఇటు ఖమ్మంలోని కొత్త బస్టాండ్ వరకు ట్రాఫిక్ నిలిచిపోతుండగా.. పోలీసులు శ్రమించినా ఫలితం కానరావడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు సైతం లేక ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ సమస్య దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతుండడంతో బైపాస్ రోడ్డు మీదుగా ప్రయాణమంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో అంబులెన్స్లు సైతం నిలిచిపోతుండడం గమనార్హం. పాత బ్రిడ్జి వద్ద మున్నేటి మీదుగా ఆటోలు, చిన్న వాహనాలు వచ్చివెళ్లేలా రహదారి చేపడితే సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. ఈమేరకు అధికారులు దృష్టి సారించాలని వాహనదారులు, నగరవాసులు కోరుతున్నారు. -
చిరు జీవితాలకు చేయూత
● వీధి వ్యాపారులకు రుణలక్ష్యాలు ఖరారు ● జిల్లాలో 2,977 మందికి అవకాశం ● పాత వారికీ ఇచ్చేలా కార్యాచరణ ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం వీఽధి వ్యాపారులకు చేయూతనిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వీరికి రుణ సదుపాయం కల్పిస్తూ వ్యాపారాభివృద్ధిలో సహకారం అందించనుంది. నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వారితో పాటు గతంలో రుణం తీసుకుని తిరిగి చెల్లించిన వారికి మరో సారి రుణాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో కొత్తగా 2,977 మందికి రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అండగా నిలిచేందుకు.. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అనేకమంది తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు, సైకిళ్లపై వీధుల వెంట వ్యాపా రం చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. కొందరు చిరువ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారం నిర్వహణ కష్టంగా మారగా.. ఇంకొందరు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీతో రుణాలు తీసుకుంటున్నారు. తద్వారా వచ్చే ఆదాయం వడ్డీలకే పోతోంది. ఈనేపథ్యాన వీధివ్యాపారులు నష్టపోకుండా ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తోంది. ఇప్పటివరకు రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికే కాక కొత్తవారికీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఐదు మున్సిపాలిటీల్లో కొత్త వ్యాపారులను గుర్తించి రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీరికి మెప్మా ఆధ్వర్యాన గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తారు. 2025–26 ఏడాదికి జిల్లాలో 2,977 మందికి కొత్తగా రుణాలు ఇవ్వనుండగా, కేఎంసీ పరిధిలో అత్యధికంగా 1,912 మందికి రుణాలు అందజేస్తారు. రూ.15 వేల నుంచి.. వీధి వ్యాపారులకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు రుణసదుపాయం కల్పిస్తారు. తొలుత వ్యాపారులు మెప్మా అధికారుల ను కలిసి తమ వివరాలు తెలియజేయాలి. అలాగే ఆధార్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన ఫోన్ నంబర్, వ్యాపారానికి సంబంధించిన ఫొటోలు సమర్పించాలి. చేసే వ్యా పారం, వచ్చే ఆదాయం, అప్పు తీర్చడానికి ఉన్న మార్గాలను వివరిస్తే మెప్మా అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి బ్యాంక్ ద్వారా రుణం ఇప్పిస్తారు. మరోసారి కూడా.. కొత్తవారికి రుణాలు ఇవ్వడమే కాక గతంలో రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి మరో దఫా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఖమ్మం కార్పొరేషన్తోపాటు ఏదులాపురం, మధిర, కల్లూరు, సత్తుపల్లి, వైరా ప్రాంతాల్లోని వ్యాపారులను గుర్తించారు. ఒకసారి రుణం తీసుకుని చెల్లించిన వారిలో 1,337 మందికి, రెండుసార్లు రుణం తీసుకుని చెల్లించిన వారిలో 368 మందికి ఇంకో దఫా రుణాలు ఇవ్వనున్నారు.మున్సిపాలిటీ కొత్త రుణాలు రెండోసారి మూడోసారి పొందేవారు ఖమ్మం కార్పొరేషన్ 1,912 862 208 ఏదులాపురం 469 235 63 మధిర 155 80 30 కల్లూరు 182 91 27 సత్తుపల్లి 122 35 20 వైరా 137 34 20మొత్తం 2,977 1,337 368 -
డిప్లొమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంవైద్యవిభాగం: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే గడువును నవంబర్ 27వరకు పొడిగించినట్లు ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. మెడికల్ కాలేజీలో డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని వెల్ల డించారు. రెండేళ్ల కాల వ్యవధితో కొనసాగే ఈ కోర్సుల్లో బైపీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని, ఆతర్వాత ఎంపీసీ, ఇతర విద్యార్థులకు అవకాశం ఇస్తామని తెలిపారు. https://tspmb.telangana.gov దరఖాస్తు చేసుకుని, ఆ కాపీకి ధ్రువపత్రాలు కలిపి జత చేసి కళాశాలలో సమర్పించాలని, వివరాలకు https://gmc.khammam.org లో పరిశీలించాలని ప్రిన్సిపాల్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ ● ఓపెన్ హౌస్లో సీపీ సునీల్దత్ ఖమ్మంక్రైం: ప్రజల సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని, తద్వారా నేరాలు నియంత్రణలో ఉన్నాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాల(ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని మంగళవారం ఖమ్మంలోని సిటీ ఆర్మ్డ్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటుచేసిన ఓపెన్ హౌస్ను ఆయన ప్రారంభించారు. కేసుల విచారణలో ఫింగర్ ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ పనితీరు, బ్రీత్ ఎనలైజర్ పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాక సీపీ మాట్లాడారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు నర్సయ్య, సుశీల్సింగ్, ఆర్ఐ కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, సీఐ నరేష్, ఐటీ విభాగం ఉద్యోగి హేమనాధ్ పాల్గొన్నారు. ‘భవిత’ కేంద్రాల్లో ఆరోగ్యం, విజ్ఞానం కొణిజర్ల: భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల ఆరోగ్యం మెరుగుపరుస్తూనే విజ్ఞానం పెంపొందించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కొణిజర్లలోని భవిత కేంద్రంలో మరమ్మతు పనులు, సౌకర్యాల కల్పనను మంగళవారం ఆమె పరిశీలించారు. రూ.6.75 లక్షలతో టాయ్లెట్లు నిర్మించడమే కాక పెయింటింగ్ వేస్తుండగా పరిశీలించి సూచనలు చేశారు. చిన్నారులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణాలు నాణ్య తగా చేయించాలని ఆదేశించారు. ఎంఈఓ అబ్రహం, ఎంపీఓ ఉపేంద్రయ్య ఉన్నారు. -
నిండుకుండలా పాలేరు!
● ముంపు ఎదురుకాకుండా వరద మళ్లింపు ● కాల్వల భద్రత దృష్ట్యా ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేతకూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టమైన 23 అడుగులకు గాను మంగళవారం 22 అడుగులకు చేరడంతో జలకళ సంతరించుకుంది. ఈనేపథ్యాన మోంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్ష సూచన ఉండగా రిజర్వాయర్, కాల్వకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. గతేడాది సెప్టెంబర్ 1న భారీ వర్షాలతో రిజర్వాయర్ ఉప్పొంగి కాల్వలకు భారీ గండ్లు పడ్డాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పంటలకు నీటి అవసరం తగ్గడంతో రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ, పాలేరు కాల్వకు సరఫరా పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ భారీ వర్షాలు, వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక సాగర్ నుంచి రిజర్వాయర్కు నీటి సరఫరా నిలిపివేయాలని ఇక్కడి అధికారులు కోరడంతో మంగళవారం 1,600 క్యూసెక్కులకు తగ్గించగా రెండు రోజుల్లో ప్రవాహం పూర్తిగా నిలిచిపోనుంది. మిగులు జలాలు ఏటిలోకి... రిజర్వాయర్ నీటిమట్టం 22 అడుగులకు చేరగా ఎగువ నుంచి 1,100 క్యూసెక్కుల వరదతో పాటు సాగర్ నుంచి 1,600 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీనికి తోడు దిగువకు నీటి విడుదల నిలిపివేయగా రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట స్థాయిని దాటకుండా ఔట్ ఫాల్ గేట్ల(అలుగుల గేట్లు)ను కొంతమేర ఎత్తారు. దీంతో 1,500 క్యూసెక్కుల నీరు గేట్ల ద్వారా పాలేరు ఏటిలో కలుస్తోంది. తద్వారా రిజర్వాయర్ నీటిమట్టాన్ని 20 అడుగులుగా క్రమబద్ధీకరించనునున్నారు. అయితే, తుపాన్ ప్రభావం తగ్గాక ఆయకట్టుకు తిరిగి నీరు విడుదల చేస్తామని అఽధికారులు తెలిపారు. -
ఎందుకోసం ఈ సమావేశం?
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించేందుకు జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ(దిశ) కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేయగా, నిర్వహణ లోపాలపై ఖమ్మం ఎంపీ, కమిటీ చైర్మన్ రామసహాయం రఘురాంరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేని సమయాన ఏర్పాటుచేయడమే కాక పలువురు ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2–10 గంటలకు కలెక్టరేట్కు ఎంపీ రాగా ఉన్నతాధికారులు లేకపోవడంతో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చాంబర్కు వెళ్లి అయనతో కలిసి 2–20 గంటలకు హాల్కు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు లేకపోవడంతో సమావేశం నిర్వహణ ఎలా సాధ్యమని వాఖ్యానించారు. ఏదైనా సమస్య ఉంటే రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, కానీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పి రాకపోవడం సరికాదని తెలిపారు. ‘మంత్రుల కార్యక్రమాలు ఉన్నాయని రెండు రోజుల ముందే తెలుసు.. ఆ కార్యక్రమాలకు వెళ్లొద్దని చెప్పడం లేదు.. కానీ అధికారులు వారి సలహా తీసుకుని సమన్వయంతో సమావేశాలు నిర్వహించాలి’ అని సూచించారు. దిశ కమిటీ సమావేశంతో మెరుగైన ఫలితాలు రావాలంటే ఎమ్మెల్యేలు, అధికారుల హాజరు తప్పనిసరని ఎంపీ తెలిపారు. అజెండా ప్రారంభించగానే.. దిశ కమిటీ సమావేశంలో తొలుత డీఆర్డీఓ సన్యాసయ్య గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను తెలపాలంటూ పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు నిర్ణయాలను వెల్లడించాక విద్యాశాఖ నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంపీ సూచించగా ఆ శాఖ నుంచి ఎవరూ లేరు. ఆ తర్వాత వరుసగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీ అధికారులను పిలిచినా వారూ రాలేదు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీ రఘురాంరెడ్డి సమావేశానికి వచ్చేందుకు ఆయా శాఖల్లో ఒక్క అధికారి కూడా లేరా అని ప్రశ్నించారు. ‘నాది ఒక సజెషన్.. ఇక్కడకు వచ్చిన అధికారులు ఇన్కన్వినెన్స్గా భావించకండి.. పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు ఉన్నప్పుడే సమావేశాన్ని నిర్వహించుకుందాం.. అప్పటివరకు తాత్కాలికంగా వాయిదా వేయండి’ అని సూచిస్తూ ఎంపీ వెళ్లిపోయారు. ఎంపీ వెళ్లిన తర్వాత.. సమావేశం 2–20 గంటలకు ప్రారంభం కాగా.. అధికారులు లేకపోవడంతో వాయిదా వేస్తూ పది నిమిషాల్లో ముగించారు. ఆపై ఎంపీ వెళ్లిపోయాక వైరా మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు చేరుకున్నారు. వైరా కమిషనర్ రిజిస్టర్లో సంతకం చేసేందుకు ప్రయత్నించగా ఎంపీ పిలిచిన సమయంలో లేకుండా ఇప్పుడు సంతకం చేయొద్దని అధికారులు చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇతర అధికారులు కూడా సమావేశం వాయిదా పడిందని తెలిసి వెనుదిరిగారు. -
మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు
కల్లూరురూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిరోజు వేడుకలను మంగళవారం జిల్లాలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యాన నిర్వహించారు. పలుచోట్ల పేదలకు అన్నదానం చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు. మంత్రి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో ఆయన తల్లి స్వరాజ్యమ్మ కేక్ కట్ చేశారు. కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవి, నాయకులు అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కనకదుర్గమ్మ, భాగం ప్రభాకర్, కాటేపల్లి కిరణ్కుమార్, రవికుమార్, తక్కెళ్లపల్లి దుర్గాప్రసాద్, కీసర శ్రీనివాసరెడ్డి, లక్కిరెడ్డి ఏసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మా కష్టం పగోళ్లకూ రావొద్దు
ముదిగొండ: ఇలాంటి కష్టం పగోళ్లకూ రావొద్దని ఇటీవల కర్నూలులో బస్సు కాలిపోయిన ఘటనలో మృతి చెందిన యువకుడు చిట్టోజు మేఘనాథ్ తండ్రి శ్రీనివాసాచారి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈనెల 24న జరిగిన ప్రమాదంలో మేఘనాథ్ సజీవ దహనం కాగా, డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీనివా సాచారి – విజయలక్ష్మికి సోమవారం అప్పగించా రు. దీంతో స్వగ్రామమైన ముదిగొండ మండలం వల్లభికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించగా తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యా రు. చేతికందిన కొడుకు కుటుంబానికి నిలుస్తాడని భావిస్తే కానరాని లోకాలకు వెళ్లాడంటూ రోదించారు. ఇలాంటి కష్టం మరెవరికీ రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్సు ప్రమాద మృతుడి తండ్రి ఆవేదన -
దేశ సేవే బీజేపీ ప్రధాన ధ్యేయం
ఖమ్మం మామిళ్లగూడెం: దశసేవే భారతీయ జనతా పార్టీ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తెలిపారు. ‘బీజేపీ సిద్ధాంతం – సంస్థాగత అంశాలు’ అంశంపై జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం ఖమ్మంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీజేపీ కేవలం ఒక పార్టీ కాదని, దేశసేవకు అంకితమైన జాతీయ ఉద్యమ స్వరూపమని తెలి పారు. అధికారం కంటే సేవాభావం ముఖ్యమనే అంశాన్ని కార్యకర్తలు గుర్తించాలని సూచించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తెలిపారు. అంతేకాక బూత్ స్థాయి వరకు పార్టీ బలపడేలా శ్రమించాలని వాసుదేవరావు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా, మండలాల నాయకులు పాల్గొన్నారు. విధుల్లోకి ఆరుగురు ఎంపీడీఓలుఖమ్మం సహకారనగర్: ఇటీవల గ్రూప్–1 ద్వారా ఎంపీడీఓలుగా ఎంపికై న ఆరుగురిని జిల్లాకు కేటాయించారు. వీరికి సోమవారం కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వగా బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు కూసుమంచిలో టి.జశ్వంత్, ఏన్కూరులో పి.భాగ్యశ్రీ, కొణిజర్లలో జి.వర్ష, వేంసూరులో డి.కావ్య, తల్లాడలో డి.సోనియా, ఖమ్మం రూరల్ ఎంపీడీఓగా కె.రవికుమార్ విధుల్లో చేరారు. రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు -
‘చాంబర్’ నామినేషన్ల పర్వం ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ సోమవా రం మొదలైంది. ఆఫీస్ బేరర్లు, ప్రధాన పదవులతో పాటు 18శాఖలకు నవంబర్ 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు మూడురోజుల పాటు నామినేష న్లు స్వీకరించనుండగా కార్తీక సోమవారం కావడంతో వివిధపదవులకు 37మంది నామినేషన్లు దాఖలు చేశా రు. సహాయ కార్యదర్శి పదవికి ముత్యం ఉప్పల్రా వు, కోశాధికారి పదవికి కై లాసపు వేణుగోపాల్రావుతో పాటు కేంద్ర కార్యవర్గ పదవికి పోట్ల రామనాథం నామినేషన్లు సమర్పించారు. అంతేకాక దిగుమతిశాఖ పదవులకు అధికంగా 24 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇక అధ్యక్ష పదవికి వడ్డే వెంకటేశ్వర్లు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోలేటినవీన్, కార్యదర్శి పదవికి సోమారపు సుధీర్కుమార్, ఆత్మకూరి రామారావు, ఎర్ర అప్పారావు, మిర్చిశాఖ అధ్యక్ష పదవికి మెంతుల శ్రీశైలం, కార్యదర్శి పదవికి ఎడ్లపల్లి సతీష్తో పాటు కార్యవర్గ పదవులకు ఇద్దరు, ఎగుమతిశాఖ అధ్యక్ష పదవికి మన్నెం కృష్ణ నామినేషన్లు దాఖలు చేశారు. మంగళ, బుధవారం నామినేషన్ల స్వీకరించాక పరి శీలన, ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామని ఎన్నికల అధికారి పీ.బీ. శ్రీ రాములు తెలిపారు. -
డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తా
సాగర్ కాల్వలో పడడంతో ఊపిరి ఆడక ఒకరు మృతిసత్తుపల్లి(పెనుబల్లి): జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఒడిస్సా రాష్ట్రం కొరట్ ప్రాంతానికి చెందిన ప్రిన్స్, రేణుక, అనిల్కుమార్(26) ముగ్గురు కారులో చైన్నెకు వెళ్తున్నారు. వీరి వాహనం పెనుబల్లి మండల కేంద్రంలో విజ యవాడ – జగదల్పూర్ నేషనల్ హైవేపై ఆది వా రం అర్ధరాత్రి వెళ్తుండగా డివైడర్లు మొదలైన ప్రాంతం వద్ద సెంట్రర్ లైటింగ్, సూచిక బోర్డులు లేకపోవడంతో వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ పక్కనే సాగర్ కాల్వలో పడింది. ముందు సీట్లో కూర్చున్న అనిల్కుమార్ సీట్బెల్ట్ తీయడం సాధ్యం కాక ఛాతివరకు నీటిలో మునగడంతో ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కారులో ఉన్న మరో ఇద్దరిని బయటకు తీసి పెనుబల్లి ఆస్పత్రి తరలించారు. జాతీయ రహదారిపై మొదలవుతున్న చోట కనీసం సూచిక బోర్డులు, సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు వీ.ఎం.బంజరు ఎస్సై వెంకటేష్ తెలిపారు. పింఛన్ కోసం వెళ్తూ .. తిరుమలాయపాలెం: పింఛన్ నగదు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్తున్న వృద్ధుడు మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. మండలంలోని పిండిప్రోలుకు చెందిన గోకినపల్లి శేషయ్య(65) సోమవారం మధ్యాహ్నం పిండిప్రోలులోని పింఛన్ నగదు కోసం ఐఓబీకి నడిచి వెళ్తున్నాడు. మరిపెడ నుంచి ఖమ్మంకు వేగంగా వెళ్తున్న కారు ఆయనను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన శేషయ్యను తిరుమలాయపాలెం సీహెచ్సీకి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చికిత్స పొందుతున్న మహిళ.. చింతకాని: అనారోగ్య కారణాలతో పురుగుల మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని నాగిలిగొండకు చెందిన పి.సీతమ్మ(55) భర్త పదేళ్ల క్రితం చనిపోగా, కుమారుడు నరేష్ వద్ద ఉంటుంది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మనస్థాపంతో ఈనెల 19న పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. ఆపై 26వ తేదీన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్సపొందుతూ సోమవారం చనిపోయింది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. -
జాతీయ టీ.టీ.టోర్నీకి ముగ్గురి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ఈనెల 29 నుంచి జరగనున్న జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీకి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. పురుషుల విభా గంలో రెడ్డిసాయి శివ, అండర్–17లో పరిటా ల జ్వలిత్, పిట్టల మోహిత్ తెలంగాణ జట్టు తరఫునపోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నా రు. ఈమేరకు క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్కుమార్, వి.సాంబమూర్తి అభినందించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో రెండు పతకాలు బోనకల్: రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీలో జానకీపురం గ్రామానికి చెందిన గద్దల సిరి బంగారు పతకం సాధించింది. ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె మేడ్చల్లోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇటీవల జరిగిన అండర్–17 బాలికల విభాగం టోర్నీలో పాల్గొనగా.. డబుల్స్లో గోల్డ్మెడల్, సింగిల్స్లో రజత పతకం సాధించింది. ఆమెను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కోచ్ సాంబమూర్తి, టేబుల్టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలసాని విజయ్కుమార్ అభినందించారు. విచారణ అధికారిగా డిప్యూటీ సీఈఓ ఖమ్మం సహకారనగర్: కూసుమంచిమండలం నర్సింహులగూడెం ఎంపీయూపీఎస్ పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఉపాధ్యాయుడిని ఇటీవల డీఈఓ సస్పెండ్ చేశారు. అంతేకాక విద్యార్థినుల తల్లి దండ్రుల ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదైంది. అయితే, పూర్తిస్థాయిలో విచారణ కోసం జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజను నియమి స్తూ డీఈఓ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వచ్చేనెల 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. పశువులకు టీకాలు తప్పనిసరి ముదిగొండ: గాలికుంటు వ్యాధి సోకకుండా పశువులకు తప్పనిసరి టీకాలు వేయించాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరమణి సూచించారు. మండలంలోని చిరుమర్రి, వల్లాపురం, ఖానాపురం గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వనంవారి కిష్టాపురం వైద్యాధికారి మన్యం రమేష్ ఆధ్వర్యాన సోమవారం వేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన శ్రీరమణి మాట్లాడుతూ వ్యాధి సోకకుండా ముందస్తుగా రైతులు తమ పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. బ్యాటరీ దొంగల ముఠా అరెస్ట్ ఖమ్మంఅర్బన్: వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న ముగ్గురితో కూడిన ముఠాను ఖమ్మం అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఖమ్మంలోని చెరుకూరి గార్డెన్స్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఖమ్మం వైపు నుంచి వస్తున్న ఆటోలో ముగ్గురు అనుమానాస్పదంగా కకనిపించారు. దీంతో వారిని విచారించగా పలు వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేసినట్టు ఒప్పుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో పాటు జల్సాలకు ఖర్చుల కోసం చోరీల బాట పట్టినట్లు తేలగా ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటకు చెందిన గుడెల్లి సాయి, పెండ్ర సాయికుమార్, అభిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఖమ్మం అర్బన్తో పాటు వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీ చేయగా, రూ.1.80లక్షల విలువైన ఆటో, 12 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని సీఐ భానుప్రకాశ్ వెల్లడించారు. గోదావరి ఎక్స్ప్రెస్ రద్దు ఖమ్మం రాపర్తినగర్: తుపాన్ సూచనలతో ఖమ్మం మీదుగా వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును రెండు పక్కలా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వెళ్లే ఇతర రైళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. కాగా, గోదావరి రైలును ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారు, మిగతా రైళ్లు ఎప్పటి వరకు కొనసాగుతాయో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. 76 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి మీదుగా వాహనంలో తరలిస్తున్న 76క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నా డు. గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి ఖమ్మం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు వ్యాన్ను సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకితీసుకున్నామని ఎస్సై వీరేందర్ తెలిపారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన నడ్డి శాంతకుమార్(26) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. ఇరవై రోజుల అనంతరం స్థానికులు గుర్తించారు. మండలంలోని బయన్నగూడెం వద్ద నేషనల్ హైవే పక్కన మామిడి తోటలో సోమవారం ట్రాక్టర్తో దున్నుతుండగా పూర్తిగా కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుండడాన్ని ట్రాక్టర్ డ్రైవర్ గుర్తించాడు. ఈమేరకు అందిన సమాచారంతో వీ.ఎం.బంజరు ఎస్సై వెంకటేష్ చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి దుస్తుల ఆనవాళ్లతో శాంతకుమార్గా గుర్తించారు. ఆయన ఇరవై రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా వెళ్లాడని, ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదని కుటుంబీకులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో.. కూసుమంచి: మండలంలోని నర్సింహులగూడెంకు చెందిన కొక్కిరేణి ఎర్రయ్య (30) సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఆయన భార్యతో గొడవ జరగగా మనస్తాపంతో బలవన్మరనానికి పాల్పడ్డాడని ఎర్రయ్య తల్లి ఫిర్యాదుతోకేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. లేఖ రాసి విద్యార్థిని అదృశ్యం ముదిగొండ: నేలకొండపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని కానరాకుండా పోయిన ఘట నపై ముదిగొండలో సోమవారం కేసు నమోదైంది. నేలకొండపల్లిలోని ఓప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కొద్దిరోజులుగా కాలేజీకి వెళ్లకపోవడంతో ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు ఇచ్చారు. దీంతో ఆమెను మందలించడమే కాక రెండురోజుల తర్వాత పంపిస్తామని ముది గొండలోని అమ్మమ్మ ఇంటికి పంపించారు. అయితే, ‘నేను ఓఅబ్బాయిని ప్రేమిస్తున్నా, ఆఅబ్బాయిని ఏమీ అనవద్దు.. అంటే చనిపోతాను’ అని లేఖ రాసి ఎవరూ లేని సమయాన వెళ్లిపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ ఓ.మురళి తెలిపారు. చేపల చెరువులో విషప్రయోగం కారేపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు చేపల చెరువులో పురుగుల మందు కలిపి విషప్రయోగానికి పాల్పడ్డా రు. మండలంలోని మాధారంచేపల చెరువులో ఆది వారం రాత్రి దుండగులు పురుగుల మందు కలపగా రూ.10లక్షలవిలువైన చేపలు చనిపోయాయని మత్స్యకారులు వాపోయారు.ఈమేరకు వారి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. కల్లూరు డిప్యూటీ డీఎంహెచ్ఓ సరెండర్ ? ఖమ్మవైద్యవిభాగం: కల్లూరు డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారామ్ను సరెండర్ చేసినట్లు తెలిసింది. విధుల్లో అలసత్వం ప్రదర్శించినట్లు తేలడంతో ఆయనను వైద్య, ఆరోగ్యశాఖకు సరెండర్ చేస్తూ కలెక్టర్ అనుదీప్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.ఇరవై రోజుల అనంతరం గుర్తింపు -
దరఖాస్తులకు సత్వర పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన శ్రీజ మాట్లాడు తూ ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఏవైనా దరఖాస్తులు తిరస్కరిస్తే అందుకు కారణాలు తెలియచేయాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ ఇప్పించండి దివ్యాంగుడైన తన కుమారుడు కొండపల్లి యల్ల య్య పదేళ్లుగా వస్తున్న పింఛన్ను ఇటీవల నిలిచివేశారని ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంకుకు చెందిన సాలమ్మ, ఫిర్యాదు చేశారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన పెన్షన్ను పునరుద్ధరించాలని కోరింది. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజ -
ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యత అవసరం
● వీరిని చీల్చి అందలం ఎక్కుతున్న పార్టీలు ● రథయాత్రలో టీఆర్ఎల్డీ అధ్యక్షుడు ‘కపిలవాయి’ఖమ్మంమామిళ్లగూడెం: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యత చారిత్రక అవసరమని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. ఆయా వర్గాలకు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు డబ్బు, మందు ఎర చూపి ఓట్లను చీల్చి అందలం ఎక్కుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎల్డీ ఆధ్వర్యాన చేపట్టిన రథయాత్ర సోమవారం ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం, పంట బీమా, ధాన్యం కొనుగోళ్లు, యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అంతేకాక నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. ఉమ్మడి జిల్లాలో సింగరేణి ఓపెన్కాస్ట్ పనులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కాగా, తమ పార్టీ ఆధ్వర్యాన త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో జాబ్మేళాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూలడం ఖాయం రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోనుందని దిలీప్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలవికాని హామీలతో గద్దెనెక్కగా, మంత్రుల తీరుతో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ఈమేరకు కమీషన్ల కోసమే పనిచేస్తున్నమంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాక 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా చట్టం చేయాలని అన్నారు. అంతేకాక విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని, రాజీవ్ యువవికాసం పథకాన్ని అమలు చేయడంతో పాటు కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం, గృహలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, యువతులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎల్డీ నాయకులు గౌర బీరప్ప, మోత్కూరి వెంకటాచారి, గంట్యాల నరసింహారావు, నూనె భాస్కరరావు, రిషబ్ జైన్, ఎస్.కే. జానీ మహ్మద్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథయాత్రలో వెంకన్న ఆధ్వర్యాన పలువురు కళాకారులు, కార్యకర్తలు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
లక్కీ భాస్కర్లు!
● వైన్స్ టెండర్లలో ఈసారి కొత్త ముఖాలకే అదృష్టం ● గిరాకీ ఉండే షాపుల కోసం సిండికేట్ల బేరసారాలు ● కలెక్టర్ నేతృత్వాన 116 వైన్స్కు లక్కీ డ్రాఖమ్మంక్రైం: సిండికేట్గా ఏర్పడిన 15మంది కలిసి 15 వైన్స్ టెండర్లు దాఖలు చేస్తే ఒక్క షాపూ దక్కకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఇంకో 17మంది 17 షాపులకు దరఖాస్తు చేస్తే మూడే షాపులు రావడంతో వచ్చిందే చాలు అన్నట్లు సంతోషించారు. ఇదేక్రమంలో ఓ వ్యక్తి రెండు దుకాణాలకు టెండర్లు వేస్తే డ్రాలో ఒకటి తగలడంతో ఆనందపడ్డాడు. ఇవీ ఖమ్మంలో సోమవారం జరిగిన వైన్స్ టెండర్ల ప్రక్రియలో చోటు చేసుకున్న సన్నివేశాలు! నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ కేటాయింపునకు దాఖలైన టెండర్ల నుంచి డ్రా తీశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డ్రా ప్రారంభించడంతో పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యవేక్షించారు. ఈసారి పలువురు వ్యాపారులు తమ కుటుంబీకుల పేరిట కూడా టెండర్లు వేయడంతో హాల్లో మహిళలు, యువతులు ఎక్కువగా కనిపించారు. సిండికేట్లకు నిరాశ ఈసారి గతంలో మాదిరి సిండికేట్ల ఆశలు ఫలించలేదు. పాతమద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి వివిధ ప్రాంతాల షాపుల కోసం టెండర్లు వేశారు. కానీ అందులో చాలామందికి నిరాశే ఎదురుకాగా.. కొత్తగా మద్యం వ్యాపారంలోకి వస్తున్న వారికి మాత్రం షాపులు దక్కాయి. ఓ ప్రాంతానికి చెందిన సిండికేట్ వ్యాపారులు 15కు పైగా షాపులకు టెండర్ వేస్తే ఒక్కటీ రాకపోవడంతో బెంబేలెత్తిపోయారు. మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న ఇంకో వ్యాపారి 18 షాపులకు దరఖాస్తు చేసినా నిరాశే ఎదురైంది. కొత్తగా వ్యాపారంలో అడుగు పెట్టిన ఓ వ్యక్తి రెండు దుకాణాలకు తన భార్య పేరిట దరఖాస్తు చేస్తే ఒక షాపు దక్కింది. అలాగే, ఇంకో వ్యక్తి తన కుమార్తె పేరుతో రెండు వైన్స్కు దరఖాస్తు వేయగా డ్రాలో ఒకటి డ్రాలో రావడం విశేషం. వైన్స్ డ్రా జరుగుతుండగానే సిండికేట్ల బాధ్యులు బేరసారాలు మొదలుపెట్టారు. అనుకున్న స్థాయిలో తమకు షాపులు రాకపోవడం, డ్రాలో గెలుపొందిన వారితో చర్చించారు. వ్యాపారం ఆధారంగా ఒక్కో షాప్నకు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఇవ్వడానికై నా సిద్ధమయ్యారు. మరికొందరు తమకు షాపులు అప్పగించడంలో సహకరిస్తే కమీషన్ ఇస్తామంటూ చోటామోటా నాయకులతో పైరవీలు చేయిస్తున్నారు. కాగా, వైన్స్ దక్కించుకున్న వారు మొదటి విడత లైసెన్స్ ఫీజు రూ.10.50 లక్షలు చెల్లించేందుకు మంగళవారం వరకు అవకాశం కల్పించారు. దీంతో షాప్ల కోసం బేరసారా లు సాగిస్తున్న సిండికేట్ల బాధ్యులు ఆ ఫీజు తామే చెల్లిస్తామని చెప్పడం కనిపించింది. కాగా, డ్రా ప్రక్రియలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, జిల్లా అధికారి నాగేందర్రెడ్డి, ఏఈఎస్ వేణుగోపాల్రెడ్డి, సీఐ కృష్ణ తదితరులు పాల్గొనగా ఖమ్మం వన్టౌన్ సీఐ కరుణాకర్, ఎస్ఐ మౌలానా, ఆర్ఐ సాంబశివరావు ఆధ్వర్యాన బందోబస్తు నిర్వహించారు. -
బకాయిలు చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం
ఖమ్మం సహకారనగర్: పెన్షనర్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని పలువురు వక్తలు అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్జీపీఏటీ) జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య అధ్యక్షతన సోమవా రం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వ తీరుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరికి చికిత్స అందక మృతిచెందుతున్నారని తెలిపారు. దాదాపు 18 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం సరి కాదని చెప్పారు. తొలుత ధర్నాను సంఘం రాష్ట్ర కార్యదర్శి మేరీ ఏసుపాదం ప్రారంభించగా కలెక్టరేట్లో డీఆర్వో కు వినతిపత్రం సమర్పించారు. వివిధ పార్టీలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు బాగం హేమంతరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కె.విజయ్, వి. మనోహర్రాజు, ఎస్.కే.కరీం, కళ్యా ణం నాగేశ్వరరావు, ఆవుల అశోక్, ఏ.విద్యాసాగర్, జల్లా వెంకటేశ్వర్లు, రాయల రవికుమార్, ఐవీ.భాస్కరాచారి, శ్యాంసుందర్, జి.లక్ష్మయ్య, భద్రయ్య, గుర్రాల శ్రీనివాసరావు, పెదమళ్ల సత్యనారాయణ, కె.శరత్బాబు, ఊడుగు వెంకటేశ్వర్లు, బోజడ్ల కృష్ణకుమారి, తాడి అంజలి, లక్ష్మీసుజాత, అన్నమ్మ, రాధాకృష్ణమూర్తి, ప్రసాదరావు పాల్గొన్నారు. -
గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్
ఇల్లెందు: ఎస్పీ రోహిత్రాజ్ ఆదేశాల మేరకు ఇల్లెందు సీఐ టి.సురేశ్ గంజాయి సరఫరా చేసే సపావత్ వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాశీరాంతండాకు చెందిన సపావత్ వెంకన్న గంజాయి సరఫరా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లా జైలులో ఉన్న వెంకన్నపై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడిపై భద్రాచలం, దుమ్ముగూడెం, రాజేంద్రనగర్, ఇల్లెందు తదితర పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదై ఉన్నాయి. గత ఏడాది ఇల్లెందు పోలీసులు వెంకన్నను అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో వెంకన్నను అరెస్ట్ చేయగా.. చాకచక్యంగా తప్పించుకున్నాడు. పట్టణం దాటక ముందే ఆనాటి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. తాజాగా వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి, అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ సురేశ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ రోహిత్రాజ్ అభినందించారు. గంజాయి అడ్డాలపై నిఘారఘునాథపాలెం: మండలంలోని రౌడీషీటర్లు, గంజాయి, మాదక ద్రవ్యాల అడ్డాలపై పోలీసులు దృష్టి సారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు రెండు రోజులుగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. రౌడీషీటర్ల చిరునామాల ప్రకారం వారి నివాసాలను సందర్శించి, వారు ఎక్కడ ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు? రోజువారీ దినచర్య ఏంటన్న అంశాలపై సమాచారం సేకరించా రు. మండల పరిధిలోని కొన్ని ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే సమాచారం నేపథ్యంలో ఆ ప్రదేశాలను కూడా పోలీసులు పరిశీలించారు. యువకులు తరచుగా రాకపోకలు సాగిస్తున్న హాట్స్పాట్లపై నిఘా ఏర్పాటు చేసి, వ్యక్తుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు పోలీసులు చెప్పా రు. రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 17మంది రౌడీషీటర్లు జాబితాలో ఉన్నారని, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచి ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించారు. పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలుకూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈదాడిలో ఉదయం గ్రామానికి చెందిన ఓ బాలుడు గాయపడ్డాడు. సాయంత్రం గ్రామ పంచాయతీ కార్మికుడు గోపె నాగయ్యపై దాడిచేయగా నుదుటిన తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని పశువులు, మేకలను కరిచి గాయపర్చటంతోగ్రామస్తులు కుక్కను వెంబడించి హతమార్చారు. ఎలుకల మందు తిని వృద్ధురాలు మృతిఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలు ఎలుకల మందు తిని చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భానుప్రకాశ్ కథనం ప్రకారం.. రామన్నపేట కాలనీలో నివసించే షేక్ హిమాంబీ (62) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయింది. శనివారం ఆమె ఇంట్లోనే ఎలుకల మందు తిన్నది. గమనించిన బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు జానీమియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. చికిత్స పొందుతున్న చిన్నారి మృతికారేపల్లి: పేస్ట్ అనుకుని ఎలుకల మందు తిన్న చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మండలంలోని గోవింద్తండాకు చెందిన ధరావత్ మానస (3) ఈ నెల 17న ఇంట్లో పేస్ట్ అనుకొని ఎలకలమందు తిన్నది. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆదివారం పరిస్థితి విషమించి మృతి చెందింది. చిన్నారి తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చేతి వృత్తులకు చేయూతనిద్దాం..
ఖమ్మంమామిళ్లగూడెం: స్థానిక చేతివృత్తిదారులను ఆదుకోవడం ద్వారా స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని బీజేపీ జాతీయ నాయకుడు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం మేదరబజార్ ప్రాంతాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావుతో కలిసి సందర్శించారు. చేతివృత్తిదారులు తయారు చేస్తున్న వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. స్థానిక కళాకారులు కనికరపు విజయలక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు తయారు చేసిన వెదురు బుట్టలు, అలంకార వస్తువులను కొనుగోలు చేసి, మాట్లాడారు. దేశాభివృద్ధి అంటే కేవలం సాంకేతిక రంగం కాదని, ప్రతి వృత్తిదారుడి కృషి కూడా ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులనే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి డి.వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శులు నల్లగట్టు ప్రవీణ్కుమార్, నాయుడు రాఘవరావు, నాయకులు నున్న రవికుమార్, రంగా కిరణ్, గడిల నరేశ్, పాలెపు రాము, ఏలూరి నాగేశ్వరరావు, రుద్రప్రదీప్, గుగులోతు నాగేశ్వరరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సత్తుపల్లిలో బీసీ బంద్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైరాకు చెందిన టీజేఏసీ వైరా మండల అధ్యక్షుడు షేక్ పాషా పార్టీలో చేరగా సుధాకర్రెడ్డి కండువా కప్పారు. అనంతరం శ్రీరక్ష వైద్యశాలలో చికిత్స పొందుతున్న బానోతు విజయను పరామర్శించారు, తర్వాత 57వ డివిజన్లోని కనమర్లపూడి ఉపేందర్ ఇంటి వద్ద మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దొంగల సత్యనారాయణ, కిరణ్, వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరావు, నలగట్టు ప్రవీణ్ కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి -
రాష్ట్రస్థాయి టీటీ టోర్నీలో ప్రతిభ
ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్లోని డీఆర్ఎస్ పబ్లిక్ స్కూల్లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీ ల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–11 బాలురలో జాయ్ ఇమ్మాన్యుయేల్ ద్వితీయస్థానం, అండర్–13 సింగిల్స్లో షేక్ సహాయల్ ఫజల్ ప్రథమ, అండర్–15 బాలురులో గౌరిశెట్టి చార్విక్ తృతీయస్థానం దక్కించుకున్నారు. అండర్–17 బాలురలో పరిటాల జలిత్ సింగిల్స్లో టైటిల్ను దక్కించుకోగా, పిట్టల మోహిత్ కృష్ణ తృతీయస్థానంలో.. అదే డబుల్స్ విభాగంలో ప్రథమస్థానంలో నిలిచాడు. బాలికల అండర్–17లో గద్దల సిరి ద్వితీయస్థానం, డబుల్స్లో ప్రథమస్థానంలో నిలిచింది. అండర్–13లో బొంతు సాయిశివాని ద్వితీయ, వి.సౌమ్య సింగిల్స్లో ప్రథమస్థానం, అండర్–13లో ఈలప్రోలు హరి, ఈలప్రోలు తరుణ్ సింగిల్స్లో ద్వితీయ, డబుల్స్లో ప్రథమస్థానంలో నిలిచారు. అండర్–15 బాలుర డబుల్స్లో రణధీర్రెడ్డి ప్రథమ, డబుల్స్లో ప్రథమ, సీతా ప్రజ్ఞాన్ ప్రథమ, జి.చంద్రికరాణి, జి.షర్మిలరాణి డబుల్స్ లో ప్రథమస్థానాల్లో నిలిచారు. వారిని డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలసాని విజయ్, కార్యదర్శి వి.సాంబమూర్తి, ఉపాధ్యక్షులు పరిటాల చలపతిరావు, గద్దల రామారావు, షేక్ జవహర్పాషా అభినందించారు. -
ఘనంగా సత్యనారాయణ వ్రతం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో ఆర్జిత సేవలో భాగంగా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రామాలయంలోని అంతరాలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆర్జిత సేవల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిత్యకల్యాణం సంప్రదాయబద్ధంగా జరిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, కంకణధారణ, మాంగల్యధారణ, వేద ఆశీర్వచనంతో కల్యాణ ప్రక్రియ ముగించారు. -
అండర్ – 19 క్రీడా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా జూనియర్ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి బాస్కెట్బాల్, రగ్బీ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డి.మూసా కలీం తెలిపారు. అండర్–19 బాస్కెట్బాల్ బాలుర జట్టులో జోయిదీప్, అబిద్, సిద్దు, వినయ్కుమార్, విష్ణు, చేతన్, ఖాదర్, సంజయ్, లోహిత్, తాస్విక్, రాజ్ కీర్తన్, బాలికల జట్టులో మౌనిక, జోషిత, సాగరిక, ధత్రి, అశిని, జబీన్, మనస్విని, లిఖిత, దీక్షిత, ప్రవళ్లిక, అక్షనీ, లావణ్య, సాయిచరిత, రగ్బీ బాలుర జట్టులో జి.ప్రవీణ్, బి.గణేష్, వి. రోమిత్, పి.వీరబ్రహ్మం, ఎం.శరణ్సాయి, ఎం. గోపీచంద్, డి.నోము, ఎ.రాకేష్, ఆర్. ఈశ్వర్, బి.రాజశేఖర్, యక్షిత్, బి.సంతోష్, టి.మనోహర్, కె.శ్రావణ్, పి.సాయితేజ, పి.విగ్నేష్, జి.నూతన్కుమార్, బాలికల జట్టులో ఎ.వేదశ్రీ, బి.సునీత, కె.సాత్విక, ఎస్.సోని, కె.మంజు, జి.మైసీ, జి.శైలజ, డి.హిమవర్షిని, జె.సాహితీ, పి.సల్మా, ఆర్.గీతయామిని, ఎస్.సాత్వి, బి.పావని, జె.ప్రవళ్లిక, ఐ.భవాని, ఎం.డి.ఆఫ్రీన్, జిచయవస్విని, కె.లాస్య ఉన్నారు. -
ముంపు నుంచి రక్షణకు రూ.100 కోట్లు
ఖమ్మంఅర్బన్ : ఖమ్మం నగరాన్ని గతేడాది తీవ్రంగా ప్రభావితం చేసిన మున్నేరు వరద ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వరద నియంత్రణ, నివారణ చర్యల కోసం రూ.6,190 కోట్ల విడుదలకు జలశక్తి మండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో జిల్లాకు నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది వరదలతో ములుగు, కొత్తగూడెం, రామగుండం, భూపాలపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో భారీ నష్టాలు సంభవించాయి. వరద నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికల ఆధారంగా కేంద్రం ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక కింద నిధులు కేటాయించింది. ఖమ్మంలో మున్నేరు వరద ముప్పును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టింది. అయితే ఇటీవల జలవనరుల శాఖ అధికారులు ప్రకాశ్నగర్ వంతెన నుంచి నేషనల్ హైవే వంతెన వరకు సర్వే నిర్వహించి రిటైనింగ్ వాల్ పొడిగింపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర జలశక్తి మంజూరుచేసిన రూ.100 కోట్లను ఈ ప్రతిపాదిత పనుల కోసం వినియోగించనున్నారు. మొదట ధంసలాపురం కాలనీ వైపు శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నిధులతో మున్నేరు పరిధిలో రిటైనింగ్ వాల్ పొడిగింపు, డ్రెయినేజీ మార్గాల అభివృద్ధి, వరద నీరు తక్షణం నదిలోకి చేరేలా పనులు చేపట్టనున్నారు.నిధులు మంజూరు చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ -
చరిత్రకు సాక్ష్యంగా..
ఎంపికై న అభ్యర్థులతో ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే రాగమయి, సింగరేణి అధికారులు పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగావకాశాలుసత్తుపల్లి: ప్రతీ జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి, టాస్క్ సహకారంతో ఆదివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్మేళాను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే ఉద్యోగాల్లో మాత్రం అథమ స్థానంలో ఉందన్నారు. జాబ్మేళాకు సుమారు 70 కంపెనీలు రావడం, 13వేల మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్మేళాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పి స్తోందని, వివిధ నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రైవేట్ కంపెనీల ద్వారా నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తోందని చెప్పారు. జాబ్మేళా నిర్వహించిన ఎమ్మెల్యే రాగమయి, సహకరించిన సింగరేణి సంస్థను అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. ఉద్యోగాలు సాధించటం ద్వారా ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హతకు తగిన ఉద్యోగావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యం మెరుగుపర్చుకుంటే ఇంకా ఉన్నత స్థాయికి చేరవచ్చని సూచించారు. సింగరేణి ద్వారా సత్తుపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణి ఈఅండ్ఎం డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ.. కోల్బెల్ట్ ప్రాంతంలో ఇది ఆరో జాబ్మేళా అని చెప్పారు. అనుభవం లేని వారికి కూడా ఉద్యోగావకాశాలు దక్కినందున కేరియర్ డెవలప్మెంట్కు ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలు అందించారు. కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఏసీపీ రఘు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్బాబు, భాగం నీరజ, మున్సిపల్ కమిషనర్ కోండ్రు నర్సింహా, తోట సుజలారాణి, ఎండీ కమల్పాషా, ఉమ్మినేని ప్రసా ద్, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, గాదె చెన్నారావు, పసుమర్తి చందర్రావు, మందపాటి ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతా పెద్దాస్పత్రి బాటే..
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రసవాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం 20 నుంచి 25 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. దీంతో ఎంసీహెచ్ వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో కూడా ప్రసవాలు పెంచాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. అక్కడ సరైన వసతులు, సౌకర్యాలు, పరికరాలు లేకపోవడం, వైద్యుల కొరతతో ప్రసవాలు జరగడం లేదని చెబుతున్నారు. అయితే సరైన దృష్టి సారిస్తే కింది స్థాయి ఆస్పత్రుల్లోనూ ప్రసవాలు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. జిల్లాలో పెద్దాస్పత్రి తర్వాత వైద్య విధాన పరిషత్కు చెందిన సత్తుపల్లి, పెనుబల్లి, వైరా, మధిర, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు ఆస్పత్రులకు పేషెంట్లు ఎక్కువగా వస్తున్నా.. ఆయా ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉందని ఇటీవల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్లో ఈ ఏడు ఆస్పత్రుల్లో కలిపి 74 ప్రసవాలు మాత్రమే జరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇకపై నెలకు కనీసం 200 ప్రసవాలు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులను కేటాయించినా అదే తీరు.. జిల్లాలో పలు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను అప్గ్రేడ్ చేశారు. మధిర, సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వైరాలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉండగా, కల్లూరులో 30, పెనుబల్లిలో 50 పడకల ఆస్పత్రులు పూర్తయ్యాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే వైద్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. కాగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లిన తర్వాత అందులోని వైద్యులు, సిబ్బందిని జిల్లాలోని ఏడు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో సర్దుబాటు చేశారు. అందులో 10 మంది గైనకాలజిస్టులు కూడా ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులున్నా.. వీవీపీ ఆస్పత్రుల్లో ప్రసవాలు మాత్రం పెరగడం లేదు. ఆయా ఆస్పత్రుల్లో సదుపాయాల లేమి ఒక కారణమైతే, ఖమ్మం పెద్దాస్పత్రిలో అన్ని వసతులు ఉంటాయనే భావనతో ఎక్కువ మంది ఇక్కడికే వస్తున్నారు. దీంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం సరిపోవడం లేదు. ప్రస్తుతం మూడంతస్తుల్లో 150 పడకలు ఉండగా మరో ఫ్లోర్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. సింహభాగం ప్రసవాలు ఇక్కడే.. జిల్లాలో 20 పీహెచ్సీలు, 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు ఉన్నా ఎక్కువ ప్రసవాలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనే జరుగుతున్నాయి. పెద్దాస్పత్రిపై ఒత్తిడి తగ్గించి, మిగతా ఆస్పత్రుల్లో ప్రసవా ల సంఖ్య పెంచే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు ఎంసీహెచ్లో 2,605 డెలివరీలు జరగగా, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులన్నీ కలిపి 305 ప్రసవాలు మాత్రమే జరిగాయి. చాలా ఏళ్లుగా ఇదే వ్యత్యాసం కనిపిస్తున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వారు సైతం పెద్దాస్పత్రికే వచ్చి డెలివరీలు చేయించుకుంటున్నారు. స్థానికంగా ఉండే వీవీపీ ఆస్పత్రులకు వెళితే వ్యయప్రయాసలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తే వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు చేపట్టాం. గతంలో కంటే ప్రస్తుతం ఏడు ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగయ్యాయి. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. ప్రసవాలకు అవసరమైన వసతులు కూడా ఉన్నాయి. గర్భిణులు దగ్గరలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ రాజశేఖర్గౌడ్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి -
ఇన్ఫ్లో స్థాయిలోనే ఔట్ ఫ్లో..
వైరా: జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో వైరా రిజర్వాయర్కు ప్రత్యేక స్థానం ఉన్నది. కొన్నే ళ్లుగా రిజర్వాయర్కు పూర్తిస్థాయిలో నీరు చేరుతుండడంతో అటు సాగు, ఇటు తాగునీటికి ఇబ్బంది ఎదురుకావడం లేదు. మరోపక్క పంటల సాగుకు సరిపడా నీరు అందుతుండడంతో అన్నదాతల పాలిట వరప్రదాయినిగా నిలుస్తోంది. ఇక ఈ ఏడా ది రికార్డు స్థాయిలో రిజర్వాయర్లోకి వరద వచ్చి చేరింది. అదే స్థాయిలో ఐదు అలుగుల ద్వారా నీరు బయటకు వెళ్లింది. తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా నెలకు 2.100 క్యూసెక్కుల నీటిని జిల్లాలోని 11మండలాలకు సరఫరా చేస్తు న్నారు. రోజుకు కోటి లీటర్లకు పైగా నీరు ఇక్కడి నుంచి ప్రజలకు అందుతోంది. కాగా, వైరా రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ కూడా 2.5 టీఎంసీలే ఉండడంతో జలకళ ఉట్టిపడుతోంది. రికార్డు స్థాయిలో వరద ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రిజర్వాయర్లోకి చేరింది. ఈ నెల 23వ తేదీవరకు 12.5 టీఎంసీల వరద రిజర్వాయర్లోకి వచ్చింది. ఇక 10 టీఎంసీల నీరు రిజర్వాయర్ ఐదు అలుగుల ద్వారా బయటకు వెళ్లింది. ఆగస్టు 17వ తేదీన కుడి, ఎడమ కాల్వలకు అధికారికంగా సాగునీరు విడుదల మొదలుపెట్టారు. కుడికాల్వ పరిధిలో సుమా రు 15 వేలకు పైగా ఎకరాలు సాగులో ఉండగా ఒక టీఎంసీ నీటిని వినియోగిస్తున్నారు. ఎడమ కాల్వ పరిధిలో సుమారు 9వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ కాల్వ పరిధిలో అర టీఎంసీ నీరు పొలాలకు చేరింది. అత్యధికంగా ఈ రోజుల్లోనే.. ఈ ఏడాది జూలైలో జోరువానలు మొదలయ్యా యి. ఈ మేరకు ఆగస్టు 16వ తేదీన ఒక టీఎంసీ నీరు అలుగుల ద్వారా బయటకు వెళ్లింది. అలాగే, సెప్టెంబర్ 4వ తేదీన 0.55 టీఎంసీలు, అక్టోబర్ 5వ తేదీన 0.139 టీఎంసీలు రిజర్వాయర్ నీరు బయటకు వెళ్లినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. నెల ఇన్ఫ్లో ఔట్ ఫ్లో (టీఎంసీల్లో) (టీఎంసీల్లో) జూలై 1.22 0.8 టీఎంసీలు ఆగస్టు 5.78 5.78 టీఎంసీలు సెప్టెంబర్ 2.77 2.77 టీఎంసీలు అక్టోబర్ 1.239 0.867 టీఎంసీలుఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో వైరా ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. తద్వారా సాగు అవసరాలకు ఎలాంటి డోకా లేదు. రిజర్వాయర్లో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఫలితంగా తాగునీటికి కూడా సమస్య ఎదురుకాదు. –శ్రీనివాస్, ఐబీ, డీఈ -
లక్కు ఎవరికి దక్కేనో ?
ఖమ్మంక్రైం : నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 ఏ4 (మద్యం) షాపులకు సోమవారం నగరంలోని సీక్వెల్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో లాటరీ తీయనున్నారు.ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్రెడ్డి, సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా దుకాణాలు దక్కించుకునేందుకు టెండర్లు వేసిన వ్యాపారులు తమకే షాపు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. గ్రూప్లుగా ఏర్పడి 20 నుంచి 30 షాపులకు దరఖాస్తులు వేసిన వారు కనీసం తమకు రెండు నుంచి ఐదు షాపుల వరకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 116 షాపులకు గాను 4,430 దరఖాస్తులు రాగా, ఎకై ్సజ్ శాఖకు రూ.133 కోట్ల మేర ఆదాయం లభించిన విషయం విదితమే. జిల్లాకు చేరిన ఆంధ్రా వ్యాపారులు.. మద్యం దుకాణాలకు టెండర్లు వేసిన ఆంధ్రా వ్యాపారులు ఆదివారమే ఖమ్మం చేరుకుని పలు లాడ్జీల్లో గదులు తీసుకుని ఉన్నారు. గిరాకీ ఎక్కువగా ఉండే షాపులు తమకు రాకపోతే వాటిని ఎలాగైనా దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలువురు వ్యాపారులు రూ.కోట్లు వెచ్చించేందుకై నా సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఈసారి విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల నుంచి సైతం మద్యం వ్యాపారులు ఖమ్మంలో దరఖాస్తులు చేయడం గమనార్హం. అందరి చూపూ.. ఆ షాపుపైనే ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1 పరిధిలో షాపు నంబర్ 27 (చింతకాని)కు 75 దరఖాస్తులు రావడంతో అందరి చూపూ అటువైపే ఉంది. అదే స్టేషన్ పరిధిలోని షాపు నంబర్ 23కు 72 దరఖాస్తులు, షాపు నంబర్ 26కు 71 దరఖాస్తులు వచ్చాయి. మరి అధిక అమ్మకాలు ఉండే ఈ షాపులు ఎవరికి దక్కుతాయో చూడాలి. మద్యం షాపుల డ్రాలో పాల్గొనే వారు సోమవారం ఉదయం 9 గంటల వరకు సీక్వెల్ రిసార్ట్స్కు చేరుకోవాలని జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్ రెడ్డి కోరారు. ఎంట్రీ పాస్ ఉన్నవారినే అనుమతిస్తామని, డ్రాలో పాల్గొనే వారు మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. మద్యం షాపులకు నేడు డ్రా -
ముమ్మరంగా రోప్వే పనులు
ఖమ్మంరాపర్తినగర్: పర్యాటకులను ఆకర్షించేందుకు నగరంలోని ఖమ్మం ఖిల్లా మీదుగా రోప్ వే నిర్మించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన రోప్ వే పనులు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించారు. ముందుగా లోయర్ బేస్ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయి కేవలం రోప్ వేకు సంబంధించిన వాటిని మాత్రమే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.15.15 కోట్లు కేటాయించింది. పనులను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి అప్పగించారు. దాదాపు 236 మీటర్ల పొడవున నిర్మించే రోప్ వే పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. బేస్ స్టేషన్ నిర్మాణంలో బాగా రాళ్లు తేలడంతో వాటిని తొలగిస్తున్నారు. లోయర్ స్టేషన్ అప్పర్ స్టేషన్ పనులు పూర్తికాగానే ఖిల్లాపై మ్యూజియం, మినీ థియేటర్, ఒక హోటల్ నిర్మించనున్నారు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, రోప్ వే పనులు పూర్తి కాగానే వెంటనే ఖిల్లాపై మిగిలిన పనులను పూర్తి చేస్తామని డీఈ రామకృష్ణ, ఏఈ ఎం.నరేశ్ తెలిపారు. -
జాబ్మేళాకు సర్వం సిద్ధం
సత్తుపల్లి: సింగరేణి సంస్థ – టాస్క్ సంయుక్త ఆధ్వర్యాన సత్తుపల్లిలో ఆదివారం మెగా జాబ్మేళా జరగనుంది. ఇందులో 80కి కంపెనీలు పాల్గొననుండగా, కనీసం 3వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. సుమారు 10వేల మంది నిరుద్యోగ యువత హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. ఏడో తరగతి మొదలు నుంచి పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు పాల్గొనవచ్చని సూచించగా, సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు, జీఎం షాలేం రాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు ఆధ్వర్యాన జాబ్మేళా జరిగే రాణి సెలబ్రేషన్ ప్రాంగణంలో శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. విస్తృత ప్రచారం సత్తుపల్లిలో జరిగే జాబ్మేళాను ఎక్కువ మంది నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యాన విస్తృత ప్రచారం చేశారు. అధికారులు, పార్టీ నేతలతో కలిసి గ్రామాలు, వార్డుల వారీగా పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేయించారు. అంతేకాక విద్యాసంస్థల నుంచి పూర్వ విద్యార్థులకు ఫోన్ చేయించడంతో పాటు మెసేజ్లు పంపించారు. కాగా, జాబ్మేళాకు దూర ప్రాంతాల నుంచి వచ్చే నిరుద్యోగులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అంతేకాక ప్రైవేట్ పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల సౌజన్యంతో వాహనాలు సైతం సమకూరుస్తున్నారు. ఒకేసారి పెద్దసంఖ్యలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా రెండు పెద్ద హాళ్లు సిద్ధం చేశారు. ‘టాస్క్’ ఆధ్వర్యాన శిక్షణ సింగరేణి, టాస్క్ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్మేళాకు హాజరయ్యే నిరుద్యోగుల్లో సందేహాలు తొలగించేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాల్డెజ్(టాస్క్) ప్రాజెక్టు మేనేజర్ బాలు ప్రవరాఖ్య అవగాహన కల్పిస్తున్నారు. మూడు రోజులుగా రోజుకు ఐదు బ్యాచ్ల చొప్పున యువతలో కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించడం, డ్రస్కోడ్, ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాక రెజ్యూమ్ తయారీపై శిక్షణ ఇచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొంటారని చెబుతున్నారు. నేడు సత్తుపల్లిలో.. 3వేల మందికి ఉద్యోగాలు -
తాగునీటి సరఫరా ఎలా జరుగుతోంది?
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో తాగునీటి సరఫరా విధానాన్ని మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు పరిశీలించారు. 24 గంటల పాటు నీటి సరఫరా కోసం కేఎంసీలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించాలన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీడీఎంఏ శ్రీదేవి ఆదేశాలతో మిర్యాలగూడ బృందం శనివారం ఖమ్మం వచ్చింది. తొలుత కమిషనర్ అభిషేక్ అగస్త్యను మర్యాదపూర్వకంగా కలిశాక, పబ్లిక్ హెల్త్ ఏఈఈ దివ్య ఆధ్వర్యాన అల్లీపురం, రోటరీనగర్ ప్రాంతాల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ఖమ్మం పబ్లిక్ హెల్త్ ఏఈ అనిత, మిర్యాలడ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు నవీన్, సాయితేజ ఉన్నారు. కాగా, 24 గంటల పాటు నీటి సరఫరా కోసం జరుగుతున్న పనులు చివరి దశకు చేరడంతో అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులు పరిశీలించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కేఎంసీలో మిర్యాలగూడ బృందం పరిశీలన -
ముఖగుర్తింపు హాజరులో అగ్రస్థానం
చింతకాని/రఘునాథపాలెం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్సీ) ద్వారా నమోదు చేస్తుండగా జిల్లాలోని చింతకాని మండలం ముందు వరుసలో నిలిచింది. అంతేకాక రఘునాథపాలెం మండలంలోని గణేశ్వరం ఎంపీయూపీఎస్ సైతం విద్యార్థుల ముఖగుర్తింపు నమోదుతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో చింతకాని ఎంఈఓ సలాది రామారావు, గణేశ్వరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.విజయశ్రీ అవార్డులు అందుకున్నారు. వీరికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, అదనపు డైరెక్టర్ రాధారెడ్డి అవార్డులు అందజేయగా, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, వరంగల్ రీజినల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.చింతకాని మండలంతో పాటు గణేశ్వరం పాఠశాలకు అవార్డులు -
పురపాలికలకు నిధుల వరద
కార్పొరేషన్, మున్సిపాలిటీల అభివృద్ధిలో ముందడుగు ● కేఎంసీకి రూ.40కోట్లతో ప్రతిపాదన.. రూ.50కోట్ల కేటాయింపు ● ఏదులాపురం మున్సిపల్కు రూ.15 కోట్ల మంజూరుఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. నిధుల లేమితో స్తంభించిన అభివృద్ధికి తిరిగి ఊపందుకునేలా ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా తక్షణమే నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయగా, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు రెండు నెలల క్రితమే ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించగా వాటికి మరికొంత మొత్తాన్ని కలిపి నిధులు కేటాయించేలా ప్రభుత్వం సీడీఏఎంకు సూచించినట్లు సమాచారం. కేఎంసీకి రూ.50 కోట్లు ఖమ్మం నగర పాలక సంస్థ నుంచి రూ.40 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలను అధికారులు పంపించారు. కానీ రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు ఒకే రకంగా నిధులు ఇవ్వాలనే ప్రభుత్వ సూచనలతో కేఎంసీకి రూ.50 కోట్లు కేటాయించినటు్ల్ సమాచారం. ఈ నిధులతో కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ ఉన్న డ్రెయినేజీలు, రోడ్లు, కూడళ్ల సుందరీకరణ వంటి పనులు చేపడుతారు. కొత్త పట్టణాలకే సింహభాగం నిధుల కేటాయింపులో భాంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రధాన దృష్టి సారించింది. ఈక్రమంలోనే కొన్ని పురపాలక సంస్థలకు తక్షణమే నిధులను మంజూరు చేస్తూ జీఓలు విడుదలయ్యాయి. జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీకి ఏకంగా రూ.15 కోట్లు మంజూరు చేయడం విశే షం. ఈ నిధులను పార్కులు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల వ్యవస్థ బలోపేతంతో పాటు విలీన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేరుగా అనుమతులు అభివృద్ధి పనుల కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుండి పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పరిశీలించి నేరుగా పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు స్థానిక పాలకవర్గాల నుండే అనుమతులు తీసుకుంటుంటారు. కానీ ఇప్పుడు పాలకవర్గాలు, ప్రత్యేక అధికారులతో సంబంధం లేకుండానే ప్రభుత్వమే నేరుగా పనులు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. అంతేకాక పనులు పూర్తయిన వెంటనే నిధులు మంజూరు చేస్తారని సమాచారం. రెండు రోజుల్లో.... జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఏదులాపురం, మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏదులాపురం మున్సిపాలిటీకే రూ.15 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేఎంసీకి రూ.50కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా ఉత్తర్వులు రాలేదు. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు వెలువడలేదు. అయితే, కేఎంసీతో పాటు ఆయా మున్సిపాలిటీల నుండి మరికొన్ని పనులకు ప్రతిపాదనలు పంపిస్తే నిధుల కేటాయింపు ఉత్తర్వులు జారీ అవుతాయని, ఇదంతా రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుందని మున్సిపల్ అధికారుల్లో చర్చ జరుగుతోంది.పనులు నిధులు (రూ.కోట్లలో) విలీన ప్రాంతాల అభివృద్ధి 4 కూడళ్ల అభివృద్ధి 1 అంతర్గత రోడ్ల నిర్మాణం 4 డ్రైయినేజీల నిర్మాణం 3.25 2 బీహెచ్కే కాలనీలో సౌకర్యాల కల్పన 0.25 పార్కుల అభివృద్ధి 2 కల్వర్టుల నిర్మాణం 0.50 -
మందుబాబులకు వినూత్న శిక్ష
ఖమ్మంక్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఏడుగురికి రూ.2వేల చొప్పున ఖమ్మం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి బక్కెర నాగలక్ష్మి శనివారం తీర్పు చెప్పారు. అంతేక రెండు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులకు విధుల్లో సహకరించాలని ఆదేశించారని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. నిర్ణీత తేదీల్లో ఖమ్మంలో ఉదయం 10నుంచి సాయంత్రం 5వరకు ట్రాఫిక్ విధుల ద్వారా కమ్యూనిటీ సేవ చేయాలని తీర్పులో వెల్లడించారని సీఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న మహిళ మృతి సత్తుపల్లిటౌన్: కుటుంబ కలహాలతో పిల్లలకు కలుపు మందు తాగించి తానూ తాగిన మహిళ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. సత్తుపల్లి ద్వారకాపురి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(29) శుక్రవారం తన చిన్నకుమారుడు సయాన్(6)కి కలుపు మందు తాగించింది. మరో కుమారుడికి సైతం తాగించినా ఆ బాలుడు ఉమ్మేశాడు. దీంతో అపస్మారక స్థితికి చేరిన సల్మా, సయాన్ను ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అనంతరం వరంగల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సల్మా మృతి చెందగా.. కుమారుడు సయాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా, భర్తలో మార్పు రావడం లేదని సల్మా ఈ నిర్ణయం తీసుకుందని బంధువులు తెలిపారు. ఈమేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.విషమంగానే కొడుకు పరిస్థితి -
పకడ్బందీగా ఎస్ఐఆర్ జాబితా
ఖమ్మంసహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ 2002లో చేసిన ఎస్ఐఆర్ జాబితాతో ప్రస్తుత ఓటర్ జాబితా ను మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఈమేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆర్డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్లు అరుణ, శ్రీనివాసరావు, ఉద్యోగులు రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు. రేక్ పాయింట్కు 2,518 టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు కోరమాండల్ కంపెనీకి చెందిన 2,518 టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,158 టన్నులు, భద్రాద్రి జిల్లాకు 830 టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 టన్నులు కేటాయించినట్లు రేక్ పాయింట్ ఇన్చార్జ్ పవన్కుమార్ తెలిపారు. మిగతా యూరియా బఫర్ స్టాక్గా నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ ఎదుట రేపు పెన్షనర్ల ధర్నా ఖమ్మంసహకారనగర్: 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయి ల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 27న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.మేరీ ఏసుపాదం తెలి పారు. ఖమ్మంలో శనివారం పరిశ పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ధర్నా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కార్యదర్శి రాయల రవికుమార్తో పాటు పి.సత్యనారాయణ, కె.శరత్బాబు, ఊడుగు వెంకటేశ్వర్లు, జల్లా వెంకటేశ్వర్లు, బి.కృష్ణకుమారి, టి.అంజలి, కె.అన్నమ్మ, రాధాకృష్ణమూర్తి, ప్రసాదరావు పాల్గొన్నారు. మెడిసిన్ విద్యార్థికి రూ.1.25 లక్షల ఆర్థికసాయం కల్లూరు: తిరుమలాయపాలెం మండలం తిమ్మక్కపేటకు చుంచు వీరబాబు – మాధవి కుమార్తె భవన హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో ఉచిత సీటు సాధించింది. అయినా హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులు భరించేక నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుండగా, స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు పరకా రామారావును ఆశ్రయించారు. ఆయన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీవ్యాల్కు వివరించడంతో దాతల సహకారంతో రూ.1.25 లక్షలు సమకూర్చారు. దీంతో చెక్కును కల్లూరులో శనివారం భవన తల్లిదండ్రులకు రామారావు అందజేశారు. ఫీజు, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి ఖమ్మం మామిళ్లగూడెం: విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఖమ్మంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం లేదని, ప్రభుత్వం మారినా పరిస్థితుల్లో మార్పు లేదని విమర్శించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు షేక్ నాగుల్మీరా, శివ, వంశీ, గోపి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిఘా ఖమ్మంక్రైం: జిల్లాలో రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై పోలీసులు నిఘా పెంచారు. ఈమేరకు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్ల వారుజాము వరకు రికార్డుల్లో ఉన్న 225మంది ఇళ్లకు ఆకస్మికంగా వెళ్లిన పోలీసులు కదకలికలపై ఆరా తీశారు. ప్రస్తుత వృత్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరిపై నిఘా ఉన్నందున ఏ చిన్న తప్పు చేసినా దొరిపోవడం ఖయమని తెలిపారు. తరచూ భూదందాలు, సెటిల్మెంట్లతో పాటు గంజాయి అమ్మకాలు చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు తప్పదని హెచ్చరించారు. ఇదే సమయాన సత్ప్రవర్తన కలిగి ఉంటే షీట్ ఎత్తివేస్తామని పోలీసులు వారికి భరోసా కల్పించారు. -
టీటీడీ ఆలయ హద్దులపై సర్వే
ఖమ్మంఅర్బన్: టీటీడీ ఆధ్వర్యాన ఖమ్మం అల్లిపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించగా, ఇప్పటికే గుర్తించిన స్థలంలో శనివారం సర్వే చేశారు. తహసీల్దార్ సైదులు ఆధ్వర్యాన భూసర్వే చేపట్టి హద్దులను నిర్ధారించారు. అయితే, ఇవి అసైన్డ్ భూములు కావడంతో అందులో ఎంతమేర సాగులో ఉంది, ఎక్కడైనా చేతులు మారిందా అనే వివరాలు నమోదు చేశారు. సర్వే పూర్తయ్యాక భూముల వారీగా వివరాలతో నివేదిక సిద్ధం చేయనుండగా, ఆతర్వాత అసైన్డ్ పట్టాదారులకు ఎలాంటి సాయం చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని తెలిసింది. సర్వేలో తహసీల్దార్తో పాటు ఆర్ఐలు సత్యనారాయణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అల్లిపురం, కొత్తగూడెం గ్రామాల వాసులు ఆలయం నిర్మించే స్థలంలో శుభ్రపరిచి పూజలు చేశారు. పీఏసీఎస్ చైర్మన్ రావూరి సైదుబాబు, నాయకులు సంక్రాంతి నాగేశ్వరరావు, వెనిగళ్ల నాగేశ్వరరావు, పత్తిపాటి అప్పారావు, వడ్డెప్పుడు మల్లయ్య, సామినేని ముత్తయ్య, గుండె ఆదినారాయణ, ఎర్రబోయిన గోవిందు, పగడాల మల్లేశ్, జె.వెంకన్న, ఉప్పందర్ పాల్గొన్నారు. -
‘జాగృతి’ రాష్ట్ర కార్యదర్శిగా కిషన్నాయక్
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన బానోత్ కిషన్నాయక్ నియమితులయ్యారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర కార్యవర్గంతో అన్ని జిల్లాల అనుబంధ విభాగాల బాధ్యులను శుక్రవారం హైదరాబాద్లో ప్రకటించారు. ఈమేరకు రాష్ట్ర కార్యదర్శిగానే కాక ఎస్టీ విభాగం కోఆర్డినేటర్గా కిషన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ కార్యకలాపాలు గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని తెలిపారు. జమలాపురంలో పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు పాల్గొన్నారు. -
సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి
తిరుమలాయపాలెం: విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా పర్యవేక్షిస్తూనే అన్ని సబ్జెక్టుల సిలబస్ సకాలంలోని పూర్తి చేయాలని జిల్లా ఇంటర్మీడిఝెట్ విద్యాశాఖ అధికారి కె.రవిబాబు సూచించారు. మండలంలోని పిండిప్రోలు జూనియర్ కళాశాలను శనివారం తనిఖీ చేసిన ఆయన మరమ్మతు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆతర్వాత అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ.. విద్యార్థుల హాజరు, బోధనపై సూచనలు చేశారు. అనంతరం ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్న ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును సన్మానించారు. ఆతర్వాత హార్ట్ పుల్నెస్ సంస్థ బాధ్యుడు కరుణాకర్ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. -
జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు
జూబ్లీహిల్ ్సజిల్లా మంత్రులకు బాధ్యతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్యనేతలకు అప్పగించింది. ఈమేరకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్టార్ క్యాంపెయినర్లుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కేడర్ను సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై సూచనలు చేస్తూనే, మంత్రులు నేరుగా ప్రధాన సభలతో పాటుగా అభ్యర్థితో కలిసి రోడ్డు షోల్లో పాల్గొంటున్నారు. అలాగే, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, కాంగ్రెస్ నాయకుడు ఎండీ.ముస్తఫా తదితరులు సైతం ప్రచారానికి హాజరవుతున్నారు.. బీఆర్ఎస్ నేతలు సైతం.. ఉప ఎన్నికలో అభ్యర్థుల జాబితా ఖరారవడంతో బీఆర్ఎస్ ప్రచారంపై దృష్టి సారించింది. ఈమేరకు ప్రచారం చేసే స్టార్ క్యాంపెయిన్లలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుకు చోటు కల్పించింది. అలాగే ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మైనార్టీ నాయకుడు తాజుద్దీన్ సైతం ప్రచారానికి వెళ్లారు. నేతలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తుండగా, స్టార్ క్యాంపెయినర్లు సభలు, రోడ్ షోల్లో పాల్గొనడమే కాక ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెబుతూ, కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధిపై నిర్లక్ష్యం చేస్తోందని వివరిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రచార జాబితాలో డిప్యూటీ సీఎం, మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు 17 రోజుల సమయం ఉండగా, ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో తలమునమకలయ్యారు. రెండు పార్టీల నాయకులు వారం, పది రోజులుగా అక్కడే మకాం వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెల 9 వరకు నేతలంతా అక్కడే ఉండనున్నట్లు చెబుతున్నారు. కాగా, జిల్లా ముఖ్యనేతలు ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏయే సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి.. ఆ సామాజిక వర్గం నేతలను పార్టీలు ప్రచారానికి ఆహ్వానించాయి. అంతేకాక ఉమ్మడి జిల్లా నుంచి జూబ్లీ హిల్స్లో ఎవరు ఓటర్లుగా ఉన్నారో ఆరా తీయడం.. ఇక్కడి ప్రజల బంధువులను గుర్తిస్తూ వారితోనూ చెప్పిస్తున్నారు. సామాజికవర్గాలు, కుల సంఘాల వారీగా జరిగే సమావేశాల్లోనూ జిల్లా నేతలు పాల్గొంటున్నారు. -
విద్యార్థుల ప్రగతికి అనుగుణంగా బోధన
కొణిజర్ల: పాఠ్యాంశాల్లో విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా బోధించాలని గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీఓ(రీజినల్ కోఆర్డినేటర్) ఏ.అరుణ సూచించారు. తనికెళ్లలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డార్మెటరీ, కిచెన్ షెడ్, భోజనశాల, సిక్రూమ్ను పరిశీలించి సదుపాయాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన ఆర్సీఓ మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ఆటంకాలు రాకుండా చూడాలని తెలిపారు. ప్రిన్సిపాల్ కె.రజని, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, అధ్యాపకులు డాక్టర్ కే.పీ.ఐశ్వర్య, కె.రజిత, బి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యసాధన ఖమ్మంక్రైం: వాహనాల త్రైమాసిక పన్నులు, ఇతర ఆదాయ లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో చేరుకోవాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్రెడ్డి సూచించారు. జిల్లా రవాణాశాఖా కార్యాలయానికి శనివారం వచ్చిన ఆయన జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాల పని తీరు, పన్నుల వసూళ్లు, రోజువారీ రిజిష్ట్రేషన్లపై జిల్లా రవాణా శాఖాధికారి వెంకటరమణతో సమీక్షించారు. అలాగే, పెనుబల్లి మండలం ముత్తగూడెంలో తొలగించిన చెక్పోస్ట్కు సంబంధించి సిబ్బందికి కేటాయించిన విధులపై ఆరా తీశారు. కార్యాలయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏజెంట్లను అనుమతించవద్దని సూచించారు. ఏఓ సుధాకర్, ఏఎంవీఐ స్వర్ణలత, ఉద్యోగులు పాల్గొన్నారు. యాప్లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి రఘునాథపాలెం: పత్తి రైతులు సీసీఐ కేంద్రాల్లో పంట అమ్మకానికి కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య రైతులకు సూచించారు. రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడిలో యూరియా పంపిణీని శనివారం పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడారు. పత్తి సాగు చేసిన ప్రతీ రైతు కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని, తద్వారా సీసీఐ సెంటర్లలో మద్దతు ధరతో అమ్ముకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. అంతేకాక మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడొద్దని సూచించారు. మొక్కజొన్న విత్తన సాగు చేసే రైతులు తప్పనిసరిగా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి కర్నాటి ఉమామహేశ్వరరెడ్డి, రైతులు పాల్గొన్నారు. అందరికీ న్యాయం పొందే హక్కు ఖమ్మం లీగల్: న్యాయం అందరికీ సమానమేనని, దీన్ని పొందే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కే.వీ.చంద్రశేఖరరావు తెలిపారు. ఖమ్మం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వయో వృద్ధుల కోసం ఉచిత న్యాయం అందుబాటులో ఉంటుందని, ఈ కేంద్రంలో పారా లీగల్ వలంటీర్లు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం ఆర్డీఓ నర్సింహారావు మాట్లాడుతూ వయోవృద్ధుల పోషణ అంశం తమ పరిధిలో ఉండగా, భూతగాదాలు, గిఫ్ట్ డీడ్లు కలెక్టర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వలంటీర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
రండీ.. చార్జింగ్ స్టేషన్ పెట్టండి !
● కేంద్రం నుంచి 70–80 శాతం సబ్సిడీ ● ఏఈల ద్వారా ప్రతిపాదనలకు అవకాశం ఖమ్మంవ్యవసాయం: ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ఆసక్తి పెరుగుతుండడంతో కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశీయ సాంకేతికతకు ప్రోత్సాహం, కాలుష్యం తగ్గింపు, చమురు దిగుమతులపై పెట్టుబడులను కుదించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఈ–డ్రైవ్ పథకాన్ని అమలు చేస్తుండగా పలువురు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఇలా వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో చార్జింగ్ స్టేషన్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనేపథ్యాన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తూ ‘ఈ డ్రైవ్’ పథకాన్ని తొలుత రెండేళ్ల కాల పరిమితితో రూపొందించగా, ఇటీవల 2028 వరకు పొడిగించింది. ఈ పథకం కింద ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం రూ. 2 వేల కోట్ల నిధులు కేటాయించింది. ప్రభుత్వ సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో.. ఎలక్ట్రానిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ–డ్రైవ్ పథకం కింద సబ్సిడీలను ప్రకటించింది. ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టేషన్ ఏర్పాటుకు 80 శాతం, షాపింగ్ మాళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, సినిమా థియేటర్లు, వ్యాపార కేంద్రాల్లోనైతే 70 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. అంతేకాక ద్విచక్ర వాహనాల బ్యాటరీల స్వాపింగ్ సెంటర్లకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. సెంటర్ల ఏర్పాటుకు నాలుగు కేటగిరీల్లో సబ్సిడీ సౌకర్యం కల్పించనుండగా.. జాతీయ రహదారులపై 30–40 కిలోమీటర్లకు ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్ ఏర్పాటును ప్రోత్సహించనున్నారు. ఈమేరకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థల బాధ్యులు సమీపంలోని విద్యుత్ ఏఈలను సంప్రదించవచ్చు. అవసరమైన ధ్రువ పత్రాలతో సంబంధిత డిస్కంకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఈవీ చార్జింగ్ స్టేషన్ మంజూరు చేస్తారు.ఎలక్ట్రానిక్ చార్జింగ్ స్టేషన్లతో వాహనదారులకు లబ్ధి జరుగుతుంది. కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో పాటు సబ్సిడీ ఇస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సముదాయాల్లో స్టేషన్ల ఏర్పాటుతో వ్యాపార వృద్ధి కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఔత్సాహికులు వినియోగించుకోవాలి. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఖమ్మం -
రేపటి నుంచి పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరిలో ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం పెంపొందించాలనే లక్ష్యంతో సోమవారం నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం నుంచి శనివారం ఆయన ఎంఈఓలు, హెచ్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో సోమవారం నుంచి కార్యక్రమం మొదలవుతుందని, ప్రతీరోజు గంట పాటు విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ పెంచేలా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలని చెప్పారు. మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు 1 – 5వ తరగతి పిల్లలతో ఇంగ్లిష్ చదివించేలా ప్రత్యేక కోర్సు సిద్ధం చేశామని తెలిపారు. సులువైన పదాలతో ప్రారంభించి సరళంగా ఆంగ్లం చదవడం వచ్చేలా ఈ మెటీరియల్ ఉంటుందని వెల్లడించారు. ప్రతీ బుధవారం విద్యార్థి సామర్థ్యాలు ఏ మేర ఉన్నాయో యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అనుదీప్ -
శబరిమలకు ఆర్టీసీ బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: అయ్యప్ప మాలధారులు శబరిమలలో స్వామి దర్శనానికి వెళ్లేందుకు తక్కువ చార్జీలతో ఆర్టీసీ బస్సులు సమకూర్చనున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. రీజియన్లోని ఏడు డిపోల నుంచి పుష్బ్యాక్ సీట్లు కలిగిన సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఐదు, ఏడు రోజుల ప్రయాణంలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట స్వాములకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని తెలిపారు. బస్సుల కోసం ఖమ్మం డిపో మేనేజర్(99592 25958), సత్తుపల్లి డిపో(99592 25962), కొత్తగూడెం డిపో (99592 25959), భద్రాచలం డిపో (99592 25960), మధిర డిపో (99592 25961), మణుగూరు డిపో (99592 25963) మేనేజర్ను సంప్రదించాలని ఆర్ఎం సూచించారు. వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: అర్హులైన మైనార్టీలకు వృత్తి నైపుణ్య రంగాల్లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగ కల్పన కల్పించేలా వృత్తి శిక్షణా సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎండీ.ముజాహిద్ తెలిపారు. రిజిస్ట్రేషన్, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో అనుసంధానం కాపీలు, గడిచిన మూడేళ్ల పన్ను చెల్లింపులు, గత మూడేళ్లలో ఇచ్చిన శిక్షణ, గత ఏడాది కాలానికి ఉద్యోగాలు కల్పించిన వారి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాల్సి ఉండగా, వివరాలకు 97040 03002 నంబర్లో సంప్రదించాలని ఆయన తెలిపారు. ఎన్నెస్పీ క్యాంప్లో డీసీసీ ఆఫీస్ ● కాంగ్రెస్ కార్యాలయానికి ఎకరం భూమి ఖమ్మం అర్బన్: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఎకరం భూమిని ప్రభుత్వం కేటాయిచింది. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్లో భూమి కేటాయిస్తూ గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ప్రస్తుత పాత బస్టాండ్ సమీపాన ఉన్న కార్యాలయంలో కార్యకలాపాలకు ఇక్కట్లు ఎదురవుతున్నందున నూతన భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కోరారు. ఈమేరకు ఆయన 2024 ఫిబ్రవరి 21న ప్రభుత్వానికి విన్నవించగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. ఈ వినతులను పరిగణనలోకి తీసుకుని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సర్వే నంబర్ 93లోని ఎకరం ఎన్నెస్పీ భూమిని కాంగ్రెస్ కార్యాలయానికి కేటాయించారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ‘సోలార్’ విద్యుత్ సరఫరాకు లైన్ ఎర్రుపాలెం: మండలంలోని రాజుపాలెం రెవెన్యూ మోటాపురం సబ్స్టేషన్ పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యాన సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను వెంకటాపురం సబ్స్టేషన్కు అనుసంధానించేలా ప్రత్యేక లైన్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల్లో సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఒక మెగావాట్ సామర్ధ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ బండి శ్రీనివాసరావు, ఏడీఈలు అనురాధ, నాగమల్లేశ్వరావు, ఏఈలు బోజ్యా, అనూష, ఎంపీడీఓ సురేందర్, ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు. పోలీసు అమరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం ఖమ్మంక్రైం: పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులకు అండగా ఉంటామని సీపీ సునీల్దత్ తెలిపారు. కమిషనరేట్లో గురువారం ఆయన అమరవీరుల కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు తమ సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలు ఇప్పించాలని కోరగా, ఇప్పటికే ప్రక్రియ మొదలైందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కమిషనర్ తెలిపారు. -
సస్పెన్షన్ రద్దు చేయాలని నిరసన
ఖమ్మం సహకారనగర్: టీఎస్ యూటీఎఫ్ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు, ఎర్రగడ్డ యూపీఎస్ ఉపాధ్యాయుడు భూక్యా కేశ్యాపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద గురువారం నిరసన తెలపగా ఆమె మాట్లాడారు. ఐటీఐ ఏర్పాటు చేయాలని జరిగిన దీక్షకు భోజన విరామ సమయాన సంఘీభావం తెలిపితే సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈమేరకు అధికారులు వాస్తవాలను పరిశీలించి సస్పెన్షన్ను ఎత్తివేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్, డీఈఓ శ్రీజకు వినతిపత్రం సమర్పించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
రూ.919 కోట్లు.. 37 రోడ్లు
● ‘హ్యామ్’ విధానంలో నిర్మాణానికి మంజూరు ● పలు రహదారుల విస్తరణ, నిర్మాణం ● మెరుగుపడనున్న రవాణా సౌకర్యం ఖమ్మంఅర్బన్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) విధానంలో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రతిపాదనలకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించగా, త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా, జాబితాలో జిల్లాలోని పలు రహదారులకు కూడా స్థానం దక్కింది. మొత్తం 414 కి.మీ. మేర 37 రోడ్ల నిర్మాణం, విస్తరణ పనుల కోసం రూ.919.86 కోట్లు మంజూరు చేశారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యాన హ్యామ్ విధానంలో చేపట్టే ఈ పనులు పూర్తయితే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పనుల్లో భాగంగానే వైరా నుంచి జగ్గయ్యపేట రోడ్డు, ఖమ్మం – బోనకల్లు రోడ్డును డబుల్ లేన్లుగా విస్తరించనున్నారు. ఏపీ రాష్ట్రానికి అనుసంధానంగా ఈ రహదారులు ఉండడంతో రద్దీ దృష్ట్యా పది మీటర్ల రోడ్డుగా నిర్మాణానికి ప్రతిపాదించారు. మంజూరైన రహదారుల్లో కొన్ని.. ‘హ్యామ్’ విధానంలో అభివృద్ధి చేయనున్న రహదారుల జాబితా విడుదలైంది. ఇందులో పల్లిపాడు – గుబ్బగుర్తి – జన్నారం – బక్క చింతలపాడు బస్వాపురం – పొద్దుటూరు రోడ్డు, ఖమ్మం – ఇల్లెందు రోడ్డు, ఖమ్మం బైపాస్ రోడ్ (ఎఫ్సీఐ గోదాం వద్ద), రాయపట్నం బ్రిడ్జి నుండి మోటమర్రి రైల్వేస్టేషన్ వరకు, ఖమ్మం – వైరా నుంచి కొదుమూరు – రుద్రమకోట – పుట్టకోట రహదారి జాబితాలో ఉన్నాయి. అలాగే, వెంకటాపురం రోడ్డు, ఖమ్మం – కొత్తకొత్తూరు, పెనుబల్లి – అడిసర్లపాడు, తల్లాడ – భద్రాచలం రోడ్డు, ఖమ్మం – సూర్యాపేట రోడ్డు, వీ.వీ.పాలెం – రఘునాథపాలెం – వేపకుంట్ల – గణేశ్వరం లింక్ రోడ్డు, ఖమ్మం – ఇల్లెందు రోడ్డు నుండి దేవరపల్లి లింక్ రోడ్డు నిర్మిస్తారు. అంతేకాక మధిర – నందిగామ, వెంకటాపురం –కూసుమంచి, లక్ష్మీపురం – వెంకటగిరి, గుదిమల్ల – కోదాడ, నేలకొండపల్లి – పాలేరు, జక్కేపల్లి రోడ్డు, కల్లూరు – ఊట్కూరు, ఖమ్మం – మర్లపాడు – రామాపురం తదితర రోడ్లతో మరికొన్ని ప్రాంతాల రహదారులు జాబితాలో ఉన్నాయి. నిర్మాణం, విస్తరణతో ఇక్కట్లకు చెక్ తాజాగా లభించిన అనుమతులతో సింగిల్ లేన్గా ఉన్న రహదారులను డబుల్ లేన్గా విస్తరిస్తారు. మిగతా చోట్ల దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్త రహదారులు నిర్మిస్తారు. జాబితాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంత రహదారులే ఉండడంతో పట్టణా ల నుంచి గ్రామాలకు రవాణా వ్యవస్థ బలోపేతమవుతుందని చెబుతున్నారు. తద్వారా ప్రయాణ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. -
అన్నదాత గుండెల్లో దడ
ఖమ్మంవ్యవసాయం: వరుణుడు అన్నదాతకు దడ పుట్టిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం ఆకాశం మేఘావృతమై ఉండగా, గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్ర, శనివారాల్లోనూ వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పంటలకు ప్రతికూలం వానాకాలంలో సాగైన పంటలకు ప్రస్తుత వానలు ప్రతికూలంగా మారుతున్నాయి. అన్ని పంటలు కలిపి జిల్లాలో 6,97,441 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 2.95 లక్షల ఎకరాల్లో, పత్తి 2,25 లక్షల ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికందుతోంది. ఈ సమయాన వర్షంతో పంట నేలవాలుతోందని, కాయలోకి నీరు చేరి రంగు మారుతోందని ఆవేదన చెందుతున్నారు. అసలే దిగుబడి పడిపోగా, ఇప్పుడు రంగు మారడంతో మద్దతు ధర దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే, ఆరబెట్టిన మొక్కజొన్న కూడా రంగు మారే ప్రమాదముంది. అంతేకాక సత్తుపల్లి, కూసుమంచి డివిజన్లలో వరి కోతలు మొదలుపెట్టారు. మిగతా చోట్ల వరి పొట్ట దశ నుంచి కోత దశకు చేరడంతో తాజా వర్షాల కారణంగా కోతలు వాయిదా వేస్త్తున్నారు. ఇక మిర్చి తోటలకు ఈ వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. ఖమ్మం మార్కెట్లో పరుగులు అల్పపీడనం కారణంగా గురువారం ఉదయం ఒక్కసారిగా వాతారణంలో మార్పులు చోటు చేసుకొని వర్షం కురిసింది. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విక్రయానికి తీసుకొచ్చిన పత్తి బస్తాలను రక్షించుకునేందుకు రైతులు పరుగులు తీశారు. మార్కెట్ కమిటీ టార్పాలిన్లు సమకూర్చడంతో వాటిని కప్పి జాగ్రత్త పడ్డారు. ఆపై వర్షం తగ్గగానే వ్యాపారులు కాంటా వేయించి గోదాంలకు తరలించారు. ఓ మోస్తరు వాన అల్పపీడనం ప్రభావంగా జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు రఘునాథపాలెం మండలం పంగిడిలో అధికంగా 49.8 మి.మీల వర్షపాతం నమోదైంది. అలాగే, తిమ్మారావుపేట 40.8, మంచుకొండలో 33.3, వేంసూరులో 30.8, లింగాలలో 29.8, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 24, రఘునాథపాలెంలో 16.8, సిరిపురంలో 16.3, చింతకానిలో 16, పమ్మి, నాగులవంచలో 15, గంగారంలో 14, వైరా ఏఆర్ఎస్ వద్ద 13.3, ఖమ్మం ప్రకాష్నగర్, సత్తుపల్లి సదాశివునిపాలెంలో 11.3, ఖమ్మం ఖానాపురంలో 10.8, కల్లూరు, రావినూతల, నేలకొండపల్లిలో 10 మి.మీ.ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. తేమ పేరిట పత్తి కొనుగోళ్లకు నిరాకరణ జిన్నింగ్ మిల్లుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యాన పత్తి విక్రయాలకు వాన ప్రతిబంధకంగా మారింది. జిల్లాలోని పలుచోట్ల కొనుగోళ్లు మొదలుపెట్టగా స్లాట్ బుక్ చేసుకున్న రైతులు పత్తిని తీసుకొస్తే అధిక తేమ ఉందని నిరాకరిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో 18 మంది రైతుల నుంచి 33 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం 8 – 12 శాతం తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేయనుంది. కానీ ప్రస్తుత వాతావరణంలో తేమ పెరగగా విక్రయాలు జోరందుకోవడం లేదు. కాగా, గురువారం జిల్లాలో ఒక్క రైతు కూడా పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోలేదని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ.అలీం తెలిపారు. -
లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలి
వాతావరణ ం జిల్లాలో శుక్రవారం ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది. కొన్నిచోట్ల జల్లులు మొదలు ఓ మోస్తరు వర్షం కురవొచ్చు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితిరుమలాయపాలెం: సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి పాలేరు రిజర్వాయర్లోకి 2026 ఖరీఫ్ సీజన్ నాటికి గోదావరి జలాలు తరలించేలా లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మండలంలోని బీరోలు, దమ్మాయిగూడెంలో సీతారామ ప్రాజెక్టు 16వ ప్యాకేజీలోని పాలేరు లింక్ కెనాల్, టన్నెల్ పనులను జల వనరుల శాఖ ఎస్ఈ వెంకటేశ్వరరావు, డీఈ బాణాల రమేష్రెడ్డితో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నాక ఆయన మాట్లాడుతూ ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని తెలిపారు. అంతేకాక భూసేకరణపై ఆరా తీసిన కలెక్టర్, టన్నెల్ తవ్వకానికి వినియోగిస్తున్న యంత్రాల పనితీరును తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విల్సన్ ఇరిగేషన్, ఏఈలు రామకృష్ణ, రమాదేవి పాల్గొన్నారు. -
‘బతుకమ్మ’ చాలెంజ్లో స్థానం
నేలకొండపల్లి: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్–2025 పేరిట నిర్వహించిన పోటీల తుదిజాబితాలో మండలంలోని మంగాపురం తండా వాసి రూపొందించిన షార్ట్ ఫిల్మ్కు చోటు దక్కింది. కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమలుచేస్తున్న పథకాలతో పాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఆధారంగా రూపొందించిన షార్ట్ఫిల్మ్లను పోటీకి ఆహ్వానించారు. ఈమేరకు మంగాపురంతండాకు చెందిన గుగులోత్ నాగేంద్రవర్మ డైరెక్టర్గా, గుగులోత్ రూప్లానాయక్ నిర్మాణంలో శ్రీజయకేతనంశ్రీపేరిట షార్ట్ ఫిల్మ్ను రూపొందించగా పోటీలో తుది జాబితాలో చోటు దక్కింది. ఈ విషయాన్ని వెల్లడించిన డైరెక్టర్, నిర్మాత మాట్లాడుతూ విజేతల జాబితాలోనూ స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉపాధిలో ఈ–కేవైసీ..
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంఎన్ఆర్ఈజీఎస్) మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వాలు కీలక చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా కూలీల హాజరు నమోదులో అక్రమాలకు తావు లేకుండా, నిజమైన కూలీలకు మాత్రమే లబ్ధి చేకూరేలా నూతన సాంకేతిక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇక నుంచి ఉపాధి పనులకు వచ్చే కూలీల హాజరును ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ద్వారా నమోదు చేసేందుకు కసరత్తు వేగవంతమైంది. జిల్లాలో ఈ పథకం కింద యాక్టివ్గా ఉన్న కూలీల వివరాలను సేకరించడంతో పాటు వారి ఫొటోతో కూడిన వివరాలను జాబ్కార్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫొటోతో అనుసంధానం ఈ నూతన విధానంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనులకు వస్తున్న (యాక్టివ్గా ఉన్న) కూలీలను గుర్తించి వారి ఫొటోలు, ఆధార్ వివరాలను సేకరించి జాబ్ కార్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఉపాధి పథకానికి సంబంధించిన ప్రత్యేక యాప్లో కూలీ ఫొటోను తీయగానే, ఆటోమేటిక్గా జాబ్కార్డులోని వివరాలు, పేరు కనిపించడంతో పాటు వారి హాజరు యాప్లో నమోదయ్యేలా రూపొందిస్తున్నారు. ఇది పనుల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు, బోగస్ కూలీల బెడదను పూర్తిగా తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 85 శాతం పూర్తి.. జిల్లాలోని యాక్టివ్ కూలీల ఈ–కేవైసీ ప్రక్రియ అధికారులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 85 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. జిల్లాలో 2,85,055 మంది కూలీలు యాక్టివ్గా ఉండగా.. ఇప్పటి వరకు 2,44,759 మంది కూలీల ఈ–కేవైసీని పూర్తి చేయగా.. మరో 40,296 మందివి చేయాల్సి ఉంది. గ్రామాల్లోని సిబ్బంది కూలీల ఫొటోలను చురుగ్గా అప్లోడ్ చేస్తున్నారు. త్వరలోనే ఫేస్ రికగ్నైజేషన్ ఈ–కేవైసీ అమలు తర్వాత మరింత అధునాతనంగా ఫేస్ రికగ్రైజ్ (ముఖ గుర్తింపు) ద్వారా హాజరు నమోదు చేసే విధానాన్ని కూడా త్వరలోనే అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కూలీలు నేరుగా తమ ముఖాన్ని గుర్తించే యంత్రం, యాప్ ద్వారా హాజరు వేయడం సాధ్యమవుతుంది. ఈ చర్య ఉపాధి హామీ పథకంలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి కొత్త మార్గం వేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పనుల్లో పారదర్శకతకు కొత్త విధానం -
ముగిసిన మద్యం టెండర్లు
● 116 వైన్స్కు 4,430 దరఖాస్తులు ● గడువు పెంచినా స్పందన అంతంతే.. ● ఈనెల 27వ తేదీన డ్రా ద్వారా వైన్స్ కేటాయింపు ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ కేటాయింపునకు గత నెల 26వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. మొదట ఈనెల 18వరకే గడువు విధించగా, అదేరోజు బీసీల బంద్ ఉండడంతో బ్యాంకులు తెరుచుకోలేదని అందిన వినతులతో గురువారం వరకు గడువు పొడిగించారు. అయినప్పటికీ పెద్దగా దరఖాస్తులు పెరగకపోవడం గమనార్హం. గడువు పెంచాక 387 తొలి దఫా గడువు ముగిసే నాటికి జిల్లాలోని వైన్స్కు 4,043 దరఖాస్తులు అందాయి. అయితే, గడువు పెంచడంతో భారీగా పెరుగుతాయని ఎక్సైజ్ వర్గాలు భావించినా ఆ స్థాయిలో ఫలితం కానరాలేదు. కొత్తగా 387 దరఖాస్తులే రావడంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 4,430కి చేరింది. దీంతో ఒక్క దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున ఎకై ్సజ్ శాఖకు రూ.132.90కోట్ల ఆదాయం సమకూరింది. గత పాలసీలో రూ.2లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును రూ.3లక్షలకు పెంచడమే స్పందన రాకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. ముఖం చాటేసిన ఏపీ వ్యాపారులు జిల్లాలోని పలువురు వ్యాపారులతో సిండికేట్గా మారిన ఏపీ వ్యాపారులు వైన్స్కు దరఖాస్తులు సమర్పించారు. గడువు పెంచాక మరికొందరు వస్తారని భావించినా రాలేదు. ఇప్పటికే చాలా టెండర్లు వేసినందున మరోమారు రాలేమంటూ తమకు ఫోన్ చేసిన ఎకై ్సజ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. బల్క్ టెండర్లే ఎక్కువ మద్యం వ్యాపారులు ఈసారి దుకాణాలు దక్కించుకునేందుకు బల్క్గానే దరఖాస్తులు వేశారు. గ్రూప్లుగా ఏర్పడిన పలువురు ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వైన్స్ కోసం టెండర్లు వేశారు. ఒక్కో గ్రూప్ నుంచి 20 మొదలు 70 వరకు దరఖాస్తులు వేసినట్లు తెలిసింది. కొన్ని షాపులకు ఆంధ్రా – తెలంగాణ వ్యాపారులు సిండికేట్ అయి టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇక బార్ షాపుల యజమానులు ఒకరిద్దరు తప్ప మిగతా వారు వైన్స్పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఏదిఏమైనా ఈనెల 27వ తేదీన జరిగే డ్రాలో వైన్స్ దక్కించుకునేదెవరో తేలనుంది. -
సీతారామా.. వేగమేదయా?!
●సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు లక్ష్యం మేర సాగడం లేదు. భద్రాద్రి జిల్లాలో మూడు పంపుహౌస్లు, 104 కి.మీ. మేర ప్రధాన కాల్వ పూర్తయినా.. ఖమ్మం జిల్లాలో ప్రధాన కాల్వ, టన్నెళ్ల తవ్వకంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.19,324 కోట్లకు పెంచినప్పటికీ ఆ మేరకు నిధులు రావడం లేదు. జూలూరుపాడు వద్ద టన్నెల్ తవ్వకం ప్రారంభానికే నోచుకోకపోగా, తిరుమలాయపాలెం వద్ద టన్నెల్ సగంలో నిలిచిపోయింది. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మాణం నిదానంగా సాగుతోంది. ఇప్పటివరకు చేసిన పనులు, భూసేకరణకు సంబంధించి రూ.258.26 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండడంతో పనులు ఊపందుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో నత్తనడక.. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండు జిల్లాల్లో పనులను 16 ప్యాకేజీలుగా విభజించారు. భద్రాద్రి జిల్లాలో ప్రధాన కాల్వ నిర్మాణం, మూడు పంప్హౌస్ల పనులు పూర్తికాగా, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి టెండర్లు, భూసేకరణ సాగుతోంది. డిస్ట్రిబ్యూటరీలను భద్రాద్రి జిల్లాలో 1, 2, 7, 8, ఖమ్మం జిల్లాలో 3, 4, 5, 6ప్యాకేజీలుగా చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 6వ ప్యాకేజీ మినహా మిగతా వాటికి అనుమతులే రాలేదు. అలాగే, ప్రధాన కాల్వ పనులు పూర్తి కాలేదు. ఇక 13 నుంచి 16 ప్యాకేజీల్లో సత్తుపల్లి ట్రంక్, పాలేరు లింక్ కెనాల్ పనులు పెండింగ్ ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 1,138.693 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో అనుమతులు రావాల్సి ఉంది. ప్రధాన కాల్వకు అడ్డంకులు ఖమ్మం జిల్లాలో 13 నుంచి 16 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వలు నిర్మించాలి. ఏన్కూరు నుంచి 75 కి.మీ. మేర ప్రధాన కాల్వ తవ్వితేనే గోదావరి జలాలు రిజర్వాయర్లోకి చేరతాయి. దీంతో ఎన్నెస్పీ ఆయకట్టును స్థిరీకరించినట్టవుతుంది. కానీ భూసేకరణ, నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. అంతేకాక 13వ ప్యాకేజీలో 10.53 కి.మీ. కాల్వ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్యాకేజీలో 167.76 ఎకరాల పట్టా, 213.60 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని ప్యాకేజీల్లో ఇలా.. ప్యాకేజీ 14లో 10.50కి.మీ. నుంచి 39.50కి.మీ. వరకు 29కి.మీ. మేర కాల్వ నిర్మించాలి. ఇంకా 26.11 కిలోమీటర్లు పూర్తి కావాలి. ఈ పరిధిలో రెండు రైల్వేలైన్లు, ఒక గ్యాస్ పైప్లైన్ ఉండగా, 1,021 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అందులో 872 ఎకరా లు మాత్రమే సేకరించగా 761ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇంకా రూ.80.85 కోట్లు పెండింగ్ ఉంది. ప్యాకేజీ 15లో 23.20కి.మీ. కాల్వకు గాను 16.96 కి.మీ. పనులు జరుగుతున్నాయి. ఇందులో రెండు అక్విడెక్ట్లు ఉన్నాయి. ఈ ప్యాకేజీలో 740 ఎకరాలకు గాను 685 ఎకరాలు సేకరించి 34 ఎకరాలకే పరిహారం చెల్లించారు. ప్యాకేజీ 16లో 4.57 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి 1.20 కి.మీ.మేర పనులు సాగుతున్నాయి. ఇక్కడ అవసరమైన 336 ఎకరాల్లో 321 ఎకరాల భూమి సేకరించి 12 ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇంకా రూ.2.09 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలో అప్రోచ్ కెనాల్ నిర్మాణానికి రూ.70కోట్లు మంజూరు చేశారు.ఖమ్మం జిల్లాలోని 16వ ప్యాకేజీ కింద తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం నుంచి కూసుమంచి మండలం పోచారం వరకు 8.2 కి.మీ. టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు నాలుగు కి.మీ. పూర్తికాగా రూ.170 కోట్ల బిల్లుల్లో రూపాయీ విడుదల కాక కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. పూర్తయిన టన్నెల్లోనూ నిలిచిన నీటి తొలగింపునకు మూడు నెలలు పడుతుంది. 2022లో మొదలైన ఈ టన్నెల్ పనులను తొలుత 2024 నాటికి, ఆతర్వాత 2026 సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ అప్పటికీ పూర్తవడం కష్టమే. ఇక భద్రాద్రి జిల్లా జూలూరుపాడు వద్ద 1.650 కి.మీ. టన్నెల్ నిర్మాణం మొదలే కాకపోగా, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పరిధిలో యాతాలకుంట వద్ద కూడా నత్తనడకన సాగుతున్నాయి. ప్రధాన కాల్వ పనులతో పాటు టన్నెల్ పనులు పూర్తయితేనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి అందుతాయి.భూసేకరణ సమస్య, నిధుల కొరతతో ఆటంకం -
ప్రేమ, ఆప్యాయత వెల్లివిరియాలి
● ప్రజల్లో అవగాహనకు ఖమ్మం యువకుడి ప్రయత్నం ● ఖమ్మం నుంచి ఉదయ్పూర్కు సైకిల్యాత్ర ఖమ్మం రాపర్తినగర్: మనుషులంతా రాగద్వేషాలు మరిచి.. ప్రేమ, ఆప్యాయతతో జీవనం సాగించాలని.. తద్వారా ఆనందమయ సమాజం ఏర్పాటుతుందని భావించిన ఓ యువకుడు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్యాత్ర మొదలుపెట్టాడు. ఖమ్మంలో ఫార్మా–డీ చదువుతున్న వీఎస్.భావిన్ గతనెల 28న యాత్రను చేపట్టి మార్గమధ్యలో ప్రజలకు వివరిస్తూ ఈనెల 13న గమ్యస్థానమైన రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చేరాడు. 1,500 కిలోమీటర్ల యాత్ర.. ప్రతిరోజు 100 కి.మీ. వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని భావిన్ దాదాపు 1,500 కి.మీ. మేర సైకిల్యాత్ర చేశాడు. ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వరకు రోడ్డు సాఫీగా ఉండడంతో 80కి.మీ చొప్పున రోజు వెళ్లినా.. అక్కడి నుంచి దాదాపు 30 కి.మీ. వరకు రోడ్డు మరమ్మతులతో ఆలస్యమైందని పేర్కొన్నాడు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్లోకి ప్రవేశించిన ఆయన రాత్రి సమయాన గుడారం, పెట్రోల్బంక్, దేవాలయాలు, దాబాల్లో బస చేసేవాడు. తన యాత్రకు సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు సహకరించారని, ఈ యాత్ర ద్వారా కొందరిలో మార్పు వచ్చినా తన లక్ష్యం నెరవేరినట్లేనని భావిన్ పేర్కొన్నాడు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం,ఆరాధన తదితర పూజలు చేశారు.అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 26న క్రీడా జట్ల ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన ఈనెల 26వ తేదీన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14, 17 క్రీడా జట్లను ఎంపిక చేయనున్నట్లు కార్యదర్శి వై,రామారావు తెలిపారు. లాన్ టెన్నిస్, స్కేటింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, జూడోలో బాలబాలికల ఎంపిక పోటీలు సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతాయని, క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకల్లా హాజరు కావాలని సూచించారు. ‘తెలంగాణ రైజింగ్’పై సిటిజన్ సర్వే.. ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర పురోగతికి మార్గనిర్దేశం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’అనే దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల ఆకాంక్షలు, ప్రాధాన్యతలు, ఆలోచనలను సంగ్రహించడానికి సిటిజన్ సర్వే ప్రారంభించింది. ఈ నేపథ్యాన ఖమ్మం డిపో ఉద్యోగులు, బస్టాండ్లోని ప్రయాణికులు కూడా పాల్గొనేలా క్యూఆర్ కోడ్ స్కానర్ను అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొనాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. స్కూళ్లలో వసతులకు ప్రతిపాదనలు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ ఖమ్మం సహకారనగర్: మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్, అదనపు కలెక్టర్, డీఈఓ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం మధి ర నియోజకవర్గ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై వారు హెచ్ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజీవ్, శ్రీజ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో అవసరమైన పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. తద్వారా నిధులు మంజూరవుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు శశిధర్, రామకృష్ణ, హెచ్ఎంలు, హాస్టళ్ల వార్డెన్లు పాల్గొన్నారు. ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం ! ఆర్టీసీ అధికారుల వినూత్న కార్యక్రమం -
ఇసుక అక్రమ రవాణాకు చెక్
ముదిగొండ: నిరంతరం తనిఖీలు చేపడుతున్నా, పలు వాహనాలను సీజ్ చేస్తున్నా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. దీంతో ట్రాక్టర్ల రాకపోకలను అడ్డుకునేలా ముదిగొండ మండలంలోని పెద్దమండవ, గంధసిరి మున్నేటి వద్ద గురువారం కందకాలు తీయించారు. ముదిగొండ సీఐ ఓ.మురళి ఆధ్వర్యాన కందకాలు తీయించగా, ఆయన మాట్లాడారు. గంధసిరిలోని లంక సమీపాన ఇసుకను చింతకాని మండలానికి అక్రమంగా తరలిస్తున్నారనే ఫిర్యాదులతో ట్రాక్టర్లను కట్టడి చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.బాలుడిపై లైంగిక దాడికి యత్నం ఖమ్మం అర్బన్: ఖమ్మం అర్బన్ పోలీస్స్టేషన్ పరిధి ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడిపై అదే గ్రామ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి లైంగిక దాడికి యత్నించాడు. అంతేకాక వికృత చర్యలకు పాల్పడినట్లు బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై విద్యార్థిని కోర్టు ఆదేశాలతో చైల్డ్ హోమ్కు తరలించినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. ప్రేమ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య కల్లూరురూరల్: మండలంలోని పేరువంచకు చెందిన బాలిక ప్రేమ పేరిట ఎదురవుతున్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన తురక అనిల్ కొన్నాళ్లుగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధిస్తుండడమే కాక అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో గురువారం అనిల్పై కేసు నమోదు చేసినట్లు కల్లూరు ఎస్సై హరిత తెలిపారు. -
ఏఎన్ఎం కోర్సుతో ఉపాధి అవకాశాలు
ఖమ్మంఅర్బన్: ఏఎన్ఎం కోర్సు పూర్తిచేసిన యువతులకు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, తద్వారా సేవాస్ఫూర్తితో విధులు నిర్వర్తించవచ్చని డీఎంహెచ్ఓ బి.కళావతి బాయి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో ఎంపీహెచ్డబ్ల్యూ (నర్సింగ్ కోర్సు) పూర్తి చేసిన విద్యార్థినులకు గురువారం క్యాపింగ్ ఉత్సవం నిర్వహించగా ఆమె మాట్లాడారు. నిరుపేద విద్యార్థినులకు మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ మాట్లాడుతూ రెండేళ్ల కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. డీసీహెచ్ఎన్ శేషు పద్మ మాట్లాడగా కోర్సు పూర్తి చేసిన వారికి పత్రాలు అందజేశారు. మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేతతో పాటు ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, విజయ్కుమార్, సుధీర్, సుకన్య, లాలయ్య, మౌనిక, దుర్గారావు, శాంతమ్మ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
నా ‘అన్న’ వారు రాకున్నా...
రఘునాథపాలెం: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్తుల సహకారంతో ఆయన మిత్రులు నిర్వహించారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన అడ్డగిరి రాంప్రసాద్(35) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఆయన తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందగా, మరో గ్రామంలో ఉంటున్న సోదరుడికి సమాచారం ఇచ్చినా రాలేదు. దీంతో రాంప్రసాద్ స్నేహితులైన మడ్డాల నవీన్, కందుకూరి నాగ, గంగవరపు వెంకటేశ్వరరావు, వీరముష్టి వెంకన్న, టంగుటూరి మహేష్ తదితరులు ముందుకొచ్చి ఆయన అంత్యక్రియలను గురువారం నిర్వహించారు. అంతేకాక గ్రామస్తులు పలువురు ఆర్థిక సాయం అందజేశారు.స్నేహితుడి అంత్యక్రియలు నిర్వహించిన బృందం -
● పత్తి చే‘జారి’పోతోంది..!
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయం కాగా, రైతులకు నష్టం జరిగినట్లయింది. ఈ ఏడాది పత్తి సాగులో మొదటి నుంచి అవాంతరాలు వస్తుండగా దిగుబడి తగ్గుతోంది. ఇంతలోనే భారీ వర్షం కురవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. చెట్ల నుంచి పత్తి కారి పోతుండగా, మరో రెండు రోజుల పాటు వర్షం ఉంటే పత్తి చేజారినట్లేనని చెబుతున్నారు. మిగిలిన పత్తి కూడా నల్లబడి మద్దతు ధర దక్కదని ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈమేరకు ప్రభుత్వం స్పందించి రంగు మారిన పత్తిని కూడా సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయించాలని కోరుతున్నారు. అలాగే, పలుచోట్ల వరి చేన్లు కూడా నేలవాలాయి. – కొణిజర్ల / ఏన్కూరు / తల్లాడ /తిరుమలాయపాలెం -
వరిలో తెగుళ్ల బెడద
కల్లూరు: ఈ వానాకాలం సీజన్లో సాగు చేస్తున్న వరిలో అధిక వర్షాల కారణంగా ఎండాకు తెగులు సోకుతోంది. కల్లూరు మండలంలో సాగర్ ఆయకట్టు కింద సుమారు 33,740 ఎకరాల్లో వరి సాగు చేశారు. జూన్, జూలై నెలల్లో వేసిన పంట బాగానే ఉన్నా, ఆగస్టులో సాగు చేసిన పొలాలకు మాత్రం ఎండు తెగులు ఆశించింది. గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఇలా జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అంతేకాక వరి మడి నుంచి వేరే మడిలోకి నీరు చేరినప్పుడు తెగులు కూడా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. మండలంలోని సుమారు 7,500 ఎకరాల పంటకు ఈ తెగులు సోకగా, దిగుబడి పది బస్తాలైనా వస్తుందో, రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏడీఏ శ్రీనివాసరెడ్డి, ఏఓ ఎం.రూప పైర్లను పరిశీలించి తెగులు నివారణపై రైతులకు సూచనలు చేశారు. ఆరుగాలం కష్టపడి వరి సాగు చేస్తే వాతావరణంలో తేడాతో తెగుళ్లు వ్యాపించాయి. అధిక వర్షాలతో వరి పైరుకు ఎండాకు తెగులు ఆశించింది. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇప్పటికే చాలావరకు తాలు కంకులు వచ్చాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – రంగు లక్ష్మణ్రావు, రైతు -
అక్రమ కేసులు పెడితే సహించం..
సత్తుపల్లి/ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ కార్యకర్తల జోలికి వచ్చినా, అక్రమ కేసులు బనాయించినా సహించేది లేదని మాజీ ఎంపీ సీతారాం నాయక్ హెచ్చరించారు. ఇటీవల సత్తుపల్లిలో తమ కార్యక్రమాలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. సత్తుపల్లిలో బీసీ బంద్ సందర్భంగా జరిగిన ఘర్షణపై బీజేపీ ఆధ్వర్యాన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటుచేయగా, బీజేపీ ఓబీసీ, ఎస్సీ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు గంగామల్ల ఆనందగౌడ్, అత్తునూరి క్రాంతికిరణ్తో కలిసి సీతారాంనాయక్ బుధవారం సత్తుపల్లి పర్యటించారు. అనంతరం సత్తుపల్లి, ఖమ్మంలో ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పోలీసులు బీజేపీ నాయకులపైనే అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు, గిరిజన నాయకుడు బానోతు విజయ్పై దాడి పోలీసులకు కనబడలేదా అని ప్రశ్నించారు. బీసీలపై ఎస్సీలతో కేసు పెట్టించడంపై పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ చెప్పినట్లు బీసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలంటే మంత్రివర్గంలోని ఓసీలను తొలగించి బీసీ నియమించాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ తీరుతో బీసీలకు రిజర్వేషన్లు రావని తెలిపారు. బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, నాయకులు ఈ.వీ.రమేష్, నాయుడు రాఘవరావు, సాలి శివ, సురేందర్రెడ్డి, రహ్మతుల్లా, బాలకృష్ణారెడ్డి, మట్టా ప్రసాద్, గెంటెల విద్యాసాగర్, రామలింగేశ్వరరావు, నున్నా రవి, నాయుడు రాఘవరావు, గుతా్త్ వెంకటేశ్వర్లు, రవిరాథోడ్, వీరవెల్లి రాజేష్గుప్తా, ఎన్.బెనర్జీ, మందడపు సుబ్బారావు, జ్వాల నరసింహారావు పాల్గొన్నారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్ -
రైతు వేదికలు
● మూడేళ్లుగా అందని నిర్వహణ నిధులు ● ఒక్కో క్లస్టర్కు రూ.3.33 లక్షల బకాయి ● భారం భరించలేక ఏఈఓల ఇక్కట్లుభారంగా మారిన నేలకొండపల్లి/కామేపల్లి: రైతులకు సాగులో మెళుకువలు, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడమే కాక శాస్త్రవేత్తల ద్వారా సలహాలు ఇప్పించాలనే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికల ద్వారా ఆ స్థాయిలో సేవలు అందడం లేదు. నిర్వహణ నిమిత్తం గత మూడేళ్లగా ప్రభుత్వం పైసా విదల్చకపోవటంతో వ్యవసాయ విస్తీరణాధికారులు (ఏఈఓ) సొంత నగదుతో నెట్టుకొస్తున్నారు. దీంతో రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఒక్కో క్లస్టర్కు దాదాపు రూ.3.33 లక్షల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. పనిభారంతో సతమతం అవుతున్న తాము ఇకపై నగదు వెచ్చించే స్థితిలో లేమని ఏఈఓలు వాపోతున్నారు. 2020లో నిర్మాణం గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్కు ఓ రైతు వేదికను నిర్మించింది. జిల్లాలో 129 రైతు వేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3 వేల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఆ నిధులు చాలవని వ్యవసాయ శాఖ నివేదించడంతో రూ.9 వేల చొప్పున నిధులు విడుదల చేస్తామని 2020 ఏప్రిల్లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్లో ఐదు నెలలకు సంబంధించి రూ.45 వేల చొప్పున విడుదలయ్యాయి. ఇక అప్పటి నుంచి అంటే 37 నెలలకు సంబంధించి ఒక్కో రైతువేదికకు దాదాపు రూ.3.33 లక్షల నిధులు బకాయి ఉన్నాయి. వసతులు కరువు అట్టహాసంగా నిర్మించిన రైతు వేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈఓలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేలా కంప్యూటర్లు ఉన్నా విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈఓలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాని సూచించినా వారూ పట్టించుకోవడం లేదు. అంతేకాక చాలా చోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు మరింత అవస్త పడుతున్నారు. అలాగే, 2019లో ఏఈఓలకు ఇచ్చిన ట్యాబ్లు సైతం సరిగా పనిచేయక నివేదికలు అప్లోడ్ చేసే సమయాన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.రైతు వేదికలకు నిర్వహణ నిధులు రావాల్సి ఉంది. చాలా చోట్ల సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయి. నిధుల బకాయిలతో పాటు నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. – డి.పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కారేపల్లి/ఖమ్మం వ్యవసాయం/తల్లాడ: కారేపల్లిలోని శ్రీలక్ష్మీప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో ఇల్లెందు మార్కెట్ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్నాయక్, కోరం కనకయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తోందని తెలిపారు. ఈమేరకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇల్లెందు మార్కెట్ చైర్మన్, కార్యదర్శులు బి.రాంబాబు, నరేష్, వైరా ఏడీఏ కరుణశ్రీ, కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, ధరావత్ భద్రునాయక్, షేరు, యాకూబ్ అలీ, సఫావట్ నాగులు, అడప పుల్లారావు పాల్గొన్నారు. అలాగే, తల్లాడలోని స్టేపు ల్ రిచ్ జిన్నింగ్ మిల్లు, ఖమ్మం మార్కెట్ పరిధి గుర్రాలపాడులోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీభాయి ప్రారంభించారు. పత్తిలో 8 నుంచి 12శాతం మేర తేమ ఉండేలా తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని ఆమె తెలిపారు. వరంగల్ రీజినల్ జేడీ శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీమ్, మార్కెట్ చైర్మన్లు, వైస్చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, బోళ్ల రంగారావు, కాపా సుధాకర్, మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్, సీసీఐ సీపీఓ పవన్కల్యాణ్, ఏఓలు ఎండీ.తాజుద్దీన్, వెంకటేశ్వర్లు, నాయకులు మట్టా దయానంద్, నారాయణవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పక్కా ప్రణాళికతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ
ఖమ్మం అర్బన్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు బాధ్యతగా రోడ్ల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మంలో పది రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణగా రోడ్ల గుంతలు పూడ్చివేయించామని తెలిపారు. కల్లూరు, వైరా, సతుపల్లి, మధిర, ఏదులాపురం మున్సిపాలిటీల పరిధిలోనూ ఇలాగే చేయాలని చెప్పారు. అంతేకాక ఖమ్మం బైపాస్ రహదారిపైనా మరమ్మతులు చేసి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. అలాగే, జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్ల వద్ద త్య్రేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీసు కమిషనర్ సునీల్దత్ మాట్లాడుతూ రహదారులు కలిసే చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, పార్కింగ్ లేకుండా నూతన పాఠశాలలకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు. డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకూబ్, డీఎంహెచ్ఓ కళావతిబాయి, ఆర్టీఓ వెంకటరమణ, నేషనల్ హైవే పీడీలు రామాంజనేయరెడ్డి, దివ్య పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఖమ్మం సహకారనగర్: మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆమె విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్తో కలిసి వీసీ ద్వారా సమీక్షించగా ఖమ్మం నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ మధిర నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు మొదలుపెట్టాలని, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు సిద్ధం చేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ పాఠశాలల్లో టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు, ల్యాబ్ల ఏర్పాటుకు నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, మధిర మండలం మహదేవపురం, చింతకాని మండలం నాగులవంచ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నందున పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ పేరిట ఖాతాలు తెరవాలని తెలిపారు. బనిగండ్లపాడులో అభివృద్ధి పనులకు ఈనెల 25న డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్దత్ -
పనులు కాకపోతే వేతనాల్లో కోత
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలోని 44 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేసి ఎంబీ రికార్డులు సమర్పిస్తే బిల్లులు విడుదలవుతాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని, లేనిపక్షంలో పాఠశాల సిబ్బంది, ఇంజనీరింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. అలాగే, పాఠశాలకు నీటి సరఫరా లేకపోతే భగీరథ పైప్లైన్ నుంచి కనెక్షన్ ఇప్పించాలని తెలిపారు. విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఎంపీడీఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఏఈలు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు తాకిందని దంపతుల ఘర్షణ ఖమ్మంఅర్బన్: ఖమ్మం–వైరా ప్రధాన రహదారి గోపాలపురం వంతెన సమీపాన ఆర్టీసీ బస్సు తమపైకి దూసుకొచ్చిందంటూ బైక్పై వెళ్తున్న దంపతులు డ్రైవర్, కండక్టర్తో ఘర్షణకు దిగారు. బుధవారం మణుగూరు నుంచి ఖమ్మం వస్తున్న ఖమ్మం డిపో బస్సు గోపాలపురం వంతెన వద్ద తమ ద్విచక్ర వాహనాన్ని తాకిందంటూ దంపతులు బస్సును ఆపారు. ఆపై డ్రైవర్ మధు, కండక్టర్ ఆదిలక్ష్మితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించగా, బస్సులో ప్రయాణికులు సైతం బైక్పై వెళ్తున్న వారిదే తప్పని చెప్పారు. అయినా వినకపోగా బస్సును ఖమ్మం అర్బన్ పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా దంపతులు ఆవేశంగా మాట్లాడం, ప్రయాణికులంతా వారినే తప్పుపట్టడంతో సీఐ భానుప్రకాశ్ వారికి సర్దిచెప్పి ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఘటనలో బస్సు గంటకు పైగా నిలిచిపోగా అందులోని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. వివాహిత ఆత్మహత్య కేసులో రౌడీషీటర్ అరెస్ట్ రఘునాథపాలెం: మండలంలోని వీ.వీ.పాలెం గ్రామానికి చెందిన వివాహిత బోడా సుశీల ఆత్మహత్యకు కారణమైన రౌడీషీటర్, అదే గ్రామానికి చెందిన వినయ్ను పోలీసులు అరెస్ట్చేశారు. ఈ మేరకు నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్టు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సుశీలను వేధించడమే కాక లైంగిక దాడికి యత్నించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆమె కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. అసంక్రమిత వ్యాధుల కట్టడిపై దృష్టిమధిర/బోనకల్/ఎర్రుపాలెం/చింతకాని: అసంక్రమిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వరికుటి సుబ్బారావు సూచించారు. మధిర మండం దెందుకూరు, బోనకల్, ఎర్రుపాలెం మండలం బనగండ్లపాడు పీహెచ్సీలను బుధవారం తనిఖీ చేసిన ఆయన టీబీ తదితర వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు చికిత్సపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆతర్వాత ఉద్యోగుల హాజరు, ఓపీ రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందూనాయక్ కూడా పాల్గొనగా వ్యాక్సిన్ల నిల్వలు, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయాల్సిన ఆవశ్యకతపై సూచనలు చేశారు. అలాగే, చింతకాని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. వైద్యాధికారులు స్రవంతి, వి.కావ్య, ప్రశాంత్, అశ్విని, అల్తాఫ్తో పాటు ఉద్యోగులు దానయ్య, సందీప్, కాంతమ్మ, వెంకటేశ్వరావు, అమృత్, వీరేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్ష విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంరూరల్: మండలంలోని కస్నాతండా వద్ద ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.లక్ష విలువైన గంజా యిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నా రు. సీఐ ముష్కరాజు తెలిపిన వివరాలు.. ఖమ్మం రూరల్ మండలం కస్నాతండాకు చెందిన వాంకుడోత్ వినోద్, రంగారెడ్డి జిల్లా కొత్తపేటకు చెందిన వస్కుల రాజు, హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన గొడ్డెమల్ల సాయిరామ్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంకు చెందిన భూక్యా రోహిత్ ఖమ్మం – మహబూబాబాద్ హైవే పక్కన కస్నాతండా సమీపాన మద్యం తాగుతున్నారు. పెట్రోలింగ్లో భాగంగా పోలీసులు అటువైపు వెళ్లగా రోహిత్ పారిపోయాడు. మిగిలిన ముగ్గురిని తనిఖీ చేయగా రూ.లక్షల విలువైన రెండు కేజీల గంజాయి లభించగా, ఒడిశాలోని మల్కన్గిరి నుంచి హైదరాబాద్లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు. లీజ్కు ఇచ్చిన కారు తాకట్టు చింతకాని: దళితబంధు లబ్ధిదారుడు తన కారును లీ జ్కు ఇస్తే ఎదుటి వ్యక్తి తాకట్టు పెట్టడంతో కేసు నమోదైంది. చింతకాని మండలం తిరుమలాపురానికి చెంది న చాపలమడుగువీరబాబుకు దళితబంధు కింద కారు వచ్చింది. ఈ కారును లచ్చగూడెం వాసి తాటికొండ డిసిల్వాకు లీజ్కు ఇచ్చాడు. ఆయన ఖమ్మంలో వ్యక్తి వద్ద తాకట్టుపెట్టి రూ.లక్షన్నర తీసుకోగా, అదేకారును ఏపీలోని నూజివీడు వాసికి తాకట్టు పెట్టాడు. ఈ విష యం తెలిసి వీరబాబు వెళ్లి అడగగా రూ.లక్షన్నర ఇస్తే కారు ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన వీరబాబు చేసిన ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్షఖమ్మం లీగల్: ఓ మహిళ తీసుకున్న అప్పు చెల్లించేందుకు జారీచేసిన చెక్కు చెల్లకపోవడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు జడ్జి ఏపూరి బిందుప్రియ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం సంభానీనగర్కు చెందిన మేకల రాంబాబు వద్ద మామిడిపద్మ 2020నవంబర్లో రూ.5లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2023 జూన్లో చెక్కు ఇచ్చి నామె ఖాతాలో నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో రాంబాబు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసుదాఖలు చేశాడు. విచారణ అనంతరం పద్మకు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
మైలురాయిగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ విద్యాచరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాతో మంత్రి హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవేశాలు, భవన నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించాక మంత్రి మాట్లాడారు. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ దేశంలోనే మొదటిది కాగా, ప్రపంచంలో రెండోదని తెలిపారు. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ విద్యాసంస్థకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక్కడ చదివే విద్యార్థులు భూశాస్త్రవేత్తలు, ఖనిజ నిపుణులుగా కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఎన్ఎండీసీ, సింగరేణి, కోల్ ఇండియా ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.వీసీ యోగితారాణాతో భేటీలో మంత్రి తుమ్మల -
వరి కోతల్లో జాగ్రత్తలతో అధిక దిగుబడి
కూసుమంచి: వరి కోతల వేళ రైతులు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక దిగుబడి నమోదవుతుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండలంలోని పెరికసింగారంలో వరి కోతలనుబుధవారం ఆయన పరిశీలించి విత్తన రకాలు, పెట్టుబడి, దిగుబడులపై ఆరా తీశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ కోతల వేళ ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చూడడమేకాక, ఆరబోయడంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కూసుమంచిలోని పలు ఎరువుల దుకాణాల్లో నిల్వలు, రికార్డులను తనిఖీ చేశారు. ఆతర్వాత కూసుమంచి ఏఓ కార్యాలయంలో వ్యవసాయ యాంత్రికీకరణకు అందిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఏఓ వాణి, ఏఈఓలు నవీన్, రవీందర్, వంశీకృష్ణ, సౌమ్య, ప్రియాంక పాల్గొన్నారు. టీకాలతోనే పశువులకు ఆరోగ్యం ముదిగొండ: రైతులంతా తప్పనిసరిగా పశువుల కు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, తద్వారా జీవాలు ఆరోగ్యంగా ఉంటా యని జిల్లా పశు వైద్యాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. ముదిగొండ మండలంలోని పమ్మి, సువర్ణాపురం, నూలక్ష్మీపురంలో వ్యాక్సినేషన్ శిబిరాలను బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పశువైద్య సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తూ టీకాలు వేయించాలని సూచించారు. లేదంటే సీజనల్గా వచ్చే వ్యాధులతో పశువులు నీరసించి వ్యవసాయ పనులకు సహకరించవని తెలిపారు. అనంతరం గ్రామాల్లో ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు అందచేసిన గేదెలను పరిశీలించి పోషణపై సూచనలు చేశారు. మండల పశువైద్యాధికారి అశోక్, ఇందిరా మహిళా డైరీ ఏపీఎంలు లక్ష్మణ్ రావు, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఓసీల్లో నిబంధనల అమలుపై ఆరా సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్, కిష్టారం సింగరేణి ఉపరితల గనులను పర్యావరణ, అటవీ శాఖల సభ్యులు ప్రొఫెసర్ ఆర్ఎం భట్టాచార్జీ, పర్యావరణ జనరల్ మేనేజర్ సైదులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలు ఆరా తీశారు. అలాగే, బొగ్గు రవాణా సమయాన దుమ్ము లేకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకున్నారు. కాలుష్యాన్ని అరికడుతూ పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఏరియా జీఎం షాలేం రాజు, ఓసీ పీఓ ఎస్వీఆర్.ప్రహ్లాద్, ఉద్యోగులు కోటిరెడ్డి, రాజేశ్వరరావు, కల్యాణ్రామ్, రవికిరణ్, పి.సత్యనారాయణ పాల్గొన్నారు. లోటుపాట్లు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కల్లూరురూరల్: ఎలాంటి సమస్యలు రాకుండా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్కుమార్ సూచించారు. కల్లూరు రైతు వేదికలో బుధవారం ఆయన తహసీల్దార్ పులి సాంబశివుడు, ఏఓ ఎం.రూప తదితరులతో సమావేశమయయ్యారు. కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, కాంటాలు సమకూర్చుకోవాలని, ధాన్యం బస్తాలకు ట్యాగ్ వేశాకే మిల్లులకు పంపించాలని తెలిపారు. అంతేకాక రైతుల పూర్తి వివరాలను పోర్టర్లో నమోదు చేస్తే వారికి త్వరగా నగదు జమ అవుతుందని చెప్పారు. అనంతరం ఎర్రబోయినపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డీసీఎస్ఓ తేమ శాతాన్ని పరీక్షించారు. -
పత్తి కొనుగోళ్లలో సాంకేతిక సమస్య
● సాఫ్ట్వేర్ మొరాయించడంతో నిలిచిన కొనుగోళ్లు ● వచ్చే సోమవారం నుంచి తీసుకురావాలని సూచనఖమ్మంవ్యవసాయం/తిరుమలాయపాలెం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సాఫ్ట్వేర్లో ఎదురైన సాంకేతిక సమస్యలతో కొనుగోళ్లు నిలిచిపోగా, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులు పత్తి వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎనిమిది జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలుకు నిర్ణయించగా, రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళ, బుధవారాల్లో నాలుగు కేంద్రాలు మొదలయ్యాయి. ఈమేరకు రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని వాహనాల్లో పత్తి తీసుకొచ్చారు. అక్కడ వ్యవసాయ శాఖ నమోదు చేసిన పంట సాగు వివరాలు, స్లాట్ వివరాలు పరిశీలించాక కొనుగోలు చేయాల్సి ఉండగా.. సాఫ్ట్వేర్లో సమస్యతో బ్రేక్ పడింది. ఈమేరకు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సమస్యపై సాఫ్ట్వేర్ సమకూర్చిన సంస్థ నిర్వాహకులతో మాట్లాడి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తొలిరోజు ఒక్కో మిల్లు వద్దకు 10 – 15 వాహనాల్లో పత్తితో రైతులు రాగా, సాయంత్రం కురిసిన వర్షంతో పత్తి కొంతమేర తడిసింది. ఈవిషయమై వివరణ కోరేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. కాగా, గోల్తండాలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయని తెలుసుకున్న మద్దులపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్రెడ్డి, పాలేరు స్పెషల్ ఆఫీసర్ రమేష్ చేరుకుని మార్కెట్, సీసీఐ అధికారులతో మాట్లాడాక తేమ శాతం పరీక్షించి దిగుమతి చేసుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాంకేతిక సమస్యల నేపథ్యాన రైతులు నుంచి పత్తి తీసుకురావాలని అధికారులు సూచించారు. -
అందరూ చదవాలి!
●యాపిల్.. బాల్.. కార్.. డాల్ఏమిటీ కార్యక్రమం.. జిల్లాలోని 814 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 – 5వ తరగతి వరకు విద్యార్థులకు ఇంగ్లిష్ చదివే సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతీరోజు గంట పాటు ఇంగ్లిష్ రాయించడం, చదివిస్తూ ప్రతీ తరగతికి మెటీరియల్ సిద్ధం చేశారు. అంతేకాక యాప్ కూడా రూపొందించారు. ఈ యాప్లో ఉపాధ్యాయులు విద్యార్థుల పేర్లను నమోదు చేయాలి. ఇంగ్లిష్ అక్షరాలు రాయించడం, పలికించడం, ఆ తర్వాత పదాలు, చివరకు వాక్యాలు చదవడం, రాసే స్థాయికి తీసుకెళ్తారు. 29,393 మంది విద్యార్థులు జిల్లాలో 814 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండగా, 29,393 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరినీ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ యాప్లో నమోదు చేస్తారు. ఈనెల 27నుంచి మెటీరియల్ అందించి ఇంగ్లిష్ అక్షరాలు రాయడం, చదివించడంతో మొదలుపెడతారు. వచ్చే నెల 30 నాటికి అంటే నెల రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఎలా పెరుగుతుందనే వివరాలను ప్రతీ బుధవారం యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చింతకానిలో పైలట్ ప్రాజెక్టు ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమ అమలుకు చింతకాని మండలంలోని 12 ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలంలోని పందిళ్లపల్లి, నామవరం, నాగులవంచ, రామకృష్ణాపురం, పాతర్లపాడు, ప్రొద్దుటూరు, కోమట్లగూడెం, చింతకాని, కొదుమూరు, అనంతసాగర్, బస్వాపురం, నేరడ పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థుల చొప్పున 650 మంది విద్యార్థులను యాప్లో నమోదు చేశారు. ఇప్పటికే ఇంగ్లిష్ అక్షరాలు పలికిండచంతో కార్యక్రమం మొదలైంది. 12 పాఠశాలల్లో ఈనెల 14న మొదలైన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 27వ తేదీ నుంచి ప్రారంభిస్తారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లిష్ అభ్యసన సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రాథమిక స్థాయిలో పట్టు సాధించకపోవడంతో పై తరగతులకు వెళ్లేకొద్ది ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన సందర్భంగా ఇంగ్లిష్లో చాలా మంది విద్యార్థులు వెనకబడి ఉన్నారని గ్రహించారు. ఈమేరకు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు తర్ఫీదు సాధించేలా ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం814 ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఇంగ్లిష్పై పట్టు సాధిస్తే ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ ఉద్దేశంతోనే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం తీసుకున్నాం. చింతకాని మండలంలోని కొన్ని పాఠశాలల్లో పైలట్గా ప్రారంభించాం. ఆపై జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించనున్నాం. ఇక్కడ విజయవంతం అయ్యాక అంగన్వాడీ కేంద్రాల్లోనూ అమలుచేస్తాం. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్ -
శిశువులకు శ్రీరామరక్ష
● 108 నియోనాటల్ ద్వారా అత్యవసర వైద్యం ● నవజాత శిశువు మరణాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు ● ఉమ్మడి జిల్లాలో 1,971 మందికి సేవలు ఖమ్మంవైద్యవిభాగం: అప్పుడే పుట్టిన శిశువు మొదలు 30రోజుల లోపు వయస్సు వారిని నవజాత శిశువులుగా పరిగణిస్తారు. ఈ వయస్సు శిశువుల సంరక్షణపై అవగాహన లేక కొన్ని, సరైన పోషణ అందక ఇంకొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈక్రమాన శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యాన మరణాలు తగ్గించేలా అత్యవసర వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 నియోనాటల్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ సేవలతో ఉమ్మడి జిల్లాలో వందలాది మంది శిశువుల ప్రాణాలు నిలిచాయి. ఉమ్మడి జిల్లాకు రెండు అంబులెన్స్లు కేటాయించగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందులకు సిబ్బంది వైద్యం అందిస్తూనే పెద్దాస్పత్రులకు తరలిస్తూ శిశు మరణాల తగ్గింపునకు పాటుపడుతున్నారు. రెండేళ్లుగా నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 108 నియోనాటల్ అంబులెన్స్ సేవలు రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు ఇప్పటి వరకు 1,971 మంది శిశువులకు వైద్య సేవలు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సాధారణంగా 108 వాహనంలో శిశువు చికిత్సకు అవసరమైన సౌకర్యాలు ఉండవు. ఈమేరకు ప్రత్యేక పరికరాలతో నియోనాటల్ అంబులెన్స్లు సమకూర్చారు. ఇందులో వెంటిలేటర్ సౌకర్యంతో పాటు ఇంక్యూబేటర్, పల్స్ ఆక్సీమీటర్, సిరంజ్ పంప్, ఆక్సిజన్ సిలిండర్ ఉంటాయి. బరువు తక్కువ ఉన్న శిశువులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో పుట్టేవారు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారికి అత్యవసర చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు చేర్చడం సులువవుతోంది. నవజాత శిశు మరణాల నివారణే... కొన్నేళ్లుగా జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. బరువు తక్కువగా పుట్టడం, అవయవాల ఎదుగుదలలో లోపాలతో జన్మిస్తున్న వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుంది. అయితే, శిశువు పరిస్ధితి ఇబ్బందిగా మారినప్పుడు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యాన ఉమ్మడి జిల్లాకు రెండు నియోనాటల్ అంబులెన్స్లను కేటాయించగా వీటిలో వైద్యం అందిస్తూ పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. తద్వారా శిశు మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో చిన్నచిన్న సమస్యలకు కూడా కొందరు వైద్యులు వైద్యం చేయకుండా రిఫర్ చేస్తున్నారని, అలా కాకుండా జిల్లాలోనే వైద్యం అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.ఉమ్మడి జిల్లాలో రెండు నియోనాటల్ వాహనాల ద్వారా సేవలు అందుతున్నాయి. శిశువులకు చికిత్స చేస్తూనే పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారామరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. అత్యవసర వైద్యం అవసరమైన శిశువులనే రిఫర్ చేస్తే మరింత మందికి సేవలు అందుతాయి. – శివకుమార్, ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ -
ఉత్తమ ఫలితాలను సాధిద్దాం..
ఖమ్మం సహకారనగర్: ప్రతీ విద్యార్థికి ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్ సామర్థ్యాలు పెంచేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్లో ఇబ్బంది పడకుండా ఆంగ్లంపై పట్టు సాధించేలా వచ్చే సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలయ్యే ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ముప్ఫై రోజుల పాటు ప్రతీరోజు విద్యార్థి గంట సేపు చదివి సామర్థ్యాలు పెంచుకునేలా బుక్లెట్ తయారు చేశామన్నారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నందున కాస్త దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ చింతకాని మండలంలోని కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. మిగతా చోట్ల ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
ఇకపై ఒకే పిన్కోడ్
ఖమ్మం అంతటికీ 507 001 ● బట్వాడా కేంద్రాల విలీనం.. ఐడీసీ ఏర్పాటు ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలు వేగంగా, సమర్ధవంతంగా నిర్వహించేలా సంస్కరణలు తీకొస్తున్నారు. ఇందులో భాగంగానే నగరాలు, పట్టణాల్లో ఒకటికి మించి ఉన్న బట్వాడా కేంద్రాలను విలీనం చేస్తూ ‘ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్’(ఐడీసీ) ఏర్పాటుకు తపాలా శాఖ నిర్ణయించింది. తద్వారా కౌంటర్(ఫ్రంట్ ఆఫీస్), పంపిణీని క్రమబద్ధీకరించి బట్వాడా వేగంగా పూర్తిచేయొచ్చని చెబుతున్నారు. ఐడీసీగా ఖమ్మం హెడ్పోస్టాఫీస్ ఖమ్మం నగరంలోనూ కొత్త విధానం అమలుచేయనున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో టౌన్–1(హెడ్ పోస్టాఫీస్–507001), టౌన్–2(పాత కలెక్టరేట్–507002), టౌన్–3(గాంధీచౌక్–507003) బట్వా డా కేంద్రాలు ఉన్నాయి. మూడింటికి వేర్వేరు పిన్కోడ్ నంబర్లు ఉండడంతో కొత్త వ్యక్తులకు తెలియక పొరపడితే గమ్యస్థానాలకు చేర్చడంలో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన మూడు కేంద్రాలను విలీనం చేసి ఖమ్మం హెడ్ పోస్టాఫీస్ కేంద్రంగా ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. దీంతో మూడు పిన్కోడ్లను రద్దు చేసి నగరమంతా 507001 పిన్కోడ్ అమలుచేస్తారు. చకచకా ఏర్పాట్లు ఖమ్మం హెడ్పోస్టాఫీస్లో ఐడీసీ ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. మూడు పోస్టాఫీసుల్లో పనిచేసే 29 మంది పోస్టుమెన్లు ఇకపై ఐడీసీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో అందరికీ సరిపడా ఏర్పాట్లు సాగుతున్నాయి. బట్వాడా వస్తువుల పరిశీలన, పోస్టుమెన్ల సీటింగ్ పనులను త్వరలోనే పూర్తి చేసి ఐడీ సెంటర్ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఖమ్మం నగరమంతా హెడ్ పోస్టాఫీస్ నుంచే బట్వాడాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు బట్వాడా కేంద్రాలు ఉండడంతో పలు సందర్భాల్లో జాప్యం జరిగి వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించి.. వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా ఐడీసీ ఏర్పాటు చేయనున్నాం. – కె.సుబ్రహ్మణ్యం, పోస్టుమాస్టర్, హెడ్పోస్టాఫీస్, ఖమ్మం -
ముత్తగూడెం చెక్పోస్టు తొలగింపు
సత్తుపల్లి: పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని రవాణా శాఖ చెక్పోస్టును బుధవారం అధికారులు తొలగించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పలుచోట్ల లెక్కాపత్రం లేని నగదు బయటపడింది. ఈమేరకు అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టుల తొలగింపునకు నిర్ణయించింది. ఇందులో భాగంగా డీటీఓ ఎం.వెంకటరమణ పర్యవేక్షణలో ముత్తగూడెంలోని చెక్పోస్టు నుంచి సామగ్రిని ఖమ్మం తరలించారు. అంతేకాక చెక్పోస్టును మూసివేసినట్లు చెబుతూ మూడు భాషల్లో ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎంవీఐ రాజశేఖర్, ఏఎంవీఐ రాజశేఖర్రెడ్డి, ఉద్యోగులు బడేషా, సరిత, అశోక్ ఉన్నారు. నేటితో ముగియనున్న వైన్స్ టెండర్లు ఖమ్మంక్రైం: జిల్లాలోని 116వైన్స్ దక్కించుకునేందుకు టెండర్లు దాఖలు చేసే గడువు గురువారంతో ముగి యనుంది. ఈమేరకు బుధవారం 50 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,177 దరఖాస్తులు రాగా, చివరిరోజు మరిన్ని వస్తాయని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణాల్లో వేగం పెంచాలి ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మోడల్ మిర్చి మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి ఆదేశించారు. పనులను బుధవారం పరిశీలించిన ఆమె అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో చర్చించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ లక్ష్మణ్గౌడ్, ఈఈ యల్లేష్, వరంగల్ జేడీ ఉప్పల శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్, వైస్చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల రక్షణలో పోలీసులే కీలకం
ఖమ్మంక్రైం: శాంతి భద్రతల సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీసు కమిషనర్ సునీల్దత్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తూ, అమరులైన సిబ్బందికి నివాళులర్పించడం అందరి బాధ్యత అని తెలిపారు. ఏ కార్యక్రమమైనా శాంతియుతంగా కొనసాగాలంటే పోలీసుల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. దీపావళి, హోలీ, వినాయక నిమజ్జనం వంటి వేడుకలు ప్రశాంతంగా కొనసాగడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నందున, పౌరులు వారికి కృతజ్ఞతగా ఉండాలని తెలిపారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ప్రజారక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని తెలిపారు. కాగా, పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 24న రక్తదాన శిబిరం, 25న సైకిల్ ర్యాలీ, 27వ తేదీన సిబ్బందికి వ్యాసరచన పోటీలు, 28వ తేదీన విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత అధికారులు, అమరవీరుల కుటుంబసభ్యులు స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఈ ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పేర్లను ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి వినిపించారు. అడిషనల్ డీసీపీలు రామానుజం, ప్రసాద్రావు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు, సుశీల్సింగ్, నర్సయ్య, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, అప్పలనాయుడు, నాగుల్మీరా, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్బాబు, భానుప్రకాష్, రాజిరెడ్డి, రామకృష్ణ, చిట్టిబాబు, సత్యనారయణ, ఉస్మాన్షరీఫ్, స్వామి పోలీస్ అసోసియేషన్ నాయకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు,అమవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్ -
పోస్టల్ బీమా విభాగంలో ఏజెంట్ల నియామకం
ఖమ్మంగాంధీచౌక్: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(ఆర్పీ ఎల్ఐ) విభాగాల్లో కమీషన్ పద్ధతిపై తాత్కాలిక ప్రాతిపదికన ఏజెంట్లను నియమించనున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. పదో తరగతి పూర్తిచేసి 18 ఏళ్లు నిండిన నిరుద్యోగులు, గృహిణులు, మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, గ్రామీణ తపాలా సేవకులు అర్హులని పేర్కొన్నారు. తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను ‘పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం గాంధీచౌక్, ఖమ్మం–507003’ కు చిరునామాకు చేరే పంపించాలని, దరఖాస్తుకు ఎస్సెస్సీ మెమో, ఆధార్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలను జతపర్చాలని తెలిపారు. ఎంపికై న వారు రూ.500 ఎన్ఎస్సీ లేదా కేవీపీ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, వివరాలకు సమీపంలోని తపాలా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అమావాస్య ఎఫెక్ట్ ! ● వైన్స్కు 13 దరఖాస్తులే నమోదు ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్కు దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం, దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించింది. అయితే, ఆదివారం, సోమవారం సెలవు కాగా, మంగళవారం అమావాస్య కావడంతో వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో మంగళవారం కేవలం 13దరఖాస్తులే నమోదయ్యాయి. అయితే, బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో చివరి రెండు రోజులు భారీగా దరఖాస్తులు అందే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే సిండికేట్గా మారిన వ్యాపారులు దరఖాస్తుల నమోదుకు సిద్ధమైనట్లు తెలిసింది. పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి తల్లాడ: ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయినందున పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని జిిల్లా పంచాయతీ ఆశాలత సూచించారు. తల్లాడ మండలంలోని మల్లవరంలో మంగళవారం పర్యటించిన ఆమె రికార్డులు తనిఖీ చేసి పన్నుల డిమాండ్, ఇప్పటివరకు వసూళ్లపై ఆరా తీశారు. ఇకనైనా వసూళ్లలో వేగం పెంచడమే కాక పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆతర్వాత గ్రామంలోని నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠ ధామాన్ని కూడా డీపీఓ పరిశీలించారు. ఎంపీడీఓ సురేష్బాబు, కార్యదర్శి సిద్ధిక్మియా, సిబ్బంది పాల్గొన్నారు. ఆహారంలో అయోడిన్ అవసరం ఖమ్మంవైద్యవిభాగం: అయోడిన్ సూక్ష్మపోషకాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని, అయోడిన్ కలిసిన ఉప్పు ఆరోగ్యానికి మంచిదేనని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి తెలిపారు. ‘ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం’ సందర్భంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అయోడిన్ లోపం వల్ల మానసిక మంద గమనం, బలహీనత, అలసట, గర్భిణులకు మృతశిశువులు పుట్టడమే కాక పుట్టిన పిల్లల్లో వైకల్యాలు ఎదురవుతాయని తెలిపారు. మెదడు అభివృద్ధి, మానసిక, శారీరక ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపునకు అయోడిన్ అవసరమని చెప్పారు. ఈమేరకు అయోడిన్ కలిగిన ఉప్పు వాడాలని, ఆశా కార్యకర్తల వద్ద ఉండే సాల్ట్ టెస్టింగ్ కిట్ల ద్వారా ఉప్పులో అయోడిన్ శాతాన్ని పరీక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డీఎంహెచ్ఓ వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్లు రామారావు, భాస్కర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. గురుకులాల్లో సమస్యలు పరిష్కరిస్తాం వైరా: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, భవనాల కొరతకు త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తామని పాఠశాలల అసిస్టెంట్ సెక్రటరీ శారద తెలిపారు. వైరాలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ వైరా పాఠశాలలో డార్మెటరీ శిథిలావస్థకు చేరగా, డైనింగ్ హాల్ సైతం తాత్కాలికంగా నిర్మించామన్నారు. అలాగే, కోతుల బెడద పరిష్కారంపై దృష్టి సారించామని తెలిపారు. ఇటీవల పాఠశాల ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా కొన్ని చెట్లు నరికివేయించారని, కోతుల సమస్యతోనే కొమ్మలు నరికించినట్లు వెల్లడైందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మమత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మోడల్ గ్రామాలకు నజరానా
ఉమ్మడి జిల్లాలో అధిక సోలార్ ప్లాంట్లు కలిగిన రెండు గ్రామాలకు రూ.కోటి నజరానా ఇచ్చేలా సిఫారసు చేశారు.బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025అర్హులకే పీఠం!సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్ష పదవులకు నేతల ఎంపిక చివరి దశకు చేరింది. ఐదు నియోజకవర్గాల నుంచి జిల్లా అధ్యక్ష పదవికి 56 మంది, నగర అధ్యక్ష పదవికి పది మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ ఐదేళ్లుగా పార్టీలో కొనసాగుతూ ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెబుతున్నారు. పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారే కాక అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు కూడా పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో డీసీసీ పదవికి ఆరుగురు, నగర అధ్యక్ష పదవికి 12 మంది పేర్లతో ఏఐసీసీకి నివేదిక ఇవ్వగా.. వడబోత అనంతరం వచ్చే నెల 15 నాటికి ప్రకటించే అవకాశముంని సమాచారం. మంత్రులతోనూ చర్చ.. ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి తదితరులు కలిశారు. ఈక్రమాన వారితోనూ ఏఐసీసీ నిబంధనలు, అధ్యక్ష పదవికి కావాల్సిన అర్హతలపై చర్చించినట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల నుంచి డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తులు రావడంతో పోటీ పెరిగినట్లయింది. 2014 నుంచి 2023 వరకు అధికారంలో లేకపోవడంతో ఆ సమయాన పార్టీలో స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు పలువురు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో పార్టీకి విధేయులుగా ఉన్న వారికే పదవి ఇవ్వాలని ముఖ్యనేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. బంధువులు కావొద్దు.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం వచ్చిన 56 దరఖాస్తుల్లో ముఖ్య నేతలు ఆరుగురి పేర్లు ఏఐసీసీ పరిశీలనకు వెళ్లాయి. అలాగే నగర కమిటీకి కూడా ఆరుగురి పేర్లు ప్రతిపాదించారు. ఐదేళ్లపాటు నిరంతరాయంగా కాంగ్రెస్కు సేవలు అందించిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదేసమయాన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బంధువులు అయి ఉండొద్దనే నిబంధన విధించినట్లు సమాచారం. ఇవికాక పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న వారినే పరిగణనలోకి తీసుకుని పార్టీకి విధేయులై సుదీర్ఘకాలం సేవలందిస్తున్న వారికి పదవి ఇస్తేనే న్యాయం చేసినట్లు అవుతుందనే భావన వ్యక్తమవుతోంది. షార్ట్ లిస్ట్ చేసి.. డీసీసీ అధ్యక్ష పదవికి 56, ఖమ్మం నగర అధ్యక్ష పదవికి పది దరఖాస్తులు రావడంతో వడబోత అనంతరం ఒక్కో పదవికి ఆరుగురి పేర్లతో మహేంద్రన్ జాబితా రూపొందించారు. ఈ జాబితాతో పాటు ఆయా నేతలు నిర్వహించిన పదవులు, ప్రజాక్షేత్రం, పార్టీ కేడర్లో ఉన్న అభిప్రాయాలతో ఈనెల 25న ఆయన అధిష్టానానికి సమర్పిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా డీసీసీ, నగర అధ్యక్షులను వచ్చేనెల 15లోగా పార్టీ ప్రకటిస్తుందని సమాచారం. ఆ ఆరుగురు ఎవరో? డీసీసీ, నగర అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నేతలు ఎవరికి వారు పదవి తమకే దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. డీసీసీకి దరఖాస్తు చేసుకున్న వారిలో వేమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్, నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్చౌదరి, మద్ది శ్రీనివాస్రెడ్డి, సూతకాని జైపాల్, కొత్త సీతారాములు, ఎండీ.ముస్తఫా, బెల్లం శ్రీనివాసరావు, పగడాల మంజుల, సూరంపల్లి రామారావు, చోట బాబా తదితరులు ఉన్నారు. అలాగే నగర అధ్యక్ష పదవికి నాగండ్ల దీపక్చౌదరి, కమర్తపు మురళి, ఖాదర్బాబ, రషీద్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 66దరఖాస్తులు రావడంతో రెండు పదవులకు ఆరుగురి చొప్పున పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించడంతో.. ఎవరి పేర్లు జాబితాలో ఉన్నాయి.. అందులో ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. డీసీసీ, నగర అధ్యక్ష పదవులకు ఐదేళ్ల అర్హత ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ ఈనెల 11 నుంచి 19 వరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై క్రియాశీలకంగా పని చేస్తున్న నేత ఎవరు.. ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు.. వారి పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు. ఇలా ఐదు నియోజకవర్గాల్లో 3,800 మందితో ముఖాముఖి నిర్వహించగా.. అధ్యక్ష పదవులకు దరఖాస్తు చేసుకున్న వారితో ఈనెల 19న ఖమ్మంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు.. పదవులు ఇస్తే పార్టీ మరింత బలోపేతానికి ఏం చేస్తారనే ఆరా తీశారు. -
నోటరీ వ్యవస్థలో డిజిటల్ విప్లవం
● పారదర్శకత కోసం మరో అడుగు ● రెన్యూవల్ కాకపోతే సీఓపీల తొలగింపు ● ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 41 మంది సీఓపీలకు అనుమతి ● నవంబర్ 1 నుంచి ఆన్లైన్ విధానం ప్రారంభం ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత కోసం సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, భూరికార్డుల డిజిటలైజేషన్, ఆన్లైన్ ద్వారానే స్టాంప్ వెండింగ్ అమలు చేస్తుండగా ఇప్పుడు కీలకమైన నోటరీ విధానాన్ని కూడా ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది. ఈ విధానం నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. తద్వారా నోటరీ కార్యకలాపాల్లో జవాబుదారీతనం పెరిగి, మోసాలకు తావు లేకుండా చేయొచ్చని ఆ శాఖాధికారులు భావిస్తున్నారు. లైసెన్స్ ఉంటేనే అనుమతి నోటరీ పబ్లిక్గా పనిచేసే న్యాయవాదుల విషయంలో స్పష్టత తీసుకొచ్చేలా ప్రభుత్వం సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) లైసెన్స్ కలిగిన వారి వివరాలనే ఆన్లైన్లో నమోదు చేయిస్తోంది. తద్వారా చట్టపరమైన అర్హత కలిగిన వారే నోటరీ సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక న్యాయవాదుల వివరాలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. నోటరీ పబ్లిక్లు జారీ చేసే ప్రతీ నోటరీని పోర్టల్లో నమోదు చేయడం ద్వారా కక్షిదారుడికి ఇచ్చే నోటరీ వివరాలు, సంతకాలు చేశాకే ఆన్లైన్లో పొందుపరుస్తారు. కక్షిదారుల వివరాలు, వారు సమర్పించిన ధ్రువపత్రాల వివరాలు పక్కాగా ఉంటేనే నోటరీ జారీ చేయాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలివ్వడం, రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రపర్చడం ద్వారా భవిష్యత్లో వివాదాలు ఎదురైతే ప్రామాణికంగా ఉంటాయి. రెన్యూవల్ కాకపోతే రద్దు నోటరీ విధానంలో పాత, వినియోగంలో లేని లైసెన్స్లకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా తమ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) లైసెన్స్ను రెన్యూవల్ చేసుకోని వారి లైసె న్సులు తొలగించే ప్రక్రియ మొదలైంది. సీఓపీ కలిగిన నోటరీ న్యాయవాదులు తమ లైసెన్సును ప్రతీ ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. కాల పరిమితి ముగిసే ఆరు నెలల ముందే జిల్లా రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి ముగిశాక రెన్యూవల్కు వస్తే సమస్యలు తలెత్తుతున్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సామాన్య ప్రజలకు మేలు ఆన్లైన్ విధానం ద్వారా సామాన్య ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నోటరీ ద్వారా ధ్రువీకరించిన పత్రాలు ఆన్లైన్లో నమోదు కానుండడంతో విశ్వసనీయత పెరుగుతుంది. అనధికార వ్యక్తులు నోటరీగా చెలామణి అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. నోటరీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొనసాగుతున్న సంస్కరణల్లో దీనిని కీలక అడుగుగా భావిస్తున్నారు.పారదర్శకత కోసం ప్రభుత్వం అన్ని సేవలను డిజిటలైజేషన్ చేస్తోంది. అందులో భాగంగానే నోటరీలు కూడా ఆన్లైన్లో నమోదు చేశాకే కక్షిదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ విధానం నవంబర్ 1నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే జిల్లాలో యాక్టివ్గా ఉండి, రెన్యూవల్ అయిన సీఓపీ లైసెన్సులను ఆన్లైన్ చేస్తున్నాం. ఈ విధానంపై న్యాయవాదులకు అవగాహన కల్పిస్తున్నాం. –ఎం.రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ -
పత్తి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో 14జిన్నింగ్ మిల్లులకు అనుమతి ● తాత్కాలిక రిజిస్ట్రేషన్ల విధానం రద్దుఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పచ్చజెండా ఊపింది. జిన్నింగ్ మిల్లుల ఎంపిక పూర్తి కావడంతో కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ఈమేరకు తిరుమలాయపాలెం మండలం గోల్తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్లో తొలి కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తేమశాతం ఆధారంగా పత్తి క్వింటాకు గరిష్టంగా రూ. 8,110 ధర నిర్ణయించింది. అయితే వ్యాపారులు తేమ, నాణ్యత పేరిట రూ.6,500కు మించి చెల్లించడం లేదు. ఇంతలోనే సీసీఐ కేంద్రాలకు ఏర్పాటుకు జిన్నింగ్ మిల్లుల యజమానులు ముందుకు రాకపోతే ప్రభుత్వ జోక్యంతో కొనుగోళ్లకు లైన్క్లియర్ అయింది. ఉమ్మడి జిల్లాలో ఈఏడాది 4.46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. తద్వారా 50 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. 14 మిల్లులకు అనుమతి పత్తి కొనుగోళ్లకు ఖమ్మం జిల్లాలో జీఆర్ఆర్ ఇండస్ట్రీస్(వెంకటగిరి), శ్రీసాయిబాలాజీ జిన్నింగ్ మిల్(తల్లంపాడు), అమరావతి టెక్స్టైల్స్(దెందుకూరు), మంజీత్ కాటన్ మిల్స్(మాటూరు), శ్రీ శివగణేష్ కాటన్ ఇండస్ట్రీస్(ఇల్లెందులపాడు), స్టాపిలచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్(తల్లాడ), జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్(పొన్నెకల్), శ్రీ భాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్(గోల్ తండా)తో పాటు భద్రాద్రి జిల్లాలో ఆరింటిని ఎంపిక చేశారు. ఎకరాకు 12 క్వింటాళ్లు పంట దిగుబడిని అంచనా వేశాక ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి అవకాశం కల్పించారు. అయితే, ఈ ఏడాది అధిక వర్షాలతో ఎకరాకు ఐదు క్వింటాళ్లు మించే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ పోర్టల్లో పంట నమోదై ఉండడమే కాక ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటే విక్రయానికి అనుమతిస్తారు. కాగా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ల(టీఆర్) విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కౌలు రైతుల కోసం ఈ విధానాన్ని తీసుకొస్తే కొందరు ఉద్యోగులు, వ్యాపారులు ఏకమై అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో పట్టాదారు అనుమతితో కౌలు రైతుల ద్వారా విక్రయ బాధ్యత ఏఈఓలకు అప్పగించారు. -
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనఖమ్మంరూరల్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, తల్లంపాడులో రహదారుల నిర్మాణానికి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కొండాపురం నుంచి ముఠాపురం వరకు రూ.7.50కోట్లతో బ్రిడ్జి, పొన్నేకల్ నుంచి కొండాపురం వరకు రూ.5.20కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే, పీహెచ్సీ నిర్మాణం, పెద్దకుంట చెరువు శాశ్వత మరమ్మతు పనులు చేపడుతామని వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందిస్తుండగా, తెల్లరేషన్కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే, దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కాగా, మండలంలోని మద్దులపల్లిలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవన పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. రూ.25కోట్లతో మూడు అంతస్తులు గా చేపడుతున్న నిర్మాణం తుది దశలో ఉందని తెలి పారు. డీఏఓ డి.పుల్లయ్య, ఆర్డీఓ నర్సింహారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
● వందనంలో ఇంటర్ విద్యార్థి మృతి ● ఇంజక్షన్ వికటించడంతో మృతి చెందాడని కుటుంబసభ్యుల ఆరోపణ ● మృతదేహంతో అర్ఎంపీ ఇంటి ఎదుట ఆందోళన
అండర్–19 బ్యాడ్మింటన్, కరాటే జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్, కరాటే జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ఖమ్మంలోని సర్దార్పటేల్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక పోటీలను కోచ్లు జి.రాము, గోపతి సైదులు ఎస్.కే.ఖాసీం, ఎం.బాబు, ఎండీ. మహహబూబ్, ఎం.సురేష్, హరీష్, ఎం.సందేష్ పర్యవేక్షించగా జట్ల వివరాలను అండర్–19 క్రీడల కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం ప్రకటించారు. అండర్–19 బ్యాడ్మింటన్ బాలుర జట్టుకు ఎన్.నవీన్ ఉదయ్, ఎం.రాజీవ్, డి.నవీన్, ఎ.అరవింద్, జి.నవదీప్, బాలికల జట్టులో బి.ధరణి ప్రియ, ఎ.రష్మీ, కె.హెమీమా, ఎస్.గాయత్రి, జి.మహాలక్ష్మి స్థానం దక్కించుకున్నారు. అలాగే, కరాటే జట్టులో వివిధ కేటగీరీలకు గాను కె.అరుణతేజ్, డి.గౌరీశంకర్, కె.హర్షతేజ, కె.గణేష్, షాహిద్, ఎం.డీ. అసదుద్దీన్, ఎస్.కే.రియాన్, ఎం.లాస్యశ్రీ, వి.లక్ష్మీశ్రావణి, బి.సహస్రసేన్, ఎం.డీ.హఫషాజబీన్, కె.నిఖిత ఎంపికయ్యారు. నిర్లక్ష్య వైద్యానికి నిండు ప్రాణం బలి.. చింతకాని: ఓ గ్రామీణ వైద్యుడి(ఆర్ఎంపీ) నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థి బలయ్యాడు. తెలిసీ తెలియని వైద్యంతో జ్వరంతో వచ్చిన విద్యార్థికి ఇంజక్షన్ ఇవ్వడంతో అది కాస్తా వికటించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో విద్యార్థి కుటుంబసభ్యులు మృతదేహంతో గ్రామీణ వైద్యుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని వందనం గ్రామానికి చెందిన ఉద్వి జస్వంత్ (17) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చి అదే రోజు కొదుమూరు గ్రామంలోని గ్రామీణ వైద్యుడికి చూపించాడు. అతడు ఓ ఇంజక్షన్ వేయగా.. వెంటనే వాంతులు చేసుకొని అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కొద్దిసేపటికి మృతి చెందాడు. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు గ్రామీణ వైద్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వీరేందర్, ఏఎస్సై లక్ష్మణ్ అక్కడకు చేరుకొని కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. మృతికి కారకుడైన గ్రామీణ వైద్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రొటోవేటర్ తగిలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి రఘునాథపాలెం: రొటోవేటర్ ఫిట్టింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరబండ గ్రామానికి చెందిన మాదాసు నారాయణ (35) మంచుకొండలోని ఖాసీమ్కు చెందిన మామిడి తోటలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం రొటోవేటర్ను ట్రాక్టర్కు ఫిట్టింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఖమ్మంరూరల్: మండలంలోని మద్దులపల్లి వద్ద నాగార్జున సాగర్ కాల్వలో గుర్తు తెలియని ఓ వ్యక్తి(34) మృతదేహం లభ్యమైంది. మద్దులపల్లి గ్రామ శివారులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో పల్లెగూడెం బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.రాజు తెలిపారు. -
అరెస్టులతో సమ్మెను ఆపలేరు
ఖమ్మంమయూరిసెంటర్: తగ్గించిన వేతనాలు పెంచాలని, జీఓ 60 ప్రకారం రూ.15,600 వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు 38 రోజులుగా సమ్మె చేస్తూ మంత్రులకు, అధి కారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల జేఏసీ రాష్ట్ర నాయకులు కె.బ్రహ్మచారి అన్నారు. ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విధులు నిర్వర్తిస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఖమ్మంలో మంత్రుల క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించేందుకు ఎన్నెస్పీ క్యాంపునకు చేరుకున్నారు. మూడు జిల్లాల నుంచి వచ్చిన కార్మికులను పోలీసులు ఎన్నెస్పీ క్యాంపులో అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ 38 రోజుల్లో 20 సార్లు ఆర్థిక శాఖ మంత్రికి తమ గోడు వినిపిస్తూ వినతిపత్రం ఇచ్చామని, అయినా స్పందన లేదని అన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన కార్మి కులను అరెస్టు చేయించడం దుర్మార్గమని అన్నారు. డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయాలని, అప్పటి వరకు కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ వర్కర్లకు ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో రూ.15,600 వేతనం చెల్లిస్తుంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం రూ.9,200 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. అరెస్టులతో సమ్మె ఆపలేరని, సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని వెల్లడించారు.సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జెల్లా ఉపేందర్, దొడ్డా రవికుమార్, నాగేశ్వరరావు, అనంతరాములు, లక్ష్మణ్, మోహన్, కౌసల్య, నర్సింహరావు, లక్ష్మి, శ్రీను, హీరా లాల్, ముత్త య్య, మంగమ్మ, తిరుపతమ్మ పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం ఈ ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు 40 మంది బాలలు, 30 మంది బాలికలు హాజరు కాగా.. వివిధ పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికల ప్రక్రియను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వై.రామారావు, బాస్కెట్బాల్ కోచ్లు పీ.వీ.రమణ, కృష్ణమూర్తి, రామారావు, భరత్చంద్ర పర్యవేక్షించారు. జట్లు ఇవే...అండర్–17 బాలుర బాస్కెట్బాల్ జట్టుకు అక్కి ఆయాన్, కె.స్నేహిత్, యశ్వంత్, హర్షవర్ధన్, సాత్విక్, సుమంత్, జెస్సు కిరణ్, చరణ్, సూర్య, గౌతమ్ సాహూ, ఎం.సాకేత్, రేహాన్, రైసింగ్, ఎస్.సాకేత్, అభినవ్, విశ్వతేజ, చత్రపతి శివాజీ, ఎండీ.గౌస్ అస్లాం ఎంపియ్యారు. అలాగే, బాలికల జట్టులో పి.అఖిల, రిశివశ్రీ, పూనం హన్సీ, సహస్ర, ఓంకారుణ్య, ఆయుషాన్ని, కీర్తి స్వప్నిక, తమన్ వి.తమరిత, చందనశ్రీ, దీక్షిత, యక్షిత, సాత్విక, ధతి, మనస్విని, కీర్తన, బి.హరిణి, కె.రితికాశాస్త్ర, కె.గ్రేస్కు స్థానం దక్కింది. -
టీసీఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రదీప్, వీరేష్
ఖమ్మం స్పోర్ట్స్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కూరపాటి ప్రదీప్కుమార్ నియమితులయ్యారు. అలాగే, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి.వీరేష్ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురవారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఖమ్మం వచ్చిన అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయచందర్రెడ్డి డాక్టర్ ప్రదీప్, వీరేశ్గౌడ్ను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించడానికి టీసీఏ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రదీప్, వీరేష్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా క్రికెటర్ల ఎంపిక చేపడతామని వెల్లడించారు. -
వైన్స్కు దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంక్రైం: వైన్స్ షాపుల దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈనెల 23 వరకు పొడిగించింది. జిల్లాలో 116 వైన్స్కు శనివారం వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని తొలుత ప్రకటించారు. ఈమేరకు శనివారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 4,043 దరఖాస్తులు అందగా ఎకై ్సజ్ శాఖకు రూ.121.29కోట్ల ఆదాయం లభించింది. అయితే, బీసీల బంద్ కారణంగా బ్యాంకులు తెరుచుకోక డీడీలు తీయలేకపోయామని పలువురు విన్నవించడంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎౖక్సైజ్ అధికారి నాగేందర్రెడ్డి తెలిపారు. కాగా, 27వ తేదీ డ్రా తీసి వైన్స్ కేటాయిస్తామని వెల్లడించారు. అప్రమత్తతతోనే ప్రమాదాలు దూరం నేలకొండపల్లి: దీపావళి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఇదే సమయాన బాణసంచా కాల్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలని 108 సర్వీసుల ఉమ్మడి జిల్లా మేనేజర్ పి.శివకుమార్ సూచించారు. నేలకొండపల్లిలో ఆదివారం 108 వాహనం పనితీరు, రికార్డులను పరిశీలించాక ఆయన మాట్లాడారు. టపాసులు కాల్చే సమయాన అజాగ్రత్తగా ఉండడంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు పిల్లలు కాల్చే సమయాన పెద్దలు పర్యవేక్షించాలని, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాన 108 సేవలను వినియోగించుకోవాలని, తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఎంపీ దీపావళి శుభాకాంక్షలుఖమ్మం మామిళ్లగూడెం: దీపావళి పండుగతో పాటు సదర్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై విజయం సాధించడానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే, యాదవ సమాజం అన్ని జాగ్రత్తల నడుమ సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఎత్తులు.. పై ఎత్తులు ! ● హోరాహోరీగా రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మం టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ నిర్వహించారు. అండర్ – 8, 10, 12, 14 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించగా వివిధ జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–8 బాలుర విభాగంలో లావుడ్యా చౌహాన్, కార్తికేయ, దర్శన్రెడ్డి, ఈశ్వర్, హర్ష, అండర్–10లో శివనాగసారయి, అరిహంత్, గౌతమ్కృష్ణ, నిఖిల్చంద్ర, విశ్వతేజ, అండర్–12లో ఎస్.గౌతమ్ చంద్రమోఖిత్, రామ్ నిఖిత్, భూక్యా తనీష్, ఆర్యన్శర్మ వరుసగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. అలాగే, బాలికల అండర్–8 విభాగంలో సహస్ర, సామికా, తేజశ్రీ, జిహిత, జితిషా, అండర్–10లో అంధ్య, అనికారామ్, కార్తీక్ ప్రణవ్, అధ్విక గౌరీ, శరణ్యప్రియ, అండర్–12లో భవజ్ఞ, రీతూశ్రీ, కృతధార, నిహారిక, దిలీషా, అండర్–14 బాలికల విభాగంలో లక్ష్మి, హర్షిత, శ్రీసాత్విక, సిరిలయ, ఆరాధ్య మొదటి ఐదు స్థానాల్లో నిలవగా నిర్వాహకులు బహుమతులు అందజేశారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రఫీ, ఆర్గనైజర్ టి.వీరన్నతో పాటు శివకృష్ణ, కావ్య, హుస్సేన్ పాల్గొన్నారు. -
కల్లూరుకు సరికొత్త శోభ
● రూ.49 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సబ్కలెక్టర్ కార్యాలయ నిర్మాణం ● మంత్రి తుమ్మల సూచనలతో ప్రతిపాదనలుసత్తుపల్లి/కల్లూరు : సుమారు పది ఎకరాల స్థలంలో రూ.49 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయ నిర్మాణం జరగనుండగా కల్లూరు కొత్తశోభ సంతరించుకోనుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా దీనిని డిజైన్ చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయంగా ఇది రూపుదిద్దుకుంటుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో ఈ మేరకు ప్రతిపాదనలను సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ సిద్ధం చేసి ఆదివారం మంత్రికి అందజేశారు. అంతేకాక సబ్కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని మరో రూ.2.50 కోట్లతో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండడంతో ప్రజలకు మెరుగైన సేవలు సులువుగా అందుతాయని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో చర్చించాక ప్రతిపాదనలు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ప్రభుత్వ, ఎన్నెస్పీ భూములను పరిరక్షించాలని, సత్తుపల్లి వేశ్యకాంతల చెరువులో ఆక్రమణలు తొలగించాలని మంత్రి సూచించారు. అంతేకాక వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలో గ్రామకంఠం భూములను సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. -
అర్ధరాత్రి ఏసీబీ సోదాలు
● అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు ● లెక్కకు మించి ఉన్న నగదు స్వాధీనం ● రికార్డులను వెంట తీసుకెళ్లిన అధికారులు పాల్వంచరూరల్/అశ్వారావుపేట/పెనుబల్లి: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఉమ్మడి జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో సోదాలు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో పాల్వంచ మండలం జగన్నాథపురం, నాగారం కాలనీ గ్రామాల మధ్య బీసీఎం జాతీయ రహదారిపై ఉన్న చెక్పోస్టులో దాడులు నిర్వహించారు. కంప్యూటర్ డేటా, రికార్డులతోపాటు చెక్పోస్టులోఉన్న అధికారి, సిబ్బంది సెల్ఫోన్లను కూడా తనిఖీ చేశారు. ఓవర్లోడ్ ఫైన్, ట్యాక్స్ కలెక్షన్ వంటి విషయాల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలపై తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. లెక్కలో లేని రూ.26 వేల నగదు లభించిందని పేర్కొన్నారు. దొరికిన నగదు వ్యవహారంపై ఎంవీఐ, సిబ్బందిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు సమాచారం. కాగా ఇదే చెక్ పోస్టులో గతేడాది ఆగస్టులో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశ్వారావుపేట ఆర్టీఏ చెక్పోస్టులో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పెనుబల్లి మండల పరిధి లోని ముత్తగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన సొమ్ము కంటే అదనంగా రూ.6,660 ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
తుది నిర్ణయం ఏఐసీసీదే..
● డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ● డీసీసీకి 56, నగర అధ్యక్ష పదవికి 10 దరఖాస్తులు ● ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ వెల్లడిఖమ్మంమయూరిసెంటర్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర అధ్యక్ష పదవులకు నాయకుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అధ్యక్ష పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ వారం రోజుల క్రితం ఖమ్మం చేరుకున్నారు. తొలి రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత ప్రతీ నియోజకవర్గంలోని రెండు బ్లాక్ల్లో సమావేశాలు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. మొత్తంగా ఆయన 3,700 మందితో మాట్లాడారు. అధ్యక్ష పదవులకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారం ముగియగా.. డీసీసీ అధ్యక్ష పదవికి 56 మంది, నగర అధ్యక్ష పదవికి 10 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరితోనూ మహేంద్రన్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యక్ష పదవులకు వచ్చిన దరఖాస్తుల్లో జిల్లాకు 6, నగరానికి 6 దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి 25వ తేదీ లోగా ఏఐసీసీకి అందజేస్తామని తెలిపారు. అందులో నుంచి ఒకరిని డీసీసీ అధ్యక్ష పదవికి, ఒకరని నగర అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని వివరించారు. కాగా, జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన మహేందరన్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కార్పొరేటర్ రాపర్తి శరత్ తదితరులు కలిశారు. -
అంతకంటే ఎక్కువే!
సగం కాదు.. 2023లో కళాశాల ఏర్పాటు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయగా, 2023 అక్టోబర్లో మొదటి సంవత్సరం బోధన ప్రారంభమైంది. మొత్తం 100 సీట్లతో కళాశాల ఏర్పాటు కాగా జాతీయ కోటాలో 15 శాతం, రాష్ట్ర కోటాలో 85 శాతం సీట్లు కేటాయించారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత విశాలంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ఖమ్మం మెడికల్ కళాశాల నిలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రితో పాటు కళాశాల, హాస్టళ్లు కలుపుకుని సుమారు 30 ఎకరాల మేర స్థలం ఉంది. అంతేకాక నగర నడిబొడ్డున కళాశాల ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది లేనందున ఇక్కడ చేర్పించేందుకు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాక హాస్టళ్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, నిరంతరం సెక్యూరిటీ, విశాలమైన తరగతి, ప్రాక్టికల్ గదులు ఉండడంతో నీట్ ర్యాంకర్ల చూపు ఇటు వైపు తిప్పేలా చేస్తోంది. మూడు బ్యాచ్ల్లోనూ వారే.. ఖమ్మం మెడికల్ కాలేజీకి అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లను కేటాయించడంతో బోధన సాఫీగా సాగుతోంది. కళాశాలలో ఈ ఏడాది 100 సీట్లలో 82 మంది విద్యార్థినులు ప్రవేశాలు పొందారు. వీరిలో చాలా మంది నిరుపేదలు, రైతు కుటుంబాలు, చిరువ్యాపారుల కుటుంబాల నుంచే వచ్చారు. అలాగే, గత ఏడాది 56 మంది, అంతకు ముందు ఏడాది 71 మంది అమ్మాయిలు చేరి ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్నారు. తద్వారా మూడు బ్యాచ్ల్లోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. జిల్లా విద్యార్థినులకు ప్రయోజనం గతంలో ఎంబీబీఎస్ సీటు సాధించటం కష్టమైన వ్యవహారంగా ఉండేది. కానీ ప్రస్తుతం అమ్మాయిలు చదువులో రాణిస్తూ లక్ష్యం వైపు కదులుతున్నారు. మూడు బ్యాచ్ల్లో చూస్తే 30 మంది జిల్లా విద్యార్థినులు ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారు. మెరుగైన ర్యాంకుతో స్థానికంగా సీట్లు సాధిస్తుండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా జిల్లాలోనే చదివే అవకాశం రావడం.. అనుకున్నట్లుగానే గత రెండేళ్లలో మంచి ఫలితాలు రావడంతో ఈసారి కూడా విద్యార్థినులు ఇటే మొగ్గు చూపారు. అంతేకాక జాతీయ కోటాలో మహారాష్ట్ర, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, కేరళ రాష్ట్రాల విద్యార్థులు 45 మంది చదువుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అమ్మాయిలే అధికం కళాశాలలో వసతులకు తోడు ఉత్తమ బోధన అందుతోంది. గత రెండు బ్యాచ్ల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో ర్యాంకర్లు ఇక్కడ చేరుతున్నారు. అందులో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు పటిష్టమైన భద్రత ఉండడంతో చదువు సాఫీగా సాగుతోంది. – డాక్టర్ శంకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
ఇందిరా డెయిరీ నా చిరకాల వాంఛ
● పాల ఉత్పత్తులతో దేశానికే ఆదర్శంగా నిలవాలి ● వైరా అభివృద్ధికి నిధులు.. అక్కడి నుంచే ఈ స్థాయికి చేరా ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బోనకల్/వైరా : పాల ఉత్పత్తులతో మధిర నియోజకవర్గ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుతో తన చిరకాల వాంఛ నెరవేరుతుందని తెలిపారు. బోనకల్లో ఆదివారం ఆయన నియోజకవర్గ పరిధిలోని ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2013లో మధిర నియోజకవర్గంలో 52వేల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండేసి గేదెలు పంపిణీ చేసి డెయిరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కానీ అదే సమయాన రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆలస్యమైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మధిర నియోజకవర్గంలోని మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న తన లక్ష్యం నెరవేరడానికి మార్గం ఏర్పడిందని తెలిపారు. రెండేసి గేదెలు.. సోలార్ ప్లాంట్లు ప్రతీ సభ్యురాలికి రెండేసి గేదెలు పంపిణీ చేయడమే కాక పాకల నిర్మాణం, సోలార్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని భట్టి వివరించారు. అలాగే, దాణా సరఫరా బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, రాష్ట్ర హస్తకళలు, గిడ్డంగుల సంస్థల చైర్మన్లు నాయుడు సత్యం, రాయ ల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఆర్అండ్బీ, పీఆర్, విద్యుత్ శాఖ, భగీరథ ఎస్ఈలు యాకోబు, వెంకటరెడ్డి, శ్రీనివాసాచారి, శేఖరరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, ఏడీఏ విజయచందర్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ ఆర్.రమాదేవి పాల్గొన్నారు. వైరాకు మరిన్ని నిధులు.. వైరా అభివృద్ధికి భవిష్యత్లో మరిన్ని నిధులు మంజూరు చేస్తానని, ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతోనే ఈస్థాయికి చేరానని భట్టి విక్రమార్క అన్నారు. ఆది వారం వైరాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైరాలో రూ. 500 కోట్లతో త్వరలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. అంతకుముందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, వైద్యులు కాపా మురళీకృష్ణ, ఉండ్రు శ్యాంబాబుతో పాటు 100 కుటుంబాల వారు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్నాయక్, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, ఏదునూరి సీతారాములు, బోళ్ల గంగారావు, దాసరి దానియేలు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
బోనకల్: మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి కుంచం సందీప్ (16) శనివా రం మృతిచెందాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాల లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. దస రా సెలవుల అనంతరం కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఇటీవల గడ్డిమందు తాగాడు. దీంతో గుర్తించిన ఆయ న తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. ఉరి వేసుకుని బలవన్మరణంకారేపల్లి: మానసిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన మాలోతు తావుర్యా – లక్ష్మి దంపతుల కుమారుడు సాయికుమార్ (25) రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఇటీవల బెంగళూరు ప్రాంతంలో పనులకు వెళ్లిన ఆయన దసరాకు ఇక్కడకు వచ్చి మళ్లీ వెళ్లాడు. తిరిగి ఈనెల 17వ తేదీన స్వ గ్రామానికి వచ్చిన సాయికుమార్ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. తల్లి లక్ష్మి అస్వస్థతకు గురికాగా ఆమెను చికిత్స నిమిత్తం తావుర్యా ఖమ్మం తీసుకెళ్లాడు. శనివారం సాయంత్రం వరకు స్నేహితులతో గడిపిన సాయికుమార్ ఉన్నట్టుండి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు తలుపు పగలకొట్టి సాయికుమార్ను ఇల్లెందు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
చూసొద్దాం రండీ !
భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో పర్యాటక రంగానికి పట్టుగొమ్మలాంటి పాపికొండల యాత్ర మళ్లీ సిద్ధమవుతోంది. వర్షాకాల సీజన్లో గోదావరి వరదల నేపథ్యంలో పర్యాటక యాత్ర నిలిచిపోగా.. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి గోదావరి ప్రవాహం నిలకడగా ఉండడంతో తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏపీలోని రాజమండ్రి గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్కు అనుమతులు రావడంతో వారం కిత్రమే అక్కడ ప్రారంభించారు. కాగా గోదావరికి ఇవతల వైపున ఉన్న పోచవరం పాయింట్కు నేడో, రేపో అధికారిక అనుమతి రానుందని లాంచీల యజమానులు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్కు పాపికొండల పర్యాటకాన్ని తిలకించేందుకు పలువురు రెడీ అవుతున్నారు. దసరా నాటికే కావాల్సి ఉన్నా.. ప్రతి ఏడాది భద్రాచలం నుంచి పరవళ్లు తొక్కుతున్న గోదావరికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారీగా వరదలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని పాపికొండల విహారయాత్ర నిలిపేస్తుంటారు. ఈ ఏడాది జూలైలోనే ఈ యాత్రకు బ్రేక్ పడింది. ఈ సంవత్సరం భారీ వరదలు రాకున్నా గోదావరి నదీ ప్రవాహం నిరంతరం 30 – 45 అడుగుల మధ్య నమోదవుతూనే ఉంది. ఈ ఏడాది అత్యధిక పర్యాయాలు గోదావరి పరవళ్లు తొక్కడంతో పాపికొండల యాత్ర ఆలస్యమైంది. దసరా సెలవుల నుంచే పర్యాటక సీజన్ ప్రారంభం అవుతుంది. కానీ ఈ ఏడాది విజయదశమి నాటికి కూడా గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి రాకపోవడంతో జాప్యం జరిగింది. దీపావళి నేపథ్యంలో ఎదురుచూపులు.. మూడు నెలలుగా ఆగిపోయిన పాపికొండల పర్యాటకానికి ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం రాజమండ్రి వైపు నుంచి అనుమతి ఇచ్చింది. గండిపోచమ్మ గుడి బోటింగ్ పాయింట్ వద్ద వారం క్రితమే యాత్ర ప్రారంభమైంది. అయితే తెలంగాణ వైపు నుంచి అత్యధికంగా పర్యాటకులు వచ్చే పోచవరం పాయింట్ వద్ద అనుమతి కోసం ఏజెంట్లు, లాంచీల యజమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆదివారం, దీపావళి సెలవులు రావడంతో త్వరగా అనుమతిస్తే బాగుండేదని అంటున్నారు. యాత్రకు సంబంధించిన అన్ని పత్రాలూ సమర్పించామని, ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యమని లాంచీల యజమానులు చెబుతున్నారు. వీరితో పాటుగా పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్న వివిధ రంగాల ప్రజలు సైతం యాత్ర ప్రారంభం కోసం వేచిచూస్తున్నారు. పాపికొండల యాత్ర ప్రారంభమైతే ఇటు ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రగిరిలోనూ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. పాపికొండల విహార యాత్ర నేడో, రేపో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమండ్రి వైపు యాత్ర నడుస్తోంది. పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద లాంచీలు సిద్ధంగా ఉన్నాయి. అనుమతి వస్తే ఇక సందడిగా మారనుంది. – మహేందర్, టికెట్ల విక్రయ కేంద్రం నిర్వాహకుడు, భద్రాచలంపచ్చని అడవులు, వాటి నడుమ అమాయక ఆదివాసీల జీవన విధానం, కట్టూబొట్టు, సంస్కృతి, సంప్రదాయాలు దర్శనమిచ్చే పాపికొండల యాత్ర ఎంతో మధురానుభూతిని నింపుతుంది. రెండు రోజుల్లో కార్తీక మాసం సైతం ప్రారంభం కానుండడంతో భక్తులు, పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో పాపికొండల పర్యాటక ధరలను గతంలో మాదిరిగానే నిర్ణయించారు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున వసూలు చేయనున్నారు. ఇక కళాశాల, పాఠశశాలల విద్యార్థులకు ప్యాకేజీలు ప్రకటించాల్సి ఉంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్దకు చేరుకోవడానికి సొంత వాహనాల్లో లేదంటే భద్రాచలంలో ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. -
అదనపు కోర్టులు ఏర్పాటుచేయండి
బూర్గంపాడు/కొత్తగూడెంటౌన్ : ప్రజల సౌలభ్యం కోసం భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు లేదా అసిస్టెంట్ సెషన్స్ కోర్టును, కొత్తగూడెంలో ఎస్సీ, ఎస్టీ కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానాన్ని, ఫ్యామిలీ కోర్టు, జువైనల్ జస్టిస్ బోర్డులు ఏర్పాటు చేయాలని కొత్తగూడెం, భద్రాచలం బార్ అసోసయేషన్ల సభ్యులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జె. శ్రీనివాసరావును కోరారు. సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో భద్రాచలం బార్ సభ్యులు, కొత్తగూడెం కోర్టులో స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులు ఈ మేరకు జడ్జికి వినతిపత్రాలు అందించారు. భద్రాచలం, మణుగూరు సబ్ డివిజన్లలో 600 పైగా సెషన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, జిల్లా కేంద్రం కొత్తగూడెం వెళ్లాలంటే ఈ ప్రాంత వాసులకు అసౌకర్యంగా ఉందని వివరించారు. ఆ తర్వాత కొత్తగూడెం బార్ అసో సియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ తదితరులు శ్రీనివాసరావును సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి పాటిల్ వసత్, అదనపు జిల్లా జడ్జి సరిత, సీని యర్ జడ్జిలు ఎం.రాజేందర్, కె.కిరణ్కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.కవిత, జూనియర్ జడ్జిలు కె.సాయిశ్రీ, బి.రవికుమార్, వి.శివనాయక్, డి.కీర్తిచంద్రికారెడ్డి బి.భవాని, కె.సురారెడ్డి, భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట దేవదానం, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, సభ్యులు జె.గోపీకృష్ణ, భాగం మాధవరావు, కాసాని రమేష్, ఉప్పు ఆరుణ్, ఆడపాల పార్వతి, మాలోత్ ప్రసాద్, కె.చిన్నికృష్ణ, కొడాలి శ్రీనివాసన్, పసుపులేటి రాంబాబు, రామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు. హైకోర్టు జడ్జికి ‘బార్’ సభ్యుల విన్నపం -
హైవే సర్వేను అడ్డుకున్న రైతులు
ఖమ్మంరూరల్: నాగ్పూర్ – అమరావతి హైవే నిర్మాణానికి మండలంలోని కామంచికల్లో శనివారం చేపట్టిన భూసర్వేను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూనిర్వాసితుల తరఫున హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే భూములు, బావులు, చెట్ల గుర్తింపునకు సర్వే చేయడం సరికాదన్నారు. మార్కెట్ ధర కంటే మూడింతలు రెట్టింపు పరిహారం చెల్లిస్తేనే భూమి ఇస్తామని తెలిపారు. రైతుల ఆందోళనతో రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు వెనుదిరిగారు. అనంతరం రైతులతో రెవెన్యూ అధికారులు చర్చించగా, పరిహారంపై తేల్చాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతులు వేములపల్లి సుధీర్, రాధాకృష్ణ, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, అనంతిని శ్రీనివాస్, శ్రీధర్, రఘు, పాటి వెంకటయ్య, ఉపేందర్రావు, రంగారావు, వి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ముష్టికుంట్ల వాసికి డాక్టరేట్
బోనకల్: మండలంలో ని ముష్టికుంట్లకు చెంది న కేవీ నారాయణకు డాక్టరేట్ లభించింది. ‘ది రైటింగ్స్ ఆఫ్ ఆర్కే నారాయణ్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథాని కి ఉత్తరప్రదేశ్లోని జేఎస్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. కాగా, నారాయణ ప్రస్తుతం ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నా డు. అంతేకాక సొంత ఇన్స్టిట్యూట్ ద్వారా పేద విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించారు. 26న సింగరేణి ఆధ్వర్యాన జాబ్మేళా సత్తుపల్లి: సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 26న జాబ్మేళా నిర్వహించనున్నారు. సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్మేళా పోస్టర్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి గనులతో కిష్టారం వాసులు నష్టపోయినందున గ్రామంలో పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసు కోవాలని సూచించారు. అలాగే, సైలో బంకర్ నుంచి వాయు కాలుష్యం వెలువడకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని తెలిపారు. మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, చల సాని సాంబశివరావు, సింగరేణి పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు పాల్గొన్నారు. టీటీడీ ఆలయ ప్రతిపాదిత స్థలంలో పనులు ఖమ్మంఅర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన ఖమ్మం 15వ డివిజన్ అల్లీపురంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంలో శనివారం చెట్ల తొలగింపు పనులను ప్రారంభించారు. ఇక్కడ సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమిని ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించగా ఇటీవల దేవాదాయ శాఖ స్థపతి, అధికారులు పరిశీలించారు. అయితే, కంపచెట్లు తొలగించి భూమిని చదును చేస్తే పూర్తిస్థాయి స్వరూ పం తెలుస్తుందన్న సూచనలతో పనులు మొదలుపెట్టారు. వీ.వీ.పాలెం సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు, నాయకులు పత్తిపాటి వీరయ్య, గౌని గోవర్దన్, పత్తిపాటి అప్పారావు, పత్తిపాటి వెంకటేశ్వర్లు, యనిగండ్ల సత్యనారాయణ, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, సనగండ్ల ఉపేందర్రావు, సామినేని సైదులు, ముత్తయ్య, గుండె ఆదినారాయణ, దమ్మాలపాటి సైదులు పాల్గొన్నారు. బందోబస్తును పరిశీలించిన సీపీఖమ్మంక్రైం: రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం బంద్కు పిలుపునివ్వగా.. పోలీస్ కమిషనర్ సునీల్దత్ శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించారు. బందోబస్తుపై ఆరాతీసిన ఆయన శాంతిభద్రతల కు విఘాతం ఏర్పడకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఏసీపీ రమణమూర్తి, సీఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీమా పరిహారం చెల్లించాల్సిందే.. ఖమ్మంలీగల్: ఆరోగ్య బీమా పథకంలో పాలసీ తీసుకున్న వారికి చికిత్స ఖర్చులు చెల్లించాల్సిందేనని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత తీర్పు చెప్పారు. రెండు కేసుల్లో శనివారం వెలువరించిన తీర్పుల వివరాలిలా ఉన్నాయి. మధిర మండలానికి చెందిన బలగం జయమహేశ్వరనాయక్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి 2021లో రూ.15,287 చెల్లించి ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.5.50 లక్షల పరిమితితో ఈ పాలసీ తీసుకోగా, కొన్నాళ్లకే మహేశ్వరనాయక్ కరోనా బారిన పడితే ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సచేయించుకున్నాడు. ఆయనవైద్యం బిల్లులు చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయిస్తే క్లెయిమ్ నిరాకరించారు. దీంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో న్యాయవాదులు వెల్లంపల్లి నరేంద్రస్వరూప్, కొలికొండ శరత్బాబు ద్వారా కేసు నమోదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారు చికిత్సకు అయిన రూ.94,945తో పాటు వేదనకు గురిచేసినందుకు రూ.10వేలు, ఖర్చుల కింద రూ.10వేలను 45రోజుల్లో చెల్లించాలని తీర్పు వెలువరించారు. అలాగే, బలగం స్వరూపారాణి దాఖలు చేసిన కేసులో ఆమె చికిత్సకు అయిన రూ.71,245తో పాటు మనోవేదన, ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు. -
‘సాక్షి’పై కుట్రలు సరికాదు
కూసుమంచి: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను కాలరాసేలా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజాసమస్యల ను వెలుగులోకి తీసుకొస్తున్న ‘సాక్షి’పత్రికతో పాటు ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్నికాలరాస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం పాలేరు నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలో నిర్వహించిన ఆందోళనలో జర్నలిస్టులు, వివిధపార్టీలు, సంఘాల నా యకులుపాల్గొన్నారు. న్యూడెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకట్రామిరెడ్డి, టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు పోలంపల్లి నాగేశ్వరరావుమాట్లాడుతూ.. సమాజానికి పత్రికలుమూల స్తం భాలుగా నిలుస్తుండగా వాస్తవాలను వెలికితీసే హక్కు ఉందని తెలిపారు. అయితే, ఏపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే సాక్షి మీడియా, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రభుత్వాలకు మనుగడ ఉండదని, మీడియా గొంతు నొక్కితే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.కాంగ్రెస్,బీఆర్ఎస్, ఎన్డీ, సీపీఎం నాయకులు ఎండీ హఫీజుద్దీన్, ఎండీ కలీమ్,బాబునాయక్, ముత్తేశం, సైదానాయక్, వెంక న్న, చంద్రయ్య, బానోతుఉపేందర్, అద్దంకికోటయ్య, మల్లీడువెంకటేశ్వర్లు, ఉపేంద్రాచారి, సండ్ర బజారు, చెరకుపల్లివీరయ్య, బత్తులఉప్పలయ్య, ఎడవెల్లి రమ ణారెడ్డి, కొక్కిరేణి వీరస్వామి, వివిధ పత్రికల జర్నలిస్టులు, ఉద్యోగులు చాగంటి వెంకటేశ్వర్లు, మల్లెల ఉపేందర్, వాచేపల్లి హనుమంతరెడ్డి, పెంటమళ్ల కోట య్య, మెగిలి రామకృష్ణ, పందిరి వెంకటరెడ్డి, ఎండీ రంజాన్అలీ,మందులనాగరాజు, అత్తలూరి హనుమం తరావు,వడ్లమూడి వెంకటేశ్వర్లు, పోలేటి నారాయణ, గంధం రాంచందర్రావు, రాము, పడిశాల వెంకన్న, రాంబ్రహ్మం,వెంకటేశ్వర్లు, కర్ణబాబుపాల్గొన్నారు. -
భద్రాద్రి డీపీఓగా అనూష
చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 62వ ర్యాంకుతో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పోస్టుకు ఎంపికై న బొప్పన అనూషను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించారు. ఈమేరకు ఆమెను డీపీఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరు జిల్లాలకు డీపీఓలను నియమించగా జాబితాలో ఖమ్మంకు చెందిన అనూష కూడా ఉన్నారు. ఐటీడీఏకు ఉత్తమ అవార్డుభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో కేంద్ర పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ఐటీడీఏ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు పీఓ రాహుల్ శనివారంఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ధర్తీ ఆభా జాన్జాతీయ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లో గల 130 గ్రామాల్లో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం ప్రా రంభించామని, ఈ మేరకు గిరిజన సంక్షేమ, విద్యా, వైద్య, గ్రామీణాభివృద్ధి శాఖలను సమన్వయం చేస్తూ పనులు చేపట్టామని వివరించారు. విజన్ 2030 నాటికి ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో నడిచేలా ఆన్ని శాఖ లను అప్రమత్తం చేశామని వివరించారు. అవార్డు ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన పీఓ.. ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో ప్రతిభ చాటిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. పెద్దమ్మతల్లి ఆలయంలో నేడు రుద్రహోమం పాల్వంచరూరల్: మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆదివారంరుద్రహోమంనిర్వహించనున్నట్లుఈఓ ఎన్. రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని సూచించారు.


