ఇంటర్నేషనల్ కరాటే టోర్నీకి ఇద్దరు విద్యార్థులు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం శ్రీనగర్కాలనీలోని స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థులు ఫునకోషి షాటోఖాన్ కరాటే ఆర్గనైజేషన్(డబ్ల్యూఎఫ్ఎస్కేఓ) ఆధ్వర్యాన నిర్వహించిన ఆసియా ఓపెన్ కరాటే చాంపియన్ షిప్లో ప్రతిభ కనబరిచారు. అండర్–14 కుమిటే బాలుర విభాగంలో ఎస్కే.అద్నాన్ బంగారు పతకం, కటాస్లో వెండి పతకం గెలుచుకోగా, అండర్–12 బాలికల్లో రెండు విభాగాల నుంచి రెడ్డిబోయిన సోనాక్షి వెండి, రజిత పతకాలు గెలుచుకుంది. వీరిద్దరు ఏప్రిల్ 26నుంచి దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ ట్రోఫీకి అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ డైరెక్టర్లు కొండా శ్రీధర్రావు, కృష్ణవేణి బుధవారం అభినందించారు. ప్రిన్సిపల్ పీవీఆర్.మురళీమోహన్, కోచ్ ఖాసీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


