breaking news
Khammam District News
-
●నాడు భర్త.. నేడు భార్య
వైరా: వైరా మున్సిపాలిటీలో తొలి వైస్ చైర్మన్గా గతంలో ముళ్లపాటి సీతారాములు పదవి చేపట్టగా ఇప్పుడు ఆయన భార్య ముళ్లపాటి విజయలక్ష్మి పోటీలో ఉన్నా రు. నాడు అధికార బీఆర్ఎస్ నుంచి సీతారాములు పోటీ చేయగా ఆయన ఇటీవల కాంగ్రెస్లో చేరడంతో ఇప్పుడు ఆయన భార్య విజయలక్ష్మి 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ●ప్రత్యర్థులుగా అన్నదమ్ములు కొణిజర్ల: వైరా మున్సిపాలిటీ బరిలో అన్నదమ్ము లు ప్రత్యర్థులుగా మారారు. ఒకరు అధికార కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగగా, మరొకరు ప్రతిపక్ష బీఆర్ ఎస్ పోటీ చేస్తున్నారు. వైరా మున్సిపాలిటీ శివారు పల్లిపాడు 16వ వార్డులో రాచబంటి బలరామయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండగా అతని బా బాయి కుమారుడు రాచబంటి బాలకృష్ణ బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్నాడు. మరో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే ఉంది. -
రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ఉండాలి
అశ్వారావుపేటరూరల్: రాజకీయాల్లో యువత భాగస్వామ్యం అవసరమని, యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంటుందని రాస్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం అశ్వారావుపేటలోని ఆ పార్టీ కార్యదర్శి వెలుగు జాకబ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వీరిలో అశ్వారావుపేటలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి హెచ్చుమీరిందని విమర్శించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని అన్నారు. అశ్వారావుపేట వంటి గిరిజన ప్రాంతాలకు నిధుల కేటాయింపులు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వంటి అసమర్థ సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు రాజ్ కుమార్ రెడ్డి, గౌర బీరప్ప, గిరికుండే, కట్టా సతీష్, మడకం ప్రసాద్, యాగంపూడి ప్రసాద్ పాల్గొన్నారు. -
ముంచిన మొక్కజొన్న సీడ్!
అశ్వారావుపేటరూరల్: మొక్కజొన్న విత్తనాలతో అధిక దిగుబడితోపాటు టన్ను ధర భారీగా వస్తుందని ఓ ఆర్గనైజర్ ఆశ చూపించడంతో సాగు చేసిన కౌలు రైతుకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతు కథనం ప్రకారం.. మండలంలోని మామిళ్లవారిగూడేనికి చెందిన కూరపాటి నరేశ్ గతేడాది అక్టోబర్లో ఇదే మండలంలోని రెడ్డిగూడెం గ్రామంలో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని దమ్మపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ ఆర్గనైజర్ ద్వారా మొక్కజొన్న పంట సాగు చేశాడు. కాగా, సీడ్ ఇచ్చే సమయంలో ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.34 వేలు చొప్పున ధర ఇస్తామని చెప్పారు. తీరా పంట చేతికంది, 10 ఎకరాల్లో పంట కోయగా.. మొక్కజొన్న కండెలో గింజలు పూర్తిస్థాయిలో రాకపోవడం, అంతంత మాత్రంగానే గింజలు రావడంతో ఎకరానికి క్వింటా దిగుబడి మాత్రమే వచ్చినట్లు రైతు వాపోతున్నాడు. ఆశించినస్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఒక ఎకరానికి రూ.80 వేల దాకా నష్టం రాగా, ఇరవై ఎకరాలకు దాదాపు రూ.14 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ఈ విషయాన్ని సీడ్ సరఫరా చేసిన దమ్మపేట మండలానికి చెందిన సదరు ఆర్గనైజర్కు చెబితే తనకు సంబంధం లేదని, సీడ్కు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో బాధిత రైతు దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు. కాగా, సదరు ఆర్గనైజర్ అశ్వారావుపేట మండలంలో మరో వంద ఎకరాలకు సీడ్ సరఫరా చేసినట్లు ప్రచారం సాగుతుండగా, ఆయా రైతుల్లో కుడా ఆందోళన నెలకొంది. తనను మోసం చేసిన ఆర్గనైజర్పై వ్యవసాయ, పోలీస్ శాఖ దృష్టిపెట్టి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
కార్పొరేషన్, మున్సిపాలిటీల వారీగా మొత్తం అభ్యర్థులు.. స్వతంత్ర, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు
మున్సిపాలిటీ వార్డులు మొత్తం స్వతంత్ర/రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు అభ్యర్థులు సత్తుపల్లి 23 84 16మధిర 22 70 12వైరా 20 80 24ఏదులాపురం 32 109 22కల్లూరు 20 72 13ఇల్లెందు 24 108 36అశ్వారావుపేట 22 78 17మొత్తం 163 601 140కొత్తగూడెం 60 354 96(కార్పొరేషన్) (డివిజన్లు) -
నిఘా, తనిఖీ బృందాలు..
ప్రతీ మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని కలెక్టర్ నియమిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు వీరిదే బాధ్యత. – ఫ్లయింగ్ స్క్వాడ్లు డబ్బు, మద్యం పంపిణీ, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఈ బృందంలో ఒక మెజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఒక పోలీస్ అధికారి, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. వీరు నిరంతరం గస్తీ తిరుగుతూ ఉంటారు. – స్టాటిక్ సర్వైలెన్స్ బృందం మున్సిపాలిటీ పరిధిలోని సరిహద్దులు లేదా చెక్పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమ రవాణా కట్టడికి కృషి చేస్తారు. ప్రతీ మున్సిపాలిటీకి ఒక బృందం (పెద్ద మున్సిపాలిటీల్లో రెండు, రెండు కార్పొరేషన్లో అంత కంటే ఎక్కువ) ఉంటుంది. వీడియో సర్వైలెన్స్ బృందం ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, అభ్యర్థుల ప్రచారాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. కోడ్ ఉల్లంఘనలు జరిగితే సాక్ష్యంగా ఈ వీడియోలు ఉపయోగపడతాయి. ●వ్యయ పరిశీలకులు అభ్యర్థులు చేసే ఖర్చు పర్యవేక్షిస్తుంటారు. అభ్యర్థులు సమర్పించే లెక్కలను వీడియోల ఆధారంగా పరిశీలిస్తారు. -
వరి వెదజల్లే పద్ధతిపై శిక్షణ
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా వరి వెదజల్లే పద్ధతి యజమాన్య పద్ధతులపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హైదరాబాద్ భారతీయ వరి పరిశోధన కేంద్రం నుంచి ప్రిన్సిపల్ సైంటిస్టులు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ పద్మావతి హాజరవగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహేంద్రకుమార్, పద్మావతి మాట్లాడుతూ.. వరిలో చీడపీడల నివారణ కోసం అభివృద్ధి చేసిన లింగాకర్షక బుట్టలు, జిగురట్టలు, నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి, వచ్చే లాభాలు, గడ్డిని ఎలా నియంత్రించాలో వివరించారు. అభ్యుదయ రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కేవీకే ఫామ్లో డ్రోన్ పద్ధతిలో వరి సాగు విధానాల గురించి రైతులకు చూపించారు. గిరిజన రైతులకు డ్రమ్ సీడర్ పరికరాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆళ్లపల్లి మండలం రాయపాడు, చుంచుపల్లి మండలం పెనగడప, సుజాతనగర్ మండలం నిమ్మలగూడెం నుంచి 80 మంది రైతులు పాల్గొన్నారు. -
అధికారుల హోదాలు, విధులు
– కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. వార్డుల రిజర్వేషన్లు, నోడల్ అధికారుల నియామకం, ప్రవర్తనా నియమావళి అమలు కమిటీల ఏర్పాటు వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. – అదనపు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలను అదనపు కలెక్టర్ నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి అప్పగించిన విధులు పూర్తి చేస్తారు. అలాగే, ఆర్డీఓ స్థాయి అధికారి డిప్యూటీ ఎన్నికల అధికారిగా ఉంటారు. – మున్సిపల్ కమిషనర్లు సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరి స్తారు. ఓటర్లజాబితాతయారీ, వార్డు ల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల గణన, పోలింగ్ కేంద్రాల ఎంపిక, నామినేషన్ల స్వీకరణ వీరి ప్రధాన బాధ్యతలు. -
చివరి దశకు పత్తి కొనుగోళ్లు
● సీసీఐ కొన్నది 4.41 లక్షలు.. ప్రైవేట్గా 2.73 లక్షల క్వింటాళ్ల కొనుగోలు ● సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ఫిబ్రవరి 20 వరకు అవకాశం ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో పత్తి విక్రయాలు చివరి దశకు చేరుకున్నాయి. వానాకాలం సీజన్లో మొత్తం 6 లక్షల ఎకరాల్లో పంటలుసాగు కాగా 3.03లక్షలఎక రా ల్లో వరి, రెండో స్థానంలో 2.56 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం 40వేల ఎకరాల వరకు పెరిగింది. మిర్చి కి ధర లేకపోవటంతో రైతులు పత్తివైపు మొగ్గు చూ పారు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు పత్తి పంట దిగుబడులపై ప్రభావాన్ని చూపాయి. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడులు సగానికి పడిపోయాయి. పండిన పంటకు కనీస మద్దతు ధరలేకపోవటంతో ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం తేమశాతం ఆధారంగా నిర్ణయించిన మద్దతు ధరతో కొనుగోళ్లు చేశా రు. తొలుత ప్రైవేట్ మార్కెట్లో క్వింటాలుకు రూ.5 నుంచి రూ.6వేల వరకు ధర పలకగా, సీసీఐ కేంద్రా లు ఏర్పాటు చేసిన తరువాత వ్యాపారులు నాణ్యతా ప్రమాణాల ఆధారంగా రూ.7వేల వరకు కొనుగోలు చేశారు. కొద్దిరోజులుగా ఆ ధర రూ.7,800 వరకు పెరి గింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.8,110గా, 9 శాతానికి రూ.8,029గా, 10 శాతానికి రూ.7,948, 11 శాతానికి రూ.7,867గా, 12 శాతం తేమ కలిగిన పత్తికి రూ.7,786 చొప్పున ధర నిర్ణయించి కొనుగోలు చేసింది. 7.14 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జిల్లాలో ఈఏడాది ఇప్పటి వరకు మొత్తంగా 7,14, 953 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేపట్టింది. ప్రభుత్వం సీసీఐ ద్వారా 8 జిన్నింగ్ మిల్లుల్లో 21,281 మంది రైతులకు చెందిన 4,41,850 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా వ్య వసాయ మార్కెట్ల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఈ ఏడాది సీసీఐ పత్తి కొనుగోళ్లు నిర్వహించింది. సీసీఐ పత్తికొనుగోళ్లలో వ్యాపారులు తమ మాయాజాలాన్ని ప్రదర్శించి రైతుల నుంచి రూ.5 నుంచి రూ.6 వేల చొప్పున కొనుగోలు చేసి సీసీఐ కేంద్రాల్లో (జిన్నింగ్ మిల్లుల్లో) విక్రయించి క్వింటాలుకు రూ.2 వేలకు పైగా లాభాలు ఆర్జించారు. ఇక ప్రైవేట్ వ్యాపారులు ఖమ్మం, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లలో, గ్రామాల్లో 2,73,103 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు పత్తిని గుజరాత్ రాష్ట్రానికి ఎగుమతి చేశారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయాలకు ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉంది. కపాస్ కిసాన్ యాప్లో పత్తి విక్రయాలకు నమోదు చేసుకున్న రైతులు కనీస మద్దతు ధరల ప్రయోజనాన్ని పొందేందుకు నిర్ణీత గడువులోగా స్లాట్ బుక్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పత్తిని విక్రయించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరింత సమాచారానికి 94405 87833లో సంప్రదించవచ్చు. –ఎంఏ అలీం, జిల్లా మార్కెటింగ్ శాఖ -
గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాది
● గత పదేళ్లలో కేసీఆర్ను నమ్మి మోసపోయాం ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం ● మంత్రి పొంగులేటి హామీ ఖమ్మంరూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా నాటి సీఎం కేసీఆర్కు లేదని, ఇప్పుడు కల్లబొల్లి మాటలతో ఆ పార్టీ నాయకులు ఓట్ల కోసం ప్రజల ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. వారి మాటలు నమ్మి పదేళ్లు మోసపోయామని, ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 1, 21, 19, 18, 31, 17, 14, 16 వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం, రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తమ స్వలాభం కోసం అడడ్దారులు తొక్కారని, వాటిని కప్పి పుచ్చుకునేందుకు నేడు నాటకమాడుతున్నారని అన్నారు. ఇప్పుడు రంగు, రంగుల కండువాలు వేసుకుని మాయమాటలు చెప్పి ఓట్లు అడిగేందుకు బయలుదేరారని ఎద్దేవా చేశారు. వారి మాటలు నమ్మి గతంలో చేసిన తప్పును పునరావృతం చేయొద్దని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ అందుతున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. గతంలో వరి వేస్తే ఉరి అంటూ రైతులను నట్టేట ముంచిన వారు నేడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగతున్నారని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధర అందించి రైతులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. సొంతింటి కల నెరవేరుస్తాం.. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇంది రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని పొంగులే టి తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రెండో విడతలో పేదలకు ఇళ్లు ఇస్తామని, స్థలాలు లేని అర్హులకు అవి కూడా కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పడిన ఏడాదిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపా రు. కార్యక్రమంలో నాయకులు భైరు హరినాఽథ్బాబు, తమ్మినేని నవీన్, వెంపటి సురేష్, చింతమళ్ల రవీంద్ర, గొడ్డుగొర్ల కృష్ణవేణి, పండూరి అరుణ, మలాది శిరీష, కోటమర్తి సునీత పాల్గొన్నారు. -
‘డబుల్’ ధమాకా
●ఇసీ్త్ర చేస్తూ.. సమోసా వేస్తూ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొత్తగూడెంలోని 56వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బాలిశెట్టి సత్యభామ శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇసీ్త్ర చేస్తూ, టైలరింగ్ పనులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. 55వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి హరిహరన్ సమోసాలు కాల్చుతూ అక్కడి వారిని ఓటు అభ్యర్థించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ 23వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్కే సాహెరాబేగం కూడా ప్రచారంలో భాగంగా ఇసీ్త్ర చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కాగా, ఆమె ప్రత్యర్థి అపర్ణ రజక కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, వారికి ఇసీ్త్ర దుకాణం ఉండడం గమనార్హం. – కొత్తగూడెంఅర్బన్/సత్తుపల్లిరూరల్ ఒకే కుటుంబం నుంచి బరిలో ఇద్దరు.. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోరు ఆసక్తికరంగా మారింది. పలువురు ఒకే కుటుంబం నుంచి వేర్వేరు వార్డుల్లో బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో భార్యకు మద్దతు తెలిపేందుకు భర్త, కూతురుకు మద్దతుగా తండ్రి.. ఇలా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో భార్యాభర్తలు నిలవగా, బీజేపీ నుంచి తండ్రీకూతురు బరిలో నిలిచారు. కాగా, ఈ డబుల్ ధమాకా పోటీపై పట్టణంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. – సత్తుపల్లిఅభ్యర్థుల వినూత్న ప్రచారం.. -
● మీకు తెలుసా?
మున్సిపల్ చైర్మన్కు గౌరవ వేతనం రూ.12 వేలు వైరా: మున్సిపాలిటీ పాలక మండలి సభ్యులకు, చైర్మన్లకు ప్రభుత్వం ప్రతినెల గౌరవ వేతనాన్ని ఇస్తుంది. మున్సిపల్ చైర్మన్కు రూ.12 వేలు, వైస్ చైర్మన్కు రూ.5 వేలు చెల్లిస్తారు. కౌన్సిలర్కు రూ.2,500 చొప్పున గౌరవ వేతనం రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. గ్రామ పంచాయతీలో సర్చంచ్కు రూ.6,500 ఇస్తుండగా.. వార్డు సభ్యులకు వేతనం లేదు. -
ఘనంగా పాఠశాల వజ్రోత్సవాలు
వేంసూరు: వేంసూరు మండలం కందుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల మొదటి బ్యాచ్ నుంచి ఇప్పటివరకు గల పూర్వ విద్యార్థులు హాజరై గత స్మృతులను పంచుకున్నారు. నాటి మిత్రులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వవిద్యార్థి, రాజ్య సభ సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి మాట్లాడుతూ చదువుతోనే ప్రతిఒక్కరి తలరాత మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలిడీఎంహెచ్ఓ రామారావు ఏన్కూరు : మండల కేంద్రంలో డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ధనాలకోట రామారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఫార్మసీ, ల్యాబ్ రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడు తూ.. ఎన్సీడీ స్కానింగ్ పనులను ఈ నెలా ఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. మండలంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎంపీడీఓ భాగ్యశ్రీ, ఎంపీఓ జీవీఎస్ నారాయణతో చర్చించారు. కార్యక్రమంలో వైద్యాధికారి బి.రాములు. డాక్టర్ సాయిలాస్య, పీహెచ్ఎన్ పుణ్యవతి, రమణ పాల్గొన్నారు. 108 వాహనాల తనిఖీఖమ్మంవైద్యవిభాగం : జిల్లాలోని 108, 102(అమ్మ ఒడి), 1962 (పశు సంచార) వాహనాలను తెలంగాణ గ్రీన్ హెల్త్ సర్వీస్ హెచ్ఆర్ హెడ్ కిరణ్కిషోర్ శుక్రవారం తనిఖీ చేశారు. వాహనాల పనితీరు, ఉద్యోగుల హాజరు, నెలవారీ కేసుల సంఖ్య తదితర వివరాలను ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. వాహనాలు సమర్థంగా పని చేసేలా చూడాలని, సమాచారం అందిన వెంట ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను సకాలంలో ఆదుకోవాలని సూచించారు. గోల్డెన్ హవర్ ప్రాముఖ్యతను వివరించి, చురుకై న వేగంతో మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ప్రోగ్రామ్ పనితీరు మెరుగ్గా ఉండడంతో జిల్లా మేనేజర్, ప్రోగ్రాం మేనేజర్లను అభినందించారు. ఆయన వెంట జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, నజీరుద్దీన్ తదితరులు ఉన్నారు. -
పారిశుద్ధ్య పనులకు ప్రణాళిక చేపట్టాలి
● చెత్త రవాణా వాహనాలకు జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్ ఏర్పాటు ● ఆస్తి పన్ను చెల్లించని భవన యజమానులపై చర్యలు ● కేఎంసీ సమీక్షలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మంమయూరిసెంటర్ : నగర పాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గతంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్తో కొంతమేర సత్ఫలితాలు వచ్చాయని అన్నారు. కలెక్టరేట్లో కేఎంసీ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్త రవాణా వాహనాలకు జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్ ఉండాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థలో కొనుగోలు చేస్తున్న నాలుగు స్వీపింగ్ వాహనాలను త్వరగా తీసుకొచ్చేలా చూడాలన్నారు. నగరంలో బ్రిడ్జిపై అనుమతి లేకుండా ప్రచార హోర్డింగులు, పోస్టర్లు పెట్టవద్దని, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని హోర్డింగులు, పోస్టర్లను తొలగించాలని, అలా పెట్టే వారికి జరిమానా విధించాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు.. నగరంలో మంజూరైన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులు పూర్తిచేయాలని, పర్యవేక్షణకు డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, పురోగతిపై ప్రతీ వారం నివేదిక సమర్పించాలని చెప్పారు. మార్చి మొదటి వారం నాటికి ఫుట్ పాత్ పనులు పూర్తి చేయాలన్నారు. పన్నులు చెల్లించకుంటే చర్యలు.. నోటీసులు జారీ చేసినా ఆస్తి పన్ను చెల్లించకపోతే భవన యజమానులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుని సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిఫాల్టర్లను గుర్తించి నీటి సరఫరా నిలిపివేయాలని, వాణిజ్య సముదాయాల పన్ను చెల్లించకపోతే వ్యాపారుల లైసెన్సులు రద్దుచేయాలని అన్నారు. అక్రమ నిర్మాణాలను అనుమతించవద్దన్నారు. ఎస్టీపీల నిర్మాణానికి అవసరమైన భూములను ఈనెల 15 నాటికి అప్పగిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఏఎంసీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ వద్ద నిఘా ఉండాలి ఖమ్మం సహకారనగర్: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శుక్రవారం ఆయన గోడౌన్ను తనిఖీ చేశారు. అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. ఆయన వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎం.ఏ. రాజు, డీటీ అన్సారి, ఆర్అండ్బీ డీఈ లఖన్నాయక్, ఏఈ లలిత ఉన్నారు.ఖమ్మం స్పోర్ట్స్ : నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.50 కోట్లతో ఏర్పాటవుతున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనులను కలెక్టర్ అనుదీప్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా రంగాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఐఎస్ఓ నిబంధనల ప్రకారం పనులు చేయాలని, వర్షపునీరు నిల్వ ఉండకుండా వన్ సైడ్ కార్బోచాంబర్లు, సరిపడా వెలుతురు ఉండేలా హైమాస్ట్ లైట్లు అమర్చాలని చెప్పారు. స్టేడియంలో పచ్చదనాన్ని పెంచేందుకు పొగడ మొక్కలు నాటాలన్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. స్టేడియంలో అందుబాటులో ఉన్న టేబుల్ టెన్నిస్ హాల్, రన్నింగ్ ట్రాక్, ఇతర క్రీడా సదుపాయాలను యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్రీడలు మరింత పెరగా ల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేయర్ పునుకొల్లు నీరజ, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, ఎస్ఈ రంజిత్, ఈఈ కృష్ణలాల్, డీఈ నవీన్, మున్సిపల్ ఉద్యానవన అధికారిణి రాధిక, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ.గౌస్, డీఎస్ఏ మేనేజర్ ఉదయ్కుమార్, ఆదర్శ్కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. -
‘రిజిస్ట్రేషన్’లో తర్జనభర్జన!
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అద్దె భవనాల్లోని కార్యాలయాలను ప్రభు త్వ భవనాల్లోకి మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే జిల్లా రిజిస్ట్రార్, చిట్, మార్కెట్ వ్యాల్యూ అధికారుల కార్యాలయాలు, సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మా ర్చాలని రిజిస్ట్రేషన్శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అద్దె భవనాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గత నెల 25వ తేదీ నాటికే అద్దె భవనాలు ఖాళీ చేయాలని ఆదేశించినా సరిపడా భవనాలు లేకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఒకటి, రెండు కార్యాలయాలకు మాత్రం భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని త్వ రలోనే మార్చనున్నట్లు అధికారులు వెల్లడించారు. బూర్గంపాడు, ఇల్లెందుల్లో మాత్రమే అందుబాటులో.. జిల్లాలో ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు 11 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మధి ర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇప్పటికే ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్, కూసుమంచి, ఖమ్మంరూరల్, వైరా, కల్లూరు, ఇల్లెందు, బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటి కోసం అధికారులు ప్రభుత్వ భవనాలను వెతకగా, బూర్గంపాడు, ఇల్లెందుల్లో మాత్ర మే అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. రెండింటిని త్వరలోనే ఆయా భవనాల్లోకి మార్చనున్నట్లు సమాచారం. శంకుస్థాపన చేసినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గత ప్రభుత్వం స్థలాలు కేటాయించి శంకుస్థాపనలు చేసింది. నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 2016, జూన్ 12న శంకుస్థాపన చేశారు. పదేళ్లు అవుతున్నా నిర్మాణం ముందుకు సాగడం లేదు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు ఖమ్మం, ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి వద్ద స్థలం కేటాయించింది. నిధులు మంజూరు చేయకపోవడంతో భవన నిర్మాణాలు చేపట్టలేదు. వైరా, జిల్లారిజిస్ట్రార్ కార్యాలయం, ఖమ్మం, ఖమ్మంరూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నిధుల లేమితో సొంత భవనాలకు నోచుకోలేదు. ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి వద్ద రిజి స్ట్రేషన్ శాఖకు కేటాయించిన స్థలంలో కార్యాలయా ల కోసం ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనం నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మిస్తుండగా, ఖమ్మంలో కూడా నిర్మించాలని కోరుతున్నారు. ఇదే విషయం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలను అద్దె భవనాల్లోనే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఆర్ఓ–జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మా ర్చాలంటే ఎనిమిది గదులు, ఐదు పెద్దహాళ్లు, స్టోర్కు మరో నాలుగైదు గదులు ఉన్న భవనం అవసరం ఉంటుంది. దీంతో ఈ కార్యాలయ భవనం మార్పునకు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇక వైరా, కల్లూరు, ఖమ్మంరూరల్, కూసుమంచి కార్యాలయాలకు భవనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వాటిలో కొనసాగించే యోచనలో అధికారులు ఉన్నారు. అయితే యజమానులు అద్దె లేకుండా కార్యాలయాలకు భవనాలు ఇస్తే కొనసాగిస్తామని చెబుతుండడం గమనార్హం. -
త్వరలో గిరిమార్ట్ ప్రారంభిస్తాం
బూర్గంపాడు/ములకలపల్లి: త్వరలో భద్రాచలంలో గిరి మార్ట్ను ప్రారంభిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. బూర్గంపాడులోని అక్షయ గ్రామీణ చెక్క గానుగ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ–4 కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ములకలపల్లి మండల పరిధిలోని పాతూరులో పచ్చళ్లు, మిల్లెట్ స్నాక్స్, ఫుడ్ తయారీ, ఆనందపురంలో వైరుబుట్టలు, పూసుగూడెంలో పేపర్పేట్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించేందుకు శ్రీరామనవమికి గిరిమార్ట్ ప్రారంభిస్తామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు గిరిమార్ట్ను వేదికగా మారుస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఐటీసీ, ఎల్జీడీ వంటి సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు ఒడినింపే కార్యక్రమంలో వారికి పండ్లు,పోషకాహారంతో కూడిన ఆహార పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్రాజ్, రేవతి,సర్పంచ్ కుంజా రవి, ఉద్యానవన అధికారి ఉదయ్కుమార్, ఎంపీడీఓ రామారావు, ఏపీఎం రామ్కుమార్, ఎంపీఓ రమేష్బాబు, అంగన్వాడీ కార్యకర్తలు పద్మ, సుమిత్ర, ఎల్జీడి సిబ్బంది ప్రమీల, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఏదులాపురంలో రూ.308 కోట్లతో అభివృద్ధి
ఏదులాపురం మున్సిపల్ పరిధిలో రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్డు అభివృద్ధి పనులు, పోస్ట్ మెట్రిక్ బాలుర, బాలికల హాస్టల్ భవనాల నిర్మాణం చేపడుతున్నాం. ఏదులాపురం, గొల్లగూడెం, గుదిమళ్ల, గుర్రాలపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, పెద్దతండా, పోలేపల్లి, పల్లెగూడెం, తెల్దారుపల్లి, వెంకటగిరి తదితర గ్రామాల్లో ఉపాధి హామీ, పట్టణాభివృద్ధి నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాం. రూ.23.50 లక్షలతో ఓఅండ్ఎం పథకం ద్వారా తెల్దారుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి చెరువులు, కుంటలు, కాల్వల కు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. వెంకటగిరిలో రూ.2.65 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. రూ.2కోట్లతో గిరిజన భవనం నిర్మిస్తున్నాం. ఇంకొన్ని శాశ్వత అభివృద్ధి పనులతో ఏదులాపురంను రాష్ట్రంలోనే రోల్మోడల్గా తీర్చిదిద్దుతా. -
వృత్తి నైపుణ్యాలతో స్వయంఉపాధి
భద్రాచలం: నిరుద్యోగ గిరిజన యువత వృత్తి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని స్వయం ఉపాధి పెంపొందించుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అఽధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఎలక్ట్రానిక్ ప్యూరిఫైర్, డ్రోన్ సర్వీస్ ఎలక్ట్రీషియన్లలో శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులు పీఓను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ వైటీసీలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధిలో ఉపయోగించి రాణించాలని సూచించారు. ఏకలవ్య దరఖాస్తులకు ప్రత్యేక సెల్ తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల దరఖాస్తులను స్వీకరించేందుకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు పీఓ తెలిపారు. గురువారం ప్రవేశ పరీక్షకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేసి మాట్లాడారు. ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో రూ. 100 చెల్లించి ఆన్లైన్ ద్వారా ఎంట్రన్స్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్ రాజ్, హరికృష్ణ, శ్రీనివాస్, అరుణ, సులోచన, అబ్దుల్, భవాని, అనూహ్య, వినీత, సమ్మయ్య పాల్గొన్నారు.ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ -
ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వసతులు
● అత్యవసర కొనుగోళ్లకు రూ.5లక్షల నిధులు ● సమీక్షలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జనరల్ ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వసతులు మెరుగుపర్చాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన ఆస్పత్రి పనితీరు, పెండింగ్ పనులపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆస్పత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు, సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వస్తున్నందున మార్పు రావాలని స్పష్టం చేశారు. రూ.5 లక్షల నిధులు అందుబాటులో ఉంటాయని, ఏ విభాగంలోనైనా అత్యవసరంగా పరికరాలు అవసరమైతే కొనుగోలు చేయాలన్నారు. అంతేకాక రూ.1.65కోట్లతో నిర్మిస్తున్న టాయిలెట్లు, లిఫ్ట్ మరమ్మతులు త్వరగా పూర్తిచేయడంతో పాటు అదనంగా వాటర్ సంప్ నిర్మించాలని, ఫైర్ సేఫ్టీ, సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ఆస్పత్రిలో ఆర్ఎంఓలు, బయో మెడికల్ ఇంజనీర్ నియామకం, ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక బ్లాక్ నిర్మాణం, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంపై దృష్టి సారించాలని తెలిపారు. నెలకు రూ.55 లక్షలు వెచ్చిస్తున్నందున పారిశుద్ధ్యం మెరుగపడకపోతే ఏజెన్సీ రద్దుకు లేఖ రాయాలన్నారు. అంతేకాక కార్మికుల హాజరును ఎఫ్ఆర్ఎస్ విధానంలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్, వైద్య ఆరోగ్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ సహాయ కమిషనర్ అనిల్కుమార్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అప్రోచ్ రోడ్డు ఉంటేనే లే ఔట్ అనుమతి ఖమ్మం సహకారనగర్: లే ఔట్లకు అనుమతుల జారీ విషయంలో నిబంధనలను పక్కాగా అమలుచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి లే ఔట్ కమిటీ సమావేశం నిర్వహించగా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 డ్రాఫ్ట్ లేఔట్, నాలుగు తుది లేఔట్ దరఖాస్తులను పరిశీలించాక కలెక్టర్ మాట్లాడారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేకుండా చూడడమే కాక అప్రోచ్ రోడ్డు 18 మీటర్లు ఉంటేనే క్షేత్థ్రాయి పరిశీలన అనంతరం అనుమతికి సిఫారసు చేయాలని సూచించారు. ఈసమావేశంలో ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, వివిధ శాఖల అధికారులు వెంకట్రెడ్డి, శ్రీనివాసాచారి, రాజేందర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
తీర్థాల జాతరలో పకడ్బందీ భద్రత
ఖమ్మంరూరల్: మండలంలోని తీర్థాలలో మహా శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత కల్పించనున్నట్లు అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు తెలిపారు. తీర్థాల జాతర ఆవరణ, పరిసరాలను రూరల్ ఏసీపీ తిరుపతిరెడితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున అదనపు బలగాలతో భద్రత ఏర్పాటుచేస్తామని తెలిపారు. అనంతరం ఆలయ స్వాగత ద్వారం మొదలు గర్భాలయం వరకు వేస్తున్న క్యూలైన్లు, చలువ పందిళ్లను పరిశీలించారు. అలాగే, సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్, బారికేడ్లు ఏర్పాటుపై సూచనలు చేశారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
హైవేలపై ప్రమాద ప్రదేశాల గుర్తింపు ఎలా?
ఖమ్మంమయూరిసెంటర్: జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేల్లో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యా న వాటిని ఎలా గుర్తిస్తున్నారు, అక్కడ ఎలాంటి నివారణ చర్యలు చేపడుతున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. ఈమేరకు గురువారం ఆయన పార్లమెంట్లో ప్రశ్న లేవనెత్తారు. ఇందుకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక ఆధారంగా బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామని తెలిపారు. మరణాలు లేదా తీవ్ర గాయాలకు దారి తీసే నిర్దిష్ట సంఖ్యలో ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా తేలుస్తున్నామని వెల్లడించారు. అంతేకాక ప్రమాదాల సమాచారాన్ని పొందుపరిచి విశ్లేషించేలా ఎలక్ట్రానిక్ డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ప్రమాదాల వివరాలు ఒకే వేదికపై నమోదవుతాయని, తద్వారా ప్రమాదాల నివారణ చర్యల అమలు, పర్యవేక్షణ సులభం కానుందని.. దీంతో పాటు బీమా క్లెయిమ్లను వేగంగా పరిష్కరించేందు కు ఉపయోగపడుతుందని గడ్కరీ వివరించారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో లేఖా రచన పోటీలు సర్కిల్, జాతీయ స్థాయిలో బహుమతులు ఖమ్మంగాంధీచౌక్: యూనివర్సల్ పోస్టల్ యూనియన్(యూపీయూ) ఆధ్వర్యాన ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా యువత కోసం అంతర్జాతీయ లేఖల రచన పోటీలు నిర్వహించనున్నారు. ‘డిజిటల్ ప్రపంచంలో మానవ సంబంధాలు ఎందుకు ముఖ్యం’ అన్న అంశంపై స్నేహితులను ఉద్దేశిస్తూ లేఖ రాయాల్సి ఉండగా, 9 – 15 ఏళ్ల వయసు విద్యార్థులను అర్హులుగా ప్రకటించారు. ఇంగ్లిష్లో లేదా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న ఏ భాషలోనైనా రాసే అవకాశముండగా, లేఖ 800 పదాలకు మించకుండా ఉండాలి. సర్కిల్ స్థాయిలో ముగ్గురు విజేతలకు వరుసగా రూ.25వేలు, రూ.10 వేలు, రూ.5వేల బహుమతి అందిస్తారు. అలాగే, జాతీయ స్థాయిలో ముగ్గురికి రూ.50వేలు, రూ.25 వేలు, రూ.10 వేల నగదు బహుమతి అందుతుంది. అంతేకాక జాతీయ స్థాయిలో ఉత్తమ లేఖను అంతర్జాతీయ స్థాయి పోటీలకు భారత్ అధికారిక ఎంట్రీగా పంపిస్తారు. ఈమేరకు విద్యార్థులు తమ లేఖలను పాఠశాలల ద్వారా మార్చి 9వ తేదీ లోగా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి అందేలా పంపించాలని, ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన రెసిడెన్షియల్ పద్ధతిలో ఐదు నెలల పాటు ఇచ్చే ఫౌండేషనల్ కోర్సు ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులను ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు అధ్యయన కేంద్రం జిల్లా సంచాలకులు ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈమేరకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన గ్రూప్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిటీ, బ్యాంకింగ్ మొదలైన పోటీపరీక్షలకు భోజన, వసతితో 100 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఐదు నెలల బేసిక్ ఫౌండేషన్ శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీలకు 75శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలు, మైనార్టీలకు కలిపి 15 శాతం, అన్ని కేటగిరీల్లో మహిళలకు 33.3 శాతం, దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండి, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 98667 26277, 79819 88667 నంబర్లలోసంప్రదించాలని సూచించారు. నాలుగు కొత్త కార్మిక కోడ్ల అమలు ఖమ్మం సహకారనగర్: గత ఏడాది నవంబర్ 21 నుంచి నాలుగు కొత్త కార్మిక కోడ్లు అమలులోకి వచ్చాయని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ వై.డీ.శ్రీనివాస్ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేసి, నాలుగు కార్మిక కోడ్లను రూపొందించిందని వెల్లడించారు. ఇందులో వేతనాల కోడ్–2019, పారిశ్రామిక సంబంధాల కోడ్–2020, సామాజిక భద్రత కోడ్–2020తో పాటు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశ పరిస్థితుల కోడ్–2020 ఉన్నాయని తెలిపారు. ఈ కోడ్లు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. కార్మికుల సంక్షే మం, వ్యాపార సౌలభ్యం మధ్య సమతుల్య తను కాపాడుతూ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ఉన్న వీటి ద్వారా అందే ప్రయోజనాలను యజమానులు, ఉద్యోగులు వినియోగించుకో వాలని కమిషనర్ ఓ ప్రకటనలో సూచించారు. -
ఎన్నికల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ ఆరా
కల్లూరు రూరల్: కల్లూరు మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ గురువారం పరిశీలించారు. ఈమేరకు ఏర్పాట్లపై ఆరా తీసిన ఆమె ఉద్యోగులకు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్లో బ్యాలెట్ బాక్స్ల భద్రత, కౌంటింగ్ హాల్లో అవసరమైన సదుపాయాల కల్పనపై చర్చించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.రామదుర్గారెడ్డి, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ చలపతి, తహసీల్దార్ పులి సాంబశివుడు, మేనేజర్ ఎన్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. మత్స్య రైతులు ఆర్థికంగా ఎదగాలి కూసుమంచి: చేపల పెంపకంలో ఆధునిక విధానాలు పాటిస్తూ మత్స్య రైతులు ఆర్థికంగా ఎదగాలని నాబార్డ్ జిల్లా మేనేజర్ ఎల్.సుజిత్కుమార్ సూచించారు. పాలేరులోని పీవీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయో ప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సుజిత్కుమార్ మాట్లాడుతూ మత్స్య రంగానికి ప్రభుత్వాలు ఇస్తున్న తోడ్పాటు, పాలేరు కేంద్రంలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం నాబార్డు ద్వారా మత్స్యకారులు, రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ శిక్షణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల మత్స్య రైతులు పాల్గొనగా వారికి నైపుణ్య సర్టిఫికెట్లను అందజేశారు. పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, శాంతన్న, దివ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారంలో ‘సోషల్’ ట్రెండ్ !
వైరా: మున్సిపల్ ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇదే సమయాన ఓటర్లకు మరింత చేరువయ్యేలా ప్రచార పంథా మార్చారు. గతంలో ఓటర్లను ప్రత్యేకంగా కలిసి తాము ఏమేం చేస్తామో చెబుతూ మద్దతు కోరేవారు. ఇది ఇప్పుడూ కొనసాగుతున్నప్పటికీ ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రస్తుతం చిన్నాపెద్ద తేడా లేకుండా అందరి చేతుల్లో ఇంటర్నెట్తో కూడిన సెల్ఫోన్లు ఉంటున్నాయి. అంతేకాక అందరికీ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి. వీటి ఆధారంగా అభ్యర్థులు తమ ప్రచార శైలి, ఇచ్చే హామీలను ఓటర్లలోకి తీసుకెళ్తున్నారు. అంతేకాక పత్రికల్లో ప్రచురితమవుతున్న కథనాల క్లిప్పింగ్లను ప్రతిరోజు ఉదయం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేలా ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించుకున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ఓటర్లను ఆకట్టుకునేలా పాటలు రికార్డింగ్ చేయించారు. అలాగే, రీల్స్ ద్వారా కూడా తమ సందేశాన్ని పంపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారానికి సోషల్ మీడియాను ఆయుధంగా ఎంచుకున్నారు. ప్రచారంలో భాగంగా గతంలో చేసిన సేవా కార్యక్రమాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అలాగే, ప్రచార సమయాన ప్రత్యేక ఫొటోగ్రాఫర్లతో చిత్రీకరించిన ఫొటోలు, వీడియోలకు పాటలు జత చేసి పోస్ట్ చేస్తూ కొత్త ట్రెండ్తో హోరెత్తిస్తున్నారు. కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులంతా వార్డుల వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటుచేశారు. ఇందులోని వార్డులోని ఓటర్లను యాడ్ చేసి తమ ప్రచార ఫోటోలు, వీడియోలను పోస్టు చేస్తూ, తమను గెలిపిస్తే చేసే అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో కలిసి దిగిన ఫొటోలు, ప్రచారంలో వారి వీడియోలతో రీల్స్ కూడా పోస్టు చేస్తున్నారు. ఓటర్లను సులువుగా ఆటకట్టుకునేలా పలువురు అభ్యర్థులు ప్రత్యేకంగా పాటలు రాయించారు. వీటిని స్టూడియోల్లో రికార్డు చేయించడమే కాక వీడియోలు జత చేస్తున్నారు. పేరున్న గాయకుడు తెలంగాణ గద్దర్ గతంలో పాడిన పాటల్లో కొంత భాగం తీసుకుని తమ వీడియోలకు జత చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఖర్చుకు వెనుకాడకుండా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు చేస్తున్న ‘నయా’ ప్రచారంతో సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు -
ప్రతిపక్షానికి ఓటు వేస్తే గుండు సున్నే..
సత్తుపల్లి: ‘ఓటర్ల వద్దకు కొందరు రంగురంగుల కండువాలు వేసుకుని వస్తున్నారు.. మీరు ఎమ్మెల్యేనా, ఎంపీనా, మంత్రినా.. ఏ హోదాతో హామీలు ఇస్తున్నారు.. అవి ఎలా నెరవేరుస్తారు’ అని వారిని నిలదీయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇంకా అధికారంలో ఉన్నట్లు భ్రమ పడుతున్న ప్రతిపక్షానికి ఓటు వేస్తే మిగిలేది గుండు సున్నానే అని పేర్కొన్నారు. సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, టీజీ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబుతో కలిసి రోడ్షో నిర్వహించగా మంత్రి మాట్లాడారు. ఏ అభివృద్ధి జరగాలన్నా, నిధులు రావాలన్నా ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని సత్తుపల్లి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్సార్ ఇచ్చిన ఇళ్ల స్థలాలే.. సత్తుపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన రాజీవ్నగర్ ఇళ్ల స్థలాలే తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ స్థలం ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో ఇళ్ల స్థలాల సమస్యను ఎమ్మెల్యే రాగమయి పలుమార్లు చర్చించడంతో ఎన్టీఆర్ కాలువ ను పూడ్చివేయించి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా హామీ వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పరిపాలనలో మాటలు తప్ప పనులు జరగలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక పేదలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 15 ఏళ్ల పాలనలో సత్తుపల్లిలో రోడ్డుకో శిలాఫలకం వేయడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. అభివృద్ధి అంటే రోడ్లు వేయడమే కాద ని.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించి అవసరాల ను తీర్చడమని తెలిపారు. టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్ని కల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో విజయం సాధించాలన్నారు. డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ మున్సిపాలిటీల ప్రతీ పని పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రచా రంలో అభ్యర్థులు, నాయకులు ఎం.డీ.కమల్పాషా, తోట సుజలరాణి, ఎస్.కే.మౌలాలీ, మందపాటి ప్రభాకర్రెడ్డి, ఎం.డీ.రెహానాబేగం, బొంతు సుమలత, వందనపు సత్యనారాయణ, నాయుడు రాధిక, ఎస్.కే.నాగుల్మీరా, బండారు శరత్, మట్టా దేవజ్యోతి, పింగళి సామేలు పాల్గొన్నారు. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో శుక్రవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్డుషో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3–30 నుండి 1, 21, 19, 18, 31, 32, 17వ వార్డుల్లో రోడ్డు షో ఉంటుందని, అభ్యర్థులు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి పిలుపునిచ్చారు.అన్ని స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించండి -
కనుల పండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తుల కోరిక మేరకు ఈ నెల 8న వైజాగ్లో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణాన్ని జరపనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా వైజాగ్లోని రాజప్పనాయుడు వీధి రామాలయ నిర్వహణ సేవా సంఘం సంప్రదించారని పేర్కొన్నారు. నిబంధనల మేరకు 7న శోభాయాత్ర, 8న కల్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు. -
బంగారు ఆభరణాలు అప్పగింత
ఖమ్మంక్రైం: వైద్యం కోసం ఖమ్మం వచ్చి ఆభరణాలు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఆభరణాలు దక్కేలా పోలీసులు చేసిన కృషి ఫలించింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల గ్రామానికి చెందిన గుగులోత్ లక్పతి ఖమ్మంలో ఆస్పత్రికి గురువారం రాగా, ఆయన వద్ద 35 గ్రాముల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో ఖమ్మం టూ టౌన్ పోలీసు ఉద్యోగులు డి.శ్రీను, టి.భీముడు రంగంలోకి దిగారు. లక్పతి తిరిగిన ఆస్పత్రి, మెడికల్ షాప్ ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మెడికల్ షాప్లో ఆభరణాలు మరిచిపోయినట్లు తేలింది. దీంతో వాటిని ఎస్ఐ రమేష్ సమక్షాన బాధితుడికి అప్పగించడంతో కృతజ్ఞతలు తెలిపాడు. సంత ఆవరణలో వ్యక్తి.. కామేపల్లి: మండలంలోని పండితాపురం సంత ఆవరణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన లావుడ్యా బాలు(55) బుధవారం సంతకు వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడు. తిరిగి రాత్రి ఇంటికి చేరకపోవడంతో ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియరాలేదు. గురువారం ఉదయం సంత ఆవరణలోని షెడ్డులో ఆయనను స్థానికులు గుర్తించగా, కుటుంబీకులు వచ్చి పరిశీలించే సరికే బాలు మృతి చెంది ఉన్నాడు. ఆయన అతిగా మద్యం తాగి నీరు, ఆహారం లేక మృతి చెంది ఉంటాడని బాలు కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ప్రైవేటు చిట్టీ నిర్వాహకుడిపై కేసు ఖమ్మంఅర్బన్: డబ్బు చెల్లించకుండా మోసం చేసిన ప్రైవేట్ చిట్టీ నిర్వాహకుడిపై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. ఖానాపురానికి చెందిన తోటకూర విజయలక్ష్మి ప్రైవేట్గా చిట్టీలు నడిపే బోనం ప్రసాద్ వద్ద నెలకు రూ.25 వేల చొప్పున 19 నెలల పాటు కిస్తీలు చెల్లించింది. ఆమెకు రూ.5లక్షల మేర చెల్లించాల్సి ఉన్నా ప్రసాద్ తప్పుడు కారణాలు చూపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. బస్టాండ్లో యాచకుడు మృతి సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన యాచకుడు సత్తుపల్లి బస్టాండ్లో శుక్రవారం మృతి చెందాడు. కాకర్లపల్లికి చెందిన భూక్యా శ్రీను(50) కొంతకాలంగా ప్రయాణికులను యాచిస్తూ బస్టాండ్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన ఆయన మృతి చెందాడు. ఈమేరకు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించగా, బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై ప్రదీప్ తెలిపారు. గంజాయి స్వాధీనంభద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని గురువారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం వద్ద ఓ కారులో సోదా చేయగా, రూ.10.73లక్షల విలువైన 15.070 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. నిందితులు రంగారెడ్డి జిల్లా జీడిమెట్లకు చెందిన రఘు, రాజస్థాన్కు చెందిన శేఖర్ రామ్ను అరెస్ట్ చేశారు. -
విద్యుత్ ఫెన్సింగ్ కట్టడిపై దృష్టి
ఖమ్మంవ్యవసాయం: అడవి జంతువుల నుంచి పంటలకు రక్షణ పేరుతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ఫెన్సింగ్ కట్టడిపై విద్యుత్ అధికారులు దృష్టి సారించారు. ఈ ఫెన్సింగ్ జంతువులకే కాక మనుషులకు ప్రాణాంతకంగా మారుతున్న నేపథ్యాన నియంత్రించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోన్నారు. ఇదే సమయాన ప్రత్యామ్నాయంగా సోలార్ ఆధారిత ఫెన్సింగ్, గార్డింగ్, ఇతర విధానాలు అవలంబించేలా అవగాహన కల్పించనున్నారు. సులువు కావడంతో... పలు చోట్ల పంటలను అడవి జంతువులు పాడు చేస్తుండడంతో పొలాల చుట్టూ రైతులు విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తున్నారు. మొక్కజొన్న, వేరుశనగ, పండ్ల తోటలు, కూరగాయల పంటలకే కాక వరి చేన్లకు అడవులు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటుచేయించడం సర్వసాధారణమైంది. కొందరు పంటల రక్షణ కోసం.. ఇంకొందరు అటవీ జంతవుల వేట కోసం ఏర్పాటుచేయిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఇందుకోసం విద్యుత్ లైన్ల నుంచి అనధికారికంగా వైర్లు అనుసంధానించి ఫెన్సింగ్కు సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ లైన్లకు కర్రలు, బొంగుల సాయంతో వైర్లను తగిలిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఫెన్సింగ్ కారణంగా అటవీ జంతువులే కాక ఆవులు, గేదెలు, దుక్కిటెద్దులతో పాటు ఒక్కోసారి రైతులు, కూలీలు కూడా మరణిస్తున్నారు. గత ఏడాది కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన మేకల కాపరి కరుణాకర్ మరణించాడు. సురక్షిత విధానాలు పంటలను పశుపక్షాదుల నుంచి రక్షించుకునేందుకు అనేక విధానాలు చర్యలు అందుబాటులోకి వచ్చాయి. పండ్ల తోటలు, మొక్కజొన్న చేలు, వేరుశనగ పంటల రక్షణ కోసం సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. సోలార్ ఆధారిత ఫెన్సింగ్, గార్డింగ్, ఇతర సురక్షిత పద్ధతులను వినియోగించుకునే అవకాశం ఉన్నందున అధికారులు రంగంలోకి దిగారు. విద్యుత్ ఫెన్సింగ్తో నష్టాలు, ఎదురయ్యే చట్టపరమైన చర్యలను వివరిస్తూనే సురక్షిత మార్గాలపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. పంటల రక్షణ పేరిట విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయడం చట్టరీత్యా నేరం. విద్యుత్ లైన్ల నుంచి నేరుగా కనెక్షన్ ఇచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణలో భాగంగా తనిఖీల ద్వారా ఇలాంటి వారిని గుర్తిస్తాం. ప్రజలు కూడా అక్రమంగా విద్యుత్ వినియోగించే వారి వివరాలను అందించాలి. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
మల్లారం పాఠశాల భేష్..
తల్లాడ/కల్లూరు రూరల్: ప్లాస్టిక్ రహిత పాఠశాలగా రూపుదిద్దుకుంటున్న తల్లాడ మండలం మల్లారం ప్రాథమిక పాఠశాల ఇతర స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యాశాఖ సీఎంఓ(క్లస్టర్ మానిటరింగ్ ఆఫీసర్) ప్రవీణ్కుమార్ అన్నారు. పాఠశాలలో గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్తో పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆతర్వాత నారాయణపురం పాఠశాలలో భవిత కేంద్ర భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే, కల్లూరు మండలం చెన్నూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ను పరిశీలించిన సీఎంఓ... పదో తరగతి విద్యార్థులకు బోధన, పరీక్షలకు సన్నద్ధతపై చర్చించాక సచనలు చేశారు. ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్, హెచ్ఎంలు హెచ్ఎంలు జాబిశెట్టి ప్రసాదరావు, బి.హరిబాబు, కె.అనంతరాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘పుర’పోరు.. ప్రచార హోరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తరఫున ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యే నెలకొంది. వీటితో పాటు సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. అభ్యర్థుల ప్రచారం జోరందుకోగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్లోని కీలక నేతలు రంగంలోకి దిగారు. మనది ఈ ‘గుర్తే’.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను పలకరిస్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పులు, మైకులతో వీధులన్నీ దద్దరిల్లుతున్నాయి. ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాల్లో అభ్యర్థులు వారితో మాట కలిపి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అంతేకాక తమ గుర్తుతో కూడిన పోస్టర్లు చూపిస్తూ ‘గుర్తుంచుకోండి’ అని కోరుతున్నారు. జెండా కట్టు.. మైకు పెట్టు ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వీధులన్నీ పార్టీల జెండాలతో కళకళలాడుతున్నాయి. వాహనాలకు జెండాలు, ఫ్లెక్సీలు, మైకులు అమర్చి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక అభ్యర్థుల ఫొటోలు, గుర్తులతో ఉన్న పోస్టర్లు, ఫ్లెక్సీలను కూడళ్లలో ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయాన ప్రచారానికి సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు. నాలుగు రోజుల్లో చుట్టేసేలా.. ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఇన్నాళ్లు టికెట్ సాధించడం, రెబల్స్కు నచ్చజెప్పడంతో బిజీగా ఉన్న అభ్యర్థులు ఇప్పుడు ప్రచారంలో వేగం పెంచారు. మిగిలిన నాలుగు రోజుల్లో డివిజన్, వార్డులోని ప్రతీ గల్లీని చుట్టేయడం, ఓటర్లందరికీ కలవడమే లక్ష్యంగా ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. ఓసారి అభ్యర్థి వచ్చివెళ్లగానే.. వారికి సంబంధించిన ప్రచార వాహనాన్ని ఆ గల్లీకి పంపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తుండగా.. బీఆర్ఎస్ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు ప్రస్తుతం అభివృద్ధి జరగడం లేదంటూ ప్రచారం నిర్వహిస్తోంది. బీజేపీ తదితర పార్టీలు కూడా ఇదే తరహా ప్రచారం చేస్తున్నాయి.గల్లీగల్లీని చుట్టేస్తున్న అభ్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఏదులాపురం, కల్లూరు, అశ్వారావుపేట, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రచార బాధ్యతలు భుజాలకెత్తుకున్నారు. వైరాలో పువ్వాడ, తాతా మధు, మధిరలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటిస్తుండగా, కొత్తగూడెం కార్పొరేషన్లో బీఆర్ఎస్ తరుపున వద్దిరాజు రవిచంద్ర ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర సెక్రటరీ మహిపాల్రెడ్డి, ఇతర నాయకులు, సీపీఐ నుంచి కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్రావు, నున్నా నాగేశ్వరరావు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
● పోస్టల్ బ్యాలెట్కు రేపటి వరకు గడువు
సత్తుపల్లిటౌన్: మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం తొలుత దరఖాస్తు ఫారం–12కు ధ్రువీకరణ పత్రం జత చేసి ఓటుహక్కు కలిగి ఉన్న మున్సిపాలిటీలో శనివారంలోగా అందజేయాలి. ఆపై రిటర్నింగ్ అధికారి ఫారం–15, 16, 7, 18ను అందిస్తారు. వీటిలో ఓటు నమోదు చేసి ఆదివారం 8వ తేదీ ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటు హక్కు కేంద్రాలు ఏదులాపురం మున్సిపాలిటీ సంబంధించి ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్హాల్లో ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్స్లో వేయాలి. అలాగే, మధిర మున్సిపాల్టీకి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో, కల్లూరు మున్సిపాలిటీ పరిధి ఉద్యోగులు కల్లూరు జీహెచ్ఎస్లో, వైరా ఉద్యోగులు తహసీల్లో, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయంలోని సెంటర్లో ఓటు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. ● పోల్ స్లిప్పులు రెడీ వైరా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 11న జరగనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. ఇందులో భాగంగా వైరా మున్సిపాలిటీ 20 వార్డుల్లో 24,689మంది ఓటర్లు ఉండగా వీరికి పంపిణీ చేసేందుకు పోల్ స్లిప్పులను సిద్ధం చేశారు. మున్సిపల్ సిబ్బంది వీటిని ఇంటింటికీ పంపిణీ చేయనున్నారని కమిషనర్ యు.గురులింగం తెలిపారు. -
పుర పోరులో బాధ్యతల విభజన
బృందాల వారీగా విధుల కేటాయింపు ఖమ్మంమయూరిసెంటర్: పురపాలక ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పది విభాగాలకు నోడల్ అధికారులను నియమించారు. వీరంతా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మానవ వనరులు : నామినేషన్ల పరిశీలన మొదలు ఓట్ల లెక్కింపు వరకు కావాల్సిన ఉద్యోగులను ఈ విభాగం ద్వారా నియమిస్తారు. మొత్తం ఎన్నికల్లో ఇది కీలక విభాగం. బ్యాలెట్ పెట్టెల నిర్వహణ : కేంద్రాలకు బ్యాలెట్ పెట్టెలను చేర్చడం, పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్కు తరలించడం, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు భద్రతను పర్యవేక్షించడం ఈ బృందం బాధ్యత. రవాణా : పోలింగ్కు ముందురోజే ఉద్యోగులు, బ్యాలెట్ పెట్టెలు, భద్రతా బలగాలను వాహనాల ద్వారా కేంద్రాలకు చేర్చే విభాగం. సామగ్రి, ముద్రణ : పోలింగ్, కౌంటింగ్కు కావాల్సిన వస్తువులను సమకూర్చడం, బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లను ముద్రించే బాధ్యతను ఈ విభాగం చూసుకుంటుంది. వ్యయ నిర్ధారణ, పర్యవేక్షణ : అభ్యర్థులు నిబంధనల ప్రకారం ఖర్చు చేస్తున్నారా లేదా అని ఆరా తీసే విభాగం ఇది. ఖర్చుల వీడియోలు, సీడీలను ఈ విభాగం ఉద్యోగులు నిక్షిప్తం చేస్తారు. శిక్షణ, ఏర్పాట్లు : పోలింగ్, కౌంటింగ్పై సిబ్బందికి శిక్షణ ఇచ్చే విభాగమిది. వివిధ విభాగాల పరిశీలకులకు కావాల్సిన ఏర్పాట్లను సమన్వయం చేస్తుంది. ఖాతాల నిర్వహణ : ప్రచార సభలు, సమావేశాలకు అయ్యే ఖర్చులను అంచనా వేసి, వాటిని అభ్యర్థుల ఖాతాల్లో చూపే విభాగం. ప్రవర్తన నియమావళి : రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కోడ్ అనుసరిస్తున్నారా, లేదా అని నిఘా వేస్తారు. ఉల్లంఘనలు ఉంటే ఆధారాలు సేకరిస్తారు. ఫిర్యాదులు, హెల్ప్లైన్, కేసులు : పార్టీలు, అభ్యర్థులు లేదా ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఎస్ఈసీకి నివేదిస్తారు. హెల్ప్లైన్కు అందే ఫిర్యాదులను పరిష్కరిస్తారు. సమాచారం, నివేదికలు : ఎన్నికల సమాచారాన్ని మీడియాకు అందించడం, అవసరమైన నివేదికలు రూపొందించడం ఈ విభాగం ముఖ్య విధి. -
మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్యత
● ప్రజలు ఇచ్చిన శక్తితో పాటుపడతా... ● ఏదులాపురం, కల్లూరు ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మంరూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులో మంత్రిగా తాను ఉండడానికి ప్రజలు ఇచ్చిన శక్తే కారణం.. దీన్ని వంద శాతం ఉపయోగించుకుంటూ మున్సిపాలిటీల అభివృద్ధికి పాటుపడతానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈమేరకు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 10, 11, 28, 29, 30 వార్డు అభ్యర్థుల తరఫున బుధవారం జరిగిన ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడారు. పేదరికమే ప్రాతిపదికన ఏ పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని తెలిపారు. ఏప్రిల్ మరో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. ఈమేరకు 11న జరిగే ఎన్నికల్లో ప్రత్యర్ధులకు డిపాజిట్లు రాకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మాటలు చెప్పే వారిని కాకుండా అనునిత్యం పేదల సంక్షేమం ఆలోచించే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ ప్రచారంలో అభ్యర్థులు నూకల రాంమోహన్రెడ్డి, కొట్టం శిరీష, పేరం. వెంకటలక్ష్మి, తుమ్మల భిక్షం, వెంపటి ఉమతో పాటు నాయకులు కొట్టం రంజిత్రెడ్డి, సైదిరెడ్డి, గణపారపు. వీరన్న, వెంపటి రవి, భూక్యా సురేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. నంబర్ వన్గా అభివృద్ధి చేస్తా కల్లూరు రూరల్: కల్లూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్డుషోలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరు మెయిన్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తన సొంత మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించినందున 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ను గెలిపించి ప్రజలు తమ బాధ్యత నెరవేర్చాలని సూచించారు. తమ ప్రభుత్వంలో చందాలు, దందాలకు స్థానం లేదని మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలను మోసగిస్తే.. తాము అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేయడమే కాక పేదలకు రేషన్కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పసుమర్తి చందర్రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మార్కె ట్ చైర్పర్సన్ బాగం నీరజాదేవి తదితరులు పాల్గొన్నారు. -
మేయర్, చైర్మన్ రిజర్వ్ స్థానాలపై పార్టీల నజర్
● ఆయా డివిజన్లు, వార్డుల్లో గెలుపునకు ప్రత్యేక వ్యూహం ● అన్ని పార్టీల నుంచి పోటాపోటీ ప్రచారం కొన్నిచోట్ల వ్యూహాత్మకం మేయర్, చైర్మన్ పదవులకు రిజర్వ్ అయిన డివిజన్లు, వార్డుల్లో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించాయి. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్టీ జనరల్కు రిజర్వు కాగా, ఇక్కడ ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాలే కాకుండా జనరల్ స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ తొమ్మిదో వార్డు ఎస్సీ జనరల్కు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ మున్సిపాలిటీలోని 5వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ అయినా బీఆర్ఎస్ ఎస్టీ మహిళను బరిలో నిలిపింది. ● ఇల్లెందు : ఈ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ 24 వార్డులకు గాను 18 వార్డులు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నుంచి 13వ వార్డు అభ్యర్థి మడుగు సాయిసుధ, రెండో వార్డు అభ్యర్థి దొడ్డా కిరణ్మిత్ర, 23వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కొండపల్లి సరితతో పాటు ఎనిమిదో వార్డు అభ్యర్థి స్వరూప చైర్పర్సన్ పదవికి పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్లో 19వ వార్డు నుంచి పింగళి అనూహ్య, 4వ వార్డు నుంచి ఎస్.రాజ వినోద చైర్పర్సన్ రేసులో ఉన్నారు. ● ఏదులాపురం : ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, ఈ కేటగిరీలో 9, 17, 23 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గొడ్డుగొర్ల కృష్ణవేణి, పోకబత్తిని అనిత, కందుకూరి శేషమ్మ చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నారు. ఇక డిప్యూటీ చైర్మన్ రేసులో 28వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రాంమోహన్రెడ్డి, 22 వార్డు అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్లోనూ 9వ వార్డు నుంచి కొట్టె రమాదేవి, 17 నుంచి కర్లపూడి ఇందిర, 23 నుంచి అడ్డాకుల శారద చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ● మధిర : మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ 1, 4, 6, 11, 12, 21వ వార్డులు జనరల్ మహిళకు, 5, 9, 20వ వార్డులు ఎస్సీ మహిళకు, 13, 15వ వార్డులు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యా యి. ఆయా వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ ముఖ్యనేతలు కూడా ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ● వైరా : ఈ మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, 2, 6, 12, 13, 15, 19వ వార్డులు జనరల్ మహిళకు, 17, 18వ వార్డులు బీసీ మహిళకు, 4, 20వ వార్డులు ఎస్సీ మహిళకు కేటాయించారు. చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్లో 3వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి, 6వ వార్డు అభ్యర్థి కాపా చంద్రకళతో పాటు 15 వార్డు నుంచి పోటీ చేస్తున్న రాంపూడి రాజ్యలక్ష్మి రేసులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఐదో వార్డు అభ్యర్థి కట్టా స్వరూపరాణి చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నారు. ● కల్లూరు : ఈ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. ఇక్కడ 4, 6, 7వ వార్డులు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఏడో వార్డులో కాంగ్రెస్ నుంచి ధరావత్ మోహన్నాయక్, బీఆర్ఎస్ నుంచి బానోతు కృష్ణ, 4వ వార్డులో కాంగ్రెస్ నుంచి భూక్యా రాంబాయి, బీఆర్ఎస్ నుంచి బానోతు బాలు, 6వ వార్డులో కాంగ్రెస్ నుంచి బానోతు మారోని, బీఆర్ఎస్ నుంచి బానోతు మమత పోటీ పడుతుండగా వీరు చైర్పర్సన్ రేసులో ఉన్నారు. సత్తుపల్లి : ఇక్కడ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ మున్సిపాలిటీలో 2, 3, 22, 6, 11వ వార్డులు జనరల్ మహిళకు రిజర్వ్డ్గా ఉన్నాయి. ఈ వార్డుల నుంచి ఎంపికై న అభ్యర్థుల్లో ఒకరికి చైర్పర్సన్ పదవి కట్టబెడతారు. దీంతో అభ్యర్థులు గెలిచేలా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఇప్పటివరకు చైర్పర్సన్ పదవిపై ఎవరికీ హామీ ఇవ్వలేదని సమాచారం. అశ్వారావుపేట : ఇక్కడ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. ఈ కేటగిరీలో 6, 8 వార్డులు ఉన్నాయి. ఆరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి శశికళ, బీఆర్ఎస్ అభ్యర్థి చిక్కం మాధురిబాయి, 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ రెహానా, బీఆర్ఎస్ నుంచి కాసాని నాగశేష పద్మ బరిలో ఉన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా, ఇక్కడ 9, 23, 31, 34, 52 డివిజన్లు ఎస్టీ మహిళకు, 3, 19, 20, 32, 33, 48 డివిజన్లు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఇందులో అభ్యర్థులుగా నిలిచిన వారు గెలిచి మేయర్ రేసులో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ నుంచి మేయర్ పదవిని ఆరో వార్డు అభ్యర్థి బీ.ఎస్.రావు, 19వ వార్డు నుంచి బరిలో ఉన్న స్వప్న ఆశిస్తున్నారు. మరికొందరు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్లో పిచ్చిరెడ్డి, కొత్వాల విమల ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్వాల విమల డీసీఎంఎస్ చైర్మన్ సతీమణి. ఇక సీపీఐ, బీఆర్ఎస్లు మేయర్ అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదు. అధిక స్థానాల్లో విజయం సాధిస్తే రిజర్వ్డ్ డివిజన్లలో గెలుపొందిన వారి నుంచి ఒకరిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
బస్సులో వస్తుండగా రూ.20 వేల నగదు మాయం
నేలకొండపల్లి: వైద్యపరీక్షల నిమిత్తం బస్సులో ఖమ్మం వస్తున్న ఓ వ్యక్తి వద్ద ఉన్న రూ.20వేల నగదు చోరీ జరిగిందని సమాచారం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన వి.సైదులు బుధవారం ఖమ్మం వచ్చేందుకు కోదాడలో బస్సు ఎక్కాడు. బస్సు నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి వచ్చేసరికి ఆయన జేబులో ఉన్న రూ.20వేలు లేకపోవడంతో కండక్టర్కు చెప్పగా బస్సును నేరుగా నేలకొండపల్లి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఈమేరకు ప్రయాణికుల వద్ద, బస్సులో పోలీసులు తనిఖీ చేసినా డబ్బు లభించకపోవడంతో కోదాడలోనే చోరీ జరిగి ఉంటుందని భావిస్తూ అక్కడే ఫిర్యాదు చేయాలని సూచించగా వెళ్లిపోయారు. మత్స్యసహకార సొసైటీపై విచారణకారేపల్లి: మండలంలోనిదుబ్బతండా మత్స్య సహకార సొసైటీలో అనర్హులుగా సభ్యులుగా కొనసాగుతున్నందున రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈవిషయమై ఇటీవల కలెక్టర్కు పిర్యాదు అందడంతో ఆయన ఆదేశాల మేరకు మత్స్యశాఖ ఏడీ శివప్రసాద్, తహసీల్దార్ అనంతుల రమేష్ బుధవారం ఇరువర్గాలను విచారించారు. మండలంలోని గేటుకారేపల్లి రెవెన్యూ పరిధి మేకలతండా, దుబ్బతండాకు చెందిన తుమ్మలకుంట, సంగెంకుంట చెరువులకు సంబంధించి 2011వ సంవత్సరంలో 19మంది సభ్యులతో సొసైటీ ఏర్పడింది. అయితే, నిబంధనల ప్రకారం చెరువుల విస్తీర్ణం లేకున్నా సొసైటీ ఏర్పాటుచేశారని, పట్టా భూమి లోని కుంటలో అనుమతి లేకుండా చేపపిల్లలు పోశారంటూ అధికారుల విచారణలో పలువురు వివరించారు. అంతేకాక సొసైటీ సభ్యులు ప్రభుత్వం ఇచ్చిన ద్విచక్రవాహనాలు, ఎలక్ట్రికల్ కాంటాలు అమ్ముకున్నారని పేర్కొగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక సభ్యులు మాత్రం తాము చేపల వేటపైనే జీవనం సాగిస్తున్నందున సొసైటీని రద్దు చేయొద్దని కోరారు. ఈమేరకు ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఏడీ శివప్రసాద్ మాట్లాడుతూ నివేదికను కలెక్టర్కు అందించి ఆయన ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేటీపీఎస్ ఉద్యోగి మృతికి సంతాపం నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన తేజావత్ బాసు(57) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాసు పాల్వంచ కేటీపీఎస్లో జేపీఏ, ఓడీఎస్ అండ్ టీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయన మరో మూడేళ్లలో పదవీ విరమణ చేయనుండగా మృతి చెందడంపై పలువురు సంతాపం తెలిపారు. వివిధ శాఖల అధికారులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.సర్పంచ్ ధీరావత్ అశోక్రాణి, ట్రాన్స్కో డీఈఈ ధీరావత్ కోటేశ్వరరావు, నాయకులు ధీరావత్ రాధాకృష్ణమూర్తి, బాలాజీ, తేజావత్ రామదాసు పాల్గొన్నారు. -
●ఏకగ్రీవ కౌన్సిలర్కు మంత్రి అభినందన
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలో 15వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్కు చెందిన తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఇక్కడ పోటీలో ఉన్న సీపీఎం అభ్యర్థి విరమించుకోవడంతో మంగతాయి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆమె బుధవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో కలవగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తమ్మినేని నవీన్, జూకూరి గోపాల్రావు, జొన్నలగడ్డ రవికుమార్, చాట్ల పరశురాం తదితరులు పాల్గొన్నారు. -
●పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేయండి
వైరా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరాలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూటరీ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని ఆమె బుధవారం పరిశీలించి ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ గురులింగంతో చర్చించారు. సామగ్రి పంపిణీ, ఆతర్వాత బ్యాలెట్ బాక్సుల భద్రత, లెక్కింపులో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు పాగించాలన్నారు. ఇందుకోసం అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలకు రూ.93 వేల విలువైన బెంచీలు
తల్లాడ: మండలంలోని కలకొడిమ ప్రభుత్వ పాఠశాలకు కొత్తపల్లి చలపతిరావు ఆధ్వర్యాన నిస్వార్ధ ఫౌండేషన్ ద్వారా రూ.93వేల విలువైన 20 స్కూల్ డెస్క్ బెంచీలు అందజేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రకాంత్, సర్పంచ్ తాతా సుమతీబాయితో పాటు తాతా భాస్కర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేలా ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇగ్నో(ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్) యూనివర్సిటీ వేదికగా నిలుస్తుందని అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపా రు. ఖమ్మంలోని పలు కళాశాలల్లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఇగ్నోలో కోర్సులో చదువుతూనే విద్యార్థులు రెగ్యులర్ చదువు కొనసాగించే అవకాశముందని తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉన్నందున సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇగ్నో సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కే.వీ.రమణారావు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్.పాపారావు, వెంకటేష్ పాల్గొన్నారు. -
గతుకుల రోడ్డుకు అతుకులు..
● కొత్త రోడ్డు నిర్మాణంలో ఇప్పట్లో లేనట్టే? ● ఖమ్మం – దేవరపల్లి పాత హైవేపై రూ.15 కోట్లతో పనులు ● మరమ్మతులతో వాహనదారులకు ఉపశమనం ఖమ్మం అర్బన్: ఖమ్మం – దేవరపల్లి పాత నేషనల్ హైవేపై కొత్తగా రోడ్డు నిర్మాణం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డుపై పలుచోట్ల తారు చీలికలు ఏర్పడడమే కాక గుంతలు పడడం, కొన్నిచోట్ల ఉబ్బెత్తుగా మారడంతో ప్రయాణానికి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యాన అధికారులు బాగా దెబ్బతిన్న చోట నాలుగు రోజులుగా మరమ్మతు చేయిస్తున్నారు. దీంతో కొత్త రోడ్డు వేసే పరిస్థితులు లేవని తెలుస్తుండగా.. మరమ్మతులతో కాస్త ఉపశమనం లభించనుందని వాహనదారుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం – దేవరపల్లి మార్గంలో కొత్త హైవే అందుబాటులోకి రానుండడంతోనే మరమ్మతులతో సరిపెడుతున్నారని తెలుస్తోంది. 122 కిలోమీటర్ల పరిధి... ఖమ్మం కరుణగిరి నుంచి దేవరపల్లి కొత్త హైవేను కలిసే జంక్షన్ వరకు సుమారు 122 కి.మీ. మేర ఈ రహదారి ఉంటుంది. ఈమేరకు దెబ్బతిన్న చోట ప్రత్యేక యంత్రాల సాయంతో రోడ్డుపై పొరను తొలగించి మళ్లీ కొత్తగా తారు వేయిస్తున్నారు. ఈ పనులను సుమారు రూ.15 కోట్లతో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా ఖమ్మం రాపర్తి నగర్ నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చీలికలు రావడం, గుంతలతో ద్విచక్రవాహనాదారులే కాక చిన్న వాహనాల రాకపోకలకు సమస్య ఎదురవుతోంది. ఈనేపథ్యాన కొత్త రోడ్డు వేయకున్నా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మరమ్మతు చేయిస్తుండడం విశేషం. అంతేకాక అవసరమైన చోట కంపచెట్లు తొలగింపు, బ్లాక్ స్పాట్ల వద్ద అవసరమైన చర్యలు చేపట్టనుండడంతో రాకపోకలు సులువు కానున్నాయి. నాలుగు రోజులుగా ఖమ్మంలో ఈ పనులు చేపడుతుండగా, ట్రాఫిక్ సమస్య రాకుండా రాత్రి వేళ పనులు కొనసాగిస్తున్నారు. అయితే, రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న చోట విస్తరించడంతో పెంచడంతో పాటు మండల కేంద్రాల్లో డివైడర్లు కూడా నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. -
ఇదీ మా అజెండా..!
‘బొగ్గు గనుల విస్తరణతో సత్తుపల్లిలో రోజురోజుకు కాలుష్యం కోరలు చాస్తోంది. దుమ్ముధూళితో పాటు వాయు, నీటి కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా పట్టణ వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు...’ అని పలువురు వెల్లడించారు. ఈ మేరకు మున్సిపాలిటీలో గెలిచే అభ్యర్థులు ప్రధానంగా ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యాన సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నీలాద్రి అర్బన్ పార్క్ల్లో ‘సాక్షి’ ఆధ్వర్యాన ప్రజల అజెండాపై బుధవారం డిబేట్ నిర్వహించగా వాకర్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇందులో న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులే కాక విద్యార్థులు పాల్గొనగా.. ఎన్నికల సమయాన హామీలకే పరిమితం కాకుండా సింగరేణి కాలుష్య నివారణ చర్యలపై కార్యాచరణ చేపట్టాలని కోరారు. అంతేకాక గెలిచిన కౌన్సిలర్లు అందుబాటులోఉండాలని.. కోతుల, కుక్కల బెడద నుంచి కాపాడాలనే సూచనలు వచ్చాయి. – సత్తుపల్లిటౌన్ పట్టణంలో వీధి కుక్కలతో పాటు కోతుల బెడద తీవ్రంగా ఉంది. వీటి బారి నుంచి ప్రజలను కాపాడాలి. అలాగే, వార్డుల్లో సదుపాయాల కల్పనపై పాలకవర్గం దృష్టి పెట్టాలి. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. – ఎం.గాయత్రి ఎన్నికల్లో గెలిచే కౌన్సిలర్లు స్థానికులకు అందుబాటులో ఉండాలి. సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుంది. పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించి, కాలుష్య రహిత వాతావరణం కోసం పాటుపడాలి. – సయ్యద్ సలీం -
●మూడు తరాల నేతలు
వైరా: వైరానియోజకవర్గ రాజకీయాల్లో బొర్రా కుటుంబం దశాబ్ద కాలంగా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 1987లో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బొర్రా భద్రయ్య ఎంపీపీగా ఎన్నికై 1993 వరకు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత భద్రయ్య కోడలు బొర్రా పద్మావతి 1995లో సోమవరం(వైరా) మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందింది. 2001 వరకు ఆమె సర్పంచ్గా పనిచేశారు. అనంతరం 2006 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భద్రయ్య కుమారుడు బొర్రా వెంకటేశ్వర్లు పోటీ చేసి విజయం సాధించి 2011 వరకు సర్పంచ్గా కొనసాగారు. ఇక 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బొర్రా వెంకటేశ్వర్లు కోడలు ఉమాదేవి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు. ఇలా ఆ కుటుంబం మూడు తరాలుగా రాజకీయాల్లో కొనసాగుతోంది. అంతేకాక ఉమాదేవి ప్రస్తుతం వైరా మున్సిపాలిటీ మూడోవార్డు నుంచి పోటీ చేస్తూ చైర్మన్ రేసులో ఉన్నారు. ఇక వెంకటేశ్వర్లు కుమారుడు బొర్రా రాజశేఖర్ 2019లో వైరా పీఏసీఎస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్గా రెండేళ్ల పాటు పనిచేశారు.‘బొర్రా’ కుటుంబంలో ఎంపీపీ, సర్పంచ్లు, జెడ్పీటీసీ -
●మార్కెట్లకు వందేళ్ల చరిత్ర
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్లకు వందేళ్ల చరిత్ర ఉంది. జిల్లా ప్రజలందరికీ సుపరిచితమైన సూపర్బజార్ సెంటర్ పక్కన చిన్నబజార్, పెద్దబజార్తో పాటుగా నేతాజీ మార్కె ట్లు ఉన్నాయి. ఈ మార్కెట్లు ప్రస్తుతం 52వ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అయితే ఇల్లెందు, కొత్తగూడెంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైన సమయంలో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నిత్యావసరాలు, ఇతర సరుకుల సరఫరాకు మార్వాడీలు, ఆర్యవైశ్యులు, వారి కుటుంబాలతో సహా కొత్తగూడెం వచ్చి వ్యాపారాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత నేతాజీ మార్కెట్, ఆ తర్వాత చిన్నబజార్, పెద్దబజార్ ఏర్పడ్డాయి. కాలక్రమేనా కొత్తగూడెంలో కొంత అభివృద్ధి మొదలైన తర్వాత సూపర్బజార్ సెంటర్ ఏర్పాటైంది. నేతాజీ మార్కెట్, చిన్నబజార్, పెద్దబజార్లకు సమీపంలో ఉన్న మేదరబస్తీ, ప్రగతినగర్ వందేళ్ల క్రితం అటవీ ప్రాంతాలుగా ఉండేవి. అయితే సింగరేణి బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాక కార్మికులు, ఉద్యోగులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయి. -
వేసవిలోనూ ఆగకుండా విద్యుత్
ఖమ్మంవ్యవసాయం: వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్నందున అంతరాయం లేకుండా సరఫరా చేసేలా విద్యుత్ శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే లా అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ప్రారంభించారు. ఇందులో భాగంగా మధిర విద్యుత్ డివిజన్ పరిధి బోనకల్ సెక్షన్లో బుధవారం అదనపు డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫారర్ల(డీటీఆర్)ను ఏర్పాటు చేశారు. జానకీపురంలో మూ డు, చిన్నబీరవల్లి, నారాయణపురంలో రెండు చొప్పున, బోనకల్, రావినూతలలో ఒక్కో అదనపు డీటీఆర్ ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుతో గృహ, వ్యవసాయ అవసరాలకు వినియోగం పెరిగినా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం వీలవుతుంది. ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, వైరా, మధిర డివిజన్లలో డీటీఆర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టనున్నారు. లోడ్ బ్యాలెన్సింగ్ వేసవిలో సహజంగా గృహ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఈమేరకు సాంకేతిక సమస్యలను ముందస్తుగా గుర్తించి పరిష్కరించడంతో పాటు పరికరాల తనిఖీ చేపట్టనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఇదే సమయాన అవసరమైన చోట్ల అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయనుండడంతో వేసవిలో ఇబ్బందులు ఎదురుకావని చెబుతున్నారు.రానున్న వేసవిలో ఎంత డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఇందుకోసం అన్ని విభాగాల సమన్వయంతో పనులు చేపడుతున్నాం. అవసరమైన ప్రాంతాల్లో అదనపు డీటీఆర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
సోలార్ ప్లాంట్తో రూ.లక్షల్లో ఆదాయం
● మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఎర్రుపాలెం: ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటుచేస్తున్న ఒక మెగావాట్ సామర్థ్యపు సోలార్ ప్లాంట్ పనుల పురోగతిని కలెక్టర్ బుధవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడమే కాక మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. ప్లాంట్ పనుల్లో వేగం పెంచడమే కాక నిర్వహణపై మహిళలకు అవగాహన కల్పించాలని ఉద్యోగులను కలెక్టర్ ఆదేశించారు. రోజుకు రూ.12వేలకు పైగా.. ప్రాజెక్ట్ వ్యయం రూ.1.50 కోట్లు కాగా, రుణంలో రూ.85 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. నిర్వహణ ఖర్చులు పోగా మొదటి, రెండు సంవత్సరాల్లో రూ.4లక్షలు, మూడో సంవత్సరం రూ.5 లక్షలు, ఆతర్వాత 11వ సంవత్సరం రూ.10 లక్షలు ఇలా ఆదాయం పెరుగుతుందని.. 13వ ఏట రుణం తీరాక రూ.40 లక్షల చొప్పున 25ఏళ్ల పాటు మహిళలకు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రోజువారీగా రూ.12 నుంచి రూ.15 వేల ఆదాయం రానున్నందున నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తూ రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టును ఆదర్శంగా నిలపాలని సూచించారు. తొలుత ఎర్రుపాలెంలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్... తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా బీఆర్.అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించి అధికారులు, విద్యార్థులతో కలిసి సామాజిక ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ చదువులో ప్రతిభ చాటాలని తెలిపారు. ఆతర్వాత 50పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి, డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్, రెడ్కో జిల్లా మేనేజర్ పి.అజయ్కుమార్, డీఆర్డీఓ ఏపీడీ జయశ్రీ, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, తహసీల్దార్ ఉషాశారద, ఎంపీడీఓ బి.సురేందర్, ఏడీఏ విజయచందర్, డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం హరినాఽరాయణ, సర్పంచ్లు బొగ్గుల గోవర్దన్రెడ్డి, నండ్రు అశ్విని, నాయకులు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశాల పెంపునకు కృషి
కొణిజర్ల: ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్య పెరిగేలా ప్రిన్సిపాళ్లు, అడ్మిషన్ కమిటీల బాధ్యులు కృషి చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎండీ.ముజాహిద్ సూచించారు. కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్దులలో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంచేలా బోధన సాగాలని తెలిపారు. ఆతర్వాత విద్యార్ధులతో మాట్లాడి వసతి, భోజనం, మెనూపై ఆరా తీసిన ఆయన ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీ ఎం.జే.అరుణకుమారి, విజిలెన్స్ ఆఫీసర్ సీతారాములు, అకడమిక్ కోఆర్డినేటర్ అఫ్రోజ్, జితేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్యం నుంచే విలువల బోధన
● ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’పై అవగాహన తప్పనిసరి ● జాతీయ బాలికల దినోత్సవంలో అదనపు కలెక్టర్ శ్రీజ ఖమ్మంమయూరిసెంటర్: చిన్నతనం నుంచే పిల్లల్లో విలువలు పెంపొందించేందుకు అందరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా మహిళా సాధికారత కేంద్రం, మహిళా–శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో బుధవారం నిర్వహించగా ఆమె మాట్లాడారు. జిల్లాలో ‘చిన్నారి’ పేరిట కార్యక్రమాన్ని రూపొందించి మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా వేయి విద్యాసంస్థల్లో పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించామన్నారు. ఈవిషయమై తల్లిదండ్రులు కూడా వివరించాలని, మగ, ఆడపిల్లలకు సమానంగా ఇతరులను ఎలా గౌరవించాలో నేర్పాలని సూచించారు. అలాగే, పిల్ల లకు సెల్ఫోన్ అలవాటు చేయొద్దన్నారు. తొలుత బాలల సదనం పిల్లలు చేసిన స్వాగతం నృత్యం, అంగన్వాడీ ఖమ్మం అర్బన్, రూరల్ ప్రాజెక్టుల పిల్లలకు వెల్ బేబీ షో, గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై కేజిబీవీ విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్ తదితరులు పాల్గొన్నారు. ఈసీఆర్ అమలుపై ప్రత్యేక శ్రద్ధ చింతకాని: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్)పై ప్రత్యేక వ్రద్ధ వహిస్తూ పిల్లల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. చింతకాని మండలం లచ్చగూడెం పాఠశాలలో ఈసీఆర్ అమలును పరిశీలించిన ఆమె ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈఓ ఎస్.రామారావు, కాంప్లెక్స్ హెచ్ఎం జగదీష్ పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం
కారేపల్లి: గిరిజన విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తూ వారిని తీర్చిదిద్దడమే లక్ష్యమని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వెల్లడించారు. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి, రేలకాయలపల్లిలో బాలుర ఆశ్రమ పాఠశాలలను బుధవారం పీఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి బోధన, పరీక్షలకు సన్నద్ధత, మెనూ అమలుపై ఆరా తీశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి పీఓ మధ్యాహ్న భోజనం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, ఏసీఎంఓ రాములు, డీఈ రాజు, ఏఈ మహేందర్, ఏటీడీఓ రమేష్, ఎస్సీఆర్పీ బాల పాల్గొన్నారు. యాప్పై అవగాహన కల్పించండి ఖమ్మంరూరల్: యాప్ ద్వారా ఎరువుల బుకింగ్పై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని మద్దులపల్లి, ముత్తగూడెంలో ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు యాప్ ద్వారా బుకింగ్, యూరియా విక్రయాలను పరిశీలించాక మాట్లాడారు. షాప్లకు వచ్చే రైతులకు యాప్తో ఉపయోగాలను వివరించాలని తెలిపారు. అలాగే, పారదర్శకంగా ఎరువుల విక్రయాలు కొనసాగించాలని, రికార్డులు నిర్వహణ సరిగా చేపట్టాలని సూచించారు. ఏఓ ఉమానగేష్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ దిశగా తెలంగాణ.. ఖమ్మంమయూరిసెంటర్: ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్(పీఎంజీడీఐఎస్ హెచ్ఏ) కింద తెలంగాణలో కొనసాగుతున్న డిజిటల్ శిక్షణపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్లో బుధవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగిందని, రాష్ట్రంలో నమోదైన 14,56,226 మందిలో 12,10,448 మంది విజయవంతంగా శిక్షణ పూర్తయిందని బదులిచ్చారు. ఇందులో 7,63,651 మంది పురుషులు, 4,46,777 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్పై అవగాహన, ఆన్లైన్ సేవల వినియోగం పెరగగా, డిజిటల్ లావాదేవీలు, ప్రభుత్వ ఈ–సేవలను స్వయంగా వినియోగించుకునే స్థాయికి లబ్ధిదారులు చేరుకున్నారని తెలిపారు. మహా మండపం నిర్మాణానికి రూ.21 లక్షల విరాళం కామేపల్లి: కామేపల్లిలో రూ.5కోట్ల వ్యయంతో పునర్మించనున్న శ్రీ హరిహర గురు క్షేత్రం(శివాలయం)లో భాగంగా మహా మండపానికి ఖమ్మం వాసి కాసాని నాగలక్ష్మి–శేషారావు దంపతులు రూ.21,11,116 విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి విడత రూ.10 లక్షలను బుధవారం ఆలయ కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాలయం నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం దాతను నిర్వాహకులు సన్మానించారు. నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గొట్టుపర్తి శివాజీతో పాటు కేసగాని నాగయ్య, అజ్మీరా హరినాయక్, రాందాస్నాయక్, భూక్యా శ్రీనివాస్, బండి శ్రీనివాస్, దమ్మలపాటి శివాజీ పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు విద్యార్థి
ఖమ్మంక్రైం: ఓ విద్యార్థి వసతి గృహం నుంచి పారిపోతుండగా, విషయాన్ని గుర్తించిన కానిస్టేబుల్ దంపతులు సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లిదండ్రులకు అప్పగించారు. భద్రాద్రి జిల్లా దమ్మ పేట మండలం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆదివారం వసతిగృహం నుంచి బయటకు వచ్చాడు. ఆపై ఖమ్మం వెళ్తున్న బస్ ఎక్కగా.. అదే బస్సు లో ప్రయాణిస్తున్న ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్.కృష్ణారావు భార్య లక్ష్మి బాలుడు ఆందోళనగా ఉండడాన్ని గమనించి ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేయగా, ఆయన ఆర్ఐఓ రామోజీ రమేశ్ దృష్టికి, ఆపై గురుకుల ప్రిన్సిపాల్కు వివరించారు. దీంతో ఖమ్మం బస్టాండ్లో దిగాక విద్యార్థి తండ్రి వచ్చే వరకు ఆపి అప్పగించారు. ఈ మేరకు సమయస్ఫూర్తిగా వ్యవహరించిన లక్ష్మి దంపతులను ఆర్ఐ ఓ రామోజీ రమేశ్ మంగళవారం సన్మానించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ భార్య -
పవర్ సెంటర్గా పేట !
అశ్వారావుపేట: అశ్వారావుపేట జమీన్దారీ పాలనలో ఉన్నప్పటి నుంచీ రాజకీయంగా పవర్ సెంటర్గా వెలిగింది. దొరల పాలనలో ఉన్నప్పుడు అశ్వారావుపేట దివాణం పరిధిలో ప్రస్తుత అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు, దమ్మపేట మండలాలు ఉండేవి. పాల్వంచ సంస్థానంలో అశ్వారావుపేట జమీన్ ఓ భాగంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం.. స్వపరిపాలలో భాగంగా వేంసూరు నియోజకవర్గంలో అశ్వారావుపేట జమీన్ను కలిపారు. ఆ తర్వాత అదే సత్తుపల్లి నియోజకవర్గంగా మారింది. పాలనా సౌలభ్యం కోసం నాటి ఏపీ ప్రభుత్వం 1959లో ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితులు మరియు జిల్లా పరిషత్’ చట్టం చేస్తూ సుమారు 80 వేల జనాభా, కనీసం 20 గ్రామపంచాయతీలతో ఒక సమితిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారమే ఏర్పాటయ్యే సమితి విధివిధానాలు, పాలనా బాధ్యతలను బల్వంత్రాయ్ మెహతా సంఘం సిఫార్సుల ఆధారంగా 1959 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇలా ఏర్పాటైన అశ్వారావుపేట సమితిలో ప్రస్తుత అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు ఉండేవి. గ్రామపంచాయతీల సర్పంచ్లు సమితి సభ్యులను ఎన్నుకునే వారు. వీరిలో ఒకరిని అధ్యక్షడిగా ఎన్నుకునేవారు. అప్పట్లో గ్రామాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, రహదారులు అన్నింటినీ సమితి నుంచే పర్యవేక్షించేవారు. పాలనా సౌలభ్యం కోసం అశోక్ మెహతా సంఘం సిఫార్సుల మేరకు 1987లో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను తీసుకురావడంతో సమితులు రద్దయ్యాయి. అశ్వారావుపేట సమితి చివరి అధ్యక్షుడిగా కందిమళ్ల వెంకట్రావు పనిచేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత పెద్ద పదవి మున్సిపల్ పాలకవర్గానిదే. దీంతో అశ్వారావుపేట జమీన్దార్, సమితి కాలంలో ఇక్కడి రాజకీయ నాయకులకు ఉన్న పెత్తనం, పవర్ తిరిగి రానుందని చెప్పొచ్చు. అశ్వారావుపేట దివాణం పాలకులు ఎవరిని సూచిస్తే వారే ఎమ్మెల్యేలుగా పదవులు పొందారంటే అశ్వారావుపేట పవర్ సెంటర్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో చైర్ పర్సన్గా ఎవరు ఎన్నికై నా ఎమ్మెల్యే తర్వాతి ప్రొటోకాల్ లభిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆ పీఠం కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక నిధుల ప్రవాహం పెరగడంతో సమితి తరహాలో అభివృద్ధి పనులు చేసేందుకు ఆస్కారం ఉంది. నాడు సమితి.. నేడు మున్సిపాలిటీ -
●బీ ఫామ్.. నీకా, నాకా ?!
వైరా: వైరా మున్సిపల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే సమయాన నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరికి బీ ఫామ్లు వస్తాయో తెలియక అందరూ వేచి చూశారు. చివరకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ ఒక్కొక్కరిని పిలిచి బీ ఫామ్లు ఇస్తుండగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా, 12వ వార్డులో మిట్టపల్లి కృష్ణవేణి, ఎడ్లపల్లి వనజ ఇద్దరికి బీ ఫామ్లు ఇచ్చినా చివరకు కృష్ణవేణిని అధికారికంగా ప్రకటించారు. దీంతో వనజ ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. ●బరిలో దంపతులుకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లోని రెండు డివిజన్ల నుంచి భార్యాభర్తలు పోటీలో ఉన్నారు. బూడిదగడ్డ ఏరియాకు చెందిన కనుకుంట్ల కుమార్, వెంకటరమణ 2005లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 3, 4వ వార్డుల నుంచి గెలిచా రు. ప్రస్తుతం కుమార్ 10వ డివిజన్, వెంకటరమణ 49వ డివిజన్ నుంచి పోటీకి దిగారు. ఇద్దరూ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడం ఆసక్తిగా మారింది. 2005 ఎన్నికల్లోనూ జంటగా విజయం -
ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా ఈసీఆర్
వైరారూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్ల భాష పరిజ్ఞానం పెంచేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ ఆనుదీప్ దురిశెట్టి సూచించారు. వైరా మండలం పాలడుగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈసీఆర్ అమలును మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు, నాలుగో తరగతిలో విద్యార్థులతో ఆంగ్లం అక్షరాలు, పదాలు రాయించి వాటి ఉచ్చారణ, అర్థాలు ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఈసీఆర్ అమలును పకడ్బందీగా చేపడితే విద్యార్థులకు జీవితాంతం ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ వంటల తయారీకి గ్యాస్ ఉపయోగించాలని సూచించారు. అలాగే, అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారాన్ని పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తహసీల్దార్ సురేష్బాబు, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు దయాకర్రావు, రమేష్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.●మండలాలకు ప్రత్యేక అధికారుల కేటాయింపు ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులంతా ఇంగ్లిష్ చదవడంతో పాటు రాసేలా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ అనుదీప్ ఆలోచనల నుంచి ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రూపుదిద్దుకుంది. మూడు నెలల క్రితం శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమ రెండో విడత ఇటీవల ప్రారంభించారు. ఈ నేపథ్యాన ఈసీఆర్ను మరింత పకడ్బందీగా అమలు చేసేలా పర్యవేక్షణకు ముగ్గురు అధికారులను నియమించారు. ప్రతీ అధికారికి ఏడేసి మండలాల బాధ్యతలు అప్పగించగా వీరు ఈసీఆర్ అమలుపై నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. మండలాల కేటాయింపు ఇలా.. అదనపు కలెక్టర్ శ్రీజకు చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, సింగరేణి, కామేపల్లి మండలాలు కేటాయించారు. అలాగే, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్కు ఏన్కూరు, కల్లూరు, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, పెనుబల్లి, వైరా మండలాల బాధ్యతలు అప్పగించగా, జెడ్పీ సీఈఓ దీక్షారైనా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల మండలాల్లో బోధనను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతీ బుధవారం వివరాల నమోదు అన్ని పాఠశాలల్లో ప్రతీ బుధవారం ఈసీఆర్ను పర్యవేక్షించి అమలు స్థితిపై నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా వెనకబడిన పాఠశాలలు, మండలాలపై ప్రత్యేక దృష్టి సారించిచే అవకాశముంటుంది. అలాగే, ప్రతీ అధికారి వారానికి కనీసం రెండు పాఠశాలలను సందర్శించాలి. ఇదే సమయాన విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ఎఫ్ఆర్ఎస్లో నమోదునా దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాగే, మండలాల వారీగా పురోగతి, ,ఎఫ్ఆర్ఎస్ అమలు తదితర అంశాలపై 15రోజులకోసారి జిల్లా స్థాయి సమీక్ష నిర్వహిస్తారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
●ఎన్నికల విధులపై అవగాహన
వైరా: ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగులు నిబంధనలపై అవగాహన పెంచుకుని పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. వైరా తహసీల్లో మంగళవారం ఆయనమున్సిపాలిటీ అభ్యర్థుల బీ ఫాం లు, గుర్తులకేటాయింపును పరిశీలించి మాట్లాడారు. శాంతియుత వాతా వరణంలో పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకునేలా అవగాహన కల్పించాలని, అక్రమంగా నగదు, మద్యం తరలించినట్లు తేలితే సీజ్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ సురేష్బాబు, మున్సిపల్ కమిషనర్ గురులింగం, ఎంపీడీఓ తేజావత్ సక్రియా, ఎంఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ●డీసీసీ మాజీ అధ్యక్షుడి సతీమణి విత్డ్రావైరా: వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సతీమణి ఇందుమతి చైర్పర్సన్ బరిలో ఉన్నట్లు మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆమె 11వ వార్డు నుంచి నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే, మంగళవారం ఆమె నామినేషన్ ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కొల్లి రమేష్కు బీ ఫాం దక్కింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పదేళ్లకు పైగా పనిచేసిన దుర్గాప్రసాద్ తీసుకున్న నిర్ణయం వెనక ఆంతర్యం తేలాల్సి ఉంది. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
మంత్రి పేరుతో వసూళ్లు?
●విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు ఖమ్మంక్రైం: మంత్రితో తనకు ఉన్న పరిచయాల ఆధారంగా ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తామని చెబుతూ ఓ వ్యక్తి డబ్బు డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు సీపీ సునీల్దత్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయగా.. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు కూడా రంగంలోకి దిగి సమాచారం సేకరిస్తున్నాయి. మంత్రి పేరిట వసూళ్లకు పాల్పడిన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. లాగితే ‘తీగ’ బయటపడింది..రఘునాథపాలెం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ చోరీపై రఘునాథపాలెం ఏఈ శంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఖమ్మంటౌన్, సీసీఎస్, రఘునాథపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ముఠా పట్టుబడింది. ఈ మేరకు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్చేసిన రఘునాథపాలెం పోలీసులువారి నుంచి 80కిలోల కాపర్ వైర్, 66కేజీల అల్యూమినియం వైర్ చుట్ట లు, ఆటోను స్వాధీనం చేసుకోగా, సీఐ ఉస్మాన్షరీఫ్ వివరాలు వెల్లడించారు. సులువుగా సంపాదన కోసం... ఖమ్మం కై కొండాయిగూడెంకు చెందిన పిట్టల గోపి, అంగోత్ ఉమాశంకర్, శీలం నాగేశ్వరరావు, మందా చత్రపతితో పాటు రమణగుట్టకు చెందిన బజ్జా కృష్ణ, వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ మైనర్ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో ఆటో డ్రైవర్లు, వెల్డింగ్ పనులు చేసే వారితో పాటు పాత ఇనుము వ్యాపారి ఉన్నాడు. వీరు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ను తీసి విక్రయించడం ద్వారా డబ్బు సంపాదనకు అలవాటుపడ్డారు. జిల్లాలోని రఘునాథపాలెం, కామేపల్లి, ముది గొండ, ఖమ్మం రూరల్, కూసుమంచి, కొణిజర్ల, తల్లాడ, బోనకల్లు, తిరుమలా యపాలెం, ఖమ్మంఅర్బన్ స్టేషన్ల పరిధిలో చోరీలుచేయగా కాపర్ వైర్ను ఖానాపురంలోని పాత ఇనుము వ్యాపారి బజ్జా కృష్ణకు విక్రయించేవారు. ఈక్రమాన రఘునాథపాలెం ఏఈ శంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. రఘునాథపాలెం ఎస్ఐ జి.నరేష్, సిబ్బంది ఎన్ఎస్.రాజు, బి.శ్రీనివాసులు, ఎండీ.అహ్మద్ఆలీ, వి.నవీన్ మంగళవారం ఆపిల్ సెంటర్ వద్ద వాహన తనిఖీ లు చేస్తున్న క్రమాన ఆటోలో వచ్చిన వారు అనుమానాస్పదంగా కనిపించారు. అందులో పరిశీలించడంతో అల్యూమినియం వైర్ కనిపించగా విచారించడంతో చోరీల విషయం బయటపడింది. నిందితులపై ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 18 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈమేరకు నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ చోరీ ముఠా అరెస్ట్ -
తీర్థాల జాతరకు విస్తృత ఏర్పాట్లు
●అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మం రూరల్ మండలంలో ని తీర్థాల సంగమేశ్వర స్వా మి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18వరకు ఐదు రోజుల పాటు జాతర జరగనుంది. లక్షల్లో భక్తులు హాజరుకాను న్న నేపథ్యాన విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించిన ఆయన మాట్లాడారు. తీర్థాల జాతరకు దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున గతంలో కంటే మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. అవసరమైన మేర పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు. అంతేకాక బస్సుల ఏర్పాటు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ, కంట్రోల్ రూం ఏర్పాటుపై సూచనలు చేశారు. కాగా, జాతరలో వసతుల కల్పనకు కేటాయించిన రూ.10 లక్షల చెక్కును ఆలయ ఈఓ కె.వేణుగోపాల్కు కలెక్టర్ అందజేశారు. ఈసమావేశంలో డీఎంహెచ్ఓ రామారావు, డీపీఓ రాంబాబు, ఆర్డీఓ జి.నర్సింహారావు, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదానానికి రూ.లక్ష విరాళం
ఖమ్మంఅర్బన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం కై కొండాయిగూడెం క్రాస్ వద్ద ఉన్న శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అన్నదానానికి దేవభక్తుని కిషోర్బాబు రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని మంగళవారం ఆయన ఆలయ చైర్మన్, కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావుకు అందజేశారు. ఈనెల 15న జరగనున్న మహాశివరాత్రి వేడుకల్లో అన్నదానానికి నగదు అందించిన దాతను అభినందించారు. రావికంపాడు మైనర్ కాల్వకు గండికల్లూరు రూరల్: సాగర్ ప్రాజెక్టు పరిధి మండలంలోని రావికంపాడు మైనర్ కాల్వ డ్రాప్ వద్ద బుధవారం గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా పోతుండగా, వరద ప్రవాహంతో కాల్వపై నిర్మించిన డ్రాప్ కూలే ప్రమాదముందని చెబుతున్నారు. మరోపక్క కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరు అందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్నెస్పీ అధికారుల వివరణ కోరగా డ్రాప్ వద్ద మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామని, ప్రస్తుతం నీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఆర్టీసీకి మేడారం జాతర!
● రీజియన్కు భారీగా రాబడి ● రూ.3.28 కోట్లకు పైగా ఆదాయంతో రికార్డుఖమ్మంమయూరిసెంటర్: భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న వనదేవతలు సమ్మక్క – సారలమ్మ తల్లులు ఆర్టీసీకి సైతం వరాలు కురిపించారు! ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క జాతర ఇటీవల ములుగు జిల్లా మేడారంలో జరగగా భక్తులను చేరవేసిన ఆర్టీసీకి గణనీయమైన ఆదాయం సమకూరింది. గత నెల 27 నుండి ఈ నెల 2వ తేదీ వరకు ఖమ్మం రీజియన్ నుంచి మేడారానికి అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. ముందస్తు ప్రణాళికలతో రీజియన్లో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటుచేయగా తల్లుల గద్దెల సమీపానికి బస్సులు వెళ్లడంతో భక్తులు అధికసంఖ్యలో ఆర్టీసీనే ఆశ్రయించారు. దీంతో రీజియన్ పరిధిలోని అన్ని డిపోలకు కాసుల వర్షం కురిసింది. రెండు లక్షల మంది ప్రయాణం మేడారం జాతర కోసం ఖమ్మం రీజియన్ నుంచి 214 బస్సులు కేటాయించారు. ఈ బస్సులు మొత్తం 2,039 ట్రిప్పులు తిరగగా 2,03,863 మంది భక్తులు రాకపోకలు సాగించారు. రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయడంతో ఎక్కడా ఇబ్బంది ఎదురుకాలేదు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక కండక్టర్ను ఏర్పాటుచేసి 24 గంటలు సర్వీసులు నడిపించడం ద్వారా రీజియన్కు ఏకంగా రూ.3,28,39,181 ఆదాయం సమకూరింది. కొత్తగూడెం డిపో రూ.1,07,02,941 ఆదాయంతో మొదటి స్థానాన నిలిచింది. కాగా, రీజియన్ సగటు ఆక్యుపెన్సీ రేషియో 85 శాతంగా నమోదు కావడం విశేషం.మేడారం జాతరలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సర్వీసులు ఏర్పాటు చేశాం. పాయింట్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సులు సమకూర్చాం. భక్తులతో పాటు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా బస్సులు నడపగలిగాం. – ఏ.సరిరామ్, ఖమ్మం రీజినల్ మేనేజర్ -
టీ.టీ. టోర్నీలో 17పతకాలు
ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 1, 2వ తేదీల్లో జరిగిన ఖేల్ క్షేత్ర ఆల్ ఇండియా ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఖమ్మం నుంచి పాల్గొన్న క్రీడాకారులు 17 పతకాలు సాధించారు. జూనియర్, సీనియర్, సబ్ జూనియర్ కేటగిరిల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచి పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, క్రీడా సంఘాల బాధ్యులు బాలసాని విజయ్కుమార్, వీవీఎస్.మూర్తి, పుట్టా శంకరయ్య, కె.క్రిస్టోఫర్బాబు, కొండ శ్రీధర్, డాక్టర్ కూరపాటి ప్రదీప్, డాక్టర్ జంగాల సునీల్కుమార్, ప్రవీణ్, చలపతి, రెడ్డిసాయి, మజార్ అభినందించారు. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత ఖమ్మంఅర్బన్: అధిక వర్షపాతం సమయాన వరద నీటిని నిల్వచేసి భూగర్భ జలాలను పెంపొందించడంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తున్నందున పరిరక్షించుకోవాలని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచించారు. ఖమ్మం 14వ డివిజన్లో చిత్తడి నేలల పరిరక్షణ ప్రాధాన్యతపై విద్యార్థులు, ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయన్నారు. అంతేకాక అరుదైన పక్షులు, జీవరాశుల కు ఆవాసంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు చెరువులను ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలతో కలుషితం చేయకుండా కాపాడుకోవా లని సూచించారు. అటవీశాఖ డివిజన్ అధికారి మంజుల, ఉద్యోగులు పాల్గొనగా వెలుగుమట్ల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. మత్స్య రైతులకు శిక్షణ కూసుమంచి: మండలంలోని పాలేరు పీవీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయో ప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై ఏర్పాటుచేసిన శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల మత్స్య రైతులు పాల్గొనగా సూర్యాపేట జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి బానోత్ నాగులునాయక్ మాట్లాడారు. మత్స్య సంపద పెంపునకు ఆధునిక విధానాలు అనుసరించాలని సూచించారు. పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, శాంతన్న, దివ్య పాల్గొన్నారు. తాగునీటి సమస్య రావొద్దు ముదిగొండ: రానున్న వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్లూఎస్ ఎస్ఈ శేషిరెడ్డి సూచించారు. తాగునీటి వసతులు, సమస్యలపై చేపడుతున్న సర్వేను ముదిగొండ మండలం గోకినేపల్లిలో మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాత వాటర్ ట్యాంక్ కొత్తది నిర్మాణం, బోరు, మోటారు, పైపులైన్ కోసం రూ.1.12కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈమేరకు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన ఎస్ఈ స్థానిక ఉద్యోగులకు సూచనలు చేశారు. మిగతా ప్రాంతాల్లో సమస్యలు ఉంటే మరమ్మతుకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసరావు, ఏఈలు విజయరాజు, సుధాకర్, సర్పంచ్ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 3,017 మె.టన్నుల యూరియా చింతకాని: మూడు జిల్లాల రైతుల అవసరాల కోసం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం చేరింది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు యూరియా వచ్చిందని ఏఓ(టెక్నికల్) పవన్కుమార్ తెలిపారు. ఇందులో 1,517.16మెట్రిక్ టన్నులను ఖమ్మం జిల్లాకు, 500 మె.టన్నులు భద్రాద్రి జిల్లాకు, 800 మె.టన్నులకు మహబూబాబాద్ జిల్లాకు సరఫరా చేయగా, మరో 200 మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్ నిల్వ చేసినట్లు వెల్లడించారు. -
జత కట్టారు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల పొత్తులు తేలాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు ఎవరితో ఎవరు జత కట్టారో కూడా స్పష్టత వచ్చింది. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ సీపీఎంతో కలవగా.. సీపీఐ – టీడీపీ జత కట్టాయి. ఇతర మున్సిపాలిటీల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్ కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకున్నా, మరికొన్నింట్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. బీఆర్ఎస్ – సీపీఎం సైతం పొత్తుతో ముందుకెళ్తున్నాయి. ఇక అన్నిచోట్లా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండడం గమనార్హం. ఎవరు..ఎవరితో.. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియగా.. ఆయా పార్టీల అభ్యర్థులకు పార్టీల గుర్తులు, స్వతంత్రులకు ఇతర గుర్తులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే కొత్తగూడెంలో ఆసక్తికర పొత్తులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్, సీపీఎంతో జత కట్టగా, సీపీఐ – టీడీపీ కలిసి పోటీకి దిగాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఒంటరిపోరుకు దిగగా, సీపీఐ, సీపీఎం, మాస్లైన్తో బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడింది. అశ్వారావుపేటలో కాంగ్రెస్ – సీపీఎం పొత్తుతో, బీఆర్ఎస్, సీపీఐ సింగిల్గా బరిలో ఉన్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. బీఆర్ఎస్ – సీపీఎం పొత్తు కుదిరింది. ఇక్కడ సీపీఐ సింగిల్గా పోటీలో ఉంది. మధిరలో కాంగ్రెస్ – టీడీపీ పొత్తు కుదరగా బీఆర్ఎస్ సీపీఐ, సీపీఎంతో జత కట్టింది. సత్తుపల్లి, కల్లూరు, వైరా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, సీపీఐ ఒంటరిగానే బరిలో నిలవగా బీఆర్ఎస్, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్నా.. ఈ అభ్యర్థులకు సీపీఐ బీ ఫామ్లే ఇవ్వడంతో కంకి కొడవలి గుర్తు వచ్చింది. ఇక మధిరలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుని మూడు వార్డుల్లో బరిలో దిగినప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పరిగణించి గుర్తులు కేటాయించారు.ఏదులాపురం మున్సిపాలిటీ : వార్డులు 32 కాంగ్రెస్ ఒంటరి పోరు పోటీ : 32 వార్డులు (15వ వార్డు తమ్మినేని మంగతాయి ఏకగ్రీవం) పొత్తు : బీఆర్ఎస్, సీపీఎం పోటీ : బీఆర్ఎస్ – 23, సీపీఎం – 08 వార్డులు సీపీఐ ఒంటరి పోరు : పోటీ 11 వార్డులు బీజేపీ ఒంటరిపోరు : పోటీ 24 వార్డులు అశ్వారావుపేట మున్సిపాలిటీ : వార్డులు 22 పొత్తు : కాంగ్రెస్, సీపీఎం పోటీ : కాంగ్రెస్ 21, సీపీఎం 01 వార్డు బీఆర్ఎస్ ఒంటరి పోరు : పోటీ 22 వార్డులు సీపీఐ ఒంటరి పోరు : పోటీ 01 వార్డు బీజేపీ ఒంటరి పోరు : పోటీ 15 వార్డులుకొత్తగూడెం కార్పొరేషన్ : డివిజన్లు 60 పొత్తు : కాంగ్రెస్, సీపీఎం పోటీ : కాంగ్రెస్ 58, సీపీఎం 02 బీఆర్ఎస్ ఒంటరి పోరు : పోటీ 59 డివిజన్లు పొత్తు : సీపీఐ, టీడీపీ పొత్తు పోటీ : సీపీఐ 56 డివిజన్లు, టీడీపీ 04 డివిజన్లు బీజేపీ ఒంటరిపోరు : పోటీ 56 డివిజన్లుకలిసి వచ్చిన వారితో కలివిడిగా.. ఇల్లెందు మున్సిపాలిటీ : వార్డులు 24 కాంగ్రెస్ ఒంటరి పోరు : పోటీ 24 వార్డులు పొత్తు : బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, మాస్లైన్ పోటీ : బీఆర్ఎస్ – 20, సీపీఎం – 01, సీపీఐ – 02, మాస్లైన్ – 01 బీజేపీ ఒంటరి పోరు : పోటీ 18 వార్డులు ఎన్డీ ఒంటరిపోరు : పోటీ 01 వార్డు -
కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి..
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఏదులాపురం మున్సిపల్ పరిధి 7, 8, 9, 12, 13 వార్డుల్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, స్థలాలు ఇచ్చే శాఖ తన వద్దే ఉన్ననందున ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులందరికీ ఇచ్చే బాధ్యత స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి విడతల వారీగా పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు విశ్రమించనని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వాన తమ ప్రభుత్వం ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీతో పేదలకు అండగా నిలుస్తోందని మంత్రి వివరించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ రోడ్లు, డ్రెయిన్ పనులను వేసవి లోపే పూర్తి చేస్తామని ప్రకటించిన మంత్రి,, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో అభ్యర్థులు, వార్డు ఇన్చార్జ్లతో పాటు నాయకులు వెంపటి రవి, భూక్యా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ●మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఏదులాపురంలోని ఐదు వార్డుల్లో ప్రచారం చేయనున్నారు. ఈమేరకు 10, 11, 28, 29, 30వ వార్డుల్లో ఉదయం 8గంటల నుంచి మంత్రి రోడ్షో నిర్వహిస్తారని క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా..
విద్యార్థుల్లో ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ను పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు.IIలోకల్లూరు మున్సిపాలిటీ : వార్డులు 20 కాంగ్రెస్ ఒంటరిపోరు : పోటీ: 20 వార్డుల్లో పొత్తు : బీఆర్ఎస్, సీపీఎం పోటీ : బీఆర్ఎస్ 20 వార్డుల్లో, సీపీఎంకు కో ఆప్షన్ ఇవ్వాలని ప్రతిపాదన బీజేపీ ఒంటరి పోరు : పోటీ 16 వార్డులు సీపీఐ ఒంటరి పోరు : పోటీ 01 వార్డువైరా మున్సిపాలిటీ : వార్డులు 20 కాంగ్రెస్ ఒంటరిపోరు పోటీ : 18 వార్డులు, ఒక్కో వార్డులో సీపీఐ, స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పొత్తు : బీఆర్ఎస్, సీపీఎం పోటీ : బీఆర్ఎస్ – 16, సీపీఎం – 03 సీపీఐ ఒంటరి పోరు : పోటీ 01 వార్డు బీజేపీ ఒంటరి పోరు : పోటీ 19 వార్డులు -
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులతో సమీక్షించారు. అధికారులపై నమ్మకంతో ప్రజలు వస్తారని, వారి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తే ఆ నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఒకవేళ ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేయాలని సూచించారు. ఆతర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమలు, పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై సూచనల చేశారు. ● వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ గతనెల 31న ఉద్యోగ విరమణ చెందిన ఏడుగురు ఉద్యోగులను కలెక్టర్ అనుదీప్ సత్కరించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు. ● జిల్లాలోని అభివృద్ధి పనుల పురోగతికి అధికారులు ప్రణాళికాయుతంగా పనిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ప్రాజెక్టుల భూసేకరణ, రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి, సింథటిక్ ట్రాక్, రోప్ వే పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు.సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేటి రిటైనింగ్ వాల్కు అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జూన్కల్లా పూర్తయ్యేలా వేగం పెంచాలని తెలిపారు. అలాగే, ఎన్నెస్పీ భూములకు ఫెన్సింగ్, ఫ్రూట్ మార్కెట్కు భూకేటాయింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్, డీఆర్వో పద్మశ్రీ, డీఎంహెచ్ఓ రామారావు, పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీలత, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, యాకూబ్, వెంకటరెడ్డి, రంజిత్, ఎస్డీసీ రాజేశ్వరి, డీఈఓ చైతన్య జైనీ, ఆర్డీఓ నర్సింహారావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ధాన్యం సేకరణ, యూరియా పంపిణీ, మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించిన ఆయన ధాన్యం దిగుబడి అంచనాకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే, యాప్ ద్వారా యూరియా పంపిణీపై నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది మినహాయింపునకు అధికారులు సిఫారసు చేస్తే ప్రత్యామ్నాయ సిబ్బందిని కూడా వారే సూచించాలని తెలిపారు. కాగా, కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో షాపులు కోల్పోయిన వారికి స్ట్రీట్ వెండర్ జోన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, జిల్లా అధికారులు పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ భోజన నాణ్యత పరిశీలించాలని సూచించారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవా రం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం సెషన్లో రెగ్యులర్, ఒకేషనల్ అభ్యర్థులకు 49 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 3,031మంది విద్యార్థుల్లో 2,870 మంది హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. అలాగే, మధ్యాహ్నం సెషన్ 32 కేంద్రాల్లో జరగగా 2,603మంది విద్యార్థులకు గాను 2,536 మంది హాజరయ్యారని వెల్లడించారు. హెచ్పీసీ, డీఈసీ, ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు తాను 53 కేంద్రాల్లో తనిఖీ చేశామని డీఐఈఓ తెలిపారు. పోస్టల్ ప్రాంచైజీలకు దరఖాస్తుల స్వీకరణ ఖమ్మంగాంధీచౌక్: ఇండియా పోస్టు ప్రాంచైజ్ స్కీం ద్వారా ప్రాంచైజీల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఖమ్మం పోస్టల్ సూపరిటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. 18 ఏళ్లు నిండి ఇంటర్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. డెలివరీ మాత్రమే చేసే వారికి పదో తరగతి అర్హత ఉండాలని తెలిపారు. వీరు వాహనం, డ్రైవింగ్ లైసెన్సు ఉండాలని వెల్లడించారు. స్పీడ్ పోస్టు బుకింగ్, ఇండియా పోస్టు పార్సిల్, ఇంటర్నేషనల్ పార్సిల్ డెలివరీ, సీఓడీ కలెక్షన్ల సేవల కోసం ఆసక్తి ఉన్న వారు ఇండియా పోస్టు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం పోస్టాఫీసుల్లో సంప్రదించాలని సూపరింటెండెంట్ తెలిపారు. ఔషధ మొక్కల గుర్తింపుపై అవగాహన సత్తుపల్లిరూరల్: జీవవైవిధ్యం, ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై సత్తుపల్లిలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ గొల్లమందల రవి పాల్గొని మొక్కల శాసీ్త్రయ గుర్తింపు, ఔషధ విలువలు, సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. ఆతర్వాత కళాశాలలోని బొటానికల్ గార్డెన్లో మొక్కలను ప్రత్యక్షంగా పరిచయం చేశారు. ప్రిన్సిపాల్ ఎస్కే. పీర్సాహెబ్, అధ్యాపకులు డాక్టర్ ఎస్.బాబు, ఎల్.మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
అజెండా.. లోకల్!
కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం మున్సిపాలిటీల్లో అభివృద్ధికి పెద్దపీట వేసింది తామేనని కాంగ్రెస్ అభ్యర్థులు చేస్తున్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు రూ.కోట్ల నిధులు విడుదలై నిర్మాణ దశలో ఉన్నాయని వివరిస్తున్నారు. ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల ఏర్పాటు తమ ఘనతేనని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మున్సిపాలిటీల్లోనూ గెలిపిస్తే జనానికి ప్రయోజనం జరుగుతుందని చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అంతేకాక రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులతో కరపత్రాలు విడుదల చేస్తున్నారు. మహర్దశ మా హయాంలోనే.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలు గణనీయమైన అభివృద్ధి సాధించాయని చెబుతున్నారు. పట్టణ ప్రగతి పేరుతో మున్సిపాలిటీలకు జవసత్వాలు నింపగా.. డంపింగ్యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుచేశామని వివరిస్తున్నారు. ప్రస్తుతం సమస్యలు పేరుకుపోయాయని.. తమకు అవకాశం కల్పిస్తే వాటి పరిష్కారానికి పాటుపడతామని హామీలు గుప్పిస్తున్నారు. సరిపడా నిధుల కోసం పోరాడుతామని.. తద్వారా వసతులు కల్పించడమే కాక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామంటూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో చెబుతున్నారు. ఆ పార్టీలదీ అదే దారి ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా సమస్యలనే ఆయుధంగా మార్చుకున్నాయి. సీపీఎం – బీఆర్ఎస్తో జత కట్టి వార్డుల్లో సమస్యలపై ఫోకస్ పెట్టారు. సమస్యలను ప్రస్తావించడమే కాక అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నలు సంధిస్తూ ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులను ఎన్నుకుంటే పోరాటాలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీపీఎం నాయకులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధనకు పోరాటాలు చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. అలాగే, బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్లే లక్ష్యంగా.. స్థానిక సమస్యలను లేవనెత్తుతున్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఇలా మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు స్థానిక సమస్యలనే అస్త్రాలుగా మార్చుకుని ముందుకు వెళ్తూ ప్రచారాన్ని రోజురోజుకు హోరెత్తిస్తున్నారు. జిల్లాలోని ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీల్లో ఓటర్లు సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనను కోరుతున్నారు. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులకు అవే అస్త్రాలుగా మారాయి. అంతర్గత రహదారుల దుస్థితి, డ్రెయినేజీలు అస్తవ్యస్తం, వీధుల్లో చెత్త పేరుకుపోవడం, డంపింగ్యార్డు సమస్య, అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలు, తాగునీటి సమస్య, పౌర సేవల్లో జాప్యం తదితర అంశాలను అభ్యర్థులు తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. మున్సిపాలిటీల సమస్యలే అజెండాగా అభ్యర్థులు ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. అవసరమైన వసతులు కల్పిస్తామని హామీలు గుప్పిస్తుండగా.. స్థానికులు కూడా తమ డిమాండ్ల చిట్టాలను అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, డ్రైయిన్లు ఇలా స్థానిక సమస్యలను పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు హామీలు ఇస్తూనే ఇప్పటివరకు మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ఇప్పటి సమస్యలను లేవనెత్తుతున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంస్థానిక సమస్యలే అభ్యర్థుల ప్రచారాస్త్రాలు -
105 మంది చిన్నారులకు విముక్తి
ఖమ్మంక్రైం: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపే లక్ష్యంగా నెల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్–12 ద్వారా 105 మంది చిన్నారులకు విముక్తి కల్పించామని, ఇందులో 29 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. గతనెల 1నుంచి 31వ తేదీ వరకు నోడల్ అధికారి అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ సాంబరాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్లో పోలీసు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, కార్మిక, విద్య, ఆరోగ్య శాఖలే కాక చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఎన్జీఓలు పాల్గొన్నారని వెల్లడించారు. ఈమేరకు రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలపై దృష్టి సారించి చిన్నారులకు విముక్తి కల్పించామని తెలిపారు. చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖ కవళికలను గుర్తించే దర్పణ్ పరిజ్ఞానం ఆధారంగా పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారని వెల్లడించారు. ఒక్కో డివిజన్లో ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లుతో కూడిన బృందాలు పాల్గొనగా సీపీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. 18మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధి వివిధ స్టేషన్లలో కానిస్టే బుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న 18మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా వీరిని సోమవారం పోలీస్ కమిషనర్ సునీల్దత్ అభినందించారు. పదోన్నతి పొందిన వారిలో ఖమ్మం జిల్లాకు ఒకరిని కేటాయించగా, వరంగల్ జిల్లాకు నలుగురు, మహబూబాబాద్ జిల్లాకు ముగ్గురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పది మందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.పోలీస్ కమిషనర్ సునీల్దత్ -
ఎక్కడైనా.. ఎక్స్రే!
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎక్స్రే అవసరమైతే పెద్ద తతంగమే. యంత్రాలు పెద్దగా ఉండడంతో ఆస్పత్రులకు కానీ ల్యాబ్లకు వెళ్తేనే ఎక్స్రే తీయడం సాధ్యమయ్యేది. ఇక టీబీ క్యాంపుల్లో తెమడ పరీక్షల ద్వారా మాత్రమే బాధితులను గుర్తిస్తుండగా ఎక్స్ రే ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురయ్యేది. వీటన్నింటికి చెక్ పెట్టేలా కేంద్రప్రభుత్వం నుంచి టీబీ విభాగానికి హ్యాండ్ హోల్డ్ పోర్టబుల్ మొబైల్ ఎక్స్రే యంత్రాన్ని కేటాయించారు. ఈ మిషన్ రేడియషన్ తక్కువగా వెలువరించడంతో పాటు నాణ్యతతో కూడిన చిత్రాలు విడుదల చేస్తుంది. ఎక్కడికై నా తీసుకెళ్లే వీలుండే కొత్త యంత్రాన్ని కలెక్టర్ అనుదీప్ కలెక్టరేట్లో సోమవారం పరిశీలించారు. డీఎంహెచ్ఓ రామారావు, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుబ్బారావు, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, అధికారులు చందునాయక్ తదితరులు పాల్గొన్నారు. – ఖమ్మం వైద్యవిభాగం -
రిటైనింగ్ వాల్తో ముంపు కష్టాలకు చెక్
● మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారమే ధ్యేయం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని.. ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధికి రెట్టింపు చేస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తద్వారా రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా నిలబెడతానని వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 22, 23, 24, 26, 27 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి సోమవారం రాత్రి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కూడళ్లలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మాట ఇచ్చి తప్పే అలవాటు తనకు లేదని తెలిపారు. వచ్చే జూన్ కల్లా మున్నేటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి వరద కష్టాలకు శాశ్వతంగా చెక్ పెడతానని వెల్లడించారు. ఇది ఎన్నికల సమయాన ఇస్తున్న వాగ్దానం కాదని.. చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. రూ.690 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఏదులాపురానికి రక్షణ కవచంలా మారుతుందన్నారు. అలాగే, రాజీవ్గృహకల్ప ఇళ్లకు కొత్త హంగులు అద్దడంతో పాటు ప్రతీ ఇంటికీ నల్లా నీరు అందించే బాధ్యత తనదేనని తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండగా, ప్రతీ సమస్య పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. గత సర్కార్ ప్రజలను ముంచినట్లుగా కాకుండా తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తోందని పొంగులేటి తెలిపారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వార్డు అభ్యర్థులు, నాయకులు ఏనుగు స్వరూప, పోకబత్తిని అనిత, బానోత్ భాస్కర్, బానోత్ దివ్య, భూక్యా పూల్చంద్, తోట చినవెంకటరెడ్డి, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఏనుగు మహేష్, బానోత్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఐదు వార్డుల్లో... ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రచారం చేయనున్నారు. ఈమేరకు 7, 8, 9, 12, 13 వార్డుల్లో మంత్రి పొంగులేటి ఉదయం 8–30 నుంచి 10–30 గంటల వరకు ప్రచారంలో పాల్గొంటారు. -
తాగునీటి పథకాల పనితీరుపై సర్వే
ఖమ్మం అర్బన్: రానున్న వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి కాకుండా ముందస్తు చర్యల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈమేరకు జిల్లావ్యాప్తంగా 20రోజుల పాటు తాగునీటి పథకాల పనితీరు, అంతరాయాలను పరిశీలించి తక్షణ మరమ్మతులకు ఉపక్రమించనున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జి.శేఖర్రెడ్డి, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ మండలాల వారీగా ఇంజనీర్ల సర్వేను పరిశీలించి సూచనలు చేస్తున్నారు. ఎర్రుపాలెం, రఘునాథపాలెం, పెనుబల్లి తదితర మండలాల్లో సోమవారం సర్వే జరగగా సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులను కలిసి అక్కడి తాగునీటి పథకాలు, పనితీరు, పైపులైన్లు, లీకేజీలపై ఆరా తీశారు. రఘునాథపాలెం మండలంలో డీఈఈలు ఓంప్రకాష్, ఇందిరాజ్యోతి ఆధ్వర్యాన సర్వే చేయగా సర్పంచ్ కోటేరు నర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఉదయ్కుమార్ తదితరులు వారికి వివరాలు వెల్లడించారు.వేసవిలో ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు -
అంతర్జాతీయ సదస్సుకు ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు
వైరా: దుబాయ్లో ఈనెల 7, 8వ తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆంగ్ల ఉపాధ్యాయుడు మొండ్రు భాస్కర్ ఎంపికయ్యారు. వైరాకు చెందిన ఆయన కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తుండగా, ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్’ పాల్గొని పరిశోధనా పత్రం సమర్పించన్నారు. ఏఐ ఆధారిత బోధనపై భాస్కర్ రూపొందించిన పరిశోధనా పత్రం సదస్సు అకడమిక్ కమిటీ ద్వారా ఆమోదం పొందింది. కాగా, సదస్సుకు తెలంగాణ నుంచి భాస్కర్ మాత్రమే ఎంపిక కాగా, పలువురు భినందించారు. రూ.4.50లక్షల విలువైన భూమి వితరణ కొణిజర్ల: మండలంలోని తుమ్మలపల్లిలో గ్రామ సమాఖ్య(సీ్త్ర శక్తి) భవన నిర్మాణం కోసం యర్రా నరసయ్య జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు 136 గజాల భూమి వితరణగా అందజేశారు. భవనం నిర్మాణానికి ప్రభుత్వ స్థఽలం లేక పోవడంతో శివాజీ గ్రామ సమాఖ్య బాధ్యులు సర్పంచ్ డేరంగుల వెంకటరమణను సంప్రదించారు. ఆమె నరసయ్య కుటుంబీలతో చర్చించగా యర్రా జానకమ్మ, ఆమె కుమారుడు కృష్ణయ్య రూ 4.50 లక్షల విలువైన భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను సోమవారం అందజేశారు. మాజీ సర్పంచ్ డేరంగుల బ్రహ్మం, గ్రామ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలి ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్ర బడ్జెట్లో విస్మరించిన వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు పెంచాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం విత్తన, విద్యుత్ రంగాల్లో సంస్కరణల అమలు ద్వారా వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశానికి అనువైన పరిస్థితి కల్పించారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకం నిధులు కేటాయింపులు తక్కువగా ఉన్నందున సరిచేయడంతో పాటు వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, మేరుగు సత్యనారాయణ, ఎర్రా శ్రీనివాసరావు, భూక్యా వీరభద్రం, వాసిరెడ్డి ప్రసాద్, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, వడ్లమూడి మధు, నందిపాటి మనోహర్, నాగేశ్వరరావు, వెంకన్న బాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కటైన వలస కూలీల జంట
నేలకొండపల్లి: పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చిన ఓ యువతీ, యువకుడు ప్రేమించుకోగా స్థానిక రైతులు వారి పెద్దలను ఒప్పించి వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు పలువురు నేలకొండపల్లి మండలంలోని మోటాపురంలో ఏటా నాలుగు నెలల పాటు మిర్చి ఏరేందుకు వస్తారు. ఇందులో పూల్సింగ్, ఆశ ఉండగా వీరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో మోటాపురానికి చెందిన సోదరులైన రైతులు భూక్యా మోహాన్రావు, భూక్యా లక్ష్మణ్ వారి తల్లిండ్రులతో ఫోన్లో మాట్లాడి ఒప్పించారు. అంతేకాక పెళ్లి ఖర్చులు, భోజనం ఇతరత్రా అన్నీ భరించి సోమవారం వీరన్నస్వామి ఆలయంలో కల్యాణం జరిపించారు. సీపీఐ మండల కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు భాగం నరసింహారావు, మూడు శ్రీనుతో పాటు రైతులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. -
ఎదురెదురుగా ఢీకొన్న కంటైనర్ – లారీ
వైరారూరల్: మండలంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెన సమీపాన సోమవారం రాత్రి రాళ్ల లోడుతో వెళ్తున్న కంటైనర్, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రధాన రహదారిపై ఇవి ఢీకొనడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రాళ్ల లోడుతో వైరా వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న కంటైనర్, తల్లాడ వైపు నుంచి వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సీఐ వెంకటప్రసాద్, ఎస్సై పి.రామారావు చేరుకుని బస్సులు మినహా భారీ వాహనాలను ఏన్కూరు మీదుగా పల్లిపాడు నుంచి తల్లాడ వైపు మళ్లించారు. ఆతర్వాత ప్రొక్లెయిన్ సాయంతో వాహనాలను తప్పించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో కంటైనర్, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జు కాగా డ్రైవర్లకు గాయాలయ్యాయి. -
చైనా వ్యాపారుల పర్యటన
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో చైనా మిర్చి వ్యాపారుల బృందం సోమవారం పర్యటించింది. కోయచలక తదితర గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మిర్చి మిర్చి తోటలతో పాటు ఇప్పటికే కోసి ఆరబెట్టిన మిర్చిని ముగ్గురు సభ్యులతో కూడిన బృందం పరిశీలించి వివరాలు ఆరా తీశారు. విత్తన ఎంపిక, సాగు విధానం, చేతికి వచ్చే వరకు తీసుకున్న జాగ్రత్తలు, రసాయనాల వాడ కం, దిగుబడులను తెలుసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో చైనాకు చెందిన వ్యాపారులు మిర్చి ఫ్యాక్టరీ ఏర్పాటుచేయగా, ఇక్కడి వ్యాపారులు చైనాకు మిర్చి ఎగుమతి చేస్తున్నారు. ఈనేపథ్యాన ఆ దేశ వ్యాపారులు పర్యటించడంతో ఆసక్తి నెలకొంది. షార్ట్ సర్క్యూట్తో గృహోపకరణాలు దగ్ధం కల్లూరురూరల్: కల్లూరులోని ఏకలవ్యనగర్లో సోమవారం బొడ్డు రవి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్ కాలిపోవడమే కాక ఇతర సామగ్రి, దుస్తులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష మేర ఆస్తి నష్టం జరిగినందున ప్రభుత్వం, విద్యుత్ శాఖ తమను ఆదుకోవాలని రవి కోరారు. -
సర్వేలో ఆడపులులు !
● వన్యప్రాణుల గణనలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు ● ఉద్యోగులే కాక వలంటీర్లలోనూ అతివలు ● దట్టమైన అడవిలో వెన్నుచూపకుండా విధులుఖమ్మంవ్యవసాయం: వన్యప్రాణుల గణనలో మహిళలు ధైర్య సాహసాలను ప్రదర్శించారు. వంటింటికే పరిమితమైన రోజుల నుంచి పురుషులకు తగ్గకుండా అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ వెన్నుచూపక విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనేపథ్యాన జనవరి 19 నుంచి నిర్వహించిన పులులు, వన్యప్రాణుల గణనలో అటవీ శాఖ పరిధిలోని మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. శాఖలోని వివిధ హోదాల ఉద్యోగులే కాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వలంటీర్లు కూడా పాల్గొన్నారు. గణనలో దాదాపు సగం మంది మహిళా ఉద్యోగులు, వలంటీర్లు ఉండడం విశేషం. 40శాతానికి పైగా మహిళలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికంగా 4,311 చదరపు కిలో మీటర్ల అటవీ విస్తీర్ణం ఉండగా, ఖమ్మం జిల్లాలో 637 చదరపు కిలో మీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వన్యప్రాణుల గణన ప్రక్రియలో మొత్తం 1,105 మంది పాల్గొన్నారు. వీరిలో అటవీ ఉద్యోగులతోపాటు వలంటీర్లు 262 మంది ఉన్నారు. వీరిలో 40 నుంచి 50 శాతం మంది మహిళలు ఉన్నారు. కేటాయించిన అటవీ బీట్లలో ఉంటూ సర్వే నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మాంసాహార, శాఖాహార జంతువులతోపాటు, చెట్లు, పొదలు, మొక్కలు, ఆవాసాలను లెక్కించారు. చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, అడవి పందులు, రేసు కుక్కలు, కనుజులు, మనుబోతులు, నక్కలు, దుప్పులు తదితర జంతువుల సంచారం ఉన్నట్లు పాదముద్రలు, వెంట్రుకలు, అవశేషాలు, విసర్జితాలు, గోర్ల ఆధారంగా గుర్తించారు. జంతువులు సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల వరకు సంచరిస్తుంటాయి. ఆ సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని దట్టమైన అడవుల్లో నిబంధనల ప్రకారం ఒక్కో అటవీ బీట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున వన్యమృగాల గణన చేశారు. ఉమ్మడి జిల్లాలో అటవీ మహిళా అధికారులతోపాటు మహిళా వలంటీర్లు సర్వేలో శివంగులుగా పనిచేసి అటవీశాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఉదయం 6 గంటలకు క్షేత్రస్థాయికి చేరుకుని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రణాళికతో పనిచేశాం. చిరుతల జాడలు లభించాయి. ఔషధ మొక్కలూ గుర్తించాం. సాధారణ విధులతో పోలిస్తే సర్వేను ఓ టాస్క్గా చేశాం. అడవిలో విధులు నిర్వర్తించడం ఆహ్లాదంగా గడిచింది. – పూనెం లావణ్య, బీట్ ఆఫీసర్, పులిగుండాల మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నా. వన్యప్రాణుల గణనలో వలంటీర్గా అవకాశం వచ్చింది. వెలుగుమట్ల అటవీ ప్రాంతంలో సర్వే సమయాన తొలిరోజు భయం వేసినా ధైర్యంగా ముందుకు సాగాం. ఇది భవిష్యత్లో నాకు ఉపయోగపడుతుంది. – జలగం కవిత, వలంటీర్, బొడ్లాడ, మహబూబాబాద్ జిల్లావన్యప్రాణుల గణనలో రిస్క్ ఉంటుంది. మహిళలకు మరింత ఇబ్బంది అని తెలిసినా విధి నిర్వహణే లక్ష్యంగా సర్వే చేశాం. పులుల కదలికల గుర్తింపులో శిక్షణ తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురుకాలేదు. వాచర్ వెంట రాగా ఉదయం 6గంటలకే వెళ్లేవాళ్లం. ఆసక్తితో శాఖలో చేరిన నాకు సర్వే ఎంతో నేర్పింది. – బానోత్ గౌతమి, బీట్ ఆఫీసర్, కొంపెల్లి, సత్తుపల్లి -
ఎన్నికల ‘ఉపాధి’!
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్ ఎన్నికలు కొందరు కూలీలకు ఉపాధిని తెచ్చిపెట్టాయి. ఉదయం, సాయంత్రం పార్టీల జెండాలను పట్టుకుని అభ్యర్థుల వెంట తిరుగుతూ జై కొడితే రూ.200 నుంచి రూ.400 వరకు చెల్లిస్తున్నారు. గత నెల 30వ తేదీతో నామినేషన్లు వేసే గడువు ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో పలువురు ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచార సమయంలో హంగు, ఆర్భాటం ఉండేలా మనిషికి ఇంత చొప్పున నగదు చెల్లించి పలువురిని వెంట తిప్పుకుంటున్నారు. రోజువారీ చేసే ప్రచారంలో తక్కువమంది ఉన్నా.. ముఖ్యనేతలు వార్డుల్లో, డివిజన్లలో ప్రచారానికి వచ్చినప్పుడు, మంత్రులు ప్రచారంలో పాల్గొన్నప్పుడు కొంత హడావుడి ఉంటోంది. ఆ సమయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో రోజువారీగా పనులు చేసుకునే వారికి ఉపాధి లభిస్తోంది. ఉదయం, సాయంత్రం సమయంలో అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొంటే భోజనాలు పెట్టించి రూ. 200 నుంచి రూ. 400 ఇస్తుండటంతో పలువురు కూలీలు ప్రచార బాట పడుతున్నారు. ● బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫాంలు ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులెవరో తేలింది. ఈమేరకు అభ్యర్థులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సోమవారం బీ ఫామ్లు అందజేశారు. పార్టీ శ్రేణులంతా ఐకమత్యంతో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నాయకులు బెల్లం వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొంటే ఒక్కొక్కరికి రూ.400 వరకు చెల్లింపు -
కేఎంసీ పాత భవనానికి శతాధిక చరిత్ర
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలతోపాటు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఉండటంతో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. అయితే ఖమ్మం నగర పాలకసంస్థ పాత భవన చరిత్ర మాత్రం ఆకట్టుకుంటోంది. 2022 ఏప్రిల్ 15వ తేదీ వరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంగా సేవలందించిన భవనానికి 113 ఏళ్ల చరిత్ర ఉంది. రైల్వే స్టేషన్కు సమీపంలో బ్రిటీష్ కాలంలో భవనం నిర్మించగా తొలినాళ్లలో కలెక్టర్ బంగ్లాగా కొనసాగించారు. ఖమ్మం మున్సిపాలిటీ ఏర్పడ్డాక మున్సిపల్ భవనంగా మార్చారు. ఖమ్మం 1942లో స్పెషల్ గ్రేడ్, 1952లో గ్రేడ్–3, 1959లో గ్రేడ్–2, 1980లో గ్రేడ్–1 మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 2012, అక్టోబర్ 19న మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. అప్పటి నుంచి భవనం సేవలందిస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త భవనం నిర్మించగా, 2022, ఏప్రిల్ 18 నుంచి నూతన భవనంలో ఖమ్మం కార్పొరేషన్ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇక పాత భవనాన్ని హెరిటేజ్ భవనంగా గుర్తించడంతోపాటు, అనుబంధంగా నిర్మించిన భవనాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయం, ఇతర శాఖలకు కార్యాలయాలుగా వినియోగిస్తున్నారు. కలెక్టర్ బంగ్లాగా సేవలు ప్రారంభం -
ఏసీబీ వలలో తూనికలు, కొలతల అధికారి
● వే బ్రిడ్జి లైసెన్స్కు లంచం డిమాండ్ ఖమ్మక్రైం: వే బ్రిడ్జి లైసెన్స్ మంజూరుకు లంచం డిమాండ్ చేసిన జిల్లా తూనికల కొలతల శాఖ జిల్లా అధికారి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ వెల్లడించిన వివరాలు... ఓ వ్యక్తి వే బ్రిడ్జి ఏర్పాటుకు లైసెన్స్ మంజూరు చేయాలని జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్(జిల్లా అధికారి) ప్రవీణ్ను సంప్రదించాడు. అయితే, రూ.10వేలు ఇస్తేనే లైసెన్స్ మంజూరు చేస్తానని ఆయన బదులిచ్చాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు ప్రవీణ్కు ఫోన్ చేయించి మాట్లాడగా రూ.5వేలకు ఒప్పుకున్నాడు. ఇదంతా రికార్డ్ చేసిన ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యాన ఖమ్మం దానవాయిగూడెంలోని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. హుండీ ధ్వంసం, నగదు చోరీ మధిర: మండలంలోని మల్లారంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి హుండీని ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి నగదు తీసుకుని వదిలేసి వెళ్లారు. సోమవారం ఉదయం అర్చకులు హుండీ లేదని గుర్తించి గ్రామస్తులతో కలిసి గాలిస్తుండగా పాఠశాల వెనకాల లభించింది. ఘటనపై మధిర రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్వర్టును ఢీకొట్టిన లారీ కామేపల్లి: లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇల్లెందు నుంచి ఇసుక లోడ్తో ఖమ్మం వెళ్తున్న లారీ పండితాపురం బైపాస్ వద్ద అదుపుతప్పి కల్వర్టు, రోడ్డు పక్కనే చెట్టును ఢీకొట్టింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. -
అభ్యర్థుల గుర్తులు ఇవే..
సత్తుపల్లిటౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత బీ–ఫామ్ అందిన అభ్యర్థులకు పార్టీల గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. మిగిలిన ఇండిపెండెంట్ల కోసం 75 గుర్తులను ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీరికి అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు. జాతీయ, రాష్ట్ర పార్టీల గుర్తులు ఇలా.. జాతీయ పార్టీలో బీజేపీ (కమలం), కాంగ్రెస్ (హస్తం), ఆమ్ఆద్మీ (చీపురు), బీఎస్పీ (ఏనుగు), ఇండియన్ ముస్లీం లీగ్ (నిచ్చెన), సీపీఎం (సుత్తి కొడవలి, నక్షత్రం) గుర్తులు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ ల్లో ఏఐఎంఐఎం (గాలిపటం), బీఆర్ఎస్ (కారు), వైఎస్ఆర్సీపీ (ఫ్యాన్), టీడీపీ (సైకిల్), రిజిస్టర్ పార్టీల్లో ఫార్వర్డ్ బ్లాక్ (సింహం), సీపీఐ (కంకి కొడవలి), జనసేన (గాజుగ్లాసు) గుర్తులు ఉన్నాయి. స్వతంత్రుల గుర్తులు.. స్వతంత్ర అభ్యర్థులకు 75 గుర్తులు కేటాయిస్తూ ఎన్నికల సంఘం విడుదల చేయగా.. ఇందులో యాపిల్, గాజులు, ఎయిర్ కండీషన్, బ్యాట్, సీసా, బెలూన్, కెమెరా, బకెట్, ఫుట్బాల్ తదిర గుర్తులు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో ఇలా.. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు 202 మంది అభ్యర్థులకు గాను 206నామినేషన్లు, వైరాలో 20వార్డులకు 155మంది అభ్యర్థులకు గాను 155నామినేషన్లు, సత్తుపల్లిలో 23 వార్డులకు 124 మంది అభ్యర్థులకు 128 నామినేషన్లు, కల్లూరులో 20 వార్డులకు 130 మంది అభ్యర్థులకు గాను 132 నామినేషన్లు, మధిరలో 22 వార్డులకు 165 మంది అభ్యర్థులకు గాను 165 నామినేషన్లను పరిగణనలోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఏదులాపురంలో 16 మంది, వైరా, సత్తుపల్లిలో 14 మంది చొప్పున, కల్లూరులో ఆరుగురు, మధిరలో నలుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లకు 75 గుర్తులు -
విమానంలో ‘మమత’ సేవలు
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీకి చెందిన మానసిక వైద్యుల బృందం విమాన ప్రయాణం సందర్భంగా ఓ వ్యక్తికి అత్యవసర చికిత్స అందించి అభినందనలు అందుకున్నారు. వైద్యుల బృందం గతనెల 31వ తేదీన ఢిల్లీలో జాతీయ సదస్సుకు హాజరై హైదరాబాద్కు ఎయిర్ ఇండియా విమానంలో తిరిగి వస్తున్నారు. ఈక్రమాన ప్రయాణికుల్లో ఒకరికి మద్యం మానేయడం వల్ల కలిగే డెలిరియం లక్షణాలు కనిపించాయి. ఆ వ్యక్తిలో తీవ్రమైన అశాంతి, ఆగ్రహం, ఎవరో చెడు చేయబోతున్నారని అనుమానం, తనలో తానే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు గమనించారు. దీంతో నిరంతర మాటల ద్వారా శాంతింపజేయడం, భరోసా కల్పించడం, దృష్టి మళ్లించే పద్ధతులతో నియంత్రించగా క్యాబిన్ క్రూ సిబ్బందికి కూడా సహకరించారు. విమానం ల్యాండ్ అయ్యే వరకు సదరు వ్యక్తిని శాంతింపజేస్తుండడం ద్వారా ఇతర ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించినట్లయింది. వైద్యుల బృందంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.దివ్యారెడ్డితో పాటు చింతల శ్రీకర్, అడపా ప్రణతి, యర్లగడ్డ ప్రీతి, వినయకాంత్ తేజ ఎస్, శాఖమూరి నిహారిక, ఆదిత్య కులకర్ణి ఉన్నారు. -
ఫిజియోథెరపిస్ట్కు రూ. 30 లక్షలకు టోకరా..
ఖమ్మంక్రైం: షేర్ మార్కెట్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు ఓ ఫిజియోఽథెరపిస్ట్కు రూ. 30 లక్షల మేర కుచ్చుటోపి పెట్టారు. ఈ ఘటనలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం ఒకరిని అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తి అధిక లాభాల ఆశ చూపడంతో జిల్లాకు చెందిన ఫిజియోథెరపిస్ట్ ఒకరు వాట్సాప్ ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టారు. చివరకు లాభాలు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నగదు వైజాగ్కు చెందిన జగ్గారావు బ్యాంక్ అకౌంట్కు వెళ్లినట్లు గుర్తించి, అతడిన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సైబర్క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ నరేష్, ఎస్ఐలు రంజిత్, విజయకుమార్, సిబ్బంది శ్రీనివాస్రావు, భానుమూర్తిని సీపీ సునీల్దత్ అభినందించారు.సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు -
వాలీబాల్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్జూనియర్ బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లావ్యాప్తంగా బాలబాలికలు 130 మందికి పైగా హాజరుకాగా, ప్రతిభ కలిగిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి బి.గోవిందారెడ్డి తెలిపారు. వీరు కామారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. బాలుర జట్టులో కె.వెంకన్నబాబు, వి.వినయ్వర్మ, పి.రేవంత్, జె. చరణ్కుమార్, జి. వినయ్కుమార్, కె.నాగచైతన్య, కె.రాకేష్ వర్థన్, వై. రిషి వర్మ, ఎం.రాం చరణ్, బి.లోకేష్, పి.కార్తీక్, ఎస్. అర్షద్, టి.శ్రీకాంత్, ఎం, జశ్వంత్, బాలికల జట్టులో జి.హర్షిణి, ఎస్.నందమ్మ, కె. అమృత, ఎస్.పరియామ్మ, పి.నిధి, ఎస్డీ అర్షీయా, బి.శాంతిశ్రీ, ఎస్.విజ్ఞాత, బి. జయకేశి, బి.జస్మిత, జి.ఉషారాణి, కె. రాధీక, ఎస్. శ్రీలక్ష్మి ఉన్నారు. ఫెర్టిలైజర్ డీలర్ల అసోసియేషన్లో స్థానం ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గంలో జిల్లాకు ప్రాధాన్యత దక్కింది. అసోసియేషన్ కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు ఉపాధ్యక్షులుగా జిల్లాకు చెందిన పునుకొల్లు రాంబ్రహ్మం, సహాయ కార్యదర్శిగా రామడుగు మనోహర్, గౌరవ అధ్యక్షుడిగా బోడేపూడి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. విద్యార్థులకు అండగా నిలవండి● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర: వాసవీ క్లబ్ సభ్యులు తమ కుటుంబం, వ్యాపారాలు చూసుకుంటూనే సమాజ సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలుస్తుంటారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. వాసవీ వనితా క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం రాత్రి జరగగా భట్టి మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చేపడుతూనే నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడంతో పాటు గృహిణులు ఆర్థికాభివృద్ధి సాధించేలా వృత్తి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర కార్యక్రమాలతో విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్చింతకాని: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను చింతకాని గ్రామంలో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. చిన్నమండవ వద్ద మున్నేరు నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తుండగా రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడు మృతి కొణిజర్ల: మండలంలోని పల్లిపాడు సమీపాన రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడు మృతి చెందాడు. మండలంలోని లాలాపురం శివారుకు చెందిన షేక్ యాకూబ్ మియా(33) ద్విచక్రవాహనంపై వైరా వెళ్లి తిరిగి వస్తుండగా పల్లిపాడు సమీపాన గుబ్బగుర్తి వైపు నుంచి వ్యక్తి బైక్ను రోడ్డు పైనే నిలపడంతో ఢీకొన్నాడు. దీంతో యాకూబ్మియా రోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూరజ్ తెలిపారు. పోలీసుల అదుపులో మోటార్ల దొంగలు తిరుమలాయపాలెం: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల మహ్మాదాపురం, తిరుమలాయపాలెం, ఏలువారిగూడెం, బీరోలులో ఒక్కో మోటార్, జల్లెపల్లిలో రెండు మోటార్లను చోరీ చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని మోటార్లను రికవరీ చేసి రైతులకు అప్పగించారు. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. -
కేసీఆర్ విచారణ దుర్మార్గపు చర్య
● రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ● జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన ● ఖమ్మంలో తోపులాట.. విరిగిన సీఐ చేయిఖమ్మంవైరారోడ్: మాజీ సీఎం కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారించడం ప్రభుత్వ దుర్గారపు చర్య అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ విచారణను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలపగా ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్లో చేపట్టిన ధర్నాలో పువ్వాడ, నాయకులు పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పెనుగులాట జరగగా ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ అనేది పోలీసు అధికారులకే తప్ప సీఎం, మంత్రులకు సంబంధం ఉండదని తెలిసినా రేవంత్రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు, నాయకులు కర్నాటి కృష్ణ, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, జ్యోతిరెడ్డి, తోట రామారావు, బిక్కసాని జస్వంత్, బుడిగం శ్రీను, మాటేటి నాగేశ్వరరావు, పసుమర్తి రామ్మోహన్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఖమర్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సీఐ చేతికి ఫ్రాక్చర్, బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ఖమ్మంక్రైం: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలపగా... రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని నిలువరించేందుకు ఖమ్మం వన్టౌన్ సీఐ కరుణాకర్ సిబ్బంది ప్రయత్నించారు. ఈక్రమాన పోలీసులు – బీఆర్ఎస్ శ్రేణుల నడుమ తోపులాట జరగగా సీఐ కింద పడ్డారు. దీంతో ఆయన చేయి విరగగా ఆస్పత్రికి తరలించారు. కాగా, నగర ఏసీపీ రమణమూర్తి, అర్బన్ సీఐ భానుప్రకాష్ తదితరులు ఆస్పత్రికి వెళ్లి చికిత్సపై ఆరాతీశారు. కాగా, దిష్టిబొమ్మకు మంటలు ఆర్పే క్రమంలో టూటౌన్ సీఐ బాలకృష్ణ కూడా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నగర అధ్యక్షడు పగడాల నాగరాజుతోపాటు కోయిలపోంగు వెంకట్, కోయలపోంగు ఉపేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, నామవరపు ఈశ్వర్, మాటేటి కిరణ్, భూక్యా అశోక్పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అనంతరం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును టూ టౌన్ స్టేషన్కు తరలించగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెళ్లి ఆయనతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం గర్హనీయమని, నిర్బంధాలు ఎదురైనా భయపడేది లేదని తెలిపారు. -
భక్తి ప్రపత్తులతో నదీ హారతి
భద్రాచలం: భద్రాచలంలో గోదావరి మాతకు ఆదివారం భక్తిప్రపత్తులతో నదీ హారతి నిర్వహించారు. మాఘ(వ్యాస పూర్ణిమ)ను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులతో ప్రత్యేక భజన, భక్తి గీతాల కార్యక్రమం చేపట్టారు. గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం రామయ్యకు, గోదావరి నదికి హారతి సమర్పించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ – మనీషా దంపతులు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆలయంలో నిత్యాన్నదానానికి హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన డాక్టర్ ఎన్.కవిత రూ.లక్ష విరాళం అందజేశారు. కాగా, గత జనవరిలో స్వామివారిని 2,92,369 మంది భక్తులు దర్శించుకోగా, గతేడాది జనవరిలో 2,72,335 మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కాంగ్రెస్ విజయమే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్/సత్తుపల్లి/మధిర/వైరా: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం పార్లమెంటరీ ఇన్చార్జ్ కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపల్ నాయకులతో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఒకటి రెండు చోట్ల మినహా అన్ని వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలవడం మంచి పరిణామమని అన్నారు. పార్టీలో చీలికలు రాకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో అసమ్మతిదారుల నామినేషన్లు విత్ డ్రా చేయించడంలో నాయకులు విజయవంతం అయ్యారని అభినందించారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయనే అంశాన్ని గుర్తించాలని, ఇదే సమయాన ఓట్లు చీలితే పార్టీకి నష్టమని తెలిపారు. కాగా, ఏదులాపురం మున్సిపాలిటీలో రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాన్ని మంత్రి సురేఖ ఆవిష్కరించారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల సన్నాహక సమావేశంలో సత్తుపల్లిలో జరగగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పొరపొచ్చాలకు పోకుండా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేస్తూ రెండు మున్సిపాలిటీలను గెలుచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ రానున్న రెండేళ్లల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మధిర సమావేశంలో సురేఖ మాట్లాడుతూ మున్సిపాలిటీని గెలవడం ద్వారా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బహుమతి ఇవ్వాలని సూచించారు. వైరాలో మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారు టికెట్ రాలేదని బాధపడకుండా అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈసమావేశాల్లో రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా, ఖమ్మం నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్ చౌదరి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, వైరా మార్కెట్ చైర్మన్ బోళ్ల గంగారావు, నాయకులు మద్దినేని బేబి స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్రెడ్డి, గాదె చెన్నారావు, ఎండీ.కమల్పాషా, చల్లగుళ్ల నర్సింహారావు, వి.వెంకటేశ్వరరావు, పి.చందర్రావు, సాయి, సందీప్గౌడ్, సూరంశెట్టి కిషోర్, మిరియాల రమణగుప్తా, తూమాటి నవీన్రెడ్డి, బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, సూతకాని జైపాల్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శీలం వెంకటనర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ !
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం పార్లమెంటరీ ఇన్చార్జి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు కష్టపడితే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కై వసం చేసుకోవడం సులువవుతుందని తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హామీలు అమలు చేస్తున్నాం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు కాగా, పేదలకు ఇళ్లు, రేషన్కార్డులు కూడా ఇవ్వలేదని మంత్రి సురేఖ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వాన తమ ప్రభుత్వం మాత్రం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రూ.500 బోనస్తో ధాన్యం కొనుగోలు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, సన్న బియ్యం పంపిణీతో ప్రజలకు మేలు చేస్తోందని తెలిపారు. కాగా, గెలుపు గుర్రాలు, ప్రజల్లో గుర్తింపు ఉండి, పార్టీ గౌరవాన్ని పెంచే వారికే మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫామ్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఒకే వార్డులో ఆశావహులు ఎక్కువగా ఉంటే నాయకులు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావా లని, రెబల్స్ లేకుండా చూడాలని సూచించారు. మాట వినని పక్షంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సాధారణంగా నెల పాటు జరిగే ఎన్నికల ప్రక్రియను తక్కువ సమయంలోనే పూర్తి కానుందని, మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెట్టే సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సర్పంచ్లు, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ వారు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వేగంగా చేరతాయనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నాయకులు కొత్తా సీతరాములు, వేజెండ్ల సాయికుమార్, మొక్కా శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పేరు లేదు.. ఊరు లేదు!
బడ్జెట్పై ఎవరేం అన్నారంటే..దేశవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో బాలికల హాస్టళ్లను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు హాస్టళ్లు ఏర్పాటుకానున్నాయి. అలాగే, ఎరువుల తయారీ శాతాన్ని పెంచడంతో జిల్లా రైతులకు లబ్ధి జరగనుంది. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ఏళ్ల నాటి కలగా కొనసాగుతోంది. కొత్తగూడెంలో ఓ స్థలాన్ని ఎంపిక చేయగా, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించి ఇక్కడ ఏర్పాటు అసాధ్యమని తేల్చారు. ఫలితంగా జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ స్థలాలను సైతం గుర్తించింది. కానీ కేంద్ర బడ్జెట్లో కొత్త ఎయిర్పోర్ట్ల ప్రస్తావన లేకపోవడంతో అడుగు ముందుకు పడడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెల్ఫోన్ చిప్ల తయారీలో కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతకు కేంద్రం బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కారిడార్ను ప్రకటించగా అందులో ఒడిశా – ఏపీ – తమిళనాడు – కర్ణాటకలకు స్థానం దక్కింది. కానీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతలో కీలకంగా నిలిచే సింగరేణి గనులు ఉన్న తెలంగాణకు మాత్రం చోటివ్వలేదు. ఇదే లక్ష్యంతో కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఫలితం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. -
● ‘ఉపాధి’కి పెంపు
వ్యవసాయ పనులు లేనప్పుడు కూలీలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్లో నిధులు పెంచారు. ఖమ్మం జిల్లాలో 3.05లక్షల జాబ్ కార్డులు, 6.29లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో యాక్టివ్ జాబ్ కార్డులు 1.75 లక్షలకు గాను 2.88 లక్షల మంది యాక్టివ్ కూలీలు కొనసాగుతున్నారు. భద్రాద్రి జిల్లాలో 2.23 లక్షల జాబ్ కార్డులు, 4.58 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో యాక్టివ్ జాబ్ కార్డులు 1.35 లక్షలు ఉండగా, 2.29 లక్షల మంది కూలీలు యాక్టివ్గా కొనసాగుతున్నారు. పథకానికి బడ్జెట్లో నిధులు పెంచినట్లు తెలుస్తున్నా స్పష్టత రావాల్సి ఉంది. -
దక్కేది ఎవరెవరికో?!
● కాంగ్రెస్ అభ్యర్థులకు నేడు బీ ఫామ్ల పంపిణీ ● రెబల్స్ను బుజ్జగించే పనిలో అభ్యర్థులు, కీలక నేతలు ● ఉపసంహరణే లక్ష్యంగా చర్చలుఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 117 వార్డు స్ఢానాలకు గాను 768 మంది అభ్యర్థులు 779 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఆదివారం ఎనిమిది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఏడుగురు విత్ డ్రా చేసుకోగా, వీరిలో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇక కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యాన రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక, బీ–ఫామ్ల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు బీ–ఫామ్లను సోమవారం అందిస్తామని మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ ప్రకటించంచడంతో అభ్యర్థులెవరో తేలనుంది. వ్యూహాత్మక అడుగులు పార్టీ ప్రకటించిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండేలా అసంతృప్తులను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా రెబల్స్ను దారికి తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎవరైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి నామినేషన్ వెనక్కి తీసుకుంటారో వారికి భవిష్యత్లో ప్రాధాన్యత ఉంటుందనే హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ నుండి బీ–ఫామ్ వస్తుందని సంకేతాలు ఉన్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే, మరో పక్క అసమ్మతివాదులను కలుపునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సమయం లేదు మిత్రమా... ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 9వ తేదీ సాయంత్రానికి ప్రచారం ముగించాలి. కానీ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎక్కడా ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. రెబల్స్ను బుజ్జగించడంపై అటు నేతలు, ఇటు అభ్యర్థులు దృష్టి సారించడంతో ప్రచారంపై ఇంకా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సోమ, మంగళవారం మధ్యాహ్నంకల్లా ఈ ప్రక్రియ ముగించి ఆతర్వాత ప్రచార రంగంలో దూసుకెళ్లాలనే భావనతో ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అయినప్పటికీ ప్రచారానికి ఆరు రోజులకు మించి సమయం లేని కారణంగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థులకు సోమవారం బీ–ఫామ్లు ఇవ్వనుండగా, అందులో ఎదురుదెబ్బ తిన్న బలమైన నేతలకు బీ ఫామ్ ఇవ్వాలనే యోచనలో మిగతా పార్టీల నేతలు ఉన్నట్లు సమాచారం. దీంతో మంగళవారం కల్లా అన్నిచోట్ల పార్టీల వారీగా అభ్యర్థులెవరో తేలుతుందని చెబుతున్నారు.జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనడం కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. అధికార పార్టీ కావడంతో కౌన్సిలర్లుగా పోటీకి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా వైరా మున్సిపాలిటీలో 20వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 92 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. ఇక మధిరలో 22 వార్డులకు 86, ఏదులాపురంలో 32 వార్డులు ఉండగా 82, సత్తుపల్లిలో 23 వార్డులు ఉండగా 50, కల్లూరులో 20 వార్డులకు 64 మంది నామినేషన్లు వేశారు. ఇందులో వార్డులో ఒక్కొక్కరికే బీ ఫామ్ ఇవ్వనుండగా.. మిగతా వారిని బుజ్జగించడంపై నేతలు దృష్టి సారించారు. -
● నిధులు ప్రకటించినా...
ఇప్పటికే ప్రకటించిన రైల్వే లైన్లు పూర్తి చేసేందుకు భారీగా నిధులు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించారు. అయితే, ఏ లైన్కు ఎంత మొత్తంలో నిధులు ఇస్తారో తేలాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన మల్కన్గిరి – భద్రా చలం, మణుగూరు – రామగుండం, కొవ్వూరు – భద్రాచలం రోడ్డు, కిరండోల్ – కొత్తగూడెం లైన్లను ఏళ్ల క్రితం ప్రకటించినా రాష్ట్ర పరిధిలో ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీంతో ఈ లైన్లు పూర్తయ్యేలా నిధులు కేటాయిస్తారా, గతంలో మాదిరిగానే నామమాత్రపు నిధులతో సరిపెడతారా అన్నది తేలాల్సి ఉంది. వీటితోపాటు డోర్నకల్ – భద్రాచలం రోడ్డు డబ్లింగ్ లైన్పైనా స్పష్టత రాలేదు. -
పకడ్బందీగా పరీక్షలు
సన్నద్ధత ఇలా.. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెలలో జరగనుండగా, విద్యా సంవత్సరానికి సంబంధించి అక్టోబర్, నవంబర్ నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. తద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం సులువవుతోంది. గత ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 71.15 శాతం ఫలితాలు సాధించగా.. ద్వితీయ సంవత్సరం 77.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడనున్నాయి. తల్లిదండ్రులతో సమావేశాలు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడమే కాక అవసరమైన పుస్తకాలు అందిస్తోంది. అంతేకాక విద్యార్థులకు అందుతున్న బోధన, వారి మార్కులను తల్లిదండ్రులకు తెలియజేసేలా పేరెంట్ కమ్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాం. విద్యార్థుల లోటుపాట్లను తెలియజేయడంతోపాటు వారిని ప్రోత్సహించేలా తల్లిదండ్రులకు అధ్యాపకులు సూచనలు చేస్తున్నారు. ఇది కూడా ఫలితాల మెరుగపడడానికి దోహదపడనుంది. ప్రాక్టికల్స్కు నిధులు జిల్లాలోని ఒక్కో ప్రభుత్వ కళాశాలలో సైన్స్ల్యాబ్కు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ.50 వేలు కేటాయించింది. తద్వారా ఎలాంటి ఇక్కట్లు లేకుండా ప్రాక్టీస్ చేయడం, పరీక్షలు రాయడం సులువు కానుంది. వార్షిక పరీక్షలకు సంబంధించి కూడా వివిధ శాఖల అదికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాం. వాట్సాప్కు హాల్టికెట్లు.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్బోర్డు ఈ ఏడాది విద్యార్థుల సెల్కు మెసేజ్ పంపిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. సీసీ కెమెరాల నిఘా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో ల్యాబ్లో ఒక్కో కెమెరా ఉంటుంది. థియరీ పరీక్షల సమయాన ప్రశ్నపత్రం బండిల్ తెరిచే గదిలోనే కాక ప్రధాన ప్రాంతాల్లో కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఏమైనా సమస్యలు తలెత్తితే నేరుగా ఉన్నతాధికారులే జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చి పరిష్కరిస్తారు. నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నేలకొండపల్లి: ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 67 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా ఇందులో జనరల్ కేంద్రాలు 57, ఒకేషనల్ కేంద్రాలు పది ఉన్నాయి. కాగా, మొత్తం 17,047 విద్యార్థుల్లో 13,007మంది(ఎంపీసీ 10,265 మంది, బైపీసీ 2,742 మంది)తో పాటు ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,858 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 132 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తంగా 35,188 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,467 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,721 మంది ఉన్నారు. వీరి కోసం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చేనెల 2 నుంచి 21 వరకు రెండు సెషన్లలో జరగన్నాయి. మొత్తంగా 13,007 మంది విద్యార్థులు ఉండగా.. ఇందులో 10,265 మంది ఎంపీసీ, 2,742 మంది బైపీసీ విద్యార్థులు ఉన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు గాను 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె.రవిబాబు వెల్లడించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 2(సోమవారం) నుంచి 11 వరకు, థియరీ పరీక్షలు 25నుంచి మార్చి 13వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షల నిర్వహణ, కేంద్రాల్లో ఏర్పాట్లు, విద్యార్థుల సన్నద్ధత తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. డీఐఈఓ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే... -
సాంస్కృతిక వైభవం.. బొగ్గుట్ట
ఇల్లెందురూరల్: పరిశ్రమల కేంద్రమంటే పాల్వంచ, మణుగూరు, ఆధ్యాత్మిక వైభోగం చూడాలంటే భద్రాచలం వెళ్లాల్సిందే. అలాగే జిల్లా సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవాలంటే ఇల్లెందును పరికించాల్సిందే.. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇల్లెందు జిల్లాలో సాంస్కృతిక వారసత్వానికి చిరునామాగా.. మైలురాయిగా నిలుస్తోంది. మినీ మేడారం.. వనదేవతలు కొలువుదీరిన ప్రాంతం మేడారం. అమ్మవార్ల శక్తి అక్కడే ఆవహించి ఉంటుందన్న విశ్వాసంతో భక్తులు ప్రతి రెండేళ్లకోమారు జాతరకు వెళ్లి పూజ చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ, ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన వనదేవతలకు ఆరు దశాబ్దాల కిందట స్థానిక ఆదివాసీలు గద్దెలు నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. మేడారంతో పాటుగా వనదేవతల శక్తి బొజ్జాయిగూడెంలోనే ఆవహించిందన్న నమ్మకంతో క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది. నేడు బొజ్జాయిగూడం వనదేవతల మహాజాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భజన బృందాలకు అంకురార్పణ బొగ్గు వెలికితీత జరిగిన తొలినాళ్లలో కార్మికులు దట్టమైన అడవిలో బొగ్గు బావుల వద్దే నివాసం ఉండేవారు. క్రూర మృగాల బారి నుంచి రక్షణ, మానసికోల్లాసం రాత్రి వేళలో దేవుడిని స్మరించుకుంటూ వారు ఆలపించిన కీర్తనలు వారిలో కొత్త ఆలోచనకు ఆజ్యం పోశాయి. ఈ క్రమంలోనే తొలిసారిగా నంబర్–2 బస్తీలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో శ్రీకృష్ణ భజన బృందం ఏర్పాటైంది. రాత్రి వేళలో వారంతా భగవంతుడిని స్మరిస్తూ భజన చేయడం ప్రారంభించారు. వారి స్తూర్తితో ఇతర కార్మిక వాడల్లోనూ హనుమాన్, శ్రీరామ పేరుతో భజన బృందాలు ఏర్పడ్డాయి. ఇవి సంస్థతోపాటే సింగరేణివ్యాప్తంగా విస్తరించాయి. వైభవంగా దసరా ఉత్సవాలు దసరా ఉత్సవాలంటే ఉమ్మడి జిల్లావాసులకు గుర్తుకొచ్చేది ఇల్లెందు. కర్ణాటకలోని మైసూర్ తరహాలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. నాడు బ్రిటీష్ పాలకులు విడిది చేసే ప్రాంతంలోనే జమ్మి చెట్టు ఉండేది. కార్మిక వాడల్లోని భజన బృందాల నేతృత్వంలో దేవతల ప్రతిమలను కావడిలో మోస్తూ జమ్మి మైదానానికి తీసుకొచ్చేవారు. అక్కడ సామూహిక భజనతో జమ్మి పూజ ఘనంగా నిర్వహించేవారు. ఇలా వేడుకను వందేళ్లకుపైగా కావడి, రథాల సహాయంతో చేపట్టారు. నేడు నూతన హంగులతో ఆధునికతను మేళవించి సరికొత్తగా కొనసాగిస్తున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇల్లెందుకు వస్తుంటారు. గణనాథునికి ఘన స్వాగతం ప్రతీ చోట వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. కానీ, ఆ ఉత్సవాలను భిన్నంగా, హంగు ఆర్భాటాలతో నిర్వహించడం బొగ్గుట్ట ప్రత్యేకత. నాలుగు దశాబ్దాల కిందట ప్రత్యేకంగా కమిటీలు ఏర్పడి పోటీపోటీగా భారీ సెట్టింగులతో వినాయకచవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించేవారు. ఇల్లెందులోని పలు ప్రాంతాల్లో భారీ సెట్టింగులతో కూడిన మండపాలను తిలకించేందుకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చేవారు. ప్రత్యేక ఏర్పాట్లు, పూజలు చేసి గణనాథులను సాగనంపడం నేటికీ ఆనవాయితీగా వస్తోంది. మేడారం తరహాలో వనదేవతల జాతర నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా.. మత సామరస్యానికి ప్రతీకగా మండలంలోని హజరత్ నాగుల్మీరా దర్గాహ్ మౌలా చాన్ చిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడ నిర్వహించే ఉర్సు ఉత్సవాల వైభవంతో దర్గా పేరు దశదిశలా విస్తరించింది. ఒకప్పుడు గ్రామస్థాయి ఉత్సవంగా మొదలైన వేడుకలు ఇప్పుడు రాష్ట్రస్థాయికి చేరుకున్నాయి. ఆలయాలు, గుడులు, మసీదులు, దర్గాలు ఇలా మతపరమైన ప్రార్థనా స్థలాలంటే కోరికలు తీర్చే కేంద్రాలు, మహిమలు చూపే మందిరాలు మాత్రమే కాదని రకరకాల ఒత్తిడులతో చిత్తవుతున్న నేటి తరం మనుషులకు ప్రశాంతతను అందించే ప్రదేశమనే విధంగా నాగుల్మీరా దర్గా పేరు తెచ్చుకుంటోంది. -
జంతు సంక్షేమం అందరి బాధ్యత
ఖమ్మంఅర్బన్: ‘జంతువుల పట్ల కరుణ చూపడం మానవత్వానికి నిదర్శనం. జంతు సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతతో పాటు సమాజం మొత్తం తీసుకోవాల్సిన బాధ్యత’అని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి డా.పురంధర్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని టేకులపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన జంతు సంక్షేమ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జంతువులు మాట్లాడలేని జీవులని, వాటి ఆరోగ్యం, సంరక్షణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీధి జంతువుల సమస్యలు, జంతువులపై జరుగుతున్న అమానుష దాడులు, కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జంతువులకు ఆహారం, నీరు అందించడం వంటి చిన్న చర్యలే పెద్ద మార్పునకు దారి తీస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా, విద్యార్థులకు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, పాకబండ పశువైద్యాధికారి కె.క్రాంతికుమార్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ టి.కృష్ణ, వెటర్నరీ అసిస్టెంట్ మణిదీప్ పాల్గొన్నారు. -
ఐ మార్క్ ఫొటోగ్రఫీలో అవార్డులు
ఖమ్మంగాంధీచౌక్/ఖమ్మంమామిళ్లగూడెం: ఐ మార్క్ ఫొటోగ్రఫీ విభాగంలో తెలుగురాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు. జిల్లాకు చెందిన ఫొటోగ్రఫీ నిపుణుడు జగన్ ఆధ్వర్యంలో ఏపీలోని అల్లూరి జిల్లా మోతుగూడెంలో గత నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఫొటోగ్రఫీ స్పాట్ కాంపిటీషన్ వర్క్షాప్ నిర్వహించి, శనివారం విజేతలకు అవార్డులు అందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది ఫొటోగ్రాఫర్లు తలపడగా.. జిల్లా నుంచి ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రతినిధి మారగాని వెంకట్, కోశాధికారి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో జిల్లాకు చెందిన 16 మంది ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు. అందులో సతీశ్రెడ్డి తీసిన ఫొటోకు సైతం అవార్డు వచ్చింది. కార్యక్రమంలో బీకే అగర్వాల్, క్లిక్ అండ్ క్లిక్ శ్రీను పాల్గొన్నారు. జాతీయ మహిళా క్రికెట్ విజేత ఉత్తరాఖండ్ ఖమ్మంస్పోర్ట్స్: వారం రోజులుగా ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన జాతీయస్థాయి ఇన్విటేషన్ టీ–20 మహిళా క్రికెట్ టోర్నీ శనివారం ముగిసింది. విజేతగా ఉత్తరాఖండ్ జట్టు నిలువగా రన్నరప్గా ఉత్తరప్రదేశ్ జట్టు నిలింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తరాఖండ్ జట్టు పరిమిత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు 18.1 ఓవర్లు ఆడి 90 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఎండీ ఫర్హా, డాక్టర్ ఎంజీవీ ప్రవీణ్కుమార్, కురువెల్ల ప్రవీణ్కుమార్, రాయల సతీశ్, సందీప్ఆర్య,ఎండీ మతిన్, జానీపాషా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో సత్తా ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ కేటగిరిల్లో జిల్లా క్రీడాకారులు ఏడుగురు పతకాలు సాధించగా ఇద్దరు క్రీడాకారులు ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు పుణెలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారుల్లో శ్రీఆద్య, యువాస్రెడ్డి, వినూత్న, దీక్షిత్రెడ్డి, భరత్, హమీద్, మోక్షచంద్రశేఖర్ ఉండగా.. జాతీయస్థాయి పోటీలకు మనోజ్ఞ, దీక్షిత ఎంపికయ్యారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కోచ్ భవ్య క్రీడాకారులను అభినందించారు. -
సమగ్ర సవరణను పటిష్టంగా నిర్వహించాలి
ఖమ్మంసహకారనగర్ : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని, ఓటరు జాబితాలో ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పెండింగ్ ఫారం 6, 6ఏ, 7, 8లను త్వరగా పరిష్కరించాలన్నారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎస్డీసీ రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎం.ఏ.రాజు, డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
ఏఈఓల నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మంసహకారనగర్: టీఎన్జీవోస్ అనుబంధంగా తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీ ఏఈఓ)ల జిల్లా నూతన కార్యవర్గం శనివారం ఏకగ్రీమైంది. టీఎన్జీవోస్ ఫంక్షన్హాల్లో జరిగిన ఎన్నికలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దినేని రాధాకృష్ణమూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించి, ఫలితాలు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎండీ జానీబాబా, కార్యదర్శిగా యు.శివకృష్ణ, అసోసియేట్ అధ్యక్షులుగా కె.శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వర్లు, ఎం.ఆదర్శ్, కోశాధికారిగా బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా దీపక్రెడ్డి, సాయికుమార్, కె.ప్రతిభ, కల్చరల్ సెక్రటరిగా కె.నరేశ్, స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరిగా గురుమూర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శివకుమార్, సభ్యులుగా సైదులు, హరికృష్ణ, నాగసాయి, వాసంతి, అవినాష్ ఎన్నికయ్యారన్నారు. ఈ కమిటీ మూడు నెలల పాటు కొనసాగుతుంది. నూతన కమిటీని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు అభినందించారు. కార్యక్రమంలో జైపాల్, విజయ్కుమార్, దీలిప్ పాల్గొన్నారు. -
సాగర్ కాల్వ రెగ్యులేటర్ గేట్కు మరమ్మతులు
ఖమ్మంఅర్బన్: సాగర్ ప్రధాన కాల్వలోని 14వ కిలోమీటర్ వద్ద వీవీపాలెం సమీపంలోని రెగ్యులేటర్ షట్టర్ దెబ్బతినగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈఎన్సీ రమేష్ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య పర్యవేక్షణలో డీఈ ఉదయ్ప్రతాప్, ఏఈ సతీష్ దగ్గరుండి మరమ్మతు పనులు పరిశీలిస్తున్నారు. నీరు వృథా కాకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రెగ్యులేటర్ షట్టర్ను పూర్తిస్థాయిలో సరిచేసేందుకు అవసరమైన సాంకేతిక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. -
గాయపడిన వ్యక్తి మృతి
కల్లూరురూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని లింగాల గ్రామానికి చెందిన మేకల రమేశ్ (43) లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత నెల 14వ తేదీన గ్రామంలోని తన ఇంటికి ఎదురుగా రోడ్డు పక్కనే నిలుచుని ఉండగా అతివేగంగా వచ్చిన కారు రమేశ్ను ఢీకొట్టింది. బలమైన గాయాలు కావటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఇప్పటికే ఈ ఘటనపై కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దెందుకూరు గోడౌన్లలో ఆకస్మిక తనిఖీమధిర: మండలంలోని దెందుకూరు గ్రామంలోని గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లలో నిల్వ ఉన్న సన్న బియ్యం నాణ్యత, నిల్వ పరిమాణాన్ని పరిశీలించారు. రక్షణ ఏర్పాట్లు, గోదాముల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే ఆహార ధాన్యాలు ప్రజలకు చేరే వరకు నాణ్యతలో లోపం లేకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ముదిగొండ: మండలంలోని గంధసిరి మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లతోపాటు పెద్దమండవ మున్నేరు నుంచి తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను శనివారం సీఐ మురళి ఆదేశాల మేరకు ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో సువర్ణాపురం, న్యూలక్ష్మీపురం గ్రామాల సమీపంలో పట్టుకున్నారు. ఎనిమిది ఇసుక ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించి, ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి తెలిపారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల అందజేత ముదిగొండ: వివిధ కారణాలతో సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారు ఇటీవల ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం సీఐ మురళి ఆదేశాలతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కనిపెట్టి ఐదుగురు బాధితులకు సెల్ఫోన్లను అందజేశారు. వాటి విలువ రూ.90 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య తిరుమలాయపాలెం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి గడ్డిమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బచ్చోడుతండాకు చెందిన గుగులోత్ పాండు (43) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండగా కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం చేను వద్ద గడ్డి మందు సేవించాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిగుస్తున్న ఈడీ ఉచ్చు..!
సత్తుపల్లి/పెనుబల్లి: సైబర్, ఆర్థిక నేరాల కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అప్పజెప్పినట్లు సమాచారం. జనవరి 11న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ వీఎం బంజర్ పోలీస్స్టేషన్లో ప్రకటించిన విధంగానే కేసులను బదిలీ చేసినట్లు తెలిసింది. అంతర్జాతీయస్థాయి హవాలా, మనీ లాండరింగ్ రూపంలో సైబర్ ఆర్థిక నేరాలు విచారణలో బయటపడుతుండటం.. రూ.వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరగడంతో కేంద్ర విచారణ సంస్థలు రంగంలో దిగినట్లు తెలిసింది. ఆస్ట్రేలియా, కంబోడియా, మయన్మార్ దేశాలతో పాటు పలు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్లతో రూ.కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్కు బెయిల్ వచ్చింది. మరో 18 మంది నిందితులు జైలు జీవితం గడుపుతున్నారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు మోరంపూడి చెన్నకేశవరావు, ఉడతనేని వికాస్చౌదరి పరారీలో ఉన్నారు. పోట్రు మనోజ్కల్యాణ్ విచారణలో.. సైబర్ ఆర్థిక నేరాల్లో ప్రధాన నిందితుల్లో ఒకరు, సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్కల్యాణ్ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. రూ.547 కోట్లు కాస్తా రూ.వెయ్యి కోట్లు దాటి అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలియటం.. మరికొందరు నిందితుల పేర్లు వెలుగులోకి రావటంతో కేసు మలుపుతిరిగింది. సత్తుపల్లి పట్టణానికి చెందిన బొప్పన నాగప్రసాద్ కీలక సూత్రదారిగా మనోజ్కల్యాణ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వటంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్, క్రిప్టో కరెన్సీ, హవాలా, మనీలాండరింగ్పై బొప్పన నాగప్రసాద్ సహకారంతోనే ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు విచారణలో పోలీసులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మరికొందరు సైబర్ క్రైమ్ నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పోలీసు కస్టడీకి నిందితులు.. సైబర్ క్రైమ్లో ప్రధాన నిందితులైన పోట్రు మనోజ్కల్యాణ్, బొప్పన నాగప్రసాద్లతో పాటు మరికొందరిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ తీవ్రత దృష్ట్యా వివరాలు బయటికి వెల్లడించలేమని పోలీసులు చెబుతున్నారు. పోలీసు విచారణ తీవ్రతరం కావటం.. మరో వైపు ఈడీ రంగ ప్రవేశంతో సైబర్ క్రైమ్కు సహకరించిన వారిలో టెన్షన్ నెలకొంది. బయట ఉన్న ప్రధాన నిందితులు ఇతర దేశాలకు పరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు దుబాయ్, ఇతర దేశాల్లో తలదాచుకున్నారని సమాచారం. కస్టడీకి సైబర్ నిందితులు ఖమ్మంక్రైం: ఆన్లైన్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మంచి సుమారు రూ.18 లక్షలు దండుకున్న కేసుల్లో ఇద్దరు వ్యక్తులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం సీపీ సునీల్దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలోని వైజాగ్కు చెందిన ఉమాశంకర్, హేమలత ఖమ్మం జిల్లాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు గడించవచ్చని ఆశ చూపి విడతలవారీగా రూ.18 లక్షలు చోరీ చేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి విచారించగా.. ఉమాశంకర్, హేమలత బ్యాంక్ ఖాతాలకు వెళ్లినట్లు తేలింది. దీంతో వైజాగ్కు వెళ్లి వారిద్దరిని అరెస్ట్ చేశారని సీపీ వివరించారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, సీఐ నరేశ్, ఎస్ఐలు రంజిత్కుమార్, విజయ్కుమార్, కానిస్టేబుళ్లు భానుమూర్తి, కిషన్రావు, కృష్ణప్రసాద్, అఫ్సనాను సీపీ అభినందించారు. -
రోల్మోడల్గా తీర్చిదిద్దుతా
ఖమ్మంరూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, భోజనం చేసేప్పుటు ఒకటి రెండు మెతుకులు జారిపడినట్టు.. ఒకటి, రెండు సీట్లు అటూఇటు అయినా మున్సిపాలిటీని కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 25వ వార్డుల్లో శనివారం ఆయన విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేళ్లలో ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 డివిజన్లలో రూ.19.74 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, సెంట్రర్ లైటింగ్ పనులు చేపట్టామని అన్నారు. మున్నేరు వరద బాధితుల శాశ్వత పరిష్కారానికి రూ.680 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీకి కొత్త హంగులతో రాష్ట్రానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి పునరుద్ఘాటించారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా ఎఫ్సీఐ గోడౌన్ను ఇక్కడి నుంచి తరలించే బాధ్యత తనదేనని చెప్పారు. ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలను చెప్పే వారిని నమ్మొద్దని, అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో అభ్యర్థులు వెలుగు సైదమ్మ,, వేమిరెడ్డి శివదేవి, బోయిన కుమారి, కడవ నవీన్కుమార్, బాణోత్ భాస్కర్, నాగేంద్రప్రసాద్, బాణోత్ దివ్య, పూల్చంద్, నాయకులు బాణోత్ కిషోర్, తోట వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ విచారణ
కొణిజర్ల: మండలంలోని బోడియాతండా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై డీఈఓ చైతన్యజైనీ శనివారం విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో వాడిన పదార్థాలు, గుడ్లు తదితర వివరాలపై ఆరా తీశారు. డీఈఓతో పాటు విచారణ అధికారులుగా తహసీల్దార్ నారపోగు అరుణ, తల్లాడ ఎంఈఓ దామోదర ప్రసాద్ వ్యవహరించారు. విచారణ నివేదికను విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, కలెక్టర్కు అందించనున్నట్లు డీఈఓ తెలిపారు. కాగా, భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో హెచ్ఎం మురళీకృష్ణ తప్పు లేదని, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని స్థానికులు కలెక్టర్ అనుదీప్ను కోరినట్లు తెలిసింది. -
ఊరట కలిగేనా ?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా ఉమ్మడి జిల్లా వాసులు కేంద్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏ బడ్జెట్లోనూ జిల్లాకు ప్రత్యేక ప్రయోజనాలేమీ ఒనగూరడం లేదు. ప్రధానంగా రైల్వే సమస్యలపై ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం పెడచెవిన పెడుతోందనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లా పురోభివృద్ధిలో కీలకమైన పరిశ్రమలకు రాయితీల్లో కేంద్రం ముందుకు రావడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆదాయ పన్ను మినహాయింపుల్లో ఈసారి మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. నేడు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ అంశాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ ఉమ్మడి జిల్లా వాసుల్లో నెలకొంది. కొత్తగూడెం – కొవ్వూరు ఎప్పటికయ్యేనో..? కొత్తగూడెం(భద్రాచలం రోడ్) – కొవ్వూరు రైల్వే లైన్ ఏళ్ల క్రితమే మంజూరైనా కేంద్రం దీనిపై దృష్టి సారించడం లేదు. భద్రాచలం రోడ్ నుంచి సత్తుపల్లి వరకు 56 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. సత్తుపల్లి నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు దాదాపు 95 కిలోమీటర్ల లైన్ పూర్తి కావాల్సి ఉన్నా.. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడంతో జాప్యం జరుగుతోంది. ఈసారైనా నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. పరిశ్రమల మనుగడకు.. గ్రానైట్ పరిశ్రమకు జిల్లా పుట్టినిల్లుగా ఉంది. అయి తే ఇప్పుడు మాత్రం సంక్షోభం దిశలో పయనిస్తోంది. గతంలో దాదాపు 400 గ్రానైట్ పరిశ్రమలుండగా.. ఇప్పుడా సంఖ్య 100కు తగ్గింది. ప్రభు త్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో వ్యాపారులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రాయితీలు లేకపోవడంతో పరిశ్రమల నిర్వహణ సవాల్గా మారింది. దీంతో పాటు జిల్లా పురోభివృద్ధికి వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం కృషి చేయాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. బొగ్గు బ్లాక్లు సింగరేణికే దక్కాలి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో సింగరేణి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం అనేక బొగ్గు బ్లాక్లను ప్రభుత్వం వేలం వేస్తుండగా.. వీటిని ప్రైవేట్ సంస్థలకు కాకుండా సింగరేణికే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. ఆదాయపన్నుపై ఊహాగానాలు.. ఆదాయ పన్ను మినహాయింపులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వేతన జీవులకు స్టాండర్డ్ డిడెక్షన్తో కలిపి రూ.12.75 లక్షల వరకు పన్ను లేదు. దీన్ని రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పెంచుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 8 రకాల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా 30 శాతం స్లాబ్ పరిమితి పెంపు, భార్యాభర్తల ఆదాయంపై జాయింట్ ట్యాక్సేషన్ వంటి కీలక నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. గృహ రుణాల వడ్డీపై కనీసం రూ.2 లక్షల వరకు మినహాయింపు తదితర మార్పులు ఉంటాయని తెలుస్తోంది.ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు జంక్షన్గా ఉన్న ఖమ్మంలో పలు రైళ్లు ఆగడం లేదు. వ్యాపార, వాణిజ్య రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఖమ్మం నుంచి నిత్యం వేలాది మంది ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ పలు రైళ్లు ఆగకపోవడంతో విజయవాడ లేదా వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. ఇక ప్రధానంగా కేరళ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగడం లేదు. దీంతో శబరిమల, తిరుపతి వెళ్లే భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమైన అన్ని రైళ్లనూ ఖమ్మంలో ఆపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.రైల్వే సమస్యలను పట్టించుకోని కేంద్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం చూపాలి. పలు అవరోధాలతో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదు. భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పునఃపరిశీలించాలి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పాండురంగాపురం – భద్రాచలం రైల్వే మార్గాన్ని చేపట్టాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాల నివేదిక కోసం ప్రత్యేక ఏజెన్సీకి బాద్యతలు అప్పగించాలి. – రామసహాయం రఘురాంరెడ్డి, ఎంపీ, ఖమ్మం -
సమరానికే సై!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : పుర పోరు బరిలో తగ్గేదేలే అన్నట్టుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ సమరానికి సై అంటున్నాయి. ఒంటరిగా గెలుస్తామనుకున్న చోట కాంగ్రెస్ బరిలోకి దిగుతుండగా.. అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు బీఆర్ఎస్ పొత్తుల అస్త్రాలతో కదులుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 3తో ముగియనుండగా.. ఎవరు ఏ దారిలో వెళ్తున్నారనేది ఇప్పటికే తేలింది. ఉపసంహరణల నాటికి అటుఇటుగా మార్పులు జరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సీపీఐ చెరోదారి పట్టాయి. రెండు పార్టీల మధ్య పొత్తుకు బ్రేక్ పడడంతో ఒంటరిపోరు ఖాయమైంది. అక్కడ తలోదారి.. కొత్తగూడెం కార్పొరేషన్పై అధికార కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. కార్పొరేషన్గా ఏర్పాటైన అనంతరం తొలి ఎన్నికలు కావడంతో పాలకవర్గాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదిపింది. ఇక్కడ సీపీఐతో కలిసి కాంగ్రెస్ పోటీకి దిగుతుందని ముందునుంచి జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది. పొత్తులు కుదరకపోవడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. కాంగ్రెస్ తరఫున ఆశావహులు అన్ని డివిజన్లకు నామినేషన్లు వేశారు. సీపీఐ కూడా బలమున్న చోట నామినేషన్లు వేసింది. ఇక బీఆర్ఎస్, సీపీఎం ఇక్కడ కలిసి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలూ కొలిక్కి రాలేదు. చివరకు బీఆర్ఎస్ ఒంటరిగా బరిలో నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. పొత్తుల కోసం బీఆర్ఎస్ చర్చలు.. ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్.. సీపీఎం, సీపీఐ, బీసీ సంఘాల జేఏసీతో చర్చలు కొనసాగిస్తోంది. నేడో రేపో చర్చలు కొలిక్కి రానున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మధిరలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు ఖరారైంది. సత్తుపల్లి, కల్లూరు, వైరా మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్, సీపీఎం కలిసి పోటీకి దిగాయి. ఏదులాపురంలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తుతో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఒంటరి పోరుకు సై అంటోంది. ఈ మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందో తేలనుంది. ఇక అశ్వారావుపేటలో కాంగ్రెస్ – సీపీఎం కలిసి ముందుకు సాగుతున్నాయి. మధిర, వైరాలో ప్రతిష్టంభన.. మధిర, వైరా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రూపుల వారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక నేతలు పోటీకి సై అంటూ తమ అనుయాయులతో నామినేషన్లు వేయించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఇలా ఉండగా.. సీపీఐతో పొత్తుల అంశంపై ఏకాభిప్రాయానికి రాలేదు. పొత్తు ఉంటుందా లేదా అన్నది తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయే అనే అభిప్రాయం రెండు పార్టీల శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నామినేషన్ల ఉపసంహరణల నాటికి ఈ రెండు మున్సిపాలిటీల్లో పొత్తుపై స్పష్టత రానుంది.ఏదులాపురం, సత్తుపల్లి, ఇల్లెందు, కల్లూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తోంది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పలు దఫాలుగా చేయించుకున్న సర్వేల్లో మెజార్టీ వార్డులు దక్కుతాయన్న రిపోర్టు రావడంతో ఆ దిశగా సొంత బలంతో పోటీలో నిలుస్తున్నట్లు సమాచారం. మొత్తంగా మిగితా పార్టీలతో పొత్తుల చర్చలు కూడా చేయకుండా తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. ఉపసంహరణల నాటికి బీ ఫారాలు కూడా అందనుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇక పలు వార్డుల నుంచి కొంతమంది ఆశావహులు రెబల్స్గా నామినేషన్లు వేశారు. వీరిని బుజ్జగించేందుకు ముఖ్య నేతలు ఈ రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ పెట్టుకున్నారు.కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ చెరో దారి -
ప్రాధాన్యతా పనులపై దృష్టి పెట్టండి
ఖమ్మం సహకారనగర్ : ప్రభుత్వ ప్రాధాన్యతా పనులపై దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరె న్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ తో కలిసి శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలో మెప్మా కార్యకలాపాలు చేపట్టాలని, ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. జమలాపురం పర్యాటక అభివృద్ధి పనుల్లో చైన్ లింక్ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయని, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంలో వేగం పెంచాలని అన్నారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని, స్కూళ్ల నమూనా, ఖర్చు వివరా లతో ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. మధిర, సిరిపురం, బనిగండ్లపాడులోని డిగ్రీ, జూనియర్ కళాశాల భవనాలను త్వరగా నిర్మించాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు చైతన్య జైనీ, శ్రీనివాసాచారి, నవీన్ బాబు, సుమన్ చక్రవర్తి, మంజుల, శ్రీరామ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫుట్పాత్లు నడిచేందుకు సౌకర్యంగా ఉండాలి ఖమ్మంమయూరిసెంటర్: నగరంలో ఆధునిక మౌలిక వసతులతో పాటు ప్రజలు నడిచేందుకు వీలుగా ఫుట్పాత్లు నిర్మించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించారు. ఫుట్పాత్ ల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. పిల్లలు, వికలాంగులు, వృద్ధులు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచేలా నిర్మించాలన్నారు. నగరంలో తొలిసారిగా గ్రానైట్ రాళ్లతో ఫుట్పాత్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. లైట్ గ్రే రంగు గ్రానైట్ రాళ్లు ఆకర్షణీయంగా ఉండడమే కాక వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ యాకూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
జమలాపురంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని, శ్రీ అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీవారి పాదానికి పంచామృతాభిషేకం గావించారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. నామినేషన్లన్నీ ఓకే..ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో ఎన్నికలు జరిగే ఐదు మున్సిపాలిటీల పరిధిలో దాఖలైన నామినేషన్లను శనివారం పరిశీలించారు. మొత్తం 117 వార్డులకు గాను 776 మంది అభ్యర్థులు 922 నామినేషన్లు దాఖలు చేయగా ఒక్కటి కూడా తిరస్కరణకు గురి కాలేదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. వీటిపై వచ్చిన అభ్యంతరాలను ఈనెల 2న పరిష్కరించనుండగా, 3వ తేదీన ఉపసంహరణల అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలికూసుమంచి: రైతులు వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి. పుల్లయ్య సూచించారు. శనివారం ఆయన కూసుమంచిలోని మన గ్రోమోర్ సెంటర్, జక్కేపల్లి సొసైటీలో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులతో మాట్లాడారు. యాప్ విధానం సులభంగా ఉందని, యూరియా పంపిణీలో గత ఇబ్బందులు ఇప్పుడు లేవని రైతులు చెప్పారు. అనంతరం కూసుమంచిలో వరి పొలాలను పరిశీలించి చీడపీడల ఉధృతి నివారణకు సస్యరక్షణ చర్యలను వివరించారు. వరిలో వాతావరణ మార్పులతో వచ్చే అగ్గి తెగులు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు. ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలిఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఈ నెల 2 నుంచి 11 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ కె.రవిబాబు అన్నారు. నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో శనివారం నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 67 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహిస్తున్నామని, జనరల్ సైన్స్కు 13,007 మంది, వృత్తి విద్యా కోర్సుకు ప్రథమ సంవత్సరంలో 2,182, ద్వితీయ సంవత్సరంలో 1,858 మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ బాధ్యులు విజయకుమారి, సయ్యద్ యూసఫ్, ప్రవీణ్కుమార్, హై పవర్ కమిటీ బాధ్యులు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. 7న నవోదయ ప్రవేశ పరీక్షకూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 7న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో నవోద య వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి పరీక్ష రాసే వారికి కూసుమంచి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, 11వ తరగతి ప్రవేశ పరీక్ష రాసే వారికి పాలేరులోని నవోదయలో కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 11.15 నుంచి మద్యాహ్నం 1.45 గంటల వరకు ఉంటాయని, విద్యార్థులు ఉదయం 10.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. -
పరిశుభ్రమైన నగరంగా అభివృద్ధి చేస్తాం
ఖమ్మంఅర్బన్ : ఖమ్మం నగరాన్ని శుభ్రమైన, సకల సౌకర్యాలు గల నగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 6, 7 డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అమృత్ పథకం కింద రూ.200 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) కింద రూ.250 కోట్లు మంజూరు చేసి నగర మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కొత్తగా విలీనమైన పంచాయతీల్లో రహదారులు, డ్రెయిన్లు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. గోశాల ప్రాంతానికి వెళ్లే రహదారిని విస్తరిస్తామన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఖమ్మాన్ని ముందంజలో నిలిపామని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా త్వరలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యం మెరుగ్గా ఉండడంతో ఇతర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు ఖమ్మంలో స్థిరపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహారావు, మేయర్ నీరజ, తహసీల్దార్ సైదులు, పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, దొంగల సత్యనారాయణ, కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
విద్యావంతుల నిలయం
● పాలేరు ‘నవోదయ’కు నేటితో 38ఏళ్లు ● 6నుంచి 12వ తరగతి సీబీఎస్ఈ విధానంలో బోధన ● ఉన్నతస్థానాలకు చేరిన పలువురు పూర్వవిద్యార్థులుకూసుమంచి: జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ నిలుస్తోంది. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి విద్యాలయ కీర్తిని చాటుతున్నారు. ఈవిద్యాలయం ఏర్పడి 38 ఏళ్లు పూర్తికాగా.. సీటు దక్కించుకుంటే చాలు విద్యార్థుల భవితకు అండగా నిలుస్తోంది. దీంతో నవోదయలో సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. గ్రామీణప్రాంత విద్యార్థులకు వరం గ్రామీణప్రాంతాల విద్యార్థులను నాణ్యమైన విద్యనందించేలా జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నవోదయ విద్యాలయాలను ప్రకటించారు. ఈమేరకు 1986లో పాలేరు రిజర్వాయర్ సమీపంలో సుమారు 27 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విద్యాలయాన్ని స్థాపించగా 1988 జనవరి 30న నాటి చిన్న నీటి పారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి భవనాలను ప్రారంభించారు. ఇందులో సీబీఎస్ఈ విధానంలో 6నుంచి 12వ తరగతి వరకు బోధన జరుగుతుండగా, ఏటా ఆరో తరగతిలోలోకి పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో ఒకేరీతిన జరుగుతుంది. ఇక్కడి విద్యావిధానం, క్రమశిక్షణ, వసతులు విద్యార్థి జీవితాలను మలుపు తిప్పేలా ఉండడంతో నవోదయ విద్యాలయం విద్యార్థులకు దేవాలయంగా విలసిల్లుతోంది. అంతేకాక జాతీయ సమైక్యత పెంపు, త్రిభాషా సూత్రాన్ని పక్కాగా అమలు చేయడంలో కీలకంగా నిలుస్తోంది. ఉన్నత స్థానాలకు ఎదుగుతూ.. పాలేరు నవోదయ విద్యాలయలో చదివిన ఎందరో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులు, విద్యాలయ గర్వపడే స్థాయికి చేరారు. పూర్వ విద్యార్థుల్లో శ్రీలక్ష్మి, పాపయ్య, వినయ్కుమార్, గాంధీ తదితరులు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. ఇంకా పలువురు వైద్యులుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉన్నత స్థాయికి చేరారు. ఆల్ రౌండర్లుగా విద్యార్థులు... నవోదయ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలు, కళలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో రాణిస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పతకాలు సాధించారు. అంతేకాక పాలేరు నవోదయ కూడా జాతీయస్థాయి పోటీలకు వేదికగా నిలిచింది. ఏటా ప్రతీ డిసెంబర్ళో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తుండగా పలువురు హాజరై నేటి విద్యార్థుల దిక్సూచిలా నిలుస్తున్నారు.పాలేరు నవోదయ విద్యాలయలో చదివిన ఎందరో ఉన్నతులుగా ఎదిగారు. ఉద్యోగాల పరంగానే కాకుండా సామాజిక, సేవా రంగాల్లో ముందు నిలుస్తున్నారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి వారి భవితకు బంగారు బాటలు వేయడమే నవోదయ లక్ష్యం. ఆ దిశగా పాలేరు విద్యాలయను ముందు వరుసలో నిలిపేలా కృషి చేస్తున్నాం. – కె.శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ -
●62ఏళ్ల పాలనకు సాక్ష్యం
కల్లూరులో అరవై ఏళ్ల స్థానిక పాలనకు ప్రస్తుత మున్సిపల్ కార్యాలయ భవనం సాక్ష్యంగా నిలుస్తోంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన రెండేళ్లకు 1962లో కల్లూరులో గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ భవనాన్ని 1964లో అప్పటి జెడ్పీ చైర్మన్ జలగం వెంగళరావు ప్రారంభించారు. మొదట ఏడు వార్డులతో మొదలైన పంచాయతీ 18వార్డులకు విస్తరించి 17వేల జనాభా, 12వేల ఓటర్లతో రాష్ట్రంలోనే పెద్ద పంచాయతీగా కొనసాగింది. ఇలా 62 ఏళ్ల నుంచి చిన్నపాటి మరమ్మతులు తప్ప భవనం పటిష్టంగా ఉండడంతో మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినప్పటికీ ఇదే భవనంలో కార్యాలయం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కల్లూరు మున్సిపాలిటీ 20 వార్డుల్లో 18,886 ఓటర్లు ఉండగా తొలి పాలకవర్గం ఎన్నిక జరగనుంది. – కల్లూరురూరల్ -
నోటిఫైడ్ టు కార్పొరేషన్
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. కానీ చెప్పుకోదగిన అభివృద్ధి మాత్రం జరగలేదు. ప్రజలకు సదుపాయాలు, సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నాలుగుసార్లు ము న్సిపల్ ఎన్నికలు జరిగి, పాలకవర్గాలు కొలువుదీరినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు. కౌన్సిలర్లే కాంట్రాక్టర్లుగా మారి, పనులు నాణ్యత లేకుండా చేపట్టడంతోపాటు అవినీతి, అక్రమాలతో పాలన సాగిందనే ఆరోపణలు వచ్చాయి. 1971లో ఏర్పాటు కొత్తగూడేన్ని 1971లో నోటిఫైడ్ ఏరియాగా గుర్తించారు. 1988లో నోటిఫైడ్ ఏరియా కమిటీ నియమించారు. అందులో చైర్మన్, కమిటీ సభ్యులు ఉండే వారు. కమిటీ నిర్ణయాల మేరకు అధికారులు అభివృద్ధి పనులు నిర్వహించేవారు. 1995లో మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది. 2000లో 25 వార్డులకు తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో గరీబ్పేట పంచాయతీలో ఉన్న చిట్టి రామవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు. 2005లో రెండోసారి ఎన్నికలు జరిగాయి. మూడోసారి 2014 సంవత్సరంలో పెరిగిన ఓట్లకు అనుగుణంగా వార్డుల సంఖ్యను 33కు పెంచి ఎన్నికలు నిర్వహించారు. అనంతరం నాలుగోసారి 2020 సంవత్సరంలో 36 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పాల్వంచ, సుజాతనగర్ను కలిపి.. గతేడాది కొత్తగూడెం మున్సిపాలిటీలో పాల్వంచ మున్సిపాలిటీతో పాటు సుజాతనగర్ను విలీనం చేస్తూ కార్పొరేషన్గాఏర్పాటుచేశారు. ప్రస్తుతం కా ర్పొరేషన్కు తొలి ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్లో విలీనమైన పాల్వంచలో కూడా మూడు దశాబ్దాల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో సందడి నెలకొంది.మారుతూ వచ్చిన కొత్తగూడెం స్వరూపం -
ముగిసిన కీలక పర్వం
● ఐదు మున్సిపాలిటీల్లో 923 నామినేషన్లు దాఖలు ● నేడు పరిశీలించనున్న అధికారులుసాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లాలోని ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీల్లో చివరి రోజు 603నామినేషన్లు దాఖలవడం గమనార్హం. సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారిని అనుమతించారు. ఐదు మున్సిపాలిటీల్లోని 117వార్డులకు మూడు రోజుల్లో కలిపి మొత్తంగా 923 నామినేషన్లు అందగా, వీటిని అధికారులు శనివారం పరిశీలిస్తారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు వచ్చేనెల 3వరకు గడువు ఉంది. చివరి రోజు జోరు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తెల్లారి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మూడు రోజుల సమయమే ఇవ్వడంతో తొలిరోజైన బుధవారం నామమాత్రంగానే దాఖలయ్యాయి. రెండో రోజు నామినేషన్లు సంఖ్య పెరగగా, చివరి రోజైన శుక్రవారం నామినేషన్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అభ్యర్థులు, వారి అనుచరులతో నామినేషన్ కేంద్రాల పరిసరాలు కిటకిటలాడాయి. కేంద్రాలకు పలువురు డప్పుచప్పుళ్లు, నృత్యాలతో ర్యాలీగా వచ్చారు. కాగా, ఐదు మున్సిపాలిటీలకు గాను అత్యధికంగా వైరాలో 190నామినేషన్లు దాఖలు కాగా, సత్తుపల్లిలో 155 నామినేషన్లే అందాయి. అయితే, ఉపసంహరణల గడువు ముగిశాక వీరిలో ఎందరు బరిలో నిలిచారన్నది తేలనుంది. -
యాప్ ద్వారా యూరియా కొనుగోలు సులభం
కొణిజర్ల: రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా రైతులు యూరియా కొనుగోలు చేయడం సులభమవుతుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. కొణిజర్ల సొసైటీ కార్యాలయంలో యూరియా నిల్వలను శుక్రవారం పరిశీలించిన ఆయన స్థానిక డీలర్ల వద్ద యాప్ ద్వారా అమ్మకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రైతుల సమయం వృథా కాకుండా యాప్లో బుక్ చేసుకున్న 24 గంటల్లో ఎంపిక చేసుకున్న చోట యూరియా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఏడీఏ కరుణశ్రీ, ఏఓ బాలాజీ, సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల్లో రూ.5.72 లక్షల వసూళ్లు సత్తుపల్లిటౌన్: ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీల ఖజానాకు కాసులు సమకూరుతున్నాయి. నామినేషన్ దాఖలు చేసే సమయాన అభ్యర్థులే కాక ప్రతిపాదకులు సైతం ఆస్తి, నల్లా పన్ను బకాయి లేనట్టుగా ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీంతో వారంతా బకాయిలు చెల్లించడానికి ముందుకు రావడంతో సత్తుపల్లి, మధిర, కల్లూరు, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే పన్నులు వసూలయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సత్తుపల్లిలో 120మందికి పైగా పన్నులు చెల్లించారు. దీంతో మున్సిపాలిటీకి మూడురోజుల్లో రూ.5.72 లక్షల పన్నులు వసూలు కావడం విశేషం. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ ఖమ్మం లీగల్/మధిర: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మంలో శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం బార్ అసోసియేషన్లోని 990 మందికి గాను 887 మంది న్యాయవాదులు ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 10–30 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఎన్నికల అధికారిగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు వ్యవహరించారు. అలాగే, మధిర కోర్టులో 40 మంది న్యాయవాదులకు గాను 39 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియను న్యాయమూర్తి దీప్తి వేముల పర్యవేక్షించారు. విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ఉద్యోగుల, కార్మిక సంఘాల అభ్యర్ధనతో పాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని విద్యుత్ అధికారులకు మౌఖిక ఆదేశాలు చేశాయి. ప్రస్తుత స్థానంలో జనవరి 1నాటికి రెండేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మందిని బదిలీ చేసేలా ఈనెల 21న షెడ్యూల్ విడుదల చేశారు. ఈమేరకు అర్హుల జాబితా విడుదల చేయగా పలువురు దరఖాస్తు చేసుకోవడంతో 31వ తేదీన ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడం, కాలపరిమితిని రెండేళ్లకు తగ్గించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగడం, మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతుండడంతో ప్రక్రియను నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. -
కాంగి‘రేసు’లో.. రెబల్స్
● టికెట్ దక్కని ఆశావహుల నామినేషన్లు ● జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అదే పరిస్థితి ● బుజ్జగించేందుకు రంగంలోకి నేతలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీల వారీగా బరిలో ఉండే అభ్యర్థులెవరో ఓ స్పష్టత వచ్చింది. ఈక్రమాన టికెట్ ఆశించి నిరాశకు గురైన పలువురు రెబల్స్గా నామినేషన్లు వేశారు. జిల్లాలోని ఏదులాపురం, వైరా, మధిర, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ప్రధానంగా కాంగ్రెస్లో ఈ బెడద ఉంది. వీరికి నచ్చజెప్పేందుకు ముఖ్యనేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాకేం తక్కువ? మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులు ఎవరన్నది తేల్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగైదు సార్లు సర్వే చేయించింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అన్ని వార్డులో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా సర్వేల్లో అగ్రస్థానాన నిలిచిన వారినే అభ్యర్థులుగా ప్రకటించింది. ఫలితంగా టికెట్ దక్కని ఆశావహులు చివరి వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్లు వేశారు. దీంతో ఐదు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్కు రెబల్స్ బెడద తప్పేలా లేదు. సర్వేలో సరైన నివేదిక రాకపోయినా తామేం తక్కువ కాదంటూ టికెట్ దక్కని ఆశావహులు పోటీకి దిగడంతో వీరిని బుజ్జగించడం పార్టీ నేతలకు తలకు మించిన భారంలా మారనుంది. ఈ నాలుగు రోజులు కీలకం నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 3వరకు గడువు ఉంది. అప్పటిలోగా రెబల్స్ను బుజ్జగించి బరి నుంచి తప్పించాల్సి ఉంటుంది. అయితే, కొందరు రెబల్స్ నామినేషన్ వేసింది మొదలు ప్రచారం కూడా ప్రారంభించారు. దీంతో పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు కునుకు కరువైంది. రెబల్స్ను పోటీ నుంచి తప్పించాలంటూ ముఖ్య నేతలను వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థికి బీ ఫామ్ ఇవ్వడం.. మిగతా వారిని బరిలో లేకుండా చూడడం నేతలకు కత్తి మీద సాములా మారనుంది. ఈనేపథ్యాన మున్సిపాలిటీల వారీగా రంగంలోకి దిగిన ముఖ్య నేతలు, మరో మూడేళ్లు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంటుందని.. ఇతర పదవులు ఇస్తామనే ప్రతిపాదనలతో రెబల్స్ను శాంతపర్చడంపై దృష్టి సారించారు. -
●ఏం జరుగుతోంది ?
నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థుల కుటుంబీకులే కాకుండా బంధువులు, అనుచరులతో ర్యాలీగా కేంద్రాల వద్దకు వచ్చారు. నిర్ణీత దూరంలోనే అందరినీ నిలిపివేసి అభ్యర్థి, ప్రతిపాదకులనే లోనకు పంపించారు. ఇలా వెళ్లిన అభ్యర్థి వచ్చేవరకు సత్తుపల్లిలోని కార్యాలయం వద్ద అనుచరులు వేచి ఉండగా.. అటుగా వెళ్తున్న ఓ మహిళకు విషయం తెలియక తన వాహనాన్ని ఆపి ఆసక్తిగా ఆరా తీయడం కనిపించింది.ఆలసించిన ఆశాభంగమే.. మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అంతకు ఐదు నిమిషాల ముందు సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారులు ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని ‘మరో ఐదు నిమిషాల్లో గడువు ముగుస్తోంది.. ఆశావాహులు ఉంటే వెంటనే రావాలి’ అని మైక్ ద్వారా ప్రకటించారు. సరిగ్గా 5గంటలు కాగానే గేట్లు మూసేసి లోపల ఉన్న వారి నామినేషన్లు మాత్రం స్వీకరించారు. -
కుష్ఠు వ్యాధి రహిత సమాజమే ధ్యేయం
ఖమ్మంవైద్యవిభాగం: కుష్ఠు వ్యాధి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జాతిపిత మార్గంలో నడవడమే ఆయనకు ఇచ్చే నివాళి అని తెలిపారు. కుష్ఠు రోగులకు ఎదురవుతున్న వివక్ష, వారి సమస్యలను గుర్తించి గాంధీ సేవలందించారని చెప్పారు. ఈమేరకు బాధితులపై ఎవరు కూడా వివక్ష చూపొద్దని సూచించారు. కాగా, మందులతో పూర్తిగా నయమయ్యే ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స ఉంటుందని, శరీరంపై మొద్దుబారిన మచ్చలు ఉన్న వారు ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇటీవల గుర్తించిన 74 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ అంశంపై ప్రచార కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13వరకు నిర్వహించనుండగా, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్ఓ రామారావు, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, అధికారులు చందునాయక్, వేణుమనోహర్, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
వేసవికి ముందస్తు సిద్ధం
● నీటి సరఫరాలో అంతరాయాల గుర్తింపునకు డ్రైవ్ ● రేపటి నుంచి 20రోజుల పాటు కొనసాగనున్న సమగ్ర సర్వే ఖమ్మంఅర్బన్: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముంద స్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ఉపయోగిస్తున్న పైపులైన్లు, మోటార్లు, చేతి పంపులు, ఓవర్హెడ్ ట్యాంకులు, బావులను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టేలా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు హ్యాబిటేషన్లు వారీగా పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. ఇందులో భాగంగా ప్రతీ తాగునీటి పథకాన్ని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నివేదిక సిద్ధం చేయనుండగా.. తక్షణ మరమ్మతుల కోసం నిధులు మంజూరు అవుతాయని చెబుతున్నారు. 20రోజుల పాటు సర్వే జిల్లాలోని అన్ని ఆవాసాల్లో ఫిబ్రవరి 1(ఆదివారం) నుంచి నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రతీ గ్రామంలో తాగునీటి వనరుల స్థితిగతులు, పనిచేయని పథకాలు, లీకేజీలు, మోటార్ల పరిస్థితి, పైపులైన్ లోపాలను గుర్తిస్తారు. ఆతర్వాత అవసరమైన మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నారు. నాలుగింటిపై ప్రత్యేక దృష్టి ప్రస్తుతం తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న నాలుగు ఆవాసాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నీటి వనరులకు అత్యవసరంగా మరమ్మతు చేపట్టడమే కాక, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించారు. అలాగే, 20రోజుల పాటు చేపట్టే ప్రత్యేక డ్రైవ్లో గుర్తించే లోపాలను సరిచేయడం ద్వారా రానున్న వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి ఎదురుకాకుండా చూస్తామని యంత్రాంగం చెబుతోంది.జిల్లాలో తాగునీటి సరఫరా, సమస్యలపై పూర్తి స్థాయిలో సర్వే చేయనున్నారు. తద్వారా లోపాలపై స్పష్టత రానుండగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఈ సర్వే ఆదివారం నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటాం. – పుష్పలత, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ -
హాస్టల్ నుంచి వెళ్లి విగతజీవిగా..
ఖమ్మంమయూరిసెంటర్: మూడు రోజుల క్రితం వసతిగృహం నుంచి వెళ్లిన విద్యార్థి సాగర్ కాల్వలో మృతదేహమై తేలాడు. ఖమ్మం ఎస్సీ డీడీ బాలుర(సీ) వసతిగృహంలో ఉంటూ ఎన్నెస్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పస్తం సంజయ్కుమార్(17) మృతదేహాన్ని శుక్రవారం యూపీహెచ్ కాల నీ వద్ద ఎన్నెస్పీ కాల్వలో గుర్తించారు. ఖమ్మం అర్బ న్ పోలీసులు చేరుకుని అన్నం శ్రీనివాసరావు బృందం సహకారంతో బయటకు తీసి మార్చురీకి తరలించారు. అప్పటికే విద్యార్థి అదృశ్యమైన కేసు నమోదై ఉండడంతో హాస్టల్ ఉద్యోగులు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకుని సంజయ్కుమార్ మృతదేహం గుర్తించారు. సోదరుడితో ఘర్షణ ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంకు చెందిన పస్తం సాగర్–రమ్య కుమారుడు సంజయ్కుమార్ తన సోదరుడితో కలిసి ఎన్నెస్పీ క్యాంపులోని హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం సంజయ్కుమార్, ఆయన సోదరుడు ఘర్షణ పడగా వర్కర్లు, విద్యార్థులు ఆపారు. ఆతర్వాత సంజయ్ సోదరుడు హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో భయంతో సంజయ్ కూడా బయటకు వెళ్లాడు. అయితే, ఆయన సోదరుడు తిరిగి వచ్చినా సంజయ్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి గాలిస్తున్నారు. ఇంతలోనే శుక్రవారం ఎన్నెస్పీ కాల్వలో మృతదేహమై కనిపించడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతదేహం వద్దకు వచ్చిన తల్లి రమ్య తన కుమారుడిదేనని గుర్తించగానే కుప్పకూలడంతో ఆస్పత్రిలో చికిత్స అందించారు. రూ.3 లక్షలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. ఈమేరకు అధికారులు సంజయ్ కుటుంబానికి రూ.3లక్షల పరిహారం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఘటనపై ప్రభుత్వానికి లేఖ రాశామని, ఏదైనా సాయం అందితే కూడా అందజేస్తామని ఆర్డీఓ నరసింహరావు, ఎస్సీ డీడీ గుడికందుల జ్యోతి తెలిపారు. సీపీఐ నాయకుడు బాగం హేమంతరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు ఇటికాల రామకృష్ణ, సీహెచ్.ప్రవీణ్, గోకినేపల్లి మస్తాన్, మందా సురేష్, అశోక్ తదితరులు పాల్గొనగా ఆస్పత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నెస్పీ కాల్వలో మృతదేహమై తేలిన విద్యార్థి -
మహిళా క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్
ఖమ్మం స్పోర్ట్స్: భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిచాక మహిళా క్రికెట్ర్లకు మరింత ఆదరణ పెరిగిందని.. ఇందులో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఇందిరాగాంధీ ఐదోజాతీయ సీనియర్ మహిళా టీ–20 క్రికెట్ టోర్నీ కొనసాగుతుండగా ఎంపీ శుక్రవారం క్రీడాకారులకు పౌష్టికాహారం కిట్లు అందజేసి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఎంపీ కాసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. అలాగే, స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులను పరిశీలించారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్తో పాటు ఎంజీవీ.ప్రవీణ్కుమార్, కొప్పుల చంద్రశేఖర్, తుమ్మా అప్పిరెడ్డి, టోర్నీ నిర్వాహకులు ఎం.డీ.మతిన్, జానీపాషా తదితరులు పాల్గొన్నారు. ఫైనల్స్కు చేరిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ టీ–20 క్రికెట్ టోర్నీలో భాగంగా శుక్రవారం సెమీస్ నిర్వహించారు. తొలిమ్యాచ్లో ఉత్తరప్రదేశ్– విదర్భ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తరప్రదేశ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు అనంతరం బ్యాటింగ్కు దిగిన విదర్భ జట్టు 128 పరుగులే చేయడంతో ఓటమి పాలవగా ఉత్తరప్రదేశ్ జట్టు ఫైనల్స్కు చేరింది. రెండో సెమీస్లో ఉత్తరఖాండ్ – ఢిల్లీ జట్లు తలపడగా ఉత్తరఖాండ్ జట్టు ఘనవిజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఈ జట్టులో సాక్షి వాగ్మోడే 56 బంతుల్లో 106 పరుగులు చేసింది. కాగా, శనివారం ఉదయం ఫైనల్స్ నిర్వహించనున్నారు.ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి -
ప్రచారం హోరెత్తేలా!
హామీలు నెరవేర్చే బాధ్యత నాదే..శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నామినేషన్ల పర్వం ముగియడం, అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రావడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల్లు దాఖలు చేసినప్పటి నుంచే కొందరు అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. షెడ్యూల్ రాకముందు, వచ్చాక డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వివిధ మున్సిపాలిటీల్లో పార్టీల నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. నామినేషన్లతోనే షురూ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల నాయకులు గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొన్నివార్డుల్లో తొలి రోజే కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ తదితర పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో వారు నామినేషన్ వేయగానే ప్రచారం మొదలుపెట్టారు. వార్డుల్లో ఇంటింటికీ వెళ్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే, ఫొటోలతో ప్రచార సామగ్రిని ముద్రించినా, గుర్తులు వస్తే వాటిని కూడా జోడించేందుకు సిద్ధమవుతున్నారు. రంగంలోకి ప్రధాన నేతలు పట్టణాల్లో పార్టీల ప్రతిష్టకు మున్సిపల్ ఎన్నికలు గీటురాయిగా నిలవనున్నాయి. ఈనేపథ్యాన ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో గెలుపును కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రచారంలో ప్రధాన నేతలు కూడా భాగస్వాములు కానున్నారు. ఎన్నికల దృష్ట్యా ఇటీవల ఏదులాపురం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని ఎన్నికలపై పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖమ్మంలో పర్యటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారానికి హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రచారం చేయనున్నారు. పది రోజులు.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11వ తేదీన జరగనుండగా, 9వ తేదీ సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశముంది. ఈ పది రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునేలా అభ్యర్థులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే, బీఆర్ఎస్ అభ్యర్థులు స్థానిక సమస్యలపై దృష్టి సారించారు. మరోపక్క బీఆర్ఎస్తో జత కట్టిన సీపీఎం కూడా ప్రచారంలో పాలు పంచుకుంటోంది. అంతేకాక బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అభ్యర్థులంతా ఇంటింటి ప్రచారంతో పాటు కూడళ్లల్లో సమావేశాలు నిర్వహిస్తుండడంతో మున్సిపాలిటీల్లో సందడి వాతావరణం నెలకొంది.నిర్మాణ సంస్థ బాధ్యులతో మంత్రి తుమ్మల సమీక్షమున్సిపాలిటీల్లో ఇప్పుడిప్పుడే మైక్ల మోత జోరందుకుంటోంది. రెండు, మూడురోజులుగా ఇంటింటి ప్రచారంపైనే దృష్టి సారించిన అభ్యర్థులు ఇప్పుడు తమ పార్టీ ప్రత్యేకతలు, వ్యక్తిగత గుణగణాలతో రూపొందించిన పాటలతో మైక్ల ద్వారా ప్రచారాన్ని మొదలుపెట్టారు. అనుచరులతో కలిసి వార్డుల్లో పర్యటిస్తూ ఈసారి తమను గెలిపిస్తే చేయనున్న అభివృద్ధి పనులు, పరిష్కరించే సమస్యలపై హామీలు ఇస్తున్నారు. ఇదంతా కొన్నిచోట్లే జరుగుతుండగా, శనివారం నుంచి మరింత హోరెత్తనుంది.ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల కార్యాచరణ -
కలెక్టరేట్లో మీడియా సెంటర్
ఖమ్మం సహకారనగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన కలెక్టరేట్లో మీడియా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ సెంటర్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి గురువారం ప్రారంభించి మాట్లాడుతూ అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై ఈ కేంద్రం ద్వారా పరిశీలన ఉంటుందని తెలిపారు. అంతేకాక మీడియాలో ప్రచార అనుమతులకు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీని సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీపీఆర్వో ఎం.ఏ.గౌస్, ఉద్యోగులు కె.ప్రవల్లిక, నవీన్, హరీష్, సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మంరూరల్: ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఏదులాపురం మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన అన్ని పత్రాలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతీ నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించాలని, అభ్యర్థులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని చెప్పారు. అలాగే, అభ్యర్థులు విధిగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మున్వర్అలీ, తహసీల్దార్ పి.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు కాసుల పంట
భద్రాచలం : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి హుండీల రూపంలో కాసుల పంట పండింది. డిసెంబర్, జనవరిలో సెలవులు రావడం, ముక్కోటి ఏకాదశి తోడు కావడంతో భక్తులతో ఆలయం కళకళలాడింది. వారు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా 70 రోజులకు గాను రూ.2,31,31,984 ఆదాయం నమోదైంది. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఈఓ దామోదర్రావు సమక్షంలో కానుకలను లెక్కించారు. ఈమేరకు నగదుతో పాటు 56 గ్రాముల బంగారం, 1,400 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ కూడా లభించిందని ఈఓ వెల్లడించారు.70 రోజులకు రూ.2.30 కోట్ల రాబడి -
పొత్తులు.. ఎత్తులు
జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో పార్టీల నడుమ పొత్తులపై గందరగోళం కొనసాగుతోంది. కొన్నిచోట్ల చర్చలు జరుగుతుండగా.. మరికొన్నిచోట్ల ఒంటరిగానే బరిలోకి దిగేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కొన్ని మున్సిపాలిటీలకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదులాపురం, వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఈ పార్టీల నడుమ చర్చలు తుది దశకు చేరగా.. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగనుందని ప్రకటించింది. ఇక బీఆర్ఎస్, సీపీఎం మాత్రం కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం జోరుగా చర్చలు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగియనుంది. దీంతో చర్చల్లో జోరు పెంచగా.. కాంగ్రెస్–సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ఎటూ తేలడం లేదని సమాచారం. మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు సంకేతాలు ఇస్తున్నా.. పొత్తులు మాత్రం ఖరారు కాలేదు. ఏదులాపురం, వైరా, మధిరలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల కసరత్తు తుది దశకు చేరింది. సత్తుపల్లిలోని 23, కల్లూరులోని 20 వార్డుల్లో మాత్రం చర్చలు తెగకపోవడంతో కాంగ్రెస్ ఒంటరిగానే అన్ని వార్డుల్లో పోటీకి దిగాలని నిర్ణయించింది. కొన్నిచోట్ల సానుకూలం ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా.. ఇప్పటికే 25 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరో నాలుగు వార్డులకు అభ్యర్థులను ప్రకటించకున్నా ఆశావహులతో నామినేషన్లు దాఖలు చేయించింది. ఒకవేళ పొత్తు ఉంటే కాంగ్రెస్ 25 స్థానాల్లో, సీపీఐ ఏడు స్థానాల్లో బరిలో దిగుతుందని తెలుస్తోంది. పొత్తు కుదరకపోతే కాంగ్రెస్ అన్ని స్థానాలకు పోటీ చేయనుండగా.. సీపీఐ మాత్రం బలంగా ఉన్న 15–18 స్థానాల్లో బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ – సీపీఐ కలిసే పోటీ చేయనున్నాయి. అయితే, ఇక్కడ 20 వార్డులకు గాను సీట్ల కేటాయింపు కొలిక్కిరాలేదు. ఇక మధిరలోనూ కాంగ్రెస్– సీపీఐ మధ్య పొత్తు చర్చల దశలోనే ఉంది. కలిసే ఎన్నికలకు.. జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్–సీపీఎం సమన్వయంతో పోటీ చేశాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసే కొనసాగాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 23 స్థానాల్లో, సీపీఎం తొమ్మిది స్థానాల్లో పోటీకి అంగీకరించాయి. సత్తుపల్లిలో 23 వార్డులకు గాను ఒక వార్డు సీపీఎంకు కేటాయించారు. మిగిలిన వార్డుల్లో బీఆర్ఎస్ పోటీచేయనుంది. కల్లూరులో సీపీఎం– బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరినా సీపీఎంకు ఒక్క వార్డు కూడా కేటాయించలేదు. కూటమి విజయం సాధిస్తే సీపీఎంకు కోఆప్షన్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇక వైరాలో బీఆర్ఎస్ – సీపీఎం కలిసి పోటీ చేస్తున్నా ఎవరెవరికి ఏ వార్డు అనేది ఖరారు కాలేదు. మధిరలో 22 వార్డులకు గాను మూడు వార్డులను సీపీఎంకు కేటాయించారు. మిగిలిన చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలుస్తారు.పార్టీలకు స్థానికంగా ఉన్న బలాల ఆధారంగానే సీట్ల కేటాయిస్తున్నారు. బీఆర్ఎస్ స్థానికంగా ఉన్న ఓటు బ్యాంక్ను దృష్టిలో పెట్టుకుని సీపీఎంతో ముందుకు సాగుతోంది. మున్సిపాలిటీ స్థాయిలో పొత్తు ఖరారైనప్పటికీ వార్డుల కేటాయింపులో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వార్డుల్లో ఆయా పార్టీకి ఓటు బ్యాంక్ ఉంటేనే స్థానాన్ని కేటాయిస్తున్నారు. పార్టీల బలాబలాల అంచనా కోసం నేతలు అంతర్గత సర్వే కూడా చేయించినట్లు సమాచారం.పార్టీల మధ్య ఎడతెగని చర్చలు -
ఇకపై బుక్ చేస్తేనే యూరియా
● జిల్లాలో మొదలైన ప్రక్రియ ● పలు ప్రాంతాల్లో రైతులకు పంపిణీ ఖమ్మంవ్యవసాయం: యూరియా విక్రయాల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం రూపొందించిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అమల్లోకి వచ్చింది. యాప్ ద్వారా జిల్లాలో యూరియా విక్రయాలను గురువారం ప్రారంభించారు. భూమి సర్వే నంబర్, సాగు చేస్తున్న పంట వివరాలు నమోదు చేస్తే అందుకు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేసేలా యాప్ను రూపొందించారు. గడిచిన వానాకాలం సీజన్లో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈనేపథ్యాన యూరియా పక్కదారి పట్టకుండా చూడడంతో పాటు సరిపడా మాత్రమే కొనుగోలు చేసేలా యాప్ను డిసెంబర్ 28వ తేదీనే ప్రారంభించినా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పాత విధానాన్ని అమలు చేస్తుండగా, యాప్లో లోపాలను సరిచేయడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో గురువారం నుంచి యాప్ ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ విధానం మొదలుకావాల్సి ఉంది. ఇంకా 25వేల మె.టన్నులు అవసరం జిల్లాలో యాసంగి పంటల సాగు లక్ష్యం 4.16 లక్షలు కాగా 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే 45 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించారు. ఇంకా 25వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, గోదాముల్లో 7వేల మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ల్లో 1,200 మె.టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 1,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. మిగతా యూరియా దశల వారీగా చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ●కామేపల్లి: మండలంలోని కొండాయిగూడెం సొసైటీ వద్ద యాప్లో బుక్ చేసుకున్న పలువురు రైతులకు ఏఓ భూక్యా తారాదేవి యూరియా అందజేశారు. ఏఈఓలు భాస్కర్, అశోక్రెడ్డి, సొసైటీ సీఈఓ దొడ్డ ముత్తయ్య, సిబ్బంది షేక్ సలీమ్, బోడా రమేష్ పాల్గొన్నారు.ఇకపై జిల్లాలో యాప్ ద్వారానే యూరియా విక్రయాలు కొనసాగుతాయి. రైతులు పూర్తి వివరాలు నమోదు చేశాక పీఏసీఎస్ లేదా డీలర్ను ఎంపిక చేసుకుని ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. అయితే, 24 గంటల్లోగా యూరియా కొనుగోలు చేయకపోతే ఆ బుకింగ్ రద్దవుతుంది. విక్రయ కేంద్రాల వద్ద ఏఈఓల సహకారం తీసుకోవచ్చు. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి -
విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెరగాలి
● అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు గంట పాటు ‘ఈసీఆర్’ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం పెరిగేలా రూపొందించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఖమ్మంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్తో కలిసి గురువారం ఆయన విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలో ఈసీఆర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 3నుంచి 4గంటల వరకు ఈసీఆర్ కోసం కేటాయించి విద్యార్థులకు ఆంగ్లం చదవడంపై తర్ఫీదు ఇవ్వాలని తెలిపారు. ఈసీఆర్ ప్రారంభించిన మొదటి వారం నుంచే విద్యార్థుల హాజరు శాతం పెరగగా, పిల్లలకు జీవిత కాలం ఉపయోగపడే సామర్థ్యాలు అందుతున్నాయని చెప్పారు. మొదటిదశ ద్వారా పిల్లల్లో చదివే సామర్థ్యం వచ్చాక, రెండో దశలో వాక్యాలు చదివించడంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. వచ్చే నెలలోగా 75 శాతం విద్యార్థులకు వాక్యాలు చదవడం రావాలని తెలిపారు. నామమాత్రంగా కాకుండా ప్రతీ అక్షరం, వాక్యం శబ్దాల ఆధారంగా శిక్షణ ఇస్తే పిల్లలకు జీవితకాలం గుర్తుంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ అంశంపై ప్రతీ బుధవారం విద్యార్థుల ప్రగతిని యాప్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఈసీ ఆర్ మొదటి దశ అమలులో ప్రతిభ కనబరిచిన ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలను సన్మానించా రు. రఘునాథపాలెం, బోనకల్ ఎంఈఓలు రాములు, దామాల పుల్లయ్య, కారేపల్లి మండలం గేటుకారేపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వై.రాధ తది తరులు సన్మానం అందుకున్నారు. ఈసమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్, ఆర్ఎంఓ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామ సంఘాల పటిష్టతే లక్ష్యం
తల్లాడ: గ్రామసంఘాల పటిష్టతే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.ఆంజనేయులు సూచించారు. తల్లాడ మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం గ్రామ సమాఖ్యల ప్రతినిధులకు శిక్షణ ఏర్పాటుచేయగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు పటిష్టమైన నాయకత్వం ఉండేలా చూడడమే కాక ప్రతీనెలా సమావేశాల నిర్వహణ, రికార్డుల్లో నమోదు, ఆర్థిక అక్షరాస్యత, జీవనోపాధుల మెరుగుదలపై అవగాహన కల్పించాలని సూచించారు. భవిష్యత్లో గ్రామ సమాఖ్యల ద్వారా వ్యాపార నిర్వహణకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎం రవికుమార్, సీఆర్పీలు నజీమా బేగం, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఐ.స్వప్న, ఉపారాణితో పాటు త్రివేణి, స్వాతి, భారతి, సీత, భద్రమ్మ, నిర్మల, అస్మత్, సాయమ్మ, సోంబాబు పాల్గొన్నారు. -
ఊపందుకున్న నామినేషన్లు
● రెండో రోజు దాఖలు చేసిన 309 మంది ● అభ్యర్థుల కోసం హెల్ప్డెస్క్ల ఏర్పాటు ● నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో రెండో రోజు నామినేషన్ల జోరు పెరిగింది. తొలిరోజైన బుధవారం కేవలం ఏడు నామినేషన్లే దాఖలు కాగా, గురువారం మాత్రం ఐదు మున్సిపాలిటీల పరిధి 117 వార్డుల్లో 309 మంది నామినేషన్లు సమర్పించారు. తొలిరోజు ఆశావహులు దూరంగా ఉన్నా, కొన్నిచోట్ల పార్టీల మధ్య పొత్తులు కొలిక్కిరావడం, అభ్యర్థులను ఖరారు చేయడంతో నామినేషన్ల సంఖ్య పెరిగింది. శుక్రవారం చివరి రోజు కావడంతో మిగతా వారు కూడా నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయడమే కాక నామినేషన్ పత్రాలు ఇవ్వడం, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేలా సిబ్బందిని నియమించారు. కాగా, ఏదులాపురం మున్సిపల్ పరిధిలోని నామినేషన్ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. అలాగే వెంకటగిరిలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అడిషనల్ డీసీపీ ప్రసాదరావు సందర్శించి బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. మొత్తం 316 ఐదు మున్సిపాలిటీల పరిధిలో గురువారం 309 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు దాఖలైన ఏడింటితో కలిపి ఈ సంఖ్య 316కు చేరింది. ఇందులో కాంగ్రెస్ నుంచి 114, బీఆర్ఎస్ నుంచి 124, బీజేపీ నుంచి 35, సీపీఎం నుంచి 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల్లోని గుర్తింపు పొందిన పార్టీల నుంచి 20 నామినేషన్లు అందాయి.మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. మూడు రోజులు అవకాశం ఇవ్వడంతో తొలి రెండు రోజులు పొత్తుల్లో స్పష్టత లేకపోవడం, ఇతర కారణాలతో చాలా మంది వేచిచూశారు. ఇక చివరిరోజు మాత్రం పార్టీలు ప్రకటించిన అభ్యర్థులే కాక ఆశావహులంతా నామినేషన్లు వేయనున్నారు. పార్టీల నుంచి జాబితాలు రావడం, సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరడంతో నాయకుల సూచనల మేరకు అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా చివరిరోజు నామినేషన్ కేంద్రాల వద్ద రద్దీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. -
ఎన్నికల పరిశీలకుడిగా పవన్కుమార్
ఖమ్మంసహకారనగర్/సత్తుపల్లిటౌన్/కల్లూరు రూరల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన జిల్లా సాధారణ పరిశీలకులుగా పవన్కుమార్ నియమితులయ్యారు. టీజీఐఐసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత ఖమ్మంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశాక ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఆతర్వాత సత్తుపల్లి, కల్లూరులో నామినేషన్ల స్వీకరణను పవన్కుమార్ పరిశీలించారు. చివరిరోజైన శుక్రవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నందున సరిపడా హెల్ప్డెస్క్లు ఏర్పాటుచేసి అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ముజాహిద్, కల్లూరు మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు చలపతిరావు, సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ కమిషనర్లు కొండ్ర నర్సింహ, దుర్గారెడ్డి, మేనేజర్ ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మధిర పాలన‘ఆమె’ చేతుల్లోనే
● రెండు దశాబ్దాలుగా మహిళల నేతృత్వాన పాలకవర్గాలు ● ఈసారి కూడా అతివలకే రిజర్వేషన్మధిర: గ్రామపంచాయతీగా, నగర పంచాయతీగానే కాక మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యాక మధిరలో గత రెండు దశాబ్దాల నుంచి పాలన మహిళల నేతృత్వంలోనే కొనసాగుతోంది. 2006 సంవత్సరంలో మధిర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో కాంగ్రెస్ తరఫున న్యాయవాది వాసంశెట్టి కోటేశ్వరరావు సతీమణి లక్ష్మీప్రియ విజయం సాధించి 2011 వరకు కొనసాగారు. ఆతర్వాత ప్రత్యేక అధికారుల పాలన కొనసాగగా, నాటి ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క 2013 మార్చి 28న నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేయించారు. ఆ సమయంలో మధిర జీపీలో మడుపల్లి, ఇల్లెందులపాడు, అంబారుపేట గ్రామాలు విలీనమయ్యాయి. నగర పంచాయతీ మొదటి చైర్ పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మొండితోక నాగరాణి గెలిచి 2019 వరకు కొనసాగారు. ఆ తర్వాత జిలుగుమాడు గ్రామాన్ని విలీనం చేస్తూ 2018 మార్చి 24న మధిర మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ప్రత్యేక అధికారుల పాలన అనంతరం 2020 జనవరి 22న మధిర మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కౌన్సిలర్ మొండితోక లత గెలిచి చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. ఆమె 2025 వరకు పనిచేశారు. దీంతో మేజర్ జీపీగా, నగర పంచాయతీగానే కాక మున్సిపల్ తొలి చైర్మన్ పదవి మహిళకే దక్కడంతో ఇరవై ఏళ్ల పాటు అతివల చేతిలోనే పాలన సాగినట్లయింది. ఈసారి జనరల్ మహిళకు... ప్రస్తుతం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి మధిర చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో మధిర పీఠాన్ని మహిళే దక్కించుకోనున్నారు. అంటే మరో ఐదేళ్లు.. తద్వారా 25ఏళ్ల మధిర పాలన మహిళ చేతుల్లో కొనసాగినట్లవుతుంది. దీనికి తోడు ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కౌన్సిలర్లు సైతం సగం మంది మహిళలే కొలువుదీరనున్నారు. కాగా, మధిర మున్సిపల్ పరిధిలో మొత్తం 25,679 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలే 13,424 కావడం విశేషం. పురుషులు 12251 మందితో పాటు ఇతరులు నలుగురు ఉన్నారు. -
కేసీఆర్కు సిట్ నోటీసులు గర్హనీయం
మధిర/వైరా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మధిర, వైరాలో గురువారం జరిగిన బీఆర్ఎస్ శ్రేణుల సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ప్రజల్లో బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా రైతుబంధు, రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమలుచేయలేదని, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం ఊసే లేదని విమర్శించారు. ఇవికాక ఇంకా అమలుచేయని హామీలను ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు పాటుపడాలని అజయ్ సూచించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కుటుంబం అవినీతికి పాల్పడుతుండడమే కాక, బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు డబ్బుతో కొనుగోలుకు యత్నిస్తున్నారని ఆరో పించారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ విస్మరించిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్దాం -
రండీ.. ప్రచారం చేసుకోండి
● తపాలా శాఖ ఆధ్వర్యాన ‘మీడియా పోస్టు’ సేవలు ● ప్రభుత్వ, కార్పొరేషన్లు, ప్రైవేట్ కంపెనీల ప్రచారానికి అవకాశం ● పోస్టాఫీసుల్లో బ్యానర్లు, పోస్టర్లు, ఎల్ఈడీల ద్వారా ప్రచారంఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ‘మీడియా పోస్టు’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ సేవలు, ఉత్పత్తులను ప్రచారం చేసుకునేలా ఈ విధానం ద్వారా అవకాశముంటుంది. పోస్టాఫీసుల ఆవరణలో బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించడమే కాక ఎల్ఈడీ తెరల ద్వారా ప్రచారానికి అవకాశం కల్పిస్తారు. అంతేకాక పోస్టు కార్డులు, ఇన్ల్యాండ్ లెటర్లు, మనీ ఆర్డర్ ఫామ్స్, ఇతర స్టేషనరీపై కంపెనీల బ్రాండ్లను ముద్రించుకోవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించే ఈ విధానం కొంతకాలంగా అమల్లో ఉన్నా ఎక్కడికక్కడ పోస్టాఫీసుల స్థాయిలో ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక ఉత్పత్తుల ప్రచారానికి... పోస్టాఫీస్ల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల, కార్పొరేట్ సంస్థల ఉత్పుత్తులపై ప్రచారానికి తపాలా శాఖ అవకాశం కల్పిస్తోంది. ఖమ్మం పోస్టల్ డివిజన్ వ్యాప్తంగా లేదా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం హెడ్ పోస్టాఫీసులు, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, మధిర, సత్తుపల్లిలోని ఏదో ఒక పోస్టాఫీస్, ఇతర సబ్, బ్రాంచ్ పోస్టాఫీసుల్లోనూ ప్రచారానికి అవకాశం ఉంటుంది. ఈమేరకు సంస్థల ఉత్పత్తులు, సేవల వివరాలతో బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్లు ఏర్పాటుచేసుకోవచ్చు. అంతేకాక ఎల్సీడీ/ ఎల్ఈడీల తెరల ద్వారా ప్రచారానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం బోర్డుల, బ్యానర్ల సైజు ఆధారంగా రుసుము చెల్లించాలి. ఖమ్మం పోస్టల్ డివిజన్ పరిధిలో ఆసక్తి ఉన్నవారు గాంధీచౌక్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(99897 48758), పబ్లిక్ రిలేషన్ విభాగం ఉద్యోగి(98660 32213)ని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలు, ఉత్పత్తుల ప్రచారానికి తపాలా శాఖ అవకాశం కల్పిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే పోస్టాఫీసుల్లో మంచి ప్రచారం లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బాధ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వి.వీరభద్రస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్, ఖమ్మం -
స్టాచ్యూ సెంటర్ !
అన్ని పట్టణాలు, గ్రామాల్లో జాతీయ నేతలు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటుచేయడం ఆనవాయితీ. కానీ వీధికొకటి అన్నట్లుగా, మరికొన్ని విగ్రహాలు ప్రధాన రహదారుల మధ్యలో ఉంటాయి. అయితే, సత్తుపల్లికి ఈ అంశంలో ప్రత్యేకత ఉంది. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన జాతీయ నాయకుల విగ్రహాలు వరుసగా ఏర్పాటు చేశారు. జయంతి, వర్ధంతి సందర్భాలతో పాటు ఇతర ప్రత్యేక రోజుల్లో ఇక్కడ నివాళులర్పిస్తుండడంతో ఇది స్టాచ్యూ సెంటర్గా మారింది. రహదారి పక్కన ఉండడంతో ఎంత మంది హాజరైనా సమస్యలు ఎదురుకావడం లేదు. ఇక్కడ గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజీవ్గాంధీ, ఇందిరా గాంధీ, వల్లభాయ్పటేల్, జ్యోతిరావుపూలే, డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి, ఎన్టీఆర్, చాకలి ఐలమ్మ, వడ్డెర ఓబన్న, కుమురం భీమ్, వంగవీటి రంగ తదితరుల విగ్రహాలు ఉన్నాయి. – సత్తుపల్లిటౌన్రహదారి పక్కన జాతీయ నాయకుల విగ్రహాలు -
ఢీకొట్టి.. తలపై నుంచి వెళ్లిన లారీ
● తీవ్రగాయాలతో వ్యక్తి మృతి సత్తుపల్లిటౌన్: లారీ ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన పొదిలి నారాయణరావు(59) మోపెడ్పై తిరుగుతూ ఫాన్సీ వస్తువులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఆయన వాహనంపై వెళ్తుండగా రింగ్ సెంటర్ వద్ద ఖమ్మం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో కిందపడ్డాడు. ఆపై తల పైనుంచి లారీ టైర్లు కింద వెళ్లడంతో తీవ్రగాయాలతో మృతి చెందాడు. నారాయణరావుకు భార్య లక్ష్మి, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తాళం పగులగొట్టి బంగారం, నగదు చోరీ కామేపల్లి: మండలంలోని మద్దులపల్లిలో ఓ ఇంటి తాళం పగలగొట్టి ఆగంతకులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన దేవండ్ల ఉపేందర్ కుటుంబంతో కలిసి మంగళవారం మేడారం జాతరకు వెళ్లాడు. బుధవారం రాత్రి ఇద్దరు యువకులు తాళం పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఉపేందర్ గురువారం చేరుకుని పరిశీలించగా బీరువాలో దాచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.80 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్సై శ్రీకాంత్ చేరుకుని వివరాలు ఆరా తీసి దర్యాప్తు చేపట్టారు. -
12 కేజీల గంజాయి స్వాధీనం
వైరా: ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 12 కేజీల ఎండు గంజాయిని వైరా ఎకై ్సజ్ పోలీసులు గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఎస్హెచ్ఓ మమతారెడ్డి తెలిపిన వివరాలు... ఎకై ్సజ్ ఉద్యోగులు వైరా బస్టాండ్లో తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారించగా మధ్యప్రదేశ్ రాష్ట్రం విదీషాకు చెందిన బ్రజేన్ అహిర్వార్గా తేలడంతో పాటు ఆయన బ్యాగ్లో 12.20 కేజీల గంజాయి లభించింది. ఈ గంజాయిని ఖమ్మం మీదుగా మధ్యప్రదేశ్కు తీసుకెళ్తున్నట్లు అంగీకరించడంతో బ్రజేన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తనిఖీల్లో ఎస్ఐలు రతన్ప్రసాద్రెడ్డి, కె.విజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
దుమ్మూదూళి నడుమ భోజనం చేయలేం...
● విధులు బహిష్కరించిన సింగరేణి కార్మికులు సత్తుపల్లిరూరల్: దుమ్మూదూళి నడుమ భోజనం చేయలేమంటూ సత్తుపల్లి మండలం జేవీఆర్ సింగరేణి ఓసీలో కార్మికులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సింగరేణి క్యాంటీన్లో కాకుండా ఓసీ ఇంటర్నల్ పార్కింగ్ యార్డులో నిర్మించిన షెడ్డులో భోజనం చేయాలని యాజమాన్యం ఆదేశించింది. అయితే, సీహెచ్పీ నుంచి దుమ్ము వెలువడే ప్రాంతంలో షెడ్డు నిర్మించడం సరికాదంటూ కార్మికులు విధులు బహిష్కరించారు. యాజమాన్యం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
31లోగా పరీక్ష ఫీజు చెల్లించండి
ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2016కు ముందు వార్షిక విధానంలో డిగ్రీ చదివి ఉత్తీర్ణులు కానీ విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బాణోతు రెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు మిగిలిన సబ్జెక్టుల కోసం యూనివర్సిటీ పరీక్షల విభాగం నుండి అనుమతి తీసుకుని ఫీజు చెల్లించాలని సూచించారు. డీఆర్డీఓ సన్యాసయ్య బదిలీ ● పీఆర్ అండ్ ఈఈకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీఓ) ఆర్.సన్యాసయ్యను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోగా, పీఆర్ అండ్ ఈఈ డైరెక్టర్కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సన్యాసయ్యను బదిలీ చేస్తూ 22వ తేదీతో జారీ అయిన ఉత్తర్వులు బుధవారం బయటకు వచ్చాయి. డీఆర్డీఓగా స్థానిక అధికారులకు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్కు సూచించడంతో ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి రెండు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు మధిర: మధిర మండలం మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యాన గురువారం నుంచి మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక, పద్య, దృశ్య అంశాల్లో నాటక పోటీలు ఉంటాయని రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం సుబ్బారావు తెలిపారు. అంతరించిపోతున్న కళలపై ప్రజలకు అవగాహన కల్పించడం, కళాకారులను ప్రోత్సహించేలా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోటీల్లో వివిధ విభాగాల విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేస్తామని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు శిక్షణ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బుధవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాల మేరకు మూడురోజుల పాటు వరంగల్ రీజియన్కు చెందిన ప్రొఫెసర్లు శ్రీనివాస్, శశికాంత్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనున్నారు. తొలి విడతలో 30మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎంబీబీఎస్ విద్యార్థులకు బోధనలో మెళకువలపై అవగా హన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్, డాక్టర్ రాజేశ్వరరా వు, వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
చకచకా పన్నుల వసూళ్లు
వైరా/సత్తుపల్లిటౌన్/కల్లూరు రూరల్: మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని పేరుకుపోయిన ఆస్తి, నల్లా పన్ను బకాయిలు వసూలతున్నాయి. పోటీ చేసే అభ్యర్థితో పాటు బలపరిచే వారి ఆస్తి, నీటి పన్నులు బకాయి ఉండొద్దనే నిబంధన విదించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు పన్నులన్నీ చెల్లించి నామినేషన్తో పాటు నో డ్యూ సర్టిఫికెట్ సమరించాల్సి ఉంటుంది. దీంతో సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు, మధిర మున్సిపాలిటీల వద్ద బుధవారం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బిల్కలెక్టర్లతో పాటు వార్డు ఆఫీసర్లకు విధులు కేటాయించారు. ఈమేరకు సత్తుపల్లి మున్సిపాలిటీకి సాధారణంగా రోజుకు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం పన్నుల రూపంలో వస్తుంది. కానీ బుధవారం రూ.2.84 లక్షల ఇంటి, నీటి పన్నులు వసూలు కావడం విశేషం. ఇక వైరా మున్సిపాలిటీకి పన్నుల రూపేణా రూ.75,938 ఆదాయం నమోదైంది. అలాగే, కల్లూరు, మధిర, ఏదులాపురంలోనూ పలువురు పన్నులు చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం చెల్లిస్తున్న ఆశావహులు -
బోధనలో సాంకేతికత జోడించండి
● డీఈఓ చైతన్య జైనీ ● పీఎంశ్రీ స్కూళ్ల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు శిక్షణకరోనా అనంతరం సాంకేతిక వినియోగం పెరిగింది. దీంతో అధికారులు పంపించే గూగుల్ షీట్లు, డాక్యుమెంట్లలో వివరాలు నింపుతున్నా వాటి తయారీపై అవగాహన లేదు. దీంతో బోధన మెరుగుపడేలా శిక్షణ ఇచ్చారు. – సరస్వతి, జెడ్పీహెచ్ఎస్, కూసుమంచి హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఇంటరాక్టివ్ కంటెంట్ల తయారీపై అవగాహనకు శిక్షణ ఇస్తున్నాం. ఇది పాఠ్యాంశాల బోధనలో ఉపయోగపడుతుంది. అలాగే, విద్యార్థులు సొంతంగా అర్థం చేసుకునేలా తర్ఫీదు ఇవ్వడం వీలవుతుంది. – దొడ్డపనేని కృష్ణారావు, రిసోర్స్ పర్సన్ పీఎంశ్రీ పాఠశాలల్లో సాంకేతికత వినియోగం పెరి గింది. ప్రతీ పాఠశాలకు లాప్టాప్, ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించాం. వీటి ఉపయోగం, సాంకేతికతపై అవగాహన తద్వారా విద్యార్థులకు నా ణ్యమైన బోధన కోసం అవగాహన కల్పిస్తున్నాం. – పెసర ప్రభాకర్రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్ ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులు బోధనలో పాఠ్యాంశాలకు తోడు సాంకేతిక జోడించాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు. తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు 508మందికి ఐసీటీ అంశంపై రెండు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ తరగతులు బుధవారం జిల్లా విద్యా శిక్షణ సంస్థ, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న డీఈఓ చైతన్యజైనీ మాట్లాడుతూ అసెస్మెంట్, కమ్యూనికేషన్ తదితర అంశాల్లో బోధన మరింత మెరుగుపడాలని తెలిపారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే కాక మెరుగైన అభ్యసన ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. శిక్షణలో భాగంగా గూగుల్ షీట్లు, డాక్యుమెంట్ల రూపకల్పన, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం ద్వారా పార్టీ సత్తా చాటేలా కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఐదు మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి పాటు పడాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కొండబాల కోటేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వడ్డేబోయిన నరసింహారావు, పగడాల మంజుల, యర్రం బాలగంగాధర్ తిలక్, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ -
పనులు శరవేగంగా పూర్తి చేయాలి
నేలకొండపల్లి: ఆస్పత్రి అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. నేలకొండపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, చెరువుమాధారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం తనిఖీ చేసిన ఆమె అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అలాగే, చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అవసరమైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని సీనియర్ రెసిడెంట్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్గౌడ్, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ ప్రసాద్, వైద్యాధికారులు మంగళ, శ్రావణ్కుమార్, సర్పంచ్లు వెంకటలక్ష్మి, అమరగాని ఎల్లయ్య పాల్గొన్నారు. కాగా, నేలకొండపల్లిలో వీధి కుక్కల బెడద, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై వివిధ పార్టీల నాయకులు బట్టపోతుల ప్రకాశం, పసుమర్తి శ్రీనివాస్ తదితరులు అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నాయకులు మద్దినేని మహేష్, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని బుధవారం అదనపు కలెక్టర్ శ్రీజ తనిఖీ చేశారు. సదరమ్ విభాగం కోసం నిర్మించిన భవనాన్ని పరిశీలించిన ఆమె త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే, ట్రామా కేర్, క్రిటికల్ కేర్ బ్లాక్కు అనుసంధానిస్తూ నిర్మించే కనెక్షన్ కారిడార్ నిర్మాణాన్ని పరిశీలించారు. మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ -
సాగర్ కాల్వలో మృతదేహం
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపాన బోనకల్ బ్రాంచ్ కాల్వలో ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. ఈ విషయమై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో బయటకు తీయించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత ఆచూకీ కోసం ఆరా తీస్తుండగా ఖమ్మం గోపాలపురం ఎల్బీ నగర్లో నివాసముండే వెల్డర్ నల్లాని బద్రినాధ్(38)గా గుర్తించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రామచంద్రంపేటకు చెందిన ఐదేళ్లుగా ఖమ్మంలో నివాసముంటున్నాడు. కాగా, భద్రినాధ్ ఈనెల 26నుంచి కానరాకుండా పోగా బుధవారం మృతదేహం లభ్యమైంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు మృతి రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం గడ్డికుంట తండాకు చెందిన రైతు తేజావతి లాలు(45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖమ్మంలో పనులు ముగించుకొని బుదవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మరో ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన లాలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఉరి వేసుకుని బలవన్మరణం శరీరంపై సీపీఎం జెండాతో ఆత్మహత్య ఎర్రుపాలెం: మండల కేంద్రానికి చెందిన రేఖా దుర్గయ్య(60) అలియాస్ కొండ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లారీ డ్రైవర్గా పనిచేసిన ఆయన నాలుగేళ్ల క్రితం భార్యతో గొడవపడి గ్రామంలోనే వేరేఇంట్లో నివసిస్తున్నాడు. ఈక్రమాన మద్యానికి బానిసవడంతో పాటు మానసిక స్థితి సరిగా లేక తిరుగుతున్నాడు. ఈమేరకు కేజీబీవీ ఎదుట వాటర్ ట్యాంక్ మెట్లకు వైర్తో ఉరి వేసుకుని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఆయన కుమారుడు గోపికృష్ణ చూసి ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.రమేష్కుమార్ తెలిపారు. కాగా, సీపీఎం సానుభూతిపరుడైన దుర్గయ్య ఆత్మహత్య చేసుకున్న సమయాన ఆ పార్టీ జెండాను శరీరంపై కట్టుకోవడం గమనార్హం. బ్యాటరీల దొంగలు అరెస్ట్ రూ.2.16 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం రఘునాథపాలెం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన బ్యాటరీల చోరీ కేసుల్లో నిందితులను బుధవారం రఘునాథపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించిన వివరాలు... ఎస్ఐ జి.నరేష్, సిబ్బంది బుధవారం ఉదయం జింకల తండా క్రాస్ రోడ్డులో తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన కారులో ఉన్న ఇద్దరు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో వారి ని వెంబడించి పట్టుకోగా జిల్లా కోర్టు ఆవరణలోని జనరేటర్ నుంచే కాక పలు చోట్ల వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేసినట్లు అంగీకరించారు. వీరిలో పెనుబల్లి మండలం రామచంద్రపురానికి చెందిన ఎస్కే.అక్బర్, బల్లేపల్లికి చెందిన షేక్ సైదులు ఉండగా, రూ.2.16లక్షల విలువైన బ్యాటరీలు, గ్యాస్ సిలిండర్ తది తర సామగ్రిని స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మున్సిపాలిటీగా..
మేజర్ జీపీ నుంచి● 2018లో వైరా మున్సిపాలిటీ ఆవిర్భావం ● శివారు గ్రామాలను కలుపుతూ 20 వార్డులు ● నిజాం కాలంలోనే ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణంవైరా: జాతీయ రహదారిపై ఉన్న వైరా మేజర్ గ్రామపంచాయతీ 2018 ఆగస్టు 2వ తేదీన మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఆ సమయాన రాష్ట్రంలోని పలు మేజర్ జీపీలను అప్గ్రేడ్ చేయడంతో వైరాకు స్థానం దక్కింది. అంతకుముందు 17 నెలలు, మున్సిపాలిటీ ఏర్పడ్డాక కొద్దినెలలు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఆతర్వాత 2020లో మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ సమయాన చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్కు రిజర్వ్ కాగా అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్న సూతకాని జైపాల్ ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ స్వరూపం ఇలా.. వైరా పట్టణంతో పాటు గండగలపాడు, సోమవరం, బ్రాహ్మణపల్లితో పాటుగా కొణిజర్ల మండలంలోని దిద్దిపూడి, లాలాపురం, పల్లిపాడు గ్రామాలను కలుపుకుని మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఇక్కడ 36వేల మంది జనాభా, 24,689 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి వేయి మంది ఓటర్లు పెరిగారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గాను 45 వేలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. పంచాయతీ సర్పంచ్లు వీరే.. వైరా మేజర్ పంచాయతీగా, అంతకుముందు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు పలువురు సర్పంచ్లు అభివృద్ధికి కృషి చేశారు. 1954 నుండి 61వరకు సాతులూరి సంపత్కుమార్, 1961 – 64లో శాఖమూరి సీతరామయ్య, 1964 – 70 వరకు ఖాజా నాగభూషణం, 1970 – 81 వరకు చింతనిప్పు నర్సయ్య, 1981 – 88 వరకు కేతినేని సత్యనారాయణ, 1988 – 95లో టీఎస్.ప్రసాద్ సర్పంచ్లుగా గెలిచారు. ఇక 1995 నుంచి 2000 వరకు బొర్రా పద్మావతి, 2001 – 2006లో పువ్వాళ్ల దుర్గాప్రసాద్, 2006 – 2011 వరకు బొర్రా వెంకటేశ్వర్లు, 2011 – 2016 వరకు బానోతు వాలీ సర్పంచ్గా పని చేశారు. ఆపై వైరా మున్సిపాలిటీ ఏర్పడగా రెండో పాలకవర్గం ఎన్నిక ప్రస్తుతం జరగనుంది.జిల్లాలోనే వైరాకు ప్రత్యేక చరిత్ర ఉంది. 1920కు పూర్వం ఇక్కడ వీరనది ఉండేదని.. అది కాస్త కాలక్రమేణా ప్రస్తుత వైరా నదిగా మారిందని చెబుతారు. నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ హయాంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న వైరా రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. 1923లో ప్రారంభమైన ఈ నిర్మాణం 1930లో పూర్తయింది. అప్పట్లో ఈ రిజర్వాయర్కు రూ.30.90 లక్షలు వెచ్చించారు. -
తొలిరోజు అంతంతే..
● ఏడు మున్సిపాలిటీల్లో 11 నామినేషన్లు ● కొత్తగూడెం కార్పొరేషన్లో ముగ్గురు ● ఇందులోనూ బీ ఫామ్లు ఇచ్చింది కొందరే..సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 117 వార్డులు ఉండగా, నామినేషన్ల స్వీకరణకు 43కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, తొలిరోజు ఎనిమిది చోట్ల కలిపి 14నామినేషన్లే దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం అభ్యర్థులు ఉండగా, కొందరే బీ ఫామ్లు అందజేశారు. మధిర, కల్లూరు నిల్ ఐదు మున్సిపాలిటీలకు గాను సత్తుపల్లిలో తొలిరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో వార్డు, 14 వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు, 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. వైరా మున్సిపాలిటీలోని రెండో వార్డు, 11వ వార్డుకు బీఆర్ఎస్ అభ్యర్థులు, ఏదులాపురం 23వ వార్డులో కాంగ్రెస్, 31వ వార్డు నుంచి సీపీఎం తరఫున ఒకరు నామినేషన్ వేశారు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్లో 60డివిజన్లు ఉండగా, 8, 19, 56డివిజన్ల నుంచి ఒక్కో నామినేషన్ దాఖలైంది. అశ్వారావుపేటలో 22వ వార్డులకు గాను మూడో వార్డుకు ఇద్దరు, 22వ వార్డుకు ఒకరు, ఇల్లెందులో 24వార్డులకు గాను ఆరో వార్డు నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. కల్లూరు, మధిర మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. కాగా, నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరిని తనిఖీ చేశాకే అనుమతించారు. వైరాలో నామినేషన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా పరిశీలించారు. సలహాలు, సూచనలు నామినేషన్ పత్రాల దాఖలుకు వచ్చే అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేలా సిబ్బందిని నియమించారు. కేంద్రం బయట వీరు సలహాలు ఇచ్చారు. అంతేకాక అభ్యర్థులు ఇంటి, నల్లా పన్నులు చెల్లించేలా కేంద్రాల వద్ద డిజిటల్ పేమెంట్ యంత్రాలతో సిబ్బందిని కేటాయించారు. వీరు ఓటర్ల జాబితా ఆధారంగా పేర్లు పరిశీలించడంతో పాటు ప్రతిపాదకులకు ఓటుహక్కు ఉందా, లేదా అని నిర్ధారణ చేశారు. రేపటితో ముగింపు.. నామినేషన్ల దాఖలుకు రెండు రోజుల సమయం ఉంది. గురువారం, శుక్రవారం నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా.. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోపక్క బీ ఫామ్ సాధించేందుకు అభ్యర్థులు ఆరాట పడుతున్నారు. అయితే, రెండో రోజైన గురువారం నామినేషన్లు జోరందుకుంటాయని భావిస్తున్నారు. -
బుల్డోజర్లతో వస్తామని బెదిరింపులు
సత్తుపల్లి: సత్తుపల్లి–రేజర్ల డైవర్షన్ రహదారి నిర్మాణానికి సింగరేణి, రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. భూమి, చెట్లకు పరిహారం చెల్లించాలని బాధితులు ఆందోళన చేస్తుంటే.. అధికారులు దౌర్జన్యంగా భూముల్లోకి బుల్డోజర్లతో వచ్చి తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారని మందపాటి కృష్ణారెడ్డి, శీలపురెడ్డి రాధిక తదితరులు వాపోతున్నారు. ఈక్రమంలోనే బుధవారం రెవెన్యూ, సింగరేణి ఉద్యోగులు రాగా, స్థానికులతో కలిసి ప్రతిఘటించే సరికి రాత్రి మళ్లీ వస్తామంటూ హెచ్చరించి వెళ్లారని తెలిపారు. అసింగరేణి స్వాధీనం చేసుకున్న భూముల సర్వే నంబర్లు తప్పుగా పడడంతో ఏడుగురు రైతులు పరిహారానికి దూరమయ్యారు. ఇందులో మందపాటి కృష్ణారెడ్డికి చెందిన రేజర్ల రెవెన్యూ సర్వే నంబర్ 88లో 30 కుంటల భూమి ఉంటే.. 15 కుంటలు రోడ్డు పనుల్లో పోయింది. కానీ పాస్పుస్తకంలో సర్వే నంబర్ 794 ప్రభుత్వ భూమిగా నమోదు కావడంతో కోర్టును ఆశ్రయించగా, సరిచేసి పరిహారం చెల్లించాలనే ఆదేశాలు వచ్చినా భూమి స్వాధీనానికి యత్నిస్తున్నారని ఆరోపించాడు. ఎప్పుడు పడితే అప్పుడు పొక్లెయినర్లు, బుల్డోజర్లతో వచ్చి వృద్ధ దంపతులమని చూడకుండా బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఇక శీలపురెడ్డి రాధికకు నాలుగు కుంటల ఇళ్ల స్థలం వ్యవసాయ భూమిగా చూపించడంతో పరిహారం తక్కువగా వచ్చింది. దీంతో ఆమె ఇంటి వరకు ఫెన్సింగ్ వేయించి అధికారుల చుట్టూ తిరుగుతోంది. రూ.7.5 కోట్ల వరకు నష్టం ఈ రోడ్డు నిర్మాణానికి సేకరించే భూమిలో ఎస్కె ఖదీర్పాషా ఎకరం మేర ఉండగా, అందులోని 576 శ్రీగంధం, 58 మలబార్, 46 టేకు చెట్లను అటవీశాఖ అనుమతి లేకుండా తొలగించారని వాపోయాడు. ఫలితంగా రూ.7.50 కోట్ల మేర నష్టం ఎదురైందని తెలిపాడు. పదిహేనేళ్ల క్రితం మొక్కలు నాటగా, మరో పదేళ్లలో రూ.కోట్లల్లో లాభాలు వచ్చేవని, ఇంతలోనే తొలగించినందున అటవీశాఖ లెక్కించిన విధంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. సింగరేణి, రెవెన్యూ అధికారుల నిర్వాకం -
భారీగా పోలీసులు.. వాహనాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలో రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాల్లో భాగంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రకాశ్నగర్, శ్రీనివాసనగర్ మీదుగా ధంసలాపురం వరకు గోళ్లపాడు చానల్పై రోడ్డు నిర్మాణ పనులకు గాను మార్కింగ్ ప్రకారం తొలగింపు పనులు చేపట్టారు. ఈమేరకు బుధవారం తెల్లవారుజామునే వందలాది మంది పోలీసులతో ఖమ్మం నగర పాలక సంస్థ, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు చేరుకుని జేసీబీల ద్వారా రావిచెట్టు బజార్లో ఆక్రమణల తొలగింపు మొదలుపెట్టారు. అయితే, నోటీసులు, సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక ఇప్పటికిప్పుడు రోడ్డుపై పడేస్తే ఎటు వెళ్లాలని అధికారులను నిలదీశారు. ఈక్రమాన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కార్పొరేటర్ గజ్జల లక్ష్మి భర్త వెంకన్న అధికారులను ప్రశ్నిస్తుండగా ఆయనను సైతం స్టేషన్కు తరలించారు. నోటీసులు ఇవ్వకుండానే.. మార్కెట్ నుండి గోళ్లపాడు చానల్పై ధంసలాపురం వరకు రోడ్డు విస్తర్ణణ కోసం అధికారులు గతంలోనే మార్కింగ్ చేశారు. రెండు నెలలుగా ఆక్రమణల తొలగింపు పనులు జరుగుతుండగా, బుధవారం ప్రకాశ్నగర్ నుండి రావిచెట్టు బజార్ మీదుగా శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో పనులు చేపట్టారు. ఈక్రమాన నోటీసులు ఇవ్వకుండా తొలగించడంపై స్థానికులు అధికారులను నిలదీశారు. ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారు తాము ఎక్కడ తలదాచుకోవాలంటూ బోరున విలపించారు. కాగా, గోళ్లపాడు చానల్పై 66 అడుగుల రోడ్డు నిర్మించేందుకు మార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు వారికి వివరించారు. కానీ గతంలో 57 అడుగులకు ఓసారి, మరోసారి 60 అడుగులకు మార్కింగ్ చేశారని స్థానికులు వెల్లడించారు. బుధవారం మాత్రం 66 అడుగుల వెడల్పుతో మార్కింగ్ ఆధారంగా ఎనిమిది ఇళ్లు పూర్తిగా, 60 – 70 ఇళ్ల ప్రహరీలు, గదులు, గోడలను తొలగించారు. ఈక్రమాన ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారి వివరాలను రెవెన్యూ శాఖ అధికారులు నమోదు చేసుకున్నారు. వీరికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసే అవకాశముందని వెల్లడించారు.అక్రమ నిర్మాణాలు కూల్చివేత నేను, నా భర్త కూలీ పనులు చేసుకుంటూ దాచుకున్న సొమ్ముతో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతంలో రోడ్డు వస్తుందని చెప్పకుండా రూ.15 లక్షలకు రెండు గదుల ఇంటిని అంటగట్టారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేతతో రోడ్డున పడ్డాం. అధికారులే మమ్ముల్ని ఆదుకోవాలి. – చాట్ల కోటమ్మ, స్థానికురాలు -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
● ప్రసవాల సంఖ్య మరింత పెంచాలి ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు నమ్మకంగా వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ శాఖలోని వివిధ విభాగాల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. పీహెచ్సీల్లో ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తూ, అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, వైద్యాధికారులు తమ పరిధిలోని ఆశా కార్యకర్తలతో సమావేశమవుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని తెలిపారు. అంతేకాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం లేని ఆపరేషన్లను నిరోధించాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్రతీ ఆపరేషన్పై నివేదిక ఉండాలని స్పష్టం చేశారు. ఇక పీహెచ్సీ పరిధిలో వంద శాతం పిల్లలకు టీకాలు, ఎన్సీడీ సర్వే, టీబీ నిర్మూలన, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా పరీక్షలు, ఎయిడ్స్పై అవగాహన, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, దత్తత నియమాల అమలుపై కలెక్టర్ సూచనలు చేశారు. అలాగే, మధిరలో కొత్త బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ రామారావు, అడిషనల్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు చందునాయక్, వేణుమనోహర్, పీఓలు సుబ్బారావు, బిందుశ్రీ, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నయనానందకరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, దేవస్థానానికి అనుబంధంగా ఉన్న రంగనాయక ఉపాలయంలో ఫిబ్రవరి 1న రంగనాయక స్వామి తిరుకల్యాణోత్సవం ఉంటుందని ఈఓ తెలిపారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. గురువారం ఆలయ హుండీలను లెక్కించనున్నామని పేర్కొన్నారు. తలనీలాల సేకరణ.. రూ.1.27కోట్లు భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ టెండర్ అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్కు చెందిన ఎ.పుల్లారెడ్డి రూ.1.27 కోట్లకు దక్కించుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కాంట్రాక్ట్ ఆయనకు దక్కనుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీవైరా/కల్లూరు: వైరాలోని ఆదిత్య డెంటల్ క్లినిక్, హరిత డెంటల్ క్లినిక్తో పాటు కల్లూరులోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్ఓ రామారావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు వివరాలు, ఆస్పత్రి రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రదర్శించాలని ఆదేశించారు. అలాగే, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ తప్పని సరిగా పాటించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్, వైద్యాధికారి నవ్యకాంత్ తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. తెలంగాణ జట్టు విజయం ఖమ్మం స్పోర్ట్స్: ఇందిరాగాంధీ ఇన్విటేషన్ మహిళల టీ–20 జాతీయ క్రికెట్ టోర్నీ కొనసాగుతోంది. ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న టోర్నీలో భాగంగా బుధవారం తెలంగాణ – తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్లో తెలంగాణ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ జట్టు 209 పరుగులు చేయగా, అన్షు సహాని 69 బంతుల్లో 87 పరుగులు సాధించారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన తమిళనాడు జట్టు 64 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. అలాగే విదర్భ–మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్లో విదర్భ, ఢిల్లీ–ఆంధ్రప్రదేశ్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. తొలుత క్రీడాకారులను కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, టోర్నీ నిర్వాహకులు ఎండీ.మతిన్, జానీపాషా పరిచయం చేసుకుని మ్యాచ్లను ప్రారంభించారు. హైవే పనులను అడ్డుకున్న రైతులుఖమ్మం అర్బన్: నాగపూర్–అమరావతి జాతీయ రహదారి పనులను చింతకాని మండలం వందనం సమీపాన రైతులు బుధవారం అడ్డుకున్నారు. ఖమ్మం నగరానికి సమీపాన ఈ ప్రాంతం ఉన్నా భూములు కోల్పోతున్న తమకు సరైన పరిహారం చెల్లించడం లేదని పేర్కొన్నారు. పరిహారం పెంచడంతోపాటు పునరావాసంపై స్పష్టత వచ్చేవరకు రోడ్డు పనులు చేపట్టవద్దని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల నుంచి రఘునాథపాలెం మండలం వీవీపాలెం వరకు, వీవీపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు భూసేకరణపై హైకోర్టు స్టే ఆర్డర్ అమల్లో ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రతినిధులు సూచించారు. -
టార్గెట్.. ఫిబ్రవరి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మెప్మా పనితీరుపై అధికారులు దృష్టి సారించారు. సీ్త్రనిధి రుణాలు తీసుకుని చెల్లింపులో అలసత్వం వహిస్తున్న సభ్యులు, పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్న ఆర్పీలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే బుధవారం మెప్మా పీడీ కార్యాలయంలో ఎస్ఎల్ఎఫ్ పనితీరును సమీక్షించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న తరుణాన సీ్త్రనిధి రికవరీ శాతాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాల వల్ల ఆన్లైన్ పేమెంట్లలో ఎదురవుతున్న సర్దుబాటు సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది కోరినట్లు సమాచారం. అంతేకాక రుణాల వసూళ్లకు సీ్త్రనిధి సిబ్బంది తమతో రావాలని, ప్రత్యేక సిబ్బందిని నియమించుకునే వీలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. ఈమేరకు మొండి బకాయిల వసూళ్ల కోసం అవసరమైతే సీ్త్రనిధి సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి ఫిబ్రవరి చివరికల్లా పెండింగ్ లేకుండా చూడాలనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాక వలస వెళ్లిన వారు, మృతుల రికవరీల సమస్య పరిష్కారానికి తీర్మానించినట్లు తెలిసింది. నలుగురిపై ఫిర్యాదు సంఘం సభ్యులు చెల్లించిన రుణ వాయిదాలను సీ్త్రనిధి ఖాతాల్లో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడిన ఆర్పీలపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. నలుగురు ఆర్పీలు నిధులను వాడుకున్నట్లు అంగీకరించిన నేపథ్యాన వారిపై టూ టౌన్, త్రీ టౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీ్త్రనిధి రుణ బకాయిల వసూళ్లకు ప్రణాళిక -
రెస్టారెంట్ వద్ద బైక్ చోరీ
సత్తుపల్లిరూరల్: బిర్యానీ తినాలని రెస్టారెంట్కు వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చే సరికి ఆయన బైక్ చోరీకి గురైంది. సత్తుపల్లిలోని బాలాజీ థియేటర్ పక్కన ఉన్న రెస్టారెంట్కు ఓ వ్యక్తి మంగళవారం బైక్పై వెళ్లాడు. లోనకు వెళ్లి బిర్యానీ తినొచ్చేసరికి బైకు లేకపోవడంతో ఖంగుతిన్నాడు. హోటల్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి బైక్ను చోరీ చేసినట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి ఘటనపై జీరోఎఫ్ఐఆర్ఖమ్మం అర్బన్: భద్రాచలానికి చెందిన అలవాల నాగయ్యపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఖమ్మం అర్బన్ పోలీస్స్టేషన్లో మంగళవారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. కుటుంబ గొడవల కారణంగా ఈనెల 16న నాగయ్యపై కె.వంశీ దాడి చేశాడు. గాయపడిన నాగయ్యను ఖమ్మంలో ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబీకులు ఖమ్మంలో ఫిర్యాదు చేశారు. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి భద్రాచలం బదిలీ చేస్తున్నట్లు సీఐ భానుప్రకాష్ వెల్లడించారు. మైనార్టీ గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ కొణిజర్ల: వుండలంలోని అమ్మపాలెం పంచాయతీ పరిధి తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, రెండో సంవత్సరం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించగా వారు కొట్టారని తెలిసింది. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థులు మంగళవా రం ఉదయం కళాశాల ప్రాంగణం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ జితేష్ సాహిల్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అలాగే, దెబ్బలు తిన్న బాలుడి తండ్రి, బంధువులు కూడా వచ్చి సీనియర్లపై ఫిర్యాదు చేయడంతో ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
మోగిన భేరి
వార్డులు మొత్తం ఓటర్లు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఈనెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ (ఉదయం 10–30నుంచి సాయంత్రం 5గంటల వరకు) నామినేషన్ల స్క్రూటినీ ఈనెల 31వ తేదీ అభ్యంతరాల స్వీకరణ వచ్చేనెల 1న సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాల పరిష్కారం వచ్చేనెల 2వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ గడువు వచ్చేనెల 3న సాయంత్రం 3గంటల వరకు బరిలో ఉన్న అభ్యర్థుల ప్రకటన వచ్చేనెల 3న సాయంత్రం 3గంటల తర్వాత పోలింగ్ వచ్చేనెల 11న ఉదయం 7గంటల నుంచి ఓట్ల లెక్కింపు వచ్చేనెల 13వ తేదీసాక్షి ప్రతినిధి, ఖమ్మం: కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల తుదిజాబితా విడుదల చేయగా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఉద్యోగుల నియామకం, శిక్షణతో పాటు సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందుగానే యంత్రాంగం ఏర్పాట్లు చేయడంతో ఇప్పుడు ఎన్నికలు సజావుగా నిర్వహించడంపై దృష్టి సారించారు. చకచకా ఏర్పాట్లు ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితాలు ఇప్పటికే సిద్ధం కాగా, 242 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఈ వివరాలన్నీ మున్సిపల్ ఎన్నికల లాగిన్లో నమోదు చేశారు. ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ బాక్స్లే కాక అదనంగా 20 శాతం కలిపి 580బాక్స్లు సమకూర్చుకుంటున్నారు. అలాగే, నామినేషన్ల స్వీకరణకు మున్సిపాలిటీల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను ఎంపిక చేయగా, వార్డుల వారీగా మొత్తం 43సెంటర్లు ఏర్పాటుచేశారు. ఉద్యోగులు సిద్ధం పోలింగ్ నిర్వహణకు 20 శాతం రిజర్వ్తో కలిపి పీఓలు 291 మంది, ఓపీఓలు 948 మంది అవసరమవుతారు. అలాగే, అదనపు సిబ్బందితో కలిపి రిటర్నింగ్ ఆఫీసర్లు 55 మంది, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 55 మందిని గుర్తించారు. ఇక 26 మంది జోనల్ అధికారులు, పది మందితో ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు పది స్టాటిస్టిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్ఓలు, పీఓలు, ఓపీఓలకు శిక్షణ పూర్తయింది. పరీక్షల దష్ట్యా ఇంటర్మీడియట్ విద్యాశాఖ సిబ్బందిని, అత్యవసర సేవల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లను మినహాయించారు. కట్టుదిట్టంగా పోలింగ్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘట నలు జరగకుండా సజావుగా నిర్వహించేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్, నామినేషన్ సెంటర్లలో వెబ్కాస్టింగ్ చేపడుతారు. అలాగే పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. నామినేషన్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేస్తారు.మున్సిపల్ ఎన్నికలకు వేళాయె.. -
కొనసాగుతున్న ఉమెన్ టీ–20 క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఇందిరాగాంధీ సీనియర్ మహిళల టీ–20 క్రికెట్ టోర్నీ కొనసాగుతోంది. మూడో రోజు పోటీల్లో భాగంగా మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా తొలుత బ్యా టింగ్ చేసిన మహరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 197 పరుగులు చేసింది. జట్టులో మిథాలీ శర్మ 96 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆంధ్రప్రదేశ్ జట్లు 29 ఓవర్లలో 128 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. ఉత్తరాఖండ్ – ఉత్తరప్రదేశ్ మధ్య మ్యాచ్లో ఉత్తరాఖాండ్, విదర్భ – ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్లో విదర్భ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్లను మాజీ మిస్ ఇండియా డాక్టర్ పర్హా ప్రారంభించగా, బ్యాంక్ మేనేజర్ శివకుమార్తో పాటు ఎం.డీ.మతిన్, జానీ, జోజిచాకో తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతమైన నగరంగా ఖమ్మం
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● రజక భవనానికి శంకుస్థాపన, ఆస్పత్రి భవన ప్రారంభం ఖమ్మం అర్బన్: ప్రశాంతమైన, పచ్చని, ప్రగతిశీల నగరంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 36వ డివిజన్లో రూ.63 లక్షలతో నిర్మించే రజక భవనానికి మంగళవారం శంకుస్థాపన చేసిన మంత్రి, రూ.2.43 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో నిర్మిస్తున్న భవనం రజకుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఐలమ్మ పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాగా, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించి 12 గంటల పాటు వైద్య సేవలు కొనసాగించాలని అధికారులకు సూచించారు. నగర అభివృద్ధిలో రోడ్ల విస్తరణ కీలక పాత్ర పోషిస్తుందని, జనాభాకు తగినట్లు రోడ్ల విస్తరణ జరిగితేనే వ్యాపారం వృద్ధి చెంది ఆస్తుల విలువ పెరుగుతుందని తెలిపారు. విస్తరణలో భూములు లేదా స్థలాలు కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డీఎంహెచ్ఓ రామారావు, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్లు పసుమర్తి రాంమోన్రావు, కమర్తపు మురళి, శ్రీదేవి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్రెడ్డి, తుపాకుల యలగొండస్వామి, యర్రం బాలగంగాధర్ తిలక్, వి.నర్సింహారావు, నాగరాజు, మధు, వెంకన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ●రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ఖమ్మం 21వ డివిజన్ చెరువు బజార్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. -
మామిడి పూతకు మంచు దెబ్బ
● చల్లని వాతావరణం, విపరీతమైన మంచుతో రాలుతున్న పూత ● అక్కడక్కడా ఆశిస్తున్న తెగుళ్లు ● సస్యరక్షణ చర్యలపై అధికారుల సూచనలుఖమ్మంవ్యవసాయం/తల్లాడ: మామిడిలో పూత, కాయ ఎదుగుదలకు తక్కువ వర్షపాతం, తక్కువ తేమ అవసరం. ఇవే కాయ పెరుగుదల, ఉత్పాదకతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ కొద్దిరోజులుగా పెరుగుతున్న చలి, మంచు ప్రభావంతో మామిడిపూతపై ప్రభావం పడుతోంది. ఖమ్మం జిల్లాలో 31వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, దాదాపు అన్నిచోట్ల చెట్లు విరగబూశాయి. కానీ మంచు ప్రభావంతో పూత రాలుతుండడం, ఇతర తెగుళ్ల ఆనవాళ్లు కూడా మొదలుకావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యాన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఉద్యాన, పట్ట పరిశ్రమ అధికారి ఎంవీమధుసూదన్ పలు సూచనలు చేశారు. నీటి తడులతోనే పూత, పిందె పూతకు రాని తోటల్లో తేలికపాటి తడులు ఇస్తే పూమొగ్గలు విచ్చుకొని పుష్పగుచ్ఛాలు ఏర్పడుతాయి. పూ మొగ్గలు పిందెలుగా మారుతున్న దశలో చెట్లకు నీరు ఇవ్వడం మొదలు పెట్టి ఎరువులు వేసుకోవాలి. క్రమం తప్పక నీటి తడులు ఇస్తే త్వరగా పిందె కడుతుంది. అంతేకాక పిందె రాలిపోకుండా కాపాడుకోవచ్చు. తోటల్లో చీడపీడల నివారణకు సమగ్ర చర్యలు తీసుకుంటూనే పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలి. నీటి తడి అధికంగా కాకుండా పలుచగా ఇవ్వాలి. తెగుళ్ల నివారణకు సల్ఫర్, ఫ్లానా ఫిక్స్ స్ప్రే చేసుకోవాలి. 2.5 లీటర్ల నీటిలో ఒక ఎంఎల్ ద్రావణం కలిపి స్ప్రే చేసుకోవాలి. కొద్దిరోజులుగా మంచు బాగా కురుస్తుండడం, ఉదయం 7 – 8 గంటల వరకు ప్రభావం ఉండడంతో మామిడి చెట్ల పూత రాలుతోంది. అంతేకాక తోటల్లో బూడిద తెగులు, తేనెమంచు పురుగు, నల్లి(తామరపురుగు) ఆశిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈమేరకు ట్రాక్టర్ల ట్యాంకర్లో మందులు కలిపి తోటలపై పిచికారీ చేస్తున్నారు. తద్వారా మందులు, కూలీలు, ట్రాక్టర్ ఖర్చు కలిపి ఎకరానికి రూ.10 వేల వరకు అవుతోందని రైతులు వాపోతున్నారు. -
దివ్యాంగుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● ఇప్పటివరకు రూ.100 కోట్లు కేటాయించాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కమధిర: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్ల నిధులు కేటాయించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిరలో మంగళవారం ఆయన పలువురు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశాక మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో దివ్యాంగుల సంక్షేమానికి చేయలేని పనులను తాము రెండేళ్లలోనే చేసి చూపించామని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు ఐపాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు ఇస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో జన్మించిన వారిని సమాజంలో భాగం చేసుకోవాల్సి న బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య మాట్లాడుతూ తెలంగాణలో మాత్రమే అత్యధిక సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన మధిరలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. తొలుత మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో పూజలు చేసిన ఆయన శివాలయం సమీపాన వైరా నదిపై రూ. 65కోట్లతో నిర్మించే రిటైనింగ్ వాల్, రూ.75 కోట్లతో నిర్మించే వర్షపు నీటి నిర్వహణ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత, తహసీల్దార్ ఆర్.రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.వైరారూరల్: వచ్చే శివరాత్రి నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆయన స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరుగుతున్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాందాస్ నాయక్తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ సత్రం, కల్యాణ మండలం, స్నానఘట్టాల పనులను పరిశీలించిన ఆయన ఆశించిన మేర వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాశివరాత్రి కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్ నూతి వెంకటేశ్వరరావుతో పాటు దొడ్డా పుల్లయ్య, మల్లు రామకృష్ణ, వడ్డ నారాయణరావు, పొట్లపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మిస్ట్ అధ్యాపకుడికి డాక్టరేట్
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని మదర్థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ తాళ్లూరి మహేశ్వరరావుకు డాక్టరేట్ లభించింది. ‘బిహేవియర్ ఆఫ్ ప్లగ్జరల్ మెంబర్స్ విత్ పార్షి యల్ రీప్లేస్మెంట్ ఆఫ్ సిమెంట్ విత్ జీజీబీఎస్ అండ్ ఫైన్ అగ్రిగేట్ ఇన్ కార్పొరేటింగ్ క్లాసింక్ శాండ్’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథం సమర్పించగా తమిళనాడులోని అన్నామలై యూని వర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఈసందర్భంగా మహేశ్వరరావు ను ప్రిన్సిపాల్ చలసాని హరికృష్ణ, కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, అధ్యాపకులు సాయి ఇంద్రసేనారెడ్డి, రామచంద్రరావు మంగళవారం అభిందించారు. నేటి నుంచి శిక్షణ ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పీఎంశ్రీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఖమ్మంలోని డైట్ కళాశాల, టేకులపల్లిలోని గురుకుల కళాశాలల్లో ‘కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద యూసెజ్ ఆఫ్ ఐసీటీ టూల్స్’ అంశంపై శిక్షణ ఉంటుంది. ‘మంచుకొండ’ నుంచి నీటి విడుదల రఘునాథపాలెం: మండలంలోని వీవీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా మంగళవారం నీటిని విడుదల చేశారు. చెరువులకు నీరు అందించేందుకు గాను ఒక మోటార్ను ఆన్ చేసి నీరు విడుదల చేశామని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ నీటిని మల్లెపల్లిలోని రేగులకుంట చెరువుకు మళ్లించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వైద్యసేవలు పెనుబల్లి: పెనుబల్లిలోని నూతనంగా నిర్మించిన 50 పడకల ఆస్పత్రి ద్వారా త్వరలోనే పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్ తెలిపా రు. ఆస్పత్రికి మంగళవారం పరిశీలించిన ఆయన కావాల్సిన పరికరాలపై వైద్యాధికారి కిరణ్కుమార్తో చర్చించారు. గతంలో సింగరేణి సంస్థ ఇచ్చిన రూ.5.90 లక్షలతో దంత వైద్య పరికరాలు, ఆపరేషన్ టేబుళ్లు, ఇతరత్రా కొనుగోలు చేశామని తెలిపారు. ఇవికాక మిగతావి త్వరలో సమకూరుస్తామని డీసీహెచ్ఎస్ వెల్లడించారు. వైద్యులు రంజిత్, వరుణ్, సృజన, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ ఉద్యోగులకు ఆయుధాలు
● స్మగ్లర్లను ఎదుర్కొనేలా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం? ● జిల్లా మీదుగా గంజాయి రవాణా కట్టడికి ఉపయోగం ఖమ్మంక్రైం: నిజామాబాద్లో గంజాయి తరలిస్తున్న వారి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించిన మహిళ ఎకై ్సజ్ కానిస్టేబుల్ను స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీస్ శాఖ మాదిరిగానే ఎకై ్సజ్ ఉద్యోగులకు కూడా ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఒడిశా నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా చేసే వారు జిల్లా మీదుగా వెళ్తున్న నేపథ్యాన.. ఇక్కడి ఉద్యోగులకు ఆయుధాలు ఇస్తే స్మగ్లర్ల కట్టడి మరింత పకడ్బందీగా చేయొచ్చనే భావన వ్యక్తమవుతోంది. ఏపీలో మాదిరిగా.. ఎకై ్సజ్ ఉద్యోగులకు పోలీసుల మాదిరి ఆయుధాలు సాధ్యం అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది. పోలీసు శాఖలో చేరే వారిలాగే ఎకై ్సజ్ ఉద్యోగులు కూడా శిక్షణ పొందుతారు. కానీ పోలీసులకు అకాడమీలో తొమ్మిది నెలల శిక్షణ ఉంటే ఎకై ్సజ్ ఉద్యోగులకు మూడు నెలలు అకాడమీలో, మరో మూడు నెలలు కేటాయించిన ప్రాంతాల్లో శిక్షణ ఇస్తారు. ఇందులో ఎకై ్సజ్ ఉద్యోగులకు వారం పాటే ఫైరింగ్ శిక్షణ ఉంటుంది. ఈనేపథ్యాన ఉద్యోగులకు ఆయుధాలు ఇవ్వాలంటే మరోమారు ఫైరింగ్లో శిక్షణ తప్పనిసరవుతుంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో ఎకై ్సజ్ అకాడమీలో శిక్షణ సమయంలోనే ఉద్యోగులకు ఫైరింగ్లో పకడ్బందీ శిక్షణ ఇస్తుంటారు. ఈనేపథ్యాన తెలంగాణలో ఎకై ్సజ్ ఉద్యోగులకు ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయిస్తే.. ఏపీలో మాదిరి ఫైరింగ్ శిక్షణ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఏటా వందలాది కేసలు నమోదవుతుండగా, వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకంటున్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగులు ఇటీవల విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అయితే, నిజామాబాద్ ఘటనా దృష్ట్యా ఎప్పుడేం జరుగుతోందనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యాన ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు జిల్లా టాస్క్ఫోర్స్ ఉద్యోగులకు ఆయుధాలు ఇస్తే ఉపయోగమని భావిస్తుండగా.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
ఖమ్మం సహకారనగర్: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డితో కలిసి మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేయడమే కాక ఉద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పోలీసు కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్, సీపీఓ శ్రీనివాస్, డీపీఓ రాంబాబు, డీటీఓ జగదీష్, డీసీఓ గంగాధర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు ఎన్నికల కమిషనర్ వీసీ అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉద్యోగుల ఎంపిక శిక్షణ పూర్తయిందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటుచేసిన కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అంతేకాక నామినేషన్, పోలింగ్, లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించాలని, కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని


