breaking news
Khammam District News
-
మొరాయించిన స్పీడ్ బోటు
కిన్నెరసాని జలాశయం మధ్యలో పర్యాటకుల ఆందోళన పాల్వంచరూరల్: పర్యాటకులు ఆదివారం జలవిహారం చేస్తుండగా స్పీడ్ బోటు కిన్నెరసాని రిజర్వాయర్ మధ్యలో మొరాయించింది. జలాశయంలో మొసళ్ల సంచారం ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందారు. నెల క్రితమే బోటుకు మరమ్మతులు చేపట్టినా ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది. డ్రైవర్ మరమ్మతులు నిర్వహించగా తిరిగి స్టార్ట్ కావడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక రోజు ఆదాయం రూ. 50 వేలు... కిన్నెరసానికి పర్యాటకల రాకతో ఆదివారం ఒక్కరోజూ రూ. 50 వేల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 684 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.36,090 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.14,040 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొరవడిన పర్యవేక్షణ బోటింగ్ పాయింట్ వద్ద టూరిజం కార్పొరేషన్ మేనేజర్ నిత్యం పర్యాటకుల భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఆదివారం మేనేజర్ విధులకు రాలేదు. స్పీడ్ బోటు జలాశయం మధ్యలో నిలిచిపోవడంతో బోటింగ్ సమస్యపై ఎవరికీ ఫిర్యాదు చేయాలో అర్థం కాలేదని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు. అనంతరం కొందరు ఏజీఎంకు సమస్యను విన్నవించారు. ఈ విషయమై మేనేజర్ దుర్గాప్రసాద్ను వివరణ కోరగా.. అనారోగ్య సమస్యలతో విధులకు రాలేదని తెలిపారు. -
యాదవులను నిర్లక్ష్యం చేయొద్దు..
ఖమ్మంవ్యవసాయం: యాదవులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని అఖిలభారత యాదవ మహాసభ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న రామకృష్ణ ఫంక్షన్ హాల్లో మేకల నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం సమావేశం నిర్వహించగా అఖిల భారత యాదవ మహాసభ గౌరవ అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే గొర్రెల పథకాలు వచ్చాయని, సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో యాదవులకు సముచిత స్థానం దక్కుతుందనే ఆశలో ఉన్నామన్నారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకల వెంకటనర్సయ్య, జిల్లా యాదవ యువజన సంఘం అధ్యక్షుడు చిత్తారు సంహాద్రి మాట్లాడారు. సమావేశంలో యాదవ సంఘాల ప్రతినిధులు పుచ్చకాయల వీరభద్రం, చిన్నం మల్లేశ్, పగడాల మధు, దుబాకుల శ్రీనివాస్, అల్లిక అంజయ్య, మల్లెబోయిన ఉపేందర్, మంద నాగేశ్వరరావు, మేకల సైదులు, మెండె వెంకటేశ్, గోపిరాజు యాదవ్, వర్లబోయిన నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
చిక్కుముడి
మాఢవీధుల విస్తరణకు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అభివృద్ధికి చేపట్టిన మాఢవీధుల విస్తరణకు అడ్డు తొలగడం లేదు. దాదాపు అందరూ ఖాళీ చేసినా ఓ రెండు కుటుంబాల పేచీతో భూ సేకరణ పూర్తి కాలేదు. భూ సేకరణ పూర్తయితేనే రామాలయ అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. దీంతో భక్తులకు ఎదురుచూపులు తప్పడంలేదు. మేము నష్టపోయామంటున్న నిర్వాసితులు ప్రభుత్వంపై నమ్మకంతో రామాలయ అభివృద్ధికి సహకరించేందుకు ఆలయానికి పడమర, దక్షిణం వైపున ఉన్న చిరు వ్యాపారులు, ఇళ్ల యజమానులు గత నెల 10వ తేదీ తర్వాత ఖాళీ చేశారు. నష్టపరిహారం పూర్తిగా అందించలేదని, ప్రత్యామ్నాయఇంటి స్థలం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే తమ నివాసాలను ఖాళీ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వారు జేసీబీలతో ఇళ్లను కూల్చేశారు.నెల రోజులు దాటినా ఇతర ఇళ్లను ఖాళీచేయించలేదు. దీంతో తాము వ్యాపారం నష్టపోయామనిఖాళీ చేసిన నిర్వాసితులు పేర్కొంటున్నారు. పుష్కరాల నాటికై నా అవుతాయా..? రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అంటున్నా ప్రభుత్వ చిత్తశుద్ధిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు కావొస్తున్నా అభివృద్ధిలో కీలక ఘట్టమైన మాఢ వీధుల విస్తరణ భూ సేకరణకే నెలలపాటు సమయం తీసుకోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. భూ సేకరణ పూర్తయి, మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం ఆమోదించి, విడతలవారీగా బడ్జెట్ విడుదలైతేనే పనులు పూర్తవుతాయి. ఆ పనులన్నీ అయ్యేదెప్పుడు.. ఆలయంఅభివృద్ధి చెందేదెప్పుడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం గోదావరి పుష్కరాల నాటికై నా ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భూ సేకరణ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. భద్రాచల రామాలయ అభివృద్ధికి ఆటంకం! స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించని రెండు కుటుంబాలు భూ సేకరణ పూర్తయితేనే పనులు ప్రారంభం -
ఇక నిశ్చింతగా ఉండేలా..
కుటుంబీకులతో మాట్లాడేలా.. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మొత్తం 34 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉండగా వాటిలో 9 బాలుర, 25 బాలికల పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఫోన్ సౌకర్యాన్ని కల్పించింది. తొలిసారిగా ఇంటిని వదిలి గురుకులాల్లో చేరే వారు ఒత్తిడికి గురవుతుంటారు. ఒంటరిగా ఉన్నామని బాధపడుతుంటారు. వీరి బాధలను గుర్తించిన సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి ఫోన్మిత్రను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉండనుంది. ప్రతీ విద్యార్థికి కాలింగ్ కార్డు.. ప్రతీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టెలిఫోన్ బాక్స్లను ఏర్పా టు చేశారు. విద్యార్థులకు కాలింగ్ కార్డులను కేటా యించారు. దీని ద్వారా ముందుగా నమోదు చేసుకున్న తల్లిదండ్రులు, సంరక్షకులకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల యోగక్షేమాలను తెలుసుకోవచ్చు. అధికారుల దృష్టికి.. గురుకులాలలో ఏర్పాటు చేసిన ఫోన్ సౌకర్యం కేవలం ఫోన్ చేసుకోవడానికే కాదు.. విద్యార్థులకు ఒక సైకా లాజికల్ సేఫ్టీ నెట్గా ఉపయోగపడనుంది. కార్డులో ఏఐ ఆధారిత చాట్ బాక్స్తో ఉన్న నంబర్ ఆధారంగా ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు ఉంటే సంబంధిత అధికారికి నేరుగా సందేశం పంపవచ్చు. లేదంటే సొసైటీ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్కు ఫోన్ వెళ్తుంది. తద్వారా సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చు. ‘ఫోన్మిత్ర’ పేరిట గురుకులాలలో ఫోన్ సౌకర్యం ఇందుకు విద్యార్థులకు కాలింగ్ కార్డుల అందజేత తీరిన తల్లిదండ్రుల బాధలు ఉమ్మడి జిల్లాలో 34 గురుకులాల్లో ఏర్పాటుఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించాక ఇంటిబాట పట్టిన సమయాన వారితో కనీసం మాట్లాడటానికి ఫోన్ కూడా లేదని ఎంతో మదనపడేవారు. అలాగే విద్యార్థులు సైతం తల్లిదండ్రుల సమాచారం కోసం బెంగపడేవారు. కొందరు అక్కడ ఉండలేక ఇంటిబాట పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే కాలానుగుణంగా ప్రభుత్వం గురుకులాల్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పించి నాణ్యమైన బోధన అందించడంతో పాటు విద్యార్థుల యోగక్షేమాలు, ఇతర విషయాలను తల్లిదండ్రులకు చేరవేసేందుకు ఫోన్మిత్ర పేరిట ఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతీ విద్యార్థికి ఒక కాలింగ్ కార్డు ఇవ్వనుంది. – నేలకొండపల్లి -
సాఫీగా సాగేదెలా?
ఖమ్మం అర్బన్: జిల్లాలో సాగునీటికి ప్రధాన ఆధారమైన నాగార్జున సాగర్ ఎడమకాల్వలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ వానాకాలంలో సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం నెలకొంది. జిల్లాలో అధికారికంగా 2.54 లక్షల ఎకరాలు, లిఫ్ట్ల పరి ధిలో ఆయకట్టు కలిపితే మూడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సిన ప్రధాన కాల్వలపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు చేరకపోవచ్చనే ఆందోళన రైతుల్లో పెరుగుతోంది. గతేడాదే ఇబ్బంది పడ్డామని, ఈ సంవత్సరమైనా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పంటలకు సక్రమంగా నీరందించాలని రైతులు, వివిధ సంఘాల నాయకులు ఇటీవల కలెక్టరేట్ ఎదుట అందోళన చేశారు. తాత్కాలిక మరమ్మతులే.. గత వానాకాలంలో పాలేరు నుంచి సాగర్ ప్రధాన కాల్వలో పలు చోట్ల తీవ్రంగా గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు. ప్రధాన కాల్వ లతోపాటు బ్రాంచ్, మేజర్, మైనర్ కాల్వల్లో పూడిక పేరుకుపోయి, తూములు, షట్టర్లు ధ్వంసమై, చెట్లు పెరిగి నీరు సక్రమంగా వెళ్లే పరిస్థితి లేదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా జలవనరుల శాఖ అధికారులు సరైన దృష్టి పెట్టకపోవడం, అంచనాలకు తగ్గట్టుగా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు అసంతృప్తికి లోనవుతున్నారు. అన్ని చోట్లా అంతే.. కల్లూరు సర్కిల్ పరిధిలోని కల్లూరు, మధిర, సత్తుపల్లి డివిజన్లలో సాగర్ ఎడమ కాల్వ ఆధారంగా పంటలు వేస్తుంటారు. అయితే కాల్వల్లో పూడిక, చెత్త, పిచ్చిమొక్కలు పెరగడంతో చివరి భూములకు నీరందడం లేదు. ఏన్కూరు, కొణిజర్ల, మధిర, తల్లాడ మండలాల్లో కాల్వలు మరీ దయనీయ స్థితిలో ఉన్నాయి. ఏన్కూరు మండలంలోని మేడేపల్లి, రఘునాథపాలెం మండలం మూలగూడెం మధ్య 22 కిలోమీటర్ల మేర కంపచెట్లు ఉన్నాయి. వంతెనలు కూడా శిథిలావస్థకు చేరాయి. రెగ్యులేటర్ షట్టర్లు ధ్వంసమై నీరు బయటకు వెళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నిధులతో కాల్వ లకు ఆధునికీకరణ పనులు చేయగా, ఆ తర్వాత నామమాత్రంగానే పనులు జరగడం, కొత్తగా నిధులు మంజూరు కాకపోవడంతో మరమ్మతుల కోసం నిరీక్షిస్తున్నాయి. మధిర మండలంలో మేజర్ కాల్వల్లో చెట్ల్లు పెరిగి, పూడిక పేరుకుపోయి నీరు పారే పరిస్థితి లేదు. తూములు, షట్టర్లు ధ్వంసమై సాగునీరు వృథాగా వాగుల్లోకి వెళ్తుండగా పంటలు ఎండిపోతున్నాయి. పాలేరు – సాగర్ ప్రధాన కాల్వ లో గతేడాది ఏర్పడిన గండ్లకు ఇప్పటికీ పూర్తిగా మరమ్మతులు చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించకుంటే వానాకాలం పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. రూ.కోటితో ప్రధాన కాల్వ మరమ్మతులు.. సాగర్ ప్రధాన కాల్వ జిల్లా సరిహద్దు నుంచి ఏపీ సరిహద్దు వరకు ఖమ్మం, కల్లూరు సర్కిళ్ల పరిధిలో జంగిల్ క్లియరెన్స్ (కంపచెట్లు తొలిగింపు)యూటీ, హెడ్ వర్క్స్ మరమ్మతులకు రూ.కోటి మంజూరయ్యాయి. ఖమ్మం సర్కిల్లో రూ.40 లక్షల విలువైన పనులు సాగుతుండగా, కల్లూరు పరిధిలో రూ. 60 లక్షల విలువైన పనులకు టెండర్ల దశలోనే ఉన్నట్లు తెలిసింది. జంగిల్ తొలగించాక బలహీనంగా ఉన్న కాల్వకట్టలు, పూడికలను గుర్తించి మరమ్మతులు చేస్తామని అధికారులు చెబుతున్నారు.మరమ్మతులకు నోచుకోని సాగర్ కాల్వలు నీటి సరఫరాకు అడుగడుగునా అడ్డంకులే మెయిన్ కెనాల్లో జంగిల్ క్లియరెన్స్కు రూ.కోటి నిధులతో అంచనా ఖమ్మం సర్కిల్లో మొదలు.. కల్లూరులో ఖరారు కాని టెండర్లు పనులు సాగుతున్నాయి.. వరద కారణంగా దెబ్బతిన్న యూటీ మరమ్మతు పనులు వేగంగానే సాగుతున్నాయి. సాగర్ ప్రధాన కాల్వకట్టలపై చెట్ల తొలిగింపు పనులు చేస్తున్నాం. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు ఖమ్మం సర్కిల్ ఎస్ఈఆయకట్టుకు ఇబ్బంది రానివ్వొద్దు రైతులు సాగు మొదలు పెట్టిన తర్వాత కాకుండా ముందస్తుగానే సాగర్ ఆయకట్టు వరకు నీరందేలా అవసరమైన మరమ్మతులు చేయాలి. కాల్వల్లో చెట్లు పెరగడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాదైనా ఆ సమస్య లేకుండా చూడాలి. –బొంతు రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శియూటీ మరమ్మతులు.. గత ఏడాది వరదతో తెగిన యూటీ వద్ద రూ.14 కోట్ల అంచనాలతో పనులు కొనసాగుతున్నాయి. నీటి విడుదల నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈలోపు వానలు, వరదలు అడ్డంకిగా మారకుంటే పనులు పూర్తవుతాయి. లేదంటే మళ్లీ కష్టాలు తప్పవు. అధికారులు మాత్రం యూటీ మరమ్మతులు జూలై మొదటి వారం కల్లా పూర్తి చేస్తామని అంటున్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. కూచిపూడి నృత్యంలో చిన్నారి ప్రతిభఖమ్మంరూరల్ : మండలంలోని సూర్యనగర్కు చెందిన చిన్నారి గండికోట భువనచంద్రిక కూచిపూడి నృత్యంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్లో జరిగిన నృత్య పోటీల్లో పాల్గొన్న భువన.. మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో బాసర సరస్వతి అమ్మవారి అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా భువనను పలువురు అభినందించారు.మధిర – విజయవాడ బస్సు సర్వీస్ షురూ మధిర: మధిర డిపో పరిధిలోని జమలాపురం నుంచి మైలవరం మీదుగా విజయవాడకు నూతన బస్సు సర్వీస్ను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ డి.శంకర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ట్రిప్పులు సర్వీస్ ఉంటుందని, మధిర నుంచి ఉదయం 6, 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బయలు దేరుతుందని, విజయవాడ నుంచి ఉదయం 8.30,మధ్యాహ్నం 1.30, సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. బైక్ను ఢీకొట్టిన కారు చింతకాని: మండలంలోని నాగులవంచ సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఏపీలోని చిల్లకల్లు, చిట్యాల దేవాలయాల్లో పనిచేస్తున్న పూజారి వెంకటేశన్కు గాయాలయ్యాయి. వెంకటేశన్ ద్విచక్ర వాహనంపై ఖమ్మం వస్తుండగా నాగులవంచ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. గాయపడిన ఆయన్ను 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంజాయి పట్టివేత ఖమ్మంక్రైం: నగరంలోని త్రీటౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మోహన్బాబు కథనం ప్రకారం.. అగ్రహారం కాలనీకి చెందిన రాయల భోగి అలియాస్ యోగి, దానవాయిగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో నివసించే బానోత్ సాయి కలిసి బైక్పై వెళ్తుండగా.. మోతీనగర్ పార్కు వద్ద పోలీసులు తారపడ్డారు. దీంతో వారు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకుని, తనిఖీ చేయగా 200 గ్రాముల గంజాయి దొరికింది. వారిద్దరు అగ్రహారం కాలనీలో ఉండే నాగేంద్రబాబు (పండుఝ) నుంచి కొన్ని రోజుల కిందట 300 గ్రాముల గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు. -
ఆదర్శవంతంగా ఏదులాపురం
ఖమ్మంరూరల్ : నూతనంగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు రహదారుల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పథకాలను అందిస్తున్నామని, తద్వారా పేదలు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం చారిత్రక నిర్ణయమని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబ్్, ఈఈ యుగంధర్, ఆర్డీఓ నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ -
శిశువుకు ఆరోగ్య రక్ష
● నేటి నుంచి మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాలు ● మిస్సింగ్, డ్రాపౌట్ చిన్నారులకు వ్యాక్సినేషన్ ● 12 రకాల వ్యాధులకు 11 రకాల టీకాలుఏ టీకా ఎప్పుడు.. ●శిశువు జన్మించగానే టీబీ రాకుండా బీసీజీ, పోలీయో రాకుండా ఓపీవీ, కాలేయ సమస్యలు రాకుండా హెపటైటీస్ బీ టీకా వేస్తారు. ●ఆరు వారాలకు పెంటావాలెంట్, రోటావైరస్, ఓరల్ పోలియో, పీసీవీ, ఐపీవీ టీకాలు ఇస్తారు. ●పది వారాలకు పెంటావాలెంట్, ఓరల్ పోలియో, రోటావైరస్ టీకా ఇస్తారు. ●14 వారాలకు పెంటా వాలెంట్, రోటావైరస్, ఓరల్ పోలియో, పీసీవీ టీకా వేస్తారు. ●9 నుంచి 12 నెలల మధ్య మిజిల్స్, రుబెల్లా, జపనీస్ ఎన్సప్లైటీస్, పీసీవీ, ఐపీవీ టీకా ఇస్తారు. ●16 నుంచి 24 నెలల మధ్య ఎంఆర్, జేఈ, ఓరల్ పోలియో, డీపీటీ టీకా ఇస్తారు. ●5 నుంచి ఆరేళ్ల మధ్య డీపీటీ బూస్టర్–2 ●పదేళ్లకు టెటనస్ అండ్ డిఫ్తీరియా(టీడీ) వ్యాక్సిన్ ఇస్తారు. ●16 ఏళ్లకు టెటనస్ అండ్ డిఫ్తీరియా(టీడీ) వ్యాక్సిన్ వేస్తారు. ●గర్బిణీలకు టీడీ1, టీడీ2 లేదా టీడీ బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తారు.ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం సోమవారం నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. 12 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు 11 రకాల టీకాలు వేయనున్నారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. మిస్సింగ్, డ్రాపౌట్ పిల్లలను గుర్తించి టీకాలు ఇవ్వనున్నారు. గతంలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం ద్వారా ఏడు రకాల వ్యాధులకు టీకాలు వేయగా ప్రస్తుతం 12 రకాలకు పెంచారు. పోలియో, టీబీ, డిఫ్తీరియా, పెర్టుసిస్(వూపింగ్ దగ్గు), టెటనస్, పొంగు, రుబెల్లా, హెపటైటిస్ బీ, మెనింజైటిస్, హిమోఫిలస్ ఇన్ఫ్లూఝెంజా బీ(హెచ్ఐబీ), న్యూమోనియా, రోటా వైరస్, గ్యాస్ట్రోంటెరిటిస్ వ్యాధులు సంక్రమించకుండా టీకాలు అందిస్తారు. టీకాలు వేస్తూ.. అవగాహన కల్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం పిల్లల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తోంది. సాధారణంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం ఈ టీకాలు వేస్తుంటారు. పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో ప్రతీ బుధవారం టీకాలు వేస్తారు. మిగతా చోట్ల ప్రతీ శనివారం వేస్తారు. అయితే కొందరు తల్లిదండ్రులు వీటిపై అవగాహన లేక, మరిచిపోయి పిల్లలకు టీకాలు వేయించకుండా ఉంటారు. కాగా, ప్రతి సంవత్సరం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంతో అలాంటి వారిని గుర్తిస్తూ టీకాలు వేయడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. గర్భిణులకూ టీకాలు.. జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కోసం డ్రాపౌట్స్, మిస్సింగ్, లెఫ్ట్ ఔట్ శిశువులపై జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 904 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులకు కూడా టీకాలు వేయనున్నారు. ఇప్పటివరకు 214 మంది గర్భిణులను గుర్తించారు. ప్రత్యేకంగా సంచారజాతులు, మురికి వాడలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, రవాణా సౌకర్యంలేని తదితర ఏరియాలపై దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సద్వినియోగం చేసుకోవాలి మిషన్ ఇంద్రధనుష్ ద్వారా అందించే టీకాలు చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. ప్రాణాంతకమైన 12 రకాల వ్యాధులు రాకుండా కాపాడుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు నిర్దిష్ట సమయాల్లో సూచించిన టీకాలు వేయిస్తే ఆరోగ్యంగా ఉంటారు. సోమవారం నుంచి నిర్వహించే ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. – రమణ, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ -
‘రాజీవ్ స్వగృహ’ సాధనకు కృషి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని గెజిటెడ్ అధికారులకు ఇళ్ల స్థలాలకు బదులు రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ఇప్పించేలా కృషి చేస్తామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం తీసుకుంటామని చెప్పారు. ఖమ్మంలోని టీజీఓ కార్యాలయంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏలూరి మాట్లాడారు. ఫ్లాట్స్ కోసం ఇప్పటికే మంత్రులను కలిసి విన్నవించామని తెలిపారు. బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలని, హైదరాబాద్ స్థాయిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఖమ్మంలోని గెజిటెడ్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు చెప్పారు. సమావేశంలో హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా కిషోర్, పి.విజయ్కుమార్, టీజీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, టీజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి -
కొన్నే భళా.. మరిన్ని డీలా
● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు అంతంతే ● జిల్లా కేంద్రంలో మాత్రం ఆశాజనకంగా చేరికలు ● మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో దక్కని ఫలితం ప్రవేశాలు పెంచేలా చర్యలు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా కొన్ని అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. –రవిబాబు, డీఐఈఓ ప్రచారం చేస్తున్నాం.. విద్యార్థుల ప్రవేశాలు పెంచేలా ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. దీని ద్వారానే ప్రవేశాల సంఖ్య పెరిగింది. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో అందుతున్న విద్య, పాఠ్యపుస్తకాలు, సౌకర్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రవేశాలు పెంచుతున్నాం. –ఆర్.గోవిందరావు, ప్రిన్సిపాల్, శాంతినగర్ జూనియర్ కళాశాల, ఖమ్మంఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగడం లేదు. అధికారులు ఆది నుంచీ ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు రావడం లేదు. పలు కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది గతేడాది చివరి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని పదో తరగతి విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే ఖమ్మం నగరంలోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు అధికంగా ఉండగా.. మిగతా చోట్ల మాత్రం అరకొరగానే నమోదయ్యాయి. 1,632 మంది చేరిక.. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. ఇప్పటి వరకు 1,632 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. ఇందులో జనరల్ విభాగంలో 1,127, ఒకేషనల్లో 505 మంది విద్యార్థులు చేరారు. ఖమ్మంలోని ఏఎస్ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో 310 మంది చేరగా.. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 186 మంది, నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 166 మంది, కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 161 మంది, నయాబజార్ జూనియర్ కళాశాలలో 131 మంది ప్రవేశాలు పొందారు. కాగా, గతేడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాంతినగర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి ప్రతిభ చాటారు. దీంతో ఈ కళాశాలకు ఈసారి ఆదరణ లభించినట్లు తెలుస్తోంది. 31 వరకే గడువు.. గత నెల నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు విస్తృత ప్రచారం నిర్వహించిన అధ్యాపకులు.. ఈనెల ఒకటో తేదీ నుంచి కళాశాలలను పునఃప్రారంభించారు. కాగా, ప్రవేశాల గడువు ఈ నెల 31 వరకే ఉంది. జిల్లాలోని 21 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులతోపాటు ఒకేషనల్కు సంబంధించి మొత్తంగా 8,882 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉండగా.. ఇప్పటి వరకు 1,632 మంది మాత్రమే చేరడం గమనార్హం. గతేడాది సుమారు 3,500 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందగా.. ఈసారి అంతమంది విద్యార్థులు చేరే అవకాశం లేదనే చర్చ సాగుతోంది. సమయం గడుస్తున్నా అడ్మిషన్లు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. అతి తక్కువ ఇక్కడే.. జిల్లాలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో చాలా తక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు ఇద్దరే చేరగా.. కామేపల్లి జూనియర్ కళాశాలలో ఐదుగురు, కందుకూరు బండి సీతారత్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 మంది, కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 15 మంది, ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 29 మంది, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కళాశాలలో 33 మంది, సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 48 మంది మాత్రమే చేరారు. మిగతా కళాశాలల్లో 50కి పైగా ప్రవేశాలు జరిగినా కేటాయించిన సీట్లతో పోలిస్తే పావు వంతు కూడా చేరలేదు. అయితే అధికారులు మాత్రం కొన్ని అడ్మిషన్లు ఆన్లైన్ చేయాల్సి ఉందని చెబుతుండటం గమనార్హం. -
బ్లాస్టింగ్తో ఉలిక్కిపడిన చెన్నారంవాసులు
నేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో పొలాల్లోని బండరాళ్లను బ్లాస్టింగ్ చేయగా పరిసర ప్రాంతంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆదివారం పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్లాస్టింగ్ చేయడంతో ప్రజలు ఏంజరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. పెద్ద బండ రాళ్లు ఇళ్లపై పడ్డాయి. గంజికుంట్ల వరలక్ష్మికి తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబానికి పరిహారం అందజేతరఘునాథపాలెం: మండలంలోని వేపకుంట్ల గ్రామానికి చెందిన మేక వెంకన్న విద్యుదాఘాతంతో మృతిచెందగా.. ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ఆదివారం అందించారు. వెంకన్న 2024 నవంబర్ 21న విద్యుదాఘాతంతో మృతిచెందగా విద్యుత్ శాఖ నుంచి నష్టపరిహారం మంజూరైంది. చెక్కును మాజీ సర్పంచ్ రమేశ్ అందించారు. ఇరాన్పై దాడి హేయమైన చర్యఖమ్మంమయూరిసెంటర్: మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోసం ఇజ్రాయిల్కు అండగా ఉంటూ అమెరికా నేరుగా ఇరాన్పై దాడి చేయడాన్ని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ తీవ్రంగా ఖండిస్తోందని, ఇది హేయమైన చర్య అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది యుద్ధ ఉన్మాద దురాక్రమణ చర్య అని, ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి అని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం అమెరికా ఎన్నో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు చేస్తోందని, పాలకులను అనుకూలంగా మార్చుకుంటోందని, స్వతంత్రంగా వ్యవహరించే వారిని హతమారుస్తోందని ఆరోపించారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతి ఏన్కూరు: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన మండలంలోని టీఎల్ పేటలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామవాసి షేక్ సైదులుకు చెందిన ఎద్దు పొలంలో మేత మేసేందుకు వెళ్లి.. అక్కడే తెగి పడి ఉన్న 11 కేవీ విద్యుత్ వైరును తగిలి షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్శాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. కాగా, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
కార్మికవర్గ ఐక్యతే ఎస్డబ్ల్యూఎఫ్ లక్ష్యం
● ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధనకు ఉద్యమించండి ● సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్ఖమ్మంమయూరిసెంటర్ : ఆర్టీసీ కార్మికుల ఐక్యతకు వారధిగా.. పోరాటాల సారథిగా, కార్మికవర్గ ఐక్యతే లక్ష్యంగా ఎస్డబ్ల్యూఎఫ్ పని చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఖమ్మం ఐఎంఏ హాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు నష్టం కలిగించే ప్రభుత్వ, యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడే సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ ఒక్కటేనని చెప్పారు. సంస్థలో 55 రోజుల పాటు జరిగిన సమ్మెకు సీఐటీయూ అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీని పరిరక్షించేది ఐక్య పోరాటమేనని పిలుపునిచ్చారు. కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు, ఆర్టీసీ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్ విధానాలు, ఎలక్ట్రికల్ బస్సులు, పెరిగిన పనిభారాలు అన్నీ కూడా ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితమేనని విమర్శించారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మహాసభలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఉమెన్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్వీ రమ, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి అర్ముగనాయర్, ఏపీ ఎస్డబ్ల్యూఎఫ్ కోశాధికారి దివాకర్, ఆహ్వాన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వరరావు, పిట్టల సుధాకర్, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి, ఆర్టీసీ శ్రామిక మహిళా కమిటీ నాయకులు పద్మావతి, వివిధ విభా గాల నాయకులు మాధవరావు, రోశయ్య, పగిళ్లపల్లి నరసింహారావు, గడ్డం వెంకటయ్య, వి.రమేష్, బుగ్గవీటి లింగమూర్తి, భాగ్యలక్ష్మి, మల్లికాంబ, పద్మ, విజయలక్ష్మి, సరిత, సీతారామారావు పాల్గొన్నారు. -
నీటి చుక్క నిలవక..
మైదానాన్ని తలపిస్తున్న పెదవాగు ప్రాజెక్ట్ వానాకాలం సీజన్లో ఏటా సాగునీటితో నిండే పెదవాగు ప్రాజెక్ట్ ఈ ఏడాది మాత్రం పచ్చదనం పర్చుకుంది. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లివద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆనకట్టకు భారీ గండి కోతకు గురైంది. ఈ ఏడాది వానాకాలం సీజన్కు ముందే ప్రాజెక్ట్ను తిరిగి నిర్మిస్తామని పాలకులు హామీ ఇచ్చారు. వరద ఉధృతికి ఆనకట్ట కొట్టుకుపోయినట్లే ఆ హామీ కూడా కొట్టుకుపోయి గోదారిలో కలిసింది. దీంతో ప్రాజెక్ట్లో సాగునీరు నిలవక పచ్చదనంతో నిండి క్రికెట్ మైదానంలా కనిపిస్తోంది. మరోవైపు ఆయకట్టు రైతులు సాగునీటి కోసం మనోవేదన చెందుతున్నారు. –అశ్వారావుపేటరూరల్ -
సాహిత్యంలో ధిక్కార స్వరాలు
● రచనలతో చైతన్యపరిచిన దాశరథి, ఆరుద్ర ● జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఘంటా చక్రపాణి ఖమ్మం సహకారనగర్: సామాజిక పరిణామాలపైనే కాక స్వాతంత్య్రానంతరం దేశంలోని మార్పులపై తమ సాహిత్యం, రచనల ద్వారా దాశరథి, ఆరుద్ర ధిక్కార స్వరం వినిపించారని డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. అంతేకాక తమదైన రచనా శైలితో ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. ఖమ్మంలోని ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన ‘శతజయంతి సాహితీమూర్తులు – దాశరథి, ఆరుద్ర జీవితం – సాహిత్యం’పై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చక్రపాణి మాట్లాడుతూ దాశరథి తెలంగాణ జీవన స్వరమన్నారు. ఖమ్మంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన పాదముద్రలు పడిన ఖమ్మంలో శతజయంతి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన సాహిత్యం, పాటలు ఉత్తేజం, స్ఫూర్తిని కలిగించాయన్నారు. ఇక ఆరుద్ర గొప్ప పరిశోధకుడిగా, కవిత్వంలో ప్రయోగాలకు ఆధునికుడిలా నిలిచారని తెలిపారు. సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం, నిజాం నిరంకుశ పాలన కాలపు బడుగుల కన్నీళ్లను అక్షరబద్ధం చేశారన్నారు. స్వీయ అనుభవాలు, సామాజిక పరిణామాలు దాశరథి ప్రతీ రచనలో కనిపిస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ పూర్వ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఖమ్మం సాహిత్య గుమ్మం అని, ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సు చరిత్ర పుటల్లో నిలుస్తుందని చెప్పారు. అనంతరం బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ ఈ తరం విద్యార్థులు దాశరథి, ఆరుద్రల సాహిత్య సారాంశాన్ని తప్పక అధ్యయనం చేయాలని సూచించారు. సాహిత్య విశ్లేషకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ దాశరథి తెలంగాణకు సాహిత్య దీపదారిగా నిలవడమేకాక తన రచనలతో సమాజాన్ని మేల్కొలిపారని వెల్లడించారు. స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎన్.కిషోర్రెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూక్యా భాంగ్యా, సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.రవికుమార్ మాట్లాడగా డాక్టర్ సీతారాం, రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికచట్టాల రక్షణకు పోరాటం
● జూలై 9న జాతీయ సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలి ● ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా రవాణా రంగంతో పాటు కార్మిక చట్టాలను కాపాడుకునేలా ప్రజా ఉద్యమాలకు రూపకల్పన జరగాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య(ఏఐఆర్డబ్ల్యూఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య అన్నారు. ఇందుకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) మహాసభలు వేదికగా నిలవాలని సూచించారు. ఖమ్మంలో శనివారం ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు మొదలుకాగా, రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు జెండా ఆవిష్కరించాక అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూనే సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేయాలని సూచించారు. వచ్చేనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికవర్గం పాల్గొని నిరసన తెలపాలని కోరారు. వివిధ సంఘాల నాయకులు అశ్వద్ధామరెడ్డి, పాటి అప్పారావు, థామస్రెడ్డి, బత్తినేని హనుమంతరావు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తామని ప్రకటించారు. ఈసమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ.ఎస్.రావుతో పాటు కళ్యాణం వెంకటేశ్వరరావు, పి.శ్రీకాంత్, సీహెచ్.సుందరయ్య, ఎంఎన్.రెడ్డి, రాములు, ఎంవీఎస్ఎస్.నారాయణ, గుండు మాధవరావు, గడ్డం లింగమూర్తి, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, పద్మావతి, పి.రవీందర్రెడ్డి, బిక్షపతిగౌడ్, బత్తుల సుధాకర్, పిట్టల సుధాకర్, విక్రం, జిల్లా ఉపేందర్, రోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూల విరాట్తో పాటు శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాలు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల పరిధిలో రోడ్ల విస్తరణ, బీటీ రోడ్లు నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత నల్లగొండ జిల్లా నకిరేకల్లో పర్యటనకు మంత్రి పొంగులేటి బయలుదేరతారు. 26న డాక్ అదాలత్ ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు ఈనెల 26వ తేదీన ఆన్లైన్ విధానంలో డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని తపాలా సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఫిర్యాదులను ఈనెల 24వ తేదీలోగా ‘డాక్ అదాలత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, ఖమ్మం–507003’ చిరునామాకు పంపించాలని సూచించారు. ఫిర్యాదుతో పాటు మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ జత చేస్తే, అదాలత్ సమయాన వారిని లింక్ చేసి సమస్యను చర్చిస్తామని తెలిపారు. డిగ్రీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని మహా త్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కాలేజీలో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 25న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపా రు. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో సీట్లను రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయనుండగా 25న ఉదయం 11గంటలకు స్పాట్ కౌన్సెలింగ్ మొదలవుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, టీసీ, కుల, ఆదా య, ఫిట్నెస్, స్థానికత ధ్రువపత్రాలతో పాటు పది పాస్పోర్ట్ సైట్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. వివరాలకు 99639 30931, 70326 32863 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. యూపీఎస్సీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: యూపీఎస్సీ సివిల్స్కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు హైదరాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనుండగా, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రతులను ‘డైరెక్టర్, టీజీఎస్సీ స్టడీ సర్కిల్, రోడ్డు నంబర్ 14, కేబీఆర్ పార్కు ఎదుట, బంజారాహిల్స్, హైదరాబాద్’ చిరునామాలో వచ్చేనెల 7లోగా అందజేయాలని సూచించారు. వచ్చేనెల 13న ఇంగ్లిష్ మీడియంలో నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 040–23546552, 81216 26432, 90320 77276 నంబర్లలో సంప్రదించాలని డీడీ సూచించారు. 9ఎకరాల వరకు పెట్టుబడి సాయం జమ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రపభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా శనివారం నాటికి తొమ్మిది ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయింది. జిల్లాలో 3,53,794 మంది రైతులను అర్హులుగా గుర్తించగా, రూ. 436,84,65,365 అందాల్సి ఉంది. ఇందులో శనివారం నాటికి 3,20,105 మంది రైతుల ఖాతాల్లో రూ.347,18,42,096 జమ అయ్యాయని డీఏఓ పుల్లయ్య తెలిపారు. -
వన మహోత్సవానికి సిద్ధం
● 571 నర్సరీల్లో 25లక్షల మొక్కలు రెడీ ● ఈసారి 3.50 లక్షల తాటి, ఈత మొక్కలు ప్రత్యేకం ● ప్రభుత్వ ఆదేశాలు రాగానే ప్రారంభం ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవానికి సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ఆధ్వర్యాన నర్సరీల్లో మొక్కలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈసారి పర్యావరణ పరిరక్షణతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తాటి, ఈత మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. జిల్లాలోని 20మండలాల్లో 571 నర్సరీల్లో 25 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 3.50 లక్షల తాటి, ఈత మొక్కలు సిద్దం చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాల అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షలో తాటి, ఈత మొక్కల పెంపకంపై చేసిన సూచనలతో అధికారులు జిల్లాలో లక్ష్యం మేరకు నాటాలని నిర్ణయించారు. పర్యావరణం.. జీవనోపాధి గతంలో హరితహారం, వన మహోత్సవంలో నీడనిచ్చే మొక్కలతో పాటు పూలు, పండ్లు, మూలికల మొక్కలే నాటారు. ఈసారి తాటి, ఈత మొక్కలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మొక్కలు నేల కోతను సమర్థవంతంగా అరికట్టి భూగర్భ జలాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాతావరణ సమతుల్యత కాపాడడమే కాక కార్బన్ డై ఆకై ్సడ్ను తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి. తాటి, ఈత చెట్లు దీర్ఘకాలం జీవిస్తూ పర్యావరణ పరిరక్షణకే కాక ఉపాధికి ఊతమిస్తాయి. వీటి నుంచి లభించే కల్లు, తాటి బెల్లం, ఈత పళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పలువురికి జీవనోపాధిని కల్పిస్తాయి. ప్రణాళికాయుతంగా నిర్వహణ వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో డీఆర్డీఏ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేలా అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంగణాలు, గ్రామీణ రోడ్ల పక్కన ఖాళీ స్థలాలే కాక సామూహిక భూములను ఎంపిక చేస్తున్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేలా అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ చేయడం, క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ప్రతీ మొక్కను బతికించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. హరిత స్ఫూర్తితో ముందుకు.. వన మహోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగానే కాక జిల్లా వాసుల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా కనీసం ఒక మొక్క అయినా నాటి సంరక్షించాలని కోరుతున్నారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల బాధ్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా కార్యాచరణ రూపొందించారు. పచ్చదనం పెంచడం వ్యక్తిగత కృషి మాత్రమే కాక సామాజిక బాధ్యత కూడా అని అవగాహన కల్పించనున్నారు. -
భూభారతీ.. భారం మీదే
జిల్లాలో అత్యధిక దరఖాస్తులు వచ్చిన మండలాలు మండలం దరఖాస్తులు కారేపల్లి 6,114 కొణిజర్ల 5,539 ఏన్కూరు 4,994 కల్లూరు 4,866 పెనుబల్లి 4,653 తల్లాడ 4,567 కామేపల్లి 4,527 కూసుమంచి 3,877 వేంసూరు 3,830 రఘునాథపాలెం 3,534 వైరా 3,344 తిరుమలాయపాలెం 3,097 ఎర్రుపాలెం 3,040సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా ఈనెల 3నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు శుక్రవారం ముగిశాయి. అధికారులు బృందాలుగా విడిపోయి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో సమస్యల పరిష్కారం కోసం రైతులు 67,378 దరఖాస్తులు అందజేశారు. తొలిదశలో పైలట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో కలిపి 6,085 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా మొత్తం 73,463 దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అయితే, నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో అందిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం ఇప్పటికే కొనసాగుతోంది. మిగిలిన మండలాల్లో అందిన ఆర్జీలపై త్వరలోనే దృష్టి సారించనున్నారు. అయితే, మొత్తంగా అందిన దరఖాస్తుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే ఉండడం విశేషం. ఆ రెండు మండలాల్లో తొలుత.. భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన పైలట్ మండలాల్లో నేలకొండపల్లి కూడా ఉంది. దీంతో ఈ మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించగా 3,224 మంది రైతులు దరఖాస్తులు ఇచ్చారు. రెండో విడతలో బోనకల్ మండలాన్ని ఎంపిక చేయగా ఇక్కడ 2,861 దరఖాస్తులు వచ్చాయి. రెండు మండలాల్లో సాదాబైనామాపైనే దరఖాస్తులు ఎక్కువగా అందాయి. వీటిని పక్కన పెట్టి మిగతా దరఖాస్తులకు సంబంధించి నేలకొండపల్లి మండలంలో 354 పరిష్కరించగా, బోనకల్ మండలంలోనూ క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతోంది. తుది నిర్ణయం వచ్చాకే.. రైతులు వివిధ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వగా అత్యధికంగా 40,872 దరఖాస్తులు సాదాబైనామాలపైనే రావడం గమనార్హం. ఇక సర్వేనంబర్లు తప్పుగా నమోదయ్యాయని 4,390, మ్యుటేషన్ కోసం 956 దరఖాస్తులు ఇచ్చారు. అలాగే, పాస్ పుస్తకాల్లో పట్టేదారు వివరాల నమోదుకు 187, ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగింపునకు 355 దరఖాస్తులు వచ్చాయి. అయితే, సాదా బైనామాలకు సంబంధించిన ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉండడంతో అధికారులు వీటి పరిశీలన మొదలుపెట్టలేదు. దీంతో రైతులు ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. పరిశీలనకు కసరత్తు జిల్లాలో నిర్వహించిన సదస్సుల్లో అందిన దరఖా స్తులను ఆన్లైన్లో నమోదు చేసి పరిశీలించాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో ఆన్లైన్ నమోదు ప్రక్రియ ముగి యగా పరిశీలన, పరిష్కారం ఊపందుకున్నాయి. మిగిలిన మండలాల్లోనూ అధికారులు సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాక పరిష్కా రంపై దృష్టి సారించనున్నారు. ఓసారి నిర్ణయం వెలు వరించాక భవిష్యత్లో మరోసారి వివాదం, ఘర్షణ జరగొద్దనే భావనతోనే పకడ్బందీగా పరిశీలన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల ఆన్లైన్, పరిశీలనపై అధికారుల దృష్టి నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహణ మిగతా 19మండలాల్లో 67,378 దరఖాస్తుల స్వీకరణ సాదాబైనామా కోసం అత్యధికంగా 40,872..19 మండలాలు..339 గ్రామాలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రెండు మండలాలు మినహా మిగిలిన 19 మండలాల్లో ఈనెల 3 నుంచి భూభారతి చట్టం అమలు ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాల్లో శుక్రవారం వరకు కొనసాగాయి. అధికారుల బృందం 339 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూభారతి చట్టంతో ఉపయోగాలు, రైతుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో అవగాహన కల్పించారు. దీంతో ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు వెల్లువలా 67వేలకు పైగా దరఖాస్తులు సమర్పించగా అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
లాకులకు లీకులు..
● పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోని గేట్లు ● నిధులున్నా టెండర్లకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు ● కిన్నెరసాని ప్రాజెక్ట్కు పొంచి ఉన్న ముప్పు ● ప్రమాదమేమీ లేదని కొట్టిపారేస్తున్న జెన్కో అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచాం.. కిన్నెరసాని గేట్ల మరమ్మతుల కోసం రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గత నెల 6న, 22న, ఈ నెల 3న... మూ డు సార్లు టెండర్లు పిలిచాం. కానీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందురావడంలేదు. డ్యామ్లో నీటిమట్టం 393 అడుగులు ఉంటేనే మరమ్మతులు చేసే అవకాశంఉంటుంది. గేట్ల మధ్య సీల్స్ ఏర్పాటు, రోప్ మార్పు, పెయింటింగ్ పనులు నిర్వహిస్తాం. డ్యామ్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. – ప్రభాకర్రావు, కేటీపీఎస్ 5వ దశ సీఈపాల్వంచరూరల్: పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చడంతోపాటు తాగు, సాగునీరు అందించే కిన్నెరసాని ప్రాజెక్ట్కు ప్రమాదం పొంచిఉంది. పదేళ్లుగా ప్రాజెక్ట్ గేట్లు(లాకులు) మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో గేట్ల మధ్య లీకులు ఏర్పడి జలాశయం నుంచి నీరు వృథాగా పోతోంది. రెండు, మూడేళ్లుగా గేట్ల రబ్బర్ సీల్స్ లీకై నీళ్లు బయటకు వస్తున్నాయి. లీకేజీ చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు, పరీవాహక ప్రాంతాల ప్రజ లు పేర్కొంటున్నారు. గేట్లకు సంబంధించిన పిల్ల ర్లు కూడా దెబ్బతింటున్నాయి. మరమ్మతులకు అవసరమైన నిధులున్నా పనులు చేపట్టడంలేదు. ప్రా జెక్ట్ నిర్వహణ చూస్తున్న జెన్కో (కేటీపీఎస్) అధి కారులు మేల్కొనకపోతే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు కిన్నెరసాని రిజర్వాయర్ నిర్మాణం 1962లో ప్రారంభించి 1972లో పూర్తిచేశారు. 13క్రస్ట్గేట్లతో 407 అడుగుల గరిష్ట నీటిమట్టంతో 8.4 టీఎంసీల నిల్వసామర్థ్యంతో జలాశయం నిర్మిం చారు. తొలుత ప్రాజెక్ట్ను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షించగా, 1998 ఏప్రిల్ 1 నుంచి జెన్ కో పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్ట్ నిర్మించి ఆరు దశాబ్దాలు గడుస్తుండగా మధ్యలో జెన్కో అధికారులు కరకట్టను పటిష్టపరిచే పనులు చేపట్టారు. 2014లో రూ.60 లక్షలతో 13 క్రస్ట్ గేట్లకు రోప్ వే, సాకెట్లను మార్చారు. దీంతో వీటిని మరో పదేళ్లు మార్చాల్సిన అవసరం లేదు. కాగా కిన్నెరసాని జలాశయం విస్తీర్ణం 515 చదరపు మీటర్లు, డ్యామ్ ఎత్తు 39మీటర్లు, పొడవు 2.4 కిలోమీటర్లుగా ఉంది. కేటీపీఎస్లో విద్యుదుత్పత్తికి, ఎన్ఎండీసీ, నవభారత్, కర్మాగారాలకు కిన్నెరసాని నీరు సరఫరా చేస్తారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు తాగునీరు ఇక్కడి నుంచే వెళ్తుంది. పాల్వంచ మండలంలో మూడు వేలు, బూ ర్గంపాడు మండలంలో 7వేల ఎకరాల భూమికి సాగునీరు కూడా అందిస్తోంది. పదేళ్ల క్రితం మరమ్మతులు గేట్లకు పదేళ్లక్రితం మరమ్మతులు నిర్వహించారు. నా లుగైదు ఏళ్లకోసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా జెన్కో అధికారులు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్లోని నీటిమట్టం 393 అడుగుల లోపు ఉంటేనే మరమ్మతు పనులు చేపట్టేందుకు వీలవుతుంది. అంతకంటే ఎక్కువగా పెరిగితే పనులు సాధ్యం కావని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఒకటోగేటు నుంచి నాలుగో గేటు వరకు, 13వ నంబర్ గేట మధ్య పిల్లర్లకు బీటలు వారాయి. దీంతో పిల్లర్ల మధ్య నీటి చెమ్మ అధికంగా కన్పిస్తోంది. గేట్ల మధ్య రబ్బర్ సీల్స్ కూడా లీకవుతుండటంతో రిజర్వాయర్ నుంచి నీరు వృథాగాపోతోంది. అయితే ఈ లీకులతో ప్రమాదమేమీ లేదని కేటీపీఎస్ అధికారులు చెబుతున్నా రు. రిజర్వాయర్లోనీటిమట్టం 400అడుగులకు మిం చి పెరిగినప్పుడే బీటలనుంచి నీళ్లు బయటకు వస్తుందని పేర్కొంటున్నారు. పరీవాహక గ్రామాల ప్రజ లు, ఆయకట్టు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే మరమ్మతులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం జరిగే అవకాశముందనిఆవేదన చెందుతున్నారు. కాగా పిల్లర్ల మరమ్మతులు, ఇతర పనులకు ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ పథకం డ్రిప్ ఇరిగేషన్ కింద రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. కట్ట పటిష్టతకు రూ.1.90 కోట్లు కిన్నెరసాని జలాశయం కరకట్ట పటిష్టతకు రూ.1.90కోట్లు, గేట్ల మరమ్మతులకు రూ.1.20 కోట్లను జెన్కో మంజూరు చేసింది. పుణేలోని సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీడబ్ల్యూపీఆర్ఎస్) నుంచి నిపుణులు వచ్చి అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాకే పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులతోపాటు భవిష్యత్లో ఎదురయ్యే పరిణామాలను తట్టుకునేలా నిపుణులు అధ్యయనం చేసి సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. ఇక గేట్ల మరమ్మతులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రక్తంగా జరిపించారు. ఈ – టికెట్లపై భక్తులకు అవగాహన భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు దర్శనం, ప్రసాదాలు ఇతర సేవలకు గాను రామాలయంలో ఏర్పాటు చేసిన మిషన్లపై ఈఓ ఎల్.రమాదేవి శనివారం భక్తులకు అవగాహన కల్పించారు. తొలుత ఈ మిషన్లకు పూజలు నిర్వహించాక యంత్రాల్లో ఉన్న సదుపాయాలు, ఈ టికెట్లు పొందే విధానం గురించి వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. భక్తులు సైతం ఈ టికెట్లు తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీందర్, ఏఈఓ భవాని రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు. -
బడిలో సెల్కు చెల్లు
● తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్ మాట్లాడొద్దు ● స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ● పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని నిర్ణయంవైరా: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇకపై తరగతి గదిలో సెల్ఫోన్ మాట్లాడడం నిషేధం. ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం కొద్దిరోజుల క్రితం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తరగతి గదిలో ఉన్న సమయాన సెల్ఫోన్లో మాట్లాడితే చర్యలు ఉంటాయని అందులో వెల్లడించింది. రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఫోన్లు మాట్లాడడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని నిపుణుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఉపాధ్యాయులు స్వీయ నియంత్రణ పాటిస్తూ సెల్ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని సూచించింది. సమయం వృథా కాకుండా.. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్ మాట్లాడడం ద్వారా సమయం వృథా అవుతుందని, విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతింటుందని చెబుతున్నారు. అంతేకాక ఫోన్లో మాట్లాడగానే అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు వెంటనే పాఠ్యాంశంలో నిమగ్నం కావడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. ఈ విషయమై విద్యావేత్తల నుంచి అందిన సమాచారంతో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా, ఉపాధ్యాయులు తరగతి గదిలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకో వాలి. రాగానే స్టాఫ్రూమ్లో పెట్టడం.. విరామ సమయాల్లోనూ చూసేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కఠిన చర్యలు తీసుకుంటాం.. ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దు. పాఠం మధ్యలో ఫోన్ మాట్లాడినట్లు తేలితే చర్యలు తప్పవు. స్కూల్కు ఫోన్ తీసుకొచ్చినా హెచ్ఎంకు అప్పగించాలి. మధ్యలో వినియోగిస్తే బోధనలో ఏకాగ్రత దెబ్బతింటుంది. – సామినేని సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి ప్రభుత్వ నిర్ణయం మంచిదే.. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనివేళల్లో సెల్ఫోన్ వాడకుండా తీసుకున్న నిర్ణయం మంచిదే. తద్వారా విద్యార్థులు, బోధనకు పూర్తి సమయాన్ని కేటాయించొచ్చు. విద్యార్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. – దొడ్డా వరప్రసాద్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
వృద్ధుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంఅర్బన్: వృద్ధుల మానసిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించా ల ని, తద్వారా వారిని కాపాడుకోవచ్చని మాజీ మంత్రి, మమత విద్యాసంస్థల చైర్మన్ పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో ‘వృద్ధుల మానసిక ఆరోగ్యం’ అంశంపై ఏర్పాటుచేసిన రాష్ట్ర మానసిక వైద్యుల సదస్సును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారిలో ఒంటరితనం, మతిమరుపు సమస్యలపై చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. పరిశోధకులు, వైద్యులు, వైద్యవిద్యార్థులు ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణశాఖ అధ్యక్షుడు డాక్టర్ అశోక్, మమతా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ నరేన్రాజ్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ దక్షిణ మండల శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఉమాశంకర్తో పాటు డాక్టర్ ప్రసాద్రావు, డాక్టర్ జార్జ్రెడ్డి, డాక్టర్ సతీష్బాబు, డాక్టర్ నారా యణరావు, డాక్టర్ ఆకుల విశాల్, డాక్టర్ రాయిరాల అనిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలి ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీ య స్థాయికి ఎదిగిన క్రీడాకారులను వర్ధమాన క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకుని సత్తా చాటాలని ఖమ్మం మేయర్ పి.నీరజ సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీ రక దృఢత్వంతో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. బాడ్మింటన్ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నాటి వీరభద్రం మాట్లాడగా కార్పొరేటర్ కమర్తపు మురళి, అసోసియేషన్ బాధ్యులు దుద్ధుకూరి సత్యనారాయణ, వి. చంద్రశేఖర్, సిరిపురపు సుదర్శన్రావు, పాటిబండ్ల యుగంధర్, నల్లమోతు రఘు పాల్గొన్నారు. విజేతలు వీరే.. జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతల వివరా లను నిర్వాహకులు ప్రకటించా రు. బాలుర అండర్–13 సింగిల్స్లో బి.రేవంత్కుమార్, వి.అశ్వినిరాజ్, డబుల్స్లో బి.రేవంత్కుమార్ – అశ్వినిరాజ్, శశివర్ధన్ – సాహిత్, బాలికల అండర్–13 సింగిల్స్లో ఎం.చరితశ్రీ, జి.నిత్యసంతోషిని, డబుల్స్లో జి. నిత్య – ఎం.చరితశ్రీ, టి.నవియా, ఓంశ్రీల వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అలాగే, అండర్–15 బాలుర సింగిల్స్లో వి.మేఘవర్షిత్, ఎస్.స్వప్నిల్, డబుల్స్లో కె.విశ్వతేజ – స్వప్నిల్, కె.నిశాంత్సాయి– బి.అభినవ్, అండర్–17 బాలుర సింగిల్స్లో ఏ.వినయ్, తేజస్ వివేక్, డబుల్స్లో ఏ.వినయ్ – డి.తేజస్ వివేక్, విశ్వతేజ్ – ఎస్.నిఖిల్, బాలికల సింగిల్స్లో హర్షిత, బి.ధరణి, బాలికల అండర్–15 సింగిల్స్లో వై.హోషిత, జె.అన్విత, బాలుర అండర్–19 సింగిల్స్లో డి.తేజస్ వివేక్, ఏ.వినయ్, డబుల్స్లో యశ్వంత్ – ప్రర్థవిన్, ఎం.రాజీవ్ – ఎస్.నిఖిల్, బాలికల సింగిల్స్లో వి.వేదస్వి, హర్షిత మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నారు. సంస్కృత పండితుడికి సన్మానంభద్రాచలంటౌన్: భద్రాచల దేవస్థానంలో సంస్కృత పండితుడిగా పనిచేస్తున్న ఎస్టీజీ శ్రీమన్నారాయణ ఆచార్యులును భద్రాద్రి దేవస్థానం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో శనివారం ఘనంగా సన్మానించారు. వేలాది మంది విద్యార్థులకు సంస్కృత భాషను బోధించిన ఆయన ఇటీవల ప్రాచ్య విద్య విభూషణం బిరుదు అందుకున్నారు. ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్. రమాదేవి, ఏఈఓలు శ్రవణ్ కుమార్, భవాని రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మానసిక వైద్యుల సదస్సులో మాజీ మంత్రి పువ్వాడ -
అటవీ కార్యాలయంలో రక్తదాన శిబిరం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని జిల్లా అటవీ కార్యాలయంలో శనివారం రక్తదాన శిబరం నిర్వహించారు. తలసేమియా బాధితుల కోసం డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రంసింగ్ ఆధ్వర్యాన ఈ శిబిరం ఏర్పాటుచేయగా డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉన్న 18–65 ఏళ్ల మధ్య వయస్సు వారంతా రక్తదానం చేయొచ్చని, తద్వారా తలసేమియా బాధితులతో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఎఫ్ఓ హరిప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చందూనాయక్, డాక్టర్ నారాయణమూర్తి, సంకల్ప స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు ప్రొద్దుటూరి అనిత, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15వరకు ఇన్స్పైర్ దరఖాస్తులుఖమ్మం సహకారనగర్: ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్పైర్ అవా ర్డు స్కీమ్(ఈ–ఎంఐఏఎస్) సిస్టమ్ ద్వారా ఆన్లైన్ నామినేషన్లు సెప్టెంబర్ 15వ తేదీ వరకు స్వీకరిస్తామని డీఈఓ సామినేని సత్యనారాయణ తెలిపారు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో మేధస్సు పదును పెట్టడానికి, వారిలో వినూ త్న ఆలోచనల ద్వారా నూతన ఆవిష్కరణలు వెలికితీయడంతో పాటు సమాజంలో అపరి ష్కృత సమస్యల పరిష్కారానికి ఇన్స్పైర్ మానక్ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈమేరకు కు www. inspireawards-dst. gov.in ద్వారా 6నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఉత్తమ ఆలోచనలను దరఖాస్తు చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి(94403 54528)ని సంప్రదించాలని డీఈఓ తెలిపారు. రూ.1.62కోట్లు కొల్లగొట్టిన కేసులో ఇంకొకరి అరెస్టుఖమ్మం క్రైం: ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ.1.62 కోట్ల మేర మోసం చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. బోనకల్ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఫోన్ చేసిన ముఠా సభ్యులు దితులు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వాట్సప్, ట్రేడింగ్ లింక్ల ద్వారా సుమారు రూ.1.62 కోట్లు జమ చేయించారు. ఆతర్వాత ముఖం చాటేయడంతో మోసపోయిన గుర్తించిన బాధితుడు ఖమ్మం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డబ్బు జమ అయిన అకౌంట్ ఆధారంగా ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, నేనావత్ అఖిల్ను నాగర్కర్నూల్ జిల్లాలో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరుపర్చాక రిమాండ్కు తరలించినట్లు సీపీ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైం డీఎస్పీ ఫణీందర్, ఎస్సైలు రంజిత్కుమార్, విజయ్కుమార్, సిబ్బందిని ిసీపీ అభినందించారు. విద్యార్థులపై శ్రద్ధ చూపాలి పాల్వంచరూరల్: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో సోమవారం నాటికి వందశాతం హాజరు ఉండాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. పాల్వంచలోని గిరిజన బాలికల పోస్టు మెట్రిక్ వసతి గృహం, బాలుర ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలకు చేరుకునేలా హెచ్ఎంలు, వార్డెన్లు చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పిల్లలకు రక్షిత తాగునీరు అందించాలని చెప్పారు. నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో వార్డెన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పీఓ ఈ సందర్భంగా సూచించారు. -
కార్మికుల రేట్లపై చర్చలు వాయిదా
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్మికుల రేట్లు సవరించేందుకు శనివారం పాలకవర్గం, అధికారులు, సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం తుది నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడింది. మార్కెట్లో పనిచేసే హమాలీలు, రెల్లుడు కూలీలు, స్వీపర్లు, దడవాయిలు తదితరులకు రెండేళ్లకోసారి కూలీ రేట్లు పెంచ డం ఆనవాయితీ. ఈమేరకు కార్మిక సంఘాల ప్రతినిధులు 25 శాతం పెంచాలని కొన్నాళ్ల క్రితం లేఖ ఇచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు శనివా రం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు అధ్యక్షతన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పాటు దిగుమతి శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈమేరకు కార్మిక సంఘాల ప్రతినిధులు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమకు కూలీ ధరలు పెంచాలని కోరగా, రైతు సంఘాల ప్రతినిధులు మాత్రం ఈ ఏడాది పంటల ధరలు ఆశాజనకంగా లేనందున మరికొంత కాలం వాయిదా వేయాలన్నారు. దీంతో వారం తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలనే భావనకు రావడంతో రేట్ల పెంపు వాయిదా పడింది. మార్కెట్ ఉపాధ్యక్షులు తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో పాటు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్రావు, దొండపాటి రమేష్, వేణు, మీరా, లక్ష్మీనారాయణ, మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అధిక ఫీజులు, పుస్తకాల అమ్మకంపై ఏఐఎస్ఎఫ్ ఆందోళన
ఖమ్మం మామిళ్లగూడెం: అధిక ఫీజు వసూళ్లు, అక్రమంగా పుస్తకాల అమ్మకంపై ప్రశ్నించినందుకు నారాయణ విద్యాసంస్థల బాధ్యులు తమపై దాడి చేశారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ ఆరోపించారు. ఖమ్మం జమ్మిబండ రోడ్డులోని నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజు వసూలు చేస్తున్నారని, స్టేషనరీ పేరుతో పుస్తకాలు అమ్ముతున్నారంటూ శనివారం ఆందోళనకు చేశామని పేర్కొన్నారు. ఈమేరకు ప్రిన్సిపాల్, సిబ్బంది దూషిస్తూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆపై ఖమ్మం వన్ టౌన్ పోలీసులు చేరుకుని తమ నాయకులను అదుపులోకి తీసుకున్నారన్నారు. నారాయణ విద్యాసంస్థల్లోని గోదాంను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసినా దొడ్డిదారిలో పుస్తకాలు అమ్ముతుండడాన్ని ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆరోపించారు. కాగా, నారాయణ పాఠశాలలో ప్రైమరీ సెక్షన్కు అనుమతి లేకున్నా, చట్టాలను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు లోకేష్, షేక్ నాగుల్మీరా, మధు, కౌశిక్, మనోజ్, వినయ్, గౌతమ్, అఖిల్, నాగరాజు, నరేష్, ప్రతాపు, గోపి, రాజేష్ పాల్గొన్నారు. -
ప్రాణదాతగా మాధాపురం వాసి
ముదిగొండ: మండలంలో మాధాపురానికి చెందిన భువనగిరి లక్ష్మీనారాయణ(44) ఈనెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స చేయించే క్రమాన బ్రెయిన్డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు కుటుంబీకులు అవయవదానానికి అంగీకరించడంతో మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేసినట్లయింది. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 16న లక్ష్మీనారాయణ టెట్ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆటోలో మాదాపురం నుంచి ఖమ్మం వెళ్తుండగా రహదారి పక్కన ఉన్న చెట్టు ఆటోపై పడింది. దీంతో లక్ష్మీనారాయణ తలకు గాయాలు కాగా ఖమ్మంలో చికిత్స చేయించినా ఫలితం లేకపోగా వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఈమేరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ శనివారం ఉదయం ఆయన గుండె, నేత్రాలు, ఊపిరితిత్తులు, కిడ్నీలను సేకరించిన వైద్యులు అవసరమైన వారికి అమర్చారు. దీంతో లక్ష్మీనారాయణ మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేసినట్లయింది. ఈమేరకు ఆయన మృతదేహం వద్ద గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు నివాళుర్పించి, అవయవదానానికి అంగీకరించిన కుటుంబీకులను అభినందించారు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాల దానం -
ఎదురెదురుగా బస్సు, ఆటో ఢీ
కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్ల క్రాస్ సమీపాన శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు... మహబూబాబాద్ జిల్లా గార్ల నుంచి లింగాల మీదుగా ఖమ్మం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఖమ్మం నుంచి నలుగురు ప్రయాణికులతో ఇల్లెందు వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సలీంతో ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ మహబూబ్, హలీమా, సోందుబీ, జర్పుల కమలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎస్సై సాయికుమార్, సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను 108లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చెందిన షేక్ సోందుబీ(68) మృతి చెందింది. అలాగే చికిత్స చేయిస్తుండగా గాదెపాడుకు చెందిన అంగన్వాడీ టీచర్ షేక్ మహబూబ్(48) కన్నుమూసింది. అంతేకాక అలాగే, సలీం(ఇల్లెందు) పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, కమల(గాదెపాడు)కు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యసత్తుపల్లిరూరల్: కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డా డు. మండలంలోని కాకర్లపల్లికి చెందిన మట్టా మురళీకృష్ణ(45) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నాక ఫలితం లేక శుక్రవారం రాత్రి ఆయన పురుగుల మందు తాగగా ప్రభుత్వాస్పత్రి తరలించా రు. అక్కడే చికిత్సపొందుతూ మృతిచెందాడు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేజీ గంజాయి స్వాధీనంతిరుమలాయపాలెం: ఒడిశా నుంచి గంజాయి తీసుకొస్తున్న ఓ వ్యక్తిని శనివారం తిరుమలాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గ్యామాతండాకు చెందిన ఆటో డ్రైవర్ లూనావత్ ప్రవీణ్కుమార్ అలియాస్ తాజ్ ఒడిశా నుండి మోటార్ సైకిల్పై కేజీ గంజాయితో వెళ్తున్నాడు. ఈక్రమాన తిరుమలాయపాలెం సమీపాన కొక్కిరేణి స్టేజీ వద్ద ఎస్ఐ కూచిపూడి జగదీష్ ఆధ్వర్యాన వాహనాల తనిఖీ చేస్తుండగా తాజ్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయన వద్ద పరిశీలించగా కేజీకి పైగా ఎండు గంజాయి లభించింది. ఈమేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు మహిళల మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం -
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
ఖమ్మంక్రైం: మాదక ద్రవ్యాల వినియోగంతో నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి, సమూలంగా నిర్మించడమే లక్ష్యంగా పోలీసులు అధికారులు కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈనెల 26వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా స్థాయిల్లో అవగాహన సదస్సులతో పాటు యోగా, ధ్యానం, ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, పోటీలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈమేరకు ఖమ్మం కమిషనరేట్లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను సీపీ సునీల్దత్ వివరించారు. ఇంకా ఈ వీసీలో అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, సీఐ స్వామి పాల్గొన్నారు.టీకాలతోనే ఆరోగ్య సంరక్షణఖమ్మంవైద్యవిభాగం: మిషన్ ఇంద్రధనస్సు ద్వారా జిల్లాలో వంద శాతం గర్భిణులు, 0–5ఏళ్ల చిన్నారులకు టీకాలు వేయాలని, తద్వారా ఆరోగ్య సంరక్షణ సాధ్యమవుతుందని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చంద్రూనాయక్ తెలిపారు. మిషన్ ఇంద్రధనస్సు, యోగా డే, డయేరియా నియంత్రణ కార్యక్రమాలపై శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు మిషన్ ఇంద్రధనస్సు ద్వారా గర్భిణులు, చిన్నారులను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి టీకాలతో ప్రయోజనాలను వివరించాలని సూచించారు. అలాగే, డయేరియా నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలని, చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు అందించాలని తెలిపారు. కాగా, యోగా డే సందర్భంగా శనివారం ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని డీఐఓ సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ రామారావు, అదనపు డీఎంహెచ్ఓ బిందుశ్రీ, డీ.వీ.ఎల్ ఎం.రమణ తదితరులు పాల్గొన్నారు.అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలిఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను శుక్రవారం ఖమ్మంలోని డీపీఆర్సీ హాల్లో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బీఏఎస్లో సీటు రాని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, సంక్షేమ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ బీఏఎస్ పథకం ద్వారా ఒకటో తరగతిలో డే స్కాలర్లుగా 343దరఖాస్తులు అందగా 131 మందిని, ఐదో తరగతి(రెసిడెన్షియల్) ప్రవేశాలకు 219 దరఖాస్తులు అందితే 128 మందిని డ్రా ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సామినేని సత్యనారాయణ, ఎస్సీ డీడీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీఖమ్మంమయూరిసెంటర్: పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. స్థాయీ సంఘం ఆధ్వర్యాన నాలుగు రోజుల అధ్యయన యాత్ర కర్ణాటకలోని మంగళూరులో శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్రకు చైర్మన్ సునీల్ తర్కరే అధ్యక్షత వహించగా, పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల ధరలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే కార్యాచరణపై చర్చించారు. -
సన్నగా సర్దేస్తున్నారు
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం కొద్దినెలలుగా సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుండడం అక్రమార్కులకు అవకాశంగా మారింది. కొందరు డీలర్లు, వ్యాపారులు ముఠాగా ఏర్పడి బియ్యాన్ని అధిక ధరలతో ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క లబ్ధిదారులు కూడా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేసిన సమయాన సాగిన అక్రమాలు ఇప్పుడు ఆగకపోగా.. పౌర సరఫరాల శాఖ అధికారులు నిఘా నేత్రాన్ని దాటి అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంఏళ్లుగా వేళ్లూనుకుని.. రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరించింది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యం పక్కదారి పడుతున్నాయి. అయితే, దొడ్డు బియ్యం పంపిణీ సమయాన లబ్ధిదారులు తినలేక.. డీలర్లు, ఇతరులకు అమ్మేవారు. ఇక కొందరు వ్యాపారులు రేషన్ షాప్ల్లో మిగిలిన, లబ్ధిదారుల వద్ద సేకరించిన బియ్యాన్ని ప్రాసెస్ చేయించి అధిక ధరకు విక్రయించేవారు. కొందరు బడా వ్యాపారులు.. మిల్లర్లు, ఇతరుల నుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యం సేకరించి పాలిష్ చేయించాక విదేశాలకు ఎగుమతి చేశారు. కొన్ని సందర్భాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు బియ్యం లారీలను పట్టుకున్నా దందా మాత్రం ఆగలేదు. సన్న బియ్యంతో చెక్ పెట్టాలని.. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయగా వాటిని తినేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. మధ్య తరగతి ప్రజలైతే బియ్యం అసలే తీసుకోలేదు. ఇదే అదునుగా బడా వ్యాపారుల జేబులు నింపుకున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు కచ్చితంగా తింటారనే భావనతో ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్షాప్ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. తొలి నెలలో బియ్యాన్ని లబ్ధిదారులు అధిక సంఖ్యలో తీసుకెళ్లి తినడానికి వీలుగా ఉన్నాయని తెలిపారు. తద్వారా అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని పౌర సరఫరాల శాఖ అధికారులు భావించారు. కఠిన చర్యలు తీసుకుంటేనే.. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడమే కాక లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకున్నట్లు తెలిస్తే కేసు నమోదు చేయడమే కాక రేషన్కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే బియ్యం అమ్మిన, కొనుగోలు చేసిన వారిపైనా కేసులు పెడతామని చెబుతున్నారు. ఈక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. అయితే, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు రేషన్షాప్లపైనా నిఘా పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.అక్రమంగా కొనుగోళ్లు, తరలింపు వ్యాపారులకు సహకరిస్తున్న కొందరు డీలర్లు అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న వ్యాపారం తనిఖీలు ముమ్మరం చేస్తున్న పౌర సరఫరాల శాఖ -
మేరునగధీరులు.. దాశరథి, ఆరుద్ర
ఖమ్మం సహకారనగర్: తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన దాశరథి, ఆరుద్ర తెలుగు సాహిత్య చరిత్రలో మేరునగధీరులుగా నిలిచారని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన ‘శతజయంతి సాహితీమూర్తులు’ పేరిట దాశరథి – ఆరుద్రజీవితం సాహిత్యంపై నిర్వహించే రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎల్. ఎన్.శాస్త్రి అధ్యక్షత వహించగా దాశరథి, ఆరుద్ర చిత్రపటాల వద్ద నివాళులర్పించాక వీసీ సూర్య ధనుంజయ్ తదితరులు మాట్లాడారు. తెలంగాణ పీడిత ప్రజల పక్షాన నిలిచి అక్షరమే ఆయుధంగా పోరాడిన యోధుడిగా దాశరథి తిమిరంతో సమరం చేశారని చెప్పారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడిన బడుగు వర్గాలకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఇక ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య పరిశోధనతో చరిత్రను లోతుగా అధ్యయనం చేసి అరుదైన పరిశోధకుడిగా నిలిచారని కొనియాడారు. నేటి యువత వీరిద్దరి సాహిత్యంపై అధ్యయనం చేయాలని సూచించారు. అనంతరం దాశరథి, ఆరుద్ర సాహిత్యంపై ఓయూ తెలుగు శాఖాధిపతి ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, సాహిత్య విమర్శకులు కవి రెంటాల వెంకటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. ఈకార్యక్రమంలో కేయూ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్రా రాజుతో పాటు రవిమారుత్, ప్రసేన్, బానోత్ రెడ్డి, డాక్టర్ సునంద, డాక్టర్ పి.రవికుమార్, డాక్టర్ సీతారాం, డాక్టర్ జె.అనురాధ, కిరణ్కుమార్, డాక్టర్ ఎం.వీ.రమణ, డాక్టర్ కార్తీక్, కోటమ్మ, శ్రీ నివాస్ మాట్లాడగా వివిధ ప్రాంతాల అధ్యాపకులు 30మంది పత్రాలు సమర్పించారు.జాతీయ సదస్సులో వక్తలు -
●పక్కాగా పక్కదారి..
ప్రభుత్వం, అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ కొందరు వ్యాపారులు సన్న బియ్యాన్ని సైతం పక్కదారి పట్టిస్తునట్లు తెలుస్తోంది. మొదటి నెల పూర్తిగా లబ్ధిదారులు బియ్యం తీసుకోగా, ఆతర్వాత నెల నుంచి సొమ్ము చేసుకోవడానికి అక్రమార్కులు యత్నాలు ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యంతో రూ.లక్షలు కొల్లగొట్టిన వ్యాపారులు.. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో ప్రణాళికతో పక్కదారి పట్టించే కుట్రకు తెరలేపారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు తీసుకోకపోగా మిగిలిన సన్న బియ్యం, ఇంకొన్ని చోట్ల లబ్ధిదారుల నుంచే నేరుగా సేకరించడం మొదలుపెట్టారు. దొడ్డు బియ్యం కన్నా ఎక్కువ డబ్బు ముట్టచెబుతుండటంతో పలుచోట్ల లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలా సేకరించిన సన్నబియ్యాన్ని తరలిస్తుండగా జిల్లాలో కొన్నిచోట్ల పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. తాజాగా గురువారం కల్లూరు నుంచి 145 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని లారీలో హైదరాబాద్కు తరలిస్తుండగా వైరా వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇవే కాకుండా రెండు నెలల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం తరలించినట్లు తెలుస్తోంది. -
లక్ష్యాన్ని చేరలేదు..
ప్రభుత్వ స్కూళ్లలో తరగతుల వారీగా విద్యార్థులు 28–04 20–06 –2024 –2025 1వ తరగతి 5,448 4,724 2వ తరగతి 5,486 6,116 3వ తరగతి 6,361 6,348 4వ తరగతి 7,675 7,103 5వ తరగతి 5,348 7,526 6వ తరగతి 6,820 4,842 7వ తరగతి 7,125 7,158 8వ తరగతి 7,500 6,919 9వ తరగతి 7,433 7,430 10వ తరగతి 7,093 7,388మొత్తం 66,289 65,554ఖమ్మం సహకారగనర్: ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన భవనాలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండడమే కాక విద్యార్థులకు ఉచితంగా విద్య, పాఠ్య, నోట్పుస్తకాలు, యూనిఫామ్ అందుతోంది. అలాగే, నాణ్యమైన మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్నారు. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి మక్కువ చూపడం లేదని తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఈనెల 3నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించారు. అయితే, కార్యక్రమం ముగిశాక నమోదైన ప్రవేశాల ఆధారంగా లెక్కలు వేస్తే గత విద్యాసంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉండడంతో బడిబాట ద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. 735మంది తక్కువ... గత విద్యాసంవత్సరం ముగిసే నాటికి(ఏప్రిల్ 24న) జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి వరకు 66,289మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 10తరగతి విద్యార్థులు వెళ్లిపోగా, ఇతర పాఠశాలలకు మారిన వారిని కూడా మినహాయించి కనీసం అదే సంఖ్యలోనైనా విద్యార్థులు ఉండేలా ప్రవేశాలకు కృషి చేశారు. కానీ శుక్రవారం గణాంకాలను పరిశీలిస్తే విద్యార్థుల సంఖ్య 65,554మందిగా తేలింది. ఆదిలోనే గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య 735 తక్కువ ఉండగా.. వీరంతా కొనసాగుతారా.. ఇంకొందరు ఇతర పాఠశాలలకు వెళ్తే పరిస్థితి ఏమిటన్నది తెలియరావడం లేదు. సహకారం అందలేదా? రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో బడిబాట నిర్వహించాలని ఆదేశించింది. అయితే, చాలా శాఖల అధికారుల నుంచి సహకారం లభించలేదని విద్యాశాఖ వర్గాలు చెబు తున్నాయి. మండల ప్రత్యేక అధికారులు బడిబాట కార్యక్రమానికి నోడల్ అధికారులుగా ఉండగా... చాలాచోట్ల పాల్గొనలేదని సమాచారం. తద్వారా ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తక్కువే.. గతేడాదితో పోలిస్తే పడిపోయిన విద్యార్థుల సంఖ్య ఆశించిన ఫలితాలు ఇవ్వని ‘బడి బాట’లక్ష్యసాధనకు కృషి చేస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మరింత పెరిగేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే మూతపడిన 12పాఠశాలలు తెరిపించాం. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రవేశాలు నమోదయ్యాయి. అయితే, గతేడాది కంటే విద్యార్థులు తగ్గకుండా మరిన్ని ప్రయత్నాలు చేస్తాం. – రాజశేఖర్, విద్యాశాఖ సీఎంఓ -
విపత్తుల నిర్వహణకు పకడ్బందీ ప్రణాళిక
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం సహకారనగర్: విపత్తుల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుని ఈసారి మూడు నెలల పాటు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయని తెలిపారు. తద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలకు వీలవుతుందని చెప్పారు. ఈమేరకు అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాక పునరావాస కేంద్రాలను గుర్తించాలని, అవస రమైన సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం కమాండర్ ఎస్.గౌతమ్, ఉద్యోగులు మద్దిలేటి, జగదీష్, సురేష్కుమార్, రియాజుద్దీన్, జనార్దన్ పాల్గొన్నారు. ఏఐతో సులువుగా పనులు అధికారులు విధినిర్వహణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఉపయోగిస్తూ సులువుగా పనులు చేసేలా త్వరలోనే వర్క్షాప్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన విధి నిర్వహణపై సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు ఫైళ్లు పరిష్కరించాలని, ఉద్యోగులు బృందంగా పని చేస్తేనే ఫలితాలు వస్తాయని తెలిపారు. అందరూ సమయపాలన పాటించాలని, గైర్హాజరైతే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆపై కలెక్టరేట్ నిర్వహణ, ప్రొటోకాల్ అంశాలపై సూచనలు చేశారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తల్లాడ: వచ్చే మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతీ పేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తల్లాడ మండలం నారాయణపురం నుంచి కొడవటిమెట్ట వరకు రూ.5.50 కోట్లతో నిర్మించిన రహదారిని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తూ పాలన సాగిస్తోందని తెలిపారు. గత పాలకులు అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల వేళ తాము ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని చెప్పారు. భవిష్యత్లో మరి న్ని పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబ్, ఈఈ తానేశ్వర్, ఆర్డీఓ రాజేందర్, డీఈ ఖలీల్అహ్మద్, తహసీల్దార్ సురేష్కుమార్, ఎంపీడీఓ సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. రైతును రాజును చేసింది మనమే... కల్లూరు/తల్లాడ: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు, తల్లాడలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, సన్నబియ్యం పంపణీ చేస్తుండడమే కాక యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, బోనస్ ఇస్తున్నామని తెలిపారు. అంతేకాక భూభారతితో సమస్యలు పరిష్కరిస్తుండడం ద్వారా రైతులను రాజుగా చేస్తున్నామన్నారు. కాగా, కాంగ్రెస్ అమలుచేస్తున్న పథకాలు, గత ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఈనేపథ్యాన కార్యకర్తల్లో విబేధాలు ఉన్నా పక్కన పెట్టాలని తెలిపారు. ఈ సమావేశాల్లో ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవితో పాటు నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కాపా సుధాకర్, తూము వీరభద్రరావు, దగ్గుల రఘుపతిరెడ్డి, మారెళ్ల లక్ష్మణ్రావు, వీరారెడ్డి, కిషోర్, పోట్టేటి సంధ్యారాణి, బ్రహ్మారెడ్డి, గొడుగునూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీరెడ్డి, జనార్దన్రెడ్డి, గుర్రం శ్రీనువాసరావు, తుమ్మపల్లి రమేష్, ఆనంద్బాబు, వెంకటనారాయణరెడ్డి, పొట్టేటి జనార్దన్రెడ్డి, వీరా రెడ్డి, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, భాగం ప్రభాకర్రావు, ఏనుగు సత్యంబాబు, పెద్దబోయిన శ్రీను, ఎల్.పుల్లారావు, భూక్యా శివకుమార్ నాయక్, యాసా వెంకటేశ్వరరావు, నోటి కృష్ణారెడ్డి, దామాల రాజు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పాలన తల్లాడలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి కల్లూరు, తల్లాడ కాంగ్రెస్ సమావేశాలకు హాజరు -
వాడీవేడిగా డీసీసీబీ మహాజన సభ
● మినిట్స్ బుక్ లేకపోవడంపై సభ్యుల మండిపాటు ● డిపాజిట్లు, ఇతర అంశాలపై ప్రశ్నల వర్షం ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) 127వ మహాజన సభ వాడీవేడిగా సాగింది. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించగా, తొలుత వార్షిక నివేదిక ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా సహకార సంఘాల చైర్మన్లు పలువురు తీర్మానాలను మినిట్స్ బుక్లో రాయాలని సూచించగా.. అధికారులు బుక్ తీసుకురాలేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాజన సభకు మినిట్స్ బుక్ లేకుండా హాజరుకావడం ఏమిటంటూ సమోసాలు, టీ కోసం వచ్చామా అని ప్రశ్నించారు. కాగా, 2007–08లో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారి నుంచి రూ.90 కోట్లు డిపాజిట్లు సేకరిస్తే, ఆ డిపాజిట్ల చెల్లింపుపై గత సభలో చేసిన తీర్మానం అమలుకు నోచుకోలేదని పలువురు తెలిపారు. వడ్డీ కలిపి రైతులకు చెల్లించాల్సి ఉందని చెప్పడంతో త్వరలోనే చెల్లిస్తామని బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్య బదులిచ్చారు. కాగా, పీఏసీఎస్లు పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో డీసీఎంఎస్, ఇతర సంస్థల ద్వారా ధాన్యం కొనుగోలుపై అవకాశం కల్పించటం సరికాదని పేర్కొన్నారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల సమయాన నియమించే సిబ్బంది వేతనాల విషయమై ప్రశ్నించగా కమీషన్ నుంచి వేతనాలు చెల్లించవచ్చని జిల్లా సహకార అధికారి గంగాధర్ తెలిపారు. అలాగే, బ్యాంకు రుణాల నుంచి వసూలు చేసే వాటాధనంలో సహకార సంఘాలకు భాగం ఇచ్చేలా తీర్మానానికి పలువురు పట్టుబట్టారు. అంతేకాక 2023 నుంచి మొక్కజొన్నల కొనుగోళ్లపై రూ.లక్షల్లో రావాల్సిన కమీషన్ చెల్లించాలని కోరగా రాష్ట్ర మార్క్ఫెడ్ సమావేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని మార్క్ఫెడ్ జీఎం సునీత తెలిపారు. ఇంకా భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఎరువుల స్టాక్ పాయింట్ ఏర్పాటు, సహకార సంఘాల ఉద్యోగుల బదిలీలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, బ్యాంకు డైరెక్టర్లు గొర్ల సంజీవరెడ్డి, లక్కినేని సురేందర్రావు, లక్ష్మణ్రావు, ప్రసాద్, సైదులు, డీఆర్డీఓ అవధానుల శ్రీనివాసరావు, అధికారులు, పీఏసీఎస్ల చైర్మన్లు పాల్గొన్నారు. సభ్యులకు బీమా పెంపు పీఏసీఎస్ల నుంచి పంట రుణాలు తీసుకునే సభ్యులకు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పరిమితిని పెంచుతూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న బీమా పరిమితిని రూ.లక్షకు పెంచారు. అలాగే, 2024–25లో బ్యాంకు గడించిన లాభాల్లో రూ.530.55 కోట్లను సహకార సంఘాలకు డివిడెంట్(ఆరు శాతం)గా చెల్లించాలని నిర్ణయించింది. అంతేకాక ఉద్యోగులకు 8–12 శాతం(దూరం ఆధారంగా) అలవెన్స్ చెల్లింపునకు నిర్ణయించారు. అక్రమాలపై విచారణకు నిర్ణయం ఇళ్ల స్థలాలకు సంబంధించి నకిలీ ధ్రువ పత్రాలు సమర్పించి రూ.6 కోట్ల రుణాలు తీసుకున్న వ్యవహారంపై విచారణ చేపట్టాలని డీసీసీబీ పాలకవర్గం నిర్ణయించింది. మహాజన సభకు ముందుగా బ్యాంకు పాలకవర్గ సమావేశం జరగగా ఈ అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించారు. దీంతో బ్యాంకు సొమ్మును పక్కదారి పట్టించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా విచారణకు నిర్ణయించారు. -
వైస్ చైర్మన్గా శ్రీనివాస్యాదవ్
కామేపల్లి: రాష్ట్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల అభివృద్ధి మండలి వైస్ చైర్మన్గా జాలె శ్రీనివాస్యాదవ్ నియమితులయ్యారు. కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన ఆయనకు శుక్రవారం ఢిల్లీలో జాతీయ మండలి అధ్యక్షుడు రాహుల్ ద్వివేది నియామకపత్రం అందజేచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ, అటవీ సంబంధిత విధానాలు, కార్యక్రమాల ప్రణాళికలు విస్తరించడం, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వరిస్తానని తెలిపారు. పాత విధానంలోనే పంట రుణాలు ఇవ్వాలి ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1/70 చట్టం కారణంగా రైతులకు పంట రుణాల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నందున, గతంలో మాదిరి పహానీల ఆధారంగా రుణా లు ఇవ్వాలని పలు పీఏసీఎస్ల చైర్మన్లు కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో శుక్రవారం జరిగిన డీసీసీబీ మహాసభలో జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ వెంకట్ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. అలాగే, ఏజెన్సీ రైతులు సహకార బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేయించాలని కోరారు. కార్యక్రమంలో పాల్వంచ, కొత్తగూడెం, మేడేపల్లి, కొణిజర్ల పీఏసీఎస్ల చైర్మన్లు కొత్వాల శ్రీనివాసరావు, మండే హన్మంతరావు, సామినేని వెంకటేశ్వరరావు, చెరుకుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. -
1998లో స్థాపించాం..
సత్తుపల్లిలోని శ్రీరామకృష్ణ యోగా సమితిని 1998లో స్థాపించి యోగాసనాలపై ఉచిత శిక్షణ ఇస్తున్నాం. రాజారత్నచారి, గువ్వల కృష్ణారెడ్డితో కలిసి ఏటా సుమారు వేయి మందికి కళాభారతి వేదికగా యోగాసనాలు నేర్పిస్తున్నాం. విద్యార్థులు, జైలు ఖైదీలకు కూడా శిక్షణ ఇచ్చాం. – చల్లగుళ్ల అప్పారావు, శ్రీరామకృష్ణ యోగా సమితి, సత్తుపల్లిధ్యానంతో ప్రశాంతత.. ధ్యానంతో ఒడిదుడుకులు, కోపాన్ని జయించవచ్చు. భౌతిక, అధ్యాత్మిక జీవనంలో సమతుల్యత ఏర్పడుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే ఏటా ‘హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ లైఫ్ పొటెన్షియల్’ పేరిట విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ఉప్పన శ్రీనివాసరెడ్డి, శ్రీరామచంద్ర మిషన్, సత్తుపల్లి 15 ఏళ్లుగా ధ్యాన శిక్షణ శ్వాసపై ధ్యాస కలిగేలా ధ్యానంపై శిక్షణ ఇస్తున్నాం. సత్తుపల్లిలో 15 ఏళ్లుగా పిరమిడ్ కేంద్రం నిర్వహిస్తున్నాం. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పలువురు ఇక్కడకు వస్తున్నారు. నిత్య సాధనతో మానసిక సమతుల్యత, ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తుంది. – బెల్లంకొండ సుశ్మిత, పిరమిడ్ సొసైటీ, సత్తుపల్లి● -
ముగ్గురికి ఎస్సైలుగా పదోన్నతి
ఖమ్మంక్రైం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పదోన్నతిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించిన ఎం.సూర్యనారయణ, బేగ్, రాఘవయ్యను కమిషనర్ సునీల్దత్ శుక్రవారం సన్మానించారు.జూనియర్ ఫుట్బాల్ జట్టు ఎంపికఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్స్ ఫుట్బాల్ జట్టును ఎంపిక చేశారు. ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు రెండు జిల్లాల నుంచి 35 మంది క్రీడాకారులు హాజరయ్యా రు. వీరిలో ప్రతిభ చాటిన వారితో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశామని అసోసియేషన్ కార్యదర్శి కె.ఆదర్శ్కుమార్ తెలిపారు. ఈ జట్టు 28నుంచి జూలై 1వరకు నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని వెల్లడించారు.టేబుల్ టెన్నిస్ జట్లు..ఖమ్మం సర్దార్ పటేల్స్టేడియంలో శుక్రవారం జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ జట్లను ఎంపిక చేశారు. ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న ఈ జట్ల ఎంపికను టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్కుమార్, వీవీఎస్.మూర్తి పర్యక్షించారు. బాలుర అండర్–13లో షేక్ సాహెల్ ఫజల్, అండర్–15లో గౌరిశెట్టి చార్విక్ స్థితప్రజ్ఞ, అండర్–17లో పరిటాల జ్వలిత్, ఎం.డీ.అనస్, సాత్వి క్, రాధాకృష్ణ, అండర్–19లో పిట్టల మోహిత్కృష్ణ ఎంపికయ్యారని తెలిపారు. అలాగే, బాలి కల విభాగం అండర్–13లో బొంతు సాయి, శివానీ, అండర్–17లో అమృత, గద్దల సిరి ఎంపిక కాగా అసోసియేషన్ బాధ్యులు షేక్ మజ్హార్, పరిటాల చలపతి, గద్దల రామారావు, రెడ్డి సాయి, శివ, అజయ్ పాల్గొన్నారుఉద్యోగుల సమస్యలు పరిష్కరించండిఖమ్మం సహకారనగర్: ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఉద్యోగ సంఘాల జేఏసీ బాధ్యులు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఆయను కలిసి పలు సమస్యలను వివరించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారుల సంఘం నాయకుడు రవీంద్రరెడ్డి, టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.గిరిజన సంక్షేమ శాఖలో సీఆర్టీల బదిలీభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పాఠ శాలల్లో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న ఉపాధ్యాయుల(సీఆర్టీ)ను బదిలీ చేశారు. ఆశ్ర మ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న 64 మంది సీఆర్టీలకు సబ్జెక్టుల వారీగా శుక్రవారం ఐటీడీఐ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్ ఇచ్చినట్లు డీడీ విజయలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత బెస్ట్ అవైలబు ల్ పాఠశాలల్లో 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి అందిన దరఖాస్తుల ఆధారంగా తల్లిదండ్రులు, కమిటీ సభ్యుల సమక్షాన డ్రా ద్వారా విద్యార్థుల ను ఎంపిక చేశామని డీడీ వెల్లడించారు. కార్యక్రమాల్లో వైరా ఏటీడీఓ జహీరుద్దీన్, ఏఓ నారాయణరెడ్డి, ఏసీఎంఓలు రాములు, రమేశ్, హెచ్డబ్ల్యూఓలు హన్మంతరావు, రాంబాబు, రాజేందర్, నర్సింహారావు, శ్రీనివాసరావు, ధనుశ్, భద్రాచలం ఎంఈఓ రమతో పాటు అలివేలు మంగతాయారు, రంగయ్య, ప్రసాద్, శ్రీధర్, మణికుమార్, సురేశ్, భద్రం పాల్గొన్నారు.ఉసురు తీసిన క్షణికావేశంఖమ్మంక్రైం: భార్యాభర్తల మధ్య తలెత్తిన వివా దంతో ఒకరి ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఖమ్మం ప్రకాష్నగర్కు చెందిన కొత్తపల్లి నాగేశ్వరరావు, త్రివేణి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై 13వ తేదీన వివాదం తలెత్తడంతో క్షణికావేశాని కి లోనైన నాగేశ్వరరావు నిద్రమాత్రలు మింగాడు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేర్పించగా.. సపర్యలు చేస్తున్న త్రివేణి ఈనెల 15న ఇంట్లో ఎలుకల మందు తాగింది. ఈమేరకు ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతే శుక్రవా రం మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. -
మెరుగైన వైద్యంతో మన్ననలు పొందాలి
మధిర: మధిర ప్రాంత వాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా అత్యాధునిక పరికరాలతో ఆస్పత్రిని ఏర్పాటుచేసిన హైకేర్ ఆస్పత్రి యాజమాన్య బాధ్యులు అభినందనీయులని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మధిరలో హైకేర్ ఆస్పత్రి భవనాన్ని శుక్రవారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ వారి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఆస్పత్రి అధినేత డాక్టర్ జంగా నవీన్రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్రెడ్డితో పాటు డాక్టర్ రామనాథం, డాక్టర్ కనకపూడి అనిల్, మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, సూరంశెట్టి కిషోర్, తూమాటి నవీన్రెడ్డి, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, బిక్కి కృష్ణప్రసాద్, అద్దంకి రవికుమార్, ఏలూరు నాగేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు పాల్గొన్నారు. సింహాసనంపై ఒకరు.. ప్రజల గుండెల్లో మరొకరు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాహుబలి సినిమా మాదిరిగా ఉందని ఆ రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. హైకేర్ ఆస్పత్రి ప్రారంభానికి హాజరైన ఆయన జంగా నవీన్రెడ్డి, జంగా ప్రవీణ్రెడ్డిని అభినందించి మాట్లాడారు. ఆంధ్రాలో సింహాసనంపై ఒకరు కూర్చుంటే, ప్రజల గుండెల్లో మాత్రం మరొకరు (వైఎస్.జగన్మోహన్రెడ్డి) ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల ప్రేమ జగన్మోహన్రెడ్డిపై ఇలాగే ఉండాలని, ఈ ప్రేమ నిలబెట్టుకునేలా 24 గంటలు కష్టపడతామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతసాగర్కు చెందిన వట్టికూటి జగదీష్(27) మృతి చెందాడు. ఆయన ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి అనంతసాగర్ వస్తుండగా పందిళ్లపల్లి సేషన్ సమీపాన ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తండ్రి నాసరయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు. రూ.63లక్షలకు ఐపీ దాఖలు ఖమ్మం లీగల్: ఖమ్మం సంభానీనగర్కు చెందిన షేక్ అన్వర్జానీ రూ.63 లక్షలకు దివాలా పిటిషన్(ఐపీ) దాఖలు చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా పలువురి వద్ద నగదు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ పది మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా శుక్రవారం ఖమ్మం సీనియర్ సివిల్జడ్జి కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశాడు. చెల్లని చెక్కుల కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వరంగల్కు చెందిన తొడుకునూరి రత్నాకర్, మహమ్మద్ హిమాయత్ అలీకి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బిక్కం రజిని తీర్పు చెప్పారు. శుక్రవారం వెలువరించిన ఈ తీర్పు వివరాలు... ఖమ్మం పంపింగ్వెల్ రోడ్డుకు చెందిన చుక్కల సరళాదేవికి చెందిన స్థలాలను కమీషన్ పద్ధతిపై అమ్ముతామని నమ్మించిన రత్నాకర్, అలీ జీపీఏ చేయించుకున్నారు. ఆపై స్థలాలు అమ్మినా సరళకు డబ్బు ఇవ్వకపోగా, పలుమార్లు అడిగాక చెరో రూ.30 లక్షల చొప్పున చెక్కులు జారీ చేశారు. కానీ వారి ఖాతాల్లో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం ఇద్దరికి ఏడాది జైలుశిక్ష విధించడమే తో పాటు ఫిర్యాదికి చెరో రూ.30 లక్షలు చెల్లించాలని న్యాయవాధికారి తీర్పు చెప్పారు. పాఠశాలలో విగ్రహాలు ధ్వంసం నేలకొండపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన గాంధీ, సరస్వతీదేవి విగ్రహాలను గుర్తుతెలి యని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉపాధ్యాయులు, స్థానికులు గుర్తించా రు. ఈమేరకు పోలీసులు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పసుమర్తి శ్రీనివాస్ తదితరులు కోరారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం
తిరుమలాయపాలెం: మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న ఏలువారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. గ్రామంలో ఇళ్లను శుక్రవారం పరిశీలించిన ఆమె లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడారు. ఆతర్వాత హైదర్సాయిపేట, పడమటితండా ఇసుక రీచ్లను పరిశీలించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక కూపన్లు సకాలంలో జారీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎంపీడీఓ ఎస్.కే.సిలార్ సాహెబ్, తహసీల్దార్ జి.లూథర్ విల్సన్, ఎంపీఓ పి.సూర్యనారాయణ, ఉద్యోగులు వీరయ్య, మిథున్, సునీత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
మా కల నెరవేరుతోంది..
దాదాపు 40ఏళ్ల క్రితం ఖమ్మంలో తొలిసారి యోగా కేంద్రాన్ని ప్రారంబించాం. అప్పట్లో కేవలం పది మందే వచ్చేవారు. ఇప్పుడు అశించిన స్థాయిలో సాధకులు వస్తున్నారు. అంతేకాక మరిన్ని కేంద్రాలు ఏర్పాటుకావడం, ప్రభుత్వం సైతం గుర్తించడంతో మా కల నెరవేరుతోంది. – జీవీకే.శర్మ, పతంజలి యోగా కేంద్రం, ఖమ్మం సంపూర్ణ ఆరోగ్యమే ముఖ్యం ప్రతీ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుటుంటారు. ఇందుకోసం యోగా, ధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించే శక్తి యోగాకు ఉంది. ఆడ, మగ బేధం లేకుండా సాధన చేయొచ్చు. – కోదండరావు, సిద్ధార్థ యోగా కేంద్రం, ఖమ్మం యోగాను విస్తృత పరుస్తాం సర్థార్ పటేల్స్టేడియంలో యోగా కేంద్రం ఏర్పాటుకు మా వంతుప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే యోగాలో జాతీయ, రాష్ట్రస్థాయిలో పలువురు రానించారు. వీరితో పాటు ఔత్సాహికుల కోసం ప్రత్యేక యోగా కేంద్రం ఏర్పాటు చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓ● -
దర్శనం, ఆర్జిత సేవలకు ఇక ఈ–టికెట్లు
● ట్రయల్ రన్ నిర్వహించిన దేవస్థానం ఈఓ ● ఇప్పటికే రామాలయంలో డిజిటల్ సేవలు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో డిజిటల్ సేవలు భక్తులకు మరింత చేరువ అవుతున్నాయి. ఇప్పటికే పలు విభాగాల్లో డిజిటల్ సేవలు అందుతుండగా తాజాగా స్వామివారి దర్శన, ఆర్జిత టికెట్లు పొందేందుకు మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం ఆలయంలో ట్రయల్ రన్ నిర్వహించారు. మూడు మిషన్లను ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఉచితంగా అందించగా, పడమెర మెట్ల వైపు ఒకటి, లడ్డూ కౌంటర్ల వద్ద రెండు మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. యంత్రాలతో భక్తుల సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. మరికొన్ని మిషన్లను దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు బ్యాంకర్లతో దేవస్థానం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేర్మేషన్ యాప్.. రామాలయ సమస్త సమాచారం లభించేలా భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేషన్(బీటీఐ) యాప్ రూపొందించారు. తెలంగాణలోనే తొలిసారిగా యాప్ను రూపొందించి భక్తులకు చేరువైన దేవస్థానంగా రామాలయం నిలిచింది. ఇందులో ఆలయానికి సంబంధించిన 22 రకాల సేవల వివరాలు లభ్యమవుతాయి. సేవలు పొందే ప్రదేశాలతో గూగుల్ మ్యాప్ను అనుసంధానించారు. భద్రాచలంతోపాటు చుట్టు పక్కల ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఉపాలయాలు, సందర్శనీయ స్థలాల వివరాలు కూడా పొందుపర్చారు. త్వరలో అకౌంట్లు సైతం.. త్వరలో అకౌంటింగ్ సెక్షన్ను సైతం డిజిటల్గా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రికార్డుల నిర్వహణలో ఉద్యోగుల చేసే తప్పులకు ఆడిటింగ్ సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రికార్డులను కంప్యూటరైజ్డ్ చేయనున్నారు. దీంతో ఉద్యోగులకు పని ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఈఓ రమాదేవి సాఫ్ట్వేర్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. మరో నెల రోజుల్లో రికార్డులు సైతం కంప్యూటరైజ్డ్ చేసే అవకాశం ఉంది. డిజిటల్మయంగా రామాలయం రామాలయం డిజిటల్మయంగా మారుతోంది. తొలుత దేవస్థాన వెబ్సైట్ ఆధునికీకరించారు. లడ్డూ కౌంటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్ చేశారు. నిత్యన్నదానం, గోశాలకు విరాళాలు ఇచ్చే వారి వివరాలు నమోదుతో పాటు దాతలకు ఆన్లైన్ రశీదులు అందజేస్తున్నారు. స్వామివారి వస్త్రాల విక్రయాలకు బార్కోడ్ రూపొందించారు. ప్రొటోకాల్ దర్శనానికి వచ్చే వారికి స్కాన్తో ఫొటో తీసి ఎంట్రీ టికెట్ అందజేస్తున్నారు. అన్నదానానికీ ఈ–టోకెన్ ఇస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో డిజిటల్ సేవలను విస్తరింపజేశారు.సులభంగా సేవలు పొందేలా.. ఒక్కొక్కటిగా భక్తులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. భక్తులకు సమయం ఆదా, సులభరీతిలో సేవలు అందేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. యాప్, ఆన్ల్లైన్లో సేవలతోపాటు తాజాగా కియోష్కి మిషన్లు ద్వారా దర్శన, ప్రసాద టికెట్లు విక్రయించే చర్యలు చేపట్టనున్నాం. వీటిపై ట్రయల్రన్ నిర్వహించాం. – ఎల్.రమాదేవి, రామాలయ ఈఓ -
రాజకీయాల్లో యువత పాత్ర కీలకం
ఖమ్మంమయూరిసెంటర్: రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో కీలకమని గుర్తించి సమాజ మార్పునకు ముందుకు రావాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్రెడ్డి సూచించారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేజెండ్ల సాయికుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అంతేకాక ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఇదే సమయాన యువతకు అత్యధిక సీట్లు ఇచ్చేలా నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జిల్లా ఇన్చార్జి దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ కష్టపడి పని చేసే వారికి పదవులు తప్పక వస్తాయని తెలిపారు. తొలుత మయూరి సెంటర్లోని రాజీవ్గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శి జెర్రిపోతుల అంజనీకుమార్, నాయకులు యడ్లపల్లి సంతోష్, ఖలీల్ పాషా, బెజ్జం గంగాధర్, బానోత్ కోటేష్ పాల్గొన్నారు. కాగా, సభ్యత్వ నమోదులో ప్రతిభ కనబరిచిన యూత్ కాంగ్రెస్ నాయకుడు కె.క్రాంతికుమార్ను శివచరణ్రెడ్డి సత్కరించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి -
నేడు యోగా దినోత్సవం
● యోగా సాధనకు పెరుగుతున్న ఆదరణ ● జిల్లాలో పలు సంస్థల ఆధ్వర్యాన కేంద్రాలు, ఉచిత శిక్షణ ● ఆసక్తిగా హాజరవుతున్న సాధకులు 40ఏళ్ల క్రితమే కేంద్రం వందల ఏళ్ల క్రితమే యోగా మనుగడలో ఉన్నట్లు తెలుస్తుండగా గత పది, పదిహేనేళ్ల నుంచి మాత్రం విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో కొన్ని సంస్థల ద్వారా జిల్లా, మండల కేంద్రాల్లో యోగా ఉచిత శిక్షణ ఇస్తుండగా ఔత్సాహికులు హాజరవుతున్నారు. ఖమ్మంలో దాదాపు 40 ఏళ్ల క్రితం పతంజలి యోగా కేంద్రాన్ని తొలిసారిగా స్థాపించారు. ఇందులో శిక్షణ పొందిన పలువురు రాష్ట్ర, జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటడం విశేషం. అంతేకాక జిల్లాలో శ్రీరామకృష్ణ యోగా సమితి, శ్రీరామచంద్ర మిషన్, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, బ్రహ్మకుమారీల ద్వారా శిక్షణ కొనసాగుతోంది. ఈమేరకు నేడు (శనివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్థల నిర్వాహకులు, సాధకుల అభిప్రాయాలు. -
నైరుతి.. కరుణ ఏదీ?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముందస్తుగా వర్షాలు కురిశాయన్న ఆనందం రైతులకు కొద్దిరోజులు కూడా మిగల్లేదు. వ్యవసాయ పనులు ప్రారంభించే సమయానికి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయగా.. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఎదురుచూడడం ఆనవాయితీగా మారింది. గత నెలాఖరులో జిల్లా అంతటా వర్షాలు కురవగా, రైతులు సంతోషంగా దుక్కులు దున్ని సేద్యానికి సిద్ధమయ్యారు. కొన్నిచోట్ల పత్తి విత్తనాలు కూడా నాటినా, ఆతర్వాత అనుకున్న స్థాయిలో వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఈపాటికే దాదాపు లక్ష ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటాల్సి ఉండగా, ఇది 30,351 ఎకరాలకే పరిమితమైంది. ఇక వరితో పాటు మెట్ట పంటల సాగు కూడా ఆశాజనకంగా నమోదు కాలేదు. మే చివరిలోనే వర్షాలు.. ఈ ఏడాది మే మూడో వారంలోనే నైరుతి రుతుపవనాల ప్రవేశం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ఆధారంగా రైతులు దుక్కులు దున్నగా.. చాలామంది పత్తి విత్తనాలు విత్తారు. మృగశిర కార్తె ప్రారంభం తర్వాత వర్షాలు జోరందుకోవాల్సి ఉండగా, అడపా దడపా మబ్బులు కమ్మడం తప్ప వర్షం జాడే లేదు. ఇదే పరిస్థితి మరిన్ని రోజులు ఉంటే పత్తి విత్తనాలు భూమిలోనే కలిసిపోయే అవకాశముందనే భయంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. అంచనా అందుకునేనా.. గత నెలలోనే వర్షాలు కురిసిన నేపథ్యాన ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత వానాకాలంలో 2లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, ఈసారి 2,20,550 ఎకరాలకు చేరుతుందని భావించారు. ఈమేరకు కొందరు రైతులు విత్తనాలు నాటగా, మరికొందరు సరిపడా వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, వర్షాలు ఆలస్యమవుతుండగా.. అంచనాల మేరకు జిల్లాలో పత్తి సాగవుతుందా, లేదా అన్న మీమాంస నెలకొంది. మరో రెండు నెలలే.. ఈ వానాకాలం సీజన్ పంటల సాగుకు రెండు నెలల సమయమే ఉంది. ఆగస్టు వరకు వరి నాట్లు వేయడానికి అవకాశముంది. సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో రైతులు పంట సాగుపై దృష్టి పెట్టారు. కానీ పూర్తిస్థాయిలో వర్షాలు లేక వరి సాగు ఊపందుకోలేదు. ఈ సీజన్లో 2.85లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 9,740 ఎకరాలకు సంబంధించి నార్లు పోశారు. మరో 6,585 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు మొదలుపెట్టారు. మొక్కజొన్న కూడా కేవలం 32ఎకరాల్లో సాగవుతోంది. ఈ సమయాన వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇప్పటికే సాగైన పంటలకు ఊపిరి అందడమే కాక అంచనా మేర సాగు జోరందుకోనుంది. బోర్లు, బావులే దిక్కు.. ఇప్పటివరకు మోస్తరు వర్షం తప్ప.. పంటలకు సరిపడా కురవలేదు. దీంతో పంటల సాగు అంతంతమాత్రంగానే ఉంది. ఓవైపు వరి నార్లు పోయగా, పత్తి విత్తనాలు విత్తారు. ఈ నేపథ్యాన పత్తి మొలకలను కాపాడుకునేందుకు రైతులు అవస్థ పడుతున్నారు. వర్షం కురవక బోర్లు, బావులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆ దిశగా దృష్టి సారిస్తున్నారు. మొదట్లో కురిసిన వర్షాలతో దుక్కులు దున్నిన రైతులు ఆ తర్వాత వరుణుడి జాడ లేక ఊపందుకోని పత్తి సాగు పొడి దుక్కుల్లో విత్తిన అన్నదాతల్లో ఆందోళన ఇంకొన్ని రోజులు వాన రాకపోతే కష్టమేనని ఆవేదన వర్షాలు లేక.. మొలక రాక ఈ ఫొటోలోని రైతు తిరుమలాయపాలెం మండలంలోని ఎదుళ్లచెరువుకు చెందిన నాగండ్ల మోహన్రావు. పది రోజుల క్రితం నాలుగెకరాల్లో పత్తి విత్తనాలు నాటాడు. అప్పటి నుంచి చిరుజల్లులు తప్ప మొలకలు వచ్చే స్థాయిలో వర్షం కురవడం లేదు. పత్తి విత్తనాలు నాటడానికి ఎకరాకు కూలీల ఖర్చుతో కలిపి రూ.5 వేలకు పైగా వెచ్చించాడు. విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక, మరోమారు నాటాలంటే ఆర్థిక భారం తప్పదని ఆందోళన చెందుతున్నాడు. సాగు కష్టమే... ఏటా మాదిరే ప్రకృతి మోసం చేసింది. పంట కాలం కంటే ముందే వాన పడడంతో పత్తి విత్తనాలు నాటాం. తీరా నాటాక వానల జాడ లేక పైకి వచ్చిన మొక్కలు, భూమిలో విత్తనాలు దెబ్బతిన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ విత్తనాలు కొనాలంటే కష్టమే. – తోట వెంకట్, కోయచలకఆదిలోనే ఎదురుతిరిగింది.. రోహిణకార్తెలోనే వాన కురవడంతో పత్తి సాగుపై ఆశతో ఎనిమిది ఎకరాల్లో విత్తనాలు వేశాం. కొంత మేర మొలక వచ్చినా మొక్క ఎదగడం లేదు. ఇదిలాగే ఉంటే పెట్టుబడి మొత్తం మట్టి పాలైనట్లే. నాతో సహా చాలా మంది నష్టం చవిచూడాల్సి వస్తుంది. – చెరుకూరి కృష్ణారావు, రేగులచలక -
బాలుడి గొంతులో ప్లాస్టిక్ గన్ బుల్లెట్
● ఏడాదిగా నొప్పి, మింగలేక ఇబ్బందులు ● శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యుడు ఖమ్మంవైద్యవిభాగం: ఆడుకునే క్రమాన ప్లాస్టిక్ గన్ బుల్లెట్ను నోట్లో పెట్టుకోగా అది బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఏడాది కాలంగా నొప్పి, ఏదీ సరిగా తినలేక ఇబ్బంది పడుతుండగా శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైనమిది. మహబూబాబాద్ జిల్లా పాతపోచారం గ్రామానికి చెందిన పి.శ్రవణ్కుమార్ – సౌజన్య దంపతుల మూడేళ్ల కుమారుడు షణ్ముక్ కొంత కాలంగా గొంతు నొప్పి, మింగలేకపోవడం, తినలేక బాధపడుతున్నాడు. చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేక ఖమ్మం నెహ్రూనగర్లోని ప్రవీణ్ ఈఎన్టీ ఆస్పత్రిలో డాక్టర్ ఎం.జీ.వీ.ప్రవీణ్ను సంప్రదించారు. బాలుడికి ఎండోస్కోపీ నిర్వహించినా ఫలితం లేక సిటీ స్కాన్ చేయగా గొంతు వెనుక భాగంలో వస్తువు కనిపించింది. అత్యంత సున్నితమైన మెదడు అడుగు భాగాన పదునైన వస్తువు ఉన్నట్లు తేలడంతో శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయగాఅది ప్లాస్టిక్ గన్ బుల్లెట్గా గుర్తించారు. దీన్ని అలానే వదిలేసి ఉంటే కపాలం నుంచి మెదడులోకి చొచ్చుకెళ్లి మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను పాడు చేసేదని వైద్యుడు వివరించారు. -
వ్యవసాయ భూములన్నింటికీ ‘భరోసా’
● ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తున్నాం.. ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి: వానాకాలం సీజన్ ఆరంభంలో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.6వేలు జమ చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నదాతలు విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే పెట్టుబడి సాయం అందించడం ద్వారా వారి ఇక్కట్లు తీరనున్నాయని చెప్పారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెం, పోచారం, పూర్యాతండా, చింతలతండా తదితర గ్రామాల్లో బీటీ, సీసీ రహదారుల నిర్మాణానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతోందని తెలిపారు. సాగు యోగ్యమైన ప్రతీ ఎకరా భూమికి భరోసా అందుతుందని స్పష్టం చేశారు. అంతేకాక ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు. ఈక్రమంలో ఎదురవుతున్న ఆర్థిక ఇక్కట్లను అధిగమిస్తూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యాన నిర్వహించిన పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి కేక్ కట్ చేసి మాట్లాడారు. దేశ ప్రజల తరఫున ప్రశ్నించే ఏకై క గొంతుక రాహుల్గాంధీదేనని తెలిపారు. -
క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి పకడ్బందీగా పోటీలు
నేలకొండపల్లి: ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి మండలాల వారీగా ఎంపిక పోటీలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ సీఎంఓ, ఫిట్ ఇండియా జిల్లా నోడల్ అధికారి రాజశేఖర్ తెలిపారు. నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం పాఠశాలలను గురువారం తనిఖీ చేసిన ఆయన కంప్యూటర్ ఆధారిత బోధనపై ఆరా తీశారు. అలాగే, విద్యార్థుల ప్రగతి, సామర్థ్యాలను పరీక్షించాక దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సీఎంఓ మాట్లాడుతూ రాజేశ్వరపురం భవిత కేంద్రాన్ని నేలకొండపల్లిలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో విలీనం చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఫిజియోథెరపీ ద్వారా వారిని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. కాగా, స్పోర్ట్ స్కూళ్లలో ప్రవేశానికి ఈనెల 21 వరకు మండలస్థాయి పోటీలు పూర్తిచేసి, 22న ఖమ్మంలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తామని, అక్కడ ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కాగా, అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లోనూ కంటైనర్ గృహాలు!
● ఖర్చు తక్కువ.. అన్ని వసతులు ● నచ్చిన కొలతల్లో తయారీకి అవకాశం కొణిజర్ల: ఇప్పటి వరకు నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, చిన్నపాటి ఆఫీసులుగా చూసిన కంటైనర్ ఇళ్లు ఇప్పుడు అందరికీ చేరువవుతున్నాయి. ఇష్టం వచ్చిన రీతిలో త్వరగా సమకూర్చుకునే అవకాశం ఉన్నందున గ్రామాల్లోనూ పలువురు వీటిని ఆర్డర్పై తయారు చేయించుకుంటున్నారు. దూలపల్లిలో తయారీ.. కొణిజర్ల వాసి చింతల సతీష్కు ఇక్కడ 300 చదరపు అడుగుల స్థలం ఉంది. ఈ స్థలంలో బేస్మెంట్ నిర్మించాక ప్రీ ఫ్యాబ్రికేట్ ఇళ్లు సిద్ధం చేసి ఇస్తున్నారని తెలియడంతో హైదరాబాద్ కొంపల్లి సమీపాన దూలపల్లిలోని సంస్థను సంప్రదించాడు. దీంతో కిచెన్, హాల్, సింగిల్ బెడ్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో కంటైనర్ రూపంలోని ఇళ్లు తయారుచేసి ఇచ్చారు. ప్రత్యేక వాహనంపై తీసుకొచ్చి ముందే నిర్మించిన బేస్మెంట్పై ఫిట్ చేయించాడు. తనకు ఉన్న స్థఽలం కొలతల ఆధారంగా ఇంటిని సిద్ధం చేయించుకున్న సతీష్ ఇందుకోసం రూ.6 లక్షల వ్యయమైందని, జీఎస్టీ, రవాణా కలిపి మరో రూ.లక్ష వెచ్చించానని చెబుతున్నారు. ఇంటీరియర్ డిజైన్తో పాటు వాటర్, హీట్, ఫైర్ ఫ్రూప్గా ఉండి ఏడాది వారంటీతో ఇచ్చారని వెల్లడించాడు. కాగా, ఈ ఇంటిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్తో పాటు నచ్చిన కొలతలతో ఇంటి నిర్మాణానికి అవకాశం ఉండడంతో పలువురు సంస్థను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ ఇళ్లలో కాస్తంత ఎత్తు తక్కువగా ఉండడం కొంత లోపంగా చెబుతున్నారు. సాధారణంగా ఇళ్లు పది అడుగుల ఎత్తులో నిర్మిస్తుంటే ఈ క్యాబినెట్ ఇల్లు మాత్రం తొమ్మిది అడుగుల ఎత్తులోనే ఉంది. -
మానవ తప్పిదమేనా!?
● పెరుగుతున్న ’ఆఫ్టైప్’ ఆయిల్పామ్ బాధిత రైతులు ● గెలలు రాక ఏళ్ల శ్రమ వృథా అవుతోందని ఆవేదన ● రేగళ్లపాడు, దమ్మపేట నర్సరీల్లో ఇచ్చిన మొక్కలపైనే సందేహాలుసత్తుపల్లి: ఆయిల్పామ్ తోటల్లో ఆఫ్టైప్ మొక్కల సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. తోటల్లో నానాటికీ ఆఫ్టైప్ మొక్కలు పెద్దసంఖ్యలో వెలుగు చూస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయిల్పామ్ సాగు పెంపే లక్ష్యంగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంటే, కొన్ని నర్సరీల సిబ్బంది తప్పిదాలతో ఆఫ్టైప్ మొక్కల సరఫరా జరుగుతోందనే ఆరోపణల వెల్లువెత్తుతున్నాయి. అయితే, వీటిని తొలినాళ్లలో గుర్తించే అవకాశం లేక.. నాలుగేళ్ల తర్వాత మరుగుజ్జు గెలలు, కొన్నింటికి అసలు గెలలే రాకపోవడంతో ఏటా రూ.లక్ష చొప్పున నాలుగేళ్లకు రూ.4లక్షల పెట్టుబడి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్పామ్ సాగుతో మంచి దిగుబడి, లాభాలు వస్తాయని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతుండగా, ఇప్పుడు ఎదురైన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. చైర్మన్ పరిశీలించినా... ఈ ఏడాది ఏప్రిల్ 24, 25వ తేదీల్లో ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో శాస్త్రవేత్తల బృందంతో కలిసి పర్యటించారు. పలుచోట్ల కాపురాని తోటలను పరిశీలించిన ఆయన రాష్ట్రంలోని 11 నర్సరీలకు గాను ఐదు నర్సరీల ద్వారా ఇస్తున్న మొక్కలతో సమస్య ఎదురవుతోందని తెలిపారు. ఆయా నర్సరీలను ప్రక్షాళన చేస్తే సగం సమస్యలు తీరతాయని చెప్పారు. ఇదే సమయాన కాపురాని తోటలకు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పిన ఆయన, ఉద్యోగుల్లో ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది జరిగిన రెండు నెలలు దాటుతున్నా ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలే లేకపోవడం గమనార్హం. ఆ మొక్కల పంపిణీకి యత్నాలు సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీలో తంబా రకానికి చెందిన 2.20 లక్షల మొక్కలను కల్లింగ్ చేస్తామని ప్రకటించినా, ఇప్పుడు రైతులకు అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఐఓపీఆర్ సంస్థ ద్వారా విచారణ చేయిస్తే ఏవి నకిలీ, ఏవి అసలు మొక్కలో తేలుతాయని, ఇదే సమయాన తోటలను కూడా శాస్త్రవేత్తలతో పరిశీలన చేయించాలని కోరుతున్నారు. మరికొన్ని చోట్ల ఆయిల్పామ్ మొక్కల్లో జన్యులోపం వల్ల 30 – 40 కేజీలకు బదులు గెలలు 10 కేజీలు కూడా రావడం లేదని చెబుతున్నారు. ఈ విషయమై ఆయిల్ఫెడ్ అధికారులు, శాస్త్రవేత్తలు స్పందించి ఆయిల్పామ్ సాగు, నేలల రకాలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. కాగా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆఫ్టైప్ మొక్కలు వచ్చిన తోటలను ఇటీవల రాష్ట్ర రైతు సంఘం నాయకులు పరిశీలించారు. నర్సరీల్లో మావన తప్పిదాలతోనే వంధ్యత్వ మొక్కలు బయటకు వెళ్లాయని ఆరోపించిన వారు రైతులకు పరిహారంతో పాటు గెలలు టన్నుకు మద్దతు ధర రూ.25వేలు తగ్గకుండా చెల్లించాలని డిమాండ్తో ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.రెండు వేల ఎకరాల్లో సమస్య సుమారు రెండు వందల మంది రైతులు సాగు చేస్తున్న రెండు వేలకు పైగా ఎకరాల ఆయిల్పామ్ తోటల్లో ఆఫ్టైప్ మొక్కల సమస్య ఉందని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట నర్సరీల ద్వారా లక్షలాది మొక్కలు నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు అక్రమంగా రవాణా చేశారని చెబుతున్నారు. ఇదే సమయాన అశ్వారావుపేట మండలం దిబ్బగూడెంలోని తోటల్లో నాలుగేళ్ల క్రితం మొక్కలకు అంట్లు కట్టి నర్సరీల్లో పెంచి ఉమ్మడి జిల్లా రైతులకు ఇవ్వడంతోనే ఆఫ్టైప్ మొక్కలు వచ్చాయని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ ఆఫ్టైమ్ సమస్య వెలుగు చూస్తున్నందున పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని చెబుతున్నారు. -
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి
కొణిజర్ల: పత్తి చేనులో పని కోసం నడిచి వెళ్లున్న ఓ మహిళను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన మండలంలోని తీగలబంజరలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ జి.సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. తీగలబంజరకు చెందిన సయ్యద్ గోర్బీ(53) పత్తి చేనులో పనికి వెళ్తుండగా సింగరాయపాలెంకు చెందిన ఎస్.సాయికృష్ణ ద్విచక్ర వాహనంతో వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కింద పడిన గోర్బీ మామూలుగానే లేచి ఇంట్లోకి వెళ్లింది. ఆ కాసేపటికి వాంతులు చేసుకుంటుండడంతో వైరా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గోర్బీకి భర్త జానీమియా, ఇద్దరు కుమార్తెలు ఉండగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. -
ఆధునిక విధానాలతో లాభసాటిగా సాగు
చింతకాని: పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు అవలంభిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చునని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. చింతకాని మండలం జగన్నాధపురం, పందిళ్లపల్లి, గాంధీనగర్ కాలనీల్లో పత్తి పంటను గురువారం ఆయన పరిశీలించారు. పత్తి విత్తనాలను జూలై 15వరకు విత్తుకునే అవకాశమున్నందున, భూమిలో తగిన తేమ వచ్చాకే నాటాలని సూచించారు. తొలుత విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లను కొంతమేర తగ్గుతాయని తెలిపారు. ఆతర్వాత ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నియంత్రణపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ మానస, ఏఈఓలు రాము, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
సత్తుపల్లిటౌన్/పెనుబల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక పద్ధతుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ తెలిపారు. సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్లో ఏఐ బోధన, సత్తుపల్లి పాత యూపీఎస్లో పీఎంశ్రీ అమలును గురువారం పరిశీలించిన ఆయన జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు బిగ్హెల్ప్ సంస్థ సమకూర్చిన బ్యాగ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. అలాగే, గత ఏడాది పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించడంపై జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శైలకుమారి, ఉపాధ్యాయులను డీఈఓ అభినందించారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, పెనుబల్లి మండలం వీఎం బంజర్, కుప్పెనకుంట్ల జెడ్పీహెచ్ఎస్ల్లో బడిబాట ముగింపు సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్ డేలో డీఈఓ పాల్గొన్నారు. వెనుకబడిన విద్యార్థులను విద్యాసంవత్సరం మొదట్లోనే గుర్తించి వారి సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంఈఓ ఎస్.సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పదవులు ఇవ్వకుంటే గుణపాఠం చెబుతాం
ఖమ్మం మామిళ్లగూడెం: యాదవులు, మున్నూరు కాపులతో పాటు ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుంటే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షుడు డి.రాజారాంయాదవ్ హెచ్చరించారు. ఖమ్మంలో గురువారం ‘బీసీల రిజర్వేషన్లు, మంత్రి పదవుల కేటాయింపు’అంశంపై తెలంగాణ యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి గుమ్మా రోశయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యాదవులు, మున్నూరుకాపులు, ఎంబీసీలు సహకరించగా, యూపీఏ–1, 2 ప్రభుత్వం మనుగడలోనూ ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ కృషి ఉందని తెలిపారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి యాదవజాతిని నిర్లక్ష్యంగాచూడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సూచనల మేరకు ఇకనైనా మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 30వ తేదీన యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రాజారాం కోరారు. సదస్సులో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్నూరు కాపు సంఘం నాయకుడు గుండాల కృష్ణ, గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమరగాని వెంకన్నగౌడ్, తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య యాదవ్తో పాటు వివిధ సంఘాల నాయకులు ఎర్రబోయిన గోవిందరావు, గోవర్దన్, మేకల కృష్ణ, మధు, బారీ మల్సూర్, చిత్తారు ఇందుమతి, జడ మల్లేష్, జంగా సత్యనారాయణ, మీగడ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి
బోనకల్: శాంతిభద్రతల పరిరక్షణకు పెట్రోలింగ్ ముమ్మరం చేయడమే కాక పాత నేరస్తుల కదలికలపై నిఘా వేయాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు సూచించారు. బోనకల్ పోలీసుస్టేషన్ను గురువారం తనిఖీ చేసిన ఆయన స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసుల విచారణపై ఆరాతీశారు. అనంతరం ప్రసాద్రావు మాట్లాడుతూ పోలీసులపై నమ్మకంతో స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలు, ఇతరత్రా అక్రమ రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పొదిలి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు మధిరలో జరిగే ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 10–30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లితో పాటు అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు. ప్రధాని పిలుపుతో ‘అమ్మ పేరుతో మొక్క’ ఖమ్మం అర్బన్: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపుతో ‘అమ్మ పేరుతో మొక్క‘కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. ఖమ్మం రోటరీనగర్లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం వద్ద పార్టీ నాయకుడు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యాన గురువారం మొక్కలు నాటగా కోటేశ్వరరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మోదీ పాలనలో ప్రజలు ధైర్యంగా జీవిస్తున్నారని, ఇదే సమయాన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, నాయకులు విజయరాజు, అల్లిక అంజయ్య, కంపసాటి అంజన్న, మేడిపల్లి నీలిమ, హుస్సేన్, సీతారాములు, ముత్యం, పల్లపు వెంకన్న, రమేష్, కృష్ణ, సత్యనారాయణ, రాజు, నరేందర్, సాంబశివరావు పాల్గొన్నారు. భూభారతి సదస్సుల్లో దరఖాస్తుల వెల్లువ ఎర్రుపాలెం: ఇటీవల అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంపై గ్రామాల్లో నిర్వహిస్తున్న సదస్సులకు పెద్దసంఖ్యలో రైతులు హాజరై సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి తెలిపారు. ఎర్రుపాలెం రైతు వేదికలో గురువారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. సదస్సుల్లో అందిన దరఖాస్తులను పరిశీలించి పరి ష్కరిస్తామని, తద్వారా రైతుల ఇక్కట్లు తీరనున్నాయని చెప్పారు. ఈకార్యక్రమంలో మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, తహసీల్దార్ ఎం.ఉషాశారద, ఉద్యోగులు శిరీష, రవికుమార్తో పాటు గుడేటి బాబు రావు, షేక్ ఇస్మాయిల్, కంచర్ల వెంకటనరసయ్య, కడియం శ్రీనివాసరావు, మల్లెల లక్ష్మణ్రావు, షేక్ షాబాష్, బుర్రా వెంకటనారయణ, సూరంశెట్టి రాజేష్ పాల్గొన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలి ముదిగొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) అందే రుణాలను రైతులు సద్వి నియోగం చేసుకోవాలని బ్యాంక్ సీఈఓ వెంకట ఆదిత్య సూచించారు. ముదిగొండలోని సొసైటీ కార్యాలయానికి గురువారం వచ్చిన ఆయన రుణాల మంజూరు, బకాయిలపై చర్చించారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ రైతులకు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో పాటు గేదెల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని ఉద్యోగులకు సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. సొసైటీ చైర్మన్, వైస్చైర్మన్లు తుపాకుల యలగొండస్వామి, బట్టు పురుషోత్తం, సీఈఓ వెంకటరత్నం, డీజీఎం ఉదయశ్రీ, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్లు మధులిక, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి
ఖమ్మంరూరల్: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఏదులాపురంలో గురువారం పర్యటించిన ఆయన ఇళ్ల పురోగతిని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, తొలిదఫా బిల్లులు అందాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణం చేపడుతుంటే ఎప్పటికప్పుడు బిల్లులు జమ అవుతాయని తెలిపారు. కాగా, కూపన్ల ద్వారా ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును పరిశీలించి పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆతర్వాత ఏదులాపురం చెరువు కబ్జాపై ఫిర్యాదులు అందుతున్నందున సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డికి సూచించారు. అనంతరం ఏదులాపురం చెరువు, మిషనన్ భగీరథ ఇన్ టేక్వెల్, పంప్ హౌస్ను కూడా కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. పల్లె దవాఖానాలో మెరుగైన వైద్యం పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఏదులాపురంలోని పల్లె దవాఖానా, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీయడమే కాక బీపీ చెక్ చేయించుకున్నారు. ఏఎన్ఎం సెలవులో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన డీఎంహెచ్ఓను ఫోన్లో ఆరాతీశారు. ఆతర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పిల్లల హాజరు, సిబ్బంది వివరాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. తహసీల్దార్ పి.రాంప్రసాద్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
అన్యాక్రాంతం
అసైన్డ్ భూములుఖమ్మంమయూరిసెంటర్: అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు అసెస్మెంట్ నంబర్లు కేటాయించడంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. బల్లేపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 137, 138ల్లోని అసైన్డ్ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను గురువారం పరిశీలించి కొలతలు, ఎంత మేర నిర్మాణాలు చేపట్టారనే వివరాలు సేకరించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్తో కూడిన బృందం అసైన్డ్ స్థలాల్లో పరిశీలించగా కేఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు, టౌన్ప్లానింగ్ అధికారి, ఇతర సిబ్బంది పర్యవేక్షణలో వివరాలు సేకరించారు. అలాగే, రెవెన్యూ శాఖ ఖమ్మం అర్బన్ కార్యాలయ ఆర్ఐ, సర్వేయర్ పంచనామా చేశారు. అనంతరం జయనగర్ కాలనీ రోడ్డు నంబర్ 10లో ఓ భవనం, బాలపేటలోని ఇంకో భవనాన్ని కూడా పరిశీలించి కొలతలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే, బాలపేటలోని భవన యజమానులు లేకపోవడంతో తిరిగి కేఎంసీ కార్యాలయానికిచేరుకొని అసెస్మెంట్ల రికార్డులు పరిశీలించినట్లు సమాచారం. 2021 నుంచి 2023 సెప్టెంబర్ వరకు రెవెన్యూ విభాగం నుంచి కేటాయించిన అసెస్మెంట్ల నంబర్లకు సంబంధించిన రికార్డులను తమకు అందజేయాలని కేఎంసీ అధికారులను విజిలెన్స్ అధికారులు కోరినట్లు సమాచారం. రికార్డులు పరిశీలించకుండానే.. బల్లేపల్లి సర్వే నంబర్ 137, 138ల్లోని అసైన్డ్ భూములను ప్రభుత్వం కొందరు గిరిజనులకు కేటాయించి పట్టాలు అందజేసింది. ఆ భూమిలో వారు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందాలే తప్ప నిర్మాణా లు చేపట్టడానికి వీలులేదు. అయితే, కొందరి నుంచి భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి అనుమతి లేకుండానే నిర్మాణం చేపట్టాడు. ఇదే మాదిరి ఇంకొందరు కూడా నిర్మాణాలు చేశారని సమాచారం. అయితే, అసైన్డ్ భూమిలో నిర్మాణాలను కేఎంసీ అధికారులు అడ్డుకోకపోగా.. రెవెన్యూ విభాగం నుంచి అసెస్ మెంట్ నంబర్లు కేటాయించడం గమనార్హం. తద్వారా ఆ నంబర్ ఆధారంగా సదరు వ్యక్తి భూమి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రత్యేక విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ ద్వారా కనెక్షన్ తీసుకున్నాడు. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా ఏ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించకపోగా అనుమతులపై ఆరా తీయకపోవడం గమనార్హం. ఈనేపథ్యాన అసైన్డ్ స్థలంలో నిర్మాణాలు, అసెస్మెంట్ నంబర్లు కేటా యింపు అందిన ఫిర్యాదులతో విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఆ నంబర్లు రద్దు అసైన్డ్ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలకు అసెస్మెంట్ నంబర్లు కేటాయించడం, వీటి రిజిస్ట్రేషన్లు జరగడంపై ఆరోపణలు రావడంతో కేఎంసీ అధికారులు నంబర్లను రద్దు చేశారు. కానీ అనుమతి లేని నిర్మాణాలు, నిర్మాణదారులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అసైన్డ్ భూముల్లో చేపట్టిన నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఎలా ఇచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతుండగా, ఈ విషయంలో కేఎంసీ టౌన్ప్లానింగ్, రెవెన్యూ విభాగ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేని నిర్మాణాలకు అసెస్మెంట్ నంబర్లు ఫిర్యాదులతో నంబర్లు రద్దు చేసి చేతులు దులుపుకున్న కేఎంసీ అధికారులు విచారణకు రంగంలోకి దిగిన విజిలెన్స్నాటి రికార్డుల పరిశీలన ఖమ్మం నగర పాలకసంస్థ పరిధిలో అనుమతి లేకుండా చేపట్టిన వందలాది నిర్మాణాలకు రెవెన్యూ విభాగ అధికారులు అక్రమంగా అసెస్మెంట్(ఇంటి నంబర్లు) కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై అందిన ఫిర్యాదులతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కేవలం బల్లేపల్లి ప్రాంత నిర్మాణాలే కాక అసెస్మెంట్ నంబర్లు కేటాయింపుపై పూర్తిస్థాయి విచారణకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగా 2021 ఏడాది నుంచి 2023 సెప్టెంబర్ వరకు అసెస్మెంట్ల నంబర్ల కేటాయింపు రికార్డుల పరిశీలనకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆతర్వాత క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
నేడు, రేపు జాతీయ సదస్సు
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ జూనియర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ జకీరుల్లా తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, తెలంగాణ సాహిత్య అకాడమీ తదితర విభాగాల ఆధ్వర్యాన శతజయంతి సాహితీమూర్తులు దాశరథి, ఆరుద్ర జీవితం, సాహిత్యంపై ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు. కళాశాల విద్యా కమిషనర్ ఎ.శ్రీదేవసేనతో పాటు పలువురు కవులు, కళాకారులు హాజరవుతారని తెలిపారు. సహాయ ఉపకరణాల దరఖాస్తు గడువు పొడిగింపు ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం దివ్యాంగులకు అందజేయనున్న సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన దివ్యాంగులు https://tsobmms. cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై సంబంధిత పత్రాలను 27వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు కలెక్టరేట్లోని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలనికాయన తెలిపారు. నర్సింగ్లో నైపుణ్యాలతో మెరుగైన ఉపాధి సత్తుపల్లి: నర్సింగ్ విద్యలో నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. సత్తుపల్లి మండలం కిష్టారంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆతర్వాత బేతుపల్లిలో జీలుగు సాగు, కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా కోకో పంటలను పరిశీలించారు. అనంతరం రుద్రాక్షపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, యాతాలకుంటలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల పనులను పరిశీలించి, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఎంపీడీఓ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జోష్న, హౌసింగ్ ఏఈ పవన్ పాల్గొన్నారు. బీఏఎస్కు నేడు విద్యార్థుల ఎంపిక ఖమ్మంమయూరిసెంటర్: బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను గురువారం లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్లోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఉదయం 10గంటలకు 1వ తరగతి విద్యార్థులు(డే స్కాలర్), మధ్యాహ్నం 2గంటల నుంచి ఐదో తరగతి విద్యార్థుల(రెసిడెన్షియల్) ఎంపికలు ఉంటాయని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని డీడీ సూచించారు. అవగాహనతోనే సికిల్సెల్ నిర్మూలన కారేపల్లి: సికిల్సెల్ అనేది వారసత్వంగా వచ్చే రక్తరుగ్మత సమస్య అని.. ప్రజలందరూ అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందని డీఎంహెచ్ఓ కళావతి తెలిపారు. కారేపల్లి మండలం గోవింద్తండాలో గురువారంస్థానికులకు సికిల్సెల్ పరీక్షలు నిర్వహించాక ఆమె మాట్లాడారు. ధర్తి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా సికిల్సెల్ పరీక్షల నిర్వహణతో పాటు అవగాహన కల్పిస్తూ పిల్లల్లో వ్యాధి నిర్మూలనకు పాటుపడుతున్నామని తెలిపారు. జన్యులోపాలతో ఎదురయ్యే ఈ వ్యాధి కారణంగా చిన్నారుల్లో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని చెప్పారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసినందున సద్వియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్వీబీడీసీ ప్రోగ్రామ్ అధికారి వెంకటరమణ, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ రవీంద్రప్రసాద్, వైద్యాధికారి సురేష్ పాల్గొన్నారు. -
మహిళల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళల అభివృద్ధి, ససంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తే, నేటి ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా తోడ్పాటునిస్తోందని తెలిపారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడుతూ మహిళల పేరిట అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. అనంతరం రాహుల్గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. అలాగే, ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యకర్త గుంటి భవాని ఇంట్లో సన్న బియ్యంతో భోజనం చేశారు. నాయకులు దుంపా రూప, జాను, కుమారి, తోట దేవీప్రసన్న, దామా స్వరూప, బిక్కసాని స్వరూప, దేవత్ దివ్య, కొత్తపల్లి పుష్ప, ఊరుకొండ చంద్రిక, అన్నపూర్ణ, కె.సుగుణ, సుగుణ, ప్రతిభారెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు -
సుమనోహరం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామయ్యకు రూ.5 లక్షల విలువైన బంగారు హారంభద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి హైదరాబాద్కు చెందిన ఎం.కృష్ణచైతన్య – రాజ్యలక్ష్మి దంపతులు గురువారం బంగారుహారం అందజేశారు. సుమారు రూ.5 లక్షల వ్యయంతో తయారు చేయించిన 52.25 గ్రాముల హారాన్ని మొదట స్వామివారి మూలమూర్తుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రమాదేవికి అందజేశారు. -
తల్లి మృతి, కుమారుడికి గాయాలు
పెనుబల్లి: ఆగి ఉన్న బైక్ను లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన గుడికందుల కోటేశ్వరరావు సత్తుపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం తన తల్లి సావిత్రి(60)ని తీసుకుని బైక్పై సత్తుపల్లి వెళ్తుండగా మార్గమధ్యలో పెనుబల్లి మండల టేకులపల్లి వద్ద లగేజీ సరిచేసేందుకు జాతీయ రహదారి పక్కన ఆగాడు. ఈక్రమంలో సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టగా తీవ్రగాయాలతో సావిత్రి అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, కోటేశ్వరరావుకు సైతం గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. -
రాజకీయ జోక్యమే కాపాడుతోందా?
● డీసీసీబీలో రూ.కోట్ల అక్రమాలపై విచారణకే పరిమితం ● నేడు మహాజన సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) 127వ మహాజన సభ శుక్రవారం జరగనుండగా, బ్యాంకులో ఏళ్ల క్రితం అక్రమాలపై పలువురు చర్చకు పట్టుబట్టే అవకాశముందని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఖమ్మంలోని పలు బ్రాంచ్ల ద్వారా 21మంది ఇళ్ల నకిలీ ధ్రువపత్రాలతో రూ.6 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇవేకాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బ్రాంచ్ల ద్వారా రుణాల మంజూరీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటిపై నాలుగేళ్లుగా వివిధ స్థాయిల్లో విచారణ జరుగుతుండగా, కేవలం ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మిగతా బ్రాంచ్ల అధికారులు అక్రమాలకు కారణమని తెలిసినా ప్రధాన కార్యాలయంలో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడంతోనే సరిపెట్టడం గమనార్హం. మిగతా వారికి రాజకీయ నాయకుల అండ ఉండడంతో విచారణల పేరిట కాలం వెళ్లదీస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, రూ.6కోట్ల రుణం తీసుకుని చెల్లించని వ్యవహారంపై గత పాలకవర్గం రాష్ట్ర సహకార బ్యాంకు(టస్కాబ్) దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్ విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణ అనంతరం నివేదిక సమర్పించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై కొద్దినెలల క్రితం జరిగిన సమావేశంలో డైరెక్టర్లు ప్రశ్నించారు. దీంతో శుక్రవారం జరిగే సమావేశంలో గట్టిగా నిలదీయాలని డైరెక్టర్లు భావిస్తుండడంతో, సభలో చర్చించేలా అజెండాగా చేర్చారు. అంతేకాక స్థానిక అధికారులతో విచారణ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్యను సంప్రదించగా రుణ అక్రమాలపై మహాజన సభలో నిర్ణయం తీసుకునే అవకాశముందని, సభ్యులు చర్చిస్తే విచారణకు తీర్మానిస్తామని తెలిపారు. అలాగే, ఏడాది క్రితం బ్యాంకులో జరిగిన పలు అక్రమాలపైనా సభ్యులు నిలదీయనున్నట్లు సమాచారం. కాగా, వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంట రుణాలు, పీఏసీఎస్ల ద్వారా ఎరువుల పంపిణీపై చర్చించేలా అజెండాలో చేర్చారు. -
●వడలిపోతున్న ఆశలు
ఈసారి ముందుగా రుతుపవనాలు వచ్చేశాయని, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో రైతులు సంతోషించారు. ఇందులో భాగంగా రఘునాథపాలెం మండలంలో పలువురు రైతులు ఈసారి మిర్చి తగ్గించి పత్త సాగుకు మొగ్గు చూపారు. త్వరగా పత్తి చేతికొస్తే ఆపై మొక్కజొన్న సాగు చేయొచ్చని నిర్ణయం తీసుకున్నారు. గతనెల మూడు, నాలుగో వారాల్లో అడపాడదపా వర్షాలు కురవడంతో పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు నాటారు. కానీ ఆతర్వాత వరుణుడి జాడ లేకపోగా అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతవుతున్నా వర్షం మాత్రం కురవడం లేదు. దీంతో రూ.వేలు వెచ్చించి భూమి సిద్ధం చేయడంతో పాటు విత్తనాలు నాటిన రైతులు ఇప్పుడేం చేయాలో పాలుపోక ఆకాశం వైపు చూస్తున్నారు. కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తినా మండే ఎండలతో అవి వాడిపోతున్నాయి. దీంతో ప్రతిరోజు పొలానికి వెళ్లడం.. వర్షం ఎప్పుడు కురుస్తుందా అని చూడడం.. వడలిపోతున్న మొక్కలను చూసి ఆవేదనగా ఇంటిముఖం పడుతున్న రైతులు పలుచోట్ల కనిపిస్తున్నారు. ఒకవేళ మరో రెండు, మూడు రోజుల్లో వర్షం కురవకపోతే మళ్లీ విత్తనాలు నాటాల్సిందేనని.. తద్వారా రూ.వేలల్లో నష్టం ఎదురవుతుందని ఆవేదన చెందుతున్నారు. – రఘునాథపాలెం -
సహకార శిక్షణ ఇక ఇక్కడే..
● నాలుగు జిల్లాలకు కలిపి ఖమ్మంలో.. ● చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు సహకార శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేసింది. సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణా కేంద్రాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యాన మల్టీ జోన్–1గా హైదరాబాద్, మల్టీ జోన్–2గా వరంగల్లో మాత్రమే కేంద్రాలు కొనసాగుతున్నాయి. కానీ రాష్ట్రంలోని 60 వేల సహకార సంఘాల నిర్వాహకులకు శిక్షణ ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన ప్రభుత్వం.. కొత్తగా మరో మూడు కేంద్రాలను మంజూరు చేసింది. వీటిని ఖమ్మంతో పాటు నిజామాబాద్, మహబూబ్నగర్లో ఏర్పాటుచేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. చట్టాలపై అవగాహన.. సహకార వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది, అనుబంధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లకు సహకార చట్టం, సహకార వ్యవస్థ నిర్వహణపై అవగాహన పెంచేలా ఈ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), గొర్రెల పెంపకందారులు, మత్స్య సహకార సంఘాలు, కార్మిక సహకార సంఘాల నిర్వాహకులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, స్టాఫ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ స్టాఫ్, డైరెక్టర్లకు ఈ కేంద్రం ద్వారా చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే, కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఉద్యోగులు, ప్రతినిధులకు కూడా ఇక్కడే శిక్షణ ఇవ్వనున్నారు. సహకార చట్టాలతో పాటు వ్యవస్థ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, ఆడిట్, వ్యాపార లావాదేవీలే కాక నూతనంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాలుగు జిల్లాలకు కలిపి.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో సహకార ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చేలా ఖమ్మంలో కేంద్రాన్ని నెలకొల్పుతారు. ఖమ్మం జిల్లాలోని 76 పీఏసీఎస్లు, ఏడు జిల్లా స్థాయి సొసైటీలు, 818 ఎయిడెడ్, 434 అన్ ఎయిడెడ్ సొసైటీలతో పాటు భద్రాద్రి జిల్లాలోని 21 పీఏసీఎస్లు, ఒక జిల్లా స్థాయి సొసైటీ, 316 ఎయిడెడ్, 315 అన్ ఎయిడెడ్ సొసైటీలే కాక మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని సంస్థల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కేంద్రం అందుబాటులోకి రానుంది. కాగా, ఈ కేంద్రం నిర్వహణకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సి పాల్, సంబంధిత అంశాల్లో అనుభవం కలిగిన ఫ్యాకల్టీని నియమించడమే కాక అవసరమైన భవనాన్ని కేటాయించాల్సి ఉంటుంది. -
లోటుపాట్లు ఉండొద్దు..
గురుకులాల్లోవిద్యుత్ సంస్థల్లో సాంకేతిక పరిజ్ఞానం బోనకల్: రైతు భరోసా ద్వారా తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సాగు పనులు ఊపందుకోకముందే పెట్టుబడి సాయం అందించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. బోనకల్ మండలం సీతానగరం సబ్స్టేషన్లో రియల్ టైమ్ ఫీడర్ మేనేజ్మెంట్, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్ సిస్టమ్ను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. రియల్టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం సబ్స్టేషన్లలో ఫీడర్ల పర్యవేక్షణ, నియంత్రణ, రక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు. తొలుత రాష్ట్రంలోని 100సబ్స్టేషన్ల ఈ వ్యవస్థ ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. అలాగే, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్ ద్వారా విద్యుత్ సరఫరాలో అవాంతరం ఎక్కడ ఉందో గుర్తించేందుకు ఉపయోగపడతుందని తెలిపారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఎస్ఈ శ్రీనివాసాచారి, సీఈ తిరుమల్రావు, అధికారులు భద్రూపవర్, శ్రీనివాసరావు, కిరణ్కుమార్, మనోహర్, సాయి, సుందర్కుమార్, కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పైడిపల్లి కిశోర్కుమార్, గాలి దుర్గారావు, మోదుగు సుధీర్బాబు పాల్గొన్నారు.ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురుకులాల నిర్వహణ కొనసాగాలని డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా, ఎకై ్సజ్ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేష్ వి.పాటిల్, సీపీ సునీల్దత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకులాలు, వసతిగృహాల నిర్వహణ, బీసీ సంక్షేమం, రవాణా, ఎకై ్సజ్ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, వనమహోత్సవం నిర్వహణపై సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ సరైన వసతులు లేని గురుకులాలను ప్రత్యామ్నాయ భవనాల్లోకి మార్చాలని, ఎక్కడా దోమల బెడద లేకుండా జాలీలు ఏర్పాటుచేయాలని సూచించారు. కామన్ డైట్ కచ్చితంగా అమలయ్యేలా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని తెలిపారు. మొక్కలు నాటేందుకు గతంలో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా, ఎన్ని బతికాయో లెక్కలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈసారి అలాకాకుండా మొక్కల పెంపకాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు. కాగా, బస్సు సర్వీసులు అవసరమైన గ్రామీణ రూట్లపై ప్రతిపాదనలు సమర్పిస్తే నూతన బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఐఐటీ, నీట్ పై శిక్షణ అందించాలి.. గురుకులాల్లో విద్యాప్రమాణాలు మరింత మెరుగుపరుస్తూ, ఐఐటీ, నీట్ల్లో మంచి ఫలితాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పెరిగిన డైట్ చార్జీల ఆధారంగా కామన్ డైట్ అమలుచేయాలని తెలిపారు. గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించేలా బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ ఏడాది వన మహోత్సవంలో ఈత, తాటి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ గీత కార్మికులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పీఎంఈ స్కీం ద్వారా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళా సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్ పి.నీరజ, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేయాలి అవసరమైన అన్ని ప్రాంతాలకూ బస్సు సర్వీసులు ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ఊరికో బస్సు... ఇంటికో దీపం మధిర: ఊరికో బస్సు... ఇంటికో దీపం అనే నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిరలో రూ.10కోట్లతో నిర్మించే బస్స్టేషన్ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్దత్తో కలిసి ఆయన ప్రారంభించాక మాట్లాడారు. 1978లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వాన ఊరికి ఒక బస్సు.. ఇంటికో దీపం నినాదంతో ప్రభుత్వం ఏర్పాటు కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గత పాలకుల హయాంలో ఆర్టీసీ నష్టపోతే, ఇప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం కృషితో లాభాల బాట పట్టిందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ రూ.6,210 కోట్లను సంస్థకు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. కాగా, మహిళా సంఘాల ద్వారా 600 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అప్పగించనున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ నూతన సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 1987లో ఆరు బస్సులతో ప్రారంభమైన మధిర బస్టాండ్ ఇప్పుడు అత్యాధునిక రూపు సంతరించుకోనుందని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన డిమాండ్ దృష్ట్యా మహిళా సంఘాల ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. అనంతరం కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రారంభించి కొద్దిదూరం ప్రయాణించారు. మధిర మార్కెట్ చైర్మన్ నర్సింహారావు, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పగిడిమర్రి సోలోమన్, ఆర్టీసీ అధికారులు చెరుకుపల్లి వెంకన్న, అజ్మీరా సరిరామ్, జోగు భాస్కర్, శంకర్రారావు తదితరులు పాల్గొన్నారు.1912కు ఫోన్ చేస్తే విద్యుత్ సమస్య పరిష్కారం ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా 2029–30 నాటికి న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా మరో 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యాన రూపొందించిన విద్యుత్ అంబులెన్స్లను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. 1912 నంబర్కు ఫోన్ చేస్తే విద్యుత్ అంబులెన్స్ ద్వారా సిబ్బంది చేరుకుని మరమ్మతులు చేస్తారని భట్టి తెలిపారు. అనంతరం విద్యుత్ సిబ్బందికి ఎలక్ట్రికల్ సేఫ్టీ టూల్ కిట్లు అందజేయగా, ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈశిబిరంలో డీఎంహెచ్ఓ కళావతిబాయి నేతృత్వాన వైద్యులు చందునాయక్, సైదులు, బాలకృష్ణ, చందన తదితరులు 1,217 మందికి పరీక్షలు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఎస్ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఏ.సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెం, పురియాతండా, చింతలతండా గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి గురువారం సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత పోచారం, కూసుమంచిలోనూ సీసీ, బీటీ రోడ్లనిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 23న ఒలింపిక్ డే రన్ ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా యువజన, క్రీడల శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన ఈనెల 23న ఒలింపిక్ డే రన్ నిర్వహించనున్నా రు. ఈ సందర్భంగా ఖమ్మంలోని పటేల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్య మాట్లాడారు. పాఠశాలల విద్యార్థులు, క్రీడా సంఘాల బాధ్యులు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని రన్ను విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ పాఠశాల నుంచి 150మంది విద్యార్థులను పంపించేలా డీఈ ఓకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబు, క్రీడాసంఘాల ప్రతినిధులు గోవింద్రెడ్డి, ఎన్.ఉప్పల్రెడ్డి, శ్రీనివాస్ రా వు, ఉదయ్కుమార్, ఎం.డీ.గౌస్ పాల్గొన్నారు. సివిల్స్ కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: సివిల్స్(ప్రిలిమ్స్, మెయిన్స్)కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ కార్యదర్శి కె.సత్యనారాయణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, పీడబ్ల్యూడీ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనుండగా, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3లక్షలకు మించని వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వచ్చేనెల 13న నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. దరఖాస్తు విధానం, ఇతర సమాచారం కోసం కోసం టీజీఎస్సీ స్టడీ సర్కిల్లో లేదా 90320 77276 నంబర్లో సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. 780 షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ ఏన్కూరు: జిల్లాలోని 780 రేషన్ షాప్ల ద్వారా కార్డుదారులకు మూడు నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నామని డీసీఎస్ఓ చందన్కుమార్ తెలిపారు. ఏన్కూరులోని పలు రేషన్ దుకాణాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం డీసీఎస్ఓ మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా బియ్యం అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసపుకుంటామని స్పష్టం చేశారు. ఈనెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగుతుందని, కార్డుదారులు ఆందోళన చెందాల్సి న పనిలేదని సూచించారు. తనిఖీల్లో ఆర్ఐలు పవన్కుమార్, నరేష్, కిరణ్ పాల్గొన్నారు. రూ.10 ప్యాకెట్లలో విజయ పాలు, పెరుగు ఖమ్మంవ్యవసాయం: అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ విజయ ద్వారా పాలు, పెరుగు ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10కి 150 మి.లీ. పాలు, 120 గ్రాముల పెరుగు ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల పోటీని తట్టుకోవడమే పాటు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వీటిని విక్రయిస్తున్నట్లు ఖమ్మం పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కె.రవికుమార్ తెలిపారు. 27,360 మందికి రైతుభరోసా ఖమ్మంవ్యవసాయం: రైతుభరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతోంది. మూడో రోజైన బుధవారం జిల్లాలో నాలుగెకరాల వరకు భూమి కలిగిన 27,360 మంది రైతుల ఖాతాల్లో రూ.57,22,91,899 జమ చేశారు. మొత్తం 3,53,794 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటివరకు 2,88,151మంది రైతులకు రూ.250,67,89,542 అందాయని డీఏ ఓ ధనసరి పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. -
ఓసీలో రక్షణ చర్యలపై ఆరా
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్(ఓసీ)ను బుధవారం సింగరేణి సౌత్ సెంట్రల్జోన్ డిప్యూటీ డీజీఎంఎస్ టీఆర్.కన్నన్ పరిశీలించారు. కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, పీఓ ప్రహ్లాద్తో కలిసి ఓసీ కార్యాలయం, మైనింగ్ ప్లాన్, వ్యూ పాయింట్ను పరిశీలించిన ఆయన పలు వివరాలు ఆరా తీశారు. బొగ్గు వెలికితీత సమయాన గనులతో పాటు కార్మికుల రక్షణ చర్యలపై ఆరా తీశారు. అనంతరం అధికారులు వ్యూ పాయింట్ వద్ద మొక్కలు నాటారు. వివిధ విభాగాల అధికారులు అశోక్కుమార్, ఆనందవేల్, దిలీప్కుమార్, కమలేష్కుమార్ వర్మ, చింతల శ్రీనివాసరావు, తివారీ, సూర్యనారాయణరాజు, వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, గోవింద్, అభిలాష్, దేవదాస్ పాల్గొన్నారు. -
మానవత్వంతో ఆర్థిక సాయం
తల్లాడ: తల్లాడ మండలం మిట్టపల్లిలో గత నెల గ్యాస్ సిలిండర్ పేలగా ఒకే కుటుంబానికి చెందిన కవల పిల్లలు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో బాలుర తండ్రి గుత్తికొండ వినోద్ కూడా గాయపడగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మండల విద్యాశాఖ ఆధ్వర్యాన సేకరించిన రూ.50 వేల నగదును బుధవారం ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్ చేతుల మీదుగా ఆయనకు అందజేశారు. తొలుత విరాళాల రూపంలో సమకూరిన రూ.61 వేల నగదును వినోద్కు అందించారు. కానీ, ఆయన మొత్తం నగదు తీసుకోకుండా తన కుమారులు చదివిన మిట్టపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి కోసం రూ.11 వేలు వెచ్చించాలని కోరాడు. ఈ మేరకు పిల్లలకు ఆ నగదుతో బ్యాగ్లు, ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు అందించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాయల నరసింహారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలగాలి
ఖమ్మంస్పోర్ట్స్: ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత స్థానాలకు చేరాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ నార్సింగ్ షైలానీ సూచించారు. ఖమ్మం హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లోని ఎన్సీసీయూనిట్ను బుధవారం పరిశీలించిన ఆయ న కేడెట్లతో మాట్లాడారు. కేడెట్లు ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని తెలిపారు. భారత ఆర్మీలో చేపట్టే ఎంపీకల్లో ఎన్సీసీ కేడెట్లకు ప్రత్యేక కోటాఉంటుందని చెప్పారు. అనంతరం గ్రూప్ కమాండర్కల్నల్, వీరచక్ర అవార్డు గ్రహీత సచిన్ నింబాల్కర్, ఏడీ (పర్సనల్) కల్నల్ సంజీవ్కుమార్,11వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్కుమార్ భద్ర, హార్వెస్ట్ కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డితో పాటు జి.బాలకృష్ణ, మమత, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖమ్మంలోని 11వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ను నర్సింగ్ షైలానీ తదితరులు సందర్శించి వివరాలు ఆరా తీశారు. -
అటు ఉద్యోగం.. ఇటు అంత్యక్రియలు
రఘునాథపాలెం: ఉద్యోగానికి ఎంపికై నట్లు సమాచారం తెలియకుండానే యువకుడు కన్నుమూయడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రఘునాథపాలెం మండలం వీవీ పాలెంనకు చెందిన బానోత్ మణిచందన్ (21) తన తండ్రి బాలాజీతో కలిసి సూర్యాపేట జిల్లా బురకచర్ల వెళ్లి వస్తూ కూసుమంచి వద్ద జరిగిన ప్రమాదంలో మంగళవారం మృతి చెందిన విషయం విదితమే. అయితే, పోలీసు, సైనిక దళాల్లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో శ్రమించిన మణిచందన్ ఇటీవల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కానిస్టేబుళ్ల భర్తీకి నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు మంగళవారం ప్రకటించారు. కానీ, అప్పటికే మణిచందన్ మృతి చెందగా.. ఈ విషయం బుధవారం ఉదయం కుటుంబీకులకు తెలిసింది. విజయం సాధించినట్లు తెలుసుకోకుండానే మణిచందన్ మృతి చెందడం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపగా, బంధువులు, గ్రామస్తులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. జీసీసీ గోదాంలో రేషన్ బియ్యం తనిఖీపాల్వంచరూరల్: స్థానిక గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సముదాయంలోని గోదాంలో రేషన్ బియ్యం నిల్వలను రాష్ట్ర విజిలెన్స్ టాస్క్ఫోర్స్ అధికారులు అంజయ్య నేతృత్వంలోని బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. గోదాంలోని సన్నబియ్యం రేషన్ షాపులకు ఎన్ని క్వింటాళ్లు తరలించారు.. ఎంత నిల్వ ఉన్నాయి.. అనే వివరాలతో పాటు ఆర్ఓ ఎంట్రీలను పరిశీలించారు. దమ్మపేట, భద్రాచలంలో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు డీటీ శ్రీనివాసరావు తెలిపారు.శుభవార్త వినకుండానే కన్నుమూసిన యువకుడు -
సాగర్ కెనాళ్ల మరమ్మతులు చేపట్టాలి
ఖమ్మంమామిళ్లగూడెం: వానాకాలం పంటల సాగు సీజన్ మొదలైనందున సాగర్ ఆయకట్టు వరకు నీరు అందేలా అవసరమైన మరమ్మతులు చేపట్టా లని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించగా, సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడారు. ఐదు దశాబ్దాల కిందట సాగర్ ఎడమ కాల్వ నిర్మాణం చేపట్టారని, ఆ తర్వాత కాల్వల్లో అవాంతరాలు, చెట్లు పెరగడంతో ఆయకట్టు చివరి భూములకు నీరు అందక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఇకనైనా మరమ్మతులు చేయడంతో పాటు అర్హులందరికీ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేశ్, నాయకులు చింతనిప్పు చలపతిరావు, గుడ్డూరి ఉమ, తూళ్లూరు రమేశ్, ఉపేందర్, రామారావు, భాస్కర్రావు, రామకృష్ణ, వీరభద్రం, మధు, వెంకట్రావు, అప్పారావు, శ్రీను, ఆనందరావు, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.3.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం బైపాస్ రోడ్డు సమీపాన గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకర రమేశ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టగా టీన్జీవోస్ కాలనీకి చెందిన కట్టగోరు రవితేజ, పాకబండబజార్కు చెందిన జిలాన్ సైఫ్, సంభానీనగర్కు చెందిన షేక్ మహమ్మద్ బాషా, పిండిప్రోలుకు చెందిన బాసిగోంపు గోపి, కోలా శ్రీకాంత్ పట్టుబడ్డారు. ఇదే ముఠాకు సంబంధించి ఎలగందుల సందీప్ పరారీలో ఉండగా, వీరంతా ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరికి బైక్లపై వెళ్లి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో నిందితుల నుంచి రూ.3.60 లక్షల విలువైన గంజాయితో పాటు నాలుగు ద్విచక్రవాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సీఐ రమేశ్తోపాటు ఎస్ఐ శ్రీహరిరావు, ఉద్యోగులు కరీం, బాలు, సుధీర్, వెంకటేశ్, విజయ్, హనుమంతరావు, హరీశ్, వీరబాబు పాల్గొన్నారు. -
బిందు సేద్యానికి ప్రోత్సాహం
● ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు చేయూత ● జిల్లాలో 14,500 ఎకరాలకు డ్రిప్ యూనిట్ల మంజూరు ● వార్షిక ప్రణాళికలో రూ.408 కోట్లు కేటాయింపు కల్లూరురూరల్: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. అందులో భాగంగా బిందు సేద్యానికి సహకరించేలా సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు 2025–26 సంవత్సరానికి సంబంధించి రూ.408 కోట్ల నిధులు కేటాయించింది. ఉద్యానవన పంటలైన ఆయిల్పామ్, మామిడి, నిమ్మ, జామ, మిర్చి, పత్తి, అరటి, అంజీర, బొప్పాయి, అవకాడో, హైబ్రిడ్ కూరగాయలు, పూలమొక్కలు తదితర పంటలను అధిక శాతం సాగు చేసేలా రైతులను ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తోంది. ఉద్యాన సాగును ప్రోత్సహించడమే కాక తక్కువ ఖర్చుతో లాభాలు గడించేలా డ్రిప్ యూనిట్లు మంజూరు చేయనున్నారు. రాయితీపై పరికరాలు బిందుసేద్యం యూనిట్ల మంజూరులో భాగంగా రైతు లకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. షెడ్యూల్ కులాలు, తెగల రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు మంజూరు చేస్తారు. అలాగే, సన్న, చిన్నకారు, వెనుకబడిన తరగతుల రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ అందుతుంది. డ్రిప్ సేద్యానికి సంబంధించిన పరికరాలు, సామగ్రి కావాల్సిన రైతులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కొందరు రైతులకు ఈ పథకం ద్వారా యూనిట్లు మంజూరు చేశారు. తొలి విడతగా రూ.16.17 కోట్లు జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) పరికరాల కొనుగోలుకు తొలి దశలో రూ.16.17 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో మొదటి విడతగా 1,710 ఎకరాల్లో బిందు సేద్యం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేశాక, అధికారులు డ్రిప్ మిషనరీ, పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయిస్తారు. నిధుల మంజూరు మొదలు పరికరాల ఎంపిక, బిగించే వరకు అధికారులు పర్యవేక్షించనున్నారు. అంతేకాక పరికరాల సరఫరాకు జిల్లాల వారీగా కంపెనీలను సైతం ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నేపథ్యాన వారే కొన్నేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూస్తూ రైతులకు అండగా నిలుస్తారు. ‘రాష్ట్రీయ కృషి యోజన’ద్వారా.. రాష్ట్రీయ కృషి యోజన పథకం కింద రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తోంది. పండ్ల తోటలకు డ్రిప్తో పాటు కూరగాయల తోటల్లో పందిళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. అలాగే, రైతులు వెదురు సాగు చేపట్టవచ్చు. –జి.నగేశ్, ఉద్యానవనశాఖ అధికారి, కల్లూరు డివిజన్ -
12 ట్రాలీలు.. 39 పశువులు
ఖమ్మంఅర్బన్: కామేపల్లి మండలం పండితాపురం సంతలో కొనుగోలు చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలిస్తున్న పశువులను ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పలువురు రైతులు 12 మినీ ట్రాలీల్లో 39కిపైగా పశువులను తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. వ్యవసాయ అవసరాల కోసం ఈ పశువులను కొనుగోలు చేసినట్లు చెప్పడమే కాక అన్ని పత్రాలు చూపించారు. అయినప్పటికీ ఒక్కో వాహనంలో రెండుకు మించి పశువులను తీసుకెళ్లొద్దనే నిబంధన ఉల్లంఘించారని వాహనాలను స్టేషన్కు తరలించారు. ఆపై పశువులను సమీప గోశాలలకు తరలించి వాహనదారులు, కొనుగోలుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసుల వివరణ కోసం యత్నించగా స్పందించలేదు. కాగా, వ్యవసాయ పనుల కోసం ఆవులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్న రైతులను పోలీసులు వేధించడం గర్హనీయమని మాస్లైన్ జిల్లా నాయకుడు ఆవుల అశోక్ పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన రైతులను కలిసి మాట్లాడారు. కొందరు ఆకతాయిలు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే విచారణ లేకుండా పోలీసులు వాహనాలను సీజ్ చేయడం సరికాదని తెలిపారు. చెక్ డ్యాంలో పడి వ్యక్తి మృతిజూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం వైకుంఠధామం సమీపంలోని చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెంగల చిన్న వెంకయ్య(55) మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లేదు. బుధవారం చెక్ డ్యాం నీటిలో మృతదేహం లభ్యమైంది. అనారోగ్యం, మానస్థితి బాగాలేక బాధపడుతున్న చిన్న వెంకయ్య బహిర్భూమికి వెళ్లి చెక్ డ్యాంలో పడి మృతి చెంది ఉండవచ్చునని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అక్రమంగా తరలిస్తున్నారని స్వాధీనం -
డయేరియా నిర్మూలనే లక్ష్యం
● ఈ నెల 31 వరకు కొనసాగనున్న పక్షోత్సవాలు ● జిల్లాలో 1.18 లక్షల మందికి ఓఆర్ఎస్, జింక్ మాత్రల పంపిణీ ● ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్ల సమన్వయంతో కార్యక్రమం ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన డయేరియా నియంత్రణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇంటెన్సిఫైడ్ డయేరియల్ కంట్రోల్ ఫోర్ట్నైట్ (ఐడీసీఎఫ్)లో భాగంగా 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 16న కార్యక్రమం మొదలుకాగా 31వ తేదీ వరకు 0–5 ఏళ్లలోపు చిన్నారుల్లో నీళ్ల విరేచనాలను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య కృషి చేయనుంది. అందులో భాగంగా చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యా కెట్లు, జింక్ మాత్రలను జిల్లాలోని సబ్సెంటర్లు, పీహెచ్సీలు, సీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారులకు పంపిణీ చేస్తారు. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్ల సమన్వయంతో ప్రతీ చిన్నారిని గుర్తించి వారికి ఓఆర్ఎస్, జింక్ మాత్రలు మింగించాల్సి ఉంటుంది. వర్షాకాలం రావటంతో కొత్తనీరు ప్రభావంతో ఎక్కువ శాతం చిన్నారులు ఈ సీజన్లో డయేరియా (నీళ్ల విరోచనాలు) బారిన పడతారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ విరేచనాల రూపంలో బయటకు పోవడతో చిన్నారులు పూర్తిగా నీరసిస్తారు. శరీర ఉష్ణోగ్రత పెరిగితే వారు మరింత నీరసించే అవకాశం ఉంటుంది. దీంతో ఓఆర్ఎస్ ద్రావణం తాగిస్తే వారికి ఉపశమనం కలుగుతుంది. శరీరం నుంచి విరేచనాల రూపంలో వెళ్లిన ఎలక్ట్రోలైట్స్ను ఓఆర్ఎస్ ద్రావణం తాగటం ద్వారా తిరిగి సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. 1,18,849 మంది చిన్నారుల గుర్తింపు జిల్లాలో 0–5 ఏళ్ల లోపు 1,18,849 మంది చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ మాత్రలను ఇవ్వనున్నారు. ఇందుకోసం 385 మంది ఏఎన్ఎంలు, 1,340 మంది ఆశా కార్యకర్తల సేవలను వినియోగించుకుంటారు. స్థానిక అంగన్వాడీల సహకారంతో ప్రతీ ఇంటికి వెళ్లి ఓఆర్ఎస్, జింక్ మాత్రలతో కలిగే లాభాలను తల్లిదండ్రులకు వివరిస్తారు. ఓఆర్ఎస్ ద్రావణంతో పాటే చిన్నారులకు జింక్ మాత్ర ఇస్తారు. జింక్తో లాభాలు తరచూ జబ్బు పడకుండా కాపాడుతుంది. త్వరగా నయమయ్యేలా సహకరిస్తుంది. నీళ్ల విరేచనాల సంఖ్య తగ్గుతుంది. అయినా 14 రోజుల వరకు వీటిని ఇవ్వడం ద్వారా కొన్ని నెలల వరకు మళ్లీ విరేచనాలు, న్యూమోనియా రాకుండా కాపాడుతుంది. అలాగే, శరీరంలో జింక్ అవసరాన్ని తీర్చి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాగా, వయస్సుల వారీగా పిల్లలకు ఈ మాత్రలను తల్లి పాలతో కానీ పరిశుభ్రమైన నీటితో కానీ ఇవ్వొచ్చు. కాగా, విరేచనాలు ప్రారంభమైన వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ మాత్ర ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నారులకు ఆరు నెలలు విరేచనాలు పెడుతున్నా కూడా తల్లిపాలే తాగించాలి. ఒక్కరు కూడా మృతి చెందొద్దని.. డయేరియా బారిన పడి 0–5 ఏళ్లలోపు పిల్లలెవరూ మృతి చెందొద్దనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,17,810 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,05,535 జింక్ మాత్రలు సిద్ధం చేశారు. ఇవేకాక సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచీ అవసరమైన చోటకు సరఫరా చేయనున్నారు. ఇటుక బట్టీలు, సంచార జాతులు నివసించే ప్రాంతాల్లో చిన్నారులను గుర్తించి ఓఆర్ఎస్, జింక్ మాత్రలు అందించేందుకు వాహనాల ద్వారా వెళ్లనున్నారు. చిన్నారులందరికీ ఓఆర్ఎస్, జింక్ మాత్రలు జిల్లాలో గుర్తించిన 0–5 ఏళ్లలోపు చిన్నారులందరికీ ఓఆర్ఎస్, జింక్ మాత్రలు అందిస్తాం. పదిహేను రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం విజయవంతమయ్యే లా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ ఒక్కరూ డయే రియాతో మృతి చెందొద్దనే లక్ష్యంతో కృషిచేస్తున్నాం. తల్లిందడ్రులు మా సిబ్బందికి సహకరించి ఓఆర్ఎస్, జింక్ మాత్రలు పిల్లలకు ఇప్పించాలి. –డాక్టర్ చంద్రూనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
టీ క్యాంటీన్లలో తనిఖీ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో టీ క్యాంటీన్లను ఆహార తనిఖీ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆర్.కిరణ్కుమార్ ఆధ్వర్యాన బృందం రైల్వేస్టేషన్ రోడ్డు, కస్బాబజార్ ప్రాంతాల్లో టీ స్టాళ్లలోని టీపౌడర్, పాలు, ఇతర పదార్థాలను పరిశీలించారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని కిరణ్కుమార్ హెచ్చరించారు. ఆహార తనిఖీ అధికారులు లోకేశ్, శరత్, ల్యాబ్ టెక్నీషియన్ రతన్రావు పాల్గొన్నారు. 21న జాబ్మేళా ఖమ్మంసహకారనగర్: ఖమ్మం బస్ డిపో రోడ్డులోని న్యూ చైతన్య అకాడమీ వద్ద హెచ్సీఎల్ టెక్ ఆధ్వర్యాన ఈ నెల 21న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ కె.రవిబాబు తెలిపా రు. 2023–24, 2024–25లో ఇంటర్ బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ గ్రూప్ల లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ, డీపీఓలుగా నియామకానికి ఈ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, ఆధార్కార్డు జిరాక్స్లు, ఒక పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆండ్రాయిడ్ మొబైల్తో హాజరు కావాలని సూ చించారు. వివరాలకు 83414 05102 నంబర్ లో సంప్రదించడంతో పాటుhttp:://bit. ly HCLTB& Telangana లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఐఈఓ తెలిపారు. గెలిచిన వారిపై ఓడిపోయిన వారి దాడిఖమ్మంక్రైం: ఖమ్మంలోని ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగగా.. ఓడిన వారు ఆగ్రహంతో గెలిచిన వర్గీయులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అంబులెన్స్ డ్రైవర్కు తీవ్రగాయాలు కాగా చికిత్స పొందుతున్నాడు. పలు ప్రైవే ట్ ఆస్పత్రులకు సంబంధించిన అంబులెన్స్ డ్రైవర్ల యూనియన్ ఎన్ని కలు ఇటీవల జరిగాయి. ఇప్పటికే ఉన్న కార్యవర్గ బాధ్యులు ఓడిపోగా, కొత్తవారు గెలిచారు. లావాదేవీలపై చర్చించేందుకు నూతన కార్యవర్గం బాధ్యులు మంగళవారం ఖమ్మం నెహ్రూనగర్లో పాత యూనియన్ బాధ్యుల వద్దకు వెళ్లగా ఆగ్రహంతో ఉన్న వారు లెక్కలు వివరించే క్రమాన గొడవకు దిగారు. ఆపై అంబులెన్స్ డ్రైవర్ వినయ్ ఆధ్వర్యాన ఏలూరి శ్రీకాంత్, మైదులు, మహేశ్ తదితరులపై దాడి చేయగా శ్రీకాంత్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించడంతో న్యాయమూర్తి శ్రీకాంత్ వాంగ్మూలం తీసుకున్నారు. కాగా, దాడికి పాల్పడిన వినయ్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టు టౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుపై మహిళలకు అవగాహనఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలతో పరిశ్రమలు ఏర్పాటు చేయించేలా అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జెడ్పీ కార్యాలయంలో డీఆర్డీఏ, సెర్ప్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో అడిషనల్ డీఆర్డీఓ ఆర్.జయశ్రీ మాట్లాడారు. మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సదస్సుల్లో ఔత్సాహికుల ను ఎంపిక చేసి పరిశ్రమల ఏర్పాటు, నిర్వహ ణ, మెళకువలు, నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల శిక్షణ ఇస్తామని, అంతేకాక లైసెన్స్, రుణాల మంజూరులో అండగా నిలుస్తామని తెలిపారు. సమావేశంలో డీపీఎం దుర్గయ్య, జిల్లా సమాఖ్య కార్యదర్శి కేవీ విజయలక్ష్మి, కోశాధికారి వి. మరియమ్మ, సభ్యులు అలీఫ్ పాల్గొన్నారు. రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి బోనకల్: బోనకల్ రైల్వేస్టేషన్ సమీపాన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడడంతో మృతి చెందాడు. ఒడిశాకు చెందిన బిశ్వనాథ్ మహంతి (38) విజయవాడ వైపు వెళ్తున్న రైలులో బుధవారం ప్రయాణిస్తున్నాడు. ఆయన ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. -
దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు
వైరా: వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన ఉమ్మడి జిల్లాలోని ఆరుగురికి వైరా ఎస్ఐ పుష్పాల రామారావు చొరవతో కృత్రిమ కాళ్లు సమకూరాయి. ఏపీలోని మంగళగిరి, హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యాన ఆరుగురికి మంగళగిరిలోని రోటరీక్లబ్ కార్యాలయంలో కృతిమ కాళ్లు అమర్చారు. తక్కువ బరువు కలిగిన వీటితో దివ్యాంగులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు సోమవారం వైరా ఎస్ఐ రామారావు, రోటరీ క్లబ్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జనరల్ ఆస్పత్రి కిటకిటఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సోమవారం కిటకిటలాడింది. ఉదయం 8గంటల నుంచే పరీక్షలు, చికిత్స కోసం వచ్చిన పలువురు ఓపీ చీటీల కోసం బారులు దీరారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఓపీ చీటీల కోసం గంటల తరబడి వేచి ఉండడం, ఆపై వైద్యుల వద్ద పరీక్ష చేయించుకోవడానికి సమయం పట్టడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇక నిర్దేశిత పరీక్షలు చేయించుకుని నివేదికలతో వచ్చే సరికి ఓపీలో వైద్యులు ఉండకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మరో వైద్యుడి వద్దకు వెళ్లి మందులు రాయించుకోవాల్సి వచ్చిందని వాపోయారు. రైతుల ప్రయోజనాల కోసం చట్టం ఉండాలిఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విత్తన చట్టం అన్నదాతల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఏఐయూకేఎస్(అఖిల భారత ఐక్య రైతు సంఘం) రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు, నాయకుడు గుర్రం అచ్చయ్య అన్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించకుండా ప్రైవేట్ విత్తన కంపెనీలు, డీలర్లతో సమావేశమై చట్టాన్ని తీసుకొస్తే రైతులకు ప్రయోజనం ఉండదన్నారరు. ఈమేరకు రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, రైతుల నుంచి సూచనలు స్వీకరించాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు కోలేటి నాగేశ్వరరావు, కమ్మకోమటి నాగేశ్వరరావు, బీరెల్లి లాజర్, గుగులోతు తేజ, పాశం అప్పారావు, ఒగ్గు నాగిరెడ్డి, కుర్ర వెంకన్న, కేలోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకీ అసంతృప్తి?
2022లో ప్రారంభం ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల 2022 మార్చిలో ఏర్పాటైంది. నూతన భవనాల నిర్మాణం కోసం రూ. 166 కోట్లతో పాటు 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణతో కలిపి 21.31 ఎకరాలు, పాత కలెక్టరేట్ ఆవరణ 5.23 ఎకరాలు, ఆర్అండ్బీ కార్యాలయం 3.09 ఎకరాలను అప్పట్లో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి అనుసంధానంగా పాత కలెక్టరేట్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా భవనాల ఆధునికీకరణ, మరమ్మతులకు తొలుత ప్రభుత్వం రూ.8.05 కోట్లు మంజూరు చేసింది. దీంతో చకచకా పనులు చేపట్టిన కళాశాలను అందుబాటులోకి తీసుకురాగా 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది. దీంతో 2023 ఆగస్టులో తొలిఏడాది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించారు. అలాగే గత ఏడాది కూడా భర్తీ చేయగా ప్రస్తుతం మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు కలిపి 200 మంది చదువుతున్నారు. ఇప్పుడు మూడో ఏడాదికి అనుమతి జారీ చేయాల్సి ఉండగా, ఎన్ఎంసీ బృందం తనిఖీలు చేపట్టింది. ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2025–26 ఏడాదికి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు కోసం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఇటీవల తనిఖీ చేయగా.. 26 ప్రభుత్వ కళాశాలల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ జాబితాలో ఖమ్మం కాలేజీ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రతీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ముందు నేషనల్ మెడికల్ బృందం తనిఖీ చేయడం ఆనవా యితీ. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు, అధ్యాపకులు, ఆధార్తో బయోమెట్రిక్ హాజరు నమోదు, అనుబంధ ఆస్పత్రిలో చికిత్స, వైద్య పరికరాలను పరిశీలించి సంతృప్తి చెందితే అనుమతులు జారీ చేస్తారు. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవంత్సరానికి గాను ఎన్ఎంసీ బృందం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తనిఖీ చేపట్టగా, ఇక్కడి సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నా... ఖమ్మంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కళాశాల రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు సాధించింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఏ జిల్లాలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి విశాలమైన భవనాలు, సమీపాన జిల్లా జనరల్ ఆస్పత్రి ఎక్కడా లేవు. ఖమ్మం నడిబొడ్డున సుమారు 30 ఎకరాల్లో కళాశాల ఏర్పాటుచేయడం విశేషంగా చెబుతారు. అలాగే, అనుబంధంగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి సైతం రాష్ట్ర స్ధాయిలో గుర్తింపు ఉంది. సుమారు 500 పడకలు ఉండగా, నిత్యం 1,500 మంది నుండి 2వేల మంది చికిత్స కోసం వస్తుంటారు. అలాగే, ఆస్పత్రి ఆవరణలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు అత్యధికంగా జరుగుతున్నాయి. కళాశాలకు అనుసంధానంగా ఇంత పెద్ద ఆస్పత్రి ఉండడంతో విద్యార్థులకు బోధన సాఫీగా సాగుతుండగా.. మెడికల్ కాలేజీలోనూ అధ్యాపకులు సరిపడా ఉన్నారు. అలాగే, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు, సీసీ కెమెరాలు, చికిత్సపై అవగాహన పెంచుకునేలా ఆస్పత్రిలో రోగులు, అవసరానికి మించి మృతదేహాలు ఉన్నాయి. అంతేకాక తొలి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, గత ఏడాది ఈ కళాశాలలో చేరేందుకు మెరిట్ ర్యాంకర్లు ఆసక్తి కనబరిచారు. అయినప్పటికీ ఎన్ఎంసీ బృందం ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేసిందో తెలియడం లేదని అధ్యాపకులు చెబుతున్నారు. అయితే, తుదిదశలో మరో మారు తనిఖీ చేయనున్నందున బృందం చేసిన సూచనల మేరకు సరిచేస్తే అనుమతులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. అనుమతి తప్పక వస్తుంది.. మూడో ఏడాది ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ నుంనుండి తప్పక అనుమతి వస్తుందనే నమ్మకముంది. రాష్ట్ర స్థాయిలోనే ఖమ్మం కళాశాలకు మంచి గుర్తింపు ఉంది. నిబంధనల మేరకు విశాలమైన భవనం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో పాటు బాలుర, బాలికలకు హాస్టళ్లు, ఇతర వసతులు కల్పించాం. అయితే, అప్డేట్ అయిన వాటిని ఎన్ఎంసీ బృందం పరిశీలించనందున హైదరాబాద్ వెళ్లి డీఎంఈకి వివరించా. అందుకే అనుమతులపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. – సుంకర రాజేశ్వరరావు, కాలేజీ ప్రిన్సిపాల్ఖమ్మం మెడికల్ కాలేజీలో ఎన్ఎంసీ బృందం తనిఖీ సౌకర్యాలు, వసతులపై పెదవి విరుపు తుది తనిఖీకి వచ్చేలోగా సరిచేయాలని సూచనలు కాలేజీలో మూడో ఏడాది అనుమతులపై సందిగ్ధత -
హృద్రోగంతో పోరాడుతున్నా... ఆదుకోండి
ఖమ్మంమయూరిసెంటర్: పూట గడవడమే కష్టంగా ఉన్న ఓ నిరుపేదను గుండె జబ్బు మరింత బాధిస్తోంది. కనీసం చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో దాతల చేయూత కోసం అర్థిస్తున్నాడు. ఖమ్మంకు చెందిన వివెంకటగోపీ కిషన్రావుకు 65ఏళ్లు. రోజు కూలీగా జీవిస్తుండగా, ఆయన భార్య టైలరింగ్ చేస్తుంది. కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న కిషన్రావు ఇప్పుడు పనులకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. తెలిసిన వారి సాయంతో ఆస్పత్రికి వెళ్తే స్టంట్లు వేయాలని తెలిపారు. ఇందుకోసం తగిన స్థోమత లేకపోవడంతో ఆయన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురవుతోంది. ఈమేరక దాతలు 63040 09513 నంబర్కు సాయం పంపించి ఆదుకోవాలని కిషన్రావు కోరుతున్నాడు. ఓ పేద వృద్ధుడి అభ్యర్థన -
జాడ లేని వరుణుడు
మధిర: ఈ ఏడాది మే నెల రెండో వారం నుంచే అడపాదడపా వర్షాలు కురవడంతో సాగుకు అనుకూలిస్తుందని రైతులు ఆనందపడ్డారు. వాతావరణ శాఖ అధికారులు సైతం ఈ వానాకాలంలో వర్షాలు ముందస్తుగానే వచ్చే అవకాశముందని ప్రకటించారు. దీంతో రైతులు ముందుగానే దుక్కులు దున్ని పంటల సాగుకు సిద్ధమయ్యారు. పలుచోట్ల మే మూడో వారం నుంచే పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు నాటారు. ఒకటి, రెండు మంచి వర్షాలు పడగానే మొలకలు వస్తాయని భావించారు. కానీ ఈనెల రెండు వారాలు దాటినా వర్షం జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకటి, రెండు రోజుల్లో వర్షం కురవకపోతే పత్తి విత్తనాలు భూమి లోనే పాడవుతాయని.. మళ్లీ నాటాల్సి వస్తుందన్న ఆలోచన వారి ఆవేదనకు కారణమవుతోంది. 2.20లక్షల ఎకరాలకు పైగానే.. జిల్లాలో గత ఏడాది వానాకాలం సీజన్లో 2.08 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అలాగే, మిర్చి కూడా సాగు చేయగా తెగుళ్లతో దిగుబడి రాక, సరైన ధర లభించక ఈసారి రైతులు మిర్చి వైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో ఈసారి పత్తి సాగు విస్తీర్ణం గతంతో పోలిస్తే మరో 20వేల ఎకరాలు పెరుగుతుందని భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 16,534 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినట్లు తెలుస్తోంది. అయితే, వర్షాభావ పరిస్థితులతో ఈ గింజలు మొలకెత్తుతాయా, లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతనెల 20నుంచే... జిల్లాలోని బోనకల్, రఘునాథపాలెం, మధిర, కొణిజర్ల, తల్లాడ తదితర మండలాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటారు. వర్షాలు ముందుగా వస్తాయన్న ఆశతో గత నెల 20వ తేదీ నుంచి విత్తనాలు నాటడం మొలుపెట్టారు. మరికొందరు ఈనెల మొదట్లో నాటారు. ఆతర్వాత వర్షాలు లేకపోగా, నాలుగు రోజుల క్రితం చిరుజల్లులు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ మళ్లీ వర్షం జాడ లేకపోవడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఆది, సోమవారాల్లో సాయంత్రం జిల్లాలోని పలుచోట్ల ఆకాశం మేఘావృతమైనా వర్షం మాత్రం కురవలేదు. రానున్న రెండు, మూడు రోజుల్లో మంచి వర్షం పడితేనే పత్తి విత్తనాలు మొలకెత్తే అవకాశముంది. లేకపోతే అవి భూమిలోనే పాడవుతాయని భావిస్తున్నారు. ఈ కారణంగా పలువురు రైతులు ఆశలు వదిలేసుకుని మళ్లీ నాటేందుకు పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం తప్పదనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎకరాకు రూ.9వేలకు పైగా పెట్టుబడి ఎకరం భూమిలో పత్తి సాగుకు ఇప్పటికే రైతులు రూ.9వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఫ్లవ్ దుక్కికి రూ.2వేలు, గొర్రు తోలకానికి రూ.1,600, రోటోవేటర్కు రూ.2వేలు, అచ్చు తోలకానికి రూ.1,500తో పాటు విత్తనాలకు రూ.1,700, కూలీలకు రూ.800 చొప్పున వెచ్చించారు. ఒకవేళరెండు, మూడు రోజుల్లో మంచి వర్షం కురిసి విత్తనాల మొలకెత్తకపోతే మళ్లీ కొనుగోలు, నాటించడం ఆర్థికంగా భారమవుతుందని చెబుతున్నారు. పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు ఆపై సరైన వర్షాలు లేక మొలకెత్తని వైనం మళ్లీ నాటాలంటే భారం తప్పదని ఆవేదన -
అర్చక, ఉద్యోగులకు
● కేటగిరీల వారీగా ఆర్థిక ప్రయోజనాలు ● సేవల ఆధారంగా లబ్ధి చేకూర్చేలా నిర్ణయం ● జాబితాలో ధూప, దీప పథకం అర్చకులు కూడా..ఖమ్మంగాంధీచౌక్: ఆలయాల్లో పనిచేసే అర్చక, ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శాశ్వత అర్చక, ఉద్యోగులతో పాటు ధూప దీప నివేదన(డీడీఎన్) పథకం అమలవుతున్న ఆలయాల అర్చకులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టింది. ఈమేరకు సంక్షేమ నిధి ద్వారా అర్చక, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు, సామాజిక భద్రత కల్పించే లక్ష్యంగా విధివిధానాలను ప్రకటించింది. అంతేకాక పదవీ విరమణ పొందిన తర్వాత అందే ప్రయోజనాలను సైతం పెంచడం విశేషం. అయితే, ఈ ప్రయోజనాలు అర్చక, ఉద్యోగుల సేవా కాలం ఆధారంగా అందుతాయి. ప్రభుత్వ నిర్ణయంతో మెడికల్ రీయింబర్స్మెంట్, వివాహపథకం, ఉపనయనం, ఇంటి నిర్మాణం, మరమ్మతులు, విద్య తదితర అంశాల్లో లబ్ధి జరగనుంది. సంక్షేమ ట్రస్టు ద్వారా ప్రయోజనాలు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆలయ అర్చక, ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు ద్వారా పది రకాల పథకాలు అమలుకానున్నాయి. ●అర్చక, ఉద్యోగులకు రిటైర్మెంట్ గ్రాట్యూటీ(మరణానంతరం) 20ఏళ్లకు పైగా సేవలందించి వారైతే రూ.8 లక్షలు, 15–20 ఏళ్ల సర్వీస్ కలిగిన వారికి రూ.6 లక్షలు, 10–15 ఏళ్ల సర్వీస్ ఉంటే రూ.4 లక్షలు, పదేళ్ల కనీస సర్వీస్ పూర్తికాక ముందే మృతి చెందితే రూ.2 లక్షలు చెల్లిస్తారు. అలాగే, ధూప, దీప నివేదన పథకం అర్చకులకు మరణానంతరం గ్రాట్యూటీ రూపంలో సర్వీస్ ఆధారంగా రూ.4లక్షలు, రూ.3లక్షలు, రూ.2లక్షలు, రూ.లక్ష అందుతాయి. ●మెడికల్ రీయింబర్స్మెంటు గ్రాంట్ కింద మెడికల్ బోర్డు సిఫారసుతో గరిష్టంగా రూ.2 లక్షలు అందించనున్నారు. ●వివాహ పథకం కింద రెగ్యులర్ ఉద్యోగులు, కన్సాలిడేటెడ్, ధూప, దీప నివేదన అర్చకులకు రూ.1,01,116 అందిస్తారు. రెగ్యులర్ ఉద్యోగులకై తే రుణంగా రూ. 2 లక్షలు, మహిళా ఉద్యోగితో పాటు ఆమె కుమార్తె, సోదరి వివాహానికి రూ. 1,25,000 అందిస్తారు. ●ఉపనయనం గ్రాంట్ కింద రూ. 50 వేలు అందించనున్నారు. ●మరణానంతరం ఎక్స్గ్రేషియాగా రూ.50 వేలు, అంతిమ సంస్కారాల ఖర్చులకు రూ.30 వేలు అందిస్తారు. ●ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు, రెగ్యులర్ ఉద్యోగులకై తే రూ.4 లక్షల మేర బ్యాంకు రుణంపై వడ్డీ మొత్తం ఐదేళ్ల వరకు చెల్లిస్తారు. ●విద్య పథకం ద్వారా గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఏటా రూ.35 వేలు రీయింబర్స్మెంట్ చేస్తారు. ●విధులు నిర్వర్తించలేదని దివ్యాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సాయంగా కనీసం 5 – 10 ఏళ్ల సర్వీస్ పూర్తయితే రూ.లక్ష, పదేళ్లకు పైగాసర్వీస్ ఉంటే రూ. 2లక్షలు అందిస్తారు. ఖమ్మంలోని భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వరస్వామి దేవాలయంఉమ్మడి జిల్లాలో 702 మంది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ ట్రస్టు ద్వారా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల అర్చక, ఉద్యోగులు, ధూప, దీప నివేదన అర్చకులు కలిపి 702 మందికి ప్రయోజనం కలగనుంది. రెండు జిల్లాల్లోని 93 ఆలయాల్లో 100 అర్చకులు, పాచికలు, సహాయ అర్చకులు, పరిచారకులు పనిచేస్తుండగా, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగులు కలిపి 140 మంది ఉన్నారు. అలాగే, దూప, ధీప నివేదన పథకం ఆలయాల్లో 462 మంది అర్చకులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం ప్రభుత్వం అర్చకులు, ఉద్యోగుల ప్రయోజనాలకు సంక్షేమ నిధిలో ప్రాధాన్యత ఇచ్చింది. డీడీఎన్ అర్చకులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించడం సంతోషంగా ఉంది. అయితే, ఈ అర్చకులకు నెలనెలా వేతనాలు అందేలా చూడాలి. అంతేకాక మరిన్ని ఆలయాలకు పథకం అమలుచేస్తే అభివృద్ధితో పాటు మరికొందరు అర్చకులకు ఉపాధి లభిస్తుంది. – మునగలేటి రమేష్శర్మ, జిల్లా అధ్యక్షుడు, డీడీఎన్ అర్చకుల సంఘం -
మూడున్నర ఏళ్లలో 20 లక్షల ఇళ్లు
నేలకొండపల్లి: వచ్చే మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మండలంలోని గువ్వలగూడెం, కోరట్లగూడెం, మోటాపురంలో సోమవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం 3,500 ఇళ్లు మంజూరు చేయగా దశల వారీగా అర్హులందరికీ కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటికే ఉచిత విద్యుత్, గ్యాస్, బస్సు ప్రయాణం అమలవుతుండగా, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేస్తే... తమ ప్రభుత్వం పది నెలల్లోనే రూ.21 వేల కోట్లు మాఫీ చేసిందని వెల్లడించారు. అంతేకాక సన్న ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తూ రైతులకు అండగా నిలిచామని మంత్రి తెలిపారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీఓ నర్సింహారావు, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు నాయకులు శాఖమూరి రమేష్, భద్రయ్య, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, రావెళ్ల కృష్ణారావు, కడియాల నరేష్, కొమ్మినేని విజయ్బాబు, కె.హన్మంతరావు, మార్తి కోటి, మధు, వెంకటేశ్వర్లు, వాసు తదితరులు పాల్గొన్నారు. దశల వారీగా అర్హులందరికీ మంజూరు రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డి -
ఖమ్మం రైతులు హుషారు!
ఆదర్శ రైతు రామకృష్ణతో సీఎం రేవంత్రెడ్డినేలకొండపల్లి: ఖమ్మం జిల్లా రైతులు హుషారుగా ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సోమవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వీసీ ద్వారా రైతువేదికల్లో హాజరైన రైతులు, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈమేరకు నేలకొండపల్లి రైతు వేదికలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జిల్లా వ్యవసాయ శాఖాధికారితో పాటు చెన్నారం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మంకెన రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు రైతు నేస్తం 57 వీసీలకు క్రమం తప్పకుండా హాజరైన రామకృష్ణ తనకు శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు ఉపయోగపడ్డాయని తెలిపారు. దీంతో సీఎం ఆయనను అభినందిస్తూ ‘కేబినెట్లోని కీలక పదవులన్నీ మీ జిల్లాకే ఉన్నాయి.. మీకేంటి అంతా హుషారుగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. రైతులు పంటలు మరింత బాగా పండించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రభుత్వ సాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటూ లాభదాయకమైన పంటలు పండించాలని సూచించారు. ఏడీఏ బి.సరిత, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, రైతులు, నాయకులు ఆరెకట్ల గురవయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, కడియాల నరేష్, కొమ్మినేని విజయ్బాబు, సూరేపల్లి రవి, గుండా బ్రహ్మం, చిలకబత్తిని వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉద్యోగుల కోసం నిర్వహించే హెల్త్ క్యాంప్ను, ఆతర్వాత విద్యుత్ ఆంబులెన్స్ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు బోనకల్ మండలం జానకీపురం సబ్ స్టేషన్లో అభివృద్ధి పనులను ప్రారంభించాక మధిర బయలుదేరతారు. అక్కడ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రూ.10 కోట్లతో పాత బస్టాండ్ స్థానంలో నిర్మించే నూతన ఆర్టీసీ బస్టాండ్కు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 9,600మంది పరీక్ష రాయగా 7,248మంది (75.50శాతం) ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. అలాగే, ఒకేషనల్ విభాగంలో 676మందికి 444మంది(65.68 శాతం) ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 3,745మందికి 2,293మంది(61.23శాతం), ఒకేషనల్ విభా గంలో 622మందికి 337మంది (54.18శాతం) ఉత్తీర్ణత సాధించారని తెలి పారు. కాగా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానం, ద్వితీయ సంవత్సరంలో 11వ స్థానం దక్కించుకుందని డీఐఈఓ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోండి ఇంటర్మీడియట్ ఫలితాలపై సందేహాలు ఉంటే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. tsbie.cgg.gov.in వెబ్సైట్లోని స్టూడెంట్ సర్వీసెస్ విభాగం ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్ ఒక్కో సబ్జెక్టుకు రూ.600, రీకౌంటింగ్కైతే రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని డీఐఈఓ తెలిపారు. 2.88లక్షల మంది రైతుల ఖాతాల్లో ‘పెట్టుబడి’ ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల పెట్టుబడి సాయం(రైతు భరోసా) పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కడే ఈ పథకం ద్వారా నగదు జమ చేయడాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొనగా.. జిల్లాలోని రైతు వేదికల నుంచి అధికారులు, రైతులు హాజరయ్యారు. ‘రైతు భరోసా’ ద్వారా జిల్లాలో 3,53,794 మంది రైతులను అర్హులను గుర్తించగా, ఎకరాకు రూ.6వేల చొప్పున రూ. 436.84 కోట్ల సాయం వారి ఖాతాల్లో జమ కానుంది. ఈమేరకు తొలిరోజైన సోమవారం రెండు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం జమ చేశారు. జిల్లాలో 2,88,387మంది రైతుల ఖాతాల్లో రూ.250,84,22,381 నగదు జమ కాగా, వారి పోన్లకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరిట ప్రభుత్వం నుంచి మెసేజ్ అందింది. జిల్లా రైతుల ఖాతాల్లో దశల వారీగా ఈనెల 24వ తేదీ వరకు నగదు జమ అయ్యే అవకాశముంది. పరిశుభ్రతతోనే డయేరియా నిర్మూలన రఘునాథపాలెం: ఇళ్లలోనే కాక పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, తద్వారా డయేరియా సహా ఎలాంటి వ్యాధులు దరిచేరవని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి తెలిపారు. డయేరియా నిర్మూలన ప్రచారంలో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డయేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల వినియోగంపై బాలింతలు, గర్భిణులతో పాటు స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చందునాయక్, వైద్యులు బాలకృష్ణ, మౌనిక మాట్లాడగా ఉద్యోగులు పుష్పవతి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పాలనలోనే దేశాభివృద్ధి
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్లో సోమవారం నిర్వహించిన వికసిత్ భారత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతుండగా, దేశం అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. అలాగే, పాకిస్తాన్పై దాడి ద్వారా దేశ సైన్యం ఘనతను ప్రపంచానికి చాటారని చెప్పారు. అనంతరం వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి ఆయన బీజేపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు గుత్త వెంకటేశ్వర్లు, పిట్టల వెంకట నరసయ్య, రుద్ర ప్రదీప్, కొణతం లక్ష్మీనారాయణ, నల్లగట్టు ప్రవీణ్, పమ్మి అనిత, ఈదుల భద్రం, నెల్లూరు బెనరీ, రేఖా సత్యనారాయణ యాదవ్, వీరవెల్లి రాజేష్, రాఘవగౌడ్, గోనెల శివ, మణి, రజినీరెడ్డి, శంకర్గౌడ్, డోన్వాన్ దాసు పాల్గొన్నారు. -
●‘శ్రీ చైతన్య’ సత్తా
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బెటర్మెంట్ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందించాక ఆయన మాట్లాడుతూ ఎంపీసీలో 13మంది 470కి 468 మార్కులు, బైపీసీలో 440కి 439 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీలో బి.జీవన, ఏ.భవిత, పి.నందిని, వై.భరత్ తేజ, డి.యశ్వంత్, బి.ధరణి, కె.జ్యోతి, ఎం.నాగహాసిని, పి.మోక్షిత, ఎస్.నాగజ్యోతి, జి.భావన, బి.వర్షిత, జీర మేహక్ 468, బైపీసీలో కె.గాయత్రి 439, బి.అప్రూవ, జి.జోహాన్ విశిష్ఠ, కె.జ్యోత్స్న 438మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్తో పాటు అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం సీహెచ్.చేతన్ మాథూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ.వర్మ, డీన్ కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ అభినందించారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
● సామాజిక మాధ్యమాల్లోనూ స్వీకరించాలి ● గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మం సహకారనగర్: ప్రజావాణికి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అంతేకాక ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తూ పరిష్కారంపై దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణి (గీవెన్స్ డే)లో భాగంగా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సోమవారం ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, అది సాధ్యం కాకపోతే కారణాలను దరఖాస్తుదారులకు చెప్పాలని సూచించారు. అలాగే, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారాన్ని ఆన్లైన్ ద్వారా పరిశీలిస్తూ మండల అధికారులకు సూచనలు చేయాలని చెప్పారు. డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● వేంసూర్ మండలం బీరపల్లి వాసులు ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని నిలిపివేయించాలని కోరారు. ● ఖమ్మం శ్రీరామ్ హిల్స్కు చెందిన వనమా ఉషారాణి ధంసలాపురం సర్వే నంబర్ 194లో రెండెకరాల వ్యవసాయ భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. తన భూమిపై ఇతరులకు జారీ చేసి పట్టా పాస్ పుస్తకాన్ని రద్దు చేయాలని కోరారు. ● ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన సునీత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని విన్నవించారు. ● తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ కే.వీ.కృష్ణారావు కోరారు. తొలి, మలి దశ ఉద్యమకారులతో కలిసి కలెక్టర్ వినతిపత్రం అందించారు. వారంలోగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ఖమ్మంగాంధీచౌక్: పేదల సొంతింటి ఆకాంక్ష నెరవేర్చేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఇళ్ల సంఖ్యకు అనుగుణంగా ఇందిరమ్మ కమిటీల నుంచి జాబి తాలు తీసుకున్నాక మరోమారు పరిశీలించి పారదర్శకంగా వారంలోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. అలాగే, పంపిణీ చేయకుండా మిగిలిన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయడంతో పాటు మిగిలిపోయిన నిర్మాణాలపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, డీఎల్పీఓ రాంబాబు, ఆర్డీఓలు జి.నరసింహరావు, ఎల్.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సారొస్తేనే ఇస్తాం.. ఇటీవలే కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ తొలిసారి సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి హాజరయ్యారు. అయితే, కలెక్టర్ ఉదయమే మంత్రి పొంగులేటి పర్యటనకు వెళ్లగా, అప్పటికే అదనపు కలెక్టర్లు గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభించారు. కానీ చాలా మంది కలెక్టరేట్ ఆవరణలోనే వేచి ఉండి, కలెక్టర్ అనుదీప్ వచ్చాకే దరఖాస్తులు ఇవ్వడం కనిపించింది. -
ప్రైవేట్ విద్యాసంస్థల గోదాం సీజ్
ఖమ్మం మామిళ్లగూడెం: ఫీజులు, పుస్తకాల పేరిట ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో తల్లిదండ్రుల నుంచి విచ్చవిడిగా వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఇటికాల రామకృష్ణ విమర్శించారు. ఈమేరకు నాయకులు సోమవారం ఖమ్మంలోని నారాయణ విద్యాసంస్థల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దీంతో అర్బన్ ఎంఈఓ శైలజ తనిఖీలు చేపట్టి పాఠశాల గోదాంను సీజ్ చేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ వివిధ పేర్లతో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు షేక్ నాగుల్మీరా, మధు, మనోజ్, గోపి, పవన్, వినయ్, లక్ష్మణ్, గౌతమ్, సురేష్, నాగరాజు, ఉమ, చరణ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి ముదిగొండ: ముదిగొండ మండలం వనంవారికిష్టాపురం సమీపాన సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడకు చెందిన పి.పున్నయ్య(70) ఆటోలో ఖమ్మం నుంచి జగ్గయ్యపేట వెళ్తున్నాడు. మార్గమధ్యలో వనంవారి కిష్టాపురం సమీపాన ఆటోను బైక్ ఢీకొనగా పున్నయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
●బెటర్మెంట్ ఫలితాల్లో ‘న్యూవిజన్’ ప్రభంజనం
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ బెటర్మెంట్ పరీక్ష(అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ) ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కులు సాధించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సోమవారం అభినందించాక ఆయన మాట్లాడారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు యు.శృతి, ఎస్.గ్రీష్మిత, వి.లక్ష్మీ స్నేహిత, పి.అవినాష్, కె.నేహశ్రీ 468 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే, కె.సాయిసాత్విక్, ఎం.శ్రీరోషిణి, కె.శేషుకుమార్, ఎం.ప్రహర్షిణి, ఎం.కిద్విత, పి.సాత్విక, ఎం.నాగవెంకటసాయి చరణ్, కె.రోహిత, డి.తన్వి, ఎస్.గౌరినందన్రెడ్డి, ఎస్.సిరిసంజన, డి.శ్రీజయదీప్ కుమార్, సీ.హెచ్.ఆదిత్య శ్రీవాత్సవ, కె.రూపిక, జి.రిషిక్ తేజ, బి.శ్రీకరణ్, ఎం.డీ.అస్లాంహంజా, టి.మన్వితతేజు, ఆర్.సిరిచందన, ఎం.గీతిక శ్రీ 467మార్కులు సాధించారన్నారు. బైపీసీలో 440 మార్కులకు ఏ.విద్యాశ్రీ, కె.ఆరోణ్ నిహాల్రాయ్, జి.స్పందన, అమతున్నూర్నధియా, బి.అర్షిత, బి.నాగలోకేష్, ఎం.డీ.ఇనాన్ 436మార్కులు, ఎం.రోషిణి, టి.గోమతి 435, కె.గుణశేషు, బి.శశాంక్ 434, కె.యశస్విని, మాహీరమెహ్రోజ్ 433, బి.శరణ్య, కె.హాసిని, టి.సాత్విక 432, ఎం.లక్ష్మీహర్షిత, బి.హిమ, ఏ.సాత్విక, జి.ప్రణీత్, జి.శ్రీవెంకటనాగకోమలి, పి.నిఖిత 431 సాధించారని మార్కులు సాధించారని తెలిపారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్లు సీ.హెచ్.గోపీచంద్, సీ.హెచ్.కార్తీక్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆదర్శం.. ఈ ఉపాధ్యాయులు
సత్తుపల్లిటౌన్/కల్లూరురూరల్/వేంసూరు: ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తూ ఇతరుల పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని ప్రచారం చేస్తున్నారనే విమర్శలు తరచుగా వస్తుంటాయి. ఈనేపథ్యాన కొందరు ఉపాధ్యాయులు మాత్రం తమ పిల్లలను సైతం ప్రభుత్వ బడుల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. సత్తుపల్లి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు మారుతి అరుణకుమారి – జిట్టయ్య దంపతులు తమ పిల్లలను పాతసెంటర్ హైస్కూల్లో చేర్పించారు. వీరి పెద్దకుమారుడు ఇదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా, ఇప్పుడు చిన్నకొడుకు యువరామ్ తేజను ఆరో తరగతిలో చేర్పించారు. అలాగే, ఎన్టీఆర్నగర్ పాఠశాల ఉపాధ్యాయుడు కంభంపాటి వెంకటేష్ తన కుమారుడు విహాన్ను మూడో తరగతిలో చేర్పించారు. ఇక కల్లూరు మండలం పాత ఎర్రబోయినపల్లికి చెందిన మునగ దివ్య అన్నపురెడ్డిపల్లిలోని రాజాపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె భర్త బుద్ధారపు నాగేశ్వరరావు బ్యాంకు ఉద్యోగి కాగా వారి కుమారుడు మోక్షిత్ను పాత ఎర్రబోయినపల్లిలో అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంచి అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చేర్పించారు. మోఖిత్కు హెచ్ఎం వేదగిరి అశోక్ రెండో తరగతిలో ప్రవేశం కల్పించారు. అలాగే, వేంసూరు ప్రగతినగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లెల్లి నాగ శ్రీనివాసరావు కుమారుడు హేమ శ్రీకార్ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో చదువుతుండగా సోమవారం వేంసూరు జెడ్పీహెచ్ఎస్లో చేర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సీహెచ్.వెంకటేశ్వరరావు, హెచ్ఎం బీ.కే.నరసింహరావు తదితరులు అభినందించారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించిన పలువురు -
పని ఆగదు.. రోడ్డు పాడు కాదు
ఖమ్మం పదో డివిజన్లో అండర్ డ్రెయినేజీ నిర్మిస్తుండగా బైపాస్లోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పనులు చేపట్టాల్సి ఉంది. అయితే, పైప్లైన్ వేయడానికి రోడ్డు తవ్వాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని గుర్తించారు. అంతేకాక రోడ్డు కూడా పాడయ్యే అవకాశముండడంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోడ్డు అడుగున తవ్వకం చేపట్టి 16 పైపులు అమర్చే పనులు చేపట్టారు. ఆ తర్వాత సాగర్ కాల్వ అడుగు భాగాన సైతం ఇదే తరహాలో పైప్లైన్ వేయనున్నట్లు బాధ్యులు తెలిపారు. – ఖమ్మం అర్బన్ -
స్థానిక సందడి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కొన్ని నెలలుగా ఎలాంటి హడావిడి లేకున్నా.. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లతో పాటు మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయనే సంకేతాలతో ఆశావహులు రంగంలోకి దిగారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కూసుమంచిలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలపై ప్రకటన చేశారు. సోమవారం జరిగే కేబినెట్ భేటీలో తేదీలపై స్పష్టత వస్తుందని కూడా చెప్పారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేడర్కు పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక స్థానికంగా టికెట్లు ఆశిస్తున్న నేతలు కార్యకర్తలను సమన్వయం చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసి కలిసికట్టుగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని అధికార పార్టీ తమ నాయకులకు సూచిస్తోంది. ఏడాదిగా ప్రత్యేక పాలన.. జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలు ఉండగా.. 2019లో 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 2న పంచాయతీ పాలకవర్గాలు పగ్గాలు చేపట్టాయి. వాటి గడువు 2024 ఫిబ్రవరి ఒకటిన ముగిసింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. పల్లెల్లో దాదాపు 16 నెలలుగా ఇన్చార్జ్లే దిక్కయ్యారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాలు లేక ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఇన్చార్జ్లుగా నియమితులైన అధికారులు ఇతర పనులతో సతమతం అవుతుండడంతో స్థానిక పాలనపై దృష్టి సారించలేకపోతున్నారు. సమస్యలతో వాయిదాలు.. స్థానిక సంస్థల ఎన్నికలకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయించాయి. ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్స్లు సిద్ధం చేశాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులను ఈసీ ఆదేశించింది. అయితే కులగణన తదితర సమస్యలతో వాయిదా పడుతూ వచ్చింది. జిల్లాలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు 3,148 బ్యాలెట్ బాక్స్లను అందుబాటులో ఉంచారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తిచేశారు. అయితే ఆ తర్వాత ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మరోసారి సమాయత్తం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మరోసారి కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని మూడు రోజుల క్రితం మంత్రి సీతక్క, ఆదివారం మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు కార్యరంగంలోకి దూకారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో ఇంటింటినీ సందర్శిస్తున్నారు. ఈసారి ఎలాగైనా స్థానికంగా తమ పట్టు నిరూపించుకోవాలనే లక్ష్యంతో కొందరు నేతలు పనిచేస్తున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన ముగ్గు రు మంత్రులు కూడా కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్నారు. మంత్రి పొంగులేటి ప్రకటనతో కేడర్లో కదలిక ఇటీవలే తుమ్మల కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం గ్రామాల్లో మొదలైన ఆశావహుల హడావిడి ఏకగ్రీవాలపై అధికార పార్టీ ఫోకస్ఏకగ్రీవాలపై దృష్టి.. జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలు ఉండగా.. 12 పంచాయతీలు ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 577 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో ఎక్కువ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే మంత్రులు, నేతలు.. స్థానిక నాయకులకు సూచనలు చేస్తున్నారు. ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ఆయా గ్రామాల్లో అభివృద్ధి బాగా జరుగుతుందని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెం మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో, మరో మంత్రి పొంగులేటి ఆదివారం కూసుమంచిలో జరిగిన పాలేరు నియోజకవర్గస్థాయి ముఖ్య నేతల సమావేశంలోనూ ఇదే విషయమై సూచనలు చేశారు. -
‘స్వయం’ ఉపాధి
ఖమ్మంమయూరిసెంటర్ : జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు (ఎస్హెచ్జీ) సాధిస్తున్న విజయం ఆత్మనిర్భరతకు, సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. వృత్తిపరమైన వ్యాపారాలు చేయడంతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు గల వనరులను వినియోగించుకుంటూ మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫామ్ను మహిళా సంఘాల సభ్యులు కుట్టి ఉపాధి సాధించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఈ క్లాత్, కొలతలను అందించగా యూనిఫామ్ తయారుచేసి విద్యాశాఖకు అందజేశారు. మొదటి దశలో డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో మహిళలు 72,432 యూనిఫామ్లు కుట్టగా.. రెండో దశకు సంబంధించిన ఆర్డర్ త్వరలోనే విద్యాశాఖ నుంచి రానున్నట్లు తెలిసింది. సకాలంలో అందజేత.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్ అందజేస్తోంది. వీటిని కుట్టే బాధ్యతను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకుండా.. మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. వేసవిలో యూనిఫామ్ వస్త్రాలను జిల్లా అధికారులు మహిళా సంఘాల సభ్యులకు అందజేయగా.. వారు ఇచ్చిన కొలతల ప్రకారం కుట్టారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 20 మండలాల్లో 77 కేంద్రాలు ఏర్పాటు చేసి 56,614 యూనిఫామ్లు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా ఆయ కేంద్రాల్లో 583 మంది మహిళలు ఉపాధి పొందారు. మెప్మా ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో కేంద్రాలను ఏర్పాటు చేయగా 108 మంది మహిళలు 15,818 యూనిఫామ్లను తయారు చేశారు. మొదటి దశలో విద్యాశాఖ నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం యూనిఫామ్ కుట్టి పాఠశాలల పునఃప్రారంభం నాటికి అందజేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఇలా కుట్టిన మహిళలకు ఒక్కో యూనిఫామ్కు రూ.75 చొప్పున చెల్లించనున్నారు. నెల రోజుల్లో ఈ వేతనం వారికి అందనుందని అధికారులు వెల్లడించారు. ఎస్హెచ్జీలకు యూనిఫామ్ తయారీ బాధ్యతలు జిల్లాలో 72,432 యూనిఫామ్లు కుట్టిన సభ్యులు సకాలంలో పాఠశాలలకు అందజేత మహిళల్లో పెరిగిన ఆత్మనిర్భరత..నాలుగు నెలల పాటు ఉపాధి.. పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టడంతో ఉపాధి లభిస్తోంది. సంవత్సరంలో నాలుగు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. యూనిఫామ్ తయారీతో నెలకు రూ.12 వేల వరకు సంపాదిస్తున్నా. టైలరింగ్ నేర్చుకున్నందుకు మంచి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఈ ఆదాయం కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. – ఎన్.మాధవి, కృష్ణవేణి గ్రూప్ సభ్యురాలు, ఖమ్మం ఆనందంగా ఉంది.. టైలరింగ్ నేర్చుకున్న తర్వాత స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం ఆనందంగా ఉంది. మహిళా సభ్యులకు యూనిఫామ్ కుట్టే బాధ్యతలు ఇచ్చి ప్రభుత్వం మాకు మంచి ఉపాధి చూపించింది. మాకిచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేశాం. యూనిఫామ్ తయారీ ద్వారా వచ్చే వేతనంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవచ్చు. – ఎస్కె.ఫర్హానా, మధర్థెరిస్సా గ్రూప్ సభ్యురాలు, ఖమ్మం ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా.. జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు నైపుణ్యాన్ని, కష్టపడే తత్వాన్ని చాటుతూ యూనిఫామ్ తయారీ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 56,614, మెప్మా ఆధ్వర్యంలో 15,818 యూనిఫామ్లను కుట్టారు. తద్వారా మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా లబ్ధి పొందడమే కాక, నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. సామూహిక కృషి, పరస్పర సహకారంతో వారు ఈ పనిని విజయవంతం చేశారు. -
రైతు భరోసాకు రంగం సిద్ధం
● జిల్లాలో పాత పట్టాదారులు 3,38,463 మంది ● కొత్తగా మరో 4,693 మంది అర్హులు ● నూతన పట్టాదారుల దరఖాస్తుకు 20 వరకు గడువుఖమ్మంవ్యవసాయం: వానాకాలం వ్యవసాయ పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ సీజన్కు అందించే రైతు భరోసాపై ఇప్పటికే జిల్లాలో అర్హుల వివరాలను సేకరించింది. ఈ పథకానికి జిల్లాలో ఇప్పటికే 3,38,463 మంది రైతులు ఉండగా, ఈనెల 5వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికీ అవకాశం కల్పించింది. దీంతో కొత్తగా మరో 4,693 మంది రైతులు సాయం పొందనున్నారు. మొత్తంగా 3,43,156 మందికి ఈ వానాకాలంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.350 కోట్ల మేర అందించనున్నారు. 20 వరకు దరఖాస్తుకు అవకాశం.. ఈనెల 5వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20 వరకు అవకాశం ఉంది. భూ భారతి ద్వారా పొందిన పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం(భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నుంచి) జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జతచేసి క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులకు దరఖాస్తులు అందించాలి. గతంలో రైతుబంధు పొందిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నేడు రైతులతో సీఎం ముఖాముఖి ప్రస్తుత వానాకాలం సీజన్కు అమలు చేసే రైతు భరోసాతో పాటు పలు అంశాలపై సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాల్లో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతారు. జిల్లాలోని 21 మండలాల్లో 129 క్లస్టర్లు ఉండగా వీసీకి 62 రైతు వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఎం రేవంత్రెడ్డి సందేశాన్ని వీక్షించేందుకు ఒక్కో వేదికలో 200 మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెండింగ్ భరోసా సంగతేంటి..? ప్రభుత్వం వానాకాలం సీజన్కు రైతు భరోసా అమలు చేస్తున్న క్రమంలో గత యాసంగి సీజన్లో నిలిపేసిన బకాయిల సంగతేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడు జిల్లాలో 3,51,592 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. అయితే వారిలో నాలుగైదు విడతలుగా మార్చి నాటికి 2,65,392 మంది రైతుల ఖాతాల్లో రూ. 215.98 కోట్లు జమ చేశారు. ఇంకా 86 వేల మంది రైతులకు రూ.156 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ సీజన్లో అందించే పెట్టుబడి సాయంతో కలిపి పాతవి కూడా చెల్లించాలని ఆయా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా ఎకరాకు రూ.5 వేల చొప్పున అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడవగా, ప్రస్తుతం మూడో సీజన్ ప్రారంభమైంది. గత ఎన్నికల సమయంలో ఏడాదికి ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పుడు ఎకరాకు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.12 వేలే, అందులోనూ కొందరు రైతులకే అందించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
మతం పేరుతో కల్లోలం సృష్టిస్తున్నారు
తిరుమలాయపాలెం: మతాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోందని, అలాంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బచ్చోడులో ఆదివారం నిర్వహించిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ ర్యాలీకి ఆయన హాజరై మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల జ్ఞాపకాలను, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. ఆ రాజ్యాంగం లేకుంటే ప్రజలకు ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కాదన్నారు. అధికారం కోసం బీజేపీ ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మత్తులో రాష్ట్రాలను చిన్నాభిన్నం చేస్తోందని, ఆ పార్టీకి కనువిప్పు కలిగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బచ్చోడు, రాజారం, సోలీ పురం, కాకరవాయి గ్రామాల్లో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. సోలీపురంలో హజ్రత్ మన్సూర్ షావలి దర్గాను దర్శించి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత గృహ విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గురుకులాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10వేలు ఇస్తే తమ ప్రభుత్వం రూ.12 వేల కు పెంచిందన్నారు. వారం రోజుల్లో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటరెడ్డి, ఈఈ మహేష్, డీఈ వేణుగోపాల్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఏడీఏ సరిత, ఏఓ సీతారాంరెడ్డి, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్రెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, బెల్లం శ్రీనివాస్, అరవిందరెడ్డి, నరేష్రెడ్డి, చావా శివరామకృష్ణ, బుద్దా కనకయ్య, అశోక్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బచ్చోడులో ‘జై బాపు..జై భీమ్.. జై సంవిధాన్’ కార్యక్రమం -
హక్కుల సాధనకు పోరాటం
ఖమ్మంమామిళ్లగూడెం: గిరిజన హక్కుల సాధనకు ఢిల్లీ స్థాయిలో లడాయికి సిద్ధం కావాలని లంబాడి హక్కుల పోరాట సమితి – నంగార భేరి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు దాస్రాంనాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం ఐఎంఏ హాల్లో ఖమ్మం జిల్లా అధ్యక్షులు దశరథ్నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్నాయక్, జాతీయ జనరల్ సెక్రెటరీ డాక్టర్ నరేందర్పవార్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో లంబాడీల జనాభా బహిర్గతం చేయాలని, గిరిజనులు సాగుచేస్తున్న పోడు, లావణి భూముల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించి వెంటనే పట్టాలు ఇవ్వా లని డిమాండ్ చేశారు. సమావేశంలో , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసునాయక్, రాష్ట్ర కార్యదర్శులు గోవింద్నాయక్, కృష్ణనాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలునాయక్, పంతులునాయక్, రాష్ట్ర సీనియర్ నాయకు లు అజ్మీర సమ్మయ్య, పలు జిల్లాల అధ్యక్షులు వీరేశ్నాయక్, సురేశ్నాయక్, రాథోడ్సూర్య, సైదానాయక్, నీలకంఠం, జంపానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘నగ్నదేశం’ కావ్య సంపుటి ఆవిష్కరణ
ఖమ్మంగాంధీచౌక్: కవి, రచయిత, అనువాదకులు, చిత్రకారుడు సవ్యసాచి రచించిన కవితా సంపుటి ‘నగ్నదేశం’పుస్తక ఆవిష్కరణ ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ టెండర్ రూట్స్ పాఠశాలలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న కవి, కేంద్ర సాహిత్య అకాడమీ జరల్ కౌన్సిల్ సభ్యులు ప్రసేన్ మాట్లాడుతూ.. సవ్యసాచి కవిగా, అనువాదకునిగా రాణిస్తున్నారని తెలిపారు. పాత, కొత్త తరం కవులు రాస్తున్న ‘సిగ్నేచర్ పోయమ్స్’ను ఆంగ్ల భాషలోకి అనువాదం చేయడానికి పూనుకున్నారన్నారు. జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు, కవి మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సవ్యసాచి సామాజిక కోణంలో కవిత్వాన్ని అందించటం అభినందనీయమన్నారు. విద్యావేత్త, కవి రవిమారుత్ మాట్లాడుతూ.. సవ్యసాచి మణిపూర్లో జరిగిన మారణహోమంలో సీ్త్రని నగ్నంగా నడిబజార్లో ఊరేగించిన ఉదంతాన్ని తాను రాసిన కవితా సంపుటి ‘నగ్నదేశం’లో వివరించారని తెలిపారు. కార్యక్రమంలో కవులు శ్రీరామకవచం సాగర్, అన్నవరం దేవేందర్, డాక్టర్ పోతగాని తదితరులు సవ్యసాచి రచనను అభినందించారు. కార్యక్రమంలో కవులు ఇబ్రహీం, నిర్గుణ్, సునంద, రాంకుమార్, శేషగిరి, వెంకటయ్య, అమృత వర్షిణి, జయరాజ్, ఆంజనేయులు, పి.వెంకటేశ్వర్లు, దేవ, రౌతు రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సత్తుపల్లిటౌన్: పట్టణంలోని ద్వారకాపురి కాలనీలో ఆదివారం ఆటోలో తరలిస్తున్న ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నా రు. ద్వారకాపురికాలనీ రోడ్–7లో గజ్జల చంద్రకళ నివాసం నుంచి సుమారు 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఆటోలో వేస్తున్నారు. అదేకాలనీ రోడ్ నంబర్–2లో కొడాలి రమేశ్ ఆటోలో రెండు క్వింటాళ్లు వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి రెండు చోట్ల బియ్యాన్ని పట్టుకున్నామని ఆర్ఐ జానీమియా తెలిపారు. కేసు నమోదు చేసి ఆటో, బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఆర్ఐ జానీమియా తెలిపారు. -
విత్తనాలు సిద్ధం..
అందుబాటులోకి వరి, అపరాల సీడ్స్ ● వరిలో బీపీటీ, కేఎన్ఎం సన్న రకాలు ● అపరాలలో పెసర, మినుములు రెడీరైతులకు అందుబాటులో.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరిలో బీపీటీ 5204, కేఎన్ఎం 1638 సన్న రకాల విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని విత్తన విక్రయ కేంద్రాల్లో బీపీటీ 5204 రకం 2,943 క్వింటాళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 807 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. కేఎన్ఎం 1638 రకం ఖమ్మం జిల్లాలోని విక్రయ కేంద్రాల్లో 187 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. ఖమ్మం జిల్లాలో పెసలు ఎంజీజీ 295 రకం 10 క్వింటాళ్లు, ఎంజీజీ 385 రకం 130 క్వింటాళ్లు, మినుములు బీజీ పీయూ–31 రకం 35 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. ఇవిగాక ఖమ్మం విత్తనాభివృద్ధి సంస్థ యూనిట్లో బీపీటీ 5204 రకం వెయ్యి క్వింటాళ్లు, కేఎన్ఎం 1638 రకం 180 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా యూనిట్ వరి, అపరాల విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. వానాకాలం సీజన్ ప్రారంభం కావటంతో తొలుత మెట్ట పంటలు, ఇదే క్రమంలో వరి సాగుకు అవసరమైన విత్తనాలను సంస్థ సిద్ధం చేసింది. ప్రభుత్వం వరిలో విదేశీ డిమాండ్ ఉన్న సన్న రకాలను ప్రోత్సహిస్తోంది. అంతేగాక సన్న రకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ కూడా ఇస్తోంది. దీంతో రైతులు కూడా వరి సాగులో సన్న రకాలకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ జిల్లాల వారీగా నీటి వనరులు, నేలల రకాలు, వ్యవసాయ శాఖల ఇండెంట్ల ఆధా రంగా వరిలో సన్న రకాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బీపీటీ 5204 రకంతో పాటు కేఎన్ఎం 1638 రకాన్ని సిద్ధం చేశారు. ఇక మెట్ట పంటలుగా సాగు చేసే పెసర, మినుము విత్తనాలను కూడా సంస్థ అందుబాటులో ఉంచింది. విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. షరతులతో కూడిన రాయితీ వరి విత్తనాలకు విత్తనాభివృద్ధి సంస్థ ఓ ఆఫర్ ప్రకటించింది. ఖమ్మం విత్తనాభివృద్ధి సంస్థ యూనిట్ కార్యాలయం (గోదాం) నుంచి రైతులు నేరుగా విత్తనాలను కొనుగోలు చేస్తే వారికి విత్తన ధరలో 6 శాతం రాయితీ ప్రకటించింది. అంతేగాక రైతులు సమూహంగా ఏర్పడి 2 టన్నుల విత్తనాలను ఆర్డర్ చేస్తే దానికి కూడా 6 శాతం డిస్కౌంట్ కల్పించారు. ఎలాంటి రవాణా చార్జీలు లేకుండా ఆయా గ్రామాలకు సంస్థ విత్తనాలను రవాణా చేసే సౌకర్యం కల్పించింది. విత్తన ధరలు (రూ.లలో) వరి కిలోలు రైతు ధర బీపీటీ 5204 25 950.00 కేఎన్ఎం 1638 25 950.00 పెసలు ఎంజీజీ–295 4 506.00 పెసలు ఎంజీజీ–385 4 506.00 మినుములు పీయూ–31 4 463.00డిమాండ్ ఆధారంగా విత్తనాలు వానలు కురుస్తున్న వేళ విత్తన సీజన్ ప్రారంభమైంది. రైతులు సాగు చేసే పంటల ఆధారంగా విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రస్తుతం వరిలో రెండు సన్న రకాల విత్తనాలు, పెసరలో రెండు రకాలు, ఇనుములో ఒక రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాం. రైతుల వినియోగాన్ని బట్టి అందుబాటులో ఉంచుతాం. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని షరుతుల ఆధారంగా వరి విత్తనాలకు డిస్కౌంట్ ఇస్తున్నాం. అంతేగాక విత్తన విక్రయాలకు డీలర్ల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నాం. వివరాలకు విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు. –ఎన్.భిక్షం, ప్రాంతీయ మేనేజర్, విత్తనాభివృద్ధి సంస్థ -
ప్రజలకు దూరంగానే కాంగ్రెస్ పాలన
● బీజేపీ వైఖరిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం ● మాస్లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మంమయూరిసెంటర్ : అనేక హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాదిన్నర పాలన కమీషన్ల మయంగా మారిందని, ఏ సంక్షేమ పథకాన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆదివారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకొరగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం రేవంత్రెడ్డి పాలనపై పట్టు సాధించలేకపోయారని అన్నారు. మూడు రోజులుగా ఖమ్మంలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించామన్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వెనుక ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఉందని ఆరోపించారు. పశ్చిమాసియా దేశాలపై పెత్తనం కోసం ఇజ్రాయిల్ను అమెరికా పావుగా వాడుకుంటోందని, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దివంగత రాయల చంద్రశేఖర్ ప్రథమ వర్ధంతిని సోమవారం ఇల్లెందులో ఏర్పాటుచేశామని, ఈ సందర్భంగా స్తూపం, పుస్తకా విష్కరణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కార్పొరేట్ శక్తులను విమానయానరంగంలోకి ప్రోత్సహించడం, కనీస భద్రతా ప్రమాణాలు పరిశీ లించకపోవడం వల్లే ఎయిర్ ఇండియా విమానానికి ఆహ్మదాబాద్లో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్, కె.రమ, కెచ్చెల రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరావు, గుర్రం అచ్చయ్య, సీవై పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్ పాల్గొన్నారు. -
రోడ్డుపై గుంతలు పూడ్చిన రైతులు
ఖమ్మంఅర్బన్: చెరువుకట్టపై ఏర్పడిన గుంతలను రైతులే పూడ్చుకున్న ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ కొత్తగూడెంలోని ధంసలాపురం చెరువుకట్టపై గుంతలు ఏర్పడ్డాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి పూడ్చుకున్నారు. మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, మొర్రిమేకల కోటయ్యయాదవ్, వాకధాని గురవయ్య, జంగాల నాగేశ్వరరావు, కాంపాటి హనుమంతరావు, తెల్లబోయిన వెంకటేశ్వర్లు, చేతుల రామారావు, చెవుల రమణయ్య, కంచర్ల వీరయ్య, జంగాల వలరాజు, వాకధాని వలరాజు తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా రామయ్య కల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేసవి సెలవుల చివరి ఆదివారం కావడంతో నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో సందడి నెలకొంది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా, క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించి సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతి అందాల నడుమ ఉత్సాహంగా గడిపారు. 599 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.33,145 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.22,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
రైతువేదికల్లో వీసీ యూనిట్ల ఏర్పాటు
నేలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత రైతు నేస్తం వీసీ (వీడియో కాన్ఫరెన్స్) యూనిట్లను సోమవారం ప్రారంభించనున్నారు. జిల్లాలో 41 రైతు వేదికల్లో కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 129 రైతు వేదికలు ఉండగా.. వాటిలో గతంలో 1, 2 విడతల్లో 21 రైతు వేదికల్లో వీసీ యూనిట్లను ఏర్పాటు చేసి రైతు నేస్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు మరింత చేరువగా ఉండేందుకు ప్రతీ మండలంలో కనీసం మూడు రైతు వేదికల్లో వీసీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జిల్లాలో మూడో విడతలో 41 వేదికల్లో వీసీ యూనిట్లకు సంబంధించి పరికరాలు ఇన్స్టాల్ చేసి, ట్రయల్ రన్ నిర్వహించారు. సోమవారం సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వీటిని ప్రారంభించనున్నారు. సీఎం జిల్లాలోని నేలకొండపల్లి, కొణిజర్ల మండలంలోని లింగగూడెం రైతు వేదికలో పాల్గొననున్న రైతులతో ముఖాముఖి మాట్లాడేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖాముఖికి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఏఓ పుల్లయ్య అధికారులకు సూచించారు. సుర్దేపల్లి, ముజ్జుగూడెం రైతువేదికల్లో పనులను ఏఓ రాధ పరిశీలించారు. వీవీపాలెం రైతువేదిక సందర్శన రఘునాథపాలెం: రైతులకు శాసీ్త్రయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ కీలక ముందడుగు వేసిందని డీఏఓ ధనసరి పుల్లయ్య పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వీవీపాలెం రైతువేదికను సందర్శించి వీడియో కాన్ఫరెన్స్ పనితీరును పరిశీలించారు. ఇప్పటికే జిల్లాలో 21 వీసీ యూనిట్లు ఉండగా.. తాజాగా ఏర్పాటు చేస్తున్న 41 యూనిట్లతో కలిపి మొత్తం 62 అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ప్రతి మంగళవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించి శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు ప్రత్యక్షంగా సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఓ సాయిశిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తల్లాడ: స్థానిక డాంబర్ ప్లాంట్ వద్ద గుర్తు తెలయని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తల్లాడకు చెందిన చల్లా కృష్ణయ్య (63) ఉదయం కల్లూరు రోడ్డులో ఉన్న తన పొలం వద్దకు వెళ్లి టీవీఎస్ మోపెడ్పై తిరిగి వస్తున్నాడు. డాంబర్ ప్లాంట్ వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చల్లా నాగులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఫాదర్స్ డే రోజే.. తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్త స్రావం కావటంతో కృష్ణయ్యను స్థానికులు గుర్తుపట్టలేక పోయారు. చిన్న కుమారుడు రాము అక్కడికొచ్చి కూడా తన తండ్రి కాదనుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండో కుమారుడు చల్లా నాగులు అక్కడికొచ్చి తన తండ్రి టీవీఎస్ మోపెడ్ను చూసి గుర్తు పట్టాడు. కాగా, ఫాదర్స్ డే రోజే తమను వదిలివెళ్లావా.. అంటూ కుమారులు, కుమార్తె విలపించిన తీరు అక్కడివారిని కలచివేసింది. రైలు ఢీకొని సుతారి మేస్త్రి మృతిఖమ్మంక్రైం: రైలు ఢీకొని ఓ సుతారి మేసీ్త్ర మృతిచెందిన ఘటన ఆదివారం నగరంలో చోటుచేసుకుంది. ధంసలాపురానికి చెందిన నరం వెంకటేశ్వర్లు అలియాస్ వెంకన్న (75) సుతారి మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఇంటిసమీపంలో ఓ ఫంక్షన్కు హాజరై తన సైకిల్తో రైలుపట్టాలు దాటుతుండగా అటువైపు నుంచి వచ్చిన రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు చెవులు సరిగ్గా వినపడకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉండగా ఒకకుమార్తె గతంలో మృతిచెందింది. ఘటనా స్థలాన్ని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సత్యనారాణరెడ్డి చేరుకొని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నంశ్రీనివాసరావు బృందం సాయంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
టీజీఎస్ఆర్టీసీ ఈయూ నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మంమామిళ్లగూడెం: టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం రీజియన్ కౌ న్సిల్ సమావేశం ఆదివారం గిరిప్రసాద్భవన్ లో రీజియన్ అధ్యక్షుడు గుడిబోయిన శ్రీనివా స్ అధ్యక్షతన జరిగినది. సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం రీజియన్ అధ్యక్షుడిగా బూదాటి శ్రీనివాసరెడ్డి, రీజియన్ కార్యదర్శిగా పిల్లి రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా గుడిబోయిన శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు మాట్లాడారు. ఈ నెల 24న అన్ని సంఘాలతో సమావేశం హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీజీ కై ్లమేట్, బాగం హేమంతరావు మాట్లాడా రు. కందుల భాస్కర్రావు, తిమ్మినేని రామారావు, అరుణకుమారి, తిమ్మినేని రామారావు, రామచంద్రరావు, దేశబోయిన జగన్నాథం, బేతంపూడి బుచ్చిబాబు, జి.ఎస్.రెడ్డి, వెంకన్న, రమేశ్, అరుణమ్మ, కవిత, జరీనాబేగం, లాల్బి తదితరులు పాల్గొన్నారు. తండ్రికి కుమార్తె తలకొరివిదమ్మపేట: తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నాగుపల్లి గ్రామానికి చెందిన కునుసోతు రామకృష్ణకు మూడు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్ రాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడికి కుమారులు లేకపోవడంతో బీటెక్ చదువుతున్న ఆయన పెద్ద కుమార్తె శ్రావిక తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఫాదర్స్డే రోజే తండ్రికి కుమార్తె అంత్యక్రియలు చేయాల్సిరావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
అలరించిన ‘అనశ్వరం’
ఖమ్మంగాంధీచౌక్: నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో విజయవాడలోని శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్కు చెందిన కళాకారులు ప్రదర్శించిన ‘అనశ్వరం’నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమాజ మార్పు అంశంగా బర్రె సత్యనారాయణ రచించిన ఈ నాటికకు ద్వాదశి వెంకటచంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. వైద్య వృత్తితో వ్యాధులు నయం చేయటమే గాకుండా సమాజంలో ఆత్మహత్యలు జరగకుండా చైతన్యం కలిగించేందుకు కూడా తమ వృత్తి ఉండాలని వైద్యుల తపనపై, అనాగరికులను నాగరికులుగా మార్చటం, అనాథలకు అండగా నిలిచి, వారి అభ్యున్నతికి పాల్పడటం లక్ష్యంగా రూపొందించిన నాటిక ప్రేక్షకులను ఆలోచించపజేసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో కార్పొరేటర్ కమర్తపు మురళి, కార్యక్రమ అతిథి బత్తినేని నీరజ మాట్లాడుతూ.. ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో నెలనెలా వెన్నెల పేరిట నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. నిర్వాహకులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ప్రతి నెలా కార్యక్రమాన్ని నిర్వహించటం ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో అమరజీవి అనాబత్తుల రవీంద్రనాథ్ సాంస్కృతిక కళా సంస్థ(ఆర్క్స్) కార్యదర్శి అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగబత్తిని రవి, ప్రజానాట్యమండలి కార్యదర్శి వేముల సదానందం, నందిగామ కృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గాయకులు మంజులనాయుడు, గణపతి రాజు, భిక్షం తదితరులు సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఫాదర్స్ డే సందర్భంగా నాన్న ఔన్నత్యం తెలిపే పాటలు పాడారు. -
మున్నేరు పనులు ముందుకు సాగేనా..?
● వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్ నిర్మాణం ● ఖమ్మం వైపు భూ సేకరణకు పలువురు ససేమిరా.. ● వర్షాకాలం నేపథ్యంలో జాప్యం కానున్న పనులు ఖమ్మం అర్బన్: మున్నేరు నదికి ఇరువైపులా వరదల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఖమ్మం నగర పరిధిలో భూసేకరణ సమస్యతో అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు రూ. 690 కోట్ల అంచనాతో సుమారు 16 కి.మీ.కు పైగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో ఖమ్మం రూరల్ మండలం వైపు సుమారు రూ. 150 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తి కాగా, ఖమ్మం నగరం వైపు భూసేకరణ సమస్యలతో పనులు నిలిచిపోయాయి. నగర పరిధిలో ఎనిమిది కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 113.27 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 38.18 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. మిగిలిన 81.08 ఎకరాల్లో ప్రైవేట్ భూములు, ప్లాట్లు ఉన్నాయి. రైతుల నిరాకరణ.. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరిస్తుండగా, ఇచ్చే నష్ట పరిహారం సరిపోవడం లేదని కొంతమంది రైతులు, భూమికి బదులు భూమి ఇచ్చి న్యాయం చేయాలని మరి కొందరు కోర్టులను ఆశ్రయించారు. అయితే భూ సేకరణకు ముందే రైతులను ఒప్పించాలని కోర్టులు ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం. ప్రాంతాలవారీగా భూసేకరణ ఇలా.. దానవాయిగూడెం పరిధిలో 34 ఎకరాల్లో 22 ఎకరాలు ఎన్నెస్పీ భూములు కాగా, 11 ఎకరాలు ప్రైవేట్ భూములు ఉన్నాయి. ఇందులో ఆరుగురు రైతులు భూమి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ●మల్లెమడుగు పరిధిలో 14 ఎకరాల 29 గుంటల భూమి అవసరం కాగా, ఏడుగురు రైతులు ఇంకా ఒప్పుకోలేదు. ●బుర్హాన్పురం పరిధిలో 22 ఎకరాల్లో 11 కుంటలు ప్రభుత్వ భూమి ఉంది. మరో 5 ఎకరాలకు చెందిన రైతులు మాత్రమే ఒప్పుకోగా, మిగిలిన రైతులు ఇంకా అంగీకారం తెలపలేదు. ●ఖమ్మం అర్బన్ పరిధిలో 42 ఎకరాల 4 గుంటల భూముల్లో 9 ఎకరాల 18గుంటలు మాత్రమే ప్రభు త్వ భూమి ఉంది. మిగతా 32 ఎకరాల 24 కుంట ల్లో పదెకరాలకు చెందిన రైతులు, కొంతమంది ప్లాట్ల యజమానులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అంగీకారాలు తక్కువ.. నగర పరిధిలో 288 ప్లాట్లు ప్రాజెక్ట్ నిర్మాణ పరిధిలో ఉండగా ఇప్పటివరకు 45 మంది మాత్రమే భూమి ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు అధికారులు చెపుతున్నారు. బుర్హాన్పురంలో 51 ప్లాట్లు ప్రభావితమవుతుండగా 12 మంది మాత్రమే అంగీకరించారు. దీంతో పనులు ముందుకు సాగడం కష్టంగా మారింది. పనులు నిలిపేసే దిశగా.. వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో తాత్కాలికంగా భూసేకరణ, నిర్మాణ పనులు నిలిపేసేలా అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం నగరం వైపు ఒక కిలోమీటర్ పరిధిలో 250 మీటర్లకు పైగా వాల్ నిర్మాణం పూర్తయినట్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఒప్పందాలు పూర్తయ్యే వరకు మిగిలిన పనులకు జాప్యం తప్పదని తెలుస్తోంది. -
భట్టికి మంత్రి తుమ్మల శుభాకాంక్షలు
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో భట్టిని కలిసిన తుమ్మల శాలువాతో సత్కరించారు.జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటనఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో సీసీ రోడ్డు పనులకు, 9.30 గంటలకు కొరట్లగూడెం, 10 గంటలకు మోటాపురంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 10.30 గంటలకు మోటాపురం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళతారు. కాగా, పొంగులేటి పర్యటన వివరాలను నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఆయన వెంట నాయకులు శాఖమూరి రమేష్, కడియాల నరేష్, బచ్చలకూరి నాగరాజు, రావెళ్ల కృష్ణారావు ఉన్నారు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు ఖమ్మం సహకారనగర్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పరిధి ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2025 –26 విద్యాసంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి ప్రకటనలో తెలిపారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని స్పోర్ట్ స్కూళ్లలో ప్రవేశానికి మూడంచెల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఈనెల 16 నుండి 19వ తేదీ వరకు మండల స్థాయిలో, ఇక్కడ ప్రతిభ చూపిన వారికి ఈనెల 23 నుండి 26 వరకు జిల్లా స్థాయి పోటీలు, ఆ తర్వాత జూలై 1నుండి 5వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. 01–09–2016 నుండి 30–8– 2017 మధ్య జన్మించిన వారు అర్హులు కాగా, వివరాలకు tgss.telangana. gov.inలో పరిశీలించాలని సూచించారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్లో ఆదివాసీ గిరిజనలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని పేర్కొన్నారు. -
సంక్షిప్త సమాచారం
యోగాతోనే ఆరోగ్యం మధిర: ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడు వెంకట్ లాల్ తెలిపారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధిర ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు యోగా చేయాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు కందుల రాంబాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలి కారేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి.ఝాన్సీ అన్నారు. శనివారం మండలంలోని టేకులపల్లిలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులనే, కాంగ్రెస్ ప్రభుత్వం అవలవంభిస్తున్నదన్నారు. జూన్ 21,22 తేదీల్లో నిజామాబాద్లో కార్మిక సమస్యలపై జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్లైన్ మండల కార్యదర్శి ఉమ్మడి సందీప్, నాయకులు తేజ్యానాయక్, భాస్కర్, సక్రు, సత్తిరెడ్డి, సరోజిని, అనసూర్య, లఘుపతి, రంగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర కొణిజర్ల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని సీపీఐ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రా బాబు అన్నారు. శనివారం మండలంలోని చిన్నమునగాలలో నాగవరపు భద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. అనంతరం శాఖ కార్యదర్శిగా పాపగంటి సుదర్శన్, సహాయ కార్యదర్శిగా కొత్తపల్లి నాగయ్యలతో పాటు మరో 11మంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కోటేశ్వరరావు, సుదర్శన్, భద్రయ్య, సంసోన్, నాగయ్య, విజయ్కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలను జయప్రదం చేయండి మధిర: మధిర పట్టణంలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించే సీపీఐ జిల్లా 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు తెలిపారు. శనివారం స్థానిక రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో నిర్వహించిన సీపీఐ ఆహ్వాన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులపై చర్చించడం జరుగుతుందన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి మహాసభల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెజవాడ రవిబాబు, మందడపు రాణి, ఊట్ల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ మరణం పార్టీకి తీరని లోటు తల్లాడ: కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి తేజావత్ బాలాజీ నాయక్ మరణం బీజేపీ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని అంజనాపురంలో నిర్వహించన ఆయన సంస్మరణ సభలో బీజేపీ నాయకులు పాల్గొని, బాలాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, వెంకటేశ్వరరావు, మదుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెట్లు నిర్మించాలని వినతి.. వైరారూరల్: మండలంలోని తాటిపూడిలో వైరా రిజర్వాయర్ కుడి కాలువ ఆధునికీకరణ పనులలో భాగంగా భక్తులు కార్తీక మాసాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కాలువకు ఇరువైపులా మెట్లు నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ వెంకటకృష్ణకు శనివారం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాగరాజు, జయరాజు, నిర్మల, శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జేవీఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి చర్యలు
సత్తుపల్లి: సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన షెడ్ల నిర్మాణంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటామని పూర్వ విద్యార్థి సంఘం బాధ్యుడు మట్టా దయానంద్ అన్నారు. శనివారం కళాశాలను సందర్శించి కళాశాల మైదానంలోని క్రీడాకారులతో మాట్లాడారు. ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వాకర్స్కు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి, దొడ్డా శ్రీనివాసరావు, ఇమ్మినేని ప్రసాద్, వెంకటరమణ, దిలీప్, జె.వంశీ, ఇర్ఫాన్ పాల్గొన్నారు. -
రాజీ మార్గమే రాజమార్గం
మధిర/సత్తుపల్లిటౌన్: కేసులను పరిష్కారంలోలో రాజీ మార్గమే.. రాజ మార్గమని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాస్, మధిర కోర్టు న్యాయమూర్తి ఎన్.ప్రశాంతి తెలిపారు. శనివారం మధిర కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవా అధికార సంస్థ చైర్ పర్సన్ ఎన్.ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో.. మధిర కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల కూడా పాల్గొని పలు కేసులు పరిష్కరించారు. మధిర ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి పరిధిలో 289కేసులు పరిష్కారం కాగా రూ.1,32,900జరిమానా విధించారు. అదేవిధంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి పరిధిలో 240 కేసులు పరిష్కారం కాగా, రూ.3,86,800జరిమానా విధించారు. అదే విధంగా సత్తుపల్లి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జడ్జి శ్రీనివాస్ పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో రాజీ అయితే సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని స్పష్టం చేశారు. రాజీ చేసుకుంటే ఇరువురు గెలుస్తారని, సమయం, డబ్బు ఆదాఅవుతుందన్నారు. క్షణికావేశంలో జరిగిన కేసులకు రాజీపడేందుకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ సందర్భంగా పలువురి బాధితులకు అవార్డులు సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్జడ్జి షేక్ మీరాఖాసీం సాహెబ్, జూనియర్ సివిల్ జడ్జి బి.సుమబాల, సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్లు జె.గోపాలరావు, అబ్రహం, బార్ అధ్యక్షులు బోజడ్ల పుల్లారావు, మల్లెపూల వెంకటేశ్వరరావు, ఏపీపీ భద్రయ్య, మధిర పట్టణ సీఐ రమేష్ ,ఎస్సై చంద్రశేఖర్, బ్యాంక్ అధికారులు, పోలీస్, కోర్టు సిబ్బందితో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. -
బీమా చెక్కు అందజేత
వైరా: వైరా మున్సిపాలిటీలోని శాంతినగర్కు చెందిన ఎక్కిరాల వెంకటేశ్వర్లు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆయనకు బీఆర్ఎస్పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో ఆయన కుటుంబానికి మంజూరైన రూ.2 లక్షల చెక్కును వైరా మాజీ ఎమ్మెల్యే దివంగత బానోత్ మదన్లాల్ సతీమణి మంజుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వైరా మాజీ వైస్ ఎంపీపీ జ్యోతి, నాయకులు వెంకటేశ్వరరావు, కిరణ్, సురేష్, రాము, కిషోర్, ప్రేమ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మదర్థెరిస్సా కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్ సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మదర్థెరిస్సా ఫార్మసీ కళాశాలలో శనివారం అపోలో ఫార్మసీ ఆధ్వర్యాన క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 35మంది విద్యార్థులు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చల్లా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎంపికై న విద్యార్థులను కళాశాల చైర్మన్ కంచర్ల సత్యనారాయణ, కళాశాల కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కుమార్రాజా, ఐక్యూ కోఆ ర్డినేటర్ డాక్టర్ దాసరి ప్రవీణ్కుమార్, ఇన్చార్జ్ గంటా మానస, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. నడవాలంటే నరకమే.. – అధ్వానంగా మారిన సాగర్ కాల్వ బ్రిడ్జి రోడ్డు కల్లూరురూరల్: సాగర్కాల్వ బ్రిడ్జిపై నిర్మించిన రోడ్డుపై ప్రజలు ప్రయాణించాలంటే నరకయాతన పడాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. కప్పల బంధంలోని సాగర్ ప్రధాన కాలువపై నిర్మించిన బ్రిడ్జిపై రోడ్డు గుంటలు పడి నీరు నిల్వ ఉండడంతో దానిపై వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరామాపురం, ఎన్నెస్పీ కల్లూరు వెళ్లేందుకు ఈ బిడ్జియే ప్రధాన మార్గం కావడంతో ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు చెప్పలేనివి. కొత్త రోడ్డు దేవుడెరుగు ఉన్న రోడ్డుకై నా మరమ్మతులు చేయించి రాకాపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేయొద్దు.. బోనకల్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఎంఈఓ దామాల పుల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతి లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రేపటి నుంచి మిర్చి కొనుగోళ్లు
మధిర: మధిర వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ రబీలో రైతులు సాగు చేసిన ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మూడు మండలాల్లో 1,035 మంది రైతుల వద్ద 51,207 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, మద్దతు ధర రూ.12 కోట్లతో పాటు సన్నధాన్యానికి బోనస్ కూడా ఖాతాల్లో జమ అయిందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్ అద్దంకి రవికుమార్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు బంగారు పతకాలు
జూలై 7న స్నాతకోత్సవంలో అందజేత కొణిజర్ల: కాకతీయ యూనివర్సిటీ ఇటీవల ప్రకటించిన బీఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సు ఫలితాల్లో కొణిజర్ల మండలం అమ్మపాలెం పంచాయతీ పరిధిలోని బ్రౌన్స్ ఫార్మసీ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. యం ఫార్మసీ కోర్సులో వేముల సింధు (2018), 2019 సంవత్సరానికి గాను బీఫార్మసీలో సముద్రాల రచన 4 బంగారు పతకాలు సాధించింది. 2021 సంవత్సరానికి గాను బీఫార్మసీలో మద్దోజు తేజశ్విని, కాటేపల్లి శివానీలు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పారుపల్లి ఉషాకిరణ్కుమార్, సెక్రటరీ కరస్పాడెంట్ పారుపల్లి విజయలక్ష్మి బంగారుపతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. జూలై 7న కాకతీయ స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ జగన్నాథ్ పాత్రో, ఏఓ సీహెచ్ హనుమంతరావు, అధ్యాపక బృందం అభినందించారు. -
శాటిలైట్ టీవీతో విద్యాబోధన
●పెద్దతండా పాఠశాల హెచ్ఎం రాజాలిపాషా ప్రత్యేకత ●ఇన్నోవేషన్లో..రాష్ట్ర స్థాయి గుర్తింపు కారేపల్లి: మండలంలోని పెద్దతండా (భాగ్యనగర్తండా) ప్రాథమికోన్నత పాఠశాలలో శాటిలైట్ టీవీతో విద్యాబోధన పలువురిని ఆకట్టుకుంటుంది. ఆ పాఠశాల హెచ్ఎం ఎస్కే రాజాలిపాషా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వినూత్న బోధన విధానాన్ని అవలంభిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభకు పదును పెడుతున్నారు. విద్యార్థులను ఆకట్టుకునేలా.. పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకునేలా శాటిలైట్ టీవీని వినియోగించి బోధన చేస్తున్నారు. హెచ్ఎం సారధ్యంలో విద్యార్థులు మల్టీశాటిలైట్ సిగ్నల్ రిసీవింగ్ యాంటినాను తయారు చేశారు. అదే రిసీవర్ యాంటినా ద్వారా 300లకు పైగా టీవీ చానల్స్ను విద్యార్థులకు అందుబాటులో ఉంచి విద్యనందించటం ద్వారా పాఠశాలకు గుర్తింపు వచ్చింది. ప్రైవేట్ ధీటుగా విద్యాబోధన సాగుతుండడంతో పాఠశాలలో ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని హెచ్ఎం తెలిపారు. ఇన్నోవేషన్లో రాష్ట్రస్థాయి అవార్డు.. రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ సెల్ సైన్స్ ప్రొగ్రాంలో యూపీఎస్ పెద్దతండా (భాగ్యనగర్తండా) విద్యార్థి ఎం.ఉపాసన రాష్ట్రస్థాయి అవార్డు సాధించింది. మల్టీశాటిలైట్ సిగ్నల్ రిసీవింగ్ యాంటినా తయారు చేసినందుకు గాను ఈ అవార్డును అందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడిన 500ల మంది విద్యార్థుల్లో 20మంది ఎంపిక కాగా, వారిలో ఎం.ఉపాసన ఒకరు. దీంతో విద్యార్థినికి, ప్రోత్సహించిన హెచ్ఎం.. కలెక్ట ర్ చేతులమీదుగా అవార్డును సైతం అందుకున్నారు. ఆదర్శవంతంగా పాఠశాల నిర్వహణ.. పిల్లల తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాల ఉపాధ్యాయుల కృషితో పెద్దతండా ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా బోధన చేస్తుండటంతో వారిలో నేర్చుకోవాలనే తపన పెరిగి బడికి ఉత్సాహంగా వస్తున్నారు. విద్యార్థుల మనోవికాసాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ఎస్కే.రాజాలిపాషా, హెచ్ఎం, పెద్దతండా -
ఘనంగా రామాలయం వార్షికోత్సవం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని శ్రీకోదండ రామాలయం 51వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలమూర్తులకు అభిషేక మహోత్సవం, పుష్పాలంకరణ, పట్టాభిషేక ఉత్సవం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అనుమోలు సురేష్, కొత్తూరు సత్యనారాయణ, మొరిశెట్టి సాంబశివగుప్తా, భక్తులు పాల్గొన్నారు. సెంట్రల్ డీఎస్పీగా మేకలతండా యువకుడు కారేపల్లి: మండలంలోని మేకలతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బానోత్ రామ్మూర్తి నాయక్ – విజయ దంపతుల కుమారుడు బానోత్ లక్ష్మీవరప్రసాద్ సెంట్రల్ డీఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ ఎక్జామ్లో 256వ ర్యాంక్ సాధించి సీఏపీఎఫ్ సెంట్రల్ డీఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. దీంతో యువకుడి ని మండల ప్రజలు అభినందించారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం తల్లాడ: పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. శనివారం తల్లాడలోని కుర్నవల్లి ఫంక్షన్హాల్లో నిర్వహించిన సీపీఎం సత్తుపల్లి డివిజన్ రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్గా సత్తుపల్లి డివిజన్ సీపీఎం కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి వ్యవహరించగా.. రాజకీయాలు వాటి ఆవశ్యకతపై జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాద్యుడు మల్లెంపాటి వీరభద్రరావు బోదించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మాచర్ల బారతి, జిల్లా కమిటీ సభ్యులు రమేష్, విఠల్, పాండురంగారావు, రామలింగేశ్వరరావు, కృష్ణార్జున్రావు, సర్వేశ్వరరావు పాల్గొన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం కృషి చేస్తా వైరా: మున్నూరు కాపు కుల కార్పొరేషన్ ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తానని టీపీసీసీ కార్యదర్శిగా నియమితుడైన కట్ల రంగారావు అన్నారు. శనివారం వైరాలోని 12వ వార్డు రేచర్ల బజార్లో మున్నూరు కాపు కుల సంఘం ఆధ్వర్యంలో కట్ల రంగారావుకు ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, రేచర్ల నాగేశ్వరరావు, రాముడు, కట్ల నాగరాజు, కామిశెట్టి రవికుమార్, కట్ల సంతోష్, కుటుంబరావు, నాగేంద్రరావు, పుల్లయ్య, సీతారాములు, మహేష్, శ్రీకాంత్, అక్కిశెట్టి రవితేజ, సైదులు సత్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి కృషి.. డాక్టర్గా బిడ్డ
తిరములాయపాలెం: కుమారుడు జన్మించినప్పుడే డాక్టర్గా చూడాలని ఆ తండ్రి కల కన్నాడు. ఆ కల నిజమయ్యేలా కష్టపడి చదవడం అలవాటు చేయడంతో తండ్రి కోరికను నెరవేర్చిన బిడ్డ ఇప్పుడు పేదలకు వైద్య సేవలందిస్తుండడం విశేషం. తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన బత్తిని జగన్మోహన్రావు గ్రామాల్లో తిరుగుతూ వాయిదాల పద్ధతిలో వస్తువులు అమ్మే వ్యాపారం చేస్తాడు. పూసల కుటుంబంలో పుట్టిన ఆయనలాంటి ఇంకొందరు పిల్లలను సైతం అదే వ్యాపారం చేయిస్తున్నారు. కానీ జగన్మోహన్రావు చిన్న నాటి నుండే పిల్లలపై శ్రద్ధ వహిస్తుండగా కుమారుడు సాయికుమార్ ఎండీ(జనరల్ మెడిసిన్) పూర్తి చేసి కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా సేవలందిస్తున్నాడు. అంతేకాక కుమార్తె రాణి బీటెక్ పూర్తిచేసింది. కుమారుడిని మెడిసిన్ చదివించే సమయాన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదల వీడని జగన్మోహన్రావు ఇప్పుడు సాయి ఎదుగుదలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
డ్రైవర్గా పనిచేస్తూనే...
ఖమ్మంక్రైం: రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. పెద్ద చదువులు లేకున్నా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలన్న ఆయన కల నెరవేరుతోంది. ఖమ్మం మంచికంటినగర్–2లో నివాసముండే తమ్మనబోయిన శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్లో సరుకులను తరలించే వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె అయిన స్నేహ మృదుల చిన్నతనం నుంచే చదువులో మేటిగా ఉండటంతో భార్య విజయ సహకారంతో కష్టపడి చదివించాడు. స్నేహ ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్లో 89వ ర్యాంక్ సాధించి హైదరాబాద్ ఐఐటీలో సీఎస్ఈ(ఏఐ) సీటు సాధించింది. ఈసందర్భంగా స్నేహ మృదుల మాట్లాడుతూ తాను కష్టపడుతున్నా బిడ్డలు ఉన్నత స్థాయికి చేరాలన్న నాన్న కలను నెరవేరుస్తుండడం ఆనందంగా ఉందని తెలిపింది. -
ఒకరు ఐపీఎస్, ఇంకొకరు సీఐ
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడలోని పేద కుటుంబానికి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మ దంపతులకు ఇరువురు కుమారులు. చిన్నప్పటి నుండి కృష్ణయ్య పేదరికాన్ని అనుభవించారు. భీమవరంలోని పలువురు రైతుల వద్ద ఏటా రూ.3వేల జీతానికి పనిచేశాడు. ఆయన భార్య వజ్రమ్మ కూడా కూలీ పనులకు వెళ్లేది. అయినా రూపాయి రూపాయి పోగేసి పిల్లలు శ్రద్ధగా చదువుకునేలా చూశారు. తద్వారా ఓ కుమారుడు బాబురావు రామగుండం సీసీఎస్లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్న కుమారుడు కిరణ్కుమార్ ఐపీఎస్ సాధించి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రోహఽథాస్ జిల్లాలో ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆది నుంచి కష్టాలను ఎదుర్కొన్నప్పుడు బిడ్డలు ఉన్నత స్థాయికి చేరడంతో కృష్ణయ్య దంపతులు ఆనందంలో ఉండగా.. స్థానికులు వారి కృషిని అభినందిస్తున్నారు. -
మెకానిక్ తనయుడు న్యాయమూర్తి
ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం బొమ్మన సెంటర్లో టీవీ మెకానిక్గా పనిచేస్తున్న షేక్ చాంద్పాషా వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను ఉన్నతస్థాయికి చేర్చాడు. పెద్ద కుమారుడు ఆరిఫ్ డిగ్రీ అనంతరం టైప్ నేర్చుకుని కోర్టులో ఉద్యోగం సాధించాడు. అంతటితో ఆగకుండా లా పూర్తి చేసి జడ్జిగా ఎంపికయ్యాడు. తొలుత కాజీపేట రైల్వే కోర్టులో జడ్జిగా పనిచేశాక, ప్రస్తుతం నకిరేకల్ కోర్టులో జూనియర్ సివిల్జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక చాంద్ రెండో కుమారుడు ఆసిఫ్ హైదరాబాద్లో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈ విషయమై చాంద్ మాట్లాడుతూ ‘నాకొచ్చేది చాలీచాలని ఆదాయమే అయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా చదువుపై దృష్టి సారించాలని బిడ్డలకు సూచించా. అలా వారు శ్రద్ధగా చదివి ప్రయోజకులు అయ్యారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది’ అని వెల్లడించాడు. -
లోక్ అదాలత్తో శాశ్వత పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ● జిల్లా కోర్టుల్లో 6,220 కేసుల పరిష్కారంఖమ్మంలీగల్: ఇరుపక్షాలు లోక్ అదాలత్లో రాజీ పడడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇక్కడి తీర్పుపై అప్పీల్కు సైతం అవకాశం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కె.ఉమాదేవి తదితరులతో కలిసి పాల్గొన్న జిల్లా జడ్జి రాజగోపాల్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని, తద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయని తెలిపారు. పెండింగ్ కేసులు సత్వర పరిష్కారమే కాకుండా ప్రీ లిటిగేషన్, సివిల్ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు ఇతరత్రా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కాగా, లోక్ అదాలత్ ద్వారా 62 మోటార్ వెహికల్ ప్రమాద కేసుల్లో రాజీ ద్వారా రూ.2.80 కోట్ల పరిహారం ఇప్పించామని వెల్లడించారు. జిల్లా కోర్టు పరిధిలోనే కాకుండా సత్తుపల్లి, మధిర కోర్టుల్లోనూ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించామని తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన వృద్ధురాలు గొడ్ల రత్తమ్మ తరపున న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ కేసు దాఖలు చేయగా సత్వర పరిష్కారం చేసి హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.11.50 లక్షల అవార్డ్ జారీ చేశారు. అలాగే, భార్యాభర్తలైన భవాని – వీరభద్రం వివాదాన్ని కూడా రాజీ ద్వారా పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దేవినేని రామప్రసాదరావు, వి.శీనయ్య, ఎం.అర్చన కుమారి, ఎంకల్పన, టి.మురళీమోహన్, కాసరగడ్డ దీప, బెక్కం రజని, ఏపూరి బిందుప్రియ, వి.మాధవి, బి.నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.వెంకటేశ్వరరావుతో పాటు న్యాయవాదులు గద్దల దిలీప్కుమార్, బండారుపల్లి గంగాధర్, పి.సంధ్యారాణి, కొత్తపల్లి రామారావు, స్వర్ణ రాంబాబు, మందడపు శీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి ప్రోత్సాహంతో విదేశాలకు..
సత్తుపల్లిటౌన్: ‘నాన్న ప్రోత్సాహంతోనే సింగపూర్లో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడ్డా.. ఆయన ఎన్ని కష్టాలు పడినా మాకు ఆనందాన్ని పంచుతూ జీవితంలో రాణించేలా తీర్చిదిద్దారు. అందుకే నాన్నే నా హీరో..’ అంటున్నారు సత్తుపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్ షేక్ అబ్దుల్ గఫార్ కుమారుడు షేక్ తాబేర్ పర్వేజ్. 1996 నుంచి గఫార్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయనకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా కుమారుడు పర్వేజ్ను విజయవాడలో ఇంటర్, హైదరాబాద్లో బీటెక్, ఎంటెక్ చదివించారు. ఆపై ఆయన సింగపూర్లోని ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్లో ఉద్యోగం సాధించి స్థిరపడ్డాడు. ‘నా కలలు సాకారం చేసేందుకు నాన్న ఎన్నో త్యాగాలు చేసి జీవితంలో బలమైన పునాది వేశారు.. అలాంటి తండ్రి ఉండడం నా అదృష్టం’ అని తాబేర్ ఫర్వేజ్ తెలిపారు. -
ఎంవీఐగా రైతు బిడ్డ
వైరా: తన కష్టం బిడ్డలు పడొద్దని తపించే వారిలో ఆచంట రామకృష్ణ ఒకరు. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన ఆయనకు ఐదెకరాల భూమి ఉంది. రామకృష్ణకు కుమారులు వరప్రసాద్, సురేష్ ఉండగా, బిడ్డలు మంచి ఉద్యోగాలు చేసి పేరు సాధించాలని భావించేవాడు. ఈక్రమంలోనే వరప్రసాద్ను బీటెక్ వరకు చదివించగా ప్రస్తుతం వైరా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సురేష్ చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. ‘కష్టపడండి.. ఉన్నత ఉద్యోగాలు చేయండి.. పది మందికి సాయపడండి..’ అని చెప్పే తండ్రి మాటలే తమకు ఆదర్శమని వరప్రసాద్ చెబుతారు. -
రైతు ప్రయోజనాలే అంతిమ లక్ష్యం
● అందుకు అనుగుణంగా విత్తన చట్టం రూపకల్పన ● రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి ఖమ్మంవ్యవసాయం: రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా వారి సంపూర్ణ ప్రయోజనాల కోసం విత్తన చట్టం రూపొందిస్తున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి తెలిపారు. చట్టం ముసాయిదా బిల్లుపై కలెక్టరేట్లో శనివారం ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు, ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొనగా అన్వేష్రెడ్డి మాట్లాడారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతున్నందున పకడ్బందీ చట్టాలు చేసేందుకు విత్తన చట్టం ముసాయిదా బిల్లు రూపొందించామని తెలిపారు. దీనిపై అభిప్రాయాల సేకరణ కోసం ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశాల్లో వచ్చే సూచనల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి చట్టం ఖరారు చేస్తామని అన్వేష్రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఫిర్యాదు చేయొచ్చు.... రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఆర్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రైతులు సొంతంగా విత్తనం ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో మోసపోతున్నారని తెలిపారు. ఎవరికై నా నష్టం ఎదురైతే రైతు సంక్షేమ కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. న్యాయవాది సునీల్ మాట్లాడుతూ ఒప్పందం పేరిట వ్యవసాయం జరుగుతున్నందున విత్తన నాణ్యతలో లోపాలతో రైతుకు నష్టం ఎదురైతే పరిహారం పొందే విధానం ఉండాలన్నారు. రఘునాథపాలెంకు చెందిన రైతు రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే అమ్మేలా చూస్తే నష్టపోయే పరిస్థితి ఉండదన్నారు. వైరాకు చెందిన బి.రాంబాబు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు మాట్లాడగా, కొణిజర్ల ఏఓ నాగార్జున మాట్లాడుతూ విత్తన లోపాలతో నష్టపోయే రైతులకు పరిహారం అందేలా చట్టంలో పొందుపర్చాలని తెలిపారు. ఖమ్మం డీలర్ల అసోసియేషన్ ప్రతినిధి మనోహర్ మాట్లాడుతూ లైసెన్స్డ్ కంపెనీల నుంచే విత్తనాలు తెచ్చి అమ్ముతుండగా, పంట సరిగ్గా రాకపోతే డీలర్ల తప్పేం ఉంటుందని ప్రశ్నించారు. ఈమేరకు లైసెన్సింగ్ విధానంలోనే మార్పులుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీన, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయాధికారులు డి.పుల్లయ్య, వి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
స్తంభం.. వాడితే పన్ను ఖాయం
సంయుక్తంగా సర్వేకు శ్రీకారం ప్రైవేట్ వ్యక్తులు విద్యుత్ స్తంభం వినియోగించుకుంటే గ్రామాల్లోనైతే రూ.15, పట్టణాల్లో రూ.20 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం చాన్నాళ్లుగా అమల్లో ఉంది. కానీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఈ నేపథ్యాన జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్లు ఎన్నేసి స్తంభాలను వినియోగించుకుంటున్నారో లెక్క తేల్చాలని నిర్ణయించారు. ఈమేరకు విద్యుత్ సిబ్బంది, ఆపరేటర్లు సంయుక్తంగా సర్వే చేస్తున్నారు. వారం, పది రోజులలో ఈ ప్రక్రియ పూర్తయ్యాక పన్నుల వసూళ్లకు రంగంలోకి దిగనున్నారు.నేలకొండపల్లి: విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్న కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్ల నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేసేలా విద్యుత్ శాఖ సిద్ధమవుతోంది. గతంలోనూ ఈ పన్ను విధానం అమల్లో ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే, స్తంభాలకు గజిబిజిగా వైర్లు ఉండడంతో ఏదైనా మరమ్మతు అవసరమైనప్పుడు సిబ్బంది ఎక్కడం కష్టమవుతోంది. వీటన్నింటికి చెక్ పెట్టేలా విద్యుత్ శాఖ అధికారులు ప్రతీ స్తంభాన్ని పరిశీలించి వినియోగించుకున్న వారి పన్ను వసూలుకు నిర్ణయించింది. స్తంభాలపై కుప్పలు కుప్పలుగా పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు వైర్లు కుప్పలుగా ఉంటున్నాయి. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లతో పాటు విద్యుత్ తీగలు అన్ని కలిసిపోయి ఉంటాయి. ఈమేరకు ఆపరేటర్లు పదిహేను రోజుల్లోగా వైర్లను సర్దుకోవాలని అధికారులు సూచించారు. ఆతర్వాత లెక్కలు తేల్చి పన్ను వసూలుకు నిర్ణయించారు. ఇన్నాళ్ల మాదిరి దాటవేయడం కష్టమే పక్కాగా లెక్క తేల్చేలా జాయింట్ సర్వేవాడితే పన్ను కట్టాల్సిందే.. జిల్లాలో విద్యుత్ స్తంభాలను వినియోగించే వారంతా పన్ను చెల్లించాల్సిందే. తొలుత గజిబిజిగా ఉన్న ఇంటర్నెట్, కేబుల్ టీవీ వైర్లను సరి చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత వారు వినియోగించుకుంటున్న స్తంభాల లెక్క తేల్చందుకు జాయింట్ సర్వే చేస్తున్నాం. ఆపై ప్రతీ నెల పన్ను వసూలు చేస్తాం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
‘నీట్’లో జిల్లా విద్యార్థుల సత్తా
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్లో జిల్లా విద్యార్థులు పలువురు సత్తా చాటారు. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తిచేశాక నీట్ రాయగా, జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు అభినందించాక వివరాలు వెల్లడించాయి. – ఖమ్మం సహకారనగర్● డాక్టర్స్ అకాడమీ ర్యాంకుల పంటఖమ్మంసహకారనగర్: నీట్ ఫలితాల్లో ఖమ్మంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థిని తూము వెన్నెల 626 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 307వ ర్యాంకు సాధించిందని యాజమాన్యం రాయల సతీష్బాబు, ఈగా భరణికుమార్ తెలిపారు. అలాగే, వెన్నెల రాష్ట్రస్థాయిలో 11వ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. ద్వితీయస్థానంలో రిషిక శర్మ 588, ప్రియాంక ఎస్టీ కేటగిరిలో ఆలిండియా 171వ ర్యాంకు సాధించిందని వివరించారు. ఇంకా అతియా తరణమ్ 509, ఏ.వర్ష 505, కె.మోక్షిత శరణ్నయ 496, షేక్ సమీనమథార్ 496, రేణుశ్రీ 489, యశ్వంత్ 482, ఆయేషా సమీర 481, సీహెచ్.క్షేత్ర 474, వెన్నెలరెడ్డి 467, కే.వీ.నిక్షిత 463 మార్కులు సాధించారని, నర్ల్కులు సాధించినట్లు తెలిపారు. ఇక జి.అనూష 461, షేక్ నూరెవసీమ్ 467, టి.వైష్ణవి 451, ఎండి.సునైనా 450, ఎస్.విగ్నేష్రెడ్డి 444, బి.అక్షయ 443 ర్యాంకులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను ఘనంగా సన్మానించారు. 500 మార్కులకు పైన ఆరుగురు, 450 మార్కులకు పైన 21మంది, 400 మార్కులకుపైన 62మంది, 122 మందికి ప్రభుత్వ ఎబీబీఎస్సీట్లు సాధిస్తున్న ఏకై క సంస్థ తమదేనన్నారు. ఖమ్మం సహకారనగర్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. ఈమేరకు ర్యాంక్లు సాధించిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించాక మాట్లాడారు. పి.సంహిత 951వ ర్యాంక్ సాధించగా, ఎల్.సాయిచరణ్ 1,114, బి.గోపిచంద్ 1,187, ఎం.ఆకాంక్ష 1,197, ఎం.వైష్ణవి 1,535, బి.సాయిశృతి 2,571, టి.దివ్య 2,991, బి.చైతన్య సాయి 3,058, బి.అక్షిత 4,281, ఆర్.శీతల్ 5,553, జె.వివేక్ 5,672, బి.యశ్వంత్ 5,743వ ర్యాంక్లు సాధించారని తెలిపారు. అలాగే, ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు సీహెచ్.గోపీచంద్, సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ● హార్వెస్ట్కు ఉన్నత శ్రేణి ఫలితాలు ఎన్టీఏ ఆధ్వర్యాన నిర్వహించిన నీట్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని హార్వెస్ట్ గ్రూప్ విద్యాసంస్థల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కళాశాల విద్యార్థిని తమన్నా డీవీఎస్ఎస్.నయనాంజలి 564 మార్కులతో 3,321, జి.రాణి ఉమాఅలేఖ్య 544 మార్కులతో 6,586వ ర్యాంకు, బి.భార్గవి 449 మార్కులతో 1,181వ ర్యాంకు సాధించగా, జి.శ్రీమయి 456 మార్కులతో 6,727, ఎండీ.అన్షియ ముస్కాన్ 487 మార్కులతో 8,420, సరోజ్రాజ్ పురోహిత్ 472 మార్కులతో 40,997, ఎం.డీ.షయాన్ మునీబ్ 433 మార్కులతో 77,202, ఎస్.జాహ్నవి 377మార్కులతో 2,55,757వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి విద్యార్థులను అభినందించారు. న్యూవిజన్కు అత్యుత్తమ ర్యాంక్లు సర్జన్గా సేవలందిస్తా... భవిష్యత్లో మంచి సర్జన్గా పేదలకు సేవ చేయాలనేది నా లక్ష్యం. నీట్లో 626 మార్కులతో ఆలిండియా స్థాయిలో 307వ ర్యాంక్ సాధించా. డాక్టర్స్ మెడికల్ అకాడమీ యజమాన్యం రాయల సతీష్బాబు, భరణికుమార్ సలహాలు, సూచనలతో ఇది సాధ్యమైంది. మా అమ్మ నవ్య గృహిణి కాగా, నాన్న తూము రామకృష్ణ న్యూలైఫ్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. – తూము వెన్నెల, 307వ ర్యాంకు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ -
అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల అధ్యాపకుడు మద్దినేని వెంకటేశ్వరరావుకు డాక్టరేట్ లభించింది. అన్నామలై యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభా గం ప్రొఫెసర్ ఎన్.సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఆయన ‘డైనమిక్ రిసోర్స్ అలకేషన్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావును ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ కాటేపల్లి నవీన్బాబు, ప్రిన్సిపాళ్లు డాక్టర్ బి.గోపాల్, వి.రామారావు, అకడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ, అధ్యాపకులు ఇంజం నరసింహారావు, ఎం.శివకుమార్ అభినందించారు. పెరిగిన పెంకు కార్మికుల వేతనాలు ఇల్లెందురూరల్: పెంకు పరిశ్రమల యజమానులు, తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల మధ్య చర్చలు ఫలప్రదం కావడంతో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కార్మికుల వేతనాలు పెరిగా యి. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా అసి స్టెంట్ లేబర్ ఆఫీసర్ సమక్షంలో ఇరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం.. కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి గత రేట్లపై అదనంగా లోన పనులకు 4శాతం, బయట పనులకు 5శాతం, రోజువారీ కూలీ రేట్లపై అదనంగా రూ.10, గుమస్తాలకు ప్రస్తు త వేతనాలపై అదనంగా నెలకు రూ.400 చొప్పున పెరిగాయి. ఈ ఒప్పందం 2026 జూన్ వరకు కొనసాగేలా ఒప్పందం కుదిరింది. చర్చల్లో తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాంసింగ్, దుర్గాప్రసాద్, లక్ష్మినారాయణ, రంగబాబు, సత్తిబాబు, యజమాను లు సాంబశివరావు, అరవింద్, విక్రమ్రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ శ్రేణులకే ఇందిరమ్మ ఇళ్లు’ నేలకొండపల్లి: రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారడమే కాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ధైర్యం చాలడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడుతూ ఇందిరమ్మ ఇళ్లను ఆ పార్టీ శ్రేణులకే ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని పేర్కొన్నారు. కాగా, 11ఏళ్ల పాటు దేశంలో మోడీ సుస్థిర పాలన అందించారని తెలిపారు. అనంతరం నేలకొండపల్లిలో ఆయన మొక్కలు నాటడంతో పాటు కేంద్రప్రభుత్వ పథకాలతో రూపొందించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటి హనుమంతరావు, పాగర్తి సుధాకర్, షర్పొద్దీన్, మన్నె కృష్ణారావు, భువనాసి దుర్గాప్రసాద్, గోవిందరావు, సూరేపల్లి జ్ఞానరత్నం, కందరబోయిన వెంకటరమణ, తంగెళ్ల సతీష్, కొండా హర్ష తదితరులు పాల్గొన్నారు. బస్సును ఢీకొట్టిన లారీకామేపల్లి: ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటన కామేపల్లి మండలం మర్రిగూడెం స్టేజీ సమీపాన శనివారం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి ఇల్లెందుకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా మర్రిగూడెం స్టేజీ వద్ద ఇల్లెందు వైపు నుంచి వస్తున్న యాష్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయి డ్రైవర్లు తోటా పృథ్వీ, బి.సాయితో పాటు బస్సులో ఉన్న సముద్రాల లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే, మరో పది మంది ప్రయాణీకల్లు గాయయడ్డారు. అయితే, లారీ క్యాబిన్లో డ్రైవర్ సాయి ఇరుక్కుపోగా స్థానికులు ట్రాక్టర్ల సాయంతో ఆయనను బయటకు తీశారు. ఈ ఘటనతో ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోగా కామేపల్లి ఎస్సై సాయికుమార్ చేరుకుని వాహనాలను పక్కకు తప్పించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. -
● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ
నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని కృష్ణవేణి డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. సీహెచ్.రాగ్నై 556మార్కులు, బి.నందిని 505, జి.కావ్య 479, వై.గీతికాశ్రీ 479,జి.అశ్విన్ 467, వి.అనిల్కుమార్ 456, బి.చార్మి 449, ఎస్.గీతశ్రీ 447, జి.హారిణి 441, ఎస్.మాధవన్ 434, సిహెచ్.షేభారాణి 430, ఎస్.దివ్య శ్రీ 424, ఆర్.దుర్గ మహేష్ 418, కె.నిస్సీ అమూల్య 418, బి.వినీత 414, ఎం.హాసిని 413, కె.నవ్య 408, జి.జనని 406, పి.దేవా సుమ హర్షిణి 403, ఎస్.రిషిత 402మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈమేరకు విద్యార్థులను వారు అభినందించారు. ● రెజొనెన్స్ ప్రభంజనం నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావు తెలిపారు. ర్యాంక్లు సాధించిన విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడారు. వైఎస్. రెడ్డి 460వ మార్కులు, ఎన్.రామ్చరణ్ 460, ఎన్.మాల్యాద్రి 444, ఎస్. లావణ్య 442, ఎస్.కే.బీణా 407, ఎన్. అజయ్కుమార్ 372, బి.హరికృష్ణ 330, జి.లావణ్య 325, బి.సిరిచందన 300 మార్కులు సాధించారన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ●● శ్రీచైతన్య విద్యార్థుల సత్తా.. నీట్ పరీక్షలో శ్రీచైతన్య విద్యార్థులు పలువురు జాతీయ స్థాయిలో 267, 541తో వెయ్యి లోపు ర్యాంకులు సాధించారని తెలంగాణ శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. అంతేకాక తమ విద్యార్థులకు 1,229, 2801, 3,104, 3,255, 3,658, 4,175, 4,445, 4481వంటి అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు కాగా, డి.దుర్గా గుజిరి 267, ఎల్.మనోహర్ 541, బి.చందన 1,229, వి.రోహ/త 2,810, భూమిక 3,104, జి.శ్రీనిధి జ్యోతిర్మయి 3,255, డి.శ్రీలేఖ 3,658, డి.జ్వరాజ్పాల్ 4,175, ఎ.లిఖిత 4,445, వి.ప్రియాంక 4,481, బి.రిషిత 5,898 ర్యాంకులు సాధించారని వెల్లడించగా వారిని అభినందించారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారికి శనివారం వైభవంగా సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యాన్నదానానికి విరాళం..భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి విజయవాడకు చెందిన చిన్నబాబు – పుష్పాంజలి దంపతులు శనివారం రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదతరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తిరుమలాయపాలెం: మండలంలోని ఏలువారిగూడెం స్టేజీ సమీపాన శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బీరోలుకు చెందిన ఎస్.కే.మహ్మద్ కుమారుడు మోహిన్(24) తన స్నేహితుడు ఎస్.కే.జాకీర్తో కలిసి మోటార్ సైకిల్పై దమ్మాయిగూడెం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈక్రమాన ఏలువారిగూడెం మూలమలుపు వద్ద తాటి చెట్లకు తగిలి పడిపోయారు. ఈ ఘటనలో మోహిన్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, జాకీర్కు తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం తరలించారు. మోహిన్ హైదరాబాద్లోని హోటల్లో పనిచేస్తూ మూడు రోజుల క్రితమే ఇంటికి వచ్చి ప్రమాదం బారిన పడడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ద్విచక్రవాహనం చోరీకామేపల్లి: మండలం పరిధిలోని పింజరమడుగు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేలోత్ భాస్కర్నాయక్ వాహనం చోరీకి గురైంది. ఆయన శుక్రవారం పంట చేను వద్ద బుల్లెట్ బైక్ నిలిపి, దుక్కి దున్ని వచ్చేసరికి వాహనం కానరాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, బైక్ కవర్లో సుమారు రూ.60 వేల నగదు కూడా ఉందని భాస్కర్ తెలిపారు. -
ప్రజారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
బూర్గంపాడు: ప్రజారోగ్యంపై వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. మోరంపల్లిబంజర పీహెచ్సీని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. ఫార్మసీ గదిని తనిఖీ చేసి మందులను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఆసన్నమైనందున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గర్భిణులను నూరు శాతం నమోదు చేసి వారికి రక్తహీనత లేకుండా మందులు అందించాలని, ఆస్పత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు వారికి ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమాచారం తీసుకోవాలని సూచించారు. ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దూర ప్రాంత గర్భిణులను గుర్తించి వారి డెలివరీ సమయానికి ముందే ముందే ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, డాక్టర్ ఆర్.చైతన్య, ప్రసాద్, మధువరన్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. -
రామాలయంలోకి దూసుకెళ్లిన లారీ
పెనుబల్లి: ఓ లారీ అదుపుతప్పి మండలంలోని లంకపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రామాలయంలోకి దూసుకెళ్లిన ఘటన శనివారం రాత్రి జరిగింది. సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆలయంలో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో రామాలయం దెబ్బతినగా, లారీ డ్రైవర్ శ్యామ్సింగ్, క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. దీంతో పోలీసులు చేరుకుని లారీ క్యాబిన్లో వారిద్దరిని బయటకు తీసి 108లో పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో ఆలయంలో నిద్రిస్తున్న దివ్యాంగుడైన ఓ వ్యక్తికి సైతం గాయాలయ్యాయని ఎస్సై కె. వెంకటేష్ తెలిపారు. ప్రేమికుల అరెస్ట్.. వర్ధన్నపేట: చైన్స్నాచింగ్ కేసులో ప్రేమికులను వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. వర్ధన్నపేట పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంకు చెందిన రామాయణం హేమలత వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలోని తన అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చింది. ఎదురింట్లో నివాసముండే పెరంబుదూరు సజాత మెడలో బంగారు గొలుసు ఉండగా, చోరీకి నిర్ణయించుకున్న ఆమె తన ప్రియుడైన పిడియాల రాముకు సమాచారం ఇచ్చింది. ఈనెల 11న రాత్రి ఆయన ఊరి చివరి వేచి ఉండగా, హేమలత ఇంటి బయటకు వచ్చిన సుజాత మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పరుగెత్తి ప్రియుడితో కలిసి బైక్పై ఖమ్మం పారిపోయింది. శనివారం ఖమ్మం నుంచి వరంగల్కు వెళ్తుండగా మార్గమధ్యలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. ఈమేరకు పోలీసులు వారిని పట్టుకుని విచారించగా 24 గ్రాముల బంగారు మంగళసూత్రం చోరీ విషయాన్ని ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సురేశ్, రంజిత్, కల్పన, సానియా పర్హాన్, స్వాతి పాల్గొన్నారు. -
రక్తం పంచుతున్న బంధువులు
● రక్తదానంతో ప్రాణదాతలుగా గుర్తింపు ● తలసేమియా బాధితులతో పాటు గర్భిణులకు చేయూత ● రెడ్క్రాస్, సంకల్ప సంస్థల అవగాహనతో ముందుకు.. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఖమ్మంమయూరిసెంటర్: ఓ ప్రాంతం కాదు.. ఒకే ఊరు కాదు.. రక్తం పంచుకుని పుట్టలేదు. కానీ ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలన్న తపనతో రక్తదానం చేస్తున్న పలువురు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ప్రమాదాల్లో గాయపడిన, అత్యవసర చికిత్స చేయించుకుంటున్న వారి కోసం కబురు అందితే చాలు వాలిపోయి రక్తం పంచుతున్నారు. మా జీవిత కాలం పెంచండి.. అంటూ కోరే తలసేమియా చిన్నారులు, ప్రసవం కోసం ఆస్పత్రుల్లో చేరిన మహిళల కోసం మేమున్నామంటూ ముందు నిలుస్తున్న పలువురు ఆదర్శంగా నిలుస్తున్నారు. మిత్రులు బృందాలుగా.. రక్తదానం విలువ తెలిసిన జిల్లాలోని పలువురు యువకులు బృందాలుగా ఏర్పడుతున్నారు. పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్, ఎస్బీఐ ఇన్సూరెన్స్ బృందం, యువజన చేయూత(టేకులపల్లి), యువ భారత్ శక్తి(వైబీఎస్), జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్, ఆశ్రయ సేవా సొసైటీ, వీఆర్ విత్ యూ, మిసైల్ మ్యాన్ మ్యాన్ హెల్పింగ్ హ్యాండ్స్(ఎంఎంహెచ్హెచ్), బత్తినేని చారిటబుల్ ట్రస్ట్, జనసేన అభిమానులు, కొత్తగూడెం బ్లడ్ డోనర్స్ ఇలా పలు గ్రూప్ల సభ్యులు క్రమం తప్పకుండా మూడు నెలలకోసారి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక పోలీస్ శాఖ సైతం తలసేమియా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ అభినందనలు అందుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో 300 మందికి పైగా తలసేమియా చిన్నారులు నిశ్చింతగా ఉండడానికి రక్తదాతల సహకారమే కారణమని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు చెబుతున్నారు. అంతేకాక రెడ్ క్రాస్ సొసైటీ కూడా రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహిస్తోంది. మూడునెలలకు ఒకసారి.. రక్తం అవసరమైన వారికి చేయూతనిచ్చేలా రక్తదాతలు స్నేహితులతో కలిసి వాట్సప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్ల్లో రక్తం కావాలనే అందితే నేరుగా ఆస్పత్రులకు వెళ్తున్నారు. అంతేకాక దాతలు ప్రతీ మూడు నెలలకోసారి బ్లడ్బ్యాంక్లకు వెళ్లి రక్తదానం చేయడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. వీరిని చూసి మరికొందరు రక్తదాతలు ముందుకొస్తుండడం విశేషం. కాగా, తలసేమియా చిన్నారులను ఆదుకునేందుకు 2009లో ఖమ్మంలో హోంగార్డు ప్రొద్దుటూరి రవిచంద్ర – కండక్టర్ పి.అనిత కుటుంబం ‘సంకల్ప’ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. చిన్నారులకు రక్తం ఆవశ్యకతను వివరిస్తుండడంతో దాతలు ముందుకొచ్చారు. ఇదేసమయాన తలసేమియా చిన్నారుల సంఖ్య పదుల సంఖ్య నుండి వందలకు చేరడంతో ఈ చిన్నారులకే కాక ప్రాణాప్రాయ స్థితిలోఉన్న వారికి రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహిస్తున్నారు.తలసేమియా చిన్నారులు నిశ్చింతగా.. వేలాది మంది రక్తదాతల సహకారంతోనే తలసేమియా చిన్నారులు నిశ్చింతగా జీవిస్తున్నారు. రక్తం అవసరముందని సమాచారం ఇస్తే చాలు పలువురు ముందుకొస్తున్నారు. వేసవిలోనూ చిన్నారులు ఇబ్బంది పడలేదంటే దాతల చేయూతే కారణం. – ప్రొద్దుటూరి రవిచందర్, సంకల్ప సంస్థ -
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో సహకార శాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యలపై అధికారులు జారీ చేసిన ఆర్డర్లపై అభ్యంతరం ఉంటే అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. గతంలో సివిల్ కోర్టుల ద్వారా మాత్రమే లభించే పరిష్కారం కొత్త చట్టంతో రెవెన్యూ వ్యవస్థ వద్ద లభిస్తుందని చెప్పారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారించి మ్యుటేషన్ చేస్తారని తెలిపారు. అనంతరం చట్టంపై పలువురి సందేహాలను అదనపు కలెక్టర్ నివృత్తి చేశారు. డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకట్ఆదిత్య, వరంగల్ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ రాజయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఎండీ.అన్వర్, కె.కిషోర్తో పాటు పీఏసీఎస్ల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
గిరిప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఖమ్మంమామిళ్లగూడెం: వచ్చే నెల 10న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఖమ్మం రీజియన్లోని మణుగూరు, సత్తుపల్లి, ఖమ్మం డిపోల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. జూలై 8న సాయంత్రం 7 గంటలకు ఖమ్మం నుంచి, మణుగూరు నుంచి 6 గంటలకు, సత్తుపల్లి నుంచి 7 గంటలకు బయలుదేరే బస్సులు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత 9వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటాయని తెలిపారు. అలాగే, 10వ తేదీన గిరిప్రదక్షిణ, అరుణాచలేశ్వరుడి దర్శనం అనంతరం మధ్యాహ్నం బయలుదేరే బస్సులు 11వ తేదీన ఉదయం డిపోలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఖమ్మం, సత్తుపల్లి నుంచి పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.2,500, మణుగూరు నుంచి పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.2,750 చార్జీగా నిర్ణయించినట్లు ఆర్ఎం తెలిపారు. ఇతర వివరాలు, రిజర్వేషన్ కోసం మణుగూరు డిపో మేనేజర్ (99592 25963), సత్తుపల్లి డీఎం 99592 25962, ఖమ్మం డీఎం 99592 25958 నంబర్లలో సంప్రదించాలని ఆర్ఎం సూచించారు. -
ఐఐటీకి చేరిన గిరిజన విద్యార్థులు
రఘునాథపాలెం: మారుమూల గిరిజన ప్రాంతాల నిరుపేద విద్యార్థులు గురుకులాల్లో చదుతూ తమ ప్రతిభ ద్వారా దేశంలోని ప్రఖ్యాత ఐఐటీల్లో సీట్లు సాధించడం అభినందనీయమని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. రఘునాథపాలెం గిరిజన గురుకు ల ప్రతిభా కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ఐఐటీలు, నిట్ల్లో సీట్లు సాధించగా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం వారిని సన్మానించారు. ఈసందర్భంగా పీఓ మాట్లాడుతూ గురుకులాల్లో ఉన్న వసతులకు తోడు విద్యార్థుల కష్టం, అధ్యాపకుల కృషితో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. కాగా, ఐఐటీలు, నిట్ల్లో సాధించిన కె.మన్యం, పి.ప్రశాంత్, పి.విఘ్నేశ్వర్, డి.చరణ్, ఆర్.సందీప్, ఎం.రాంచరణ్, ఆర్.భాను కుమార్, ఎం.ప్రకాశ్రాజ్, ఎం.గణేష్, బి.సిద్ధు, బి.వాసుని సన్మానించిన పీఓ భవిష్యత్లో మరింతగా రాణించాలని సూచించారు. గరుకులాల ఆర్సీఓ అరుణకుమారి, కళాశాల ప్రిన్సిపాల్ మల్లెల బాలస్వామి, వైస్ ప్రిన్సిపాళ్లు మిట్టపల్లి నరసింహారావు, మాలోత్ శ్రీనివాస్, అధ్యాపకులు శివశంకరాచారి, సత్యనారాయణ, హరీష్, రమేష్, వెంకట్రెడ్డి, ప్రవీణ్, రమ్య, ఏసోబు పాల్గొన్నారు.సన్మానించిన ఐటీడీఏ పీఓ రాహుల్ -
సివిల్స్ అభ్యర్థులకు లాంగ్ టర్మ్ శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్–2026 కోసం లాంగ్ టర్మ్ శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు జూలై 7న నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి, జూలై 25 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు హైదరాబాద్ లక్ష్మీనగర్లోని బీసీ స్టడీసర్కిల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం 150మందికి శిక్షణ ఇవ్వనుండగా 100మందిని ఆన్లైన్ టెస్ట్ ద్వారా, ఇంకో 50మంది గతంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 16 నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు ‘టీజీ బీసీ స్టడీసర్కిల్, రోడ్డు నంబర్ 8, లక్ష్మీనగర్కాలనీ, సైదాబాద్, హైదరాబాద్’లో దరఖాస్తులు అందజేయాలని డైరెక్టర్ సూచించారు. డైట్లో అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఖమ్మం సహకారనగర్: ఖమ్మం డైట్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ తెలిపారు. వివిధ సబ్జెక్టుల బోధనకు ఎనిమిది మంది నియమించనుండగా, ఆయా సబ్జెక్టులో 50శాతం కనీస మార్కులతో ఉత్తీర్ణులైన వారు గెస్ట్ ఫ్యాకల్టీగా అర్హులని వెల్లడించారు. 65ఏళ్లలోపు వయస్సు కలిగిన రిటైర్డ్ అధ్యాపకులతో పాటు ఇతరులకు అవకాశముండగా, ఎంఈడీ అభ్యర్థులు లేని పక్షంలో బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న వారు ఈనెల 19వ తేదీ లోగా టేకులపల్లిలోని డైట్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపాల్ సూచించారు. 16 నుంచి లాం ఫామ్లో మిరప విత్తనాల విక్రయం ఖమ్మంవ్యవసాయం: ఏపీలోని గుంటూరు లాం ఫామ్ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ఈనెల 16వ తేదీ నుంచి ఎల్సీఏ 625, ఎల్సీఏ 657, ఎల్సీఏ 643 మిరప ఫౌండేషన్ విత్తనాలను రైతులకు విక్రయించనున్నారు. ఈ విషయాన్ని ఫామ్ అసోసియేట్ డైరెక్టర్ పి.వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం మినహా ప్రతిరోజు ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైతులకు నేరుగా విత్తనాలు విక్రయిస్తామని పేర్కొన్నారు. కిలో విత్తన ధర రూ.1,200గా నిర్ణయించామని, వివరాలకు 99898 09554, 94405 92982 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. 13 మందికి సెల్ఫోన్లు అప్పగింత ఖమ్మంక్రైం: వివిధ ప్రాంతాల్లో 13 మంది సెల్ఫోన్లు పోగొట్టుకోగా, సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజస్టర్ పోర్టల్) ద్వారా గుర్తించిన పోలీసులు తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులకు శుక్రవారం ఫోన్లు అందజేసిన అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు మాట్లాడారు. వీటి విలువ రూ.4లక్షలు ఉండగా, సీఈఐఆర్ ద్వారా ఇప్పటివరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 2,276 ఫోన్లను ట్రాక్ చేశామని తెలిపారు. ఫోన్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన ఐటీ సెల్ ఎస్సై సత్యనారాయణ, ఉద్యోగులను సీపీ, అడిషనల్ డీసీపీ అభినందించారు. సోనో విజన్లో లక్కీ డ్రా ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని సోనోవిజన్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేసిన వారి నుంచి శుక్రవారం లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. అనంతరం రోటరీనగర్లోని సోనోవిజన్ షోరూంలో విజేతలకు బహుమతులు అందించారు. ఎల్జీ కంపెనీ చాంపియన్ ప్రీమియర్ లీగ్ పేరిట నిర్వహించిన లక్కీ డ్రా లో వాషింగ్ మిషన్ కొనుగోలు చేసిన రవికుమార్ రూ.40 వేల విలువైన రిఫ్రిజిరేటర్, ఏసీ కొనుగోలు చేసిన నాగయ్య రూ.40 వేల విలువ చేసే వాషింగ్ మిషన్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ మార్కెటింగ్ మేనేజర్ కిరణ్, ఏఎస్ఎం రవి, సోనోవిజన్ మేనేజర్లు రాంబాబు, రవికుమార్, కల్యాణ్ పాల్గొన్నారు. -
కళాశాలలో ప్రవేశాలు పెరగాలి
తిరుమలాయపాలెం: పిండిప్రోలు ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెరిగేలా అధ్యాపకులు విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అఽధికారి రవిబాబు సూచించారు. కళాశాలకు శుక్రవారం వచ్చిన ఆయన బోధన, గత ఏడాది ఫలితాలపై ఆరా తీశాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. కాలేజీలో ఉచిత విద్య, పుస్తకాలు, స్కాలర్షిప్ అందుతున్నాయనే అంశాన్ని తల్లిదండ్రులకు వివరించి పిల్లలను చేర్పించేలా చూడాలని తెలిపారు. అనంతరం తాయన విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే టీబీ నియంత్రణ
వైరా: టీబీ సోకడానికి కారణాలు, చికిత్సపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలో శుక్రవారం నిర్వహించిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ సమావేశంలో వారు మాట్లాడారు. 60ఏళ్లు పైబడిన వారే కాక షుగర్, హెచ్ఐవీ, కేన్సర్ బాధితులు టీబీ పరీక్ష చేయించుకోవాలన్నారు. అనంతరం పలువురు గ్రామస్తులను పరీక్షించి అవసరమైన వారికి ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేశారు. వైద్యులు శ్రీహర్ష, మారె బాబు, ఉద్యోగులు ఇమామ్, తార, శివ, శ్రీలత పాల్గొన్నారు. -
బాత్రూమ్లో జారిపడి ఉపాధ్యాయుడు మృతి
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు బాత్రూమ్లో జారి పడడంతో మృతి చెందాడు. ఖమ్మం జిల్లా మద్దులపల్లికి చెందిన నల్లగొండ రాజేంద్ర ప్రసాద్(55) పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో మూడేళ్ల నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం బడిబాట కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో క్వార్టర్స్లోనే ఉండాలని సహచరులు చెప్పి బయలుదేరారు. ఆతర్వాత హాస్టల్ ఉద్యోగులు రాజేంద్రప్రసాద్ కోసం భోజనం తీసుకురాగా బాత్రూమ్కు వెళ్లొచ్చాక తింటానని చెప్పాడు. అయితే, చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో సిబ్బంది తలుపు తెరిచి చూడగా కింద పడి ఉన్నాడు. దీంతో పేరూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఏటూరునాగారం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన బాత్రూమ్లో పడడంతో అపస్మారక స్థితికి చేరి మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. రాజేంద్రప్రసాద్కు భార్య ప్రమీలరాణి, కుమారుడు రామ్కుమార్, కుమార్తె స్రవంతి ఉండగా, కుమారుడు తండ్రి మృతదేహం పడి రోదించడం కలిచివేసింది. -
●ఈ తిప్పలు ఎన్నాళ్లు..
ఒకే గది, 55 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు... ఇదీ ఖమ్మం 57వ డివిజన్లోని దివ్యాంగుల కాలనీ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. మొత్తం 55మందిలో 30మందికి పైగా విద్యార్థులు హాజరవుతుండగా ఒకేగదిలో 1నుంచి 5వ తరగతి వరకు బోధించడం ఇబ్బందిగా మారింది. ఇటీవల అధికారులు పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పినా నిర్మాణం జరిగే వరకు అద్దె భవనమైనా సమకూర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
పులిసిపోయిన చట్నీ, అధిక ధరలు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ అధికారులు హోటళ్లలో తనిఖీ చేస్తూ ఆహార కల్తీ, అపరిశుభ్ర వాతావరణంపై జరిమానా విధిస్తున్నా ఖమ్మంలోని కొందరి తీరు మారడం లేదు. ఈనేపథ్యాన కొత్త బస్టాండ్లోని ఫుడ్ కోర్టు, దుకాణాల్లో వాటర్ బాటిళ్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో పాటు వంటశాలలు అధ్వానంగా మారా యని పలువురు కేఎంసీ కంట్రోల్ రూమ్కు ఫోన్ ద్వారాఫిర్యాదు చేశారు. దీంతో శానిటేషన్ సూపర్వైజర్ సాంబయ్య, ఉద్యోగులు శుక్రవారం ఫుడ్కోర్టులో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్లో పరిశీలించగా పులిసిపోయిన చట్నీ, దోసల పిండికి తోడు అపరిశుభ్రతను చూసి చట్నీని పడబోయించారు. కాగా, వినియోగదారులు కేఎంసీ అధికారులకు సమస్యలు వివరిస్తుండగా హోటల్, దుకా ణాల నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఫుడ్కోర్టులో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తుండడంతో కేఎంసీ అధికారులు రూ.2వేల జరిమానా విధించారు. అయితే, కేఎంసీ అధికారులు తనిఖీ చేయడంపై తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆర్టీసీ ఉద్యోగి ఒకరు ప్రశ్నించడం గమనార్హం.బస్టాండ్లోని ఫుడ్కోర్టులో తనిఖీ, జరిమానా -
పదవుల టెన్షన్..
‘హస్త’వాసి పెరిగినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అత్యధిక సీట్లు గెలవడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది మంది, పొత్తులో భాగంగా మరో స్థానంలో సీపీఐ అభ్యర్థి గెలిచారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ఉమ్మడి జిల్లా తగిన బలాన్ని ఇచ్చినా ఆ స్థాయిలో పదవులు రాలేదన్న చర్చ ముఖ్య నేతల్లో జరుగుతోంది. ఒకటి, రెండు ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయన్న ప్రచారం తొలి నాళ్లల్లో ప్రచారం జరిగినా ఆశపడిన నేతలకు నామినేటెడ్ పదవులతో సరిపెట్టారు. ఇంకా డజన్ మందికి పైగా నామినేటెడ్ పదవులను ఆశిస్తుండగా, ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గంలో కొందరికి స్థానం దక్కింది. దీంతో ఆశావహుల సంఖ్య తగ్గినప్పటికీ తమకు అనుకున్న పదవులు రావడం లేదనే అంతర్మథనంలో పలువురు ఉన్నారు. ఆ పదవులు పెండింగ్లోనే.. చిన్నాచితక నామినేటెడ్ పదవులు కూడా ప్రకటించక ఆశావహుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలోని వైరా, ఏన్కూరు మార్కెట్ కమిటీలను ప్రకటించకపోగా, ఏన్కూరు మార్కెట్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో సందిగ్ధత వీడడం లేదు. ఇక జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ప్రముఖ ఆలయ కమిటీల కోసం పలువురు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నా భర్తీపై జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉండగా త్వరలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో అప్పటి వరకై నా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారా, లేదా అని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘నామినేటెడ్’ ఆశావహుల్లో ఆందోళన కుర్చీ లేక ముఖ్య నేతల్లో నైరాశ్యం పార్టీ పదవులతోనే సరిపెడుతున్న అధిష్టానం ముగ్గురు మంత్రుల ఆశీస్సుల కోసం నాయకుల హైరానాఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవుల టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా తమ సేవలకు గుర్తింపు లేదనే నైరాశ్యం అలుముకుంటోంది. ‘అధికారంలో లేకపోయినా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా మాకు గుర్తింపు లభిండం లేదు’ అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్న వారికి రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు కేటాయిస్తున్నా ఇంకొందరు ఆశ వదులుకోలేక జిల్లా మంత్రుల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వస్తాయని అటు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇటు జిల్లా మంత్రులు చెబుతుండగా ఇది జరిగేది ఎన్నడోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంసుడా.. పీఠం ఎవరికి? ఉమ్మడి జిల్లాలో సుడా(స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని నామినేటెడ్ పదవుల్లో కీలకంగా భావిస్తారు. గతంలో ఖమ్మం కార్పొరేషన్ వరకే దీని పరిధి ఉండగా ఇప్పుడు ఐదు నియోజకవర్గాలకు విస్తరించడంతో రాజకీ య ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలోని రియల్ ఎస్జేట్ అంతా ‘సుడా’ పరిధిలోనే జరగనుండడం, అనుమతులు కీలకం కావడంతో పదవి దక్కించుకుంటే ఆర్థిక వనరులు సమకూరుతాయనే ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాలు సుడా పరిధిలోనే ఉండగా.. పదవులు ఆశిస్తున్న నేతలు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఎవరికి పదవి దక్కుతుందోనన్న సస్పెన్స్ మాత్రం వీడడం లేదు. -
వార్షిక రుణప్రణాళిక.. రూ.16వేల కోట్లు
● వ్యవసాయ రంగానికి అత్యధిక కేటాయింపులు ● మొత్తం రుణాల్లో రూ.50.94శాతం ఈ రంగానికే.. ● 4.98లక్షల మందికి ప్రయోజనం కలిగేలా రూపకల్పనఖమ్మంవ్యవసాయం: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. రూ.16,185.12 కోట్లతో రూపొందించిన ప్రణాళిక ను జిల్లా లీడ్ బ్యాంకు శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 4,98,651 మంది బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇవ్వనుండగా.. 50.94 శాతం రుణాలను వ్యవసాయ అవసరాలకు కేటాయించారు. అలాగే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విద్య, గృహ, సామాజిక, పునరుత్పాదక శక్తి తదితర రంగా లకే కాక ప్రాధాన్యేతర రంగాలకు ప్రణాళికలో ప్రాధాన్యత కల్పించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎప్పటి మాదిరిగానే ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాలో పెద్దసంఖ్యలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున మొత్తం రుణాల్లో 50.94 శాతం ఈ రంగానికి కేటాయించారు. మొత్తం 4,22,519 మంది వ్యవసాయ, అనుబంధ రైతులకు రూ. 8,244.72 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధుల నుంచి రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానం ద్వారా బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. పారిశ్రామిక, ఇతర రంగాలకు... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 2,968.30 కోట్లు కేటాయించారు. ఇందులో సూక్ష్మ పరిశ్రమలకు ప్రాధాన్యతగా రూ. 1,813.60 కోట్లు, చిన్న పరిశ్రమల స్థాపనకు రూ.908.60 కోట్లు, మధ్య తరహా పరిశ్రమలకు రూ.246.10 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మొత్తం 22,428 మందికి లబ్ధి జరగనుంది. ఇక విద్య, గృహ, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, ఇతర రంగాల్లో 3,320 మందికి ప్రయోజనం కలిగేలా రూ.289.30 కోట్లు కేటాయించారు. ఇందులో విద్యా రంగానికి రూ.97 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.63.40 కోట్లు కేటాయించగా, ప్రాధాన్యేతర రంగాల్లో 50,384 మందికి ప్రయోజనం కలిగే విధంగా రూ.4,682.80 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళికలో పొందుపరిచారు.ప్రాధాన్యతల ఆధారంగా కేటాయింపులు జిల్లాలో రుణాలకు సంబంధించి ప్రాధాన్యత రంగాల వారీగా ప్రణాళిక రూపొందించాం. జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ రూపొందించిన ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకున్నాం. జిల్లాలో ప్రధాన రంగం వ్యవసాయమే కావడంతో 50 శాతానికి పైగా నిధులను కేటాయించాం. వివిధ రంగాల అభివృద్ధి, తద్వారా జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళిక అమలుచేస్తాం. – ఏ.శ్రీనివాసరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ -
అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
● ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావురఘునాథపాలెం: అభివృద్ధి విషయంలో ఖమ్మం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తోందని చెప్పారు. రఘునాథపాలెం మండలంలోని కోయచలక, రేగులచలకల్లో శుక్రవారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి రూ.100 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. వానాకాలం సీజన్లో రైతులు వరినాట్లు వేయకముందే వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు. కాగా, గ్రామాల్లో రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించడమే కాక అనారోగ్యం దరి చేరకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. తొలుత కోయచలక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందజేసిన మంత్రి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఏఓ డి.పుల్లయ్య, ఆర్డీఓ నరసింహారావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ఎంఈఓ రాములు, హెచ్ఎం శిరీష, పీఆర్ డీఈ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్కుమార్తో పాటు చెరుకూరి పూర్ణ, యండపల్లి సత్యం, అన్నం భూషయ్య, రాంప్రసాద్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వాంకుడోత్ దీపక్, మాధంశెట్టి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.కష్టపడిన వారికే పదవులు పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పక పదవులు లభిస్తాయని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ రఘునాథపాలెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం బాలాపేటలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. ప్రతీ కార్యకర్త పార్టీకి అండగా నిలిస్తే నిరుత్సాహానికి గురిచేయకుండా పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే స్థాయికి చేరుస్తామని, తద్వారా తనకు కూడా గౌరవం దక్కుతుందని తెలిపారు. రఘునాథపాలెం మండల అభివృద్ధికి ఇప్పటికే రూ.500 కోట్లకు నిధులు తెచ్చినందున మిగతా పదవీకాలంలో మరిన్ని నిధులు సాధిస్తానని చెప్పారు. కాగా, పలు గ్రామాల నాయకులు ఈ సమావేశంలో మాట్లాడుతూ తమకు పార్టీలో తగిన గుర్తింపులేదని, కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోగా నాయకులు అందరినీ కలుపుకోవడం లేదని, మైనార్టీలకు పార్టీ పదవుల్లో అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈసమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రాయల నాగేశ్వరరావు, మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లుతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్రెడ్డి, వాంకుడోత్ దీపక్, తాతా రఘురాం, చెరుకూరి పూర్ణ, దేవ్సింగ్, రామూర్తి, యండపల్లి సత్యం, రెంటాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి తుమ్మల బైక్పై బాలసాని లక్ష్మీనారాయణను ఎక్కించుకుని నడపగా.. బైక్ నిలిపే సమయాన అదుపు తప్పుతుండడంతో నాయకులు స్పందించగా ప్రమాదం తప్పింది. -
విద్యార్థులకు సీట్ల కేటాయింపు
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఎంపిక చేసిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో మొదటి విడతగా పలువురు విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఆయా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీట్లు కేటాయిస్తూ ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ శుక్రవారం లేఖలు అందజేశారు. మొదటి దశలో 94 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. శుక్రవారం 64 మంది హాజరుకావడంతో సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీట్లు కేటాయించారు. మిగతా విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సోమవారం తమ కార్యాలయంలో హాజరు కావాలని డీడీ సత్యనారాయణ సూచించారు.నేడు ‘విత్తన’ ముసాయిదా కమిటీ సమావేశం ఖమ్మంవ్యవసాయం: విత్తన చట్టం ముసాయిదా కమిటీ సమావేశాన్ని శనివా రం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 10గంటలకు కలెక్టరేట్లో ఈ సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయాధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, కేవీకేలు, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ది సంస్థ అధికారులతో పాటు విత్తన డీలర్ల అసోసియేషన్ బాధ్యులు, పలువురు ఆదర్శ రైతులు పాల్గొంటారని డీఏఓ తెలిపారు. -
కలెక్టర్గా అనుదీప్ బాధ్యతల స్వీకరణ
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలువురు ఐఏఎస్లను బదిలీ చేయగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్గా నియమించారు. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి అనుదీప్కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, డీఆర్వో పద్మశ్రీ, ఆర్డీఓ నర్సింహారావు, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రితో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.రూ.50 లక్షలతో భవిత కేంద్రాల ఆధునికీకరణ ● జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు 59నేలకొండపల్లి: జిల్లాలోని భవిత కేంద్రాల ఆధునికీకరణ కోసం నిధులు కేటాయించినట్లు విద్యాశాఖ సీఎంఓ వై.రాజశేఖర్ తెలిపారు. మండలంలోని మండ్రాజుపల్లి, నేలకొండపల్లి, బోదులబండ ప్రభుత్వ పాఠశాలలు, సింగారెడ్డిపాలెంలోని భవిత కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల ప్రగతి, బడిబాటపై ఉపాధ్యాయులతో చర్చించాక మాట్లాడారు. జిల్లాలో 22 భవిత కేంద్రాలు ఉండగా, పక్కా భవనాల ఉన్నచోట మరమ్మతులు, సౌకర్యాల కల్పకు రూ.50 లక్షలు కేటాయించడమే కాక దివ్యాంగుల రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఐఈఆర్పీలు, ఫిజియోథెరపిస్ట్లను నియమించనున్నామని వెల్లడించారు. కాగా, జిల్లాలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి చేరని పాఠశాలలు 59 ఉండగా, వీటిలో కనీసం పది పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు కార్యాచరణ రూపొందించామని సీఎంఓ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్ఎం తొర్తి గురవయ్య పాల్గొన్నారు. -
నేడు జాతీయ లోక్అదాలత్
ఖమ్మంలీగల్: జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధా న న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు న్యాయ సేవా సదన్లో లోక్ అదాలత్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం పలు బెంచ్లను ఏర్పాటు చేయడమే కాక కక్షిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ‘ఫాల్ట్ ప్యాసేజ్’ ఇండికేటర్ల ఏర్పాటు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని విద్యుత్ ఫీడర్లపై ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల(ఎఫ్పీఐఎల్ఎస్) ఏర్పాటు పనుల్లో అధికారులు వేగం పెంచారు. ప్రకృతి వైపరీత్యాలు, ఈదురుగాలుల సమయాన విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండగా, నిర్ధిష్టమైన ప్రాంతాన్ని గుర్తించి సరిచేసేందుకు సమయం పడుతోంది. ఈనేపథ్యాన కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఎఫ్పీఐఎల్ఎస్ ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాలోని 33 కేవీ 18 ఫీడర్లపై 78 చోట్ల, 11 కేవీ 37 ఫీడర్లపై 170 చోట్ల ఏర్పాటుచేయనుండగా, ఇప్పటికే పలు చోట్ల బిగించామని ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. త్వరలోనే మిగతా చోట్ల అమరుస్తామని వెల్లడించారు.