breaking news
Khammam District News
-
రాత్రయితే.. రచ్చరచ్చ
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో రౌడీమూకల ఆగడాలు ● ఓ పక్క చోరీలు, ఇంకోపక్క అల్లర్లతో జనం ఆందోళన ● పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని వినతులుఖమ్మంక్రైం: జిల్లావ్యాప్తంగా కొంతకాలంగా అల్లరిమూకలు శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఓ పక్క చోరీలు సర్వసాధారణం కాగా.. రౌడీమూకలు, గంజాయి సేవిస్తూ అల్లర్లకు పాల్పడుతున్న వారి కారణంగా జనం బెంబేలెత్తిపోతున్నారు. రాత్రయితే చాలు గంజాయి సేవించి ఆ మత్తులో 24గంటల తెరిచే ఉండే బెల్ట్షాప్లకు వస్తున్న వారు చేసే గొడవలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసు పెట్రోలింగ్ నామమాత్రంగా సాగుతుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. దొంగల విజృంభణ ఇటీవల జరుగుతున్న చోరీలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పాత నేరస్తులే కాక ఇతర ప్రాంతాలకు నుంచి ముఠాలు వచ్చినట్లు తెలుస్తుండగా.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా రాత్రింబవళ్లు దోచుకోంటున్నారు. ఖమ్మం శివారు గొల్లగూడెం, మధురానగర్ ప్రాంతాలో ఇటీవల ముసుగు ధరించిన వ్యక్తులు తిరుగుతున్న సీసీ పుటేజీలు వైరల్గా మారాయి. అలాగే, సత్తుపల్లిలోని సింగరేణి క్వార్టర్స్లో దొంగలు చొరబడ్డారు. గతంలోనూ క్వార్టర్స్లో చోరీ జరిగినా పోలీస్ నిఘా ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో రెక్కీ చేసి మరీ చోరీలకు పాల్పడే ముఠాల సంచారంపైనా పోలీసు నిఘా లేదని తెలుస్తోంది. నడిరోడ్డుపై గొడవలు జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాలలో అసాంఘిక శక్తులు మద్యం, గంజాయి మత్తులో ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్డుపై బైఠాయించి వాహనాలను ఆపుతూ తమనెవరూ ఏమీ చేయలేరని, తమ వెనుక నాయకులు ఉన్నారంటూ ప్రజలను బెదిరిస్తున్నారు. గంజాయితోపాటు మద్యం మత్తులో ఉన్న వీరిని ఏమీ చేయలేక స్థానికులు వణికిపోతున్నారు. గత మంగళవారం రాత్రి గోపాలపురం ప్రధాన రహదారిపై వైఎస్సాఆర్ నగర్కు చెందిన కొందరు ఆకతాయిలు గంజాయి, మద్యం మత్తులో నానా బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో పోలీసు సిబ్బంది వచ్చినా తమనెవరూ ఏమీ చేయలేరని, అధికార పార్టీ నాయకులు తమకు ఉన్నారని గట్టిగా కేకలు వేయడం గమనార్హం. అయితే వైఎస్సార్ నగర్ ప్రాంతంలో చాలా కాలంగా ఆకతాయిలు ఆగడాలు పెచ్చుమీరినట్లు తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు మొక్కుబడిగా మందలించి వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసు నిఘా ఎక్కడ? కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా పోలీస్ తగ్గిందని తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఆకతాయిలు పుట్టిన రోజు, ఇతర వేడుకలను రోడ్లుపైనే నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా ఇతర పట్టణాల శివార్లలో తెల్లవారు మద్యం సేవిస్తూ దాబాల వద్ద సైతం వీరంగం చేస్తున్నారని సమాచారం. ఇదంతా పోలీసుల దృష్టిలో ఉన్నా పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా పోలీసులు నిఘా పెంచి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
52మంది కమీషన్దారులకు లైసెన్సులు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొత్తగా 52 మంది కమీషన్దారులకు శుక్రవారం లైసెన్సులు అందజేశారు. ఉమ్మడిగా వ్యాపారాలు చేసేవారు, వారసత్వంగా వ్యాపారం చేస్తున్న వారి వినతితో కొత్త లైసెన్సులు జారీ చేశారు. ఈమేరకు మార్కెట్ చైర్మన్, వైస్చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ వారికి లైసెన్సులు అందజేశారు. వ్యాపార వర్గాల ప్రతినిధులు దిరిశాల వెంకటేశ్వరరావు, ముత్యం ఉప్పల్రావు పాల్గొన్నారు. ఏఐఎఫ్టీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రసాద్సత్తుపల్లి: అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్టీఓ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్తుపల్లికి చెందిన చిత్తలూరి ప్రసాద్ నియమితులయ్యారు. ఈమేరకు సంఘం ప్రధాన కార్యదర్శి సీఎల్.రోజ్ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి సమక్షాన ఆయనకు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్లం దామోదర్రెడ్డి ఉత్తర్వులు అందించారు. సహకార సంఘాల పదవీకాలం పెంపుపై హర్షంఖమ్మంవ్యవసాయం: పీఏసీఎస్లు, డీసీసీబీ పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించడంపై ఆయా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఖమ్మం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఆశయ సాధనకు పునరంకితం
ఖమ్మం సహకారనగర్: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకాంక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాలు ఆవిష్కరించి మాట్లాడారు. వీరుల త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చినందున సమరయోధులను స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డి, డీఈ మహేష్బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే పరమావధి ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా అధికారులు కలిసికట్టుగా పని చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపిన అధికారులు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవంలో కలెక్టర్ అనుదీప్ -
ఆంజనేయస్వామికి రూ.1.63లక్షల విలువైన ఆభరణాలు
ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడుకు చెందిన ఎన్ఆర్ఐ కర్నాటి శంకర్రెడ్డి–కరుణ దంపతులు అంజనాద్రిపై కొలువైన శ్రీఆంజనేయ స్వామి ఆలయానికి రూ.1.63 లక్షల విలువైన వెండి అభయహస్తం, పాదుకలు సమర్పించారు. వీటిని అర్చకులు వేదాంతం రాధాకృష్ణమాచారికి శుక్రవారం అందచేశాక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మాజీ సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ యన్నం పిచ్చిరెడ్డితో పాటు కోనా సత్యనారాయణ గుప్తా, యరమల నర్సింహారెడ్డి, రామ్మోహన్రెడ్డి, జంగా గురునాథరెడ్డి, వేమిరెడ్డి వెంకటరెడ్డి, వేమిరెడ్డి రామిరెడ్డి, వెదురు కృష్ణారెడ్డి, కొండారెడ్డి, నాగిరెడ్డి, శివ నాగరాజు, పత్తి సుబ్బారావు, సాంబయ్య, పండు పాల్గొన్నారు. ●చింతకాని: చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ కోదండ రామాలయానికి యల్లంపల్లి చిన్న అప్పారావు, ప్రమీల దంపతులు రూ.లక్ష విలువైన వెండి కిరీటాన్ని అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నారగాని శ్రీనివాసరావుతో పాటు వెచ్చా మంగపతిరావు, అంబటి వెంకటేశ్వర్లు, ఆలస్యం బస్వయ్య, మద్దినేని వెంకటేశ్వరరావు, అంబటి శాంతయ్య, ముత్తినేని వెంకటేశ్వర్లు, తన్నీరు నర్సింహారావు, కోలేటి పెద్ద బ్రహ్మం, పరిటాల శ్రీను, అర్చకుడు యోగేంద్రాచార్యులు పాల్గొన్నారు. -
ఆర్మీ జవాన్ కుటుంబానికి అండగా నిలుస్తాం..
కారేపల్లి: కాశ్మీర్ లోయలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ జవాన్ అనిల్కుమార్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. కారేపల్లి మండలం సూర్యతండాలో అనిల్ కుటుంబాన్ని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్తో కలిసి శుక్రవారం ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని ఎంపీ తెలిపారు. కాగా, అనిల్ సతీమణి రేణుక బీటెక్ పూర్తిచేయగా ఎనిమిది నెలల కుమారుడు ఉన్నందున ఆదుకోవాలని స్థానికులు కోరారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి కృషి కారేపల్లి రైల్వేస్టేషన్లో వసతులు కల్పించడమే కాక అవసరమైన రైళ్ల హాల్టింగ్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. స్టేషన్ను శుక్రవారం ఆయన పరిశీలించగా కరోనాకు ముందు నడిచిన రైళ్ల పునరుద్ధరణ, ప్యాసింజర్ రైళ్ల హాల్టింగ్పై స్థానికులు విన్నవించారు. దీంతో ఎంపీ సానుకూలంగా స్పందించారు. మార్క్ఫెడ్ మాజీ వైస్చైర్మన్ బొర్రా రాజశేఖర్, నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, అడ్డగోడ ఐలయ్య, సురేందర్ మణియార్, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి టోనీవీరప్రతాప్, బానోతు పద్మావతి, మాలోతు ఈశ్వరీనందరాజ్, హేమలత, మల్లేల నాగేశ్వరరావు, వినోద్, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి -
గుంతను తప్పించబోయి కారు బోల్తా
కొణిజర్ల: రహదారిపై గుంతను తప్పించే కారు బోల్తా పడిన ఘట న కొణిజర్ల మండలం తీగలబంజర సమీపాన శుక్రవారం ఉద యం జరిగింది. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి ఇద్దరు కారులో వెళ్తుండగా తీగలబంజర సమీ పాన రోడ్డుపై భారీ గుంతను తప్పించే క్రమంలో పక్కకు తిప్పగా అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడగా, జేసీబీ సాయంతో స్థానికులు కారును బయటకు తీశారు. అడవి పంది మాంసం స్వాధీనంసత్తుపల్లిరూరల్: అడవి పందిని వేటాడి మాంసం పంచుకుంటుండగా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని యాతాలకుంట గ్రామానికి చెందిన నాగరాజు, నాగార్జున, రామకృష్ణ చేనులో అడవి పందిని కుక్కలు వేటాడడంతో చనిపోయింది. సుమారు ఎనిమిది నెలల వయస్సు ఉన్న అడవి పందిని శుక్రవారం ఇంటికి తీసుకొచ్చిన వారు పోగులు వేస్తున్నారు. ఈ విషయమై అందిన సమాచారంతో ఎఫ్ఎస్ఓ నాగరాజు, బీట్ ఆఫీసర్ కిరణ్ తనిఖీలు చేపట్టి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. -
ఇరువర్గాల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
తిరుమలాయపాలెం: మండలంలోని కాకరవాయిలో శుక్రవారం దుర్గమ్మ జాతర సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలో దుర్గమ్మ జాతర జరుగుతుండగా గ్రామపంచాయతీ సమీపాన ఓ బెల్ట్షాపులో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో జరిగిన గొడవలో వేణు అనే యువకుడికి గాయాలు కాగా ఆయనకు చికిత్స చేయిస్తుండగా మరికొందరు మద్యం సీసాలతో వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధుకు గాయాలయ్యాయి. రజకులు, దళితుల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపు చేశారు. గాయపడిన ఇద్దరి నుంచి ఫిర్యాదు అందిందని ఎస్ఐ జగదీష్ తెలిపారు. సూర్యతండాలో చిన్నారులకు అస్వస్థతరఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని సూర్యతండాలో పది రోజులుగా పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. ఉన్నట్టుండి వరుసగా వాంతులు, విరోచనాల బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు జాటోత్ జయంత్, పవన్శ్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. కాగా, గ్రామంలో పలువురు చిన్నారులు అస్వస్థతకు గురవడానికి తాగునీరు కలుషితమా లేక వాతావరణ మార్పులు కారణమా అన్నది తెలియడం లేదు. వైద్యాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని సూర్యతండా వాసులు కోరుతున్నారు. 15 ఆర్కేఎం 303 – ప్రధాన సెంటర్లో ఘర్షణకు పాల్పడుతున్న ఇరువర్గాలు -
పక్కాగా నిధుల వ్యయం
● జూనియర్ కాలేజీలకు రూ.2.96 కోట్లు ● పనుల పర్యవేక్షణకు ‘అమ్మ ఆదర్శ కమిటీలు’నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కొన్నాళ్ల క్రితం అమ్మ ఆదర్శ కమిటీలను నియమించారు. ఇదే తరహాలో జూనియర్ కాలేజీలకు సైతం కమిటీలను నియమించి పనుల పర్యవేక్షణ అప్పగించారు. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేపట్టే పనులు నాణ్యతగా జరగడమే కాక నిధులు లెక్క పక్కాగా ఉంటుందని భావిస్తున్నారు. వసతుల కల్పన పరిశీలన జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులు నాణ్యతగా జరిగేలా అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఈ కమిటీలు ఉండగా జూనియర్ కాలేజీల్లోనూ అమల్లోకి వచ్చాయి. కాలేజీ ఉన్న ప్రాంత సీ్త్ర శక్తి మహిళా సంఘాల సభ్యులే కాక విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ కమిటీలు నియమిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడమేకాక ఫ్యాన్లు, ల్యాబ్ పరికరాల కొనుగోలు, మరమ్మతు వంటి అత్యవసర పనులను ఈ కమిటీల పర్యవేక్షణలో చేపట్టాల్సి ఉంటుంది. అలాగే, విద్యార్థులంతా హాజరయ్యే అధ్యాపకులకు ఈ కమిటీల సభ్యులు సహకరిస్తారు. 15 కాలేజీలకు రూ.2.96 కోటుల జిల్లాలో 21ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 15 కాలేజీలకు రూ.2.96 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతీ కాలేజీకి కనీసం రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షలు కేటాయించారు. జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, ఏన్కూరు, వైరా, బనిగండ్లపాడు, కారేపల్లి, కామేపల్లి, పిండిప్రోలు, ముదిగొండ, నయాబజార్, ఖమ్మం బాలికల కాలేజీ, శాంతినగర్, నాగులవంచ, బోనకల్ కళాశాలలకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులో చేపట్టే పనులను మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ స్థాయిలో రిసోర్స్ పర్సన్లు పర్యవేక్షిస్తుండగా అదనంగా అమ్మ ఆదర్శ కమిటీలను సైతం నియమించారు. కేటాయించిన నిధుల్లో ఇప్పటికే 25 శాతం మేర విడుదల కాగా.. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలకు మంజూరైన నిధులతో చేపట్టే పనులు నాణ్యతగానే కాగా త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. రెండు నెలల్లో పనులన్నీ పూర్తిచేయాలనేది లక్ష్యం. తద్వారా కళాశాలల్లో సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. నిర్వహణ బాధ్యతలను అమ్మ ఆదర్శ కమిటీలు చూస్తాయి. – కె.రవిబాబు, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి -
వాగు హోరు.. వేట జోరు!
కూసుమంచి మండలం నర్సింహులగూడెం వాగులో చేపలు పడుతున్న స్థానికులుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతుండగా వరదతో పాటే చేపలు కొట్టుకొస్తున్నాయి. దీనికి తోడు శుక్రవారం డ్రై డే కావడంతో మాంసం, చికెన్ దుకాణాలు మూసివేశారు. ఈమేరకు వాగుల వద్ద స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం వద్ద వాగులో చేపలవేటకు పెద్దసంఖ్యలో జనం రావడంతో సందడి నెలకొంది. అలాగే, నేలకొండపల్లి మండలంలోని నేలకొండపల్లి, ముజ్జుగూడెం, అనాసాగారం, నాచేపల్లి, చెరువుమాధారం తదితర గ్రామాల్లోనూ స్థానికులు చేపలు వేటాడారు. చాలామందికి సరిపడా కంటే ఎక్కువ చేపలు లభించడంతో వాగుల వద్దే కిలో రూ.100 చొప్పున విక్రయించారు. – కూసుమంచి / నేలకొండపల్లి -
బంగారు భవిష్యత్..
సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా ఎర్రుపాలెం మండలం రాజులపాలెం, కల్లూరు మండలంలోని చిన్నకోరుకోండిలో 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందిరా సౌరగిరి జలవికాసం ద్వారా జిల్లాలో 550మందికి సోలార్ పంపు సెట్లు సరఫరా చేస్తాం. ఈ పథకం ద్వారా రానున్న మూడేళ్లలో జిల్లాలోని 11,785 మంది రైతులకు చెందిన 27,447 ఎకరాలను అభివృద్ధి చేస్తాం. మోడల్ సోలార్ విలేజ్ స్కీంకు బోనకల్ మండలంలోని 22 గ్రామాలను ఎంపిక చేశాం. అలాగే, మహిళా మార్ట్, 64 సీ్త్ర టీ స్టాళ్లు ఏర్పాటు చేయించాం. ఇసుక రీచ్ల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించాం. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా 80 శాతం సబ్సిడీతో 40 వేల గేదెలు పంపిణీ చేస్తాం. ఏడాదిలోగా జవహర్ ఎత్తిపోతలు మధిర, ఎర్రుపాలెం మండలాల్లో సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించేలా రూ.630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తిచేసి 33 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరి స్తాం. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 3,28,853 ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పిస్తాం. రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయితే 455 ఎకరాల కొత్త ఆయకట్టు, 1,957 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఆధునిక వైద్యం జిల్లా ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలు సమకూర్చడంతో గత ఏడాది 15,040 శస్త్ర చికిత్సలు, 6,658 ప్రసవాలు జరిగాయి. పాలేరు, సత్తుపల్లిలో రూ.25 కోట్ల చొప్పున వ్యయంతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, వైరాలో రూ.37.50 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, జిల్లా ఆస్పపత్రిలో రూ. 23.50 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాలల సదనంలోని 81 మంది పిల్లలకు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆరోగ్యశ్రీ కార్డులు, ఆధార్ కార్డులు అందాయి. పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద రహదారిని అభివృద్ధి చేశాం. జమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అటవీ పార్క్, కాటేజీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఖమ్మం ఖిలా రోప్వే నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. పాలేరు వద్ద పర్యాటకాభివృద్ధికి రూ.16.75 కోట్లకు గాను రూ.5 కోట్లు, నేలకొండపల్లి బౌద్ధస్తూపాల అభివృద్ధి, వసతుల కల్పనకు రూ.5.82 కోట్లలో రూ.2.50కోట్లు, మధిర పెద్ద చెరువు అభివృద్ధికి రూ.10 కోట్లకు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు, కనకగిరి గుట్టలను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేస్తున్నాం.నృత్యం చేస్తున్న చిన్నారి -
నిమజ్జనానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు
ఖమ్మంగాంధీచౌక్/ఖమ్మం రూరల్/కూసుమంచి: వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మున్నేటి పరీ వాహకంలో ప్రకాష్నగర్, పెద్ద తండా వద్ద గణేష్ నిమజ్జన పాయింట్లను అదనపు కలెక్టర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాయింట్ల వద్ద అవసరమైన క్రెయిన్ల ఏర్పాటు, విద్యుత్ లైట్లు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, గజ ఈతగాళ్ల నియామకం, మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తొలుత అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ పరిశీలించారు. వరద ఉధృతి, ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు వెల్లడించగా.. పర్యాటకుల తాకిడి పెరుగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఈలు రత్నకుమారి, మధు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
సమీకృత భవనాలకు లైన్ క్లియర్!
ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండల కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించాలని ఐదేళ్ల క్రితమే నిర్ణయించినా ఎవరికి వారు తమకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలనే పట్టుదలకు పోవడంతో ఎటూ తేలలేదు. బీఆర్ఎస్ హయాంలో ఈ విషయమై ఓ అడుగు ముందుకు పడినా స్థలం ఖరారుపై వివిధ పార్టీల నాయకులు పట్టు వీడకపోవడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తరుణీ హట్లో మండల సమీకృత భవన నిర్మాణాలకు ఖరారు చేశారు. ఇటీవల మంత్రి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అక్కడొకటి.. ఇక్కడొకటి రూరల్ మండలం ఏర్పడిప్పటి నుండి తహసీల్, ఎంపీడీఓ, పోలీస్స్టేషన్లు విసిరేసినట్లుగా అక్కడొక్కటి, ఇక్కడొకటి అన్నట్లు ఉన్నాయి. తహసీల్ ఖమ్మం నగరంలో, ఎంపీడీఓ కార్యాలయం జలగంనగర్లో, పోలీస్స్టేషన్ వరంగల్ క్రాస్ రోడ్డులో కొనసాగుతున్నాయి. ప్రతీ కార్యాలయం మధ్య కిలోమీటర్కు పైగా దూరం ఉండడంతో పనుల కోసం కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో.. మండలంలోని 12 గ్రామాలను కలుపుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటైంది. దీంతో సమీకృత భవనం నిర్మిస్తే అటు మున్సిపల్ కార్యాలయం, ఇటు మండల కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరే అవకాశముంది. సముదాయంలో మున్సిపల్ కార్యాలయం, సమావేశ మందిరం, రెవెన్యూ, విద్యాభవనం, వ్యవసాయ, మత్స్య పరిశ్రమ, ఉద్యానవన, శిశు సంక్షేమం, ఆర్అండ్బీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించాలనే ఆలోచనలకు వచ్చారు. తరుణీ హట్లో నిర్మించే సముదాయం వద్దకు 30అడుగుల రోడ్డు కూడా నిర్మించనున్నారు. జీ ప్లస్ టూ భవనాల నిర్మాణం మున్సిపాలిటీకి సంబంధించిన సమీకృత భవన నిర్మాణానికి గత మే నెలలోనే పరిపాలనాపరమైన అనుమతులు వచ్చాయి. దీంతో రోడ్లు భవనాల శాఖ అధికారులు జీ ప్లస్ టూ విధానంలో భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ భవనంలోనే మండల కార్యాలయాలు కూడా కొలువుదీరనున్నాయి. కార్యాలయాల సముదాయంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేయనున్నారు. అలాగే, పార్కింగ్ సౌకర్యం, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, ప్రతీ ఫ్లోర్లో ప్రజల కోసం వెయిటింగ్ గదులు నిర్మించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే శంకుస్థాపన సమీకృత భవన నిర్మాణాలకు త్వరలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. గతనెల 31న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి తరుణీ హట్లో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే అక్కడి చెట్లను తొలగించి శుభ్రం చేయించారు. అలాగే, నూతన భవనాల నిర్మాణాలకు అడ్డొచ్చే పాత భవనాల తొలగింపునకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుందని సమాచారం. కాగా, అటు మున్సిపాలిటీ, ఇటు మండల కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించనుండడంతో ప్రజల ఇక్కట్లు తీరనున్నాయి.ఐదేళ్ల అనంతరం తరుణీ హట్లో ఖరారు -
‘సంకల్ప’ బలానికి సన్మానం
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ ఖమ్మం డిపోలో కండక్టర్ ఉద్యోగం చేస్తూనే సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా తలసేమియా చిన్నారులకు సేవలందిస్తున్న అప్పికట్ల(ప్రొద్దటూరి) అనితను సంస్థ ఎండీ వీ.సీ.సజ్జనార్ సత్కరించారు. హైదరాబాద్లోని బస్భవన్లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉద్యోగులను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అందులో భాగంగా అనిత, ఆమె భర్త ప్రొద్దుటూరి రవిచంద్ర, వారి కుమార్తెలను ఎండీ సత్కరించి అభినందించారు. అనిత చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంస్థ అండగా ఉంటుందని, వారికి కావాల్సిన సహకారం అందిస్తామని సజ్జనార్ తెలిపారు. కాగా, సన్మానం అందుకున్న అనితను ఖమ్మం ఆర్ఎం ఏ.సరిరామ్, డిపో మేనేజర్ దినేష్కుమార్, అధికారులు, ఉద్యోగులు అభినందించగా.. తన సేవలకు గుర్తింపు ఇవ్వడంపై యాజమాన్యం, ఎండీ సజ్జనార్, ఆర్ఎంకు అనిత కతృజ్ఞతలు తెలిపారు.మున్నేటిని పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మంఅర్బన్: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతుండడంతో మున్నేటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యాన పరిస్థితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఖమ్మంలో మున్నేటిని శుక్రవారం పరిశీలించిన ఆయన గత అనుభవాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతమైతే లోతట్టు ప్రాంతాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తెలిపారు. మున్నేటి నీటిమట్టం 10.30 అడుగులు ఖమ్మంఅర్బన్: జిల్లాలో శుక్రవారం పెద్దగా వర్షం లేకున్నా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 6గంటలకు 11.30 అడుగులుగా ఉన్న నీటిమట్టం సాయంత్రం 5గంటలకు 10.30 అడుగులకు పడిపోయింది. అయితే, జిల్లాలో శుక్రవారం రాత్రి వర్షం కురవగా.. బయ్యారం చెరువు, కొత్తగూడ, గార్ల, పాకాల తదితర ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతోంది. దీంతో శనివారం ఉదయంకల్లా మున్నేరులో నీటిమట్టం కాస్త పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఉమ్మడి జిల్లాకు 2,638 మెట్రిక్ టన్నుల యూరియా
చింతకాని: ఆర్ఎఫ్సీఎల్ కంపెనీ నుంచి జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా సరఫరా అయింది. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు శుక్రవారం చేరిన యూరియాను ఏఓ(టెక్నికల్) పవన్కుమార్ పరిశీలించి జిల్లాల వారీగా కేటాయించారు. ఖమ్మం జిల్లాకు 1,538.44 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు వెయ్యి టన్నులు కేటాయించగా వంద మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు ఏఓ తెలిపారు. జిల్లాకు సరిపడా యూరియా చేరినందున రైతులెవరూ ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు. ప్రవేశాలకు సెప్టెంబర్ 10వరకు గడువు ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్(గతంలో ఎస్డీఎల్సీఈ)లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సెప్టెంబర్ 10వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ గోపి తెలిపారు. ప్రవేశాలకు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఫీజు, అర్హతలు వివరాల కోసం అధ్యయన కేంద్రం సెల్ నంబర్ 80088 11998 లేదా కేయూ దూరవిద్య కేంద్రం వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు. నాగులవంచ రైల్వేస్టేషన్ కొనసాగింపు -
సప్తపదుల ఖాదీ
ఖమ్మంగాంధీచౌక్: ఖాదీ లేదా ఖద్దరు వస్త్రాలు మహాత్మా గాంధీ నమ్మిన సత్యం, అహింస, స్వదేశీ భావాలకు ప్రతీకగా నిలిచాయి. స్వాత్రంత్య ఉద్యమంలో ఖాదీ వస్త్రాలు దేశ భక్తిని పెంపొందించాయి. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాయి. తక్కువ ధరకు లభించే ఈ వస్త్రాలు వేసవిలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. తొలుత నూలు వడికి మగ్గాలపై నేసేవారు. సాంకేతికత పెరిగాక యంత్ర పరికరాలపై బట్టను తయారు చేస్తున్నారు. వయసులో పెద్దవారు, రాజకీయ నాయకులు ఖద్దరు దుస్తులను ఎక్కువగా వినియోగిస్తారు. కాలక్రమంలో ఖాదీ వస్త్రాల కార్ఖానాలు వెలిశాయి. పలు రాష్ట్రాల్లో ఖాదీ పరిశ్రమలు పెరగటంతో ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. కుటీర పరిశ్రమలుగానూ వెలిశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాదీ వస్త్రాల తయారీకి ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. ఏపీలోని పొందూరు ఖద్దరు, తెలంగాణలో వావిలాల ఖాదీ ఆదరణ చూరగొన్నాయని చెప్పొచ్చు. విస్తరించిన వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ స్వాతంత్రోద్యమంలో ఖాదీకి లభించిన ఆదరణ, ప్రాముఖ్యతతో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో వావిలాల గ్రామోద్యోగ్ ప్రతిష్టాపన జరిగింది. కుటీర పరిశ్రమగా ఆవిర్భవించి అంచెలంచెలుగా రాష్ట్రంలో ఎనిమిది పరిశ్రమలకు విస్తరించింది. పరిశ్రమలు, చేతి మగ్గాలు, దుకాణాల్లో దాదాపు వెయ్యి మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. కరీంనగర్, హనుమకొండ, తొర్రూరు తదితర ప్రాంతాలకు పరిశ్రమ విస్తరించగా, పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఖద్దరు విక్రయ దుకాణాలను నిర్వహిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, తొర్రూర్, హుజూరాబాద్, హైదరాబాద్లో పలు బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు చైర్పర్సన్గా దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు తనయ ఎంఎల్సీ సురభి వాణితో పాటు కార్యదర్శిగా వడిదల కిషన్రావు వ్యవహరిస్తున్నారు. ఖమ్మం గ్రామోద్యోగ్కు 70 ఏళ్ల చరిత్ర వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాపన బ్రాంచిని ఖమ్మంలో 70 ఏళ్ల కిత్రం ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలోని గాంధీ నడయాడిన గాంధీచౌక్లోనే ఈ బ్రాంచిని ఖాదీ గ్రామోద్యోగ్ ఎంపోరియం ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన వేములపల్లి రంగారావు గ్రామోద్యోగ్లో ఉద్యోగిగా చేరి 40 ఏళ్ల పాటు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కృష్ణారావు 30 ఏళ్లుగా గ్రామోద్యోగ్ ఉద్యోగిగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ వంద శాతం ఖాదీ దుస్తులు పంచెలు, లుంగీలు, టవల్స్, చొక్కాలు విక్రయిస్తున్నారు. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, కోదాడ, నల్లగొండ, ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి రెగ్యులర్ కష్టమర్లు వస్తుంటారు. ఇక రాజకీయ నాయకులు ఖద్దరు చొక్కాలు, పంచెల కోసం ప్రత్యేక ఆర్డర్లు ఇస్తారు. ఇక స్వాంతత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి, వర్ధంతి, రిపబ్లిక్ డే వంటి ప్రత్యేకమైన రోజుల్లో సంస్థ ప్రత్యేక తగ్గింపు ధరలకు ఖాదీ బట్టను విక్రయిస్తుంది. ప్రస్తుత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 30 శాతం డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో విక్రయాలు మరికొంత పెరిగాయి.గాంధేయ వాదులం. వావిలాల గ్రామోద్యోగ్లో ఖద్దరు బట్టలను కొనుగోలు చేసి చొక్కాలను ధరిస్తున్నాం. లుంగీలు, టవల్స్ను కూడా వాటినే వినియోగిస్తున్నాం. ఆర్యోగపరంగా కూడా ఈ బట్ట అనుకూలంగా ఉంటుంది. నాణ్యత బాగుంటుంది. –తూములూరి లక్ష్మీనరసింహారావు, ఖమ్మంఖాదీ వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ వస్త్రాలకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. ఖమ్మంలో 70 ఏళ్లుగా గ్రామోద్యోగ్ను నిర్వహిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా సంస్థ ఖాదీ తయారీ, విక్రయాలు చేస్తోంది. – వేములపల్లి కృష్ణారావు, మేనేజర్, ఖమ్మం గ్రామోద్యోగ్ ఎంపోరియం -
ప్రతిభ కనబర్చిన పోస్టుమాస్టర్లకు సత్కారం
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ద్వారా ఖాతాదారులకు ఉత్తమ సేవలందించిన పలువురు పోస్టుమాస్టర్లను సన్మానించారు. నార్త్ సబ్ డివిజన్ బ్రాంచి పోస్టాఫీసుల పోస్టుమాస్టర్లు, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ల సమావేశం ఖమ్మంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగింది. ఈసందర్భంగా సీతారాంపురం, కొక్కిరేణి, వెంకటగిరి పోస్టుమాస్టర్లు చెరుకూరి కోటేశ్వరరావు, వి.శ్రీనివాసరావు, హరిప్రియసింగ్ రాజ్పుత్ తదితరులను సన్మానించారు. ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి, ఇన్స్పెక్టర్ బీ.కే.మహేశ్వరి, ఖమ్మం హెడ్ పోస్టాఫీస్ పోస్టుమాస్టర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. కూలిన వైరా రిజర్వాయర్ కాల్వ గైడ్వాల్వ్ వైరారూరల్: వైరా మండలం విప్పలమడక సమీపాన వైరా రిజర్వాయర్ ఎడమ కాల్వ గైడ్ వాల్వ్ గురువారం కూలింది. రెండో విడత ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఇటీవల రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వలకు ఇరువైపులా గైడ్ వాల్వ్లు నిర్మించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విప్పలమడక సమీపంలో డ్రెయినేజీ నీరు కాల్వలోకి చేరుతుండడంతో గైడ్వాల్వ్ ఓవైపు కుంగి సుమారు 100 మీటర్ల మేర కూలింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన నిర్మాణం ఆదిలోనే కూలడంపై విమర్శలు వస్తుండగా.. మరమ్మతులు చేయిస్తామని అధికారులు తెలిపారు. ‘ఆఫ్టైప్’ మొక్కలపై విచారణ చేయించండి సత్తుపల్లి: ఆఫ్టైప్ ఆయిల్పామ్ మొక్కల సరఫరాతో నష్టపోయినట్లు తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేయాలని బాధిత రైతులు కోరారు. సత్తుపల్లిలో గురువారం జిల్లా, డివిజనరల్ ఉద్యానవన శాఖ అధికారులు ఎంవీ.మధుసూదన్, శంకర్, ఆయిల్ఫెడ్ ప్రత్యేక అధికారి అడపా కిరణ్తో రైతులు సమావేశమయ్యారు. తోటల పరిశీలనకు అధికారులతో కమిటీని నియమించడమే కాక రీప్లేస్ చేసిన మొక్కల్లో ఆఫ్టైప్ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అంతేకాక ఇన్నేళ్ల కష్టానికి పరిహారం, బాధ్యులపై చర్యల విషయాన్ని వెల్లడించాలన్నారు. రైతులు కారం శ్రీరాములు, రాము, జగ్గారావు, రామకృష్ణ, సత్యనారాయణరెడ్డి, రమేష్రెడ్డి, వెంకట్రావు, ఉమామహేశ్వరరెడ్డి, చెలికాని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
శాలివాహనులు రాజకీయంగా ఎదగాలి
● రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు ఖమ్మం మామిళ్లగూడెం: శాలివాహనులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాజకీయంగా మరింత ఎదగాలని మాజీ డీజీపీ జుజ్జవరపు పూర్ణచంద్రరావు సూచించారు. శ్రీశ్రీశ్రీ దక్ష ప్రజాపతి శాలివాహన సొసైటీ, శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలో నిర్వహించిన రాజకీయ చైతన్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమ్మరి కులస్తులెవరూ తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడం బాధాకరమని తెలిపారు. ఈమేరకు రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదగాలని సూచించారు. శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ ఉన్నత విద్యనభ్యసించే శాలివాహన విద్యార్థులకు సహకరిస్తామని తెలిపారు. ఈసమావేశంలో సూర్యారావు, శంకర్రావు, మల్లెల రామనాథం, శేషగిరిరావు, హన్మంతరావు, ఉపేందర్, సత్యనారాయణ, ప్రసాద్, చిరంజీవి, రాచర్ల రాజు, రమేష్, వెంకటేశ్వర్లు, భాస్కర్, సైదారావు, సర్వయ్య, పరశురాములు, కృష్ణ పాల్గొన్నారు. -
నాలుగో శనివారం.. బ్యాగ్ లెస్ డే !
విద్యాశాఖపై సమీక్షలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: ఇక నుంచి ప్రతీనెల నాలుగో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘బ్యాగ్ లెస్ డే’గా నిర్వహించాలని.. ఆ రోజు క్రీడా పోటీలు, పాటలు పాడించడమే కాక మొక్కల పెంపకం, మాక్ అసెంబ్లీ ఏర్పాటుచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం విద్యాశాఖపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సమీక్షించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్, సమగ్రాభివృద్ధి దిశగా కార్యక్రమాలు ఉండాలని తెలిపారు. పీఎంశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన నిధులతో పనులు పూర్తిచేయించడమే కాక రెండో యూనిఫామ్, పాఠ్య, నోట్ బుక్స్ పంపిణీ చేసి వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని చెప్పారు. యూనిఫామ్ పంపిణీలో నిర్లక్ష్యం వహించే ఎంఈఓలకు మెమో జారీ చేయాలని తెలిపారు. అలాగే, హాజరు నమోదుపై సూచనలు చేసిన కలెక్టర్... గుడిసెలు, శిథిల భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలల స్థానంలో కంటైనర్లు ఏర్పాటు చేయించాలన్నారు. డీఈఓ నాగపద్మజ, ఎంఈఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ●ఖమ్మంగాంధీచౌక్: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఆన్లైన్ ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా కేటాయిస్తున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కామేపల్లి మండలం పింజరమడుగు, ముచ్చర్ల ప్రాంత 50మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాక ఆయన మాట్లాడారు. త్వరలోనే వీరికి మంత్రులు, ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కామేపల్లి తహసీల్దార్ సుధాకర్, డబుల్ బెడ్రూం లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణి ట్రక్కు.. అప్పాయిగూడెం ఇంజిన్!
కారేపల్లి: మండల కేంద్రమైన సింగరేణి((కారేపల్లి) గ్రామపంచాయతీ ట్రాక్టర్ మరమ్మతుకు వచ్చింది. ఏళ్లుగా కనీసం ఇంజన్ ఆయిల్ కూడా మార్చకపోవడంతో మొరాయిస్తోంది. ఈమేరకు మెకానిక్కు చూపిస్తే మరమ్మతులకు రూ.20వేలు అవసరమని చెప్పడంతో నిధులు లేక అధికారులు చేతులెత్తేశారు. అయితే, కారేపల్లిలో 12వార్డులతో పాటు రెండు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి ఉండడంతో ప్రతిరోజు చెత్త సేకరించాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్రాక్టర్ ఇంజన్ లేకపోవడంతో అప్పాయిగూడెం గ్రామపంచాయతీ నుంచి ఇంజన్ను తెప్పించి కారేపల్లి ట్రక్కు అమర్చి చెత్త సేకరిస్తున్నారు. -
సమూల మార్పులతోనే..
దేశాభివృద్ధికి కొన్ని వ్యవస్థల్లో సమూల మార్పు చేయాలి. ప్రధానంగా విద్య, వైద్యం అందరికీ అందాలి. ఇందుకోసం యువత సేవలు వినియోగించుకుంటూ ఉపాధి రంగాల్లో చేయూత ఇవ్వాలి. రిజర్వేషన్లలోనూ మార్పులు చేపట్టాలి. – ఎ.ధనలక్ష్మిప్రస్తుతం కొనసాగుతున్న విద్యావ్యవస్థలో సరికొత్త విధానం తీసుకురావాలి. నిరుపేదలకు విద్య అందుబాటులోకి రావాలి. అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే, ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు కల్పించి బలోపేతం చేయాలి. – షేక్ భాను -
చట్టాల్లో సంస్కరణలతో...
పెరుగుతున్న హింస.. పడుతున్న శిక్షలకు సంబంధం లేదు. ఈ విషయమై దేశంలో అమలవుతున్న చట్టాల్లో వీలైనంతగా సంస్కరణలు చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి. – ఎం.వినోద్కుమార్ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విషయంలో ప్రజలు తమ ఓటు విలువ తెలుసుకోవాలి. ప్రధాన పార్టీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలకు సేవ చేయగలిగే నేతను ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని అంతా గుర్తించాలి. – బి.వంశీ -
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పటిష్ట చర్యలు
ఖమ్మం సహకారనగర్: వాతావరణ శాఖ సూచనల ప్రకారం అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి పొంగులేటి, సీఎస్ రామకృష్ణారావు, ఖమ్మం కలెక్టరేట్ నుంచి తుమ్మల గురువారం కలెక్టర్లతో వీసీ ద్వారా మీక్షించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మరికొన్ని రోజులు వర్షాలు ఉన్నందున వరద ముంచెత్తినా నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సహాయక చర్యల కోసం రూ.కోటి నిధులు విడుదల చేయగా, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆకేరు, మున్నేరు, పాలేరు, వైరా, లంకాసాగర్లో వరద నిలకడగా ఉన్నప్పటికీ ఎగువ జిల్లాల్లో వర్షం వివరాలు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీసీలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కెఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై వర్షపాతం వివరాలు, వరద అంచనా, ముందస్తు చర్యలపైనే కాక సీజనల్ వ్యాధుల కట్టడిపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య, డీఎంహెచ్ఓ కళావతి బాయి, సీపీఓ శ్రీనివాస్, వివిధ శాఖల ఎస్ఈలు శ్రీనివాసాచారి, ఎం.వెంకటేశ్వర్లు, వెంకట్రెడ్డి, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు. వీసీలో మంత్రులు పొంగులేటి, తుమ్మల -
రేపు నాస్తిక అధ్యయన తరగతులు
ఖమ్మంమయూరిసెంటర్: నాస్తిక సమాజం (తెలంగాణ – ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యాన శనివా రం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నాస్తిక అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ చార్వాక సుధాకర్ తెలిపారు. సరైన ఆలోచన, తాత్విక జీవనం కోసం మనుషులు స్వేచ్ఛగా, స్వతహాగా ఆలోచించేలా అవగాహన కల్పించడమే ఈ తరగతుల ఉద్దేశమని వెల్లడించారు. ఖమ్మంలో గురువారం ఆయన మాట్లాడుతూ జీవితంలో శాసీ్త్రయ ధృక్పథాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ తరగతుల్లో రిటైర్డ్ ప్రొఫెసర్లు సీహెచ్.రమేష్బాబు, డాక్టర్ కె. విజయ్కుమార్, డాక్టర్ బి.వి.రాఘవులు పలు అంశాలపై మాట్లాడతారని సుధాకర్ వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు ఆవుల అశోక్, సీహెచ్.రమేష్బాబు, నాగరాజు, సమతా శ్రీధర్, సత్యనారాయణ, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. సామర్థ్యాలకు అనుగుణంగా ప్రశ్నాపత్రాలు ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల స్థాయి, విద్యా సామర్థ్యాల ఆధారంగా ప్రశ్నాపత్రాలు తయారీ జరగాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగపద్మజ తెలిపారు. ఖమ్మం రోటరీనగర్ హైస్కూల్లో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) ఆధ్వర్యాన గురువారం ఎస్ఏ–1 ప్రశ్నాపత్రం తయారీపై ఉపాధ్యాయులకు వర్క్షాపు ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రం చూడగానే ఆందోళన చెందకుండా ఉత్సాహంగా జవాబులు రాసేలా ఉండాలని తెలిపారు. ఇక్కడ తయారుచేసే ప్రశ్నాపత్రాలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండేలా, విద్యార్థుల సామర్థ్యాల సరిగ్గా అంచనా వేసేలా రూపొందించాలని సూచించారు. డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, హెచ్ఎం తుంగతుర్తి సుబ్బారావు, ఏఎంఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ట్రెజరీ డీడీగా సత్యనారాయణ ఖమ్మం సహకారనగర్: మహబూబాబాద్ జిల్లా ఖజనా శాఖాధికారి వెంటపల్లి సత్యనారాయణకు ఖమ్మం ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు అందిన ఆదేశాలతో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్నాళ్లు డీడీగా ఉన్న ప్రసన్నకుమార్ వైరా ఏటీఓగా నియమించారు. కాగా, డీడీ సత్యనారాయణకు ఏటీఓలు రాంబాబు, జి.శ్రీనివాస్, ఎస్టీఓలు మోదుగు వేలాద్రి, నాగేంద్రకుమారి, శారద, ఉద్యోగులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
టోల్ రుసుముకు వార్షిక పాస్
ఖమ్మం అర్బన్: వాహనదారులకు జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన టోల్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు గురువారం అర్ధరాత్రి(శుక్రవారం) నుంచి రూ.3వేల వార్షిక రుసుంతో 200టోల్ ప్రవేశాలకు అనుమతులు లభిస్తాయని ఎన్హెచ్ఏఐ ఖమ్మం పీడీ దివ్య తెలిపారు. ఫాస్ట్ట్యాగ్లో ఆక్టివేట్ చేసిన వార్షిక పాస్తో జాతీయ రహదారి, జాతీయ ఎక్స్ప్రెస్ వేల్లోని ప్లాజాల మీదుగా ఒక ఏడాది లేదా 200 ట్రిప్పుల రాకపోకలకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. డౌన్లోడ్ ఇలా... వార్షిక పాస్ను వాహనదారులు రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్లో యాక్టివేట్ చేయించుకోవచ్చు. సంబంధిత పాస్ట్టాగ్ ధృవీకరణ అనంతరం ఆమోదం లభిస్తుంది. రుసుము చెల్లించిన రెండు గంటల్లోగా అమల్లోకి వస్తుందని పీడీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ట్యాగ్తోనే రూ.3వేలు చెల్లించి యాక్టివేషన్ చేసుకునే వెసలుబాటు ఉందని వెల్లడించారు. -
పదేళ్లలో అత్యధికం.. 37.5అడుగులు
● రెండేళ్లుగా వణుకుతున్న మున్నేటి పరీవాహకం ● గతేడాది భారీ నష్టాన్ని మిగిల్చిన వరద ● ప్రస్తుత వర్షాలతో స్థానికుల్లో ఆందోళన సాక్షిప్రతినిధి, ఖమ్మం: గత ఏడాది మున్నేటికి వరద పోటెత్తగా పరీవాహక ప్రాంత కాలనీలన్నీ నీట మునిగాయి. ఈనేపథ్యాన ప్రస్తుత వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది అధికారిక లెక్కల ప్రకారం 37.5 అడుగులు, అనధికారికంగా దాదాపు 42 అడుగుల మేర మున్నేటికి వరద చేరింది. ఇక 2023లోనూ మున్నేరుకు వరద పోటెత్తింది. అయితే, గత ఏడాది ఎదురైన చేదు అనుభవాలతో అప్రమత్తంగానే ఉన్నా అటు అధికా రులు, ఇటు ప్రజల్లో ఆందోళన వీడడం లేదు. మున్నేరు ముంచింది.. గత ఏడాది ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1న వచ్చిన వరదలతో మున్నేరు పరీవాహకం మొత్తం నీట మునిగింది. 42 అడుగుల మేర వరద రావడంతో ఖమ్మం నగరంలోని 14 డివిజన్లు, ఖమ్మంరూరల్ మండలంలోని 20 కాలనీలు వరద ముంపు బారిన పడి దాదాపు 80 శాతం కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కొందరి ఇళ్లు పూర్తిగా ధ్వంసమై.. మరికొందరికి పాక్షికంగా దెబ్బతినడంతో పాటు ఉపకరణాలు పనికి రాకుండా పోయాయి. 2023లో 30 అడుగులకు పైగా.. గత 20 ఏళ్లలో మున్నేరు వరదను పరిశీలిస్తే అత్యధికంగా గత ఏడాదే నమోదైంది. అంతకుముందు 2023 జూలై 27న 30.70 అడుగులు, 2005లో 26 అడుగుల వరద వచ్చింది. అయితే, 2005లో మున్నేటికి ఇరువైపులా ఇన్ని కాలనీలు లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత 2023–24లో 30 అడుగుల మేరకు రావడంతో అదే అత్యధిక వరదగా నమోదైంది. కానీ 2024–25కు సంబంధించి 2024 సెప్టెంబర్ 1న ఊహించనంతగా 42 అడుగుల వరకు వరద రావడం గమనార్హం. ఎప్పుడేం జరుగుతుందో.. జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మున్నేరు, ఆకేరు పరీవాహక ప్రాంత కాలనీల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత 60 ఏళ్లలో ప్రశాంతంగా ఉన్న మున్నేరు గత రెండేళ్లుగా నిద్ర లేని రాత్రులను మిగులుస్తోందని కాలనీవాసులు కన్నీటిపరంతమవుతున్నారు. ప్రస్తుతం ఎడ తెరిపి లేని వర్షాలతో అధికారుల ముందస్తు చర్యలతో జనానికి మరింత భయం కలిగిస్తోంది. ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు వెళ్లేలా విలువైన సామగ్రిని సర్దుకుంటున్నారు.జిల్లాలో గురువారం కూడా వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మిగతాచోట్ల ఓ మోస్తరు వర్షంతో వాగులు, చెరువుల్లోకి నీరు చేరింది. గురువారం ఉదయం 8–30 నుంచి రాత్రి 9గంటల వరకు అత్యధికంగా చింతకాని మండలం నాగులవంచలో 66 మి.మీ. వర్షపా తం నమోదైంది. ఎర్రుపాలెం మండలంలో కట్టలేరుకు వరద పెరగగా, ముదిగొండ మండలం వల్లభి పెద్ద చెరువుకు అలుగు పడింది. వైరా నది ఉధృతితో స్నానాల లక్ష్మీపురం, సిరిపురం మధ్య రాకపోకలు నిలిపివేశారు. కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్కు సాగర్ నుంచి నీటి విడుదల తగ్గించడమే కాక దిగువకు 2,043 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు అలుగు ద్వారా మరో 7,667క్యూసెక్కులు పాలేరు ఏటిలో కలుస్తుంది. ఈ మేరకు రిజర్వాయర్ నీటిమట్టం 23.45అడుగుల వద్ద నిలకడగా ఉంది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్ట మైన 18.3అడుగులు దాటి 19 అడుగులకు చేరింది. ఇక డోర్నకల్ వద్ద మున్నేరు 140 మీటర్లకు గాను 136, ఖమ్మం జిల్లా తీర్థాల వద్ద 20 అడుగులకు గాను 10, ఆకేరు తిప్పారెడ్డిగూడెం వద్ద 135 మీటర్లకు 132 మీటర్లు, ఖమ్మం కాల్వొడ్డు వద్ద మున్నేరు 7.90అడుగులుగా నమోదైంది. -
సర్వతోముఖాభివృద్ధి
సంస్కరణలతోనే● యువతలో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాలి ● కొత్త ఆలోచనలు, నైపుణ్యాభివృద్ధి అవసరం ● దేశంపై బాధ్యత, నిజాయితీ, అంకితభావం తప్పనిసరి ‘వందేళ్ల భారతం’పై ‘సాక్షి టాక్ షో’లో విద్యార్థుల మనోగతంసుజాతనగర్: దేశం నేడు(శుక్రవారం) 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 2047 నాటికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అనేక రంగాల అభివృద్ధిలో దేశం 2047 నాటికి ఎలా ఉండాలన్న అంశంపై సుజాతనగర్లోని ధన్వంతరి ఫార్మా కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యాన టాక్ షో నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. సంస్కరణలే కీలకం పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయం, రవాణా అభివృద్ధి, సాంకేతికత వినియోగం.. మహిళా సాధికారత, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే దేశాన్ని అగ్రస్థానాన నిలబెడతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. యువత నూతన ఆలోచనలు, నైపుణ్యాలను స్వీకరిస్తూ వారికి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. అలాగే, అవినీతిని నిర్మూలించాలని.. రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వడమే కాక పేదరిక నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో మార్పులు, పాలనలో అవినీతి నిర్మూలన, సేవాగుణం, అభివృద్ధి చేయగలిగే నేతలను ఎన్నుకోవడం.. ప్రజల ఆర్థిక శ్రేయస్సు, సామాజిక సమాన త్వం, సాంకేతిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం వంటివి అమల్లోకి తీసుకురాగలిగితే దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం కష్టమేమీ కాదని ధన్వంతరి కళాశాల విద్యార్థులు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ టాక్ షోలో పలువురు విద్యార్థులు వెల్లడించిన అభిప్రాయాలు..భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొంత వెనకబాటు ఉంది. అధిక జనాభా, పేదరికం, తక్కువ తలసరి ఆదాయం, అవినీతి, వసతుల లేమి, జవాబుదారీతనంపై సరైన నిర్ణయాలు తీసుకుంటే 2047 నాటికి ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది. – జి.నాగరాజు, ప్రిన్సిపాల్ -
వరదతో పాటే వ్యాధులు
● జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు, జ్వరాలు ● డెంగీ కేసులు 50 దాటడంతో అప్రమత్తత ● ఫీవర్ సర్వేలో వెలుగుచూస్తున్న జ్వరబాధితులు ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగి స్తోంది. కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్య సమస్య ఏర్పడి డెంగీ, వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉండడంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీనికితోడు అధికారులు చేపట్టిన ఫీవర్ సర్వేలోనూ వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. వెలుగులోకి వందలాది కేసులు గత నెలలో జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ల పరిధిలో ఫీవర్ సర్వే చేపట్టింది. ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి అనుమానితుల రక్త నమూనాలు సేకరించి మందులు పంపిణీ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రత ఉన్న వారిని ఆస్పత్రులకు తరలించారు. జూలై 8నుంచి 24వ తేదీ వరకు మొదటి విడత చేపట్టిన ఫీవర్ సర్వేలో రెండు హైరిస్క్ ఏరియాలను జల్లెడపట్టారు. ఈమేరకు 342 ఇళ్లలో 1,382 మందిని పరీక్షించగా 46 మంది విషజ్వరాలతో భాదపడుతున్నట్లు గుర్తించారు. ఆపై జ్వరాల తాకిడి పెరగటంతో జూలై 28నుంచి రెండో విడత ఫీవర్ సర్వే చేపట్టగా ఇప్పటి వరకు 1,554 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు తేలింది. డెంగీ.. ౖపైపెకి జిల్లాలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెల 12వ తేదీకి 52 కేసులు అధికారికంగా వెలుగుచూశాయి. అనధికారికంగా కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. ఖమ్మం నగరంతో పాటు తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, తల్లాడ తదితర మండలాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, డెంగీ చికిత్స పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.70వేల నుండి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలైతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పరీక్షలకు అనుమతి లేకపోగా.. ఎలీసా పరీక్షల కోసం రక్త నమూనాలను పెద్దాస్పత్రిలోని ఐడీఎస్పీ ల్యాబ్కు పంపించాలి. కానీ పలు ఆస్పత్రుల్లో పరీక్షలు.. ఆపై చికిత్స పేరుతో దోచుకుంటున్నట్లు తెలుస్తోంది.ఫీవర్ సర్వే వివరాలు... సర్వే చేసిన గృహాలు 1,57,332 పరీక్షించిన వారు 4,37,911 ఫీవర్ కేసులు 1,554 నెలల వారీగా వైరల్ జ్వరాలు, డెంగీ కేసులు నెల వైరల్ జ్వరాలు డెంగీ జూన్ 5,947 01 జూలై 6,476 27 ఆగస్టు 2,596 21 (ఇప్పటివరకు)డెంగీ కేసులు అదుపులోనే... జిల్లాలో డెంగీ కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాప్తిని కట్టడి చేశాం. ఇక సీజనల్ వ్యాధుల వ్యాప్తి నామమాత్రంగానే ఉంది. ఫీవర్ సర్వేతో ఎప్పటికప్పుడు మందులు ఇస్తుండడంతో ప్రభావం తగ్గిపోయింది. అయినా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ జ్వరం లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలి. – బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
అంతటా అప్రమత్తం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యాన అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మున్నేటికి ఇరువైపులా ఇప్పటికే పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యవసర సమయాన సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేయడమే కాక కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, మున్సిపాలిటీల్లో కంట్రోల్రూమ్లు ఏర్పాటుచేశారు. పరీవాహకంలో ఎడతెరిపి లేకుండా.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపాతం వివరాలను అధికారులు తెప్పించుకుంటున్నారు. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బుధవారం కూడా మున్నేరు, ఆకేరు పరీవాహక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. మున్నేరు పరీవాహకంలో రాత్రి 8గంటల వరకు 7.1 సెం.మీ., ఆకేరు పరీవాహ కంలో 1.0 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పునరావాస కేంద్రాలు భారీ వర్షాలు, వరదల నేపథ్యాన మున్నేటి పరీవాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు. శిక్షణ వలంటీర్లతో అవగాహన కల్పి స్తూనే గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సమాయత్తం చేశారు. ఖమ్మం కార్పొరేషన్లో 12డివిజన్లు, ఏదులాపురం మున్సిపాలిటీలో 12వార్డులను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతా లను వరద ముంచెత్తితే ప్రజలకు ఆశ్రయం కల్పించేలా 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టంగా ఏర్పాట్లు వరదలపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే, పోలీస్ కమిషనర్ సునీల్దత్ పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగుల వద్ద పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపరులెవరూ చెరువులు, వాగులు దాటొద్దని హెచ్చరించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే వంతెనలు, చప్టాలపై రాకపోకలు నిలిపేస్తున్నారు. ఆపద తొలగే వరకు.. ఒకేసారి భారీ వర్షం పడి వరద ముంచెత్తితే తక్కువ సమయంలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గత ఏడా ది ఇలాంటి అనుభవమే ఎదురైనందున ఈసారి ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. డ్రెయిన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేలా శుభ్రం చేయిస్తూనే పారిశుద్ధ్య పనులపైనా దృష్టి సారించారు. కాగా, పోలీస్ కమిషనర్ సునీల్దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం కాల్వొడ్డు, ప్రకాష్నగర్ ప్రాంతాల్లో మున్నేరు వరదను పరిశీలించి పరిస్థితులు అంచనా వేశారు. బుధవారం సాయంత్రం ఖమ్మంలోని కాల్వొడ్డు వద్ద మున్నేరు 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. నేడు విద్యాసంస్థలకు సెలవు భారీ వర్షాల నేపథ్యాన అన్ని యాజమాన్యాల పరిధి విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అలాగే, ప్రజలు అప్ర మత్తంగా ఉంటూ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, నీటి ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయొద్దని ఆయన సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు చర్యలు మున్నేటికి ఇరువైపులా పునరావాస కేంద్రాలు సిద్ధం చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్ అందుబాటులోకి వలంటీర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నేడు విద్యాసంస్థలకు సెలవు16 అడుగుల వరద వస్తే మొదటి హెచ్చరిక.. కాల్వొడ్డు వద్ద మున్నేరు 16అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాం. ఆ వెంటనే కాల్వొడ్డు, బొక్కలగడ్డ ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. నగరంలోని 12 డివిజన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించాం. అక్కడి ప్రజలను అప్రమత్తం చేసేందుకు వలంటీర్లను సిద్ధం చేశాం. ఎవరెవరిని ఏ పునరావాస కేంద్రానికి తరలించాలో మ్యాపింగ్ కూడా చేశాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీటోల్ఫ్రీ, కంట్రోల్ రూమ్ నంబర్లు కార్యాలయం నంబర్లు కలెక్టరేట్ 1077, 90632 11298కేఎంసీ 83338 33696ఏదులాపురం 95156 85414ఖమ్మంరూరల్ తహసీల్ 83319 30583పోలీసులు డయల్ 100పోలీసు కమిషనరేట్ 87126 59111 -
నిరంతర పర్యవేక్షణ
మున్నేటి వరదపై ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంతో పాటు మున్నేటి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున మున్నేరుకు వచ్చే వరదను నిరంతరం పర్యవేక్షిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. మున్నేటి వరదల నేపథ్యాన ప్రత్యేక అధికారిగా వచ్చిన జి.వేణుగోపాల్తో కలిసి కమిషనర్ అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమీక్షించారు. అయితే, 16అడగుల మేర వరద రాగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి పరీవాహక కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈ విషయమై వలంటీర్ల ద్వారా స్థానికులను అప్రమత్తం చేయాలని తెలిపారు. కాగా, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఎంపిక చేసిన వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. నగరంలోని 12 డివిజన్ల ముంపు ప్రాంతాల్లో 240 మందిని ఎంపిక చేయగా వారికి కేఎంసీ అధికారులు హ్యాండ్ మైకులు, టార్చ్లైట్లు, రైయిన్కోట్లు అందజేశారు. అలాగే, ముంపు ప్రాంతాల ప్రజలు సర్టిఫికెట్లు భద్రపరుచుకునేలా కవర్లు సరఫరా చేస్తున్నారు. పాలేరుకు తగ్గిన వరద కూసుమంచి: మండలంలోని పాలేరురిజర్వాయ ర్కు వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం రాత్రివరకు 17వేల క్యూసెక్కుల వరదచేరగా బు ధవారం సాయంత్రానికి 8,250 క్యూసెక్కులకు పడిపోయింది. ఈమేరకు రిజర్వాయర్కు సాగర్ నుంచి 2,168క్యూసెక్కుల నీరుసరఫరాఅవుతోం ది. దీంతో దిగువకు 2,043 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, అలుగు ద్వారా 8,095 క్యూసెక్కుల నీరు పాలేరు ఏటిలో కలుస్తుండగా, రిజర్వాయర్ నీటిమట్టం 23.50 అడుగులుగా నమోదైంది. ఈమేరకు రిజర్వాయర్ను జలవనరులశాఖ ఎస్ఈమంగళంపూడి వెంకటేశ్వర్లు పరి శీలించి వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లించాలని ఉద్యోగులకు సూచించారు. -
డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు సెంచరీ!
మధిర: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల సంఖ్య వందకు చేరిందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవీంద్రారెడ్డి తెలిపారు. కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో కళాశాలకు బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ గ్రూపులు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో ప్రవేశాలకు విద్యార్థులు ముందుకొచ్చారని పేర్కొన్నారు. కాగా, దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకుని డిగ్రీలో చేరని, దరఖాస్తు చేయని విద్యార్థుల కోసం త్వరలో స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సి పాల్ వెల్లడించారు. ప్రవేశాలు వందకు చేరేలా కృషి చేసిన అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమమే లక్ష్యంసత్తుపల్లిరూరల్: బొగ్గు ఉత్పత్తిలో రక్షణ పాటిస్తూనే కార్మి కుల సంక్షేమమే లక్ష్యం గా సింగరేణి ముందుకు సాగుతోందని డీజీఎం యోహాన్ తెలిపారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేంరాజు ఆధ్వర్యాన సత్తుపల్లి జేవీ ఆర్ ఓసీ కార్యాలయంలో బుధవా రం జరిగిన మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి కోసం ఉద్యోగులు, కార్మికులు సహకరించాల ని సూచించారు. ఇందుకోసం యంత్రాల పనిగంటలు పెంచాలని తెలిపారు. అనంతరం మల్టీ డి పార్ట్మెంట్ కమిటీ సమావేశాల లక్ష్యాలు, బొగ్గు ఉత్పత్తి లక్ష్యం, ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జేవీఆర్ ఓసీ పీఓ ప్రహ్లాద్, ఉద్యోగులు కె.హనా సుమలత, కె.సూర్యనారా యణరాజు, మోహన్రావు, బి.రాజేశ్వరరావు, డి. శ్రీనివాసరావు, జి.కల్యాణ్రామ్, ఎస్.గోవింద్, దుర్గాప్రసాద్రెడ్డి, నర్సింహారావు, రామారావు, దేవదాస్ పాల్గొన్నారు. సింహపూరి, కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దుఖమ్మం రాపర్తినగర్: మూడో రైల్వేలైన్ నిర్మాణ పనుల కారణంగా సింహపురి, కృష్ణా ఎక్ప్ప్రెస్ రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి గూడూరు(12710) వెళ్లే సింహపురి ఎక్స్ప్రెస్(12710)ను ఈనెల 14, 17, 18వ తేదీల్లో, గూడూరు – సికింద్రాబాద్ మార్గం(12709)లో ఈనెల 15, 18, 19వ తేదీల్లో రద్దు చేసినట్లు అధి కారులు తెలిపారు. అలాగే, తిరుపతి నుంచి ఆది లాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్(12705)ను ఈనెల 13నుంచి 19వ తేదీ వరకు, ఆదిలాబాద్ – తిరుపతి మార్గం(12706)లో ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు సీసీటీఓ రాజగోపాల్ వెల్లడించారు. పశు వైద్యాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా హరీష్ఖమ్మంవ్యవసాయం: పశువైద్యాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ అనంతు హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఖమ్మం పశువైద్య, పశుసంవర్థక శాఖ కార్యాలయంలో బుధవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పశువైద్యాధికారి హరీష్ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మానుకొండ రాకేష్కుమార్(వైరా), కోశాధికారిగా డాక్టర్ రఘుపతి(ఖమ్మం పశువైద్య ప్రయోగశాల)తో పాటు కార్యవర్గ సభ్యులుగా డాక్టర్లు ఉషశ్రీ, శశిదీప్, జానీ, కృష్ణారెడ్డి, సృజనను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా కె.ప్రదీప్కుమార్ వ్యవహరించగా, పశువైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.రమేష్బాబు, వైద్యులు ఉపేందర్, అశోక్, సుబ్బారావు, రాంజీ, రాజు, భువనేష్, సమీరా, స్వాతిలత తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల ముఖాముఖికి సుజాతఖమ్మం సహకారనగర్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆరుగురు ముఖాముఖికి ఎంపిక కా గా, కేంద్ర విద్యాశాఖ నిపుణుల కమిటీ, రాష్ట్ర ఉన్నతాధికారులు బుధవారం ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. జిల్లాలోని ఏన్కూరు మండలం బురద రాఘవాపురం పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు సాగి సుజాత కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆమె ఇంటర్వ్యూలో పాల్గొనగా విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలర్, జేడీ మదన్మోహన్ ఆమెను సత్కరించారు. కాగా, పది రోజుల్లో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా వెలువడే అవకాశముంది. హోంగార్డుకు గాయాలుతిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం పెట్రోల్బంక్ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంతో హోంగార్డుకు తీవ్రగాయాలయ్యాయి. గోల్తండాకు చెందిన ఉపేంద్రయ్య(ఉపేందర్) హోంగార్డు(డ్రైవర్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన బుధవారం రాత్రి బైక్పై వెళ్తుండగా పెట్రోల్ బంక్ సమీపాన కింద పడడంతో తలకు గాయమైంది. దీంతో సీహెచ్సీలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. -
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాటు
● ప్రతీ విగ్రహం సమాచారం తప్పనిసరి ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిఖమ్మంగాంధీచౌక్: రానున్న వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. గణపతి నవరాత్రోత్సవాలపై కలెక్టరేట్లో బుధవారం అధికారులు, ఉత్సవ కమిటీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశమున్నందున నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అంతేకాక ప్రతీ మండపం వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని, అన్ని వివరాలు సమర్పించాలని సూచించారు. అలాగే, మండపాలకు విద్యుత్ అనుమతి, నిమజ్జం రోజు రూట్మ్యాప్ తయారీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ సూచనలు చేశారు. కాగా, గత ఏడాది మాదిరిగా ఈసారి సైతం మట్టి విగ్రహాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్అజయ్యాదవ్, డీఆర్వో పద్మశ్రీ, డీపీఓ ఆశాలత, డీఎంహెచ్ఓ కళావతిబాయి, కేఎంసీ అసిస్టెంట్ కమీషనర్ అనిల్కుమార్, ఖమ్మం స్తంభాద్రి సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు వినోద్ లాహోటి, కీసర జయపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూసమస్యల పరిష్కారంపై దృష్టి తల్లాడ/ఏన్కూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భూసంబంధిత సమస్యలపై అందిన దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. తల్లాడ, ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన దరఖాస్తుల స్థితిగతులపై సమీక్షించారు. భూభారతి చట్టం నిబంధనల ప్రకారంగా నోటీసులు జారీ చేసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు స్పష్టమైన కారణాలు వెల్లడించాలని సూచించారు. కాగా, ఏన్కూరులోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాన్ని సైతం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి డైనింగ్ హాల్, కిచెన్ను పరిశీలించి వర్షాల నేపథ్యాన పరిశుభ్రతపై సూచనలు చేశారు. తహసీల్దార్లు వి.సురేష్కుమార్, సీసిహెచ్.శేషగిరిరావు, ఉద్యోగులు భాస్కర్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం అవే పాట్లు
కొణిజర్ల: కొణిజర్ల సొసైటీ కార్యాలయం ఎదుట బుధవారం రైతులు బారులు దీరారు. సొసైటీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం 15టన్నుల యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు బుధవారం తెల్లవారుజామునే క్యూ కట్టారు. ఒక్కో ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా ఉన్నందున ఆందోళన చెందొద్దని సూచించారు. ఎస్టీ కమిషన్ సభ్యుడికి నిర్వాసితుల వినతిఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంమున్నేటి పరీవాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండగా సరైన పరిహారం ఇవ్వడం లేదని భూములు, ప్లాట్లు కోల్పోతున్న పలువురు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్కు విన్నవించారు. ఖమ్మంకు బుధవారం వచ్చిన ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం నిర్వాసితులు కలిశారు. సుమారు 250 మంది నుంచి 50ఎకరాల భూములను రిటైనింగ్వాల్ నిర్మాణానికి సేకరిస్తున్నారని తెలిపారు. మార్కెట్ విలువ లేదా ప్రభుత్వ ధరపై మూడింతల పరిహారం ఇప్పించాలని కోరారు. నాయకులు సన్నె ఉదయప్రతాప్, గల్లా సత్యనారాయణ, నున్న రవికుమార్, రవిరాథోడ్, ఎం.సుబ్బారావు, ఎం.సరస్వతి, శ్యాం, మోహన్, మేకల నాగేంద్ర, రవీందర్, రాజేష్, మల్లేశ్వరి పాల్గొన్నారు. -
ఎంత వరద వస్తే ఎక్కడ నష్టం?
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో కురిసే వర్షంతో పాటు ఎగువ నుంచి వరద వస్తే మున్నేరు పోటెత్తే అవకాశముంది. గతేడాది సెప్టెంబర్ 1న తెల్లవారుజాము 4గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చిన వరదతో పరీవాహక కాలనీలకు భారీ నష్టం ఎదురైంది. ఈమేరకు గత ఏడాది వరద అంచనా ఆధారంగా మున్నేటికి ఎన్ని అడుగుల వరద వస్తే ఎన్ని కాలనీల్లో ఎన్ని ఇళ్లు నీట మునుగుతాయో అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో భాగంగా 16 అడుగులు వరద వస్తే మునిగే ఇళ్లను గూగుల్ ఎర్త్ మ్యాప్లో ఆరెంజ్ జోన్గా, 20 అడుగులు వస్తే మునిగే ప్రాంతాన్ని బ్లూ జోన్గా, 25 అడుగుల వరదతో నష్టం ఎదురయ్యే ప్రాంతాన్ని పింక్ జోన్గా గుర్తించడమే కాక 32 అడుగుల వరద వస్తే ప్రభావితమయ్యే ప్రాంతాలను రెడ్ జోన్లో చేర్చారు. ఈమేరకు డివిజన్లు, ఇళ్ల వారీగా జోన్లను నిర్ధారించి వరద ఆధారంగా ఆన్లైన్లో నమోదుకు సిద్ధమయ్యారు. గతేడాది ముంపు ఆధారంగా మ్యాపింగ్ -
జిల్లా అంతటా వర్షం
ఖమ్మంవ్యవసాయం: జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8–30 నుంచి రాత్రి 9గంటల వరకు కురిసిన వర్షపాతంపై వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. ఈమేరకు అత్యధికంగా మధిరలో 87.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, బాణాపురంలో 84.5, బచ్చోడులో 76.3, సిరిపురంలో 75, కాకరవాయిలో 68, వేంసూరులో 66, ఎర్రుపాలెంలో 65.3, నాగులవంచలో 62.8, కూసుమంచిలో 60 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంతేకాక బోనకల్, నేలకొండపల్లి, సత్తుపల్లి, కల్లూరు, రఘునాథపాలెం, ఖమ్మం మండలాల్లోనూ ఓ మోస్తరు వర్షం నమోదైందని నివేదికలో వెల్లడించారు. -
మరో ప్రమాదంలో ఇద్దరు మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని కరుణగిరి బ్రిడ్జి సమీపాన ఆటోను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్ర మాదంలో ఆటో డ్రైవర్తో పాటు ద్విచక్రవాహనదా రుడు మృతిచెందాడు. బుధవారం తెల్లవారుజా మున జరిగిన ఈ ప్రమాదం వివరాలు... ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ పల్లపు నరేష్(28) మంగళవారం అర్ధరాత్రి రోజు మాదిరి గానే కిరాయికి వెళ్లాడు. పలు ప్రాంతాల్లో తిరిగాక తెల్లవారుజామున నాయుడుపేట వైపు వెళ్తుండగా కరుణగిరి సమీపంలో మున్నేరు బ్రిడ్జి వద్దకు రాగా నే వరంగల్ వైపు నుంచి ఖమ్మం వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టా డు. ఈ ఘటనలో ఆటో, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే, ఆటోడ్రైవర్ నరేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ నడుపుతున్న ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన వున్నపు రాంచరణ్ సాయి(22)సైతం మృతిచెందాడు. ద్విచక్రవాహనం వెనకాల కూర్చున్న చల్లా వీరబాబు,రాంబాబుకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆటోడ్రైవర్ నరేష్ భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐముష్కరాజు తెలిపారు. -
అడవులను సంరక్షిస్తూనే అభివృద్ధి
● రాజకీయాలకు అతీతంగా ఇళ్ల కేటాయింపు ● రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెం: అభివృద్ధి అనివార్యమైన నేపథ్యాన అడవులను సంరక్షించుకుంటూనే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై యంత్రాంగం దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రఘునాథపాలెం మండలం దొనబండలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. గ్రామంలో అవసరమైన డొంక రోడ్లను నెలలోగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంత స్థలం ఉండి గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకు తప్పక ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని.. ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. అడవులకు నరికివేతకు వ్యతిరేకం కొత్తగా అడవుల ఆక్రమణకు ఎవరు పాల్పడొద్దని మంత్రి తుమ్మల సూచించారు. అడవుల నరికివేతకు తాను వ్యతిరేకమని, అడవి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అటవీ ప్రాంతం తగ్గుతుండడంతోనే గ్రామాల్లో కోతుల సమస్య పెరిగిందని చెప్పారు. కాగా, గిరిజన రైతులు పోడు భూముల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని.. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రూ.2కోట్ల నిధులతో దొనబండ – గణేశ్వరం రోడ్డు నిర్మాణంతో ఖమ్మంకు దూరం తగ్గుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, ఆర్డీఓ నర్సింహారావు, పీఆర్ ఎస్ఈ వెంకట్రెడ్డి, ఖమ్మం మార్కెట్ చైర్మన్ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
జవాన్ అనిల్కు కన్నీటి వీడ్కోలు
● సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు ● కి.మీ. మేర జాతీయ జెండాలతో ర్యాలీ●నాన్న వచ్చాడురా... వేలాదిగా తరలివచ్చిన జనసందోహం నడుమ సూర్యతండాలోని స్వగృహానికి అనిల్ మృతదేహాన్ని తీసుకురాగనాఏ ఆయన తల్లి ద్వాలీ, భార్య రేణుక కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ‘దేశ రక్షణ కోసం వెళ్లి ఇలా తిరిగి వచ్చావా’ అంటూ ఆయన తల్లి చేసిన రోదనలు అందరినీ కంట తడి పెట్టించాయి. అలాగే, ‘మీ నాన్న వచ్చాడురా.. చిన్నా!’ అంటూ అనిల్ కుమారుడికి తండ్రి మృతదేహాన్ని చూపిస్తూ రేణుక కన్నీరుమున్నీరవడం అందరికీ ఆవేదనకు గురిచేసింది.కారేపల్లి: కాశ్మీర్ లోయలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన ఆర్మీ జవాన్ బానోతు అనిల్కుమార్కు కుటుంబీకులు, స్థానికులు బుధవారం వీడ్కోలు పలికారు. జై జవాన్, అమరహే అనిల్కుమార్ అంటూ నినాదాల నడుమ విద్యార్థులు, యువత, స్థానికులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఈనెల 11వ తేదీన కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన బానోతు అనిల్కుమార్ మృతి చెందిన విషయం విదితమే. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్కు అక్కడి నుంచి అక్కడి నుంచి బుధవారం ఉదయం ప్రత్యేక వాహనంలో కామేపల్లి కామేపల్లి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఈక్రమాన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనిల్ మృతదేహం నివాళులర్పించారు. అనంతరం కారేపల్లి క్రాస్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్ నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారీగా హాజరైన జనం కారేపల్లి క్రాస్ వద్దకు అనిల్ మృతదేహంతో కూడిన వాహనం చేరేసరికి యువకులు, విద్యార్థులు, స్థానికులు జాతీయ జెండాలో వేచి ఉన్నారు. ఆపై ఆయన మృతదేహం ఉన్న మిలటరీ వాహనాన్ని ఏడు కి.మీ. అనుసరిస్తూ స్వగ్రామానికి చేరారు. ఆపై అనిల్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చి నివాళులర్పించాక వ్యవసాయ పొలం తీసుకెళ్లారు. అక్కడ సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆపై అనిల్ అంత్యక్రియలు పూర్తిచేశారు. మాజీ ఎమ్మెల్యేలు లావుడ్యా రాములు నాయక్, బానోతు చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ సతీమణి మంజుల పాల్గొన్నారు. -
జిల్లాలో క్షీణించిన శాంతిభద్రతలు
ఖమ్మవైరారోడ్: జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆరోపించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండగా అభివృద్ధి మాటేమో కానీ మునుపెన్నడూ లేని విధంగా శాంతిభద్రతలు ప్రమాదంలో పడడంతో ప్రజలు ఆందోళనగా గడుపుతున్నారని తెలిపారు. ఎప్పుడు ఎక్కడ చోరీ జరుగుతుందో, ఎవరిపై ఆగంతకులు దాడి చేస్తారోనన్న భయంతో గడపాల్సి వస్తోందని చెప్పారు. మంత్రులు నివాసముండే కాలనీల్లోనే దొంగలు మారణాయుధాలతో తిరుగుతుండగా, హోటళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ మంత్రుల ప్రొటోకాల్కే సరిపోతుండడంతో ఉద్యోగ భాధ్యతలు నిర్వర్తించే సమయం చిక్కడం లేదని తాతా మధు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ ఖమ్మం నగర, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల అధ్యక్షులు పగడాల నాగరాజు, బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, కార్పొరేటర్ మక్బూల్, నాయకులు ఖమర్, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ -
అక్వాడెక్ట్ను పరిశీలించిన కలెక్టర్
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో ఆకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు అక్వాడెక్ట్కు అడ్డుగా బండరాళ్లు, గుట్టలు ఉండడంతో భారీ వర్షాల సమయాన వరద పోటెత్తే ప్రమాదముంది. ఈ విషయమై మంగళవారం ‘సాక్షి’లో ‘ఆకేరు అక్వాడెక్ట్కు అడ్డుగా గుట్టలు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందించారు. ఈమేరకు మంగళవారం అక్వాడెక్ట్ను పరిశీలించేందుకు రాగా అడ్డుగా ఉన్న బండరాళ్లను పొక్లెయినర్తో తీయిస్తున్నారు. అయితే, వరద వచ్చే వరకు ఏం చేశారని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. భూసేకరణ సమస్య ఉందని అధికారులు చెప్పగా.. వరద ప్రవాహం పరిశీలనకు సీసీ కెమెరా ఏర్పాటుచేయాలని ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్రెడ్డిని ఆదేశించారు. అనంతరం రాకాసితండా వాసులతో మాట్లాడిన కలెక్టర్ అనుదీప్ వరద పెరిగితే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్సాహెబ్ ఎంపీఓ సూర్యానారాయణ పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి సైతం బుధవారం రాకాసి తండాను పరిశీలించిన అధికారులతో వరదపై సమీక్షించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కూసుమంచి సీఐ సంజీవ్, తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తదితరులు పాల్గొన్నారు అడ్డుగా ఉన్న గుట్టల తొలగింపుపై సమీక్ష -
హత్యకు కుట్ర పన్నిన యువకుడిపై ఫిర్యాదు
కామేపల్లి: బీఆర్ఎస్ పార్టీ నాయకుల హత్యకు ఓ యువకుడు కుట్ర పన్నాడని పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మద్దులపల్లికి చెందిన బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సామా మోహన్రెడ్డి, నూకల ఉపేందర్ మాట్లాడుతూ తమను హత్య చేసేందుకు గడబోయిన హరీష్ మహబూబాబాద్ జిల్లాలోని ఓ రౌడీ షీటర్తో రూ.4 లక్షలకు సుపారీ కుదుర్చుకుని రూ.లక్ష చెల్లించినట్లు ఆడియో లీక్ అయిందని తెలిపారు. ఈమేరకు తమకు ప్రాణహానీ ఉన్నందున రక్షణ కల్పించడంతో పాటు పూర్తిస్థాయిలో విచారించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్ నాయకులపై హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రౌడీయిజం పెరిగిందని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే రౌడీషీటర్ ఉంటుండడం ఇందుకు నిదర్శమని తెలిపారు. అలాగే, తమ బీఆర్ఎస్ నాయకుల హత్యకు కుట్ర పన్నిన వారిపై చర్యలు తీసుకోవాలని మద్దులపల్లి కాంగ్రెస్, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. -
పెళ్లింట పెను విషాదం
● రోడ్డు ప్రమాదంలో వధువు అన్న, బంధువు దుర్మరణం ● వరుడికి కొత్త బట్టలు ఇచ్చేందుకు వెళ్తుండగా ఘటనతిరుమలాయపాలెం/ముదిగొండ: మూడేళ్ల క్రితం తండ్రి కన్నుమూశాడు.. దీంతో కుటుంబ బాధ్యత తీసుకున్న యువకుడు అన్నీ తానై చెల్లెలి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. 24గంటలు గడిస్తే చెల్లెలిని పెళ్లి మండపంలో చూడాల్సిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఆయనతో మరో బంధువు సైతం మృతి చెందడంతో అంత సేపు పెళ్లి సందడి నెలకొన్న ఇంట్లో విషాదం అలుముకుంది. ముదిగొండ మండలం గోకినపల్లి సమీపాన బుధవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వధువుకు మంగళస్నానం చేయించి... తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన దొండేటి నాగేశ్వరరావు – పద్మ దంపతులకు కుమారుడు సాయిరంజిత్(34) కుమార్తె సాయి మనీషా ఉన్నారు. నాగేశ్వరరావు గుండె సంబంధిత వ్యాధితో మూడేళ్ల క్రితం మృతిచెందాడు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన రంజిత్ కేరళలో ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఆయన చెల్లి సాయిమనీషా వివాహం నల్లగొండ జిల్లా దామరచర్ల వాసితో నిశ్చయం కాగా గురువారం వివాహం జరగాల్సి ఉంది. ఈమేరకు పిండిప్రోలులో చెల్లి సాయిమనీషా మంగళస్నానాల కార్యక్రమంలో కుటుంబంతో సంతోషంగా గడిపిన రంజిత్ వరుడికి పెళ్లి బట్టలు, ఇతర సామగ్రి ఇచ్చేందుకు సమీప బంధువు, తిరుమలాయపాలెంకు చెందిన కొండబాల శ్రీనివాసరావు (65)తో కలిసి కారులో దామరచర్ల బయలుదేరాడు. అయితే, భారీ వర్షం వస్తుండడంతో ముదిగొండ మండలం గోకినపల్లి వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా రంజిత్, శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలియగానే పెళ్లి పనులతో హడావుడిగా ఉన్న ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తిరుమలాయపాలెంకు చెందిన శ్రీనివాసరావుకి భార్య రమాదేవి, కుమారుడు రమేష్బాబు, కుమార్తె శరణ్య ఉన్నారు. కొంతకాలంగా కుమార్తె శరణ్య ఇంట్లోనే ఉంటుండగా ఆయన మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఘటనపై ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధ, గురువారాల్లో ఖమ్మంతో పాటు రఘునాథపాలెం మండలంలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం 4గంటలకు రఘునాథపాలెం మండలం దోనబండలో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, గురువారం ఉదయం ఖమ్మం 54వ డివిజన్ వీడీఓ కాలనీలోని రెడ్క్రాస్ సొసైటీ భవనంలో మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ను ప్రారంభించనున్న మంత్రి, ఆ తర్వాత 36వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.28 నుంచి అండర్–15 బ్యాడ్మింటన్ టోర్నీఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి అండర్–15 బాలబాలికల బ్యాడ్మింటన్ టోర్నీని ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వీరభద్రరావు, వి.చంద్రశేఖర్ తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు టోర్నీ జరుగుతుందని వారు వెల్లడించారు. ఈమేరకు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కమర్తపు మురళి, కోశాధికారి జట్ల శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం వారు టోర్నీ బ్రోచర్లు ఆవిష్కరించి మాట్లాడారు. నాలుగు రోజుల పాటు జరిగే పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు. ఎంట్రీల కోసం క్రీడాకారులు ఈనెల 24వ తేదీలోగా www.btronline.in లో సంప్రదించాలని సూచించారు. ప్రతీ జిల్లా జట్టులో ఐదుగురు ఆడనుండగా, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అంశాల్లో పోటీలు జరుగుతాయని.. ఇక్కడ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచే క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు.పోటీ పరీక్షలకు సిద్ధం చేయండిఏన్కూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులను నీట్, ఎప్సెట్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి రవిబాబు సూచించారు. ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన అభివృద్ధి పనులు, ఉపయోగిస్తున్న సామగ్రిని పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బోధన అందించాలని, ప్రాక్టికల్స్పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆతర్వాత లైబ్రరీ దినోత్సవం సందర్భంగా లైబ్రేరియన్ కవితను సన్మానించారు. ప్రిన్సిపాల్ సింహాచలం, అధ్యాపకులు సుందర్, కృష్ణప్రసాద్, బాబులాల్, రామారావు, వెంకటేశ్వరావు, విజయలక్ష్మి, నర్సింహారావు, రమాదేవి, కిషోర్బాబు పాల్గొన్నారు.స్టేషన్ను కొనసాగించాల్సిందే...చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేస్టేషన్ను ఎత్తివేయకుండా కొనసాగించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈమేరకు పాతర్లపాడు, నాగులవంచ రైల్వేకాలనీ, రామాపురం గ్రామాల ప్రజలు, విద్యార్థులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ప్రయాణికుల ఆదరణ లేదంటూ నాగులవంచ రైల్వేస్టేషన్ను మూసివేస్తున్నట్లు ఇటీవల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ మూసివేతతో చుట్టుపక్కల పదికి పైగా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడనున్నందున అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన సందర్భంగా స్థానికులు కోరారు. -
72 గంటలు అప్రమత్తంగా ఉండాలి
● వరద ముంచెత్తితే రంగంలోకి హెలీకాప్టర్లు ● వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్రెడ్డిఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న సూచనలతో అధికారులు రానున్న 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన పలువురు మంత్రులు, సీఎస్ రామకృష్ణారావులతో కలిసి వీసీ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బృందాలను సిద్ధం చేయడమే కాక అవసరమైన హెలీకాప్టర్లు సమకూర్చుకోవాలని తెలిపారు. గత సంవత్సరం ఖమ్మంలో ఎదురైన ఇబ్బంది ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఖమ్మం తదితర కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారులను నియమించి 24గంటలు పాటు పర్యవేక్షించాలని తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో సమావేశమై వరద ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డీఆర్ఓ పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్ఈలు వెంకటేశ్వర్లు, వాసంతి, ఆర్డీఓ నర్సింహారావు, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ ఈఈలు తానేశ్వర్, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నజైషన్ సిస్టమ్) ద్వారానే నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి హాజరు నమోదు తదితర అంశాలపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. అంతేకాక ఉపాధ్యాయుల డిప్యూటేషన్లపై సమీక్షించి విద్యార్థులు అధికంగా ఉన్న 237 పాఠశాలల్లో ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పారు. అలాగే, కేజీబీవీల్లో ఎఫ్ఆర్ఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరు, అపార్ నంబర్ల కేటాయింపు, పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థుల క్షేత్రస్థాయి సందర్శనలు, ఒక రోజు బ్యాగ్ లెస్ డే నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఈఓ నాగ పద్మజ, తదితరులు పాల్గొన్నారు. బాధితులకు భరోసాగా సఖి కేంద్రాలు ఖమ్మం క్రైం: సఖి కేంద్రాల ద్వారా మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూనే అన్యాయానికి గురైన వారికి బాసటగా నిలవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ప్రభుత్వ ప్రధాన ఆప్పత్రి ప్రాంగణంలోని సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, షీ టీమ్, భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన సెంటర్ను ఆశ్రయించిన వారి వివరాలు బాధితులకు అందించిన సాయంపై ఆరా తీశారు. ఇప్పటివరకు 2,338 మందికి సేవలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్యాయానికి గురైన మహిళలు హెల్ప్లైన్ 181 ఫోన్ చేసేలా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్రెడ్డి, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్.అరుణ, కోఆర్డినేటర్ జి.రాజకుమారి, సిబ్బంది ఈ.అంజని, టి.శ్రావణి, కె.సరిత, ఎం.సుమలత, ఎం.పుష్పలత, ఎన్.నవీన్కుమార్ పాల్గొన్నారు. -
యూరియా కష్టాలు తీరవా?
వాతావరణ ం జిల్లాలో బుధవారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.● పీఏసీఎస్ల ముందు రైతుల బారులు ● సరిపడా అందక ఆందోళనసాక్షి ప్రతినిధి, ఖమ్మం: పంటల సాగు జోరందుకున్న వేళ ఏపుగా పెరగడానికి యూరియా అవసరం. కానీ పడిగాపులు కాస్తున్నా సరిపడా అందక అదును దాటుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్లకు యూరియా స్టాక్ వచ్చిందని తెలియగానే పరుగులు తీస్తున్నారు. మునుపెన్నడూ ఈ పరిస్థితి లేకపోగా, ఈసారి యూరియా కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలోని కారేపల్లి, కొణిజర్లల్లో మంగళవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. నిత్యం రెండు, మూడు చోట్ల ఇదే పరిస్థితి ఎదురవుతుండగా పలుచోట్ల ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయితే, కేంద్రం నుంచే యూరియా తగినంత రావడం లేదని, ఉన్న వరకు ఇస్తున్నామంటూ పీఏసీఎస్ల బాధ్యులు సర్దిచెబుతున్నారు. ఈ మూడు నెలలే కీలకం.. యూరియా ఎక్కువగా పత్తి, వరి పంటలకే అవసరమవుతుంది. పత్తికి నాలుగైదు సార్లు యూరియా వేయాల్సి ఉంటుంది. ఇక వరి నాట్లు ముమ్మరమవుతుండడంతో పంటలకు కావల్సినంతా యూరియా అందుబాటులో ఉండాలి. ప్రధానంగా వచ్చే రెండు నెలల్లో వరికి యూరియా కీలకం కానుంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 54,826 మెట్రిక్ టన్నుల యూరియా పంటలకు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు జిల్లాకు 15,719 మెట్రిక్ టన్నులే సరఫరా అయింది. ఈ సీజన్లో 12,414 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశారు. వచ్చే నెలలో జిల్లాకు 21,244 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని అంచనా. పత్తి, వరి పంటలకు యూరియా కీలకం కావడంతో రైతులతో పాటు అధికారులు కూడా గండం గట్టెక్కడం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు.జిల్లాలో యూరియా అవసరం, సరఫరా (మెట్రిక్ టన్నుల్లో) నెల అవసరం సరఫరా జూలై 7,500 6,434 ఆగస్టు 4,610 1,631 సెప్టెంబర్ 21,244 –––గరిష్టం / కనిష్టం 300 / 230 -
ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ
ఖమ్మంవైరారోడ్: ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ పాలక మండలి ఎన్నికలు మంగళవారం జరగగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఓటు వేశారు. ప్రతిష్ఠాత్మక కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు సభ్యులుగా కొనసాగుతారు. ఈమేరకు పోలింగ్లో వద్దిరాజుతో పాటు మాజీ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, బాల్కన్ సుమన్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఊర చెరువు బుంగకు మరమ్మతులుబోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామ ఊర చెరువుకు వర్షానికి బుంగ పడింది. దీంతో నీరు వృథాగా పోతుండగా మంగళవారం ఇరిగేషన్ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, తహసీ ల్దార్ రమాదేవి ఆధ్వర్యాన బుంగ పూడ్పించారు. అలాగే, తూ ము పైపులైన్లు పగిలిన చోట కొత్తవి వేయించారు. భూదాన్ భూమిలో నిర్మాణంపై అభ్యంతరంఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్ల గుట్టపై ఏర్పాటైన వినోబా నవోదయ కాలనీ సమీపాన వాటర్ ట్యాంక్, ప్రహరీనిర్మాణాన్ని కాలనీ వాసులు మంగళవారం అడ్డుకున్నారు. ఇక్కడ 12ఏళ్ల నుంచి పలువురు నివాసం ఉంటుండగా.. ప్రొసీడింగ్స్, ఇంటి నంబర్లు పొందినా విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించలేదని ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యాన కోర్టులో స్టేటస్ కో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూప్రహరీ నిర్మించడం సరికాదని జేసీబీలు, పొక్లెయినర్లతో వచ్చిన రెవెన్యూ, పోలీసు సిబ్బంది ని అడ్డుకున్నారు. దీంతో తహసీల్దార్ సైదులు, సీఐ భానుప్రకాష్ చేరుకుని వారితో చర్చించా రు. అయితే, తమకు విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని స్థానికులు పేర్కొనడంతో ప్రజా అవసరాలు తీర్చే నిర్మాణాలకు సహకరించాలని అధికారులు సూచించారు. కాగా, ట్యాంక్ ద్వారా తమకు నీరు అందించడమే కాక విద్యు త్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘జాతీయ క్రీడా బిల్లు’పై మాట్లాడిన ఎంపీ రవిచంద్రఖమ్మంవైరారోడ్: రాజ్యసభలో మంగళవారం జాతీయ క్రీడలపాలన బిల్లు, ఉత్ప్రేరకాల నిరో ధక బిల్లును కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగి న చర్చలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. క్రీడలు, క్రీడాకారులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్ల పాలనలో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపా రు. దీంతో రాష్ట్ర క్రీడాకారులు పలువురు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటారని వెల్లడించారు. అంతేకాక క్రీడారంగానికి అత్యధిక నిధులు కేటాయించి జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేడియం నిర్మించారని తెలి పారు. అయితే, కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో క్రీడారంగానికి రూ.2161 కోట్లు కేటాయించి తెలంగాణకు కేవలం రూ.17 కోట్లే ఇవ్వడంస సరికాదని పేర్కొన్నారు. ఇకనైనా కేటాయింపుల్లో సవరణలు చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు. డైట్ ప్రిన్సిపాల్గా మేర్జుల్లా ఖాన్ఖమ్మం సహకారనగర్: ఖమ్మం డైట్ ప్రిన్సిపాల్గా మహ్మద్ మేర్జుల్లా ఖాన్ నియమితులయ్యారు. మహబూబ్నగర్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్గా కొనసాగుతున్న ఆయనకు ఖమ్మం ప్రిన్సిపాల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడ డైట్ ప్రిన్సిపాల్గా ఉన్న సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయడంతో మేర్జుల్లా ఖాన్ను నియమించారు. -
పెసర చేతికి వచ్చేసింది!
● ఖమ్మం మార్కెట్లో కొత్త పంట విక్రయాలు ● దిగుబడి రాక.. ధర దక్కక రైతుల ఆవేదనఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత వానాకాలంలో సాగు చేసిన పెసర చేతికికొస్తోంది. ఈమేరకు రైతులు పంటను ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు తీసుకొస్తున్నారు. మే నెల చివరి వారంలో కురిసిన వర్షాలకు మెట్ట పైరుగా పలువురు రైతులు పంట సాగు చేశారు. ఈ వానాకాలం పంట సాధారణ సాగు విస్తీర్ణం 16,838 ఎకరాలు కాగా 17,318 ఎకరాల్లో సాగైంది. ఖమ్మం అర్బన్, కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కామేపల్లి, మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, వైరా తదితర మండలాల్లో ఎక్కువగా సాగు చేయగా ప్రస్తుతం చేతికందుతోంది. అయితే దిగుబడి మాత్రం ఎకరాకు రెండు నుంచి రెండున్నర క్వింటాళ్లే రావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటల పెట్టుబడి కోసం.. ఖమ్మం మార్కెట్లో ఇప్పుడిప్పుడే కొత్త పెసల విక్రయం ఊపందుకుంటోంది. జిల్లాలో ఇప్పటికే పత్తి సాగు పూర్తికాగా, వరి నాట్లు కొనసాగుతున్నాయి. మిరప సాగుకు కూడా సమయం ఆసన్నం కావడంతో ముందుగా చేతికందిన పెసలు విక్రయించి నగదును ఇతర పంటల పెట్టుబడికి వినియోగించనున్నారు. ఈమేరకు రెండు, మూడు రోజుల నుంచి ఖమ్మం మార్కెట్కు పది నుంచి పదిహేను క్వింటాళ్ల పెసలు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పెసలు క్వింటాకు మద్దతు ధర రూ.8,768గా నిర్ణయించింది. కానీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం గరిష్టంగా రూ.6,660, మోడల్ ధర రూ.6,350, కనిష్ట ధర రూ.5,900గా నమోదైంది. మద్దతు ధరతో పోలిస్తే రూ.2 వేలకు పైగా తేడా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కొనుగోళ్లు లేక వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.దిగుబడి రాలేదు.. ధర లేదు వర్షాధారంగా నాలుగెకరాల్లో పెసర సాగు చేస్తే ఎకరాకు రెండున్నర క్వింటాళ్ల చొప్పున పది క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. మార్కెట్కు తీసుకొస్తే క్వింటాకు రూ.6వేలతో తీసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తే మరో రూ.25వేలకు పైగా లభించేవి. – కె.సైదులు, అల్లీపురం, ఖమ్మం అర్బన్ మండలం -
కాపు రాక ఆయిల్పామ్ మొక్కల తొలగింపు
వేంసూరు: ఆయిల్పామ్ సాగుతో దీర్ఘకాలం లాభాలు వస్తాయని రైతులు భావిస్తే ఆఫ్టైప్ మొక్కలతో నిరాశే మిగులుతోంది. నాలుగేళ్ల పాటు పెట్టుబడి పెట్టి కంటిపాపలా పెంచిన మొక్కలకు గెలలు రాకపోవడంతో చేసేదేం లేక మొక్కలు తొలగిస్తున్నారు. వేంసూరు మండలం వైఎస్.బంజర్ గ్రామానికి చెందిన మహిళా రైతు కొప్పుల శ్రీదేవి అశ్వారావుపేట నర్సరీ నుంచి మొక్కలు తెచ్చి ఆరెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశారు. అయితే, నాలుగేళ్లు దాగినా దిగుబడి రాకపోవడంతో ఆఫ్టైప్ మొక్కలుగా తేలింది. ఆయిల్ఫెడ్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో మంగళవారం జేసీబీతో ఆయా మొక్కలను తొలగించారు. -
ఆయుష్షు పోస్తూ..
ఆయువు పోయినా.. సుజాతనగర్: అమ్మ జన్మనిస్తే అవయవదానం పునర్జన్మనిస్తుంది.. మరణించినా కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. ఏ లోకంలో ఉన్నా మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మశ్వాస ఆగిపోయినా గుండె మాత్రం లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది.. ‘ఆయువు పోయినా.. అవయదానంతో ఊపిరిపోద్దాం.. అవయవాలను ఈ లోకంలో జీవించనిద్దాం.. రండి అవయదానం చేద్దాం.. మరణించినా మరో వ్యక్తిలో జీవించే ఉందాం’.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కొందరు అపోహలు, అనుమానాలతో వెనకడుగు వేస్తున్నారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఈ విషయమై విస్తృత అవగాహన కోసం ఏటా ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవదాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ●పెరికసింగారం.. నవీన్ కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామానికి చెందిన బత్తుల నవీన్ ఓ కంపెనీలో సేల్స్ బాయ్గా పనిచేసేవాడు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను హైదరాబాద్కు తరలించి చికిత్స చేయిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యులు అవగాహన కల్పించగా, ఆయన కుటుంబీకులు అవయవాలను దానం చేశారు. అవయవదానానికి ముందుకొస్తున్న కుటుంబాలు ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవగాహన నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం -
రైతుల ఆందోళన
కొణిజర్ల: యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు సిద్ధం కాగా అధికారులు నచ్చచెప్పారు. కొణిజర్ల మండలంలోని సాలెబంజర, సింగరాయపాలెం, తీగలబంజర, కొణిజర్ల తదితర గ్రామాల రైతులు యూరియా కోసం మంగళవారం కొణిజర్లలో సొసైటీ కార్యాలయానికి వచ్చారు. కానీ స్టాక్ లేదని సిబ్బంది చెప్పడంతో రైతులు ఆగ్రహంగా రోడ్డుపై బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి ఎస్ఐ జి.సూరజ్ చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని నచ్చచెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం ఏఓ బాలాజీ మాట్లాడుతూ రెండు రోజులలో యూరియా రానుందని తెలిపారు. -
ఆకేరు అక్వాడెక్ట్కు అడ్డుగా గుట్టలు
● నానాటికీ పెరుగుతున్న వరద ప్రవాహం ● రాకాసితండా వాసుల్లో ఆందోళనతిరుమలాయపాలెం: జిల్లాలో వర్షం లేకున్నా.. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిస్తే ఆకేరు నదికి వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి ఉండడంతో.. గత ఏడాది ప్రళయాన్ని తలుచుకుని మండలంలోని రాకాసి తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 1న భారీ వర్షాలు, వరదలతో తండా మునిగిపోగా స్థానికులు సర్వం కోల్పోయారు. అయితే, సీతారామ ప్రాజెక్టు అక్వాడెక్ట్ నిర్మాణంలో కాంట్రాక్టర్ తప్పిదాలతో ఎత్తయిన గ్రామాన్ని వరద ముంచెత్తిందనే ఆరోపణలు వచ్చాయి. వరంగల్ జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురవగా.. మంగళవారం సాయంత్రానికి ఆకేరు వరద పెరిగి సీతారామ ఆక్వాడెక్ట్కు తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఆక్వాడెక్ట్ నిర్మాణం పొడవుగానే ఉన్నా సగం కానాలు(నీరు వెళ్లే మార్గాలు) బండరాళ్లతో నిండి, భారీ గుట్ట అడ్డుగా ఉండడంతో నీరు పైకి పోటెత్తే ప్రమాదముంది. గత ఏడాది నుంచి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ఈసారి ఏం జరుగుతుందోనని రాకాసి తండా వాసులు నిత్యావసరాలు, విలువైన వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా తమ గోడు ఆలకించి అక్వాడెక్ట్కు అడ్డుగా ఉన్న బండరాళ్లు, గుట్టలను తొలగించాలని కోరుతున్నారు. -
ఇల్లెందు, మానుకోటకూ.. ‘సీతారామ’ జలాలు ఇవ్వండి
ఖమ్మంమయూరిసెంటర్: సీతారామ ప్రాజెక్టును ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సైతం అనుసంధానించి సాగునీరు సరఫరా చేయా లని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం మాస్లైన్ నాయకులు హైదరాబాద్లో మంగళవారం సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో సీతారామ ప్రా జెక్టును నిర్మించినా ఇల్లెందు ప్రాంత రైతులకు ప్ర యోజనం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు సీతారామ నీరు అందేలా చూడాలని కోరారు. అలాగే, పోడు సాగుదారులకు పొజిషన్ హక్కులు కల్పించి, అర్హులకు పట్టాలు జారీ చేయాలని, పోడు రైతులపై అటవీ అధికారుల దాడులను నిలిపివేయించాలన్నారు. అంతేకాక వ్యవసాయ కూలీలకు రూ.12 వేల భృతి, పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500 చెల్లింపుతో పాటు పెండింగ్ ఉపకార వేతనాలు, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయా లని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంతేకాక మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు మాస్లైన్, ఇతర వామపక్షల పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అధికారులకు సూచనలు చేస్తానని చెప్పారని రంగారావు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు కేజీ. రాంచందర్, కె.రమ, కె.సూర్యం పాల్గొన్నారు. సీఎంకు విన్నవించిన మాస్లైన్ నాయకులు -
ఫలితం ఏదీ?
పడిగాపులు కాసినా పని వదిలేసుకుని వచ్చా.... చేను పని వదిలేసుకుని రోజంతా లైన్లో ఉన్నా. నాలుగెకరాల్లో పత్తి వేశానని చెప్పినా రెండు యూరియా కట్టలే ఇచ్చారు. ఈ యూరియా పంటకు ఎటూ సరిపోదు. పెద్ద సార్లు అవసరం తగ్గట్టుగా యూరియా ఇవ్వకపోతే పంట నష్టపోతాం. – భూక్యా తులిస్యా, రైతు, వెంకిట్యాతండా రెండు బస్తాలే ఇచ్చారు... పది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. కానీ రెండు యూరియా బస్తాలే ఇచ్చారు. దీనికోసం చేను పని వదిలేసుకొని పొద్దాక ఉండాల్సి వచ్చింది. యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుంది. అధికారులు ఆలోచించి సరిపడా ఇవ్వాలి. – ఉప్పుగండ్ల శ్రీనివాసరావు, రైతు, పేరుపల్లికారేపల్లి: యూరియా కోసం రైతులు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్ని కావు. సొసైటీ కార్యాలయాల వద్ద పొద్దంతా పడిగాపులు కాసినా రెండుకు మించి బస్తాలు ఇవ్వకపోవడం.. పంటలకు అవసరం పెరుగుతుండంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం(సొసైటీ) పరిధి గ్రామాల్లో సుమారు 5వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. కానీ సొసైటీ ద్వారా రెండు నెలల్లో 7,244(3259.80 క్వింటాళ్లు) యూరియా బస్తాలను 2682 మంది రైతులకు పంపిణీ చేశారు. జూన్లో వ్యవసాయ భూమి ఆధారంగా ఐదు బస్తాల వరకు పంపిణీ చేయగా.. జూలైలో ఎంత భూమి ఉన్నా రెండేసి బస్తాలే ఇచ్చారు. ఇక ఈనెలలోనూ అదే పరిస్థితి ఉండడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూరియా అవసరం పెరగడంతో సొసైటీకి ఎప్పుడు స్టాక్ వచ్చిందని తెలిసినా ఉదయం లైన్ కడుతున్నారు. రోజంతా వేచి ఉన్నా ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూరియా కోసం రైతుల వెతలు రేషన్ విధానంలో పంపిణీపై అసహనం -
పులిగుండాల అభివృది్ధకి రూ.4.20కోట్లు
● కిన్నెరసాని, భద్రాచలం, పులిగుండాల సందర్శనకు ప్యాకేజీ ● డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్సత్తుపల్లిటౌన్: జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.4.20 కోట్లు మంజూరు చేసిందని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ.1.89 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. సత్తుపల్లి చెక్పోస్టు, క్వార్టర్లు, టింబర్ డిపోను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం కంటైనర్ ఆస్పత్రి, వాచ్టవర్ను పరిశీలించాక చంద్రాయపాలెంలో వనసంరక్షణ సమితి బాధ్యులతో మాట్లాడారు. పులి గుండాల ఎకో టూరిజం, కిన్నెరసాని, భద్రాచలంను సందర్శించేలా ప్యాకేజీ రూపొందిస్తున్నట్లు తెలి పారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టెంట్తో బస ఏర్పాటు చేస్తామని, పులిగుండాల వద్ద బ్యాటరీ వాహనంతో పాటు రెండు సఫారీ వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సందర్శకుల కోసం సోలార్బోట్ సమకూర్చడమే కాక ప్రాజెక్టు వద్ద రక్షణ కోసం ఫెన్సింగ్, 30 కి.మీ. సఫారీ రూట్, కాకతీయుల తోరణంతో గేట్, రిసెప్ష్షన్ సెంటర్ నిర్మించనున్నట్లు తెలిపారు. పులిగుండాల గుట్టపై పల్లెర్ల బావి, వీరభద్రస్వామి ఆలయం, పాలపిట్ట వాచ్ టవర్తో పాటు జలపాతం సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయని చెప్పారు. కాగా, గూడూరు, లోకారం, చంద్రాయపాలెం, వీఎస్ఎస్ సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉత్పత్తులను మహిళా మార్ట్తో అనుసంధానం చేస్తామని డీఎఫ్ఓ తెలిపారు. పోడుదారులపై చర్యలు అడవిలో పోడు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్ హెచ్చరించారు. అటవీ సంరక్షణ, అక్రమ తవ్వకాల నివారణ, వన్యప్రాణి రక్షణ, అటవీ అభివృద్ధిపై వీఎస్ఎస్ సభ్యులతో చర్చించాక సూచనలు చేశారు. సత్తుపల్లి ఎఫ్డీఓ వి.మంజుల, టాస్క్ఫోర్స్ రేంజర్ శ్రీనివాసరావు, వైల్డ్లైఫ్ ఎక్స్ఫర్ట్ దీపక్నారాయణ పాల్గొన్నారు. -
ఆర్టీసీకి కలిసొచ్చింది..
వరుస సెలవులతో ప్రయాణికుల రద్దీ ● నాలుగు రోజుల్లో రూ.1.21 కోట్ల ఆదాయం ● అత్యధికంగా మధిర నుంచి రూ.29.84 లక్షలురద్దీలోనూ మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు విపరీతమైన రద్దీలోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేశారు. రక్షా బంధన్ పండుగ రోజు రీజియన్ వ్యాప్తంగా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 1.50 లక్షల మంది మహిళామణులు ప్రయాణించారు. ఈరోజు మొత్తంగా 2లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇక ఆదివారం అదనంగా 137 సర్వీసులు నడిపించారు. కాగా, రీజియన్కు రికార్డు స్థాయిలో కేవలం ప్రత్యేక సర్వీసుల ద్వారానే రూ.1.21 కోట్ల ఆదాయం నమోదుకాగా.. అత్యధికంగా మధిర డిపో నుంచి రూ.29.84 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు రోజుల్లో డిపోల వారీగా ఆదాయం (ప్రత్యేక సర్వీసుల ద్వారా) డిపో కిలోమీటర్లు ఆదాయం (రూ.లక్షల్లో) మధిర 42,316 29.84భద్రాచలం 42,958 25.81ఖమ్మం 38,022 20.99సత్తుపల్లి 26,122 15.58మణుగూరు 24,096 12.05కొత్తగూడెం 15,155 9.16ఇల్లెందు 11,797 7.88మొత్తం 2,00,466 121.35ఖమ్మంమయూరిసెంటర్: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వత్రం, రాఖీ పౌర్ణమి రెండో శనివారం.. ఆ తర్వాత ఆదివారం కావడంతో జనమంతా ఊర్ల బాట పట్టడం ఆర్టీసీకి కలిసొచ్చింది. ఈనెల 7నుంచి 10వ తేదీ వరకు ఆర్టీసీ ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల ద్వారా 374 బస్సులు నడిపించారు. ఆ బస్సుల్లో లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంతో కాసుల పంట పండింది. ప్రణాళికాయుతంగా.. ఈనెల 8న శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోగా విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలీడే ఇచ్చారు. ఆ మరుసటి రోజు రాఖీ పండుగ, ఆపై ఆదివారం కలిసొస్తుండడంతో చాలా మంది 7వ తేదీనే సొంత ఊర్లకు పయనమయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలకు ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక 9వ తేదీన హైదరాబాద్తో పాటు జిల్లాలో రద్దీ ఉన్న ప్రాంతాలకు బస్సులు తిప్పారు. అంతేకాక 10వ తేదీ ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్కు తిరుగుప్రయాణం అయ్యేవారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తూ బస్టాండ్లలో అదనపు సిబ్బంది ద్వారా పర్యవేక్షించడంతో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు రాఖీ పండుగ, మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యాన ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నాం. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని ఉద్యోగులకు సూచనలు చేశాం. డిప్యూటీ ఆర్ఎం, డిపో మేనేజర్లతో పాటు నేను కూడా బస్టాండ్లలో పర్యవేక్షిస్తూ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయడంతో ఏ సమస్యా రాలేదు. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్9వ తేదీన ఓఆర్.. 112 సత్తుపల్లిటౌన్: వరుస సెలవులతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఖమ్మం రీజియన్లో అదనపు సర్వీసులు నడిపించామని రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో, బస్టాండ్తో పాటు మందలపల్లి, అశ్వారావుపేట బస్టాండ్లను సోమవారం పరిశీలించిన ఆయన సత్తుపల్లిలో మాట్లాడారు. రాఖీ పండుగ రోజున రీజియన్లో ఓఆర్ 112గా నమోదైందని తెలిపారు. హైదరాబాద్ నుంచి రాఖీ పౌర్ణమికి వచ్చే ప్రయాణికుల కోసం 7, 8వ తేదీల్లో 102 అదనపు సర్వీసులు, సత్తుపల్లి–ఖమ్మం మధ్య అదనంగా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులను నడిపించామని ఆర్ఎం వెల్లడించారు. డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఉద్యోగులు ఎస్.సాహితి, బాలస్వామి, వెంకటయ్య, ఆనంద్, ఆనందం పాల్గొన్నారు. -
జిల్లా జడ్జిని కలిసిన సబ్కలెక్టర్
ఖమ్మంలీగల్: కల్లూరు సబ్కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అజయ్యాదవ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ను సోమవారం కలిశారు. జిల్లా కోర్టులో న్యాయమూర్తిని ఆయన మర్యాదపూర్వకంగా కలవగా వివిధ అంశాలపై చర్చించారు. రేపు డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఖమ్మం సహకారనగర్: రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా స్థాయిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. కళాశాల చరిత్ర విభాగం, ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యాన ‘భారతదేశ స్వాతంత్రోద్యమం – ప్రపంచానికి ఆదర్శం’ అంశంపై వ్యాసరచన పోటీ ఈనెల 13న ఉంటుందని వెల్లడించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసే అవకాశం ఉండగా, వివరాలకు 79819 52341, 7731944849 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి ఏన్కూరు: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పా టించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. ఏన్కూరులోని గురుకుల విద్యాలయం, కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల పరిసరాలు, మరుగుదొడ్లు, డార్మెటరీలతో పాటు మధ్యాహ్న భోజనం అమలుతీరును పరిశీలించాక మాట్లాడారు. విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని.. తద్వారా శ్రద్ధగా చదువుకోవచ్చని తెలిపారు. కాగా, విద్యార్థులకు సీఈఓ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైధ్యాధికారులు బి.రాములు, మౌనిక, ప్రిన్సిపాల్ టి.శ్రీనివాసరెడ్డి, ప్రత్యేకాధికారి లావణ్య, హెచ్ఎం రాఘవరావు పాల్గొన్నారు. రైతు బీమా అర్హుల జాబితా ప్రదర్శన ఖమ్మంవ్యవసాయం: రైతు బీమా పథకం ఎనిమిది పాలసీకి అర్హులైన రైతుల జాబి తాలను వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా విడుదల చేశారు. ఈ జాబి తాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించగా, అర్హులైన రైతులు తమ దరఖాస్తులకు ధ్రువపత్రాలు జత చేసి రైతు వేదికల్లో ఏఈఓ లకు అందజేయాల్సి ఉంటుంది. కాగా, అర్హులైన రైతులు సకాలంలో రైతు బీమా పథకానికి నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. -
జిల్లా జడ్జిని కలిసిన సబ్కలెక్టర్
ఖమ్మంలీగల్: కల్లూరు సబ్కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అజయ్యాదవ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ను సోమవారం కలిశారు. జిల్లా కోర్టులో న్యాయమూర్తిని ఆయన మర్యాదపూర్వకంగా కలవగా వివిధ అంశాలపై చర్చించారు. రేపు డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఖమ్మం సహకారనగర్: రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా స్థాయిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. కళాశాల చరిత్ర విభాగం, ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యాన ‘భారతదేశ స్వాతంత్రోద్యమం – ప్రపంచానికి ఆదర్శం’ అంశంపై వ్యాసరచన పోటీ ఈనెల 13న ఉంటుందని వెల్లడించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసే అవకాశం ఉండగా, వివరాలకు 79819 52341, 7731944849 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి ఏన్కూరు: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పా టించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. ఏన్కూరులోని గురుకుల విద్యాలయం, కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల పరిసరాలు, మరుగుదొడ్లు, డార్మెటరీలతో పాటు మధ్యాహ్న భోజనం అమలుతీరును పరిశీలించాక మాట్లాడారు. విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని.. తద్వారా శ్రద్ధగా చదువుకోవచ్చని తెలిపారు. కాగా, విద్యార్థులకు సీఈఓ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైధ్యాధికారులు బి.రాములు, మౌనిక, ప్రిన్సిపాల్ టి.శ్రీనివాసరెడ్డి, ప్రత్యేకాధికారి లావణ్య, హెచ్ఎం రాఘవరావు పాల్గొన్నారు. రైతు బీమా అర్హుల జాబితా ప్రదర్శన ఖమ్మంవ్యవసాయం: రైతు బీమా పథకం ఎనిమిది పాలసీకి అర్హులైన రైతుల జాబి తాలను వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా విడుదల చేశారు. ఈ జాబి తాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించగా, అర్హులైన రైతులు తమ దరఖాస్తులకు ధ్రువపత్రాలు జత చేసి రైతు వేదికల్లో ఏఈఓ లకు అందజేయాల్సి ఉంటుంది. కాగా, అర్హులైన రైతులు సకాలంలో రైతు బీమా పథకానికి నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. -
అంతా అప్రమత్తంగా ఉండండి..
రాజీవ్ స్వగృహ టౌన్షిప్ వేలం ఖమ్మంరూరల్: పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ ఆధ్వర్యాన పూర్తయిన, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనా లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ స్వగృహ భవన సముదాయాన్ని కలెక్టర్ సోమవారం పరిశీలించారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులు, బిల్డర్లతో సమావేశమై మాట్లాడారు. ఇక్కడ నివాసముండే వారికి మున్నేటి వరద నుంచి ఇబ్బంది రాకుండా రిటైనింగ్వాల్ నిర్మిస్తామని తెలిపారు. ఎనిమిది బ్లాక్లు, తొమ్మిది ఫ్లోర్లు, ఫ్లోర్కు ఎనిమిది ఫ్లాట్ల చొప్పున 576 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పారు. ఆసక్తి ఉన్న సంఘాలు, బిల్డర్లు, డెవలపర్లు సెప్టెంబర్ 6లోగా టెండర్ దాఖలు చేయాలని తెలిపారు. కాగా, మున్సిపాలిటీ వారు బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చివేస్తుండగా, మున్నేటి పక్కన స్వగృహ టౌన్షిప్ పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నించగా రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అధికారికంగా అనుమతి ఇచ్చినట్లే అవుతుందని కలెక్టర్ తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎస్ఈ భాస్కర్రెడ్డి, ఈఈ నరేందర్రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఈనెల 14నుంచి 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందున్న వాతావరణ శాఖ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించాక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సూచనలు చేయడంతో పాటు మంగళవారం సాయంత్రంలోగా శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల జాబితా సమర్పించాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. కాగా, వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రభుత్వ వ్యతిరేక వార్తలను అధికారులు సమీక్షించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తొలుత అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్.. పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● వైరా మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన డి.రాంబాబు ఇంటి నంబర్ మంజూరు చేయాలని కోరారు. ● మధిరకు చెందిన డి. వెంకటమ్మ తన భర్త కలెక్టరేట్లో స్వీపర్గా పనిచేసిన కాలానికి ధృవీకరణ పత్రం ఇప్పించాలని కోరారు. అలాగే, కొణిజర్ల మండలం పల్లిపాడు హైస్కూల్ స్వీపర్గా పనిచేసిన వెంకటేశ్వర్లు తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ● రఘునాధపాలెం మండలం పువ్వాడనగర్కు చెందిన షేక్ బీబమ్మ, కట్ట మోహన్, నల్ల నీలవేణి తదితరులు తమ పేర్లు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఉన్నందున మంజూరు పత్రాలు ఇప్పించాలని కోరారు. సమస్య పరిష్కరించండి ఖానాపురం హవేలీ పరిధిలో మా అమ్మ కాంతమ్మ పేరుతో 150 చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని 1997లో కేటాయించారు. కానీ ఇప్పటి వరకు స్థలాన్ని స్వాధీనం చేయలేదు. సర్వేయర్ పరిశీలించినందున యంత్రాంగం స్థలాన్ని అప్పగించాలి. – పేరం దాసయ్య, ఎక్స్ సర్వీస్మెన్, బీరోలు ఈనెల 14నుంచి భారీ వర్షాలకు అవకాశం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
పాత పద్ధతిలోనే ఎస్సెస్సీ పరీక్షలు
80 మార్కులకు పరీక్ష.. ఇంటర్నల్ మార్కులు 20 ఖమ్మం సహకారనగర్: పదో తరగతి విద్యార్థులకు పాత విధానంలో వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయింది. గత ఏడాది వరకు 80మార్కులు పరీక్ష ద్వారా, 20మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా కేటాయించేవారు. కానీ ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయంటూ ప్రభుత్వం గతేడాది పరీక్షల సమయాన 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అయినా ఇది అమలుకు నోచుకోలేదు. ఇక ఈ విద్యాసంవత్సరం మాత్రం ఇంటర్నల్ మార్కులు తొలగిస్తామని ముందు నుంచి చెబుతుండగా.. మళ్లీ పాత పద్ధతిలోనే నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. జిల్లాలోని 212 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,500మంది పదో తరగతి చదువుతుండగా, వీరికి థియరీతో పాటు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అమలుచేస్తారు. ఇప్పటికే పూర్తయిన ఎస్ఏ–1 పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ)–1 పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు విడతలుగా ఎఫ్ఏ పరీక్షలు నిర్వహించి.. ప్రత్యేక బృందాల ద్వారా జవాబుపత్రాల పరిశీలన చేపడుతారు. పరీక్షల్లోని మార్కుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి ఇంటర్నల్ మార్కులు కేటాయిస్తారు. ఆపై మిగతా 80మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈవిషయమై జిల్లా పరీక్షల బోర్డు(డీసీఈబీ) కార్యదర్శి కనపర్తి వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటర్నల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. -
అల్బెండజోల్తో రక్షణ
ఖమ్మంవైద్యవిభాగం: చిన్నారుల శారీ రక, మానసిక ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తున్న నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన మాత్రలు అందజేసి మాట్లాడారు. జిల్లాలో 3,11,317 మంది పిల్లలకు మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎవరైనా మిగిలిపోతే 18వ తేదీన అందిస్తామని చెప్పారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చందూనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన అవసరం
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం స్పోర్ట్స్: ప్రతి ఒక్కరు ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం వద్ద సోమవారం ఆమె 5కే రన్ను డీవైఎస్ఓ సునీల్రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. యువత ఎయిడ్స్పై అవగాహన పెంచుకోవడమే అనర్థాలను ఇంకొందరికి వివరించాని సూచించారు. కాగా, రన్లో 100 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొనగా బాలికల విభా గంలో ఎస్.కే.ఆప్రిన్, నాగజ్యోతి, బాలుర విభాగంలో అనిల్, ఎస్.గోపీచంద్ మొదటి రెండు స్థానాల్లో నిలవడంతో నగదు బహమతులు అందజేశారు. ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ, వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ పీఓలు డి.సత్యకుమార్, ఎం.డీ.అలీ, వీరయ్య, రామకృష్ణ, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో వైద్యాధికారుల నియామకానికి మెరిట్ జాబితా విడుదల చేశామని డీసీహెచ్ఓ డాక్టర్ కె.రాజశేఖర్గౌడ్ తెలిపారు. ఈనెల 6న నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన వారితో సిద్ధం చేసిన జాబితాను https:// khammam. telangana. gov. in వెబ్సైట్లో పొందుపర్చామని వెల్లడించారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఈనెల 14లోగా సమర్పించాలని ఆయన సూచించారు. ఆలయ నిర్వహణ, అభివృద్ధికి రూ.5 లక్షలుసత్తుపల్లిటౌన్: సత్తుపల్లి జేవీఆర్ పార్కు ఎదురుగా ఉన్న శ్రీహరిహరాత్మజ అయ్యప్పస్వామి ఆలయ నిర్వహణ, అభివృద్ధికి బెంగళూరుకు చెందిన భక్తుడు సోమవారం రూ.5లక్షలు అందజేశారు. వాసవీ కన్స్ట్రక్షన్స్ అధినేత గాధంశెట్టి నాగరాజు ఈ నగదు అందజేశాక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల య కమిటీ చైర్మన్ దోసపాటి అమరలింగేశ్వరరావు, బొంతు శ్రీనివాసరావు, అర్చకులు సురేష్ ఆచార్యులు పాల్గొన్నారు. ఊరచెరువుకు బుంగబోనకల్: మండలంలోని ము ష్టికుంట్ల గ్రామ ఊరచెరువుకు బుంగ పడడంతో నీరు వృథా గా పోతోంది. ఇటీవల కురిసి న వర్షాలకు చెరువుకట్ట తూము వద్ద పెద్దఎత్తున బుంగ పడింది. దీంతో నీరు వృథా అవుతున నేపథ్యాన అధికారులు మరమ్మతు చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. పలుచోట్ల ఓ మోస్తరు వానఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతా ల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉద యం 8–30నుంచి సోమవారం ఉదయం 8–30 గంటల వరకు వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం జిల్లాలో సగటున 20.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధి కంగా బోనకల్ మండలంలో 58.6 మి.మీ.గా నమోదవగా చింతకానిలో 49.4, కల్లూరులో 38.4, కొణిజర్లలో 33.4, పెనుబల్లిలో 32.2, కూసుమంచిలో 31.8, తల్లాడలో 29.2, నేలకొండపల్లిలో 28.4, కామేపల్లిలో 20.8 మి.మీ. వర్షపాం నమోదైందని వెల్ల డించారు. అలాగే, వైరా, తిరుమలాయపాలెం, సత్తుపల్లి, ఖమ్మం అర్బన్, మధిర, ఖమ్మం రూరల్, ముదిగొండ, రఘునాథపాలెం, ఏన్కూ రు, సింగరేణి మండలాల్లోనూ వర్ష ప్రభావం కని పించింది. ప్రస్తుతం కురుస్తున్న వాన సాగులో ఉన్న పత్తి, వరి, ఇతర పంటలకే కాక వరినాట్లకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. -
కేజీబీవీలకు ఆదరణ..
పాల్వంచరూరల్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు.. అందుతున్న బోధన సత్ఫలితాలను ఇస్తున్నాయి. కేజీబీవీ ల్లో విద్యార్థినులకు ఉచిత భోజనం, వసతి, దుస్తులు ఇవ్వడంతో పాటు నాణ్యమైన బోధన అందుతోంది. గత వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 28 కస్తూ ర్బాగాంధీ కళాశాలల్లో ఈ ఏడా ది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పెరిగా యి. కొన్ని కళాశాలల్లో కొంతమేర తగ్గినా.. మొత్తంగా చూస్తే ప్రవేశాల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో 8,234 మంది విద్యార్థినులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరారు. భద్రాద్రి జిల్లాలోని కేజీబీవీల్లో 3,719 మంది చేరగా, ఖమ్మం జిల్లా కేజీబీవీల్లో 4,515 మంది ప్రవేశాలు పొందారు. అయితే, ప్రవేశాలు పెరిగినా ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంకా 544 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెంలో 23, పెనుబల్లి 34, సింగరేణి 20, లింగాల 24, బోనకల్ 24, కూసుమంచి 23, ఏన్కూరు 14, కొణిజర్ల 15, ముదిగొండలో ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. ఆయా సీట్ల భర్తీకి ఈనెల 15 వరకు స్పాట్ ఆడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్ జీసీడీఓ ఎం.తులసి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కస్తూర్బా కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు ఫలితమిచ్చిన ఇంటింటి ప్రచారం ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 8,234 మంది చేరికజిల్లాలోని కేజీబీవీల్లో గత ఏడాది, ఈ ఏడాది ప్రవేశాలు 2024 – 25 2025 – 26 ఎర్రుపాలెం 277 283 పెనుబల్లి 219 300 సింగరేణి 309 341 లింగాల 291 263 బోనకల్ 289 318 కూసుమంచి 302 334 ఏన్కూరు 317 329 కొణిజర్ల 281 288 ముదిగొండ 311 330 చింతకాని 330 334 ఖమ్మం 317 352 రఘునాథపాలెం 300 330 తిరుమలాయపాలెం 359 354 కొత్తూరు (వై) 369 369 మొత్తం 4,271 4,515 -
కాశ్మీర్ లోయలో ప్రమాదం...
● ఆర్మీ జవాన్, జిల్లా వాసి మృతి ● ట్రక్కు లోయలో పడడంతో ఘటనకారేపల్లి: కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బానోతు అనిల్కుమార్(30) కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. విధుల్లో భాగంగా ఆయన సోమవారం కాశ్మీర్ లోయ ప్రాంతంలో వెళ్తుండగా ట్రక్కు లోయలో పడినట్లు తెలిసింది. అనిల్ సహా మరికొందరు ఆర్మీ జవాన్లకు గాయాలు కాగా, ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడని అక్కడి అధికారులు అనిల్ సోదరుడు ప్రసాద్కు సమాచారం ఇచ్చారు. చిన్నప్పటి నుంచే దేశసేవపై మక్కువ.. ఇంటర్మీడియట్ చదివిన అనిల్కుమార్కు చిన్నప్పటి నుంచి ఆర్మీలో ఉద్యోగం సాధించి దేశసేవ చేయాలని లక్ష్యంగా ఉండేదని స్థానికులు తెలిపారు. 2012లో ఆర్మీలో చేరిన అనిల్ మరో రెండేళ్లయితే రిటైర్డ్ అయ్యేవాడని తెలిసింది. ఆయన తండ్రి మంగీలాల్ కేన్సర్ బారిన పడగా కాపాడేందుకు ఆర్మీ హాస్పిటల్లో అనిల్ చికిత్స చేయించినా ఫలితం దక్కక ఏడాది క్రితం మృతి చెందాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనిల్కు భార్య రేణుక, ఎనిమిది నెలల కుమారుడితో పాటు సోదరుడు ప్రసాద్, ఒక సోదరి ఉన్నారు. కాగా, అనిల్ మృతదేహాన్ని మంగళవారం విజయవాడ ఎయిర్పోర్ట్లో కుటుంబీకులకు అప్పగించనుండగా, అక్కడి నుంచి గ్రామానికి తీసుకొస్తారు. ఈ మేరకు ఆయన భార్య రేణుక, కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. -
టేబుల్ టెన్నిస్ ఉమ్మడి జల్లా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ జట్లను ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం ఎంపిక చేశారు. ఈమేరకు జట్ల వివరాలను టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్కుమార్, వీవీఎస్.సాంబమూర్తి తెలిపారు. అండర్–11 బాలుర జట్టులో అనుమోలు శ్రేయన్, జాయ్, ఈశ్వర్, హేమంత్ సాయి, నిహాల్ కృష్ణ, యశ్వంత్, రోషన్, బాలికల జట్టుకు బాలసాని హర్వికలక్ష్మి, పి.ఆరాధ్య, తోట జిజ్ఞాస, రోస్మిత, అండర్–13 బాలికల జట్టులో పర్స వంషిక, బాలసాని తన్మయిశ్రీ, బొంతు సాయిశివాని, బాలుర జట్టులో కోటగిరి హితేష్ శ్రీరంగా, ఈ.హరి, అభిలాష్, అన్వేష్, సాయి హర్షిత్ ఎంపికయ్యారని వెల్లడించారు. అలాగే, అండర్–15 బాలికల జట్టులో హర్షిత, అఖిల, స్పందన చంద్ర, చిలకబత్తిన పావని, బాలురు జట్టుకు షేక్ సాహెల్ ఫజల్, జి.చార్విక్, ఈ.తరుణ్, ఏ.ఉజ్వల్, ప్రజ్ఞ, అండర్–17 బాలురు జట్టుకు పరిటాల జ్వలిత్, పిట్టల మోహిత్ కృష్ణ, రామ్ సాకేత్, రణధీర్రెడ్డి, సైఫ్, అనస్, బాలికల జట్టులో గద్దల సిరి, పి.అమత, జి.చంద్రికరాణి, షర్మిలరాణి, సుప్రియ, అండర్–19 బాలికల జట్టులో బి.అఖిల, సౌమ్య, స్ఫూర్తి, రష్మీ, బాలురు జట్టులో జెస్సీ, ధనుష్, గుణ సోమశేఖర్ ఎంపికయ్యారని తెలిపారు. ఆయా జట్లు ఈనెల 22నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటాయని అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు. -
240మందికి సైకిళ్లు, వెయ్యి మందికి యూనిఫామ్
సత్తుపల్లి: అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర సౌకర్యాలే ఉన్నా కష్టపడి చదువుకుని ఈ స్థాయికి చేరామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి వెల్లడించారు. ఊరి నుంచి మూడు తెలిపా రు. ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సబ్కలెక్టర్ అజయ్యాదవ్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థినులకు 240 మందికి ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే, సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో వెయ్యి మంది విద్యార్థులకు యూనిఫామ్, నోట్ పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికై న 12 మందికి రూ.60వేల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. అలాగే, పాతసెంటర్ హైస్కూ ల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన డాక్టర్ ఇమ్మడి నిఖిల్ సహకారంతో 45మందికి రూ.వెయ్యి విలువైన కిట్లు, మండల స్థాయి రూ.10వేల చొప్పు న అందజేశాక ఎమ్మెల్యే మాట్లాడారు. మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు గాదె చెన్నారావు, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, మలిరెడ్డి మురళీరెడ్డి, తోట సుజలరాణి, ఎం.డీ.కమల్పాషా, నారాయణవరపు శ్రీని వాస్, చల్లగుళ్ల నర్సింహారావు మున్సిపల్ కవిషనర్ నర్సింహ, తహసీల్దార్ సత్యనారాయణ, పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే రాగమయికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా అందించిన ఎమ్మెల్యే రాగమయి -
నాటిక పోటీల్లో విజేత.. ‘ఖరీదైన జైళ్లు’
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలో నాలుగురోజుల పాటు జరిగిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. కరీంనగర్ చైతన్యభారతి కళాసంస్థ ప్రదర్శించిన ఖరీదైన జైళ్లు, హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు ప్రదర్శించిన అమ్మ చెక్కిన బొమ్మ, తాడేపల్లికి చెందిన అరవింద్ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన విడాకులు కావాలి నాటికలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం తొమ్మిది నా టికలు ప్రదర్శించగా రంగస్థల నటులు సుబ్బ రాయ శర్మ, మేక రామకృష్ణ, గోవిందరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈమేరకు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నాటికలు ప్రదర్శించిన సంస్థలు, ఉత్తమ దర్శకులు, నటులకు బహుమతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అన్నాబత్తుల సు బ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్రావు, దేవేంద్ర, డాక్టర్ నాగబత్తిని రవి, వేల్పుల విజేత, నామ లక్ష్మీనారాయణ, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలోనే అంతరాయం..
● శిథిలమైన సాగర్ కాల్వలతో ఇక్కట్లు ● పూడికకు తోడు గండ్లతో నీరు సాగక రైతుల ఆవేదనఖమ్మం అర్బన్: గతంతో పోలిస్తే ఈసారి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగు అవసరాలకు ముందుగానే నీరు విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు సంతోషించారు. కానీ కాల్వల్లో అడ్డంకులు, శిథిలమైన లైనింగ్తో చివరి వరకు నీరు చేరే పరిస్థితి లేకపోవడం.. మార్గమధ్యలో గండ్లు పడే ప్రమాదం ఉండడంతో వారి ఆశలు ఆదిలోనే అడియాసలవుతున్నాయి. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని బ్రాంచ్, మేజర్లు, మైనర్లు అనేకచోట్ల బలహీనంగా ఉండడం.. పూడిక, చెత్త, పిచ్చిమొక్కలతో నిండిపోవడం సాగునీటి సరఫరాకు అడ్డంకిగా మారుతోంది. వేసవిలో శాశ్వత మరమ్మతులు చేయించాల్సి ఉన్నా తాత్కాలిక పనులతోనే సరిపెట్టడంతో ఇప్పుడు నీరు విడుదల చేయగానే లోపాలు బయటపడుతున్నాయి. గత ఏడాది కూసుమంచిలో.. గతేడాది ఆగస్టు చివరి వారం భారీ వర్షాలతో సాగర్ ప్రధాన కాల్వకు వరద పోటెత్తింది. దీంతో కూసుమంచి వద్ద యూటీ తెగిపోగా భారీ నష్టం జరిగింది. రూ.కోట్లాది నిధులతో మరమ్మతులు చేసి ఇటీవలే నీరు విడుదల చేశారు. ఇంతలోనే వేంసూరు మండలం కుంచపర్తి సమీపాన కాల్వకు ఆదివారం భారీ గండి పడింది. గండి చుట్టూ మట్టి కొట్టుకుపోవడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే సీజన్ చివరి వరకు నీటి సరఫరా సాఫీగా సాగుతుందా, లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు అధికారికంగా 2.54 లక్షల ఎకరాలు ఉండగా.. ఎత్తిపోతల పథకాలతో కలిపి 3లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సి ఉంది. కానీ కాల్వల దుస్థితి, మరమ్మతు చేయకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. తాత్కాలిక మరమ్మతులతోనే సరి గత వానాకాలంలో పాలేరు నుంచి సాగర్ ప్రధాన కాల్వ మీదుగా పలుచోట్ల గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెట్టారు. ప్రధాన కాల్వతో పాటు బ్రాంచ్, మేజర్లు, మైనర్లలో పూడిక పేరుకుపోవడం, తూములు, షట్టర్లు ధ్వంసమవడం, చెట్లు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఏన్కూరు, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో కాల్వల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వంతెనలు శిథిలావస్థలో ఉండగా, రెగ్యులేటరీల షట్టర్లు ధ్వంసమై నీరు సాఫీగా సాగడం లేదు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతో సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు చేసినా.. ఆతర్వాత పెద్ద ఎత్తున మరమ్మతులు జరిగిన దాఖలాలు లేవు. కొత్తగా నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి
ఏన్కూరు: గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డీ.ఎస్.నాగేశ్వరావు డిమాండ్ చేశారు. మండలంలోని మూలపోచారం పాఠశాలలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలి పారు. ఈనేపథ్యాన ఉపాధ్యాయుల బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయులు పుల్లయ్య, బి.శోభన్, బి.రవి, బి.సింగ్యా, సుశ్మిత, వి.రమేష్, ఉషశ్రీ పాల్గొన్నారు.నిందితుడి అరెస్ట్ఖమ్మంక్రైం: చోరీ కేసులో నిందితుడిని ఖమ్మం వన్టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం సంభానీనగర్కు చెందిన వరికూటి విజయ్కుమార్ ఇంట్లో ఈనెల 5న చోరీ జరగగా దర్యాప్తు చేపట్టారు. ఈమేరకు ముస్తఫానగర్లో చేపట్టిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన చింతకాని మండలం గాంధీనగర్ వాసి నెటుకుమల్లి కృష్ణను ఆరా తీయగా చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించారు. దీంతో 7.5 తులాల బంగారంతో పాటు వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. -
నిరుద్యోగుల కోసం డీఈఈటీ యాప్
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత – ఉద్యోగాకాశాలు కల్పించే పరి శ్రమల నడుమ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) యాప్ వారధిలా పని చేస్తుందని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో సోమవా రం వారు డీఈఈటీ యాప్ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. నిరుద్యోగులు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేస్తే వారి నైపుణ్యాలకు అనుగుణంగా పరిశ్రమలు అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. అంతేకాక ఇంటర్న్షిప్, అప్రెంటిస్ షిప్, నైపుణ్య శిక్షణ సంస్థలు, జాబ్మేళాల వివరాలు అందుతాయని చెప్పారు. జాయింట్ సర్వే చేయాలి ఆర్ అండ్ బీ, ఎన్హెచ్, పంచాయతీరాజ్ అధికారులు రోడ్లనిర్మాణ సమయాన మిషన్ భగీరథ పైప్లైన్లు దెబ్బతినకుండా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి సూచించారు. రోడ్ల మంజూరు సమయంలోనే సంయుక్తంగా సర్వే చేసి తాగునీటి పైప్లైన్ తరలింపు పనుల అంచనాలు కూడా పొందుపర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. కొత్త సంఘాల ఏర్పాటుపై దృష్టి ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలను గుర్తించి కొత్త సంఘాలు ఏర్పాటు చేయించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. ఖమ్మం టీటీడీసీ భవనంలో ఏపీఎంలు, సీసీలకు సెర్ప్ ఆధ్వర్యాన సోమవారం ఇచ్చిన శిక్షణలో ఆమె మాట్లాడారు. మహిళలతో పాటు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, కిషోర బాలి కలతో కొత్త సంఘాలు ఏర్పాటు చేయించాలని తెలి పారు. అనంతరం ఏపీఎంలు, సీసీ లతో ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, డీపీఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు న్యాయవాది ఎంపిక
కల్లూరు: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అంతర్జాతీయ సదస్సుకు కల్లూరు పట్టణం అంబేద్కర్నగర్కు చెందిన ప్రముఖ న్యాయవాది ఉబ్బన రామకృష్ణ ఎంపికయ్యారు. ఆగస్టు 16న వియత్నం రాజధాని హనోయ్లో జరుగనున్న సదస్సులో పాల్గొననున్నారు. ఆదివారం ఖమ్మం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సేవలను అధికారులు కొనియాడి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టీఎస్ ఏరియా3 డీఆర్ఎం కె.శ్రీనివాసరావు, ఖమ్మం డివిజన్ మేనేజర్ ఎ.సంతోష్రెడ్డి, యూనిట్ మేనేజర్ కోటా నరసింహారావులు రామకృష్ణను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కిన్నెరసానిలో సండే సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. 579 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.32,845 ఆదాయం లభించింది. 360 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.18,640 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ మిత్రులు, అధికారులతో కలిసి కిన్నెరసానిని సందర్శించారు. జలాశయంలో బోటు షికారు చేశారు. వేతనాలు పెంచాలి సింగరేణి(కొత్తగూడెం): కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్సీసీడబ్ల్యూయూ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలోని జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూనియన్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలోని వివిధ విభాగాల్లో సుమారు 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో వేతనం రూపాయి కూడా పెంచలేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు వేతనాలు పెంచకపోవడంతో పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు గౌని నాగేశ్వరరావు, ఎన్.సంజీవ్, రాసుద్దీన్, రాజేశం, బి.అశోక్, మల్లికార్జున్రావు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలు పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బి.నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు.ఇసుక లారీ పట్టివేత వైరా: ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఆంధ్ర నుంచి తరలిస్తున్న ఇసుక లారీని వైరా పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఎస్ఐ పి.రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా తల్లాడ నుంచి వైరా వైపు వస్తున్న లారీని ఆపి పరిశీలించగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గమనించారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని వాహన డ్రైవర్ బాలకృష్ణ, యజమాని వెంకటేశ్వరరావు, రవాణాకు సహకరిస్తున్న వైరాకు చెందిన బాణోత్ కృష్ణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. -
మళ్లీ దొంగలు పడ్డారు..
● సింగరేణి క్వార్టర్లలో చోరీ ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. ● విచారణ చేస్తున్న క్లూస్ టీం సత్తుపల్లి: సింగరేణి క్వార్టర్స్లో మళ్లీ దొంగలు పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న భారీ చోరీ సంఘటన మరవక ముందే.. శనివారం రాత్రి 2.30 గంటల సమయాన మళ్లీ చోరీ జరగడం సంచలనమైంది. రాఖీ పండగ, వరుస సెలవులు రావడంతో సింగరేణి కార్మికులు బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఇకపోతే సింగరేణి క్వార్టర్స్లో తలుపులు బలహీనంగా.. అల్యూమినియం గడియలు ఉండడంతో దొంగలకు గడియలు పగలకొట్టడం తేలికై నట్టుగా ఉంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి మరీ చోరీకి పాల్పడ్డారు. అశోక్ ఇంట్లో రెండు తులాల బంగారం, 57 తులాల వెండి, రూ.20వేల నగదు, అఖిల్ ఇంట్లో 16 కాసుల బంగారం, ఎందీ సాధిక్ ఇంట్లో రూ.2 లక్షల నగదు, 40 గ్రాముల వెండి, కె.సుధాకర్ ఇంట్లో రూ.30వేల నగదు, నసీమ్ఖాన్ ఇంట్లో రూ.20వేల నగదు, శీలం రాజు ఇంట్లో రూ.16వేల నగదు చోరీకి గురయ్యాయి. ఏప్రిల్ నెలలో 8 క్వార్టర్స్లో జరిగిన చోరీ ఘటనలో రూ.80 లక్షలకుపైగా బంగారం, నగదు, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి క్లూ చిక్కలేదు. సింగరేణి కార్మికుల ఇళ్లనే టార్గెట్గా నాలుగేళ్లలో సుమారు పదికిపైగా చోరీ సంఘటనలు నమోదయ్యాయి. సీసీ కెమెరా అలర్ట్తో.. సింగరేణి క్వార్టర్స్లో 26 బ్లాక్లలో కొందరు సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. 26, 6, 4, ఎంసీ, 19, 20 బ్లాక్లలో మొత్తం ఆరుగురు ఇళ్లల్లో చోరీ జరిగింది. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే దొంగలు నక్కినక్కి వెళ్తున్నట్లు రికార్డు అయింది. అశోక్ ఇంటి లోపల సీసీ కెమెరాలో ముగ్గురు దొంగలు ఇంట్లో దూరి ఎత్తుకెళ్తున్నట్లు కన్పిస్తోంది. అయితే బయట సీసీ కెమెరా మనుషుల కదలికలను పసిగట్టి ‘అలర్డ్’సైరన్ ఇచ్చింది. జేవీఆర్ ఓసీలో పని చేస్తున్న ఏపీ ఆపరేటర్ రషీద్పాషా సీసీ కెమెరాలకు లింక్ చేసి ఉండటం.. అదే సమయంలో అతను విధుల్లో ఉండటంతో ఒక్కసారిగా సీసీ కెమెరాలను పరిశీలించి తోటి కార్మికులకు, పోలీసులకు ఫోన్లో సమాచారం అందించడంతో హుటాహుటీన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కార్మికులు అప్రమత్తం కావటంతో దొంగలు పరారయ్యారు. క్లూస్ టీమ్ రంగ ప్రవేశం.. పోలీసులు శనివారం రాత్రి అంతా గస్తీని ముమ్మరం చేశారు. సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి సిబ్బందితో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్వార్టర్స్ వెనుకవైపు నుంచి ముళ్ల కంచెను కట్ చేసి దొంగలు క్వార్టర్స్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఖమ్మం క్లూస్టీం ఆదివారం చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. దొంగలుపడిన నాలుగు నెలలకు.. దొంగలు పడిన ఆరు నెలలకు పోలీసులు వచ్చిన చందంగా సింగరేణి అధికారులు గత కొంతకాలంగా సింగరేణి కార్మికులు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని పలు దఫాలుగా విజ్ఞప్తులు, విన్నపాలు చేస్తున్నారు. క్వార్టర్స్ వెనుక అటవీ ప్రాంతం ఉండడంతో ప్రహరీకి విద్యుత్ సరఫరా ఇవ్వాలని చెప్పినా పట్టించుకోకపోవటంపై కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, సింగరేణి అధికారులు ఆదివారం సెక్యూరిటీని పెడుతున్నట్లు సెక్యూరిటీ అవుట్పోస్టును పెట్టడం గమనార్హం. -
ఇక కోల్ పర్మిట్లకు అనుమతి..
సత్తుపల్లి: బొగ్గు లోడింగ్లపై జరుగుతున్న చర్చ పరిష్కారం దిశగా అడుగులు పడుతుంది. ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలతో లారీ యజమానుల యూనియన్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. లోకల్, నాన్లోకల్ లోడింగ్లపై చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు సోమవారం లారీ యూనియన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు ‘సాక్షి’కి తెలిపారు. లోకల్ సీరియల్తో పాటు నాన్లోకల్ సీరియల్లో కూడా స్థానిక లారీలకు లోడింగ్ ఇచ్చి అవసరమైతే బయట లారీలకు ఇచ్చే కిరాయికే వెళ్లేలా కార్యాచరణపై చర్చించేందుకు సీనియర్ లారీ యజమానులు సిద్ధమవుతున్నారు. కోల్ ట్రాన్స్పోర్టర్కే కమిషనా..? సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీలకు కోల్ ట్రాన్స్పోర్టర్లుగా వ్యవహరించే వ్యక్తులు కమీషన్లు తీసుకుంటున్నారనే వస్తున్న ఆరోపణలపై లారీ యజమానుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోల్ ట్రాన్స్పోర్టర్ లోడింగ్లకే పరిమితమవుతారని, కిరాయి ఎంత, కమీషన్ ఎంత వంటి విషయాలు పట్టించుకోరని, కోల్ ఏజెంట్లే ఈ వ్యవహారం అంతా నడుపుతుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. సత్తుపల్లి లారీ యూనియన్ కార్యాలయంలో ఆరుగురు కోల్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని.. మానవతా ధృక్పథంతో లోడింగ్లపై తగు నిర్ణయం తీసుకోవాలని లారీ యూనియన్ మాజీ అధ్యక్షుడు పీ.ఎల్.ప్రసాద్ లారీ యజమానుల గ్రూప్ల్లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. బయట లారీలకు ఇచ్చే నాలుగు కిరాయిలను కూడా స్థానిక లారీలకు బొగ్గు లారీలకు అవకాశం కల్పించాలని కోరారు. సరికొత్త ఎత్తుగడలు.. కమీషన్లపై బహిరంగంగా మాట్లాడుతున్న లారీ యజమానులకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకల్కు ఏడు, నాన్లోకల్కు 4 శాతం చొప్పున లోడింగ్లకు అడ్డు చెపితే.. కోల్ పర్మిట్లు రాకుండా అడ్డుకుంటామంటూ ఏజెంట్లు నయానా.. బయనా లొంగదీసుకునేందుకు సరికొత్త ఎత్తుగడలకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నాన్లోకల్కు అనుమతి ఇవ్వకపోతే అసలు లోడింగే ఇవ్వకుండా చూస్తామంటూ కొందరు ఏజెంట్లు లారీ యజమానుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. లోకల్, నాన్లోకల్ లోడింగ్పై చర్చ నేడు లారీ యూనియన్ సర్వసభ్య సమావేశం -
కూలిన స్తంభం.. తప్పిన ప్రమాదం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనంటున్న గ్రామస్తులు తిరుమలాయపాలెం: విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపంతో నూతనంగా ఏర్పాటు చేసిన స్తంభం కూలిపోయింది. అప్పటివరకు అక్కడే ఆడుకున్న చిన్నారులు వర్షం వస్తుండగా ఇళ్లలోకి వెళ్లాక స్తంభం కూలడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఘటన మండలంలోని హైదర్సాయిపేట శివారు రావిచెట్టుతండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలు తొలగింపునకు ఆయా గ్రామాల్లో విద్యుత్ కాంట్రాక్టర్తో స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం రావిచెట్టుతండాలో విద్యుత్ స్తంభం వేశారు. ఆ సమయంలో ఐదు నుంచి ఆరు అడుగుల మేర లోతున గుంత తవ్వాల్సి ఉండగా బండ రావడంతో రెండడుగులు మాత్రమే తవ్వి స్తంభం వేశారు. విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఇవేమీ పట్టించుకోకుండా రెండడుగుల గుంతలో తొమ్మిఇ మీటర్ల ఎత్తుగల స్తంభం ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం వర్షానికి స్తంభం కూలగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం కొణిజర్ల: మొక్కల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టిన సంఘటన మండల పరిధిలోని పల్లిపాడు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుంచి ఏపీలోని రాజమండ్రికి మొక్కలు లోడుతో వెళ్తున్న లారీ పల్లిపాడు పెట్రోల్ బంక్ సమీపాన అదుపు తప్పి రోడ్డు మీద బోల్తా కొట్టింది. ఆ సమయంలో వాహనాలేవి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పగా.. ఎవరూ గాయపడలేదు. పోలీసులు క్రేన్ సాయంతో లారీని పక్కకు తీయించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. -
నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
● 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు మాత్రల పంపిణీ ● జిల్లావ్యాప్తంగా 3,11,317 మంది పిల్లల గుర్తింపు ● అందుబాటులో 3.30 లక్షల మాత్రలు ● మిస్ అయిన వారికి 18న మాప్ అప్ రౌండ్ నూరు శాతం సక్సెస్కు.. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ముందస్తుగా ఇంటింటి సర్వే నిర్వహించగా మొత్తం 3,11,317 మంది ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించేలా 3.30 లక్షల మాత్రలు సిద్ధం చేసి ఇప్పటికే అన్ని కేంద్రాలకు పంపిణీ చేశారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నూరు శాతం అమలయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి అంగన్వాడీలు 1,840 మంది, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్లు 1,260మంది, ఆశాలు 1,339. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1,750 మంది సిబ్బందిని నియమించింది. ఒకవేళ నేడు(సోమవారం) మిస్ అయిన పిల్లలకు ఈ నెల 18న మాప్అప్ రౌండ్ నిర్వహించనున్నారు. మాత్రలు మింగించే విధానం, జాగ్రత్తలు.. ●1 నుంచి 19 ఏళ్ల లోపు బాలబాలికలకు ఆల్బెడజోల్ మాత్రలు వేయనుండగా.. 1 నుంచి 2 ఏళ్ల చిన్నారులకు అర(1/2) మాత్రను రెండు చెంచాలతో పొడి(క్రష్) చేసి నీటితో మింగించాలి. ●2 నుంచి 3 ఏళ్ల చిన్నారులకు పూర్తి(ఫుల్) మాత్రను రెండు చెంచాలతో పొడి(క్రష్) చేసి నీటితో మింగించాలి. ●3 నుంచి 19 ఏళ్ల వరకు ఉన్నవారికి ఒక మాత్ర నమిలి మింగించాలి. ●అనారోగ్య సమస్యలు, ఇతర చికిత్సలు తీసుకున్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రలు మింగించొద్దని, పిల్లలకు మధ్యా హ్న భోజనం అయిన అరగంట తర్వాతనే మాత్రలు మింగించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి చేశాం.. అల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం నూరుశాతం పూర్తి చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు తప్పకుండా మాత్రలు మింగించాలి. పిల్లలు గోళ్లు కత్తిరించుకోకపోవడం, చేతులు కడకుండా భోజనం చేయటం ద్వారా పేగుల్లోకి నట్టలు చేరి ఆకలి మందగించడంతో పాటు రక్తహీతన ఏర్పడి అనారోగ్యపాలవుతారు. అలా జరగకుండా పిల్లలకు మాత్రలు వేయించి వారి కడుపులోని నులిపురుగులను అంతం చేయొచ్చు. సోమవారం మిస్ అయిన పిల్లలకు ఈ నెల 18 ప్రత్యేక మాప్ అప్ రౌండ్ ద్వారా మళ్లీ మాత్రలు అందిస్తాం. – డాక్టర్ చందూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓవివిధ కేంద్రాల్లో ఉన్న చిన్నారుల వివరాలు.. అంగన్వాడీల్లో (1 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు) 74,641 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల పిల్లలు 95,276 ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 6,040 ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులు 1,35,360 -
ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా చావా రవి
ఖమ్మం సహకారనగర్ : దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు ఏడు లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) నూతన ప్రధాన కార్యదర్శిగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, కేంద్ర కమిటీ సభ్యులుగా సీహెచ్.దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజా న్, పారుపల్లి నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోల్కతా నగరంలో జరుగుతున్న ఎస్టీఎఫ్ఐ 9వ రజతోత్సవ మహాసభలో వీరిరువురు ఎన్నిక కావడం హర్షణీయమని పేర్కొన్నారు. చావా రవి 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేసి, ప్రస్తుతం అఖిల భారత ఉపాధ్యాయ ఉద్యమానికి నాయకత్వం వహించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. దుర్గాభవాని మహిళా ఉపాధ్యాయులను చైతన్యపరుస్తూ, ఆదర్శవంతంగా పనిచేసి బాలికల విద్యావ్యాప్తికి కృషిచేస్తున్నారని పేర్కొన్నా రు. వీరి ఎన్నిక పట్ల యూటీఎఫ్ నాయకులు జి.వి.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమి, వల్లంకొండ రాంబాబు హర్షం వ్యక్తం చేశారు.కేంద్ర కమిటీ సభ్యులుగా దుర్గాభవాని -
నూతన విద్యాపాలసీ దేశానికే ప్రమాదం
ఖమ్మంమయూరిసెంటర్: నూతన విద్యావిధానం దేశానికి అత్యంత ప్రమాదమని, బీజేపీ అధికారంలోకి వచ్చాక కోవిడ్ ముందు నుంచి ఇప్పటికీ 1,800కు పైగా అంశాలను మార్చిందని జీవశాస్త్ర ప్రొఫెసర్, కవి, రచయిత, కవిరాజు త్రిపురనేని రామస్వామి తొలి జాతీయ అవార్డు గ్రహీత దేవరాజు మహారాజు అన్నారు. మానవశక్తి స్థానంలో దైవశక్తిని చొప్పించి అజ్ఞానం వైపు విద్యావిధానాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం 20వ వార్షికోత్సత్సవం సందర్భంగా బోడేపూడి స్మారకోపన్యాసం సావనీర్ ఆవిష్కరణ సందర్భంగా సైన్స్,చరిత్ర పాఠ్యాంశాల మార్పులపై స్థానిక మంచికంటి హాల్లో బీవీకే ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన ఆదివారం సెమినార్ నిర్వహించగా ఆయన మాట్లాడారు. జాతీయ విద్యావిధానాన్ని మార్చి అసంబద్ధమైన, అవాస్తవాలతో కూడిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020ని తీసుకొచ్చారని, జీవపరిణామక్రమ సిద్ధాంతాన్నే మార్చాలని చూడడం అవివేకం అన్నారు. ఈ దేశాన్ని హిందూరాష్ట్రంగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. 50 శాతం పన్నులపై స్పందించరేంటి..? అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మోదీ స్నేహితులు అయినప్పుడు మనదేశ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించినప్పుడు ప్రధాని ఎందుకు స్పందించడం లేదని తమ్మినేని వీరభద్రం అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల ఇప్పుడు రైతులు సంక్షోభంలో పడ్డారన్నారు. పాకిస్తాన్పై 19%, కొన్నిదేశాలపై 10, 15 శాతం దిగుమతి సుంకాలు మాత్రమే వేసి ఇండియాపై పెద్దమొత్తం పన్ను వేశారని వివరించారు. భారతీయ వ్యవసాయరంగాన్ని నాశనం చేసేలా ట్రంప్ చేస్తున్న ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీవీకే ట్రస్ట్ జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా టీటీ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్ : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఎంపికలకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి 120 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ బోర్డులకు ప్రత్యేక హాల్ నిర్మిస్తున్నామని, ప్రతీ క్రీడాకారుడు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేలా రాణించాలని ఆకాంక్షించారు. టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలసాని విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు తమ సంఘం ఆధ్వర్యాన పది రోజుల పాటు శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు జోజిచాకో, షేక్ ముజాఫర్, పరిటాల చలపతి, రెడ్డి సాయి, శివ, రామారావు పాల్గొన్నారు. రేపు జాబ్మేళాఖమ్మం రాపర్తినగర్ : ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారిణి ఎన్.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. అపొలో హోమియో కేర్లో 34 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయని, హాజరయ్యే వారికి 18 – 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. హోమియో కేర్లో 30 పోస్టులకు నర్సింగ్, సూపర్వైజర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్, బయోమెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీటెక్ బయోమెడికల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులై ఉండాలని వివరించారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాఎస్ఈ శ్రీనివాసాచారి వెల్లడి ఎర్రుపాలెం: జిల్లావ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. మండలంలోని మామునూరు విద్యుత్ సబ్ స్టేషన్లో ఏర్పాటుచేసిన ఐదు మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహ, వ్యవసా య వినియోగదారులకు అవసరమైన మేరకు నాణ్యత గల విద్యుత్ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వైరా డీఈ బండి శ్రీనివాసరావు, మధిర ఏడీఈ అనురాధ, డీఈ భద్రు, ఏఈలు గణేష్, బోజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చనభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా నిలిపిన నిత్యకల్యాణాలను పునః ప్రారంభించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
‘సరోగసీ’పై నిఘా!
● ఫెర్టిలిటీ సెంటర్ల నియంత్రణకు సర్కార్ చర్యలు ● జిల్లాలో తనిఖీలు చేపట్టనున్న రాష్ట్ర స్థాయి అధికారులు ● ‘సృషి’్ట ఘటన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ ● జిల్లా స్థాయిలోనూ ముమ్మరంగా తనిఖీలు ఖమ్మంవైద్యవిభాగం: సరోగసీ ముసుగులో హైదరాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన నిర్వాకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల తీరును తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్లు ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో జిల్లాలోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను త్వరలో తనిఖీ చేయనుండగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కేంద్రాల నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఏడు టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్లకు అనుమతి ఉండగా వాటిలో రెండు సెంటర్లు సరోగసీకి అనుమతి తీసుకున్నారు. ఇంకా పర్మిషన్ లేకుండా అనేక సెంటర్లు పుట్టుకొచ్చాయి. త్వరలోనే ఉన్నతాధికారుల పరిశీలన.. హైదరాబాద్ తర్వాత మెడికల్ హబ్గా వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలకు పేరుంది. కాగా ఖమ్మంలో తక్కువ సమయంలో ఎక్కువ సంతాన సాఫల్య కేంద్రాలు వెలిశాయి. జిల్లాకు అనుకుని ఉన్న భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా జిల్లాల నుంచి వైద్య సేవల కోసం ఎక్కువగా ఖమ్మం వస్తుంటారు. దీనికి తోడు ఆర్ఎంపీలు కమీషన్ల ప్రాతిపదికన పేషెంట్లను తీసుకొస్తుంటారు. ఇదే అదనుగా ఇటీవల సంతాన సాఫల్య కేంద్రాలు కూడా పుట్టుకొచ్చాయి. పిల్లలు లేని దంపతులకు వల వేసి ఆయా సెంటర్లకు తీసుకొస్తుండగా తమ వద్ద చికిత్స తీసుకుంటే 100 శాతం పిల్లలు పుట్టడం గ్యారంటీ అంటూ సెంటర్ల నిర్వాహకులు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సెంటర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు త్వరలోనే తనిఖీలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిలా స్థాయిలో తనిఖీలు.. హైదరాబాద్ ఘటన కలకలంతో కలెక్టర్ వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అనుమతి లేని టెస్ట్ట్యూబ్ బేబీ సెంట ర్లు, నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తని ఖీలు చేయాలని ఆదేశించారు. దీంతో ఈనెల 1న తనిఖీలు ప్రారంభించారు. వైరా రోడ్లోని రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను తనిఖీ చేశారు. అలాగే వైరారోడ్లోని మార్వెల్స్ హాస్పిటల్లో గతంలో సుమారు 168మందికి చికిత్స అందించినట్లు నకిలీ బిల్లులు ఇవ్వగా.. వారు సీఎంఆర్ఎఫ్ బిల్లుల కోసం సమర్పించినట్లు తేలడంతో ఆస్పత్రిని సీజ్ చేశారు. మయూరిసెంటర్లోని బ్రీత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఓ మహిళ మృతి చెందడానికి డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కలెక్టర్ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ, సిబ్బంది వెళ్లి విచారించారు. మహిళ మృతికి వారి నిర్లక్ష్యమే కారణమని గుర్తించి ఆస్పత్రిని సీజ్ చేశారు. అయితే జిల్లాస్థాయిలో చేపట్టిన తని ఖీలు సాదారణమైనవే కాగా హైదరాబాద్ నుంచి వచ్చే బృందాల తనిఖీలతో ఎవరి బాగోతాలు బయటపడతాయో త్వరలో తేలనుంది. -
ముగిసిన నాటిక పోటీలు
ఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాసంస్థలు తొమ్మిది నాటికలు ప్రదర్శించాయి. సమాజ చైతన్యం, మూఢనమ్మకాలు, కొత్తపోకడలు, పాశ్చాత్య సంస్కృతి వంటి అంశాలపై ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఆదివారం హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికను ప్రదర్శించారు. జ్యోతిరాజ్ బీశెట్టి రచించిన ఈ నాటికకు డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వం వహించారు. ఇక విశాఖపట్టణానికి చెందిన చైతన్య కళాస్రవంతి వారు (అ)సత్యం నాటికను ప్రదర్శించారు. చివరి రోజు నెల నెలా వెన్నెల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు సీహెచ్.ఎన్. రాజకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక విద్యావేత్తలు వంగా సాంబశివరావు, చైతన్య విద్యాసంస్థల అధినేత మల్లెంపాటి శ్రీధర్, హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత రవిమారుత్, నెల నెలా వెన్నెల నిర్వాహకులు ఎ.సుబ్రహ్మణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, జగన్మోహన్రావు, కురువెళ్ల ప్రవీణ్, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, వేల్పుల విజేత, మొగిలి శ్రీనివాసరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సేవలకు ఇక సెలవ్..!
చింతకాని : మండల పరిధిలోని నాగులవంచ రైల్వేస్టేషన్ను త్వరలో మూసివేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి.సునీత ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. సుమారు 77 సంవత్సరాలుగా ఎంతో మంది ప్రయాణికులకు సేవలందించిన ఈ రైల్వేస్టేషన్కు ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు. ఈ రైల్వేస్టేషన్లో ఇప్పటికే కాంట్రాక్ట్ పొందిన ప్రైవేట్ వ్యక్తి టికెట్లు విక్రయిస్తుండగా.. ఇటీవల అతడు కూడా టికెట్లు ఇవ్వడం లేదు. కాగా, ఈ రైల్వేస్టేషన్ను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించడంతో నాగులవంచ రైల్వేకాలనీ, నాగులవంచ, పాతర్లపాడు, సీతంపేట, చిన్నమండవ, రామాపురం, లక్ష్మీపురం, గోవిందాపురం (ఎల్) గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధికి అప్పటి ఎంపీ నామా నాగేశ్వరరావుకు పాతర్లపాడు గ్రామస్తులు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. రైల్వేస్టేషన్ను మరింతగా అభివృద్ధి చేస్తారని ఊహించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. అసలే మూసివేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయడంతో విస్మయం వ్యక్తం చేశారు. మూడో లైన్ ఏర్పాటుతో రైల్వేస్టేషన్లో కొత్తగా బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. అలాగే పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపట్టారు. మూసివేసే స్టేషన్కు ఇవన్నీ ఎందుకు చేసినట్టనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, నాగులవంచ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు సేవలు కొనసాగించేలా రైల్వే ఉన్నతాధికారులను కలుస్తామని పాతర్లపాడు గ్రామస్తులు తెలిపారు. రైల్వే శాఖ అధికారులు తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని అంటున్నారు.త్వరలో నాగులవంచ రైల్వేస్టేషన్ మూసివేత -
ప్రతి ఎకరాకూ సాగునీరు
మధిర: జిల్లాలోని ప్రతీ ఎకరానికి కృష్ణ, గోదావరి జలాలు అందేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించేందుకు రూ.630 కోట్లతో వంగవీడు సమీపంలో వైరా నదిపై చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం పనులకు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ మూడో జోన్లో ఉన్న ఆయకట్టుకు రెండో జోన్ నుంచి సాగునీరు అందించాలని ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మధిర ప్రాంతంలో కట్టలేరు, వైరా, మున్నేరు నదులు ప్రవహిస్తున్నా సాగు నీరందడం లేదన్నారు. జవహర్ ఎత్తిపోతల పథకానికి 2012లో మంజూరు ప్రతిపాదనలు సమర్పించామని, గత పాలకులు పదేళ్లలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక సర్వే చేసి, నిధులు మంజూరు చేశామన్నారు. పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారానే పంటలు పండుతున్నాయని చెప్పారు. గేమ్ చేంజర్గా ఎత్తిపోతల పథకం.. జవహర్ ఎత్తిపోతల పథకం మధిర ప్రాంతానికి గేమ్ చేంజర్గా ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏడాది లోపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జవహర్ ఎత్తిపోతల పథకం ద్వారా 33వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, వైరా నదిలో 120 రోజుల్లో 4 టీఎంసీలు ఎత్తిపోసేలా రూపకల్పన చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 190 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం రూ.45 కోట్లు కేటాయించామని చెప్పారు. మధిర మండలంలో 13 వేల ఎకరాలు, ఎర్రుపాలెం మండలంలో 19 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దిండి, సీతారామ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రూ.1,200 కోట్లతో ఆర్అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, వంగవీడుకు డబుల్ రోడ్డు వేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో గత పాలకులు పేదలను మోసం చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సన్న ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జోన్ 3లో ఉన్న బ్రాంచ్ కెనాల్పై మధిర, ఎర్రుపాలెంలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా నీరందక రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. జవహర్ ఎత్తిపోతల పథకంతో ఆంధ్రాతో సంబంధం లేకుండా జోన్ 3 ఆయకట్టును జోన్ 2 పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. గోదావరి నీటిని పాలేరు తీసుకొచ్చి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న 33 వేల ఎకరాలు రెండు పంటలు సాగయ్యేలా ఈ పథకం ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి, సీపీ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ సీఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రూ.630 కోట్లతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, వాకిటితో కలిసి జవహర్ లిఫ్ట్ పనులకు శంకుస్థాపన -
పారదర్శకతే లక్ష్యం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో వేల మంది పేదల సొంతింటి కల నెరవేర్చే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అర్హులను గుర్తించడం నుంచి గృహప్రవేశం వరకు అధికారుల కనుసన్నల్లోనే పనులు జరిగేలా ప్రణాళికాయుతంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో పునాది దశ నుంచి రూఫ్, స్లాబ్, ఇంటి నిర్మాణం.. ఇలా అన్ని దశల్లోనూ వివిధ స్థాయి అధికారులు పరిశీలిస్తూ నిర్మాణ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుంది. జిల్లాలో మొదటి దశలో 16,153 ఇళ్లు మంజూరు కాగా.. నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే కొన్నిచోట్ల ఫొటోల అప్లోడ్లో సాంకేతిక సమస్యలు ఎదురవడం, ఇతర కారణాలతో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంలో జాప్యం జరుగుతోంది. వీటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. జిల్లాలో 3,48,740 దరఖాస్తులు.. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన, మీసేవ, గ్రామసభల ద్వారా 3,48,740 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఎల్ –1, ఎల్ –2, ఎల్ –3గా విభజించారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేకుండా గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉండేవారిని ఎల్ –1(లిస్ట్)గా గుర్తించారు. గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉంటూ స్థలం లేనివారిని ఎల్ –2గా, ఇల్లు ఉండి.. తల్లిదండ్రుల నుంచి విడిపోయి మరో ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ – 3 కేటగిరీగా నిర్ణయించారు. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాక ఎల్ –1లో 73,472, ఎల్ –2లో 56,549, ఎల్ –3లో 2,18,719 దరఖాస్తులను విభజించారు. వీటిలో తొలుత 16,153 ఇళ్లు మంజూరు చేశారు. నిర్ణీత స్థలంలోనే.. ఇల్లు మంజూరైన లబ్ధిదారుడు తన స్థలంలో ముగ్గు పోసుకుంటే పంచాయతీ సెక్రటరీ ఆ స్థలాన్ని ఫొటో తీసి.. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో అప్లోడ్ చేస్తారు. అకౌంట్ నంబర్, స్థలం వారిదా కాదా అని చెక్ చేస్తారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఒకసారి ఫొటో తీస్తే దాన్ని మార్చే అవకాశం ఉండదు. 400 చదరపు అడుగులు.. అంటే 60 గజాలకు తగ్గకుండా స్థలం ఉండాలి. 45 గజాల్లో నిర్మాణం చేపట్టాలి. నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా అనేది పంచాయతీ సెక్రటరీ నిర్ధారిస్తారు. అధికారుల పర్యవేక్షణ ఇలా.. ఇంటి పునాది నిర్మించాక గ్రామ కార్యదర్శి మళ్లీ లబ్ధిదారుడిని స్థలం వద్ద నిలబెట్టి సైడ్, టాప్, ఫ్రంట్ యాంగిళ్లలో ఫొటో తీసి ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేస్తారు. దాన్ని ఏఈ పరిశీలించి అప్రూవ్ చేయాలి. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు స్థలం ఉందా లేదా.. బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్ సక్రమంగా ఉన్నాయా అని పరిశీలిస్తారు. ఎంత స్థలంలో నిర్మిస్తున్నారనే కొలతలతో పాటు మేసీ్త్ర ఫోన్ నంబర్, పేరు రాసుకుని యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత డీఈ లాగిన్లోకి వస్తుంది. ఆయన బేస్మెంట్ లెవెల్, స్లాబ్, ఇల్లు పూర్తయ్యాక ఫొటోలు చూసి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకుని అప్రూవ్ చేస్తారు. అక్కడి నుంచి పీడీ లాగిన్కు వస్తుంది. అక్కడ సూపర్ చెక్ చేశాక కలెక్టర్ లాగిన్కు వెళ్తుంది. కలెక్టర్ అప్రూవ్ చేశాక ఎండీ లాగిన్కు వెళితే.. అక్కడి సెక్షన్ అధికారులు సీజీజీ (సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ఏఐ ద్వారా ప్లేస్మెంట్ సరిగా ఉందా.. నిబంధనల ప్రకారం నిర్మాణం ఉందా లేదా అనే వివరాలు పరిశీలిస్తారు. ఇలా అన్ని దశల్లోనూ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.జిల్లాలో పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు దశల వారీగా పరిశీలన.. ఫొటోల అప్లోడ్ నిర్మాణం సక్రమంగా ఉంటేనే నగదు జమ మొదటి దశలో 16,153 మందికి లబ్ధి సాంకేతిక చిక్కుముడులు.. ఇటీవల కొందరి ఖాతాల్లో డబ్బు జమ కావడం లేదనే చర్చ సాగుతోంది. చిన్న చిన్న సాంకేతిక సమస్యలతో ఈ ఇబ్బందులు వచ్చినట్లు తెలుస్తోంది. బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యాక రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.2లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో కొంత సమయం వరకు యాప్ ఓపెన్ కావడం లేదు. కారేపల్లి మండలం సీతారాంతండా, సత్తుపల్లి మున్సిపాలిటీలోని 2, 15, 22 వార్డుల్లో, కామేపల్లి మండలం బర్లగూడెంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇంకొన్నిచోట్ల ఆధార్ లింక్ కాకపోవడం, పేరు, అకౌంట్ తప్పుగా ఉండడంతో కొందరి ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. అయితే ఈ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. -
ఘనంగా హయగ్రీవ జయంతి
● వేడుకగా ముగిసిన పవిత్రోత్సవాలు ● నేటి నుంచి నిత్యకల్యాణాలు పునఃప్రారంభం భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం హయగ్రీవుని జయంతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న హయగ్రీవుని ఉపాలయంలో పండితులు వేదమంత్రాలు, భక్తజనాల శ్రీరామస్మరణల నడుమ హయగ్రీవునికి ఉదయం స్నపనం, తిరుమంజనం జరిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు విజయరాఘవన్ చేతుల మీదుగా చిన్నారులకు పలకలు, సామగ్రి అందజేశారు. పవిత్రోత్సవాల ముగింపు నేపథ్యంలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. కుంభప్రోక్షణ, పవిత్రావరోపణాలతో ఉత్సవ స్వస్తి పలికారు. పవిత్రోత్సవాల సందర్భంగా నిలిపివేసిన నిత్యకల్యాణాలు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో శనివారం రాఖీ పౌర్ణమి సందడి కనిపించింది. మండల పరిధిలోని కిన్నెరసానికి శనివారం జిల్లా నలు మూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. 383 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,855 ఆదాయం లభించింది. 150 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.6,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామివారి విగ్రహానికి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను అలంకరించి నిత్య కల్యాణం జరిపించగా.. భక్తులు కనులపండువగా తిలకించారు. శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి: సీపీ ఖమ్మంక్రైం : నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ సునీల్దత్ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సీసీ కెమెరాల విస్తరణ, నిబంధనలు అతిక్రమించే వాహనదారుల నుంచి జరిమానాల వసూలు తదితర అంశాలపై చర్చించారు. మునిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో సరైన పార్కింగ్ స్థలాలు గుర్తించాలని సూచించారు. ఖమ్మంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను ఆరికట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారయణ, ఆర్ఐ సాంబశివరావు, ఎస్ఐ సాగర్ ఉన్నారు. జిల్లాకు చేరిన బ్యాలెట్ బాక్స్లు ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు రోజుల క్రితం గుజరాత్ నుంచి 2,300 బ్యాలెట్ బాక్స్లను కేటాయించింది. ఈ క్రమంలో శనివారం రెండు కంటైనర్లలో వాటిని తీసుకొచ్చి జిల్లా పరిషత్ ఆవరణలోని గోడౌన్లో భద్రపర్చినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 3న దివ్యాంగుల మహాగర్జనసత్తుపల్లిటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలు, వృద్ధులకు రూ.4వేలు, పూర్తి వైకల్యం చెందిన వారికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిందని, 20 నెలలైనా హామీలు అమలు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 3న హైదరాబాద్లో దివ్యాంగుల మహాగర్జన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ వీరంరాజు మంద కృష్ణను సత్కరించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బాణోతు విజయ్, సాలి శివ, జొన్నలగడ్డ నరేష్, మట్టా ప్రసాద్, లక్ష్మీనారాయణ, సాధు జానికీరాం పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల రాస్తారోకో
కల్లూరురూరల్: తమకు సరిపడా యూరియా అందజేయాలని కోరుతూ కల్లూరు మండలం చెన్నూరు పీఏసీఎస్ ఎదుట రైతులు రాస్తారోకో చేపట్టారు. యూరియా అరకొరగా పంపిణీ చేస్తున్నారని, నెలకు ఒకసారి మాత్రమే ఇస్తుండడంతో పంటలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ఎస్సై హరిత ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎరువుల కోసం తమ కుటుంబాలు క్యూలైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. జిల్లాకు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 4,500 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, రావూరి వెంకటేశ్వరరావు, ఆళ్ల శ్రీకాంత్, దంతాల లక్ష్మయ్య, నల్లమాటి రామకృష్ణ, మాదాల భద్రయ్య, గింజుపల్లి అర్జున్రావు పాల్గొన్నారు. -
గిరిజన ఆశ్రమ హాస్టల్ బాత్రూమ్లకు డోర్లు
కల్లూరు: కల్లూరు ఎన్నెస్పీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 93 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సరైన సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ‘ఎవరికీ పట్టని సంక్షేమం’ శీర్షికన ఈనెల 7న సాక్షిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏటీడీఓ భారతీదేవి ఆధ్వర్యంలో బాత్రూమ్లకు డోర్లు అమర్చగా.. విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. దొంగల హల్చల్ఖమ్మంఅర్బన్: నగరంలోని గొల్లగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేసినట్లు తెలిసింది. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి చేతిలో ఇనుపరాడ్లతో గ్రామంలో తిరిగారు. ఒక ఇంటి యజమాని తా ళంవేసి ఊరు వెళ్లగా తాళం పగులగొట్టి చోరీకి యత్నించారు. అక్కడ ఎమీ లభించకపోవడంతో గోడ దూకి పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డులను బట్టి గుర్తించారు. ఈ విషయంపై సీఐ భానుప్రకాష్ను వివరణ కోరగా హల్చల్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నామని తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతివేంసూరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. స్థానికుల కధనం ప్రకారం.. రామన్నపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి గోపీకిరణ్(20) భీరపల్లి శివారున ఉన్న పెట్రోల్ బంక్లో నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా మొద్దులగూడెం వైపు వెళ్తున్న కారు డీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపీకిరణ్ను చికిత్స నిమిత్తం సత్తుపల్లికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చింతకాని : మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి శ్రీలం సుదర్శన్రావు, అతడి కుమారుడు చైతన్యపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్ మీరా తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. సుదర్శన్రావు కుటుంబసభ్యులకు సంబంధించిన భూ వివాదంపై ఈనెల 6న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గ్రామానికి చెందిన మాలెంపు కోటేశ్వరరావు, వారి కుటుంబసభ్యులు ఈ వివాదంలో జోక్యం చేసకోగా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సుదర్శన్రావు, అతడి కుమారుడిపై దాడి చేసిన ఘటనలో కోటేశ్వరరావుతో పాటు విజయ, పద్మావతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. దాడి ఘటనలో కేసు నమోదు.. ఖమ్మంఅర్బన్: నగరంలోని దానవాయిగూడెంలో అత్తమామలపై అల్లుడు దాడి చేసిన ఘట నపై శనివారం ఖమ్మం అర్బన్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపాలెం మండలం కామంచికల్కు చెందిన చిట్టిబాబు దానవాయిగూడేనికి చెందిన సౌజ న్యను పెళ్లి చేసుకున్నాడు. శనివారం భార్యను తీసుకెళ్లడానికి రాగా, ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో భార్యపై ఇనుపచువ్వతో దాడికి ప్రయత్నం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్త, మామ కూడా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు అల్లుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. గంజాయి స్వాధీనంమణుగూరు టౌన్: ఒడిశా నుంచి వరంగల్కు తరలిస్తున్న గంజాయిని శనివా రం మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. సీఐ పాటి నాగబాబు కథనం ప్రకా రం.. ఎస్ఐ రంజిత్, సిబ్బందితో కలిసి తోగ్గూడెం శివారు ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను ఆపి తనిఖీ చేయగా 32 కేజీల గంజాయి లభించింది. విచారించగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దపాక మండలం కుసున్నపల్లి గ్రామానికి చెందిన తోడెం శ్రీను, మహబూబాద్ జిల్లా బోడగుట్ట తండా గ్రామానికి చెందిన బానోత్ కుమార్ ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు సీఐ తెలిపారు. పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటదుమ్ముగూడెం: మండలంలోని తురుబాక గ్రామానికి చెందిన యువకుడు, బూర్గంపాడు మండలానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం శనివారం దుమ్ముగూడెం పోలీసులను ఆశ్రయించారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరి వివాహానికి యువతి తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట రహస్యంగా వివాహం చేసుకుంది. రక్షణ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లగా పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరు మేజర్ల కావడంతో వివాహం చేసుకున్నారని నచ్చజెప్పారు. -
నేడు ఇంపు
నాడు కంపు..ఖమ్మంమయూరిసెంటర్: వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో నిండి, దుర్వాసనతో పరిసర ప్రాంత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డు ఇప్పుడు సరికొత్తగా మారింది. అధికారుల పట్టుదల, ప్రణాళికాయుతమైన కృషి ఫలితంగా ఈ డంపింగ్ యార్డు నేడు ఆహ్లాదకరమైన పచ్చని వనంగా రూపుదిద్దుకుంది. ‘చెత్త పోయి.. మొక్కలు వచ్చె’ అనే నానుడిని నిజం చేస్తూ ఈ ప్రదేశం స్థానికులకు ఆదర్శంగా నిలుస్తోంది. దానవాయిగూడెం డంపింగ్ యార్డు అంటేనే ఒకప్పుడు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. నగరంలోని ఘన వ్యర్థాలన్నీ ఇక్కడికే చేరడంతో నిత్యం కంపు కొడుతూ, పర్యావరణానికి విఘాతం కలిగించేది. దుర్వాసన మాత్రమే కాదు.. దోమలు, ఈగలు వృద్ధి చెందడానికి, భూగర్భ జలాలు కలుషితం కావడానికీ ఇది ఒక ముఖ్య కారణంగా స్థానికులు భావించారు. ఇక నెలలో రెండు, మూడుసార్లు డంపింగ్యార్డ్లో చెలరేగే మంటలు, పొగతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన పాలకవర్గం, అధికారులు డంపింగ్ యార్డును పునరుద్ధరించాలని సంకల్పించారు. వేల మొక్కలతో పచ్చదనం.. దానవాయిగూడెం డంపింగ్యార్డ్లో శుభ్రం చేసిన స్థలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఇప్పటి వరకు 8 ఎకరాల్లో 8 వేలకు పైగా మొక్కలు నాటగా.. మరో రెండు వేల మొక్కలు నాటేందుకు దశల వారీగా కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ పచ్చదనాన్ని పెంచడం ద్వారా వాతావరణాన్ని మెరుగుపరచడమే కాకుండా, డంపింగ్ యార్డుకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో వివిధ రకాల పండ్లు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, క్రమం తప్పకుండా మొక్కలకు నీరందేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ కృషి ఫలితంగా నగరంలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డు ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతోంది. ఒకప్పుడు చెత్తకుప్పల దిబ్బగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పక్షుల కిలకిలారావాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోయింది. ఈ మార్పు కేవలం పర్యావరణానికే కాదు.. పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి, జీవన నాణ్యతకు కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధికారులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం దేశంలోని ఇతర నగరాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అంటున్నారు. కాగా, తమ సమస్యలు తీరాయని ప్రజలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు.దానవాయిగూడెం డంపింగ్ యార్డుకు కొత్తరూపం బయోమైనింగ్తో పదెకరాల స్థలం శుభ్రం 8 ఎకరాల్లో 8 వేలకు పైగా మొక్కల పెంపకం ఆహ్లాదకరంగా మారిన డంపింగ్యార్డ్ స్థలంబయోమైనింగ్తో స్థలం శుభ్రం.. డంపింగ్ యార్డ్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించే కార్యక్రమం చేపట్టారు. 2023 జనవరి నాటికి ఇక్కడ 2.75 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకపోయినట్లు అధికారులు అంచనా వేశారు. 32 ఎకరాల్లో 20 ఎకరాల స్థలాన్ని శుభ్రం చేసే లక్ష్యంతో బయోమైనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2023 జనవరిలో ఈ ప్రక్రియ ప్రారంభించగా.. ఆధునిక యంత్రాలతో వ్యర్థాలను వేరుచేసి, బయోమైనింగ్ ప్రక్రియతో పునర్వినియోగం చేయగల వాటిని రీసైక్లింగ్ యూనిట్లకు తరలించారు. మిగిలిన వ్యర్థాలను సురక్షితంగా డంప్ చేసే ప్రక్రియ పూర్తి చేశారు. పదెకరాలు శుభ్రం చేసేందుకు రెండున్నరేళ్ల సమయం పట్టగా ఈ స్థలాన్ని బయోమైనింగ్ నిర్వాహకులు కేఎంసీ అధికారులకు అప్పగించారు. -
నాటక రంగానికి జీవం పోస్తున్నారు..
ఖమ్మంగాంధీచౌక్: నాటక రంగం గొప్పదని, మారుతున్న కాలంలో ఆ రంగాన్ని ఆదరిస్తూ నెల నెలా వెన్నెల నిర్వాహకులు జీవం పోస్తున్నారని సినీ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నెల నెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాటక రంగం తల్లి లాంటిదని అభివర్ణించారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలను చూస్తుంటే తన తల్లిగారింటికి వచ్చిన ఆనందం కలుగుతోందన్నారు. ప్రతీ నెల నాటికలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. నాటకాలకు ప్రసిద్ధిగా ఉన్న ఈ ప్రాంతంతో తెలియని అనుబంధం ఉందని చెప్పారు. సినీ దర్శకులు దశరథ్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా పేరును నలుదిశలా చాటుతున్న నెల నెలా వెన్నెల కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మిత్ర ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్, నెల నెలా వెన్నెల నిర్వహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, వేల్పుల విజేత, మోటమర్రి జగన్మోహన్రావు, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతరం సీనియర్ కళాకారుడు కన్నబోయిన అంజయ్యను తనికెళ్ల భరణి సత్కరించారు. కాగా, విజయవాడకు చెందిన న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘ఐ ఏట్ ఇండియా’ నాటిక ప్రేక్షకులను అలరించింది. నెలనెలా వెన్నెల నిర్వాహకులకు తనికెళ్ల భరణి అభినందన -
సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం
● ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాంట్ల ఏర్పాటు ● ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఖమ్మంవ్యవసాయం: సోలార్ విద్యుత్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లన్నీ ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచే పంపిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయాల్లో మంచి డిజైన్లు ఉంటే ఆయా కలెక్టర్లు హైదరాబాద్ కు పంపవచ్చని సూచించారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఖమ్మం కలెక్టరేట్లో పార్కింగ్ షెడ్లు సోలార్ ప్యానెళ్లతో నిర్మించామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇరిగేషన్ భూములు, దేవాదాయ భూముల వివరాలు సమర్పించనున్నట్లు వివరించారు. సమీక్షలో విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి, ఏడీఈ నాగమల్లేశ్వర రావు, రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ – బొలేరో వాహనం ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు తిరుమలాయపాలెం: బొలేరో వాహనం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున దమ్మాయిగూడెం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరం నుంచి పూల మొక్కల లోడుతో నిర్మల్ వెళ్తున్న బొలేరోను వాహనం దమ్మాయిగూడెం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే మరిపెడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బొలేరో వాహనం డ్రైవర్ ఆకుల లోవరాజు, తోడుగా వచ్చిన బొడ్డుపల్లి ప్రదీప్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బురదలో దిగబడిన లారీ..సీసీ రోడ్డు సగం వేసి వదిలేయడంతో ఘటన కారేపల్లి: డోర్నకల్ జంక్షన్ నుంచి కారేపల్లి మీదుగా భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ వరకు నిర్వహించే డబ్లింగ్ రైల్వే లైన్ ప్రక్రియలో భాగంగా.. పనులు చేపట్టిన రైల్వే అధికారులు ముందస్తుగా రైల్వే ట్రాక్ సిమెంట్ దిమ్మెలను లారీల్లో ట్రాక్ల వెంట స్టోర్ చేస్తున్నారు. కాగా, శనివారం కారేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే కేబిన్ వద్దకు సిమెంట్ దిమ్మెలను తీసుకొస్తున్న లారీ కారేపల్లి ముత్యాలమ్మగుడి, సంత, సింగరేణి ప్రాథమిక పాఠశాలల కూడలి మీదుగా వెళ్తుండగా దిగబడిపోయింది. టైర్లు మొత్తం బురదలో దిగబడడంతో లారీ పూర్తిగా ఓ పక్కకు వాలిపోయింది. ఇటీవల ముత్యాలమ్మగుడి నుంచి డోర్నకల్ బైపాస్ రోడ్డుకు కలిపేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అది సగం వరకు వచ్చి ఆగిపోవడం, మిగతా రోడ్డులో అప్పటికే మట్టిని తొలగించి ఉండడంతో వరద నీరు చేరింది. ఈ క్రమంలో లారీ దిగబడగా.. క్రేన్ సాయంతో సిమెంట్ దిమ్మెలను దింపి లారీని బయటకు తీశారు. -
సింగరేణి ‘ఫారెస్టు’ అక్రమాల డొల్ల..
● భూపాలపల్లి ఏరియాలో అక్రమాలపై విచారణ పూర్తి ● కలప విక్రయాల్లో రూ.50 లక్షలకు పైగా తేడా ● ఇతర ఏరియాల్లోనూ విచారణకు పెరిగిన డిమాండ్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సామాజిక బాధ్యత, సంస్థ అవసరాల మేరకు పని చేయాల్సిన ఫారెస్టు విభాగంపై సింగరేణి యాజమాన్యం దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జామాయిల్ చెట్ల నరికివేత, అమ్మకాల విషయంలో కేవలం భూపాలపల్లి సంఘటనే వెలుగు చూసిందని, కానీ వెలుగులోకిరాని నిజాలెన్నో ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం భూపాలపల్లి ఘటనపైనే విచారణ సింగరేణి సంస్థ పరిధిలో 11 ఏరియాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సింగరేణి సంస్థ భారీగా జామాయిల్ చెట్లను పెంచుతోంది. ఏపుగా పెరిగిన చెట్లను నరికి సంస్థ అవసరాల కోసం వినియోగిస్తోంది. చెట్లను నరకడంతో పాటు వాటిని దుంగలు/మొద్దులుగా మార్చి ఇవ్వాల్సిన పనిని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లి ఏరియాలో 2018 నుంచి 2020 వరకు జరిగిన లావాదేవీల్లో రూ. 50 లక్షలకు పైగా పక్కదారి పట్టినట్టు సంస్థ విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చింది. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టి నివేదికను సిద్ధం చేశారు. అవకతవకలకు కారణమైన ఉద్యోగులు, అధికారులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇతర ఏరియాల్లో విచారణ జరపాలి... భూపాలపల్లి ఏరియాలో 2018 నుంచి 2020 మధ్య కాలంలో చోటుచేసుకున్న అక్రమాల కారణంగా సంస్థకు రూ. 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా తేలింది. సంస్థ పరంగా ఫారెస్టు విభాగంలో పని చేసే అఽధికారుల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానగా మారడంతో ఈ వ్యవహారం విజిల్ బ్లోయర్ ద్వారా విజిలెన్స్ దృష్టికి వచ్చింది. లేదంటే సంస్థకు రావాల్సిన రూ. 50 లక్షలకు పైగా సొమ్ము రాకుండా పోయేది. ఈ తరహా అవకతవకలు ఇతర ఏరియాల్లోనూ జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో భూపాలపల్లి తరహాలోనే ఇతర ఏరియాల్లోనూ విచారణ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి. సంస్థ పరిధిలోని అన్ని ఏరియాల్లో కనీసం గడిచిన ఐదేళ్ల కాలంలో ఫారెస్టు విభాగంలో జరిగిన లావాదేవీలపై దృష్టి సారించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కేవలం కర్ర అమ్మకాలే కాకుండా ఎంత విస్తీర్ణంలో కటింగ్ చేయాల్సి ఉండగా ఎంత ఏరియాలో చెట్లను నరికారనే అంశాలపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు. దీంతో పాటు భవిష్యత్లో చెట్లు నరికే విషయంలో అవకతవకలు జరిగేందుకు వీలులేకుండా పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా కొత్త నిబంధనలు రూపొందించాలంటున్నారు. పైస్థాయిలో అలా.. కింది స్థాయిలో ఇలా సామాజిక బాధ్యతగా ఐదు కోట్లకు పైగా మొక్కలు నాటిన సంస్థగా సింగరేణి రికార్డు సాధించింది. 2019లో సంస్థలో డైరెక్టర్ పాగా బాధ్యతలు చేపట్టింది మొదలు ప్రస్తుతం సీఎండీ వరకు రికార్డు స్థాయిలో 20 వేలకు పైగా మొక్కలు స్వయంగా నాటారు. అఖిల భారత స్థాయి అధికారుల్లో ఫారెస్టు వారిని మించి మరీ ట్రీమ్యాన్గా గుర్తింపు పొందారు. మరోవైపు ఆ సంస్థ పరిధిలో ఉన్న ఫారెస్టు విభాగం అక్రమాలకు వేదికగా మారడం గమనార్హం.అసలేం జరిగిందంటే..? గనుల్లో బొగ్గును తీసిన తర్వాత ఏర్పడిన గుల్ల ప్రదేశంలో బొగ్గు పొరలు కూలి కిందపడకుండా సపోర్ట్గా ఐరన్ రాడ్స్, కలప దుంగలను పెడుతుంటారు. ఇందుకోసమే సింగరేణి సంస్థ వేలాది ఎకరాల్లో యూకలిప్టస్ చెట్లు పెంచుతోంది. జామాయిల్ చెట్టు మొదలు (ప్రోప్), మధ్య (చోక్) భాగాలు సపోర్టింగ్ పిల్లర్లుగా ఉపయోగపడతాయి. చెట్టుపై భాగంలో సన్నగా, పీలగా ఉండే కలప సపోర్టింగ్ పిల్లర్గా పనికి రాదు. కానీ పేపర్ పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. వీటితో పేపర్ పల్ప్ను తయారు చేస్తారు. దీంతో నరికివేసిన చెట్ల నుంచి ప్రధాన అవసరమైన సపోర్టింగ్ పిల్లర్లకు సంబంధించిన కలపను సంస్థకు కాంట్రాక్టరు ముందుగా అప్పగించాలి. ఆ తర్వాత మిగులుగా తేలిన జామాయిల్ చెట్ల పై భాగానికి సంబంధించిన వివరాలను వెల్లడించాలి. అనంతరం వాటిని పేపర్ పరిశ్రమలకు అమ్మి, ఆ మేరకు కమీషన్ తీసుకుని మిగిలిన సొమ్మును సంస్థ ఖాతాలో జమ చేయాలి. భూపాలపల్లి ఏరియాలో మిగులు కర్రను కాంట్రాక్టరుకు అప్పగించారు. అయితే తిరిగి ఎంత సొమ్ము సంస్థఖాతాలో జమైంది అనే వివరాల్లో భారీ అంతరాలు చోటు చేసుకున్నట్టు ఫిర్యాదు అందింది. -
‘ఇల్నెస్’ సెంటర్..!
వెల్నెస్ సెంటర్పై పట్టింపు కరువు ● వేధిస్తున్న మందుల కొరత ● నామమాత్రపు ఔషధాలతోనే నెట్టుకొస్తున్న వైనం ● ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ఈ సెంటర్ను కొన్ని నెలలుగా మందుల కొరత వేధిస్తోంది. అవసరమైన మందులు దొరకక ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవసరమైన మందులు దొరకక కొందరు ఆస్పత్రి చుట్టూ తిరుగుతుండగా, మరికొందరు ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్ కేవలం ఓపీ సేవలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజువారీ మాత్రలు కూడా లేక.. వెల్నెస్ సెంటర్కు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో 40 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా బీపీ బారిన పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో దాదాపు 80 నుంచి 90 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. కొందరు బీపీతో పాటు షుగర్ మాత్రలు రోజూ వేసుకోవాల్సి వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల మందులు వెల్నెస్ సెంటర్లో ఆరు నెలలుగా అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు ట్రస్ట్ నుంచి మాత్రలు వస్తున్నా ఒకటి, రెండు రోజుల్లోనే అయిపోతున్నాయి. తాకిడి ఉన్నా పట్టింపు కరువు.. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 200 మంది వెల్నెస్ సెంటర్కు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఇక్కడ జనరల్ మెడిసిస్, ఫిజియోథెరపీ, డెంటల్ తదితర సేవలు అందుతాయి. టెస్టులకు ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, నరాల బలహీనత, జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులకు చికిత్స చేస్తారు. అయితే ఇక్కడ బీ కాంప్లెక్స్, ఇన్సులిన్, థైరాయిడ్, గ్యాస్, జ్వరం, జలుబు, దగ్గు, అస్తమా రోగులకు ఇన్హెల్లర్లు అందుబాటులో లేవు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు మందులు దొరక్క నిరాశగా వెనుదిరుగుతున్నారు. సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి.. ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూత్ర పరీక్షల షాంపిళ్లు తీసుకోవడానికి కనీసం బాత్రూమ్లు కూడా లేవు. దాని కోసం జనరల్ ఆస్పత్రిలోని బాత్రూమ్ల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఓపీ, ఇతర విభాగాల్లో కుర్చీలు కూడా లేవు. గదుల్లో కిటికీలకు కర్టన్లు లేక పగటి పూటే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. సెంటర్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ముగ్గురు ఫార్మసిస్టులకు ఇద్దరు, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇద్దరు, నలుగురు స్టాఫ్నర్సులకు ఇద్దరు, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా పెషెంట్లకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు. గైనిక్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సేవలు అందుబాటులో లేక ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. బీపీ మిషన్ మరమ్మతులకు గురి కాగా, పక్కన పెట్టారు. అలాగే 400 రకాల మందులు అందుబాటులో ఉండాల్సిన ఈ సెంటర్లో 150 రకాలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా వెల్నెస్ సెంటర్కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి బ్రాండెడ్ మందులు సరఫరా అవుతాయి. ఒక్కో రోగి నెలకు సరిపడా మందులు తీసుకెళ్తుంటారు. అవి అందుబాటులో లేక ప్రైవేటు షాపుల్లో డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.మూడు నెలలుగా మందులు లేవు మూడు నెలలుగా వెల్నెస్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా మందులు అందుబాటులో ఉండట్లేదు. ఎప్పుడు వస్తాయనే సమాచారం చెప్పే వారు కూడా లేరు. బీపీ, షుగర్, థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నా. ఈ సెంటర్తో ఉపయోగం లేకుండా పోయింది. – ఎ.జయలక్ష్మి, ఖమ్మంమందుల కొరత వాస్తవమే వెల్నెస్ సెంటర్లో మందుల కొరత వాస్తవమే. ట్రస్ట్కు ఇండెంట్ పెట్టాం. త్వరలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న మందులతో సేవలు అందిస్తున్నాం. రోగులకు సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. కొంత మేరకు సిబ్బంది కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సౌకర్యాలపై కూడా నివేదిక పంపించాం. – డాక్టర్ నారాయణమూర్తి, వెల్నెస్ సెంటర్ జనరల్ ఫిజీషియన్ -
పోరాటాలతోనే హక్కుల సాధన
కారేపల్లి/సత్తుపల్లిరూరల్ : పోరాటాలతోనే ఆదివాసీల హక్కులు సాధ్యమవుతాయని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. శనివారం కారేపల్లిలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు నేటికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్య అవకాశాలకు దూరంగా ఉన్నారని, పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురవుతున్నారని ఆరోపించారు. ఆదివాసీ గూడేల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదన్నారు. ప్రతి ఒక్కరు కొమం భీం స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆదివాసీలు సంప్రదాయ వేషధారణలో కొమరం భీం సెంటర్ నుంచి బస్టాండ్, సినిమాహాల్, అంబేడ్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు దుగ్గి కృష్ణ, బచ్చలి వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, ఈసం భాస్కర్, వీసాల రాంబాబు, యదళ్లపల్లి శ్రీనివాస్, వజ్జా రామారావు, వట్టం నాగేశ్వరరావు, శివరాం, జ్యోతి, రామారావు, సరోజిని, సత్యనారాయణ, స్వామి, పెంటయ్య పాల్గొన్నారు. హక్కుల పరిరక్షణకు ఉద్యమిద్దాం.. సత్తుపల్లిరూరల్ : ఆదివాసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తూ వారిని అడవుల నుంచి తరిమివేస్తున్నాయని, వారి హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు అడవుల్లో స్వేచ్ఛగా జీవించిన ఆదివాసీలు ఇప్పుడు భయంభయంగా బతుకీడుస్తున్నారని అన్నారు. ఆదివాసీల సంరక్షణకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని నేటి పాలకులు గొప్పలు చెబుతున్నా.. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో నేటికీ వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు అమర్లపూడి శరత్, ఎ.వెంకన్న, కాటేనేని శ్రీనివాసరావు, గంటా శ్రీను, కొర్సా వెంకటేష్, దుంపా రాఘవులు, ఆదాం సాహెబ్, మారుతి శ్రీను, పుచ్చ కృష్ణవేణి, కృష్ణ, అరుణ్కుమార్, హనుమంతరావు పాల్గొన్నారు.ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో వక్తలు -
కార్మికులకు రక్షణ కల్పించాలి
మణుగూరు టౌన్: కార్మికుల రక్షణ, ఆరోగ్య పరిరక్షణపై యాజమాన్యం దృష్టి సారించాలని డీఎంఎస్(మైనింగ్) ఎం.ఉమేశ్ సావర్కర్, డీఎంఎస్ (ఎలక్ట్రికల్) ఆనంద్లేల్ అన్నారు. మణుగూరులోని ఇల్లెందు క్లబ్లో మణుగూరు ఏరియాస్థాయి 18వ రక్షణ త్రైపాక్షిక సమావేశం డైరెక్టర్ (పీఅండ్పీ) కొప్పుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. తొలుత అధికారులందరూ రక్షణ ప్రతిజ్ఞ చేశారు. 17వ సమావేశంలో గుర్తించిన సమస్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంఎస్లు మాట్లాడుతూ ప్రతి గనిలో రక్షణపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రి షిఫ్ట్ నిర్వహించే ఉద్యోగుల కోసం లైటింగ్ వ్యవస్థను మెరుగుపర్చాలని చెప్పారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ (మైనింగ్) సనత్కుమార్ మాట్లాడారు. సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు, జీఎం (సేఫ్టీ) కార్పొరేట్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులు తప్పనిసరిగా రక్షణ సూత్రాలు పాటించాలని అన్నారు. యంత్రాల పనిగంటలు పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని కోరారు. కేసీహెచ్పీలో దుమ్ముధూళి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 2025–26 లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏబీసీ రక్షణ సూత్రంపై అవగాహన కల్పించారు. ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ ప్రమాద రహిత ఉత్పత్తికి పటిష్టంగా ముందస్తు చర్యలు తీసుకుని ప్రమాదాలు నివారిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో కొత్తగూడెం జీఎం (సేఫ్టీ) కృష్ణ గోపాల తివారి, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు వై.రాంగోపాల్, త్యాగరాజన్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. రక్షణ త్రైపాక్షిక సమావేశంలో డీఎంఎస్ ఉమేశ్ సావర్కర్ -
వైరల్ ఫీవర్తో రైతు మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన రైతు పున్నపోల వెంకటేశ్వర్లు(49) వైరల్ ఫీవర్తో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన నాలు గు రోజుల క్రితం జ్వరం బారిన పడగా ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే వెంకటేశ్వర్లు మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డెంగీ లక్షణాలతో మహిళ .. కొణిజర్ల: డెంగీ లక్షణాలతో బాధపడుతున్న ఓ మహిళ మండలంలోని తనికెళ్లలో శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన కూచుపూడి హరిత(35) జ్వరం బారి న పడగా ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయి తే, ప్లేట్లెట్ల సంఖ్య క్షీణించడంతో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ శక్రవారం మృతి చెందింది. కాగా, హరిత డెంగీతోనే మృతి చెందిందని ఆమె కుటుంబీకులు చెప్పగా.. పెద్దగోపతి పీహెచ్సీ వైద్యాఽధికారి రాధాకృష్ణ మాత్రం డెంగీ పరీక్షలో నెగిటివ్గా వచ్చిందని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో దోమల పెరిగి జ్వరాలు వ్యాపిస్తున్నందున అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు. ఆర్టీసీ బస్సులో ఛత్తీస్గఢ్ వాసి..వైరా: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స చేయించుకుని వస్తున్న ఛత్తీస్గఢ్వాసి ఆర్టీసీ బస్సులోనే మృతిచెందాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గుడారా గ్రామానికి చెందిన దేవ శిపా అనారోగ్యంతో బాధపడుతుండగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం శుక్రవారం ఆర్టీసీ బస్సులో భద్రాచలం బయలుదేరగా వైరా వద్దకు వచ్చే సరికి మృతి చెందాడు. దీంతో డ్రైవర్ స్టేషన్ మాస్టర్ సాయంతో వైరా పోలీసులకు సమాచారం ఇవ్వగా ట్రెయినీ ఎస్ఐ పవన్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోడ్రైవర్ అదృశ్యంపై కేసు ఖమ్మంఅర్బన్: ఖమ్మం వైఎస్సార్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ జానీ కానరాకుండా పోవడంపై కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితం బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గాలించినా ఫలితం కానరాలేదు. దీంతో జానీ కుటుంబ సభ్యులు శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. -
డబ్బు తక్కువ ఇచ్చారని హిజ్రాల దూషణ
నేలకొండపల్లి: అడిగినంత డబ్బు ఇవ్వండి.. లేకపోతే మా శాపానికి బతుకులు ఆగమవుతాయంటూ కొందరు హిజ్రాలు బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నేలకొండపల్లిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పలువురు వ్రతం చేసుకుంటుండగా ఇద్దరు హిజ్రాలు చేరుకున్నారు. ఇందులో ఒకరు ఇంటింటికీ వెళ్లి అడిగినంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీ కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని బెదిరించారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొందరు డబ్బులు ఇవ్వగా మరికొందరు తక్కువ ఇవ్వబోగా శాపనార్ధాలు పెట్టారు. నేలకొండపల్లి, బైరవునిపల్లి,ఆరెగూడెం, సింగారెడ్డిపాలెం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా విసిగిపోయిన స్థానికులు ఆగ్రహంతో దాడికి యత్నించగా హిజ్రాలు ఇద్దరు వాహనంపై పారిపోయారు. కాగా, టెంట్ కనిపిస్తే చాలు శుభ, అశుభ కార్యమేదైనా డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న హిజ్రాల తీరుపై పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. కత్తి దాడిలో ఒకరికి తీవ్ర గాయాలుఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సాయిగణేష్నగర్కు చెందిన గుడిపెల్లి సుదర్శన్పై అదే కాలనీకి చెందిన మెడికంటి రాజవర్ధన్రెడ్డి కత్తితో దాడి చేయగా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... సుదర్శన్ గురువారం రాత్రి స్థానిక సూపర్ మార్కెట్కు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తిని రాజవర్ధన్రెడ్డి కొడుతుండడంతో అడ్డుకోబోయాడు. దీంతో సుదర్శన్పై రాజవర్ధన్రెడ్డి కత్తితో దాడి చేయగా తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై క్షతగాత్రుని భార్య ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు. కాగా, సుదర్శన్ను మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ టి.దయాకర్రెడ్డి పరామర్శించారు. చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్ ఖమ్మంరూరల్: పలు చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాలు... ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన మోతె శ్రీను, పవార్ తరుణ్ కలిసి తిరుమలాయపాలెం మండలంలో పలు చోరీలకు పాల్ప డ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన ఉప్పలమ్మ ఇంట్లో చోరీ చేయగా, గొల్లగూడెం గోదాం వద్ద ఒక జంట ద్విచక్రవాహనంపై ఆరెంపులకు వస్తుండగా వారి నుంచి తులం బంగారు గొలుసు లాక్కున్నారు. అలాగే, జూన్ 27న తిరుమలాయపాలెంలో పొలానికి వెళ్తున్న వ్యక్తి నుంచి ఉన్న రెండు తులాల బంగారు లాకెట్ అర తులం బంగారు ఉంగరం, సెల్ఫోన్, ఇదే నెల 13న పిండిప్రోలులో మహిళ నుంచి తులం బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. అంతేకాక కూసుమంచి మండలం లింగారాంతండా వద్ద మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో పారిపోయారు. ఈమేరకు నిందితులను గుర్రాలపాడు వద్ద శుక్రవారం అరెస్ట్ చేసి ఆభరణాలు, ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ముష్క రాజు, ఎస్ఐ విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్తో ప్రమాదం జరగొద్దు..
ఖమ్మంవ్యవసాయం: ఇళ్లలో బట్టలు ఆరేసేందుకు ఇనుప తీగలు కడుతుండగా విద్యుత్ వైర్లు తాకడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగా రు. ఇందులో భాగంగా ఇనుప తీగలను బట్టలు ఆరేసేందుకు వినియోగించొద్దని.. వీటికి బదులు ప్లాస్టిక్ తీగలే వాడాలని శుక్రవారం విద్యుత్ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించారు. ఉద్యోగులు, సిబ్బంది పలువురు ఇళ్లకు వెళ్లి ఇనుప తీగలు ఉన్న చోట్ల తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్ తీగలు ఏర్పాటు చేయించారు. వర్షాల నేపథ్యాన ప్రమాదాలకు ఆస్కారమున్నందున ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టినట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. కారణాలు, నివారణపై విస్తృత అవగాహన -
పింఛన్ పెంపు హామీ అమలెప్పుడు?
వైరా/కూసుమంచి/మధిర: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేయూత పింఛన్ మొత్తాన్ని పెంచుతామంటూ ఇచ్చిన హామీని ఇకనైనా అమలుచేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగుల పింఛన్లు పెంచాలనే డిమాండ్తో వైరా, కూసుమంచి మండలం జీళ్లచెరువు, మధిర మార్కెట్ యార్డులో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దివ్యాంగు పింఛన్ను రూ.4వేల నుంచి రూ.6 వేలకు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు రూ.2వేలను రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా త్వరలోనే హైదరాబాద్లో నిర్వహించే సభకు జిల్లా నుంచి దివ్యాంగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశాల్లో నాయకులు కారుమంచి వెంకన్న, మాగంటి వెంకటేశ్వర్లు, బత్తుల అంజలి, సంగెపు ఆదినారాయణ, ఎక్కిరాల సుజాత, బానోతు సైదులు, ఆదూరి ఆనందరావు, ఇల్లు వెంకటి, దాసరి కృష్ణవేణి, విలారపు ఉమారాణి, తూరుగంటి అంజయ్య, బెల్లంకొండ రవి, అయినాల కనకరత్నం, సామినేని భవానీచౌదరి, అజ్మీరా భారతి, బొజ్జ జీవరత్నం, పగిడికత్తుల ఈదయ్య, కట్టెకోల వెంకటేశ్వర్లు, తోడేటి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ -
రెండో రోజు రెండు నాటికలు
ఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో కళాకారులు ప్రదర్శిస్తున్న నాటికలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తున్నాయి. నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పోటీలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కరీంనగర్కు చెందిన చైతన్య కళా భారతి బాధ్యులు ‘ఖరీదైన జైళ్లు’ నాటికను ప్రదర్శించారు. ఆధునిక సమాజంలో గ్రామీణ వాతావరనం, నగరాల్లో బ్రతుకుతున్న ప్రజల జీవన విధానాలు, ప్రేమానుబంధాల మధ్య తేడాను ఈ తేడా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపారు. ఓ అపార్టుమెంట్లో ఉంటున్న కుటుంబంలో కొడుకు అమెరికాలో, కూతురు ముంబైలో ఉండగా తండ్రి మరణిస్తాడు. ఈ విషయం తెలిపినా పిల్లలు పనుల కారణంగా రాకపోవడంతో వాచ్మెన్ తలకొరివి పెట్టగా కుమారుడు, కుమార్తె ఆన్లైన్లో చూస్తూ నివాళులర్పించడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. అనంతరం విజయవాడకు చెందిన మైత్రి కళానిలయం వారు ‘బ్రహ్మస్వరూపం’ నాటికను ప్రదర్శించారు. స్నిగ్ధ నాటకీకరించిన ఈ నాటికకు టీవీ.పురుషోత్తం దర్శకత్వ వహించారు. ఆహ్లాదకరంగా సాగే జీవితంలో ఊహించని కష్టం చోటు ఎదురైతే జరిగే పరిణామాల ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. కాగా, రెండో రోజు పోటీలను చెరుకూరి వనశ్రీ, కాటంనేని వీరభద్రరావు, రమేష్, సంపత్, తిరుమలాచారి, వేల్పుల విజేత, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, జగన్మోహన్రావు, సదానందం, లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్, నాయకుడు తుమ్మల యుగేందర్ తదితరులు హాజరై ప్రదర్శకులకు పోత్సాహకాలు అందించారు. కాగా, నాటిక పోటీలకు శనివారం సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించిన ‘ఖరీదైన జైళ్లు’ -
బ్యాంకింగ్ రంగంలో పెనుమార్పులు
ఖమ్మంగాంధీచౌక్: బ్యాంకింగ్ రంగంలో పెను మా ర్పులు చోటు చేసుకుంటున్నాయని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో రెండు రోజులుగా జరుగుతున్న యూనియన్ వర్కింగ్ కమిటీ సమావేశాలు శుక్రవారం ముగిశా యి. ఈ ముగింపు సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు అధికారులు, ఉద్యోగులపై భారంగా పరిణమించాయని చెప్పారు. ఈ కారణంగా పనిభారం, ఒత్తిడి పెరిగి సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయితే, పెరిగిన భారానికి అనుగుణంగా ప్రోత్సాహకం లేకపోవడం మరింత ఆవేదన కలిగి స్తోందని చెప్పారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాండిల్య మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందన్, ఖమ్మం జిల్లా రీజనల్ కార్యదర్శి చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుంచి 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ -
‘సైబర్’ ముఠాలో వేదాంతపురం వాసి
● ఉపాధి కోసం కాంబోడియా వెళ్లిన అన్నదమ్ములు ● మంచిర్యాల జిల్లా వాసికి డబ్బు ఎరవేసిన ఒకరు ● ఆపై జన్నారం కేంద్రంగా సైబర్నేరాలుఅశ్వారావుపేటరూరల్: అమాయకులను నమ్మించి రూ.కోట్లలో కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వేదాంతపురం గ్రామవాసి ఉన్నట్లు బయటపడడం సంచలనం కలిగించింది. కొద్ది రోజులుగా పరారీలో నిందితుడి కోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందం అధికారులు గ్రామంలో గురువారం రాత్రి విచారణ చేపట్టిన విషయం శుక్రవారం వెలుగుచూసింది. అక్కడ పట్టుబడడంతో.. మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా పెద్దత్తున సైబర్ నేరాలు జరుగుతున్నట్లు సమాచారం అందగా గత నెల 30వ తేదీన పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. విచారణలో అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన అన్నదమ్ముల్లో ఒకరు ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. ఆయన కోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందం గాలిస్తుండగా గురువారం రాత్రి గ్రామంలోని వారి నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్నదమ్ములు తక్కువ సమయంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు గుర్తించారని సమాచారం. వేదాంతపురం టు కాంబోడియా పదో తరగతి, ఇంటర్ అభ్యసించిన వేదాంతపురానికి చెందిన అన్నదమ్ములు మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కాంబోడియా దేశానికి వెళ్లారు. వీరిద్దరు అక్కడ హోటల్లో పనిచేస్తుండగా ఒకరికి సైబర్ నేరగాళ్లతో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. వారి నుంచి యంత్రాలు సమకూర్చుకున్నట్లు సమాచారం. ఆపై మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడగా.. సదరు వ్యక్తి స్వగ్రామానికి వెళ్లే క్రమాన సైబర్ నేరాలతో రూ.కోట్లు సంపాదించవచ్చని ఆశ చూపాడని తెలిసింది. నేరాల్లో ఉపయోగపడే యంత్రాలను తీసుకెళ్లాలని సూచించగా సదరు వ్యక్తి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆపై కాంబోడియాలో ఉన్న ప్రధాన నిందితుడి సూచనల మేరకు జన్నారంలోని బంధువుల ఇంట్లో గది అద్దెకు తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఢిల్లీకి చెందిన టెలీ కమ్యూనికేషన్ శాఖ అధికారులు గుర్తించారు. ఈమేరకు జన్నారంలో ముఠాను పోలీసులు అరెస్ట్ చేయగా.. సూత్రధారి వేదాంతపురం వాసి అని తేలడంతో సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై అశ్వారావుపేట ఎస్సై యయాతిరాజును వివరణ కోరగా.. సైబర్ నేరం ఘటనలో వేదాంతపురం వాసిపై మంచిర్యాల జిల్లాలో కేసు నమోదైందని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందం విచారిస్తుండగా.. తమ పరిధిలో లేదని వెల్లడించారు. -
సీహెచ్పీలో తనిఖీ చేసిన డైరెక్టర్
సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను శుక్రవారం సింగరేణి డైరెక్టర్(ఎగ్జిక్యూటివ్) బి.వెంకన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగ్గు రవాణా, నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం సింగరేణి, రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణాను మరింత పెంచాలని సింగరేణి అధికారులకు, ఖాళీ వ్యాగన్లను సకాలంలో అందించాలని రైల్వే అధికారులకు సూచించారు. కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఉద్యోగులు సూర్యనారాయణరాజు, ప్రహ్లాద్, నర్సింహారావు, సోమశేఖర్రావు, మదన్మోహన్, తౌర్య, రవికుమార్, ఏ.రాజేంద్రబాబు, కేవై.పాషా పాల్గొన్నారు. -
పెంచక మూడేళ్లు..
లారీ కిరాయిసత్తుపల్లి: మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా సత్తుపల్లిలోని బొగ్గు లారీల యజమానుల పరిస్థితి తయారైంది. లారీ నిర్వహణ ఖర్చులు, పన్నులు, బీమా, పెరిగిన డీజిల్ ధరలు, డ్రైవర్లు, క్లీనర్ల జీతభత్యాలు పెరిగిపోతుంటే.. వారికి ఇచ్చే కిరాయి మాత్రం పెరగడం లేదు. మూడేళ్ల క్రితం హైదరనాబాద్కు బొగ్గు రవాణా చేస్తే టన్నుకు రూ.1,400 చెల్లించేవారు. ఇప్పుడు అదే అద్దె చెల్లిస్తుండడం గమనార్హం. ఒక్కో లారీకి ఏజెంట్ కమీషన్ రూ.3వేలు దండుకుంటున్నా.. కిరాయి పెంచకపోవడంపై లారీల యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయినా లారీలను ఏజెంట్లు చెప్పినట్లుగా అద్దెకు తిప్పాల్సి వస్తోంది. అయితే, ఈ అంశంపై లారీ యజమానుల యూనియన్ దృష్టి సారించకపోవటం మరింత ఆందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. ఉద్యమించి సాధించుకున్న బొగ్గు లోడింగ్ దళారుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు లారీల సీలింగ్ తీర్మానం ఏడాదిన్నర క్రితం ఎవరికైనా ఐదు లారీల కంటే ఎక్కువ ఉంటే వాటిని యూనియన్ పరిధిలో సీరియల్ వేసేది లేదని కొన్నాళ్ల క్రితం తీర్మానించారు. అయినా ఆ తీర్మానం అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఐదు లారీల కంటే ఎక్కువగా 20 మంది కలిగి ఉండగా.. వీరి లాభం కోసం ఒక్కో లారీ ఉన్న యజమానులను ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. యూనియన్లో కూడా వీరి పెత్తనమే ఉండడంతో చర్చించటానికి సైతం ముందుకు రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. భూ నిర్వాసితుల సంగతేమిటి? సత్తుపల్లి మండలంలోని కిష్టారం, కొమ్మేపల్లి, జగన్నాథపురం, చెరకుపల్లి, రేజర్ల రైతులు వందల ఎకరాల భూమిని సింగరేణి గనులకు అప్పగించారు. ఆ సమయాన నిర్వాసితులకు బొగ్గు రవాణాలో ప్రాధాన్యత కల్పిస్తామని సింగరేణి అధికారులు ఇచ్చిన హామీ నెరవేరడం లేదు. ఏడాది క్రితం భూ నిర్వాసితులు న్యాయమైన లోడింగ్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తే.. యూనియన్ బాధ్యులు చర్చిద్దామని జెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదు. సుమారు వందకు పైగా లారీలు భూనిర్వాసితులకు ఉండగా.. లోకల్, నాన్లోకల్ కారణాలతో లోడింగ్ దక్క ఫైనాన్స్ చెల్లించలేక రోడ్డున పడుతున్నారు. ఏజెంట్ల ఇష్టారాజ్యంతో యజమానులకు అన్యాయం భూనిర్వాసితులకు దక్కని ప్రాధాన్యతనాన్లోకల్ రోజుకు 20 లారీల యజమానుల ఆందోళనలకు మద్దతు గా సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి సింగరేణి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో లారీలకు రోజూ 1,500 టన్నుల బొగ్గు లోడింగ్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఫలితంగా రోజుకు 50 లారీలకు లోడింగ్ దక్కుతుండగా... నాన్లోకల్ లారీలౖకైతే కమీ షన్ ఎక్కువని అటే ఇస్తుండడంతో స్థానిక యజమానులకు సీరియల్ బాధలు తప్పడం లేదు. లారీ యూనియన్ బాధ్యులు దీనిపై దృష్టి సారించకుండా లోడింగ్ లేవంటూ ఆందోళనలు చేయటం.. తీరా వచ్చాక నాన్లోకల్ లారీలకు ఏజెంట్లు కట్టబెడుతున్న తీరుపై నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకపోతే కోయగూడెం ఓసీలో నాన్లోకల్ కింద బయట లారీలకు కాక, స్థానిక లారీలకే నాన్లోకల్ కింద తక్కువ కిరాయితో పంపిస్తున్నట్లు సమాచారం. -
జవహర్ లిఫ్ట్ వద్ద సిద్ధమైన పైలాన్
మధిర: ఖమ్మం జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం మండలాలను ఎన్నెస్పీ సెకండ్ జోన్లోకి మార్చి సాగునీటి సరఫరా కోసం రూ.630.30 కోట్ల నిధులతో జవహర్ ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు. ఈ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. మధిర మండలం వంగవీడులో ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు శంకుస్థాపన చేయనున్న భట్టి, మంత్రులు ఆతర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా, శంకుస్థాపన ప్రదేశం వద్ద పైలాన్ను నిర్మించగా మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు బండారు నరసింహారావు, కర్నాటి కోటేశ్వరరావు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ వివిధ మండలాల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, సూరంసెట్టి కిషోర్, గాలి దుర్గారావు, శీలం శ్రీనివాసరెడ్డి, నాయకులు అనుమోలు వెంకటకృష్ణారావు, కడియం శ్రీనివాసరావు, దేవరకొండ రాజీవ్గాంధీ తదితరులు పాల్గొన్నారు. రేపు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం -
ఓయూ నుంచి డాక్టరేట్
కల్లూరు: కల్లూరు మున్సిపాలిటీ పరిధి శాంతినగర్కు చెందిన కొత్తపల్లి మందాకినికి ఉస్మానియా యూని వర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ కె.శ్యామల పర్యవేక్షణలో ఆమె సమర్పించిన పరిశోధనా త్మక సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్ ప్రకటించా రు. మందాకిని తండ్రి గోపాలరావు ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్కాగా, భర్త అన్వేష్ ములుగు జిల్లాలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నేడు మంత్రి పొంగులేటి పర్యటనఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు రఘునాథపాలెం, వైరా, బోనకల్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లోని పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. కాంగ్రెస్ మాజీ ఇన్చార్జిని కలిసిన మంత్రిఖమ్మంఅర్బన్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రేను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయనను కలిసిన మంత్రి రాష్ట్రంలో వ్యవసాయ రంగం, పార్టీ వ్యవహారాలు తదితర అంశాలపై చర్చించారు. గణపతి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతఖమ్మంగాంధీచౌక్: సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వినాయక నవరాత్రోత్సవాలు నిర్వహించాలని ఖమ్మం స్తంభాద్రి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కమిటీ అధ్యక్షుడు వినోద్ లాహోటి అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఉత్సవా లపై నిర్వహణపై చర్చించారు. ఈనెల 27వ తేదీ బుధవారం గణేష్ఉత్సవాలను ప్రారంభించి,సెప్టెంబర్6న ప్రతిమలనునిమజ్జనం చేయా లని నిర్ణయించారు. ఈసారి మట్టి విగ్రహాలతో ఉత్సవాలను జరుపుకునేలా మండప నిర్వాహకులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉత్సవాలు వైభవంగా జరిగేలా సహకారం కోసం కలెక్టర్, పోలీస్ కమిషనర్ను కలవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కమిటీ ప్రధా న కార్యదర్శి కీసర జయపాల్రెడ్డితో పాటు గెంటేల విద్యాసాగర్, వేల్పుల సుధాకర్, అల్లిక అంజయ్య, ఈశ్వరప్రగఢ రామారావు, హరి, పిల్లలమర్రి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఏకగ్రీవం ఖమ్మం సహకారనగర్: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఇద్దరిని ఎన్నుకున్నారు. ఖమ్మం జెడ్పీ హాల్లో జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే(ఐజే యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, సీనియర్ నాయకుడు నలజాల వెంకట్రావు మాత్రమే ఇద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికఏకగ్రీవమైంది. అనంతరం వీరిని యూ నియన్ నాయకులు సన్మానించారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావుతో పాటు నాయకులు మాటేటి వేణుగోపాల్, వనం వెంకటేశ్వర్లు, శివ, మామిడాల భూపాల్, పసునూరి మహేందర్, కనకం సైదులు, అన్నంచిన్ని వెంకట రామారావు, నెల్లూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. పాత సంతకాలతో నోటరీలు?ఖమ్మంక్రైం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపాన ఓ మహిళ నిర్వహిస్తున్న జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లో శుక్రవారం రాత్రి టూటౌన్, టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆమె వద్దకు నోటరీ కోసం వచ్చే వారిని విచారించకుండానే పాత సంతకాలతో కూడిన పత్రాలు విక్రయిస్తుందనే ఫిర్యాదులు అందాయని సమాచారం. దీంతో తనిఖీ చేపట్టి 36 నోటరీలను స్వాధీనం చేసుకున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు. -
విత్తకుండానే పంట పండింది!
ముదిగొండ: రబీలో ఆరు తడి పంటల సాగు మంచిదన్న వ్యవసాయశాఖ అధికారుల సూచనలతో ఓ ఆదర్శ రైతు గడిచిన రబీలో మూడెకరాల్లో పెసర సాగు చేశాడు. అదేస్థలంలో రెండు పంట కూడా తీసిన సదరు రైతు ఔరా అనిపించాడు. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన ఆదర్శ రైతు జూలకంటి సంజీవరెడ్డి గత 30ఏళ్లుగా పంట మార్పిడి విధానం పాటిస్తూ ఆరు తడి పంటలు సాగు చేస్తున్నాడు. గత రబీలోనూ మూడెకరాల్లో పెసర సాగు చేశాడు. బోరు సాయంతో నీరందించగా 20క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే, పంట తీసిన కొద్దిరోజులకే చేనును బోరు నీటితో తడిపాడు. దీంతో వారం వ్యవధిలోనే రాలిన గింజల ద్వారా మళ్లీ పెసర మొక్కలు మొలకెత్తాయి. ఆపై చీడపీడలు ఆశించకుండా కాపాడడంతో ఇటీవల పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్లో క్వింటా పెసలకు రూ.7వేల నుంచి రూ.8వేల ధర ఉండగా.. ఒకేసారి విత్తనంతో రెండు పంటలు తీసిన సంజీవరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. -
మద్యం మత్తులో మార్కెట్ డైరెక్టర్ హల్చల్
కల్లూరు: కల్లూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మద్యం మత్తులో ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీల పేరిట హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుబల్లి మండలం చిన్యాతండాకు చెందిన కల్లూరు మార్కెట్ డైరెక్టర్ బాలాజీ బుధవారం తెల్లవారుజామున ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన రికార్డులు పరి శీలించాలంటూ సిబ్బందిని బెదిరించినట్లు తెలిసింది. అంతేకాక చికిత్స పొందుతున్న వారిని ఏ ఊరు, ఎందుకు వచ్చారని ఆరా తీస్తూ అందరి సంగతి తేలుస్తానంటూ హడావుడి చేసినట్లు సమాచారం. ఘటనపై వైద్య సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి ఆయనకు సర్దిచెప్పి పంపించారు. -
దళితుల నడుమ భూవివాదం
చింతకాని: గత ప్రభుత్వం దళిత కుటుంబాలకు భూమి పంపిణీ చేయగా.. నెలకొన్న వివాదం ఒకరిపై హత్యాయత్నానికి దారి తీసింది. చింతకాని ఎస్సీ కాలనీలో గురువారం అర్ధరాత్రి నారపోగు రామకృష్ణపై అదే కాలనీకి చెందిన 12మంది హత్యాయత్నానికి పాల్పడగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు వెల్ల డించిన వివరాలు... బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ చేయగా చింతకానిలో తొమ్మిది కుటుంబాలకు 27 ఎకరా లు అందాయి. అయితే, భూమి రాని వారు, భూమి పొందిన వారి నడుమ వివాదం నెలకొంది. ఈ విషయమై రెండు రోజుల క్రితం కొందరు తహసీల ఎదుట దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యాన నారపోగు రామకృష్ణ కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఫంక్షన్ నుంచి ఇంటికి వస్తుండగా కాపు కాసిన ఉసికల నాగరాజు, మరో 11 మంది కత్తులు, కొడవళ్లతో దాడి చేశారు. దీంతో రామకృష్ణ మెడ వద్ద తీవ్ర గాయం కాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటన సమాచారం తెలుసుకున్న వైరా ఏసీపీ రహమాన్, సీఐ సాగర్ నేతృత్వాన గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. అలాగే, బాధితుడి ఫిర్యాదుతో 12మందిపై కేసు నమోదు చేయగా ఇద్దరిని అరెస్ట్ చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు. చింతకానిలో వ్యక్తిపై హత్యాయత్నం -
మాయమాటలతో కాంగ్రెస్ గారడీ
ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో గారడీ చేస్తూ పాలనను గాలికొదిలేసిందని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి వాటి అమలును గాలికొదిలేశారని ఆరోపించారు. రైతుల రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోగా, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందడం లేదని, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని, కేంద్రం నిధులు ఇస్తుంటే.. కాంగ్రెస్ శ్రేణులకు ఇళ్లు కేటాయిస్తున్నారని సుధాకర్రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళా నాయకులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు గెంటెల విద్యాసాగర్, సన్నె ఉదయ్ప్రతాప్, గోంగూర వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, నున్నా రవికుమార్, అల్లిక అంజయ్య, మండడపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.బీజేపీ నాయకుడు సుధాకర్రెడ్డి -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరగాలి
● జిల్లా ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దండి ● మరింత వేగంగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు ● హెచ్డీఎస్ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ(హెచ్డీఎస్) సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘సుడా’ నిధులు రూ.25కోట్లతో ఆస్పత్రిలో 13 అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇందులో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు త్వరగా పూర్తిచేయడంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కావాల్సిన యంత్రాలు సమకూరుస్తామని చెప్పారు. అలాగే, టాయిలెట్ల మరమ్మతు పూర్తిచేసి, అందుబాటులో ఉన్న యంత్రాల పనితీరు, సీసీ రోడ్ల మరమ్మతుకు అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయాన ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్సూచించారు. పలు విభాగాల పనితీరుపై సీరియస్ ఆస్పత్రిలో పలు విభాగాల్లో పనితీరుపై కలెక్టర్ అనుదీప్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో 259 మంది కార్మికులు ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపంతో సగం మందే పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్ట్ గడువు ఈ నెలతో ముగుస్తున్నందున 50 మందికి ఒక సూపర్వైజర్ చొప్పున బాధ్యతలు అప్పగించి పనులు చేయించాలని సూచించారు. అలాగే, శస్త్రచికిత్సలు సాఫీగా జరిగేలా పరికరాల మరమ్మతు అవసరమైతే చేయించాలని తెలిపారు. అంతేకాక రోగులతో ప్రవర్తన, వైద్యులు, సిబ్బంది సమయపాలనపై కలెక్టర్ సూచనలు చేశారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.నరేందర్, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, వైద్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మిగులు భూమి ఎంత?
కేటాయింపులు, ఆక్రమణలు ఎన్నెస్పీ ప్రధాన కాల్వపైనే పాలేరు నుంచి ఏన్కూరు వరకు ఖమ్మం చుట్టుపక్కల సుమారు 368ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఇందులో దానవాయిగూడెం కాలనీ, మద్దులపల్లి మార్కెట్ ఏర్పడ్డాయి. ఇక మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి కొంతమేర స్థలాలు ఇచ్చేందుకు గుర్తించారు. ఖమ్మం నడిబొడ్డున మేజర్ కాల్వ ఐదున్నర కి.మీ. పొడవుతో టేకులపల్లి వంతెన నుంచి చైతన్యనగర్, వరదయ్యనగర్, మధురానగర్ కాలనీ ధంసలాపురం వరకు ఉండేది. కానీ ఇప్పుడు కేవలం కి.మీ. నిడివి ద్వారా మాత్రమే లకారం చెరువులోకి నీరు చేరేందుకు ఉపయోగపడుతోంది. మిగతా భాగమంతా ఆక్రమణలకు గురికాగా.. ఇంకొంత క్రమబద్ధీకరణతో ఇతరుల పరమైంది. అలాగే, కాల్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్లాట్లుగా మార్చేసిన ఉదంతాలు కూడా వెలుగు చూశాయి. దీంతో ఇప్పుడు కాల్వలు, స్థలాల గుర్తింపు కష్టంగా మారింది చెబుతున్నారు. ఖమ్మంఅర్బన్: రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల శాఖ పరిధిలోని భూముల గుర్తింపునకు కసరత్తు మొదలైంది. ఆయా భూముల లెక్కలు తేల్చి రక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ఆదేశించారు. దీంతో జిల్లాలోనూ అధికారులు మిగులు భూముల లెక్కల వివరాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు(ఎన్నెస్పీ) పరిధి కాల్వల నిర్మాణ సమయాన రైతుల నుంచి భారీగా భూములు సేకరించారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో భూములు సేకరించగా.. కాల్వలు తవ్వకం, క్యాంప్లు, క్వార్టర్లు, ఇతర నిర్మాణాలకు పోగా మిగిలిన భూములు ఎక్కడెక్కడ, ఎంత మేర ఉన్నాయని సబ్ డివిజన్ల వారీగా నివేదిక తయారు చేస్తున్నారు. 239 కి.మీ. మేర కాల్వలు జిల్లాలో సాగర్ ప్రధాన కాల్వ, బ్రాంచ్ కాలువలు కలిపి 239 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. వీటితోపాటు మేజర్లు, మైనర్లకు సైతం అప్పట్లో రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే, అవసరానికి మించి చాలాచోట్ల ఎక్కువ వైశాల్యం గల భూములు సేకరించినట్లు అంచనా. డీప్ కట్ ప్రాంతాల్లో మట్టి పోసేందుకు, క్యాంప్లు, యంత్రాల నిల్వ కోసం ఇలా సేకరించినట్లుసమాచారం. బోనకల్ బ్రాంచ్, మధిర బ్రాంచ్, 16–17 బ్రాంచ్ కాల్వల పరిధిలో భారీగా భూసేకరణ జరిగినట్లు తెలిసింది. క్యాంపుల నిర్మాణం విధినిర్వహణకు వచ్చే ఎన్నెస్పీ ఉద్యోగుల కోసం ఖమ్మం, వైరా, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, ఏన్కూరు, తిమ్మారావుపేట, బసవాపురం తదితర ప్రాంతాల్లో క్యాంపులు నిర్మించారు. అలాగే, ఉద్యోగులు, సిబ్బంది ఉండేలా క్వార్టర్ల నిర్మాణం సైతం జరిగింది. ఆతర్వాత మిగులు భూముల్లో కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, మార్కెట్ యార్డులకు కేటాయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు సైతం జరగగా.. ప్రభుత్వమే 59 జీఓ ద్వారా క్రమబద్ధీకరించడంతో ఎన్నెస్పీ భూములు కుంచించుకుపోయాయి. పేరుకే క్యాంప్.. ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ఎన్నెస్పీ క్యాంపులో మొత్తం 96 ఎకరాల భూమి జలవనరుల శాఖ పరిధిలో ఉంది. కానీ ఇది రికార్డుల్లో మాత్రమే కనిపిస్తోంది. ఈ భూమిలో 80 ఎకరాలకు పైగా వివిధ ప్రభుత్వ శాఖలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలకు కేటాయించారు. ఇదే స్థలంలో ఆర్టీసీ, ఆర్టీఓ, ఎల్ఐసీ, డీపీఓ, ఆర్డబ్ల్యూఎస్ తదితర కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇక పట్టాదారులు కొందరు అప్పటి ఎన్నెస్పీ అధికారుల ద్వారా తమ పట్టా భూములు మిగులుగా ఉన్నాయని కొంతమేర తీసుకున్నట్లు సమాచారం. అన్నీ పోగా క్యాంప్లో ప్రస్తుతం 16 ఎకరాలే జలవనరుల శాఖ పేరున మిగిలి ఉండొచ్చని అంచనా. భవిష్యత్ అవసరాల కోసం... ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు నిర్మించేందుకు భూమి అవసరమైనప్పుడు వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యాన మిగులు భూములపై సమగ్ర సర్వే చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలోని జలవనరుల శాఖ మిగులు భూములను పూర్తిస్థాయిలో గుర్తించడంలో నిమగ్నమయ్యారు. ఇదేసమయాన ఆక్రమణలు, కేటాయింపులు, ప్రభుత్వ వినియోగం తదితర వివరాలను కూడా నివేదికలో పొందుపర్చనున్నట్లు తెలిసింది.జలవనరుల శాఖ స్థలాలపై ఆరా సబ్ డివిజన్ల వారీగా లెక్కలు తీస్తున్న యంత్రాంగం ఖమ్మం ఎన్నెస్పీ క్యాంపులో మిగిలింది 16 ఎకరాలే? -
సీహెచ్పీలో సింగరేణి ఈడీ తనిఖీ
సత్తుపల్లి: సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను శుక్రవారం సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూవ్మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, సీహెచ్పీ ద్వారా రవాణాపై ఆరా తీశారు. అనంతరం జీఎం కార్యాలయంలో సింగరేణి, రైల్వే అధికారులతో ఈడీ సమావేశమయ్యారు. సైలో బంకర్ నుంచి దుమ్ము, ధూళి వెలువడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోజువారీ లక్ష్యాలను అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సూచించారు. అనంతరం ఓసీల డంప్ యార్డ్లపై ఈడీ మొక్కలు నాటారు. కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఉద్యోగులు కోటిరెడ్డి, సూర్యనారాయణరాజు, ప్రహ్లాద్, నర్సింహారావు, సోమశేఖర్రావు, మదన్మోహన్, తౌర్య, రవికుమార్, ఏ.రాజేంద్రబాబు, కేవై.పాషా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు 3వేల మెట్రిక్ టన్నుల యూరియా ఖమ్మంవ్యవసాయం/చింతకాని: ఉమ్మడి ఖమ్మం జిల్లా అవసరాల కోసం 3,001 మెట్రిక్ టన్నుల క్రిబ్కో యూరియా సరఫరా అయింది. ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్కు యూరియా చేరగా.. ఖమ్మం జిల్లాకు 1,501, భద్రాద్రి జిల్లాకు 1,400 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మిగిలిన 100మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేశారు. జిల్లాల వారీగా కేటాయించిన యూరియాను పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా విక్రయిస్తారు. కాగా, పందిళ్లపల్లిలో యూరియా పంపిణీని ఖమ్మం డీఏఓ డి.పుల్లయ్య పర్యవేక్షించారు. జిల్లాలో ఓ మోస్తరు వాన ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా గురువారం, శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గురువారం ఉదయం 8–30 నుంచి శుక్రవారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో సగటున 19.9 మి.మీ.ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా వేంసూరు మండలంలో 74.4 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, ఎర్రుపాలెంలో 52.2, నేలకొండపల్లిలో 50.2, బోనకల్లో 47.8, మధిరలో 46.2, వైరాలో 22.4, సత్తుపల్లిలో 21.8, చింతకానిలో 14.8, తల్లాడలో 10.4, పెనుబల్లిలో 10.2, సింగరేణిలో 10 మి.మీ., మిగిలిన మండలాల్లో 10 మి.మీ.ల లోపు వర్షపాతం నమోదైందని తెలిపారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగగా, ప్రస్తుతం వర్షంతో పత్తి తదితర మెట్ట పంటలకే కాక వరి పంటకు ప్రయోజనం కలగనుంది. ట్యాంక్ బండ్లుగా అభివృద్ధికి రూ.30కోట్లు ఖమ్మం రాపర్తినగర్: మధిర నియోజకవర్గంలోని పలువురు చెరువులను ట్యాంకు బండ్లుగా అభిృవృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.30.60కోట్ల నిధులు కేటాయించింది. ఈమేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు శుక్రవారం ఆయా చెరువులను పరిశీలించి అభివృద్ధి ప్రతిపాదనలపై సమీక్షించారు. ముత్తారం చెరువును రూ.8.95కోట్లు, చింతకాని చెరువును రూ.7.90కోట్లు, కలకోట చెరువును రూ.7.05కోట్లు, చిరుమర్రి, బయ్యారం చెరువులను రూ.2.90కోట్ల చొప్పున నిధులతో పాటు మాటూరు చెరువుకు రూ.90లక్షలతో ట్యాంక్ బండ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఉపేందర్రెడ్డి, సరిత, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి పూసుకుంట..
ఆదివాసీ గ్రామంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు వెదురు బొమ్మలే జీవనాధారం.. పూసుకుంట గ్రామం వెళ్లాలంటే దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి నుంచి దట్టమైన అడవిలో 13 కి.మీ పాటు కాలిబాటన ప్రయాణించాలి. వానాకాలం వచ్చిందంటే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మిగతా కాలాల్లో కొన్ని ఆటోలు, టూ వీలర్ల ద్వారా గ్రామానికి రాకపోకలు సాగుతాయి. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రోడ్లు, మిషన్ భగీరథ పథకం గ్రామానికి చేరుకోలేదు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వానలపై ఆధారపడి సాగే వ్యవసాయంతో పాటు వెదురు బొమ్మల తయారీనే ప్రజల ప్రధాన జీవనాధారంగా మారింది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆదివాసీల జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో గొప్పగా చెబుతారు. ఆ రోజు గడిస్తే మళ్లీ వారి జీవితాల్లోకి రోడ్డు సౌకర్యం లేకపోవడం, కరెంటు ఉండకపోవడం, తాగునీటి కోసం తండ్లాట వంటి సమస్యలు వచ్చి చేరతాయి. వీరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రజాప్రతినిధులు గట్టిగా సంకల్పం తీసుకుంటే అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సంక్షేమం, అభివృద్ధి కిరణాలు ఎంత వేగంగా ఆదివాసీ జీవితాల్లోకి వస్తాయనేందుకు.. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామం నిదర్శనంగా నిలుస్తోంది. నాటి గవర్నర్ గ్రామాన్ని సందర్శించాక.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలపాటు దట్టమైన అడవిలో ఉండిపోయిన ఈ గ్రామం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు దాదాపుగా దూరంగా నిలిచిపోయింది. 2021 ఏప్రిల్లో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేకంగా సందర్శించడంతో ఒక్కసారిగా పూసుకుంట గ్రామం వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రజల కష్టాలను చూసి ఆమె చలించిపోయారు. తాగునీటి సౌకర్యం కోసం ఆర్వో ప్లాంటు, ఈవీ ఆటో, వెదురు బొమ్మల తయారీ శిక్షణ కేంద్రానికి నిధులు మంజూరు చేశారు. కొన్నాళ్లు పని చేసిన ఆర్వో ప్లాంటు మూతపడగా శిక్షణా కేంద్రం అలంకారప్రాయమైంది. ఈవీ ఆటో రిపేర్లకు వచ్చి మూతపడింది. అంతకుముందు చరిత్రను పరిశీలించినా కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గ్రామాన్ని సందర్శించారు. అది కూడా సాధారణ ఎన్నికల ప్రచారం కోసమే వచ్చినట్టుగా రికార్డులు పేర్కొంటున్నాయి. కొండరెడ్లు ఇతరులతో కలవకుండా దట్టమైన అడవుల్లో వేరుగా ఉండటం, ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో అధికారులు, రాజకీయ పార్టీలు వీరిని పట్టించుకోలేదు. ఈ విషయం గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సాక్షి కథనాల ద్వారా వెలుగులోకి వచ్చింది. యాక్షన్ ప్లాన్ గడిచిన ఏడాది కాలంగా కొండరెడ్లు జీవిస్తున్న పూసుకుంట గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్ అండ్ బీ అధికారులు, ఫారెస్టు శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించే పనులు ఈ ఏడాది జనవరిలో మొదలెట్టారు. ప్రస్తుతం రూ. 5 కోట్ల వ్యయంతో మూడు వంతెనల నిర్మాణం పూర్తికాగా, రోడ్డు పనులు కంకర పరిచే దశలో ఉన్నాయి. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించి, వారి నైపుణ్యం ఆధారంగా తేనెటీగల పెంపకం, టెంట్ హౌస్, రెండు పవర్ టిల్లర్లు మంజూరు చేశారు. వ్యవసాయం చేస్తున్న 20 కుటుంబాలకు 12 బోర్లను ఉచితంగా మంజూరు చేశారు. 22 కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సుగా ఉపయోగించుకునేందుకు వీలుగా గతంలో మూలన పడిన ఈవీ ఆటోను రిపేర్ చేయించి అందుబాటులోకి తెచ్చారు. నామ్కే వాస్తేగా కాకుండా ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఐటీడీఏల పేరుతో ప్రత్యేక సంస్థలను నెలకొల్పి అనేక పథకాలను అందుబాటులో ఉంచింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పథకాలు లేకపోవడం, మరికొన్ని కాలానుగుణంగా మారకపోవడంతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న వ్యయం అంతా బినామీలకు, గుత్తేదారులవశం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. ఆదివాసీల పల్లెల్లోకి వెళ్లి వారి జీవితాలను, ఆర్థిక స్థితిగతులను దగ్గరుండి పరిశీలించి పథకాలు అమలు చేస్తే మార్పు త్వరితగతిన వస్తుందనే అభిప్రాయానికి పూసుకుంట గ్రామం వేదికగా మారింది. పీవీటీజీలుగా కొండరెడ్లు ఆదివాసీల్లో కోయ, గోండు, గొత్తికోయ తదితర జాతులు ఎన్నో ఉన్నాయి. వీరిలో బాగా వెనుకబడిన జాతుల్లో కొండరెడ్లు ఉన్నారు. ఆదివాసీల్లో ఎక్కువ శాతం అడవుల్లో జీవించేందుకు ఇష్టపడితే, ఆ అడవుల్లో కొండలపైనే జీవించడం కొండరెడ్ల ప్రత్యేకత. కొండ కిందకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాల వల్ల ప్రస్తుతం కొండరెడ్లు కిందకు వచ్చి అడవిలోనే ఊళ్లను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. కొండరెడ్లను ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ (అరుదైన ఆదిమజాతి)గా 1975లో కేంద్రం గుర్తించింది. ఆ తర్వాత కాలంలో వీరి జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో కొండరెడ్లను పీవీటీజీ (పర్టిక్యూలర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్) కేటగిరీలోకి మార్చారు. పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రగతి గిరిజనుల సామాజిక జీవనం మెరుగుపడే అవకాశం -
అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య కిట్లు
నేలకొండపల్లి: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రాల్లో ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందిస్తూనే పౌష్టికాహారం సమకూరుస్తున్నారు. ప్రసుత్తం వర్షాకాలం కావడంతో చిన్నారులు వ్యాధుల బారిన పడే అవకాశముండడం.. ఆడుతూ కింద పడితే గాయపడే ప్రమాదమున్నందున ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య కిట్లు పంపిణీ చేసింది. జిల్లాలోని 1,840 అంగన్వాడీ కేంద్రాల్లో 67,198 మంది చిన్నారులు ఉండగా.. అనుకోకుండా స్వల్ప గాయాలైనా, జ్వరం బారిన పడిన చికిత్స చేసేలా ఈ కిట్లలో మందులు అందించారు. ఇందులో హైడ్రోజన్ పెరాకై ్సడ్, దూది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, దురద నివారణ, చెవినొప్పి మందులు, జ్వరం, దగ్గు, జలుబు నివారణ టానిక్లు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి రాంగోపాల్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్ల సరఫరా పూర్తికావొచ్చిందని తెలిపారు. అయితే, అందులోని మందులను వైద్య సిబ్బంది సూచనలతో ఉపయోగించాలని టీచర్లు, ఆయాలకు స్పష్టం చేశామని వెల్లడించారు. -
కదిలించిన ‘ఎడారిలో వాన చినుకు’
ప్రారంభమైన నాటికల పోటీలుఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు గురువారం రాత్రి ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ పోటీలు ఏర్పాటుచేశారు. తొలిరోజు రెండు నాటికలను ప్రదర్శించగా ఏపీలోని కాకినాడకు చెందిన శ్రీసాయి కార్తీక్ క్రియేషన్స్ వారి ‘ఎడారిలో వాన చినుకు’ నాటిక కంట తడి పెట్టించింది. అల్లారుముద్దగా పెంచుకున్న కొడుకు పెళ్లి తర్వాత భార్య మాటలు విని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేయడం, అమెరికా నుంచి వచ్చిన ఇంకో వ్యక్తి వారిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తే కుమారుడు రూ.25 లక్షలకు బేరం పెట్టడం ఇతివృత్తంగా ప్రదర్శించిన ఈ నాటిక అందరినీ కదిలించింది. ఈ నాటికను శారద ప్రసన్న రచించగా, సీహెచ్.మహేష్ దర్శకత్వం వహించారు. ఆతర్వాత హైదరాబాద్ కళాంజలి కళాకారులు ‘కొత్తభూతం’ నాటికను ప్రదర్శించారు. శ్రీకాళహస్తి నాగరాజు రచించిన ఈ కథకు సాదినేని శ్రీజ నాటకీకరణ చేయగా, కె.రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. అందరి సహకారంతో... నాటక పోటీలను అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ బాధ్యులు అన్నాబత్తుల పుష్పరాణి, ఖమ్మం కళా పరిషత్ కార్యదర్శి వేల్పుల విజేత, అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, బయ్యన బాబు, మోటమర్రి జగన్మోహన్ రావు, నామ లక్ష్మీనారాయణ, వేముల సదానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, పోటీలకు వివిధ జిల్లాల నుంచి 180మంది కాకారులు హాజరుకాగా ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి వారికి వసతి, బోజనం, అల్పాహారం సమకూర్చడంపై కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఎడారిలో వానచినుకు నాటికకు జిల్లా ఎన్నారై ఫౌండేషన్ అధ్యక్షులు బాబు బయ్యన పారితోషికం అందించగా, ఎన్నారై ఫౌండేషన్ నుంచి రూ. లక్ష చెక్కును పేద విద్యార్థుల చదవులకు అందించారు. -
చేనేత రంగం బలోపేతానికి కృషి
ఖమ్మంగాంధీచౌక్: చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు కార్మికులకు అండగా నిలిచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. ముందు తరాలు కూడా చేనేత దుస్తులపై ఆసక్తి పెంచుకునేలా ప్రస్తుత తరం వారు చేనేత వస్త్రాలనే ధరించాలని సూచించారు. అలాగే, కార్మికులు తెలంగాణ నేతన్న పొదుపు పథకం, భద్రతా పథకం, భరోసా పథకం, రుణమాఫీ పథకాలను వినియోగించుకుంటూ వృత్తిలోఎదగాలని తెలిపారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి.. కార్మికులకు పథకాల చెక్కులు అందజేశారు. చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం..విజయలక్ష్మి, కార్యాలయ ఉద్యోగుగులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. -
పొంగి పొర్లిన వాగులు
రఘునాథపాలెం/కామేపల్లి: రఘునాథపాలెం మండలం పాపటపల్లి – వీఆర్.బంజర మధ్య గురువారం మధ్యాహ్నం బుగ్గ వాగుకు వరద పోటెత్తింది. రహదారిపైకి రెండు అడుగుల మేర నీరు చేరడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లెందు వైపు కురిసిన భారీ వర్షాలతో వాగులోకి వరద చేరినట్లు తెలుస్తుండగా, అధికారులు రెండు వైపులా ట్రాక్టర్లు ఏర్పాటుచేసి ఎవరూ వెళ్లకుండా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీఓ అశోక్కుమార్, ఆర్ఐ వహీద్, గ్రామ కార్యదర్శులు నాగరాజు, హిమబిందు, పోలీసులు పర్యవేక్షించారు. అలాగే, కామేపల్లి మండలంలోని పొన్నేకల్ బుగ్గవాగు సైతం ఉధృతంగా ప్రవహించింది. బ్రిడ్జి మీదుగా ప్రవాహం ఉండడంతో లింగాల – డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో ఎవరూ వెళ్లకుండా తహసీల్ధార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్ ఆధ్వర్యాన ట్రాక్టర్లు ఏర్పాటుచేయించారు. ●కారేపల్లి: కారేపల్లిలోని నల్లవాగు పొంగి పొర్లడంతో దీని పరిధిలోని పెద్ద చెరువు ఆయకట్టులో పొలాలు కొట్టుకుపోయాయి. పెద్ద చెరువు ఆయకట్టులో వారం రోజులుగా రైతులు వరి నాట్లు వేస్తుండగా, ప్రస్తుత వరదతో సుమారు వంద ఎకరాల్లో పొలాలు మునిగి నారు కొట్టుకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రాకపోకలకు అంతరాయం -
పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి
నేలకొండపల్లి: జిల్లాను పర్యాటక రంగంలో అగ్రస్థానాన నిలిపేలా అందరూ సహకరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి గురువారం పరిశీలించిన ఆయన నిర్మాణంలో ఉన్న విశ్రాంతి భవనం, ఇతర పనులపై ఆరా తీశాక అధికారులతో చర్చించారు. ఇక్కడ అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.2.50 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ఈ నిధులతో పర్యాటకుల విడిది కేంద్రం, మ్యూజియం, మెడిటేషన్ హాల్, బుద్ధుడి జీవిత చరిత్ర తెలిపే శిల్పాలు ఏర్పాటుచేయాలని, రెస్టారెంట్, బాలసముద్రం చెరువులో బోటింగ్కు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, డీఈ రామకృష్ణ, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీఓ సీ.హెచ్.శివ, మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, మాజీ ఎంపీటీసీ బొడ్డు బొందయ్య పాల్గొన్నారు. రోప్వే ఏర్పాటుతో కొత్త అందం ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం ఖిల్లాపైకి రోప్వే ఏర్పాటైతే కొత్త అందం సంతరించుకుంటుందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం ఖిల్లా, జాఫర్ బావిని గురువారం పరిశీలించిన ఆయన రూ. 29 కోట్లతో చేపట్టే రోప్ వే ఇతర పనులపై సమీక్షించారు. స్థల సేకరణ వారంలోగా పూర్తిచేసి పనులు మొలుపెట్టాలన్నారు. ఆర్డీఓ నర్సింహారావు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి సుమన్ చక్రవర్తి, తహసీల్దార్ సైదులు, పర్యాటక శాఖ డీఈ రామకష్ణ, నిర్మాణ సంస్థ ప్రతినిధి వెంకటేష్ పాల్గొన్నారు.బౌద్ధక్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అనుదీప్ -
అష్టైశ్వర్యాలు ప్రసాదించు తల్లీ..
నేడు వరాల దేవత వరలక్ష్మీ వ్రతంఖమ్మంగాంధీచౌక్: శ్రావణ మాసం అంటే వ్రతాలు, పూజలు, పండుగలకు ప్రత్యేకం. ఈ మాసంలో మహిళలు ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే వరలక్ష్మీ దేవి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ఆనవాయితీ. మహిళలు దీర్ఘ సుమంగళిగా ఉండాలని, యువతులు మంచి భర్త లభించాలని, పెళ్లయిన వారు మంచి సంతానం కోసం వ్రతం చేయడమే కాక దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలతో సమానమని నమ్ముతారు. వ్రతానికి సన్నద్దం.. వరాలను ఇచ్చే వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి మహిళలు సిద్ధమయ్యారు. ఈమేరకు పూలు, మామిడాకులు, పండ్లు, అమ్మవారి చిత్రపటాలు ఇతర సామగ్రి కొనుగోళ్లతో నిమగ్నమయ్యారు. దీంతో గురువారం సాయంత్రం ప్రధాన వీధుల్లో రద్దీ నెలకొనగా పూలు, పండ్లకే కాక కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. బంతి, చామంతి పూలు కిలో ధర రూ.450 దాటగా, కొబ్బరి కాయలను రూ.35కు పైగా అమ్మారు. కాగా, పలువురు మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఇందుకోసం ఆలయ కమిటీల నేతృత్వాన ఏర్పాట్లు చేశారు. ఇంకొందరు ఇళ్లలోనే వ్రతం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. -
పీఆర్ రోడ్ల పరిధిలో అటవీ భూమి సర్వే
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలంలోని భీమవరం – కాచారం, అయ్యవారిగూడెం – బుచ్చిరెడ్డిపాలెం మధ్య బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.22.5 కోట్లు విడుదలయ్యాయి. పీఆర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో రహదారుల నిర్మాణం చేపట్టగా, మధ్యలో అటవీ భూమి ఉండగా అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆయన ఆదేశాలతో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ మహేష్ గురువారం పరిశీలించారు. రెండు శాఖల ఆధ్వర్యాన సర్వే నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరెడ్డి, ఏఈ నరేష్, కాంగ్రెస్ నాయకుడు అనుమోలు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, అటవీ ప్రాంతంలో మరింత పచ్చదనం పెంచేలా కృషి చేస్తున్నట్లు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం జమలాపురంలోని అటవీ ప్రాంతంలో 500 సీడ్ బాల్స్ విసరగా ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవకుడు ఆదిత్య శ్రీనివాస్ పాల్గొన్నారు.ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిన జిల్లా నాయకులుఖమ్మంమయూరిసెంటర్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను జిల్లా కాంగ్రెస్ నేతలు గురువారం ఢిల్లీలో కలిశారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల కార్పొరేషన్ల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఖర్గేను కలిసిన వారిలో ఉన్నారు.వీ.వీ.పాలెం పీఏసీఎస్లో సీఈఓలు, లెక్చరర్లురఘునాథపాలెం: జిల్లాలోని వివిధ పీఏసీఎస్ల సీఈఓలు, టెస్కాబ్ లెక్చరర్లు ఐదు రోజుల శిక్షణలో భాగంగా గురువారం మండలంలోని వీ.వీ.పాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ ఉపాధ్యక్షుడు రావెళ్ల శ్రీనివాసరావు, సీఈఓ తిరుపతిరావు సంఘం ద్వారా అమలవుతున్న కార్యకలాపాలు, అభివృద్ధిని వివరించారు. సాంకేతికతను వినియోగించుకంఉటూ సంఘం అభివృద్ధి వేగంగా జరిగేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 35 పీఏసీ ఎస్ల సీఈఓలు, టెస్కాబ్ లెక్చరర్లు విజయకుమార్రెడ్డి, సంపత్కుమార్ పాల్గొన్నారు.పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యంఖమ్మంవ్యవసాయం: సైక్లింగ్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యవంతమైన జీవనం సొంతమవుతుందని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ) సిద్దార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు. ఖమ్మం సైక్లింగ్ క్లబ్ లోగోను గురువారం ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించడంతో పాటు మొక్క నాటాక మాట్లాడారు. సైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చనే అంశాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ విషయమై సైక్లింగ్ క్లబ్ కృషి చేయాలని డీఎఫ్ఓ తెలిపారు.ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలుచింతకాని: జిలాల్లో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి, ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించాలన ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. చింతకాని మండలం నాగులవంచ, లచ్చగూడెం, నాగిలిగొండ, పాతర్లపాడుల్లో సొసైటీలు, ఎరువుల దుకాణా లను గురువారం తనిఖీ చేశాక ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి మండలానికి రావాల్సిన ఎరువుల కోటా పంపిస్తున్నందున రైతులను ఇబ్బంది పెట్టకుండా విక్రయిస్తూ రికార్డులు పక్కాగా నిర్వహించాలని సూచించారు. సరిప డా నిల్వలు ఉన్నందున రైతులు కూడా ఆందోళనకు గురికావొద్దని డీఏఓ సూచించారు. ఏఓ మానస, నాగులవంచ సొసైటీ సీఈఓ యాలముడి శ్రీనివాసరావు, ఏఈఓలు పాల్గొన్నారు. -
కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ
మధిర: మధిరలో రూ.24 కోట్ల నిధులతో నిర్మించే కోర్టు భవన సముదాయానికి గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ భూమి పూజ చేశారు. మధిర సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల న్యాయమూర్తులు ఎన్.ప్రశాంతి, వేముల దీప్తితో కలిసి శంకుస్థాపన చేశాక ఆయన నిర్వహణలో ఉన్న కోర్టు రికార్డు రూంను పరిశీలించారు. అలాగే, నూతన భవన నిర్మాణంపై ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. తొలుత జిల్లా జడ్జికి న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు స్వాగతం పలికి సత్కరించారు. మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు, న్యాయవాదులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, కట్టా పూర్ణచందర్రావు, దేవరపల్లి సుబ్రహ్మణ్యం, గంధం శ్రీనివాసరావు, జింకల రమేష్, సుంకు మోహన్దాస్, వెంకట్రావు, కోట జ్ఞానేష్, సంధ్య, మాధురి, సునీత, సూపరింటెండెంట్లు నాగమణి, వెంకన్న, మల్లేశ్వరరావు, మధిర టౌన్ సీఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి మార్కెట్కు సెలవులు ఖమ్మంవ్యవసాయం: పండుగలు, వారాంతం నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. ఈనెల 8న శుక్రవారం వరలక్ష్మి వ్రతం, శనివారం రాఖీ పౌర్ణమి, వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు మొదలవుతాయని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కల్లూరురూరల్: ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడమే కాక రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోందని జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. కల్లూరు మండలం దారుగ బంజరులో ఆయిల్పామ్ తోటలు, మిర్చి నర్సరీలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో మొక్కల పెంపకం, రికార్డుల నిర్వహణపై సూచనలు చేసిన మధుసూదన్ మాట్లాడారు. జిల్లాలో 34వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతుండగా, మరో 14,500 ఎకరాల్లో తోటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఎకరాకు సాగు ఖర్చుల కింద నాలుగేళ్లలో రూ.50వేలు, రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ఇస్తున్నండగా.. అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ఇదే సమయాన సంప్రదాయ పంటలతో నష్టాలు వస్తున్నందున రైతులు ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలని సూచించారు. 11న యూత్ ఫెస్ట్, పరుగు పందెం ఖమ్మంవైద్యవిభాగం: రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యాన హెచ్ఐవీ, ఎయిడ్స్ యూత్ ఫెస్ట్లో భాగంగా ఈనెల 11న పరుగు పందెం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అదనపు డీఎంహెచ్ఓ పి.వెంకటరమణ వెల్లడించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 11వ తేదీన ఉదయం 7–30 గంటలకు మొదలయ్యే పరుగు పందెంలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు కళాశాలకు ఇద్దరు చొప్పున పాల్గొనాలని సూచించారు. పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాలకు 79899 99788(ఎస్.రామకృష్ణ), 91771 03193(వీరయ్య) నంబర్లలో సంప్రదించాలని వెంకటరమణ సూచించారు. సెలవులో డీఈఓ ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారి(ఎఫ్ఏసీ) కె.నాగపద్మజ మూడు రోజులు సెలవులో వెళ్లారు. ఆమె స్థానంలో డీఈఓ కార్యాలయ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీప్రసాద్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తిరిగి నాగపద్మజ సోమవారం విధుల్లోకి చేరతారు. ఇదిలా ఉండగా సీఎంఓగా ప్రవీణ్కుమార్, ఏఎంఓగా రాజశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. -
15నాటికి దరఖాస్తుల పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: భూభారతి చట్టానికి సంబంధించి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిష్కారం ఈనెల 15 నాటికి పూర్తయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. దరఖాస్తుల స్థితిగతులు, పరిశీలన, పరిష్కారంపై ఆరా తీసిన ఆయన 15 నాటికి పరిష్కరించేలా సూచనలు చేశారు. మొత్తం 75 వేల దరఖాస్తులు రాగా, సాదా బైనామావి మినహాయించి మిగతా దరఖాస్తులు పరిశీలిస్తూ తిరస్కరిస్తే కారణాలు తెలపాలని చెప్పారు. ప్రతీ మండలంలో పది శాతం దరఖాస్తులను తనిఖీ చేస్తామని తెలిపారు. కాగా, భూభారతి దరఖాస్తులు పరిష్కారమయ్యే వరకు రెవెన్యూ ఉద్యోగులు సెలవు తీసుకోవద్దని సూచించారు. తొలుత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపికపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఆర్డీఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ●జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా మౌలిక వసతుల కల్పనపై అధికారులు శ్రద్ధ వహించాలని కేంద్ర జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ సూచించారు. తెలంగాణ, ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కలెక్టర్లతో గురువారం వీసీ ద్వారా మాట్లాడిన ఆయన జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ పథకాల అమలు, ఎప్పటికప్పుడు పనులను ఆన్లైన్లో నమోదు చేయడంపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, అంగన్వాడీల్లో తాగునీటికి పనులపై ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. మిషన్ భగీరథ ఎస్ఈ శేఖర్రెడ్డి, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
పదోన్నతులకు బ్రేక్..
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2హెచ్ఎంలుగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ఇటీవల షెడ్యుల్ విడుదల చేసింది. సీనియారిటీ, ఖాళీల జాబితా విడుదల చేయడమే కాక సర్టిఫికెట్ల పరిశీలన మొదలవడంతో ఎస్ఏల్లో ఆనందం వ్యక్తమైంది. జిల్లాలో గ్రేడ్–2 హెచ్ఎంలుగా 260మంది ఎస్ఏలకు పదోన్నతులు లభించే అవకాశముందని భావించారు. ఈక్రమాన ఆప్షన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. కొందరు తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 11వ తేదీన వాదనలు విన్నాక హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ప్రక్రియ ముందుకు సాగనుందని సమాచారం. అర్హుల్లో ఆందోళన గ్రేడ్–2 హెచ్ఎంలుగా పదోన్నతి కోసం ఎస్ఏలు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో షెడ్యూల్ విడుదల కాగానే ఆనందించినా.. ఇప్పుడు బ్రేక్ పడడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనెల 11వ తేదీన కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న అంశంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, గురువారం కూడా పదోన్నతుల విషయమై పలువురు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.ఉపాధ్యాయుల్లో ఆందోళన -
చర్చించండి.. పరిష్కరించండి
పెద్దాస్పత్రిని వేధిస్తున్న సౌకర్యాల కొరత ● వేతనాలు అందక తరచుగా కార్మికుల సమ్మె ● ‘ప్రైవేట్’కు వెళ్తేనే ఎంఆర్ఐ సేవలు ● నేడు కలెక్టర్ అధ్యక్షతన ‘హెచ్డీఎస్’ సమావేశంఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి కొన్నేళ్లుగా తాకిడి పెరిగింది. నిత్యం 1,500 నుంచి 2వేల వేల మంది వైద్యసేవలకు వస్తుండగా వారి సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది సుమారు 5వేల మంది రాకపోకలు సాగింటారు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా నామమాత్రపు సౌకర్యాలు, పరికరాలతో ఆశించిన స్థాయిలో వైద్యం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెద్దాస్పత్రికి అనుసంధానంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటంతో వైద్య విధాన పరిషత్ పరిధి నుండి 2023 నవంబర్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలోకి వెళ్లింది. దీంతో నిపుణులైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించినా రోగులకు నామమాత్రపు సేవలే అందుతుండడం గమనార్హం. కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన శుక్రవారం(నేడు) పెద్దాస్పత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ(హెచ్డీఎస్) ముందస్తు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆస్పత్రి సమస్యలు, వైద్యసేవల్లో లోటుపాట్లపై చర్చించి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఎంఆర్ఐ సేవలకు ఎదురుచూపు పెద్దాస్పత్రిలో ఏళ్లుగా ఎంఆర్ఐ సేవలు అందని ద్రాక్షలానే మారాయి. నిత్యం 50 మందికి పైగా ఇన్పేషంట్లు చేరుతుండగా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తాకిడి ఉంటోంది. ఎక్స్రే, సిటీ స్కాన్ అందుబాటులో ఉన్నా ఎంఆర్ఐ సేవలు ప్రతిపాదనలకే పరిమితం కావడంతో అవసరమైన వారు బయటి సెంటర్లలో రూ.3వేల నుండి రూ. 10వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. తీరని కార్మికుల వేతన సమస్య ఆస్పత్రి కార్మికులకు నెలనెలా వేతనాలు అందడం లేదు. ఆస్పత్రి వీవీపీ పరిధిలో ఉన్నప్పుడు 575పడకలకు అనమతి ఉంది. ఆ లెక్క ప్రకారం పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికుల వేతనాల కోసం ఏజెన్సీకి ప్రభుత్వం రూ. 50 లక్షలు చెల్లించేది. కానీ డీఎంఈ పరిధిలోకి వెళ్లాక కాలేజీలో 100 సీట్లకు అనుగుణంగా 430 బెడ్లకే అనుమతి ఇచ్చి ఏజెన్సీకి రూ.35 లక్షలు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో కాంట్రాక్టర్ కార్మికులకు నెలనెలా జీతాలు ఇవ్వలేకపోతుండడంతో తరచూగా సమ్మెకు దిగడం.. ఒక నెల వేతనం చెల్లించి విధుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. అధ్వానంగా అంతర్గత రోడ్లు జిల్లా జనరల్ ఆస్పత్రి మెడికల్ కళాశాల పరిధిలోకి వెళ్లి రెండేళ్లు కావొస్తున్నా రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా రోడ్లు గుంతలమయమై రోగులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక చిన్నపాటి వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి మరింత సమస్య ఎదురవుతోంది. కురుస్తున్న పాత భవనం అరవై ఏళ్ల క్రితం నిర్మించిన ఆస్పత్రి పాతభవనం కొద్దిపాటి వర్షానికి కురుస్తోంది. పాత భవనంలో మినిస్టీరియల్ విభాగాలు, సూపరింటెండెంట్ కార్యాలయం, ల్యాబ్లు, ఎయిడ్స్ విభాగాలు ఉన్నాయి. భవనం పాతది కావటంతో స్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండడంతో వర్షం మొదలుకాగానే నీరు కారుతోంది. పాత భవనం స్థానంలో నూతన భవన నిర్మాణం ప్రతిపాదనలు ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. మౌలిక సదుపాయాలు కరువు నిత్యం వేలాది మంది వచ్చివెళ్లే ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. కనీస స్థాయిలో మరుగుదొడ్లు లేకపోగా ఉన్నవి అధ్వానంగా తయారయ్యాయి. తరచూ పైప్లైన్లు లీకేజీతోమురుగు నీరు బయటకు వస్తోంది. నీరు నిల్వ చేయటానికి పాత సంపులు సరిపోక నీటి కొరత కూడా వేధిస్తోంది. అలాగే అత్యవసర విభాగాల్లో ఏసీలు సరిపడా లేకపోగా.. జనరల్ సర్జరీ, ఆర్ధో పెడిక్ సర్జరీ విభాగాల్లో కావాల్సిన పరికరాలు, ఆల్ట్రా సౌండ్ మిషన్, పిల్లలకు కావాల్సిన టూడీ ఎకో, డాఫ్లర్ మిషన్ పరికరాలను సమకూర్చాల్సి ఉంది.లోటుపాట్లు, కావాల్సిన సౌకర్యాలపై చర్చ కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం హెచ్డీఎస్ ముందస్తు సమావేశం జరగనుంది. ఆస్పత్రిలో అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలపై సమావేశంలో చర్చించేలా అజెండా రూపొందించాం. కలెక్టర్ చైర్మన్గా, డీఎంఈ వైస్ చైర్మన్గానే కాక 17మందితో కమిటీ ఉంటుంది. ఈ సమావేశంలో సమస్యలపై చర్చించి, ప్రతిపాదనలను ఆమోదించే అవకాశముంది. – ఎం.నరేందర్, మెడికల్ సూపరింటెండెంట్ -
కీలకమైన పనుల్లో జాప్యం
● ‘మంచుకొండ లిఫ్ట్’ వద్ద మొదలుకాని సబ్స్టేషన్ నిర్మాణం ● ఇది పూర్తయితేనే నడవనున్న మోటార్లురఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని సాగు భూములకు సాగర్ జలాలు చేరేలా రూ.66 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మంచుకొండ ఎత్తిపోతల పథకం కీలక పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పైపులైన్ ఏర్పాటుచేయడంతో పాటు మోటార్లు అమర్చి ట్రయల్ రన్ చేపట్టగా విజయవంతమైంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ నడుస్తుండడంతో రైతులు పైప్లైన్ పనులకు అభ్యంతరం చెబుతున్నా అధికారులు నచ్చచెబుతూ ముందుకు సాగుతున్నారు. కానీ పథకానికి కీలకమైన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం మొదలుకాకపోవడం గమనార్హం. సబ్స్టేషన్ నిర్మాణానికి జలవనరుల శాఖ రూ.2.53 కోట్లు కేటాయించినా నిధులు విద్యుత్ శాఖకు చేరితేనే పనులు ప్రారంభం కానున్నాయి. తాత్కాలికంగా విద్యుత్ లైన్లు వేస్తే మోటార్లు నడిచే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. రెండు మోటార్లు.. 36 చెరువులు ఎత్తిపోతల పథకం ద్వారా తొలుత 27 చెరువులకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వపై నిర్మిస్తున్న ఈ పథకం ద్వారా మంచుకొండ వరకు 9 కి.మీ. ప్రధాన పైపులైన్.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఐదు లింక్ చానళ్లు పైపులైన్లతో చెరువులకు నీరు సరఫరా చేయాలనేది పథకం ప్రధాన ఉద్దేశం. ఈమేరకు పైప్లైన్ల పనులు తుది దశకు చేరగా.. పాపటపల్లి, బూడిదంపాడు, ఈర్లపూడి, గడ్డికుంట తండా, రఘునాథపాలెం చెరువులకు నీరు చేరనుంది. ఆపై ఈర్లపూడి పైపులైన్ను పొడిగించి పంగిడి వరకు మరో తొమ్మిది చెరువులకు నీరు చేర్చే పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ వ్యవసాయ సీజన్లోనే చెరువులకు నీరు సరఫరా చేస్తామని ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పనుల్లో జాప్యంతో ఇటీవల అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎత్తిపోతలు మొదలు పెట్టాలంటే మోటార్లు నడవడానికి కీలకమైన సబ్స్టేషన్ పనులు ప్రారంభం కాకపోవడంపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఇకనైనా అవసరమైన నిధులను విద్యుత్ శాఖకు కేటాయించి యుద్ధప్రాతిపదికన సబ్స్టేషన్ను నిర్మిస్తేనే రెండు మోటర్ల ద్వారా తొలుత ప్రతిపాదించిన 27 చెరువులే కాక మండలంలోని మొత్తం 36 చెరువులకు సాగర్ జలాలు చేరే అవకాశం ఉంది. -
ఆ దాడులు పాశవికం..
ఖమ్మంమయూరిసెంటర్: గాజాపై ఇజ్రాయిల్ పాశవికంగా చేస్తున్న దాడులను అన్నివర్గాల ప్రజలు నిరసించాలని.. ఇదే సమయాన శాంతి నెలకొల్పేందుకు దేశాధినేతలు కృషి చేయాలంటూ ఖమ్మంలో గురువారం పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యాన భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలు, సంఘాల నాయకులు, యువజనులు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగులు పాల్గొన్న ఈ ప్రదర్శన పెవిలియన్ మైదానం నుండి మయూరిసెంటర్, వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్ వరకు కొనసాగింది. ఈసందర్భంగా పాలస్తీనా ప్రజలకు ఆహారం, నీరు అందకుండా వేలాదిమంది ఆకలి చావులకు కారణమవుతున్న ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అక్కడ ప్రజల దీనస్థితిని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఐక్యమత్యానికి నాంది.. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను అంతా ఖండించాలని సీపీఐ జాతీయ నాయకుడు అజీజ్ పాషా, మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మధు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్ తదితరులు కోరారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీ ఐక్యమత్యానికి నాందిగా నిలుస్తుందని తెలిపారు. మానవత్వాన్ని మరిచిన ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేస్తుండగా.. ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయమన్నారు. ర్యాలీలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు దండి సురేష్, వై.విక్రమ్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, బీ.జీ.క్లెమెంట్, మొక్క శేఖర్గౌడ్, మహ్మద్ హుస్సేన్, జైనుల్ పాషా, మహమ్మద్ ఇలియాస్, రవిమారుత్, కాకి భాస్కర్, మువ్వా శ్రీనివాస్, ఐ.వీ.రమణారావు, దేవిరెడ్డి విజయ్, బండారు రమేష్, వి.మనోహర్ రాజు, ఎంఎఫ్.గోపీనాథ్, రవీంద్రనాథ్, తిరుమలరావు, శేషగిరి, విప్లవ కుమార్, సుగుణరావు, జక్కంపూడి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఇటికాల రామకృష్ణ, వి.వెంకటేష్, టి.ప్రవీణ్, మస్తాన్, సురేష్, బషీర్, నానబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా భారీ ప్రదర్శన పెద్దసంఖ్యలో పాల్గొన్న నాయకులు, విద్యార్థులు -
పశువుల పరిహారం స్వాహాపై విచారణ
తిరుమలాయపాలెం: గత ఏడాది వచ్చిన భారీ వరదతో మండలంలోని రాకాసితండాకు చెందిన పలువురు రైతులకు సంబంధించి పశువులు మృతి చెందాయి. వీటికి సంబంధించి పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలపై అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు. ఓ రైతు పేరిట మంజూరైన నగదు వెటర్నరీ డాక్టర్ భర్త ఖాతాలో జమ కావడం, వీటిని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వ్యవహారం బయటపడింది. ఈ అంశంపై ‘సాక్షి’లో ఇటీవల ‘పశువుల పేరిట నిధుల స్వాహా’ కథనం రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ నేతృత్వంలో డీటీ శర్మ, పశుసంవర్థక శాఖ ఏడీ బోడేపూడి శ్రీనివాసరావు, జిల్లా వెటర్నరీ కార్యాలయ మేనేజర్ స్వర్ణలత గురువారం రాకాసితండాలో విచారణ చేపట్టారు. గత ఏడాది భారీ వరదతో 75 మంది రైతుల పశువులు, మేకలు, కోళ్లు చనిపోయినట్లు నిర్ధారించి రూ.55 లక్షల పరిహారం విడుదల చేశారు. అయితే, మండల వెటర్నరీ అధికారి అనూష ఇంటింటా పరిశీలిస్తూ నష్టాన్ని అంచనా వేయకుండా ఆమె భర్త సాయికుమార్కు పని అప్పగించడంతో ఆయన అక్రమాలకు తెరలేపినట్లు సమాచారం. ఈక్రమాన అధికారుల విచారణలో స్థానికులు ఎవరి జీవాలు ఎన్ని మృతి చెందాయో చెప్పలేకపోగా, గ్రామంలో లేని వారికి సైతం పరిహారం మంజూరైనట్లు బయటపడింది. దీంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు, ఆధార్కార్డుల పరిశీలనకు నిర్ణయించారు. ఈక్రమంలోనే వెటర్నరీ డాక్టర్ అనూషను రికార్డు సమర్పించాలని సూచించడమే కాక లబ్ధిదారుల ఎంపికలో ఆమె భర్త ప్రమేయంపైనా డీఆర్ఓ ప్రశ్నించారు.వెటర్నరీ డాక్టర్ భర్త కనుసన్నల్లోనే అక్రమాలు? -
ఏటీసీ కోర్సులతో యువతకు ఉపాధి
ఖమ్మం సహకారనగర్: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశపెట్టిన కోర్సులతో యువతకు ఉపాధి భరోసా లభిస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ మేరకు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం టేకులపల్లిలోని ఐటీఐని ఏటీసీగా అప్గ్రేడ్ చేసిన నేపథ్యాన కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వివిధ కోర్సుల బోధనకు సమకూర్చిన యంత్రాల వివరాలు తెలుసుకున్న ఆయన పదో తరగతి అర్హత ఉన్న ఎక్కువ మంది చేరేలా అవగాహన కల్పించాలని అధ్యాపకులకు సూచించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ●ఖమ్మం స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 45 పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకున్నారు. ఇందులో అథ్లెటిక్స్ అకాడమీతో పాటు ఇతర క్రీడాకారులు ఉండగా కలెక్టర్ అనుదీప్ బుధవారం అభినందించి, అకాడమీ కోచ్ ఎం.డీ.గౌస్ను సన్మానించారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు. ●ఖమ్మంవ్యవసాయం: మూగజీవాల ఆరోగ్యంపై పశు వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. పశువులకు సకాలంలో వైద్యం అందిస్తూ, మందుల కొరత రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఖమ్మం రాపర్తినగర్లోని జిల్లా పశు వైద్యశాలను తనిఖీ చేసిన కలెక్టర్ చికిత్సకు ఉన్న సౌకర్యాలు, మందుల లభ్యతపై ఆరాతీయడమే కాక అభివృద్ది పనులను పరిశీలించారు. జిల్లా పశువైద్యశాల సహాయ సంచాలకులు వి.శ్రీనివాసరావు, డాక్టర్ కె.కిషోర్ ఉన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
ఎవరికీ పట్టని సంక్షేమం
● గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో వార్డెన్ల ఇష్టారాజ్యం ● అధికారుల తనిఖీలు కూడా నామమాత్రమే.. ● ప్రత్యేక అధికారుల పరిశీలనలో వెలుగుచూసిన లోపాలు ● కల్లూరు ఘటనలో వార్డెన్ సస్పెన్షన్ఖమ్మంమయూరిసెటర్: జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడి సరైన భోజనం, సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారని తల్లిదండ్రులు ఆరో పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా.. ఇటీవల కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం గమనార్హం. అయితే, కల్లూరు ఘటనకు వార్డెన్ విజయనిర్మల పర్యవేక్షణ లోపమే కారణమని గుర్తించిన ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. అలాగే, ఇన్చార్జ్ వార్డెన్గా హెచ్ఎం శ్రీనివాసరావును నియమించగా, ఏటీడీఓ భా రతిదేవి బుధవారం పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం చికెన్.. అదే సాయంత్రం? కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం విద్యార్థినులకు చికెన్ వండి పెట్టినట్లు తెలిసింది. అయితే ఇదే చికెన్ను కొందరు విద్యార్థులు సాయంత్రం కూడా తిన్నారని సమాచారం. వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఏ పూట వండింది ఆ పూటే వడ్డించాల్సి ఉండగా.. మధ్యాహ్నం వంటే సాయంత్రం కూడా వడ్డించడం, శుచి, శుభ్రత లేని కారణంగా ఫుడ్ పాయిజనింగ్ దారి తీసినట్లు తెలిసింది. అంతేకాక విద్యార్థినులు భోజనం చేసే సమయాన పర్యవేక్షించాల్సిన వార్డెన్ ఆ రోజు వసతిగృహంలో లేకుండా ఖమ్మంలో ఓ అధికారి రిటైర్మెంట్ వేడుకలకు హాజరైనట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా వార్డెన్లు ఆదివారం ఆ ఫంక్షన్లోనే గడిపారని తెలిసింది. ఫలితంగా విద్యార్థుల ఆహారం విషయంలో పర్యవేక్షణ లేక ఇబ్బంది పడినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోనే వార్డెన్లు ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల వార్డెన్లు చాలా మంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడంలో విఫలమవుతుండగా, నాణ్యత లేని, అపరిశుభ్రమైన ఆహారం వడ్డించడం, తాగునీటి సరఫరా సరిగా లేకపోవడం, పరిశుభ్రత లేని మరుగుదొడ్లు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో విద్యార్థులు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల గిరిజన శాఖలో అవసరం ఉన్నా, లేకున్నా ప్రొటోకాల్ పేరు చెప్పి వసతిగృహం విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ, మండల కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సిన వార్డెన్లు జిల్లా కేంద్రంలోనే కాలం వెళ్లదీస్తున్నారని సమాచారం. తూతూ మంత్రంగా తనిఖీలు విద్యార్థుల సంక్షేమం, ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు కూడా బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలున్నాయి. కేవలం మొక్కుబడిగా తనిఖీలుచేస్తూ, లోపాలు సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఇటీవల కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంఈఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ అధికా రులు చేపట్టిన తనిఖీల్లో అనేక లోపాలు బయటపడడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉండడం, కూరగాయలు, సరుకుల్లో నాణ్యత లోపించడం తదితర లోపాలను గుర్తించినట్లు సమాచారం. అయితే, వార్డెన్లు మాత్రం తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యేక అధికారుల పరిశీలనపై విమర్శలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, ప్రత్యేక అధికారులు గుర్తించిన లోపాలపై జిల్లా అధికారులు వార్డెన్లను వివరణ కోరినట్లు తెలిసింది. -
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
●ఒకరు మృతి.. మరో ఐదుగురికి గాయాలు జూలూరుపాడు: కుటుంబీకులంతా దైవదర్శనం చేసుకున్నా రు. బంధువులను కలిసి, మరో బంధువు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. కానీ, వారి ప్రయాణం గమ్యం చేరు కోలేదు. వీరు వెళ్తున్న మారుతి వ్యాన్ను లారీఢీకొట్టడంతో ఒకరుమృతిచెందగా మరో ఐదుగురికిగాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కొణి జర్ల మండలం గద్దలగూడెం గ్రామానికి చెందిన కె.చెన్నారావు (33) ఖమ్మంటౌన్–3 విద్యుత్ సబ్స్టేషన్లో సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు నుంచి బుధవారం తొమ్మిది మంది వ్యాన్లో ఖమ్మం వెళ్లగా చెన్నారావు డ్రైవింగ్ చేశాడు. ఖమ్మంలో దైవదర్శనం అనంతరం బంధువులను కలిసి చుంచుపల్లి బయలుదేరారు. హౌసింగ్ బోర్డులో బుధవారం సాయంత్రం చెన్నారావు మేనకోడలు నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం వద్ద వీరి వ్యాన్ ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో చెన్నా రావుకు తీవ్రగాయాలు కాగా సీపీఆర్ చేయడంతో పాటు తీవ్రంగా గాయపడిన ఆయన భార్య భార్గవి, తల్లిసావిత్రి, మరో ముగ్గురు క్షతగాత్రులను కొత్తగూ డెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చెన్నారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది. ●ఖమ్మంవ్యవసాయం: విద్యుత్శాఖ ఉద్యోగి ఆర్.చెన్నారావు(34) మృతిపై శాఖ ఉద్యోగులు సంతాపం తెలిపారు. జూలూరుపాడు సమీపాన జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందాడనే సమాచారంతో తెలి యగా అధికారులు, ఉద్యోగులు నివాళులర్పించారు. ఇద్దరి మృతదేహాలకు అంత్యక్రియలుఖమ్మంఅర్బన్: వివిధ ప్రాంతాల్లో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలకు అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యాన అంత్యక్రియలు నిర్వహించారు. వైరాకు చెందిన కార్తీక్(40) ఇటీవల మృతిచెందగా ఆయన తల్లి వృద్ధురాలు కావడంతో పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో అంబులెన్స్లో మృతదేహాన్ని ఖమ్మం బల్లేపల్లిలోని వైకుంఠధామానికి తీసుకొచ్చిఅంత్యక్రియలు పూర్తి చేశారు.అలాగే, మామిళ్లగూడెం వద్ద రైలు కిందపడి మృతి చెందిన గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహానికి కూడాపోలీసుల సూచనలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యఖమ్మంరూరల్: మండలంలోని రెడ్డిపల్లికి చెందిన అనుముల లచ్చిరెడ్డి(49) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పుట్టుకతో మరుగుజ్జుగా ఉన్న లచ్చిరెడ్డి వివాహం జరిగాక కొన్నాళ్లకు భార్య వెళ్లిపోయింది. అప్పటి నుండి అదే గ్రామంలోని సోదరి ఇంట్లో ఉంటూ పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయాన పురుగుల మందు తాగగా, కాసేపటికి వచ్చిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జీవితంపై విరక్తి, ఒంటరితనం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు తెలిపారు. కడుపునొప్పి తాళలేక.. రఘునాథపాలెం: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని కొర్లబోడు తండాకు చెందిన గుగులోతు జ్యోతి(38) కొద్దిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఈనెల 1న ఎలుకల మందు తీసుకుంది. ఆమెకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్కి తరలించగా మృతి చెందింది. ఆమె సోదరుడు సతీష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. -
విద్యాశాఖ ఏఎంఓగా రాజశేఖర్
ఖమ్మం సహకారనగర్: విద్యాశాఖలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్(ఏఎంఓ)గా వాసిరెడ్డి రాజశేఖర్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై డీఈఓ కె.నాగపద్మజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చింతకాని మండలం తుమ్మలపల్లి హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశేఖర్ ఏఎంఓగా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. హార్వెస్ట్, త్రివేణి జట్ల విజయంఖమ్మం స్పోర్ట్: రాజీవ్గాంధీ మెమోరియాల్ రోలింగ్ క్రికెట్ ట్రోఫీ పోటీలు బుధవారం రెండో రోజుకు చేరాయి. అండర్–12 బాలుర విభాగంలో ఖమ్మంకు చెందిన హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, త్రివేణి పాఠశాలల జట్లు ముందంజలో నిలిచా యి. తొలి మ్యాచ్లో త్రివేణి – శ్రీ చైతన్య టెక్నో స్కూల్ జట్లు పోటీ పడగా త్రివేణి, రెండో మ్యాచ్ హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ – షైన్ ఇండియా పాఠశాలల మధ్య జరగగా హార్వెస్ట్ జట్టు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లుగా రిత్విక్, అభిషేక్ ఎంపిక కాగా, తొలుత మ్యాచ్లను తుమ్మల యుగంధర్, మార్కెట్ చైర్మన్ యార్లగడ్డ హన్మంతరావు ప్రారంభించారు. టోర్నీ నిర్వాహకుడు ఎం.డీ.మతిన్తో పాటు కొత్త సీతారాములు, బాణాల లక్ష్మణ్, మిక్కిలినేని నరేందర్, ఫరీద్ ఖాద్రీ, ఆశ్రిఫ్ పాల్గొన్నారు. వెబ్సైట్లో ఎంపిక జాబితాఖమ్మంవైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య మిషన్ విభాగంలో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సపోర్ట్ ఇంజనీర్లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించి ఎంపిక జాబితాను https:// khammam. telangana. gov. in/ వెబ్సైట్లో పొందుపర్చినట్లు డీఎంహెచ్ఓ బి.కళా వతిబాయి తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 7న ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5గంటల్లోగా తగిన ధ్రువపత్రాలతో డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ‘విద్యానిధి’ దరఖాస్తు గడువు పొడిగింపు ఖమ్మంమయూరిసెంటర్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తుకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు కె.సత్యనారాయణ తెలిపారు. ఈ పథకం ద్వారా పది దేశాల్లో చదివేందుకు అవకాశం ఉండగా, అర్హత కలిగిన వారు రూ.20లక్షల ఆర్థిక సాయం కోసం ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాక ప్రతులను తమ కార్యాలయంలో అందజేయాలని డీడీ తెలిపారు. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలుఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు గురువారం ఖమ్మంలో ప్రారంభం కానున్నాయి. నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ పోటీలకు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం సిద్ధమైంది. ఉభయ రాష్ట్రాల్లో పేరున్న రంగస్థల నటులు 150మందికి పైగా పోటీల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. గురువారం నుంచి ఆదివారం వరకు పోటీలు జరగనుండగా, సమాజ చైతన్యం, మూఢ నమ్మకాల నిర్మూలన తదితర అంశాలపై నాటిక ప్రదర్శనలు ఉంటాయని నెలనెలా వెన్నెల బృందం బాధ్యులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్య కుమార్, మోటమర్రి జగన్మోహన్రావు వేముల సదానంద్ తెలిపారు. చదువు మానేసిన వారికి వరంలా ఓపెన్ స్కూల్కారేపల్లి: వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసిన వారే కాక స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్స్కూల్ ద్వారా చదువు కొనసాగించాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు సూచించారు. కారేపల్లి ఐకే పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లుతో కలిసి ఐకేపీ సీసీలు, గ్రామ దీపికలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ మాట్లాడుతూ చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న సభ్యులు పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశముందని తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు అవకాశమున్నందున సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఐకేపీ సీసీలు అనిల్కుమార్, పుష్పకుమారి, సోందు, గౌసియా బేగం, విజయలక్ష్మి, అకౌంటెంట్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
బొగ్గు లోడింగ్లో ఇష్టారాజ్యం
● టెండర్ పొడిగిస్తూ ఆర్సీహెచ్పీకి తరలింపు ● కోల్ఏజెంట్ల తీరుతో లారీల యజమానులకు నష్టం ● ఆందోళన చేసినప్పుడే లోడింగ్ పెంపు సత్తుపల్లి: సింగరేణి వ్యాప్తంగా సత్తుపల్లి మండలంలోని ఓసీల్లో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అయితే, దీంతో ఇక్కడి బొగ్గు కోసం వివిధ ప్రాంతాల పరిశ్రమల నుంచి ఆర్డర్లు వస్తుండగా.. రవాణాలో స్థానిక లారీల యజమానులకు మాత్రం చుక్కెదురవుతోంది. ఇదే సమయాన కొత్తగూడెంలోని రుద్రంపూర్ కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(ఆర్సీహెచ్పీ)కు మాత్రం నిరంతరాయంగా రవాణా జరుగుతోంది. ఈక్రమాన తమకు అన్యాయం జరుగుతోందని లారీల యజమానులు మూడురోజులు అడ్డుకోవడంతో అధికార యంత్రాంగం మొత్తం కదిలొచ్చింది. కానీ న్యాయం చేయకపోగా ఆందోళనలు విరమించకపోతే ఉపేక్షించబోమని, కేసులు పెట్టేందుకై నా వెనుకాడమని హెచ్చరిస్తుండడం గమనార్హం. అయితే, తమను అధికారులు బెదిరించడం వెనుక బలమైన శక్తులు ఉన్నాయని లారీల యజమానులు వాపోతున్నారు. తాత్కాలిక టెండర్లతో... సత్తుపల్లి నుంచి కొత్తగూడెంలోని ఆర్సీహెచ్పీ టిప్పర్లలో బొగ్గు రవాణా చేస్తుండగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించారు. దీంతో రవాణాపై ఆంక్షలు విధించినా... సింగరేణి యాజమాన్యం తాత్కాలిక టెండర్ ఖరారు చేసి పొడిగిస్తోంది. రోజుకు 60 – 70 టిప్పర్లతో నాలుగు నుంచి ఐదు ట్రిప్పుల బొగ్గు రవాణా చేస్తుండగా.. స్థానిక లారీలకు లోడింగ్ దక్కక యజమానులు ఫైనాన్స్ కిస్తీ కట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 1,500 టన్నుల లోడింగ్ ఇటీవల సత్తుపల్లి లారీల యజమానులు చేపట్టిన ఆందోళనతో సింగరేణి సీఎండీ బలరాంనాయక్ స్పందించారు. ఇందులో భాగంగా స్థానిక లారీలకు రోజుకు 1,500 టన్నుల బొగ్గు లోడింగ్ ఇవ్వాలని సూచించారని కిష్టారం ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ నర్సింహారావు తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి సైతం ఈ అంశంపై అధికారులతో చర్చించారని, అవసరమైతే మరింత లోడ్ పెంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.కోల్ ఏజెంట్లదే పెత్తనం బొగ్గు లోడింగ్ ఇవ్వాలంటూ లారీల యజమానులు ఆందోళన చేయడం.. అప్పుడే అధికారులు ఎంతో కొంత లోడ్ పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇదేసమయాన కోల్ ట్రాన్స్పోర్టర్ల నుంచి పర్మిట్లు తెచ్చుకున్న ఏజెంట్లు బొగ్గు లోడింగ్ బయట లారీలకే ఇస్తూ స్థానికులకు మొండిచేయి చూపుతున్నారు. అంతేకాక లోకల్ లారీలకు లోడింగ్ ఇవ్వాలంటే టన్నుకు రూ.100 నుంచి రూ.150, కిరాయిలో నాలుగు శాతం కమీషన్, రిసీవ్డ్ మామూలు కింద రూ.400 వసూలుతో పాటు అన్లోడింగ్ లేని చోట టన్నుకు రూ.60 చొప్పున మినహాయిస్తే లారీకి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు దండుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇకపోతే బయట లారీల నుంచి రెండింతలు అదనంగా వసూళ్లు చేస్తున్నారని సమాచారం. ఇదేమిటని లారీల యజమానులు ఏజెంట్లను ప్రశ్నిస్తే లోడింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సత్తుపల్లిలో ఆరుగురు ఏజెంట్లు మొత్తం వ్యవహారాన్ని శాసిస్తున్నారని చెబుతున్నారు. మందమర్రి, తదితర ప్రాంతాల్లో లారీ యూనియన్ బాధ్యులే కోల్ ట్రాన్స్పోర్టర్లను సంప్రదించి లోడింగ్ ఇస్తుండగా.. ఇక్కడ అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉండడం గమనార్హం. -
నీటి సంపులో పడి బాలుడు మృతి
కామేపల్లి: ఆడుకునే క్రమాన ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిన రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మండలంలోని పండితాపురానికి చెందిన బాదావత్ నాగరాజు–కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జయరిషినాయక్(2) ఉన్నారు. ఈక్రమాన బుధవారం కవిత ఇద్దరు కుమార్తెలకు స్నానం చేయిస్తుండగా, జయరిషి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఆతర్వాత కుమార్తెలను ఇంట్లోకి తీసుకెళ్లిన క్రమంలో బాలుడు అక్కడే ఆడుతూ నీటి సంపులో పడిపోయాడు. కాసేపటికి రిషి కనిపించడం లేదని వెతుకుతుండగా సంపులో గుర్తించి బయటికి తీసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఫోన్ మాట్లాడుతూ బావిలో పడి.. ఖమ్మంఅర్బన్: ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బావిలో పడిన కార్మికుడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన సుధీర్ కుమార్(32) ఖమ్మం ఖానాపురంలోని గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆయన బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సమీప బావిలో పడ్డాడు. సహచరులు బయటకు తీసేలోగా ప్రాణాలు కోల్పోవడంతో ఆయన బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ వెల్లడించారు. -
మెరుగైన పనితీరుతో విద్యార్థులకు లబ్ధి
ఖమ్మం సహకారనగర్/కూసుమంచి: విద్యాశాఖ ఉద్యోగుల పనితీరు మెరుగ్గా ఉంటే విద్యార్థులకు బోధన, సౌకర్యాల్లో లోపాలు ఎదురుకావని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ(సైట్) డైరెక్టర్, జిల్లా పరిశీలకురాలు ఎస్.విజయలక్ష్మీబాయి తెలిపారు. జిల్లాలోని కూసుమంచి కేజీబీవీ, భవిత కేంద్రం, ఖమ్మంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లను బుధవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం రోటరీనగర్ హైస్కూల్లో డీఈఓ నాగపద్మజతో కలిసి విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి ఫలి తాల పెంపునకు ఇప్పటినుంచే ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలని సూచించారు. ఈసమావేశంలో ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచి కేజీబీవీని సీఎంఓ రాజశేఖర్తో కలిసి తనిఖీ చేసిన విజయలక్ష్మి పరిసరాలు, వంటశాలను పరిశీలించడమే కాక విద్యార్థులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఇన్చార్జి ఎస్ఓ రాజేశ్వరికి సూచనలు చేశారు. -
జ్వరంతో యువకుడు మృతి
కూసుమంచి: మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి(24) వైరల్ ఫీవర్తో బాధపడుతూ మృతి చెందాడు. ప్రొక్లెయిన్ ఆపరేటర్గా పనిచేసే ఆయన నాలుగు రోజులుగా జ్వరం బాధపడుతుండగామంగళవారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. చోరీ కేసులో మహిళ అరెస్ట్తిరుమలాయపాలెం: బంగారం, వెండి నగల చోరీ కేసులో పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. తిరుమలాయపాలెంకు చెందిన పగిళ్ల రామకృష్ణ ఇంట్లో మే 23వ తేదీన దొంగతనం జరిగింది. రూ.లక్ష విలువైన బంగారం, వెండి వస్తువులు అపహరించగా దర్యాప్తులో డోర్నకల్ మండలానికి చెందిన సాయికల్యాణిని నిందితురాలిగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని సొత్తు రికవరీ చేయడంతో పాటు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది తర్వాత చోరీ సొత్తు రికవరీవైరారూరల్: రిటైర్డు ఉద్యోగి ఇంట్లో టీవీని యువకులు చోరీ చేయగా.. వారి మధ్య విబేధాలతో ఏడాది తర్వాత వ్యవహారం బయటకొచ్చిన ఘటన ఇది. వైరా మండలం పూసలపాడుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చెరుకుపల్లి ప్రసాద్ ఇంట్లో రూ.80వేల విలువైన ఎల్ఈడీ టీవీని కొందరు యువకులు గత ఏడాది ఆగస్టులో చోరీచేశారు. దీనిపై ప్రసాద్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఇటీవల నిందితుల మధ్య వివాదం తలెత్తడంతో చోరీ విషయాన్ని ప్రసాద్కు తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ పి.రామారావు, ట్రెయినీ ఎస్ఐ పవన్ టీవీని స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు. స్పెషల్ డ్రైవ్లో 51 వాహనాలు సీజ్తల్లాడ: తల్లాడలో బుధవారం పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 51 వాహనాలను సీజ్ చేశారు. ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ ఆధ్వర్యాన తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్ లేకపోవడంతో పాటు సరైన పత్రాలు లేని మోటార్ సైకిళ్లను సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, బీమా, రిజిస్ట్రేషన్ కలిగి ఉండడమే కాక నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని తెలిపారు. తనిఖీల్లో ట్రెయినీ ఎస్ఐ వెంకటేశ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ మోటార్ల దొంగలు అరెస్ట్ కూసుమంచి: విద్యుత్ మోటార్లు, కాపర్వైర్ చోరీకి పాల్పడిన ముగ్గురిని కూసుమంచి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి ఏడు మోటార్లు, కాపర్ వైరు, మూడు ద్విచక్ర వాహనాలు, టైర్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. కూసుమంచి శివాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు బైక్లపై బస్తాలతో వెళ్తున్న వారు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా కూసుమంచి మండలం వెంకట్రాంపురానికి చెందిన పుట్ట నరేష్, యాట రాజు, నిమ్మల రమేష్గా గుర్తించడంతో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈశ్వరమాధారం, పాలేరులో చోరీలకు పాల్పడిన ముగ్గురిని రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు.నిందితుల మధ్య విబేధాలతో వెలుగులోకి వ్యవహారం -
నిబద్ధత గల నాయకుడిని కోల్పోయాం..
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు బొల్లోజు అయోధ్య మరణంతో కమ్యూనిస్టు పార్టీ నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భద్రాద్రి జిల్లా సీపీఐ నాయకుడు బొల్లోజు అయోధ్య మృతదేహాన్ని ఖమ్మంలోని సీపీఐ కార్యాలయానికి తీసుకొచ్చా రు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, పాకాలపాటి వెంకటేశ్వరరావు, జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మౌలానా, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కార్యదర్శులు దండి సురేష్, సాబీర్పాషా తదితరులు అయోధ్య మృతదేహంపై పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చిరుప్రాయంలోనే ఎర్ర జెండా పట్టిన అయోధ్య తుదిశ్వాస వరకు అదే జెండా నీడలో పని చేశారని, ఆటుపొట్లను తట్టుకుని పేదలకు భూమి అందేలా చూశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్ముల జితేందర్రెడ్డి, పాకాలపాటి లలితరాజేశ్వరి, యర్రా బాబు, మిరియాల రంగయ్య, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొనగా.. అయోధ్య మరణంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.అయోధ్యకు సీపీఐ నేతల నివాళి -
పారిశ్రామిక పార్క్లకు చేయూత ఇవ్వండి
మధిర: మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్క్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కేంద్ర మంత్రి జిటన్ రామ్ మాంజీకి వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రిని కలిసిన వారు మధిర మండలం ఎండపల్లి, ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లల్లో ఎంఎస్ఎంఈ పార్క్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇవేకాక తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి ఉన్నారు. 10న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన మధిర: మధిర మండలం వంగవీడు సమీపాన రూ.600 కోట్ల నిధులతో నిర్మించే జవహర్ ఎత్తిపోతల పథకానికి ఈనెల 10న శంకుస్థాపన జరగనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పథకానికి శంకుస్థాపన చేస్తారు. స్ఫూర్తిప్రదాత జయశంకర్ ఖమ్మం సహకారనగర్: ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడగా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఏ.శ్రీనివాస్, కె.సత్యనారాయణ, శ్రీలత, ఎన్.మాధవి, శ్రీనివాసరావు, వేలాద్రి పాల్గొన్నారు.వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూలు ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై 17మంది వైద్యులను నియమించనుండగా, దరఖాస్తుదారులకు బుధవారం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. డీసీ హెచ్ఓ కె.రాజశేఖర్గౌడ్, డీఆర్వో పద్మశ్రీ, జనరల్ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్ ఆధ్వర్యాన 19మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించగా, గురువారం తుది జాబితా విడుదల చేస్తామని వారు తెలిపారు. ప్రవేశాలు, హాజరు పెరగాలి ఎర్రుపాలెం: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలతో పాటే విద్యార్థుల హాజరు పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీ డియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు సూచించారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడాక పిన్సిపాల్ ఆర్.రవికుమార్, అధ్యాపకులతో సమావేశమై ప్రవే శాలు, హాజరు పెంపు, అభివృద్ధి పనుల్లో నాణ్యతపై సూచనలు చేశారు. జిల్లాకు 2,600 బ్యాలెట్ బాక్స్లు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన 2,300బ్యాలెట్ బాక్స్లను ఇటీవల గుజరాత్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది. బుధవారం మహా రాష్ట్ర నుంచి మరో 300బ్యాలెట్ బాక్స్లు కేటా యించగా, రెండు, మూడు రోజుల్లో జిల్లాకు చేరతాయని అధికారులు తెలిపారు. -
అన్నీ అరకొర వసతులే...
కల్లూరు: కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అరకొర వసతులతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మూడు నుంచి పదో తరగతి వరకు చదివే 93 మంది విద్యార్థినులు ఉండగా.. బాత్ రూమ్లు, టాయ్లెట్లు సక్రమంగా లేవు. చాలా బాత్రూమ్లకు డోర్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇక కుక్ పోస్టు ఖాళీగా ఉండడంతో సహాయకులే వంట వండుతుండగా సమస్యలు ఎదురవుతున్నాయి. గత ఆదివారం మధ్యాహ్నం వండిన చికెనే సాయంత్రం వడ్డించగా.. సోమవారం ఉదయం సైతం ఉడికీ, ఉడకనీ కిచిడీ పెట్టడంతో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించడంతో అంతా కోలుకున్నా భయంతో తల్లిదండ్రులు పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనలో వార్డెన్ విజయనిర్మల నిర్లక్ష్యం ఉందని తేలడంతో సస్పెండ్ చేశారు. అయితే, సస్పెన్షన్తో సరిపెట్టకుండా పూర్తి కాలపు కుక్ను నియమించడంతో పాటు బాత్రూమ్లు, టాయ్లెట్లకు తలుపులు అమర్చాలని, డార్మెట్రీల్లో దోమలు రాకుండా మెష్ ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు. డీఎంహెచ్ఓ పరిశీలన కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం డీఎంహెచ్ఓ కళావతిబాయితో పాటు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారామ్, కల్లూరు వైద్యాధికారి నవ్యకాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల, వంట తయారీకి ఉపయోగించే సామగ్రిని పరిశీలించి సిబ్బదికి సూచనలు చేశారు. అలాగే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. -
‘బీసీ రిజర్వేషన్ల పేరిట రాజకీయాలు’
ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరిట మత రాజకీయాలకు దారితీసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. అక్కడ జరిగిన ధర్నా బీసీల హక్కుల కోసం కాకుండా, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించే ప్రయత్నమేననని తెలిపారు. బీసీల హక్కులే కాంగ్రెస్ లక్ష్యమైతే ఇప్పటి వరకు ఒక్క బీసీ నేతను ముఖ్యమంత్రిగా ఎందు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యాన బీసీల సంక్షేమానికి అనేక పథకాలు అమలవుతున్నాయని కోటేశ్వరరావు తెలిపారు. నాయకులు ఈ.వీ.రమేష్, నల్లగట్టు ప్రవీణ్కుమార్, ఆల్లిక అంజయ్య, కుమిలి శ్రీనివాసరావు, పమ్మి అనిత, తడుపునూరి రవీందర్, రుద్రగాని మాధవ్, జ్యోతుల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ హాట్స్పాట్లు..
● నాలుగేళ్ల కేసుల ఆధారంగా గుర్తింపు ● జిల్లాలో ఏటా 500కు పైగా కేసుల నమోదు ● ప్రభావిత గ్రామాల పీహెచ్సీలకు పరీక్ష కిట్లు ● కలెక్టర్ ఆదేశాలతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది శాంపిళ్లతో నిర్ద్ధారణ వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే జిల్లా అంతటా దోమల మోత నిత్యకృత్యమైంది. దరిమిలా మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇందులో డెంగీ బారిన పడిన కొందరు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యాన వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన జ్వర సర్వే నిర్వహిస్తూ అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరిస్తున్నారు. డెంగీ హాట్స్పాట్లుగా గుర్తించిన గ్రామాల్లో ఎక్కువ శాంపిల్స్ తీస్తున్నారు. 2023లో 29,637 శాంపిళ్లు తీయగా 520 డెంగీ పాజిటివ్ కేసులు తేలాయి. 2024లో 32,656 శాంపిల్స్ తీస్తే 529, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4,895 శాంపిళ్లు సేకరించగా 42 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, 2023లో అత్యధికంగా సెప్టెంబర్, అక్టోబర్లో 330, 2024 జూలై, ఆగస్టులో 277, ఈ ఏడాది గత నెల, ఈ నెల కలిపి 38 పాజిటివ్ కేసులొచ్చాయి. పారిశుద్ధ్య లోపంతోనే.. చిన్నపాటి వర్షం కురవగానే జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో నీరు నిలిచి పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోంది. దీనికి తోడు పంచాయతీలకు పాలకవర్గాలు లేక, ప్రశ్నించే వారు లేక డ్రెయినేజీలను సరిగ్గా శుభ్రం చేయక దోమల మోత మోగుతోంది. మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల్లో అదే పరిస్థితి ఉండగా వర్షాకాలం వచ్చిందంటే విష జ్వరాలతో ఇబ్బంది పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమాలు ప్రతీ వారం నిర్వహించాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతోంది. ఆ గ్రామాల్లో తీవ్రత గత నాలుగేళ్ల డెంగీ కేసుల ఆధారంగా జిల్లాలో 82గ్రామాలను హాట్స్పాట్లుగా నమోదు చేశారు. ఏటా 500కు పైగా డెంగీ కేసులు నమోదవుతుండగా సగటున 200కు పైగా కేసులు ఈ గ్రామాల్లో వస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి, పాతర్లపాడు, అజ్మీరాతండా, తిరుమలాయపాలెం, తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, కొణిజర్ల మండలంలోని పెద్దమునగాల, పల్లిపాడు, గోపవరం, నేలకొండపల్లి మండలంలోని నేలకొండపల్లి, రాయగూడెం, బోదులబండ, గువ్వలగూడెం, ఖమ్మంరూరల్ మండలంలోని గుర్రాలపాడు, గుదిమళ్ల, రామన్నపేట, వైరా మండలంలోని వైరా, బోనకల్ మండలంలోని తూటికుంట్ల, ముదిగొండ మండలంలోని బాణాపురం, వల్లభి, రఘునాథపాలెం మండలంలోని వీవీ.పాలెం, రఘునాథపాలెం, ఖమ్మంఅర్బన్ మండలంలోని బాలపేట, వేంసూరు మండలంలోని కందుకూరు, సత్తుపల్లి మండలలోని గంగారం, తల్లాడ మండలంలోని అన్నారుగూడెం, కల్లూరు ఈ జాబితాలో ఉన్నాయి.డెంగీ నియంత్రణలోనే ఉంది.. జిల్లాలో డెంగీ నియంత్రణలో ఉంది. కేసులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులను ఆదేశించాం. జ్వర లక్షణాలు ఉంటే పరీక్ష చేయించి తగ్గే వరకూ పర్యవేక్షించాలని సూచించాం. పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో డెంగీ కిట్లు, మందులు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలపై మరింత శ్రద్ధ వహిస్తున్నాం. ఎవరికై నా జ్వరం ఉంటే సమీప పీహెచ్సీలో పరీక్ష చేయించుకోవాలి. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్హాట్స్పాట్లు గుర్తించిన గ్రామాల్లో నమోదైన డెంగీ కేసులు, కొన్ని పీహెచ్సీల వారీగా గ్రామాలు సంవత్సరం కేసులు పీహెచ్సీ హాట్స్పాట్ గ్రామాలు 2021 195 మంచుకొండ 10 2022 369 ఎం.వీ.పాలెం 08 2023 162 లంకాసాగర్ 08 2024 175 తిరుమలాయపాలెం 06 -
ఆశ కార్యకర్తలతో ఇంటింటి సర్వే
ఖమ్మంవైద్యవిభాగం: రక్తపోటు, మధుమేహం బాధితుల చికిత్సపై ఆరా తీసేందుకు ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వేచేయాలని డీఎంహెచ్ఓకళావతిబాయి సూ చించారు. ఎంపిక చేసిన ఆశా కార్యకర్తలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంట్రల్ బృందం మూ డు రోజులపాటు శిక్షణఇచ్చింది. ఈ బృందంలో డాక్టర్ డీ.ఆర్.స్వాతి, డాక్టర్ రోహిత్ గగ్రా ఉండగా డీఎంహెచ్ఓ బుధవారం వారితో సమావేశమై మాట్లాడారు. శిక్షణలో భాగంగా గురువారం నుండి ఒక్కో ఆశ కార్యకర్త, శిక్షణ పొందిన ఐసీఎంఆర్ సర్వేయర్లు సర్వే నిర్వహించాలని తెలిపారు. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బాధితుల ఇళ్లకు వెళ్లి చికిత్స, వ్యాధి తీవ్రతపై ఆరా తీస్తూ సూచనలు చేయాలని చెప్పారు. ప్రోగ్రాం ఆఫీసర్ రామారావు, ఉద్యోగులు సుబ్రహ్మణ్యం, మురళి, నాగరాజు, చారి, మాలతి పాల్గొన్నారు. వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి తల్లాడ: గర్భిణులు, శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి వేయించేలా వైద్య, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. తల్లాడ పీహెచ్సీలో బుధవారం వ్యాక్సినేషన్ను పరిశీలించిన ఆమె గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు ఎక్కువగా నమోదవుతున్నందున గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే, బిడ్డ పుట్టగానే ముర్రుపారు పట్టిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. కాగా, ఈనెల 11న నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వైద్యాధికారి ప్రత్యూషతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. -
బెటాలియన్ కానిస్టేబుల్ బలవన్మరణం
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగారం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ కుటుంబ కలహాలకు తోడు మద్యానికి బానిసవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన అల్లం బాలరాజు(40) సత్తుపల్లి మండలం బేతుపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటూ గంగారం బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏడాది క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్య, పిల్లలతో కలిసి పుట్టింటికి ఉంటుంది. ఆపై మద్యానికి బానిసైన బాలరాజు మద్యం మత్తులోనే రెండు రోజుల క్రితం నివాసముండే గదిలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో బెటాలియన్ సిబ్బంది పరిశీలించడంతో విషయం వెలుగు చూసింది. ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిఖమ్మం క్రైం: ఖమ్మంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెద్దగోపతికి చెందిన గుండ్ల రామకృష్ణ(22) ఖమ్మంలోని మొబైల్ షాప్లో పనిచేస్తుండగా, స్వగ్రామానికి బైక్పై వెళ్లే సమయాన వైరా వైపు నుంచి బైక్పై వస్తున్న సామినేని చంద్రమోహన్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రామకృష్ణకు చికిత్స చేయిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై ఆయన తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతిపాల్వంచరూరల్: పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడాపాఠశాలలో మూడేళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మోకాళ్ల పాపారావు(50) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పాటిమీదగుంపునకు తరలించారు. పాఠశాల హెచ్ఎం రామారావు, తోటి ఉపాధ్యాయులు రూ. 30 వేల ఆర్థికసాయాన్ని మృతుడి భార్యకు అందజేశారు. విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్సకల్లూరు: కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో సోమవారం అల్పాహారం తిన్నాక 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. ఇందులో ఐదుగురికి మంగళవారం కల్లూరు ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. వైద్యులు రమేష్, నవ్యకాంత్ వారిని పరీక్షిచి సూచనలు చేశారు. కాగా, మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పసుమర్తి చందర్రావు, భాగం ప్రభాకర్ విద్యార్థినులను పరామర్శించడమే కాక హాస్టల్లో పరిశీలించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. రెండు రోజుల తర్వాత గుర్తించిన వైనం -
పత్తి సాగు
లక్ష్యానికి మించిమిర్చితో నష్టం ఎదురైంది.. గత ఏడాది రెండెకరాల్లో మిర్చి సాగు చేస్తే దిగుబడి తగ్గడమే కాక పెరిగిన పెట్టుబడికి తగిన ధర రాలేదు. దీంతో ఈ ఏడాది నాలుగెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. నీటి వనరులు ఉండడంతో ఆ పంట తర్వాత మొక్కజొన్న సాగు చేయాలని నిర్ణయించుకున్నా. – బానోత్ రామా, బీచురాజుపల్లి తండా పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది.. సహజంగా జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంటున్నా గత ఏడాది కంటే ఈసారి పెరిగింది. గత ఏడాది మిర్చి ధరల ప్రభావం పత్తి సాగు పెరగడానికి దోహదపడింది. ప్రస్తుతం జిల్లా రైతులు సాగు చేసిన పత్తి పైర్లు ఆశాజనకంగానే ఉన్నాయి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారిఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు అంచనాలను మించింది. పత్తి 2,15,643 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 2,21,127 ఎకరాల్లో విత్తనాలు నాటడం విశేషం. అంటే సాధారణ సాగుతో పోలిస్తే 5వేలకు పైగాఎకరాల్లో అదనంగా సాగవుతోంది. ఇక గత ఏడాది 2,07,945 ఎకరాల్లో పత్తి సాగు చేస్తే ఈసారి మరో 14 వేల ఎకరాలు పెరగడం రైతుల ఆసక్తిని తెలియచేస్తోంది. కాగా, సాగు విస్తీర్ణం నమోదు తర్వాత ఇది మరింత అవకాశముందని భావిస్తున్నారు. గత ఏడాది మిర్చికి సరైన ధర రాకపోవడం, పత్తి ధరను కేంద్రం పెంచడం రైతులు పత్తి వైపు చూపడానికి కారణంగా చెబుతున్నారు. అంతేకాక పత్తి సాగు తర్వాత రెండో పంటగా మొక్కజొన్న సాగుకు అవకాశముండడం ఇంకో కారణంగా తెలుస్తోంది. పలు మండలాల్లో ౖపైపెకి... జిల్లాలోని పలు మండలాల్లో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కామేపల్లి, రఘునాథపాలెం, కూసుమంచి, తిరుమలాయపాలెం, తల్లాడ, ఏన్కూరు, సింగరేణి మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కో మండలంలో 2వేల నుంచి 4 వేల ఎకరాల వరకు కూడా సాగు విస్తీర్ణం పెరగగా.. మధిర, కల్లూరు తదితర మండలాల్లో మాత్రం స్వల్పంగా తగ్గింది. అయినా జిల్లా వ్యాప్తంగా పంట సాగు విస్తీర్ణం పెరిగింది. పెరిగిన పత్తి ధర కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి పత్తి ధర పెంచింది. గత ఏడాది పత్తి ధర తేమ శాతం ఆధారంగా గరిష్టంగా రూ.7,521 ఉండగా, ఈ ఏడాది ఏకంగా రూ.8,110కు పెంచారు. తద్వారా క్వింటాకు రూ.589 అదనంగా లభించనుంది. ఇక పత్తి రెండు నుంచి మూడు పత్తితీతల తర్వాత నీటి వనరుల ఆధారంగా మొక్కజొన్న సాగు చేస్తారు. ఈ పంట రైతులకు లాభాలు కురిపించనుండడంతో ఎక్కువ మంది పత్తి సాగుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మిర్చి ధర పతనం మిర్చి ధర పతనం కావడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. క్వింటా రూ.20 వేల వరకు పైగా పలికిన మిర్చి ధర గత ఏడాది గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం సగటున రూ.12 వేలు దాటడం లేదు. విదేశాల ఆర్డర్లు లేకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతుండడం.. మిర్చి పెట్టుబడికి తగిన ధర దక్కక రైతులు నష్టపోయారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది పత్తి సాగుకు మొగ్గు చూపారు. అంచనాల కంటే 5,484 ఎకరాల్లో అదనంగా పంట గత ఏడాదితో పోలిస్తే 14 వేల ఎకరాలు ఎక్కువ మిర్చి ధర పతనంతోనే పత్తి వైపు రైతుల మొగ్గుజిల్లాలోని పలు మండలాల్లో గత ఏడాది, ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) మండలం 2024–25 2025–26 కామేపల్లి 11,386.02 15,226 రఘునాథపాలెం 16,049.19 21,723 తిరుమలాయపాలెం 12,201.30 15,002 చింతకాని 19,064.37 20,364 తల్లాడ 6,028.04 8,925 ఏన్కూరు 15,250.27 16,227 సింగరేణి 20,620.12 22,674 -
ప్రతిభ చూపే సిబ్బందికి ప్రోత్సాహకాలు
ఖమ్మంక్రైం: విధినిర్వహణలో కష్టపడి పనిచేసే పోలీస్ సిబ్బందిని ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. గంజాయితో పాటు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ ఉద్యోగులు ఎస్.కే.ఖాసింఅలీ, వి.గోపి, ఎం.సతీష్కు సీపీ మంగళవారం క్యాష్ రివార్డులు అందజేసి మాట్లాడారు. జిల్లాలో 33కేసుల్లో 192 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడమేకాక 120 మంది నిందితులను అరెస్ట్ చేయడంలో ఈ సిబ్బంది కీలకంగా వ్యవహరించారని తెలి పారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. డయల్ 100కు 4,151 ఫోన్లుఖమ్మంక్రైం: ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసి న డయల్ 100కు జూలై నెలలో 4,151 మంది ఫోన్ చేశారని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఇందులో 113 ఫోన్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. ఈ కేసుల్లో మహిళలపై వేధింపులు, చోరీలు, ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు, ఇతర కేసులు ఉన్నాయని తెలిపారు. అయితే, కొందరికి డయల్ 100పై అవగాహన లేక చిన్నచిన్న అంశాలకు ఫోన్చేస్తున్నారని, అలా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించుకోవాలని సీపీ సూచించారు. డ్రై డే నిర్వహణతో వ్యాధులకు చెక్మధిర/బోనకల్: సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు డ్రై డే కార్యక్రమాలపై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి సూచించారు. మధిర మండలం దెందుకూరు, బోనకల్ పీహెచ్సీలను మంగళవారం తనిఖీ చేసిన ఆమె వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై దృష్టి సారిస్తూనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, వసతి గృహాలను నెలకోసారి సందర్శించి పరి శుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పా రు. కాగా, మధిర మండలం మహదేవపురంలో పుతుంబాక రామసీతమ్మ జ్ఞాపకార్ధం ఆమె కుమారులు సుభాష్, తదితరులు స్థలం సమకూర్చడమే కాక రూ.25 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా భవనాన్ని డీఎంహెచ్ఓ పరి శీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పృధ్వీ, స్రవంతి, ఉద్యోగులు వెంకటేశ్వర్లు, లంకా కొండయ్య, దానయ్య, స్వర్ణమార్త తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ క్రికెట్ టోర్నీ ప్రారంభంఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి రాజీవ్ స్మారక క్రికెట్ టోర్నీ మంగళవారం ప్రారంభమైంది. అండర్–12 బాలుర క్రికెట్ పోటీలను ఫైమా అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పి.రవిమారుత్, అశోక్రెడ్డి, శశిధర్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా టోర్నీ నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో సూరిబాబు, ఎం.డీ.జావిద్, డాక్టర్ చక్రి, టోర్నీ నిర్వాహకులు ఎం.డీ.మతిన్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లుపై పలువురి రాజకీయాలు
ఖమ్మంమయూరిసెంటర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించా రు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిల్లుకు ఆమోదంపై కేంద్రప్రభుత్వం దొంగాట ఆడుతోందని తెలిపారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రప్రభుత్వ నిధులు ఆగినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ బూర్జవా పార్టీలతో పొత్తు పెట్టుకోదని.. వామపక్ష పార్టీలు బూర్జువా పార్టీలతో అవగాహన, ఒప్పందాలు లేకుండా కలిసొస్తే ఐక్యంగా పోటీ చేస్తామన్నారు. కాగా, గాజాపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈనెల 7న ఖమ్మంలో నిర్వహించే ర్యాలీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని రంగారావు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆవుల అశోక్, సీవై.పుల్లయ్య, ఆర్.శివలింగం, జి.రామయ్య, బందెల వెంకయ్య, కొల్లేటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
ఢిల్లీ దీక్షలో జిల్లా కాంగ్రెస్ నేతలు
ఖమ్మంమయూరిసెంటర్/వైరా: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలనే డిమాండ్తో కాంగ్రెస్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్నాయక్, కోరం కనకయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొనగా కేంద్రం తీరును వారు ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, నాయకులు వనం ప్రదీప్త చక్రవర్తి, గజ్జల వెంకన్న, జెర్రిపోతుల అంజనీకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ సీఎంఓగా ప్రవీణ్కుమార్ ఖమ్మం సహకారనగర్: విద్యాశాఖలో కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ మీడియా ఆఫీసర్(సీఎంఓ)గా వి.ప్రవీణ్కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు ఇన్చార్జ్ డీఈఓ నాగపద్మజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చింతకాని మండలం పొద్దుటూరు హైస్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్కుమార్ ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. -
రోడ్డుప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి
కొణిజర్ల: మండలంలోని పల్లిపా డు సమీపాన రైస్ మిల్ ఎదురుగా ఆటోను లారీ ఢీకొట్టగా ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఖమ్మం రోటరీనగర్కు చెందిన సయ్యద్ సైదులు(45) తన ఆటోలో మంగళవారం రాత్రి ఖమ్మం నుండి వైరా వెళ్తుండగా పల్లిపాడు సమీపాన వైరా నుంచి ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు కాగా, సైదులు తీవ్రగాయాలతో అందులో ఇరుక్కుపోయి మృతి చెందాడు. ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు తల్లాడ: తల్లాడ మండలం నరసింహారావుపేట సమీపాన కంకర మిల్లు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జగన్నాధపురం గ్రామానికి చెందిన తుమ్మ వెంకటేశ్వర్లు(65) ద్విచక్ర వాహనంపై ఏన్కూరు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుండగా, 108వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. విత్తన లోపంతో నష్టపోయామని ఫిర్యాదుతల్లాడ: మొక్కజొన్న విత్తన లోపంతో దిగుబడి రాక నష్టపోయామని తల్లాడ మండలం మండలం ముద్దునూరుకు చెందిన పలువురు రైతులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. గ్రామ రైతులు 25మంది 2024 నవంబర్, డిసెంబరులో 80ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఆడ మగ విత్తనాలను విత్తన కంపెనీ ఏజెంట్ దేవరపల్లి జగన్నాధం సరఫరా చేయగా, 40 క్వింటాళ్లుగా చెప్పిన దిగుబడి 5నుంచి 10క్వింటాళ్లు దాటలేదు. దీంతో ఒక్కో రైతుకు ఎకరానికి రూ.50 వేల మేర నష్టం వాటిల్లగా కంపెనీ నుంచి జూన్ 1వ తేదీకల్లా పరిహారం ఇప్పిస్తానని ఏజెంట్ జగన్నాధం హామీ ఇచ్చాడు. ఇప్పటివరకు స్పందన లేకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన రైతుల్లో బి.కృష్ణారావు, మంకెన గోపాల్, సాదం లక్ష్మణ్రావు, జి.శ్రీనివాసరావు, హరీష్, కృష్ణ, కొండలరావు, నరసింహారావు, చంటి, ప్రసాద్, బాబురావు, సైదురెడ్డి, మన్నె రామారావు తదితరులు ఉన్నారు. 4కేజీల గంజాయి స్వాధీనంమధిర: ఒడిశా నుంచి తీసుకొచ్చి మధిర చుట్టుపక్కల ప్రాంతాల్లోఅమ్మేందుకు సిద్ధం చేసిన నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మధిర టౌన్ సీఐ రమేష్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని భూక్యా అనూష్ నాయక్, కుంచం గోపీచంద్, మరో మైనర్ బాలుడు తీసుకొచ్చినట్లు అందిన సమాచారంతో మధిర టౌన్ ఎస్ఐ ఎం.కిషోర్కుమార్ ఆధ్వర్యాన మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈమేరకు రూ.2లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాక కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చీటింగ్ కేసు నమోదుఇల్లెందురూరల్: షోరూం నిర్వహణ విషయంలో ఓ వ్యక్తిపై పోలీసులు మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. ఖమ్మానికి చెందిన ఈశ్వరప్రగడ రంగనాథ్ ఇల్లెందు మండలం సుభాష్నగర్లో బైక్ షోరూం ప్రారంభించాడు. నిర్వహణ బాధ్యతను ఇల్లెందుకు చెందిన యాలం దయాసాగర్కు అప్పగించచగా యజమానికి తెలియకుండా రూ. 12.31 లక్షల విలువైన బైక్లను విక్రయించి నగదు సొంతానికి వాడుకున్నాడు. అందులో కొంత చెల్లించినా, రూ.8.82లక్షలు చెల్లించకపోవడంతో రంగనాథ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
నానో యూరియాతో తగ్గనున్న ఖర్చు
మధిర: పంటలకు గుళికల యూరియా బదులు ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వినియోగంతో ఖర్చు తగ్గడమే కాక ఫలితాలు బాగుంటాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మధిర మండలం ఆత్కూర్లో పలువురు రైతులు సాగు చేసిన పత్తి పంటను మంగళవారం పరిశీలించిన ఆయన నానో యూరియా, డీఏపీపై అవగాహన కల్పించారు. నానో యూరియాతో మొక్కకు పోషకాలు ఎక్కువ మోతాదులో అందుతాయని తెలిపారు. కాగా, పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 – 10 చొప్పున ఏర్పాటు చేసుకోవాలని, ఉధృతి ఉంటే పురుగు మందులను వేపనూనెతో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సాయిదీక్షిత్, ఏఈఓ జిష్ణు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
● అసంపూర్తి నిర్మాణాలు ‘ఇందిరమ్మ’ నమూనాలో పూర్తి ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో సిద్ధంగా ఉన్న 1,132 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రారంభించనివి, పురోగతిలో ఉన్నవి మినహా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వసతులు కల్పించి పంపిణీ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక వివిధ దశల్లో ఉన్న 383 ఇళ్లను సైతం లబ్ధిదారులకు కేటాయించి ఇందిరమ్మ ఇళ్ల నమూనాలో నిర్మించుకునేలా ప్రభుత్వ సాయం అందించాలని కలెక్టర్ సూచించారు. ఇంకా ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరింత మెరుగైన వైద్యం అందించాలి తిరుమలాయపాలెం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే వారికి అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. తిరుమలాయపాలెంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ను మంగళవారం తనిఖీ చేసిన ఆయన వివిధ విభాగాలు, రిజిస్టర్లను పరిశీలించడమే కాక వైద్యసేవలపై గర్భిణులతో ఆరా తీశారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యాన పరిశుభత్ర ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో పెట్టుకోవాలని తెలిపారు. వైద్యాధికారులు కృపాఉషశ్రీ, బొల్లికొండ శ్రీనివాసరావు, ప్రతాప్రెడ్డి, అమర్సింగ్, డీఏఓ పుల్లయ్య, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యాన మంగళవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో జరిగిన ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ బాధ్యులు, టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తూనే బదిలీలు చేపట్టాలని, పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలన్నారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి, బీఈడీ అర్హత కలిగిన వారికి కూడా ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంగా పదోన్నతి ఇవ్వాలని, 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు వేతనం, పెండింగ్ డీఏలను విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. యూఎస్పీసీ నాయకులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, టి.వెంగళరావు, మన్సూర్, పి.నాగిరెడ్డి, పద్మ, షమి, వెంకన్న, రాంబాబు, రాందాస్, నాగేశ్వరరావు, సురేష్, ప్రశాంతి, వలీ, ఉద్దండ్, మనోహర్ రాజు, రాజశేఖర్ పాల్గొనగా... సీపీఎం, మాస్లైన్ నాయకులు నున్నా నాగేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, అశోక్, వెంకటేష్ తదితరులు సంఘీభావం తెలిపారు.