breaking news
Khammam District News
-
లేఖ లేక రాస్తున్నా..
డిజిటల్ యుగం ఎంత ముందుకెళ్లినా లేఖ రాయడం అనేది భావాల్ని హృదయపూర్వకంగా వ్యక్తపరిచే అందమైన పద్ధతి. ఈ ఏడాది ‘లెటర్ టు మై రోల్ మోడల్’థీమ్కు విద్యార్థులు, యువత నుంచి స్పందన వస్తోంది. ఖమ్మం డివిజన్ పరిధిలోని అనేక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పిల్లలు ఆసక్తితో లేఖలను స్వయంగా రాసి పంపుతున్నారు. వచ్చే నెల 23న ఫలితాలు ప్రకటించి నగదు బహుమతులు అందిస్తాం. –వీరభద్ర స్వామి, తపాలా శాఖ, సూపరింటెండెంట్, ఖమ్మంమనసులోని భావాలకు అక్షర రూపమిస్తే అవతలివారి హృదయాలను తాకుతుంది. అందుకే చేతిరాత లేఖలు అందగానే ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాలపై ఉన్నతాధికారుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలతో విషయ ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా విస్తరించిన తరుణంలో ఉత్తరాల సంస్కృతి కనుమరుగవుతోంది. ఆ భావనలు నవతరం కూడా ఆస్వాదించేలా తపాలా శాఖ ‘ఢాయీ ఆఖర్’ పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉత్తమ లేఖలకు నగదు బహుమతులను ప్రకటించింది. -
ప్రచార రంగంలోకి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కీలకఘట్టమైన నామినేషన్ల దాఖలు ముగిసింది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసి బరిలో ఉండే అభ్యర్థులు తేలడంతో ప్రచారం జోరందుకుంది. రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం ముగియగా పోటీలో ఎవరెవరు మిగిలారో తేలిపోయింది. ఇక మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 9వరకు గడువు ఉంది. ఈమేరకు మొదటి, రెండో విడత అభ్యర్థుల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను అభ్యర్థులు వినియోగించుకుంటున్నారు. మూడో విడతలో తప్పక పోటీలో ఉంటామనుకునే సర్పంచ్, వార్డు అభ్యర్థులు కూడా ఓటర్లను కలుస్తున్నారు. మొదటి విడత బరిలో 476మంది మొదటి, రెండో విడత ఎన్నికలు జరిగే చోట్ల అభ్యర్థుల సంఖ్య తేలింది. మొదటి విడతగా కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 192 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 1,142, 1,740 వార్డుస్థానాలకు 4,054 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 3న ఉపసంహరణ గడువు ముగియగా ఏకగ్రీవాలు మినహా 172 సర్పంచ్ స్థానాల్లో 476 మంది బరిలో మిగిలారు. ఇక 1,740 వార్డులకు గాను రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 323 ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోగా 1,415 వార్డుల్లో 3,275 మంది పోటీలో ఉన్నారు. రెండో విడత బరిలో వీరే.. రెండో విడత ఎన్నికలు కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో జరగనున్నాయి. ఆయా మండలాల్లోని 183 సర్పంచ్ స్థానాలకు 1,055మంది, 1,685 వార్డులకు 4,160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీరహితమే అయినా పార్టీల మద్దతుదారులే బరిలోకి దిగారు. ఈ నేపథ్యాన పార్టీ సూచించిన అభ్యర్థి కాక ఇంకొందరు కూడా నామినేషన్లు వేయగా వారితో ఉపసంహరింపచేసేలా జరిపిన మంతనాలు కొంత మేరకే ఫలించాయి. ఇక మూడో విడత ఎన్నికలు జరిగే 191 సర్పంచ్ స్థానాలకు 1,025, 1,742 వార్డుసభ్యుల స్థానాలకు 4,085 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ఈనెల 9వ తేదీతో ఉపసంహరణలు ముగిస్తే పోటీలో మిగిలే అభ్యర్థుల సంఖ్య తేలుతుంది. పోటాపోటీగా ప్రచారం మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో అభ్యర్థుల ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. తమను గెలిపిస్తే గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను వివరించడమే కాక వ్యక్తిగతంగా ఏమేం ప్రయోజనాలు ఉంటాయో చెబుతూ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. పార్టీ గుర్తులు లేకపోగా, ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులను ఓటర్లకు పరిచయం చేస్తూ తమను గెలిపించాలని కోరుతున్నారు. అంతేకాక తమకు కేటాయించిన గుర్తులు జనంలోకి వెళ్లేలా స్టిక్కర్లు, కరపత్రాలే కాక వాల్పోస్టర్లు ముద్రించడంతో పాటు మైకులతో ఆటోలు, రిక్షాల ద్వారా ప్రచారం హోరెత్తిస్తున్నారు. మొదటి విడత ఎన్నికల ప్రచార గడువు 9వ తేదీన ముగియనుండడంతో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు.రెండో విడత ఎన్నికలు ఈనెల 14న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో శనివారం రాత్రి నుంచే అభ్యర్థుల ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాల్లో పార్టీ నేతల సూచనలతో వ్యూహాలకు పదును పెడుతూ వినూత్న రీతిలో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ దశ అభ్యర్థుల ప్రచార గడువు 12వ తేదీ ఉన్నందున ఆరు రోజుల్లో ఓటర్లను ఒకటికి రెండు సార్లు కలవాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా, మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 9తో ముగియనున్నప్పటికీ పోటీలో తప్పక ఉంటామనుకున్న అభ్యర్థులు ఓటర్లను కలుస్తున్నారు. గుర్తు కేటాయించాక మరోసారి వస్తామని చెబుతూ తమకే ఓటు వేసేలా మాట తీసుకుంటున్నారు.ప్రజల్లోకి వెళ్తున్న మొదటి విడత అభ్యర్థులు -
ఉపసర్పంచ్ పదవికీ డిమాండే..
● రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో తగ్గుతున్న పలువురు ● సర్పంచ్ అభ్యర్థి ఖర్చులు భరించేందుకు ఆసక్తి ● నిధుల వినియోగంలో జాయింట్ చెక్పవరే కారణం? వైరా: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ పదవికి పోటీ చేయాలని పలువురు నాయకులు ఆశించారు. ఇందుకోసం ఒకటి, రెండేళ్లుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, పలువురికి రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇలాంటి గ్రామాల్లో ఉపసర్పంచ్ పదవైనా దక్కించుకోవాలని వార్డు మెంబర్లుగా పోటీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, మహిళా రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో ఉపసర్పంచ్గా ఎన్నికై తే తామే పెత్తనం సాగించొచ్చనే భావనతో వార్డు సభ్యుల మద్దతు కూడగడ్డుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని చాలా గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు ఆశావహులకు అనుకూలంగా రాకపోవడం, మహిళలకు 50శాతం రిజర్వ్ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామ పాలనలో కీలకమే.. గ్రామపాలనలో ఉపసర్పంచ్ కూడా కీలక భూమిక పోషించనున్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నిధుల వినియోగంపై సర్పంచ్తో పాటు ఉపసర్పంచ్కు కూడా ఉమ్మడి చెక్ పవర్ కట్టబెట్టారు. దీంతో ఉపసర్పంచ్ పదవి కీలకంగా మారింది. దీంతో ఈ పదవి ద క్కించుకునేందుకు చిన్న పంచాయతీల్లో నూ పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఎస్టీ,ఎస్సీ,మహిళలకు సర్పంచ్ పదవి రిజర్వ్ అయిన చోట వార్డుమెంబర్లుగా జనరల్ అభ్యర్థులు గెలిచి ఉపసర్పంచ్ పదవి చేజిక్కించుకోవాలనే యత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం సహచర వార్డు అభ్యర్థుల మద్దతు కూడగడుతూనే సర్పంచ్ అభ్యర్థికి కావాల్సిన ఆర్థిక చేయూత కూడా ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. చెక్పవర్తో పెత్తనం.. ఉపసర్పంచ్లకు సర్పంచ్తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది. గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్పవర్ కల్పించిన ప్రభుత్వం బాధ్యతలను పూర్తి స్థాయిలో సర్పంచ్లకే అప్పగించింది. ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైతే సర్పంచ్పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఉపసర్పంచ్కు ఆ ముప్పు లేదు. ఒకవేళ ఎక్కడైనా సర్పంచ్పై అనర్హత వేటు పడితే ఉపసర్పంచ్ను సర్పంచ్గా ఎన్నుకునే అవకాశముంది. దీంతో ఉపసర్పంచ్ పదవిపై కన్నేసిన పలువురు.. మహిళా సర్పంచ్లు ఉన్న స్థానాలపై పెత్తనం తామే చేయొచ్చనే భావనకు వచ్చినట్లు తెలిసింది. ఫలితంగా చాలా జీపీల్లో నువ్వు సర్పంచ్.. నేను ఉపసర్పంచ్ అన్నట్లు ఒప్పందంచేసుకుని ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఖమ్మంసహకారనగర్: జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చకుదారి తీస్తున్నాయి. తొలి విడతగా ఏడు మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలు 1,740 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇందులో 17 పంచాయతీ సర్పంచ్ పదవు లు ఏకగ్రీవం కాగా.. కొన్నిచోట్ల అన్ని వార్డులు, ఇంకొన్ని చోట్ల కొన్నేసి కలిసి 323 వార్డుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక రెండు, మూడో దశల్లో సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు చర్చలు జరుపుతూ అధికార పార్టీకి సర్పంచ్ స్థానం, ప్రతిపక్ష పార్టీలకు ఉపసర్పంచ్ స్థానం తీసుకునేలా ఒప్పందానికి వస్తున్నట్లు సమాచారం. ఈ తరహాలోనే ఇప్పటికే పలు మండలాల్లో ఎంపిక ప్రక్రియ జరిగిందని చెబుతున్నారు. -
సమాజంలో మార్పు ఆశిస్తున్నా..
పాల్వంచ: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా సాదాసీదా జీవితాన్ని గడపడమే కాక, తనకు వచ్చే జీతాన్ని సైతం పేదల కోసం ఉపయోగిస్తున్న గొప్ప వ్యక్తి గుమ్మడి నర్సయ్య అని, ఆయన జీవితచరిత్రఆధారంగా తీస్తున్న సినిమాతో సమాజంలో కొంతైనా మార్పు రావాలని ఆశిస్తున్నానని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై నల్లా సురేష్రెడ్డి నిర్మిస్తున్న గుమ్మడి నర్సయ్య(ప్రజల మనిషి) సినిమా షూటింగ్ను శనివారం ఆయన పాల్వంచలో ప్రారంభించి మాట్లాడారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నా ఇప్పటివరకు ఏ సినిమాకూ క్లాప్ కొట్టలేదని, షూటింగ్లకు వెళ్లలేదని, నర్సయ్యపై ఉన్న అభిమానంతోనే పాల్వంచకు వచ్చానని తెలిపారు. నర్సయ్య జీవితాన్ని సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, తనతో పాటు రాష్ట్రంలో ఏ నాయకుడూ నర్సయ్యకు సాటిరారని చెప్పారు. షూటింగ్ కొంత ఆలస్యమైనా సరే కానీ పాన్ ఇండియా స్థాయిలో తీయాలని సూచించారు. తన కుటుంబానికి ఎంతో సన్నిహితులైన సురేష్రెడ్డి ఈ సినిమా తీయడం హర్షణీయమని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మొదట పాల్వంచ నుంచే ప్రారంభమైందని, గుమ్మడి నర్సయ్య వంటి జననేత తెలంగాణ వాసి కావడం గర్వంగా ఉందని అన్నారు. డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని మాట్లాడుతూ సమాజంలో మంచి మార్పునకు ఇలాంటి గొప్ప రాజకీయ నేత చరిత్ర అవసరం అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులకు ఆదర్శం గుమ్మడి నర్సయ్య అన్నారు. హీరో శివరాజ్కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రతీ రాజకీయ నాయకుడికి ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. నిర్మాత నల్లా సురేష్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పాల్వంచకు ప్రత్యేక స్థానం ఉందని, దీన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడి నర్సయ్యతో పాటు పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వరు, జారె ఆదినారాయణ, సమాచార హక్కు కమిషనర్ పి.వి.శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, సినీ దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే, నాయకులు నాగ సీతారాములు, వై.మధుసూదన్రెడ్డి, యుగంధర్ రెడ్డి, ఎడవల్లి కృష్ణ, కోనేరు చిన్ని, ముక్తేవి గిరీష్, వజీర్, అనురాధ పాల్గొన్నారు. పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కోమటిరెడ్డి పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశాక అమ్మవా రి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట హీరో శివరాజ్కుమార్, సినిమా నిర్మాత నల్లా సురేష్రెడ్డి తదితరులు ఉన్నారు.గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి -
ఆస్తుల కొనుగోలుకు చక్కని వేదిక
ఖమ్మంమయూరిసెంటర్: దళారుల ప్రమేయం లేకుండా ఆస్తుల కొనుగోలుకు క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో చక్కని వేదికగా నిలుస్తుందని ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ఎక్స్పో షోను శనివారం ఆమె నిర్వాహకులతో కలిసి ప్రారంభించాక మా ట్లాడారు. ఇళ్లు, ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి వినియోగించే సామగ్రి, బ్యాంకర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. క్రెడాయ్ జిల్లా అధ్యక్షుడు బండి జయ్కిశోర్ మాట్లాడుతూ.. ఈ ఎక్స్పోలో కార్పొరేట్ కంపెనీలు, జాతీయ బ్యాంకులు, ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారులు, భవన నిర్మాణ మెటీరియల్ కంపెనీల బాధ్యులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చారని చెప్పారు. కార్యక్రమంలో క్రెడాయ్ రాష్ట్ర చైర్మన్ ప్రేమ్సాగర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ డీజీఎం ఎం.హనుమంతరెడ్డి, ఎస్బీఐ డీజీఎం బినోద్కుమార్ సిన్హా, కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, క్రెడాయ్ బాధ్యులు పెద్ది కేశవరావు, చెరుకుమల్లి వెంకటేశ్వర్లు, వేములపల్లి నగేశ్, కమతం కమల్, కొదుమూరు ఉమేశ్, ఎం.బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ‘క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో’ను ప్రారంభించిన మేయర్ -
బీఆర్ఎస్ ప్రభుత్వమే..
●2028లో మళ్లీ ●ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పువ్వాడ రఘునాథపాలెం: గ్రామాల సమగ్రాభివృద్ధికి బాటలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైనందున 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని మంచుకొండ, పంగిడి, ఈర్లపూడి, రాంక్యాతండా, బద్ధ్యాతండా, పరికలబోడు తండా, జింకలతండా పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ శనివారం ఆయన ప్రచారం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులను పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని, ప్రతీ జీపీలో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు నిర్మించామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు చేర్చామని వివరించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో గ్రామాలభివృద్ధి నిలిచిపోయినందున జీపీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా, ఏకగ్రీవమైన కాంగ్రెస్ స్థానాలన్నీ ఒత్తిళ్లు, బెదిరింపులతో సాధించుకున్నవేనని ఆరోపించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, నాయకులు శాంత, మందడపు మాధవరావు, నర్సింహారావు, తారాచంద్, భూక్యా లక్ష్మణ్నాయక్, చెరుకూరి ప్రదీప్, కంపాటి రవి, సీపీఐ, సీపీఎం నాయకులు షేక్ జానీమియా, నవీన్రెడ్డి, పగడాల మల్లేశం, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు. -
స్నైపర్ గన్తో జింకల వేట
● ఆర్మ్స్, వైల్డ్లైఫ్ నేరాల కింద చార్జీషీట్ దాఖలు ● జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ ఖమ్మంవ్యవసాయం: సత్తుపల్లిలోని అర్బన్ పార్క్ల్లో వన్యప్రాణుల వేటకు సంబంధించి సమగ్ర విచారణ అనంతరం నిందితులను గుర్తించి రిమాండ్కు తరలించామని జిల్లా అటవీఅధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు. ఖమ్మంలోని జిల్లా అటవీశాఖ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పార్కులోకి కొందరు తుపాకులతో వచ్చి ఐదు జింకలు వేటాడి చంపినట్లు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేయడమే కాక సత్తుపల్లి ఎఫ్డీఓ, ఎఫ్ఆర్ఓ ఆధ్వర్యాన విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. తొలుత సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పార్క్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ, ఉదయం వాకింగ్కు వచ్చే శ్రీరాంప్రసాద్ను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. స్నైపర్ గన్తో వేట విచారణ కొనసాగిస్తుండగా అశ్వారావుపేట నుంచి మెచ్చా రఘు కూడా వేటలో పాల్గొన్నట్లుగా తేలిందని డీఎఫ్ఓ చెప్పారు. ప్రొఫెషనల్ షూటర్ల వద్ద మాత్రమే ఉండే స్నైపర్ గన్తో రఘు రెండో గేట్ నుంచి రాగా, మెయిన్ గేట్ నుంచి వాహనంలో కుంజ భరత్ వచ్చినట్లు బయటపడిందన్నారు. దీంతో రఘు, వాహనం యజమాని భరత్ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమే కాక పూర్తిస్థాయి విచారణ కోసం కొత్తగూడెం ఎస్పీ, డీఎఫ్ఓకు సమాచారం ఇచ్చినట్లు డీఎఫ్ఓ తెలిపారు. అలాగే, ఆర్మ్స్ యాక్ట్ కింద చార్జిషీటు దాఖలు కోసం ఖమ్మం ఎస్పీ సునీల్దత్కు సమాచారం ఇచ్చిన తాము వైల్డ్లైఫ్ నేరాల కింద చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, మెచ్చా రఘు వద్ద 2021–22 నుంచి తుపాకులు ఉన్నాయని తెలిపారు. గత నెల 24న అర్బన్పార్కుకు రాగా, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే గన్ను పోలీసులకు సరెండర్ చేశాడన్నారు. ప్రస్తుతం గన్ పోలీసుల వద్దే ఉన్నందున వారు ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షల అనంతరం చార్జీషీట్ దాఖలు చేసే అవకాశముందని తెలిపారు. కాగా, ఖమ్మం అటవీ రేంజ్లోనూ తమిళనాడు వాసి తుపాకీ కలిగి ఉండగా అరెస్ట్ చేశామని డీఎఫ్ఓ వివరించారు. ఈ సమావేశంలో అటవీశాఖ టాస్క్ఫోర్స్ అధికారులు వీరభద్రరావు, రాధిక, స్నేహలత పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ
నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారంతో పాటు మండల కేంద్రంలోని సీహెచ్సీని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రామారావు శనివారం తనిఖీ చేశారు. తొలుత చెరువుమాధారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్న భవనంలో పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఆ తర్వాత నేలకొండపల్లి సీహెచ్సీలో తనిఖీ చేసిన ఆయన ఉద్యోగుల హాజరు రికార్డులు, ఆపరేషన్ థియేటర్, ఫార్మ సీని పరిశీలించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వైద్యాధికారులు కె.రాజేశ్, కవిత, సన, నాగమణి, శ్రావణ్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీసుల విస్తృత తనిఖీలు ఖమ్మంక్రైం: బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న బ్లాక్ డేగా పాటిస్తున్న నేపథ్యాన జిల్లావ్యాప్తంగా పోలీసులు శనివారం విస్తృత తనిఖీ లు చేశారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు ఆధ్వర్యాన రైల్వేస్టేషన్, బస్టాండ్లు, హోటళ్లు, ఆలయాలు, షాపింగ్మాళ్లు తదితర రద్దీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరగకుండా ము మ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వన్టౌన్ సీఐ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఖమ్మం రైల్వేస్టేషన్లో తనిఖీల సందర్భంగా కొందరు చిన్నారులు పోలీసులతో ఫొటో దిగుతామని కోరగా అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు వారితో ఫొటో దిగడంతో పాటు శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. సాయి ఈశ్వరాచారికి నివాళిఖమ్మంమామిళ్లగూడెం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కలేదనే ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడిన సాయి ఈశ్వరాచారికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళులర్పించా రు. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద శనివారం కొ వ్వొత్తులు వెలిగించి నివాళులర్పించగా జాతీ య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడారు. రాజకీయ పార్టీల కుట్రలో సాయి ఈశ్వరాచారి అమరుడయ్యాడని తెలిపారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగన్నబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, నాయకులు గద్దె వెంకటరామయ్య, మల్లికార్జున్, గజ్జల శ్రీదేవి, ఇనగాల ఉపేంద్రాచారి, కృష్ణవేణి, సిద్ధు, సచ్చితానంద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలి ఖమ్మంసహకారనగర్: ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న వారే కాక దివ్యాంగులు, గర్భిణు లు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటు న్న ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) నాయకులు కోరారు. ఎన్నికలవిధుల కేటాయింపులో సీనియర్ ఉపా ధ్యాయులకు కాకుండా జూనియర్లకు స్టేజీ–2 బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపారు. ఇక నైనా సీనియర్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని, వారు పనిచేస్తున్న మండలం నుంచి సమీప ప్రాంతాల్లోనే విధులు కేటాయించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షు డు ధరావత్ రాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీనివాసరావు, సింగారపు వేణు ఒక ప్రకటనలో కోరారు. -
హోంగార్డుల సేవలు కీలకం
ఖమ్మంక్రైం: పోలీసుశాఖలో హోంగార్డు ఆఫీసర్ల సేవలు కీలకంగా నిలుస్తున్నాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ హెడ్క్వార్టర్స్లో శనివారం జరిగిన కార్యక్రమంలో సీపీ కేక్ కట్ చేశాక విధినిర్వహణలో అత్యంత ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులు పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా పాటుపడాలని సూచించారు. వీరి సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు మహేష్, సుశీల్సింగ్, నర్సయ్య, సీఐ, ఆర్ఐలు రాజిరెడ్డి, సురేష్, కామరాజు, సాంబశివరావు, నాగుల్మీరా, హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్దత్ -
‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ రెండో దశకు రెడీ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం పెంచేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమం రెండో దశ అమలుకు సిద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉద్యోగులతో శనివారం సమావేశమైన కలెక్టర్ ఈసీఆర్ మొదటి దశను విజయవంతంగా అమలు చేయడంపై అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, విద్యార్థుల ప్రగతి ఆధారంగా రెండో దశ కోసం స్టడీ మెటీరియల్ సిద్ధం చేశామని తెలిపారు. వెనకబడిన విద్యార్థులకు బేసిక్స్ మరింత సులువుగా నేర్పించేలా ఒక మెటీరియల్, ప్రగతి సాధించిన విద్యార్థులకు వైవిధ్యమైన పదాలు నేర్పించేలా ఇంకొకటి రూపొందించామని చెప్పారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ ప్రారంభించిన మొదటి వారంలో 11శాతం విద్యార్థులే వాక్యాలు చదివారని, గత బుధవారం ఆ సంఖ్య 36శాతానికి చేరిందన్నారు. రెండో దశలో భాగంగా పదాలు చదివే సామర్థ్యం ఉన్న పిల్లలతో వాక్యాలు, అక్షరాలు చదివే పిల్లలతో పదాలు చదివించేలా తర్పీదునివ్వాలని సూచించారు. బట్టీ విధానంలో కాకుండా ప్రతీ పదం శబ్దం ఎందుకు వస్తుందో వివరిస్తూ నేర్పించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
ఉన్నత శిఖరాలు అధిరోహించండి
ఖమ్మంసహకారనగర్: బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆకాశమే హద్దుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ సూచించారు. ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరడం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్రాస్, పైప్ బ్యాండ్ పోటీల్లో బాలికల విభాగం నుంచి వైరాలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ విద్యార్థులు ప్రథమస్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను డీఈఓ అభినందించారు. అంతేకాక ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగే సౌత్ జోన్ పోటీల్లోనూ సత్తా చాటాలని డీఈఓతో పాటు సెక్టోరియల్ అధికారుల బృందం పెసర ప్రభాకర్రెడ్డి, రామకృష్ణ, రూబీ, ప్రవీణ్కుమార్ ఆకాంక్షించారు. -
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుసామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అంతేకాక పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీసేవ చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. విత్తన మక్కల సాగుకు అగ్రిమెంట్ తప్పనిసరి కొణిజర్ల: విత్తన మొక్కజొన్న సాగు చేయించే కంపెనీల ప్రతినిధులు రైతులకు తప్పనిసరిగా అగ్రిమెంట్ ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని తనికెళ్ల రైతు వేదికలో మొక్కజొన్న కంపెనీల ఏజెంట్లతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈనెల 10వ తేదీ దాటాక ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు వేయించొద్దని తెలిపారు. కంపెనీ ప్రతినిధులు వారానికో సారి పంటను పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వాలే తప్ప గత ఏడాది మాదిరి ఇబ్బంది చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, పంట కోసి లోడింగ్ చేసిన పది రోజుల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయించాలని సూచించారు. అనంతరం గ్రామంలో సాగవుతున్న సీడ్ మొక్కజొన్నను డీఏఓ పరిశీలించారు. వైరా ఏడీఏ కరుణశ్రీ, ఏఓ బాలాజీ, ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓలు, ఏజెంట్లు పాల్గొన్నారు. ‘నవోదయ’లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం కూసుమంచి: మండలంలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయలో 2000–2007 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి వివిధ హోదాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. చదువుకున్నప్పటి స్మృతులను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. ఈకార్యక్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ప్రారంభించి మాట్లాడుతూ విద్యాలయకు పూర్వ విద్యార్థులు వెన్నుముక లాంటివారని తెలిపారు. ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడటం గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గద్దర్తో బాలసుబ్రహ్మణ్యంకు పోటీ అనవసరం సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలఇల్లెందు: పీడిత ప్రజల కోసం తుది వరకు పోరాడిన గద్దర్ ఆశయ సాధనకు తాను నడుం బిగించానని ఆయన కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల తెలిపారు. ఇల్లెందులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు సందర్భంగా గద్దర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోందని చెప్పారు. కానీ గద్దర్–బాలసుబ్రహ్మణ్యం మధ్య పోటీ అనవసరమని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలోని 524 మంది సభ్యులకు గతంలో ఆరు నెలలకోసారి వేతనాలు అందేవని.. తాను బాధ్యతలు తీసుకున్నాక సమస్య తీర్చానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అభివృద్ధి ఫలాలు పొందుతున్న ప్రజలు గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని వెన్నెల కోరారు. నాయకులు గోచికొండ శ్రీదేవి, మడుగు సాంబమూర్తి, గోచికొండ సత్యనారాయణ పాల్గొన్నారు. -
‘తెలంగాణ విజన్’ వేదికపై కేఎంసీ!
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఖమ్మం నగర పాలకసంస్థలో మాత్రమే విజయవంతంగా అమలవుతున్న పథకాలు, పనులను తెలంగాణ విజన్–2047 వేదికపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య వివరించారు. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ‘తెలంగాణ విజన్ 2047– జర్నీ ఫార్వర్డ్’ పేరిట సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ ఖమ్మంలో 24 గంటల తాగునీటి సరఫరా, బయోమైనింగ్ అంశాలను వెల్లడించారు. బయోమైనింగ్ ద్వారా డంపింగ్యార్డ్లో ఎనిమిదెకరాల స్థలాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటడం, మరో 12 ఎకరాల స్థలంలో వ్యర్థాలను శుభ్రం చేయించినట్లు తెలిపారు. అంతేకాక 24 గంటల తాగునీటి సరఫరా కోసం రోటరీనగర్లో పైలట్గా అమలుచేయనున్న అంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ కూడా పాల్గొన్నారు.తాగునీటి సరఫరా, బయోమైనింగ్ వివరాలు వెల్లడించిన కమిషనర్ అభిషేక్ -
మరో 13 స్కూళ్లలో ఏఐ బోధన
నేలకొండపల్లి: రెండో విడతగా జిల్లాలోని మరో 13 పాఠశాలలో ఏఐ ఆధారిత బోధనకు ప్రతిపాదించినట్లు విద్యాశాఖ ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి తెలిపారు. మండలంలోని ముజ్జుగూడెం, సింగారెడ్డిపాలెం, నేలకొండపల్లి ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన ఏఐ బోధనను పరిశీలించారు. కాగా, ముజ్జుగూడెం పాఠశాలలో ఇద్దరికి గాను ఒకే ఉపాధ్యాయుడు ఉండడం, ఇంకొకరు అనుమతి, సమాచారం లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు. సమయపాలన పాటించకోవడం, 40 శాతం పనిదినాలు సెలవులో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన డీఈఓకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఎంఈఓ బి.చలపతిరావు, పాఠశాల హెచ్ఎంలు పాల్గొన్నారు. నేలను రక్షించుకుంటేనే మనుగడవైరా: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి నేల కలుషితం కాకుండా కాపాడాల్సిన అవసరముందని అధికారులు సూచించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రపంచ మృతికా దినోత్సవాన్ని నిర్వహించగా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.సుచరితాదేవి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆరోగ్యవంతమైన భూములు అవసరమని తెలిపారు. ఈమేరకు కలుషితమైన నేలను రక్షించుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, ఆత్మ పీడీ బి.సరిత, వైరా ఏడీఏ కరుణశ్రీ, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏఓ డి.బాలప్రకాశ్ మాట్లాడగా కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ టి.పావని, డాక్టర్ వి.చైతన్య, ఫణిశ్రీ, ఏఓలు రామారావు, మంజుఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రమే కాక వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించడంతో పాటు కోవిడ్ సమయాన రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈమేరకు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బిహార్, ఢిల్లీ, రాజస్థాన్ వైపు వెళ్లే ప్రయాణికులకు సౌలభ్యం కోసం గయా మా స్, స్వర్ణ జయంతి, జైపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఖమ్మంలో నిలపాలని, శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కేరళ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ కల్పించాలని కోరారు. అంతేకాక కోవిడ్ సమయాన రద్దయిన కాజీపేట–విజయవాడ, డోర్నకల్– భద్రాచలం, కాజీపేట–మణుగూరు, కొల్లాపూ ర్ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించి కాకతీయ రైలుకు తడికలపూడి, చీమలపాడు, బేతంపూడి స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని, భద్రాచలం రోడ్ నుంచి సికింద్రాబాద్కు ఉదయం మరో రైలును మంజూరు చేయాలని ఎంపీ కోరారు. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కు ఏన్కూరు ఉపాధ్యాయిని ఏన్కూరు: ఈనెల 6నుంచి 9వ తేదీ వరకు హరియాణా రాష్ట్రం ఛంఢీఘర్లోని పంజాబ్ యూనివర్సిటీలో జరగనున్న ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కు మండలంలోని బురదరాఘవాపురం ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పాగి సుజాత ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 200 మంది ఉపాద్యాయులను ఎంపిక చేయగా అందులో జిల్లా నుంచి సుజాతకు స్థానం దక్కింది. ‘వికసిత్ భారత్–2047లో భారతదేశంలో సాంకేతిక అభివృద్ధి ఎలా ఉండబోతోంది’ అన్న అంఽశంపై అందిన ప్రదర్శనల నుంచి అత్యుత్తమైనవి ఎంపిక చేసి సదరు ఉపాధ్యాయులను ప్రతినిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజాతను హెచ్ఎం పి.నాగిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. రవాణా శాఖలో ఆన్లైన్ సేవలకు అంతరాయం ● ఇబ్బందులకు గురైన వాహనదారులు ఖమ్మంక్రైం: జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖా కార్యాలయాల్లో శుక్రవారం సర్వర్ డౌన్ కావడంతో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాహనదారులు గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. ఖమ్మంతో పాటు వైరా, సత్తుపల్లి కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఎదురుకాగా.. సాంకేతిక సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లోనూ సేవలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఆన్లైన్ సేవలు మొదలైనా అప్పటికే చాలామంది వెనుదిరిగారు. దీంతో వీరికి శనివారం సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం ఏన్కూరు: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి సూచించారు. ఏన్కూరు మండలం మూల పోచారంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం తనిఖీ చేసిన ఆమె మెనూ అమలు, పాఠశాల పరిసరాలు, స్టోర్ రూమ్, డార్మెటరీలను పరిశీలించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ చొరవతో పంపిణీ చేసిన ఉద్దీపకం పుస్తకాల ద్వారా బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం డీడీ మాట్లాడుతూ ప్రతీ ఉపాద్యాయుడు కొందరు చొప్పున పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకుని 100 శాతం ఫలితాలు సాధించేలా బోధించాలని తెలిపారు. హెచ్ఎం జి.నాగరాజు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు బి.రవి, డీఎస్.నాగేశ్వరరావు, బి.శోభన్, రవి, శ్యామల, రమేష్ , సుశ్మిత, ఉషశ్రీ, హర్యానాయక్, రాంబాబు, నరసింహారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
● పోలీసు శాఖలో కీలకంగా హోంగార్డు ఆఫీసర్లు ● నేడు హోంగార్డుల రైజింగ్ డే
చేదోడు వాదోడుగా.. ఖమ్మంక్రైం: పోలీస్శాఖలో ఉద్యోగులకు చేదో డు వాదోడుగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డు ఆఫీసర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నేడు(శనివారం) హోంగార్డుల రైజింగ్ డే జరుపుకోనుండగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. 1950నుంచి అమల్లోకి.. సైన్యం యుద్ధం చేసే సమయాన స్థానికంగా ప్రజలు, గృహాల రక్షణ కోసం స్వచ్ఛందంగా హోంగార్డులు సేవలందించేవారు. ఈమేరకు 1950లో హోంగార్డు పదం వాడుకలోకి వ చ్చింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఈ వ్యవస్థను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలా 1963లో పోలీసులకు సహాయకులుగా హోంగార్డు వ్యవస్థ మొదలుకాగా ప్రస్తుతం 62 ఏళ్లు నిండాయి. జిల్లాలో హోంగార్డులుగా విధులు నిర్వర్తిస్తున్న 595మందిలో 66మంది మహిళలు ఉన్నారు. ఉద్యోగ భద్రత కోసం.... పోలీసుల మాదిరి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏళ్లుగా హోంగార్డులు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. తమను మినీ పోలీసులుగా గుర్తించి, పోలీస్ సిబ్బంది మాదిరి అలవెన్స్ వర్తింపచేయాలని విన్నవిస్తున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు సరైన చికి త్స వారికి చేయించలేకపోతున్న తమ కుటుంబాలకు ఆరోగ్యభద్రత కల్పించాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలన్న తమ వినతులపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. -
ఆరో తరగతిలో పంచాయతీ
టేకులపల్లి/కరకగూడెం: విద్యార్థి దశ నుంచే గ్రామపంచాయతీ పాలనపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పంచాయతీ పాలన, విధులు, విధానాలు, బాధ్యతలను వివరిస్తూ పాఠ్యాంశంగా పొందుపర్చింది. ఆరో తరగతి సాంఘికశాస్త్రం పార్ట్–2 పాఠ్యపుస్తకంలో 13వ పాఠ్యాంశంగా ‘గ్రామ పంచాయతీలు’ శీర్షికతో ఏడు పేజీల్లో ఈ పాఠాన్ని ముద్రించారు. గ్రామస్తులకు సౌకర్యాల కల్పన, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం, గ్రామసభ, ఓటర్ల జాబితా, వార్డులు, రిజర్వేషన్లు, ఎన్నికలు, నిధులు, మండల పరిషత్, జిల్లా పరిషత్ తదితర వివరాలను ఇందులోపొందుపర్చారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యాన సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ పాఠాన్ని చదివితే గ్రామపంచాయతీలపై పూర్తి అవగాహన కలుగుతుందని పలువురు చెబుతున్నారు.రఘునాథపాలెం: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రఘునాథపాలెం మండలంలో చేసిన అభివృద్ధి పనులే ఈసారి సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో శుక్రవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో గత పదేళ్లలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, పల్లెల్లో రహదారులు సహా అనేక పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని తెలిపారు. కానీ గత రెండేళ్లుగా కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి నిలిచిపోగా యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలుకాలేదని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలను అరకొరగా అమలుచేస్తుండడమేకాక ఏకగ్రీవాల పేరిట కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈమేరకు చిమ్మపూడి, పాపటపల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చిమ్మపూడికి చెందిన సూరంశెట్టి కుటుంబీకులు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరగా పువ్వాడ వారిని ఆహ్వానించారు. అనంతరం పువ్వాడ చింతగుర్తి, గణేశ్వరం, వీవీ.పాలెం తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, అజ్మీరా వీరూనాయక్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, గుత్తా రవి, కొండపర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఖమ్మంక్రైం/చింతకాని/కూసుమంచి: గ్రామపంచాయితీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ సందర్భంగా బెల్ట్ షాపులను పూర్తిగా కట్టడి చేస్తున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాధపాలెం, చింతకాని, వీఎం బంజర, ముదిగొండ, ఖమ్మం రూరల్, సత్తుపల్లి తిరుమలాయపాలెం, వేంసూరు తదితర మండలాల్లో గత నాలుగు రోజుల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.4లక్షల విలువైన 600లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. కాగా, చింతకాని మండలం నాగులవంచ సమీపాన శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో చిన్నమండవకు చెందిన పర్సగాని నాగేశ్వరరావు తీసుకెళ్తున్న మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. అలాగే, కూసుమంచి మండలంలోని వివిధ ప్రాంతాల మీదుగా మద్యం తరలిస్తున్న కాసాని ఎల్లయ్య, కోట్ల వెంకటేశ్వర్లు, భూక్యా పవన్కుమార్ నుంచి రూ.55,197 విలువైన మద్యంతోపాటు వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.పల్లెపాలనపై అవగాహన కల్పించేలా పాఠం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ -
పోలింగ్ సిబ్బంది కేటాయింపు
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో విధుల నిర్వహణకు సిబ్బంది కేటాయింపుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ర్యాండమైజేషన్ నిర్వహించగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధామరావు మాట్లాడుతూ ర్యాండమైజేషన్ ఆధారంగా మండలాలకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఒక్కో పీఓ, ఓపీఓ, 201 – 400 ఓటర్లు ఉంటే ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 401 – 650మంది ఓటర్లుకు ఒక పీఓ, ముగ్గురు ఓపీఓలను కేటాయింపు పూర్తయిందని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి 20 శాతం సిబ్బందిని రిజర్వ్లో ఉంచామని వెల్లడించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మొదటి విడతగా 192 జీపీల్లోని 1,740 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా, రిజర్వ్ సిబ్బంది సహా 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఓపీఓలను ఎంపిక చేశామని తెలిపారు. డీపీఓ ఆశాలత, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, డీఈఓ చైతన్యజైనీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు రఘునాథపాలెం: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు ఆదేశించారు. రఘునాథపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయం, పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించిన ఆయన కేంద్రాల్లో ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నిర్వహణపై సూచనలు చేశారు. తహసీల్దార్ శ్వేత, ఆర్ఐ వాహిద్, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు సుధామరావు -
●50ఏళ్ల చరిత్రలో తొలిసారి..
తల్లాడ మండలం బిల్లుపాడులో ఒకప్పుడు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా కక్షలు ఉండడంతో ఏ ఎన్నిక వచ్చినా రెండు పార్టీల వారు ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. ఈసారి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అంతా ఏకమై సర్పంచ్తో పాటు పది వార్డుస్థానాలకు ఒక్కొక్కరితోనే నామినేషన్ వేయించడం విశేషం. గ్రామంలో కొన్నేళ్ల క్రితం రెండు హత్యలతో పాటుపలుమార్లు ఘర్షణలు జరిగాయి. వీటికి స్వస్తి పలికేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు చర్చించుకుని కాంగ్రెస్ ప్రతిపాదించిన ఎనిక కృష్ణవేణితో సర్పంచ్గా నామినేషన్ వేయించడంతో పాటు పది వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఐదు తీసుకుని ఉపసర్పంచ్ పదవి బీఆర్ఎస్కు కేటాయించేలా ఒప్పందం కుదర్చుకున్నారు. దీంతో 50ఏళ్ల గ్రామచరిత్రలో ఈసారి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం కానుంది. -
బాబ్బాబూ.. తప్పక రండి !
● ఇతరచోట్ల ఉన్న ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు ● రవాణా, ఇతర ఖర్చులు భరిస్తామని హామీసాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ఈనెల 11న జరగనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే యత్నాల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో ఓటరుగా నమోదై ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని రప్పించేలా హామీలు స్తున్నారు. ‘మీ ప్రయాణ ఖర్చులు భర్తిస్తాం.. తప్పక వచ్చి ఓటేయండి’ అంటూ ఫోన్లలో అభ్యర్థిస్తున్నారు. ఓటరు జాబితా ఆధారంగా గ్రామం బయట ఎందరు ఉన్నారో ఆరా తీస్తూ స్వయంగా అభ్యర్థులు ఫోన్ చేయడమే కాక తెలిసిన వారితోనూ ఫోన్ చేయిస్తున్నారు. ప్రచారంపై దృష్టి మొదటి విడత ఎన్నికల్లో ఉపసంహరణ గడువు ముగియగా అభ్యర్థులెవరెవరో తేలడంతో ప్రచారంపై దృష్టి సారించారు. గుర్తుల ఆధారంగా పోస్టర్లు, స్టిక్కర్లు ముద్రించి ఇంటింటా ఓటర్లను కలుస్తున్నారు. ఇళ్లకు వెళ్లి వారితో అనుబంధాన్ని గుర్తు చేస్తూ కుటుంబమంతా తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఓటరు లిస్ట్ ఆధారంగా.. జిల్లాలోని కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 173 గ్రామపంచాయతీల్లో తొలివిడతగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఓటర్ల జాబితా ఆధారంగా ఆయా కుటుంబాలను సంప్రదిస్తున్నారు. మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యాన తమ తల్లి, సోదరి, సతీమణులను కూడా ప్రచారంలో వెంట తీసుకెళ్తున్నారు. గ్రామంలో లేని వారు.. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు ఒక్క ఓటు కూడా తప్పిపోవద్దనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో ఓటరుగా నమోదై వృత్తి, వ్యాపారాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని గుర్తించి ఫోన్ చేస్తూ పోలింగ్ రోజు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎంత దూరంలో ఉన్నప్పటికీ రావాలని, ప్రయాణ ఖర్చులు సహా ఇతరత్రా భరిస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి.. గ్రామస్థాయిలో పట్టు నిరూపించుకునేందుకు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అభ్యర్థులు అన్ని రకాల వ్యూహాలు అమలుచేస్తున్నారు. పోలింగ్ రోజున ఓటర్లందరినీ కేంద్రాలకు రప్పించేలా అనుచరులు, పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. గ్రామంలో పెద్ద కుటుంబాలేవి.. ఆ కుటుంబంలో ఎందరు సభ్యులు, వారు ఎవరికి ఓటు వేసే అవకాశముందో ఆరా తీస్తున్నారు. తమకే అనుకూలమని భావిస్తే పలుమార్లు కలుస్తున్నారు. -
నారాయణపురం.. అందరి ఆమోదం
● మంత్రి పొంగులేటి స్వగ్రామం సర్పంచ్గా వెంకటేశ్వర్లు ● మంత్రి సోదరుడి సమన్వయంతో ఏకాభిప్రాయంకల్లూరు రూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. ఈ స్థానం ఎస్సీ జనరల్ రిజర్వ్ కాగా, గ్రామాభివృద్ధే ధ్యేయంగా గ్రామ పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ మద్దతు తెలిపిన గొల్లమందల వెంకటేశ్వర్లు పేరును ప్రతిపాదించారు. దీంతో చివరి రోజైన శుక్రవారం ఆయన మాత్రమే నామినేషన్ సమర్పించడంతో ఏకగ్రీవమైనట్లయింది. మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్రెడ్డి చొరవ తీసుకుని గ్రామంలోని అన్నివర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అభిప్రాయ బేధాలను సర్దుబాటు చేయడంతో సర్పంచ్ సహా పది వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికై న వెంకటేశ్వర్లుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించగా.. ప్రసాద్రెడ్డి సన్మానించారు. నారా యణపురం అభివృద్ధికి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నారాయణపురంలో ప్రభుత్వ ఆస్పత్రి, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంతో పాటు స్థానిక చెరువును టూరిజం శాఖ ద్వారా అభివృద్ద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. -
దుప్పుల వేట.. పెళ్లిలో విందు
● మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు లొంగుబాటు ● ఆయనతో పాటు ఇంకొకరి రిమాండ్సత్తుపల్లి: సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో దుప్పులు వేట కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెచ్చా రఘు శుక్రవారం సత్తుపల్లి ఎఫ్డీఓ వాడపల్లి మంజుల సమక్షాన లొంగిపోయాడు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సోదరుడి కుమారుడైన ఆయనతో పాటు దమ్మపేట మండలం గొర్రెగుట్టకు చెందిన చెందిన కుంజా భరత్ కూడా లొంగిపోగా అధికారులు విచారణ చేపట్టారు. సత్తుపల్లిలో దుప్పుల వేటపై సాక్షి’లో గతనెల 29నుంచి ‘తూటా దూసుకెళ్తోంది.., అటు నగదు.. ఇటు వేట, ఇంటి దొంగల్లో’ టెన్షన్..’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టి అర్బన్పార్క్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పంతంగి గోపికృష్ణ, శొంఠి శ్రీరాంప్రసాద్ను కొద్దిరోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రఘు, భరత్ లొంగిపోగా విచారణ అనంతరం వారిద్దరిని సాయంత్రం కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. అయితే, వేటలో కీలకంగా రఘు వ్యవహరించినట్లు తెలుస్తుండగా కేసులో ఆయను ఏ2గా నమోదు చేసి గోపీకృష్ణ, శ్రీరాంప్రసాద్, భరత్ పేర్లను ఏ1, ఏ3, ఏ4గా చేర్చడం గమనార్హం. దుప్పి మాంసంతో విందు దుప్పుల వేటలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంకు చెందిన మెచ్చా రఘు వివాహ వేడుక ఇటీవల సత్తుపల్లిలో జరిగింది. సత్తుపల్లి అర్బన్పార్కు దుప్పులను వేటాడి ఈ విందులో వడ్డించారని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమాన ఆయన లొంగిపోగా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేటాడారు, అటవీశాఖ సిబ్బంది ఎవరైనా సహకరించారా, వేటలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు రాబట్టేందుకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అంతేకాక రఘు తుపాకీ ఎక్కడ కొన్నాడు.. అశ్వారావుపేట పోలీస్స్టేషన్లో లైసెన్స్ ఉన్న తుపాకీ సరెండర్ చేసినా ఇంకా ఆయన వద్ద తుపాకులు ఉన్నాయా అనే వివరాలు రాబట్టినట్లు సమాచారం. కాగా, సత్తుపల్లి అర్బన్ పార్కులోకి అక్టోబర్లో ఓ రోజు రాత్రి 11 గంటల సమయాన కొందరు వ్యక్తులు కారులో లోపలకు వెళ్లి ఐదు దుప్పులను వేటాడి తీసుకెళ్లినట్లు అధికారులు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించినట్లు సమాచారం తెలిసింది. ఆ రోజు ఆరు దుప్పులు వేటాడగా.. ఐదు దుప్పులే వీరికి దొరికాయని, ఒకటి గాయాలతో తప్పించుకుని మరుసటి రోజు జనావాసాల్లోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో అటవీశాఖ అధికారులు వైద్యం చేయించి పార్క్లో వదిలిపెట్టారు. ఈ అంశాలన్నింటినీ నిర్ధారించుకునేలా రఘు, భరత్ను విడివిడిగా విచారించాక రిమాండ్కు తరలించినట్లు సత్తుపల్లి ఎఫ్డీఓ మంజుల వెల్లడించారు. కాగా, అటవీ జంతువులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ స్పష్టం చేశారు. -
రియల్ అండ్ రీల్ హీరోస్..
● మాజీ ఎమ్మెల్యేను కలిసిన కన్నడస్టార్ శివరాజ్కుమార్ ● నేటి నుంచి ‘గుమ్మడి నర్సయ్య’ సినిమా షూటింగ్ కారేపల్లి/ఇల్లెందు: ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచినా అతి సాధారణ జీవనం గడుపుతున్న గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపుదిద్దుకోనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యాన నల్లా సురేష్రెడ్డి నిర్మాతగా కామారెడ్డికి చెందిన పరమేశ్వర్ హివ్రాలె దర్శకత్వంలో సినిమా చిత్రీకరించనున్నారు. సినిమా షూటింగ్ పాల్వంచలో శనివారం మొదలుకానుండగా.. గుమ్మడి నర్సయ్య పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్స్టార్ డాక్టర్ శివరాజ్కుమార్ శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడేనికి శివరాజ్కుమార్ – గీత దంపతులు వచ్చారు. ఆయనతో సమావేశమైన శివరాజ్కుమార్.. గుమ్మడి జీవనశైలి, ఎన్నికల వేళ అవలంబించిన విధానాలు, ప్రజల్లో అభిమానం తదితర వివరాలు తెలుసుకున్నారు. సినిమా దర్శకుడు పరమేశ్వర హివ్రాలెతో పాటు, మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శిపోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
సైనిక అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం
ఖమ్మం రాపర్తినగర్: దేశ ప్రజలంతా నిశ్చింతంగా ఉండడానికి సైనికుల త్యాగాలే కారణమని, అలాంటి సైనికుల్లో అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవడం అందరూ బాధ్యతగా భావించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం సేకరించే సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి శుక్రవారం కలెక్టర్ విరాళం అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించే సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా ప్రజలు సహకరించాలని సూచించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం నిధి అమరవీరుల కుటుంబాలు, గాయపడిన జవాన్లు, రిటైర్డ్ సైనికుల సంక్షేమానికి వినియోగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.చంద్రశేఖర్, ఈసీహెచ్ఎస్ ఓఐసీ వింగ్ కమాండర్ సురేంద్రతో పాటు ఎస్.అనూష, కళావాసు, వీరబాబు, సాయికుమార్, సుభానీ, కృష్ణమూర్తి, గోపాలరావు, ఎస్.ఎం.అరుణ్, హన్మంతరావు, అనిల్కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
మస్త్గా బందోబస్తు
సాక్షిప్రతినిఽధి, ఖమ్మం: ‘జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సూచనలు చేశాం. రెండు వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననుండగా సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో అదనంగా బందోబస్తు ఉంటుంది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి.’ అని పోలీస్ కమిషనర్ సునీల్దత్ కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’కి శుక్రవారం సీపీ ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..ముందస్తుగా అవగాహన కల్పించి.. ఎన్నికల విధులకు సంబంధించి ఉన్నతస్థాయి మొదలు కిందిస్థాయి పోలీస్ సిబ్బంది వరకు అవగాహన కల్పించాం. విధులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై వివరించాం. ఎన్నికలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని చెప్పాం. డబ్బు, మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు తనిఖీలు చేపడుతున్నాం. స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, రూట్ మొబైల్ పార్టీలు విధుల్లో నిమగ్నమయ్యాయి. ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే మా ముందున్న లక్ష్యం. 184 క్రిటికల్ పోలింగ్ ప్రాంతాలు జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతలో ఏడు, రెండో విడతలో ఆరు, మూడో విడతలో ఏడు మండలాలకు గాను 184 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలను గుర్తించాం. విడతల వారీగా 57, 77, 50 కేంద్రాలు ఉండగా గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా వీటిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటుచేస్తాం. అలాగే, మూడు విడతల్లో కలిపి 70 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొదటి విడతలో 17, రెండో విడతలో 35, మూడో విడతలో 18 ఉన్నట్లు గుర్తించి ఇప్పటినుంచే ప్రత్యేక దృష్టి సారించాం. నిరంతరం నిఘా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఐదు ఎఫ్ఎస్టీ బృందాలు, 15 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిఘా కొనసాగుతోంది. డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా తనిఖీలు చేపడుతున్నాం. ఇప్పటివరకు 753 లీటర్ల మద్యం సీజ్చేసి బాధ్యులపై కేసులు నమోదు చేశాం. జిల్లాలోని బోనకల్, ఏన్కూరు, కల్లూరు, కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, మధిర, ముదిగొండ, నేలకొండపల్లి, పెనుబల్లి, సత్తుపల్లి, కారేపల్లి, తిరుమలాయపాలెం, వైరా, ఎర్రుపాలెం మండలాల్లో ఏర్పాటైన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా బైండోవర్లు చేస్తున్నాం. సమస్యలు సృష్టించే వారు, రౌడీషీటర్లు 4వేల మందిని గుర్తించి అల్లర్లకు కారణం కాబోమని సొంత పూచీకత్తు తీసుకున్నాం. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది విధుల్లో ఉంటారు. అలాగే వేయి మంది ఓటర్లు ఉన్న కేంద్రాల్లో ఇద్దరు, అంతకు మించి ఉంటే ముగ్గురు చొప్పున సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పరిశీలించి క్యూ లైన్ల ఏర్పాటు, పార్కింగ్ వసతులపై సూచనలు ఇచ్చాం.‘సాక్షి’తో పోలీసు కమిషనర్ సునీల్దత్గ్రామాల వారీగా ఏర్పాటైన వాట్సాప్ గ్రూపుల్లో ఎస్హెచ్ఓలు కూడా ఉన్నారు. గ్రామస్తులెవరైనా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, అల్లర్లు సృష్టించే పోస్టులు పెడితే వారిపై సిబ్బంది చర్యలు తీసుకుంటారు. ఎన్నికల నేపథ్యాన 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుంది. మొదటి విడతకు సంబంధించి ఈనెల 9న సాయంత్రం 5గంటల నుంచి ఈనెల 11న ఫలితాలు ప్రకటించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ఓటర్లకు భద్రతరీత్యా సమస్యలు ఎదురైనా 100కు సమాచారం ఇవ్వాలి. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా సిబ్బందికి ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి. -
● వేడుకల ఏర్పాట్లకు నిధుల కేటాయింపు ● భద్రాచలం దేవస్థానంలో సాగుతున్న పనులు ● ఈనెల 20 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సుమారు రూ. 1.5 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే టెండర్లు ఖరారుకాగా, కొన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయి. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాచలంలో ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలను, పనులను పర్యవేక్షించారు. సత్వరమే పనులను పూర్తి చేయాలని, సామాన్య భక్తులకు ఉచిత వసతి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉంచాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. నిధుల కేటాయింపు ఇలా.. వైకుంఠద్వారం, నిత్యకల్యాణ మండపాలకు పంచరంగులకు రూ.9.20 లక్షలు వెచ్చించనున్నారు. ప్రధాన ఆలయంలో పెయింటింగ్కు సుమారు రూ.8.5 లక్షలు, పర్ణశాల వద్ద కల్యాణ మండపం, గోదావరి ఘాట్ల వద్ద తాత్కాలిక వసతికి రూ.6.35 లక్షలు ఖర్చు చేయనున్నారు. గోదావరి తీరంలో బాణసంచాలకు రూ.6 లక్షలు, భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, కార్పెట్లు, ఉచిత వసతి కోసం రూ.5.5 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లు, వ్యాన్లకు రూ.3.63 లక్షలు, ఆర్చ్గేట్లకు రూ.2 లక్షలు, వాల్పోస్టర్లు, సెక్టార్ టికెట్లు, ఆహ్వానాల ప్రింటింగ్కు రూ.2 లక్షలు కేటాయించారు. పూల అలంకరణకు రూ.7.70 లక్షలు, తెప్పోత్సవంలో హంసవాహనం అలంకరణకు రూ.4 లక్షలు, గోదావరిలో ర్యాంప్ అద్దెకు రూ.5 లక్షలు, సౌండ్ సిస్టంకు రూ.90 వేలు, ఫ్లెక్సీలకు, ప్రింటింగ్ ఖర్చులకు సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేయనున్నారు. టెండర్ ఖరారు కాకుండా, కోడ్ వేళ విధుల్లోకి..? దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఇప్పటికే ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఇటీవల మరో ఐదుగురి నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దేవస్థానం టెండర్లు ఆహ్వానించినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖరారు చేయలేదు. అయితే టెండర్ ఖరారు కాకుండానే ఓ మహిళ బుధవారం విధుల్లో చేర్చుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో సదరు ఉద్యోగిని అప్పటి ఈఓ విధుల నుంచి తొలగించారు. ఆమెనే మళ్లీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, విధుల్లోకి తీసుకోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రూ. కోటి తాత్కాలిక పనులకే.. ముక్కోటి సందర్భంగా భద్రాచలంలో చేపట్టే తాత్కాలిక పనులకు సుమారుగా కోటి రూపాయలు వెచ్చించనున్నారు. మరో రూ. 50 లక్షలు ఇతర పనులకు ఖర్చు చేయనున్నారు. ఇందులో అత్యధిక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆలయం, కల్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో రంగులు వేసే పనులు చివరి దశకు చేరుకోగా, చలువ పందిళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. హంసవాహనం విడి భాగాలను బయటకు తీస్తున్నారు. కాగా గతంలో సెక్టార్ల టికెట్ల విరక్రయాలు ముందస్తుగానే చేపట్టినా ఈ ఏడాది ఇంతవరకు దీనిపై నిర్ణయం వెలువడలేదు.ముక్కోటికి రూ.కోటిన్నర -
అండర్–17 జాతీయ టీటీ టోర్నీకి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జాతీయస్థాయి పాఠశాలల అండర్–17 టేబుల్ టెన్నిస్ పోటీలకు ఖమ్మంకు చెందిన పరిటాల జ్వాలిత్, గద్దల సిరి ఎంపికయ్యారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీలో ప్రతిభ కనబర్చిన వీరిని 25నుంచి చైన్నైలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బా లసాని విజయ్కుమార్, వీవీఎస్.మూర్తి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావు, సలహాదారుడు సైదులు అభినందించారు.ఇద్దరికి ‘రైతురత్న’ అవార్డులు కొణిజర్ల: మండలంలోని పల్లిపాడు, మల్లుపల్లికి చెందిన ఇద్దరు రైతులకు ‘రైతురత్న’ అవార్డులు లభించాయి. ఇటీవల హైదరాబాద్ శాంతివనంలో జరిగిన మహా కిసాన్ మేళాలో సేంద్రియ వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం చేసే రైతులకు పురస్కారాలు అందజేశారు. ఈమేరకు పల్లిపాడుకు చెందిన జాలాది రమేష్, మల్లుపల్లికి చెందిన మేడా కృష్ణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఏపీ సీఎం సతీమణి వాహనం తనిఖీ కూసుమంచి: జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్గూడెంలోని టోల్ప్లాజా చెక్పోస్ట్ వద్ద గురువారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్ నుండి ఏపీలోని జంగారెడ్డిగూడెంకు ఖమ్మం మీదుగా ఆమె వాహనంలో వెళ్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లో ఉందని చెప్పిన చెక్పోస్టు ఉద్యోగులు వాహనాన్ని తనిఖీ చేశాక పంపించారు. ఖమ్మం నుంచి శబరిమలైకు పాదయాత్ర ● బయలుదేరిన నలుగురు మాలధారులు ఖమ్మంక్రైం: అయ్యప్ప మాల ధరించిన నలుగురు భక్తులు శబరిమలలో స్వామి దర్శనానికి ఖమ్మం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. వణికిస్తున్న చలిలో వందల కి.మీ. మేర పాదయాత్రకు వీరు శ్రీకారం చుట్టారు. ఖమ్మం ఖానాపురానికి చెందిన గురుస్వామి హరి ఆధ్వర్యాన సతీష్, సిద్దూ, ఉమారావు మాల ధరించగా శబరిమలలో అయ్యప్ప దర్శనానికి పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కోదాడ హైవే మీదుగా బయలుదేరి గుంటూరు, ప్రకాశం, కడప మీదుగా తమిళనాడు ఆపై కేరళ చేరుకుంటామని తెలిపారు. ఇందులో హరి మాల ధరించడం ఇది 16వ సారి కాగా సుమారు 1,300 కి.మీ. మేర పాదయాత్రకు 50రోజుల సమయం పడుతుందని తెలిపారు. తమ వెంట వెంట ఓ వాహనం కూడా వస్తోంది. అందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని పేర్కొన్నారు. మార్గమధ్యలో ఆలయాల వద్ద వంట చేసుకుని, రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటూ యాత్ర సాగిస్తామని తెలిపారు. -
అంతా ఏకతాటిపై!
అమాత్యుల గ్రామాల్లో ఏకగ్రీవాలు ● డిప్యూటీ సీఎం భట్టి స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో ఖరారు ● మంత్రులు పొంగులేటి, తుమ్మల గ్రామాల్లోనూ అదేబాట●డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ మద్దతుదారుడు అభ్యర్థి నూతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఏడుగురు నామినేషన్లు వేసినా చివరి రోజునాటికి ఆరుగురు ఉపసంహరించుకున్నారు. దీంతో వెంకటేశ్వర్లుతో పాటు ఎనిమిది వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి.●కల్లూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీని ఏకగ్రీవం చేసేలా చర్చలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి స్వగ్రామమైన నారాయణపురంలో 1,385 మంది ఓటర్లు, పది వార్డులు ఉన్నాయి. మూడో విడతలో ఇక్కడ ఎన్నిక జరగనుండగా శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశముంది. ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయిన ఈ స్థానంలో మొదటి రెండు రోజులు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నండడంతో ఎవరూ నామినేషన్ వేయలేదని తెలిసింది. ఏకగ్రీవంపై నిర్ణయం జరిగాక చివరి రోజు సర్పంచ్, వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలు చేసేలా చర్చిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ పంచాయతీ ఏకగ్రీవం అయింది. అప్పుడు రెండున్నర ఏళ్లు ఒక పాలకవర్గం, మరో రెండున్నర ఏళ్లు ఇంకో పాలకవర్గం పాలన సాగించింది. -
హైవేలకు నిధులు విడుదల చేయండి
● కేంద్ర మంత్రికి ఎంపీ రవిచంద్ర వినతి ఖమ్మంవైరారోడ్: రాష్ట్రంలో పెండింగ్ ఉన్న పలు జాతీయ రహదారులు పూర్తయ్యేలా నిధులు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈమేరకు గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్లోని ఆయన చాంబర్లో మంత్రిని కలిసి ఎంపీ పెండింగ్ ఉన్న హైవే పనులు, అవసరమైన నిధులతో చర్చించారు. నామినేషన్ కేంద్రాల్లో పరిశీలన కారేపల్లి/ఏన్కూరు: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కారేపల్లి, ఏన్కూరు మండలాల్లోని పలు కేంద్రాల్లో నామినేషన్ల స్వీరణను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ గురువారం పరిశీలించారు. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, నామినేషన్ల స్వీకరణపై అధికారులతో మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎంపీడీఓలు శ్రీనివాస్, భాగ్యశ్రీ, ఎంపీఓలు రవీంద్రప్రసాద్, జీవీఎస్.నారాయణ, ఏడీఏ కిరణ్ కార్యదర్శి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఏన్కూరు మండలంలోని పలు కేంద్రాలను కల్లూరు సబ్ కలెక్టర్ ఆజయ్యాదవ్ కూడా పరిశీలించారు. పాలియేటివ్ కేర్ సెంటర్లో తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్(ఉపశమన సంరక్షణ కేంద్రం)ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు గురువారం తనిఖీ చేశారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్తో కలిసి తనిఖీ చేసిన ఆయన ఇన్ పేషంట్లతో మాట్లాడి వైద్యసేవలు, ఉద్యోగుల ప్రవర్తనపై ఆరాతీశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యసేవలతో పాటు శారీరక ఉపశమనం, మానసిక ప్రశాంతత లభించేలా ఈ కేంద్రం ఉద్యోగులు సేవలందించాలని సూచించారు. ఆతర్వాత ఎన్సీడీ క్లినిక్, కీమోథెరపీ వార్డులను పరిశీలించి వైద్యసేవలపై సూచనలు చేశారు. అనంతరం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ను కూడా తనిఖీ చేసిన ఆయన నివేదికల్లో ఆలస్యం జరగకుండా పరీక్షలు నిర్వహించాలనితెలిపారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ఆధార్ ఆధారిత హాజరు నమోదు చేయాలని సూచించారు. ఎన్సీడీ జిల్లా కోఆర్డినేటర్లు సత్యనారాయణ, పులి మురళితో పాటు వైద్యులు రిషిత, అనూష, ఉద్యోగులు సుజాత, రత్నం, మన్మధరావు, మక్బూల్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
6, 7వ తేదీల్లో ‘క్రెడాయ్’ ఎక్స్పో
ఖమ్మంమయూరిసెంటర్: ఇంటి కొనుగోలుకు ఉన్న అవకాశాలు, ఆస్తి కొనుగోలుకు రుణాలు, ఇంటి నిర్మాణ సామగ్రి వివరాలన్నీ ఒకే వేదికపై తీసుకొచ్చేలా ఎక్స్పో(ఆస్తుల, వాణిజ్య ప్రదర్శన) నిర్వహిస్తున్నట్లు ఖమ్మం క్రెడాయ్ అధ్యక్షుడు బండి జయకిషోర్ తెలిపారు. ఎక్స్పో జరగనున్న ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో గురువారం మాట్లాడారు. ఈనెల 6, 7వ తేదీల్లో జరిగే ఎక్స్పోకు జిల్లాతో పాటు హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లోని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు హాజరవుతారని, బ్యాంకర్లు తాము అందించే రుణ సేవలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయదారులతో మాట్లాడొచ్చని చెప్పారు. ఈ సమావేశంలో క్రెడాయ్, ఎక్స్పో బాధ్యులు పెద్ది కేశవరావు, చెరుకుమల్లి వెంకటేశ్వరరావు, వేముల నగేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్కుమార్తో పాటు నంబూరి ప్రసాద్, దేవభక్తుని హేమంత్, తూళ్లురి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇమేజ్.. డ్యామేజ్ కావొద్దని..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో గుర్తులు కీలక భూమిక పోషించనున్నాయి. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాకపోవడం.. ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులను జనంలోకి తీసుకెళ్లేలా అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక గుర్తుల కేటాయింపు పూర్తయింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డుమెంబర్లకు 20 గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. వీటిని జనానికి వివరించేలా అభ్యర్థులు వాల్పోస్టర్లు, డోర్ స్టిక్కర్ల ద్వారా ప్రచార రంగంలోకి దిగారు. గ్రామంలో ఇమేజ్ ఉన్నా గుర్తులను ఓటర్లు తేల్చుకోలేకపోతే డ్యామేజ్ అవుతామన్న భయంతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అక్షర క్రమంలో గుర్తులు మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తికాగా అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ సమయాన అభ్యర్థులు ఇచ్చిన పత్రంలో రాసిన పేరులోని తెలుగు అక్షర క్రమం ఆధారంగా గుర్తుల కేటాయింపు పూర్తయింది. ప్రచారానికి సిద్ధం గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా పార్టీలు మాత్రం తమ శ్రేణులను బరిలోకి దింపాయి. ఫలితంగా పార్టీల గుర్తులు కాక కొత్తవి ఉండడంతో ఓటర్లలోకి తీసుకెళ్లడం అభ్యర్థులకు సవాల్గా మారింది. దీంతో అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో వాల్పోస్టర్లు, డోర్ స్టిక్కర్ల ముద్రణపై దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించిన అభ్యర్థులు తమ ఫొటో, గుర్తుతో కూడిన స్టిక్కర్లు, వాల్పోస్టర్లను ప్రతీ ఇంటి వద్ద అతికిస్తున్నారు. అలాగే, గుర్తులతో కూడిన చిన్న ఆకారాలను తయారుచేయించి ఓటర్లను కలిసి తమ గుర్తును చూపిస్తూ ఓటు వేయాలని పదేపదే చెబుతున్నారు. ఐదు రోజులే గడువు మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మరో ఐదు రోజుల సమయం ఉంది. ఈ సమయాన్ని వీలైనంతగా వినియోగించుకుని ప్రజల్లోకి తమ గుర్తును బలంగా తీసుకెళ్లే మార్గాలను అభ్యర్థులు అనుసరిస్తున్నారు. కొన్నిచోట్ల గుర్తుతో కూడిన ఆకారాలను తయారు చేసి పంపిణీ ఆలోచనలో ఉన్నారు. గ్రామంలో అభ్యర్థికి మంచి గుర్తింపు, పేరు ఉన్నా ఓటర్లకు గుర్తు తెలియకపోతే పరిస్థితి ఏమిటన్న బెంగ వారిని వేధిస్తోంది. ఇదిలా ఉండగా రెండు, మూడో విడతల ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు కూడా గుర్తులపై ఆలోచనలో పడ్డారు. ఓటర్లలోకి గుర్తును త్వరగా ఎలా తీసుకెళ్లాలని ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు.సర్పంచ్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మన్, మనిషి తెరచాపతో పడవ, బిస్కెట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలిబుడగ, క్రికెట్ స్టంప్ గుర్తులతో జాబితా విడుదల చేసింది. ఇక వార్డుసభ్యులకు గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలెండర్, బీరువా, ఈల, కుండ, డిష్యాంటెనా, గరాటా, మూకుడు, ఐస్క్రీమ్, గాజుగ్లాస్, పోస్టు డబ్బా, కవరు, హాకీ స్టిక్ బంతి, నెక్టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కెటిల్ గుర్తులు ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పత్రాన్ని గులాబీ రంగు పేపర్పై, వార్డు సభ్యులకు తెల్ల రంగు బ్యాలెట్ పేపర్పై ముద్రించారు. -
అటవీ భూముల ఆక్రమణను కట్టడి చేయాలి
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలోని అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం కాల్వల నిర్మాణానికి సేకరించే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా గిరిజన కార్పొరేటివ్ సొసైటీ వద్ద అందుబాటులో ఉన్న వంద ఎకరాల బదిలీకి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అయితే, ఈ భూమిని గుర్తించి 15 రోజులు గడిచినా పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేయర్ల ద్వారా సోమవారం నాటికి భూబదలాయింపు పూర్తి కావాలని ఆదేశించారు. పోడు పట్టా పొందిన కొందరు రైతులను మభ్యపెట్టి సమీపాన అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నందున రెవెన్యూ, అటవీ అధికారులు అప్రమత్తంగా ఉంటూ భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలని సూచించారు. అలాగే, పోడు భూముల పట్టా ఉన్నవారు అటవీ జంతువుల వేటకు పాల్పడినా, భూఆక్రమణకు యత్నించినా గతంలో జారీ చేసిన పట్టా రద్దు చేయాలని కలెక్టర్ తెలిపారు. సత్తుపల్లి అర్బన్ పార్క్ నుంచి జింకలు బయటకు రాకుండా ప్రహరీ ఎత్తు పెంచడంతో పాటు నీలాద్రి, వెలుగుమట్ల, పులిగుండాల అర్బన్ పార్క్లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, కోతుల కట్టడికి రోడ్డుపై ఆహార పదార్థాలు వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ గిరిజనులు సాగుచేసే భూములకు ప్రభుత్వం అందించిన పోడు పట్టాలు ఎట్టి పరిస్థితుల్లో విస్తరించడానికి వీలు లేదని తెలిపారు. ఎవరైనా సమీపంలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహనీయుల జీవితం ఆదర్శం ఖమ్మంసహకారనగర్: మహనీయుల జీవితాలు అందరికీ ప్రేరణగా, ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ అనుదీప్, , అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ నివాళులర్పించగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, ఏడీ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటు పనులు పరిశీలన కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. కలెక్టరేట్ కు మరింత ఆకర్షణ వచ్చేలా విగ్రహం ఏర్పాటు ఉండాలని సూచించారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
బెదిరించారా.... ప్రలోభాలకు గురి చేశారా?!
నేలకొండపల్లి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైన చోట ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరాతీస్తున్న నేపథ్యాన నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో సర్పంచ్, ఎనిమిది వార్డులు ఏకగ్రీవం కాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు గురువారం వివరాలు సేకరించారు. ఏకగ్రీవం కావడానికి ఇతర అభ్యర్థులు, ఓటర్లను బెదిరించారా లేక ప్రలోభాలకు గురిచేశారా... తదితర విషయాలను స్థానికులతో అడిగి తెలుసుకున్నారు. అలాగే, బోదులబండ, కోరట్లగూడెం, కొంగర, ఆజయ్తండా, కట్టుకాచారం, అనాసాగారం, సధాశివాపురంల్లో 27 వార్డుసభ్యులు ఏకగ్రీవం కావడంతో అక్కడ కూడా విచారణ చేపట్టారు. ఓటర్ల వివరాలు, అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. ఉద్యోగులు ఆలస్యం మధుసూదన్రావు, అల్లం రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు పాల్గొన్నారు.ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం ఆరా -
ఘర్షణలకు తావు ఇవ్వొద్దు
ఖమ్మంక్రైం: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా సాఫీగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ సూచించారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఘర్షణలు తలెత్తకుండా, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా విధులు నిర్వర్తిస్తూనే ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అంతేకాక గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను బైండోవర్ చేయాలని, బెల్ట్షాపులను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని తెలిపారు. ఇదేసమయాన సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ సూచించారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మహేష్, సీఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో సీపీ సునీల్దత్ -
పదవులు.. కాసుల కష్టాలు
వైరా: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలి, ఎలాగైనా గెలవాలనే ఆశతో పలువురు హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. కానీ నామినేషన్ ర్యాలీ మొదలు ప్రచారంలో రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను చూసి వారు బెంబేలెత్తిపోతున్నారు. కొద్దోగొప్పో డబ్బు ఉంటే చాలు.. తమకు ఉన్న పేరుతో సులువుగా గట్టెక్కవచ్చని భావించిన ఆ పరిస్థితి లేకపోవడంతో డబ్బులు ఎలా సమకూర్చుకోవాలా అన్న ప్రశ్న వారిని వేధిస్తోంది. మరోపక్క మాజీ సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులు రాక ఇంకా అవస్థలు పడుతున్న తీరు వీరిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాక బాకీలు చెల్లించలేని స్థితిలో ఉన్న మాజీ సర్పంచ్లను చూసి ఇప్పుడు అభ్యర్థులకు అప్పు కూడా పుట్టకపోవడం, రియల్ భూమ్ కూడా లేకపోవడం ఏం చేయాలో పాలుపోవడం లేదని పలువురు వాపోతున్నారు. అయినా బరిలోకి దిగినందున తప్పని పరిస్థితుల్లో ఇళ్లు, భూములు తాకట్టు పెట్టడం, లేదా ఆభరణాలు అమ్ముతూ డబ్బు సమకూర్చుకుంటున్నారు. ఖర్చు తడిసి మోపెడు.. సాధారణంగా ఎన్నికలంటే ఖర్చుతో ముడిపడి ఉంది. పార్లమెంట్ మొదలు పంచాయతీ ఎన్నికల వరకు ప్రచారంలో ప్రత్యర్థులకు ధీటుగా వ్యవహరించాలంటూ చేతి నిండా డబ్బు ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక వెనక తిరిగి కేడర్ను మెప్పించాలన్నా డబ్బే కీలకం. లేదంటే తమ అనుకున్న వారు కూడా ప్రచారానికి రాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ వచ్చినా ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం, రాత్రి భోజనమే కాక ‘ఇతరత్రా’సమకూర్చాల్సి వస్తోంది. రూ.లక్షల్లోనే... వేయి ఓట్ల లోపు ఉన్న గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు రూ.8 లక్షలు దాటే అవకాశముందని చెబుతున్నారు. రెండు వేల లోపు ఓటర్లు ఉంటే రూ. 20లక్షలు, అంతకు మించి ఓటర్లు ఉంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సర్పంచ్ అభ్యర్థి ఖర్చు చేయాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ నుంచి పోటీకి దిగిన వారిని తప్పించేందుకు ఎంతో కొంత సమర్పించక తప్పడం లేదని చెబుతున్నారు. ఇక ఏకగ్రీవమైన పంచాయతీలో పోటీ లేకుండా, ప్రచారం చేయకుండా ఖర్చుల బాధ తప్పుతుందని అందరూ అనుకుంటున్నా అక్కడా ఖర్చులు సరిపడా ఉంటున్నాయని తెలుస్తోంది. అందరితో నామినేషన్లు ఉపసంహరించేందుకు ఎంతో కొంత చెల్లించక తప్పడం లేదని.. ఆపై గ్రామ పెద్దలను సంతృప్తి పర్చడం, గ్రామంలో ఏదో అభివృద్ధి పనికి కావాల్సిన నగదు సమకూరుస్తామన్న హామీ ఇవ్వాల్సి ఉన్నందున ఖర్చు అందరితో సమానంగా అవుతోందని చెబుతున్నారు. మాజీ సర్పంచ్ల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వృథా ఖర్చులు లేకుండా పోటీ చేయాలని అభ్యర్థులకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సూచిస్తున్నారు. సర్పంచ్ పదవిపై మోజుతో బరిలోకి పలువురు.. గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్గా గెలిచా. అప్పుడు గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.20 లక్షలకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. పెండింగ్ బిల్లులు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. – సాదం రామారావు, రెబ్బవరం, మాజీ సర్పంచ్ ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయనే నమ్మకంతో సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేయించాను. కానీ రెండేళ్లు గడిచినా మంజూరు కాలేదు. దీంతో అప్పులకు తోడు వడ్డీ పెరుగుతోంది. – భట్టా పెద్ద భద్రయ్య, తాటిపూడి మాజీ సర్పంచ్ -
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్
ఖమ్మం సహకారనగర్: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హాజరయ్యారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ వార్డుసభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలకు వెంటనే నిర్వహించాలని సూచించారు. అలాగే, ఏకగ్రీవ సర్పంచ్ స్థానాల ఫలితాలు నిబంధనల ప్రకారం ప్రకటించాలని తెలిపారు. అంతేకాక పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ జారీ చేయాలని సూచించారు. మొదటి విడత పోలింగ్ సిబ్బంది ఈనెల 8న, రెండో విడతకు డిసెంబర్ 12వ తేదీన, మూడో విడతకు ఈనెల 15న పోస్టల్ బ్యాలెట్ దాఖలకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అంతేకాక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ పరిశీలకుల నియామకం చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈసమావేశంలో డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
ట్రాక్టర్లోని వరిగడ్డి దగ్ధం
ముదిగొండ: విద్యుత్ తీగలు తాకగా ట్రాక్టర్లోని వరిగడ్డి దగ్ధమైన ఘటన మండలంలోని వల్లభిలో గురువారం చోటుచేసుకుంది. ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన ఓ రైతు నేలకొండపల్లి మండలం రాయిగూడెంలో గడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్లో తరలిస్తున్నాడు. వల్లభి వద్ద విద్యుత్ తీగలు గడ్డిని తాకడంతో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు వరి గడ్డి కింద వేయగా.. అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: మండలంలోని కాచిరాజుగూడెం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో మునగాల వీరభద్రం(55) అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా బలపాలకు చెందిన వీరభద్రం మారెమ్మతల్లి ఆలయం వద్ద జరిగిన వేడుకకు హాజరై వెళ్తున్నాడు. మార్గమధ్యలో కాచిరాజుగూడెం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆయన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ ఎం.రాజు తెలిపారు. కుక్కల గుంపు రావడంతో ఆటోడ్రైవర్.. ఖమ్మంక్రైం: రహదారిపై వెళ్తున్న ఆటోపైకి కుక్కల గుంపు రావడంతో వాటిని తప్పించే క్రమాన బ్రేక్ వేయగా ఆటో బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. వెంకటగిరి క్రాస్ రోడ్డు ఇందిరమ్మకాలనీకి చెందిన షేక్ ఇమామ్పాషా(43) గురువారం తుమ్మలగడ్డ నుంచి వెళ్తుండగా ప్రకాష్నగర్ సమీపాన గుంపుగా ఉన్న కుక్కలు ఎగబడ్డాయి. వీటిని తప్పించేందుకు బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన ఇమామ్ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన సోదరుడు సర్దార్ పాషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు.. చింతకాని: మండలంలోని నేరడకు చెందిన కంచం డేవిడ్(20) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామంలోని స్నేహితుడి ఇంట్లో డేవిడ్ గురువారం విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తొలివిడత.. బరి ఖరారు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఖరారైంది. మొదటి దశగా జిల్లాలోని కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 192 గ్రామపంచాయతీలకు గాను 1,740 వార్డులు ఉన్నాయి. ఈ స్థానాలకు పలువురు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారంతో ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల్లో బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. మొత్తం 192 సర్పంచ్ స్థానాలకు 20 ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగే 172 స్థానాల్లో 476మంది అభ్యర్థులు పోటీకి మిగిలారు. ఇక 1,740వార్డులకు గాను రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా వాటిలో 323 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఎన్నికలు జరిగే 1,415 స్థానాల నుంచి ఉపసంహరణ అనంతరం 3,275మంది బరిలో నిలిచారు.మండలం జీపీలు / వార్డుస్థానాలు సర్పంచ్ వార్డు అభ్యర్థులు అభ్యర్థులు కొణిజర్ల 27 / 254 73 524 రఘునాథపాలెం 37 / 308 106 589 వైరా 22 / 200 99 348 బోనకల్ 22 / 210 83 414 చింతకాని 26 / 248 120 466 మధిర 27 / 236 118 468 ఎర్రుపాలెం 31 / 284 116 466మొత్తం 192 / 1,740 476 3,275 సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీలో 37,51 మంది -
అప్పుడు భర్తలు.. ఇప్పుడు భార్యలు
కామేపల్లి: మండలంలోని పలు గ్రామాలు ఏకగీవ్రం దిశగా అడుగులు వేయగా వాటిలో పాతలింగాల, లాల్యతండా సర్పంచ్ స్థానాలు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. పాతలింగాల 2019 ఎన్నికల్లో ఎస్టీ జనరల్ కావడంతో గ్రామానికి చెందిన కిన్నెర నాగయ్యను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎస్టీ మహిళ కావడంతో నాగయ్య భార్య కిన్నెర సుజాతను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019లో లాల్యతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కావడంతో గ్రామానికి చెందిన మాలోత్ రాంచందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాంచందర్ భార్య సౌజన్యను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పకడ్బందీగా నిర్వహించాలికారేపల్లి: నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ దీక్ష రైనా సూచించారు. బుధవారం సింగరేణి మండలంలోని సింగరేణి, భాగ్యనగర్తండా, సీతారాంపురం, కోమట్లగూడెం గ్రామాల్లో నామినేషన్ రిసీవింగ్ కేంద్రాలను దీక్షరైనా పరిశీలించారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ మల్లేల రవీంద్రప్రసాద్, ఎస్ఐ బి.గోపి ఉన్నారు. -
అలా ఎందుకు వెళ్లారో..?
● శోకసంద్రంలో రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలు ● ఐదు నిమిషాలైతే ఇళ్లకు చేరేవారు.. సత్తుపల్లిటౌన్/చండ్రుగొండ: ఇంట్లో వారికి చెబితే ఏమంటారోనని వారు పడుకున్నాక కారు తీశారు ఆ విద్యార్థులు.. పక్క ఊరిలో ఒకరిని.. మరో ఊరిలో ఇద్దరిని కారు ఎక్కించుకున్నారు. తిరిగి తల్లిదండ్రులు లేచేలోపు ఇంటికి చేరుకోవాలనే ఆతృతలో కారును వేగంగా నడుపుతూ డివైడర్ను ఢీకొట్టారు. అంతే ముగ్గురి ప్రాణాలు పోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఎవరికీ చెప్పకుండా బయట పడి అనంతలోకాలకు వెళ్లారు. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచారు. అప్పుడే ఎందుకు వెళ్లారో..? అంతగా ఏం పని ఉందో..? మమ్ములను ఇలా వదిలి వెళ్తారా..? అంటూ కుటుంబ సభ్యు లు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. బుధవారం తెల్లవారుజామున పెనుబల్లి వైపు నుంచి సత్తుపల్లికి కారులో ఐదుగురు విద్యార్థులు వస్తుండగా కిష్టారం అంబేడ్కర్నగర్ కాలనీవద్ద జాతీయ రహదా రి మధ్యలో ఉన్న డివైడర్ను కారు ఢీకొట్టగా ఈ ఘట న చోటు చేసుకుంది.కొమ్మేపల్లికాలనీకి చెందిన సిద్దేశ్ జాయ్ (18) తన సమీప బంధువు మర్సకట్ల శశిధర్ (13) కలిసి మంగళవారం అర్ధరాత్రి తమ కారులో అన్నపురెడ్డిపల్లికివెళ్లి.. తలారి రాజా కుమారుడు అజయ్ను ఎక్కించుకుని, చండ్రుగొండ మండలం తిప్పనపల్లి జీపీ మహ్మద్నగర్కు వెళ్లి.. ఎస్కే ఇమ్రాన్, ఎస్కే సాజిద్ (21)ను ఎక్కించు కొని సత్తుపల్లికి బయలుదేరారు. దారిలో జరిగిన ప్రమాదంలో ఎస్డీ సాజిద్, మర్సకట్ల శశిధర్, జాయ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇమ్రాన్, తలారి అజయ్ల పరిస్థితి విషమంగా మారింది. ఘటనా స్థలాన్ని సత్తుపల్లి ఏసీపీ వసుంధరయాదవ్, సీఐ శ్రీహరి, ఎస్ఐ ప్రదీప్ సందర్శించారు. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించిన సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు.. శశిధర్, సిద్ధేశ్జాయ్, సాజిత్ మృతదేహాలను చూసేందుకు బంధువులు, విద్యార్థులు, స్నేహితులు, స్థానికులు చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఆదివారమే పుట్టినరోజు చేశామని, అప్పుడే నూరేళ్లు నిండాయా అని శశిధర్ తల్లిదండ్రులు ప్రేమలత, రాజబాబు రోదించిన తీరు కన్నీళ్లు తెప్పించింది. ఒక్కగానొక్క కుమారుడు సిద్ధేశ్ మృతితో శ్రీనివాసరావు, శ్రీలత.. సాజిత్ మరణంతో తల్లిదండ్రులు అజ్గర్, జిల్ఖాబీల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. శ్రీనివాసరావు వెలుగు సీసీగా పనిచేస్తుండగా.. అజ్గర్ వ్యవసాయం చేస్తున్నారు. సాజిత్ మృతితో చండ్రుగొండ మండలం మహ్మద్నగర్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సందర్శించి నివాళులర్పించారు. -
ముహూర్తం చూసుకుని..
సత్తుపల్లి: పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు పేరు బలంతో ముహూర్తాలు చూసుకుంటున్నారు. తొలి రోజు బుధవారం త్రయోదశి కావటంతో నామినేషన్లు అంతగా వేయలేదు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి కావటంతో ఆ రోజు నామినేషన్లు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. 43 క్లస్టర్లు.. 130 పంచాయతీలు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 130 పంచాయతీలు, 1,208 వార్డులను 43 క్లస్టర్లుగా విభజించి నామినేషన్ల స్వీకరణ చేపడుతున్నారు. 128 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తల్లాడ మండలంలో బస్వాపురం పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం చేసుకునేందుకు మూడు పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. పెనుబల్లి మండలం గౌరారం పంచాయతీ ఎన్నికపై కోర్టును ఆశ్రయించటంతో నిలిచిపోయింది. అభ్యర్థుల ప్రకటనలతో.. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావటంతో మండలాల వారీగా అభ్యర్థులను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రకటిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ప్రకటనతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. కొన్నిచోట్ల పార్టీలు నిర్ణయించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తొలిరోజు నామినేషన్లు నామ మాత్రమే -
సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలేవి..?
లోక్సభలో ఎంపీ రఘురాంరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: రైతులు తమ పంటచేలల్లో రసాయనిక ఎరువుల వినియోగాని కి బదులుగా సేంద్రియ సాగును ప్రోత్సహించేలా బయో ఇన్పుట్ రీ సెర్చ్ సెంటర్ల (బీఆర్సీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాల్సిందిగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్సభలో కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం ఈ అంశా న్ని ప్రస్తావిస్తూ.. పరిశోధన కేంద్రాల పురోగతి వివరాలు తెలపాలన్నారు. దీనికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల సహాయ మంత్రి రామ్నాథ్ఠాకూర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రాల్లో 3,517 బీఆర్సీలు.. ఖమ్మం జిల్లాలో ఆరు ఏర్పాటయ్యాయని తెలిపారు. క్లస్టర్ స్థాయి సంస్థగా.. రైతులకు ప్రత్యేక శిక్షణ, ప్రదర్శనలు ఉంటాయని, సొసైటీలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహా యక బృందాలతో ఈ బీఆర్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్న ఇద్దరు అరెస్ట్తల్లాడ: మండలంతోపాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పత్తి కొనుగోలు కాంటాల్లో నకిలీ చిప్లను పెట్టి రైతులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ వివరాలు వెల్లడించారు. నకిలీ చిప్లను ఉపయోగించి డిజిటల్ కాంటాలను తయారు చేస్తున్న హైదరబాద్కు చెందిన ఓగిలిశెట్టి శంకర్, జంపాల కోటేశ్వరరావును అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని తెలిపారు. వారి వద్ద నుంచి 5 మదర్బోర్డులు (పీసీబీ) నాలుగు చిప్లు, రెండు కాంటాలు, వస్తువులను సీజ్ చేశామని చెప్పారు. వారిని పట్టుకున్న ఎస్ఐ వెంకటకృష్ణ, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ముగిసిన ఉపసంహరణ ఖమ్మంసహకారనగర్: జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం ఉపసంహరణ కార్యక్రమం ముగిసింది. మొత్తంగా 192 సర్పంచ్ స్థానాలకు 438 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 1,740 వార్డు స్థానాలకు గాను 536 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా.. మిగతా అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశ ఎన్నికలకు సంబంధించి 183 సర్పంచ్ స్థానాలకు గాను 1055 నామినేషన్లు దాఖలు కాగా... పరిశీలన అనంతరం 894 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. 1686 వార్డు స్థానాలకు గాను 4160 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలన అనంతరం 4047 నామినేషన్లు ఆమోదం పొందాయి. సరైన వివరాలు లేని వాటిని అధికారులు తిరస్కరించారు. 3వ విడత 191 సర్పంచ్ స్థానాలకు తొలి రోజు 90 నామినేషన్లు దాఖలు అయ్యా యి. 742 వార్డు స్థానాలకు 237 నామినేషన్లు దాఖలైనట్లు అదనపు ఎన్నికల అధికారి ఆశా లత తెలిపారు. ఈ మూడు విడతలకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. ఇది లా ఉండగా చివరి విడత బుధ, గురువారాల్లో నామినేషన్లు భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇళ్ల తలుపులు దహనం గుర్తుతెలియని దుండగుల దుశ్చర్య ఖమ్మంక్రైం: నగరంలోని టూటౌన్ పరిధి లో గుర్తుతెలి యని దుండగు డు ఇంట్లోవా రు నిద్రిస్తున్న సమయంలో తలుపులపై పెట్రోల్ పోసి నిప్పంటించా డు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. రాపర్తినగర్లోని బీసీకాలనీలో నివాసం ఉండే ఎల్లయ్య కుటుంబం ముగ్గు విక్రయిస్తూ జీవిస్తోంది. అతని కుమారుడు నాగేశ్వరరావు ఆటోనడుపుతున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు.. తన ఇంటి ముందు తలుపులు తగలబడిపోతుండటం గమనించాడు. కేకలు వేసి, ఇంట్లో నిద్రిస్తున్న భార్య, పిల్లలను, కుటుంబ సభ్యులను లేపి, మంటలను ఆర్పివేశాడు. నాగేశ్వరరావు రాకను గమనించిన దుండగుడు పరారయ్యాడు. అతడి చెప్పులు అక్కడే వదిలిపెట్టాడు. తలుపుల వద్ద ఓ పట్టా ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తించారు. నాగేశ్వరరావు ఆ సమయానికి రాకుంటే ఇంట్లోని వారు సజీవ దహనమయ్యేవారు. పోలీసులు అన్ని కోణా ల్లో విచారిస్తున్నారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు సీఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బరిలో విద్యావంతులు, దంపతులు
కొణిజర్ల: కొణిజర్ల సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన గూదె పుష్పావతి పోటీలో నిలిచా రు. ఆమె ఎం.ఫార్మసీ చదివి కొద్దిరోజులు ఉద్యోగం చేశారు. కొణిజర్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గూదె ఉపేందర్తో వివా హం జరిగింది. కొణిజర్ల పంచా యతీ రిజర్వేషన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో సర్పంచ్గా పోటీలో నిలిచింది. కూసుమంచిలో.. కూసుమంచి: మండలంలో పలువురు విద్యావంతులు సర్పంచ్, వార్డు స్థానాల్లో బరి లో దిగారు. నేలపట్ల గ్రా మానికి చెందిన అలవాల లింగయ్య ఆర్జేసీ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తుండగా ఆయన బీఆర్ఎస్ మద్దతుదారుడిగా నేలపట్ల సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచారు. కూసుమంచి నుంచి కొండా కృష్ణవేణి కాంగ్రెస్ మద్దతుదారుగా సర్పంచ్ బరిలో దిగగా డిగ్రీ చదివిన ఆమె ఎంపీడీఓ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. ఇదే పంచాయతీలో ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న గుండా ఉపేందర్రెడ్డి 8వ వార్డు నుంచి బీజేపీ మద్దతుదారుడిగా బరిలో దిగారు. సీపీఎం మద్దతుదారుగా డిగ్రీ చదివిన సల్వాది బేబీరాణి సర్పంచ్గా బరిలో ఉన్నారు. కూసుమంచి 12వ వార్డుకు బీఆర్ఎస్ తరఫున అర్వపల్లి ఉపేందర్ నామినేషన్ దాఖలు చేయగా ఆయన భార్య రేణుక నాలుగో వార్డు నుంచి బరిలో ఉన్నారు. గట్టుసింగారం గ్రామానికి చెందిన వాచేపల్లి హనుమారెడ్డి కాంగ్రెస్ తరఫున 2వ వార్డులో బరిలో నిలవగా అతడి భార్య స్వరూప 6వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. -
●అటొక ఊరు.. ఇటు వేరు!
కూసుమంచి మండలంలోని ఈశ్వరమాధారం గ్రామం భౌగోళికంగా అంతా ఒకేలా కనిపించినా అందులో రెండు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఓ సీసీ రోడ్డు ఈ జీపీలను విడదీస్తోంది. గతంలో ఈశ్వరమాధారం పంచాయతీ పరిధిలో ఈశ్వరమాధారం, మద్దివారిగూడెం, మందడి నర్సయ్యగూడెం, మంగళితండా, తాళ్లగడ్డతండా, రాజుపేట బజార్ గ్రామాలు ఉండేవి. ఆతర్వాత మద్దివారిగూడెం, మందడి నర్సయ్యగూడెంను విడదీసి ఒక పంచాయతీ ఏర్పాటుచేశారు. అలాగే, ఈశ్వరమాధారంలో అంతర్భాగమైన రాజుపేట బజార్ను రాజుపేట జీపీ నుంచి వేరుచేసి ఈశ్వరమాధారంలోని కొంతభాగం, తాళ్లగడ్డతండాను కలిపి కొత్త జీపీగా గుర్తించారు. ఇలా రాజుపేటబజార్ ఇంకో పంచాయతీలో కలిసినా భౌగోళికంగా ఈశ్వరమాధారంలో కలిసేఉంటుంది. – కూసుమంచి -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
ఖమ్మం సహకారనగర్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అత్సవరస సేవల్లో పనిచేసే వారు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఈ నెల 5 నుంచి 10 వరకు, రెండో విడత ఎన్నికలు జరిగే కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఈనెల 8 నుంచి 13 వరకు, మూడో విడత ఎన్నికలు జరిగే ఏన్కూర్, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూర్, సింగరేణి మండలాల్లో ఈ నెల 11 నుంచి 16 వరకు ఆయా ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడి -
సంగ్రామం
ఊపందుకున్నసాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సంగ్రామం ఊపందుకుంది. మూడు విడతల్లో ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో సందడి షురూ అయింది. మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో అభ్యర్థుల ఉపసంహరణలు బుధవారంతో ముగిశాయి. ఈ విడతలో వమొత్తం 192 జీపీలకు గాను 18, 1,740 వార్డులకు 220 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 173 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు జరుగనుండగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమను గెలిపించాలని కోరుతూ గ్రామాల్లో ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ఇక మూడో విడత నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. బరిలో 3,928 మంది అభ్యర్థులు జిల్లాలో మొదటి విడతలో కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 192 గ్రామపంచాయతీలు, 1,740 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. ఇక్కడ సర్పంచ్ స్థానాలకు 1,142, వార్డులకు 4,054 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో 489 మంది సర్పంచ్, 3,445 మంది వార్డులకు.. మొత్తం 3,928 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టుల మద్దతుతో బరిలో నిలవాలని అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల మద్దతుదారులు ఒకరి కన్నా ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో వారితో ఉపసంహరింప చేయడానికి నాయకులు రంగంలోకి దిగారు. నామినేషన్ల గడువు గత నెల 29తో ముగియగా.. అప్పటి నుంచి నామినేషన్లు వేసిన వారితో చర్చలు జరిపి చాలా మందితో ఉపసంహరణ చేయించారు. మరికొందరు బరిలోనే ఉన్నారు. పోటా పోటీ.. మధిర, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను నాలుగు మండలాలు మొదటి దశలో ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం, వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా మండలాల్లో ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల మద్దతుదారులు బరిలో ఉన్నారు అన్ని పార్టీలూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల సమయంలోనే ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కావడం గమనార్హం. 19 జీపీలు ఏకగ్రీవం.. జిల్లాలో మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు ఆహ్వానించారు. ఇందులో 19 గ్రామపంచాయతీలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవం అయ్యాయి. ఇక 1,740 వార్డులకు గాను 220 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. బోనకల్ మండలంలోని కలకోట, చింతకాని మండలం రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర మండలం సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా మండలం లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, పుణ్యపురం, రఘునాథపాలెం మండలం మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములు తండా, ఎర్రుపాలెం మండలం గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 173 జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 1,740 వార్డుల్లో 220 వార్లులు ఏకగ్రీవం కాగా 1,520 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. 1,740 పోలింగ్ కేంద్రాలు.. మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.ముగిసిన మొదటి విడత ఉపసంహరణలు -
ఆ పంచాయతీలు.. ‘చే’జిక్కేదెలా..?
అభివృద్ధి, సంక్షేమ అస్త్రాలు సంధిస్తున్న కాంగ్రెస్ ● మెజార్టీ పంచాయతీలు మద్దతుదారులకు దక్కేలా ప్రణాళిక ● గెలుపు కోసం ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యూహరచనసాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలతోపాటు తమకు పట్టున్న చోట మద్దతుదారుల గెలుపు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అత్యధిక పంచాయతీలను కై వసం చేసుకునేందుకు ముగ్గురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కొంత బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అత్యధిక పంచాయతీల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కొన్నిచోట్ల బీఆర్ఎస్తో కలిసి సీపీఎం, మరి కొన్నిచోట్ల సీపీఎంతో సీసీఐ జత కడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు విడతల్లో జరిగే పంచాయతీల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, వామపక్షాలు కై వసం చేసుకున్న పంచాయతీలను ఈసారి ‘చే’జిక్కించుకోవాలని మండల స్థాయి నాయకత్వాన్ని ఆదేశించింది. సత్తా చాటాల్సిందే.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఓటు బ్యాంక్ ఉంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మూడుసార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్నే బలపరిచారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం చుక్కెదురవుతోంది. గత స్థానిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పట్టు సాధించింది. అప్పుడు బీఆర్ఎస్తో పాటు సీపీఎం, సీపీఐ కూడా బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆ సీన్ మారింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతోపాటు జిల్లాలోనూ పూర్తి ఆధిపత్యం కాంగ్రెస్దే. ఈ క్రమంలో జీపీ ఎన్నికల్లోనూ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల డైరెక్షన్లో.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, రెబల్స్ను బుజ్జగించడం, అభ్యర్థుల ప్రచారం తదితర అంశాలన్నీ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేల సూచనలతోనే సాగుతున్నాయి. మొత్తం 566 గ్రామ పంచాయతీల్లో ఎక్కువ స్థానాలను చేజిక్కించుకుని జిల్లాలో పార్టీకి తిరుగులేదని మరోసారి నిరూపించేలా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పట్టుదలతో ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి వారి నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. మండల కేంద్రాలు, మేజర్ జీపీలతో పాటు గత ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలు గెలిచిన పంచాయతీలపై దృష్టి పెట్టారు. అయితే ఏకగ్రీవం.. లేదంటే పోటీలో నెగ్గేలా చూడాల్సిన బాధ్యతలను మండల స్థాయి నేతలకు అప్పగించారు. ఐదు నియోజకవర్గాలు.. మూడు విడతలు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల తమ నియోజకవర్గాలైన మధిర, పాలేరు, ఖమ్మం పరిధిలోని 302 జీపీల్లో, వైరా, కొణిజర్ల మండలాల్లోని 49 జీపీల్లో మొదటి, రెండో విడతల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామనే ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఇక సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోనూ సింహభాగం తమవేనని ఆయా ఎమ్మెల్యేలు, నాయకులు ధీమాతో ఉన్నారు.ప్రచారం, ఉపసంహరణలు, నామినేషన్లు.. మొదటి దశ ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. దీంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. ఇక్కడ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థులతో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అలాగే మండల స్థాయిలో చరిష్మా ఉన్న నేతలతో మేజర్ గ్రామపంచాయతీల్లో ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఇక రెండో విడతకు సంబంధించి రెబల్స్తో నామినేషన్లను ఉపసంహరింపజేసే పనిలో నేతలున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. ఇక్కడ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులతో నామినేషన్లు వేయించే ప్రక్రియ సాగుతోంది.మధిర 131పాలేరు 134వైరా 94సత్తుపల్లి 129ఖమ్మం 37 -
నామినేషన్ కేంద్రాల సందర్శన
తల్లాడ/కల్లూరురూరల్/సత్తుపల్లిరూరల్/వేంసూరు : సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ పి.శ్రీజ బుధవారం సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని తల్లాడలో అధికారులను ఆదేశించారు. కల్లూరు మండలం కొర్లగూడెంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. సత్తుపల్లి మండలం కిష్టారంలో నామినేషన్ ప్రక్రియపై అధికారులతో చర్చించారు. వేంసూరు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించాక ఆమె మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. డీపీఓ సందర్శన.. తల్లాడ, కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం నామినేషన్ కేంద్రాలను డీపీఓ ఆశాలత పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఎల్పీఓ విజయలక్ష్మి, ఎన్నికల పర్యవేక్షణ అధికారి వేల్పుల విజేత, తహసీల్దార్లు కరుణాకర్రెడ్డి, పులి సాంబశివుడు, సత్యనారాయణ, ఎంపీడీఓలు కావ్య, సురేష్ బాబు, చంద్రశేఖర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.పలుచోట్ల పర్యటించిన అదనపు కలెక్టర్ శ్రీజ -
జిల్లా జడ్జిని కలిసిన డీఎంహెచ్ఓ
ఖమ్మంలీగల్: డీఎంహెచ్ఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ డి.రామారావు బుధవారం జిల్లా జడ్జి జి.రాజగోపాల్ను కోర్టులో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి పూలమొక్క బహూకరించారు. నానో డీఏపీ వాడకం పెంచండికొణిజర్ల: ద్రవ రూపంలో ఉండే నానో డీఏపీని మొక్కజొన్న పంటపై పిచికారీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య రైతులకు సూచించారు. మండలంలోని తనికెళ్లలో నానో డీఏపీ పిచికారీ విధానంపై కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు క్షేత్ర ప్రదర్శన నిర్వహించగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ మొక్కజొన్న వేసిన 25 రోజుల తర్వాత 15 రోజులకోసారి చొప్పున రెండు సార్లు నానో డీఏపీ పిచికారీ చేసుకోవాలని సూచించారు. మందు అకులపై పడేలా పిచికారీ చేయడంతో పత్ర రంద్రాల ద్వారా మొక్క లోపలికి చేరి పోషకాలు అందజేస్తుందన్నారు. ఈ మందు వాడకంతో డబ్బుతో పాటు సమయం ఆదా అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో టెక్నికల్ ఎంఏఓ పవన్కుమార్, కొణిజర్ల ఏఓ డి. బాలాజీ, కంపెనీ జోనల్ మేనేజర్ సుమన్, మార్కెటింగ్ మేనేజర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో తనిఖీబోనకల్: మండలంలోని చొప్పకట్లపాలెం ప్రాథమిక పాఠశాలను మండల ప్రత్యేకాధికారి, జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె.విజయ భాస్కర్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. విద్యార్ధుల హాజరును పరిశీలించారు. ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రోగ్రామ్పై ఆరా తీయగా 80 నుంచి 90 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారని ఉపాధ్యాయులు వివరించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దామాల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రెండురోజుల్లో రెండు వేల ఖాతాలు !ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం మాట్లాడిన ఆమె పలు సూచనలు చేశారు. రెండో విడత నామినేషన్ల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలని, మూడో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం ఉద్యోగుల కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులపై చర్చించారు. జిల్లా నుంచి ఎన్నికల పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్దత్ మాట్లాడగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, సీపీఓ శ్రీనివాస్, డీసీఓ గంగాధర్, డీవైఎస్ఓ సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడతకూ పోటాపోటీ
● చివరి రోజున భారీగా నామినేషన్ల దాఖలు ● మొదటి దశకు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు ● మూడో దశకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ● ఎంపిక, ఏకగ్రీవాలు, ఉపసంహరణలపై పార్టీలు బిజీబిజీసాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. జిల్లాలోని ఆరు మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రెండు రోజులతో పోలిస్తే చివరి రోజున పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా, కొన్ని జీపీల్లో రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఇక మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియనుండగా బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్య తేలుతంది. మరోవైపు మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని 191 జీపీలు, 1,742 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. 183 జీపీలు.. 1,686వార్డులు రెండో విడతలో కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 సర్పంచ్, 1,686 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 36 నామినేషనన్లు దాఖలయ్యాయి. రెండో రోజైన సోమవారం సర్పంచ్లుగా 383, వార్డులకు 895 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజైన మంగళవారం కూడా భారీగానే నామినేషన్లు దాఖలైనా కొన్నిచోట్ల రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగడంతో సంఖ్యపై స్పష్టత రాలేదు. దాఖలైనట్లయింది. మొదటి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీస్ బందోబస్తు నిర్వహించడంతో ఎక్కడా అవాంతరాలు ఎదురుకాలేదు. నేడు ఉపసంహరణలకు ఆఖరు మొదటి విడత ఎన్నికలు జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణలపై పార్టీలు దృష్టి పెట్టాయి. బుధవారం మధ్యాహ్నం 3గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యాన ఎంపిక చేసిన అభ్యర్థి మినహా మిగతా వారితో నామినేషన్ విత్డ్రా చేయించేలా నాయకులు చర్చలు జరుపుతున్నారు. కొందరు మాత్రం పట్టు వీడకుండా, ఇప్పుడు కాకపోతే తమకు ఎప్పుడు అవకాశం వస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూనే ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నేతలతో చెప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉపసంహరణలపై ఎక్కువగా దృష్టి సారించాయి. బుధవారం మధ్యాహ్నం 3గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా వెల్లడికానుంది. ఇకపై తుది విడత జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లోని 191 గ్రామపంచాయతీలు, 1,742 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా, 9న మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ దశ జీపీల్లో ఎన్నికలు ఈనెల 17న నిర్వహిస్తారు.గ్రామపంచాయతీల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. రాజకీయ పార్టీల నేతలు తాము మద్దతునిచ్చే అభ్యర్థుల ఎంపికతోపాటు నామినేషన్ల ఉపసంహరణ, ప్రచారం, గెలుపోటముల వ్యూహరచనలో తీరికలేకుండా గడుపుతున్నారు. గ్రామస్థాయిలో పట్టు ఉండి.. సర్పంచ్లుగా గెలుపొందే అభ్యర్థులను ఎంపిక చేయడం, ఆ స్థానాన్ని ఆశిస్తున్న ఇతరులకు నచ్చజెప్పడం కొనసాగుతోంది. ఎవరైనా మాట వినకపోతే మంతనాలు జరుపుతూనే మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రచార వ్యూహాలు రూపొందిస్తున్నారు. అధికార కాంగ్రెస్పార్టీతోపాటు బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కూడా ఎన్నికలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుండగా, అందరూ మొదటి విడత ఎన్నికల్లో ఉపసంహరణలపై దృష్టి కేంద్రీకరించారు. -
వాతావరణ ం
జిల్లాలో బుధవారం ఉదయం, రాత్రి చలి ప్రభావం పెరిగే అవకాశముంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.భూనిర్వాసితులకు అత్యధిక పరిహారం కలెక్టర్ అనుదీప్ ఖమ్మం సహకారనగర్: సీతారామ ఎత్తిపోతల పథకం సంబంధించి భూములు ఇచ్చే రైతులకు నిబంధనల మేరకు అత్యధిక పరిహారం చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన సింగరేణి మండలం బాజుమల్లాయిగూ డెం, రేలకాయలపల్లి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ నిమిత్తం సేకరించాల్సిన భూమి, పరిహారంపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ వారితో చర్చించారు. బాజుమల్లాయిగూడెంలో ఎకరా భూమి ధర రూ.2.70 లక్షలు ఉండగా రెండింతలు అంటే రూ.5.40లక్షలుగా పరిగణనలోకి తీసుకుని రెట్టింపు పరిహారం చేసి రూ.10.80లక్షలను ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు. ఇక ఆర్బిట్రేషన్లో 12 శాతం వడ్డీ రూ.64వేలు కలిపితే రూ.11.44లక్షలు అందుతాయని చెప్పారు. అలాగే, రేలకాయలపల్లిలో ఎకరా ధర రూ.2.92లక్షలు ఉండగా, వడ్డీ కలిపి రూ.12.40లక్షల చొప్పున చెలిస్తామని తెలిపారు. అంతేకాక పొలాల్లో సుబాబుల్ పంట, ఇతర చెట్లు, పైపు లైన్లు, డ్రిప్ పరికరాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు -
వైరా రిజర్వాయర్లో చేపపిల్లలు విడుదల
వైరా: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను మంగళవారం వైరా రిజర్వాయర్లో విడుదల చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి జి.శివప్రసాద్ మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. జలవనరుల శాఖ ఏఈ వెంకటరాము, మత్స్యకారుల సంఘం ఆధ్యక్షుడు షేక్ రహీమ్తో పాటుషేక్ జానీమియా, షేక్ ఉద్దండు, జ్ఞానరత్నం, రామారావు చాంద్మియా తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా పంటల నమోదు వైరారూరల్: రైతులు సాగు చేస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. మండలంలోని అష్టగుర్తిలో మంగళవారం ఆయన పంటల నమోదును పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ మొక్కజొన్న సాగు చేసే రైతులు కంపెనీ నిర్వాహకులతో అగ్రిమెంట్ చేసుకోవాలని, వరి కోతలు ముగిశాక కొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలని సూచించారు. ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ ఆలూరి వాసంతి, రైతులు పాల్గొన్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్లు తనిఖీ ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని ఎంపిక చేసిన జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళ్లను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం మంగళవారం తనిఖీ చేశారు. ఖమ్మం, మద్దులపల్లి మార్కెట్ల పరిధిలోని మిల్లుల్లో తనిఖీ చేసిన ఆయన ఇప్పటివరకు కొనుగోలు చేసిన పత్తి, రికార్డులను పరిశీలించారు. అలాగే, బ్యాంకు ఖాతాల్లో నగదు జమపై రైతులతో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్ సహాయ కార్యదర్శి పోలవరపు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి ఖమ్మంక్రైం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయనే తదితర ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు పన్నుతున్న ఉచ్చులో చిక్కుకుని ప్రజలెవరూ మోసపోవద్దని సీపీ సునీల్దత్ సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యాన ‘ఫ్రాడ్ కా పుల్ స్టాప్’ పేరుతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు జిల్లాలో మంగళవారం మొదలయ్యాయని తెలిపారు. మైక్ల ద్వారా రైల్వేస్టేషన్లు, బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. అలాగే, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరైనా వీడియోకాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే కాల్ కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. కాగా, ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’లో భాగంగా పోలీస్ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇందులో అడిషనల్ డీసీపీ రామానుజం మాట్లాడగా సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సీఐ నరేష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నివేదికలు సకాలంలో సమర్పించాలి
ఖమ్మంవైద్యవిభాగం: ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు, మందుల లభ్యత తదితర వివరాల నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో సమర్పించాలని డీఎంహెచ్ఓ డి.రామారావు సూచించారు. ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించాక షెడ్యూల్ ప్రకారం హెచ్ఐవీ, రక్తదానం, సరఫరాపై అవగాహన కల్పించారా? అని ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం మరింత పెంచాలని సూచించారు. డాక్టర్ దేవిశ్రీ, ఉద్యోగులు రజని, శారద, లక్ష్మీప్రసన్న, రహీంబీ, సంధ్య, కావ్య, శిరీష, ఉమారాణి, ముదస్సర్, షమీమ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి బాధ్యత నాదే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడె/ కొత్తగూడెం అర్బన్ : ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాను చూసినప్పుడు నా గుండెలో సంతోషం ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా అదే ఉత్సాహం కనిపిస్తుంటుంది. అదే ఊపుతో మీరు నాకు అండగా నిలబడితే, మీరు చూపించే ఉత్సాహాన్నే ఊపిరిగా తీసుకొని తెలంగాణను అగ్రభాగాన నిలబెడతా. భద్రాద్రి రాములవారి సాక్షిగా ఖమ్మం జిల్లాను అభివృద్ధిపథం వైపు నడిపించే బాధ్యత నాదే’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పటికీ కీలక మంత్రిత్వ శాఖలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరే ఉన్నాయని చెప్పారు. వారు అనుకుంటే జరగని పనంటూ ప్రభుత్వంలో ఏదీ లేదన్నారు. ‘మీ మంత్రులు అడిగిందే తడవుగా అన్ని పనులు మంజూరు చేస్తా’ అని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులే నాయకత్వం వహిస్తున్నందున ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభించామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల కొత్తగూడెం రావడం ఆలస్యమైందని, కానీ ఢిల్లీలో మరో పని ఉన్నందున వెంటనే వెళ్లిపోతున్నానని చెప్పారు. మరోసారి ఇక్కడికి వస్తానని, అప్పుడు అన్ని విషయాలు వింటానని హామీ ఇచ్చారు. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ యూనివర్సిటీని దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవనాలు, ఇతర సౌకర్యాలు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. పూర్తిస్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదని తెలిపారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ద్వారా భూమి, భూమి లోపల ఉన్న పొరలు, ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్న అనేక అంశాల పైన పరిశోధనలు చేయడమే కాకుండా దేశానికి, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించే అవకాశం ఉంటుందని వివరించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అత్యున్నత యూనివర్సిటీని సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రారంభించుకోవడం హర్షణీయమని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములకు సీతారామ జలాలను పారించేందుకు అసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అలాగే కొత్తగూడెంలో ఎయిర్పోర్టు, థర్మల్ విద్యుత్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని జిల్లాకు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ అమలు దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవారికి భరోసా, అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రజల మద్దతు, దీవెనలు కొనసాగితే మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతాయని, ఎర్త్ సైన్సెస్ వంటి యూనివర్సిటీలు భవిష్యత్లో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రెండు గంటలకు పైగా ఆలస్యం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంగళవారం కొత్తగూడెంలో సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన పర్యటనను పురస్కరించుకుని వారం రోజులుగా వర్సిటీ క్యాంపస్లో ఏర్పాట్లు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం క్యాంపస్కు రావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. దీంతో ఈ బహిరంగ సభ కోసం వచ్చిన మహిళలు చాలా మంది సభ ప్రారంభం కాకముందే వెళ్లిపోగా.. 25 వేల మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ కలిగిన సభా ప్రాంగణంలో వెనుక భాగంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే, వివిధ స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు సాయంత్రం ఐదు గంటల వరకు ఓపికగా ఎదురుచూశారు. సభ ప్రారంభమైన తర్వాత హుషారుగా ఈలలు వేస్తూ సభా ప్రాంగణంలో జోష్ నింపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కళాకారులు నిర్విరామంగా ఆడిపాడుతూ సభికులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, ఆర్డీఓ మధు, ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి రాముడి సాక్షిగా మాట ఇస్తున్నా -
‘స్వచ్ఛ’ విద్యాలయాలకు పురస్కారాలు
ఖమ్మంసహకారనగర్/కల్లూరు: స్వచ్ఛ హరిత విద్యాలయాలుగా ఎంపికై న పాఠశాలల హెచ్ఎంలకు కలెక్టర్ అనుదీప్ మంగళవారం ప్రశంసాపత్రాలు అందించారు. స్వచ్ఛ హరిత విద్యాలయాల కోసం సర్వే చేపట్టగా జిల్లాలోని 1,636 పాఠశాలలు పాల్గొన్నాయి. పాఠశాలలో తాగునీటి వసతి, టాయిలెట్ల శుభ్రత, చేతుల శుభ్రత, ప్రవర్తనలో మార్పులు, విద్యార్థుల నడవడిక తదితర అంశాల్లో 60 ప్రశ్నల ద్వారా సర్వే చేపట్టి అత్యధిక స్కోర్ సాధించిన ఎనిమిది స్కూళ్లను ఎంపిక చేశారు. కేటగిరీ–1, 2 అర్బన్ విభాగాల్లో ఎంపీపీఎస్ కొత్తగూడెం, జెడ్పీహెచ్ఎస్ అయ్యగారిపేట (బాలికలు), కేటగిరీ–1, 2 గ్రామీణంలో ఎంపీపీఎస్ మల్లారం, చెన్నూరు, వేపకుంట్ల పాఠశాలలతో పాటు జెడ్పీహెచ్ఎస్ చిన్నకొరుకొండి, పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ జల్లేపల్లి, కుర్నవల్లి పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా స్కూళ్ల హెచ్ఎంలకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేయగా, డీఈఓ చైతన్యజైనీ, సీఎంఓ ప్రవీణ్కుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి
ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ కేంద్రప్రభుత్వ నిధులు, పథకాలతోనే జరుగుతున్నాయని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ బద్దం మహిపాల్రెడ్డి తెలిపారు. మోదీ హయాంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ము గ్గురు ఉన్నా జిల్లా అభివృద్ధికి ఇచ్చిన నిధులు శూన్యమని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం డబ్బు ఇవ్వడం లేదంటే ప్రత్యర్థులను బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు సరికాదన్నారు. ఈక్రమాన ప్రతిపక్ష నాయకులు నామినేషన్ వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కాగా, బీజేపీ నల్లగొండ ఇన్చార్జ్గా నియమితులైన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ప్రతాప్ను మహిపాల్రెడ్డి, వాసుదేవరావు, కోటేశ్వరరావు తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, రాఘవరావు, ప్రవీణ్కుమార్, దొంగల సత్యనారా యణ, డాక్టర్ శీలం పాపారావు, రవిరాథోడ్, వీరల్లి రాజేష్, సుదర్శన్ మిశ్రా, దొడ్డ అరుణ, నెల్లూరి బెనర్జీ, రజినీరెడ్డి, సురేందర్రెడ్డి, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాకరవాయిలో ఉద్రిక్తత
తిరుమలాయపాలెం: మండలంలోని సోలీపురం గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఈ గ్రామపంచాయతీకి సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను కాకరవాయి రైతు వేదికలో స్వీకరించారు. మంగళవారం చివరి తేదీ కావడంతో సాయంత్రం 5గంటల వరకు క్యూలో ఉన్న వారికి అధికారులు టోకెన్లు జారీ చేశారు. అయితే, గ్రామంలో ఎనిమిది వార్డులకు ఉండగా ఓ పార్టీకి చెందిన నాయకులు మూడు వార్డులకు నామినేషన్లు వేసే అవకాశం కోల్పోతున్నామంటూ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే సమయాన ఎదుటి పార్టీ శ్రేణులు చేరుకుని నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్లు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలు భారీగా చేరడంతో ఉద్రిక్తత నెలకొనగా ఎస్ఐ కూచిపూడి జగదీష్ వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆతర్వాత ఉద్యోగులు జిల్లా అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. సమయపాలన పాటించకుండా నామినేషన్లు స్వీకరిస్తూ ఓ పార్టీ అభ్యర్థులకు అఽధికారులు సహకరిస్తున్నారని ఎదుటి పార్టీ నేతలు ఆరోపించగా.. ఆలస్యంగా వచ్చిన వారి నుంచి నామినేషన్లు స్వీకరించారా, లేదా అన్నది తెలియరాలేదు.సమయం దాటడంతో సోలిపురం నామినేషన్ల స్వీకరణకు నిరాకరణ -
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
బోనకల్: బోనకల్లో బస్టాండ్లో గుర్తుతెలియని వృద్ధుడు(65) మంగళవారం మృతి చెందాడు. బస్టాండ్లో పడుకున్న ఆయన చలి తీవ్రతతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు ఎస్సై పి.వెంకన్న తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి .. ఖమ్మంరూరల్: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం పంపింగ్ వెల్రోడ్కు చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు(60) బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటగిరి ఏరియాలో మంగళవారం బట్టలు అమ్మిన ఆయన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా గుర్రాలపాడు సమీపాన ఖమ్మం – కోదాడ ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన భార్య జయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్కరాజు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటోడ్రైవర్.. ఖమ్మంరూరల్: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా డ్రైవర్ మృతి చెందిన ఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిఽధి గొల్లగూడెం వద్ద మంగళవారం రాత్రి జరిగింది. ఆటోడ్రైవర్ కుక్కల మధు(36) ఖమ్మం వైపు వెళ్లుండగా గొల్లగూడెం వద్ద ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తన బృందంతో చేరుకుని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. -
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విధులు
ఖమ్మం సహకారనగర్: గ్రామ పాలన అధికారులు(జీపీఓ) ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చేలా విధులు నిర్వర్తించాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తుమాటి శ్రీని వాస్ సూచించారు. ఖమ్మంలో మంగళవారం జరి గిన జీపీఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన భూభారతి చట్టాన్ని అమలుచేయడమే కాక జీపీఓల వ్యవస్థకు శ్రీకారం చు ట్టారని తెలిపారు. అనంతరం తహసీల్దార్ల సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కోట రవికుమార్ మాట్లాడగా జీపీఓల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చీమల నాగేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి బాలమురళీకృష్ణ, మహిళా విభాగం అధ్యక్షులుగా పడిగా హైమావతి, కోశాధికారిగా వజ్జా రామారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మందేరుకల కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులుగా షేక్ జానీమియా, అసోసియేట్ అధ్యక్షులుగా చల్లా శ్రీనివాసరావు, మక్కాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా బానోత్ రాంచందర్రావు, టీ.ఎం.ఎం.కిశోర్, మల్లెంపాటి వెంకటేశ్వర్లు, కోట నరేష్, అంకోలు శ్రీలక్ష్మి, తాటి ఇందిర, కుంజ రాధారుక్మి ణి, శ్రీవాణి, బానోత్ స్వప్న, సహాయ కార్యదర్శులు గా ఆదినారాయణ, దన్నురి బాలరాజు, లకావత్ బంపర్, బానోత్ వస్రామ్ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు.ఏకగ్రీవంగా జీపీఓల జిల్లా నూతన కమిటీ -
రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్ల ప్రతిభ
ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం ముగిశాయి. బాలుర విభాగంలో విజేతగా హైదరాబాద్ నిలవగా, రంగారెడ్డి, ఖమ్మం జట్లు ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్ జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. పాత పది జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో మ్యాచ్లను నాకౌట్ పద్ధతిలో నిర్వహించారు. కాగా, టోర్నీని డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్, జిల్లా పాఠశాలల క్రీడల సంఘం సలహాదారుడు దేవరకొండ సైదులు ప్రారంభించారు. జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్కుమార్, సాంబమూర్తితో పాటు ప్రవీణ్కుమార్, నాగుల్మీరా, కృష్ణ, అంజయ్య, సైదేశ్వర్రావు పాల్గొన్నారు. జిల్లా కబడ్డీ బాలుర జట్టుకు శిక్షణ కల్లూరు: మహబూబ్నగర్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా బాలుర కబడ్డీ జట్టుకు కల్లూరు మినీ స్టేడియంలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 20 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా ప్రతిభ కనబర్చిన వారితో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేస్తామని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు దయాకర్రెడ్డి, కటికల క్రిస్టోఫర్బాబు తెలిపారు. కాగా, క్రీడాకారులకు క్రీడా దుస్తులు, వసతితో పాటు భోజనం, అల్పాహారాన్ని పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సమకూరుస్తోంది. శిబిరం ఇన్చార్జ్లుగా జి.శ్రీనివాస్, గౌతమ్ గోపాలరావు, సీనియర్ క్రీడాకారులు వ్యవహరిస్తున్నారు. బాలికల విభాగంలో రన్నరప్, తృతీయస్థానంలో బాలురు -
పలు పంచాయతీలు ఏకగ్రీవం
కారేపల్లి: కారేపల్లి మండలంలోని గిద్దెవారిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకునేందుకు మంగళవారం గ్రామస్తులు సమావేశమయ్యా రు. ఈమేరకు ఈసాల నాగేశ్వరరావు పేరు ఖరారు చేసి 3వ తేదీన మొదలయ్యే ప్రక్రియలో ఆయనతో మాత్రమే నామినేషన్ వేయించేలా తీర్మానించారు. కాగా, నాగేశ్వరరావు కాంగ్రెస్లో కొనసాగుతుండగా ఆయన భార్య ఛాయాదేవి కాంగ్రెస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలుగా ఉన్నారు. తనను ఏకగ్రీవం చేసినందున గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ, ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి అయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. తల్లాడ: ఒకప్పుడు గొడవలకు నిలయంగా ఉన్న తల్లాడ మండలం బస్వాపురంలో మూడు పార్టీల నాయకులు కలిసి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టేలా మంగళవారం జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఈమేరకు సర్పంచ్ స్థానానికి పాశం హైమావతిని నిలబెట్టడంతో పాటు బీఆర్ఎస్కు ఉప సర్పంచ్, ఒక వార్డు, కాంగ్రెస్కు, సీపీఎంకు మూడు వార్డులు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. వైరారూరల్: వైరా మండలంలోని 22 గ్రామపంచాయతీ ల కు గాను పుణ్యపురం సర్పంచ్గా కాంగ్రెస్ నుంచి యంగల మరియమ్మ, ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై న విషయం విదితమే. ఇక గోవిందపురం గ్రామపంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ తరపున రంగశెట్టి కళావతితో పాటు మరో ము గ్గురు నామినేషన్లు దాఖలుచేశారు. వీరిలోఇద్దరు మం గళవారం నామినేషన్లు విత్డ్రా చేసుకోగా కళావతి ఏకగ్రీవమైనట్లయింది. ఈగ్రామంలో ఎనిమిది వార్డు స్థానాలకు కూడా ఒక్కో నామినేషనే దాఖలైంది. తిరుమలాయపాలెం: మండలంలోని తిమ్మక్కపేట సర్పంచ్ అభ్యర్థిగా మాస్లైన్కు చెందిన రేపాకుల సుభద్ర అన్ని పార్టీల ఏకగ్రీవ ఆమోదంతో నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచ్గా సుభద్ర ఎన్నిక లాంఛనమే కానుంది. అలాగే, గ్రామంలో ఎనిమిది వార్డు స్థానాలకు కూడా ఒక్కో నామినేషనే దాఖలైంది. -
కేసీఆర్ హయాంలో గ్రామాల అభివృద్ధి
వైరారూరల్: సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే గ్రామాల అభివృద్ధి జరిగిందని.. ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ విమర్శించారు. వైరా మండలం కేజీ సిరిపురంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలన ప్రతీ గ్రామం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పల్లె పాలనను పట్టించుకోకపోగా వైకుంఠధామాలు, రైతు వేదికలు అధ్వానంగా మారాయని చెప్పా రు. అంతేకాక రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యేలు, మంత్రులు జీపీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్ చేసి కాంగ్రెస్ చేరాలని, తద్వారా కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ మభ్య పెడుతున్నారని విమర్శించారు. అంతేకాక జిల్లాలో 42శాతం కాకుండా బీసీలకు కేవలం 9శాతం మందికే సీట్లు ఇచ్చారని మధు తెలిపారు. ఈసమావేశంలో నాయకులు మద్దెల రవి, కట్టా కృష్ణార్జున్రావు, కామినేని శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, అయినాల కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు -
స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యం
డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఖమ్మంమయూరిసెంటర్:జిల్లావ్యాప్తంగా అత్యధిక గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల ను గెలిపించేలా పార్టీ శ్రేణులు పాటుపడాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారా యణ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఏఐసీసీ, పీసీసీ బాధ్యులకే కాక తన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన నేతలకు ఆయన ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించ డం ద్వారా జిల్లా పార్టీ కంచుకోట అని రుజువు చేయాలని కోరారు. 108 ఉద్యోగులకు శిక్షణ తరగతులు ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 108 వాహనాల్లో పనిచేస్తున్న ఈఎంటీ, డ్రైవర్ల (పైలట్లు) కు మంగళవారం ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ గ్రీన్హెల్త్ సర్వీస్ కు చెందిన పార్వతమ్మ సాధారణ, కష్టంతరమైన ప్రసవాలు చేయడంపై ఈఎంటీలకు అవగాహన కల్పించారు. అలాగే, పైలట్లకు డ్రైవింగ్లో మెళకువలు, క్షతగాత్రుల తరలింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 108 జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా ఎమర్జెన్సీ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల ఉద్యోగులు మహేశ్, సతీశ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల బలోపేతంలో ఉపాధ్యాయులే కీలకం మధిర: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్రెడ్డి సూచించారు. మధిర సీపీఎస్ ఉన్నత పాఠశాల, మడుపల్లిలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలను మంగళవారం సందర్శించిన ఆయన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా మెరుగైన బోధన అందించాలని తెలిపారు. ఇందుకోసం టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీఎస్ గ్రంథాలయానికి రూ.3 వేల విలువైన పుస్తకాలను ఆయన అందజేశారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్లీన్ ఖిల్లా..ఖమ్మంమయూరిసెంటర్:నగరంలోనిఖిల్లాపై చెట్లు, పిచ్చిమొక్కలు, కంప తొలగింపు పనులు చివరి దశకు చేరాయి. ఖిల్లాపై కంప చెట్లు పెరగడం, భారీవృక్షాలు ఉండడంతో పైకి వెళ్లడానికి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రోప్వే నిర్మాణం చేపడుతుండగా మొక్కలను కేఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. మూడు వారాలుగా జరుగుతున్న పనులు చివరి దశకు చేరడంతో ఖిల్లాపై, పరిసరాలు శుభ్రమయ్యాయి. -
జింకలకు ఉచ్చు వేసిన ఐదుగురు అరెస్ట్
పాల్వంచరూరల్: కిన్నెరసాని డీర్ పార్కులోని జింకలను చంపేందుకు విద్యుత్ తీగలతో ఉచ్చు వేసిన ఐదుగురిని వైల్డ్లైఫ్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని యానంబైల్ రేంజ్ పరిధి కిన్నెరసాని డీర్ పార్కు శివారులో సోమవారం రాత్రి విద్యుత్ ఉచ్చులు వేసినట్లు సమాచారం అందుకున్న వైల్డ్లైఫ్ సిబ్బంది బి.కిషన్, నగేశ్, వాచర్స్ కల్యాణ్, ఇబ్రహీం ఘటనా ప్రదేశానికి వెళ్లారు. ఉచ్చులు వేసిన, రాజాపురం గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేశ్వర్లు, కల్తీ శ్రావంత్, పడిగే శ్రీను, కల్తీ నర్సింహారావు, యానంబైల్ గ్రామానికి చెందిన గుమ్మడి నాగేశ్వరరావును పట్టుకుని విద్యుత్ ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. -
పాతలింగాల
ఏకగ్రీవంలో ఆదర్శం.. కామేపల్లి: కామేపల్లి మండలంలోని మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామమైన పాతలింగాల గ్రామపంచాయతీ ఏకగ్రీవంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామంలో 788 మంది ఓటర్లు ఉండగా 407 మహిళలు, 381 పురుషులు ఉన్నారు. వీరంతా ఏకతాటిపై నిలుస్తూ పాలకవర్గం ఏకగ్రీవంతో జరిగే ప్రయోజనాలను గుర్తించి ముందు కు సాగుతున్నారు. ఫలితంగా 35ఏళ్లుగా గ్రామంలో పోటీ లేకుండానే సర్పంచ్ సహా పాలకవర్గాన్ని ఎన్నుకుంటుండడం విశేషం. స్నేహపూర్వక సంబంధాలు గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొ దలుకాగానే గ్రామస్తులంతా సమావేశమవుతారు. గత పాలకవర్గాల హయాంలో జరి గిన అభివృద్ధిపై చర్చించడంతో పాటు భవిష్యత్ పనులపై సమీక్ష నిర్వహించుకుంటారు. ఆతర్వాత పాలకవర్గం ఏకగ్రీవంపై దృష్టి సారి స్తారు. పోటీ చేయడం ద్వారా ఎన్నికల నిర్వహణ, ప్రచారం తాలూకా ఖర్చులతో ఎదురయ్యే ఇబ్బందులను సమీక్షించుకుంటారు. అంతేకాక పోటీ ద్వారా గ్రామస్తుల నడుమ స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతింటాయనే భావనతో గ్రామస్తులు కలిసికట్టుగా సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటారు. తద్వారా 35ఏళ్లుగా పాతలింగాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకుండా పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రసుత్తం కామేపల్లి మండలంలో రెండో విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. కాగా, పాతలింగాల గ్రామపంచాయతీ ఈసారి ఎస్టీ మహిళా రిజర్వ్ కాగా గ్రామానికి చెందిన కిన్నెర సుజాత మాత్రమే ఏకాభిప్రాయంతో సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాక ఎనిమిది వార్డులకు కూడా సింగిల్ నామినేషనే దాఖలవడంతో గత ఆనవాయితీని కొనసాగించినట్లయింది. గ్రామ అభివృద్ధి కోసమే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా గ్రామస్తులందరం నిర్ణయం తీసుకున్నాం. సర్పంచ్, వార్డు మెంబర్లను ఎంపిక చేసుకున్నాక నామినేషన్ దాఖలు చేశాం. సర్పంచ్ స్థానానికి నేను నామినేషన్ దాఖలు చేయగా అధికారులు ప్రకటించడమే మిగిలింది. – కిన్నెర సుజాత పాతలింగాలలో 35ఏళ్లుగా గ్రామపంచాయతీ ఎన్నికలు లేకుండా సర్పంచ్, వార్డుసభ్యులను ఎన్నుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాం. నూతన సర్పంచ్కు సైతం గ్రామస్తులు సహకరిస్తూ అభివృద్ధిలో పాలుపంచుకుంటారు. మా గ్రామం ఆదర్శంగా ఇంకొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నారు. – రాంరెడ్డి గోపాల్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సీసీఎఫ్ బీమానాయక్ఖమ్మంవ్యవసాయం: అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు బాధ్యతలను విస్మరిస్తే చర్యలు తప్పవని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) బీమానాయక్ హెచ్చరించారు. జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ) సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఆయన ఖమ్మం దానవాయిగూడెంలో నిర్మించిన బీట్ ఫీసర్ క్వార్టర్లను పరిశీలించాక వెలుగుమట్లలో అర్బన్ పార్క్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్కు నిర్వహణ, టికెట్ల విక్రయం, వచ్చిన ఆదాయం ఎంత అనే వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్కు నిర్వహణలో పలు లోపాలను గుర్తించిన సీసీఎఫ్, డీఎఫ్ఓలు అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇటీవల కారేపల్లి రేంజ్ నుంచి పార్క్కు తీసుకువచ్చిన రెండు నెమళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించారు. అలాగే, ఔషధ మొక్కల పెంపకం, స్విమ్మింగ్ పూల్, బోట్ల నిర్వహణ వివరాలు ఆరా తీశారు. ఆతర్వాత తల్లాడ ఫారెస్టు రేంజ్లో అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు ఓ క్షేత్రంలో నరికిన ఎర్ర చందనం లాట్ వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి జిల్లా అటవీ కార్యాలయానికి వెళ్లిన సీపీఎఫ్, డీఎఫ్ఓలు వన్యప్రాణుల వేట, సండ్ర కలప అక్రమ రవాణా వ్యవహారాలపై చర్చించారు. ఖమ్మం, సత్తుపల్లి డివిజన్ల అటవీ అధికారి మంజుల, రేంజ్ అటవీ అధికారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
రెండో దశకు నేటితో తెర
● ఆరు మండలాల్లో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ● మొదటి దశ ఉపసంహరణకు రేపటి వరకు గడువు ● ఉపసంహరణ, ఏకగ్రీవంపై దృష్టి సారించిన పార్టీలు సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో దశ గ్రామపంచా యతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. జిల్లాలోని ఆరు మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజైన సోమవారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపించారు. ఇక మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం వరకు ఉంది. ఈనేపథ్యాన రెబెల్స్ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారు. రెండో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు. రెండో రోజున ఇలా.. కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183సర్పంచ్ స్థానాలు, 1,686 వార్డు స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయ పాలెం, కామేపల్లి మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 229, వార్డులకు 587నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో నామినేషన్లపై రాత్రివరకు స్పష్టత రాలేదు. ఇక్కడ నామినేషన్ల స్వీకరణ మంగళవారం ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. అత్యధిక సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం చేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడి ఆశావహులతో చర్చలు జరుపుతున్నారు. చర్చలు సఫలమైతే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటే నామినేషన్ దాఖలవుతుందని.. ఆశావహులు వెనక్కి తగ్గకపోతే పోటీ తప్పదని తెలుస్తోంది. ఉపసంహరణలపై దృష్టి మొదటి విడత ఎన్నికలు కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో జరగనుండగా.. కొన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని చోట్ల ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో గడువు ముగిసే గురువారం నాటికి నామినేషన్లు ఉపసంహరింపచేసేలా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా మరికొన్ని చోట్ల ఏకగ్రీవమయ్యే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉపసంహరణకు అంగీకరించినా, ఇతరుల పోటీతో పోలింగ్ అనివార్యమైతే గెలిచే అభ్యర్థులనే బరిలో ఉంచాలని నేతలు భావిస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికల వార్ గ్రామపంచాయతీల్లో ఎన్నికలతో గ్రామాల్లో వేడి నెలకొంది. స్థానిక అంశాలతో ముడిపడిన ఎన్నికలు కావడంతో ఎక్కడ చూసినా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. బరిలో ఎవరు ఉన్నారు.. ఎవరికి గెలిచే అవకాశం ఉందంటూ చర్చలు జరుపుతున్నారు. కాగా, గ్రామస్థాయిలో పార్టీల ఆధ్వర్యాన అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, రెబెల్స్తో మంతనాలు జరుగుతుండగా.. సమస్య పరిష్కారం కాకపోతే మండల, జిల్లాస్థాయి నేతల వద్దకు వెళ్తున్నారు. దీంతో మొదటి, రెండు విడతలు ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఖమ్మం సహకారనగర్: జిల్లాలో తొలివిడత ఎన్నికల్లో గ్రామపంచాయతీల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. మొదటి విడతగా ఏడు మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలు, 1,740 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా గత నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. వీటిని పరిశీలించగా సరైన ధ్రువపత్రాలు సమర్పించని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అలాగే, కొందరు రెండు, మూడు సెట్లు సమర్పించగా ఒకటి ఆమోదించి మిగతావి తిరస్కరించినట్లు తెలిపారు. మొత్తం సర్పంచ్ స్థానాలకు 1,142 నామినేషన్లు దాఖలు కాగా 215 తిరస్కరించడంతో 927 మిగిలాయి. ఇక 1,740వార్డులకు దాఖలైన 4,054 నామినేషన్లలో 73 తిరస్కరించామని, మిగతా 3,981 మిగిలాయని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ విడతలో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం అవకాశం ఉండగా, అదేరోజు సాయంత్రం బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. -
సీఎం సారూ..
ఇటు చూడరూ!ఉమ్మడి జిల్లాలో ఆర్అండ్బీ రహదారులు అధ్వానంగా మారాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు భారీ వాహనాలు ఇక్కడి నుంచే ప్రయాణిస్తుంటాయి. చాలాచోట్ల రహదారులపై గుంతలు ఏర్పడి, కంకర తేలగా ఏటా వర్షాకాలంలో మరమ్మతులకు ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలు పంపినా నిధులు రావడం లేదు. తల్లాడ–ఖమ్మం, వైరా నుంచి మధిర వెళ్లే రోడ్డు, కొణిజర్ల మండలం పల్లిపాడు– ఏన్కూరు తదితర ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్లతోనే సరిపెడుతుండగా కొన్నాళ్లకే పరిస్థితి మొదటికొస్తోంది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనుల్లో పురోగతి మందగిస్తోంది. ప్రధానంగా వరప్రదాయినిగా నిలవాల్సిన సీతారామ ప్రాజెక్టు పనులు నిధుల కొరత, భూసేకరణతో ముందుకు సాగడం లేదు. ఇక జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు భారీ వాహనాలు రాకపోకలు సాగించే ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయి. అలాగే, సత్తుపల్లి ప్రాంతంలో నిర్మించిన ఫుడ్పార్క్ దశాబ్దాలుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇవికాక అనేక సమస్యలు తిష్ట వేసినందున మంగళవారం కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీతారామకు నిధుల కష్టాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం మందగించింది. భద్రాద్రి జిల్లాలో మూడు పంపుహౌస్లు, 104 కి.మీ. మేర ప్రధాన కాల్వ పూర్తయినా, ఖమ్మం జిల్లాలో ప్రధాన కాల్వ, టన్నెళ్ల తవ్వకంలో జాప్యం నెలకొంది. ఇప్పటి వరకు చేసిన పనులు, భూసేకరణకు సంబంధించి రూ.258.26 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే, ఖమ్మం జిల్లాలో ఆరో ప్యాకేజీ మినహా మిగతా ప్యాకేజీలకు అనుమతులు రాలేదు. అంతేకాక సత్తుపల్లి ట్రంక్, పాలేరు లింక్ కెనాల్ పనులు పెండింగ్లో ఉన్నాయి. రెండు జిల్లాల్లో 1,138.693 ఎకరాల అటవీ భూమి సేకరణకు అడ్డంకులతో పనుల్లో జాప్యం జరుగుతోంది. అలంకార ప్రాయంగా ఫుడ్పార్క్ సత్తుపల్లి నియోజకవర్గంలోని మెగా ఫుడ్పార్క్కు మోక్షం లభించడం లేదు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్కు శంకుస్థాపన చేశారు. ఆయన మృతితో ఫుడ్పార్క్ మూలన పడింది. ఇక 2017లో ఫుడ్పార్క్ అభివృద్ధిపై అప్పటి మంత్రులు కేటీఆర్, తుమ్మల దృష్టి సారించినా పెద్దగా ఫలితం కానరాలేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బుగ్గపాడు ఫుడ్పార్క్ను సందర్శించినా కదలిక రాలేదు. 2018లో రెండు కంపెనీలు వచ్చినప్పటికీ పరిశ్రమలు ఏర్పాటుచేయలేదు. భూమి ధర ఎక్కువగా ఉండడం, ఇతర కారణాలతో పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని తెలుస్తుండగా ప్రభుత్వం చొరవ చూపితే ఇటు రైతులు, ఇటు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడుతుంది. ‘సీతారామ’కు నిధుల కష్టాలు -
సజావుగా నామినేషన్ల స్వీకరణ
కామేపల్లి/రఘునాథపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగేలా అధికారులు విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కామేపల్లి మండలం కొమ్మినేపల్లిలో సోమవారం నామినేషన్ల స్వీకరణను పరిశీలించిన ఆమె ఉద్యోగులతో మాట్లాడారు. అలాగే, రఘునాథపాలెం జీపలో నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా తయారీని పరిశీలించిన అదనపు కలెక్టర్ గుర్తుల కేటాయింపుపై సూచనలు చేశారు. కామేపల్లి మండల ప్రత్యేకాధికారి మధుసూదన్, ఎంపీడీఓలు రవీందర్, ఆశోక్కుమార్, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శులు శంకర్, ఫజల్, లావణ్య పాల్గొన్నారు. 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఖమ్మం సహకారనగర్: ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 10 మంది అధికారులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు కీలకమైనందున హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయగా, కఠిన చర్యలు ఎందుకు తీసుకోవద్దో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ట్రెజరీ శాఖ డీడీగా శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: హనుమకొండ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీఓ)గా పనిచేస్తున్న వై.శ్రీనివాసరెడ్డిని ఖమ్మం ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో నియమించారు. ఈమేరకు గతనెల 27వ తేదీన ఉత్తర్వులు జారీ కాగా, సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు మహబూబాబాద్ ట్రెజరీ అధికారి వెంటపల్లి సత్యనారాయణ డీడీగా విధులు నిర్వర్తించారు. 22, 23వ తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్ఫేర్? ఖమ్మం సహకారనగర్: జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ను ఈనెల 22, 23వ తేదీల్లో నిర్వహించాలని విద్యా శాఖాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత 10, 11, 12వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినా స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో మార్పు చేయనున్నారు. ఈనెల 19నుంచి 24వ తేదీల మధ్య అనువుగా ఉంటుందని భావించిన అధికారులు 22, 23వ తేదీల్లో నిర్వహణకు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలతో సమావేశం నిర్వహించి ఎగ్జిబిట్ల నమోదుపై చర్చించినట్లు సమాచారం. ‘సీఎం ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలి’ఖమ్మంవైరారోడ్: హామీలు అమలుచేయకపోగా రిజర్వేషన్లలో బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాకు ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ సూచించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి జరగకపోగా, పంచాయతీ ఎన్నికల వేళ సీఎం పర్యటన పేరుతో ప్రజలపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక రెండేళ్లుగా జిల్లాలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. కాగా, బీసీలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని గమనించి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు బిచ్చల తిరుమలరావు, తాజుద్దీన్, గుండ్లపల్లి శేషు, పగడాల నరేందర్, మక్బూల్, మాటేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరంభం అదుర్స్ !
● వైరా డిపో నుంచి వైన్స్కు భారీగా మద్యం ● రెండురోజుల్లో రూ.33కోట్ల విలువైన మద్యం అమ్మకాలు వైరా: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి జిలాల్లో వైన్స్ దక్కించుకున్న వ్యాపారులు షాప్లను సోమవారం ప్రారంభించారు. ఈమేరకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి మద్యం దిగుమతి చేసుకున్నారు. సోమవారం నుంచి వైన్స్ ప్రారంభం కావాల్సి ఉండగా ఆదివారమే రూ.20 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఇందులో 23 వేల కేసుల మద్యం, 9 వేల కేసుల బీర్లు ఉన్నాయి. ఇక సోమవారం 15,600 కేసుల మద్యం, 7,500 కేసుల బీర్లు తీసుకెళ్లగా వీటి విలువ రూ.13.25కోట్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో రెండు రోజు ల్లోనే వైన్స్ యజమానులు రూ.33.25 కోట్ల విలువైన మద్యం దిగుమతి చేసుకున్నట్లయింది. పంచాయతీ ఎన్నికలతో వైన్స్ ప్రారంభించిన మొదటి నెలలోనే జోరుగా అమ్మకాలు సాగుతాయని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన లిక్కర్ మార్ట్లు ఖమ్మంక్రైం: జిల్లాలోని 116 వైన్స్ షాపులు సోమవారం మొదలుకాగా, ఖమ్మంలో లిక్కర్ మార్ట్ల సంఖ్య మూడు నుంచి ఏడుకు చేరింది. ఈ షాప్లు రెండేళ్ల పాటు కొనసాగనున్నాయి. కొన్ని వైన్స్లు ఏర్పాటుచేసిన షాప్ల అద్దె నెలకు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు పలికినా వ్యాపారులు వెనక్కి తగ్గనట్లు తెలిసింది. అలాగే, పలు ప్రాంతాల్లో వైన్స్ వద్ద తినుబండారాలు అమ్మే షాప్లు దక్కించుకునేందుకు పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో పైరవీ చేయించుకున్నట్లు సమాచారం. ఖమ్మం ముస్తఫానగర్లోని అల్లీపురం క్రాస్ వద్ద వైన్స్ షాపు ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. వీరికి కార్పొరేటర్ పల్లా రోజ్లీనా, బీఆర్ఎస్ నాయకుడు వెంకన్న తదితరులు మద్దతు తెలిపి మందుబాబుల తీరుతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆరోపించారు. దీంతో వన్టౌన్ పోలీసులు వచ్చి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని నచ్చజెప్పడంతో మధ్యాహ్నం 12గంటల తర్వాత షాప్ తెరుచుకుంది. -
కాంగ్రెస్తోనే బలహీనవర్గాలకు ప్రాధాన్యత
● డీసీసీ అధ్యక్షుడిగా ‘నూతి’ బాధ్యతల స్వీకరణలో డిప్యూటీ సీఎం భట్టి ● హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో బలహీన వర్గాలకే ప్రాధాన్యత దక్కుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ బాధ్యతల స్వీకరణ సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. తొలుత శ్రీశ్రీ సర్కిల్ నుంచి భారీ ప్రదర్శనగా జెడ్పీ సెంటర్కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నూతి సత్యనారాయణ నివాళులర్పించారు. ఆతర్వాత పువాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉండి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం, పార్టీ లేదా నామినేటెడ్ రూపంలో పదవులు లభిస్తాయని చెప్పారు. కార్యకర్తల కష్టంతోనే జిల్లా కాంగ్రెస్కు కంచుకోటగా నిలుస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా రాజకీయాలు పక్కన పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయానికి త్వరలోనే భూమి పూజ చేస్తామని తెలిపారు. -
‘ఆరోగ్యశ్రీ’లో ఖరీదైన వైద్యం
● గుండె జబ్బు బాధితుడికి పర్మనెంట్ పేస్మేకర్ ● జిల్లా పెద్దాస్పత్రిలో తొలిసారిఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారిగా పర్మనెంట్ పేస్మేకర్(గుండె లయను నియంత్రించడానికి ఉపయోగించే పరికరం) అమర్చే శస్త్రచికిత్స నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన ఈ చికిత్సతో గుండె సంబంధిత సమస్యతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ప్రాణం నిలబెట్టారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంకు చెందిన డి.వెంకన్న(67) తీవ్రమైన ఆయాసంతో బాధపడుతుండగా కుటుంబీకులు పెద్దాస్పత్రి కార్డియాలజీ విభాగానికి గతనెల 24వ తేదీన తీసుకొచ్చారు. అయితే, ఆరోగ్యవంతులైన వారి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సి ఉండగా, వెంకన్న గుండె 25 సార్లే కొట్టుకుంటున్నట్లు పరీక్షల అనంతరం గుండె వైద్య నిపుణులు డాక్టర్ సీతారామ్ గుర్తించారు. దీంతో తాత్కాలిక పేస్మేకర్ అమర్చి అత్యవసర చికిత్స చేసినా, పర్మనెంట్ పేస్మేకర్ వేయడానికి అవకాశం లేక మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ దృష్టికి తీసువెళ్లారు. ఆయన చొరవతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంకన్నకు క్యాథల్యాబ్లో శస్త్ర చికిత్స నిర్వహించి గుండె కుడివైపు పేస్మేకర్ పరికరాన్ని అమర్చడంతో ఆయన కోలుకుంటున్నాడు. కాగా, పేస్మేకర్ శస్త్రచికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.3.50 లక్షలు వరకు ఖర్చవుతుందని, కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరికరం 12 ఏళ్లపాటు పనిచేస్తుందని, ఆతర్వాత కొత్త బ్యాటరీని అమర్చాల్సి ఉంటుందని వివరించారు. కాగా, శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ సీతారామ్, సహకరించిన మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్, ఆపరేషన్లో పాల్గొన్న వైద్యులు, సిబ్బందికి వెంకన్న కుటుంబీకులు కృతజ్జతలు తెలిపారు. -
హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు
ఖమ్మంస్పోట్స్: జిల్లాస్థాయి ఖేలో ఇండియా ఆధ్వర్యాన బాలికల విభాగంలో నిర్వహించిన అస్మిత అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలను ఖమ్మం రైల్వే సీఐ అంజలి ప్రారంభించారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రవికుమార్, డాక్టర్ సత్యనారాయణ, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎండీ షఫిక్తో పాటు ఎం.సుధాకర్, డి.రవి, సీహెచ్ కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, ఎల్.రవి, జి.ముజాహిద్, అజ్రాఫాతిమా తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–14 బాలికల ట్రయథిలిన్ ఈవెంట్ గ్రూప్–ఏలో ఎండీ ఆఫ్రిన్, కె.సంజన, ఎస్కే హాసిని, సీహెచ్ స్వర్ణపుష్ప, గ్రూప్–బీ విభాగంలో బి.శ్రీలేఖ, ఎం.బిందు, ఆర్.గీతయామిని, గ్రూప్–సీలో ఎస్కే సనీయా, బి.నిఖిత, ఎస్.హర్షిత, పి.సోనఖాన్ వరుస స్థానాల్లో నిలిచారు. అండర్–16 60 మీటర్ల పరుగులో ఎ.మనుశ్రీ, ఎస్.సల్మామెహతాబ్, బి.పూజిత, బి.సంగీత, 600 మీటర్ల పరుగులో బి.దీక్ష, బి.సంగీత, ఎస్కే సల్మామెహతా, లాంగ్జంప్లో ఎ.మనుశ్రీ, బి.కావేరి, జి.మంజుషా, ఎస్డీ బాషారా, హైజంప్లో బి.మైథిలి, ఎస్.సమీరా, ఎ.ఇందిర, షాట్ఫుట్లో డి.పావని, బి.అఖిల, సీహెచ్.సుకీర్తి, ఈ.రమ్యశ్రీ, డిస్కస్త్రోలో డి.పావని, పి.తనుశ్రీ, బి.అఖిల, పి.కీర్తి, జావెలీన్త్రోలో ఎల్.అమ్ములు, పి.తనుశ్రీ, ఎస్.సాయివర్షిత విజేతలుగా నిలవడంతో పతకాలు అందజేశారు. -
పంచాయతీ ఓటర్ల కోసం ‘టీ–పోల్ యాప్’
భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సులభంగా ఎన్నికల సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీ–పోల్ (టీఈ పీఓఎల్ఎల్) మొబైల్ యాప్ను రూపొందించింది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటరు స్లిప్పులను కోసం, ఎన్నికల నిర్వహణలో ఫిర్యాదు చేయడానికి ఈ యాప్ సాయపడుతుంది. గూగుల్ ప్లేస్టోర్లో ఈ యాప్ డౌలోడ్ చేసుకోవాలని అధికారులు ఓటర్లకు సూచిస్తున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి అజ్ఞాతవాసంపై ఆరా ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, ప్రస్తుత స్థానిక సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వల్లాల మంగమ్మ అజ్ఞాతవాసంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శనివారం రాత్రి రహస్యంగా సుభాష్నగర్లోని ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎన్నికల నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థి అజ్ఞాతవాసం ఘటన బీఆర్ఎస్ నేతల్లోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి నేటికీ ఖరారు కాకపోవడంపై సందేహంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు తరచూ మంగమ్మ ఆచూకీ కోసం ఓ వైపు ఆరా తీస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం చర్చిస్తున్నారు. -
● ముద్దాయిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ● వివరాలు వెల్లడించిన ఇల్లెందు డీఎస్పీ
రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్ మృతితల్లాడ: తల్లాడలోని కొత్తగూడెం రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీడ్రైవర్ పెద్ది సురేశ్ (30) మృతి చెందాడు. ఖమ్మం నుంచి కొత్తగూడె రోడ్డు వైపు వెళ్తున్న లారీడ్రైవర్ వేబ్రిడ్జి వద్ద లారీని ఆపి రోడ్డుపై నిల్చున్నాడు. తల్లాడ నుంచి అన్నారుగూడెం వైపు అతివేగంగా మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి సురేశ్ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన సురేశ్ను ఓ ప్రేవేట్ ఆస్పత్రిలో చేర్పించగా ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. లారీడ్రైవర్ది ఖమ్మం సమీపంలోని వైఎస్ఆర్కాలనీ. రెండో ఎస్ఐ వెంకటేశ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో హుండీ చోరీకల్లూరురూరల్: కల్లూరులోని పుల్లయ్యబంజర్ రోడ్డులో గల సమ్మక్క, సారలమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీపగల గొట్టి డబ్బులు చోరీ చేశారు. ఈ హుండీలో 3 నెలల నుంచి నగదును తీయకుండా ఉంచా మని ఆలయ పూజారి అంజి స్వామి తెలిపారు. ఆదివారం ఉదయం చూడగా హుండీ పగలగొట్టి ఉన్నదని, హుండీలో ఉన్న నగదును దొంగలు అపహరించినట్లు గుర్తించామని, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని అంజిస్వామి వెల్లడించారు. రూ.99.83 లక్షల విలువైన గంజాయి పట్టివేతటేకులపల్లి : అక్రమంగా తరలిస్తున్న 199.673 కేజీల గంజాయిని టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఇల్లెందు డీఎస్పీ ఎన్ చంద్రభాను ఆదివారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన లాల్సింగ్ చౌహాన్ అలియాస్ లాక్సింగ్ 30 ఏళ్లుగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల గ్రామంలో స్వీట్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఏఓబీ(ఆంధ్ర ఒడిశా బోర్డర్) నుంచి రాజస్థాన్కు ఏపీ31 డీఏ 4554 నంబర్ గల మారుతీ సియాజ్ కారులో 199.673 కేజీల గంజాయిని 100 ప్యాకెట్లుగా చేసి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టేకులపల్లి మండలం సాయనపేట వద్ద ఎస్ఐ ఎ. రాజేందర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. కాగా, పోలీసులను తప్పించబోయిన ముద్దాయి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టి దొరికిపోయాడు. కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు వాహనంతో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్ నిమిత్తం ఇల్లెందుకు కోర్టుకు తరలించారు. కాగా, లాల్సింగ్పై ఏపీలో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతడి తల్లి కన్కార్ దేవి, భార్య మాఫీ కన్వర్ కూడా గంజాయి తరలిస్తూ పట్టుబడగా ఏపీలోని ఎస్.రామవరం పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారని, లాల్సింగ్ సోదరుడు వీర్సింగ్ రాజస్థాన్ జైలులో ఉన్నాడని వివరించారు. సమావేశంలో సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
‘మేమెంతో.. మాకంత’
ఖమ్మంమామిళ్లగూడెం: మేమెంతో మాకు అంత రిజర్వేషన్ కావాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఓ ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభలో వారు పాల్గొని మాట్లాడారు. అగ్రకుల ఆధిపత్యంతోనే నక్సలిజం పుట్టిందని, అందుకే మనకు రాజ్యాంగ ఫలాలు అందలేదని పేర్కొన్నారు. ఓసీల్లో పేదరికం 4 శాతం ఉంటే 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ద్వారా రాజకీయ స్వరూపాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. సుంకర శ్రీనివాస్, సంగమేశ్వర్, తాటి వెంకటేశ్వర్లు, సంపత్, బండి నాగేశ్వరరావు, శివన్, ముత్యాలరావు, రాంబాబు, విజయకుమారి, మేకల సుగుణారావు, బానోతు భద్రునాయక్, సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. సమాజం మద్దతు పొందాలి..టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ కల్లూరురూరల్: ఉపాధ్యాయులు సమాజం మద్దతు పొందాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ కోరారు. కల్లూరు లో ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కే రంజాన్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయు లు కృషిచేయాలన్నారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నారో గ్రహించాలని, ఉపాధ్యాయులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటే పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు రాయల నాగేశ్వరరావు, విజయ్కుమార్, బాగం నీరజాదేవి, పారుపల్లి నాగేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు, నెల్లూరు వీరబాబు, చావా దుర్గభవాని, బాణోతు రాందాస్ పాల్గొన్నారు. రెండోస్థానంలో సింగరేణి జట్టురుద్రంపూర్: కోలిండియాస్థాయి కబడ్డీ పోటీల్లో వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ జట్టు విజేతగా నిలిచింది. సింగరేణి జట్టు రెండోస్థానం పొందింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో మూడు రోజులుగా జరుగుతున్న కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్స్లో సింగరేణి జట్టుపై వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ జట్టు 44 పాయింట్ల అధిక్యతతో విజయం సాధించింది. కోలిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆతిథ్య సింగరేణి జట్టు రెండో స్థానంలో నిలిచింది. విజేతలకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ బొగ్గు ఉత్పత్తి సంస్థల కార్మికులు కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటారని అన్నారు. ఆటల్లో గెలుపు ఓటమిలు సహజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ, జీఎం శాలేంరాజు, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం నాయకులు త్యాగరాజన్, సీఎంఓఏఐ ఈబీసీ నాయకులు బి. రాజ్గోపాల్, నరసింహారావు, జీఎంలు కిరణ్కుమార్, ఎం.సుబ్బారావు, కోటిరెడ్డి, సూర్యనారాయణ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
1959లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆవిర్భావం
భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. ఇంతకీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసా.? దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్యం – సామ్యవాదం నినాదంతో దేశంలో పాలన సాగించారు. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ప్రొఫెసర్ ఎస్కేడే నేతృత్వంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అమలు చేశారు. దీనిపై శాసీ్త్రయ అధ్యయనానికి సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ బల్వంత్రాయ్ నేతృత్వంలో అధ్యయన బృందాన్ని నియమించారు. ఈ కమిటీ ఆధారంగా 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయతీ.. మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థను దేశంలో తొలుత రాజస్థాన్లోని నాగౌర్లో అక్టోబర్ 2న ప్రారంభించగా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్లో 1959 అక్టోబర్ 11న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థకు చట్టబద్ధత వచ్చింది. -
పీడిస్తున్న మహమ్మారి..
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో ఎయిడ్స్ మహ మ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు కానరావడం లేదని తెలుస్తోంది. వ్యాధి బారిన పడేవారి సంఖ్య ఎక్కు వ అవుతుందే తప్ప తగ్గడం లేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చర్య లు నామమాత్రంగా ఉండటం.. ఎయిడ్స్ అండ్ లెప్రసీ విభాగానికి ప్రత్యేక అధికారి లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరోపక్క స్వచ్ఛంద సంస్థల బాధ్యులు కూడా ఈ అంశంపై కార్యాచరణ రూపొందించకపోవడం, ఎయిడ్స్వ్యాధి వ్యాప్తి, నష్టాలపై ప్రచారం సక్రమంగా నిర్వహించే వారు లేక వ్యాధికి అడ్డుకట్ట పడడం లేదు. జిల్లాలో ప్రతీనెల 50కి పైగా హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేలా ప్రజలకు అవ గాహన కల్పించేందుకు ఏటా జరుపుకునే ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం నేడు (సోమవారం) జరగనున్న సందర్భంగా కథనం. కేసులు ౖపైపెకి జిల్లాలో ఎయిడ్స్ బాధితులు ఏటా పెరుగుతున్నా రు. గత ఏడాది అక్టోబర్ వరకు 17,199 పాజిటివ్ కేసులను అధికారికంగా గుర్తించారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏర్పడ్డాక ఇప్పటి వరకు నమోదైన కేసులు ఇవి కాగా.. ఏటేటా మరిన్ని పెరుగుతున్నా యి. ప్రస్తుతం కేసుల సంఖ్య 17,743కు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 53,691మంది పరీక్షలు చేయగా 258 కొత్త పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇందు లో 11మంది గర్భిణులు కూడా ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రంలో 7,112 మంది ఎయిడ్స్ బాధితులు పేర్లు నమోదు చేసుకు ని ప్రతీనెల క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారు. వారిలో 3,415 మందికి ఆసరా పింఛన్ కూడా అందుతోంది. 4,680 మందిని బలిగొన్న మహమ్మారి జిల్లాలో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. జిల్లాలో 2006 నుంచి ఇప్పటి వర కు 4,680 మంది ఎయిడ్స్ కారణంగా మృతి చెందారు. అయితే, ఇవి ప్రభుత్వ పరంగా నమోదైన కేసులు మాత్రమే. నమోదు కాని కేసుల సంఖ్య, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు. జిల్లాలో నాలుగు ఐసీటీసీ, ఒక సుఖ వ్యాధి చికిత్స, 38 ఎఫ్ఐసీటీసీ, ఒక ఏఆర్టీ, రెండు లింక్ ఏఆర్టీ కేంద్రాలు, 11 రక్త నిధి కేంద్రాలు హెచ్ఐవీ నియంత్రణకు పనిచేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. ఎయిడ్స్ నియంత్రణకు పనిచేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి నిధులు భారీగానే అందుతున్నాయి. కానీ, ప్రజల్లో అవగాహన కల్పించడంలో చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. ఎయిడ్స్ నియంత్రణకు పాటు పడాల్సిన జిల్లా అధికారి పోస్టు చాలాకాలంగా ఖాళీగానే ఉంటోంది. దీంతో ఎయిడ్స్ విభాగాన్ని ముందుకు నడిపేవారు లేక మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ఏడాది కేసులు చేసిన పరీక్షలు 2021–22 445 47,714 2022–23 512 86,120 2023–24 559 1,18,796 2024–25 567 1,10,056 2025–26 258 53,691 (అక్టోబర్ వరకు) నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం జిల్లాలో ఎయిడ్స్ కట్టడికి కృషి చేస్తున్నాం. వ్యాధి వ్యాప్తిని అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. బాధితులందరూ క్రమం తప్పక మందు లు వాడేలా పర్యవేక్షిస్తున్నాం. ర్యాలీలు, కళాజాత ద్వారా ఎయిడ్స్ వ్యాధి తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా.. ఈ కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తాం. – డి.రామారావు, డీఎంహెచ్ఓ -
మసీదును సందర్శించిన హిందువులు
ఖమ్మంమామిళ్లగూడెం: జమాతే ఇస్లామి హింద్ సెంట్రల్ శాఖ, ముతవల్లి జామా మస్జీద్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘మసీదుకు రండి.. సందర్శించండి’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో కమాన్బజార్లోని జామా మసీద్కు హిందువు లు, క్రైస్తవులు రాగా.. వారికి నమాజ్ ఆచరణ, వజూ చేసే విధానాన్ని వివరిచారు. కార్యక్రమంలో మొహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ ము జాహిద్, జైనుల్పాషా, అబ్దుల్ సమీ, ఇంతియాజ్, మొహమ్మద్ యూసుఫ్షరీఫ్, సయ్యద్ నిజాముద్దీన్, అబ్దుస్ సుబుర్, అబ్దుల్ మలిక్, నజీముద్దీన్, మహే మూద్, హంజా, మొహమ్మద్ ఖాసీం, అబ్దుల్ ముజీబ్, ఖలీల్ అహ్మద్ఖాన్, ఫయాజ్, షేక్ ఇలియాస్ పాల్గొన్నారు. -
లింగమూర్తి సేవలు మరువలేనివి..
ఖమ్మంమామిళ్లగూడెం: ఆర్టీసీ ఉద్యోగిగా పలు హోదాల్లో పనిచేసిన గడ్డం లింగమూర్తి సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం ముస్తఫారగర్లోని లింగమూర్తి స్వగృహం వద్ద స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్యక్షతన లింగమూర్తి ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమూర్తి, కౌసల్య దంపతులను సత్కరించారు. తూములూరి వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వజ్రాల శ్రీనివాసరావు, పిల్లి రమేశ్, ఎ.కృష్ణ, జె.పద్మావతి, బాణాల రాంబాబు, మాధవరావు, సుధాకర్, ఎంఆర్.నాథ్, నామా వీరభద్రం, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. స్వామివారికి సువర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కాగా, హైదరాబాద్లోని రవీంద్రభారతిలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. -
నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన అదనపు కలెక్టర్
నేలకొండపల్లి/చింతకాని/ముదిగొండ: గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ డాక్టర్.పి.శ్రీజ పర్యవేక్షించారు. నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి, కోనాయిగూడెం, రాజేశ్వరపురంలో నామినేషన్ల స్వీకరణను ఆదివారం పరిశీలించిన ఆమె ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, చింతకాని మండలం నాగులవంచలో నామినేషన్ల పరిశీలనను పర్యవేక్షించిన శ్రీజ.. ప్రతీ నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇక నేలకొండపల్లి మండలంలోని పలు కేంద్రాల్లో అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఎంపీడీఓలు ఎం.ఎర్రయ్య, శ్రీనివాసరావు, తహసీల్దార్, వి.వెంకటేశ్వర్లు, ఎంపీఓ సీ.హెచ్.శివ తదితరులు పాల్గొన్నారు. ముదిగొండ మండలంలోని వెంకటాపురంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కూడా అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ శ్రీధర్స్వామిని ఆదేశించారు. -
ఖమ్మం–దేవరపల్లి హైవే పరిశీలన
పనుల్లో పురోగతిపై మంత్రి తుమ్మల ఆరా ఖమ్మంఅర్బన్: ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. కొదుమూరు నుంచి సత్తుపల్లి వరకు హైవేపై ప్రయాణించిన ఆయన పనులపై ఆరా తీస్తూ వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. హైవే నిర్మాణం పూర్తయితే ఖమ్మం – ఏపీ మధ్య రాకపోకలు సులభమై వ్యాపార, రవాణా రంగాలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. కొన్నిచోట్ల హైవే విస్తరణ, రోడ్డు లెవలింగ్, వంతెన నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. ధంసలాపురం వద్ద రైల్వే వంతెన పనులు, ఖమ్మం కలెక్టరేట్ సమీపాన కొదుమూరు జంక్షన్ వద్ద నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు ఖమ్మంలో పర్యటనమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. మున్నేరు ప్రొటెక్షన్ వాల్, కేబుల్ బ్రిడ్జి, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు. ‘దిత్వా’పై అప్రమత్తంగా ఉండాలివరి కోతలు వాయిదా వేయడమే మేలు ఖమ్మవ్యవసాయం: ‘దిత్వా’ తుపాను నేపథ్యాన రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ఈ తుపాను 65 కిలోమీటర్ల గాలి వేగంతో ఉత్తర తమిళనాడులోని నాగపట్నంకు తూర్పు ఆగ్నేయంగా నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశముందని చెబుతుండగా, ఆదివారం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు తీవ్రమయ్యాయి. సోమ, మంగళవారాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యాన కల్లాల్లో, విక్రయ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని టార్పాలిన్లతో రక్షించుకోవాలని, మిగతా రైతులు వరికోతలను వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఒక ప్రకటనలో సూచించారు. ప్రజావాణి తాత్కాలికంగా రద్దుఖమ్మం సహకారనగర్ : అధికారులు, సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. పెండింగ్ బిల్లుల విడుదలపై హర్షంఖమ్మం సహకారనగర్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు నవంబర్ నెలకు సంబంధించి రూ.700 కోట్లు విడుదల చేయడం పట్ల పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్రావు, ఆర్.రంగారావు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ రెండు రోజుల క్రితం తమ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించామని తెలిపారు. కిన్నెరసానిలో సండే సందడిపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 473 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.29,065 ఆదాయం లభించింది. 350 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.19,600 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
108 సిబ్బందికి శిక్షణ
ఖమంవైద్యవిభాగం: జిల్లాలోని 108 వాహనాల్లో విధులు నిర్వర్తించే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ)లకు శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు వారం పాటు కొనగనున్నాయి. హైదరాబాద్ జీవీకే, ఈఎంఆర్ఐకి చెందిన ట్రెయినర్ పార్వతమ్మ చికిత్స విధానాలు, సత్వర స్పందన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. తొలిరోజైన ఆదివారం ఈఎంటీలకు సీపీఆర్పై శిక్షణ ఇవ్వగా జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్లు దుర్గాప్రసాద్, సతీష్, మహేష్, మనోహర్ పాల్గొన్నారు. -
నేటి నుంచి కొత్త వైన్స్!
● అమల్లోకి నూతన ఎకై ్సజ్ పాలసీ ● షాపుల ప్రారంభానికి వ్యాపారుల ఏర్పాట్లుఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు(వైన్స్) ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 116 వైన్స్కు అక్టోబర్ 27న డ్రా తీయగా, షాప్లు దక్కించుకున్న వారు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చాలాచోట్ల పాత షాప్ల్లోనే కొత్త వ్యాపారులు కూడా ఏర్పాటు చేయనుండగా, డిపోల నుంచి మద్యం స్టాక్ తెప్పించుకున్నారు. ఇక పాత వ్యాపారులు ఆదివారం రాత్రి వరకు అమ్మకాలు చేపట్టాక కొద్దో గొప్పో మిగిలిన స్టాక్ను తీసుకెళ్లారు. అయితే, జిల్లా కేంద్రంలోని పలు షాపులను జనావాసాల్లో ఏర్పాటుచేస్తున్నారని స్థానికులు అభ్యంతరం తెలపడమే కాక ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యాన వీటి ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. రూ.కోటి వరకు బేరసారాలు వైన్స్ నిర్వహణలో ఆరితేరిన పలువురికి ఈసారి డ్రాలో షాపులు దక్కలేదు. ఓ సిండికేట్ బాధ్యులు 160కి పైగా షాప్ల కోసం టెండర్లు దాఖలు చేయగా కేవలం ఎనిమిది షాపులే వచ్చాయని సమాచారం. దీంతో షాప్లు దక్కిన వారి నుంచి తీసుకునేందుకు రూ.కోటి వరకు ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీంతో కొందరు షాప్లను అప్పగించగా.. ఆంధ్రా వ్యాపారులు సైతం ఉమ్మడి జిల్లా వ్యాపారులతో చేతులు కలిపి వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇక నూతన ఎకై ్సజ్ పాలసీలో జిల్లా కేంద్రంలో ఈసారి లిక్కర్ మార్ట్ల సంఖ్య పెరగనుంది. తొలి మాసంలోనే ఫుల్.. ఈనెలలో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైన్స్ దక్కించుకున్న వ్యాపారులు తొలినెలలో అమ్మకాలు జోరుగా సాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు. జీపీ ఎన్నికల ఫలితాల ఆధారంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. ఆపై మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉండడంతో వ్యాపారానికి ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఎకై ్సజ్ సిబ్బందికి తలనొప్పి జిల్లా కేంద్రంలో వైన్స్ దక్కించుకున్న వారు ప్రారంభ ఏర్పాట్లలో నిమగ్నం కాగా, కొన్ని చోట్ల స్థానికుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. జనావాసాల్లో వైన్స్ ఏర్పాటు చేయొద్దని స్థానికులు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. జెడ్పీ సెంటర్ సమీపాన జమ్మిబండ పక్కన వైన్స్ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని కొందరు స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు సైతం మద్దతు తెలడంతో రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వైన్స్ ఏర్పాటైతే ఆందోళనలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ అధికారులు కూడా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇక్కడ షాప్ ఏర్పాటును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించగా.. నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఎఫ్సీఐ బైపాస్ రోడ్డులో కళాశాల సమీపాన, బుర్హాన్పురంలో కూడా వైన్స్ ఏర్పాటుపై అభ్యంతరాలు రావడంతో ఎకై ్సజ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
నామినేషన్లు
కొన్నిచోట్ల తెల్లవారుజాము వరకూ స్వీకరణ ● తొలివిడత 192 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 1,142 నామినేషన్ల దాఖలు ● 1,740 వార్డు స్థానాలకు 4,054 మంది పోటా పోటీగాఖమ్మం సహకారనగర్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు హోరాహోరీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతగా ఏడు మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలకు 1,142 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, 1,740 వార్డు స్థానాలకు 4,054 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసారి నామినేషన్ల ప్రక్రియ తెల్లవారుజాము వరకు కొనసాగటం గమనార్హం. మందకొడి నుంచి.. భారీగా... తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా ఉండగా.. రెండో రోజు జోరందుకున్నాయి. మూడో రోజు మాత్రం ఎవరూ ఊహించని విధంగా అర్ధరాత్రి వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు బారులుదీరారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా.. ఆ లోగా వచ్చిన దరఖాస్తుదారులకు అధికారులు టోకెన్లు ఇచ్చారు. వారి నుంచి నామినేషన్లు తీసుకుని కార్యక్రమం పూర్తయ్యే వరకు ఒకట్రెండు మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల వరకుపట్టింది. ముమ్మరంగా రాజీ ప్రయత్నాలు నామినేషన్ల ఘట్టం ముగియటంతో ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు ఆయా పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీకి సర్పంచ్ స్థానం, ఉపసర్పంచ్ వార్డు స్థానాలు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో గ్రామస్థాయిలో సయోధ్య కుదరడం లేదు. దీంతో ఆయా గ్రామాలకు ఇన్చార్జీలుగా ఉన్న ఇతర ప్రాంత నాయకులు వారిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏకగ్రీవ పంచాయతీలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మండలం గ్రామ సర్పంచ్ స్థానానికి వార్డులు దాఖలైన పంచాయతీలు నామినేషన్లు నామినేషన్లు కొణిజర్ల 27 194 254 632రఘునాథపాలెం 37 254 308 795వైరా 22 133 200 440బోనకల్ 22 108 210 500చింతకాని 26 161 248 626మధిర 27 146 236 525ఎర్రుపాలెం 31 146 284 536మొత్తం 192 1,142 1,740 4,054తొలి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రఘునాథపాలెం మండలంలో అత్యధికంగా 37 గ్రామపంచాయతీలు ఉండగా .. ఆయా సర్పంచ్ స్థానాలకు 254 నామినేషన్లు దాఖలయ్యాయి. బోనకల్ మండలంలో 22 గ్రామపంచాయతీలకు 108 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే రఘునాథపాలెం మండలంలో 308 వార్డు స్థానాలకు 795 నామినేషన్లు, వైరా మండలంలో 200 వార్డులుండగా 440 నామినేషన్లు దాఖలయ్యాయి. -
‘ఎర్త్ సైన్సెస్’ ముస్తాబు..
● రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ ● ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న భద్రాద్రి కలెక్టర్ , ఎస్పీ కొత్తగూడెంఅర్బన్: డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్న నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత జూలైలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, హ్యయర్ ఎడ్యుకేషన్ అధికారులు వర్సిటీని సందర్శించి కావాల్సిన సదుపాయాలపై ప్రభుత్వానికి నివేదించారు. అదే నెలలో సీఎం యూనివర్సిటీని ప్రారంభిస్తారని అధికారులు పేర్కొన్నా ప్రోగ్రాం వాయిదా పడింది. ఇటీవల సీఎం పర్యటన ఖరారుకాగా, ఈ నెల 2న ప్రారంభోత్సవం జరగనుంది. పాత భవనాలకు మరమ్మతులు యూనివర్సిటీలో ప్రస్తుతం బీఎస్సీ జియోలాజిలో 14 మంది, ఎన్విరాన్మెంట్ సైన్స్లో 34 మంది, పీజీ ఎన్విరాన్మెంట్ సైన్స్లో 14, మొత్తం 62 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 8 మంది అధ్యాపకులను నియమించారు. అయితే తరగతులు, హాస్టల్ వసతికి పాత భవనాలనే వినియోగిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో శిలాఫలకం ఏర్పాటు, భవనాలకు రంగులు వేసే, మరమ్మతులు, ఆడిటోరియం పనులు, 120 విద్యార్థినులు, 80 మంది విద్యార్థులకు సరిపడే విధంగా వేర్వేరు హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పలుమార్లు ఇంజనీరింగ్, రోడ్లు–భవనాలు, విద్యుత్, పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా చర్యలు, నిర్వహణపై పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయం సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటడం, ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రోహిత్రాజు పర్యవేక్షిస్తున్నారు. -
‘ఇంటి దొంగల్లో’ టెన్షన్!
సత్తుపల్లి: సత్తుపల్లి అర్బన్ పార్కులో దుప్పుల వేటపై ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. ఇంటి దొంగలను పట్టుకునేందుకు అటవీశాఖ టాస్క్ఫోర్స్ అధికారులు ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ఖమ్మంలో గోప్యంగా విచారణ చేస్తున్నారు. దుప్పుల వేటలో ఎంత మంది ప్రమేయం ఉంది.. ఎంత కాలం నుంచి జరుగుతోంది అనే వివరాలు రాబట్టే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. విచారణలో ఇంటిదొంగ నోరువిప్పితే ఎవరెవరి పేర్లు వెల్లడవుతాయోనని వేటగాళ్లతో పాటు వారికి సహకరించిన సిబ్బందిలో ఆందోళన నెలకొంది. అర్బన్ పార్కులో అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రశ్నించాలని నిర్ణయం తీసుకోగానే ఒకరు ఫోన్ స్విచాఫ్ చేసి తప్పించుకోగా, అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి శనివారం రాత్రి ఓ మద్యం షాపులో అదుపులోకి తీసుకుని ఖమ్మం తరలించినట్లు సమాచారం. పార్కులో రక్షణ లేదా..? సత్తుపల్లి అర్బన్పార్కులో వన్యప్రాణులకు రక్షణ లేదంటూ జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. చుక్కల దుప్పులను వేటగాళ్లు మాటు వేసి చంపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎంతో మందికి ఆహ్లాదాన్ని పంచే అర్బన్ పార్కులో జంతువేటపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇటీవల ఈ పార్కులో రూ.30 లక్షలతో 125 ఎకరాల్లో అంతర్గతంగా చైన్ లింక్ ఫెన్సింగ్ వేశారు. అలాగే సింగరేణి పరిధిలో ఉన్న అటవీ ప్రాంతానికి కూడా చైన్ లింక్ కంచె ఏర్పాటు చేశారు. అయినా దుప్పుల వేట, ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ‘అదనపు’ పని భారంతోనే..! సత్తుపల్లి అర్బన్ పార్కు నిర్వహణకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఉద్యోగులను నియమించకుండా ఇతర ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో వారు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించలేకపోతున్నారని సమాచారం. ఈ పార్కులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో పాటు ఐదుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో సందర్శకులు వస్తుండగా నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం సమకూరుతోంది. సమాచార సేకరణలో నిఘా వర్గాలు.. అర్బన్ పార్కులో దుప్పిని తుపాకితో వేటాడారనే ఆరోపణల నేపథ్యంలో పోలీస్ నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి. అటవీశాఖ అధికారులు సైతం పోలీసుల సహకారంతో ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిసింది. వేటగాళ్లను పట్టుకునేందుకు ఉమ్మడి జిల్లాల్లో తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉన్నందున, పోలీసుల ప్రమేయం ఉంటే వేగంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. అర్బన్ పార్కులో దుప్పుల వేటపై అటవీ శాఖ అధికారులు మూడురోజులుగా అక్కడే మకాం పెట్టి విచారణ చేస్తుండగా.. ఆదివారం ఉదయం కాలు విరిగి మృత్యువాత పడిన చుక్కల దుప్పిని వాకర్స్ గుర్తించారు. వారు సోషల్ మీడియాలో ఈ విషయం పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. అటవీ శాఖ నిర్లక్ష్యంపై పోస్టింగ్లు వెల్లువెత్తాయి. అటవీ అధికారులు మాత్రం వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుండగా వెదురు బొంగు కాలుకు గుచ్చుకుందని, ఈ పెనుగులాటలో దుప్పి మృత్యువాత పడిందని తెలిపారు. ఈ మేరకు పశువైద్యాధికారి శశిదీప్ పోస్టుమార్టం నిర్వహించాక దహనం చేసినట్లు వెల్లడించారు. -
●రాఘవాపురం : కోటమ్మ
చింతకాని: మండలంలోని రాఘవాపురం జీపీ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, గ్రామంలో కాంపెలి కోటమ్మ ఒక్కరే ఉండడంతో ఆమె నామినేషన్ దాఖలు చేయగా ఎన్నిక ఏకగ్రీవమైనట్లే. ఆమె సీపీఐలో కొనసాగుతున్నారు. అలాగే, గ్రామంలోని 4వ వార్డు ఎస్సీ జనరల్కు రిజర్వ్ కాగా నామినేషన్ దాఖలు చేసిన కోటమ్మ కుమారుడు కుమారుడు రమేష్ అలియాస్ దావీదు వార్డుసభ్యుడిగా ఎన్నిక కానున్నాడు. ఇక రెండో వార్డు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయినా ఉన్న ఒకే మహిళ కోటమ్మ సర్పంచ్గా నామినేషన్ వేయడంతో ఆ వార్డు స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక ఎనిమిదో వార్డు మినహా 1, 3, 5, 6, 7వ వార్డులకు కూడా ఒక్కో నామినేషన్ రావడం, ఎనిమిదో వార్డుకే రెండు నామినేషన్లు దాఖలవడంతో ఒకరు వెనక్కి తగ్గితే పాలకవర్గమంతా ఏకగ్రీవం కానుంది. -
నేను బతికే ఉన్నా మహాప్రభో!
కారేపల్లి: ఓ దివ్యాంగుడు జీవించే ఉన్నా సదరమ్ సర్టిఫికెట్ ఆన్లైన్ స్టేటస్లో మాత్రం ‘డెత్.. ద పర్సన్ ఈజ్ నాట్ అలైవ్’అని చూపిస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కారేపల్లి మండలం భాగ్యనగర్తండాకు చెందిన ఉపాధ్యాయుడు, దివ్యాంగుడైన జర్పుల వీరన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు ప్రాథమికోన్నత పాఠశాల లో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2022లో దివ్యాంగుల కోటాలో ఉద్యో గం పొందగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు యూడీఐడీ కార్డు జారీకి చర్యలు చేపట్టింది. ఈమేరకు ఆయన ఆన్లైన్ సెంటర్కు వెళ్లిపాత సద రమ్ సర్టిఫికెట్ నంబర్ నమోదు చేస్తే చనిపోయినట్లుగా ఉండడంతో అవాక్కయ్యాడు. దివ్యాంగుల కోటాలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందిన తన వివరాలు తప్పుగా నమోదు కావడంతో పరిస్థితి ఏమిటని వాపోతూ ఈ నెల 17న కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఇకనైనా అధికారులు స్పందించి వివరాలు సరిచేయించాలని వీరన్న కోరుతున్నాడు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుసదరమ్ స్టేటస్లో ‘డెత్’అని రావడంతో ఆందోళన -
ఆ జీపీలు.. ఏకగ్రీవం!
● పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవికి సింగిల్ నామినేషన్! ● ఇప్పటివరకు ఆరు.. ఇంకా పెరిగే అవకాశం ● కొన్నిచోట్ల వార్డులకూ కూడా ఒక్కొక్కటే..సాక్షిప్రతినిధి, ఖమ్మం: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు సమర్పించే గడువు శనివారం ముగియగా.. కొన్నిచోట్ల సర్పంచ్ పదవుల ఏకగ్రీవం లాంఛనమైంది. ఆయా జీపీల్లో సర్పంచ్లుగా ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయగా, కొన్నిచోట్ల వార్డులకు కూడా ఒక్కో నామినేషనే అందింది. తొలి దఫా 192పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా కొన్నిచోట్ల సర్పంచ్ స్థానానికి ఏకగ్రీవం కోసం ఒప్పందాలు చేసుకున్నారు. ఇంకొన్ని చోట్ల గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు తెలిసింది. అయితే, ఏకగ్రీవాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంకొన్ని చోట్ల చర్చల దశలో ఉండడంతో నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఏకగ్రీవ జీపీల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. -
●మంగ్యాతండా : భార్గవి
రఘునాథపాలెం: మండలంలోని మంగ్యాతండా గ్రామపంచాయతీ పాలకవర్గం మరోమారు ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ పదవితో పాటు ఆరు వార్డు సభ్యుల పదవులకు గడువు ముగిసే సమయానికి ఒక్కో నామినేషనే దాఖలైంది. గత ఎన్నికల్లో ఈ గ్రామసర్పంచ్గా మత్రు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆతర్వాత రెండేళ్ల క్రితం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు బాల్సింగ్ చేపట్టగా, ఆయన కుమార్తె మాలోతు భార్గవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ముందుగానే నిర్ణయించినట్లు తెలిసింది. ఈమేరకు కాంగ్రెస్ బలపర్చిన భార్గవి నామినేషన్ దాఖలు చేయగా మరెవరూ ముందుకు రాలేదని సమాచారం. ఆరు వార్డులకు గాను నాలుగు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు చొప్పున వార్డుస్థానాలు తీసుకుని ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో పాలకవర్గమంతా ఏకగ్రీవమైనట్లయింది. -
నామినేషన్ కేంద్రాల్లో పరిశీలన
కొణిజర్ల/వైరారూరల్/బోనకల్/చింతకాని: కొణిజర్ల మండలంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శనివారం పరిశీలించారు. కొణిజర్ల మండలంలోని అమ్మపాలెంలో సుధామరావు, కొణిజర్లలో అదనపు కలెక్టర్ శ్రీజ వివరాలు ఆరా తీసి, నామినేషన్లను ఎప్పటికప్పుడు టీ పోల్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే, వైరా మండలం రెబ్బవరంలో కూడా అదనపు కలెక్టర్ పర్యటించగా ఎంపీఓ రాజేశ్వరి పాల్గొన్నారు. ఇక కొణిజర్ల మండలం తనికెళ్ల, అమ్మపాలెం, కొణిజర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అడిషనల్ డీసీపీ ప్రసాదరావు తనిఖీ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించాలని సూచించారు. ఎస్ఐ సూరజ్, సిబ్బంది పాల్గొన్నారు. బోనకల్లోని నామినేషన్ల కేంద్రాన్ని డీపీఓ ఆశాలత, చింతకాని మండలం రామకృష్ణాపురంలోని కేంద్రాన్ని ఏసీపీ వసుంధర యాదవ్ పరిశీలించారు. -
హెపటైటిస్.. ప్రాణాంతకం..
● ఎయిడ్స్, హెచ్ఐవీలాగే సంక్రమిస్తున్న వైనం.. ● ప్రజల్లో అవగాహన లేక పెరుగుతున్న బాధితులు ● జిల్లాలోనే వైరా మండలంలో అత్యధిక కేసులు వైరారూరల్: గతంలో లైంగిక సంబంధాల్లో సురక్షిత విధానాలు పాటించక పలువురు ఎయిడ్స్, హెచ్ఐవీ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం వైద్యులకు తప్ప సాధారణ పజ్రలకు తెలియని మరో ప్రాణాంతక వ్యాధి ‘హెపటైటిస్’విస్తరిస్తోంది. ఈ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. హెపటైటిస్–సీ ఆర్ఎన్ఏ వైరస్ కాగా హెపటైటిస్–బీకి డీఎన్ఏ వైరస్గా పేరుంది. ఈ కేసులు జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లోనే కాక మండలంలోని గొల్లపూడి, ఖానాపురం, గొల్లెనపాడు, అష్టగుర్తి, రెబ్బవరంలో నమోదవుతున్నాయని సమాచారం. వ్యాధిపై అవగాహన లేకపోవడంతో శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తూ ప్రాణాంతకంగా మారుతోందని తెలిసింది. వ్యాధి ఇంట్లో ఒకరికి సోకితే కుటుంబమంతా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వ్యాధి సంక్రమిస్తుంది ఇలా.. హెపటైటిస్–సీ 0.6 నుంచి 6శాతం నీడిల్ ద్వారా సోకుతుంది. హెపటైటిస్–బీ 30శాతం నీడిల్ ఇన్ఫెక్షన్ ద్వారా సంక్రమిస్తుంది. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, హెపటైటిస్ సోకిన వ్యక్తి రక్తదానం చేయడం, గ్రామీణ వైద్యులు నీడిల్ మార్చకుండా ఇంజక్షన్ చేయడం, సెలూన్ షాపుల్లో బ్లేడ్లు మార్చకపోవడం వంటి కారణాలతో వ్యాధి ప్రబలుతున్న ట్లు తేలిందని సమాచారం. ఇదికాక మాదక ద్రవ్యా ల వాడకం, డయాలసిస్ షేషంట్లు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. లక్షణాలు.. నివారణ చర్యలు హెపటైటిస్–బీ వ్యాధి బారిన పడిన వారికి నిత్యం కామెర్లు కావడం, వాంతులు, కడుపులో తిప్పినట్లు అనిపించడం, అధిక నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్ప నిసరిగా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈమేరకు మొదట స్క్రీనింగ్ ర్యాపిడ్ పరీక్షలు చేయించాలి. పాజిటివ్గా తేలితే ఎలీసా పరీక్ష ద్వారా నిర్ధారించుకుని వైరల్లోడ్ పరీక్షలు కూడా చేయించాలి. ఇక హెపటైసిస్–బీ, సీ వ్యాధి సోకిన వారు తమ రక్తాన్ని దానం చేయొద్దు. ఒకరు వాడిన నీడిల్ను మరొకరు వాడకపోవడంతో పాటు లైంగిక సంబంధాల్లో సురక్షిత చర్యలు పాటించాలి. కుటుంబంలో ఎవరికై నా హెపటైటిస్–బీ, సీ సోకితే కుటుంబమంతా పరీక్షలు చేయించుకొని వైద్యాధికారుల సూచనలు పాటించాలి. హెపటైటిస్–సీ పాజిటివ్ గా తేలితే మూడు నెలలు, హెపటైటిస్–బీ అయితే జీవింతాంతం మందులు వాడాలి. లేనిపక్షంలో లివర్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కాగా, చికిత్స సామాన్యులకు అందుబాటులోకి రాగా, రికవరీ రేటు కూడా 99 శాతానికి పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలకు రూ.15 వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నందున బాధితు లు సద్వినియోగం చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు హెపటైటిస్–బీ, సీపై అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాధి సోకితే కాలేయ సంబంధిత సమస్యలే కాక చర్మం, కిడ్నీ ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కుటుంబంలో ఒకరికి వ్యాధి నిర్ధారణ జరిగితే అందరూ పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు పాటించాలి. వైరా మండలంలో అత్యధిక కేసులు ఉన్నట్లు తేలింది. ప్రజలు ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి. –బత్తినేని శ్రీహర్ష, ప్రభుత్వ వైద్యాధికారి, వైరా -
నామినేషన్లు ఇలా...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో భాగంగా ఏడు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఈ మేరకు చివరి సమాచారం ఆధారంగా దాఖలైన నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి.రామయ్యకు సువర్ణ తులసీ అర్చనభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్తోకంగా జరిపించారు. నిత్యకల్యాణంతో పాటు ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. -
మాస్లైన్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి
ఖమ్మంరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాస్లైన్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజా ఉద్యమాలకు చేయూతనివ్వాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో శనివారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విప్లవ, కమ్యూనిస్టు పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా ఉద్యమాలు బలపడి, సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఇదేసమయాన పాలక పార్టీల జిమ్మిక్కులు, ప్రలోభాలను తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించగా, కేంద్ర ప్రభుత్వం ఫాసిస్ట్ పాలన సాగిస్తోందని ఆరోపించారు. నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, మలీదు నాగేశ్వరరావు, శ్రీనివాస్, కుర్రా వెంకన్న, గుర్రం అచ్చయ్య, మందటి సంధ్యారాణి, తోట పెద్దఅప్పారావు, పుచ్చకాయల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అటు నగదు.. ఇటు వేట
● సిబ్బందికి ఆన్లైన్లో నగదు జమ ● ఆ తర్వాత పని కానిచ్చేసిన వేటగాళ్లు ● ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువుపై అనుమానాలుసత్తుపల్లి: సత్తుపల్లి అర్బన్పార్కులో స్వేచ్ఛగా విహరిస్తున్న దుప్పులను వేటాడిన వ్యక్తిని గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ విషయమై ‘సాక్షి’లో శనివారం ‘తూటా దూసుకెళ్తోంది...’ శీర్షికన కథనం రావడంతో అటవీశాఖలో కలవరం మొదలైంది. దుప్పులను వేటాడిన వారిని గుర్తించేందుకు మూడు రోజులుగా గాలిస్తున్న అధికారులు విచారణలో వేగం పెంచారు. ఇటీవల ఐదు జీవాలను వేటాడినట్లు ఫిర్యాదు అందడంతో గతంలోనూ వేట జరిగిందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కాగా, పార్క్లో విధులు నిర్వర్తించే ఒకరిద్దరు సిబ్బందిని మచ్చిక చేసుకున్న వేటగాళ్లు వారికి ఆన్లైన్లో నగదు జమ చేసి ఆతర్వాత రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు సిబ్బంది బ్యాంకు లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు.. విధులకు డుమ్మా దుప్పుల వేట అంశంపై డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్ ఆదేశాలతో ఎఫ్డీఓ వాడపల్లి మంజుల పర్యవేక్షణలో రేంజర్లు స్నేహలత, శ్రీనివాసరావుతో కూడిన బృందం విచారిస్తోంది. వేటగాళ్లకు అటవీశాఖ నుంచి ఎవరు సహకరించారనే కోణంలో రెగ్యులర్ ఉద్యోగులు మొదలు ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలోనే అనుమానం ఉన్న ఒక కాంట్రాక్టు ఉద్యోగి రెండు రోజులుగా విధులకు గైర్హాజరు కావడం గమనార్హం. ఇక శనివారం మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న ఇంకో ఉద్యోగి ఆ తర్వాత వెళ్లిపోవడం, వీరిద్దరి సెల్ఫోన్లు స్విచాప్ వస్తుండడంతో అన్ని వేళ్లు వీరివైపే చూపిస్తున్నాయి. కాగా, అర్బన్ పార్క్ ఎంట్రన్స్ నుంచి మూడువైపులా నాలుగు సీసీ కెమెరాలను అమర్చారు. కానీ అవి తరచూ మొరాయిస్తుండడంతో వేటగాళ్లు తమ పని చక్కబెట్టుకున్నారని తెలుస్తోంది. వేటగాళ్లు ఎత్తు తక్కువగా ఉన్న ప్రహారీ దూకి వచ్చి ఉండొచ్చని అధికారులకు ఇక్కడి సిబ్బంది భ్రమ కల్పించి.. సీసీ కెమెరాల లోపాలతో ముందు భాగం నుంచే రాకపోకలకు అనుమతించినట్లు సమాచారం. షార్ప్ షూటర్ పనేనా? సత్తుపల్లికి సమీపాన ఉండే ఓ నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధి సమీప బంధువుకు ఈ ప్రాంతంలోనే షార్ప్ షూటర్గా పేరు ఉందని సమాచారం. ఆయనతో పాటు సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట తదితర మండలాల్లో వేటాడే నైపుణ్యం ఉన్న వ్యక్తుల జాబితాపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అంతేకాక లైసెన్స్డ్ గన్లు ఎవరి వద్ద ఉన్నాయనే వివరాల కోసం పోలీసుల సహకారాన్ని తీసుకుంటున్నారు. రెండు, మూడు నెలలుగా సదరు వ్యక్తుల కుటుంబాల్లో వేడుకలు జరిగాయా, అక్కడ వన్యప్రాణుల మాంసం వడ్డించారా, ఆ వేడుకలకు ఎవరెవరు హాజరయ్యారనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. కాగా, వేట అంశంపై భద్రాద్రి జోన్ సీసీఎఫ్(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) బీమానాయక్ ఖమ్మం డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్తో మాట్లాడి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. -
తొలి విడత సాఫీగా..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత జీపీల్లో నామినేషన్ల దాఖలు గడువు శనివారంతో ముగిసింది. చివరగా అందిన సమాచారం ప్రకారం ఏడు మండలాల్లోని 192 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 814, 1,740 వార్డులకు 3,139 నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చేనెల 3వ తేదీన మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించి అదేరోజు బరిలో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తారు. కాగా, నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో శనివారం రాత్రి వరకు కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులు దీరారు. చివరి రోజు జోరు.. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 192 గ్రామపంచాయతీలు, 1,740 వార్డుల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈనెల 27న నోటిఫికేషన్ జారీ చేయగా, మొదటి రోజున సర్పంచ్ స్థానాలకు 100, వార్డులకు 49 నామినేషన్లు వచ్చాయి. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 257, వార్డు సభ్యుల స్థానాలకు 374 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన శనివారం మాత్రం ఎక్కువ మంది ముందుకొచ్చారు. కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులుదీరడంతో సాయంత్రం 5గంటల వరకు ఉన్న వారికి కూపన్లు జారీ చేసి అందరి నుంచి నామినేషన్లు స్వీకరించారు. దీంతో కొన్నిచోట్ల అర్ధరాత్రి 12గంటల వరకు కూడా ప్రక్రియ కొనసాగింది. ఈనెల 11న ఎన్నికలు.. మొదటి విడత ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను ఆదివారం పరిశీలించి చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 1న సాయంత్రం 5గంటల వరకు అప్పీళ్లు స్వీకరించి 2వ తేదీన పరిష్కరిస్తారు. ఇక వచ్చేనెల 3న సాయంత్రం 3గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉండగా, ఆతర్వాత తుది జాబితా విడుదల చేస్తారు. వచ్చేనెల 11న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి ఆతర్వాత ఓట్లు ఎక్కించి సర్పంచ్, వార్డుసభ్యులుగా గెలిచిన వారిని ప్రకటించడమే కాక ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తిచేస్తారు. ఉపసంహరణలపై దృష్టి చాలాచోట్ల ఆశావహులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఎవరికి వారు పార్టీల మద్దతు తమకే ఉందని ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో పోటీ ఎక్కువగా ఉండడంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి, మిగిలిన వారితో నామినేషన్ ఉపసంహరించేలా ఆయా పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయమై వ్యక్తిగత సర్వేలతో పాటు స్థానికంగా పట్టు ఉన్న నేతల గుర్తించి వారినే బరిలో మిగల్చడంతో పాటు ఇతరులను బుజ్జగించడంపై దృష్టి సారించారు.రెండో విడత జీపీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం మొదలుకానుంది. కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183గ్రామపంచాయతీలు, 1,686 వార్డుల్లో ఈ దఫా ఎన్నికలు జరుగుతాయి. ఆదివారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా, 14వ తేదీన పోలింగ్ జరగనుంది.మొదటి విడత ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల స్వీకరణ -
రామదాసు కళాక్షేత్రం ఆధునికీకరణ
పరిశీలించిన కలెక్టర్ అనుదీప్ ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునికీకరణపై దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి సోమవారం కళాక్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సమస్యలపై ఆరా తీశారు. టాప్ లీకేజీల మరమ్మతు, పచ్చదనం కోసం మొక్కల పెంపు తదితర ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాకారులకు వేదికగా నిలిచేలా భక్త రామదాసు కళాక్షేత్రాన్ని అన్నివిధాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. సౌండ్, ఆడియో వ్యవస్థతో పాటు లైటింగ్ ఏర్పాట్లు మెరుగుపర్చాలని సూచించారు. సీట్ల కూర్పు కూడా సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలని తెలిపారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు తయారుచేసిన మోడళ్లను పరిశీలించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, పంచాయతీరాజ్ ఈఈ మహేష్బాబు, మున్సిపల్ డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు శ్రీనివాస్, అనిల్, తహసీల్దార్ సైదులు, మునిసిపల్ డీఈ ధరణికుమార్, ట్లౌన్ ఫ్లానింగ్ అధికారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించాలి ఖమ్మంవైద్యవిభాగం: ప్రారంభ దశలోనే కుష్ఠు వ్యాధిని గుర్తిస్తే నిర్మూలన సులువవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు తెలిపారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కుష్ఠు వ్యాధి నిర్మూలనకు తొలి దశలో గుర్తించడం, ఆపై తక్షణ చికిత్స, నిరంతర పర్యవేక్షణ ముఖ్యమని చెప్పారు. చర్మంపై రంగు మారడం లేదా తెల్లటి మచ్చలు, మచ్చల ప్రదేశాల్లో స్పర్శ లేకపోవడం, చేతులు, కాళ్లు మొద్దుబారడం తదితర లక్షణాలు కల్పిస్తూ ఆస్పత్రిలో సంప్రదించేలా ప్రజలకు అవగాహన కల్పించి అనుమానిత కేసుల స్క్రీనింగ్ చేపట్టాలని సూచించారు. అలాగే, అపోహల నిర్మూలనకు ఇంటింటి ప్రచారం, గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో పీఎంఓ భోజానాయక్, డీపీఎంఓలు, లెప్రసీ నోడల్ అధికారులు పాల్గొన్నారు. చదువుపై మక్కువ పెరిగేలా బోధన ఖమ్మం సహకారనగర్: ప్రీ ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా బోధన సాగించాలని, తద్వారా ప్రాథమిక దశలోనే పిల్లలకు చదువుపై పెంచాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్రెడ్డి సూచించారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్స్ట్రక్టర్లకు ఐదు రోజులుగా డైట్ కళాశాలలో ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏఎంఓ మాట్లాడుతూ విద్యార్థులకు పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు మొదటి గురువుగా గుర్తుంటారని తెలిపారు. ఈమేరకు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని సూచించారు. రిసోర్స్ పర్సన్లు శ్రవణ్, అనిల్, జీవన్ పాల్గొన్నారు. జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్కు పంచామృతంతో అర్చకులు అభిషేకం జరిపించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు డీసీసీ అధ్యక్షుడిగా ‘నూతి’ ప్రమాణస్వీకారం
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి గా ఇటీవల నియమితులైన నూతి సత్యనారాయణ గౌడ్ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రస్తుత అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నా రు. పార్టీ శ్రేణులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మంత్రి, ఎంపీని కలిసిన సత్యనారాయణ ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మంఅర్బన్: డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ శనివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించిన వారు.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కృషిచేయాలని సూచించారు. కార్యక్రమాల్లో నాయకులు విజయాబాయి, కొప్పుల చంద్రశేఖర్, ముళ్లపాటి సీతారాములు, సాధు రమేశ్రెడ్డి, గుత్తా వెంకటేశ్వర్లు, శ్రీరామనేని భాస్కర్, ఫరీద్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం వాసికి డాక్టరేట్
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంకు చెందిన దైద విజయ్ప్రకాష్కుకాకతీ య విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ‘వాయి సెస్ ఆఫ్ది అన్ హెర్డ్: ఏ కల్చరల్ అప్రోచ్ టు రూడి వీబ్ సెలెక్ట్ నావెల్స్’ అంశంపై ఆయన కేయూఆంగ్ల విభాగాధిపతిడాక్టర్ ఆర్.మేఘనా రావు పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్ప్రకటించారు.విజయప్రకాష్ ప్రస్తుతం కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోఆంగ్లంశాఖాధిపతిగా, ప్రజా సం బంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రేపు అండర్–17 క్రికెట్ జట్టు ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: అండర్–17 విభాగంలో ఉమ్మ డి జిల్లాస్థాయి బాలికల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు సోమవారం నిర్వహిస్తున్నట్లు పాఠశాలల క్రీడల కార్యదర్శులు వి.నరేశ్కుమార్, వై. రామారావు తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు మొదలవుతాయని వెల్లడించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదుతున్న విద్యార్థినులు కూడా అర్హులేనని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. బీజేపీ జిల్లా ఇన్చార్జిగా మహిపాల్రెడ్డిఖమ్మంమామిళ్లగూడెం: బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా హైదరాబాద్కు చెందిన బద్ధం మహిపాల్ రెడ్డినియమితులయ్యారు. ఈమేరకు జిల్లాల వారీ గా పార్టీ ఇన్చార్జ్ల పేర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్రావు శనివారం విడుదల చేశా రు. ఇందులో భాగంగా మహిపాల్రెడ్డిని ఖమ్మం ఇన్చార్జ్గా నియమించారు. అలాగే, ఖమ్మానికి చెందిన కొండపల్లి శ్రీధర్రెడ్డికి వరంగల్ జిల్లా, సన్నె ఉదయ్ప్రతాప్ను నల్లగొండ జిల్లా ఇన్చార్జ్లుగా నియమించినట్లు వెల్లడించారు. అల్లర్ల నియంత్రణపై శిక్షణ వైరా/ఏన్కూరు/సత్తుపల్లిటౌన్: గ్రామపంచా యతీ ఎన్నికల నేపథ్యాన పోలీసులు బందోబస్తుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా నే పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి శనివారం మాక్డ్రిల్ ద్వారా శిక్షణ ఇచ్చారు. గుంపులుగా వచ్చే వారిని గుర్తించి అడ్డుకోవడం, లాఠీ ఉపయోగించే విధానం, జనసమూ హాన్ని చెదరగొట్టడంపై అవగాహన కల్పించా రు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ ఉద్యోగులు సమన్వయంతో, వేగంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, అందుకు శిక్షణ ఉపయోగపడుతుందని కల్లూరు ఏసీపీ వసుంధర్యాదవ్ తెలిపారు. వైరా, కల్లూరు సబ్ డివిజన్లలోని పోలీస్స్టేషన్లలో శిక్షణ ఇవ్వగా, ఎస్ఐలు పి.రామారావు, ఎన్.సంధ్య పాల్గొన్నారు. వెదజల్లే పద్ధతితో లాభాలు.. ముదిగొండ: వరి సాగు చేసే రైతులు వెదజల్లే పద్ధతి ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. మండలంలోని గోకినేపల్లిలో ఖమ్మం రైతు శిక్షణా కేంద్రం, పీఐ ఫౌండేషన్ ఆధ్వర్యాన నేరుగా వెదజల్లే పద్ధతిపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ సరిత మాట్లాడుతూ.. రైతులు వరి కొయ్యలను కాల్చకుండా పొలంలో కలియదున్నా లని సూచించారు. అలాగే, వెదజల్లే పద్ధతిపై లాభా లను వివరించారు. వ్యవసాయాధికారులు అరుణకుమారి, భాస్కర్రావు, అరుణాజ్యోతి, పీఐ ఫౌండేషన్ ప్రతినిధులు రేష్మ, హర్ష పాల్గొన్నారు. -
నగర వాసులకు నిరంతరం తాగునీరు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరవాసులకు 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేసేలా ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 35వ డివిజన్లో రూ.50.25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. అమృత్ పథకంలో భాగంగా రూ.220 కోట్ల విలువైన పనులకు డిసెంబర్లో టెండర్లు ఖరారు చేసి వేసవి నాటికి నిరంతరం తాగునీటి సరఫరా అయ్యేలా చూస్తామని తెలిపారు. నగరంలో చేపట్టే ప్రతీ అభివృద్ధి పని దశాబ్దాల అవసరాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా, పరిశుభ్రతలో ప్రజలు, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కాగా, పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఖిలాపై రోప్వే, లకారం చెరువు పక్కన శిల్పారామం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు యల్లంపల్లి వెంకటరావు, కమర్తపు మురళీ, కన్నం వైష్టవీ ప్రసన్నకృష్ణ, కాంగ్రెస్ కేఎంసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి, నాయకులు బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
బోనకల్: మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దామాల బాబు కుమారుడు రాకేశ్రాయుడు (32) ఖమ్మంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బ్రాహ్మణపల్లి వద్ద బంక్లో పెట్రోల్ పోయించుకొని రోడ్డు దాటుతున్న ఆయన ద్విచక్ర వాహనాన్ని వైరా వైపునకు వెళ్లే లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్ను మధిర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి●బిడ్డ అన్నప్రాసన మరుసటిరోజే ఘటన సత్తుపల్లిరూరల్: పెళ్లయిన చాన్నాళ్లకు సంతానం కలిగింది. సంతోషంగా బిడ్డకు అన్నప్రాసన చేయించిన మరుసటి రోజే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఇది. ములుగు జిల్లా కన్నా యిగూడెం మండలం కాంతనపల్లికి చెందిన నల్లబోయిన హన్మంతరావు (40) సత్తుపల్లి మండలం గంగారం బెటాలియన్లో 2007 నుంచి కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ సత్తుపల్లిలో నివాసం ఉంటున్నాడు. హన్మంతరావు – విజయ దంపతులకు వివాహం జరిగిన చాలాకాలానికి ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు శుక్రవారం అన్నప్రాసన చేయించి ఇంటికి వచ్చారు. రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో హన్మంతరావు కుప్ప కూలి పడిపోయాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు భావిస్తుండగా బెటాలియన్ కమాండెంట్ పెదబాబు, అధికారులు నివాళులర్పించారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి ●వివాహ వేడుకలో స్టేజీ తొలగిస్తుండగా ఘటన తిరుమలాయపాలెం: వివాహ వేడుక కోసం ఏర్పా టు చేసిన స్టేజీ తొలగిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మండలంలోని మేడిదపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో వివాహం జరగగా స్టేజీ తొలగించేందుకు కారేపల్లి మండలం బొక్కలగడ్డతండాకు చెందిన అజ్మీరా విజయ్కుమార్ (24) శనివారం కూలీపనులకు వచ్చాడు. స్టేజీ సమీపాన 11 కేవీ లైన్ను గమనించకపోవడంతో ఇనుప పోల్ దానికి తాకగా షాక్కు గురయ్యాడు. సహచరులు తిరుమలాయపాలెం సీహెచ్సీకి తరలించేలోగా మృతిచెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మం అర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఖమ్మం 35వ డివిజన్ మోతీనగర్లో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే, మధ్యాహ్నం రెండు గంటలకు భద్రాద్రి జిల్లా అధికారులతో కొత్తగూడెంలో సమావేశమవుతారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పలుప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలాజీనగర్లోని సాయి డెంటినోవా హాస్పటల్, శ్రీ వెంకటేశ్వర క్లినిక్ను తనికీ చేసిన ఆయన నిబంధనల ప్రకారం ఆస్పత్రుల నిర్వహణ సాగుతోందా అని ఆరా తీసిన ఆయన వైద్యసేవలకు వసూలు చేస్తున్న ఫీజు, డాక్టర్ల పేర్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను స్పష్టంగా కనిపించేలా అంటించాలని ఆదేశించారు. అలాగే, పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణ పరికరాలు, లిఫ్ట్ ఏర్పాట్లపై నిర్వాహకులకు సూచనలు చేశారు. సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు. 7వరకు ‘ఓపెన్’ ప్రవేశాలు ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్ఓ ప్రవేశాలకు వచ్చే నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు తెలిపారు. పదో తరగతి అభ్యర్థులు రూ.100 అపరాధ రుసుము, ఇంటర్మీడియట్కై తే రూ.150అపరాధ రుసుముతో పాటు అడ్మిషన్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. వివరాలకు 80084 03522 నంబర్లో సంప్రదించాలని సూచించారు. అభ్యంతరాలు ఉంటే తెలపండి ఖమ్మం సహకారనగర్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) 8వ తరగతి పరీక్ష కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6వ తేదీలోగా తెలియచేయాలని డీఈఓ చైతన్య జైనీ సూచించారు. https://bse. telangana.gov.in వెబ్సైట్లో కీ అందుబాటులో ఉందని తెలిపారు. అభ్యంతరాలు ఉన్న వారు dirgovexams.tg@gmail. com మెయిల్ ద్వారా లేదంటే హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్కు నేరుగా సమర్పించవచ్చని వెల్లడించారు. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు మధిర: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి అధికారి రవిబాబు సూచించారు. మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన ఎంసెట్, జేఈఈ మెయిన్స్కు శిక్షణ, ప్రాక్టికల్స్పై ఆరాతీశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ కళాశాలకు తరచుగా గైర్హాజరయ్యే విద్యార్థులను ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రత్యేక తరగతుల ద్వారా పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి.జైదాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ ఆధ్వర్యాన టెట్ శిక్షణ ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ఫెడరేషన్(టీపీటీఎఫ్)జిల్లాకమిటీ ఆధ్వ ర్యాన టెట్శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మంలోని జెడ్పీ హాల్లో శిక్షణ తరగతులను శుక్రవారం అధికా ర మాసపత్రిక ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు పి.నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్ శిక్షణ సంఘం జిల్లా కార్యాలయంలోప్రతిరోజు సా యంత్రం 6–30గంటల నుంచి 8–30గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. టీపీటీఎఫ్పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మనో హ ర్ రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఎస్.విజయ్, వై పద్మ పాల్గొని మాట్లాడగా నాయకులు టి.వెంగళరావు, ఉమాదేవి పాల్గొన్నారు. -
పైరవీ కాదు.. పట్టు ఎవరికి?
● ఆశావహుల జాబితా వడపోస్తున్న పార్టీలు ● జన, ఆర్థిక, అంగబలం ఉన్న వారి కోసం అన్వేషణ ● గెలుపు గుర్రాలనే బరిలో దింపేలా సర్వే చేయిస్తున్న కాంగ్రెస్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేస్తున్న వారంతా తమకు పార్టీ మద్దతు ఉందని ప్రకటించాలంటూ ముఖ్య నేతలతో పైరవీలకు దిగుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ తాకిడి ఎక్కువగా ఉంది. సర్పంచ్ అభ్యర్థిగా తమనే ఖరారు చేయాలని నేరుగా మంత్రులను కలవడం లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్న నేతలతో రాయబారాలు నెరుపుతున్నారు. అయితే పైరవీలు కాకుండా.. జనబలం, ఆర్థిక, అంగ బలం ఎవరికి ఉంది.. వారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామాల వారీగా సర్వే చేయిస్తోంది. అలాగే బీఆర్ఎస్, వామపక్షాలు, బీజేపీ కూడా కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఎవరా అని అన్వేషిస్తున్నాయి. మాకు మద్దతు ఇవ్వండి.. బరిలో నిలవాల్సిందేననే తపనతో ఉన్న ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్లోని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని తమకు సూచించొద్దని కోరుతూనే వివిధ మార్గాల్లో పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు, మూడో విడతల్లో జరిగే పంచాయతీల్లోనూ ముందుస్తుగా ఒప్పందం చేసుకుని ఒక్కరే బరిలో నిలిచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే ఏకగ్రీవం, లేదంటే బరి అన్నట్లుగా ఈ ఒప్పందాలు ఉంటున్నాయి. కాంగ్రెస్ నుంచే... గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొదటి విడత నామినేషన్ల దాఖలు గడువు శనివారంతో ముగియనుంది. ఈ విడతలో ఎన్నిక జరిగే జీపీల్లో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయగా.. రెండు, మూడో విడత ఎన్నిక జరిగే స్థానాల్లోనూ కాంగ్రెస్ మద్దతు కోసం పలువురు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోపక్క నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వడపోతకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. బరిలో నిలిచేందుకు ఎవరు అర్హులనే అంశంపై ఆరా తీయిస్తోంది. మిగతా పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచేలా కసరత్తు చేస్తున్నాయి. ఎవరైతే సరి? ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలిపితే విజయం దక్కుతుందనే అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇందుకోసం గ్రామపంచాయతీల వారీగా సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో చాలామంది పోటీకి సిద్ధమవుతున్నందున గ్రామంలో పట్టు ఉండి ఆర్థిక, అంగబలం ఎవరి ఉందో సర్వే ద్వారా తేల్చాకే పార్టీ మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో ఆశావహులు ఎవరికి వారు తుది జాబితాలో తమ పేరు ఉండేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. -
బరి సరే.. భరోసా వస్తుందా?!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నా.. ఆర్థిక పరిస్థితులపై వారిలో హైరానా నెలకొంది. బరిలో నిలిచాక ఖర్చుకు సరిపడా నగదు చేతికి రాకపోతే గెలుపు సాధ్యం కాదనే భానలో కొందరు ఉన్నారు. దీంతో పార్టీలు, ముఖ్య నేతల నుంచి భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో పోటీదారులు కొందరు తమకు ఆర్థికంగా సహరించాలని నేరుగా పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తుండటం గమనార్హం. పోటీ కోసం ఆసక్తి.. గ్రామాల్లో తమ పట్టును నిరూపించుకోవడానికి కొందరు.. ఉన్న పట్టు కాపాడుకోవడం కోసం పలువురికి గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ అనివార్యంగా మారింది. సర్పంచ్, వార్డులకు అయిన రిజర్వేషన్ల ఆధారంగామండల స్థాయి నేతలు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యాన నేతలు హడావుడి పడుతుండగా, జనరల్కు రిజర్వు అయిన మేజర్ గ్రామపంచాయతీల్లో పోటీదారుల భారీగానే ఉంది. ఆర్ధిక సహకారం ఉంటేనే.. గ్రామ, మండల స్థాయిలో గుర్తింపు ఉండి గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉన్న నాయకులే బరిలో నిలవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఇది బాగానే ఉన్నా బరిలో నిలిస్తే ఎలా ఉంటుంది.. లేకపోతే పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. ఎన్నికల వ్యయం తడిసి మోపెడవడం ఖాయమైనందున అంత ఖర్చు మొత్తం తాము భరించే అవకాశం లేదని పేర్కొంటున్నారు. పార్టీ నుంచి ఆర్థిక సహకారం అందితేనే బరిలో ఉంటామని కొందరు ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఆ రెండు పార్టీల్లో మరింతగా.. ఎన్నికల ఖర్చు అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల్లో సందిగ్ధత ఎక్కువగా ఉంది. ఈ పార్టీల మద్దతుతో బరిలోకి దిగాలనే ఆలోచన ఉన్న నేతలు ఒకరిని చూసి ఇంకొంకరు ఖర్చు పెంచే అవకాశం ఉన్నందున డోలాయమానంలో పడ్డారు. ఆర్థిక వనరులు తమ వద్ద అంతంతమాత్రంగానే ఉన్నందున, పార్టీ నుంచి సహకారం అందాలని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేయాలనుకునే వారు కోరుతున్నారు. ఈ సమాచారం ఎమ్మెల్యేలు, మంత్రులకు చేరవేసే పనిలో పడ్డారు. మరోపక్క బీఆర్ఎస్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆశావహులపై జనాభిమానం ఉన్నా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి దీటుగా ఖర్చు చేయాలంటే రూ.లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందేనని భావిస్తున్నారు.నామినేషన్లు వేస్తున్న ఆశావహుల్లో సందిగ్ధత నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాగైనా పోటీ చేయాలని గ్రామస్థాయి నేతలు పట్టుదలతో ఉన్నారు. తీరా ఇప్పుడు బరిలో నిలవడానికి సందిగ్ధత ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థితో బేరీజు వేసుకుంటూ ఎన్నికల ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలని మధనపడుతున్నారు. గ్రామస్థాయిలో పార్టీల నాయకులు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారు. అయితే, ఈ ఏడాది పత్తి, వరి పంటల దిగుబడి ఆశాజనకంగా లేకపోవడం, ఉన్న పంటలు కూడా తుపాను ప్రభావంతో పాడవడంతో నష్టాల పాలయ్యారు. దీంతో ఎన్నికల్లో సరిపడా ఖర్చు చేయగలమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. -
తూటా దూసుకెళ్తోంది..
సత్తుపల్లిలో వన్యప్రాణులను వేటాడినట్లు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. అర్బన్ పార్క్లో జింకలు, దుప్పులను కొందరు సైలెన్సర్ బిగించిన తుపాకులతో హతమారుస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ వేడుకలో దుప్పి మాంసం వడ్డించగా విషయం బయటకు పొక్కినట్లు సమాచారం. ఐదు వన్యప్రాణులను వేటాడినట్లు రెండు రోజుల క్రితం అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో నిజమా, కాదా అని తేల్చేందుకు విచారణ చేపట్టినట్లు సమాచారం. – సత్తుపల్లిసిబ్బందిని మచ్చిక చేసుకుని.. 2022 ఫిబ్రవరిలో సత్తుపల్లిలోని 354 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్పార్కు ఏర్పాటైంది. పార్క్ను ఆనుకుని జలగంనగర్ కాలనీ, వేంసూరు రోడ్డు వైపు ప్రభుత్వ కార్యాలయాల మధ్య 2.5 కిలోమీటర్ల మేర ఐదు అడుగుల ఎత్తుతోనే ప్రహరీ ఉంది. ఈ ప్రాంతమే వేటగాళ్లకు కూడా కలిసొస్త్తోందని, వీరికి అటవీశాఖ సిబ్బంది కొందరు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయాన తాగునీటి కోసం వచ్చే జీవాలను సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాత్రివేళ కిందిస్థాయి సిబ్బంది ఒకరిద్దరే గస్తీ ఉండడంతో వారిని లోబర్చుకోవటం వేటగాళ్లకు సులువవుతోందని సమాచారం. లెక్క తేలాలి.. అర్బన్ పార్కులో గత ఏడాది 102కు పైగా జింకలు, దుప్పులు ఉన్నట్లు అటవీశాఖ తేల్చింది. ఏటేటా వీటి సంఖ్య పెరుగుతుండగా వచ్చే జనవరిలో మరోమారు లెక్కించనున్నారు. ఇటీవల పార్క్లో జింకలు, దుప్పుల మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. ఇందుకు వేటగాళ్లే కారణమా, అనారోగ్యం బారిన పడుతున్నాయా లేక పార్క్ నుంచి బయటకు వచ్చి వాహనాల కింద పడి చనిపోతున్నాయా అన్నది తేలాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కూడా ఐదు జింకలు మృత్యువాత పడడం గమనార్హం. ఎప్పుడంటే అప్పుడే.. ఇటీవల ఓ వేడుకలో దుప్పి మాంసాన్ని వడ్డించారనే విషయం బయటకు రావడంతో అధికారులు ఆరా తీస్తుండగా ఒక్కో విషయం బయటపడుడుతున్నట్లు సమాచారం. ఆ వేడుక నిర్వహించిన వ్యక్తి తాను తలుచుకుంటే ఎప్పుడంటే అప్పుడు దుప్పిని వేటాడి వడ్డిస్తానని.. అది తనకు హాబీ అని చెప్పినట్లు తెలిసింది. ఇదే సమయాన పార్కులో జింకల మృతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు రావడంతో విచారణకు బృందాన్ని నియమించారు. దీంతో రెండు రోజులుగా అర్బన్పార్కులో జింకలను వేటాడిన ఆనవాళ్లు, రక్తపు మరకలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు.సత్తుపల్లి అర్బన్పార్క్లోని దుప్పులు, జింకలే లక్ష్యం పార్కు నుంచి జింకలు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. వెనుక వైపు ఫెన్సింగ్ తక్కువ ఎత్తుతో ఉండగా జింకలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సింగరేణిలో పేలుళ్ల సమయాన శబ్దానికి జీవాలు బెదిరి బయటకు వస్తున్నాయని ఇన్నాళ్లు భావించారు. కానీ రాత్రివేళ వేటగాళ్ల తుపాకీ కాల్పులు, వారి కదలికలే అసలు కారణమని తెలుస్తోంది. ప్రహరీ తక్కువ ఎత్తుతో ఉన్న చోట నుంచి లోనకు వచ్చి వన్యప్రాణులను హతమార్చి అక్కడి నుంచే తీసుకెళ్తున్నారని సమాచారం. పార్క్ ముందు భాగంలో సీసీ కెమెరాలు ఉండడం, అక్కడ వాచ్మెన్ను నియమించడంతో వెనక దారి ఎంచుకున్నట్లు తెలిసింది. -
అంతర్జాతీయ కథా సదస్సుకు ఆహ్వానం
సత్తుపల్లిరూరల్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యా న ఈనెల 30వ తేదీన ఆన్లైన్ వేదికగా జరిగే అంతర్జాతీయ బాల సాహిత్య భేరికి బాల రచయిత ఆవుల పోతురాజుకు ఆహ్వానం అందింది. వందకుపైగా బాల సాహితీవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి పోతురాజు కథ వినిపించనున్నారు. ఇటీవలే ఆయన రాసిన కథల సంపుటి ‘నాన్నే నా హీరో’ విడుదలైన విషయం విదితమే. ఈ సందర్భంగా పోతురాజును పాఠశాల హెచ్ఎం ఎస్కే. సోదు, తెలుగు ఉపాధ్యాయురాలు ఎం.రమాదేవితో పాటు రామకృష్ణ, మధుసూదన్రాజు తది తరులు అభినందించారు. సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్ఓగా ప్రదీప్బాబు సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్ఓగా ఎం.ప్రదీప్బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిప్యూటీ డీఎంహెచ్ఓగా పనిచేసిన టి.సీతారాంపై ఆరోపణలు రావడంతో ఇటీవలే ఉన్నతాధికారులకు సరెండర్ చేశా రు. ఈ స్థానాన సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదా లో నల్లగొండ జిల్లా తిప్పర్తి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న ప్రదీప్బాబుకు డిప్యూ టీ సివిల్ సర్జన్గా పదోన్నతి కల్పించి సత్తుపల్లికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరగా మెడికల్ ఆఫీసర్లు అవినాష్, చింతా కిరణ్కుమార్, ఇందుప్రియ, నవ్యకాంత్, రాములు, ప్రత్యూష, తబుసం, ఉద్యోగులు శుభా కాంక్షలు తెలిపారు. లైసెన్స్ లేని వ్యాపారికి జరిమానా కారేపల్లి: లైసెన్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారికి ఇల్లెందు వ్యవసాయ మా ర్కెట్ కార్యదర్శి నరేష్కుమార్ జరిమానా విధించారు. ఖమ్మంకు చెందిన కె.వెంకటనారా యణ లైసెన్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసుకొని డీసీఎం వాహనంలో తరలిస్తుండగా మండలంలోని గేట్ కారేపల్లి వద్ద అడ్డుకున్నారు. ఈమేరకు వ్యాపారి నుంచి మార్కెట్ ఫీజు రూ.2,800 వసూలు చేయడమే కాక లైసె న్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు రూ. 10వేలు జరిమానా విధించారు. మార్కెట్ సిబ్బంది సీహెచ్.లక్ష్మయ్య, జి.రంజిత్, వై.మధు, ఐ.సందీప్, ఇ.రమేష్ తదితరులు పాల్గొన్నారు. తుపాకీ కలిగిన వ్యక్తి అరెస్టుఖమ్మంవ్యవసాయం: కొణిజర్ల మండలంలో తుపాకీ కలిగి ఉన్న ఓ వ్యక్తిని శుక్రవారం అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి తుపాకీ, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకోగా ఖమ్మం ఫారెస్టురేంజ్ అధికారి స్వర్ణ బాలరాజు వివరాలు వెల్లడించారు. ఖమ్మంకు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి యజమానికి కొణిజర్ల మండలంలో వ్యవసాయ క్షేత్రం ఉండగా, ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన తిరు రాజమేళతో పాటు మరో ముగ్గురిని కాపలా దారులుగా నియమించాడు. వ్యవసాయ క్షేత్రం పక్కన చేపల చెరువులు ఉండడంతో పశుపక్షాదులను అడ్డుకునేందుకు శబ్దాలు చేసేలా రాజ మేళ డబుల్ బ్యారెల్ 402 గన్ ఉపయోగిస్తున్నాడు. అయితే, తుపాకీకి ఏపీలో లైసెన్స్ ఉండగా, ఇక్కడకు తీసుకొచ్చి వినియోగించడం నేరం కావడంతో శుక్రవారం ఆయను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు న్యాయమూర్తి హాజరుపర్చి ఆయన ఆదేశాలతో14 రోజుల రిమాండ్ నిమిత్తం జిల్లా జైలుకు తరలించారు. కాగా, అక్రమ వేట, ఆయుధాల ఉపయోగం నేరమని డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్ తెలిపారు. ఈమేరకు ఎవరైనా ఆయుధాలతోకనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. -
రోడ్డు విస్తరణపై రగడ
● బందోబస్తు మధ్య మార్కింగ్, కూల్చివేత ● పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను రూ.వందల కోట్లతో అభివృద్ధి చేస్తుండగా మార్కెట్కు వచ్చే రహదారుల విస్తరణకు అధికా రులు చర్యలు చేపట్టారు. పంట ఉత్పత్తులతో వచ్చే వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా మార్కెట్లోకి వెళ్లేలా శ్రీనివాసనగర్ ఎస్వీ ఎం పాఠశాల నుండి ప్రకాశ్నగర్ మీదుగా పత్తి మార్కెట్ వరకు గోళ్లపాడు ఛానల్పై రోడ్డు నిర్మాణానికి ప్రణా ళిక రూపొందించారు. ఈమేరకు మా ర్కింగ్ చేస్తూ నిర్మాణాల తొలగింపు చేపట్టగా.. చిన్నగా ఉన్న రోడ్ల ను 66 అడుగులకుపైగా విస్తరిస్తే తాము ఇళ్లు కోల్పోతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీరికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలపడంతో ఆందోళనలు జరుగుతున్నాయి. పోలీసు బందోబస్తు మధ్య.. ఖమ్మం 17, 27, 28, 29, 30 డివిజన్లను కలుపుతూ గోళ్లపాడు ఛానల్పై రోడ్డు నిర్మాణానికి అధికారులు వారం రోజులుగా మార్కింగ్ చేస్తూ నిర్మాణాలను తొలగిస్తున్నారు. రెవెన్యూ, ఇర్రిగేషన్, కేఎంసీ అధి కారులు పోలీసు బందోబస్తు మధ్య పనులు చేపడుతున్నారు. ఈమేరకు స్థానికులు మార్కింగ్ను నిలిపివేయాలని, కూల్చివేతలు చేపట్టవద్దని ఆందోళన చేస్తుండగా సీపీఎం, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు తెలిపాయి. కాగా, నగరంలోని ప్రధాన రహదారులే 50 అడుగులుగా ఉంటే.. ఇక్కడ 70 అడుగులుగా ఎందుకంటూ సీపీఎం నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై శనివారం సీపీఎం ఆధ్వర్యంలో కేఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్లు తెలిసింది. కాగా, గోళ్లపాడు చానల్ పై 66 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మానానికి అధికారులు మార్కింగ్ పూర్తి చేశారు. పేదలు ఇళ్లను నష్టపోతే డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చే యోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ విషయమై సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ మాట్లాడుతూ చిన్న రోడ్డును 70 అడుగులకు విస్తరిస్తే పేదలఇళ్లు కోల్పోనున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి 40 అడుగులతో సరిపెట్టాని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మంక్రైం: రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారనే ఫిర్యాదుతో 16మందిపై శుక్రవారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మో హన్బాబు తెలిపారు. సీపీఎం నాయకులు యర్రా శ్రీను, భూక్యా శ్రీను తదితరులతో పాటు పలువురు సీపీఎం, బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. -
ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక
ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాస్థాయి ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ నూతన కమి టీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాం ప్రసాద్ (ఇల్లెందుసీఐ), ప్ర ధాన కార్యదర్శిగా ఎం.శేఖర్ (సత్తుపల్లి సీఐ), కోశాధికారిగా ఎం.ప్రసాద్ (పాల్వంచ సీఐ) ఉపాధ్యక్షులుగా ఎం.ప్రశాంతి (సింగరేణి సీఐ), అసోసియేట్ అధ్యక్షులుగా జె.రమేశ్ (కొత్తగూడెం ఎస్ఐ), జాయింట్ కార్యదర్శిగా ఎస్.రమేశ్ (నేలకొండపల్లి సీఐ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి.వసంతలక్ష్మి (సింగరేణి ఎస్ఐ)ఎన్నికయ్యారు. అలాగే, ఈసీ మెంబర్లుగా షేక్ రెహమున్సీసా (కొత్తగూడెం ఎస్ఐ), ఎస్.జయశ్రీ(ఖమ్మం–1 ఎస్ఐ), ఎం.సాయిరాం (వైరా ఎస్ఐ)ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్య వర్గ బాధ్యులు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు నాగేందర్రెడ్డి, జానయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, 2 సీఐలు కృష్ణ, చంద్రమోహన్ పాల్గొన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులకు అవార్డులు ఖమ్మంసహకారనగర్/కల్లూరురూరల్: మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా హైద రాబాద్లోని కీర్తి అకాడమీ ఆధ్వర్యాన వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 13 మందిని ఎంపిక చేసి హైదరాబాద్లో శుక్రవారం సన్మానించారు. ఇందులో ముదిగొండ, కల్లూరు మండలం పేరువంచ హైస్కూళ్ల గణిత ఉపాధ్యాయులు అవధానుల మురళీకృష్ణ, ఎండీ.మౌలానా ఉన్నారు. వీరిని టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త, కీర్తి అకాడమీ చైర్మన్ బిందు తదితరులు సన్మానించారు. -
కాంగ్రెస్ మోసాలను వివరించాలి
ఖమ్మంవైరారోడ్: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరో పించారు. ఈమేరకు కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన రఘునాథపాలెం మండలం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కంటే ఎక్కువగా పంట సాయం అందిస్తామని చెప్పి విస్మరించడమే కాక రైతు రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని, యూరియా సరిపడా సరఫరా చేయలేకపోయిందని విమర్శించారు. పంట నష్టపరిహారం కూడా అందించలేదని తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లి సర్పంచ్ స్థానాలను గెలచుకోవాలని పువ్వాడ సూచించారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయాన కేసీఆర్ చేపట్టిన దీక్షకు గుర్తుగా శనివారం జరిగే దీక్ష దివస్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీబీ, మార్కెట్ మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, బీఆర్ఎస్, ఖమ్మం, రఘునాథపాలెం అధ్యక్షులు పగడాల నాగరాజు, వీరునాయక్, నాయకులు కర్నాటి కృష్ణ, మక్బూల్, ఖమర్, బచ్చు విజయ్కుమార్, పల్లా రాజశేఖర్, గుత్తా రవి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ -
ఎన్నారైకి పాస్బుక్ జారీ
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్ క్రాస్రోడ్డుకు చెందిన పసుపులేటి రాజగోపాల్ అమెరికాలో స్థిరపడగా.. దరఖాస్తు చేసుకున్న చాన్నాళ్ల తర్వాత ఆయనకు పట్టాదార్ పాస్ పుస్తకం అందింది. ఆయన ధరణి సైట్ అమల్లో ఉన్నప్పుడు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా అందలేదు. మరోమారు భూభారతి చట్టం ద్వారా మరోమారు దరఖాస్తు చేసుకున్నా తహసీల్దార్ లాగిన్లో నిలిచిపోగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ తహసీల్దార్ పి.రాంప్రసాద్ వివరాలు పరిశీలించి రాజగోపాల్కు ఏదులాపురం రెవెన్యూ పరిధిలోని 51గుంటల భూమికి సంబంధించి పాస్బుక్ జారీ చేశారు. ఈ పాస్బుక్ను ఎన్నారై బంధువుకు శుక్రవారం అందజేశారు. -
●ఏకగ్రీవం వైపు మొగ్గు
కామేపల్లి: మండలంలోని జోగ్గూడెంలో 787 మంది ఓటర్లకు గాను అందరూ గిరిజనులే. దీంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో గ్రామస్తులంతా పార్టీలకతీతంగా ఏకమై ఏకగ్రీవం దిశగా చర్చలు మొదలుపెట్టారు. గ్రామంలో ఆంజనేయస్వామి, గ్రామ దేవతల ఆలయ నిర్మాణానికి సహకరించే వారికే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించగా భూక్యా సైదమ్మ, అజ్మీరా శారద, హట్కర్ పార్వతీ, ఇస్లావత్ సరోజ, వాంకుడోత్ జ్యోతి, జర్పుల కమ్లీ, జర్పుల కవిత ముందుకొచ్చారు. చివరకు కాంగ్రెస్కు చెందిన భూక్యా లక్ష్మణ్నాయక్ భార్య సైదమ్మ ఆలయ నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఆమెను సర్పంచ్గా ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలకు వచ్చినట్లు సమాచారం. అంతేకాక ఉపసర్పంచ్ పదవి కాంగ్రెస్కు, ఎనిమిది వార్డుల్లో నాలుగు కాంగ్రెస్కు, మూడు బీఆర్ఎస్కు, ఒకటి బీజేపీ ఇచ్చేలా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
విత్తన చట్టం ద్వారా రైతులకు మేలు
ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన విత్తన చట్టం ద్వారా రైతులకు నా ణ్యమైన విత్తనాలు, మొక్కలు అందుతాయని అధి కారులు తెలిపారు. చట్టం ముసాయిదాపై శుక్రవా రం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా చట్టంలోని ముఖ్యాంశాలు అధికారులు వివరిస్తూ నాణ్యమైన విత్తనాలు అందడమే కాక నర్సరీల్లో అక్రమాలను నియంత్రించవచ్చని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చట్టాన్ని పార్లమెంట్లో అమోదంచడానికి ముందుగా అందరితో చర్చించి సలహాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎంవీ.మధుసూదన్, ఆత్మ పీడీ సరిత, ఏడీఏలు వాసవీరాణి, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, కరుణశ్రీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
●ఒక్క క్లిక్తో ఓటరు జాబితా
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యాన పార్టీల నాయకులు, ఆశావహులే కాక ప్రజలు సులువుగా ఓటరు జాబితా పరిశీలించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈమేరకు తుదిజాబితాను tsec. gov. in వెబ్సైట్ ద్వారా వార్డుల వారీగా చూడొచ్చు. డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. వెబ్సైట్లోకి వెళ్తే ఫైనల్ డ్రాఫ్ట్ రోల్స్ అని కన్పిస్తుంది. జిల్లా, మండలం, గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకుని కాప్చర్ కోడ్ నమోదు చేశాక వార్డుల వారీగా ఇంగ్లిష్, తెలుగులో జాబితా కనిపిస్తుంది. మనకు కావాల్సిన వివరాలు చూడడమే కాక అవసరమైతే పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ
● నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ● ఎన్నికల పరిశీలకులు కాళీచరణ్ సుధామరావు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా పర్యవేక్షించాలని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించే అభ్యర్థులకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటుచేసిన టోల్ఫ్రీ నంబర్ 1077పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించిన ఆయన ఎన్నికల సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణపై ఆరాతీశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి డీఆర్ఓ ఆధ్వర్యంలో వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రలోభాలు, కుల, మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలుచేసే వారిని గుర్తించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్దత్ మాట్లాడుతూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం పరిశీలకుడు సుధామరావుతో ఆటు అధికారులు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ సెల్, మీడియా సెంటర్లను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈసమావేశాల్లో కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్, డీఆర్ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, డీపీఆర్ఓ ఎం.ఏ.గౌస్, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, డీఈఓ చైతన్యజైనీ, సీపీఓ శ్రీనివాస్, ఆర్టీఓ వెంకటరమణ, డీసీఓ గంగాధర్, ఆర్డీఓ నరసింహారావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, ఈడీఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి.. రఘునాథపాలెం: గ్రామపంచాయతి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ అభ్యర్థులు నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని ఎన్నికల పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు సూచించారు. రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడి, కోయచలకలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీసు కమిషనర్ సునీల్దత్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాల్లో అన్ని వివరాలు నింపేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడగా డీపీఓ ఆశాలత, డీఆర్డీఓ సన్యాసయ్య, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్కుమార్, ఎంపీఓ శ్రీనివాస్రెడ్డి, ఆర్వోలు లింగానాయక్ పాల్గొన్నారు. -
●ఎన్నికల గుర్తులు ఇవే
భద్రాచలంఅర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల గుర్తులను ఎన్నికల అధికారులు వెల్లడించారు. సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీరంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపురంగులో ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, కప్పు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్క్, చెంచా గుర్తులు కేటాయించారు. వీటికింద నోటా గుర్తు విధిగా ఉంటుంది. వార్డు సభ్యుల గుర్తులు జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు–బాణం, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది. -
●నామినేషన్ ప్రతం నింపడం కష్టమే!
రఘునాథపాలెం/నేలకొండపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు నింపడానికి ఇబ్బంది పడుతున్నారు. వివరాలు నమోదు చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా తిరస్కరణకు గురవుతుందనే ఆందోళన వారిలో ఉంది. అందుకే అనుభవం కలిగి, బాగా రాయగలిగే వారిని ఎంచుకోవడమే కాక సందేహాల నివృత్తికి అధికారులను పదేపదే సంప్రదిస్తున్నారు. నేరాలు, కేసులు, ఫిక్స్డ్, టర్మ్ డిపాజిట్ల లెక్కలే కాక పెట్టుబడులు, నగలు, వారసత్వ సంపద, భూములు కొనుగోలు చేసిన తేదీ, విస్తీర్ణం, ప్రభుత్వ ప్రవేట్ సంస్థలలో అప్పులతో పాటు నీటి, విద్యుత్, ఆదాయం పన్ను, బకాయిలు, విద్యార్హతలు, వాణిజ్య భవనాలు విలువ నమోదు చేయాల్సి ఉంది. దీంతో ఏ వివరం దాచినా ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తారనే భయంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక బరిలో ఎవరిని నిలపాలి, సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరైనా సరైన అభ్యర్థి అన్న చర్చలు గ్రామాల్లో జోరందుకున్నాయి. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండడంతో జాబితాను హైకమాండ్కు పంపించి నిర్ణయాన్ని ముఖ్య నేతలకే వదిలేస్తున్నారు. నామినేషన్లు సమర్పిస్తున్న అభ్యర్థులు తొలుత ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లో పూజలు చేశాకే ముందుకు కదులుతున్నారు. -
ముగిసిన ఫిలాటికల్ ఎగ్జిబిషన్
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ఆధ్వర్యాన ఖమ్మం డీపీఆర్సీ భవనంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఫిలాటికల్ ఎగ్జిబిషన్ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, హైదరాబాద్లకు చెందిన నలుగురు ఫిలాటలిస్టులు 3,456 స్టాంపులను ప్రదర్శించగా, వీటిని చూసేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు బారులు దీరారు. ఈమేరకు విద్యార్థులకు క్విజ్, లెటర్ రైటింగ్, డ్రాయింగ్ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన 34మందికి బహుమతులు అందజేశారు.అలాగే, స్టాంపులు ప్రదర్శించిన ఫిలాటలిస్టులు డాక్టర్ నరేంద్రకుమార్ సాబూ(ఖమ్మం), హైదరాబాద్కు చెందిన దేవేంద్రకుమార్ జైన్తో పాటు కేవీవీఎస్.సుధాకర్, జి.హజరతయ్య, పి.ఉపేందర్ను ఖమ్మం పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఆధ్వర్యాన సన్మానించారు. అలాగే, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ఉమేష్చంద్ర, సురేష్రావు, అలంక్రిత, డాక్టర్ విజయకుమారి, డీఎన్బీ.దార, అశోక్కుమార్, రుద్రాన్ష్ సాబూల్, అనిల్రెడ్డి, దిలీప్ సాబూను అభినందించారు. -
కొయ్యలు కలియదున్నితే భూసారం
వైరా: జిల్లాల్లో వానాకాలం సాగైన వరి కోతలు, పత్తితీత చివరి దశకు చేరాయి. వరి 2.82 లక్షల ఎకరాల్లో, పత్తి 1.96 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, హెక్టార్ వరి పంట ద్వారా 6–7.5 టన్నులు, పత్తి ద్వారా 2–3 టన్నులు అవశేషాలు ఉత్పన్నమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, చాలామంది రైతులు అవశేషాలను కొద్దిమేర పశువుల మేత, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నా ఎక్కువ శాతం కాలుస్తున్నారు. దీంతో లాభం లేకపోగా పర్యావరణానికి హానీ జరుగుతుందని, అలాకాకుండా భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుందని వైరా కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి తెలిపారు. ఈమేరకు ఆమె రైతులకు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి. ఇలా చేస్తే మేలు స్వల్పకాలిక వరి రకాలను ఎన్నుకుంటే త్వరలో కోతలు పూర్తిచేసి రెండో పంట వేసేలోగా వ్యర్థాలను నేలలో కలియదున్నవచ్చు. కొయ్య కాళ్లను భూమిలో కలియదున్నితే గడ్డి ద్వారా పోషకాలు తిరిగి నేలకు చేరుతాయి. పొలం దున్నే 10 రోజుల ముందు పొలంలో గడ్డి పరిచి నీరు అందించాక ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లితే భూమిలో సేంద్రియ పదార్థాల స్థాయి పెరుగుతుంది. వరి అవశేషాలను వర్మీ కంపోస్ట్ లేదా బయోచర్ లేదా బయోగ్యాస్ తయారీలో ఉపయోగించవచ్చు. ఇక వరి కోత యంత్రాలకు గడ్డిని చిన్న మొక్కలుగా చేసే పరికరం అమరిస్తే ఫలితం ఉంటుంది. వరి తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లెజ్ పద్ధతిలో సాగు చేయడం మేలు. ఇవికాక పంట అవశేషాలను తగలబెట్టకుండా వ్యవసాయంతో పాటు వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా వినియోగిస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుందని కోఆర్డినేటర్ తెలిపారు. -
నగదుతో వెళ్తే పత్రాలు తప్పనిసరి
ఖమ్మంసహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు అధికార యంత్రాంగం నిఘా పటిష్టం చేసింది. ఈమేరకు ఎవరైనా రూ.50వేల కంటే నగదు తీసుకెళ్లాలంటే సరైన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు. గ్రామస్థాయి ఎన్నికలు కావడం, ఇదే సమయాన రైతుల చేతికి పంట డబ్బు వస్తుండడంతో ఇబ్బంది పడే అవకాశముంది. ఈమేరకు నగదు తీసుకెళ్లే వారు సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. 15 మంది నోడల్ అధికారుల నియామకం ఖమ్మంసహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13విభాగాలుగా విభజించి 15మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు 15మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. విత్తన బిల్లుపై నేడు సమావేశం ఖమ్మంవ్యవసాయం: ‘విత్తన బిల్లు ముసాయిదా’పై శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉదయం 11గంటలకు సమావేశం మొదలవుతుందని వెల్లడించారు. విత్తన అనుబంధ శాఖలు, కంపెనీల డీలర్లు, రైతులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు పాల్గొనాలని ఆయన సూచించారు. -
బస్సును ఢీకొట్టి వ్యాన్ బోల్తా
సత్తుపల్లిరూరల్: వేగంగా వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వచ్చిన కళాశాల విద్యార్థుల బస్సును ఢీకొట్టి బోల్తా పడింది. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న వ్యాన్ ఎదురుగా గంగారం వైపు నుంచి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో వస్తున్న బస్సును సత్తుపల్లి మండలం తమ్మిలేరు బ్రిడ్జిపై ఢీ కొట్టట్టింది. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వ్యాన్ తమ్మిలేరు బ్రిడ్జిపై రెయిలింగ్ ఢీకొట్టి బోల్తా పడడంతో స్వల్పంగా గాయపడిన డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. నాగిలిగొండలో టిప్పర్.. చింతకాని: మండలంలోని నాగిలిగొండ గ్రామ ప్రధాన రహదారిపై జాతీయ రహదారి నిర్మాణానికి మట్టి తరలించే టిప్పర్ గురువారం బోల్తా పడింది. బ్రేక్లు ఫెయిల్ కావడంతో వాహనం బోల్తా పడినట్లు తెలిసింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గాయపడిన కొంగకు చికిత్స ఖమ్మంమయూరిసెంటర్: గాలిపటం ఎగురవేసే మాంజా దారం రెక్కలకు చుట్టుకుని గాయపడిన కొంగకు కేఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది చికిత్స చేయించారు. ఖమ్మం బస్ డిపో సమీపాన మాంజా దారం తాకి గాయపడిన కొంగ చెట్టుపై వేలాడుతోంది. డీఆర్ఎఫ్ సిబ్బంది దారం విడిపించినా గాయం కారణంగా కొంగ ఎగురలేకపోయింది. దీంతో రాపర్తినగర్లోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాకవదిలేశారు. -
బాల రచయిత్రి చంద్రికకు అంతర్జాతీయ గుర్తింపు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం ఎన్నెస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని, బాలరచయిత్రిగా రాణిస్తున్న కొల్లి చంద్రికకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యాన ఈనెల 30న ఆన్లైన్లో సాహిత్య వేదిక నిర్వహించనున్నారు. ‘బాల సాహిత్య భేరి’ పేరిట 13 గంటల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి 101 మంది పాల్గొననుండగా చంద్రికకు అవకాశం దక్కి ంది. ఈ సందర్భంగా ఆమె మూడు నిమిషాల వ్యవధిలో కథ వినిపించనుంది. విద్యార్థిని పాఠశాల హెచ్ఎం చావా దుర్గాదేవి, తెలుగు ఉపాధ్యాయుడు కోండ్రు బ్రహ్మం, తదితరులు అభినందించారు. -
భళా.. తపాలా బిళ్ల!
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఫిలాటికల్ ఎగ్జిబిషన్(స్టాంపుల ప్రదర్శన) ఆకట్టుకుంటోంది. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ గురువారం మొదలుకాగా.. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు తాము సేకరించిన అరుదైన స్టాంపులను ప్రదర్శించారు. ఖమ్మం, హైదరాబాద్కు చెందిన నలుగురు 108 ఫ్రేముల్లో 3,456 స్టాంపులను ప్రదర్శించగా.. ఇందులో 1711వ సంవత్సరం విడుదలైన స్టాంపులు కూడా ఉండడం విశేషం. భారత్తో పాటు పోర్చుగీసు బ్రిటన్, థాయిలాండ్ ఇండోనేషియా, రుమేనియా, థైవాన్ తదితర దేశాలకు చెందిన స్టాంపులను సైతం ప్రదర్శించారు. కాగా, ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం కూడా కొనసాగుతుందని.. పాఠశాలల విద్యార్థులు, వ్యక్తులు రావొచ్చని అధికారులు సూచించారు. కాదేదీ అనర్హం ప్రకృతిలో ఉండే ప్రతీ దృశ్యంతో స్టాంపులను రూపొందించారు. వివిధ దేశాల్లోని ముఖ్య స్థలాలు, ఆయా దేశాల ప్రతినిధులు, ప్రముఖుల ఫొటోలతో స్టాంపులు రూపొందాయి. జంతువులు, పక్షులు, సముద్రపు జీవులు, క్రీడా వస్తువులు, ఖాదీ వస్త్రాలు, కలప, మెటల్స్, మెడిసిన్ వంటి రంగాలే కాక ఆహార పదార్థాల దృశ్యాలు కూడా స్టాంపులపై ముధ్రితమయ్యాయి. ఖమ్మంలో నిర్వహించిన ప్రదర్శనలో మహాత్మాగాంధీ ఖాదీ వస్త్రాలతో కూడిన తొలి స్టాంప్ను ప్రదర్శించగా.. పావు అణా ధర మొదలు వివిధ ధరల్లో విడుదలైన స్టాంపులు ఆకట్టుకున్నాయి. ఖమ్మంకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఎన్కే.సాబూ వైద్యం చేస్తూనే స్టాంపుల సేకరణను హాబీగా మలుచుకున్నారు. తొలినాళ్లలో జైపూర్ కలెక్టర్గా పనిచేసిన సోడాను స్ఫూర్తిగా ఏడో తరగతి నుంచే స్టాంపుల సేకరణ మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇండియా, పోర్చుగీసు, బిట్రన్, థాయ్లాండ్, రుమేనియా తదితర దేశాల స్టాంపులను సేకరించగా, ఎక్కడ ప్రదర్శన జరిగినా వెళ్తానని పేర్కొన్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫిలాటలిక్ ఎగ్జిబిషన్లకూ సైతం హాజరవుతున్నానని చెప్పారు. ఇప్పటివరకు బంగారు, వెండి పతకాలు సాధించిన సాబూ.. స్టాంపుల సేకరణ గొప్ప అనుభూతిని ఇస్తుందని తెలిపారు. స్టాంపుల సేకరణను మరో ప్రపంచంగా అభివర్ణించారు హైదరాబాద్కు చెందిన దేవేందర్ కుమార్ జైన్. దేశాల సంస్కృతులు ఈ స్టాంపుల్లో ప్రతిబింబిస్తాయని తెలిపారు. జంతు రూపాలు, వస్తు రూపాలు, రంగులు, వస్త్రాలు వంటి ప్రకృతిలో ఉండే అన్నింటిపై స్టాంపులు రూపొందాయని చెప్పారు. 5వ తరగతి నుంచి తనకు స్టాంపుల సేకరణపై ఆసక్తి ఏర్పడిందని.. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నా స్టాంపుల సేకరణ విడిచిపెట్టలేదని వెల్లడించారు. దేశ, విదేశాల్లో నిర్వహించే స్టాంపుల ఎగ్జిబిషనల్లో పాల్గొంటూ అక్కడకు వచ్చే పోటీదారుల నుంచి మరిన్ని స్టాంపుల సేకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో ఒక్కోసారి చాలా సమయం పడుతుందని, వ్యయప్రయాసలు ఓర్చుకోవాల్సి వస్తుందని దేవేందర్ వెల్లడించారు. ఆకట్టుకుంటున్న ఫిలాటికల్ ఎగ్జిబిషన్ -
అవకాశం ఇస్తే ఆకాశమే హద్దు..
ఖమ్మం సహకారనగర్: బాలికలకు చదువుకునే అవకాశం కల్పించాలని, తద్వారా వారు అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశముంటుందని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అసోసియేషన్(ఏఐడీ) సంస్థ బాధ్యులు బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భారతిరాణి, డీఐఈఓ రవిబాబు, డీఈఓ చైతన్య జైనీ, డీడబ్ల్యూఓ విజేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐఈఓ తదితరులు మాట్లాడుతూ బాల్యవివాహాలతో అనేక అనర్థాలు ఎదురవుతాయని తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని విద్యార్థినులను చదివించాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ బి.అరుణ్కుమార్, ఎన్ఎస్ఎస్ పీఓలు చంద్రకళ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు ఎన్నికల పరిశీలకుడు
ఖమ్మంసహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యాన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు జిల్లాకు చేరుకున్నారు టీజీ బయో డైవర్సిటీ బోర్డ్ కార్యదర్శిగా ఉన్న ఆయన ఖమ్మం చేరుకోగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ స్వాగతం పలికి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ ఆశాలత తదితరులు పాల్గొన్నారు. పోలీసుల విస్తృత తనిఖీలు ఖమ్మంక్రైం: స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి వరకు వాహనాల తనిఖీ చేపట్టగా, అనుమానితుల వివరాలను వేలిముద్రల ఆధారంగా సేకరించారు. అంతేకాక హోటళ్లు, లాడ్జీల్లో ఉన్న వారి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సరిహద్దు రాష్ట్రాల మీదుగా గంజాయి, రేషన్, బియ్యం తరలింపును కట్టడి చేసేలా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ వెల్లడించారు. ‘ఇకపై.. మీరు స్కూల్కు వెళ్లండి’ ఖమ్మం సహకారనగర్: సత్తుపల్లి మండలంలోని పాఠశాల ఉపాధ్యాయుడు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని ఓ విభాగం విధులు కొన్నాళ్లుగా నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల డీఈఓ కార్యాలయానికి వచ్చిన ఇంకో ఉపాధ్యాయుడు ఈ విభాగానికి అర్హత సాధించినట్లు తెలిసింది.ఈక్రమాన గురువారం మొదటి ఉపాధ్యాయుడు శాఖ ముఖ్య అధికారి వద్దకు వెళ్లగా ‘ఇక నుంచి మీరు స్కూల్కు వెళ్లండి’ అని సూచించినట్లు సమాచారం. అలాగే, డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇంకో ఉద్యోగి తరచూ గైర్హాజరు అవుతుండడంతో ఉన్నతాధికారులకు సరెండర్ చేసినట్లు తెలిసింది. -
నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు.. ప్రసాద్
ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థి, యువజన, కార్మిక ఉద్యమాలతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శిగా ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించిన ఘనత పోటు ప్రసాద్కు దక్కుతుందని పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. ఖమ్మంలోని జమ్మిబండ సమీపాన పోటు ప్రసాద్ స్మారకస్తూపం వద్ద గురువారం ఆయన ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్తో కలిసి నివాళులర్పించాక కార్పొరేటర్ బిజి. క్లెమెట్ అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడారు. పోటు ప్రసాద్ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడుతూనే పార్టీ విస్తరణకు కృషి చేశారని గుర్తు చేశారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఏర్పాట్లను ప్రసాద్ అప్పట్లోనేసిద్ధం చేశారని తెలిపారు. నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, షేక్ జానీమియా, తోట రామాంజనేయులు, పగడాల మల్లేశ్, పోటు కళావతి, వరద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సభలో బాగం హేమంతరావు -
న్యాయం చేయాలని మృతదేహంతో రాస్తారోకో
చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేకాలనీకి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ శెట్టిపోగు రంగారావు విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. ఖమ్మంలో శవపరీక్ష చేసిన అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లే క్రమాన ఆయన బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. రంగారావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నాగులవంచలోని ఖమ్మం–బోనకల్ ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చింతకాని, బోనకల్, ఖమ్మం ఎస్సైలు వీరేందర్, వెంకన్న, నాగుల్మీరా చేరుకుని ఆయన కుటుంబీకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోగా తోపులాట జరిగింది. వైరా సీఐ వెంకటప్రసాద్ చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారిని చెదరగొట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని మృతుడి కుటుబసభ్యులకు నచ్చచెప్పాక రాకపోకలకు పునరుద్ధరించారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కారేపల్లి: జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కారేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పదో తరగతి విద్యార్థిని బి.పల్లవి, ఇంటర్ విద్యార్థి వి.ఉదయ్కుమార్ పాల్గొని బంగారు పతకాలు సాధించడంతో మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశా రు. అలాగే, రాష్ట్ర స్థాయి పోటీల్లో యశస్విని, సాత్విక, అమూల్యప్రియ, నిక్షిత, భరత్ వెండి పతకాలు, విఘ్నేష్ రజత పతకం సాధించారని ప్రిన్సిపాల్ ప్రేమ్కుమార్ తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్తో పాటుపీఈటీ మూసా మొహినుద్దీన్, అధ్యాపకులు అభినందించారు. 30న కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబురు దయాకర్రెడ్డి, కటికల క్రిస్టోఫర్బాబు తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే పోటీలకు హాజరయ్యే పురుషులైతే 85 కేజీలు, మహిళలు 75 కేజీల బరువు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్కార్డుతో హాజరుకావాలని, ఇక్కడ ఎంపిక చేసే జట్లు డిసెంబర్ 11నుంచి కరీంనగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. దేవాదాయ కమిషనర్ను కలిసిన అధికారులు ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్గా ఎస్.హరీష్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం ఆయనను హైదరాబాద్లో శాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎం.వీరస్వామి, జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కమిషనర్ను సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. 108 వాహనం తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని 108 వాహనాన్ని జీవీకే, ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ బృందం గురువారం తనిఖీ చేసింది. అంబులెన్స్లోని పరికరాల పనితీరు, నిర్వహణ, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించడంతో పాటు నెలవారీ కేసుల సగటుపై ఆరా తీశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులను గోల్డె న్ అవర్లో ఆస్పత్రులకు చేర్చాలని సూచించారు. ఆడిటింగ్ బృందం సభ్యులు ఏ.కిశోర్, ఫయాజ్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా మేనేజర్ దుర్గాప్రసాద్, సిబ్బంది జగదీష్, ఖదీర్ పాల్గొన్నారు. మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్ ఖమ్మంక్రైం: అనుమతి ఇసుక తరలిస్తున్నట్లు మూడు ట్రాక్టర్లను ఖమ్మం టాస్క్ఫోర్స్, త్రీటౌన్ పోలీసులు గురువారం రాత్రి సీజ్ చేశారు. ముదిగొండ మండలం గంధసిరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు ప్రకాష్నగర్ వంతెన వద్ద వాహనాలను గుర్తించి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్బాబు తెలిపారు. -
అభిరుచులే వ్యక్తిత్వ ప్రతిరూపాలు
● స్టాంపులు చరిత్ర, సంస్కృతికి చిహ్నాలు ● ఫిలాటికల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్ఖమ్మంగాంధీచౌక్: ప్రతీ వ్యక్తికి ఏదో ఒక అభిరుచి ఉంటుందని, అదే వారి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సంతోషాన్ని కలిగించే సంతృప్తికరమైన అభిరుచి అలవాటుగా మారితే వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, జిజ్ఞాస పెరుగుతుందని పేర్కొన్నారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో తపాలా శాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఉమ్మడి జిల్లా స్థాయి ఫిలాటికల్ ఎగ్జిబిషన్ను గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల వారు సేకరించిన ప్రత్యేక స్టాంప్లను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించగా ఆయన పరిశీలించి మాట్లాడారు. చిన్నతనంలో తాను కూడా పోస్టల్ స్టాంపులను సేకరించేవాడినని, తమ ప్రాంతం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తే అక్కడి స్టాంపులు తీసుకుని రావాలని కోరానని గుర్తు చేసుకున్నారు. స్టాంపుల సేకరణ దేశ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. కాగా, పిల్లలు ఇలాంటి అభిరుచులు పెంచుకోవాలే తప్ప ఫోన్లకు అలవాటు పడొద్దని సూచించారు. అనంతరం పోస్టల్ బీమా పాలసీ పరిహారం చెక్కులను లబ్ధిదారులకు కలెక్టర్ అనుదీప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఉద్యోగులు పాల్గొనగా మై స్టాంప్ ఫ్రేమ్తో కలెక్టర్ను సత్కరించారు. కాగా, పాఠశాలల విద్యార్థులు ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన వివిధ రకాల స్టాంప్లను తిలకించారు. అలాగే, వ్యాసరచన, స్టాంప్ డిజైన్ పోటీల్లో 450 మంది పాల్గొన్నారు. ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ శుక్రవారం సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
సర్పంచ్కు 100, వార్డులకు 49
● మొదలైన నామినేషన్ల స్వీకరణ ● పరిశీలించిన కలెక్టర్, అధికారులుఖమ్మం సహకారనగర్: జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ గురువారం మొదలైంది. అయితే, మొదటి రోజు తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం వరకు గడువు ఉండడం, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ఈమేరకు ఏడు మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలు, 1,740వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 100, వార్డు సభ్యుల స్థానాలకు 49నామినేషన్లు దాఖలయ్యాయని డీపీఓ, అదనపు జిల్లా ఎన్నికల అధికారి ఆశాలత తెలిపారు. కాగా, సర్పంచ్ స్థానాలకు వైరా మండలంలో అత్యధికంగా 22 నామినేషున్లు అందగా, ఎర్రుపాలెం మండలంలో కేవలం నలుగురే నామినేషన్లు సమర్పించారు. ఇక వార్డుసభ్యులుగా చింతకాని మండలంలో నామినేషన్లు దాఖలైతే ఎర్రుపాలెం మండలంలో కేవలం ఒకే నామినేషన్ దాఖలైంది. ఏకగ్రీవం వైపు దృష్టి చాలావరకు గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ స్థానం అధికార పార్టీకి ఇస్తే, ప్రతిపక్ష పార్టీలకు ఉపసర్పంచ్ పదవి ఇవ్వాలని.. తద్వారా ఏకగ్రీవం చేయాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగా ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేయలేదని చెబుతున్నారు. లోటుపాట్లు ఎదురుకావొద్దు ఖమ్మం సహకారనగర్/రఘునాథపాలెం: నామినేషన్ల స్వీకరణను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పలు ప్రాంతాల్లో తనిఖీ చేశారు. రఘునాథపాలెంలో నామినేషన్ల స్వీకరణ సెంటర్ను పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ సెంటర్లో చింతగుర్తి, గణేశ్వరం, రఘునాథపాలెం జీపీల నామినేషన్లు స్వీకరిస్తుండగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రక్రియలో లోటుపాట్లు ఎదురుకాకుండా చూస్తూనే పారదర్శకతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈనెల 29వరకు ఉదయం 10–30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. తహసీల్దార్ శ్వేత, అధికారులు పాల్గొన్నారు. -
పాలిట్రిక్స్!
ఆమె చుట్టేమహిళలే కీలకం గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే శక్తిగా మహిళలు నిలవనున్నారు. మొత్తం ఓటర్లలో పురుషుల కన్నా 25,818 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థులు అతివల ఓట్లు రాబట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. బరిలోనూ ప్రాధాన్యత యాభై శాతం రిజర్వేషన్లతో అతివలకు రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం దక్కింది. గతంతో పోలిస్తే ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లు రిజర్వ్ అయ్యాయి. మొత్తం 566 స్థానాలకు గాను 259 జీపీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా మహిళలే బరిలోకి దిగనున్నారు. ఇక 5,168 వార్డుల్లో 2,230 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ బలమైన మహిళా నేతలు ఉంటే వారినే పోటీకి దింపే అవకాశముంది. తద్వారా ఓటర్లుగానే కాకుండా అభ్యర్థులుగానూ అతివలకు ప్రాధాన్యత దక్కనుంది. అందరి చూపు అటే.. గ్రామపంచాయతీ ఎన్నికలు మహిళలే ప్రాధాన్యతగా జరగనున్నాయి. ఈ నేపథ్యాన రాజకీయ పార్టీల నాయకులు మహిళలకు రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యుల స్థానాలను లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. రిజర్వ్డ్ స్థానాల్లో తాము మద్దతు ఇచ్చే మహిళా అభ్యర్థులను పోటీకి దింపాల ని వ్యూహరచన చేస్తున్నారు. అన్ని పార్టీలు ఇలాగే ఆలోచిస్తుండడంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న మహిళలకు మంచి అవకాశాలు దక్కనున్నాయి. పార్టీల్లో చురుకై న మహిళా నాయకులతో పోటీ చేయించడంపై నాయకులు, మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు యత్నాలు ప్రారంభించారు. అన్నింటా పైచేయి జిల్లాలోని ఇరవై మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. నేలకొండపల్లి మండలంలో 2,004 మంది మహిళా ఓటర్లు, రఘునాథపాలెం 1,948, తిరుమలాయపాలెంలో 1,656, కూసుమంచిలో 1,646, ఖమ్మంరూరల్లో 1,485 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు ఓటరు జాబితా ద్వారా తేలింది. మిగిలిన మండలాల్లో కూడా పురుషులు, మహిళా ఓటర్ల మధ్య తేడా భారీగా ఉంది.జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం -
పొత్తులు.. ఎత్తులు
● స్కీంలు కలిసొస్తాయన్న జోష్లో కాంగ్రెస్ పార్టీ ● మెజార్టీ స్థానాల్లో పట్టు కోసం బీఆర్ఎస్ కసరత్తు ● కొన్నిచోట్ల బీఆర్ఎస్ – సీపీఎం మధ్య సయోధ్య ● బలాబలాల ఆధారంగా సీపీఐ.. పోటీకి సై అంటున్న బీజేపీ సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల పర్వం మొదలుకావడంతో జిల్లాలో ‘స్థానిక’ రాజకీయం వేడెక్కింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పటిష్టం కావాలంటే స్థానిక ఎన్నికలే అన్ని పార్టీలకు కీలకంగా నిలవనున్నాయి. ఈనేపథ్యాన ప్రభుత్వ పథకాల ఫలాలతో మెజార్టీ స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తామన్న ధీమా అధికార కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి తమ బలం నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బలం ఉన్న చోట ఒంటరిగా, కొన్ని పంచాయతీల్లో బీఆర్ఎస్తో కలిసి వెళ్లేందుకు సీపీఎం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే సమయాన వామపక్షాలతో కలిసి వెళ్లడం, బలం కలిగిన జీపీల్లో ఒంటరిగా పోటీ చేయడంపై సీపీఐ దృష్టి సారించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని మండల స్థాయి నుంచి నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇవికాక బీజేపీ, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రయత్నిస్తున్నాయి. మొత్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలపై దృష్టి సారించగా.. మిగతా పార్టీలు పొత్తుల, ఎత్తులతో బలనిరూపణకు సై అంటున్నాయి. పార్టీ అఽధికారంలో ఉండడంతో సర్పంచ్, వార్డుసభ్యులుగా బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ శ్రేణులు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల సమయాన పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ మద్దతుదారులకు అత్తెసరు సర్పంచ్ స్థానాలే దక్కాయి. ఈసారి మాత్రం మెజార్టీ స్థానాలపై పార్టీ నజర్ పెట్టింది. అవకాశమున్న చోట ఏకగ్రీవాలకు ప్రయత్నించాలని జిల్లా, స్థానిక నేతలను ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు పూరమాయించినట్లు చర్చ జరుగుతోంది. ఖమ్మం నియోజకవర్గ పరిధి రఘునాథపాలెం మండలంలో ఏకగ్రీవమైన జీపీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇక నోటిఫికేషన్ రాకముందు మహిళలకు చీరలు, ఎస్హెచ్జీలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడమే కాక పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జోరుగా చేశారు. ఆయా పథకాలతో లబ్ధి పొందిన మహిళలు, వారి కుటుంబీకులు తమ పార్టీకి అండగా నిలు స్తారన్న ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్కు పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఒక్కో స్థానంతోనే ఆ పార్టీ సరి పెట్టుకుంది. అయితే ఆ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి జిల్లాలో జయకేతనం ఎగురవేసింది. ఈసారి పార్టీ అధికారం కోల్పోవడంతో స్థానిక ఎన్నికల్లో గట్టెక్కే అంశంపై నేతలు దృష్టి సారించారు. కానీ కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఇదే తమకు కలిసొస్తుందనే ధీమా నాయకుల్లో వ్యక్తమవుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 351 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఆయా స్థానాల్లో మళ్లీ గెలుపుపై దృష్టి సారించడమే కాక పలు స్థానాల్లో పోటీకి సీపీఎంతో సయోధ్య కుదుర్చుకున్నట్లు తెలిసింది. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటేలా కసరత్తు చేస్తున్నాయి. సీపీఎం బలం ఉన్న చోట మద్దతుదారులను బరిలోకి దింపి బీఆర్ఎస్ సహకారం కోరుతుంది. అలాగే బీఆర్ఎస్ మద్దతుదారులు పోటీచేసే పంచాయతీల్లో సీపీఎం శ్రేణులు సహకరించేలా చర్చించినట్లు తెలిసింది. సీపీఐ కూడా గతంలో తమ మద్దతుదారులు విజయం సాధించిన స్థానాల్లో పోటీని తొలి ప్రాధాన్యతగా పెట్టుకుంది. మిగతా స్థానాల్లో సీపీఎం, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్లేలా స్థానిక నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక మాస్లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు తమ ప్రభావం ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టాయి. జిల్లాలో అన్ని గ్రామపంచాయతీల్లో తమ మద్దతుదారులను బరిలో నిలపనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఎక్కువ స్థానాలు సాధించి జిల్లాలో తమ బలాన్ని నిరూపిస్తామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి మోడీ ఛరిష్మాతో.. యువత, మహిళల ఓట్లు తమ పార్టీ మద్దతుదారులకే దక్కుతాయనే ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. -
నాణ్యమైన విద్య అందించండి
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారు ఉన్నతస్థాయికి చేరేలా ఉపాధ్యాయులు చేయూతనివ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ సూచించారు. కలెక్టరేట్లో గురువారం ఆమె జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాల్లో ముందు నిలిచేలా చూడాలని తెలిపారు. విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లడమే కాక శాస్త్ర, సాంకేతికం, పరిశోధన, అభివృద్ధి రంగాలపై మక్కువ పెరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు రామకృష్ణ, పెసర ప్రభాకర్రెడ్డి, రూబీ, ఎంఈఓలు వీరస్వామి, వెంకటేశ్వర్లు, నివేదిత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ●తల్లిని మరిపించేలా పాఠశాలల్లో బోధన సాగాలని డీఈఓ చైతన్య జైనీ అన్నారు. ఖమ్మం డైట్ కళాశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు ఇస్తున్న శిక్షణను ఆమె పరిశీలించి మాట్లాడారు. పిల్లలతో మమేకమవుతూ బోధన చేయాలని, తద్వారా తొలి గురువుగా పిల్లలు గుర్తు ఉంచుకుంటారని తెలిపారు. ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, రిసోర్స్ పర్సన్లు ప్రవీణ్కుమార్, శ్రవణ్కుమార్, జీవన్కుమార్, అనిల్కుమార్ పాల్గొన్నారు.డీఈఓ చైతన్య జైనీ -
వైద్యుల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
మధిర/సత్తుపల్లిటౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,200 మంది వైద్యుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె.అజయ్కుమార్ తెలిపారు. మధిర, సత్తుపల్లి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులను గురువారం తనిఖీ చేసిన ఆయన నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. అనంతరం అజయ్కుమార్ మాట్లాడుతూ మధిర, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లిలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాలను పరిశీలించామని, త్వరలోనే కొత్త భవనాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యులను నియమించేంత వరకు ప్రస్తుతం ఉన్న వైద్యులతో కొత్త ఆస్పత్రుల్లో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కాగా, కమిషనర్ను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి మాట్లాడారు. కల్లూరులో వైద్యులు, సిబ్బంది లేకుండా నూతన భవనాన్ని ప్రారంభించొద్దని సూచించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా తాను చేసిన తీర్మానాలు అమలు చేయటం లేదని తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రాజశేఖర్గౌడ్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కె.వెంకటేశ్వర్లు, అనిల్కుమార్, ఎన్.కిరణ్కుమార్, బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేడారానికి ఆర్టీసీ బస్సులు ఈనెల 30 నుంచి ప్రతీ ఆదివారం సర్వీసు ఖమ్మంమయూరిసెంటర్: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యాన భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 28నుంచి జాతర జరగనుండడంతో ఈనెల 30వ తేదీ నుంచే ప్రతీ ఆదివారం ఖమ్మం నుంచి మేడారానికి బస్సు సర్వీసు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి ప్రతీ ఆదివారం ఉదయం 6గంటలకు బయలుదేరే ఎక్స్ప్రెస్ బస్సు, తిరిగి మేడారంలో సాయంత్రం 5.30గంటలకు మొదలవుతుందని తెలిపారు. ఖమ్మం నుండి మేడారానికి పెద్దలకై తే రూ.230, పిల్లలకు రూ.120, ఇల్లెందు నుండి పెద్దలకు రూ.170, పిల్లలకు రూ.90 చార్జీగా నిర్ణయించినట్లు ఆర్ఎం వెల్లడించారు. యాప్లో నామినేషన్ల వివరాలు వైరా/కొణిజర్ల: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా దాఖలవుతున్న నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు టీ పోల్ యాప్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరా మండలం పాలడుగు తదితర గ్రామాలతో పాటు తనికెళ్లలో నామినేషన్ల స్వీకరణను గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ పత్రాలు సక్రమంగా నింపారా, అన్ని ధృవీకరణ పత్రాలు ఉన్నాయా చూశాకే స్వీకరించాలని తెలిపారు. ఇదే సమయానెలాంటి అవకతవకలకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎంపీడీఓలు సక్రియా, జి.వర్ష, ఎంపీఓలు రాజేశ్వరి, ఆర్.ఉపేంద్రయ్య, మండల పర్యవేక్షన అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీడియా సెంటర్ ప్రారంభం ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లోని డీపీఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసీఎంసీ)ని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో వీడియోలు వినియోగించాలంటే అభ్యర్థులు, నాయకుల ఎంసీఎంసీ కమిటీ వద్ద అనుమతి తీసుకోవాలని తెలిపారు. డీపీఆర్ఓ ఎం.ఏ.గౌస్, డీపీఓ ఆశాలత, ఏపీఆర్వో ఎండీఅయూబ్ ఖాన్తోపాటు ప్రవళిక, నవీన్, హరీష్, చింతల శ్రీనివాసరావు, చావా నారాయణ, తాజుద్దీన్, మంగ పాల్గొన్నారు. -
డిప్యూటీ డీఎంహెచ్ఓగా వేణుమాధవరావు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం డిప్యూటీ డీఎంహెచ్ఓగా డాక్టర్ వేణుమాధవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వేణుమాధవరావు లెప్రసీ విభాగంలో డిస్ట్రిక్ట్ న్యూక్లియస్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉన్న ఆయనకు డిప్యూటీ సివిల్ సర్జన్గా పదోన్నతి కల్పించి డిప్యూటీ డీఎంహెచ్ఓగా నియమించడంతో విధుల్లో చేరారు. అలాగే, జిల్లాకు ఇద్దరు ప్రోగ్రామ్ అధికారులను కూడా కేటాయించారు. ఆలయానికి వెండి శఠారీ, ప్లేటు వితరణ ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఇందిరానగర్ జంక్షన్లోని బాలగణపతి ఆలయానికి భక్తులు రూ.60 వేల విలువైన వెండి శటారీ, ప్లేటు బుధవారం అందజేశారు. ఖమ్మంకు చెందిన బండారు నరసరావు–జ్యోతి, తరుణ్, కౌశిక్, అనూష వీటిని అందజేశారని ఆలయ అధ్యక్షుడు బాజిన్ని వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గిరిధర్, సభ్యులు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. 30న కల్లూరులో యూటీఎఫ్ జిల్లా సమావేశంఖమ్మంసహకారనగర్: కల్లూరులో ఈ నెల 30న టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. కల్లూరులో బుధవారం సమావేశాల పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. సమావేశానికి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవానితో పాటు ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే మట్టా రాగమయి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో నాయకులు బుర్రి వెంకన్న, షమీ, వల్లంకొండ రాంబాబు, పి.సురేశ్, ఉద్దండు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆమెకు అక్షరమాల..
కొణిజర్ల: మహిళలలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా 15ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి కనీసం చదవడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో కొత్త పథకం ఉల్లాస్ (అండర్స్టాడింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీ /యూఎల్ఎల్ఎస్) ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి చదవడం, రాయడం నేర్పించడంతో పాటు జీవన నైపుణ్యాలు, ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత వంటి విషయాల్లో అవగాహన కల్పించనున్నారు. ఈ పథకాన్ని సెర్ప్, విద్యాశాఖ సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదటి విడతగా డ్వాక్రా మహిళల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీఓఏలకు, సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ప్రతీ పదిమంది సీ్త్రలకు ఒక వలంటీర్ చొప్పున నియమంచి.. వారికి కూడా శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాల్లలో నిరక్షరాస్య మహిళలకు అక్షరాలు నేర్పించేందుకు కార్యక్రమం చేపట్టారు. పది మందికి ఒక వలంటీర్ జిల్లావ్యాప్తంగా మొత్తం 969 గ్రామ సమాఖ్యలుండగా 23,871 స్వయం సహాయక సంఘాలున్నాయి. వాటి లో 2, 41,512మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారిలో 50,564మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి సర్వే చేశారు. ఇందుకు గాను 5,056 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రతి పదిమంది అభ్యాసకులకు ఒక వలంటీర్ చొప్పున అదే గ్రూపులో బాగా చదు వుకున్న ఓ మహిళను వలంటీర్గా ఎంపిక చేశారు. ఉల్లాస్లో ఉపయోగించే పుస్తకాలపై గత సెప్టెంబర్లో వలంటీర్లకు మండలాల వారీగా మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మండలానికి 1,500 మంది ఉల్లాస్ శిక్షణ పొందిన వలంటీర్లు ప్రతిరోజూ వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో మండలంలో మొత్తం 1,500 మందిని గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినారు. దశలవారీగా మహిళలను వందశాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. తొలిదశలో పూర్తి నిరక్షరాస్యులైన మహిళలకు అక్షరాలు నేర్పించి కనీసం చదవడం, రాయడం నేర్పించడం చేయనున్నారు. అనంతరం పాఠశాల మానివేసిన యువతులను గుర్తించి వారిని ఓపెన్ టెన్త్లో చేర్పిండం, ఆ తర్వాత కళాశాల మాని వేసిన యువతులను గుర్తించి వారిని ఓపెన్ డిగ్రీలో చేర్పించి వారిని ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు ఉల్లాస్లో ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 5,056 మంది వలంటీర్లకు శిక్షణ ఇవ్వగా, వారు అన్ని హాబిటేషన్లలో నెల రోజులుగా నిరక్షరాస్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే మొదటి వాచకం పూర్తి కావొచ్చింది. మహిళలకు చదువు వస్తే సంఘాలతో పాటు కుటుంబాలకు కూడా లాభం జరుగుతుంది. ‘అమ్మకు అక్షరమాల’పేరుతో చేపడుత్ను ఈ కార్యక్రమాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. –అనిల్కుమార్, డిప్యూటీ డైరక్టర్, వయోజనవిద్యడ్వాక్రా మహిళల్లో పలువురికి చదువు రాక బ్యాంకు పనులకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. అలా జరగకుండా ఉల్లాస్లో భాగంగా చదవడం, రాయడం నేర్పించే ప్రక్రియ మొదలైంది. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ గ్రూపులో చదువుకున్న వారినే వలంటీర్గా ఎంపిక చేయడంతో అభ్యాసకులుగా శిక్షణ ఇస్తున్నారు. –బాదరబోయిన అరుణ, వీఓ సభ్యురాలు, కొణిజర్ల -
విశిష్టమైనది.. రాజ్యాంగం
ఖమ్మంలీగల్: ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం విశిష్టమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రజల హక్కులు, బాధ్యతలతో పాటు ప్రభుత్వ అధికారాలు, పాలన వివరాలను రాజ్యాంగం తెలియజేస్తుందన్నారు. అన్ని మతాలు, భాషలు, జాతులు సమానంగా జీవించేలా రాజ్యాంగా మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.కల్పన, మురళీమోహన్, దీప, రజని, బిందుప్రియ, మాధవి, నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ బాధ్యులు విజయశాంత, గద్దల దిలీప్, ఇంద్ర నరసింహారావు, న్యాయవాదులు పాల్గొన్నారు రాజ్యాంగం ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి ఖమ్మంక్రైం: భారత రాజ్యాంగాన్ని ఔన్నత్యాన్ని అందరూ తెలుసుకోవాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ హెడ్క్వార్టర్స్ పరేడ్ మైదానంలో ప్రవేశిక సామూహిక పఠనం చేపట్టారు. ఆతర్వాత ప్రతిజ్ఞ చేయగా అడిషనల్ డీసీపీ మాట్లాడారు. ఏఆర్ ఏసీపీలు సుశీల్సింగ్, నర్సయ్య, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
‘చాంబర్’ ప్రతినిధుల బాధ్యతల స్వీకరణ
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన ప్రతినిధులు బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా కురువెళ్ల ప్రవీణ్కుమార్, ప్రధాన కార్యదర్శి సోమ నరసింహారావు(జీవై నరేశ్), ఉపాధ్యక్షుడిగా బత్తిని నరసింహారావు, సహాయ కార్యదర్శిగా బాదె రమేశ్, కోశాధ్యక్షుడిగా తల్లాడ రమేశ్తో పాటు సెంట్రల్ ఈసీ సభ్యులుగా మాటేటి కిరణ్కుమార్, రాయపూడి రవికుమార్, వంగవీటి హరీశ్, సుఖాసీ శేషగిరిరావు, పోట్ల రామనాథం బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ మాజీ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, కొప్పు నరేశ్కుమార్, మెంతుల శ్రీశైలం, గుర్రం ఉమామహేశ్వరరావు, భద్రాద్రి బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్ గుండాల కృష్ణతోపాటు పారా నాగేశ్వరరావు తదితరులు వారిని సన్మానించారు. అలాగే, దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులుగా వడ్డే వెంకటేశ్వర్లు, ఎర్రా అప్పారావుతో పాటు కార్యవర్గ సభ్యులు సారిక పాపారావు, మల్లెల అప్పారావు, బండి సతీశ్, జంగిలి రమణ, సిరికొండ వెంకటేశ్వర్లు, సాదె శంకర్, జుట్టకొండ చైతన్య, బాల సన్మద్కుమార్, రావుల శ్రీనివాసరావు, కందిబండ నరసింహారావు కూడా ఖమ్మం మార్కెట్ వద్ద కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణీ కుముదిని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఆమె సమీక్షించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు, ఏ విడత ఎక్కడ పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలను టీ–పోల్ వెబ్సైట్, యాప్లో నమోదు చేయాలని సూచించారు. ఎంసీఎంసీ కమిటీ, మీడియా సెల్ ఏర్పాటు చేయాలని, రైతులు పంట డబ్బు తీసుకెళ్తే రశీదు వెంట పెట్టుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. వీసీ అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్ పలు సూచనలు చేశారు. టీ– పోల్లో వివరాలు అప్ లోడ్ చేయడమే కాక మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్, ఓటరు జాబితాలను గ్రామంలోని మూడు ప్రదేశాల్లో అంటించాలని తెలిపారు. ప్రచార ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతి, నామినేషన్ కేంద్రాల వద్ద మార్కింగ్, బ్యాలెట్ పత్రాల ముద్రణ, కలెక్టరేట్లో మీడియా సెల్ ఏర్పాటుపై సూచనలు చేశారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, డీఆర్ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీపీఓ ఆశాలత, డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీఓ నరసింహారావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని -
నేడు, రేపు ‘ఫిలాటికల్’ ఎగ్జిబిషన్
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని జిల్లా పంచా యతీ వనరుల కేంద్రం (డీపీఆర్సీ)లో గురు, శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యాన ‘ఖమ్మంపెక్స్’ పేరిట ఉమ్మడి జిల్లాస్థాయి ఫిలాటికల్ ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో స్టాంపుల సేకరణదారులకు పోటీలు నిర్వహిస్తారు. రెండు కేటగిరీలుగా నిర్వహించే పోటీ ల్లో పాల్గొనేందుకు పలువురు ఇప్పటికే చేరు కుని తాము సేకరించిన స్టాంపులను ప్రదర్శనకు పెట్టారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు రానుండగా, పాఠశాలల విద్యార్థులకు సైతం పోటీకి అవకాశం కల్పించారు. ఇదే సమయాన తపాలా శాఖ సేవలపై క్విజ్, లేఖారచన, స్టాంప్ డిజైన్ పోటీలను కూడా నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ మొదలవుతుందని, అరుదైన స్టాంప్లను ప్రదర్శించనుండడంతో పాఠశాలల విద్యార్థులు తిలకించేలా ఏర్పాట్లు చేశా మని డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. కాగా, బుధవారం సైతం పలు పాఠశాలల విద్యార్థులు స్టాంపుల ఎగ్జిబిషన్ను తిలకించారు. 30న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: జిల్లాస్థాయి అండర్–14, 16 బాలికల అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 30న ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు మందుల వెంకటేశ్వర్లు, ఎండీ షఫిక్ అహ్మ ద్ తెలిపారు. పరుగు, లాంగ్జంప్, హైజంప్, డిస్కస్త్రో, జావెలిన్త్రో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఇక్కడ గెలిచిన వారిని అస్మిత లీగ్ అథ్లెటిక్స్ టోర్నీకి ఎంపిక చేస్తామని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. 108 అంబులెన్స్ తనిఖీ సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని 108 అంబులెన్స్ను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అంబులెన్స్లో పరికరాల పనితీరు, నిర్వహణ, అత్యవసర సమయాన వినియోగించే మందులను పరిశీలించడంతో పాటు ఆక్సీజన్ నిల్వలు, నెలవారి కేసులపై ఆరా తీశారు. కార్యక్రమంలో 108 జిల్లా మేనేజర్ ఎ.దుర్గాప్రసాద్, ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్, క్వాలిటీ బృందం బాధ్యులు కిశో ర్, ఫయాజ్ పాల్గొన్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యాన అంబులెన్స్పై సీఎం చిత్రపటానికి స్టిక్కర్లు వేశారు. ఆకతాయి చేష్టలతో రైతుకు నష్టం కొణిజర్ల: కొందరు ఆకతాయిలు చేసిన పని ఓ రైతు ఆరుగాలం శ్రమను బూడిదపాలు చేసింది. తనికెళ్ల ప్రధాన రహదారిపై పది రోజుల క్రితం సోప్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడగా, ఆయిల్ నేలపాలైంది. రోడ్డు పక్కన గొయ్యిలో అది నిండగా, అక్కడే స్థానికులు చెత్తాచెదారం వేశారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించడంతో చెత్తతో పాటు ఆయిల్ అంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. ఇక్కడికి సమీపానే అమ్మపాలెం రైతు కట్ల లాలయ్య మిర్చి సాగు చేయగా, కాతకు రావడంతో ఆదివారం కోత మొదలుపెట్టాలని భావించాడు. ఇంతలోనే మంటల కారణంగా ఎనిమిది గుంటల తోట కాలిపోవడంతో రూ.50 వేలకు పైగా నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. -
ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా?
● ఈ అర్హతలు, పత్రాలు తప్పనిసరి ● నామినేషన్ వేళ సరిచూసుకోకుంటే తిప్పలే.. ఖమ్మంసహకారనగర్/సాక్షి నెట్వర్క్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రకియ గురువారం మొదలుకానుంది. ఈ నేపథ్యాన సర్పంచ్గా పోటీ చేయాలంటే ఎన్నికల కమిషన్ కొన్ని అర్హతలను నిర్ణయించింది. నామినేషన్ వేసే సమయాన వీటిని పరిగణనలోకి తీసుకోకపోతే తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. అంతేకాక రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ప్రతీ అభ్యర్థి నేర చరిత్ర, ఆస్తులు, రుణాలు, విద్యార్హతలకు సంబంధించి ఇద్దరు సాక్షుల ద్వారా ధ్రువీకరించిన స్వీయ ప్రకటనను దాఖలు చేయాలి. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ నుంచి కూడా పోటీ చేయొచ్చు. అలాగే, మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలే కాక అదే కేటగిరీలోని జనరల్ స్థానాల్లోనూ పోటీకి అవకాశం ఉంటుంది. ఇక జనరల్ కేటగిరీ సర్పంచ్ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.వేయి నామినేషన్ సమయాన ధరావత్తు చెల్లిచాలి. వార్డు సభ్యులకు జనరల్ అభ్యర్థులైతే రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, పత్రాలు సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే వ్యక్తి సదరు గ్రామపంచాయతీ స్థానికుడై ఉండాలి. అందుకు నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే, అభ్యర్థి పేరు పంచాయతీ ఓటరు జాబితాలో నమోదై ఉండాలి. నామినేషన్ దాఖలు సమయానికి వయసు 21 ఏళ్లు నిండడమే కాక ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసేవారు అలాగే, నిబంధనల మేరకు ఎన్నికల ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి. నామినేషన్ పత్రం పార్ట్–1లో ప్రతిపాదకుని సంతకం, పార్ట్–2లో అభ్యర్థి సంతకం, పార్ట్–3లో కూడా అభ్యర్థి సంతకం, పార్ట్–4లో ఆర్ఓ సంతకం, పార్ట్–5 (రిజెక్టెడ్ నామినేషన్)లో కూడా ఆర్ఓ సంతకం ఉండాలి. పార్ట్–6(రిసిప్ట్)లో ఆర్ఓ సంతకం ఉండాలి. అఫిడవిట్లో ఇద్దరు సాక్షుల సంతకం, అభ్యర్థి సంతకం తప్పనిసరి. నామినేషన్ పత్రంతోపాటు స్వీయ ప్రకటన (అఫిడవిట్), అనుబంధం–5, డిపాజిట్ అమౌంట్, గ్రామపంచాయతీ నుంచి నోడ్యూ సర్టిఫికెట్, బ్యాంక్ నూతన ఖాతా పుస్తకం (గతంలో వినియోగించిన అకౌంట్ పుస్తకాన్నే జత చేస్తే సదరు అకౌంట్లో ఎలాంటి డబ్బు జమ అయినా ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు), ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్లను జత చేసి ఎన్నికల అధికారికి అందజేయాలి. అనర్హులు ఎవరంటే.. గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. గ్రామపంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు, బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారిని అనర్హులుగా పరిగణిస్తారు. మతిస్థిమితం లేని వారు, బదిరులు, మూగవారు కూడా పోటీకి అనర్హులు. పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు, గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణ ఒప్పందం చేసుకున్నా వారిని సైతం పోటీకి అనర్హులుగా పరిగణిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు లోపు పిల్లలు ఉన్న వారే పోటీ చేసేందుకు అర్హులని, అంతకంటే ఎక్కువ ఉంటే అనర్హులని 1994లో ఆంధ్రప్ర దేశ్ పంచాయతీరాజ్ చట్టం ద్వారా అమలు చేశా రు. నాడు జనాభా నియంత్రణ, ఆహార భద్రత, పేదరికనిర్మూలన, నిరుద్యోగం, అనార్యోగ సమస్యలు, ఆర్థిక అస్థిరత తదితర కారణాలతో ఈ నిబంధన తీసుకువచ్చారు. ప్రస్తుతం జననాల రేటు తగ్గిపోవటం, సంతాన సాఫల్యత క్షీణిస్తుండటంతో రాష్ట్రప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ను ఎత్తివేసింది. దీంతో 30 ఏళ్ల తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు కూడా పంచా యతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కలిగింది. -
అవశేషాలు తగలబెడితే భూసారానికి ముప్పు
రఘునాథపాలెం: పంట కోతల అనంతరం పత్తి, వరి కొయ్యలను తగులబెట్టడం మానివేయాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య రైతులకు సూచించారు. రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి, పరికలబోడుతండాల్లో బుధవారం పర్యటించిన ఆయన పంట అవశేషాలను కాలుస్తున్న రైతులకు అవగాహన కల్పించారు. మంట పెడితే భూమిలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించి భూసారం దెబ్బతింటుందని తెలిపారు. అలాకాకుండా పంట అవశేషాలను నేలలో కలియదున్నాలని సూచించారు. ఆ తర్వాత పత్తి, మిర్చి పంటలను పరిశీలించి సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈఓ బి.శిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
‘రైతుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం’
ఖమ్మంమామిళ్లగూడెం: అన్నం పెట్టే రైతులు ఆవేదన చెందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ కాలం గడుపుతోందని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సమీపాన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సాక్షిగా ప్రమాణం చేసిన పాలకులు ఇప్పుడు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అన్నదాతల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, గతంలో కేసీఆర్ సర్కార్ కూడా రైతులను మోసం చేయడంతో కుప్పకూలిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలకులు ప్రజాసేవ వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారమెత్తారని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో పారిశ్రామికవేత్తలకు విలువైన భూములు కట్టబెడుతూ రూ.6 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. కిసాన్ మోర్చా నాయకుడు గోలి మధుసూదన్రెడ్డి మాట్లాడగా.. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు సన్నె ఉదయ్ప్రతాప్, మండడపు సుబ్బారావు, రమేశ్, నున్నా రవికుమార్, రాఘవరావు, గుత్తా వెంకటేశ్వర్లు, ప్రవీణ్కుమార్, రవిరాథోడ్, పెరు మాళ్ల విజయరాజు, నరుకుల వెంకటేశ్వర్లు, మంద సరస్వతి, వీరెల్లి రాజేశ్గుప్తా పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేకాలనీకి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ శెట్టిపోగు రంగయ్య (37) బుధవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో విద్యుత్ మోటార్కు మరమ్మతు చేస్తుండగా ఆయన షాక్కు గురై మృతిచెందాడు. రంగయ్యకు భార్య, కుమా రుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వీరేందర్ తెలిపారు. ఇసుక లోడ్ ట్రాక్టర్ బోల్తాబోనకల్: మండలంలోని బ్రాహ్మణపల్లి రేవు నుంచి అనుమతి లేకుండా వైరా మండలానికి ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను బుధవారం సీజ్ చేశారు. ట్రాక్టర్ను తహసీల్దార్ రమాదేవి జానకీపురం క్రాస్ వద్ద గుర్తించి తహసీల్కు తరలిస్తుండగా ఆర్వోబీ బ్రిడ్జి దిగాక మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. అదేసమయాన రావినూతల పాఠశాల నుంచి నలుగురు ఉపాధ్యాయులతో వస్తున్న కారు.. ట్రాక్టర్ ట్రక్కుకు తాకింది. ట్రక్కు కారుపై పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.వెంకన్న తెలిపారు. రెండు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేటలో రెండెకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 136 సర్వే నంబర్లోని తొమ్మిది ఎకరాలకు గాను రెండు ఎకరాల భూమిని గతంలో నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పట్టాలు జారీ చేసిందని తహసీల్దార్ పి.రాంప్రసాద్ తెలిపారు. కానీ, ఇప్పటివరకు సాగు చేయకపోవడంతో ప్రభుత్వ అవసరాల కోసం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే, భూమిలోని బోర్డులు, తాత్కాలిక ప్రహరీని తొలగించగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ ప్రభుత్వ భూమిగా చెబుతూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆర్ఐలు ప్రసాద్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నరసింహదాసుకు స్మృత్యంజలి
● ఘనంగా జయంత్యుత్సవాలు ● అలరించిన గిరి ప్రదక్షిణ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రామదాసు తర్వాత పరమ భక్తుడిగా, వాగ్గేయకారుడిగా పేరుగాంచిన శ్రీ తూము లక్ష్మీ నర్సింహదాసుకు దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నీరాజనాలు పలికారు. ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సంగీతోత్సవాలతో స్మృత్యంజలి ఘటించారు. ఆస్థాన విద్వాంసుల కీర్తనలు, అర్చకుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల నడుమ నరసింహదాసు చిత్రపటంతో ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా భద్రగిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం నరసింహదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పూజలు చేశారు. అలరించిన సంగీతోత్సవాలు.. సీతారాములకు సాయంత్రం వైభవంగా నిర్వహించే దర్బారు సేవ, పలు ప్రత్యేక పూజలను ప్రవేశపెట్టడంతో పాటు అనేక కీర్తనలు రచించి, ఆలపించిన లక్ష్మీ నర్సింహదాసుకు సంగీత, శాసీ్త్రయ నృత్యంతో నీరాజనం పలికారు. హైదరాబాద్కు చెందిన మహేందర్ కోలాట బృందం కళారూపాలతో పాటు స్థానాచార్యులు స్థలశాయి నర్సింహదాసు కీర్తనలు ఆలపించారు. లక్ష్మీనర్సింహదాసు వారసులు, ఆల య ఈఓ కొల్లు దామోదర్రావు, ఏఈఓ శ్రవణ్కుమార్, ప్రధాన అర్చకులు విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘శ్రీ రాజా తూము లక్ష్మీనర్సింహదాసు చరిత్ర’ పేరుతో రూపొందించిన గ్రంథాన్ని ఆలయ ఈఓ ఆవిష్కరించారు. రామయ్యకు స్నపన తిరుమంజనం. స్వామి వారి ఉత్సవమూర్తులకు బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామయ్య సన్నిధిలో ఉన్నతాధికారులు శ్రీ సీతారామ చంద్రస్వామిని రాష్ట్ర విజిలెన్స్, ఎన్పోర్స్మెంట్ శాఖ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏ.ఆర్.శ్రీనివాసరావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.వి.ఆనంద్ బుధవారం దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వారికి పండితులు వేదాశీర్వచం చేశారు. తీర్థప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను వివరించారు. కాగా, సీ.వీ. ఆనంద్ కుమారుడు నిఖిల్కు భద్రాచలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బోగాల శ్రీనివాసరెడ్డి కుమార్తె వాసంతితో బుధవారం రాత్రి వివాహం జరగగా, వధూవరులను మంత్రి పొంగులేటి సతీమణి మాధురి, పలువురు ఎమ్మెల్యేలు ఆశీర్వదించారు. -
తొలి సం‘గ్రామం’
● నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు ● ఈ దఫా ఏడు మండలాల్లో 192 జీపీలకు ఎన్నికలు ● నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన ఏర్పాట్లు ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులుసాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో తొలి విడత స్థానిక సం‘గ్రామం’ మొదలుకానుంది. మొదటి దఫా ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా, గురువారం నుంచి ఈనెల 29వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10–30నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు సమయం కేటాయించారు. మొదటి దశలో కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 192 గ్రామపంచాయతీలు, 1,740 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో గ్రామపంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. వచ్చేనెల 3న అభ్యర్థుల ఖరారు నామినేషన్లను ఈనెల 29వ తేదీ వరకు స్వీకరించాక, 30న పరిశీలన, అదేరోజు అర్హులైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఆతర్వాత వచ్చేనెల 1న ఫిర్యాదులు స్వీకరించి, 2వ తేదీన పరిష్కరించాక 3న మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 11న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్లు లెక్కిస్తారు. దీంతో సర్పంచ్, వార్డుసభ్యులుగా ఎవరు విజయం సాధించారో తేలాక పాలకవర్గం సమావేశం నిర్వహించి ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి చేస్తారు. ముందైతే నామినేషన్ రిజర్వేషన్ కలిసొచ్చిన చోట పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఆతర్వాత బలాబలాలు బేరీజు వేసుకొని బరిలో ఉండడమా, వైదొలగడమా నిర్ణయించుకోవచ్చనే భావనలో ఉన్నారు. రాజకీయ పార్టీల గుర్తులు లేకున్నా, పార్టీల మద్దతు ఉంటేనే అభ్యర్థులకు గెలుపు సాధ్యం కానుంది. దీంతో పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందన్నది నామినేషన్ల ఉపసంహరణ నాటికి తేలనుంది. ఈమేరకు ఆశావహులు నామినేషన్ వేసి చివరి వరకు పార్టీ మద్దతు కోసం యత్నించాలని భావిస్తున్నారు. -
ఏఓలుగా గ్రూప్–1 అధికారులు
● మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రికి కేటాయింపు ● ఇద్దరూ ఉమ్మడి జిల్లా వాసులే..ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తొలిసారి ఇద్దరు గ్రూప్–1 అధికారులను కేటాయించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికై న వీరిని మెడికల్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏఓ)గా నియమించారు. ఇందులో ఒకరు మెడికల్ కళాశాలలో, మరొకరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఏఓగా విధులు నిర్వర్తించనున్నారు. ప్రమాదం నుంచి కోలుకుని... మెడికల్ కాలేజీ ఏఓగా విధుల్లో చేరిన తాటి ప్రమోద్సాయిది భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెం. ఆయన తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన తల్లి పెంచి పెద్దచేశారు. ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో 2014లో ఢిల్లీ వెళ్లారు. రెండు సార్లు సివిల్స్ రాసినా ఫలితం రాలేదు. ఈక్రమంలోనే 2018లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ సివిల్స్ లక్ష్యాన్ని పక్కన పెట్టాల్సి వచింది. గాయాల నుంచి కోలుకోవడానికి ఐదేళ్లు పట్టగా, ఇంటి వద్దే గ్రూప్–1కు సిద్ధమయ్యారు. డిప్యూటీ కలెక్టర్ కావాలనేది లక్ష్యమైనా 317వ ర్యాంక్ రావటంతో ఏఓగా పోస్టింగ్ వచ్చిందని తెలిపారు. డీఎంఈపై పట్టు సాధించి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేలా కృషి చేస్తానని వెల్లడించారు. సివిల్స్ లక్ష్యంతో... తొలి నుంచి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో చదివానని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏఓ కొప్పాక అవినాష్ తెలిపారు. ఈయన స్వస్థలం ఖమ్మం నెహ్రూనగర్ కాగా తండ్రి పంచాయితీరాజ్లో ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి గృహిణి. విశాఖలో ఇంజనీరింగ్ తర్వాత ఢిల్లీలో యూపీపీఎస్సీకి కోచింగ్ తీసుకుంటున్న క్రమాన గూప్–1 నోటిఫికేషన్ రావడంతో ప్రత్యేకంగా ప్రిపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. నాలుగేళ్ల పాటు ఢిల్లీలో కోచింగ్ తీసుకోగా, గ్రూప్–1 కోసం ఖమ్మం వచ్చి సొంతంగా ప్రిపేర్ అయినట్లు వెల్లడించారు. దీంతో 506వ ర్యాంక్ సాధించగా, మెడికల్ కాలేజీ ఏఓగా పోస్టింగ్ దక్కిందని చెప్పారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలపై పట్టు సాధించి మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానని తెలిపారు. -
మిరపలో వేరుకుళ్లు ఉధృతి
ఖమ్మంవ్యవసాయం/కూసుమంచి: మిరపలో వేరుకుళ్లు తెగులు వ్యాప్తి తీవ్రంగా ఉండగా.. తామర పురుగు ఆశించడం కూడా మొదలైందని హైదరాబాద్ ఉద్యాన విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్, మల్యాల ఉద్యాన పరిశోధన స్థానం నుంచి డాక్టర్ భాగ్యశాలి, జిల్లా ఉద్యాన అధికారి ఎంవీ.మధుసూదన్తో కూడిన బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. కూసుమంచి మండలం గోపాలరావుపేట, చేగొమ్మ, లోక్యాతండా, తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుతో పాటు బోనకల్ మండలం తూటికుంట్లలో మిరప క్షేత్రాలను పరిశీలించిన వారు తెగుళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అక్టోబర్ వరకు విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా వేరుకుళ్లు తెగులు వ్యాప్తి ఉందని, ఇప్పుడిప్పుడే నల్ల తామర పురుగు కూడా ఆశిస్తోందని తెలిపారు. ఈమేరకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. అధికారులు ముత్యాలు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.జిల్లా పర్యటనలో గుర్తించిన శాస్త్రవేత్తలు


