● నిధులు ప్రకటించినా...
ఇప్పటికే ప్రకటించిన రైల్వే లైన్లు పూర్తి చేసేందుకు భారీగా నిధులు ఇస్తామని బడ్జెట్లో ప్రకటించారు. అయితే, ఏ లైన్కు ఎంత మొత్తంలో నిధులు ఇస్తారో తేలాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన మల్కన్గిరి – భద్రా చలం, మణుగూరు – రామగుండం, కొవ్వూరు – భద్రాచలం రోడ్డు, కిరండోల్ – కొత్తగూడెం లైన్లను ఏళ్ల క్రితం ప్రకటించినా రాష్ట్ర పరిధిలో ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీంతో ఈ లైన్లు పూర్తయ్యేలా నిధులు కేటాయిస్తారా, గతంలో మాదిరిగానే నామమాత్రపు నిధులతో సరిపెడతారా అన్నది తేలాల్సి ఉంది. వీటితోపాటు డోర్నకల్ – భద్రాచలం రోడ్డు డబ్లింగ్ లైన్పైనా స్పష్టత రాలేదు.


