రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ఉండాలి
అశ్వారావుపేటరూరల్: రాజకీయాల్లో యువత భాగస్వామ్యం అవసరమని, యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంటుందని రాస్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం అశ్వారావుపేటలోని ఆ పార్టీ కార్యదర్శి వెలుగు జాకబ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వీరిలో అశ్వారావుపేటలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి హెచ్చుమీరిందని విమర్శించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని అన్నారు. అశ్వారావుపేట వంటి గిరిజన ప్రాంతాలకు నిధుల కేటాయింపులు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వంటి అసమర్థ సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు రాజ్ కుమార్ రెడ్డి, గౌర బీరప్ప, గిరికుండే, కట్టా సతీష్, మడకం ప్రసాద్, యాగంపూడి ప్రసాద్ పాల్గొన్నారు.


