కాళేశ్వరం(మహదేవపూర్): రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఈద్ కా తోఫాను మహదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతీ ఒక్కరు సోదరాభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హసీనాఅక్బర్ఖాన్, మసీదుల సదర్లు తాజోద్దీన్, ముజుఖాన్, మాజీ మసీద్ కమిటీ సదర్ దయాజ్ఖాన్, నాయకులు వామన్రావు, ఉప సర్పంచ్ శ్రీజ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


