Mulugu District Latest News
-
‘చల్వాయి’కి రాష్ట్రస్థాయి గుర్తింపు
గోవిందరావుపేట: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, గ్రామ పరిశుభ్రత కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మండలంలోని చల్వాయి గ్రామ పంచాయతీకి రాష్ట్రస్థాయి ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు లభించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో చల్వాయి గ్రామ పంచాయతీ చేపట్టిన తడి–పొడి చెత్త సేకరణ, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ హిత కార్యక్రమాలు, పరిశుభ్రత చర్యలు, గ్రామ సుందరీకరణ పనులను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేకల రాధసుదర్శన్ మాట్లాడుతూ చల్వాయి గ్రామాన్ని పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, గ్రామ ప్రజల సహకారం, పంచాయతీ సిబ్బంది కృషి, ప్రజాప్రతినిధుల సమష్టి ప్రయత్నాల ఫలితంగానే ఈ అవార్డు లభించిందన్నారు. ఈ గుర్తింపు గ్రామాభివృద్ధికి మరింత ప్రేరణగా నిలుస్తుందన్నారు. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సనత్నగర్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
అప్పుడే.. బాగుండె!
నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్ సర్జరీలుకాశిబుగ్గ: నాడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఆస్పత్రిలో కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ ద్వారా రెగ్యులర్గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్కు హెడ్గా ఉన్న డాక్టర్ అమరవాది ప్రభాకర్ 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ నామ్కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు అధిక డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. నేడు మూతపడిన కార్డియో థొరాసిక్ యూనిట్.. గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థొరాసిక్ యూనిట్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మార్చారు. ఈ యూనిట్ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థొరాసిక్ యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఫర్ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యూనిట్ మూతబడి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ యూనిట్లో గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయకపోయినా ఐదుగురికి గుండె శస్త్ర చికిత్సలు చేశారు. మరో 40 వరకు వాస్కులర్ సర్జరీలు చేశారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి రూ.60లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం హృద్రోగులకు ఓపీ సేవలు అందిస్తూ మిగతా సమయంలో ఫ్యాకల్టీ మొత్తం ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఆగిన శస్త్రచికిత్సలు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లోనూ నిలిచిన సేవలు 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు డాక్టర్ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు.. 2004 నుంచి 2007 వరకు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థొరాసిక్ సర్జన్గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థోరాసిక్ యూనిట్లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ ఆన్లైన్ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు. -
ప్రజాదర్బార్తో సమస్యల పరిష్కారం
● మంత్రి ధనసరి సీతక్కఎస్ఎస్తాడ్వాయి: ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని పోచాపూర్, లింగాల గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో అటవీ అనుమతుల కారణంగా నిలిచిన రహదారి పనులకు అవసరమైన అనుమతులు సాధించి వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో వాగులు, చెరువుల అభివృద్ధికి రూ.70 నుంచి రూ.80 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ప్రజావాణికి దూర ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామాలకు చేరువగా ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అంతకుముందు రూ.10 లక్షలతో నిర్మించిన అంతర్గత రహదారి, రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అలాగే రూ. 11కోట్లతో బొల్లెపల్లి –పోచాపూర్, పోచాపూర్–అల్లిగూడెం బీటీ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్మీనా, అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ, వసంతరావు, మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి, సర్పంచులు మంకిడి మొగిలిపల్లి రవీందర్, మంకిడి శ్రీలత, డీపీఓ వెంకయ్య, ట్రైబల్ ఈఈ వీరభద్రం పాల్గొన్నారు. అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యం ములుగు రూరల్: అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఇంచర్ల ఎకో పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అడవుల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కీలకమన్నారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సందర్శించారు. అలాగే దేవగిరి పట్నంలో అడవిపందుల దాడిలో మృతి చెందిన వెంకటేశ్వరరెడ్డికి రూ.పది లక్షల ఆర్థిక సాయం చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో అటవీ సంరక్షణ అ ధికారి కాళేశ్వరం జోన్ (సీసీఎఫ్ఓ) ప్రభాకర్, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ను నిషేధించాలి
ములుగు: ప్రపంచ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కవర్స్, గ్లాసులు, ప్లేట్స్ నిషేధించాలని కోరుతూ శుక్రవారం పర్యావరణ విభాగం ములుగు ప్రముఖులు కొండా గిరివర్థఽన్, గండ్రకోట కుమార్ ములుగు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. ములుగులో ప్లాస్టిక్ పదార్థాలు చాలామంది కాల్చి వేస్తున్నారని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధించి స్టీల్ పాత్రలు వాడే వి ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి పోషన్న, భాష బోయిన మహేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్ఎంఎంఎస్లో ప్రతిభ ములుగు రూరల్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంస్) పరీక్షలో బండారుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటా రు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బండారుపల్లి మోడల్ స్కూల్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు స్కాలర్ షిప్కు ఎంపికై నట్లు ప్రిన్స్పాల్ దేవకి తెలిపారు. విద్యార్థులను అభినందించారు. -
నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రైతులను మోసంచేసే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్లు నమోదు చేస్తామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీసీఎస్ టీం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీ చేసిందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలోని ప్రతీ మండలంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాఖల సమన్వయం కీలకం.. మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాస సేవలు అందించేందుకు సంబంధిత అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి
● డీఆర్డీఓ చంద్రశేఖర్ వెంకటాపురం(కె): గ్రామ సమాఖ్య ఫెడరేషన్ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని డీఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండలపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు గ్రామ సమాఖ్య వీఓలు, స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలో 31 గ్రామసమాఖ్య భవనాలకు ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలోనే అత్యధికంగా వెంకటాపురం మండలానికి భవనాలు మంజూరయ్యాయని, ఈనెల 25వ తేదీ లోపు బేస్మెంట్ లెవల్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బొగ్గం నారాయణ, ఏపీఎంలు రాజు, అప్పారావు, పీఆర్ఏఈ చరణ్, ఏపీఓ భవాని, సీసీలు శంకరమ్మ, నర్సయ్య, సమ్మయ్య, వెంకటలక్ష్మి, మండల సమాఖ్య అధ్యక్షురాలు పూనెం ఉషారాణి తదితరులు ఉన్నారు. వాజేడులో.. వాజేడు: మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలని డీఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లు, కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. వీఓ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీఓ కృపాకర్, ఎంపీఓ చందులాల్, ఏపీఎం సతీష్ తదితరులు ఉన్నారు. -
పస్రా పోలీస్స్టేషన్ తనిఖీ
గోవిందరావుపేట: పరిపాలన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, రికార్డులు సరైన నిర్వహణకు నిర్థారించే లక్ష్యంతో ములుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రవీందర్, పస్రా సర్కిల్ ఇన్స్పెక్టర్ దయాకర్తో కలిసి శుక్రవారం పస్రా పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా అధికారులు కేస్ డైరీ (సీడీ) ఫైళ్లు, స్టేషన్ రికార్డులు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. డాక్యుమెంటేషన్ సక్రమంగా నిర్వహించబడుతుందా, క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తున్నారా అని తనిఖీ చేశారు. రిసెప్షన్ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాలను సమీక్షించారు. స్టేషన్ పరిపాలన, పరిశుభ్రత, రికార్డు నిర్వహణ విధానాలను సమీక్షించారు. రికార్డులను ఖచ్చి తంగా నిర్వహించడం, ప్రజలకు సత్వర సేవలు అందించడం, సిబ్బంది అప్రమత్తంగా ఉండాల ని సిబ్బందికి సూచించారు. తనిఖీ సందర్భంగా ఎస్సై తాజుద్దీన్ను నిబంధనల పట్టింపుపై ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. నేడు బూర్గుపేటలో ప్రజాదర్బార్ వెంకటాపురం(ఎం): ప్రజల సమస్యలను స్థానికంగానే తెలుసుకొని పరిష్కరించే విధంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నేడు (శనివారం) మండలంలోని బూర్గుపేట ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలపై దరఖాస్తులను అందజేయాలని కోరారు. సత్తన్న వర్ధంతి సభను విజయవంతం చేయాలి గోవిందరావుపేట: సీపీఐ(ఎంఎల్) ప్రజాప్రతిఘటన రాష్ట్ర కమిటీ కార్యదర్శి సామ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దుంపెల్లిగూడెం గ్రామంలో నేడు నిర్వహించనున్న సామ అంతిరెడ్డి అలియాస్ సత్తన్న పూలక్క వర్ధంతి సభను విజయవంతం చేయాలని పీవైఎల్ రాష్ట్ర కన్వీనర్ పావురాల భిక్షపతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం అధ్యక్షుడు బొబ్బల సాంబయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానంములుగు రూరల్: సమ్మక్క, సారక్క కేంద్రియ విశ్వవిద్యాలయంలో ఐదు విద్యా విభాగాల్లో 17 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం గెస్ట్ ప్యాకల్టీ విధానంలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కంప్యూటరింగ్, డాటా సైన్స్ అనలైటిక్స్, ఇంగ్లిష్, ఎకానమిక్స్ విభాగంలో అన్ రిజర్వుడ్ కోటా 6, ఈడబ్ల్యూఎస్ కోటా 2, ఓబీసీ కోటా 5, ఎస్సీ 3, ఎస్టీ 1 పోస్టులు (మొత్తం 17) భర్తీ చేయన్నుట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక పక్రియ యూనివర్సిటీ నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. యువకుడి దుర్మరణంమంగపేట: ద్విచక్ర వాహనం అదుపుతప్పి మండలంలోని అబ్బాయిగూడెంకు చెందిన కోరెం అరుణ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై టీవీఆర్ సూరి తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ్ మండలంలోని కత్తిగూడెం గోదావరి ఇసుక ర్యాంపులో పనిచేస్తున్నాడు. పని ప్రదేశం నుంచి గురువారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. రాత్రి సమయంలో మార్గమధ్యలోని వాడగూడెం వద్దకు వచ్చే సరికి ద్విచక్ర వాహనం అదుపుచేయలేక రోడ్డు పక్కన పంట పొలలాల్లోకి దూసుకుపోయింది. దీంతో తల నుదుటిభాగం వాహనం హ్యాండిల్కు బ లంగా గుద్దుకోవడంతో అధిక రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో సంఘటనను ఎవరు కూడా గమనించకపోవడంతో వెలుగులోకి రాలేదు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు సంఘటనా స్థలంలో అరుణ్ మృతి చెంది ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కోరెం అంజమ్మ, నారాయణ కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతిఒక్కరిని కంటనీరు తెప్పించింది. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సూరి తెలిపారు. -
రైతన్నపై ఎరువుల భారం!
ములుగు: వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఎరువుల ధరలు పెరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కూలీల కొరతతో పాటు యంత్రాల ఖర్చులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎరువుల ధరలు పెరగడం పంటల సాగుపై ప్రభావం చూపుతుంది. ఒకవైపు నకిలీ విత్తనాలు, మరోవైపు ఎరువుల కొరత, పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు కలవరపడుతుంటే ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎకరానికి రూ.4 వేలకు పైగా పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రైతు భరోసా డబ్బులు సకాలంలో రాకపోవడంతో పాటు యాసంగిలో రెండు ఎకరాల వరకే పెట్టుబడి సాయం అందడంతో ఆందోళన చెందుతున్నారు. రూ.400ల వరకు పెరిగిన ధరలు కాంప్లెక్స్ ఎరువులు ఒక బస్తాకు రూ.100 నుంచి రూ.400ల వరకు పెరిగాయి. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఎరువులను అధికంగా వాడుతున్నారు. ఎరువుల ధరల పెరుగుదల రైతులకు ఆర్థికభారం పెంచుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో సాగు ఖర్చులు మరింత పెరిగి అన్నదాతలపై ఆర్థికభారం పడనుంది. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పంట పొలాలను సిద్ధం చేసి విత్తనాల కొనుగోలుకు మాత్రమే సరిపోతుంది. ఎరువుల కొనుగోలుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మద్దతు ధర లేకపోవడంతో పాటు క్వింటా ధాన్యానికి మిల్లర్లు సుమారు 10 కిలోల వరకు కోత పెడుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం బదులు వందశాతం సబ్సిడీపై ఎరువులను ఉచితంగా అందించాలని రైతులు కోరుతున్నారు. అవసరమయ్యే ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) యూరియా 17,504 డీఏపీ 10,000ఎంఓపీ 8,000పెరిగిన ఎరువుల ధరలు ఇలా (రూ.లల్లో) కొత్త ధరపాత ధర2,2501.9502,3501,9752,4001,3502,1752,0251,6001,8001,8501,500615775సూపర్పొటాష్డీఏపీ20:20:0:1312:32:1610:26:2614:35:1415:15:1528:28:0 వానాకాలం ముందే పెరిగిన ధరలు అన్నదాతలకు సాగు ఖర్చులు రెట్టింపు జిల్లాలో 1,63,229 ఎకరాల్లో సాగు అంచనాఉచితంగా అందించాలి రైతే దేశానికి వెన్నెముక, రైతు లేకపోతే రాజ్యం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు బాగుపడాలంటే ప్రభుత్వం ఎరువులను ఉచితంగా అందించాలి. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తున్నా.. చివరికి అవి చేతికొచ్చే పరిస్థితి లేదు. అతివృష్టి, అనావృష్టితో నిత్యం సతమతమవుతున్నా.. మళ్లీ వ్యవసాయానికే మొగ్గుచూపి పంటలను పండిస్తున్నారు. ఇప్పటికై న రైతులకు ఎరువులు ఉచితంగా అందించి పంటలకు మద్దతు ధర అందించాలి. –అల్లాడి రాజేశ్వర్రావు, రైతు, ములుగు -
మేలో జిల్లాల వారీగా వివరాలు..
97,66092,6261,39,3561,20,8801,37,8211,22,59146,16542,83660,61656,097హనుమకొండజనగామభూపాలపల్లిములుగువరంగల్ -
నియంత్రణే లక్ష్యం
ములుగు రూరల్: క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రత పెరిగిపోవడంతో పాటు ఇతరులకు సంక్రమిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అవసరమైన మందులతో పాటు పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం నిక్షయమిత్ర ద్వారా కిట్లను అందిస్తోంది. క్షయవ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామాలలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. దీంతో పాటు గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 14 ఏళ్లు నిండిన వారి నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారికి తెమడ పరీక్షలతో పాటు స్క్రీనింగ్ చేసి వ్యాధి నిర్ధారణ చేపడుతున్నారు. జిల్లాలోని పది మండలాల పరిధిలో క్షయవ్యాధిగ్రస్తులు 248 మంది ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ నివేదికలు తెలుపుతున్నాయి. క్షయవ్యాధి నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో క్షయవ్యాధి తీవ్రత ఆధారంగా 20 గ్రామాలను ఎంపిక చేసి 100 శాతం ప్రజలకు క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తొలుత మూడు గ్రామాలను ఎంపిక చేసి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెమడ పరీక్షల్లో నిర్ధారణ కాని వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు అధునాతన పరికరాలతో స్క్రీనింగ్ వ్యాధిగ్రస్తులకు పోషణ కిట్ల అందజేత మండలం వ్యాధిగ్రస్తులు ములుగు 46వెంకటాపురం(ఎం) 25గోవిందరావుపేట 27ఎస్ఎస్ తాడ్వాయి 25ఏటూరునాగారం 24కన్నాయిగూడెం 13మంగపేట 30వెంకటాపురం(కె) 36వాజేడు 22 -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
వెంకటాపురం(ఎం): గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కేశవాపూర్ లో గురువారం నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను సందర్శించి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామసభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పనులను ప్రణాళికతో అమలు చేస్తామని, డీఆర్డీఏ, ఎంపీడీవోలు, ఎంపీఓల సమన్వయంతో జిల్లా స్థాయిలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని వెల్ల డించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అందించే పథకాల ప్రయోజనాలు సకాలంలో అందాలంటే నమోదు కీలకమని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ప్రజలు అధికంగా పాల్గొనాలని, ఉపాధి పనుల్లో కార్మికుల భాగస్వామ్యం పెరిగితే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీఓ భవనాలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు లభించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, పంచాయతీరాజ్ శాఖ అధికా రులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికా రులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్శకులకు మెరుగైన సేవలు అందించాలి గోవిందరావుపేట: లక్నవరం సరస్సుకు వచ్చే సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మండల పరిధిలోని లక్నవరం సరస్సును కలెక్టర్ గురువారం సందర్శించారు. పర్యాటకకేంద్రంగా పేరుగాంచిన లక్నవరం సరస్సులో పర్యాటకులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సరస్సు పరిసర ప్రాంతాలు, ఉయ్యాల వంతెన, బోటింగ్ కేంద్రం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పరిశుభ్రత నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అదికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటకులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే బోటింగ్ కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సరస్సు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని సూచించారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
డయాగ్నొస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి
మంగపేట : డయాగ్నొస్ట్టిక్ సెంటర్లకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ రక్తపరీక్ష కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయాగ్నొస్టిక్స్ సెంటర్ల సర్టిఫికెట్లతో పాటు ఓపీ రిజిస్టర్లు, ల్యాబ్ సౌకర్యాలను పరిశీలించి నిర్వహణలో లోపాలను గుర్తించి వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు పాటించాలని సూచించారు. అదే విధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈఎస్ఆర్ డయాగ్నొస్టిక్ సెంటర్ను తనిఖీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సెంటర్ను నిర్వహించడం, అర్హత లేకుండా పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే పరీక్షలు నిలిపివేసి వారం రోజుల్లో నిర్వహణకు సంబంధించి అనుమతులు చూపించాలని నోటీసులను జారీ చేశారు. ఆయన వెంట మంగపేట పీహెచ్సీ వైద్యాధికారి అఖిల ఉన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ -
భద్రతకు అత్యంత ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఏరియాలోని కేటీకే–1 గనిలో గురువారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా నియమాలు, పనిస్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సింగరేణి నిర్దేశించుకున్న జీరో హార్మ్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అప్రమత్తతతో విధులు నిర్వహించడం ద్వారా ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ మాటూరి రవీందర్, ఏరియా ఇంజనీర్ రాజారావు, కేటీకే–1వ గని మేనేజర్ ప్రవీణ్ విక్రమ్, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.● ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి -
వైభవంగా ముయ్యలమ్మ జాతర
● భారీగా తరలివచ్చిన భక్తజనం వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామంలో గురువారం ముయ్యలమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొంది ఇంటిపేరు ఉన్న వారు జాతరను నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చారు. పూజారుల సమక్షంలో గ్రామస్తులు మేళతాళాల నడుమ గుట్ట నుంచి నేరుగా ముయ్యలమ్మ గద్దెకు వనం తీసుకుకొచ్చారు. సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు గుట్ట నుంచి ముయ్యలమ్మ దేవతను తీసుకొచ్చారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు తీర్చాలని దేవతను వేడుకున్నారు. కొత్తగూడెం, ములుగు, ఛత్తీస్గఢ్ నుంచి గొంది వంశస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
రామప్ప అభివృద్ధికి కృషి
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి గురువారం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకై క యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేవాలయంలో పురావస్తు, పర్యాటక, దేవాదాయ శాఖల అభివృద్ధి నిధులకు ప్రతిపాదనలు పంపిస్తే పార్లమెంటులో ప్రస్తావించి నిధుల సమీకరణకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ పేర్కొన్నారు. రామప్ప శిల్పకళ సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. వారి వెంట టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, దశరథ్, దేవాదాయ, టూరిజం, పురావస్తు శాఖల సిబ్బంది ఉన్నారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి -
సర్వీస్ రికార్డే కీలకం..!?
పోలీస్శాఖలో కొత్త ఫార్ములా.. ● పోస్టింగ్ల ‘రాజకీయా’నికి డీజీపీ బ్రేక్ ● ‘సేఫ్ పోస్టింగ్’లకు ‘డిప్యుటేషన్’తో చెక్.. లూప్లైన్ డ్యూటీలు ఇక తప్పనిసరి ● ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కంటే డీజీపీ రూల్సే పవర్ఫుల్ ● ఒకేచోట ఉంటే కూడా ఔట్... పోలీస్వర్గాల్లో కలకలంసాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో తప్పనిసరి డిప్యుటేషన్ విధానం మళ్లీ అమల్లోకి రాబోతుంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ కొత్త నిబంధనలను అమలు చేసే పనిలో పడ్డారు. పోలీస్ అధికారి ఇకపై ప్రమోషన్కు ముందు.. తర్వాత కనీసం రెండేళ్లయినా డిప్యుటేషన్పై లూప్లైన్ పోస్టింగుల్లో పనిచేయాల్సిందే. గతంలోనూ ఈ నిబంధనలున్నా.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా అమలు కాలేదు. చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ/ఏసీపీల వరకు శాంతిభద్రతల విభాగంలోనే కొనసాగుతూ వస్తున్నారు. డీజీపీ కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే డిప్యుటేషన్పై ఇతర యూనిట్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. సిఫార్సులు కాకుండా సర్వీస్ రికార్డులు ప్రామాణికంగా పదోన్నతులు, పోస్టింగ్లు దక్కనున్నాయన్న చర్చ ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. బదిలీ లేదా డిప్యుటేషన్.. పలువురు అధికారులకు ఎఫెక్ట్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురిపై బదిలీ లేదా డిప్యుటేషన్ వేటు తప్పేట్టులేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు గణనీయ సంఖ్యలో ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ/ఏసీపీలు 10–15 మంది, సీఐలు 30 మందికిపైగా, ఎస్ఐలు 40–50 మంది వరకు ఉండగా, కొత్త విధానం అమలైతే వీరంతా బదిలీ, డిప్యుటేషన్ పరిధిలోకి వచ్చే అవకాశముందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సీఐ, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న పలువురు రెండు నుంచి మూడు ప్రమోషన్లు పొందినా.. చాలామంది సీఐడీ, డీసీఆర్బీ, పీసీఆర్, పీటీసీ, సీటీసీ, ఇంటెలిజెన్స్ తదితర లూపులైన్ విభాగాలవైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో డీజీపీ కొత్త నిర్ణయంతో ఉమ్మడి వరంగల్లో చాలామందికి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. కుటుంబం, పిల్లల విద్య, స్థానిక అనుబంధాల కారణంగా కొందరు సీనియర్ అధికారులు డిప్యుటేషన్లు, బదిలీల నిర్ణయంపై ఆందోళన చెందుతుండగా, కీలక పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్న యువ అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఒకే వర్గం అధికారుల ఆధిపత్యానికి చెక్ పడి కీలక పోస్టుల్లో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయని, ఫీల్డ్, లాఅండ్ఆర్డర్, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ విభాగాల్లో అనుభవం, పోస్టింగ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని వారంటున్నారు. లూప్లైన్ విధులు తప్పనిసరి.. దీర్ఘకాలికంగా శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులకు లూపులైన్ పోస్టింగ్లు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు పట్టణ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ప్రత్యేక విభాగాల పోస్టింగులలో రాజకీయ ప్రభావం కీలక పాత్ర పోషించేదన్న అభిప్రాయం ఉంది. కొత్త విధానం అమలైతే ఒకేచోట ఎక్కువకాలం కొనసాగడం కష్టమవడంతోపాటు సిఫార్సుల ప్రభావం కూడా తగ్గే అవకాశముంది. ఒకే కమిషనరేట్, జిల్లా లేదా ప్రత్యేక విభాగంలో ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న అధికారులను ఇతర యూనిట్లు, జిల్లాలు లేదా విభాగాలకు పంపడం అనివార్యం కానుంది. ఇకపై పోస్టింగ్లలో వ్యక్తిగత సిఫార్సుల కంటే సర్వీస్ రికార్డు, పనితీరు, పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. సీపీ/ఎస్పీ కార్యాలయాలు 04 ఏసీపీ/డీఎస్పీ కార్యాలయాలు 21 సర్కిల్ కార్యాలయాలు 26 మొత్తం పోలీసుస్టేషన్లు 91 -
ఐటీడీఏ డీడీ జనార్దన్ బదిలీ
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలోని గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఉప సంచాలకుడి(డీడీ)గా పనిచేస్తున్న దబ్బగట్ల జనార్దన్ బుధవారం బదిలీ అయ్యారు. మంచిర్యాల గిరిజన సంక్షేమ అధికారిగా వెళ్లారు. ఆయన స్థానంలో నాగర్కర్నూలు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఫిరంగికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారం డీడీగా బదిలీ చేశారు. అదే విధంగా ఐటీడీఏ ఇన్చార్జ్ ఏఓగా ఎస్డీసీ విభాగంలో డీటీగా పనిచేస్తున్న అనిల్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలిములుగు రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా నోడల్ ఆఫీసర్ అరుణాదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈకో క్లబ్, బండారుపల్లి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో తెలంగాణ కాలు ష్య నియంత్రణ మండలి సహకారంతో ప్రజా పాలన ప్రగతి ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణాదేవి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా యువత కృషిచేయాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ‘పచ్చని భవిష్యత్ కోసం సుస్థిర అభివృద్ధి, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు’ అంశాలపై నిర్వహించారు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ సరిత, మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ దేవకి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రసన్న కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహనతోనే ప్రమాదాల నివారణ భూపాలపల్లి అర్బన్: భద్రతపై అవగాహన కలిగిఉన్నప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఏరియాలోని కేటీకే–5వ గనిలో బుధవారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు భద్రతా నిబంధనలు, పనిస్థలాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్మికులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల భద్రత సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున భద్రత విషయంలో రాజీ పడొద్దన్నారు. సంస్థ నిర్దేశించుకున్న ‘జీరో హార్మ్’ లక్ష్య సాధనకు యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) తప్పనిసరిగా వినియోగించడం, యంత్రాలు, పరికరాలను నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. పనిస్థలంలో అసురక్షిత పరిస్థితులు కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రమాదాలను గుర్తించి నివారించే సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. -
గోదావర్రీ
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు సాయిని లక్ష్మీనర్సయ్య. ఏటూరునాగారంలోని శంకరాజుపల్లి. ముళ్లకట్ట శివారు ప్రాంతంలో 106/బీ సర్వే నంబర్లోని ఒక ఎకరం భూమి గోదావరి వరదలో కలిసిపోయింది. పక్కనే మరో 20 గుంటల భూమి ఉండగా క్రమంగా అదికూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. ప్రతీ ఏడాది మిర్చి పంటను ఎక్కువగా పండించేవారు. ఎకరంన్నర భూమి కనుమరుగు అయ్యింది. అందులో బోరు పాయింట్ సైతం గోదావరిలోనే కలిసిపోయింది. ఈయనతో పాటు మరో 33 మంది రైతులు భూములు కూడా గోదావరిలోనే కలిసిపోయాయి. ఏటూరునాగారం: జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు గోదావరి పరీవాహక ప్రాంతాలకు చెందిన రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గోదావరి వరదలకు విలువైన పంట భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉండడంతో పాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఒడ్డు వెంట కాంక్రీట్ వాల్స్తో పాటు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలని సర్వే బృందం ఇచ్చిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు ప్రాంతాల్లోని గోదావరి మూలమలుపుల వద్ద ఉన్న భూమి ఎక్కువగా ఒర్లిపోతుంది. ఏటూరునాగారంలోని 6 చోట్ల, కన్నాయిడెంలో 5 చోట్ల, మంగపేట మండలంలోని 8 చోట్ల మూలమలుపులున్నాయి. రైతుల ఒత్తిడి మేరకు 2024లో అప్పటి సర్వే బృందం అవసరమైన చోట్ల క్రాస్ సెక్షన్లు(నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు తీరం వద్ద నదిలో కాంక్రీట్ వాల్ నిర్మాణాలు) నిర్మాంచాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగానే జియోట్యూబ్స్ ప్రతిపాదన చేయగా ప్రస్తుతం రామన్నగూడెం వద్ద పనులు కొనసాగుతున్నాయి. కాని ముళ్లకట్ట, రొయ్యూర్, శంకరాజుపల్లి, ఓడవాడ, రాంనగర్, కమలాపురం ప్రాంతాల్లో రాతికట్టడాలను కట్టాల్సి ఉండగా ఆ పనులు మొదలు కాలేదు. స్థానిక వాగులు, వంకల నుంచి వచ్చే వరదను గోదావరి నదిలోకి ఎత్తిపోయడానికి ఏడు చోట్ల లిఫ్టుల ఏర్పాటు చేయాల్సి ఉందని నివేదికలు ఇచ్చారు. పంపుల ఏర్పాట్లకు సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ కావాల్సి ఉంది. గోదావరికి ఇరువైపులా కరకట్టల నిర్మాణంతో పాటు స్థానిక ప్రవాహాలను నది దిగువ భాగంలో కలిపేలా ప్రత్యేకంగా కాల్వల నిర్మాణం చేయాల్సి ఉంది. అన్ని నిర్మాణాలకు సుమారు రూ. 4,100 కోట్ల వరకు బడ్జెట్ అవసరమని నివేదికలో సర్వే బృందం పేర్కొంది. ఇవి ప్రతిపాదనల దశలోనే ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 1986లో అత్యంత భారీ వరదలు రావడంతో అనేక ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. దాని ఆధారంగానే 1991లో ఎక్కెల నుంచి రామన్నగూడెం, మంగపేట వరకు 10.64 కరకట్ట నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. 2022లో అతి భారీ వరదలు వచ్చాయి. ఈ సారి ఏజెన్సీ గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేసి అప్పటి ప్రభుత్వానికి రూ.119 కోట్లతో వరద ముంపు ఉన్న ప్రాంతాలకు కాంక్రీట్ వాల్ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. కానీ ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో ఒక్క అడుగు పడలేదు. కనుమరుగవుతున్న విలువైన పంటభూములు ఇబ్బందులు పడుతున్న రైతులు కాగితాలకే పరిమితమైన రక్షణ చర్యలు కానరాని కాంక్రీట్వాల్, కరకట్టల నిర్మాణం -
అత్యవసరంగా కావాల్సినవి..
పరికరం సంఖ్య వ్యయం ఫుల్రూమ్ డీఆర్ ఎక్స్రే 2 70 లక్షలు మొబైల్ డీఆర్ ఎక్స్రే 4 80 లక్షలు అల్ట్రాసౌండ్ 4 1.20 కోట్లు హారిజొంటల్ ఆటోక్లేవ్స్ 3 15 లక్షలు ఓటీ టేబుల్స్ 4 16 లక్షలుప్రధాన పరికరాల పరిస్థితి ఇలా పరికరం ఎంజీఎం సూపర్ స్పెషాలిటీఎంఆర్ఐ 1 (తరచూ మరమ్మతు) లేదు సీటీ స్కాన్ 1 (మరమ్మతు) 1 (పనిచేయదు) క్యాథ్ ల్యాబ్ లేదు 1 (పనిచేయదు) డీఆర్ ఎక్స్రే పాతది (మరమ్మతు) 1 ( ఏఎంసీ డ్యూ) అల్ట్రాసౌండ్ 4 (పాతవి, మరమ్మతు) 2 2డీ ఇకో 1 (పనిచేయదు) పనిచేస్తోంది ఈసీజీ 4 తరచూ మరమ్మతు 2 పనిచేస్తున్నాయిఎంజీఎం ఆస్పత్రి ఓపీలు, పరీక్షలు (సుమారుగా) రోజువారీ ఓపీ : 2,000 ఇన్పేషంట్లు : 1,000 ఎంఆర్ఐ/సీటీ స్కాన్ అవసరమయ్యే వారు : 500 ప్రస్తుతం జరుగుతున్న స్కాన్లు : 50 అల్ట్రాసౌండ్ అవసరమయ్యే వారు : 200 ప్రస్తుతం జరుగుతున్న అల్ట్రాసౌండ్లు: 100లోపు -
విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఏటూరునాగారం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం పనిచేస్తుందని ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి తెలిపారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం నిర్వహించిన వినియోగదారుల ఫోరం వేదికలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారులు వినియోగదారుల సమస్యలను పట్టించుకోకపోతే ఫోరానికి ఫిర్యాదు చేయాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు తీసివేయడం, కొత్తవి మార్చడం, మీటర్లను అమర్చడం, బిల్ అధికంగా రావడం వంటి సమస్యలను ఫోరం పరిష్కరిస్తుందని వెల్లడించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు వెంట ఉన్న స్తంభాలు కొత్తవి వేయాలని, తీగలను అమర్చాలని పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. 1912 నంబర్కు కాల్ చేసి సమాచారం అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు వివరించారు. అనంతరం వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాల చారి ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా అధికారులు, సిబ్బంది ఘనంగా చైర్మన్ను సన్మానించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఫైనాన్స్ సభ్యుడు దేవేందర్, ఇండిపెండెంట్ సభ్యుడు రామారావు, డీఈ పురుషోత్తం, ఏడీఈ ఉమారావు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ ఏటూరునాగారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఏటూరునాగారం దక్షిణం రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతిలో ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ చిన్నబోయినపల్లి పల్లె ప్రకృతి వనం నుంచి అటవీశాఖ చెక్ పోస్టు వరకు చెత్తాచెదారం ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు పెంచాలని కోరారు. విద్యార్థులు పాఠశాలల్లో క్రీడా మైదానాల వెంట మొక్కలను పెంచాలని సూచించారు. మీడియా క్రికెట్ పోటీలు ప్రారంభం ములుగు రూరల్: మీడియా క్రికెట్ పోటీలు అట్టహాసంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జాకారం పోలీస్ హెడ్ క్వాటర్స్లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ , డీఎఫ్ఓ వికాస్ మీనా క్రీడాపోటీలను ప్రారంభించారు. ములుగు ప్రింట్ మీడియా, వాజేడు టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. ములుగు మీడియా టీంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆడగా వాజేడు జట్టులో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆడారు. ఈ పోటీలో వాజేడు జట్టు విజయం సాధించింది. అన్ని మండలాల జట్లు పోటీలలో పాల్గొని గెలిచిన జట్టుతో పోలీస్ టీం తలపడనుంది. -
సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ములుగు: రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజలకు సామాజిక న్యాయంతో పాటు రాష్ట్ర ఆర్థిక పురోగతిని పెంచే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తూ ప్రతీ కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఐక్యతతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలో పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉద్యమకారుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చామని తెలిపారు. రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా జిల్లాలో 7,095 మందికి వైద్యం అందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పేదలకు రూ. 29,15కోట్ల లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 2,500 గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 24,038 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. 34 మలేరియా, 10 డెంగీ కేసులను నిర్ధారించి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించినట్లు వివరించారు. అటవీ ప్రాంతాల్లో తక్షణ వైద్య సహాయం అందించుటకు 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 1,965 మంది పేదగిరిజన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వైద్యం అందించినట్లు వివరించారు. సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలను అందించినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజాదర్బార్ తో సమస్యలు పరిష్కారం రాష్ట్రంలోనే వినూత్నంగా మొట్టమొదటిసారిగా జిల్లాలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీతక్క తెలిపారు. వెంకటాపురం, ములుగు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని మారుమూల 50 గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ప్రజాదర్బార్ నిర్వహించి అర్జీదారుల నుంచి 1,421 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. అందులో 321 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళా సంఘాలకు రూ.26 కోట్లకు పైగా రుణాలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలుమహిళల ఆర్థిక సాధికారతకు రుణాలు మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ఊతమిచ్చేలా వివిధ పథకాల కింద రూ.28 కోట్లకు పైగా రుణాలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. జిల్లాలోని 210 స్వయం సహాయక సంఘాలకు రూ.20.50 కోట్ల రుణాలను, 59 గ్రామ సంస్థలకు మార్కెటింగ్ కమీషన్ రూ.1.89 కోట్లను, గ్రామీణ కుటుంబాల ఆదాయ వృద్ధే లక్ష్యంగా మహిళా సభ్యులకు రూ.1.59 కోట్లను అందించినట్లు వెల్లడించారు. అలాగే సీ్త్ర నిధి ద్వారా రూ.2.20 కోట్లను, మెప్మా బ్యాంకేజీ కింద రూ.2.15 కోట్లను లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు వెల్లడించారు. -
రీల్స్ కాంపిటీషన్ విజేతలకు నగదు పురస్కారం
పర్యాటక వారోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక ప్రాంతాలను సృజనాత్మకంగా రీల్స్ చేసి పంపిన ఇన్ఫ్లుఝెన్సర్స్ రీల్స్ కాంపిటీషన్ విజేతలకు మంత్రి సీతక్క నగదు పురస్కారాన్ని అందించారు. మంగపేట మండలానికి చెందిన శ్రావణ్కుమార్కు ప్రథమ బహుమతి రూ.21 వేలు, ఏటూరునాగారం మండలానికి చెందిన రాకేష్కు రూ.15వేలు, మామునూరుకు చెందిన కావ్యకు రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సీతక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కల్యాణి, ఇన్చార్జ్ ఆర్డీఓ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
అలుపెరుగని పోరాటం
● తెలంగాణ ఉద్యమంలో పార్టీలకతీతంగా ఉద్యమించిన ప్రజలు ● సకలజనుల సమ్మెతో స్తంభించిన ములుగు ● రోడ్డెక్కిన ఉపాధ్యాయులు, కళాకారులు, యువత, విద్యార్థులు ● పలువురిపై కేసులు నమోదైనా సంకల్పం కోల్పోకుండా ముందుకు..ములుగు: త్యాగాల నేల.. పోరాటాల గడ్డ ములుగు ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు అలుపెరుగని పోరాటం చేశారు. ఉద్యమ సమయంలో కళాకారులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకులు, యువత, విద్యార్థులు పార్టీలకతీతంగా రోడ్డెక్కి ఉద్యమించారు. పలువురిపై కేసులు నమోదైనప్పటికీ సంకల్పం కోల్పోకుండా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. కవులు, కళా కారులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. కళాకారుల పాటలే ఉద్యమానికి ఊపిరి అయ్యాయి. డప్పులు చేత పట్టుకొని యువత, విద్యార్థులు కదం తొక్కుతూ పల్లెల నుంచి పట్టణం వరకు తెలంగాణ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లారు. సకలజనలు సమ్మెతో ఉద్యమం తీవ్రరూపం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2000 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ 2011లో తీవ్ర రూపం దాల్చింది. 2011 సెప్టెంబర్ 13న మొదలైన సకలజనుల సమ్మెలో పార్టీలకతీతంగా నాయకులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, కుల సంఘాలు ఒక్కటై తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లారు. ర్యాలీలు, రాస్తారోకో, నిరహార దీక్షలు, వంటావార్పు, బతుకమ్మలతో మహిళలు ఆటలాడుతూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ములుగులో నిర్వహించిన సకలజనుల సమ్మెకు ప్రజా గాయకుడు గద్దర్ హాజరై ఉద్యమానికి ఊపిరి పోశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఊరురా చైతన్య సదస్సులు నిర్వహించారు. 42 రోజుల పాటు చేసిన సకలజనుల సమ్మెతో జిల్లా స్తంభించిపోయింది. హైదరాబాద్లో నిర్వహించిన మిలియన్ మార్చ్కు సైతం ములుగు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జిల్లా నుంచి మాజీ మంత్రి దివంగత అజ్మీర చందూలాల్, ప్రస్తుత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కూడా పాల్గొన్నారు. ప్రాణత్యాగానికి పాల్పడిన శ్రీనివాస్ ములుగు మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన దసరాపు శ్రీనివాస్ 2011లో రాష్ట్రం కోసం ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాష్ట్ర ఉద్యమంలో అసువులుభాషిన శ్రీనివాస్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు భార్య రజితకు మామునూర్ పోలీస్ క్యాంపులో ఉద్యోగం కల్పించారు. అతను ఉద్యమ సమయంలో తలపెట్టిన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.ఉద్యోగులందరూ భాగస్వాములే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతీ ఉద్యోగి ఉద్యమంలో భాగస్వామిగా మారి ఆందోళనలు నిర్వహించారు. సకల జనుల సమ్మెలో ఉపాధ్యాయ జేఏసీ తరఫున నిరహారదీక్షలు చేపట్టాం. రోడ్డుపై వంటావార్పు, మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆటలాడుతూ తెలంగాణ ఆకాంక్షను చాటాం. పల్లెల్లో ప్రజా చైతన్య రథంతో తిరిగాం. – గంట సంజీవరెడ్డి, మాజీ ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ఇల్లు వదిలి ఉద్యమాలు చేశాం..తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఇల్లు, వాకిలి వదిలిపెట్టి ఉద్యమాలు చేశాం. 2002లో కామారెడ్డిలో ధూందాం ప్రారంభించి జిల్లాల్లో తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. కళాకారులమంతా బృందాలుగా ఏర్పడి ఉద్యమ ఆకాంక్షను సాంస్కృతిక కళారూపాలతో వివరించాం. అప్పుడు ఉన్న పాలకపక్షాలు బెదిరించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో గొంతెత్తి పాటలు పాడాం. – రేలా విజయ్, కవి,గాయకుడు, ములుగు -
ముహూర్తం ఖరారు!
● ఈనెల 17న కాళేశ్వరంలో రాతి నిర్మాణాల పనులు ప్రారంభం ● వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రారంభోత్సవాలుకాళేశ్వరం: కాకతీయులు, చాలుక్యులు 11వ శతాబ్దంలో నిర్మించిన కాళేశ్వరం దేవస్థానం మరో సరికొత్త నిర్మాణాలకు వేదిక కానుంది. 1982కు పూర్వం శిథిలావస్థలో ఉన్న కాళేశ్వరాలయం..దినదినాభివృద్ధి చెందుతుంది. తాజాగా కాళేశ్వరాలయంలో రాతి నిర్మాణాలకు ఏప్రిల్ 20న సీఎం ఎనుముల రేవంత్రెడ్డి రూ.198కోట్ల వ్యయంతో భూమి పూజ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం దేవస్థానంలోని నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఈనెల 17న ఉదయం 8 గంటలకు శాస్త్రోక్తంగా విశేష పూజలతో పనులు ప్రారంభిస్తారని ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు స్వయాన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమంలో చెప్పారు. దీంతో కాళేశ్వరం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చి కొంగొత్త రూపు దిద్దుకోనుంది. రూ.198కోట్లతో ఇలా.. రూ.133.50కోట్లతో ఆలయ కాంప్లెక్స్లోని గర్భాలయం, అర్థమండపం, శిఖరం, నందులు, ధ్వజం, 11 ఉప ఆలయాలు, ప్రాకారం, ఆగ్నేయంలో పాకశాల, నైరుతిలో విజయగణపతి ఆలయం, వాయువ్యంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, నాలుగు రాజగోపురాల నిర్మాణాలు చేస్తారు. ఈఓ కార్యాలయం, దేవస్థానం, దుకాణాల సముదాయం, ఎస్ఎస్ఆర్ కాటేజీ, సింగరేణి గెస్ట్హౌస్లు తొలిగిస్తారని తెలిసింది. రూ. 5కోట్లతో భూసేకరణ కింద సమీపంలోని కొన్ని గృహాలకు సంబంధించి తొలిస్తారని సమాచారం. రూ.35.50కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులు వెయిటింగ్ షెడ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, టిక్కెట్ కౌంటర్ హాల్, కల్చరల్ సెంటర్, బ్యాంకు, ఎస్ఆర్ఆర్ కాటేజీ, ఈఓ కార్యాలయం, ప్రవేశ తోరణం, అభివృద్ధి పనులు చేస్తారు. -
గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలి
● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుములుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 4, 6, 8, 10వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా వార్డు, గ్రామసభలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సభల కార్యక్రమాల ప్రణాళిక, ఏర్పాట్లు, వ్యవసాయం, విపత్తు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ పర్యావరణ వారోత్సవాల నిర్వహణతో పాటు గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజలు మొక్కలు నాటడం, వర్షాభావ పరిస్థితులు వస్తే ఏ విధమైన పంటలు సాగు చేయాలి, సురక్షిత, తాగునీటి సరఫరా, పంటలు మార్పిడి తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జూన్ నెలలో ప్రారంభమయ్యే ప్రత్యే క ఓటరు జాబితా సవరణపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. రైతులు పంటల మార్పిడి పద్ధతులను అనుసరించాలన్నారు. వర్షాకాల సన్నద్ధత, మొక్కల నాటకం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ.ఆనంద్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్, ఎస్పీ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల గ్రామ, వార్డు సభల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మండలాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఐఓ అప్పలనాయుడు, డీఏఓ సురేశ్కుమార్, డీహెచ్ఓ సంజీవరావు, డీఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా బాధ్యతగా వినతులు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తంగా 100 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పింఛన్లు 37, ఇందిరమ్మ ఇళ్లు 25, ఇతర శాఖలకు సంబంధించినవి 38 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించి ఆయా శాఖలకు బదిలీ చేశారు. గిరిజన దర్బార్లో 28 దరఖాస్తులు ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై వచ్చిన 28 దరఖాస్తులను పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు. గిరిజన మహిళా టైలర్లు స్కూల్ యూనిఫాం కుట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో వ్యవసాయ పనుల కోసం వినియోగిస్తున్న ట్రాక్టర్ను హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పారెస్టు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ట్రాక్టర్ను విడుదల చేయాలని కోరారు. ఏటూరునాగారం లంబాడీతండా శివారు ప్రాంతంలో కల్వర్టు వరకు మెటల్ రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో నిర్మించిన మెటల్ రోడ్డు పనులకు ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ విన్నవించారు. ఇలా అనేక సమస్యలపై వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్దన్, ఈఈ వీరభద్రం, ఏఓ రాజ్కుమార్, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ అనిల్కుమార్, జీసీసీ డీఎం వాణి, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, జియాలజిస్ట్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రజావాణిలో 100 వినతుల రాక -
ప్రభుత్వ పాఠశాలలో 103 అడ్మిషన్లు
ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో 103 మంది విద్యార్థులు సోమవారం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులు హెడ్మాస్టర్ కవిత ద్వారా అడ్మిషన్లు స్వీకరించినట్లు చిన్నబోయినపల్లి సర్పంచ్ నల్ల బోయిన నాగార్జున తెలిపారు. మండల పరిధి లోని చిన్నబోయినపల్లి డీఎన్టీ పాఠశాలలో ప్రత్యేక విద్యాబోధన కోసం ఎల్కేజీ, యూకేజీతో పాటు 7వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో ప్రత్యేక బోధన, సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అడ్మిషన్లను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్ఐటీఐ, ఏటీసీ అడ్మిషన్లు పొందాలి ఏటూరునాగారం: జిల్లాలోని ఆర్ఐటీఐ, ఏటీసీ కేంద్రాల్లో అర్హులైన విద్యార్థులు అడ్మిషన్లను పొందాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ఆర్ఐటీఐ, ఏటీసీ సెంటర్ల అడ్మిషన్ల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గిరిజన యువతకు ప్రభుత్వ ఆర్ఐటీఐ , ఏటీసీ సంస్థల్లో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల గురించి సమాచారం అందించడంతో పాటు శిక్షణ ఇస్తామన్నారు. నైపుణ్య ఆధారిత విద్య ద్వారా విజయవంతమైన ఉపాధి, కేరిర్ అవకాశాలను పొందేలా ప్రోత్సహించడమే లక్ష్యమని పీఓ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, యాదగిరి, మువీన్, విక్రమ్ పాల్గొన్నారు. రామప్పలో సినిమా షూటింగ్వెంకటాపురం(ఎం): షైన్ స్టూడియో బ్యానర్ పై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నంబర్ నెం. 2 సినిమా షూటింగ్ను రామప్ప దేవాలయంలో సోమవారం మంత్రి సీతక్క తనయుడు సూర్య, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షైన్ స్టూడియోస్ బ్యానర్స్ సినిమాను చిత్రీకరించడం అభినందనీయమన్నారు. యూనిట్ బృందంతో కలిసి రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్లారాజు, ప్రొడ్యూసర్ వేణు యాదవ్, హీరో అజయ్, మూవీ డైరెక్టర్ నేరెళ్ల దేవేందర్, కో డైరెక్టర్ ఆర్య అరవింద్ తదితరులు పాల్గొన్నారు. 49 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో మే మాసంలో లక్ష్యంలో 49శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2.38 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,16లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. జూన్ మాసంలో 2.35 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గైర్హాజరు శాతం తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. -
ప్రకృతి పరిరక్షణే ప్రగతి ప్రణాళిక లక్ష్యం
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: ప్రకృతి పరిరక్షణే ప్రగతి ప్రణాళిక లక్ష్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి ప్రకృతిని పరిరక్షించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాల నిర్వహణ సమీక్ష సమావేశం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. వన మహోత్సవం ద్వారా ప్రజల్లో ప్రకృతి సంరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువత, ప్రజలు వన మహోత్సవ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీలు, పరిశుభ్రత కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రతాప్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పార్టీలకతీతంగా పోరాటం
● ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులు, యువత ములుగు: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన పోరాటంలో నాయకులు పోరాటాలకతీతంగా పోరాటం సాగించారు. ములుగు గిరిజన ప్రాంతంలో మొదలైన ఉద్యమం 2009 తర్వాత తీవ్రస్థాయికి చేరుకుంది. ములుగు ఏజెన్సీలోని 8 మండలాల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. పార్టీలకతీతంగా, సంఘాల కతీతంగా నాయకులు కలిసి రోడ్డెక్కారు. మహిళా సంఘాలు సైతం బతుకమ్మ ఆడుతూ, రోడ్లపై వంటావార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణాల్లో చదువుకునే విద్యార్థులంతా గ్రామాలకు చేరుకొని యువతతో కలిసి ఉద్యమం తీవ్రరూపం దాల్చేలా పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం మారుమోగింది. అందరూ ఏకతాటిపైకి వచ్చి అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమ పోరాటాన్ని కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ కోసం రాష్ట్రంలో బలిదానాలు చేసుకుంటుంటే బలిదానాలు వద్దని, పోరాటాల ద్వారానే తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందామంటూ పోరాటం చేశారు. వాహనాలతో ర్యాలీలు, రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు, నిరహారదీక్షలు చేపట్టారు. సకల జనుల సమ్మెలో విద్యార్తులు సైతం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. -
పర్యాటక హబ్..
మేడారం జాతరలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మాస్టర్ ప్లాన్లో భాగంగా మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లతో పనులు చేపట్టారు. మరో రూ. 100 కోట్లతో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాట్లతో పాటు మేడారం ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో పెను మార్పులు తీసుకొచ్చారు. అలాగే రామప్ప, లక్నవరం, మేడారం, బొగత జలపాతం, మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి కొలువైన హేమాచలక్షేత్రం వంటి ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. జిల్లాలోని జంగాలపల్లి, తాడ్వాయి ఎన్హెచ్పై ప్రధాన కూడళ్లలో థీమ్స్ నిర్మాణాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. -
అభివృద్ధి వెలుగులు..
ములుగుమంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 202612 ఏళ్లలో మారిన ములుగు రూపురేఖలు7అడవుల ఖిల్లాగా పేరొందిన ములుగు ఏజెన్సీ ప్రాంతం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు అనేక రంగాల్లో వెనుకబడిన గిరిజన ప్రాంతం నేడు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. 12 ఏళ్లలో అనేక మార్పులతో ములుగు ముఖచిత్రం మారింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి చందూలాల్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సాధించిన అభివృద్ధిపై సాక్షి ప్రత్యేక కథనం.. – ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి● 2019లో 33వ జిల్లాగా ఏర్పాటు ● 2025లో మున్సిపాలిటీగా ఆవిర్భావం ● వైద్య కళాశాల, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతో మహర్దశ మేజర్ పంచాయతీ నుంచి జిల్లాగా.. 2011లో మేజర్ గ్రామపంచాయతీగా ఏర్పాటైన ములుగును 2019 ఫిబ్రవరి 17న 33వ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లాలో కన్నాయిగూడెం మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేసి 174 గ్రామ పంచాయతీలతో జిల్లా ఏర్పాటు చేశారు. 2025 ఏప్రిల్ 5న ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అంతేకాకుండా మంత్రి సీతక్క చొరవతో మాజీ జెడ్పీ చైర్మన్ జగదీశ్ పేరుతో మల్లంపల్లి గ్రామాన్ని జేడీ మల్లంపల్లి మండలంగా ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2021 జూలై 25న రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రశాద్ ప్రాజెక్ట్ కింద రూ.62 కోట్ల నిధులతో రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ది పనులు చేపడుతోంది. దేవాదుల నీటితో పెరిగిన ఆయకట్టు కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై నిర్మిందిన దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రామప్ప సరస్సును రిజర్వాయర్గా మార్చి దేవాదుల నీటిని అందిస్తుండడంతో జిల్లాలో ఆయకట్టు సాగు పెరిగింది. ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట, గణపురం మండలాలకు చెందిన రైతులు సాగునీటికి కొరత లేకుండా రెండు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఒకప్పుడు 80 వేల ఎకరాలకే ఆయకట్టు సాగుకు పరిమితమైన జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల భూములు సాగు అవుతున్నాయి. జిల్లాలో అయిల్పామ్ సాగు పెంపుతో మంత్రి సీతక్క సహకారంతో జవహర్నగర్ సమీపంలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. విద్య, వైద్యంలో పురోగతి జిల్లా విద్య, వైద్యంలో పురోగతి సాధించింది. విద్యలో 65 శాతం ఉత్తీర్ణత ఉన్న జిల్లా ప్రస్తుతం 90 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే గత ప్రభుత్వం 2023 మే నెలలో వైద్య కళాశాల నిర్మాణానికి 25 ఎకరాల భూమిని అప్పగించి రూ.60 కోట్లను కేటాయించి పనులు ప్రాంభించింది. జిల్లా కేంద్రంలోని కళాశాలకు కేటాయించిన స్థలంలో మూడు భవనాలను నిర్మించి 2024–25 నుంచి వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిగా మారిపోయింది. మెడికల్ కళాశాల విద్యార్థులకు తరగతుల బోధన, ఆస్పత్రి విధులకు 48 మంది వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. మెడికల్ కళాశాలలో ఇప్పటి 100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసి సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ గిరిజన యూనివర్సిటీగా నామకరణం చేశారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ భవన నిర్మాణాలకు రూ. 900 కోట్లు కేటాయించింది. 2023–24 విద్యాసంవత్సరంలో తరగతులను ప్రారంభించింది. కంటైనర్ ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటు ఎస్ఎస్తాడ్వాయి మండల పరిధిలోని కొడిశాలలో పూరి గుడిసెలో ఉన్న ఆస్పత్రిని ప్రస్తుతం కంటైనర్ ఆస్పత్రిలోకి మార్చారు. మంత్రి సీతక్క చొరవతో కంటైనర్ ఆస్పత్రిని నెలకొల్పి రోగులకు వైద్య సదుపాయాలను అందజేస్తున్నారు. ఐలాపురంలో గుడిసెలో సబ్ సెంటర్ ఉండగా ఇప్పుడు దానిని కంటైనర్ ఆస్పత్రిగా మార్చి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సదుపాయాలతో పాటు మందులు అందజేస్తున్నారు. ఎడ్జెర్ల పల్లిలో సైతం కంటైనర్ సబ్సెంటర్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. అలాగే కంటైనర్ పాఠశాలలను గొత్తికోయగూడేలు, గిరిజన గూడేల్లో ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తున్నారు. అలాగే జిల్లాలో నూతనంగా ఐదు పాఠశాలలను సైతం గతేడాది మంత్రి సీతక్క చొరవతో ప్రారంభం అయ్యాయి. -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
ములుగు: నేటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు. కలెక్టరేట్లో నేడు(మంగళవారం)నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 8 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అనంతరం పోలీసులతో మంత్రి సీతక్క గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలపై వివరించనున్నట్లు తెలిపారు. వేడుకల నిర్వహణకు సంబంధించి తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు సంబంధిత శాఖల అధికారులు చేపట్టినట్లు తెలిపారు. -
ఏర్పాట్లపై స్వామిజీ అభినందనలు
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై శ్రీ మాధవనంద సరస్వతి స్వామీజీ అభినందలు తెలిపారు. ఆదివా రం కాళేశ్వరం వచ్చిన ఆయనను మంత్రులు పొ న్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు స్వామీజీ ఆశీ స్సులు పొందారు. అంత్య పుష్కరాలకు వచ్చే భక్తు ల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ పట్ల స్వామిజీ సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్, సీడబ్ల్యూసీ సభ్యు డు గొడుగు రుద్రరాజు, తదితరులు పాల్గొన్నారు. మాధవనంద సరస్వతి ఆశీస్సులు పొందిన మంత్రులు -
డివిజన్ కల నెరవేరేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రైల్వే రంగంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధి గణనీయంగా మారనుండగా.. ఉమ్మడి వరంగల్లో రైల్వే డివిజన్ ఏర్పాటు హామీగానే మిగలనుంది. అన్నీ ఉన్నా.. డివిజన్ లేదు.. కాజీపేటను డివిజన్గా ఏర్పాటు చేయడానికి అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్ లోకోషెడ్, రెండు పిట్లైన్లు, భారీ రైల్వేయార్డు, కోచ్ నిర్వహణ కేంద్రం, కొత్తగా నిర్మిస్తున్న మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఇంటర్సిటీ కోచ్ తయారీ యూనిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాలతో కొత్త డివిజన్లు ఏర్పాటవుతున్నా అన్ని అర్హతలు ఉన్నా కాజీపేటకు మాత్రం డివిజన్ ప్రకటించకపోవడం ఉమ్మడి వరంగల్ వాసుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి.. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జోన్ లభించిన నేపథ్యంలో కాజీపేట డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్కు డివిజన్ వల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల మంజూరు, సరుకు రవాణా ఆదాయం పెరగనుంది. 1980 నుంచే ఉద్యమం.. కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాల ని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 1980 నుంచి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వస్తుండడంతో కాజీపేట డివిజన్ కోసం ఉద్యోగ, ప్రజాసంఘాలు మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా మొండిచెయ్యే నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ అమలు డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ఉద్యోగ, ప్రజాసంఘాలుఉమ్మడి వరంగల్ (కాజీపేట)కు డివిజన్ వస్తే కాజీపేట–బల్లార్షా, కాజీపేట–మోటుమర్రి, పెద్దపల్లి–నిజామాబాద్, డోర్నకల్–మణుగూరు, డోర్నకల్–భద్రాచలం రోడ్–సత్తుపల్లి మార్గాలు చేరే అవకాశం ఉంది. దాదాపు 695 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ డివిజన్లో సింగరేణి బొగ్గు రవాణా కూడా ఉండడంతో ప్రారంభం నుంచే లాభాల్లో నడిచే అవకాశముందని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రైల్వే పరిపాలన అంతా సికింద్రాబాద్ కేంద్రంగానే కొనసాగుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటైన జంక్షన్.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలకు వెళ్లే రైళ్లకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కాజీపేటను డివిజన్ చేస్తే ఉమ్మడి వరంగల్ కొత్త గుర్తింపు రానుంది. -
బడి బస్సు భద్రమేనా?
ఖిలా వరంగల్: పాఠశాలల పునఃప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈక్రమంలో బడి బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. బస్సుల ఫిట్నెస్ గడువు మే 15తోనే ముగిసింది. బస్సులను మరమ్మతులు చేసి ఫిట్నెస్ పరీక్షలకు తీసుకురావాలని ఆర్టీఏ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) గడువు ముగిశాక బస్సులు రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు ఉన్నాయి. ఫిట్నెస్ నిబంధనలు ఇలా.. బస్సుకు పవర్ స్టీరింగ్ ఉండాలి. డ్యాష్ ప్యానల్ బోర్డులో ఎడమ, కుడి ఇండికేటర్స్ తప్పనిసరి. బ్రేకుల్లో లోపం తెలిపే ఎరుపు ఇండికేటర్ ఉండాలి. ఫ్యూయల్ గేజ్, స్పీడో మీటర్, డ్రైవర్ సీట్ దగ్గర ఎయిర్ హైండ్ బ్రేక్ ఉండాలి. గేర్ లీవర్లో అంతర్గత స్ప్రింగ్ బాగుండాలి. వెనకదారి కని పించేలా అద్దం తప్పనిసరిగా ఉండాలి. బస్సులో విద్యార్థుల కదలకలు కనిపించేలా ఇంటర్నల్ అద్దం, విద్యార్థులు ఎక్కుడం, దిగడం స్పష్టంగా కనిపించేలా కన్వీక్స్క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. ఫుట్బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు మించి ఉండరాదు. ఫార్మింగ్ లైట్లు, అత్యవసర ద్వారం విధిగా ఏర్పాటు చేయాలి. బస్ డ్రైవర్కు 60 ఏళ్లు పైబడి ఉండొద్దు. బస్సులో డ్రైవర్ లై సెన్స్, బస్నంబర్, ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్ కలిగిన కాగితం పటం కట్టించి డ్రైవర్ కుడివైపు పెట్టాలి. స్కూల్ కరస్పాండెంట్ ఫోన్ నంబర్ ఉండాలి. బస్సు కండీషన్ పరిశీలించాలి.. స్కూల్ బస్సు కండీషన్ పరిశీలిస్తుండాలి. యాజ మాన్యం నిబంధనలు అతిక్రమిస్తే ఆర్టీఏ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. డ్రైవర్ తీరును గమనిస్తుండాలి. మద్యం సేవించినట్లు గుర్తిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. బ్రేక్ నిబంధనలు ఇవే.. బస్ బ్రేక్ చేసేందుకు 32 నిబంధనలు పరిశీలిస్తారు. బస్సు పసుపు రంగులో ఉండాలి. డ్రైవర్కు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. పిల్లల జాబితా, ఎక్కడ ఎక్కుతున్నారో వివరాలు ఉండాలి. బ్రేక్ ఇంజన్, టైర్లు, లైటింగ్ సిస్టం మొత్తం పరిశీలించి ఆర్టీఏ అధికారులు ధ్రువపత్రం జారీ చేస్తారు. ఎంవీఐ రూల్స్.. ఎంవీఐ రూల్ 185 (జీ) ప్రకారం పాఠశాల యాజమాన్యాలు 32 నిబంధనలు పాటించాలి. నెట్లో స్కూల్ పూర్తి వివరాలు, స్కూల్ అడ్రస్, స్కూల్ బస్ నంబర్, డ్రైవర్ వివరాలు, లైసెన్స్, బ్యాడ్జీ నంబర్, బీమా, ట్యాక్స్ ఫోన్ నంబర్లు పొందుపరచాలి. డ్రైవర్, అటెండర్ ఫొటోలను నెట్లో అప్లోడ్ చేయాలి. అనంతరం ప్రభుత్వ ధ్రువపత్రాన్ని రవాణా అధికారులకు అందించి తగిన రుసుం తెల్లించాలి. పరీక్షల అనంతరం ఫిట్నెస్ ధ్రువీకరణ జారీ అవుతుంది. ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు444 225 219162 121 41ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే సీజ్ వాహనాలు తీసుకురావాలని యాజమాన్యాలకు ఆర్టీఏ అధికారుల నోటీసులు ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,074 బస్సులు వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లిసెలవుల్లోనే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేసుకోవాలి. ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్) గడువు ముగిసిన బస్సులు రోడ్లపై కనిపిస్తే సీజ్చేస్తాం. తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకొని సర్టిఫికెట్ తీసుకోవాలి. నిబంధనలు పాటిస్తేనే ఎంవీఐలు ఎఫ్సీ జారీ చేస్తారు. విద్యాసంస్థల యజమాన్యాలు సహకరించాలి. – సురేశ్రెడ్డి, డీటీసీ వరంగల్ -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, పుష్కర ఘాట్, త్రివేణి సంగమం వద్ద భక్తుల, ట్రాఫిక్ రద్దీని డ్రోన్ సహాయంతో నిరంతరం పర్యక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. భక్తుల వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. భక్తులు నదిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తులు సురక్షితంగా పుష్కర స్నానాలు ఆచరించేలా పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. -
వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్కకు పూజరులు అమ్మవార్ల ప్రసాదం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర మాజీ చైర్మన్ లచ్చు పటేల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, పులి సంపత్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కాల్వపల్లికి చెందిన ఉపాధ్యాయుడు బొదెబోయిన బుచ్చయ్య ఇటీవల మృతి చెందగా.. ఆదివారం జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క నివాళులర్పించారు. తునికాకు సేకరణ వెళ్లి ఇటీవల మృతి చెందిన పాయం సుచిత్ర కుటుంబ సభ్యులను సీతక్క పరామర్శించారు. -
భక్తులు మురిసె.. ‘త్రివేణి ’మెరిసె
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరస్నానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన లక్షన్నర మంది త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేశారు. మెదక్లోని కొల్చారం పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి పుష్కర స్నానాలు చేసి నదీమాతకు నైవేద్యం సమర్పించారు.సరస్వతీ ఘాట్లో పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులు – కాళేశ్వరం -
పల్లెలో చిత్రీకరణ.. ప్రజల్లో ఆదరణ
ఏటూరునాగారం: ప్రస్తుతం యువత చాలామంది జల్సాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చే సుకుంటున్నారు. చెడు వ్యసనాలతో కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కానీ.. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఈ యువకులు మాత్రం యువత ఎలా ఉండకూడదో వివరిస్తూ లఘుచిత్రాలను రూపొందించి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. వాళ్లే ఫన్నీ బాయ్స్ క్రియేటర్స్.. ఇన్స్ట్రాగామ్ వేదికగా రీల్స్తో ప్రాంభమైన వారి ప్రయాణం ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్ తీసేవరకు చేరుకుంది. అందుబాటు ఉన్న వనరులతో చిత్రాలను తీస్తున్న వీరికి మండల కేంద్రానికి చెందిన కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఇచ్చిన ఆర్థిక బలం అందించడంతో కెమెరాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసుకుని మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. వారు నివాసముండే ప్రదేశాలతోపాటు సమీప అటవీ ప్రాంతంలోనే షూటింగ్ చేస్తూ తమ చిత్రాలను ప్రజలముందుకు విడుదల చేస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పటి వరకు పది చిత్రాల రూపకల్పన.. ఫన్నీ బాయ్స్ ఇప్పటి వరకు పొరపాటు, బంధం, విలువ, నమ్మకం, ఎగతాళి, నిర్లక్ష్యం, నిజ జీవితం, నష్టం, బానిసతోపాటు మే 31న కొత్త షార్ట్ఫీల్మ్ కర్మ ఫలం పేరుతో లఘుచిత్రాలను రూపొందించారు. షార్ట్ ఫిల్మ్స్తో ఆకట్టుకుంటున్న యువకులు ఫన్నీ బాయ్స్ పేరుతో చిత్రీకరణ -
పేదరికాన్ని జయించి ట్రిపుల్ ఐటీకి ఎంపిక
గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి గ్రామం గౌరారం గడ్డకు చెందిన గంగారపు ప్రజ్వల బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 559 మార్కులు సాధించిన ప్రజ్వల ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి పలువురి మన్ననలు పొందుతుంది. ఉపాధి నిమిత్తం హనుమకొండకు వెళ్లిన ప్రజ్వల తల్లిదండ్రులు గంగారపు జ్యోతి, ప్రకాశ్ అక్కడి వడ్డెపల్లి ప్రభుత్వ పాఠశాలలో కుమార్తెను చదివించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ప్రజ్వల.. పట్టుదలతో చదువుకొని విద్యలో రాణించింది. ఈ సందర్భంగా చల్వాయి గ్రామస్తులు, బంధుమిత్రులు ప్రజ్వలను అభినందించారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (సీబీసీఎస్), (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈ నెల 8వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల ని యంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలి పారు. 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 12న మూడో పేపర్ పరీక్షలు ఉంటాయన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు. కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విద్యారణ్యపురి: డీఈఐఈడీలో మొదటి సంవత్సరంలో తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రవేశాలకు గాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 2నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తామని హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈసెట్– 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెరిఫికేషన్కు ర్యాంక్ కార్డు, హాల్టికెట్, టెన్త్, ఇంటర్మీడియట్ మెమో, 4వతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, టీసీ, ఎన్సీసీ/స్పోర్ట్స్, పీహెచ్సీ పత్రాలతో రావాల్సింటుందన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులు 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
కిటకిటలాడిన హేమాచల క్షేత్రం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రం వేలాది మంది భక్తజనంతో ఆదివారం కిటకిటలాడింది. ఆలయంలో స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలం మారింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలో వేచి ఉండి భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు. ఉదయం నుంచి సాయంత్రం 05 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. -
కష్టపడేవారికి ఎప్పటికై నా గుర్తింపు
● మంత్రి సీతక్క ములుగు రూరల్: పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం ని ర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులకు అందించేలా పార్టీ నాయకులు కృషి చేయాలన్నా రు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎన్నికలు, పార్టీ నిర్మాణంలో బూత్ ఏజెంట్ల వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ డాక్టర్స్ సెల్, మెడికల్ వింగ్ ములుగు జిల్లా చైర్మన్గా మల్లంపల్లి మండలానికి చెందిన ఆనందపు రవిబాబును నియమించగా ఆయనను శాలువాలతో సన్మానించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఇంచర్ల గ్రామానికి చెందిన మట్టెవాడ తిరుపతిని నియమించగా వారికి నియామకపత్రాలను అందించారు. ఇదిలా ఉండగా.. పేదలు సైతం కార్పొరేట్ వైద్యం పొందేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అనంతరం కొత్తగూడ మండలం సాధిరెడ్డిపల్లికి చెందిన దివ్యాంగుడు పుల్సం రవికిరణ్కు మూడు చక్రాల వాహనం అందించారు. కార్యక్రమంలో గ్రంథాల య సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు. -
హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సుమారు నాలుగు వేలకు పైగా భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. వివిధ వాహనాల్లో గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి పరవశించారు. అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
ఎంజీఎం కోల్పోయిన ఆరోగ్యసిరి
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026ఆరోగ్యశ్రీ సేవలందించి క్ల్లెయిమ్ చేయని విభాగాలు●రావాల్సిన ఆదాయం (రూ. లక్షల్లో)కార్డియాక్ అండ్ 37 కార్డియోథొరాసిక్ కార్డియాలజీ 56 ఈఎన్టీ 480 జనరల్ మెడిసిన్ 227 యూరినరీ 32 మెడికల్ అంకాలజీ 672 నెఫ్రాలజీ 47 ఆర్థోపెడిక్ సర్జరీ 39 పాలీ ట్రామా 91 ప్లాస్టిక్ సర్జరీ 112 సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 105 సర్జికల్ అంకాలజీ 195కాశిబుగ్గ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధానంగా ఉన్న వరంగల్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)లో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది వాటి వివరాలను సంబంధిత ట్రస్ట్కు పంపడంలో నిర్లక్ష్యం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.8కోట్ల మేర ఆదాయం రాకుండా పోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీఎంలో ఆరోగ్యశ్రీ సేవలందించిన దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోంది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆస్పత్రికి వచ్చిన ఆరోగ్యశ్రీ రోగులకు వివిధ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది ఉచితంగా సేవలు అందించారు. ఆయా కేసులకు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం ఆస్పత్రికి రావాల్సి ఉంది. క్లెయిమ్ చేసేందుకు ఆయా కేసుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు పంపాలి. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇది వైద్యులు, సిబ్బంది అలసత్వం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, టెక్నికల్ సమస్య వల్ల జరిగినా, ఎంజీఎం ఆస్పత్రికి మాత్రం భారీ నష్టమే వాటిల్లింది. ఈ వ్యవహారంలో ఎంజీఎంలో ఉన్న దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కనిపిస్తోందన్న విమర్శలున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఇలా..డెర్మటాలజీ 2 కేసులకు రూ.70వేలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ 33 కేసులకు గాను రూ.5లక్షలు, క్రిటికల్ కేర్ 2 కేసులకు రూ.2లక్షలు, గైనకాలజీ, సర్జరీ ఒక కేసుకు రూ.15వేలు, ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఒక కేసుకు రూ.9 వేలు, న్యూరాలజీలో 12 కేసులకు రూ.7 లక్షలు, పల్మనాలజీలో మూడు కేసులకు రూ.11 వేలు, రుమటాలజీలో 7 కేసులకు రూ.5 లక్షల చొప్పున, మరికొన్ని కేసులకు రూ.లక్షల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రావాల్సిన ఆదాయం గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు సమాచారం. జనరల్ సర్జరీ కేసులు : 1,170 రూ. 2 కోట్లు (రావాల్సిన ఆదాయం) పలు డిపార్ట్మెంట్లకు సుమారు రూ.8 కోట్ల నష్టం ట్రస్ట్కు వివరాలు పంపడంలో నిర్లక్ష్యం.. లోపించిన పర్యవేక్షణ గడువు దాటిపోవడంతో ల్యాప్స్ అయినట్లు విమర్శలువిభాగాలు, కేసులు -
నకిలీల గుబులు
గోవిందరావుపేట: ఏజెన్సీలో రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నకిలీ విత్తన ముఠాలు కొన్నేళ్లుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. వానాకాలంలో విత్తనాలు విత్తేందుకు దుక్కులు సిద్ధం చేసుకుని రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా నాసిరకం విత్తనాలతో పంటలు సాగు చేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏడాది అయినా అధికారులు నాసిరకం విక్రయ ముఠాలపై దృష్టి సారించాలని రైతన్నలు కోరుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో వానాకాలంలో 1,07,700 ఎకరాల్లో వరిపంట, 28,600 ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 11,329 ఎకరాల్లో, ఇతర పంటలు 15,600 ఎకరాల్లో సాగు కానున్నాయి. నాసిరకం విత్తనాలతో నష్టం గత రెండేళ్ల కాలంలో ఎస్ఎస్తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో నాసిరకం మొక్కజొన్న విత్తనాలు సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. స్థానిక ఏజెంట్లు తమ కమీషన్ల కోసం వివిధ కంపెనీల పేర్లు చెప్పి బాండ్ మొక్కజొన్న పేరుతో విత్తనాలను రైతులకు విక్రయించగా పంట ఆశించిన స్థాయిలో రాక రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆగ్రహించిన రైతులు ఆయా కంపెనీలను నిలదీయడంతో ఎకరానికి రూ.65వేలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా చివరకు అతి స్వల్ప మొత్తాలు చెల్లించి చేతులు దులుపుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే పలు మండలాల్లో నాసిరకం మిర్చి విత్తనాలతో కూడా రైతులు భారీగా నష్టపోయారు. ఇక గోవిందరావుపేట మండల పరిధిలోని సీడ్ వరి పేరుతో విక్రయించిన విత్తనాలు సాగు చేసిన రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. ప్రముఖ కంపెనీల పేరుతో మోసం సీజన్ ప్రారంభానికి ముందు కొందరు అక్రమ వ్యాపారులు ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ ప్యాకెట్లను తయారు చేస్తారు. అసలు కంపెనీల ప్యాకింగ్ను పోలి ఉండేలా ముద్రించి రైతులను మోసం చేసే అవకాశం ఉంది. తక్కువ ధరకు వస్తున్నాయని భావించి రైతులు కొనుగోలు చేస్తే చివరికి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. విత్తనం వేశాక కొన్ని రోజుల్లో మొలక రావాలి. కానీ నకిలీ విత్తనాల వల్ల మొలకలు సరిగా రాకపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలు కొనాలి. మళ్లీ భూమి చదును చేసి విత్తనాలు వేయాలి. ఇలా డబ్బులు ఖర్చు వస్తుంది. ఒకవైపు అప్పులు, మరోవైపు దిగుబడిపై అనిశ్చితి రైతును మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే ప్రమాదం ఉంది. దీంతో కొనుగోళ్ల ప్రారంభానికి ముందే వ్యవసాయ అధికారులు నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. రైతులు సైతం ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ప్యాకెట్పై లాట్ నంబర్, గడువు తేదీ, మొలక శాతం వివరాలను పరిశీలించాలి. అనుమానం వస్తే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలి. వానాకాలం విత్తనాల కొనుగోళ్లకు రైతుల సన్నద్ధం ఏజెన్సీలో రెండేళ్లుగా నష్టపోయిన రైతులు నాసిరకం విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని వేడుకోలు వరి విత్తనాల ప్యాకెట్లు 35,000 మొక్కజొన్న 400 క్వింటాళ్లు పత్తి విత్తనాల ప్యాకెట్లు 60వేలు పప్పు దినుసుల విత్తనాల ప్యాకెట్లు 40 క్వింటాళ్లుఈ ఫొటోలోని రైతు పేరు నాంపల్లి సత్యబాబు. వాజేడు మండల పరిధిలోని ఎడ్జెర్లపల్లి గ్రామం. గతేడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. నాసిరకం విత్తనాలు సాగు చేయడంతో మొలక శాతం తగ్గిపోయింది. మొక్కలు సైతం ఆశించిన విధంగా ఎదగలేదు. చివరకు దిగుబడి రాక రూ.లక్షల్లో నష్టపోయాడు. నాసిరకం విత్తనాల నియంత్రణకు చర్యలు ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నాసిరకం విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. విత్తన విక్రయ కేంద్రాలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే సంబంధిత డీలర్ల లైసెన్సులను వెంటనే రద్దు చేయడంతో పాటు విత్తన చట్టం–1966 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటాం. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు వ్యవసాయ శాఖ కట్టుబడి ఉంది. – వి.సురేశ్కుమార్, డీఏఓ -
గోదావరిలో డిస్టిలేషన్ రద్దు చేయాలి
● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేందర్ ములుగు: గోదావరి నదిలో డిస్టిలేషన్ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం అదనపు కలెక్టర్ మహేందర్జీకి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఎదిర, సూరవీడు, బోదాపురం గ్రామాల పరిసరాల్లోని గోదావరి నది నుంచి ఇసుక తీసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. సుమారు 15 కిలో మీటర్ల విస్తీర్ణంలో 4 వేల ఎకరాల్లో ఇసుకను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ డిస్టిలేషన్ కేవలం ఇసుక మాఫియా, బడా బాబుల కోసం చేపడుతున్నట్లు అనుమానం వస్తుందని ఆరోపించారు. గోదావరి నదిలో కోట్లాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తీయడం వల్ల ఒకవైపు పర్యావరణం, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో సాగు, తాగునీటి సమస్యలను గిరిజనులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దామెర కిరణ్, రత్నం ప్రవీణ్, కొర్ర రాజు, తోకల రవి తదితరులు పాల్గొన్నారు. -
డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు రవి కుమార్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు శుక్రవారం బైటాయించారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసిల్టింగ్ పేరుతో గోదావరి నది గర్భాన్ని ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో నది పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పేరుతో డిసిల్టింగ్ విధానం ప్రవేశ పెట్టి ప్రభుత్వం సర్వే చెపట్టిందని వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లేవని కోర్టు నిలుపుదల చేసినా ప్రాజెక్టు పేరుతో ఏజెన్సీ మండలాల్లో అధికారులు సర్వే చేయటం విడ్డూరంగా ఉందన్నారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయకపోతే పార్టీలు, ప్రజా సంఘాలతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, నాయకులు రత్నం రాజేందర్, దావూద్, చిట్టిబాబు, గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, చిట్టెం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ఏటూరునాగారం: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఏపీఓ కొమురం నాగోరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు చెందిన పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వహకులు, ఫొటో గ్రాఫర్లు, ప్లెక్సీలు ముద్రించేవారు, బ్యాండ్మేళం, క్యాటరింగ్ నిర్వహకులతో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికడితేనే బాలల భవిష్యత్కు భరోసా లభిస్తుందన్నారు. ఏజెన్సీలో వందశాతం బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. తద్వారా అందరూ కలిసికట్టుగా ములుగును బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి కొమురం నాగోరావు అన్నారు. అనంతరం డీడబ్ల్యూఓ ఈసంపెల్లి ప్రేమలత మాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారం ముందుగా తెలిసే అవకాశం పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వహకులకు తెలిసి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలోనే వారిని కట్టడి చేసి వయస్సు నిండని అమ్మాయిలకు వివాహం చేస్తే జరిగే నష్టాలపై వివరించాలని సూచించారు. వివాహాలతో సామాజిక, ఆరోగ్య, కుటుంబ పరమైన దుష్ప్రభావాలను తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుందన్నారు. వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండాలని అలా కాకుండా తక్కువ వయస్సు ఉన్నవారికి వివాహం చేస్తే పోక్సో కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. అలాగే రెండేళ్ల జైలుతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తారని వివరించారు. ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించి హాజరైన వారికి వాటిని అందజేశారు. ఈ కార్మక్రమంలో వెంకటాపురం సీడీపీఓ ముత్తమ్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఓంకార్, హరికృష్ణ, సర్పంచ్లు, వీసీపీసీ కన్వీనర్లు, టీచర్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ, సుమన్, జ్యోతి, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగోరావు -
మోక్షమెప్పుడో?
మూడో విడతకు.. ములుగు: యాసంగి సీజన్ పంటలు చేతికి వచ్చినా పెట్టుబడి సాయం( (రైతు భరోసా) పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించలేకపోవడం పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే అందాల్సిన పెట్టుబడి సాయం ఆలస్యమైనప్పటికీ రెండు విడతల్లో రెండు ఎకరాల వరకు మాత్రమే అందించడంతో మూడో విడతకు మోక్షమెప్పుడు లభిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత సాయం డబ్బులను మార్చి 23న, రెండో విడత ఏప్రిల్ 20న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. నెల రోజులు దాటినా మూడో విడత సాయానికి సంబంధించిన షె డ్యూల్ ఇంకా ప్రకటించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు విడతల్లో అందిన సాయం ఇలా.. జిల్లాలో 88,138 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.106,08 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా, రెండు విడతల్లో కలిపి 81,096 మంది రైతులకు రూ.66.56 కోట్లను జమ చేసింది. ఇంకా 7,042 మంది రైతులకు రూ.39.52 కోట్లను జమ చేయాల్సి ఉంది. ప్రతీ రైతుకు రెండెకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఐదెకరాల వరకై నా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని రైతులు భావించినప్పటికీ రెండెకరాల వరకు మాత్రమే పరిమితం చేయడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఖరీఫ్ పంటలకు.. రైతు భరోసాపై అయోమయం వానాకాలం పంటల సాగును జిల్లాలో రైతులు ఇప్పటికే ప్రారంభించారు. మరో 10 రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలను సాగు చేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి పంటకే పెట్టుబడి సాయాన్ని రెండెకరాలకు పరిమితం చేయడంతో వానాకాలం పంటకు అందే రైతు భరోసాపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం 5 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందిస్తామని కటాఫ్ ప్రకటించి ప్రతీ రైతుకు పెట్టుబడి సాయాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని పెట్టుబడి సాయం రెండు విడతల్లో ఇప్పటి వరకు అందింది రెండు ఎకరాలకే.. మూడో విడత రైతు భరోసాపై ఇప్పటికీ ఖరారు కాని షెడ్యూల్మండలం రైతులు పెట్టుబడి సాయం (రూ.కోట్లలో) ఏటూరునాగారం 6,785 5.43 గోవిందరావుపేట 6,346 5.49 కన్నాయిగూడెం 4,828 3.74 మంగపేట 10,121 9.57 ఎస్ఎస్తాడ్వాయి 7,557 6.85 వెంకటాపురం(కె) 8,014 6.39 వాజేడు 8,624 6.65 మల్లంపల్లి 5,676 4.41 ములుగు 11,952 9.09 వెంకటాపురం(ఎం) 11,193 8.94 -
పూర్వ ప్రాథమిక పాఠశాలల పునరుద్ధరణ
ములుగు రూరల్: విద్యార్థుల సౌకర్యాల దృష్ట్యా జిల్లాలో 36 పూర్వ ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి పూర్వ ప్రాథమిక పాఠశాలలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ తాజాగా ఆమోదం తెలిపినట్లు వివరించారు. దీంతో జిల్లాలో ప్రాథమిక స్థాయి విద్యా సదుపాయాలు విస్తరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 11 పూర్వ ప్రాథమిక పాఠశాలలు కొనసాగుతున్నాయని విద్యార్థుల సంఖ్య ఆధారంగా బడులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల సహకారంతో చిన్నారుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వాజేడు: ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 3 నుంచి 13 వరకు జిల్లాలోని గోవిందరావుపేటలోని పీఎస్ఆర్ గార్డెన్లో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థలు తప్పనిసరిగా ఈ శిక్షణ తరగతులకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కరపత్రాలను విడుదల చేసిన వారిలో బోదెబోయిన సాయి, పూనెం మనోహర్, మురళీ కృష్ణ, శ్రీరాం, తేజ, అవినాష్ ఉన్నారు. పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలనభూపాలపల్లి అర్బన్: పాలిసెట్ అడ్మిషన్ల కోసం ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ సమన్వయకర్త డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. ఈ పరిశీలనకు అధికారులుగా శ్రీధర్, దేవేందర్, శ్రీనివాస్, రాజకుమార్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు మల్హర్(కాటారం): కాళేశ్వరం వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడగా ఆరుగురికి గాయాలైన ఘటన కాటారం మండలం బస్వాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన ఆరుగురు కారులో శుక్రవారం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలకు వెళ్లారు. పుష్కర స్నా నాలు చేసి దర్శనం అనంతరం హనుమకొండకు తిరుగుపయనమయ్యారు. కాటారం మండలం బస్వాపూర్ క్రాస్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యా యి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వా హనంలో భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాలివానతో కూలిన టెంట్లు పలిమెల(కాళేశ్వరం): మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో శుక్రవారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో భక్తులకోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి. -
గర్భిణులకు పౌష్టికాహారం తప్పనిసరి
ములుగు రూరల్: గర్భిణులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని ములుగు ప్రాజెక్టు సీడీపీఓ శిరీష సూచించారు. జిల్లా కేంద్రంలోని యాదవనగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలు రెండేళ్ల వయస్సుకు వచ్చే వరకు తీసుకునే సంరక్షణ చర్యలపై వెయ్యి రోజుల ప్రాముఖ్యతను వెల్లడించారు. గర్భం దాల్చినప్పటి నుంచి కడుపులో బిడ్డ ఎదుగుదల, ప్రతినెలా బరువు, రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెలివరీ అయిన తర్వాత అరగంట సమయంలో పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలను తాగించాలని సూచించారు. చిన్నారులకు ఆరు నెలల వరకు తల్లి పాలను మాత్రమే పట్టించాలని సూచించారు. పిల్ల లు ఏడు నుంచి 9 నెలల మధ్య స్వతహాగా కూర్చుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోనెల భరత్, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు. సీడీపీఓ శిరీష -
సీఎం, మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ములుగు రూరల్: పంచాయతీలకు అధిక స్వేచ్ఛ, సొంత ఆదాయాన్ని పెంచుకునేలా వెసులుబాటు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం జిల్లా నాయకులు ఇంచర్ల సర్పంచ్ కుమార్గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు తమ ఖాతాల్లోనే పంచాయతీ సొంత ఆదాయాన్ని ఉంచుకునేలా ప్రభుత్వం నిబంధనలు మార్చడం హర్షనీయమన్నారు. పంచాయతీ సిబ్బందికి ప్రతినెలా ఒకటవ తేదీన వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వం రూ. 50 కోట్లు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కంచర్ల రఘు, దారావత్ సారయ్య, కరుణ సాగర్, పూలమ్మ, నాయకులు వంగ రవి యాదవ్, యాసం రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణ వేగంగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి వీసీకి ఇన్చార్జ్ ఆర్డీఓ ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది లాంటిదని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్ పంపిణీ, సేకరణ చేపట్టాలని సూచించారు. ఓటర్లు ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఎలక్షన్ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి -
టీబీవ్యాధి వ్యాప్తిని అరికట్టాలి
ములుగు రూరల్: టీబీ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం టీబీ నియంత్రణ సిబ్బంది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ నియంత్రణ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం టీబీ నిర్ధారణకు రెండు డిజిటల్ ఎక్సరే మిషన్లు అందించిందని తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన 20 గ్రామాలలో 14 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీబీ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు పంపిణీ చేయాలని సూచించారు. టీబీ నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని డీఎంహెచ్ఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీ నియంత్రణ కోఆర్డినేటర్ రమేశ్, చంద్రమౌళి, సమ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి గోపాల్రావు -
రైల్వే ప్రాజెక్ట్లకు భారీగా నిధులు
● వరంగల్ ఆర్వోఆర్ సర్వేకు రూ.10 కోట్లు ● కాజీపేట–ఘన్పూర్, 3,4వ లైన్ల సర్వేకు రూ.0.43 కోట్లు ● రైల్వే పింక్బుక్లో కేటాయింపులు కాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలో గల పలు రైల్వే ప్రాజెక్ట్లకు రైల్వేశాఖ నిధులు కేటాయించినట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ 2026–27లో కాజీపేటకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్ట్లు, సర్వేలు ప్రతిపాదించారు. కాజీపేటకు సంబంధించిన ప్రధాన రైల్వే సర్వేలు సికింద్రాబాద్–కాజీపేట మధ్య డబ్లింగ్ సర్వే 85.45 కి.మీ.గాను రూ.1.71 కోట్లు, కాజీపేట–ఘన్పూర్ మధ్య గల 3వ, 4వ లైన్ల సర్వే 21.25 కి.మీ. గాను రూ.0.43 కోట్లు, కాజీపేట–బల్లార్షా మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 220 కి.మీ.గాను రూ.4.40 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 234 కి.మీ.గాను రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య కాడ్రుప్లింగ్ సర్వే 120 కి.మీ గాను రూ.2.40 కోట్లు, వరంగల్ స్టేషన్ వద్ద రైల్ ఒవర్ రైల్ సర్వేకు రూ.రూ.10 కోట్లు, కాజీపేట– భూపాలపల్లి (హసన్పర్తి) వరకు కొత్త రైల్వే లైన్ సర్వే 24 కి.మీ.గాను రూ.1.60 కోట్లు, కాజీపేట వద్ద వరంగల్ దిశ నుంచి సికింద్రాబాద్ దిశకు బైపాస్లైన్తో కూడిన ఆర్ఓఆర్ సర్వే 38 కి.మీ. రూ.75 కోట్లు మంజూరైనట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. -
ధాన్యం తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం
ఏటూరునాగారం: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటావేసి మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలోని జీసీసీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. 40 రోజులుగా ధాన్యం అమ్ముడుపోక కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న స్థానిక రైతుల ఇబ్బందులను, వారి ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేస్తూ అన్నదాతలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. మంత్రి సీతక్క హామీలు మాటలకే పరిమితం అయ్యాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులకు పైగా ధాన్యం నిల్వలు పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసిన వడ్లన్నీ నల్లబడిపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యమంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రదీప్రావు, తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, కిరణ్, రామ్మూర్తి, అశోక్, చిన్ని కృష్ణ, వలిబా బా, సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు -
రైస్ మిల్లు తనిఖీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, రోజుకు ఎంత మేర వడ్లు స్వీకరిస్తున్నారనే అంశాలపై యజమానిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రైతుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ వడ్లను పారదర్శకంగా కొనుగోలు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రైస్ మిల్ యాజమాన్యాలకు సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రోజువారీగా వడ్ల కొనుగోలు, ఎగుమతులపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని సూచనలు చేశారు. ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేష్ కుమార్ ఉన్నారు. -
మీడియాపై బెదిరింపులు మానుకోవాలి
ఏటూరునాగారం: వార్తలు రాసిన జర్నలిస్టుల ఇళ్లను ముట్టడిస్తామని కొంత మంది మీడియాపై చేస్తున్న బెదిరింపులు మానుకోవాలని పలువురు జర్నలిస్టులు అన్నారు. కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టులపై చేసిన వాఖ్యలకు నిరసనగా గురువారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్ వద్ద నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏటూరునాగారంలో జరిగిన మంత్రి సీతక్క ప్రెస్మీట్ను బహిష్కరించారు. అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు సోషల్మీడియాలో ఇళ్లను ముట్టడిస్తామని బెదిరింపులకు పాల్పడడం అప్రజాస్వామికం అన్నారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అఫ్జల్పాషా, అలువాల శ్రీనివాస్, బట్టు గోపి, కుదురు పాక రాజేష్, నూక ప్రభాకర్, వసంత రమేష్, చింతలపల్లి వెంకటేశ్వర్లు, పర్వతాల లాలయ్య, ఎగ్గడి రవి, ఎండి. అక్తర్, శ్రీనివాస్, గంజి రమేష్, గణపనేని చంద్రశేఖర్, రాజేష్, కుదురుపాక ప్రవీణ్, నూతి ప్రణయ్, గౌరిశంకర్ పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’ జర్నలిస్టులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన సందర్భంగా నాగజ్యోతి మాట్లాడారు. మండలం లోని జర్నలిస్టులు ఇళ్లను ముట్టడిస్తామని, వారిపై దాడులు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. -
బోటులో షికారు.. హుషారు
టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరం సరస్వతీ అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులు గోదావరి ప్రవాహంలో బోటులో ప్రయాణించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రూ.100ల చార్జీ వసూల్ చేయగా భక్తులు నిరంతరం గోదావరిలో హుషారుగా షికారు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. గోదావరిలో సుమారు 10 నిమిషాల పాటు కొనసాగే బోటు ప్రయాణం కొత్త అనుభూతి అంటూ పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బోటు ప్రయాణంలో నీటి అలలను తాకుతూ మైమరిచి పోతున్నారు. ప్రత్యేక అనుభూతి....కాళేశ్వరంలో ఆలయంతో పాటు, గోదావరిలో బోటు ప్రయాణం అనుభూతినిస్తుంది. నా కుటుంబంతో పుష్కరాలకు వచ్చి బోటు ప్రయాణం చేశా. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు కొత్త అనుభూతి. బోటు ప్రయాణం చాలా ఇష్టం. – చందు భక్తుడు, వరంగల్గతంలో కంటే తక్కువే గిరాకీగోదావరిలో మొత్తం 8బోట్లు నడిపిస్తున్నాం. సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఎంతో గిరాకీ ఉంటుందని ఆశించాం. రోజుకు కేవలం రూ.30 వేల నుంచి రూ.40వేలకు వరకు మాత్రమే గిరికి అవుతుంది. సాధారణ సమయంలో అ ంతకంటే ఎక్కువే గిరాకి అయిన రోజులున్నాయి. గో దావరి పుష్కరాల సమయంలో చాలా బాగా గిరాకి అ య్యేది. గతంతో పోల్చితే చాలా తక్కువ గిరాకీ అవుతుంది. – మధు, బోట్ డ్రైవర్, కాళేశ్వరం -
రైతుల పరిస్థితి ఆగం
భూపాలపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగం ఉందని.. రైతుల సమస్య గాలికి వదిలేసి ప్రభుత్వం గాలిలో సంచిరిస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. గురువారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎగుమతి కాక, ఎగుమతి అయిన ధాన్యం దిగుమతి కాక రైతులు అరిగోస పడుతుంటే ముఖ్యమంత్రి గాలిలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే అధ్వాన పరిస్థితి ఏర్పడిందన్నారు. రానున్న రెండు మూడు రోజులో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. బీజేపీ రైతు గోస–బీజేపీ భరోసా యాత్ర రైతుల గోస చూడటానికి వచ్చినట్టు లేదని, బీజేపీ ప్రచారానికి వచ్చినట్టు హంగు ఆర్బాటాలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జన్దాన్, కౌన్సిలర్లు, నాయకులు మోతె రాజు, నూనె రాజు, సతీష్ పాల్గొన్నారు. బీజేపీది ప్రచార యాత్ర మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
ధాన్యం సేకరణకు ప్రత్యేక చర్యలు
ములుగు: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వేగంగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు అకాల వర్షాలతో ధాన్యం తడవలేదన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో కూడా రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా, నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 76 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో 9 వేలకు పైగా రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర కింద రూ.141 కోట్ల పైగా డబ్బులు జమ చేసినట్లు వెల్ల డించారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతుందని వివరించారు. అవసరమైన చోట టార్పాలిన్లు, నిల్వ సదుపాయాలు, వేగవంతమైన రవాణా ఏర్పాట్లు కల్పిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రొక్యూర్మెంట్కు సంబంధించిన అన్ని ఏజెన్సీలు, సంబంధిత శాఖల అధికారులు, డీఆర్డీఓలు, డీసీఓలు, జీసీసీ ప్రతినిధులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు వచ్చే పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా భద్రపర్చాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్యలు, సందేహాల పరిష్కారానికి జిల్లా సివిల్ సప్లయీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్/కంట్రోల్ రూం నంబర్ 9347416178లో సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
మానవత్వం చాటిన ఎస్సై
ములుగు రూరల్: పిడుసుతో పడిపోయిన మహిళను ఆస్పత్రికి తరలించి ఎస్సై చంద్రశేఖర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మనోహరబాద్ మండలకేంద్రానికి చెందిన ఠాకూర్ ఆశ(38) జిల్లాకేంద్రంలో తెలిసిన వారిని కలిసేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఫోన్లో చార్జింగ్ లేకపోవడంతో కలెక్టర్ ఆఫీస్రోడ్డులో ఓ షాపులో చార్జింగ్ పెట్టి వేచి ఉంది. ఈ క్రమంలో పిడుసు వచ్చి పడిపోవడంతో దగ్గరలో ఉన్న ఎస్సై చంద్రశేఖర్ గమనించి వెంటనే అతడి వాహనంలో సిబ్బందితో కలిసి ములుగు జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేజీబీవీలో అడ్మిషన్లు ప్రారంభం మొగుళ్లపల్లి: మండలంలోని కొరికిశాల గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రత్యేకాధికారి ఆలూరి చైతన్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ నుంచి కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేపు క్రీడాకారుల ఎంపిక మొగుళ్లపల్లి: జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడలకు బాలబాలికల ఎంపిక ఈనెల 30న జిల్లాలోని దిఏవీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు బాస్కెట్బాల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘీ చరత్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2010 తరువాత జన్మించిన వారు అర్హులని ఆసక్తి గల క్రీడాకారులు వారి వెంట ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురాగలరని కోరారు. -
పంట వ్యర్థాలను కాల్చొద్దు
ములుగు రూరల్: పంట పొలాలలో వ్యర్థాలను కాల్చడం సరికాదని ఎస్సై ఉపేందర్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పంట వ్యర్థానాలను కాల్చుతున్న క్రమంలో పక్కన ఉన్న పంటలు, పైప్లైన్లు దగ్ధం కావడంతో తోటి రైతులు ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. వ్యర్ధాలను కాల్చడం వల్ల భూమిలోని పంటలకు మేలు చేసే కీటకాలు చనిపోవడంతో భూసారం తగ్గిపోతుందని అన్నారు. రహదారుల పక్క పంటలను తలబెట్టడంతో పొగ కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వ్యార్థాలను తగలపెట్టె వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ములుగు మండల పరిధిలో ఇప్పటికి రెండు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. -
భూసారం పెంపు
ములుగు రూరల్: రైతులు పంట పొలాల్లో భూసారం పెంచుకునేందుకు పచ్చిరొట్ట సాగు ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో భూమి సారవంతంగా మారి అధిక దిగుబడి ఇస్తుంది. నేలలో సేంద్రియ పదార్థాలు పెరగడంతో పాటు నత్రజని స్థాయి సహజంగా అధికమవుతుంది. మట్టిలో సూక్ష్మ దాతువుల సంఖ్య పెరిగి భూమి సారవంతంగా మారేందుకు పట్చిరొట్ట సాగు రైతులకు అనువుగా ఉంటుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గి పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయి. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సేంద్రియ వ్యవసాయం సాగు చేసేందుకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. సాగు వివరాలు ఇలా.. జిల్లాలోని పది మండలాల పరిధిలో మొత్తం 86,768 మంది రైతులు 1,63,229 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వరి పంటను 1,07,700 ఎకరాలలో సాగు చేయనుండగా పత్తి 28,600 ఎకరాలు, మొక్క జొన్న 11,329 ఎకరాలలో సాగు చేసే అవకాశం ఉంది. అలాగే జీలుగ 14,500 ఎకరాలు, జనుము 1,100 ఎకరాలలో సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 50 శాతం సబ్సిడీపై విత్తనాలు రైతులకు వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట సాగుకు విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీతో అందించేందుకు సిద్ధం చేసింది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఆగ్రోస్ కేంద్రాలలో విత్తనాలను అందుబాటులో ఉంచారు. జీలుగా, జనుము, పిల్లి పెసర విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లోని పీఏసీఎస్ల్లో, మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం(ఎం), లక్ష్మీదేవిపేట, ఏటూరునాగారం, మంగపేట, బట్టాయిగూడెం, పస్రా, రాంపూర్ రైతు ఆగ్రోస్ కేంద్రాలలో పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు భూమి పత్రాలు సమర్పించి 50 శాతం సబ్సిడీతో విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చు. జీలుగ 1400 క్వింటాలు, జనుము 50 క్వింటాలు, పిల్లిపెసర 50 క్వింటాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. 50 శాతం సబ్సిడీతో అందిస్తుంది. పచ్చిరొట్ట సాగుతో భూ సారం పెరిగి పంట దిగుబడులు అధికంగా వస్తాయి. రైతులు నత్రజని ఎరువుల వినియోగం తగ్గించేందుకు వీలుగా ఉంటుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. – సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మండలాల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలుమండలం కేంద్రం జీలుగ జనుము పిల్లిపెసర (క్వింటాళ్లలో) మల్లంపల్లి ఆగ్రోస్ 50.20 00 00 ములుగు ఆగ్రోస్ 184.20 22 00 వెంకటాపురం(ఎం) ఆగ్రోస్ 100.0 00 00 లక్ష్మీదేవిపేట ఆగ్రోస్ 100.00 00 00 ఏటూరునాగారం ఆగ్రోస్ 99.90 00 00 మంగపేట ఆగ్రోస్ 232.50 10 50 బుట్టాయిగూడెం ఆగ్రోస్ 30.00 00 00 ఎస్ఎస్తాడ్వాయి పీఏసీఎస్ 30.30 00 00 పస్రా రాంపూర్ ఆగ్రోస్ 324.20 00 00 వాజేడు పీఏసీఎస్ 99.90 09 00 వెంకటాపురం(కె) పీఏసీఎస్ 149.10 09 00 జనుముపిల్లిపెసర -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని, యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అధికారుల సమన్వయ లోపంతో కొన్నిచోట్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వర్షాలు కురిసేలోగా కొనుగోళ్లు, లిఫ్టింగ్, నిల్వ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొని వెంటనే మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి టీం వర్క్తో పనిచేయాలని సూచించారు. ఆర్డీఓలు, సివిల్ సప్లై, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులు పండించిన ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల మధ్య గోదాంల కేటాయింపులో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కొనుగోలు, రవాణా 80 శాతం పూర్తి.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జనగామ జిల్లా పరిధి పలు మండలాల్లో ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యంగా జరుగుతోందని, రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు, రవాణా ప్రక్రియ 80 శాతం పూర్తయ్యిందన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ లారీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు కొనుగోలు చేసిన గన్నీ సంచుల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం సేకరణ 80 శాతం పూర్తయినట్లు తెలి పారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో 97 శాతం ధాన్యం షిఫ్టింగ్ పూర్తయ్యిందన్నారు. జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ములుగు కలెక్టర్ హేమంత్ బొర్ఖడే సహదేవరావు మాట్లాడుతూ.. జిల్లాల్లో కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. సమావేశానికి రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, శ్రీకుడాశ్రీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.హాజరైన కలెక్టర్లు సందీప్కుమార్ఝా, బోర్ఖడే హేమంత్ సహదేవరావు, సత్యశారద, చాహత్ బాజ్పాయ్మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, చిత్రంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, నాయిని, సత్యనారాయణరావు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు -
సమాఖ్య భవన నిర్మాణాలు
వాజేడు: మహిళా సమాఖ్య సమావేశాలు, కార్యకలాపాల నిర్వహణ కోసం వాజేడు మండలానికి 25 భవనాలు మంజూరయ్యాయి. తొలి విడతలో మూడు భవనాలు మంజూరు కాగా రెండవ విడతలో 22 భవనాలను మంజూరు చేశారు. భవన నిర్మాణ పనులను చేపట్టి భవనాలను పూర్తి చేస్తే మహిళా సమాఖ్య సభ్యులుపాటు సభలు, సమావేశాలను ఆ భవానాల్లోనే నిర్వహించుకోవచ్చు. ప్రతీ సారి తమ గ్రూపుల సంబంధించిన సమావేశాలను ఎక్కడో ఒక చోట నిర్వహించాల్సి వచ్చేది. ఈ భవనాలు పూర్తి అయితే మహిళలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఒక్కో దానికి రూ 10 లక్షలను వెచ్చించనున్నారు. ఈ భవనాల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధులను మంజూరు చేయనున్నారు. భవనాల నిర్మాణమ కోసం ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్లు శంకుస్థాపనలను చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను పంచా యతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. భవ న నిర్మాణాలు మొత్తం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగనుండగా రెండు నెలల్లో పనులు పూ ర్తి కావాల్సి ఉంది. ఈ భవనాలు పూర్తి అయితే మహిళా సమాఖ్య సభ్యురాళ్లకు సమావేశాలు, సభలు, ప్రభుత్వం ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు అనుకూలంగా ఉండనుంది. త్వరితగతిన పనులను పూ ర్తి చేసి భవనాలను నిర్మించగలిగితే మండలంలో మరో 25 ప్రభుత్వ భవనాలు ఉండనున్నాయి. మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో 25 భవనాలు మంజూరు కాగా నాలు పంచాయతీలకు భవనాలు మంజూరు కాలేదు. నాగారం 3, పేరూరు 1, ఏడ్జెర్లపల్లి 3, పూసూరు 1, మొరుమూరు 4, కొంగాల 2, దూలాపురం 1, చీకుపల్లి 1, గుమ్మడిదొడ్డి 3, చెరుకూరు 2, కృష్ణాపురం 2, అయ్యవారి పేట 1, చింతూరు 1 భవనం మంజూరయ్యాయి. టేకుల గూడెం కాలనీ, ధర్మవరం, పెద్ద గొళ్లగూడెం, చండ్రుపట్లలో ఒక్క భవనం కూడా మంజూరు కాలేదు. ఒక్కో భవనానికి రూ.10 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు -
పేరుకుపోతున్న చెత్త
వెంకటాపురం(కె): మండల కేంద్రలలోని శివాపురం వీధిలోని టెలిఫోన్ ఎక్సెజ్ సెంటర్లో పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన చెత్త కుండిలో చెత్తను తొలగించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులుగా చెత్త కుండిలోని చెత్త ఉండడంతో దుర్వాసన వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తచెదారం పెరుకుపోయి దోమలకు అవాసాలుగా మారి వ్యాధుల బారిన పడుతున్నమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెత్తను తొగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
రామప్ప దేవాలయంలో సీవీఓ శశిధర్ రాజు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ సివిల్ సప్లయీస్ డిపార్ట్మెంట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) శశిధర్ రాజు కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూ జారులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం(ఎం)ఎస్సై చల్లా రాజు, టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, భద్రు ఉన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక ఏటూరునాగారం: జిల్లాలోని బండారుపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలలో మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణానికి చెందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. స్టాండింగ్ జంప్లో అండర్ 14 విభాగంలో సంజన, 60 మీటర్ల పరుగు పందెంలో అండర్ 8లో వర్షిత, 100, 600 మీటర్ల పరుగు పందెంలో అండర్ 16 విభాగంలో సాయి రామ్ విజయం సాధించారు. షాట్పుట్ డిస్కస్ త్రోలో నందిని, వంద మీటర్ల పరుగుపందెంలో అండర్ 16 విభాగంలో భవాని, 600 మీటర్ల పరుగు పందెంలో హరిప్రియ ఎంపికై నట్లు తెలిపారు. వీరు హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భవన, క్రీడాకారులు పాల్గొన్నారు.ఈదురుగాలులు.. భారీవర్షంమంగపేట: మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం గురువారం రాత్రి కురిసింది. రాత్రి 8గంటల వరకు భారీ గాలులు, చిరజల్లులతో ప్రారంభమైన వర్షం 9 గంటల వరకు మంగపేట, మల్లూరు, రాజుపేటతో పాటు తదితర గ్రామాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది. దీంతో సాయంత్రం వరకు వడగాలులతో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఉపశమనం పొందారు. గాలులతో కూడిన వర్షానికి రమణక్కపేట సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా పడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై టీవీఆర్ సూరి వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీతో రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్టును తొలిగించి రూట్ క్లియర్ చేశారు. మోహన్కుమార్కు సేవారత్న అవార్డు ములుగు రూరల్: నాయీబ్రాహ్మణ జన సంస్థ ఆధ్వర్యంలో అందించిన ప్రతిభా పురస్కారాలు –2026లో భాగంగా జిల్లా కేంద్రానికి చెందిన అన్నం మోహన్కుమాకు సేవారత్న అవార్డు అందుకున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని బీసీ సాధికారిక సంస్థ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ జన సంస్థ అధ్యక్షుడు శ్రీధర్ మురహరి అవార్డును మోహన్కుమార్కు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్కుమార్ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి పదేళ్లుగా పోరాటాలు చేస్తున్నందుకు గాను గుర్తింపుగా అవార్డు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంఘం ఉపాధ్యక్షులు సుశీల్కుమార్, తెలంగాణ నాయీ బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గారాణి, సుబ్బయ్య, అశోక్కుమార్, రమేశ్, శివరాం, ప్రసాద్, సతీష్, సుమలత, తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ఉదయం 8 గంంటలకు జామ మసీద్ ఇమామ్ అబ్దుల్ రావుఫ్ ఆధ్వర్యంలో బక్రిద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జామా మసీదు అధ్యక్షుడు సయ్యద్ అఫ్జల్పాషాతోపాటు పెద్దలు రజాక్, మహబూబ్ హుస్సేన్, సులేమాన్, అన్వర్, ఆఫ్రీది, రహీమ్ పాల్గొన్నారు. కన్నాయిగూడెం: మండలంలో బక్రీద్ వేడుకలను ముస్లిం నిర్వహించుకున్నారు. మండలంలోని ముప్పనపల్లి, లక్ష్మీపురం, గూర్రేవుల గ్రామాల్లోని ముస్లింలు ఈద్గులలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మతపెద్దలు రియాజొద్దిన్ షాయక అలీమ్, వలిహేదర్, లతిఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంచెంచెర్వుపల్లిలో భారీ అగ్నిప్రమాదం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వరికొయ్యలను తగలబెట్టగా గ్రామ పరిసరాల్లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. వ్యవసాయ భూములను అగ్నికి ఆహుతి చేశాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఆగే తిరుపతి, రాజు, కామ సదానందం, అశోక్కు చెందిన ఐదెకరాల్లోని వరి పంట పూర్తిగా దగ్ధంకాగా, మూడు బోర్ మోటార్లు, పైపులు, వందల సంఖ్యలో వరిగడ్డి కట్టలు మంటల్లో కాలిపోయాయి.. పంట వ్యర్థాలను కాల్చితే చర్యలు పంట పొలాల్లో వరి కొయ్యలు, వ్యర్థాలకు నిప్పు పెట్టి జరిగే ప్రమాదాలకు కారణమైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై చల్లా రాజు హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా విద్యుత్ మోటార్లు, గడ్డివాములు తగలబడి రైతులకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదెకరాల్లోని వరిపంట దగ్ధం కాలిపోయిన మూడు బోరుమోటార్లు, పైపులు, వరిగడ్డి -
సేవాట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం
మంగపేట: మండలంలోని దోమెడ పంచాయతీ పరిధిలోని గొత్తికోయగూడెంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ సంస్థ చైర్మన్ బాడిష నాగరమేశ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ స్థాపించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా గూడెంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్చేసి స్వీట్లు పంచారు. గూడెంలోని బడీడు పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆకాక్షిస్తు చిన్నారులు, విద్యార్థులు దుస్తులు, పలకలు, నోట్బుక్లు, పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారు. కష్టాల్లో ప్రజలకు తొడు ఉంటూ ముందుకు సాగుతునన చైర్మన్ నాగరమేష్ను గ్రామస్తులు అభినందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు వైస్ చైర్మన్ బాడిష నవీన్, గ్రామస్తులు లక్ష్మయ్య, పుల్లారావు, సద్ధాం, నర్సింగరావు పాల్గొన్నారు. -
బోరు మోటారు ఏర్పాటు
గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి గ్రామం 5వ వార్డులో మరమ్మతులకు గురైన బోరు మోటారును తొలగించి కొత్త మోటారును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ.. నీటి సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించిన వార్డు సభ్యుడు తాటి రమణతో పాటు గ్రామ పంచాయితీ సిబ్బంది సాగర్, వెంకన్న, సాంబయ్య, ఓదేలుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటూరునాగారం: మండలంలోని రామన్నగూడెంలో ఆర్టీసీ కండక్టర్ జుపాక తిరుపతి తల్లి ఇటీవల వడదెబ్బతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని మాజీ జెడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి గురువారం పరామర్శించారు. అలాగే కందుకూరి మహేష్ తల్లి కందుకూరి సారమ్మ ఇటీవల వడదెబ్బతో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని నాగజ్యోతి పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. పల్లా మాణిక్యం, ఆకుల రోశయ్య, మూతినేని సత్యనారాయణ, తుమ్మ మల్లారెడ్డి, కోనేరు నగేష్, గడదాసు సునీల్, అంతటి నాగరాజు, ఈసం రామ్మూర్తి, కర్ర రవీందర్, రాంబాబు, చిన్ని కృష్ణ, నర్సయ్య, రమేష్ ఉన్నారు. గోవిందరావుపేట/మంగపేట: గోవిందరావుపేట మండలం మచ్చాపూర్–చల్వాయి గ్రామాల మద్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురానికి చెందిన నానవరకు సందీప్(34) మృతి చెందగా అతడి కుమారుడు లలిత్సాయి, తల్లి రాణి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కమలాపురం ఆటోస్టాండ్ సెంటర్లో సందీప్ హోటల్ నడుపుకుంటు జీవనం సాగిస్తున్నాడు. మృతుడు తల్లి రాణి, కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి కమలాపురానికి వస్తున్నారు. మార్గ మధ్యలోని మచ్చాపూర్–చల్వాయి గ్రామాల మధ్య ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొనడంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి సృహతప్పి పడిఉన్న రాణితో గాయపడిన కుమారుడు లలిత్సాయిని స్థానికుల సాయంతో 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సృహతప్పి పడిఉన్న రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. పస్రా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీలు సమకూర్చి ధాన్యం తరలిస్తాం.. మహాముత్తారం: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉందని ఎస్సై మహేందర్కుమార్ తెలిపారు. గురువారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని రెండు రోజుల్లో మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తామని లారీలకొరతతోఽ అధికారులు ధాన్యాన్ని తలించలేకపోయారన్నారు. అన్ని కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని రైతులు ఆధైర్య పడవద్దని తెలిపారు. సబ్సిడీపై జీలుగ విత్తనాలు మొగుళ్లపల్లి: మండలంలోని రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి సురేందర్రెడ్డి తెలిపారు. మండలానికి మొత్తం 834 బస్తాలు కేటాయించగా, 30 కిలోల బస్తా రైతులకు రూ.2,452.50కు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ విత్తనాలను వినియోగించడం వల్ల నేల సారవంతం పెరిగి పంట దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ మొగుళ్లపల్లి: మండలంలోని కొర్కిశాల గ్రామ చెరువు వద్ద ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దానవేణి రాములు, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టిఫిన్ సెంటర్లకు గిరాకీ అంతంతే..
టేకుమట్ల(కాళేశ్వరం): శ్రీ సరస్వతీ అంత్య పుష్కరాలలో టిఫిన్ సెంటర్లకు గిరాకీ అంతంత మాత్రంగా ఉంది. పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని ఆశించి నూతనంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసుకున్న టిఫిన సెంటర్ నిర్వాహకులకు ఆశలుఆవిరి అయ్యాయి. సాధారణంగా ప్రధాన రోడు్డ్ సైడు ఏర్పాటు చేసుకున్న టిఫిన్ సెంటర్లకు సుమారుగా రూ.2వేల నుంచి రూ.5వేల వరకు గిరాకీ అవుతుంది. అదే పుష్కరాలకు వేలాదిగా తరలివస్తారని ఆశపడి టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తే కొన్ని చోట్ల అంతంత మాత్రమే గిరాకి కాగా, మరి కొన్ని చోట మరీ అధ్వానంగా మారింది. ఖర్చులు కూడా రావడం లేదుపుష్కరాల ప్రారంభంలో సరస్వతీ పుష్కర ఘాట్ బస్టాండ్ వద్ద టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నాం. పుష్కరాల ప్రారంభం నుంచి అంతంతగానే గిరాకీ రావడంతో అక్కడి నుండి గోదావరిలో భక్తులు వచ్చే దారికి టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేసాం. ఇక్కడ గిరాకి మరీ దారుణంగా ఉంది. ఒక్కో రోజు కనీసం 5 ప్లేట్ల గిరాకీ కూడా కావడం లేదు. పిండి ఖర్చులు, నూనె, తదితర సామాను ఖర్చులు మేమే భరించాల్సి వస్తుంది. – శైలజ, టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు, ఎడప్పలి● -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
మంగపేట: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేవిధంగా చూస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 29మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను పొదుపు సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యోరి యానయ్య, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరలో నిర్వహిస్తున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు విద్యుత్ అధికారులు నెల రోజుల ముందే విద్యుత్ ఏర్పాట్లుకు సన్నాహాలు ప్రారంభించి నిరంతరం విద్యుత్ సరాఫరా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో అందిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిధులు కేటాయించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ వద్ద, టెంట్ సీటీ, పుష్కరఘాట్ ప్రదేశాల్లో సుమారుగా 490 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అలాగే 15 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 4 జనరేటర్లు ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ ఏర్పాట్లలో ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు 140 మంది సిబ్బందిని కూడా నియమించారు. -
ఐకేపీ కేంద్రాల్లో రైతుల అవస్థలు
గోవిందరావుపేట: ఐకేపీ కేంద్రాల్లో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని పస్రా మొద్దులగూడెం గ్రామాల మధ్యలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గన్ని బ్యాగుల కొరత, లారీల సమస్యలతో రైతులు ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోసుకుంటూ అకాల వర్షాల భయంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. లారీల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, మిల్లర్లు తేమ పేరుతో ధాన్యానికి కోత విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
యూనిఫామ్ ఊసేది?
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం (2026–27)లో యూనిఫామ్ సకాలంలో అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటివరకు క్లాత్ పంపిణీ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్లో పాఠశాలలకు వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు స్కూల్ వైజ్గా కొలతలు తీసుకునేవారు. టెస్కో నుంచి ఒక్కో విద్యార్థికి ఒక జత కోసం ఎంఆర్సీ పాయింట్లకు డీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో క్లాత్ పంపిణీ చేసేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాత్ బండిల్స్ రాగానే ఆయా పాఠశాలల హెచ్ఎంల సమక్షంలో కుట్టు పనికి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పర్యవేక్షణలోని మహిళా సంఘాలకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా క్లాత్ను అందజేసేవారు. ఒక్కో విద్యార్థికి తొలుత జత చొప్పున జూన్ 12వ తేదీ(పాఠశాలల పునఃప్రారంభం)కంటే ముందుగానే పాఠశాలల పాయింట్లలో అందుబాటులో ఉండేవి. మరో జత స్కూల్ యూనిఫామ్కు క్లాత్ చేరుకున్నాక ఆగస్టు నెల వరకు అందజేసేవారు. ఇలా ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ను అందజేస్తూ వస్తున్నారు. కానీ, ఈవిద్యాసంవత్సరం ఆరంభానికి రోజులు దగ్గర పడుతున్నప్పటికీ యూనిఫామ్ ఊసే వినిపించడం లేదు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏ జిల్లాకు కూడా ఇప్పటివరకు కనీసం ఒక జతకు సంబంధించి క్లాత్ కూడా చేరుకోలేదు. 24 వస్తువుల కిట్ ఎవరికి? మరోవైపు ప్రభుత్వం విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్ను ఈ విద్యాసంవత్సరం అందజేస్తుందన్న ప్రచారం ఉంది. ఆ కిట్లను అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు అందజేస్తారా? లేదా? అనేది కూడా స్పష్టత లేదని చెబుతున్నారు. కిట్లు కేవలం గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకే పంపిణీ చేస్తారనేది విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల హనుమకొండ జిల్లాలో పలుచోట్ల ఉపాధ్యాయులు బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారికి కిట్లను ప్రభుత్వం అందిస్తారని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత గురుకుల విద్యార్థులకే అని తెలిసి చెప్పడం మానేశారని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలకు రాని క్లాత్ పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక జత అయినా అందేనా? ఎలాంటి సమాచారం లేదంటున్న విద్యాశాఖ అధికారులురాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా టెస్కో ద్వారానే స్కూల్ యూనిఫామ్ క్లాత్ను సరఫరా చేస్తున్నారు. ఈసారి టెస్కోకు కాకుండా ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి. టెస్కో ద్వారానే, మరేదైనా సంస్థ ద్వారా క్లాత్ పంపిణీ చేయిస్తారా? అనేది జిల్లాల విద్యాశాఖ అధికారులకు సమాచారం లేదు. ఇక మండల విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటివరకు క్లాత్ సరఫరా కాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి జత స్కూల్ యూనిఫామ్ అందించడం సాధ్యం కాకపోవచ్చని పలువురు హెచ్ఎంల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 30,996 మంది, వరంగల్ జిల్లాలో సుమారు 32 వేల మంది, ములుగు జిల్లాలో 28,858 మంది విద్యార్థులకు యూడైస్ ప్రకారం రెండు జతల చొప్పున స్కూల్ యూనిఫామ్ అందించాల్సి ఉంటుంది. -
పుణ్యప్రదం.. పుష్కర స్నానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుష్కరాలు కొనసాగుతున్నాయి. ఏడో రోజు బుధవారం సుమారు 25 వేల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్కు చెందిన శ్రీదత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి, తెలుగు రాష్ట్రాల మహామండలేశ్వర్ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహరాజ్, మహామండలేశ్వర్ ఈట సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ త్రివేణి సంగమం వద్ద వైభవంగా గంగా హారతి నిర్వహించారు. సాయంత్రం దేవాదాయ శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – కాళేశ్వరంపుష్కరఘాట్లో స్నానాలు చేస్తున్న భక్తులు -
కోయగూడెం గురుకుల పాఠశాల ఏర్పాటును విరమించుకోవాలి
ములుగు రూరల్: మల్లంపల్లి మండల పరిధిలోని కోయగూడెం జెడ్పీహెచ్ఎస్లో ఏటూరునాగారానికి చెందిన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు పల్లె నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గురుకుల ఏర్పాటు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను లేకుండా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.తక్షణమే గురుకుల పాఠశాల, కళాశాలను ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లోనే కొనసాగించాలన్నారు. పాఠశాలల రక్షణ కోసం ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రేగ నరేందర్, గన్రెడ్డి ఆదిరెడ్డి, ఉప్పస్వామి, దిలీప్, వైనాల స్వామి, సూర్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన పంటలతో రైతులకు మేలుములుగు: ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు చేకూరుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సాంప్రదాయ పంటలను పక్కనపెట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్పామ్, కూరగాయలు, పండ్లతోటలు, మిర్చి, పసుపు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో 3,726 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు అవుతుందని తెలి పారు. ఈ పంటకు కోతుల బెడద, దొంగల బెడద ఉండదని తెలిపారు. చీడపురుగులు సైతం చాలా తక్కువగా ఆశిస్తాయన్నారు. ఆయిల్పామ్ సాగు చేసిన 4 ఏళ్లలో గెలల దిగుబడి వస్తుందని తెలిపారు. ఎండాకాలంలో వరి, మొక్కజొన్న పంటలను వేసి కోత కోసిన తర్వాత కొయ్య కాలు, మొక్కజొన్న సొప్పను కాల్చొద్దని తెలిపారు. వాటిని కాలిస్తే నష్టం అన్నారు. భూమి సారం తగ్గడం, గాలి కాలుష్యం పెరగడం, మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. ఎండు గడ్డిని, మొక్కజొన్న కొయ్య కాలును రోటవేటర్, కల్టివేటర్తో భూమిలో కలపాలని సూచించారు. 15నుంచి 20 రోజుల్లో వేస్ట్ డీకంపోజర్తో పిచికారీ చేస్తే వారంలో గడ్డి కుళ్లిపోయి ఎరువుగా మారుతుందని వెల్లడించారు. ధాన్యం సేకరణ వేగంగా చేపట్టాలి మల్హర్(కాటారం): ధాన్యం సేకరణ పనులను వేగంగా చేపట్టాలని కాటారం ఆర్డీఓ రవీందర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. బుధవారం మండలంలోని మీనాక్షి జిన్నింగ్ మిల్లును ఆర్డీఓ సందర్శంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 15వేల బ్యాగ్స్ (60వేల క్వింటాళ్ల) ధాన్యాన్ని మిల్లుకు తరలించినట్లు చెప్పారు. హమాలీల కొరతను దృష్టిలో ఉంచుకుని అదనపు కూలీలను నియమించి సేకరణ ప్రక్రియ వేగంవతం చేయాలని అన్నరు. అన్లోడింగ్కు ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీలకు అదనంగా మరో 20 మంది కూలీలను అదనంగా నియంంచాలని పీఏసీఎస్ సీఈఓ సతీష్ను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, పీఏసీఎసీ సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు అటవీశాఖ అధికారుల సస్పెన్షన్ మహాముత్తారం: మండలంలోని పెగడపల్లి రేంజ్పరిధిలోని యత్నారం అటవీప్రాంతంలో కొన్ని రోజుల క్రితం అడవిదున్నగా అనుమానిస్తూ జంతువుని కాల్చి చంపిన విషయం తెల్సిందే. యత్నారం రహదారికి అతిసమీపంలోనే అడవిజంతువుని కాల్చిన ఆనవాళ్ల విషయం తెలిసినప్పటికీ కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ ఘటనపై వివిధ పత్రికల్లో వార్త కథనాలు వెలువడగా చర్చనీయాంశమైంది. విషయం బయటకు రావడంతో కాళేశ్వరం జోన్ ఫ్లయింగ్ స్క్యాడ్ డీఎఫ్ఓ జోగేందర్ వన్యప్రాణి మృతిచెందిన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టగా వేటగాళ్లు విద్యుత్ తీగలతో అడవి జంతువుని హతమార్చినట్లు తెలింది. అయితే ఈ విషయంపై దిద్దుబాటు చర్యల్లో భాగంగా యత్నారం అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్రావుతోపాటు పడమర బీట్అధికారి శ్రీతేజను సస్పెండ్ చేస్తూ మహాదేవపూర్ డివిజనల్ ఆఫీసర్ సందీప్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వేటగాళ్లపై ఉక్కుపాదం మోపేనా..? మహాముత్తారం మండలం దట్టమైన అటవీప్రాంతం కావడంతో వేటగాళ్ల ఆకృత్యాలకి నిత్యం వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల అవతారమెత్తుతున్న కొందరు వ్యక్తులు విద్యుత్ తీగలు, ఉచ్చులతో జంతువులను బలితీసుకుంటున్నారు. -
రెండు రోజుల గడువు ఇస్తున్నాం..
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలు తప్పవని బీజేపీ బృందం హెచ్చరించింది. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ బృందం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. గణపురం మండలంలోని చెల్పూరు, కాటారం మండలంలోని కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. కాటారంలో ధాన్యం దహనం చేసి నిరసన తెలిపి కేసు పాలైన తిరుపతిని బీజేపీ నేతలు పరామర్శించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందర్రావు, ఈటల రాజేందర్ మాట్లాడుతూ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, బీజేపీ బృందం వస్తున్న విషయాన్ని తెలుసుకొని గన్నీ బ్యాగులు, లారీలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కాటారం మండలంలో నిరసన తెలిపిన 9 మంది రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నిషిధర్రెడ్డి, ఎరుకల గణపతి, కన్నం యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలే.. బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, ఈటల రాజేందర్ చెల్పూరు, కాటారంలో పర్యటన -
మైనర్లకు పెళ్లి చేస్తే కఠిన చర్యలు
కన్నాయిగూడెం: మైనర్లకు పెళ్లి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి అన్నారు. ఈ మేరకు బాల్య వివాహ రహిత గ్రామ పంచాయతీగా మండల పరిధిలోని ఐలాపూర్ ఎంపికై ందని, రెండేళ్లుగా గ్రామంలో బాల్య వివాహాలు నమోదు కాలేదని తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని ఐలాపూర్లో బుధవారం ఐసీడీఎస్ అధికారులు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్ధాలు, నష్టాలను ప్రజలకు వివరించారు. మేజర్లకు మాత్రమే వివాహాలు చేయాలని వెల్లడించారు. ఆడపిల్లలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహాలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు వివాహాలు చేస్తే రెండేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమాన ఉంటుందని హెచ్చరించారు. అనంతరం జిల్లా బాలల ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీరీల సురేశ్, యాలం రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ జయలక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి -
బాల్య వివాహాలు అరికడితేనే భవిష్యత్
ములుగు: బాల్య వివాహాలను అరికడితేనే బాలికల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని, అలాగే బాల్య వివాహ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహం – బతుకు ఆగం’ నినాదంతో బాల్య వివాహాల నిర్మూలనపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. చదువు, ఆరోగ్యం, స్వేచ్ఛను కాపాడాలంటే బాల్య వివాహాలకు పూర్తిగా చెక్ పెట్టాలన్నారు. బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారమని పేర్కొన్నారు. బాల్య వివాహాలతో బాలికలు విద్య, ఆరోగ్యం, హక్కులు, స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాల సమాచారం ముందుగా తెలిసే అవకాశం పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు, టెంట్ హౌస్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లకు ఎక్కువగా ఉంటుందని వివరించారు. వారు సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి బాల్య వివాహాలను అడ్డుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, సీడీపీఓ శిరీష, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రమాదేవి, సఖి కేంద్రం సెంటర్ అడ్మిన్ లావణ్య, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై చర్యలు మాదక ద్రవ్యాల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో నార్కోటిక్ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత ఆంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆదనపు కలెక్టర్ మహేందర్జీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలలు, వసతి గృహాల పరిసరాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డీఓ ప్రతాప్, వరంగల్ నార్కొటిక్ ఈగల్ విభాగం డీఎస్పీ రమేశ్ కుమార్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఐటీడీఏ డీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
పుస్తకాలొచ్చాయ్
ఏటూరునాగారం: పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా పాఠశాలలకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించి ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యాబోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటుంది. అందులో భాగంగానే ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభానికి ముందే జిల్లాకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో 26,858 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. దీంతో పాటు ముందుగా జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమాలను చేపడుతూ విద్యార్థుల ఆడ్మిషన్లను మరింత పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉపాద్యాయులు సైతం ఇంటిబాట పట్టి చేర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకే విద్యావారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమం చేపట్టి కొంత మంది విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేశారు. డ్రాపౌట్స్పై దృష్టి విద్యార్థుల ఆడ్మిషన్లు చేర్చి బడిబయట ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇందు కోసం పక్కా ప్రణాళికను రూపొందించి జూన్లో మొదలయ్యే బడిబాట కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టేలా చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల హాజరు శాతం, భోజన సౌకర్యాలు, అల్పాహారం వంటి విషయాలను జోరుగా ప్రచారం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. 10 మండలాలు.. 475 పాఠశాలలు జిల్లాలోని 10 మండలాల్లో 475 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 26,858 మందికి అందించనున్నారు. ఇందుకు గాను 1,60,530 లక్షల పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 1,37,030 లక్షల పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 23,500ల పుస్తకాలు రావాల్సి ఉంది. జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు 475 పాఠశాలలకు 1,37,030 బుక్స్ రాక దశలవారీగా పంపిణీకి సిద్ధం -
ధాన్యం కొనుగోలుపై ఆరోపణలు అవాస్తవం
ఏటూరునాగారం: జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు ఆరోపణలు అవాస్తవం అని కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న అన్నారు. ఏటూరునాగారం మండలం రోహిర్ గ్రామపంచాయతీ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, సర్పంచ్లు కావిరి అర్జున్, దేవులపల్లి విజయ్ కుమార్ తదితరులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తోందన్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో, కొంత ప్రాంతాల్లో లారీల కొరత కారణంగా రవాణాలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం వెంటనే స్పందిస్తూ ధాన్యం తరలింపునకు చర్యలు చేపడుతోందన్నారు. ఈ చిన్న సమస్యలను ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సరికాదన్నారు. శంకరాజుపల్లి సర్పంచ్ దేవులపల్లి విజయికుమార్, జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొడగొర్ల పోచయ్య, యూత్ జిల్లా ఉప అధ్యక్షుడు సర్వ అక్షిత్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ దొంగిరి మధుబాబు, గజ్జల అంకుల్, నర్సయ్య, శేఖర్, ఇనుగుల హరీష్, దుర్గయ్య, గోపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న -
అంతా వాకీటాకీతోనే..
కాళేశ్వరం: అంత్య పుష్కరాల్లో దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు, సిబ్బంది అంతా వాకీటాకీతో కమ్యూనికేషన్ చేస్తున్నారు. కాళేశ్వరం దేవస్థానంలో సెల్ టవర్ సిగ్నల్స్ సరిగ్గా పని చేయకపోవడంతో త్వరగా స్పందించడానికి ఎనిమిది వరకు వాకీటాకీలకు వినియోగిస్తున్నారు. కమిషనర్ స్థాయి నుంచి అర్చకుని వరకు వినియోగిస్తున్నారు.పలిమెల(కాళేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది అంత్యపుస్కారల్లో బస్టాండ్ సమీపంలో పలువురు చిలుక జోష్యం చెబుతూ ఉపాధి పొందుతున్నారు. భక్తులు చిలుక జోష్యం చెప్పించుకుంటూ వారి జాతకాలు అడిగి తెలుసుకుంటున్నారు.పెరిగిన గిరాకీ మహాముత్తారం: సరస్వతి పుష్కరఘాట్వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు బుధవారం ఎక్కువసంఖ్యలో రావడంతో గోదావరి నదివద్దసందండి నెలకొంది. గోదావరివద్ద ఏర్పాటు చేసిన వివిద దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. దీంతో దుకాణదారులకు గిరాకీ పెరగడంతో సంతోషం వ్యక్తంచేశారు.కూలుతున్న టెంట్లు పలిమెల (కాళేశ్వరం ): కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుస్కారాల కోసం ప్రధాన ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఓ టెంటు గాలికి ఒక వైపు ఊడిపోయి ప్రమాదకరంగా మారింది. కాగా టెంటు నిర్వాహకులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఎవరు ప్రమాదానికి గురికాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. మహాముత్తారం: సరస్వతీ అంత్యపుష్కరాల్లో భాగంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చిన వాహనాలు నిలుపుట కోసం అధికారులు పలు ప్రాంతాల్లో వాహనపార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వీఐపీ పార్కింగ్ స్థలంతోపాటు సరస్వతీ ఘాటువద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు నిండాయి. దీంతో పోలీసులు వచ్చి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ నియంత్రించారు. -
రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు నుంచి, ధర్మవరం వరకు అటవీ అనుమతులు లేవనే కారణంతో రహదారి పనులను నిలిపి వేశారని వెంటనే పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ మండల కార్యదర్శి పెనుమల్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వాహనాలు వెళ్లలేని విధంగా రోడ్డు గుంతలమయంగా మారిందని ఆరోపించారు. రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయలేదని వెంటనే అటవీ అనుమతులు వచ్చేలా చేసి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్న విషయం తెలుసున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నాను భగ్నం చేశారు. రోడ్డుపై బైటాయించిన వారిని అక్కడిని నుంచి పక్కకు లాక్కెల్లారు. బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, సాంబమూర్తి, బుల్లేశ్వరరావు, స్వరూప, జానకి రమణ, ఆదినారాయణ, సుమాంజలి, బెనిని, సాంబశివరావు, తిరిపతి రావు, లోహ మూర్తి తదితరులు ఉన్నారు. -
వ్యాపార సముదాయాలకు టెండర్లు
వాజేడు: ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయాలకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దెకు ఇవ్వడంకోసం నాలుగు గదులను నిర్మించినట్లు తెలిపారు. 29లోగా టెండర్ షెడ్యూల్ తీసుకొని 30లోగా సాయంత్రం 5 గంటలలోగా టెండర్ సమర్పించాలని తెలిపారు. 31 తారీకున డ్రా తీసి గదులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. టెండర్ ఫారం రూ.2000, దరఖాస్తు సొమ్ము రూ.5000 డీడీ తియ్యాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వెంకటాపురం(కె): మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు, మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, చిట్టెం సాయి, బాలసాని వేణు, తదితరులు ఉన్నారు. సన్మానం కాళేశ్వరం: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకా జానం పల్లె గ్రామానికి చెందిన గండ్రకోట సంపత్ 14 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల నిర్వహించిన ఎస్సై పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎస్సైగా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం మహదేవపూర్ మండలం రాపల్లి కోట గ్రామానికి తన అత్తమామలను కలవడానికి వచ్చిన సందర్భంగా రాపల్లి కోట యాదవ సంఘం బాధ్యులు సంపత్–స్రవంతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. యాదవ సంఘం మండల అధ్యక్షుడు పంచక మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. చిట్యాల: రైతుల కష్టాన్ని అసరాగా చేసుకుని ధాన్యం కొనుగోలు పేరుతో మోసం చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని బీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ దళారులు రైతులను మోసం చేస్తు మార్కెట్ కంటే ఎక్కువ ధర చెల్లిస్తామని నమ్మించి ధాన్యాన్ని తీసుకుని రోజుల తరబడి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిట్యాల: మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో పని చేస్తున్న ఉపాధిహామీ కూలీలకు మాజీ సర్పంచ్ పోలవేన పోశాలు, మాజీ ఎంపీటీసీ పప్పుల విజయలక్ష్మీ సంజీవయ్య బుధవారం మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
● సినీహీరో సంజోష్ ఏటూరునాగారం: యువత క్రీడల్లో రాణించాలని సినీ హీరో, సంజోష్ ఫౌండేషన్ అధినేత సంజోష్ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. శ్రీడ్రగ్స్ వద్దు – క్రీడలు ముద్ద్ఙు అనే వినూత్న నినాదంతో జిల్లాకు చెందిన సినీహీరో సంజోష్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. ఏజెన్సీ పరిధిలోని వెంకటాపురం(కె), వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల నుంచి మొత్తం 8 అగ్రశ్రేణి జట్లు ఈ టోర్నమెంట్లో తలపడ్డాయి. బుధవారం నిర్వహించిన హోరాహోరీ ఫైనల్ పోరులో అద్భుత ప్రతిభ కనబర్చిన వెంకటాపురం(కె) హంటర్స్ జట్టు ఘన విజయం సాధించి టోర్నమెంట్ ఛాంపియనన్గా నిలిచింది. రన్నరప్తో సరిపెట్టుకున్న మరో జట్టు గట్టి పోటీని ఇచ్చింది. గెలుపొందిన విజేత జట్టుకు, హంటర్స్ జట్టుకు రూ.30వేల నగదుతో పాటు ట్రోఫీని, రన్నరప్గా నిలిచిన జట్టుకు ద్వితీయ బహుమతి కింద రూ.15వేల నగదును అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్ పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా రోడ్డు
మల్హర్: మండలంలోని అన్సాన్పల్లి–భూపాలపల్లి మండలంలోని కాసీంపల్లి శివారులోని అంతర్గత రోడ్డు ప్రమాదకరంగా ఉంది. దీంతో వాహనదారులు భయంభయంగా ప్రయాణం చేస్తూ రోడ్డును దాటితే చాలు అనే పరిస్థితి నెలకొంది. 2023 జూలై నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆయా గ్రామాల మధ్యగల బీటీ ఒక చోటు పూర్తిగా కొట్టుకపోయింది. వరద నీరు ప్రవహించడంతో అలాగే మరి కొన్ని చోట్ల బీటీ కింద ఉన్న మట్టి కొట్టుక పోయి రోడ్డు ప్రమాదకరంగా మారింది. మరమ్మతులు లేవు.. ఈ రోడ్డు గుండా మండలంలోని అన్సాపల్లి గ్రామస్తులు భూపాలపల్లి జంగేడు, కాసీంపల్లి గ్రామం మీదుగా భూపాలపల్లికి నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. రైతులు గ్రామ శివారులోని తమ పొలాలకు వ్యవసాయ పనులకు సైతం వెళ్తుంటారు. కానీ రోడ్డు ప్రమాదకరంగా మారి రెండు సంవత్సరం గడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రానున్న వర్షకాలం సీజన్లో ఇబ్బందులు మరింత ఎక్కువ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భయాందోళనలో వాహనదారులు పట్టించుకోని అధికారులు -
ఎండలపై అప్రమత్తం..
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఆశవర్కర్కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న దాతలువాజేడు: వేసవిలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఎండల తీవ్రతరం కావడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉపాధి పనులను చేస్తున్న కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఆశ కార్యకర్తలు కూలీలు పని చేస్తున్న చోటుకు వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. అదే విధంగా ఇంటింటికీ తిరిగితూ ఎండకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను తెలియజేస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఎండలతో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వైద్యశాలకు వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు. మజ్జిగ సరఫరా చేస్తున్న దాతలు ఉపాధిహామీ పథకం పనులను చేస్తున్న కూలీలకు సర్పంచ్లు, దాతలు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్లు మజ్జిగ ప్యాకెట్లను వారికి అందిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమయితేనే ఎండ సమయంలో బయటకు వెళ్లాలని తెలుపుతున్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఆశవర్కర్లు మజ్జిగ సరఫరా చేస్తున్న దాతలు -
పేదలకు అండగా ప్రజాప్రభుత్వం
వాజేడు: పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన వ్యాపార సముదాయ గదులను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని ఇసుక వాగు వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఎప్పటిలోగా పనులు పూర్తి అవుతాయని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రాంత్, విశ్వనాథప్రసాదరాజు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు -
పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి
ములుగు రూరల్: ఉపాధిహామి పని ప్రదేశాలలో కూలీలకు సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ నాయకుడు పోరిక గోవింద్నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని జాకారంలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను సర్పంచ్ దాసరి సమత–రమేష్తో కలిసి మాట్లాడారు. ఉపాధి హామి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వంవిఫలమయిందని అన్నారు. నీడ, మంచినీళ్లు, మెడికల్ కిట్లు అందుబాటులో లేవని అన్నారు. ఉపాధిహామి కూలీలలకు సకాలంలో డబ్బులను చెల్లించాలని అన్నారు. కూలీలకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు గోవింద్నాయక్ -
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి
వెంకటాపురం(కె): మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని ఎంపీడీఓ జుమ్మిలాల్ అన్నారు. బుధవారం మండల మహిళా సమాఖ్య ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా శక్తి వారోత్సవాలు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధిలో ముందుండాలని అన్నారు. రుణం పొందిన మహిళలు సక్రమంగా చెల్లిస్తే రూ.10లక్షల వరకు రుణాలు పొందవచ్చని తెలిపారు. రుణం పొందిన మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల భీమా సౌకర్యం ఉంటుందని అన్నారు. మహిళా శక్తి సంఘాలకు పెరటి కోళ్ల పెంపకం, గొర్రె పెంపకం రుణాలు అందిసాతమని తెలిపారు. మండలంలో గ్రామాఖ్య భవనాలు 31 మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పూనెం ఉషారాణి, ఏపీఓ భవాని, ఏపిఎం అప్పారావు, సీసీ శంకరమ్మ, సర్సయ్య, సమ్మయ్య, వెంకటలక్ష్మీ, సిబ్బంది స్వప్న, సతీష్, గ్రామ సమాఖ్య వీఓఏలు, ప్రజాతినిధులు పాల్గొన్నారు. ఎంపీడీఓ జుమ్మిలాల్ -
బాల్యవివాహాల నిర్మూలనకు పాటుపడాలి
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజలందరూ పాటుపడాలని జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెల్లి ప్రేమలత అన్నారు. మండల పరిధిలోని శివాపురం, షాపెల్లి గ్రామాలు బాల్య వివాహ రహిత గ్రామాలుగా ఎంపిక చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బాల్య వివాహాలపై సర్పంచ్ జబ్బ సరోజన, షాపెల్లి సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్లు అమ్మాయికి, 21 సంవత్సరాల నిండకుండా అబ్బాయికి వివాహం చేస్తే బాల్య వివాహం అంటారని తెలిపారు. ఇది చట్టరీత్యా నేరమన్నారు. రెండేళ్ల నుంచి బాల్య వివాహాలు నమోదు కానీ గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా 23 జీపీలను బాల్య వివాహ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేసి గ్రామ సభలను నిర్వహించినట్లు వెల్లడించారు. ఏటూరునాగారం మండలంలో శివాపురం, షాపెల్లి, కొండాయి లను బాల్య వివాహ రహిత గ్రామలుగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి హరికృష్ణ, ఉప సర్పంచ్లు నర్సింహరావు, సరిత, కార్యదర్శులు శ్రీనివాస్, రాజ్యలక్ష్మీ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు వసంత, రజిత, పుష్పవతి పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత -
రూ.5.60 కోట్లతో జియో ట్యూబ్స్
ఏటూరునాగారం: మండల పరిధిలో గల రామన్నగూడెంలోని పుష్కరఘాట్కు అనుకొని 800 మీటర్ల మేర కరకట్ట మట్టి గోదావరి వరదలతో ఒర్లిపోయింది. రివిట్మెంట్కు వేసిన రాళ్లు సైతం కొట్టుకుపోయి గోదావరిలో కలిశాయి. అయితే గోదావరి కరకట్ట ఆనుకొని ఉన్న ఒడ్డు మొత్తం ఒర్లిపోతుండడంతో కరకట్ట ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మంజూరైన జియో ట్యూబ్స్ పనులు పుష్కరఘాట్ నుంచి 800 మీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురైన ప్రాంతం ఉంది. ముందుగా ప్రమాద స్థాయిలో కోతకు గురై ఉన్న ప్రాంతంలో 150 మీటర్ల మేర తొలి దశగా జియోట్యూబ్స్ పనులను రూ. 65 లక్షలతో చేపట్టారు. ఇప్పటి వరకు 125 మీటర్ల వరకు పూర్తి అయ్యింది. ఇంకా 25 మీటర్ల కోసం ఇసుక ఫిల్లింగ్ పనులు చేపడుతున్నారు. అదే విధంగా మళ్లీ ఇక్కడి నుంచి 650 మీటర్ల దూరంలో ఉన్న పుష్కరఘాట్ వరకు కూడా ఈ జియో ట్యూబ్స్ను వేస్తూ కరకట్టను మరింత పటిష్టపర్చాలని ఇరిగేషన్శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. భారీ నీటి పారుదలశాఖ అధికారులు నుంచి 650 మీటర్ల పుష్కరఘాట్ వరకు ఉన్న కరకట్ట ఒర్లిపోకుండా జియోట్యూబ్స్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.5.60 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఇరిగేషన్శాఖ ఇంజనీరింగ్ చీఫ్కు పంపించారు. అనుమతులు వస్తే ఇక్కడ పనులు ప్రారంభం కానున్నాయి. పుష్కరాల కోసం వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో కరకట్టను పటిష్టపర్చనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పలు దఫాల వరదలకు కరకట్ట మట్టి కొట్టుకపోవడంతోపాటు ఘాట్లోని మెట్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఈ ఏడాది వచ్చే గోదావరి వరదకు కరకట్ట మట్టి, మెట్లు సైతం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రతిపాదనలను సిద్ధం చేసి ఇక్కడ కూడా ట్యూబ్స్ను అమర్చాలని డిసెంబర్లో సర్వే చేపట్టారు. పనులపై వేగాన్ని పెంచాలనే ఉద్దేశంతో గోదావరిలో ఆయిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసి ఇసుక ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. ఇసుకను నింపిన తర్వాత టెక్స్టైల్ క్లాత్ వేసి ఆ తర్వాత జియోట్యూబ్స్ను వాటిపై అమర్చి అందులో ఇసుక, నీటిని నింపి ఎటు కదలకుండా కరకట్టకు రక్షణ ఇచ్చే విధంగా అమర్చనున్నారు. గోదావరి ఇప్పటి వరకు పూర్తి అయిన 125 మీటర్లు, ఇప్పుడు పనులు జరుగుతున్న 25 మీటర్లతో పాటు 650 మీటర్లు అదనంగా జియోట్యూబ్స్కు నిధులు మంజూరు అయితే అస్సాంకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా ఈ పనులను పూర్తి చేయించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిజ్ఞానం అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఫలితాలను ఇవ్వడంతో ఇక్కడ మొదలు పెట్టారు. 650 మీటర్ల జియోట్యూబ్స్తో పనులు చేసేందుకు ప్రతిపాదనలను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. అనుమతులు వస్తే పనులు మొదలు పెడుతాం. ఇప్పటి వరకు 150 మీటర్ల మేర జియోట్యూబ్స్ నిర్మాణం చేపట్టాం. అదనంగా మరో 650 మీటర్లను చేపట్టనున్నారు. నిధులు కేటాయిస్తే పనులు ప్రారంభిస్తాం. – ప్రవీణ్కుమార్, ఇరిగేషన్ శాఖ డీఈఈ వచ్చే ఏడాది పుష్కరాల కోసం ముందస్తుగా చర్యలు భారీ నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో పనులు -
సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ
ములుగు రూరల్: కాశిందేవిపేట పంచాయతీ పరిధి రామయ్యపల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్ నిరోషాఅమర్సింగ్ భూమి పూజ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నిర్మిస్తున్న మహిళా సంఘాల భవనానికి నిధులు మంజూరు కావడంతో నిర్మాణ పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాంద్పాషా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మర్రి రాజుయాదవ్, ఉప సర్పంచ్ ఎన్నిండ్ల సుదర్శన్, లియాకత్ అలి, రఘునందన్, నేపాల్రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం తనిఖీ కాశిందేవిపేట పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ నిరోషాఅమర్సింగ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ చిన్నారులకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
సాగుకు రైతుల సన్నద్ధం
కన్నాయిగూడెం: మండలంలోని రైతులు వానకాలం పంట సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. వర్షాకాలం జూన్ 15 తర్వాత ప్రారంభం కానుండడంతో ముందస్తుగా రైతులు పంట పొలాలను నేల స్వభావాన్ని బట్టి దుక్కులు చేస్తున్నారు. ముందస్తుగా పంట చేనులను వేసవి దుక్కులు చేస్తు పొలాలను చదును చేస్తున్నారు. వేసవి దుక్కుల వల్ల నేల స్వభావం పెరగడంతో పాటు నేలలో ఉన్న క్రిమీ కీటకాలు నసించడంతో కలుపు నివారణ కలుగుతుంది. భూమి లోపలి పొరలు చదును చేయబడి నీటిని పీల్చుకునే స్వాభావం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు చేస్తున్నారు. అధికారుల సూచనలతో రైతులు సాగుకు సిద్ధమై పనుల్లో బీజీగా మారారు. మండలంలోని రైతులు ఎక్కువ మొత్తం వర్షాదార పంటలపై మక్కువ చూపుతారు. అందులో ఎక్కువగా వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేయడానికి మక్కువ చూపుతారు. పంటల అంచనా.. మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో సుమారుగా 10,500 ఎకరాల్లో పంటలను సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అందులో వరి 3,500, మొక్కజొన్న 500, మిర్చి 7,500 ఎకరాల్లో పంటలు అధికంగా సాగు చేసే సూచనలు ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. అందుకు కావాల్సిన ఎరువులను సైతం సిద్ధం చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వేసవి దుక్కులతో మేలు.. పొంట పొలాలను వేవి దుక్కులు దున్నడం వలన అధిక లాభాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా పంట పొలాలను ఎండ తీవ్రత ఉన్న సమయంలో దున్నడం వలన భూమిలో ఉన్న పంటలకు హాని కలిగించే పురుగుల, కీటకాలు నశిస్తాయి. దీంతో పాటు కలుపు మొక్కలు నివారించవచ్చు. కొంత భూమిని ప్లావ్ వేయడంతో భూమి తిరగబడుతుంది. అందులో కలుపు మొక్కల వేరువ్యవస్థపై సూర్య కిరణాలు పడి ఎండ తీవ్రతకు మాడి చనిపోతాయి. వీటితో పాటు భూమి పొరలు వదులగా మారి వర్షం పడ్డప్పుడు నీటిని పీల్చుకొని భూమి స్వభావం పూర్తిగా మారి అధిక పంటలు రావడానికి వీలుగా తయారవుతుంది. అందువలన రైతులు పంట చేపులను వేసవి దుక్కులు చేసుకోవా లని అధిక లాభాలు ఉన్నాయని తెలుపుతున్నారు.రైతులు సాగు చేయబోయో పంటపొలలాలను అతిగా వేడి ఉన్న సమయంలో వేసవి దుక్కులు వేసుకోవాలని. దీంతో వలన నేల స్వభావం పెరుగుతుంది. నీటిని పీల్చుకోని పంటదిగుబడి రావడానికి ఉపయోగపడడంతో పాటు, భూమి లోపల ఉన్న క్రిమి కీటకాలు నసించి తెగుళ్లు రాకుండా కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి. – ముంజ మహేశ్, ఏఓ దుక్కులు సిద్ధం చేస్తున్న అన్నదాతలు -
రైతులు ఆందోళన చెందొద్దు
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అన్ని కొనుగోలు కేంద్రాల్లో వేగంగా కొనుగోళ్ల ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుతం 150 లారీలతో నిరంతరంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నాం. అవసరమైతే అదనపు లారీలు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు కొనసాగుతున్నాయి. – కృష్ణవేణి, సివిల్ సప్లయీస్ డీఎం -
పది రోజులుగా బస్తాలు పోవడం లేదు..
వడ్లు కాంట అయి 10 రోజులు అవుతుంది. లారీలు లేక ధాన్యం బస్తాలు మిల్లుకు పోవడం లేదు. అధికారులను నమ్ముకుంటే పని అయితలేదని లారీ కోసం నేనే పొద్దున 40 కిలోమీటర్లు దూరంలో ఉ న్న గోవిందరావుపేట మండలంలోని లారీ ఆఫీస్కు వచ్చి కూర్చున్నాను. సాయంత్రం వరకు పంపిస్తాం అంటున్నారు. మేము కష్టపడి పండించిన ధాన్యం తవడకుండా ప్రభుత్వం త్వరగా మిల్లులకు తరలించాలి. వాన పడుతుందేమోనని ఇంటికి కూడా వెళ్లడం లేదు. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు. – అజ్మీరా లాల్ ప్రసాద్, కన్నెపల్లి, ఎస్ఎస్తాడ్వాయి మండలం -
లారీలు రాక.. రైతుల పరేషాన్
గోవిందరావుపేట: జిల్లాలోని యాసంగి ధాన్యం కొనుగోళ్లు, బస్తాలు మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులు పలుచోట్ల లారీలు కొరతతో పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తోడు కేంద్రాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయే మబ్బులతో పరేషాన్ అవుతూ భయంభయంగా గడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 98వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. అధికారులు మొత్తం 1,08,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ధాన్యం తరలింపులో తీవ్ర సమస్యలు తలెత్తడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 150 లారీల ద్వారా ధాన్యం తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. లారీల కొరతతో ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించడం ఆలస్యమవుతుంది. కష్టపడి పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రింభవళ్లు కేంద్రాల వద్దే కాపాలా ఉంటున్నారు. గతేడాది ఇదే సమయంలో జిల్లాలోని పలు మండలాల్లో మూడు సార్లు అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన పంట కళ్లముందే నీటి పాలవడంతో అనేక కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఆ కష్టాల నుంచి పూర్తిగా కోలుకోకముందే రైతులు ఈ సారి మళ్లీ అప్పులు చేసి పంట సాగు చేశారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిలిచిపోవడంతో రైతుల్లో మళ్లీ భయం మొదలైంది. మే చివరి వారంలో ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. వచ్చిపోయే మబ్బులను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన జిల్లా పోలీసులు లారీల యజమానులతో మాట్లాడి తీసుకొచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పలు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులతో మాట్లాడుతున్నారు. ధాన్యం సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. లారీల యజమానులు, హమాలీతో కూడా పోలీసులు సమావేశాలు నిర్వహించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచిస్తున్నారు. రైతుల ధాన్యం వర్షానికి తడవకుండా త్వరగా తరలించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేసి మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.గోవిందరావుపేటలో ధాన్యం బస్తాలను కాంటా వేసి కుట్టు వేస్తున్న హమాలీలుబస్తాలు నింపి కాంటా వేస్తున్న హమాలీలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల అవస్థలు కాంటాలు అయి వారం దాటినా మిల్లులకు కదలని బస్తాలు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వేడుకోలు -
సబ్సిడీపై జీలుగు విత్తనాలు
ఏటూరునాగారం: మండలంలోని శివాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులకు నేటి(బుధవారం) నుంచి మండల కేంద్రంలోని ఆగ్రోస్ సెంటర్లో 50 శాతం సబ్సిడీ రాయితీపై జీలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఏఈఓ రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఆధార్కార్డు జిరాక్స్, పట్టా పాస్ బుక్ జిరాక్స్లు తీసుకొని విత్తనాలను పొందాలన్నారు. 30కిలలోల బ్యాగ్కు రైతు రూ. 2452లు చెల్లించాలన్నారు. ములుగు రూరల్: అఖిల భారత విశ్వకర్మ మహసభ మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలిగా జిల్లాకేంద్రానికి చెందిన గుంటోజు పావని–నిరంజన్ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నౌండ్ల సంతోష్చారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్చారి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. వెంకటాపురం(కె): బాటసారులదాహర్తి తీర్చేందుకు మండల కేంద్రంలోని సాయి పూజ సామగ్రి యజమాని మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు మంగళవారం వారాంతపు సంత కావడంతో పలు గ్రామాల నుంచి మండలకేంద్రాని వచ్చిన ప్రజలు వేసవి ఎండలకు ఇబ్బందులు పడుతుండడంతో దాహర్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేశారు. రేగొండ: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఫిర్యాదుదారు, అతడి మిత్రులపై వాట్సాప్ గ్రూపులో గుర్రాల సుమన్ రెడ్డి అనే వ్యక్తి అసత్య ప్రచారాన్ని పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి విచారించగా కొలెపాక భిక్షపతి సూచన మేరకు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపాడు. సోషల్ మీడియాలో శాంతిభద్రతాలకు విఘాతం కలిగించే విధంగా పోస్ట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. దరఖాస్తు చేసుకోవాలి కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూరు చేస్తున్న క్రమంలో మహదేవపూర్ మండలంలోని అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య సూచించారు. గత 13 సంవత్సరాల నుంచి పింఛన్ రాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు మనోవేదనకు గురయ్యారని, ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రకటించడంతో వీరికి భరోసా, మనోధైర్యాన్ని కల్పించినట్లు అయిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మల్హర్: మండలంలోని కొయ్యూరులో సోమవారం బెల్లి లలిత వర్ధంతిని ప్రజా సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట మాటతో సబ్బండ వర్గాలను, కులాలను, చైతన్యం చేస్తూ తెలంగాణ పల్లెల్లో ఉద్యమ జ్వాలను రగిలించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేవి భూమయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగామ జనార్ధన్. కుల ప్రజా సంఘాల జిల్లా కో కన్వీనర్ అయితే బాపు, మండల కో కన్వీనర్ గడ్డం లచ్చన్న, బోయిని రాజన్న, యాదండ్ల గట్టయ్య, వేల్పుల నారాయణ, యాట్ల శంకర్, సదానందం, తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్ణణ కేంద్రంలోని ఆంజనేయ ఆలయ కమిటీ చైర్మన్గా నూతనంగా ఎన్నికై న నాగపూరి సమ్మయ్యను మంగళవారం పట్టణ కేంద్రంలో ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉప అధ్యక్షులు బేతిల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శాలువతో సన్మానించారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవానికి విద్యుత్ వైరు సరిచేస్తుండగా అక్కడే పని చే స్తున్న బాపు అనే కూలీకి విద్యుత్షాక్ తగలడంతో మంగళవారం కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మరో కూలీ కర్రతో కొట్ట డంతో ప్రమాదం తప్పింది. కొంత సేపు తరువాత బాపు స్పృహా నుంచి తేరుకున్నాడు. క్షేమంగా బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
వారాంతపు సంత వెలవెల
వెంకటాపురం(కె): రోజు రోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా మండల కేంద్రంలో వారాంతపు సంత వెలవెలపోయింది. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో ప్రతీ వారం సంత నిర్వహణకు అధిక సంఖ్యలో జనం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వచ్చేవారు. నేటి వారాంతపు సంతకు వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు లేక వ్యాపారాలు జరగలేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. మండలకేంద్రంలో 46 డిగ్రీల ఎండ నమోదు కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని రైతు వేదికలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు పలు గ్రామాల సర్పంచ్ల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, సర్పంచ్లు సర్పంచ్లు జాడి రాంబాబు, పీరీల స్వప్న, అనిత, అబాల సౌజన్య, రెవెన్యూ అధికారులు జీపీఓ కాసీం, రవి పాల్గొన్నారు ములుగు రూరల్: బీజేపీ సినియర్ నాయకుడు అన్నపురెడ్డి ప్రమోద్రెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్రెడ్డి, వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు కొడేటి శ్రీదర్ బుధవారం పరామర్శించారు. ప్రమోద్రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర నాయకులు జాటోత్ మదీన్నాయక్, పుల్లారావు, భాస్కర్రెడ్డి, వాసుదేవరెడ్డి ఉన్నారు. రేగొండ: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమాని జైపాల్రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆర్డీఓ సేవలు ప్రశంసనీయం
ములుగు: జిల్లా అభివృద్దిలో ఆర్డీఓ వెంకటేశ్ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జిల్లాలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న వెంకటేశ్ను మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ అధ్యక్షతన ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటేశ్ జిల్లాలో సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, రెవెన్యూ పరిపాలన, మేడారం మహాజాతర నిర్వహణలో సమన్వయంతో వ్యవహరించారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం తో విధులు నిర్వహించారని వెల్లడించారు. అదే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల గురించి చాటి చెప్పేందుకు ‘ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ కాంపిటీషన్’లో పాల్గొనాలని ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా హ్యాండ్లర్లకు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామప్ప, మేడారం, లక్నవరం, బొగత జలపాతం ప్రకృతి అందాలపై రీల్స్ రూపొందించి పంపాలని కోరారు. డీపీఆర్ఓ రఫీక్ 99483 92976, సహాయ పౌర సంబంధాల అధికారి వేణు 94949 70535 నంబర్లకు వాట్సాప్ ద్వారా 30వ తేదీలోపు పంపించాలన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
ములుగు రూరల్: బాల్య వివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని బాలల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ నరేష్ అన్నారు. మంగళవారం మండంలోని బరిగలానిపల్లిలో బాల్య వివాహాం బతుకు ఆగం అనే వాల్ పోస్టర్ను జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆదేశాల మేరకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బరిగలానిపల్లి, ఎల్లారెడ్డిపల్లి, బూర్గుపేట గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించామని అన్నారు. ఈ గ్రామాలు బాల్య వివాహరహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయని అన్నారు. భవిష్యత్లో బాల్య వివాహాలు జరుకుండా చూడాలని అన్నారు. బాల్య వివాహల వల్ల కలిగే అనార్థాలను వివరించారు. బాల్య వివాహాలు జరిపినట్లుయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది విక్రమ్, పంచాయితీ కార్యదర్శులు, సర్పంచ్లు, అంగన్వాడీ టీచర్లు, సఖి లీగల్ కౌన్సిలర్ శిరిష, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
దేవాదుల ఎత్తిపోతల వద్ద సిల్ట్ తొలగింపు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం సమీపంలో గల గోదావరిపై ఉన్న దేవా దుల ఎత్తిపోతల వద్ద సిల్ట్ తొలగించే పనులు అధికారులు మంగళవారం మొదలుపెట్టారు. ప్రతీ సంవత్సరం మే నెల చివరి వారంలో ప్రారంభించి పోర్బే గదులతో పాటు, కాల్వలో ఉన్న సిల్ట్ను తొలగించి శుభ్రం చేస్తారు. దీంతో నీరు కాల్వ ద్వారా పోర్బే నుంచి నీరు మోటర్ల వద్దకు చేరుతుంది. ఇలా చేరడంతో పంపింగ్ చేయడానికి సులువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎస్ఎఫ్ఐ శిక్షణ తరగతులు ఏటూరునాగారం: జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు గోవిందరావుపేట పీఎస్ఆర్ గార్డెన్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో శిక్షణ తరగతుల పోస్టర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల్లో పోరాట పటిమ, హక్కులు, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాగటి రవితేజ, రవి, సిద్ధూ, సాత్విక్, రవి, రాజు పాల్గొన్నారు. జేసీబీని అడ్డుకున్న ఉపాధి కూలీలు భూపాలపల్లి రూరల్: మండలంలోని వజినపల్లి గ్రామంలో అక్రమంగా మట్టిని తరలించేందుకు వచ్చిన జేసీబీని ఉపాధి హామీ కూలీలు అడ్డుకున్నారు. గ్రామంలోని స్థానిక చెరువులో కొంతకాలంగా జేసీబీతో గుంతలు తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు. ఉపాధి కూలీలు ఏకమై మంగళవారం జేసీబీ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా జేసీబీ యజమాని కూలీలతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయమై కూలీ లు అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి మట్టి తీయడానికి అనుమతులు లేవని తెలపడంతో జేసీబీ వెనుదిరిగిపోయినట్లు కూలీలు తెలిపారు. భూముల పరిరక్షణకు ఉద్యమిస్తాంఏటూరునాగారం: గోదావరి పరిసరాల్లోని భూముల పరిరక్షణకు ఉద్యమిస్తామని, శాశ్వత పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే వ్యవసాయ భూములు గోదావరిలో కలిసిపోతున్నాయన్నారు. ప్రతీ వర్షాకాలంలో వచ్చే వరదలతో వేలాది మంది రైతుల వ్యవసాయ భూములు నీటిలో కలిసిపోతుండడం బాధాకరమన్నారు. ఆ భూముల పరిరక్షణకు ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు కాంక్రీట్ వాల్ నిర్మించాలన్నారు. లేదంటే వచ్చే నెలలో పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. భూముల రక్షణకు కాంక్రీట్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మంత్రి సీతక్కను కలిసి సమస్యను వివరించుతామన్నారు. అనంతరం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. లారీలు సకాలంలో అందుబాటులో లేక రైతులు అదనపు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడించారు. లారీల యజమానులు రూ. 4, 5వేల వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. -
ఇసుక క్వారీ మంజూరు చేయాలి
మంగపేట: మండలంలోని రమణక్కపేటలో పూర్వం నుంచి గోదావరిలో చేపలవేట కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బెస్త కులస్తులకు ఇసుక్వారీ మంజూరీ చేయాని బోట్మెన్ సొసైటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో సొసైటీ సభ్యులు చందర్రావు, గుమ్మళ కోటి తదితరులు మాట్లాడారు. గ్రామ సమీపంలోని గోదావరిలో డీసిల్టింగ్ పేరుతో ఇసుక తవ్వకాలు ప్రారంభించారన్నారు. తమ గ్రామంలో పూర్వం కోయ గిరిజనులు, ఎరుకల గిరిజనులు ఎవరూ లేరన్నారు. గ్రామ సమీపంలో ఉన్న గోదావరినదిలో తమ పూర్వికుల నుంచి చేపలవేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తమకు బోట్మెన్ సొసైటీ ఉందన్నారు. జీఓ నంబర్ 84 ప్రకారం బోట్మెన్ తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గిరిజనులకు ఇచ్చిన ఇసుకక్వారీఅనుమతులను రద్దు చేసి తమ గ్రామానికి ఇచ్చిన ఇసుక క్వారీని తమ బోట్మెన్ సొసైటీకి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మురళి, బట్ట రామారావు, గుమ్మళ ఆదినారాయణ, యుగందర్, నర్సింహారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డిసిల్టింగ్ రద్దు చేయాలని నిరసన
వెంకటాపురం(కె): డిసిల్టింగ్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ నవనిర్మాణ సే రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నర్సింహమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్జీటీ పర్యావరణ అనుమతులు లేవని దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన బేకాతరు చేస్తున్నారని అన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టు ఎగువ భాగంలో డిసిల్టింగ్ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ ఆందోళన కారుతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తుడుందెబ్బ రాష్ట్ర మహిళా నాయకురాలు సుభద్ర, రాజేష్, మహేష్, నాగరాజు, పద్మ, చిలుకమ్మ పాల్గొన్నారు. -
రహదారి నిర్మాణం చేపట్టాలి
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు, ధర్మవరం రహదారి నిర్మాణం చేపట్టాలని సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు తెలిపారు. మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెరుకూరు, ధర్మవరం రహదారికి నిధులు మంజూరైనప్పటికి అటవీ అనుమతులు లేని కారణంగా రహదారి నిర్మాణ పనులు నిలిచి పోయినట్లు తెలిపారు. కర్రె గుట్టల్లో జరుగుతున్న పనులకు అడ్డంగిగా లేని నిబంధనలు సామాన్య ప్రజల కోసం ఉపయోగపడే రహదారి విషయంలో ఎలా అడ్డు వస్తున్నాయో తెలియడం లేదన్నారు. రహదారి నిర్మాణానికి చిన్న పొదలు తప్ప పెద్ద పెద్ద చెట్లు పోవని అది తెలిసి కూడా అటవీ శాఖ నుంచి అనుమతులు ఇవ్వక పోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ రహదారిని పూర్తి చేయాలని పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినప్పటికి లాభం లేకుండా పోయిందన్నారు. జూన్ ఒకటిన రహదారి నిర్భంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో బచ్చలి కృష్ణ బాబు, దామోదర్, ముత్తయ్య, చద్రశేకర, కుమారి, ఉదయ, ప్రవీణ్, కృష్ణబాబు, నరేష్ తదితరులు ఉన్నారు. -
జేఎల్ఎంలకు పదోన్నతి కలేనా..?
హన్మకొండ: ఆకాశంలో వేలాడుతున్న విద్యుత్ తీగలపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు పదోన్నతి మీద పదోన్నతి తీసుకుంటూ.. జూని యర్ లైన్మెన్ల చిరుద్యోగుల పదోన్నతి హక్కును కాలరాయడంపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో జూని యర్ లైన్మన్లకు ఆ యాజమాన్యాలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించాయి. కానీ, ట్రాన్స్కోలో కల్పించకుండా జూనియర్ లైన్మన్లను గోస పెడుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అన్నీ ఖాళీలే.. టీజీ ట్రాన్స్కోలో జేఎల్ఎం పోస్టులు 1119 ఉన్నా యి. ఇందులో 892 పోస్టులు భర్తీ అయ్యాయి. అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు 378 ఉండగా ఇక్కడ ఆరుగురు మాత్రమే ఉన్నారు. లైన్మన్ పోస్టులు 280 ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. 372 అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని పదో న్నతి ద్వారా భర్తీ చేయకుండా జేఎల్ఎంల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తూ వ్యవస్థను నిలబెడుతున్న తమపై ఇంత వివక్ష యాజమాన్యానికి తగదని మొత్తుకుంటున్నారు. వయస్సు మీరుతున్నా.. జూనియర్ లైన్మన్ పోస్టులు నియమించే క్రమంలో అప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆర్టిజన్లుగా పని చేస్తూ ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. రిక్రూట్మెంట్ సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వెయిటేజీ ఇవ్వడంతో చాలాది జేఎల్ఎంలుగా ఎంపికయ్యారు. వీరు అప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ చేసిన వారున్నారు. చాలా మంది 50 ఏళ్ల వయస్సుకు వచ్చారు. వయస్సు మీ రుతున్నా వీరంతా తమకు ఒక్క పదోన్నతి వచ్చిన చాలు అనే ఆశతో ఉన్నారు. కానీ, వీరి ఆశలను ట్రాన్స్ కో యాజమాన్యం నీరుగారుస్తోంది. ఇంజనీర్లు, అకౌంట్స్, హెచ్ఆర్డీ విభాగంలో అన్ని స్థాయి ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని జూనియర్ లైన్మన్లు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుడా విధులు నిర్వహిస్తున్న జేఎ ల్ఎంలపై యాజమాన్యం తక్కువ చేసి చూడడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా జేఎల్ఎంలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రాన్స్కో యాజమాన్యం తీరుపై విమర్శలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించడంలో జాప్యం ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనికరం చూపని మేనేజ్మెంట్ -
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి
మంగపేట: మండంలోని కమలాపురం రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 116లోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని పలు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని రెవెన్యూ అధికారులు స్పందించి స్వాధీనం చేసుకోవాలని మన్య సీమపరిరక్షణ సమితి డోలుదెబ్బ మండల అధ్యక్షుడు తాటి నాగరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను మండల కమిటీ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతమైన మండలంలో కొందరు భూబకాసురులు రాజకీయ అండదండలతో 1/70, ఎల్టీర్ చట్టాలను అతిక్రమించి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తు ప్లాట్లుగా సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు 1/59, 1/70, ఎల్టీర్, పెసా వంటి ఏజెన్సీ చట్టాలను అమలుచేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఆక తిరుమల్రావు, గొప్ప చంద్రకాంత్, పెద్దల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు కాపాడే ప్రాణదాతలు పైలట్లు
ములుగు రూరల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే ప్రాణదాతలు అంబులెన్స్ పైలట్లని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ పైలట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను సమయానికి ఆస్పత్రికి చేర్చడంలో పైలట్ల పాత్ర అభినందనీయమని తెలిపారు. రోగులను సమయానికి ఆస్పత్రులకు చేర్చి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఎంఈ రాజ్కుమార్, 108 పైలెట్లు, ఈఎంటీలు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
ధాన్యం కొనేవరకూ పోరాటం
ఆత్మకూరు: చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని బీజేపీ ప్రజాప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి రైతు సమస్యలు పరిష్కరిస్తామని, కుల్కచర్ల నుంచి నీరుకుళ్ల వరకు అన్నీ సమస్యలే ఉన్నాయని వారు పేర్కొన్నారు. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ బృందం పరిశీలించింది. బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేశారని, ధాన్యం కొనుగోళ్లను కూడా ఎత్తేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 50 రోజులుగా వడ్ల కుప్పల మీదే నిద్రిస్తున్నారన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి బుకాయించుడు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అప్పుల కుప్పలు, ఆత్మహత్యలు మిగిలాయని, కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కిసాన్మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, పరకాల ఇన్చార్జ్ కాళీప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు సంతోష్రెడ్డి, రావు పద్మ, డాక్టర్ విజయ్చందర్రెడ్డి, దశమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల -
‘గో టు విలేజ్’ను విజయవంతం చేయాలి
వెంకటాపురం(కె): గో టు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీస్ మండల అధ్యక్షుడు యాసం రమేష్ మాదిగ అన్నారు. మంగళవారం మండలంలోని మరికాల పంచాయితీ రామక్రిష్ణాపురంలో యువతతో మాట్లాడారు. మాదిగల పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మే 25 నుంచి జులై 25 వరకు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రతి మాదిగపల్లెలో ఎమ్మార్పీఎస్ జెండాలను ఎగర వేయాలని అన్నారు. మంద క్రిష్ణ మాదిగ మూడు దశాబ్ధాల పోరాట ఫలితంగా ఏబీసీడీ వర్గీకరణ సాధించామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేష్, మల్లికార్జున్, తిరుపతి, గౌతం, ఆనంద్, రవి తదితరులు పాల్గొన్నారు. -
శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
గోవిందరావుపేట: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పస్రా సీఐ పత్తిపాక దయాకర్ అన్నారు. పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పస్రా ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా సీఐ దయాకర్ హాజరై మాట్లాడుతూ.. బక్రీద్ పండుగను కులమతాలకు అతీతంగా, పరస్పర గౌరవ భావాలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. సమావేశంలో నార్లాపూర్ ఎస్సై కమలాకర్, తాడ్వాయి ఎస్సై జగదీష్, ఎస్సైలు ఆంజనేయులు, ఎర్రయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది, కాటాపూర్, గోవిందరావుపేట, బుస్సాపూర్, నార్లాపుర్, తాడ్వాయి ప్రాంతాల ముస్లిం మత పెద్దలు, బీజేపి, ఏబీవీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పస్రా సీఐ దయాకర్ -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
గోవిందరావుపేట: ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని సర్పంచ్ మేకలరాధ సుదర్శన్ అన్నారు. మండలంలోని చల్వాయిలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో రోడ్ల నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు సౌకర్యవంతంగా మారనున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పైడాకుల కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్, సారయ్య, వెంకటేష్, సుదాకర్, అశోక్ ఏఈ సూపర్వైజర్ విక్కీ తదితరులు పాల్గొన్నారు. -
రహదారి నిర్మించాలని నిరసన
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు నుంచి ధర్మవరం గ్రామం వరకు నిలిచిపోయిన రహదారిని నిర్మించాలని కోరుతూ ప్లకార్డులతో సీపీఎం నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల పరిధిలోని చెరుకూరు నుంచి ధర్మవరం గ్రామం వరకు అటవీ అనుమతులు లేవని రహదారి పనులు నిలిపివేశారని అన్నారు. ఈ రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో నాలుగు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో రహదారి దిగ్భంధనం చేస్తామని తెలిపారు. నిరసన తెలిపిన వారిలో సదాక్రేన్, నరేష్, మహేందర్, రమేష్ తదితరులు ఉన్నారు. -
వినియోగంలోకి తీసుకురావాలి
పంచాయతీల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును అధికారులు వినియోగంలోకి తీసుకురావాలి. రోడ్డు పక్కన చెత్తా చెదారం వేయకుండా చర్యలు చేపట్టాలి. డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన వర్మి కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి కంపోస్టు ఎరువు తయారు చేసేలా అధికారులు చూడాలి. – తంగెల్లపల్లి ప్రసాద్, వెంకటాపురం(కె) చెత్తా చెదారం రోడ్డు పక్కన వేసి చెత్తకు నిప్పు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలి. రోడ్డు పక్కన, చెరువులో చెత్త, వ్యర్థాను వేయటం వల్ల దుర్వాసన వస్తోంది. రోడ్డుపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – కట్ల నర్సింహాచారి, వెంకటాపురం(కె) -
బాల్య వివాహాలను అరికట్టాలి
గోవిందరావుపేట: గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని ఐసీడీఎస్ ఇన్చార్జ్ సీడీపీఓ విజయ అన్నారు. మండలంలోని కోటగడ్డ, గాంధీనగర్ గ్రామ పంచాయతీల్లో చైల్డ్ మ్యారేజీ ఫ్రీ విలేజ్ కార్యక్రమాలను సోమవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ విజయ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రజలందరూ కలిసి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ జ్యోతి మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో నిరంతర సర్యవేక్షణ కొనసాగిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం బాల్య వివాహాలు జరగనివ్వమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఇన్చార్జ్ సీడీపీఓ విజయ -
నిరుపయోగంగా డంపింగ్ యార్డు
శివాలయం వద్ద రోడ్డు పక్కన పడేసిన చెత్త మార్కెట్ యార్డు సమీపంలో చెరువులో వేసిన చెత్త వెంకటాపురం(కె): ఇంటింటికీ చెత్త సేకరించి వందశాతం పారిశుద్ధ్యం సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఆ రు బయట రోడ్డు పక్కన, చెరువులో వేయడం వల్ల డంపింగ్ యార్డులు నిరుపయోగంగా మారాయి. రోడ్డు పక్కన, చెరువుల్లో పడేసిన చెత్తకు నిప్పు పెడుతుండడంతో దుర్వాసన రావడంతో పాటు పొగకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన చెత్త వేసి నిప్పు పెట్టి ప్రజల ఆరోగ్యానికి హా ని కలుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు పడతున్న ప్రజలు.. వర్మికంపోస్టు షెడ్లలో చెత్తను వేరు చేయడం, ఎరువులు తయారు చేయడం వంటి పనులు చేపట్టక పోతుండటంతో పాటు పంచాయతీలో సేకరించిన చెత్తతో పాటు ప్లాస్టిక్ కవర్లు తదితర వస్తువులు, వ్యర్ధాలను డంపింగ్ యార్డులో వేయడం లేదు. రోడ్డు పక్కన, బోడ చెరువులో పడేసి తగల బెట్టడం వలన వచ్చే పొగతో ప్రజలు, రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి డంపింగ్ యార్డులోనే చెత్త వేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్ల పక్కనే చెత్తాచెదారం పట్టించుకోని అధికారులు -
ముగిసిన సమ్మర్ క్యాంపు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని పీఎ శ్రీ పాఠశాలలో ప్రారంభమైన సమ్మర్ క్యాంపు సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్య, హెచ్ఎం వాసం సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రత్యేక కళలు, రుగ్మతులు, వివిధ రకాల ప్రోగ్రాంలతో నిర్వహించిన సమ్మర్ క్యాంపునేటితో ముగిసిందని అన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు చిన్నారులకు క్యారమ్స్, చెస్, రంగులు, డ్యాన్స్ రకరకాల విన్యాసాలతో వారికి శిక్షణ ఇచ్చామన్నారు. క్రీడలు ఆడడం వల్ల జరిగే లాభాలను వివరించామన్నారు. చిన్నారులు ఇంటిలో సెల్, టీవీలకు పరిమితం కాకుండా ఈ క్యాంప్ వల్ల అనేక విషయాలను నేర్పించామన్నారు. ఇదేకాకుండా భవిష్యత్లో ఎలాంటి శిక్షణ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, క్రమ శిక్షణ, గురువులపై గౌరవం, తల్లిదండ్రులపై ప్రేమ అనురాగం చూపేవిధంగా వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి మండలంలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 2025–26 విద్యా సంవత్సరంలోని విద్యార్థులకు గంగిశెట్టి మధురిమ ట్రస్ట్ ఆద్వర్యంలో సోమవారం మండల కేంద్రలోని జెడ్పీహెచ్ఎస్ లో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మల్లయ్య మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో మండల కేంద్రానికి చెందిన కృష్ణ రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించగా విద్యార్థితో పాటు మరో ఆరుగురికి పోత్సహక బహుమతులను గంగిశెట్టి మధురిమ ట్రస్ట్ చైర్మన్ గంగిశెట్టి జగదీశ్ అందజేశారు. -
మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన
వెంకటాపురం(ఎం): మండలంలో 32 గ్రామైక్య సంఘాలు ఉండగా 21 సంఘాల భవన నిర్మాణాలకు సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు ఏపీఎం ధర్మేందర్ తెలిపారు. ఈజీఎస్ పథకంలో భాగంగా ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఐకేపీ సీసీలు, వీఓ సంఘం అధ్యక్షుడు, మహిళలు పాల్గొన్నారు. వాజేడు: వాజేడు మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి, నాగారం, మొదలైన గ్రామ పంచాయతీల్లో మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఆయా పంచాయతీల సర్పంచ్లు బోదెబోయిన భరత్ కుమార్, బోదెబోయిన స్వరూపలు కొబ్బరి కాయలను కొట్టి భవనాల నిర్మాణాలను ప్రారంభించారు. మహిళ సంఘాల భవనాలకు భూమిపూజ కన్నాయిగూడెం: మండలంలోని తుపాకులగూడెం, బుట్టాయిగూడెం, కన్నాయిగూడెం గ్రామాకుల ప్రభుత్వం మహిళా సంఘాల భవనాలను మంజూరు చేసింది. వాటిని సర్పంచ్లు భూమి పూజ చేసి ప్రారంభించారు. బుట్టాయిగూడెంలో సర్పంచ్ జాడి రాంబాబు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి, ఏపీడీ వెంకటనారాయణ, మహిళ సమాఖ్య ఏపీఎం రాంబాబు, ఈజీఎస్ ఏపీఓ సురేష్, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, తుపాకులగూడెం సర్పంచ్ పీరీల స్వప్న, రాజన్నపేట సర్పంచ్ పొడెం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. మంగపేట: మండలంలోని రాజుపేట, రమణక్కపేట గ్రామాల్లో మహిళా పొదుపు సంఘాల గ్రామాఖ్య సంఘాలకు ప్రభుత్వం మంజూరీ చేసిన భవనాల నిర్మాణం పనులకు టీఎస్ఈజీసీ సభ్యుడు గుమ్మడి సోమయ్య భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వల్లెపల్లి శివప్రసాద్, రామిరెడ్డి, ముఖర్జీ, నర్సింహారావు, ఐకేపీ ఏపీఎం సత్యనారాయణరెడ్డి, సీసీ, వీవోఏలు, మహిళా పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: మండలంలోని కోయగూడ ఎల్లాపురం(రాంనగర్) గ్రామంలో మహిళ సంఘా భవనానికి సర్పంచ్ పోరిక సరిత భూమి పూజ చేశారు. రాంనగర్ గ్రామంలో మహిళ సంఘాల సమావేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన భవనాన్ని పూర్తి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గార గాంధీ, వార్డు సభ్యులు గద్దె జయకృష్ణ, వంకాయల లత, ఓజ్జల స్వప్న, సౌందర్య, రమేష్, ఐకేపీ సీసీ సరోజన, వీఓ అధ్యక్షులు గొర్లపల్లి సత్యవతి, అనిల్ పాల్గొన్నారు.వెంకటాపురం(ఎం): నల్లగుంటలో..వాజేడు: గుమ్మడిదొడ్డిలో.. -
వనదేవతలకు మొక్కులు
ఏటూరునాగారం: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మినర్సింహరావు తాడ్వాయి మండల పరిధిలోని మేడారం వనదేవతలను సోమవారం దర్శించుకున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు లక్ష్మినర్సింహరావు వెల్లడించారు. అమ్మవారికి బంగారాన్ని సమర్పించి కొబ్బరి కొట్టారు. ఆలయ పూజారులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్, పూజారులు నాయకులకు కండువాలను కప్పి సత్కరించారు. అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కునూరు అశోక్, తాటి కృష్ణ, దిడ్డి మోహన్రావు, తాడూరి రఘు, చిట్టిమల్ల సమ్మయ్య, మైపాల్రెడ్డి, ఇంద్రారెడ్డి, యలవర్తి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళల ఆర్థిక సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధి
● వర్చువల్ పద్ధతిలో మహిళా భవన నిర్మాణాలకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన ములుగు: మహిళల ఆర్థిక సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది అని సీఎం రేవంత్రెడి అన్నారు. సోమవారం తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8వేల మహిళ భవనాల నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో కలెక్టర్ హేమంత్ సహదేవరావు వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 8 వేల మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేయడం సంచలనాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఇప్పటి వరకు ఇందుకోసం రూ.10 వేల కోట్లకు పైగా ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెట్రోల్ బంకుల నిర్వహణను కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకే అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఈ ఏడాది సారెగా ఇందిరమ్మ చీరలను అందిస్తోందని వెల్లడించారు. గతంలో పంపిణీ చేసిన చీరల నాణ్యతపై విమర్శలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ఎంతో నాణ్యతతో ఉన్నాయని తెలిపారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని తెలిపారు. వర్చువల్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఆదనపు కలెక్టర్ సంపత్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, డీఆర్డీఓ చంద్రశేఖర్, డీడబ్ల్యూఓ ప్రేమలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
బిల్లులను తక్షణమే చెల్లించాలి
ములుగు రూరల్: అల్పాహార పాత బిల్లులను తక్షణమే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్ సంపత్రావుకు వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 అక్టోబర్ నుంచి నేటి వరకు వంట కార్మికులకు అల్పాహారం బిల్లులు ప్రభుత్వం విడుదల చేయలేదని అన్నారు. బిల్లులు మంజూరు చేస్తేనే జూన్లో ప్రారంభించే అల్పాహారం సజావుగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బండి కొమరయ్య, నాయకులు గడ్డం భారతి, రమీల, రాజకుమారి, పద్మ, భవాని, భాగ్య, పోషమ్మ, సరిత తదితరులు ఉన్నారు. -
పెంబర్తి టు వరంగల్
విద్యారణ్యపురి: నాలుగేళ్ల క్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆయా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించగా.. అప్పట్లో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు కాలేదు. దీంతో ఆతర్వాత మహబూబాబాద్, ములుగులోని ఈరెండు బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలను అదే పేర్లతో కాజీపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఐదేళ్ల లా కోర్సు నడుస్తున్న భవనంలోకి మార్చారు. రెండేళ్లపాటు అరకొర వసతులతో కళాశాలలను కొనసాగించగా.. గతేడాది తమకు వసతులు సరిపోవట్లేదని బీసీ గురుకుల లా విద్యార్థులు ఆందోళన చేశారు. చివరికి మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట కార్యదర్శి సైదులు ఆదేశాలతో జనగామ జిల్లాలోని పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు 2025 డిసెంబర్ 22న షిఫ్ట్ చేశారు. మళ్లీ వరంగల్కే మార్చాలని డిమాండ్ కళాశాలలను మళ్లీ వరంగల్కే మార్చాలనే డిమాండ్ వ్యక్తం కావడంతో గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి ఈఏడాది మార్చిలో ఆయా మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను వరంగల్ రంగశాయిపేటలోని నాయిడు పెట్రోల్ బంక్ సమీపంలోని అద్దె భవనంలోకి మార్చాలని ఆదేశించారు. వివిధ కారణాలతో షిఫ్టింగ్కు కొంత ఆలస్యమై చివరికి సోమవారం పెంబర్తి నుంచి వరంగల్కు మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు షిఫ్టింగ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఆరెండు కళాశాలలు కలిపి డిగ్రీ సెకండియర్, ఫైనల్ ఇయర్లో 215 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జూన్ ఒకటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ షురూ.. వరంగల్ రంగశాయిపేటలోని అద్దె భవనంలోనికి మార్చిన మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలల్లో (2026–27) విద్యాసంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు, దరఖాస్తులు చేసుకోవాలని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి సోమవారం తెలిపారు. బీఏ హెచ్ఈపీ, బీకాం (సీఏ), బీఎస్సీ బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నేరుగా పొందవచ్చని, పూర్తి వివరాలకు 98666 10429, 96768 17038 సంప్రదింవచ్చని సూచించారు. బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాలలు షిఫ్టింగ్ మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించిన గురుకుల డిగ్రీ కళాశాల వరంగల్లోని రంగశాయిపేట అద్దె భవనంలోకి.. -
స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
● యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ములుగు రూరల్: స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర స్కావెంజర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట స్కావెంజర్లతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు, మొక్కల పెంపకం, టాయిలెట్లు శుద్ధి చేసేందుకు స్కావెంజర్లను నియమించారని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందన్నారు. దీంతో పాటు 2025–26 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ నెల వేతనం సైతం పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కావెంజర్లు రమ, ఎలేంద్ర, జమున, రాజేశ్వరి, ఉమరాణి, సమ్మక్క, కవిత తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన మ్యూజియం అద్భుతం
● పీఓ లెనిన్ వత్సల్ టొప్పో భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం అద్భుతంగా ఉందని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియాన్ని ఆయన సోమవారం సందర్శించి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే వస్తువులు, వేట పరికరాలను పరిశీలించి మాట్లాడారు. మ్యూజియం ఆవరణలో గిరిజన తెగల సంస్కృతిని ప్రతిభింభించేలా ఏర్పాటు చేసిన పరికరాలు, నిర్మాణాలు బాగున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, ఉద్యోగులు ప్రభాకర్, వీరస్వామి, రాందాస్, పోశాలు పాల్గొన్నారు భక్తులకు మజ్జిగ పంపిణీ వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్పకు తరలివస్తున్న భక్తులకు సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కాళేశ్వరంలో జరుగుతున్న అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శించే భక్తులకు విజయవాడ పట్టణానికి చెందిన కోనేటి ఏడుకొండలు – దుర్గశ్రీలక్ష్మి దంపతులు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వేసవిలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా మజ్జిగ కొంతమేర ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది సంతోష్, దామోదర్, రత్న కుమారి, టూరిస్ట్ గైడ్ విజయ్ కుమార్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, అరుణ్, పురావస్తు శాఖ, గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు. వాడబలిజలను ప్రభుత్వం గుర్తించాలి ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం వాడబలిజలను ఆర్థికంగా, సామాజికంగా గుర్తించాలని రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్, సలహాదారుడు తోట మల్లికార్జున్రావు అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్హాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గార ఆనంద్ అధ్యక్షతన సోమవారం సభను ఓడవాడ నుంచి వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు. అనంతరం సభకు చేరుకొని ఆయన మాట్లాడారు. గోదావరి ప్రాంతాల్లో ఉన్న వాడబలిజలకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపల వేటకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజి కల్పించి చేపల వేటకు కావాల్సిన పరికరాలు, సామగ్రిని అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణయ్య, భాస్కర్, ఆదినారాయణ, మహేశ్, తోటి ప్రశాంత్, వీరన్న, సునీల్, రాంప్రసాద్, ఖాదర్బాబు, కర్ల అరుణ, కమల, సూర్యం పాల్గొన్నారు. నాలుగు దుకాణాల్లో చోరీ ములుగు రూరల్: జిల్లాకేంద్రంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి వైన్స్, రెడ్డి వైన్స్, మహదేవ్ ఐరన్ హర్డ్వేర్, జీ ఫ్యామిలి మార్ట్ల్లో చోరీలకు పాల్పడినట్లు ఎస్సై ఉపేందర్రావు వెల్లడించారు. రాత్రి షాపులు బంద్ చేసి వెళ్లిన యజమానులు ఉదయం వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మహదేవ్ ఐరన్ హర్డ్ వేర్లో రూ. 1.50 లక్షలు, రెడ్డి వైన్స్లో రూ. 40 వేలు, జీ ఫ్యామిలి మార్ట్లో రూ. 25 వేలు, శ్రీ పెద్దమ్మతల్లి వైన్స్లో రూ. 50 వేల నగదు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని ఎస్సై వివరించారు. -
వాడబలిజ సేవా సంఘం ఆవిర్భావ వేడుకలు
వెంకటాపురం(కె): మండలంలో ఘనంగా వాడ బలిజ సేవ సంఘం ఆవిర్భావ వేడుకలను సోమవారం నిర్వహించారు. మండల పరిధిలోని వీఆర్కె పురం గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వాడబలిజ సేవ సంఘం జెండాను వాడ బలిజసేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్రా దామోదర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాడ బలిజల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాడబిజసేవ సంఘం నాయకులు తోట ప్రశాంత్, కొప్పుల మల్లికార్జున్, బద్ది ఆదినారాయణ, బోగట విజయ్, పవన్, సనుగొండ వెంకన్న, పోతురాజు, నాగార్జున ఉన్నారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: మహిళలను వేధిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని, పని ప్రదేశాల్లో మహిళలకు పోష్ చట్టం ఒక రక్షణ కవచంలా ఉంటుందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలలో భాగంగా ‘మహిళల భద్రత – రక్షణ’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలు గౌరవంగా, భయభ్రాంతులు లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలన్నారు. పోష్ చట్టం మహిళా ఉద్యోగులకు రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. ప్రతీ కార్యాలయంలో 10 మందికి పైగా ఉద్యోగులు ఉంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వేధింపులకు గురైన మహిళలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. పోష్ చట్టంపై ప్రతీ ఉద్యోగికి అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. అనంతరం పోష్ చట్టం, న్యూట్రిషన్ పోస్టర్లను కలెక్టర్ అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి ఆవిష్కరించారు. అంతకముందు దత్తత సహాయక కేంద్రాన్ని, మహిళా భద్రతపై సంతకాల సేకరణను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఐదుగురికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. వారికి జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా వెంకటలక్ష్మి, భాను, హరీశ్, సునీత, వంశీకృష్ణలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలు జరిగే ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, టెంట్, కుర్చీల ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఇతర శాఖల అధికారులు సైతం లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రేమలత, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ కిశోర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్లో ఇలా..
ఎస్ఎస్ తాడ్వాయి మండలం బందాల గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల్లో బోరు బావులు, విద్యుత్ సరఫరాకు అనుమతి ఇవ్వాలని బందాల సర్పంచ్ మంకిడి శ్రీలత ఏపీఓకు విన్నవించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు పట్టాదారు పుస్తకాలు లేని రైతులను గుర్తించి ఇవ్వాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి ఏపీఓను కోరారు. మండలంలోని షాపెల్లిలో చెరువుల్లోని చేపలు గిరిజనేతరులు పట్టుకుంటున్నారని ఆరోపిస్తూ ఏపీఓకు కోరగంట్ల లక్ష్మణ్రావు వినతి పత్రాలను అందజేశారు. మంగపేట మండలం చుంచుపల్లికి చెందిన కొమురం రామకృష్ణ ఇందిరమ్మ ఇల్లు కావాలని విన్నవించారు. కాంట్రాక్టు అటెండర్ జాబ్ ఇప్పించాలని బానోత్ రాములు కోరారు. మంగపేట పీహెచ్సీలో స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పించాలని శనిగకుంటకు చెందిన బొడ్డు రాజమణి విన్నవించారు. తాడ్వాయికి చెందిన గౌరబోయిన పరమయ్య ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పాస్బుక్ ఇప్పించాలని కోరారు. మేడారం ఆదివాసీ మ్యూజియంలో పనిచేస్తున్న కాల్వపెల్లికి చెందిన సిద్ధబోయిన నాగరాణి వేతనం ఇప్పించాలని ఏపీఓను కోరారు. గిరివికాసం పథకం కింద బోరు మంజూరు చేయాలని తాడ్వాయి మండలం గంగారానికి చెందిన మల్కం దేవయ్య కోరారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఓకు వినతి పత్రాలు అందజేశారు. -
డిసిల్టేషన్ను రద్దు చేయాలి
వెంకటాపురం(కె): డిసిల్టేషన్ను రద్దు చేసి పాత పద్ధతిలోనే సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపులను నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని లుబాక గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల మహాసభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీలోని ఆదివాసీ చట్టాలను నిర్వర్యం చేస్తుందన్నారు. ఆదివాసీ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని తెలిపారు. సీతమ్మ ధార ప్రాజెక్టు పేరుతో వెంకటాపురం మండలంలో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడికి గురవుతుందని అన్నారు. డిసిల్టెషన్ పేరుతో గోదావరి నదిలో 15 కిలో మీటర మేర ఇసుకను కొల్లగొట్టెందుకు చూస్తున్నాని అన్నారు. అనంతరం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూనెం చందు, కార్యదర్శిగా వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. నాయకులు ఇర్ప శ్రీను, నాగేష్, చందర్రావ్, వెంకటనారాయణ తదితరులు ఉన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ -
స్థానికులనే నియమించాలి
వాజేడు: మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కాళీగా ఉన్న పోస్టుల్లో స్థానికులనే నియమించాలని సర్పంచ్ బోదెబోయిన స్వరూప ఆధ్వర్యంలో జంగాలపల్లి గ్రామస్తులు సోమవారం తీర్మానం చేశారు. జంగాలపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు కాళీగా ఉంది. ఈ పోస్టులో నియమ నిబంధనల ప్రకారం స్థానికులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. వేరే అంగన్ వాడీ కేంద్రాల నుంచి ఇక్కడికి ఎవరిని బదిలీ చెయ్యొవద్దన్నారు. అందుకు సంబంధించిన వినతి పత్రాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్ బోదెబోయిన స్వరూప, ఉపసర్పంచ్ మందపాటి సుబ్బరాజుతో కలిసి గ్రామస్తులు అందజేశారు. కన్నాయిగూడెం: మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు ప్రధాన రహదారి వద్ద క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఆదివారం రాత్రి గ్రామంలోకి వెళ్లే ప్రధాన కూడలి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పచ్చగుడ్డలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, నిమ్మకాయ, పసుపుతో అన్నం ముద్ద, కుంకుమతో మరో అన్నముద్దను పెట్టి వెళ్లారు. సోమవారం ఉదయం వెళ్లిన ప్రజలు వాటిని చూసి భయందోలనకు గురయ్యారు. -
ఇప్పపువ్వు లడ్డూ @ రూ.100
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట ఇప్పపువ్వు లడ్డూలు విక్రయిస్తున్నారు. కన్నాయిగూడెం మండలం రాజన్నపేటకు చెందిన గిరిజన ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసి ఒక బాక్స్లో పెట్టి రూ.100 చొప్పున ఐటీడీఏకు వచ్చి వెళ్లే వారికి విక్రయిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ మహిళా సంఘం సభ్యులు ఇప్ప పువ్వును సేకరించి వాటితో స్వచ్ఛమైన బెల్లంతో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ లడ్డూలతో అనేక పోషకాలు అందుతాయని వివరిస్తూ విక్రయిస్తున్నారు. దీంతో పలువురు లడ్డూలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
వెల్లువలా వినతులు
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజనదర్బార్లో ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు వెల్లువలా వచ్చాయి. ప్రజావాణిలో 113 అర్జీలను బాధితులు అందజేయగా ఐటీడీఏలో 22 వినతులను అందజేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావుతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతీవారం నిర్వహించే ప్రజావాణిలో ముందు వారం వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై రిపోర్టు అందించాలని సూచించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఏపీఓ నాగోరావు వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి చల్వాయి గ్రామంలో గతంలో ఉన్న పూరిగుడిసె కూలిపోవడంతో అద్ధె ఇంట్లో జీవిస్తున్నాము. కుటుంబ పోషణతో పాటు అద్దె చెల్లించడం భారంగా ఉంది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాం. అయినప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. విచారణ జరిపించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – గద్వాల రమేశ్, చల్వాయి భూమికి పట్టా ఇప్పించాలి జాకారం శివారులో తనకు వారసత్వం కింద వచ్చిన భూమి సర్వే నంబర్ 53/30/సిలో 10 గుంటల భూమికి పట్టా ఇప్పించాలి. 40 ఏళ్లుగా కాస్తు కబ్జాలో ఉన్నాను. ఈ భూమిని నా బిడ్డకు పసుపు కుంకుమల కింద ఇచ్చాను . భూమిని వారికి అప్పగించాలి. భూమి పట్టా ఇప్పించి ఆదుకోవాలి. – కురాకుల లక్ష్మీ, జాకారంప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల వివరాలుఇందిరమ్మ ఇళ్లు 25 పింఛన్లు 51ఇతర సమస్యలు 37 ప్రజావాణిలో 113, గిరిజన దర్బార్లో 22 అర్జీల రాక స్వీకరించిన కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఏపీఓ నాగోరావు వినతులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు -
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా మండల పరిధిలోని దేవగిరిపట్నం అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత ఆధ్వర్యంలో సర్పంచ్ ఇస్లావత్ పూలమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి భూదాత సానికొమ్ము రోషిరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ శిరీష, సెక్టార్ సూపర్వైజర్లు అనంతలక్ష్మీ, రమాదేవి, కమరున్నీసాబేగం, సరస్వతి, జూనియర్ అసిస్టెంట్ సంపత్, వార్డు సభ్యుడు బాలాజీ, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మీ, కవిత, రోజా పాల్గొన్నారు. -
అడవిలో మంటలు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఏటూరు నుంచి కంతనపల్లి వరకు ఉన్న దట్టమైన అడవిలో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఎండిన ఆకులు ఉండడంతో నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. మంటల్లో చెట్లు, జీవరాశులు ఆహుతి అవుతున్నాయి. అడవిని రక్షించాల్సిన అటవీ శాఖ అధికారులు అటుదిక్కు కన్నెతి కూడా చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి మంటలను ఆర్పాలని కోరుతున్నారు. కన్నాయిగూడెం: మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలో పని చేయని చేతి పంపులను సర్పంచ్ జాడి రాంబాబు మరమ్మతు చేయించారు. తాగు నీటికి ఇబ్బంది కాకుండా ఉండేదుకు మరమ్మతు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాజేడు: మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో సోమవారం ఆర్బీఎస్కే వైద్యాధికారి నవీన్ అధ్వర్యంలో ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ స్క్రీనింగ్లో 117 మంది రోగులకు ఎక్స్రే తియ్యగా అందులో 32 మంది టీబీ అనుమానితులను గుర్తించినట్లు వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ వేణుగోపాల కృష్ణ, వెంకటేశ్వర్లు, సుమలత, తిరుపతి, తదితరులు ఉన్నారు. ములుగు రూరల్: విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యా పరిరక్షణ రాష్ట్ర కమిటీ ఆధ్వదర్యంలో జూన్ 5 వ తేదీన చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లె నాగరాజు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో జూన్ 5న చెపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోతూరు పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు రేగ నరేందర్, గన్ రెడ్డిఆదిరెడ్డి, పాల ఉప్పల స్వామి, దిలీప్, బానోత్ సూర్య, వైనా స్వామి, సతీష్ ఉన్నారు. ములుగు రూరల్: విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘటన ములుగు మున్సిపాల్టి పరిధి బండారుపల్లి శివారులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమ్నగర్ గ్రామానికి చెందిన జంగిలి రవితేజకు సంబంధించిన పాడి గేదెలను రోజు వారిలా మేతకు వదిలాడు. బండారుపల్లి శివారులో అక్రమంగా విద్యుత్ వైర్లు వేసి పంటకు నీరు పెడుతున్నారు. ఈ క్రమంలో అటుగా మేతకు వెళ్లి పాడిగెదే విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందింది. పాడిగేదె విలువ సుమారు రూ. 80 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు పరిహారం అందించాలని కోరారు. వాహనం ఢీకొని.. వెంకటాపురం(కె): మండల కేంవద్రంలోని శివాలయం సమీపంలో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని పాడిగేదె మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శివాలయం సమీపం నుంచి గేదెలు మేతకు సమీప పొలాల్లోకి వెళ్తున్నాయి. ఉదయం గుర్తు తెలియని వాహనం గేదెను ఢీకొట్టడంతో గేదె అక్కడి అక్కడే మృతి చెందింది. గేదె ఎవరిది అనే విషయం ఇంత వరకు తెలియలేదు. కాగా, మృతి చెందిన గేదె విలువ సుమారు నలబై వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. -
‘ధాన్యం తడవకుండా కొనుగోలు చేయాలి’
ములుగు: జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కేంద్రాల వద్ద ఉన్న పంట తడవకుండా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గోదాముల కొరత, లారీలు, హమాలీల సమస్య ఉన్న చోట సమస్యను పరిష్కరించాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులు వేగంగా అందేలా ట్యాబ్ ఎంట్రీల డేటా అప్డేట్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారాల్లో సైతం చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో మోసం చేసే వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణం కలుషితం కావడంతో పాటు నేల సారవంతతను కోల్పోతుందని తెలిపారు. ఈ విషయాలపై కలెక్టర్లు రైతులకు అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీడబ్ల్యూవో ప్రేమలత, సీపీఓ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చి రొట్టతో భూసారం పెంపు
మల్హర్: పచ్చి రొట్టతో భూసారం పెరుగుందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయితీపై 50 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు మండలంలోని కొయ్యూరు ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వరి, మిరప పంటలు వేసే రైతులు తప్పనిసరిగా ఈ పచ్చి రోట్ట విత్తనాలు తొలకరిలో దుక్కి దున్ని చల్లుకొని 45 రోజుల తర్వాత పూత దశలో భూమిలో కలియదున్నుకుంటే భూమి సారవంతం కావడమే కాక పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. జీలుగ విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫిలతో మండల వ్యవసాయధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఒక బస్తా (30 కిలోల) జీలుగ విత్తనాలు రూ.2452.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరానికి భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్య శిబిరాలను భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మధుసూదన్, ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గోపాల్ రావు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, అత్యవసర సేవల పరిస్థితిపై వివరాలు సేకరించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది విధుల నిర్వహణను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పుష్కరాల కాలంలో భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.భూపాలపల్లి రూరల్: ప్రతీ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ గద్దెలు నిర్మించాలని ఆ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్ మెడల అభిలాష్ గౌడ్ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోటీఆర్ఎస్ పార్టీ గద్దెలు నిర్మాణం చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు కోరారు. జిల్లా ఇన్చార్జ్ నరేష్ నేత, నియోజకవర్గ అబ్జర్వర్ అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు వినోద్,నాయకులు గోవర్దన్, చుక్క రాజు, విగ్నేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: రాజయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన కంపేటి రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. రాజయ్య జీవితం అసలైన కమ్యూనిస్టు ఉద్యమానికి నిదర్శనమని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాలు తరతరాలకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు. అనంతరం రాజయ్య పేరుతో పర్మినెంట్ కార్మికుల కోసం ఒక కార్యాలయం, కాంట్రాక్ట్ కార్మికుల కోసం మరో కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో రాజయ్య స్మారక స్తూపం, స్మారక భవనం నిర్మాణానికి కృషి చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజయ్య కుటుంబ సభ్యులు లక్ష్మి, నాగరాజు, స్వాతి, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రాజయ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
భానుడి భగభగలు
వెంకటాపురం(కె): మండలంలో భానుడు భగభగలతో తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆదివారం మండలంలో ఎండలు నిప్పల కొలిమిని తలపించాయి. ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందకు భయందోళనలకు గురవుతున్నారు. ఉదయం 6గంటల నుంచి ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వతనే ప్రజలు బయటకు వస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు చెట్ల కింద సేద తీరుతున్నారు. దీంతో మండల కేంద్రంలో రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారాయి.చెట్ల కింద సేద దీరుతున్న మూగ జీవాలుచున్నీలు కప్పుకొని వెళ్తున్న మహిళలు -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని కాటపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2001–02 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. 25 ఏళ్ల అనంతరం ఒకొరినొక్కరు కలిసి తమ బాల్యాన్ని తలుచుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనంతరం వారికి అక్షరాలు నేర్పిన గురువులను శాలువాతో సన్మానించారు. సర్పంచ్ దిడ్డి మోహన్రావు, ఉపాధ్యాయులు ఉపేందర్, బీడీ నాయక్, రాందాస్, ప్రభాకర్, పూర్వ విద్యార్థులు పులి శ్రీలత, తడక పద్మజ, అలివేలు మంగ, సుజాత, స్వప్న, కృష్ణ, శ్రీను, దుగ్గిరాల విజయభాస్కర్, బందెల తిరుపతి, గంగెల్లి విజయ్, పల్లెర్ల గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. -
వసతుల కల్పన భేష్..
పుష్కరాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులుచిట్యాల(కాశేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కల్పించిన వసతులు సంతృప్తిగా ఉన్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో బస్టాండ్కు చేరుకోగానే బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. సరస్వతీ ఘాట్ ఆరంభం నుండి గోదావరి నీటి ప్రాంతం వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం భక్తులకు ఎండ తీవ్రత కలుగకుండా నీడ కోసం పాండాలు ఏర్పాటు చేయడంతో పాటు, వేడి గాలుల నుండి ఉపశమనం పొందేందుకు స్ప్రీంకర్ల చిరుజల్లులతో చల్లని గాలి వస్తుంది. ప్రత్యేకాకర్షణగా బాహుబలి సెట్టింగ్.. సరస్వతీ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాహుబలి సెట్టింగ్ పుష్కరాలకు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. బాహుబలి సెట్టింగ్కు ముందు భాగంలో డయాస్లో సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అదే డయాస్ నుండి పుష్కర ప్రధాన అర్చకులు గోదావరికి హారతి అందించడం వంటి ఘట్టాలకు భక్తులు పులకరించిపోతున్నారు. పుష్కర స్నానం అనంతరం ఆలయ దర్శనానికి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూలైన్ ఏర్పాటు చేశారు. పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.ఏర్పాట్లు బాగున్నాయి..అంత్య పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం వేసిన టెంట్లు, స్ప్రింకర్లు, అన్నదానం, కూలర్లు, తదితర సదుపాయాలు కల్పించారు. అలాగే బస్టాండ్ నుండి పుష్కర ఘాట్ వరకు బస్సు సౌకర్యం చాలా సౌకర్యంగా ఉంది. ఘాట్కు చేరుకునేందుకు ఎండలో నడవడం తప్పింది. – సత్యనారాయణ, భక్తుడు, చంద్రాపూర్ శివయ్య సేవ కోసం వచ్చాం...దైవ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వెళ్తాం. అందులో భాగంగానే కాళేశ్వరంలో నిర్వహిస్తున్న అంత్య పుష్కరాలకు కొరుట్ల నుంచి 50మంది భక్తులం శివయ్య సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రత్యేకంగా సేవ కోసం వచ్చిన తమకు ఆలయ సిబ్బంది అందించిన సహకారం బాగుంది. – లక్ష్మీ, సేవకురాలు, కోరుట్ల -
పనులు పూర్తయ్యేదెన్నడో?
చీకుపల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న రహదారి పనులుఅసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీలువాజేడు: హైదరాబాద్, భూపాలపట్నం 163 నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండల పరిధిలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు గ్రామం వరకు ఉన్న 10 కిలో మీటర్ల జాతీయ రహదారి(డబుల్ రోడ్డు)ను ఫోర్వే లైన్గా విస్తరిస్తున్నారు. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట డ్రెయినేజీల నిర్మాణం చేపట్టినప్పటికీ ఎక్కడ పూర్తి కాలేదు. అదే విధంగా సర్వీస్ రోడ్డు పనులు సైతం కొనసాగుతున్నాయే తప్ప పూర్తి కావడం లేదు. రహదారి విస్తరణ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారోనని ప్రజలు వాపోతున్నారు. 10 కిలో మీటర్లు రూ.120 కోట్లు జగన్నాథపురం నుంచి చెరుకూరు గ్రామం వరకు నిర్మిస్తున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.120 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో 10 కిలో మీటర్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు జూన్ నెలాకరు లోగా పూర్తి అయ్యేలా కనిపించదం లేదు. రానున్న వర్షాకాలం వాగు అవతలి వైపున ఉన్న గ్రామాలతో పాటు అంతర్రాష్ట్ర రాక పోకలకు అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్ల గూడెం గ్రామాల మధ్యన ఉన్న ఇసుక వాగుపై బ్రిడ్జి నిర్మాణం అనివార్యమైంది. దీంతో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ గతంలో ఉన్న పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు. బ్రిడ్జి సమీపంలో మట్టితో రోడ్డు డైవెర్షన్ రోడ్డును వేసి బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను జూన్లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇసుక వాగు అవతలి వైపున ఉన్న సుమారు 20 గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలతో పాటు వ్యవసాయ సంబంధిత వస్తువులు, ఎరువులు, ని త్యావసర సరుకులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోదావరికి వరద వస్తే ఇసుక వాగు ద్వారా వచ్చిన వరద ఇక్కడ తాత్కాలికంగా ని ర్మిస్తున్న రహదారిని ముంచెత్తే అవకాశం ఉంది. అ దే సమయంలో భారీ వర్షాలు పడితే ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తది. దీంతో తాత్కాలికంగా వేసిన రహదారి కొట్టుకుపొయే అవకాశం ఉంది. బ్రిడ్జి నిర్మాణం వర్షాలు పడక ముందు పూర్తి కాక పోతే రాక పోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మండలంలోని సుమారు 20 గ్రామాలతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన రాక పోకలు నిలిచి పోతాయి. బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. నత్తనడకన జాతీయ రహదారి విస్తరణ పనులు ఇబ్బంది పడుతున్న వాహనదారులు -
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
ములుగు రూరల్: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పూర్తిగా తగ్గించాలని సీపీఐ జిల్లా నాయకులు అంజద్ పాషా అన్నారు. సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఆదివారం ట్రాలీ ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5పైన పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను సైతం పెంచడంతో నిత్యావసర ధరలు ఆకాశనంటుతున్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తేకుండా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికై నా పెంచిన ధరలు తగ్గించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, కొమురయ్య, బోడ రమేశ్, శ్రీను, ఓదెలు, మల్లేశ్, రవి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశాంతం
కేయూ క్యాంపస్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–26 ఆదివారం రెండు సెషన్లలో ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని ట్రైసిటీలో ఏర్పాటు చేసిన పది పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించా రు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళా శాల పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఆరుగురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకు మొత్తం అభ్యర్థులు 4,075 మంది అభ్యర్థులగాను 2,762 మంది (67.78 శాతం) హాజరయ్యారు. 1,313 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధి కారులు తెలిపారు. రెండో సెషన్ను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. రెండో సెషన్లో 2,749 మంది అభ్యర్థులు(67.49 శాతం) హాజరుకాగా 1,326 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల తనిఖీ.. హనుమకొండలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, హ నుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ము లుగు రోడ్డులోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశా ల, ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్ ఎల్బీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. యూపీఎస్సీ సెంట్రల్ ఇన్స్పెక్షన్ అ ధికారి శుభం గౌడ్, రాష్ట్రస్థాయి అబ్జర్వర్ టీజీఎన్పీ డీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, రూట్ అధికారులు, త హసీల్దారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. నిమిషం ఆలస్యంతో పరీక్ష కోల్పోయిన ఆరుగురు మొదటి సెషన్కు 67.78 శాతం.. రెండో సెషన్లో 67.49 శాతం అభ్యర్థులు హాజరు -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివా రం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వ యంభు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. హేమాచలక్షేత్రం ఆలయ పరిసరాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో పాటు సహజసిద్ధమైన జలపాతాలు ఉండటంతో మండు వేసవిలో భక్తులకు చల్లని ఆహ్లాదాన్ని పంచుతోంది. వివిధ వాహనాల్లో గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
న్యాయం చేయాలని ఆందోళన
శాయంపేట : మండలంలోని కొత్తగుట్ట సింగారం గ్రామానికి చెందిన కుక్కల సారయ్య (75) గ్రామ శివారులోని పున్నం మల్లారెడ్డి ఆయిల్పాం తోటలో శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం బాధిత కుటుంబ సభ్యులు, బందువులు గూడెప్పాడ్–పరకాల రహదారిపై ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాహనాలు బారీగా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారుతో మాట్లాడారు. ఫిర్యాదు ఇస్తే బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సీఐ సుధాకర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం పోలీసులు సారయ్య మృతదేహానికి పరకాల సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మృతుడి భార్య కుక్కల మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అల్ట్రా మారథాన్ విజయవంతం
ములుగు రూరల్: జిల్లాలోని యువతలో ఆరోగ్యకర జీవన శైలి, ఫిట్నెస్పై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా 50కిలో మీటర్ల అల్ట్రా మారథాన్ ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. మారఽథాన్ రన్నర్ నిఖికుమార్ తన స్వగ్రామం రాయినిగూడెంలో ఆదివారం తెల్లవారుజామున 2.30గంటలకు పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సునీత గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ రన్ రాయినిగూడెం నుంచి జంగాలపల్లి, వెంకటాపురం(ఎం), రామప్ప, బండారుపల్లి మీదుగా ములుగు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నిఖికుమార్ను సీఐ సురేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతనిప్పుల భిక్షపతి, కౌన్సిలర్ ఓం ప్రకాశ్ తదితరులు శాలువా కప్పి అభినందించారు. 108తో అత్యవసర సేవలు భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా 326మందికి 108 అంబులెన్స్ సేవల ద్వారా తరలించినట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. రోగులకు అంబులెన్స్లోనే ప్రీ–హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తూ సమీప ఆస్పత్రులకు సురక్షితంగా తరలిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వడదెబ్బకు గురవుతున్నారని వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలు, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు తీవ్రమైన ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అరటి తోట దగ్ధం టేకుమట్ల: పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో చెలరేగిన మంటలు అంటుకుని అరటి తోట దగ్ధమైన ఘటన మండలంలోని పంగిడిపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత రైతు పారిపెల్లి మహేందర్ కథనం ప్రకారం.. తనకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిలో అరటితోట సాగు చేశాడు. రెండు రోజుల్లో అరటి గెలలను కోసేందుకు సిద్ధమయ్యాడు. ఈ తరుణంలో పరిసర ప్రాంత రైతులు పంట వ్యర్థాలకు అంటించిన నిప్పుతో మంటలు చెలరేగి అరటి తోట మొత్తం దగ్ధమైంది. అరటి తోటపై పెట్టుకున్న ఆశలు అగ్ని రూపంలో ఆవిరయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా దగ్ధమైందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పామాయిల్ తోట దగ్ధం భూపాలపల్లి రూరల్: అగ్ని ప్రమాదంలో పామాయిల్తోట దగ్ధమైన ఘటన భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గొర్లవీడు గ్రామానికి చెందిన చెలిమెల రాజయ్యకు చెందిన సుమారు రెండెకరాల పామాయిల్, సుబాబు తోట ఆదివారం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో విద్యుత్ మోటర్ వైర్లు, డ్రిప్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రికార్డుల తనిఖీ భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని హనుమాన్ దేవాలయంతో పాటు భూపాలపల్లి మండలంలోని కొంపల్లి, ఫుల్లురామయ్యపల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లోని దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యానికి సంబంధించి సోషల్ ఆడిట్లో భాగంగా దేవాదాయ శాఖ అధికారి వరలక్ష్మి ఆదివారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాల వివరాలు పరిశీలించారు. ఆలయాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు సేకరించారు. పుజారులు ఆలయాల్లోని సమస్యలను అధికారి వరలక్ష్మికి వివరించారు. -
బాధిత కుటుంబాలకు పరామర్శ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన బాల్య నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15వేలు నగదును అందజేశారు. వార్డు సభ్యుడు కొండాయి చిన్ని, చంద్రబాబు, తాడూరి రఘు, మోహన్, శ్రీను, పృద్విరాజ్, హరిబాబు, శ్రీనివాస్, వెంకటస్వామి, మొగిళి పాల్గొన్నారు. 6వ వార్డులో.. మండలంలోని 6వ వార్డుకు చెందిన మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ మాదరి రామయ్య తల్లి లక్ష్మీ ఇటీవల మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు నాయకులతో కలిసి పరామర్శించారు. -
న్యాయ కళాశాల సాధనే లక్ష్యం
వాజేడు: న్యాయ కళాశాల సాధనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆదివారం జీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన న్యాయ కళాశాల సాధన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ యువత చట్టాలు, జీఓలపై అవగాహన కలిగి ఉండాలంటే న్యాయ కళాశాల ఏర్పాటు అవసరమన్నారు. సొంది వీరయ్య ఆధ్వర్యంలో జీఎస్పీ చేసిన అనేక పోరాటాల ఫలితంగా జీవో నంబర్ 3 వచ్చిందని గుర్తు చేశారు. దీని కారణంగా ఏజెన్సీలో 100శాతం ఉద్యోగాలు ఆది వాసీలకే వచ్చాయన్నారు. నేడు అలాంటి జీవోను గిరిజనేతరుల కుట్రలతో కోల్పోయామని ఆరోపించారు. 1/70 చట్టాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా అమలు చేయకుండా ప్రభుత్వాలు ఆదివాసీలపై దండయాత్ర చేస్తున్నట్లు విమర్శించారు. ఏజెన్సీలో 100 శాతం రిజర్వేషన్లను కోల్పోకుండా కాపాడుకోవాలంటే భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఏజెన్సీ చట్టాలు, జీవోలను పరిరక్షించుకునే అవకాశం ఆదివాసీ యువతకు ఉంటుందన్నారు. అనంతరం పలు సంఘాల నాయకులు న్యాయ కళాశాల ఏర్పాటు, ఆదివాసీల హక్కులు, చట్టాలు, జీఓలపై మాట్లాడారు. అనంతరం గోండ్వానా సంక్షేమ పరిషత్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సదస్సులో జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెంసాయి, ముర్రం వీరభద్రం, ఏఎన్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు నర్సిమూర్తి, నాగరాజు, పూసూరు సర్పంచ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ


