Mulugu District Latest News
-
ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి
వెంకటాపురం(ఎం): ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో నిర్మిస్తున్న రామాలయానికి సోమవారం మంత్రి సీతక్క భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా మండల కేంద్రంలో నిర్మించిన పెద్దమ్మగుడిని సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బొమ్మకంటి వంశావతిరమేశ్, మామిడిశెట్టి సుగుణస్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, నాయకులు భగవాన్రెడ్డి, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనంఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం ములుగు: జిల్లాలో సోమవారం నుంచి ఓపెన్ టెన్త్(టాస్) పరీక్షలు ప్రారంభమైనట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. తొలిరోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 772 మంది విద్యార్థులకు గాను 633 మంది హాజరయ్యారు. 139 మంది గైర్హాజర్ అయినట్లు వివరించారు. ఇంటర్మీడియట్లో 967 మందికి 817 మంది విద్యార్థులు హాజరు కాగా 150 గైర్హాజర్ అయినట్లు వెల్లడించారు. జిల్లాలోని 10 కేంద్రాలలో టాస్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బసవేశ్వరుడి జయంతి వేడుకలు ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కొమురయ్య తెలిపారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సిబ్బంది మొగిలి, సరిత, మానస, రేణుక, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలపై దాడులు ఆపాలని వినతి ములుగు రూరల్: జిల్లాలో ఉన్న వలస ఆదివాసీల గూడేలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు సీపీఎం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గూడేలపై ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తక్షణమే అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలిములుగు రూరల్: వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలను రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు భీరెడ్డి సాంబశివ మాట్లాడారు. గతేడాది వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులకు నష్ట పరిహారం ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, తుమ్మల వెంకటరెడ్డి, గపూర్ పాషా, సాంబశివరావు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. వాహనాలు సీజ్ వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఇప్పగూడెం ఇసుక ర్యాంప్ వద్ద అనుమతులు లేకుండా పనులు నిర్వహిస్తున్న రెండు ఎస్కలేటర్లు, ఒక ట్రాక్టర్ను టీఎండీసీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టీఎండీసీ పీఓ రాజు కథనం ప్రకారం.. ఇప్పగూడెం ఇసుక ర్యాంప్లో అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని గ్రామస్తులు గిరిజన దర్బార్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇసుక ర్యాంప్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని టీఎండీసీ అధికారులను ఆదేశించారని తెలిపారు. దీంతో అధికారులు అక్కడకు చేరుకుని అనుమతులు లేకుండా పనులు చేస్తున్న రెండు ఎస్కలేటర్లు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఆర్వో కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు. సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష.. మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రతిపక్షాలపై నిప్పులు.. అభివృద్ధి, సంక్షేమానికి హామీ.. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్అండ్టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగాకుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నా భర్తకు వేతనం రావడం లేదు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కాంటిజెంట్ వర్కర్గా పనిచేస్తున్న నా భర్త ప్రసాద్కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను విధులకు హాజరవుతున్నాను. 2020 నుంచి వేతనం రావడం లేదు. అధికారులు, పీఓలు మారుతున్నా వేతనం రాక ఇబ్బందులు పడుతున్నాం. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి పెండింగ్ వేతనాలు వచ్చేలా చూడాలి. – ఆలం రామలక్ష్మి, మేడారం, ఎస్ఎస్తాడ్వాయివెంకటాపురం(కె) మండలంలోని అలుబాక పంచాయతీ పరిధి ముత్తారం గ్రామస్తులతో కలిసి ఇసుక క్వారీ సొసైటీని ఏర్పాటు చేశారని కుర్సం ముత్తయ్య, బాడిష కన్నయ్య, మడ సుజాత, బాడిష స్వప్నలు కలెక్టర్కు విన్నవించారు. ముత్తారంలో సొసైటీ ఏర్పాటు చేసి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు జమ ఖర్చు చెప్పడం లేదు. పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ను సొసైటీ విషయం ఏది అడిగిన ఇవ్వడం లేదు. సొసైటీ పేరు కూడా చెప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మూడు మార్లు రూ.4 లక్షల క్యూబిక్మీటర్ల ఇసుక బయటకు రవాణా చేసినప్పటికీ వాటి కమీషన్ తమకు ఇవ్వకుండా అధికారులు, సొసైటీ సభ్యులు మింగి కూర్చుంటున్నారని తెలిపారు. గ్రామంలోని గిరిజన కుటుంబాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా సొసైటీ సభ్యులు సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా పాత సొసైటీని రద్దు చేసి కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని ముత్తారం గ్రామస్తులు కోరారు. ●దరఖాస్తుల ఆహ్వానం ములుగు రూరల్: జాకారం గురుకుల పాఠశాలలో 2026–27లో ప్రవేశానికి అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అనిత అన్నారు. వచ్చే నెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. సీట్ల ఎంపిక లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుందని వివరించారు. ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు ఎన్డీఎస్ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన -
వయోవృద్ధులకు హెల్త్ క్యాంప్
ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్లో వయోవృద్ధులకు సోమవారం హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత తెలిపారు. రాయినిగూడెం పీహెచ్సీ డాక్టర్ నందకిశోర్, డాక్టర్ దీపిక తమ సిబ్బందితో కలిసి డే కేర్ సెంటర్లోని వయోవృద్ధులకు హెల్త్ చెకప్ నిర్వహించినట్లు వెల్లడించారు. బీపీ, షుగర్ టెస్టులు చేసి థైరాయిడ్తో పాటు అన్ని రకాల టెస్టుల కోసం బ్లడ్ శాంపిల్ తీసుకున్నట్లు వివరించారు. ఈ క్యాంపులో సుమారు 35 మంది వయోవృద్ధులు హెల్త్ చెకప్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సహాయకులు నాగేంద్ర, ప్రాణమ్ డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ చుంచు రమేశ్, రాయినిగూడెం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వినతులు పరిష్కరించండి
ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలు ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన మాదారపు లక్ష్మి. ఈమె భర్త ఐదేళ్ల క్రితం మరణించాడు. అయితే తన భర్త మీద ఉన్న పింఛన్ తన పేరు మీదకు మార్పించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయం వెళ్లగా ఆమె ఆధార్కార్డు ఆన్లైన్లో నమోదు చేయగా మరణించినట్లు రికార్డులో ఉండడం గమనార్హం. అయితే ఆ కార్యాయంలో పనిచేసే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని పలువురు అధి కారులు చెప్పినప్పటికీ దానిని సరిచేయడం లేదు. దీంతో ఆమె కలెక్టర్కు ప్రజావాణిలో విన తి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకుంటుంది.ఏటూరునాగారం: గిరివాణి, ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ, కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరివాణి, ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అర్జీదారుల సమస్యలు విని వినతులు స్వీకరించారు. ఈ క్రమంలో గిరివాణిలో 96 దరఖాస్తులు రాగా ప్రజావాణిలో 26 దరఖాస్తులను బాధితులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్కు చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంకటాపురం(కె) మండలం ఎదిర గ్రామ సమీపంలోని యాకన్నగూడెంలో ప్రభుత్వం నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసింది కానీ ఎలాంటి భవనం నిర్మించలేదని తక్షణమే నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమ్, క్యాంపస్ పరిసరాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను వెంటనే అందించాలని స్పష్టం చేశారు. వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏపీవో వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్, డీడీ జనార్దన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ దివాకర ఆదేశాలు గిరివాణిలో 96, ప్రజావాణిలో 26 అర్జీల రాక బాధితుల సమస్యలు విని వినతులు స్వీకరించిన కలెక్టర్ -
సొంతూరుకు దామోదర్..
ఎస్ఎస్ తాడ్వాయి : కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ 28 ఏళ్ల తర్వాత మంగళవారం తన స్వగ్రామం కాల్వపల్లిలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చిన దామోదర్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు దామోదర్ను కలిసి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. దామోదర్ అజ్ఞాతంలోకి వెళ్లి చాలా ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. 28 ఏళ్ల తర్వాత వచ్చిన దామోదర్ను చూసిన కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. దామోదర్ వస్తున్న విషయాన్ని తెలుసుకొని కాల్వ పల్లి చుట్టూ పక్కల గ్రామాలు నార్లాపూర్, కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, కొత్తూరు, వెంగళాపూర్, పడిగాపూర్ గ్రామస్తులు కాల్వపల్లికి భారీగా తరలొచ్చారు. తనకు తెలిసిన ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు, తన చిన్ననాటి స్నేహితులను, తనతో పాటు చదువుకున్న తోటి విద్యార్థులను దామోదర్ ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా దామోదర్ను కలిసి ముచ్చటించారు. దామోదర్కు ఘనసన్మానం సాయుధ పోరాటం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దామోదర్ను గ్రామస్తులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. 28 ఏళ్ల అడవి బాట వీడి గ్రామస్తులను కలవడం ఆనందంగా ఉందని దామోదర్ పేర్కొన్నారు. తన జీవితాన్ని ప్రజల సేవ కోసం అంకితం చేస్తానని తెలిపారు. చిన్ననాటి మిత్రులతో ముచ్చట్లు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు -
సమస్యలు పరిష్కరించడం ఎలా..
గ్రామపంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు గత రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. గత డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినప్పటికి ఎంపీటీసీ ఎన్నికలు మే నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ స్పష్టత లేదు. ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తేనే మండలాల్లో మండల సభలు నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. ఎంపీటీసీ సభ్యులు లేకపోతే మండల సభలు నిర్వహించేందుకు వీలు లేదు. దీంతో సర్పంచ్లు గ్రామ పంచాయతీల్లోనే గ్రామసభలు నిర్వహించుకుంటున్నప్పటికీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి సర్పంచ్లకు నెలకొంది. మండల సభకు మాత్రమే అధికారులు హాజరవుతారే తప్ప గ్రామసభలకు అధికారులు హాజరయ్యే పరిస్థితి ఉండదు. మండలస్థాయి అధికారులతో తమ గ్రామ సమస్యలు చెప్పుకునేలా ఉన్నతాధికారులు స్పందించి మండల సభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్లు కోరుతున్నారు. -
వనదేవతలకు ప్రత్యేక పూజలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కుటుంబ సమేతంగా అమ్మవార్లను మంగళవారం దర్శించుకున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద ఎస్పీ మొక్కులు చెల్లించి గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ సంప్రదాయంగా దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజారులు ఎస్పీ దంపతులను అమ్మవారి కండువాతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ మధు, రికార్డు అసిస్టెంట్ వీరన్న, సారలమ్మ పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ పాల్గొన్నారు. -
హాష్ ఆయిల్ స్మగ్లింగ్.. నలుగురి అరెస్ట్
వరంగల్ క్రైం: హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ప్రకటించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. నిందితులు ఒడిషా రాష్ట్ర మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను, రేకపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఏపీలోని అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబును అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముంబైకి వెళ్లేందుకు కోణార్క్ రైలు ఎక్కి.. ఈముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్ను సేకరించినట్లు ఆయన తెలిపారు. 20 కిలోల హాష్ ఆయిల్ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోల హాష్ ఆయిల్ను కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు. నిందితులు ఐదు కిలోల చొప్పున హాష్ ఆయిల్ను తీసుకుని ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19న అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఈనెల 20న దిగి 21న ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.2.50 కోట్ల విలువైన 20కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసీపీలు జితేందర్రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ వై.సతీష్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షూకూర్, ఎస్సైలు సందీప్, తేజ ఆర్ఎస్సైలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, క్యాట్పార్టీ లింగారావు, ఏఆర్ఏ ఎస్సైలు సుబ్బిరామి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల రాజు,శ్రీరాములు, ఇంతేజార్గంజ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. రూ.2.50 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
ఆర్టీసీలో సమ్మె సైరన్
● నేటి నుంచి వరంగల్ రీజియన్ వ్యాప్తంగా నిలిచిపోనున్న బస్సులు ● ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులుహన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి వరంగల్ రీజియన్లోని 8 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 1,036 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 596 సంస్థ బస్సులు, 325 ప్రైవేట్ అద్దె బస్సులు, 115 విద్యుత్ బస్సులు ఉన్నాయి. మొత్తం 986 షెడ్యూల్స్ నడుస్తున్నాయి. రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరిగి 4.16 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తూ రూ.2.06 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. సంస్థకు చెందిన 1,123 మంది డ్రైవర్లు, 1,436 మంది కండక్టర్లు సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 140 మంది డ్రైవర్లు, 286 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా సంస్థ ఉద్యోగులైన 368 మెకానిక్లు, 250 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది 60 మంది, సెక్యూరిటీ సిబ్బంది 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఔట్ సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న 140 మంది డ్రైవర్లు, 286 మంది డ్రైవర్లు మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 104 మంది మెకానిక్లు, కార్యాలయ స్టాఫ్ 38 మంది. సెక్యూరిటీ 36 మంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశలున్నాయి. వీరితో బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో 325 ప్రైవేట్ అద్దె బస్సులున్నాయి. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ అద్దె బస్సులు తిప్పడంతో పాటు, సంస్థ బస్సులను తిప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉన్నంతలో కనీసం ప్రధాన రూట్లలో బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిపో ఆర్టీసీ అద్దె హనుమకొండ 100 52 వరంగల్–1 105 41 వరంగల్–2 115 (ఈవీ) 44 జనగామ 83 39 నర్సంపేట 65 35 మహబూబాబాద్ 57 24 పరకాల 63 23 తొర్రూరు 57 43 భూపాలపల్లి 66 24సంస్థ పరిరక్షణ ముఖ్యం ఆర్టీసీ కార్మికులుగా సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాం. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ కోసమే సమ్మెకు వెళ్తున్నాం. విద్యుత్ బస్సులు తీసుకువచ్చి సంస్థను ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులు ఇవ్వాలి. యాజమాన్యం, ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. యూనియన్ రీజియన్ సెక్రటరీ డిమాండ్లు పరిష్కరించాలి..సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెకు ఒక రోజు ముందు చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. ముందుగా డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలి. ఎరియర్స్ ఇవ్వాలి. పని గంటలు తగ్గించాలి. ఔట్ సోర్సింగ్ విధానం తగ్గించి సంస్థ నియామకాలు చేపట్టాలి. – సీహెచ్.రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
వేదికేది
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మండల సభల నిర్వహణ లేక సర్పంచ్ల ఆవేదనములుగు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు గ్రామ సర్పంచ్లు కృషి చేయాల్సి ఉంటుంది. నాలుగు నెలల క్రితం కొత్తగా ఎన్నికై న సర్పంచులకు గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లడానికి సరైన వేదిక దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో మండల పరిషత్ పాలకవర్గాలకు మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. మండల సభలలో తమ గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు సర్పంచ్లు కృషి చేసేవారు. ఈ సభల నిర్వహణతో అధికారులు, సర్పంచులకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. గత రెండేళ్లుగా ఎంపీటీసీలు లేకపోవడంతో మండల సభలు ముందుకుసాగడం లేదు. గత డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో మంగపేట మండలం మినహా జిల్లాలోని 9 మండలాల పరిధిలో 146 పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు తమ గ్రామ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలో అర్ధంకాక అయోమయానికి గురవుతున్నారు. గతంలో మూడు నెలలకోసారి సభలు మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ఉండి ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్లు హాజరయ్యేవారు. ఎమ్మెల్యే, ఎంపీతో పాటు డివిజన్ స్థాయి అధికారులు సైతం హాజరయ్యేవారు. మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమశాఖ తరఫున చేపడుతున్న అభివృద్ధి పనులు వివరించేందుకు మూడు నెలల ప్రగతి నివేదికతో సమావేశానికి వచ్చేవారు. ఈ సమావేశంలో వ్యవసాయ, విద్య, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్ధక, అటవీశాఖ, రెవెన్యూ శాఖతో పాటు 23 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి ప్రజాప్రతినిధులకు వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారీగా అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రజాప్రతినిదులు లేవనెత్తిన సమస్యలపై అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. దీంతో ప్రజాప్రతినిదులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ మండలాభివృద్దికి తోడ్పాటునందించేవారు. సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియని అయోమయం గతంలో మూడు నెలలకోసారి నిర్వహణ ఎంపీటీసీలు లేకపోవడంతో కొనసాగని సభలు -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మంగపేట: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మల్లూరు జీపీ, మంగపేట పీహెచ్సీ ఆవరణలో మంగళవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలాన్ని 6 జోన్లుగా విభజించి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామని హామీనిచ్చారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలు తెలిపిన సమస్యలను రెండున్నర గంటల పాటు సీతక్క ఓపికగా వింటూ వినతులు స్వీకరించారు. మండల కేంద్రంలో వారాంతపు సంత, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, నూతన బస్టాండ్ ప్రారంభోత్సవంతో పాటు ప్రతీ గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మల్లూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడారు. పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల విడుదల చేసిన టైడ్, అన్టైడ్ నిధులను నిబంధనల ప్రకారం గ్రామసభల ద్వారా ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రజలకు తాగునీరు. వీధిలైట్లు, తాగునీటి లీకేజీ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమానికి ముందుగా మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీ, వివిద శాఖల అధికారులతో కలిసి మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో ఈనెల 27 నుంచి మే 6 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం బోరునర్సాపురంలో రూ.2 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణం పనులకు సీతక్క శంకుస్థాపన చేశారు. అలాగే సండ్రోని ఒర్రె అటవి ప్రాంతంలోని శాంతినగర్ గొత్తికోయగూడెంలోని గిరిజనులతో కలిసి మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి భోజనం చేశారు. గిరిజనులు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా నీటి సంప్ను మంత్రి ప్రారంభించారు. మూడేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం, బాలామృతం, ఫ్రీప్రైమరీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, హేమాచల క్షేత్రం ఈఓ వీరస్వామి, డీసీసీ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు వల్లిపల్లి శివప్రసాద్ గుమ్మడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల పరిశీలన
ఏటూరునాగారం: మండల పరిధిలోని అల్లంవారిఘణపురం పరిధిలో గల గుర్రాలబావి అటవీ ప్రాంతం ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములను ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. రెండు వారాల క్రితం గిరిజనదర్బార్లో కలెక్టర్ దివాకరకు అల్లంవారిఘణపురంలోని గుర్రాలబావి దగ్గర ఉన్న రైతులు కాపుల సమ్మయ్య, రెడ్డి శంకరయ్య, ఆర్కె సమ్మయ్యలు మొరపెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ ఎస్డీసీ గ్రామాన్ని, భూములను పరిశీలించారు. పట్టా భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీశారని రైతులు గోడు వెలిబుచ్చారు. భూ రికార్డులు రైతుల వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు రైతులు మాట్లాడుతూ మా భూములు మాకు ఇప్పించాలని వేడుకున్నారు. సాగు చేసుకొని బతికేవాళ్లమని, దీనిలో కందకాలు తీయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు ఉన్న అటవీ హక్కు పత్రాలు(ఆర్ఓఎఫ్ఆర్) , భూములు వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. ఆయన వెంట తహసీల్దార్ జగదీశ్, సిబ్బంది, గిరిజన రైతులు పాల్గొన్నారు. -
స్వీయ నియంత్రణ తప్పనిసరి
ములుగు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం మండలపరిధిలోని ఇంచర్ల గ్రామ శివారులోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం చేపట్టిందని అన్నారు. వాహనాలు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా సీట్బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేయటంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణహాని తప్పదని హెచ్చరించారు. పోలీస్ శాఖ వాహన తనిఖీలు చేసేది కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని అన్నారు. ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -
మండే ఎండ.. ఠండా ఠండా!
● జూపార్కులో చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, చలువ పందిళ్ల ఏర్పాటు ● ఉష్ణోగ్రతలు పెరగకుండా అధికారుల ఏర్పాట్లు న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్క్లోజర్లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
నేడు ఐటీడీఏలో గిరివాణి
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నేడు (సోమవారం) గిరివాణి, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ, కలెక్టర్ దివాకర టీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏకు చేరుకొని వారి వినతులు సమర్పించాలని కోరారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలిన్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడుతూ.. సమ్మర్క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధి కారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అద్దె బస్సుల స్కీం కొనసాగించాలిహన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు. హనుమకొండ హంటర్రోడ్డులోని అభిరాం గార్డెన్స్లో ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్మెంట్ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు బాలవర్ధన్రెడ్డి, ఎన్.ప్రసాద్, హబీబ్, జె.వెంకట్రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్, జి.వెంకన్న, కె.భాస్కర్రెడ్డి, కుమార్, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు. నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జేబీఎం ఎలక్ట్రిక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉండి మోడీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసినా పట్టించుకోని పక్షంలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రవాణా కమిషనర్ చర్చలకు పిలిచిన యాజమాన్యం, ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదన్నారు. అధిక పని భారమైనప్పటికీ మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
సీఎం సార్.. హామీలు నెరవేర్చరూ..
సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందేదెప్పుడు భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పలు హామీలు అమలుకు నోచుకోలేదు. వీటికి తోడు జిల్లాలో పెండింగ్ సమస్యలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పెండింగ్ సమస్యలు, ఇచ్చిన హామీల అమలుకు నిధుల కేటాయింపుపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ జిల్లా ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు లేకపోవడంతో చిన్నచిన్న రోగాలకు సైతం ఎంజీఎం, వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ● జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మున్సిపాలిటీ దినదినం అభివృద్ధి చెందుతుంది. గత ప్రభు త్వ హయాంలో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. సుమారు లక్షకు పైగా జ నాభా ఉన్న ఈ పట్టణాన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ● గత ప్రభుత్వాలు జిల్లాలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ 1ను ప్రైవేట్ కాంట్రాక్టరుకు అప్పగించగా, ప్రాజెక్ట్ 2ను సింగరేణి సంస్థకే అప్పగించి పనులు చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ● సింగరేణి బొగ్గు, గోదావరి జలాలు, కేటీపీపీ పరిశ్రమ ఉన్న ఈ జిల్లాలో ఇంజనీరింగ్, మైనింగ్ కళాశాల, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వమైన పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.జిల్లా కేంద్రం అనంతరం కాటారం రెవెన్యూ డివిజన్ అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. కాటారం, సమీపంలోని నస్తూర్పల్లి, మద్దులపల్లి, చిదినెపల్లి, పోతులవాయి, ఇబ్రహింపల్లి, బయ్యారం గ్రామాలను కలిపి కాటారాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న గణపురం మండలం చెల్పూరు పరిధిలోని సింగరేణి వేయి క్వార్టర్ల సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరాల జల్లులు కురిపించారు. కొందరు వ్యక్తులు సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోర్డును రద్దు చేసేది లేదని, కారుణ్య నియామకాలను కొనసాగిస్తామని ప్రకటించారు. 217 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా కారుణ్య నియామకాలు అంతంత మాత్రంగానే జరుగుతుండగా, డిస్మిస్డ్ కార్మికుల ఊసే లేదు. భూపాలపల్లి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 500 కోట్లు కేంద్రం కేటాయించిందని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు. ఇప్పటి వరకు కనీసం భూసేకరణ పనులు కూడా ప్రారంభం కాలేదు. సాధారణ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. సింగరేణి సంస్థలో మారు పేర్లను సవరిస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బైపాస్ రోడ్డు పనుల ప్రారంభమెప్పుడో సింగరేణిలో కారుణ్య నియామకాలు కలేనా..? 217 మంది డిస్మిస్డ్ కార్మికుల పరిస్థితేంటి నేడు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన -
నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్
భూపాలపల్లి/కాళేశ్వరం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం హెలిపాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మూడు చోట్ల హెలిపాడ్ల ఏర్పాటు.. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్పల్లిలోని గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు. జనసమీకరణ.. కాటారం సబ్డివిజన్తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్ వరకు ఉన్న ఎన్హెచ్ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్థానిక సీఐ నరేష్శ్మార్ ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్నగర్ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కాటారం మండలం నస్తుర్పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20వ పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు. -
హేమాచలుడి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి హరినాధ్ దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో ఆలయ పూజారులు రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్ వారి పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సూర్యచంద్రకళ, అడిషనల్ జడ్జి డి.మధులిక తేజ, ఎస్సై టీవీఆర్ సూరి పాల్గొన్నారు. ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు వెంకటాపురం(కె): మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవి కాలంలో ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మొర్రవానిగూడెంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ పర్శిక శ్రీలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఈ ఉమారావు మాట్లాడుతూ గ్రామాల్లో మీటర్ లేనివారు పీఎం జుగా స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉచిత మీటర్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్దాస్, లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, అసిస్టెంట్ లైన్మెన్ ఫరీద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి క్వాలిటీ కంట్రోల్ విభాగం నూతన కమిటీభూపాలపల్లి అర్బన్: సింగరేణి క్వాలిటీ కంట్రోల్ విభాగం నూతన కమిటీని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఫిట్ సెక్రటరీగా ధారపోషం, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా కార్తీక్తోపాటు షిఫ్ట్ ఇన్చార్జ్లుగా ఇ.శ్రీనివాస్, మధు, జి.శ్రీనివాస్, ఎం.రవికృష్ణ, కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం స్థానిక కొమురయ్య భవన్లో క్వాలిటీ విభాగంలో పనిచేస్తున్న శాంపిల్ మజ్దూర్ కార్మికులను ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, నాయకులు సుధాకర్రెడ్డి, జి. శ్రీనివాస్, ఎండీ ఆసిఫ్ పాషా, రామచందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఇన్చార్జ్ నూకల చంద్రమౌళి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలనమల్హర్(కాటారం): మండలంలోని కాటారం సన్తూర్పల్లిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతాలు, సభావేదికను సమగ్రంగా తనిఖీ చేశారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహనాల నిలుపుదల సౌకర్యాన్ని విస్తరించాలని సూచించారు. హెలిపాడ్ ప్రదేశంలో దుమ్ము ఎగరకుండా నీరు చల్లడంతో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్అండ్బీ ఈఈ రమేష్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి
● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి 26వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులం, విద్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్యా విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. వసతి గృహాలలో మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారం నిర్వహించే సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. శానిటేషన్ సమస్యలను పరిష్కరి స్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 62 శాతం రైతుల రిజిస్ట్రీ పురోగతి సాధించామని, మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేస్తామన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో కార్యక్రమాలు పూర్తి చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రామప్పలో ఎన్ఎస్జీ అధికారులు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం ఎన్ఎస్జీ, ఆక్టోపస్ అధికారులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. రామప్ప గార్డెన్ ఆవరణలో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కేంద్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయికృష్ణ, సీఏ అజిత్, తహసీల్దార్ గిరిబాబు, ఆర్ఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మే మాసంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి
778సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వేళయ్యింది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శనివారం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలోనే ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారయంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం.. ‘పరిషత్’ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీలోపే ఓటర్ల జాబితా... 2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీ చేసిన అదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలను రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధ్రువీకరణ అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలున్నట్లు గమనిస్తే, వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23వ లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్లు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. ‘పరిషత్’లో ‘ఆమె’కే ప్రాధాన్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పరుషులు 14,89,606 కాగా, మహిళ ఓటర్లు 15,51,289 మంది ఉన్నారు. ఇతరు(థర్డ్జండర్)లు 504 కాగా, సర్వీసు ఓటర్లు 2141. ఆరు జిల్లా ప్రజా పరిషత్లు ఉండగా ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామలు ఎస్సీ మహిళలకు కేటాయించారు. అదే విధంగా 75 జెడ్పీటీసీలకు గాను 38, 39 ఎంపీపీ స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. అలాగే 778 ఎంపీటీసీ స్థానాల్లో 399 చోట్ల మహిళలకే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో ‘స్థానిక’ వివరాలు ఇలా... జెడ్పీపీపీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం ముసాయిదా జాబితాపై అధికారుల కసరత్తు రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... మహిళలకు భారీగా అవకాశాలు మొత్తం జిల్లాలు 06ప్రయత్నాలు మొదలెట్టిన ఆశావహులు.. 7506ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ‘పరిషత్’ సందడి మొదలైంది. వాస్తవానికి 2025 సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావహులు కొందరు సరిపెట్టుకోగా.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల్లో సందడి మొదలైంది. మే మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసే పనిలో పడ్డారు. -
రామప్పలో ఫొటో ఎగ్జిబిషన్
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామప్ప దేవాలయంలో కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ గిరిబాబు హాజరై ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయి కృష్ణ, సీనియర్ సీఏ అజిత్లు మాట్లాడారు. దేశంలో మూడు వేలకు పైగా కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తున్నామన్నారు. ఇందులో 43 యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాలు, వాటి చరిత్ర తెలిపే విధంగా ఫొటో ఎగ్జిబిషన్ను రామప్పలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కట్టడాలను సంరక్షించడంలో బాధ్య త వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు రమేశ్, సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ రాజు, కేంద్ర పురావస్తు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
భానుడి భగభగ
జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలుచల్వాయి రోడ్డుపై కనిపించని జనం నిర్మానుష్యంగా మారిన 163 జాతీయ రహదారిగోవిందరావుపేట: భానుడు భగభగ మండిపోతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో శనివారం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అయ్యాయి. మంగపేట మండల పరిధిలోని మల్లూరులో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదు కాగా ములుగులో అత్యల్పంగా 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మండలాల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉండటం గమనార్హం. నిర్మానుష్యంగా రహదారులు ఉదయం 9 గంటలకే భానుడు మండిపోతున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయానికి ప్రధాన రహదారులు, మార్కెట్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారు తప్పా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. చిన్నచిన్న వ్యాపార సముదాయాలు, టీ స్టాళ్లు, తినుబండరాల దుకాణాలు, బట్టల షాపులు కష్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. సాయంత్రం 5గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. వడదెబ్బతో ప్రాణాపాయం అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ(హీట్ స్ట్రోక్) బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అధికంగా ఎండ ఉన్న సమయంలో ఎక్కువసేపు బయట తిరగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు ఆకస్మాత్తుగా పెరిగి వడదెబ్బకు గురై ప్రాణాపాయ స్థితి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు., బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తలనొప్పి, వాంతులు, తలతిరగడం, అధిక దాహం, శరీరం బలహీనత వంటి లక్షణాలు కనిసిప్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణ పొందాలంటే మాధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తరచూ నీరు తాగ డం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలి.. తలకు టవల్ లేదా టోపి ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలిజిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగడం ప్రమాదకరం. శరీరంలో నీరు తగ్గిపోకుండా తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవాలి, తలకు టవల్ లేదా టోపి ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వేళ్లేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్ను సంప్రదించాలి. – గోపాల్రావు, జిల్లా వైద్యాధికారి మల్లూరులో అత్యధికంగా 43.5డిగ్రీల సెల్సియస్ నమోదు బయటకు రావాలంటేనే జంకుతున్న ప్రజలు నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు రక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ములుగు రూరల్: అర్హులందరికీ ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని రాయనిగూడెం గ్రామ పంచాయతీలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి, తదితర పథకాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవా స్ఫూర్తి ప్రశంసనీయమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, టీజీఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనమిచ్చే ప్రతీ రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందన్నారు. రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని తెలిపారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతీ ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్సల్లో ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యసేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావులు సైతం రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ చంద్రశేఖర్, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
20న ‘రైతు భరోసా’ విడుదల
ఈ నెల 20న నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వచ్చాం. ఆస్పత్రిలో తాగునీరు ఎక్కడ ఉందనే విషయం తెలియదు. దాహం తీర్చుకునేందుకు రూ.20లతో వాటర్ బాటిల్ కొనుగోలు చేశా. వాటర్ ప్లాంట్ ఎక్కడ ఉందనే విషయం తెలిసేవిధంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. – రమ్య, వెంకటాపురం (ఎం)గతంలో ఆస్పత్రిలో ఇన్వార్డు పేషెంట్లకు అందుబాటులో ఆర్ఓ ప్లాంట్ ఉండేది. ఆస్పత్రి అప్గ్రేడ్ అయిన తర్వాత వాటర్ ప్లాంట్ను ఆస్పత్రి ఆవరణలోని జనరిక్ మందులషాపు పక్కన ఏర్పాటు చేశారు. అయితే ఆస్పత్రిలో తాగునీరు ఎక్కడ దొరుకుతుందనే విషయానికి సంబంధించి ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అటెండెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమి లేక రూ.20 పెట్టి వాటర్ బాటిల్ కొనుగోలు చేసి తాగుతున్నారు. ఆస్పత్రిలో గతంలో వేసిన బోర్ సహాయంతో వాటర్ ప్లాంట్ నిర్వాహన కొనసాగుతుంది. ఇటీవల కాలంలో ఎలాంటి బోర్లు వేయించలేదు. -
బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానంలో ఈనెల 27 నుంచి మే 6వ తేదీ వరకు జరగనున్న లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలకు పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కను ఆహ్వానిస్తూ ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి వీరస్వామి శుక్రవారం ఆహ్వాన పత్రికను అందించారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1న మధ్యాహ్నం 12.23 గంటలకు నిర్వహించే స్వామివారి తిరుకల్యాణానికి రావాలని కోరారు. అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు కూడా స్వామివారి ఆహ్వాన పత్రికను అందించారు. మల్హర్(కాటారం): కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో ఈ నెల 20న ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్ వేదిక ఏర్పాట్లు, ప్రాంగణ అభివృద్ధి, లైటింగ్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీఓ వీరస్వామి, విద్యుత్ డీఈ నాగరాజు పాల్గొన్నారు. లైటింగ్ ఏర్పాట్ల పరిశీలన సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎల్పీఓ మల్లికార్జున్రెడ్డి అధికారులను ఆదేశించారు. నస్తూరిపల్లి లైటింగ్ ఏర్పాట్లు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈ నాగరాజు, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
తండ్లాట!
జిల్లా ఆస్పత్రిలో మంచినీటి ఇబ్బందులుములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఓపీ సేవలు పొంది మందులు రాయించుకొని వెళ్లే వారు కొందరైతే.. వైద్యం అవసరమై ఆస్పత్రిలో అడ్మిట్ అయి వైద్యం పొందే వారు కొందరు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. రోగులు, వారితో వచ్చే అటెండెంట్లు మాత్రం తాగునీటి కోసం తండ్లాట పడుతున్నారు. ఆస్పత్రిలో రోగులు పడుతున్న తాగునీటి తండ్లాటపై ‘సాక్షి’ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తాగునీరు తాగేదెలా? జిల్లాకేంద్రంలోని ఆస్పత్రి ఆవరణలో తాగునీటికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ నీరు తాగేందుకు గ్లాస్ మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ఓ పెద్దాయన మంచినీళ్ల నల్లా వద్ద చేతులతో నీరు తాగి దాహం తీర్చుకున్నారు. ఓపీ 504, ఇన్పేషెంట్లు 33 ఆస్పత్రిలో రోజువారీగా అత్యధిక సంఖ్యలో అవుట్ పేషెంట్లు వైద్యసేవలు పొందుతున్నారు. రోజు వారీగా సుమారు ఓపీ 422, ఈఓపీ 82, అడ్మిట్ పేషెంట్లు 33 మందికి వైద్యం అందిస్తున్నారు. ప్లాంట్ ఎక్కడ ఉందో తెలియని వైనం ప్లాంట్ ఉన్నా.. గ్లాస్ కరువు ఇబ్బందులు పడుతున్న అటెండెంట్లు -
హిందూ మహాసమ్మేళనానికి సర్వం సిద్ధం
ములుగు: జిల్లా కేంద్రంలో నేడు (శనివారం) నిర్వహించనున్న విరాట్ హిందూ మహాసమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు. శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులు మహాసమ్మేళనం నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా సమ్మేళన కార్యక్రమం శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. శ్రీ భువనేశ్వరి దేవి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామిజీ, ధర్మ జాగరణ అఖిల భారత సహ సంయోజక్ ఏలె శ్యాంకుమార్ జీ హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని కమిటీ సభ్యులు అందజేసిన నవధాన్యాలను తీసుకువచ్చి యాగంలో సమర్పించి భారతమాతతో పాటు హిందూ దేవతామూర్తుల ఆశీర్వాదం పొందాలన్నారు. సమ్మేళనానికి హాజరయ్యే ప్రజలు తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్కూల్ బస్సుల ద్వారా రావాలని కోరారు. సుమారు పది వేల మందికి సరిపడే విధంగా అన్ని వసతులు కల్పించామని, సభ విజయవంతం కోసం కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కర్ర రాజేందర్రెడ్డి, రాజ్కుమార్, చింతలపూడి భాస్కర్రెడ్డి, వాసుదేవారెడ్డి, బాణాల సుధాకర్, ఇమ్మడి రాకేష్, ప్రకాష్, బాబురావు, కుమార్, జీవన్రెడ్డి, రమేష్, సంపత్, తదితరులు పాల్గొన్నారు. -
డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు పరిశీలన
వాజేడు: కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి జిల్లా వైద్యాధికారి గోపాల రావు వాజేడు, పేరూరు, ఎదిర వైద్యశాలలను శుక్రవారం పరిశీలించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న రోజులు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా అందుబాటులో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడంలో భాగంగా రోగులకు ఏ వైద్యశాల అనుకూలంగా ఉంటుందో అనే కోనంలో వాజేడు, పేరూరు, ఎదిర వైద్యశాలలను పరిశీలించారు. ఆస్పత్రుల్లో అదనపు గదులు, కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేయడానికి వీలుగా ఉంటుందా లేదో చూశారు. త్వరలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త జగదీష్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు ఒక లక్ష్యంతో చదవాలని ట్రాన్స్ఫార్మ్ స్కూల్, పీపుల్ ఫర్ యాక్షన్ ఎన్జీఓ కెరీర్ కౌన్సిలర్ ట్రైనర్ కిషోర్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి విద్యార్థులకు కెరీర్ విజనింగ్ వర్క్షాప్ నిర్వహించి భవిష్యత్లో ఎలాంటి చదువులు, ఉద్యోగులు పొందాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి 35 పాఠశాలల నుంచి 350 మంది విద్యార్థులు హాజరయ్యారు. వర్క్షాప్లో నిర్వహించిన సెషన్ ద్వారా విద్యార్థులు తమ వ్యక్తిగత బలాలు, ఆసక్తులు గుర్తించుకోవడంతోపాటు పదో తరగతి అనంతరం ఎంచుకోవాల్సిన సరైన వృత్తి మార్గాలపై స్పష్టమైన అవగాహన పొందారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యార్థులకు భవి ష్యత్ నిర్మాణంలో వారి ప్రాముఖ్యంపై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సాంబశివరావు, ఉపాధ్యాయులు శ్రావణ్, రాజన్న, నాగరాజు, మాదురి, తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో రాణించాలి పదోతరగతి ముగిసిందని విశ్రమించకుండా నిరంతరం క్రమశిక్షణతో భవిష్యత్లో రాణించాలని డీఈఓ సిద్దార్ధరెడ్డి అన్నారు. ములుగు మండలం బండారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో కెరీర్ గైడ్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతీరోజు విద్యార్థిగానే ఉండాలని, చదువుతోపాటు సమాజం, దేశం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు, గురువుల మాటలు విని భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. -
సీపీఆర్పై అవగాహన తప్పనిసరి
● డీఎస్పీ కిశోర్కుమార్ ములుగు రూరల్: సీపీఆర్పై ప్రతీఒక్కరికి అవగాహన ఉండాలని డీఎస్పీ కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్లో సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిని వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించడం సామాజిక బాధ్యతన్నారు. క్షతగాత్రులను కాపాడితే రహ్వీర్ పథకం ద్వారా రూ.25వేల పారితోషికం అందిస్తామన్నారు. ప్రమాదాల సమయంలో ఊపిరి అందక ఇబ్బందులు పడే వారికి వెంటనే సీపీఆర్ చేసి కాపాడాలని సూచించారు. ప్రమాదం జరిగిన గంట సమయాన్ని గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఆ సమయంలో చికిత్స అందించినట్లయితే ప్రాణాలు రక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీఐ సురేష్కుమార్, ఎస్సై ఉపేందర్రావు, చంద్రశేకర్, 108 జిల్లా మేనేజర్ రాజ్కుమార్, మెడికల్ ఆఫీసర్ అన్వేష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి
ములుగు: ములుగు మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడినందున వ్యాపారులు (2026–27)కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొంతమంది వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ లేకుండా దుకాణాలు, హోటళ్లు, మెడికల్ షాపులు, వ్యాపార సంస్థలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇప్పటి వరకు లైసెన్స్ లేని వ్యాపారులు కొత్త ట్రేడ్ లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని, లైసెన్స్ ఉన్న వారు పాత లైసెన్స్ను పునరుద్ధరించుకోవాలన్నారు. నిర్ధేశిత గడువులోగా టీఎల్ పొందని వారిపై మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ములుగు పట్టణ వాణిజ్య దారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
20నుంచి ‘ఓపెన్’ టెన్త్, ఇంటర్ పరీక్షలు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5–30గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్లో 3,945మంది విద్యార్థులకునుగాను 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 197మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్లో 7,187మందికిగాను 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 359మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం శుక్రవారం తెలిపారు. హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్(తెలంగాణఓపెన్స్కూల్.ఓఆర్జీ)లో అందుబాటులో ఉంచారని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్లో 3,495 మంది.. ఇంటర్లో 7,187 మంది విద్యార్థులు -
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్కుమార్ అన్నారు. మండలంలోని గంగారం పంచాయతీ పరిధిలోని భూపతిపూర్ సమీపంలో కారుకొండా సడాలమ్మ జాతరను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు కొర్నెబెల్లి గణేష్, చింత రమేష్, కొమరం రవి, సర్వేష్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీల ఇలవేల్పు జాతరల రక్షణకు కృషి చేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మొదటి బహుమతి రూ. 25,016, ద్వితీయ బహుమతి రూ.15,016, తృతీయ బహుమతి రూ.10,016, నాలుగో బహుమతి రూ.5,016, ఐదో బహుమతి రూ.3,016లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడే రజిత రాంబాబు, యువజన సంఘాల అధ్యక్షుడు నవీన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ములుగు: తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ, తహసీల్దార్కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎస్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వాంకుడోతి జ్యోతి, గోనె రవీందర్, సల్లకొండ పద్మాకర్ రెడ్డి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ములుగు రూరల్: ఆస్పత్రుల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిల్లో విద్యుత్ వైర్లు నాణ్యమైనవి వినియోగించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను నిరంతరం పరిశీలించాలన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా, సమయోచితంగా స్పందించడం ముఖ్యమన్నారు. ప్రమాద సమయంలో లిఫ్ట్ను ఉపయోగించకుండా మెట్లమార్గంలో రావాలన్నారు. అనంతరం ప్రమాదాలు జరిగిన సమయంలో తక్షణ చర్యలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. -
బీసీలే ఎక్కువ
● ఉమ్మడి వరంగల్లోని మొత్తం జనాభా 36,88,217లో 18,37,374 మంది వారే..● ఆ తర్వాతి వరుసలో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ● చివరి స్థానంలో బీసీ ముస్లిం, మైనారిటీలు ● మొత్తం 12,32,892 ఇళ్లు ఉన్నట్టు నిర్ధారణ ● తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, కులగణన సర్వేలో వెల్లడి సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జనాభా 36,88,217 మంది అని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే నివేదిక తేల్చి చెప్పింది. అదే సమయంలో 12,32,892 ఇళ్లు ఉన్నట్లు ఉన్నాయని వెల్లడించింది. జనాభా పరంగా చూసుకుంటే 18,37,374 మంది బీసీలు తొలిస్థానంలో ఉంటే, 1,74,440 మందితో బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. ఇల్లు ఉన్నవారి విషయానికొస్తే ఓసీలు 35.35 శాతంతో తొలిస్థానంలో ఉండగా, 30.60% బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 3,22,361 మంది ఉంటే...అత్యల్పంగా హనుమకొండలో 29,139 మంది ఉన్నారు. ఓసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 89,410 మంది ఉంటే అత్యల్పంగా ములుగులో 20,684 మంది ఉన్నారని వెల్లడించింది. ఇక ఎస్సీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 1,83,984 మంది ఉంటే ములుగు జిల్లాలో అతి తక్కువగా 49,746 మంది ఉన్నారని తెలిపింది. బీసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 4,50,150 మంది ఉంటే అతి తక్కువగా ములుగు జిల్లాలో 1,18,254 మంది ఉన్నారని పేర్కొంది. జనాభాలో వరంగల్ జిల్లా ముందు... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల మొత్తం జనాభా 36,88,217 ఉంటే వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉన్నట్టు సర్వే తేల్చింది. ఆ తర్వాత 8,04,515మందితో మహబూబాబాద్, 7,99,448మందితో హనుమకొండ, 5,45,449మందితో జనగామ, 4,07,896మందితో జయశంకర్ భూపాలపల్లిలు ఉండగా, చిట్టచివరగా 2,94,098 జనాభాతో ములుగు జిల్లా ఉంది. -
కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు
హన్మకొండ కల్చరల్: ఈ నెల 19వ తేదీ నుంచి 12 రోజుల పాటు జరుగనున్న శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు దేవాలయం ముస్తాబవుతోంది. ఆలయాన్ని సందర్శించే భక్తులు ఎండతాకిడితో ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు అయ్యే ఖర్చు రూ.10 లక్షలను విరాళంగా ఇస్తానని గత మార్చి 27న దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈమేరకు గురువారం జర్మన్ పెండల్స్ టెంట్లు వేయిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి వాహనసేవ కోసం వాహనాలను శుభ్రపర్చి సిద్ధం చేశారు. ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
వైభవంగా హిందూ సమ్మేళనం
వెంకటాపురం(ఎం): మండలంలోని నల్లగుంటలో గురువారం రాత్రి హిందూ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జనగాం రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళానికి శాంబవీ పీఠాధిపతి భువనగిరి బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హిందూ అనేది మతం కాదని.. హిందూ ధర్మం ఒక జీవన విధానం అన్నారు. మన సనాతన ధర్మం మనకందించిన గొప్ప జీవన విధానమని వెల్లడించారు. మనమంతా హిందూధర్మాన్ని ఆచరించాలని, ధర్మాన్ని కాపాడే వారసులుగా మనందరం కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్మిలారెడ్డి, విఘ్నేష్జీ, సర్పంచ్ భూక్య శ్రీదేవి, కార్యక్రమ నిర్వహకులు శిరూప సతీష్ కుమార్, భూక్య జవహర్ లాల్, రామగిరి శ్రీనివాస్, కొండ్ల కృష్ణమూర్తి, ఉత్సవ కమిటీ సభ్యులు మేరుగు మల్లయ్య, కాంతాల నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ములుగు రూరల్: రోడ్డు భద్రతా నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని అడిషనల్ ఎస్పీ సదానందం అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో వాహనదారులకు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించామన్నారు. చిన్నచిన్న నిర్లక్ష్యాల కారణంగా పెద్ద ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కిశోర్కుమార్, సీఐ సురేశ్కుమార్, ఎస్సై ఉపేందర్రావు తదితరులు పాల్గొన్నారు.అడిషనల్ ఎస్పీ సదానందం -
పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
ములుగు రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులకు సూచించారు. మల్లంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అందించిన విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగులైన విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, సామాజిక భద్రత, మహిళల ఆర్థికాభివృద్ధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని వివరించారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు వరి సాగుపై ఆధారపడకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ రూ.40 వేలు అందిస్తుందని వివరించారు. ఇంచర్ల వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉందని తెలిపారు. దీంతో 300 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని వెల్లడించారు. మల్లంపల్లి మండల కేంద్రంలో నూతన మార్కెట్ యార్డు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ కృపాకర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీఓ, తహసీల్దార్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి సూచించారు. ఈ మేరకు గురువారం మల్లంపల్లి మండల పరిధిలోని కొడిశలకుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు. నిర్వాహకులు కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేంద్రాలలో గన్ని బ్యాగులు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ చంద్రశేఖర్, ఆత్మ చైర్మన్ రవీందర్రెడ్డి, ఏపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి -
రామప్ప దేవాలయంలో అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్ సెక్రటరీ సర్వీస్కు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ సందర్శించారు. భారత్ దర్శన్లో భాగంగా వారు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. వారి వెంట కోర్స్ డైరెక్టర్ కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని డీఆర్డీఓ చంద్రశేఖర్ సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. -
గర్భాశయ క్యాన్సర్ నివారణకు పాటుపడాలి
ములుగు రూరల్: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జాన్–స్నో ఇండియా కమిషనర్ డేవిడ్ అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న హెచ్వీపీ కార్యక్రమాన్ని ఆయన గురువారం పరిశీలించి మాట్లాడారు. 14ఏళ్లు నిండిన విద్యార్థినులకు వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలకు వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని తెలిపారు. బాలికల తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను తొలగించాలని వెల్లడించారు. ములుగు, వెంకటాపురం(ఎం), ఎస్ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట, పస్రాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. వ్యాక్సిన్ వేయించుకున్న విద్యార్థినులను అభినందించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని సూచించారు. విద్యాశాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థినులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, వ్యాధి నిరోధక టీకా నియంత్రణ అధికారి నాగ అన్వేశ్, డాక్టర్ శ్రీకాంత్, సంపత్, రాము, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.జాన్ స్నో ఇండియా కమిషనర్ డేవిడ్ -
ఆరోగ్యానికి పోషణ
ఈ నెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పక్షోత్సవాలుములుగు రూరల్: తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వాలు పోషణ పక్షోత్సవాలు(పోషణ పక్వాడ) నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ప్రధాన లక్ష్యంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్, పోషణ ట్రాకర్, ఆరోగ్యలక్ష్మి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అంగన్వాడీలు తల్లీబిడ్డ ఆరోగ్యం, వారికి పౌష్టికాహారం అందిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. వివరాలను అంగన్వాడీ టీచర్లు యాప్లో నమోదు చేస్తున్నారు. పిల్లల పోషణపై చర్చ సాగేలా టాక్ షోలు, సభలు నిర్వహిస్తారు. తల్లిపాలపై అవగాహన కల్పిస్తారు. అంగన్వాడీ కేంద్రాలలో అమ్మమ్మ, నాన్నమ్మలతో పోషణ కథలు చెప్పిస్తారు. గర్భిణులు పిల్లల కోసం ప్రత్యేక పోషణ, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. చిరు ధాన్యాలతో ఆహార పదార్థాల తయారు చేసి ప్రదర్శించడం, పోషణ మేళ, క్విజ్ పోటీలు, పూర్వ ప్రాథమిక విద్యపై ప్రచారం నిర్వహిస్తారు. అంగన్వాడీ కేంద్రాలలో ఫ్రీ స్కూల్, సంసిద్ధత కార్యకలాపాలు, నో సీక్రన్ అవర్, ఫ్యామిలీ ప్లే టైం, బహిరంగ ఆటలు, శారీరక కార్యక్రమాలు చేపడుతారు. ఈ క్రీడలను 15 రోజుల పాటు నిర్వహించి సంబంధించిన ఫొటోలు, వీడియోలను యాప్లో నమోదు చేస్తారు.4 ప్రాజెక్టులు.. 640 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలోని పది మండలాల పరిధిలో ములుగు, ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం(కె) పరిధిలో 640 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 0 నుంచి 3 సంవత్సరాలు కలిగిన చిన్నారులు 10,107, మూడు నుంచి ఆరేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు 9,377, గర్భిణులు 2,443, బాలింతలు 1,075 మంది ఉన్నారు. పౌష్టికాహారం, ప్రాథమిక విద్యపై అవగాహన వేసవి దృష్ట్యా జాగ్రత్తలతో నిర్వహణప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తాం. 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేస్తాం. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యం, వ్యాయామం, పరిశుభ్రత వంటి విషయాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం. – ప్రేమలత, జిల్లా సంక్షేమాధికారి -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
ములుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, మహోన్నత వ్యక్తుల ఆశయాలను అమలు చేయడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా కలెక్టరేట్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వనల ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలు, రాజ్యాంగ నిర్మాణానికి చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ఆయన ఘన కీర్తి ప్రపంచ నలుమూలలు వ్యాప్తి చెందడంతో పాటు ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహినా, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ కిశోర్, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తప్పనిసరి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తప్పనిసరి తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అగ్ని ప్రమాదాల నివారణ, అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబాయి డాక్ యార్డులో ఒక నౌకకు అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతీ ఏడాది ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోటళ్లలో అగ్నిప్రమాద పరికరాలు అన్ని వేళలా పని చేసేలా ఉంచాలని, ప్రతి అంతస్తులో మెట్ల ద్వారాలు, అగ్నిమాపక పరికరాల స్థానం తెలిపే ఎస్కేప్ ప్లాన్ ఉంచాలని సూచించారు. ఎయిర్ కండిషనర్ ద్వారా మంటలు వ్యాప్తి చెందకుండా డ్యాంపర్స్ ఏర్పాటు చేయాలని వాటిని ఆటోమేటిక్ డిటెక్టివ్ సిస్టంకు అనుసంధానం చేయాలని వెల్లడించారు. విద్యుత్ వైరింగ్, స్విచ్లు, ఇతర పరికరాలు క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలన్నారు. వంట గదిలో అగ్నిప్రమాదం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ అసియా షాహినా, ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ కిశోర్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి నాగరాజు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఆరైవ్ అలైవ్ వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ దివాకర వాహనదారులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేపించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
నేడు భారీ ర్యాలీ
ములుగు: జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం 4 గంటలకు హనుమాన్ జెండాలతో సుమారు 500 ద్విచక్ర వాహనాలతో జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్ గండ్రకోట కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగులోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద బైక్ ర్యాలీ ప్రారంభమై మెయిన్రోడ్ మీదుగా జిల్లా కేంద్రంలోని అన్ని పుర వీధులలో కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతీ ఒక్క హిందూ సోదరుడు కార్యక్రమంలో విధిగా పాల్గొని హిందూ సమ్మేళానికి మద్దతు తెలిపి బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కుమార్ పిలుపునిచ్చారు. ట్యాంకర్తో తాగునీటి సరఫరా ఏటూరునాగారం: మండల పరిధిలోని గంటలకుంటలో గొత్తికోయ గిరిజనులకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆ గూడేనికి మంగళవారం వాటర్ ట్యాంక్ను పంపించి నీటిని అందించారు. దీంతో గొత్తికోయలు ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలం ముగిసే వరకు నీటి ఎద్దటి లేకుండా చూస్తామని స్థానిక నాయకుడు గుడ్ల దేవేందర్ తెలిపారు. గూడెంలో బోరు నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు చెప్పడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందజేయాల్సి వస్తుందని దేవేందర్ తెలిపారు. మంగపేట: మండల పరిధిలోని కమలాపురానికి చెందిన మేడిపెల్లి వెంకటేశ్వర్లు తనకు భూమి లేకున్నా 18 ఎకరాలు ఉన్నట్లుగా అక్రమంగా పొందిన పట్టాదార్ పాస్ పుస్తకాలను వెంటనే రద్దు చేయాలని సిద్ధాబత్తుల జగదీశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగదీశ్వర్రావు మాట్లాడారు. వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారుల సహకారంతో మండలంలోని చెరుపల్లి, కమలాపురంలో 151/1, 208/6, 208/6ఏ సర్వే నంబర్లలో 18 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లుగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందాడని తెలిపారు. వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాడని, ప్రభుత్వం నుంచి రైతుబంధు సైతం తీసుకుంటున్నట్లుగా తహసీల్దార్కు గతేడాదిలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ విషయంపై గిర్ధావర్, సర్వేయర్ సర్వే చేయగా భూమిలేదని సరైన ఆధారాలు లేవని 2026 ఫ్రిబ్రవరి 28న తనకు లెటర్ ద్వారా తెలిపారని వివరించారు. అదే విషయాన్ని కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీంతో వెంకటేశ్వర్లు తనపై కోపంతో అతని స్నేహితుడితో కలిసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు తనకు రక్షణ కల్పించడంతో పాటు అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాలసర్ప నివారణ పూజలకు భక్తుల రద్దీ కాళేశ్వరం: మంగళవారం సెలవుదినం కావడంతో కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వద్ద కాలసర్ప నివారణ పూజలు భక్తులు అధిక సంఖ్యలో నిర్వహించారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. సుమారుగా 200లకుపైగా భక్తులు పూజలు చేశారు. శ్రీశుభానందేవిచ, శ్రీసరస్వతీ అమ్మవార్లను దర్శించుకున్నారు. మంచి ముహూర్తాలు ఉండడంతో భక్తులు తమ పెళ్లిళ్లు, దోషాల పాపహరణం కోసం ముందస్తుగా కాలసర్ప నివారణ పూజలు చేసుకుంటున్నారు. దీంతో కాళేశ్వరాలయం పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. -
క్రీడాపోటీల్లో విద్యార్థుల ప్రతిభ
కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఏటూరు గ్రామానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఖోఖో పోటీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో నిర్వహించిన శ్రేష్ఠ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఏటూరు సర్పంచ్ కుర్సం రమాదేవి సన్మానించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖోఖోలో ప్రతిభ కనబర్చిన పుట్ట నేతాజీ, శ్రేష్ఠ పరీక్షలో ప్రతిభ కనబర్చిన మేకల హేమంత్ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, చిట్యాల రాజు, పూనెం రవి, రాజు, అంకుమల్లు, ముత్తేష్ తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: పెండింగ్లో ఉన్న మైనింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమయానికి రావాల్సిన ప్రమోషన్లు నిలిచిపోవడం, ప్రమోషన్ పొందిన వారికి బేసిక్ ఫిక్సేషన్ చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ మైనింగ్ సర్దార్లుగా పని చేస్తున్నవారికి కాలపరిమితి పూర్తయినప్పటికీ ఓవర్మెన్ ప్రమోషన్లు ఇవ్వకపోవడం అన్యాయమని తెలిపారు. అంతర్గతంగా ఎస్ఎఫ్, ఎంఎస్ తీసుకున్న ఉద్యోగులకు సీ గ్రేడ్ ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా సరికాదని తెలిపారు. ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఉన్న మైనింగ్ స్టాఫ్ ఖాళీలను తక్షణమే భర్తీచేసి, అండర్గ్రౌండ్ మైన్స్లో తగిన సిబ్బందిని నియమించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నూకల చంద్రమౌళి, సోతుకు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
లక్ష్యంతో చదివితే బంగారు భవిష్యత్
● డీడీ దబ్బగట్ల జనార్దన్ ఎస్ఎస్తాడ్వాయి: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లక్ష్యంతో చదివితే బంగారు భవిష్యత్ ఉంటుందని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల పరిధిలోని ఊరట్టం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పాఠశాల పీజీ హెచ్ఎం కల్తి శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽఽథులుగా డీడీ జనార్దన్, ఏటీడీఓ అజయ్కుమార్, ఏఎంఓ సుందర్రెడ్డి, సర్పంచ్ శైలజ హాజరై అంబేడ్కర్, సరస్వతిదేవి చిత్రపట్టాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతూ మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థినులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి, డిప్యూటీ వార్డెన్ రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తునికాకు సేకరణకు సిద్ధం!
సాక్షిప్రతినిధి, వరంగల్: తునికాకు సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధరను ఖరారు చేస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఆరు సర్కిళ్ల పరిధిలో 104 యూనిట్ల ద్వారా ఈ బీడి ఆకు సీజన్లో ఆకుసేకరణ చేయనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాళేశ్వరం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) మంచిర్యాల, బాసర, రాజన్న, భద్రాద్రి, చార్మినార్ సర్కిళ్లలో 104 యూనిట్లు ఏర్పాటు చేసి 1,22,000 స్టాండర్డ్ బ్యాగు (ఎస్బీలు)లు కొనుగోలు లక్ష్యంగా ప్రకటించారు. అయితే, అటవీశాఖ ఉమ్మడి వరంగల్ (కాళేశ్వరం, భద్రాద్రి సర్కిళ్లు) 14 డివిజన్లల పరిధి ఎనిమిది డివిజన్లలో 77 యూనిట్ల ద్వారా 80,200 స్టాండర్డ్ బ్యాగుల ఆకు సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు. సేకరణకు రూ.54.90 కోట్లు తునికాకు సీజన్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం బడ్జెట్ రూ. 54.90 కోట్లు వివిధ విభాగాలకు కేటాయించింది. ఇందులో తునికాకు సేకరణకు స్టాండర్డ్ బ్యాగు (ఎస్బీ)కి రూ.3,300 చొప్పున రూ.40.26 కోట్లు కాగా, ఇది మొత్తం బడ్జెట్లో అతిపెద్ద వాటా. నిర్ణీత ధర రూ.3,300 చొప్పున 1,22,000 స్టాండర్డు బ్యాగుల సేకరణ కోసం ఈ నిధులు కేటాయించారు. అదేవిధంగా సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ, మానిటరింగ్ పనుల కోసం 12 నెలల కాలానికి ఔట్సోర్సింగ్ సిబ్బంది కోసం రూ.4.90 కోట్లు, గోదాం రికార్డు కీపర్లు, టీఎంలకు 45 రోజుల కోసం రూ.5 లక్షలు కేటాయించారు. మిగతా రూ.14,54,10,000లు కార్యాలయ, అటవీశాఖ క్వార్టర్ల నిర్వహణ, పోస్టల్, విద్యుత్, మున్సిపల్ పనులు, టెలిఫోన్, వాహనాలు తదితర అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. తగ్గిన యూనిట్లు! ఐదేళ్ల క్రితంకు ఇప్పటికీ తునికాకు యూనిట్లు గణనీయంగా తగ్గింది. 309 యూనిట్ల ద్వారా 3,569 కల్లాలు ఏర్పాటు 5,42,70 స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరణ చేసేవారు. నూటికి నూరు శాతం లక్ష్యాలు నెరవేరగా, రాను రానూ 243 యూనిట్లు, 2,41,700 స్టాండర్డ్ బ్యాగులకు పడిపోయింది. ఈఏడాది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 104 యూనిట్లు, 1,22,000 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యం కాగా.. ఉమ్మడి వరంగల్లో 8 డివిజన్లలోనే ఆకు సేకరించనున్నారు. ఆకు సేకరణ లక్ష్యాలు తగ్గడం ద్వారా ఉపాధి కూలీలు ఆదాయం, పనిదినాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా ఫ్రూనింగ్ (కొమ్మలు కొట్టె) ఈ నెలాఖరు వరకు ముగియనుండగా, అటవీశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు మే 1 నుంచి తునికాకు సేకరణ ప్రారంభించి సుమారు 30–45 రోజుల్లో ఆకు సేకరణ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరంగల్ సర్కిల్ 14 డివిజన్లలో సేకరణ స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధర ఖరారు రూ.54.90 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వంఈసారి ఆకు సేకరణ చేసిన కూలీలకు స్టాండర్డ్ బ్యాగు (50 ఆకుల కట్టలు వెయ్యి)కు రూ.3,300 చెల్లించనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. తెలంగాణ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్) చట్టం, 1971లోని సెక్షన్ 7 ప్రకారం, సలహా కమిటీతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం ఈ ధరలను ఖరారు చేసింది. ఈ లెక్కన ఆకు సేకరణ కోసం రూ.54.90 కోట్లు విడుదల చేశారు. కాళేశ్వరం సర్కిల్ పెద్దపల్లి, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మహదేవపూర్, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం, ఏటూరునాగారం డివిజన్లలో 37 యూనిట్ల ద్వారా 32,900 స్టాండర్డ్ బ్యాగులు కొనుగోలు చేయనున్నారు. భద్రాద్రి సర్కిల్ కేజీఎం భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, కేడబ్ల్యూఎస్ కిన్నెరసాని, కొత్తగూడెం, ఇల్లందు అటవీశాఖ డివిజన్లలో 40 యూనిట్లలో 47,300, చార్మినార్ సర్కిల్లో మూడు యూనిట్ల ద్వారా 800 స్టాండర్ట్ బ్యాగుల బీడీ ఆకు సేకరించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, బీడీ ఆకు సేకరణ వ్యవహారంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్డీసీఎల్) ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరించనుంది. -
ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పిలుపు
భూపాలపల్లి అర్బన్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడు దుండ్ర రాజయ్య తెలిపారు. ఈ మేరకు డిపో ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పీఆర్సీ అమలు, ఉద్యోగ భద్రత కల్పన, ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ కార్మికులు శక్తికి మించి పనిచేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, అధికారుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, యూనియన్ల పునరుద్ధరణ లేకపోవడం వంటి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వానికి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించినా స్పష్టమైన హామీలు రాకపోవడంతో జేఏసీ నాయకులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే సమ్మెలో భూపాలపల్లి డిపో నుంచి పూర్తిస్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుర్రి తిరుపతి, రాధాకృష్ణ, ఏకే స్వామి, రంజిత్ గౌడ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
సైబర్ వల..
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● రూ.3.66 కోట్లు కాజేసిన నేరగాళ్లు ● కొత్త టెక్నాలజీల పేరుతో నిత్యం దోపిడీకి గురవుతున్న ప్రజలుములుగు: టెక్నాలజీ పెరుగుతోంది.. ప్రతీ పనికి ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్ ఫోనే అవసరమవుతోంది. ప్రభుత్వం కూడా పేపర్ లెస్ మనీ వాడాలని, ఆ విధంగా ప్రయత్నాలను వేగం చేస్తోంది. టీ బండి నుంచి పెద్ద పెద్ద లావాదేవీలు కూడా మన స్మార్ట్ ఫోనన్తోనే సాగుతున్నాయి. ఇదంతా అభివృద్ధి అనుకుంటూ ముందుగు సాగుతుంటే దీని మాటున ఎవరికీ తెలియని అంతులేని నేర సామ్రాజ్యం విస్తరిస్తుంది. పైసా పైసా కూడబెట్టుకున్న సామాన్యుల నుంచి, బడా వ్యాపారుల వరకు తెలియని సైబర్ నేర సామ్రాజ్యానికి నిత్యం బలైపోతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు నిత్యం అవగాహన కల్పించినా కొత్త, కొత్త టెక్నాలజీ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను నిత్యం దొచుకుంటూనే ఉన్నారు. జిల్లాలో 2023 నుంచి సైబర్ నేరగాళ్లు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారనే విషయాన్ని యూత్ పర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగింది. ఈ క్రమంలో సమాచారాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అందించినట్లు సంస్థ పౌండర్ పల్నాటి రాజేంద్ర తెలిపారు.సంవత్సరం కేసులు కాజేసిన రికవరీ డబ్బులు డబ్బులు2023 120 రూ.67.30 లక్షలు రూ.11,72,533 2024 194 రూ.1.53 కోట్లు రూ.18,10,748 2025 212 రూ.1.23 కోట్లు రూ.26,43,868 2026 32(ఫిబ్రవరి) రూ.20.49 లక్షలు రూ.5,76,737 -
ప్రజలే చైతన్యవంతులు కావాలి
సోషల్ మీడియా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్ల మాయలో పడకుండా ప్రజలే చైతన్యవంతులు కావాలి. సైబర్ నేరగాళ్లు అమాయకపు ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తూ, అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్నారు. అందివచ్చిన మేరకు లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో సైబర్ మోసాలపై కొంతమంది శిక్షకులను ఏర్పాటు చేసి నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉండాలి. ప్రభుత్వాలు సైబర్ మోసాలను ఆదిలోనే అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు దాచుకున్న డబ్బులకు రక్షణ కరువైపోతుంది. – పల్నాటి రాజేంద్ర, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ -
బాలల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
● బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ ములుగు: బాలల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగు, గోవిందరావుపేట, వెంకటాపురం(ఎం) మండలాల్లోని బాలసదనం చిన్నారులకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు. పిల్లలకు వార్షిక వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల ఆరోగ్య సమస్యలు గుర్తించేందుకు వీలుంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, బాలసదనం సూపరింటెండెంట్ కావ్య తదితరులు పాల్గొన్నారు. -
కోతులకు తాగునీటి తిప్పలు
వెంకటాపురం(కె): ఎండలు మండుతుండటంతో తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వానరాలకు సైతం వేసవిలో తాగునీటి తిప్పలు తప్పడం లేదు. కోతులు దాహం తీర్చుకునేందుకు నీటి వనరులు లేకపోవడంతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద చిన్న గుంటలో నిలిచిన నీటిని తాగి దాహాన్ని తీర్చుకుంటున్నాయి. హెచ్పీవీ వ్యాక్సిన్పై అపోహలు వద్దు ములుగు రూరల్: గర్భదార ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్(హెచ్పీవీ)పై ఎలాంటి అపోహలు వద్దని జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేశ్ అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాల, జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో 14ఏళ్లు నిండిన విద్యార్థినులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అనంతరం విద్యార్థినులకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పని సరిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, మాస్ మీడియా ఆఫీసర్ సంపత్, మానిటరింగ్ సూపర్వైజర్ సురేశ్, ఆరోగ్య కార్యకర్తలు ఉపేంద్ర, సమ్మమ్మ, నర్సింగ్ ఆఫీసర్ రాణి, స్కూల్ నర్సింగ్ ఆఫీసర్ దీపిక, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ‘దోస్త్’ సహాయ కేంద్రం ఏర్పాటు కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశంములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిగ్రీ ప్రవేశాలలో దోస్త్ అడ్మిషన్లకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురైతే విద్యార్థులు హెల్ప్లైన్ సెంటర్కు వచ్చి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్, అడ్మిషన్లు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశ రిజిస్ట్రేషన్కు రూ. 200, రెండు, మూడు దశల రిజిస్ట్రేషన్లకు రూ.400 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. డిగ్రీలో ప్రవేశానికి ఆధార్కార్డు, మొబైల్నంబర్, కలర్ ఫొటోలు, టెన్త్, ఇంటర్ మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడి సర్టిఫికెట్లు, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని తెలిపారు. కళాశాలలో బీఎస్సీ(లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీకాం కంప్యూటర్స్, బీఏ హెచ్ఈపీ కోర్సులతో పాటు బీకాం (బీఎఫ్ఎస్ఐ), బీఎస్సీ (హెల్త్ కేర్ మేనేజ్మెంట్) కోర్సులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9966153683, 8978825734, 9550965334 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వచ్చే నెల 7వ తేదీ వరకు మొదటి దశ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 30 నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, 14వ తేదీన సీట్లు కేటాయించడం జరుగుతుందని వివరించారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.ఏటూరునాగారం : ప్రతి గ్రామ పంచాయతీలో రోజు వంద మంది కూలీలు పనులు చేయించే విధంగా ఈజీఎస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ పీడీ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాలకు చెందిన ఈజీఎస్ ఏపీఓలు, టీఏలు, ఎఫ్ఏలు, మేట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీల హాజరు శాతం పెంచాలన్నారు. కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి హామీ కూలీలతో కలిగే లాభాలను వివరించాలన్నారు. వంద రోజుల పనులు పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలన్నారు. సర్పంచ్లు, వార్డు సభ్యులు గ్రామంలో జాబ్కార్డు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడిని ఉపాధి హామీ పనులకు పంపించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డీఆర్డీఓ కృపాకర్, టీసీఎస్ వేణు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజ్ పాల్గొన్నారు. -
20న కాళేశ్వరానికి సీఎం
కాళేశ్వరం: ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భద్రత, ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 20న సీఎంతో పాటు మంత్రులు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటు చేయనున్నారు. సుమారు 40 ఎకరాల్లో సభాస్థలి, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని 20వ పియర్(పిల్లర్) కుంగిపోగా, వంతెన కుంగి పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. అదే సమయంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (ఎన్డీఎస్ఏ) నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదు. వాటికి మరమ్మతులు చేసి పునరురిస్తామని ఇటీవల సీఎం ఇచ్చిన హామీ మేరకు పర్యటన ఖరారైందని రైతాంగం ఆశిస్తోంది. ఇప్పటికే పుణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం సైంటిస్టులు బ్యారేజీలో పలమార్లు జియోఫిజికల్, జియోటెక్నికల్తో పాటు పలు రకాల పరీక్షలు చేపట్టారు. ఆ పరీక్షలను సీఎం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇరిగేషన్శాఖ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది. నస్తూర్పల్లిలో సభ సీఎంతో పాటు ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటన తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. ఈ సభా వేదిక నిర్వహణను 40 ఎకరాల్లో కాటారం మండలం నస్తూర్పల్లిలో సభా వేదిక, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, హెలిపాడ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు మౌలిక సదుపాయాలను అధికారులతో కలిసి కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. కాగా, కాళేశ్వరం, కుదురుపల్లిలో సభాస్థలి కోసం పరిశీలనలు చేసినప్పటికీ అనువుగా ఉండే నస్తూర్పల్లిలో ఏర్పాట్లకు అధికారులు సుముఖం తెలిపారు. దీంతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగనున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేయండి.. ఈ నెల 20న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను పురస్కరించుకొని ఽకాటారం మండలం ధన్వాడలోని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తన నివాసంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, రవాణా, హెలిపాడ్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు పాల్గొన్నారు. కాటారం మండలం నస్తూర్పల్లిలో సభాస్థలి, పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు ధన్వాడలో అధికారులతో మంత్రి శ్రీధర్బాబు సమీక్ష -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ఏటూరునాగారం: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ దివాకర తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ దివాకరతో పాటు ఏఎస్పీ మనన్భట్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడంతో కలిగే అనర్థాలతో కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. అనంతరం రోడ్డు భదత్ర అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే మండల కేంద్రంలోని ఆకులవారి గణపురం ప్రభుత్వ బాలి కల వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించి సౌకర్యాల పై ఆరా తీశారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లై ట్లు ఉండేలా చూడాలని ప్రిన్సిపాల్కు సూచించారు. మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు ములుగు రూరల్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు చేశారు. -
పాకల్లోనే పాఠాలు
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గొత్తికోయలకు విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలకు విద్యా బోధనకు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మంత్రి సీతక్క చొరవతో గుర్రాల బావి, బంగారు పల్లి పాఠశాలలను గుడిసెలో నుంచి కంటైనర్ పాఠశాలలోకి మార్చారు. కానీ నూతనంగా గతేడాది మంజూరు చేసిన పాఠశాలలు ఇంకా పాకల్లోనే కొనసాగుతున్నాయి. గతేడాది ఐదు ప్రాథమిక పాఠశాలలు నూతనంగా మంజూరు చేశారు. కాని వాటికి సరైన భవనాలు, పక్కా ఇళ్లు లేక పెంకుటిళ్లు, పాకల్లోనే విద్యాబోధన కొనసాగుతోంది. తాత్కాలిక షెడ్లతో ఇటు వేసవిలో అటు వర్షాకాలంలో కురిసే వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండెంగవాయి, కొమురం భీమ్నగర్, రాయబంధంతో పాటు మరో రెండు పాఠశాలలు పాకల్లోనే ఉండడం గమనార్హం. అదే విధంగా మామిడి గూడెంలో రేకుల షెడ్డులో ప్రభుత్వ పాఠశాల కొనసాగుతుండగా పక్కనే ఖాళీ స్థలంలో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. అందువల్ల రేకుల షెడ్డులోనే కొనసాగడం గమనార్హం. పట్టించుకోని ప్రభుత్వం ప్రభుత్వం ఏజెన్సీలో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉంది. కానీ వాటి బాగోగులు మాత్రం గాలికి వదిలేసింది. పక్కా భవనాలు లేక గుడిసెలోనే పాఠశాలల నిర్వహణ సాగడం మూలంగా అసౌకర్యాల మధ్య గిరిజనుల చదువులు కొనసాగుతున్నాయి. రిజర్వు ఫారెస్ట్ కావడంతో పక్కా భవనాల నిర్మాణం గాలిలో దీపంలా మారాయి. బ్లాక్బోర్డులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, క్రీడామైదానం, స్టడీ మెటీరియల్ను అందించడం లేదు. ఇప్పటికై నా గిరిజన గూడేల్లో పాకల్లో కొనసాగుతున్న పాఠశాలలకు పక్కా భవనాలు లేక కంటైనర్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.ఈ ఫొటోలోనిది.. గుండెంగవాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం. ఇక్కడ 1 నుంచి 5 వరకు తరగతి గదులు ఉన్నాయి. 38 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించింది. మట్టిగోడల పాఠశాలను చూస్తుంటే ఇంకా మనం ఏకాలంలో ఉన్నామనిపిస్తుంది. కానీ ఇక్కడ విద్యార్థుల చేరికలు పూర్తి స్తాయిలో జరగడం లేదు. విద్యార్థులను పాఠశాలల కు పంపించాలని ఉపాధ్యాయులు ఇంటింటా తిరుగుతున్నా గిరిజనుల్లో సరైన అవగాహన లేక వారి పిల్లలను బడికి పంపడంలో జాప్యం చేస్తున్నారు. గతేడాది మంజూరైన పాఠశాలలు.. ఇంకా గుడిసెల్లోనే.. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు -
అర్జీలు పరిష్కరించండి..
ములుగు రూరల్: ప్రజావాణి, గిరివాణి(గిరిజన దర్బార్)లో స్వీకరించిన అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి, గిరివాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు 72 అర్జీలను కలెక్టర్ టీఎస్. దివాకరకు అందజేశారు. ఈ వినతులను అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా అధికారులు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి, గిరివాణిలో 72 వినతుల రాక పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు -
గిరిజన దర్బార్లో వచ్చిన వినతుల వివరాలు
ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్తో పాటు మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం గిరివాణి(గిరిజన దర్బార్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు పాల్గొని బాధితుల నుంచి 10 వినతులు స్వీకరించారు. బాధితులు అందజేసిన వినతులు ఇలా..జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కండెల గంగయ్య, కండెల సమ్మక్క పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఏపీఓను కోరారు. మంగపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలని తొలెం నర్సింగరావు విన్నవించారు. అదే మండలానికి చెందిన సున్నం శ్రీకన్య టైలర్షాపు రుణం కావాలని విన్నవించారు. అలాగే సున్నం రాఘవరావు, శ్రీకన్యలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం క్రాస్రోడ్డు వద్ద ప్రమాదకరంగా ఉన్న కల్వర్టును తొలగించాలని కందిర్సింగ్ విన్నవించారు. మంగపేటకు చెందిన బంగారు నర్సయ్య తన కుమార్తెకు పసుపు కుంకుమల కింద భూమి ఇస్తున్నానని దానిని పట్టా చేయాలని వేడుకున్నారు. కన్నాయిగూడెం మండలానికి చెందిన ఆర్కె నాగలక్ష్మి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు. గోవిందరావుపేట మండలం సర్వాపూర్ కు చెందిన మోట్లపల్లి పూజ పట్టాదార్ పాసుపుస్తకంలో పేర్లు తప్పుగా నమోదు అయ్యాయని వాటిని సరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీడీఓ దబ్బగట్ల జనార్ధన్, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, జేడీఎం కొండల్రావు తదితరులు పాల్గొన్నారు. -
పోడు రైతులపై దాడులు ఆపాలి
ఏటూరునాగారం: పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సీపీఎం మండల విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. దావూద్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారం రోజులుగా ఫారెస్ట్ అధికారులు వలస ఆదివాసీ గూడేలపై పడి దౌర్జన్యంగా సాగు భూముల్లో కందకాలు తీస్తున్నారని తెలిపారు. ఇదేమిటని నిలదీస్తే గుడిసెలు జేసీబీలతో కూలగొట్టి ఆ భూముల్ని సైతం ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు పోడు భూములపై ఉన్న శ్రద్ధ తునికాకు మోడు నరికించడంపై లేదని విమర్శించారు. 2020 నుంచి రావాల్సిన తునికాకు బోనస్ను సీపీఎం నాయకులు పోరాడి వచ్చేలా చేస్తే కూలీలకు పంచకుండా అధికారులే దండుకున్నారని మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, చిట్టిబాబు, రవి, యాకూబ్ పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య -
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
ములుగు: రహదారిపై నియమనిబంధనలు పాటించి వాహనాలు నడిపితేనే సురక్షిత ప్రయాణం సాధ్యమని, రహదారి భద్రతపై వాహనదారులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్. దివాకర తెలిపారు. అరైవ్ అలైవ్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2026 పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రక్షణ – సాంకేతికతతో మార్పు అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘బీ ఏ రోడ్ సేఫ్టీ ఛాంపియన్’ అంటూ పిలుపునిస్తూ వాహనదారులందరూ రహదారి నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం అందరిని ఆందోళనకు గురి చేస్తున్న అంశమని వివరించారు. గతేడాది గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4.80 లక్షల ప్రమాదాలు జరుగగా, అందులో దాదాపు 1.70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా నేడు నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. అంబేడ్కర్ ఉత్సవ కమిటీ సభ్యులతో తన ఛాంబర్లో కలెక్టర్ మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించాలన్నారు. అక్కడి నుండి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మీదుగా కలెక్టరేట్కు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో 11:30 గంటలకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జియో కోఆర్డినేషన్లో జాగ్రత్త వహించాలి ములుగు రూరల్: రాంచంద్రాపూర్ భూముల సర్వేలో జియో కోఆర్డినేషన్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండల పరిధిలోని రాంచంద్రాపూర్ శివారు రాజేశ్వర్రావుపల్లిలో చేపడుతున్న భూ సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. సర్వే తీరు, డేటా ఎంట్రీ, జియో కోఆర్డినేషన్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
విద్యార్థుల రాస్తారోకో
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోధాపురం పాఠశాల విద్యార్థులు ఆర్అండ్బీ రోడ్డుపై సోమవారం సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బోధాపురం పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడి పడుతున్నాయని తెలిపారు. దీంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. పాఠశాలకు ఐదు తరగతులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నాడని మిగిలిన ఉపాధ్యాయులను నియమించాలిని ఆందోళన చేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణం చేపట్టడంతో పాటు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. -
ముగిసిన ‘పది’ పరీక్షలు
ములుగు: జిల్లాలో నెల రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిసాయని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. రేపు(బుధవారం) ఒకేషనల్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 పరీక్ష కేంద్రాలలో 3,291 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 3,287 మంది పరీక్షలకు హాజరు కాగా నలుగురు గైర్హాజర్ అయినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేడు, రేపు ప్రజాదర్బార్ ములుగు: జిల్లాలోని ములుగు మండలం పరిధిలో నేడు రాయినిగూడెం, సర్వాపురం గ్రామాల్లో, బుధవారం మంగపేట మండలం రాజుపేట, మల్లూరు గ్రామాల్లో బుధవారం ప్రజాదర్బార్ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాయినిగూడెం గ్రామపంచాయతీలో మధ్యాహ్నం 3 గంటలకు, సర్వాపురం ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం 6 గంటలకు ప్రజాదర్భార్ ఉంటుందని వివరించారు. బుధవారం మంగపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్నం 3 గంటలకు, మల్లూరు జీపీలో సాయంత్రం 6 గంటలకు ప్రజాదర్భార్ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఇళ్లగణన పకడ్బందీగా చేపట్టాలి ములుగు: జనగణనలో భాగంగా చేపట్టనున్న ఇళ్లగణనను పకడ్బందీగా చేపట్టాలని జనగణన రాష్ట్ర సంచాలకులు భారతి హోలికేరీ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇళ్ల గణన ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. ప్రక్రియ నిర్వహణలో భాగంగా ఇళ్ల జాబితా బ్లాక్లను రూపొందించాలని తదితర సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జనగణనలో చేపట్టనున్న ఇళ్లగణన కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని తెలిపారు. రామప్పలో టీజీఎఫ్డీసీ జీఎం వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) జనరల్ మేనేజర్ జి. స్కైలాబ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వారికి వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ములుగు జిల్లా డివిజనల్ మేనేజర్ శైలజ, భూపాలపల్లి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ బి.కరుణాకర్ రావు ఉన్నారు. కొలువుదీరిన పాలకవర్గంకాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం దేవాదాయశాఖ సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈఓ శనిగెల మహేష్ ఆధ్వర్యంలో 11 మంది ధర్మకర్తలు, ఒక ఎక్స్అఫీషియో (అర్చక)తో ఆలయ చైర్మన్గా అవధాని మోహన్శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈఓ చైర్మన్తో పాటు ధర్మకర్తలను ప్రమాణస్వీకారం చేయించారు. ధర్మకర్తలుగా దొడ్ల అశోక్, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్ రావు, మంచినీళ్ల దుర్గయ్య, గందెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, జలవంచ సీతారాం, కాటం సత్తయ్య, శ్యాంసుందర్ దేవుడా, ఎక్స్ అఫీషియో మెంబర్గా దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ 12మంది సభ్యులు రెండేళ్ల కాల పరిమితితో కొలువుదీరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమ హాయంలో బృహత్తర ప్రణాళికతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సహకారంతో దేవస్థానం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతామన్నారు. -
జనగణనలో రిలీజియన్ కాలం ఇవ్వాలి
● తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ ఏటూరునాగారం: జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక రిలీజియన్ కాలం ఏర్పాటు చేయాలని, కోయ భాషను 8వ షెడ్యూల్లోకి చేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏను ముట్టడించి తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని ఆదివాసీలు యాప్ ద్వారా యూరియా బస్తాలు తెచ్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏజెన్సీలో యాప్ ద్వారా కాకుండా, సాధారణ పద్ధతిలో యూరియా బస్తాలు ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పోడు భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీలో సాదాబైనామా జీవో నంబర్ 76తో ఏజెన్సీ ప్రాంత చట్టాలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. పీహెచ్సీల్లో వైద్యాధికారులను నియమించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఏపీఓ వసంతరావుకు ఆదివాసీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింత కృష్ణ, వట్టం జనార్దన్, కొమరం లక్ష్మీకాంత, చర్ప లలిత, చందా మహేశ్, కాపుల సమ్మయ్య, వట్టం సురేశ్, పొడెం నరసింహరావు, తొర్రెం సంతోశ్, లక్ష్మణ్, ఆలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
సాదాబైనామా చిక్కులకు చెక్!
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఉమ్మడి వరంల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా ఫైళ్లకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్కు సిద్ధమవుతూ, జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. దీనివల్ల వేలాది మంది రైతులు, పేదలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీఓ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు ఆ జీఓపై వచ్చిన అభ్యంతరాలు, సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చినా.. భూక్రయ, విక్రయదారులు ఇద్దరి అఫిడవిట్లు, తదితర నిబంధనల కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా అఫిడవిట్ల నిబంధనలను సడలించడంతోపాటు దరఖాస్తుల పరిశీలించే పరిష్కరించే అధికారాలు పూర్తిగా ఆర్డీఓలకు ఇవ్వడంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఐదున్నరేళ్లుగా పెండింగ్లో.. సాదాబైనాల క్రమబద్ధీకరణ కోసం జీఓలు ఎన్ని తెచ్చినా దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. 2016లో జీఓనం.153, 2020లో జీఓ 112లను తీసుకువచ్చారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామాలు కలిగిన భూములను క్రమబద్ధీకరించడం.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే ఉద్దేశంతో రెండు పర్యాయాలు, ఈ రెండు జీఓలు తెచ్చారు. జీఓ నం.112పై‘పిల్’దాఖలు కావడంతో దానిని అమలు కాకుండా నిలిపివేశారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిష్కారం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, అంతకు ముందున్న మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,89,739లకు చేరింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, క్షేత్రస్థాయి పరిశీలన పేరిట తాత్సారం జరుగుతూ వచ్చింది. నిబంధనల సడలింపు, ఆర్ర్డీఓల క్షేత్రస్థాయి పరిశీలన ఉత్తర్వుల నేపథ్యంలో రైతుల దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన వాటిని పరిష్కరించనున్నారు. ‘అఫిడవిట్’ నిబంధనలు సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలు ఫాస్ట్ట్రాక్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం ఉమ్మడి వరంగల్లో 1.90 లక్షల దరఖాస్తులు 2020 నుంచి వెయిటింగ్.. ఆర్డీఓలకు కీలక అధికారాలు త్వరలోనే సాదాబైనామాలకు పరిష్కారం.. జిల్లా పెండింగ్ హనుమకొండ 27,057 వరంగల్ 26,630 ములుగు 20,150 జేఎస్ భూపాలపల్లి 51,347 జనగామ 33,305 మహబూబాబాద్ 31,250 మొత్తం 1,89,739 -
హేమాచలక్షేత్రంలో జాతర వేలం పాటలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 6వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా కల్యాణ మండపంలో ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో జాతర వేలం పాటలను సోమవారం నిర్వహించారు. హన్మకొండ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో నెల రోజుల పాటు వివిధ రకాల షాపుల ఏర్పాటు, విక్రయాలకు అనుమతులు పొందేందుకు షీల్డ్, బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి విక్రయాలు జరిపేందుకు హుజురాబాద్కు చెందిన ఎక్కెటి రాము రూ.2,86,666 లక్షలకు దక్కించుకున్నారు. కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు నల్లగొండ జిల్లా దామరచెర్లకు చెందిన నన్నెబోయిన మల్లయ్య రూ.1,08,000 లకు దక్కించుకున్నారు. స్వామి వారికి భక్తులు సమర్పించే తలనీలాలు, పుట్టు వెంట్రుకలు పోగు చేసుకునేందుకు వరంగల్కు చెందిన సత్యనారాయణ రూ 2,25,000లు, ఫొటోలు తీసుకునేందుకు మల్లూరుకు చెందిన ముత్తయ్య రూ 5,500, చెప్పుల స్టాండ్ నర్సింహారావు రూ.6వేలకు పాడుకున్నారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల వేలం వాయిదా వేసినట్లు తెలిపారు. 2025 జాతర వేలం పాటల ఆదాయం కంటే రూ.85,166 అదనపు ఆదాయం వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, ఆలయ సిబ్బంది శేషు, అజయ్ పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహారం అందించిన 10 నెలల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం పథకాన్ని అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనం పెంచడంతో పాటు గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ పథకం పేరుతో స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు సామ ల రమ, ఆయా మండలాల మండల అధ్యక్షులు పద్మ, కమలక్క, శోభ, సరోజన, భవాని, భారతి, అమృత, రాజ్యలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ -
ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి ఎన్నిక
ఏటూరునాగారం: భారతరాజ్యాంగ ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితిని శనివారం ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శనివారం భారత రాజ్యాంగ ఆదివాసీ హక్కుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో అన్ని ఆదివాసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చందా లింగయ్య దొర హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన సమితిని ఎన్నుకున్నట్లు వివరించారు. జిల్లా కన్వీనర్గా ఈసం యాదయ్య, కో కన్వీనర్లుగా చందా మహేశ్, కాపుల సమ్మయ్య, ఈసం రాజు, తోలం సుధాకర్, గలి సమ్మయ్య, ఇండ్ల సమ్మయ్య, నల్లబోయిన లక్ష్మణరావు తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, పోడెం బాబు, శ్రీనాధ్, పాయం సత్యనారాయణ, శ్రావణ్, రవి, వీరయ్య, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫెన్సింగ్తో ఉజ్వల భవిష్యత్
ఫెన్సింగ్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. తల్లిదండ్రులు రొటీన్ క్రీడల్లో కాకుండా అత్యంత అరుదైన ఫెన్సింగ్లో శిక్షణ అందించేందుకు చొరవ చూపాలి. అంతంత మాత్రంగానే ఉన్న ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. నేటి యువతలో ఫెన్సింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంది, సదుపాయాలు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు. – దుబ్బ రాము, కార్యదర్శి, జిల్లా ఫెన్సింగ్ సంఘం గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు చర్యలు ఆదరణ కోల్పోతున్న ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ ఇచ్చేందుకు గ్రామీణ యువతను ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తాం. అందుకు వేసవి సెలవుల్లో మండల కేంద్రాల్లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – తాళ్లపెల్లి ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు, జిల్లా ఫెన్సింగ్ సంఘం -
ఔషధాలను మోతాదుకు మించి వాడొద్దు
ములుగు రూరల్: ఔషధాలను మోతాదుకు మించి వాడొద్దని, వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్రెడ్డి సూచించారు. ఈ మేరకు శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఔషధ నియంత్రణ– బలోపేతం, యాంటి నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యుల సూచనల మేరకు యాంటి బయాటిక్స్ వాడాలన్నారు. నకిలీ మందులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మందుల నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్యాకింగ్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని వివరించారు. ఫిర్యాదు చేసేందుకు నంబర్ 18005996969కు కాల్ చేయాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్పప్రభావాలను వివరించారు. నిషేధిత వస్తువుల అమ్మకాలపై టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో మత్తుకు బానిసైన వారి చికిత్స నిమిత్తం 10 బెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, డీసీహెచ్ఎస్ జగదీశ్వర్, మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మెడికల్ షాపుల యజమానులు, పార్మసిస్టులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ‘ఉపాధి పనులకు కూలీలు వచ్చేలా చూడాలి’ ఏటూరునాగారం: మండల పరిధిలోని సర్పంచ్లు వారి గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలు ఎక్కువ రోజులు పనికి వచ్చేలా చూడాలని ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈజీఎస్ పనులు గ్రామాల్లో చేసినప్పుడు కూలీలకు పనులు కల్పించడం వల్ల మెటీరియల్ నిధులు వస్తాయని వెల్లడించారు. గ్రామాల్లో చెక్డ్యామ్లు, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, వీఓ భవనాలు, స్కూల్ బాత్రూమ్లు, పాఠశాల పహరీలు, ఇంకుడు గుంతలు, కంపోస్టు యూనిట్లు, మేకల షెడ్డు, గొడ్ల, బర్లపాకలు, కోళ్ల పెంపకంతో పాటు షెడ్ల వంటి పనులు చేయించుకునే అవకాశాలున్నాయని వివరించారు. ఈజీఎస్ పనులకు కూలీలు రాకపోతే మెటీరియల్ నిధులు రాకుండా పోతాయని పేర్కొన్నారు. పనికి హాజరు కాని వారి జాబ్ కార్డులను తొలగిస్తారని తెలిపారు. అదే విధంగా గ్రామాల్లో కూలీలతో పనులు చేయించేందుకు మేట్లు కావాలని వెల్లడించారు. రాయడం, చదవడం వచ్చిన వారికి మేట్గా అవకాశం కల్పిస్తామని, ఆసక్తిగల వారు వారి వారి జీపీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి వాజేడు: బీజేపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, భద్రాచలం నియోజక వర్గ ఇన్చార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని పూసూరు వద్ద రిసార్ట్లో వాజేడు, వెంకటాపురం(కె), చర్ల మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ పని స్థాయిని బట్టి దేశం నుంచి మండల స్థాయి వరకు నిర్ణీత బృందాల సమావేశంలో పార్టీ అభ్యున్నతికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కందుల రాంకిశోర్, మండల అధ్యక్షుడు పెద్ది జగపతి బాబు, చర్ల, వెంకటాపురం(కె) మండలాల అధ్యక్షులు రాజశేఖర్, రమేశ్ నాయకులు అట్టం మమత, సీతారామరాజు, బలరాం, సుబ్బయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ధి చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. అంతర్జాతీయ వేదికపై ప్రతిభ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది. పదేళ్లలో పది పోటీల్లో ప్రతిభ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. ఫెన్సింగ్ క్రీడలో రాణిస్తున్న ఓరుగల్లు యువతులు జాతీయ స్థాయిలో పతకాలు ప్రోత్సహిస్తే ఒలింపిక్స్లో రాణించే అవకాశం -
అభివృద్ధి నిల్!
ఆదాయం ఫుల్..మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో అభివృద్ధి పనులు కానరావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నా అభివృద్ధి పనులు హామీలకే పరిమితం అవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 6వ తేదీ వరకు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) నిర్వహించనున్నారు. మే 1న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంతో పాటు 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్టాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయానికి ప్రతీ శని, ఆది వారాల్లో వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. 35 ఏళ్లుగా దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతున్నా ఆలయ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. బ్రహ్మోత్సవాలకు మరో 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలయానికి పాలకమండలి లేకపోవడంతో పాటు రెగ్యులర్ ఈఓను ఉన్నతాధికారులు నియమించలేదు. గడిచిన 8 నెలల కాలంలో ఇద్దరు ఈఓలను మార్చడంతో పాటు ఈఓ స్థానికంగా ఉండకపోవడంతో ఆలయ అభివృద్ధికి అడ్డుగా మారిందని భక్తులు చర్చించుకుంటున్నారు. అలాగే ఆలయంలో గత కొంతకాలంగా అర్చకుల మధ్య బేదాభిప్రాయాల విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఆలయ అభివృద్ధికి ప్రధాన ఆటకంగా తయారైందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోతకు గురైన రోడ్లు ప్రధానంగా గుట్టపైకి వెళ్లే ప్రధాన ఆర్చీ వద్ద ఇరుకుగా ఉన్న రోడ్డు వర్షాకాలంలో గుట్టపై నుంచి వచ్చే వరదల వల్ల కోతకు గురై అత్యంత ప్రమాదకరంగా మారింది. అదేవిధంగా శిఖాంజనేయ స్వామి ఆలయానికి కాలిబాటన వెళ్లే రోడ్డు వద్ద నుంచి ఆర్చీ వరకు సీసీ రోడ్డు వెంట సుమారు 50 మీటర్లకు పైగా 3 మీటర్ల వెడల్పుతో రోడ్డు కోతకు గురై అత్యంత ప్రమాదకరంగా మారింది. గతేడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు అసంపూర్తిగా చేపట్టి వదిలేయడంతో కాలిబాట వద్ద నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు అత్యంత ప్రమాదకరంగా తయారైంది. జాతర ప్రారంభం నాటికి సంవత్సరకాలంగా నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయడంతో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తారా లేదా అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల హామీలపైనే ఆశలు గత నెల 1వ తేదీన మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, పలువురు ఎమ్మెల్యేలు స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. 2027లో వచ్చే పుష్కరాల వరకు హేమాచలక్షేత్రాన్ని ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు. మంత్రుల ఆదేశాల మేరకు ప్రధాన ఆర్చీ నిర్మాణం, రోడ్డు విస్తరణ, ఆలయ ముఖ మండపం, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పార్కింగ్ స్థలాలతో పాటు తదితర అభివృద్ధి పనుల నివేదిక రూపొందించేందుకు కలెక్టర్, దేవాదాయశాఖ డీఈ రమేష్బాబు హైదరాబాద్కు చెందిన ఆర్కిటిక్ బృందం, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. అదే విధంగా బ్రహ్మోత్సవాల వరకు భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు అనుమతులు రాలేదుఈ నెల 27 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవాదాయశాఖ, ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తాం. – వీరస్వామి, ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారిహేమాచలక్షేత్రంలో కానరాని పనులు నాయకుల మాటలు హామీలకే పరిమితం ఈ నెల 27 నుంచి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రమాదకరంగా మారిన రోడ్లుహామీలకే పరిమితమైన ప్రత్యేక నిధులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి పనులు నాయకుల మాటలకే పరిమితం అవుతున్నాయని అటు భక్తులు, ఇటు స్థానికులు ఆరోపిస్తున్నారు. 2017లో అప్పటి గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మద్రాస్కు చెందిన స్థపతి వల్లినాయర్ బృందం ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ చేసిన ప్రత్యేక మాస్టర్ ప్లాన్గా ఆలయాన్ని ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించి దేవాదాయశాఖకు నివేదిస్తామని తెలిపారు. అదేవిధంగా ట్రైబల్ టూరిజం నుంచి ప్రత్యేక నిధులను కేటాయించే విధంగా కృషి చేస్తానని ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యం
● రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు: అమ్మ మాట – అంగన్వాడీ బాటతోనే ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించడం సాధ్యమని, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐ లవ్ ములుగు థీమ్ వద్ద పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలు చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఐసీడీఎస్ విభాగం ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తినే ఆహారంలో పోషక విలువలు తగ్గడం, కల్తీ ఆహారం, జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయస్సులోనే పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. అందుకోసమే బయట దొరికే జంక్ ఫుడ్ పిల్లలకు విషంతో సమానమని, తల్లులు తమ చేతులతో వండిన నాణ్యమైన ఆహారాన్నే పిల్లలకు అందించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు రోడ్ల మీద దొరికే ఆహారం తీసుకోవద్దన్నారు. కల్తీ లేని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. అమ్మ మాట – అంగన్వాడీ బాట అనే నినాదంతో ప్రతీ అంగన్వాడీ సెంటర్ ద్వారా నాణ్యమైన ఆహారం అందించడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్, పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను సీతక్క ప్రారంభించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డిడబ్ల్యూఓ ప్రేమలత పాల్గొన్నారు. -
నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షుడి రాక
ములుగు: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ నేడు(శనివారం) జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారని తెలిపారు. గట్టమ్మ నుంచి లీలా గార్డెన్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం లీలా గార్డెన్లో జరిగే కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతారని అశోక్ వెల్లడించారు. రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పూలే ఉత్సవాల కమిటీ కన్వీనర్గా మల్లేశ్వర్కేయూ క్యాంపస్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్గా కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్ నియమితులయ్యారు. కమిటీలో 15మంది కన్వీనర్లు ఉండగా అందులో కేయూ నుంచి మల్లేశ్వర్ ఒకరు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మల్లేశ్వర్ పూలే ఆశయ సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వాదంతో ముందుకెళ్తున్నారు. నేడు స్వామి వారి కల్యాణం రేగొండ: మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం నేడు (శనివారం) నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. కల్యాణం అనంతరం మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య అవగాహన సదస్సు భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి డిపోలో శుక్రవారం ఆర్టీసీ సిబ్బందికి ఆరో గ్య అవగాహన సదస్సు నిర్వహించారు. డిపో మేనేజర్ ఇందు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తార్నాక ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సుజిత్ ఆర్టీసీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై విలు వైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా సిబ్బందిలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 80 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు అమృత, వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ యాదగిరి, హెల్త్ వాలంటీర్ చక్రవర్తి, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాజం పాల్గొన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా హన్మకొండ: వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. వరంగల్ ములుగు రోడ్డులోని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి ఆయన డీఈలు, ఏఈలు, అకౌంట్స్ అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరా, బ్రేక్డౌన్స్, ట్రిప్పింగ్స్, బిల్లుల వసూలు, బకాయిలు ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు మూడు నెలల ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు. రెవెన్యూ వసూళ్లు వంద శాతం సాధించాలని, బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతంరెడ్డి, డీఈలు రాంబాబు, ఎస్.మల్లికార్జున్, బక్క దానయ్య, ఏఈలు అకౌంట్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
అయ్యో పాపం..!
సింగరేణి సెక్యూరిటీ గార్డు నియామకాల్లో అన్యాయంప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు పరీక్షలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ అధికారులు (ఫైల్) భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం ప్రవేశపెడుతున్న నూతన టెండర్ విధానం సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్హుల ఉపాధిని దెబ్బతీసేలా ఉంది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో దాదాపు 20 ఏళ్లుగా సుమారు 1,200 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ గార్డులు పనిచేస్తూ సంస్థ ఆస్తుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యాజమాన్యం వీరి ఉపాధిని దెబ్బతీసేలా నూతన టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టెండర్ విధానాన్ని రద్దుచేయాలని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కోరుతున్నారు. సింగరేణిలో అవుట్ సోర్సింగ్ ప్రారంభమైన తొలిరోజుల్లో 2001 నుంచి నేటివరకు సింగరేణి వ్యాప్తంగా సుమారు 1,220 మంది కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులను కంపెనీ నియమించింది. వీరిలో ఆ ప్రాంతంలో ఉన్న భూ నిర్వాసితులు, వివిధ గ్రామాల ఓసీ ప్రభావిత ప్రాంతాల గ్రామాల నిరుద్యోగ యువకులు, సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ కార్మికుల వారసులు ఉన్నారు. వీరంతా సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాలలో చాలీచాలని జీతాలతో, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అందనప్పటికీ సంస్థ అభివృద్ధి కోసం విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఉన్న భూములను కంపెనీకి ఇచ్చి, కట్టుకున్న ఇళ్లు కోల్పోయి పూర్తి నిర్వాసితులుగా మారారు. వీరు సింగరేణి ఇచ్చిన ప్రైవేట్ ఉద్యోగంతో తమ బతుకు బండిని నడుపుతున్న క్రమంలో కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల స్థానంలో కొత్తగా పలు నిబంధనలు తెచ్చింది. భూనిర్వాసితులుగా సింగరేణి చే గుర్తించబడిన వారికి ఈ నూతన విధానం వలన ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే విధంగా టెండర్ విధానాన్ని యాజమాన్యం తెచ్చిందని తక్షణమే ఈ నూతన టెండర్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్నే కొనసాగించే విధంగా సవరణ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. పర్మనెంట్, కీ పోస్టుల్లో సైతం విధులు.. సింగరేణి సంస్థలో గతంలో రిటైర్డ్ ఆర్మీ అభ్యర్థులను సెక్యూరిటీ గార్డులుగా యాజమాన్యం నియామకాలు చేపట్టేది. ఆ పక్రియను నిలిపివేస్తూ అండర్ గ్రౌండ్లలో పనిచేసిన ఉద్యోగులతో సెక్యూరిటీ గార్డుల నియామకాలు చేపట్టింది. ఆ తర్వాత దానిని కొనసాగించకుండా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డుల కంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సంఖ్య గణనీయమంగా పెరిగింది. గతంలో పర్మనెంట్ కార్మికులు చేసిన పోస్టుల్లో ప్రైవేట్ వారు విధులు నిర్వహిస్తూ కంపెనీ ఆస్తులను కాపాడుతున్నారు. ఈ నియామకాల్లో ప్రభావిత ప్రాంతాల వాసులు, ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి కల్పించిన అవకాశాన్ని రద్దుచేసి, వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా యాజమాన్యం తెచ్చిన నూతన విధానాన్ని రద్దు చేయాలని వేడుకుంటున్నారు. యాజమాన్యం ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి ని తొలగించే ప్రక్రియలో భాగంగా తీసుకొచ్చి న కొత్త సర్క్యులరు వెంటనే రద్దుచేసి పాత వారికి చట్టబద్ధత హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించాలి. లేదంటే ఆందోళన చేపడతాం. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పంటపొలాలు, ఇళ్లను ధారాదత్తం చేసిన భూనిర్వాసితులకు యాజమాన్యం తెచ్చిన నూతన విధానంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. – కంపేటి రాజయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపాధిని దెబ్బతీసేలా నూతన టెండర్ విధానం నిబంధనలు మార్చాలని డిమాండ్ -
పూడికతీత.. సాగదీత!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది గడిచినా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. చెరువు సుందరీకరణ, లోతు, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం లక్ష్యంగా చేపట్టిన ఈ పనులు ఎంతకు పూర్తవకపోవడం నగరవాసులను అసహనానికి గురి చేస్తున్నాయి. తాజాగా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ ఏడాది మే వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తరచూ పరిశీలించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ధరలు తగ్గించి పనులు.. నత్తనడకన పూడికతీత.. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ సుమారు 50 ఏళ్ల తర్వాత 2025, జనవరిలో భద్రకాళి చెరువు పూడికతీతపై దృష్టి సారించింది. దీంతో చెరువులో పూడికతీత కోసం నీరంతా ఖాళీ చేశారు. అంతకుముందే పూడికతీత పనుల కోసం పంపించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం రూ.13,00,09,046లతో రెండు పనులకు నీటిపారుదలశాఖ 2025, జనవరి 5, 10 తేదీల్లో టెండర్లు పిలిచింది. ఇందులో ఒక పని చెరువులో పూడిక తవ్వడం, లోడింగ్ కోసం క్యూబిక్ మీటర్కు రూ.53 చొప్పున రూ.3,49,11,446 కేటాయించారు. అదే విధంగా క్యూబిక్ మీటరుకు రూ.162.56 చొప్పున 5.85 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తరలించేందుకు రూ.9,50,97,600లు చెల్లించేలా మరో పనికి టెండర్ పిలిచారు. మట్టి తవ్వకం, లోడింగ్ ప ని కంటే... పూడిక మట్టి తరలించే పనికి సంబంధించి గతేడాది జనవరి 17, 27 రెండు తేదీల్లో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో క్యూబిక్ మీటర్ రూ.16 2.56ల నుంచి రూ.71.83లకు తగ్గించి పనులు అప్పగించారు. అయినప్పటికీ 7.70 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసి తరలించాల్సి ఉండగా.. ఇప్పటికీ సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్లే తీశారు. ఆలస్యానికి అనేక కారణాలు.. భద్రకాళి చెరువు పూడికతీత పనులు ఏడాదిలో పూర్తి కావాల్సి ఉండగా.. నిధుల విడుదలో ఆలస్యం, యంత్రాల కొరత, సాంకేతిక సమస్యలను అధికారులు కారణాలుగా చూపుతున్నారు. భద్రకాళి చుట్టూ కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అడ్డంకులు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాది గడిచినా ఇప్పటికి 30 శాతం పనులే కాగా.. అధికారులు చెబుతున్నట్లు మే–జూన్ మాసాల నాటికి పూర్తి అనుమానమే అంటున్నారు. పూర్తిస్థాయి డీప్ డీసిల్ట్రింగ్, బండలు, చెత్త తొలగింపు, చెరువు పరిసరాల అభివృద్ధి (ఫుట్పాత్లు, గ్రీనరీ) తదితర పనులు ఎప్పటికీ పూర్తవుతాయన్న అనుమానాలు కూ డా వ్యక్తమవుతున్నాయి. గతేడాదే పూడికతీత పేరుతో చెరువును ఖాళీ చేయడం వల్ల గ్రేటర్ వరంగల్ నగరంపై తాగునీటి ప్రభావం పడింది. ఈసారి కూ డా ఆ ప్రభావం మరింతగా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘పనులు త్వరగా పూర్తి చేసి చెరువును పరిరక్షించాలి. గతేడాదిలా ఈసారి ఆ పరిస్థితి రావద్దు’ అని నగరవాసులు కోరుతున్నారు. ఏడాది గడిచినా పూర్తికాని భద్రకాళి చెరువు పూడికతీత.. మట్టి తరలింపు 14 మాసాల్లో 7.70 లక్షల క్యూబిక్ మీటర్లకు తీసింది 2 లక్షల క్యూబిక్ మీటర్లే మే నాటికి పూర్తికాకపోతే తాగునీటికి సమస్య -
అటునుంచి అటే..!
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యంములుగు: నిరుపేదలకు సన్నబియ్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. దొడ్డుబియ్యంపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదనే కారణంతో ఏడాది క్రితం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. మొదటి మూడు, నాలుగు నెలల పాటు సన్నబియ్యంపై ఆసక్తి చూపిన లబ్ధిదారులు ప్రస్తుతం అంతగా పట్టించుకోవడంలేదని తెలుస్తుంది. దీంతో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యత లోపంతో ఉంటున్నాయని, అన్నం వండితే మెత్తగా అవ్వడమే కాకుండా బియ్యానికి తొందరగా పురుగులు పడుతున్నాయని లబ్ధిదారుల అభిప్రాయం. సన్నబియ్యంపై ఆసక్తి చూపని లబ్ధిదారులు రేషన్ షాపుల్లో వేలిముద్రలు వేస్తే డీలర్లు కిలోకు రూ.12 చొప్పున చెల్లిస్తుండడంతో నగదును తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఒకరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో నలుగురు ఉంటే 24 కిలోల బియ్యాన్ని రూ.288 చొప్పున డీలర్లకే విక్రయిస్తున్నారు. క్వింటా రూ.2800 జిల్లాలోని 10 మండలాల పరిధిలో 222 రేషన్ షాపులు ఉండగా 1.02 లక్షల కార్డుదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో 5,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏప్రిల్ నెలలో లబ్ధిదారులకు అందించనున్నారు. గత 10 రోజులుగా రేషన్ షాపుల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండగా మెజార్టీ రేషన్ షాపుల్లో బియ్యం దందా కొనసాగుతుంది. లబ్ధిదారులతో మూడుసార్లు వేలిముద్ర వేసుకొని కిలోకు రూ.12 చొప్పున చెల్లిస్తూ బియ్యాన్ని డీలర్లు తమ వద్దనే నిల్వ చేసుకుంటున్నారు. సన్నబియ్యం మార్కెట్లో రూ.5 వేల నుంచి రూ.6 వేల ధర ఉండగా రేషన్ షాపుల్లో క్వింటాకు రూ.2,800 చొప్పున బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క బస్తా 50 కిలోలు ఉండగా బస్తాకు రూ.2,400 చొప్పున విక్రయిస్తూ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదా రులకు రూ.12 చొప్పున చెల్లించి అదే బియ్యాన్ని రూ.28 కు విక్రయిస్తుండడం గమనార్హం. జిల్లాలోని రేషన్ షాపులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. మూడు నెలల కోటా ఒకేసారి ఇస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లా పౌర సరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ ఏడాదిలో రేషన్ షాపులపై పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఒక్కొక్క రేషన్ షాపు నుంచి ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేసి అధికారులకు ముడుపులు అప్పజెప్పుతున్నట్లు డీలర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకొని బ్లాక్ మార్కెట్లో సన్నబియ్యాన్ని విక్రయిస్తున్న డీలర్లపై కఠన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సన్న బియ్యం అమ్ముకుంటున్న రేషన్ డీలర్లు క్వింటా రూ.2,800 చొప్పున విక్రయం మెజార్టీ రేషన్ షాపుల్లో కొనసాగుతున్న అక్రమ దందా రేషన్ షాపులపై కరువైన అధికారుల పర్యవేక్షణ -
నేడు, రేపు జేఎన్ఎస్లో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నేడు, రేపు(11,12 తేదీల్లో) 11వ తెలంగాణ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 552 మంది క్రీడాకారులు, 28 మంది టెక్నికల్ అఫిషియల్స్, 20 మంది వలంటీర్లు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరగనున్న ఫెడరేషన్ కప్ జూనియర్, సీనియర్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అంతర్జిల్లాల ఓపెన్ టు ఆల్ టెన్నీస్ పోటీలు వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్ వేదికగా శని, ఆదివారాల్లో తెలంగాణ అంతర్ జిల్లాల స్థాయి ఓపెన్ టు ఆల్ టెన్నిస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయసింహరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణ హాజరై ప్రారంభిస్తారని పేర్కొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
మంగపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల పంటకు మద్ధతు ధర లభిస్తుందని రాష్ట్ర ఉపాధిహామీ మండలి (టీఎస్ఈజీసీ) సభ్యుడు గుమ్మడి సోమయ్య అన్నారు. మండల కేంద్రంలోని గంపోనిగూడెం మార్కెట్ యార్డు వద్ద జ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో సెర్ఫ్ ద్వారా గణనాయక గ్రామైఖ్య సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమయ్య శుక్రవారం ప్రారంభించారు. అకినేపల్లి మల్లారంలో వివేకా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ కృష్ణవేణి, డిప్యూ టీ తహసీల్దార్ విజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, కామన్ గ్రేడ్ క్వింటాకు రూ.2,369 ప్రభుత్వం మద్దతు ధర, సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రునాయక్, డీసీ ఎస్ఓ ఫజల్ హైమద్ షైనీ, డీఆర్డీఓ ఏపీడీ గొట్టె శ్రీనివాస్, డీపీఎం హెచ్ఆర్ కోటేశ్వర్రావు, డీపీఎం దేవానంద్, సీ్త్రనిధి ఆర్ఎం అశోక్, ఏపీఎం సత్యనారాయణరెడ్డి, మిర్చీ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యు డు నాసిరెడ్డి సాంబశివరెడ్డి సీసీలు, వీఓ లీడర్లు, మహిళా పొదుపు సంఘాల లీడర్లు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క ప్రజా దర్బార్లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఎస్ఎస్తాడ్వాయి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి సొంతిల్లు కట్టించి అంకంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అంకంపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంతోపాటు ఆర్అండ్బీ రోడ్డు నుంచి అంకంపల్లి వరకు రూ.83 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ పేద కుటుంబానికి సొంతల్లు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఆ కల సాకారమవుతుందన్నారు. గ్రామీణ జీవనోపాధికి బొంగు చికెన్, ఇప్ప పువ్వు వంటి స్థానిక వనరులను ఆదాయ మార్గాలుగా మలుచుకోవాలన్నారు. అర్హులైన ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అదే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సీతక్క.. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, మౌలిక సదుపాయాలపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు. గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, సర్పంచులు బడే రజిత, వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర మాజీ చైర్మన్ లచ్చుపటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి సునీల్, మండల ఉపాధ్యక్షుడు నాగేశ్వర్రావు, నార్లాపూర్ సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ భాస్కర్రెడ్డి ఉన్నారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ములుగు: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, రోజువారీ జీవనశైలిలో యోగా ను ఒక భాగంగా అలవర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రపంచ హోమియోపతి (ఆయుష్ డే) దినోత్సవానికి సీతక్క హాజరయ్యారు. కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతీ రోజు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు యోగా చేయడం ద్వారా శరీరం, మెదడు చురుకుగా పనిచేస్తాయని తెలిపారు. పురా తన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా మా త్రమే మనిషి తన ఆశలను, ఆశయాలను, ఉన్నత లక్ష్యాలను చేరుకుంటాడని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులు, ఆయుష్ సి బ్బంది, క్రీడాకారులు, క్రీడాభిమానులతో కలిసి యోగాసనాలు వేసి అందరిని ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, కౌన్సి లర్లు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాంవెంకటాపురం(కె): అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కంకలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు, పాలెం, చొక్కాల, వెంకటాపురం మండలకేంద్రంలో సీసీ రోడ్లు, రాచపల్లి పంచాయతీ మొట్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర, తహసీల్దార్ వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంకంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం -
ఇసుక పంపిణీలో పారదర్శకత
ములుగు: జిల్లాలోని 10 మండలాల్లో గురువారం నుంచి ‘మన ఇసుక వాహనం‘ అమలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వం ఇసుకను పారదర్శకంగా తక్కువ ధరకే అందిస్తోందని తెలిపారు. ఇసుక కావాల్సిన వారు టీఎస్ఎంఐవీ.సీజీజీ.జీఓవి.ఐఎన్ వెబ్సైట్ నుంచి వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభం యాసంగి (రబీ) 2025–26 సీజన్ కోసం కలెక్టరేట్లోని సివిల్ సప్లై కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ను గురువారం కలెక్టర్ దివాకర టీఎస్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం, రవాణా, మద్దతు ధర ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు రైతులకు కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుందని, ఫిర్యాదుల కోసం 93474 16178 నంబర్ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఆర్డీఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏడీ మైన్స్ జయరాజు, పీడీ హౌసింగ్ సూర్యనారాయణ, సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, టెలికాం సంస్థల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల కోసం జరిగే తవ్వకాల్లో భాగంగా టెలికాం, టీ ఫైబర్ కేబుల్స్ రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఐటీఎస్ డిప్యూటీ డైరెక్టర్ భాస్కరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా టెలికాం కమిటీ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ‘మన ఇసుక వాహనం‘ అమలు కలెక్టర్ దివాకర టీఎస్ -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
వెంకటాపురం(ఎం): ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎంఎస్పీ ములుగు జిల్లా కార్యదర్శి కాడపాక శ్యాం ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని ఈజీఎస్ నర్సరీ వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా శ్యాం మాట్లాడుతూ.. మూడు నెలలుగా పని చేస్తున్నా.. కూలి డబ్బులివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, వెంటనే కూలీల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూకంటి పుష్ప, పోలోజు శ్రీవాణి, ల్యాగల సమ్మక్క, గుర్రం రాణి, వనం మమత, పల్లెబోయిన ప్రమీల, గండి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
యువ విలాపం!
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారుల్లో నిరాశములుగు రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కానీ అమలు చేయడంలో మాత్రం జాప్యం చేస్తోంది. జూన్ 2న పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో హడావిడిగా నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్ౖ లె న్లో స్వీకరించారు. నేటికి పది నెలలు గడిచినా పథకం అమలు తీరుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ చెందుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు యువకులు దరఖాస్తులు అందించారు. జిల్లా స్థాయిలో ఎంపీడీఓలు లబ్ధిదారులకు బ్యాంకుల ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూలు నిర్వహించారు. మంజూరు పత్రాలు ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం తాత్కలికంగా వాయిదా వేయడంతో స్వయం ఉపాధి ఊసేలేకుండాపోయింది. జిల్లాలో 3,005 మంది దరఖాస్తులు ములుగు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 3,005 మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ 608 మంది, ఎస్టీ కార్పొరేషన్ 1,200, మైనార్టీ కార్పొరేషన్ 96, క్రిస్టియన్ మైనార్టీ–1, బీసీ కార్పొరేషన్ 817, ఈబీసీ వెల్ఫేర్ 67, వాషర్మ్యాన్ కార్పొరేషన్ సొసైటీ –11, నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ సొసైటీ–3, వడ్డెర కో–ఆపరేటివ్ సొసైటీ–1, సగార కో–ఆపరేటివ్ సొసైటీ–1, కృష్ణ బాలాజీ కో– ఆపరేటివ్ సొసైటీ–02, కమ్మరి శాలివాహన కో–ఆపరేటివ్ సొసైటీ–07, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ సొసైటీ–24, మేదర కో–ఆపరేటివ్ సొసైటీ–02, టాడీ సొసైటీ–15, గంగపుత్ర కో–ఆపరేటివ్ సొసైటి–40, పెరిక సొసైటీ–32, ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ –21, మున్నురుకాపు కో–ఆపరేటివ్ సొసైటీ–28, గొల్ల కురుమ కో–ఆపరేటివ్ సొసైటీ–29 ద్వారా దరఖాస్తులు అందించారు. ఊసు లేని స్వయం ఉపాధి జిల్లాలో 3,005 దరఖాస్తులు బ్యాంకుల ఎంపిక, ఇంటర్వ్యూలు పూర్తి పది నెలలు గడిచినా అమలు కాని పథకంరాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని కేటగిరీల వారీగా విభజించి విడతల వారీగా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేటగిరి–1లో 50 వేలు, కేటగిరి–2లో 1 లక్ష వరకు ఉన్న యూనిట్లను ఎంపిక చేసి మొదటి విడతలో అందించాలి. కేటగిరి–3 లో రెండు లక్షలు, కేటగిరి–4లో 4 లక్షలు, కేటగిరి–5 5లక్షలకంటే పైబడిన యూనిట్లను పరిగణిస్తున్నారు. -
సమ్మె నోటీసు అందజేత
భూపాలపల్లి అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఈ నెల 12నుంచి సమ్మె చేయనున్నట్లు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (ఎన్సీకేయూస్) ఆధ్వర్యంలో కార్మికులు సింగరేణి అధికారులకు గురువారం సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ ప్రాథమిక సదుపాయాలు అందించడం లేదని ఆరోపించారు. పలుమార్లు సమస్యలు విన్నవించినా పరిష్కారం లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి నోటీసు ప్రకారం సమ్మె ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య, నాయకులు, కార్మికులు స్వామి, సుధాకర్, సంపత్, మల్లయ్య, సదానందం, మధునయ్య, లక్ష్మి, రవి, రఘుపతి, రవి పాల్గొన్నారు. -
20 నుంచి ‘టాస్’ పరీక్షలు
ములుగు: ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టాస్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ములుగులో 4 పరీక్ష కేంద్రాలు, ఏటూరునాగారంలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు సమయానికి పూర్తిచేయాలని సూచించారు. ఆర్డీఓ వెంకటేశ్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, డీఎస్పీ కిశోర్, డీపీఓ వెంకయ్య, డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ ఆనందం, ఆర్టీఓ శ్రీనివాస్, ఏసీజీఈ వినోద్కుమార్ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
నేడు ప్రజాదర్బార్
వెంకటాపురం(కె): వెంకటాపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతారన్నారు. వెంకటాపురం, వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాలకు చెందిన ఫిర్యాదుదారులు తమ స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల సంబంధించిన విన్నపాలు అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాదర్బార్కు వచ్చే అర్జీదారులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారును ఆదేశించారు. ఎస్పీ, డీఎఫ్ఓ, ఆర్డీఓ, అన్ని శాఖల జిల్లా అధికారులు ఐటీడీఏ ఏటూరునాగారం కార్యాలయ అధికారులు సంబంధిత తాహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. తైబజార్ వేలం ఆదాయం రూ.10.85 లక్షలు ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధి తైబజార్ బహిరంగ వేలంలో రూ.10.85 లక్షల ఆదాయం సమకూరినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో ముగ్గురు పాల్గొనగా.. సాజిద్ తైబజార్ను దక్కించుకున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఈ వేలం వర్తిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహీన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సెక్షన్ క్లర్క్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు టీఎన్జీఓ నాయకుల శుభాకాంక్షలు ములుగు రూరల్: ములుగు కలెక్టర్ టీఎస్ దివాకరకు టీఎన్జీఓ సంఘం నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు గురువారం సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు పోలు రాజు ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించి శాలువాతో కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేడిపల్లి చైతన్య, ఉదయ్కుమార్, కుమారస్వామి, ప్రదీప్, పిట్టల రవి, రాంగోపాల్, మహేందర్, శ్రీవాణి, తేజస్విని, సరంసింగ్, రమాదేవి, సుప్రియ, స్నేహ, అనూష, స్రవంతి, రవీందర్, వీరస్వామి, యశ్వంత్, నాగార్జున, రాజేశ్ నరేశ్, తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలిటీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజునాయక్ వెంకటాపురం(ఎం): ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర రాజునాయక్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండలంలోని బుర్గుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజన విరామం సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ వంటి కీలక అంశాలు సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు రమేశ్బాబు, సురేఖ, శరత్ బాబు, దయాకర్, జవహర్ లాల్, జాను, రాజు తదితరులు పాల్గొన్నారు. -
కందకాలు తవ్వడం ఆపేయాలి
ఏటూరునాగారం: గొత్తికోయ గూడేల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్లు తీయడం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.దావూద్ హెచ్చరించారు. గురువారం మండలంలోని గొత్తికోయ గుడేలకు చెందిన గొత్తికోయలు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఐటీడీఏలోని ఎస్డీసీ గంట ప్రతాప్, డీడీ దబ్బకట్ల జనార్దన్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఐటీడీఏ నుంచి సబ్ డీఎఫ్ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడ కూడా ధర్నా నిర్వహించి ఫారెస్ట్ రేంజర్ ట్రైనింగ్ ఐఎఫ్ఎస్ ప్రతిమిష్ కేశవ, డీఆర్ఓ అప్సరున్నిసా బేగంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్, డీఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి ధర్నా విరమించారు. కార్యక్రమంలో టీఎల్ రవి, మండల కమిటీ సభ్యుడు తోలెం కృష్ణయ్య, మండల నాయకులు సమ్మయ్య సురేశ్, దేవయ్య, జోగయ్యతో పాటు 60 మంది పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనలో వీసీపీసీలు కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో వీలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (వీసీపీసీల) పాత్ర కీలకమని జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన బాలల పరిరక్షణ, బాల వివాహాల నిర్మూలనపై చెల్పాక, చిన్నబోయినపల్లి సెక్టార్లలోని అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు డీడబ్ల్యూఓ హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణలో వీసీపీసీ(వీలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) పాత్ర కీలకమని, ప్రతీ నెలా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు పుష్పావతి, వసంత, పోషణ్ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ ఇమ్మాన్యూఝెల్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమ అధికారి ఈపీ.ప్రేమలత -
13 నుంచి ‘అరైవ్–అలైవ్’
ములుగు: ఈనెల 13వ తేదీ నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పిలుపునిచ్చారు. గురువారం డీజీపీ శివధర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం) క్రిస్టినా చోంగ్తూ, సెక్రటరీ (ప్లానింగ్) గౌరవ్ ఉప్పల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఐపీఆర్ ప్రియాంకతో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు నుంచి కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్జీ పాల్గొన్నారు. వీసీలో సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తరచూ నిర్వహిస్తూ ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. జిల్లాలో వారం రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు -
ట్రెంచ్లో పడి ఆవు మృతి
ఏటూరునాగారం: మండలంలోని గంటలకుంట అటవీ సమీపంలోని గొత్తికోయగూడేల్లో అటవీశాఖ అధికారులు తీసిన ట్రెంచ్లో పడి గురువారం ఒక ఆవు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు గోతులు తీయడంతోనే ఆవు మృతి చెందిందని గొత్తికోయ గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఏటూరునాగారం: గ్రామంలోని ప్రజలు విద్యుత్ను వృథా చేయకుండా ఆదా చేయాలని ఏటూరునాగారం విద్యుత్శాఖ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి పురుషోత్తం అన్నారు. గురువారం మండల పరిధి 12వ వార్డులో ప్రజల సమస్యపై విద్యుత్ ప్రజా బాట కార్యక్రమాన్ని వార్డు సభ్యురాలు కొయిల కృష్ణవేణి ఆధ్వర్యంలో చేపట్టారు. అనంతరం డీఈ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు వార్డు పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఈ స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ కొండా సమ్మయ్య, బీఆర్ఎస్ నాయకుడు కాళ్ల రామకృష్ణ, సిబ్బంది అమర్, సతీశ్, పాల్గొన్నారు. -
గోవులు తరలిస్తున్న వాహనాల పట్టివేత
వాజేడు: మండలంలోని మండపాక వద్ద 163వ నంబర్ జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న నాలుగు బొలేరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల సతీశ్ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల సంతలో గోవులను కొని నాలుగు బొలేరో వాహనాల్లో వరంగల్ మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మండపాక వద్ద జాతీయ రహదారిపై కాపు కాశారు. అటుగా వచ్చిన బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేశారు వాటిలో 32 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పశువులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు భూపాలపల్లి జిల్లాలోని రాంపూర్ గోశాలకు గోవులను తరలించారు. పశువులను అక్రమంగా తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని ఎస్సై సతీశ్ హెచ్చరించారు.32 ఆవులు గోశాలకు తరలింపు -
ఛత్తీస్గఢ్ ధాన్యం రాకుండా చర్యలు
వాజేడు: ఛత్తీస్గఢ్ నుంచి ధాన్యం తెలంగాణకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు గ్రామం వద్ద 163వ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని బుధవారం ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్జీ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుంచి మన రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా అధికారులు నిరంతరం విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై పక్కాగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కృష్ణవేణి, సివిల్ సప్లయీస్ అధికారి సయ్యద్ షా ఫైజల్ హుస్సేన్, తహసీల్దార్ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీటీ విజయ్ కుమార్, వాజేడు డీటీ రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి విజయన్కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని మతిభ్రమించి మాట్లాడటం సరికాదన్నారు. కేరళ రాష్ట్రంలో విద్యారంగానికి 24 శాతం బడ్జెట్ కేటాయిస్తుందని తెలిపారు. అదే మన రాష్ట్రంలో 8శాతం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రూ.2500, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, కొర్ర రాజు, ప్రవీణ్, సద్దాం హుస్సేన్, రవీందర్, చంటి, రూప్సింగ్, పాణి, భరత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాంబశివ -
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
మంగపేట: మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. వేసవిలో భూగర్భ జలాలు పడిపోవడంతో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఎంపీడీఓ భద్రునాయక్తో కలిసి బుధవారం డీపీఓ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో తాగునీటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమస్య ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతీ గ్రామంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా ఉపాధిహామీ పనులు చేసే ప్రదేశాల్లో కూలీలకు షెడ్నెట్స్ ఏర్పాటు చేసి నీడ, తాగునీటి వసతి కల్పించాలన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మినరల్ వాటర్ ప్లాంట్ల ట్రేడ్ లైసెన్స్లు పరిశీలించాలన్నారు, నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో లాడ్జీలు, దాబాలు, ఇతర వ్యాపారాలు నిర్వహించే ప్రతీ షాపునకు నిబంధనల ప్రకారం లైసెన్సు జారీ చేసి 100 శాతం పన్ను వసూలు చేయాలన్నారు. పలు జీపీలకు పంచాయతీల పరిపాలనపై అవగాహన లేని వారిని ప్రత్యేక అధికారులుగా నియమించగా నిర్వహణను వారు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి స్థానంలో మండల స్థాయి, గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించాలని కార్యదర్శులు డీపీఓను కోరారు. అనంతరం డీపీఓ ఎంపీడీఓ భద్రునాయక్తో కలిసి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. పరీక్షలు ఎలా రాశారని అడిగి తెలుసుకున్నారు. అలాగే మెనూపై ఆరా తీసి స్పెషలాఫీసర్ భాగ్యలక్ష్మికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కిశోర్, కేజీబీవీ ఉపాధ్యాయులు ఉన్నారు.జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య -
లబ్ధిదారులకు చేయూత
జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 2,189 మంది లబ్ధిదారులకు రూ. 22.87 కోట్ల రుణం అందజేశాం. ఇంకా అందజేయాల్సి ఉంది. బ్యాంకు అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు కావాల్సిన రుణం ఇప్పించడంలో సెర్ప్ సిబ్బంది ప్రత్యేక భూమిక పోషిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా గ్రూపు సభ్యుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి వారికి వెన్నుదన్నుగా ఉంటాం. ఈ ప్రక్రియ నిరంతరమైంది. లబ్ధిదారులు ఎవరైనా రుణం కావాలంటే మండల సమాఖ్య కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించాలి. – శ్రీనివాస్, డీఆర్డీఓ పీడీ -
అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన విద్యాబోధన
● జిల్లా సంక్షేమశాఖ అధికారి ప్రేమలత ఎస్ఎస్తాడ్వాయి: అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి ప్రేమలత తెలిపారు. పీఅండ్జీ ప్రథమ్ ఆధ్వర్యంలో పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమాన్ని మండల పరిధిలోని పంబాపూర్ సెక్టార్ పరిధిలో గల దామెరవాయి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. అంగన్వాడీ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పని చేస్తున్నాయన్నారు. పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల పిల్లల వరకు ఉండే వెయ్యి రోజుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ప్రథమ్ మాస్టర్ బండారి అనిల్ పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించారు. 65 మంది పిల్లలు ఆటలు, పాటలు, కథలు, సంభాషణ, పూర్వ గణిత భావనలు, ఫ్రీ స్కూల్ వస్తువుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు డీడబ్ల్యూఓ ప్రేమలత, సర్పంచ్ వట్టం తిరుపతి చేతుల మీదుగా ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నితీష్, రాజేందర్, ఉప సర్పంచ్ నగేశ్, టీచర్లు సావిత్రి, అమృత, నిర్మల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు భరోసా
గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బ్యాంక్ రుణాలు● 4,310 మందికి అందించేందుకు కార్యాచరణ ● 2,189 మందికి అందజేతఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు గ్రామీణాభివృద్ధి(సెర్ప్) సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇళ్లులేని పేద కుటుంబాలకు చెందిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా పెట్టుబడికి బ్యాంకు రుణాన్ని సెర్ప్ ద్వారా ఇచ్చేలా పథకాన్ని రూపకల్పన చేశారు. పేద ప్రజలు ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని ముందుగా డబ్బు పెట్టి కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మహిళా సంఘాల్లో సభ్యులై ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మహిళా సంఘాల్లో సభ్యులై ఉండి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను 4,310 మందిని అధికారులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు 2,189 మందికి రూ.22.87 కోట్ల నగదును బ్యాంకు ద్వారా అందజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చొరవతో ప్రత్యేకంగా లబ్ధిదారులకు రుణాలను అందించడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణాన్ని కిస్తీల వారీగా నెలనెలా బ్యాంక్లో చెల్లించాలి. ముందుగా లబ్ధిదారుల నుంచి వడ్డీ, అసలు కలిపి కిస్తీ చెల్లించగా మళ్లీ లబ్ధిదారులకు వడ్డీ సెర్ప్ నుంచి తిరిగి వారి ఖాతాల్లోనే జమ కానుంది. అందువల్లనే దీనిని వడ్డీలేని రుణంగా భావించాలని అధికారులు చెబుతున్నారు. నూతన నిబంధనలు ఇలా.. ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తుంది. ఇది బాగానే ఉంది. కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరులుగా అధికారులు విభజించారు. ప్రస్తుతం ఎల్–1 కేటగిరిలో ఉన్న వారి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొదటి, రెండు, నాలుగు విడతలు మినహా మిగిలిన మూడో విడత బిల్లు చెల్లింపులో ఈ మార్పులు చేసింది. ఈ విడతలో బిల్లులను వీబీ జీరామ్జీ పథకానికి అనుసంధానం చేశారు. జాబ్కార్డు కలిగి ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించి ఆ వేతనం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పునాది పూర్తి చేస్తే రూ.1 లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మరో రూ.1 లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.1.40 లక్షలు ఇవ్వగా పనిపూర్తి అయిన తర్వాత రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4.40 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే మూడో దశలో స్లాబ్ వేసిన తర్వాత ఉపాధి హామీ కింద రోజుకు రూ. 307ల చొప్పున 90 రోజులకు రూ. 27,630లు చెల్లించనున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద బాత్రూమ్ నిర్మించుకుంటే రూ.12వేలు, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ కింద మరో రూ. 21 వేల చొప్పున మొత్తం రూ. 60 వేలను లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లలో జమ చేసేలా ఈ పథకంలో మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లులేని అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయంగా అందిస్తోంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తుంది. పునాది, గోడలు, స్లాబ్, పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. పునాది దశలో రూ. 1 లక్ష, గోడల నిర్మాణం పూర్తి అయిన తర్వాత రూ. 1 లక్ష, స్లాబ్ దశలో రూ.1.40 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తం ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత చెల్లిస్తుంది. ఇదిలా ఉంటే స్థలం లేని వారికి రూ.5 లక్షల సాయంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించడంతో నిరుపేదల సొంతింటి కళ సాకారం అవుతుందని పేద ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
‘అంకితభావంతో పనిచేయాలి’
వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, వైద్యాధికారులు విధుల్లో అంకిత భావంతో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా సూపరింటెండెంట్ కాలకుర్తి జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గర్భనిరోధక చట్టం, తల్లి, శిశు సంరక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలన్నారు. డెలివరీలకు ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లో లింగ నిర్ధరణ పరీక్షలు చేయరాదని హెచ్చరించారు. అనంతరం వైద్యశాలలోని వైద్యులు, సిబ్బందితో కలిపి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ సురేశ్కుమార్, వైద్యాధికారులు ప్రవిద్, ప్రదీప్, శివాజీ, సిబ్బంది శాంతకుమారి, ఉషా, వరలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు. -
ఆదివాసీ గూడేలపై దాడులు ఆపాలి
ఏటూరునాగారం: ఛత్తీస్గఢ్ నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి అడవిలో జీవిస్తున్న వలస ఆదివాసీలపై అటవీశాఖ చేస్తున్న దాడులను వెంటనే నిలిపేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి.దావూద్ అన్నారు. మండలంలోని గంటల గుంటలో గొత్తికోయలు, ఆదివాసీలతో బుధవారం నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా అడవిలో జీవిస్తున్న గొత్తికోయలపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దాడులు అనేకంగా ఉన్నాయని తెలిపారు. అటవీశాఖ అధికారులు భూముల చుట్టూ, భూముల్లో కందకాలు తీయడంతో మూగజీవాలు అందులో పడి మృతి చెందుతున్నాయని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీతక్క ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి పోడు వ్యవసాయదారులకు కొత్తది నరకేది లేదు.. పాతది వదిలిపెట్టేది లేదని చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో మంత్రిగా ఉండి ఫారెస్టు అధికారులు ట్రెంచ్లు కొడుతుంటే చూస్తుండడం సరికాదన్నారు. గూడెంను సీపీఎం నాయకులు సందర్శించినప్పుడు ఓ ఆవు కందకంలో కాళ్లు పైకి తల కిందకు పడి కొట్టుమిట్టాడుతుందని తెలిపారు. ఆ సమయంలో ఆవుని ఆ గూడెం ప్రజలు కాపాడారన్నారు. ట్రెంచ్లు ఆపకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో రవి, సమ్మయ్య, జోగయ్య, సురేశ్, నగేశ్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దావూద్ -
పెండింగ్ మెస్ బిల్లులు విడుదల చేయాలి
● ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ ములుగు రూరల్: పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు హస్టళ్లలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి కాస్మోటిక్ బిల్లులు చెల్లికపోవడం బాధాకరమని తెలిపారు. మెస్ బిల్లుల పెండింగ్ కారణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ మెస్, కాస్మోటిక్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోకిల బాలు, రాకేష్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్య పోరాటం ఉధృతం
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లు భారీ సంఖ్యలో తరలిరావడంతో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం హోరెత్తింది. ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టిజన్లుగా కన్వర్షన్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. – హన్మకొండ -
‘రామప్ప చరిత్ర గొప్పది’
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయం చరిత్ర ఎంతో గొప్పదని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ.నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య, తహసీల్దార్ గిరి బాబు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీస్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
ములుగు: యువత పొగాకు, గుట్కాలు, సిగరెట్లు, మద్యం తదితర మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రతిరోజూ గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. అలాగే ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, సివిల్ సర్జన్ నరేశ్, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
ములుగు
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ7● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
రేషన్ దందా
ములుగు: బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత సన్న బియ్యం నగదు దందా జిల్లాలో బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చకపోవడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారి బియ్యం కోటాను డీలర్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలోకు రూ.12 చొప్పున లెక్కకట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. జిల్లాలో 222 రేషన్ షాపులు ఉండగా మెజార్టీ రేషన్ దుకాణాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా.. పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లి, దోశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబ్ధిదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 10 మండలాలు.. 222 దుకాణాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 222 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వేసవి కాలం దృష్ట్యా లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలలకు చెందిన బియ్యాన్ని అందిస్తున్నారు. జిల్లాలో సుమారు 1.02 లక్షల కార్డుదారులు ఉండగా 5,490 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. మూడు నెలల బియ్యానికి సంబంధించిన పంపిణీ ప్రారంభమైనప్పటికి లబ్ధిదారులు మూడు సార్లు వేలిముద్రలు వేసి రేషన్ డీలర్లకే కిలోకి రూ.12ల చొప్పున సన్నబియ్యాన్ని విక్రయిస్తున్నారు. రేషన్ షాపుల్లోనే సదరు డీలర్లు నగదును లబ్ధిదారులకు పంపిణీ చేసి సన్నబియ్యాన్ని తమ దగ్గరనే నిల్వ చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో 222 రేషన్ షాపులు ఉండగా దాదాపు 100 షాపులకు పైగా రేషన్ షాపుల్లో ఇదే దందా కొనసాగుతున్నట్లు సమాచారం. కిలో సన్నబియ్యం రూ.12కు కొనుగోలు చేస్తున్న డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని నగదు చెల్లింపు డీలర్లకు కలిసొచ్చిన మూడు నెలల కోటనిరుపేద లబ్ధిదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. రేషన్ షాపులపై నిఘా లేకపోవడం, డీలర్లు ఇచ్చే మామూళ్లకు అధికారులు అలవాటు పడడంతో రేషన్ దుకాణాల వైపు కన్నెత్తి చూసే వారే కరవయ్యారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సన్నబియ్యాన్ని నల్ల బజారుకు తరలించే రేషన్ దుకాణాలపై దాడులు నిర్వహించి డీలర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
నర్సరీ ప్రారంభం
వాజేడు: మండల పరిధిలోని మొరుమూరు గ్రామంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ సువర్ణ, డీజీపీ శివధర్రెడ్డితో కలిసి కలిసి నర్సరీని ప్రారంభించారు. కర్రెగుట్టలకు వారు వచ్చే దారిలో మంగళవారం ఆగి కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభించి పరిశీలించారు. మొక్కలను సక్రమంగా పెంచాలని సూచించారు. అనంతరం కన్జర్వేటర్ సువర్ణ ప్రగళ్లపల్లి గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన బీట్ ఆఫీసర్ భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వెంకటాపురం(కె): పేదల పక్షాన పోరాడేది సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. సమసమాజ స్థాపనకు నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. అనంతరం వ్యాపారుల వద్ద విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎస్ తాడ్వాయి : ఏజెన్సీలోని వడ్డీ వ్యాపారులు అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ గిరిజనులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని, వారి ఆగడాలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్కుమార్, జాతీయ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పరిధిలోని లింగాలలో తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం మంగళవారం స్థానిక ఆదివాసీ రైతులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. పంట రుణాల పేరిట ఒక్కొక్క కుటుంబానికి రూ. 30 లక్షలు అప్పుగా చూపిస్తూ పలువురి నుంచి భూములను ఆక్రమించుకోవడంతో పాటు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. 1960 వ్యాపారాల చట్టం ప్రకారం ఇది రాజ్యాంగం విరుద్దమని పేర్కొన్నారు. ఇలా అక్రమ వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామంలో సైతం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు, స్థానిక ఆదివాసీ రైతులు పాల్గొన్నారు. కాళేశ్వరం: సైబర్ నేరాలపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన గ్రామస్తుల కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రాంలో భాగంగా 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. యువత బండి నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ తప్పక ధరించాలని చెప్పారు. అతివేగం ప్రమాదకరమన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంగిస్తే భారీ జరిమానాలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీర్ల చంద్రశేఖర్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పవన్కుమార్, సాయిశశాంక్ పాల్గొన్నారు. -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూ నే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీమ్తో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్ లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఎల్లందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగత’ంపై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
ములుగు: ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యమని, శాస్త్ర విజ్ఞానంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఆరోగ్య అవగాహన ర్యాలీని కలెక్టర్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆరోగ్యం కోసం కలిసి, శాస్త్రానికి మద్దతుగా నిలబడండి (టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్) అనే థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, పోషకాహారము మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. దుర అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటు ఆరోగ్య సూత్రాలను పాటించాలని ప్రజలకు సూచించారు. అపోహలు, మూఢ నమ్మకాలకు నమ్మవద్దని వెల్లడించారు. శాస్త్రపరమైన అవగాహనతో ముందుకు సాగితేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వెల్లడించారు. అనంతరం డీఎంహెచ్ఓ గోపాల్ రావు మాట్లాడుతూ ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా సాంస్కృతిక కళాజాతా బృందం ఆరోగ్య సూత్రాల మీద పాటలు పాడుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ జగదీశ్వర్, ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, నాగఅన్వేష్, మున్సిపాలిటీ కమిషనర్ రమేశ్, మాస్ మీడియా అధికారి సంపత్, ప్రోగ్రాం మానిటరింగ్ సూపర్వైజర్లు వెంకట్ రెడ్డి, సురేశ్బాబు, ఫార్మసీ జిల్లా స్టోర్ ఇన్చార్జ్ వినోదర్, హెచ్ఇ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ దివాకర తనిఖీ చేశారు. గోదాంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరును, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగిషర్ను, ఇతర అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తగిన సూచనలు అందజేశారు. గోదాం వద్ద ఉన్న పోలీస్ బందోబస్తును, రిజిస్టర్లను పరిశీలించారు. భద్రత విషయంలో అలసత్వం వహించకూడదని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఈవీఎంల భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సలీం, డిటీ నితీష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, నాయకులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
విద్యార్థినులు ప్రణాళికతో చదవాలి
ఏటూరునాగారం: కేజీబీవీలో చదువుకుంటున్న విద్యార్థినులు పరీక్షలకు ప్రణాళికతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని డీఈఓ ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు శ్రద్ధతో చదివి పరీక్షల్లో వందశాతం మార్కులు సాధించాలన్నారు. అనంతరం మీసేవ కేంద్రాన్ని సందర్శించి ఐటీ, ఐటీఈఎస్ వృత్తి విద్యలో భాగంగా ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఇంటర్న్షిప్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, భవిష్యత్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అనంతరం పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ శ్యామ్సుందర్రెడ్డి, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శాంపిల్ సర్వే సర్టిఫికెట్ల అందజేత మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎఫ్ఎల్ఎన్ శాంపిల్ సర్వే సర్టిఫికెట్లను డీఈఓ సిద్ధార్థరెడ్డి అందజేశారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రేణుక మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఈ సర్వేను ఎంచుకోవడం హర్షించదగిన విషయం అన్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు 53 మంది డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా వెళ్లిన విద్యార్థులను అభినందించారు. అలాగే సర్వేను అనుసరించి విద్యార్థుల్లో ఆంగ్లభాష ఉచ్చరణ, రాత నైపుణ్యాలను పరిశీలించి రిపోర్టు విద్యాశాఖకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటయ్య, అధ్యాపకులు నవీన్, జ్యోతి, ఫాతిమా, రమేశ్, భాస్కర్, సంపత్, రాజశేఖర్, జీవవేణి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.డీఈఓ సిద్ధార్థరెడ్డి -
పింఛన్ ఇప్పించండి..
2023లో దివ్యాంగుల పింఛన్ మంజూరు కాగా గతేడాది రెన్యూవల్ కోసం సదరం క్యాంపునకు వెళ్లాను. అంగవైకల్య శాతం తక్కువగా ఉందని 25శాతం మాత్రమే ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వగా పింఛన్ తొలగించారు. ఆరు నెలలుగా రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్కు దరఖాస్తు ఇవ్వగా దివ్యాంగులకు కావాల్సిన శాతం కంటే తక్కువగా ఉందని వృద్ధాప్య పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని వివరించినట్లు తెలి పారు. ఉన్నతాధికారులు దయతలచి దివ్యాంగుల పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. – బొర్ర నర్సయ్య, కమలాపురం, మంగపేట● -
ములుగు
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267ములుగు: ఆస్తిపన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమే్శ్ తెలిపారు. పట్టణంలో సిబ్బందితో కలిసి ఆస్తి పన్నులను ఆయన సోమవారం వసూలు చేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ గత నెల 31లోపు ఇంటి పన్ను పూర్తిగా చెల్లించిన వారికి ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వర్తిస్తుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను చెల్లించనివారు బకాయిలను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటి పన్ను పూర్తిగా చెల్లిస్తేనే రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ములుగు పట్టణ ప్రజలు 5 శాతం తగ్గింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆస్తి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. -
నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన జీవనం
ములుగు: నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యమవుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద సోమవారం ‘ఈట్ రైట్ వాక్’ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు. తీసుకునే ఆహారం ఆరోగ్యంపై దాదాపు 90 శాతం ప్రభావం చూపుతుందన్నారు. మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని వెల్లడించారు. తినుబండారాలు, భోజనశాలలు, అల్పాహార కేంద్రాల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఎంహెచ్ఓ గోపాల్రావు, డీపీఓ వెంకయ్య, డీసీహెచ్ జగదీశ్వర్ పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
అర్జీలు@ 92
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరివాణి(గిరిజన దర్బార్)లో పలు సమస్యలపై ప్రజలు 92 దరఖాస్తులను అందజేశారు. ఇందులో ప్రజావాణిలో 32, గిరివాణిలో 60 అర్జీలను బాధితులు కలెక్టర్కు అందజేశారు. ఈ వినతులను స్వీకరించిన కలెక్టర్ దివాకర వాటిని పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్జీ, సంపత్రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్, డీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. స్వీకరించిన కలెక్టర్ టీఎస్.దివాకర పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు -
‘కేన్ మొక్కలను సంరక్షించాలి’
వెంకటాపురం(ఎం): కేన్ మొక్కలను సంరక్షించాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలోని పాలంపేట గ్రామ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్ ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్లడించారు. కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్ కొట్టి చైన్ లింక్ ఫెన్సింగ్ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీష్ కోరారు. -
పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి
కాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకవస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్, డాక్టర్ ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, ఆడెపు రవి తదితరులు పాల్గొన్నారు. -
బీరమయ్య జాతర.. తరలొచ్చిన భక్తజనం
వాజేడు: మండల పరిధిలోని లొట్టిపిట్ట గండి ప్రాంతం ఆదివారం తెల్లవారు జాము నుంచి బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. మండు టెండలో తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్టగండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో సమీప గోదావరిలో నిష్టతో స్నానాలు ఆచరించి బీరమయ్య, రేఖలమ్మలకు ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం కల్యాణం జరిపించారు. భక్తులు వివిధ వాహనాల్లో భారీగా తరలివచ్చి బీరమయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాత్రి నుంచి జాతర ప్రాంతంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. గుట్టపైన ఉన్న గుడికి చేరే సమయంలో భక్తులకు ఎండ తగలకుండా ఉండేలా నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల దాహం తీర్చడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతిఏటా బీరమయ్య జాతర సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేవారు. కాని రెండేళ్లుగా బస్సులు నడపడం లేదు. దీంతో జాతరకు వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాల్లో జాతరకు రావాల్సిన దుస్థితి నెలకొంది. లొట్టిపిట్ట గండిలో గిరిజనుల కోలాహలం దేవర్ల రాకతో మొదలైన జాతరతంతు -
సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి
మల్హర్(కాటారం): కాటారం డివిజన్ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర నాయకుడు, డీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విద్యా పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం.రఘుశంకర్రెడ్డి కోరారు. మండలంలోని కాటారం స్థానిక ఆదర్శ విద్యాలయంలొ ఆదివారం కరుణాకర్ ఆధ్వర్యంలో కాటారం రెవెన్యూ డివిజన్ స్థాయి పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుశంకర్రెడ్డి మాట్లాడుతూ కాటారం డివిజన్ స్థాయిలో సుమారు 450 మంది పెన్షనర్స్, వేలాదిగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్, డేకేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలం సంఘం ప్రతినిధులు అంకమ్మ అంకన్న, శంకరయ్య, వెంకటి, ఎం.రవి శంకర్రెడ్డి, మధుసూదన్రావు, దామోదర్రెడ్డి, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ఆడ్మిషన్లు ప్రారంభం
ఏటూరునాగారంలోని ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో అడ్మిషన్లను ప్రారంభించాం. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వారివారి సర్టిఫికెట్లతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. నూతనంగా ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కలగనుంది. విద్యార్థులకు మరింత అవకాశాన్ని కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రతీ ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. – జగన్మోహన్రెడ్డి, ఐటీఐ, ఏటీసీ ప్రిన్సిపాల్, ఏటూరునాగారం -
జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
ములుగు: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, మహనీయుల ఆశయాలను పాటించడమే వారికి మనమిచ్చే గౌరవమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలకు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. జగ్జీవన్ రామ్ కార్మిక చట్టాలకు ఆద్యుడని తెలిపారు. ఆయన ప్రస్తానం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ మాట్లాడారు. భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా, అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కొమురయ్య, తహసీల్దార్ విజయ భాస్కర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆదివారం సంబంధిత విభాగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకుని వారం రోజుల పాటు ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేడు ఆహార భద్రతపై దృష్టి పెట్టి కల్తీ ఆహారం వల్ల వచ్చే జబ్బుల గురించి అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ‘ఈట్ రైట్ వాక్’ నిర్వహించాలన్నారు. 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించాలన్నారు. 8న సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. 9న ఎయిడ్స్పై అవేర్నెస్ రెడ్ రన్ వాక్ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టాలన్నారు. 10న యోగా డిమానిస్ట్రేషన్ క్యాంపు నిర్వహించాలని పేర్కొన్నారు. 11న డ్రగ్ నియంత్రణ విభాగం ద్వారా ప్రజలకు మందుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీపీఓ వెంకయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ఏటీసీలతో ఉపాధి
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీలు) విప్లవాత్మక మార్పులు తేనున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను పారి శ్రామిక వేత్తలు, పారిశ్రామికులుగా తీర్చిదిద్దాలని, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు నూతనంగా జిల్లాలో ఏటూరునాగారం, వాజేడు మండల కేంద్రాల్లో రెండు ఏటీసీలను ఏర్పాటు చేశారు. ఐటీఐ విద్యార్థులతో పాటు ఏటీసీలో చేరే విద్యార్థులకు ప్ర త్యేక శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి పూర్తి అయిన విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏటీసీల ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆదాయం పెరగాలంటే నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతో కీలకం. స్కిల్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. ఐటీఐల్లోని విద్యార్థులకు ఏసీటీల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా టాటా గ్రూప్ వారితో అనుసంధానం అయ్యారు. టాటా కంపెనీ నైపుణ్యం శిక్షణపై ఆసక్తితో ఉన్న విద్యార్థులకు నేర్పించేందుకు ఆరు ట్రేడ్లను ముందుకు తీసుకొచ్చింది. రూ.35 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, సామగ్రిని ఏర్పాటు చేశారు. దీనిలో ఆరు రకాలుగా శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యం కలిగిన ట్రైనర్లను ఇక్కడ నియమించారు. టాటా టెక్నాలజీ సంస్థ ట్రైనింగ్ పూర్తి చేసిన వారిని వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందస్తుగానే అగ్రిమెంట్లు చేయించుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ 38 మంది వరకు ఉద్యోగం పొందారు. విద్యార్థులకు తప్పని తిప్పలు జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్థులు ఏటీసీలో శిక్షణ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ స్థానికంగా వసతి, భోజన సౌకర్యం లేకపోవడంతో ఇక్కడికి వచ్చే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఐటీడీఏ ద్వారా ఇక్కడ మేనేజ్మెంట్ హా స్టల్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇక్కడ ఉంటూ చదువుకునే వారు. ఇప్పుడు అలాంటి అవకా శం లేక అద్దెకు ఉండలేక, భోజన వసతి లేక, తల్లి దండ్రులను వదిలి వచ్చి ఇక్కడ ఉండలేక చదువుకు దూరం అవుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఐటీడీఏ ద్వారా గిరిజన, గిరిజనేతర విద్యార్థిని, విద్యార్థులకు భోజనం, వసతి కల్పించాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు.ఏడాది కోర్సులు ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అడ్వాన్స్డ్ టూల్స్ రెండేళ్ల కోర్సులు అడ్వాన్స్డ్ సీఎన్సీ మెకానిక్ టెక్నీషియన్ బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ మెకానికల్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్ జిల్లాలో రెండు కేంద్రాల ఏర్పాటు వసతి, భోజనం లేక విద్యార్థుల అవస్థలు -
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ములుగు రూరల్: రేపు(సోమవారం) జిల్లా స్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బండారుపల్లి గురుకుల పాఠశాలలో సోమవారం 20 ఏళ్లలోపు బాలబాలికలకు, 20 ఏళ్లు పైబడిన పురుషులకు, మహిళలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు గురుకుల పాఠశాల పీఈటీ రాజ్కుమార్కు రిపోర్టు చేయాలని సూచించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 11, 12వ తేదీలలో హనుమకొండ జవహర్లాల్ స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ కప్ పోటీలలో పాల్గొంటారని వివరించారు. రన్ ఫర్ జీసస్ ర్యాలీ ములుగు: జిల్లా కేంద్రంలో శనివారం రన్ ఫర్ జీసస్ ర్యాలీని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ రహదారిపై సాధన స్కూల్ నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్ మీర్జా, 8వ వార్డు కౌన్సిలర్ నల్లెల్ల స్వాతి భరత్ కుమార్లు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏసుప్రభు గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ రోని ఒనెసిమస్, జిల్లా అధ్యక్షుడు రెవ క్రీస్తుదాసు, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ జోనాత్తాన్, బిషప్ సామ్యూల్, పాస్టర్ రమేశ్, సుదర్శన్ రావు, బొచ్చు సమ్మయ్య, కుమార్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువన్కు పరామర్శ ములుగు: మేడారం గద్దెల వద్ద గాయపడిన పూజారి కుమారుడు యువన్ హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ములుగు మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బాలుడికి ప్రమాదం జరిగిందన్నారు. బాలుడికి అయ్యే వైద్యఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎట్టి జగదీశ్, రామసహాయం శ్రీనివాస్రెడ్డి, ఈసం రాంమూర్తి, రామయ్య, ప్రశాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రామప్ప శిల్పకళ బాగుంది వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని పీసీసీఎఫ్– చీఫ్ వైల్డ్లైఫ్ అధికారి వినయ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ శాలువాతో సత్కరించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. వారి వెంట కాళేశ్వరం సీపీఎఫ్ ప్రబాకర్, ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీఓ సత్తయ్య, ఎఫ్ఆర్ఓ శంకర్, డీఆర్ఓ మధు బాబు, ఎఫ్బీవో కిషన్ తదితరులు ఉన్నారు. రామప్పలో మఠాధిపతి నాగమహర్షి, కెనడాకు చెందిన హరిదాస్ రామప్ప దేవాలయాన్ని శ్రీ మహాకాళేశ్వర దేవస్థానం నాగమఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ కాలనాగ మహర్షి, కెనడా దేశానికి చెందిన హరిదాస్తో కలిసి శనివారం రామప్పను సందర్శించారు. భూపాలపల్లి జిల్లా నందిగామ మహాకాళేశ్వర దేవస్థానానికి హరిదాస్ రాగా మఠాధిపతి అయిన నాగమహర్షి హరిదాస్ను తీసుకుని రామప్ప ఆలయానికి వచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని వారు కొనియాడారు. -
ఇళ్లగణన సమర్థవంతంగా నిర్వహించాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: జనగణన–2027లో భాగంగా మొదటి విడతలో చేపట్టే ఇళ్ల గణన ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మహేందర్జీతో కలిసి తహసీల్దార్లు, డీటీలు, ఎంపీఎస్ఓలు, ఆర్ఐలతో జన గణన, ఇళ్ల గణన ప్రక్రియలు, మ్యాప్ తయారీపై కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జన గణన కార్యక్రమంలో భాగంగా ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గణన చేయాలని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా జన గణనను పూర్తిగా డిజిటల్ పద్ధతి ద్వారా చేపట్టినట్లు తెలిపారు. మే 11వ తేదీ నుంచి జూన్ 9వరకు జన గణనలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఇళ్ల గణనలో కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయబడతాయన్నారు. సన్నాహక పనులు మొదలు పెట్టాలని వివరించారు. యాప్ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలన్నారు. చార్జెస్ (మండలాల) వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం చేపట్టాలన్నారు. 800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్ను నియమించాలని, ఎన్యుమరేటర్ హౌస్ లిస్టింగ్, బ్లాక్ తయారు చేసి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మంజుల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా స్థాయి టెలికం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలందించాలని అధికారులను ఆదేశించారు. టెలికాం టవర్ల ఏర్పాటులో ఎదురవుతున్న అనుమతుల సమస్యలు, టవర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో ఉన్న జాప్యాన్ని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్డీఓ శ్రీనివాస్, టెలికాం కంపెనీల ప్రొవైడర్లు తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఏటూరునాగారం: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని కోచిలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ(స్కిల్ డెవలప్మెంట్)లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే తదుపరి బ్యాచ్ కోసం రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ దివాకర శనివారం తెలిపారు. శిక్షణకు వెళ్లే వారికి ఉచిత వసతి, భోజనం, లెర్నింగ్ మెటీరియల్స్, యూనిఫాం, సేఫ్టీ షూస్, శిక్షణ అనంతరం నేషనల్ కౌన్సెలింగ్ ఫర్ ఒకేషనల్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా సర్టిఫికెట్ ప్రదానం చేసి ఉపాధి కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాలన్ని గిరిజన యువతీయువకులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 10వ తేదీలోపు ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ ఎలక్ట్రిషియన్(ఆయిల్, గ్యాస్), ఇండస్ట్రీయల్ వెల్డర్(ఆయిల్,గ్యాస్), ప్రాసెస్ ఇన్స్ట్రమెంటనేషన్ టెక్నిషియన్, ఫిట్టర్ ప్యాబ్రికేషన్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కోర్సు వ్యవధి ఆరు నెలల పాటు ఉంటుందని వివరించారు. విద్యార్హతలు టెక్నికల్ డిప్లామా, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని కలెక్టర్ వెల్లడించారు. -
మ్యాపింగ్ ప్రక్రియపై దృష్టి సారించాలి
● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిములుగు: మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, బీఎల్ఓ, బూత్ ఏజెంట్లు తదితర అంశాలపై ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు మ్యాపింగ్ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, బూత్స్థాయి ఏజెంట్ల నియామకంపై సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సందడి నెలకొంది. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
● అదనపు కలెక్టర్ మహేందర్జీములుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్జీ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలన్నారు. తేమ శాతం కొలిచే పరికరాలు, బరువు తూకం యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని ఓపీఎంఎస్ ద్వారా వెంటనే నమోదు చేసి, ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, షెడ్లు, విశ్రాంతి తీసుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని టార్ఫాలిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ కృష్ణవేణి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి పైసల్ హుస్సేని, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ‘విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి’ ములుగు రూరల్: విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బాలయ్య అన్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ఆధ్వర్యంలో జాకారంలోని ప్రభుత్వ పాఠశాలలో శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ దాసరి సమత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు యూనిఫాం లేని సైనికులని తెలిపారు. ఈ శిబిరాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సహనశీలత, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయన్నారు. ఈ శిబిరం నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ –ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం పాటుపడాలని సూచించారు. అనంతరం విద్యార్థులు జాకారం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అనిల్కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ‘క్యాంపు కార్యాలయంపై దాడి సరికాదు’ ఏటూరునాగారం: గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఇంటి పెద్దపై దాడి, ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అన్నారు. అధికారం అండతో అరాచకాలు చేస్తే ప్రజలు క్షమించరని వివరించారు. అభివృద్ధిని చూపించి ప్రజల మనస్సు గెలవాల్సింది పోయి, భౌతిక దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. -
కలగానే శివగంగ
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మంగపేట: మండల పరిధిలో జిల్లా సరిహద్దు గ్రామమైన బ్రాహ్మణపల్లి వద్ద నిర్మించిన శివగంగ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయల నిధులు గంగపాలేనా అని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్రాహ్మణపల్లికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని కత్తిగూడెం గ్రామ సమీపంలో గల గోదావరి ఒడ్డున లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో బ్రాహ్మణపల్లి, కత్తిగూడెం రెవెన్యూ పరిధిలోని 1600 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.8.52 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎత్తిపోతల పథకం పనులను అప్పటి భారీనీటి పారుదలశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నవంబర్ 25న ప్రారంభించారు. నాసిరకంగా పనులు ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత ఏపీఎస్ఐడీసీ అధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో టెండర్ ద్వారా పనులు పొందిన గుత్తేదారు నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడంతో 18ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత టీఎస్ఐడీసీ అధికారులు మాత్రం పనులు మొత్తం పూర్తయ్యాయని నీటిని లిఫ్టింగ్ చేసేందుకు గోదావరిలో వరదనీరు ఒడ్డు వెంట కాకుండా మఽ ద్య నుంచి ప్రవహిస్తుండడంతో ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారిందని చెబుతున్నారు. చిరకాల వాంఛ తీరేనా? ఎత్తిపోతల పథకం పూర్తయితే తమ భూములకు రెండు పంటలకు సాగునీరు అందుతుందనుకున్న బ్రాహ్మణపల్లి, కత్తిగూడెం గ్రామాల ఆయకట్టు రైతుల చిరకాల వాంఛ కలగానే మిగిలేనా అనే సందేహం నెలకొంది. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు వినియోగంలోకి రాకపోవడంపై ఆయకట్లు రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తే బ్రాహ్మణపల్లి, పెరకకుంట, కిందిగుంపు, కత్తిగూడెం గ్రామాల రైతులకు సాగుభూములకు అధికారికంగా 1600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. అనాధికారికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన వేలాది ఎకరాల సాగు భూములకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నిరుపయోగంగా మారిన బ్రాహ్మణపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం 18 ఏళ్లు గడుస్తున్నా అందని సాగునీరు అధికారుల పర్యవేక్షణ లోపంతో రైతుల ఇక్కట్లు -
కూరగాయల సాగుకు పెద్దపీట
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ములుగు: ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎప్పుడు లేనివిధంగా వందశాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తుంది. ఒక కిట్లో టమాట, మిర్చి, బెండ, తోటకూర, పాలకూరకు సంబంధించిన విత్తనాలను ఉంటాయి. జిల్లాలో కూరగాయల సాగును పెంపొందించడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలనే నెపంతో వెజిటేబుల్ విత్తనాల కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. 625 ఎకరాల్లో సాగు అయ్యేలా.. జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఏటా 150 ఎకరాల్లో మాత్రమే కూరగాయలను రైతులు పండిస్తున్నారు. ప్రజలకు సరిపడా వెజిటేబుల్ జిల్లాలో సాగు కాకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కూరగాయలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో వ్యాపారులు ఇష్టారీతిగా ధరలను పెంచి అమ్ముతుండడంతో ప్రజల మీద భారం పడుతుంది. అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు దొరకని పరిస్థితి నెలకొంది. కాగా ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో కిట్లను అందజేస్తూ కూరగాయల సాగుకు పెద్దపీట వేస్తోంది. రైతులకు పూర్తి సబ్సిడీతో కూరగాయల విత్తనాలను అందిస్తున్నాం. ఒక కిట్లో ఐదు రకాల విత్తనాలు ఉంటాయి. ఒక ప్యాకెట్లోని విత్తనాలను అర ఎకరం వరకు సాగు చేయవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్తో సమీప ఉద్యాన అధికారిని సంప్రదించి విత్తనాలు ఉచితంగా పొందవచ్చు. – సంజీవరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అందుబాటులో 1,250 కిట్లు జిల్లాలో 625 ఎకరాల్లో కూరగాయల సాగు పెరగనున్న సాగు విస్తీర్ణం -
గద్దెల ప్రాంగణంలో చెత్త తొలగింపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన అండర్ డ్రెయినేజీలోని మురుగునీరు, చెత్త చెదారాన్ని దేవాదాయ శాఖ సిబ్బంది శుక్రవారం తొలగించారు. ఈ నెల 3న గద్దెల పునర్నిర్మాణ పనులు అస్తవ్యస్తం అనే కథనం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ఈఓ వీరస్వామి స్పందించారు. ఈ మేరకు సిబ్బంది డ్రెయినేజీలోని పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగునీరును పూర్తిగా తొలగించారు. గద్దెల ప్రాంగణానికి కూడా పరిశుభ్రత చర్యలు చేపట్టారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీ నది అంత్యపుష్కరాలపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ తెలిపారు. ఉదయం 11.30గంటలకు వివిధ శాఖలతో చేపట్టే అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. వారి వెంట కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్ హాజరు కానున్నారు. -
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం:సీపీఐ
ములుగు రూరల్: ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఇంటింటా సర్వే నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, గుడిసె వాసులకు పట్టాలు, రేషన్కార్డులు, పెన్షన్లు, సాగునీరుపై దృష్టిసారి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట మ ల్లికార్జున్, సహాయ కార్యదర్శి రవిందర్, అమ్జద్పాషా, ఇంజం కొమురయ్య, ముత్యాల రాజు, నర్సయ్య, సారయ్య, సాగర్, రమేష్, నటరాజ్, రాజేందర్, లింగమూర్తి, స్వామి, పరంసింగ్, గోపి, తిరుపతి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్ష కేంద్రం తనిఖీ
వెంకటాపురం(కె): మండల పరిధిలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్ధులకు ఏర్పాటు చేసిన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఉల్లాస్ కో ఆర్డినేటర్ పీర్ల కృష్ణబాబు తదితరులు ఉన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కొమురయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, గౌడ సంఘం నాయకులు పులి నర్సింగం, బుర్ర శ్రీనివాస్, శ్రీకాంత్, సంక్షేమ భవన కార్యాలయ సిబ్బంది సరిత, మానస, రేణుక తదితరులు పాల్గొన్నారు. ‘విస్తారాకులతో ఆరోగ్యానికి మేలు’ ఎస్ఎస్తాడ్వాయి: అడవుల్లో సహజంగా లభించే ఆకులతో తయారు చేసిన విస్తారాకులతో ఆరోగ్యానికి ఎంతో మేలని ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా అధ్యక్షుడు బొల్లు నాగేంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని కామారంలోని సమ్మక్క–సారలమ్మ ఆర్గానిక్ విస్తా రాకుల తయారు సంఘం భవనాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. పాలిథిన్ కవర్లతో ఉన్న పేపర్ ప్లేట్ల వినియోగాన్ని మానుకుని పర్యావరణానికి మేలు చేసే సహజ విస్తారాకులను వినియోగించాలని సూచించారు. విస్తారాకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు కొర్నెబెల్లి కవిత, సభ్యులు రేగ అనూష, కోరం ఇందు, పూర్ణ, సోలం అన్నపూర్ణ, రేగ సరళ, శ్రీదేవి పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ ములుగు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల వాల్పోస్టర్ను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి జిల్లా రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈనెల 14న ఏటూరునాగారంలో నిర్వహించే అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలకు రావాలని ఎస్పీని ఆహ్వానించారు. ఏటూరునాగారంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వా లీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చిలు వేరు అన్నమయ్య, కార్యదర్శి వేంపల్లి శంకర్, కోశాధికారి పరికి వేణుగోపాల్ పాల్గొన్నారు. గోవిందరావుపేట: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడు మురహారి భిక్షపతి అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గురువారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా భిక్షపతి హజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రభుత్వాలు విస్మరించడం సరికాదని అన్నారు. ఉద్యమకారులు హరిప్రసాద్, సంతోష్, ఇరుగు పైడి, బత్తిని వెంకట్, యాస పూలమ్మ, మడిపెల్లి శ్యామ్, బుర్రి సతీష్, యాస కళావతి, సమ్మక్క, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ములుగు రూరల్: యాసంగి సాగు వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాగు చేసిన వరి విస్తీర్ణానికి అనుకూలంగా దిగుబడి అంచనా వేశారు. ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్ రెండో వారం నుంచి మే నెలాఖరు వరకు ధాన్యం సేకరణకు అవసరమయ్యే యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు. నిబంధనల మేరకు ధాన్యం మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు, వ్యవసాయ అధికారులకు సూచనలు అందించారు. 60 వేల ఎకరాల్లో వరిసాగు జిల్లాలోని పది మండలాల పరిధిలో 60,972 ఎకరాల్లో వరిసాగు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాకు 22 క్వింటాల దిగుబడి అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి దిగుబడి సన్నరకం 68,632 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 65,607 మెట్రిక్టన్నులఽ వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 25 లక్షల గన్ని బ్యాగుల అవసరం జిల్లాలో ధాన్యం సేకరణకు 25 లక్షల గన్ని బ్యాగులు అవసరం ఉన్నాయి. దీంట్లో 12 లక్షల గన్ని బ్యాగుల అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పార పట్టే యంత్రాలు, తేమశాతం నిర్దేశించే పరికరాలు, ఎలక్ట్రానిక్ కాంటాలను, టార్ఫాలిన్లు సిద్ధం చేస్తున్నారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ చేపడతాం. సేకరణకు సరిపడా గన్ని బ్యాగులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాం. కాంటాలు అయిన వెంటనే జాప్యం లేకుండా ధాన్యం మిల్లులకు తరలిస్తాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలి. దళారులను నమ్మి మోసపోకూడదు. – కృష్ణవేణి, జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ విద్యార్థులకు యూనిఫాం క్లాత్ కోసం టెస్కోకు ఇచ్చిన ఇండెంట్ను ఉపసంహరించుకోవడంతో పవర్లూం, చేనేత సహకార సంఘాలు చతికిలపడనున్నాయి.లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 140 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాధమిక వ్యవసాయ కేంద్రాలు, ఐకేపీ, ఎఫ్పీఓల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఆయా సంఘాలకు కేంద్రాలను కేటాయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 81, ఐకేపీ 52, ఎఫ్పీఓ 7 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 1.08 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం అందుబాటులో 12 లక్షల గన్ని బ్యాగులు -
సమస్యలు పరిష్కరించేదెప్పుడో..
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య విమర్శించారు. ఈ మేరకు గురువారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మెడికల్ బోర్డు నిర్వహణ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు అయిన అలవెన్సులు, ఆదాయపన్ను మాఫీ, సొంత ఇంటికల, మారుపేర్ల, ఇతర అంశాలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన కార్మికుల ఆశలు నెరవేరలేదన్నారు. వేజ్బోర్డులో చేసుకున్న ఒప్పందాలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదని, గెలిచిన సంఘాలు వాటిని అమలు చేయించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీనివాస్, శ్రీకాంత్, తోట రమేష్, బాబురావు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ములుగు/వెంకటాపురం(ఎం)/ గోవిందరావుపేట: గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు మున్సిపాలిటీలోని 6వ వార్డులో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అధ్యక్షతన గురువారం నిర్వహించిన వార్డు సభకు సీతక్క హాజరై మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి రూ.1.25కోట్లతో ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేయడమే కాకుండా రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ.57 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని పీవీ కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక గ్రామసభ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతాయన్నారు.ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ.500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలు లబ్ధిదారులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయిలో గ్రామ సర్పంచ్ మేకల రాధసుదర్శన్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, కలెక్టర్ దివాకరతో కలిసి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం మహిళ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితరామచంద్రన్ మాట్లాడుతూ గ్రామంలో కొత్త రేషన్ కార్డులు అందించామని తెలిపారు. అలాగే 73 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ.10లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. చల్వాయి గ్రామంలోని లక్నవరం క్రాస్ వద్ద ఉన్న కిచెన్ షెడ్లో మంత్రి సీతక్క, అనిత రామచంద్రన్, కలెక్టర్ దివాకరలతో కలిసి అంగన్ వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం నూతన స్మార్ట్ఫోన్లను అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, పంచాయితీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి
వెంకటాపురం(కె)/వాజేడు: భద్రాచలం నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. వెంకటాపురం(కె)మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని కమ్యూనిటీ హాల్లో సర్పంచ్ సరస్వతి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. అనంతరం గ్రామసభలో పలు సమస్యలపై ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే వెంకట్రావు హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ లైన్లను ఇప్పటికే వేస్తున్నారని విద్యుత్ సమస్య రాకుండా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నాలుగు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా వాటి గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు -
ఆలయ పునర్నిర్మాణ పనులు అస్తవ్యస్తం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర నాటికి ఆలయ పునర్నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. జాతర సమయం నాటికి కొంత మేరకు పనులు పూర్తి కాకపోవడంతో తాజాగా మళ్లీ పనులను మొదలు పెట్టారు. ప్రహరీ నిర్మాణం, ఆర్చీలపై చెక్కిన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ బొమ్మలు బాగానే ఉన్నా గద్దెల ప్రాంగంణంలో ఫ్లోరింగ్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పగిలిన గ్రానైట్ రాళ్లు జాతర సమయంలో హడావుడిగా గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయడంతో గ్రానైట్ రాళ్ల మధ్య సందులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల గ్రానైట్ రాళ్లు పగిలిపోయాయి. రాళ్లు కుంగిపోయిన విషయాన్ని జాతర సమయంలో గుర్తించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్కలు సరిచేయాలని ఆదేశించడంతో జాతర అనంతరం మళ్లీ పనులను ప్రారంభించారు. గద్దెల ప్రాంగణంలో కుంగిన గ్రానైట్ రాళ్లను తొలగించి సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు భాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం గద్దెలను ప్రతిరోజూ నీటితో కడగడంతో నీళ్లు గ్రానైట్ రాళ్ల మధ్య నిలిచి పోతున్నాయి. అంతేకాకుండా సమ్మక్క గద్దె వద్ద గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసిన మెట్లరాళ్లు కూడా పగిలిపోయాయి. వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ గద్దెకు వెళ్లే మెట్ల వద్ద గ్రానైట్ రాయి పగిలి కుంగిపోయింది. ఇటీవల మేడారం సమ్మక్క పూజారి కుమారుడి కాళ్లపై గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రాయి కాలు మీద పడి గాయపడిన ఘటన కూడా చోటు చేసుకుంది. కంపుకొడుతున్న డ్రెయినేజీ గద్దెల ప్రాంగణాన్ని నీటితో శుద్ధి చేసిన నీళ్లు బయటకు వెళ్లేందుకు అండర్ డ్రెయినేజీ నిర్మాణం చేశారు. జాతర సమయంలో హడావుడిగా డ్రెయినేజీ నిర్మాణం చేయడంతో దీంతో ఆ డ్రెయినేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి గద్దెలను శుద్ధి చేసిన నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వస్తోంది. డ్రెయినేజీ నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయిందని భక్తులు విమర్శిస్తున్నారు. మళ్లీ డ్రెయినేజీని సక్రమంగా చేసేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. మహాజాతరలో మీడియా కవరేజ్ కోసం నిర్మించిన మీడియా పాయింట్ జాతర సమయం వరకు పూర్తి కాలేదు. అయితే మీడియా పాయింట్ కవరేజ్కు అనుకూలంగా లేవనే విషయాన్ని గుర్తించిన మంత్రులు జాతర అనంతరం ఆ పనులను నిలిపివేసినట్లు తెలిసింది. ఆదివాసీ బొమ్మల ఏర్పాటు గద్దెల చుట్టూ నిర్మించిన రాతి ప్రహరీ పైభాగంలో రాతితో చెక్కిన ఆదివాసీ బొమ్మలను అమర్చుతున్నారు. అయితే ఓ రాతి బొమ్మ కొమ్ము విరిగిపోవడంతో దాన్ని గమ్ముతో అతికించి ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. అధికారులు విరిగిన కొమ్ము బొమ్మను పక్కన పెట్టించాలని భక్తులు కోరుతున్నారు. మేడారంలో కొనసాగుతున్న ఆలయ పునరుద్ధరణ పనులు కంపుకొడుతున్న అండర్ డ్రెయినేజీ -
గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: జిల్లాలో నేటి నుంచి నిర్వహించే గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. గ్రామసభలు, మున్సిపల్ వార్డుల్లో సభల నిర్వహణపై బుధవారం మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. గ్రామ సభలు, మున్సిపల్ సభలు పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామ సభల్లో ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో టామ్ టామ్ చేయించాలని సూచించారు. ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని కొత్తగా మరికొన్ని చేపట్టబోతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామసభల సందర్భంగా ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చేవారి దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి అర్జీలు తీసుకోవాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వెంకటాపురం(కె): సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం సౌర విద్యుత్ వినియోగంపై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్యఘర్, ముఫ్త్ బిజిలియోజన, కుసుం పథకాలపై వివరించారు. మీటర్లు లేకుండా విద్యుత్ వినియోగించుకుంటున్న వినియోగదారులు పీఎం జుగా స్కీమ్ కింద మీటర్లు పొందవచ్చని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు, భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం సౌర విద్యుత్ వినియోగంపై కరపత్రాలను వినియోగదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వెంకటాపురం(ఎం) మండలం నల్లగుంట గ్రామానికి చెందిన భూక్య జవహర్లాల్ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి పాటుపడినందుకు పదవిని కేటాయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు బలరాం, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి అర్బన్: గత ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాకు 46.54 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 74 శాతం బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి వెల్ల డించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 55 వేల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. ఏరియాకు మొత్తం 46.54 లక్ష టన్నుల లక్ష్యానికి 34.22 లక్ష టన్నులు మాత్రమే సాధించి 74 శాతంలో నిలిచామన్నారు. కేటీకే–1 గని 71 శాతం, కేటీకే–5, కేటీకే–6 గనులు 49 శాతం చొప్పున, కేటీకే–8 గని 44 శాతం సాధించాయి. కేటీకే ఓసీ–2 గని 97 శాతం, ఓసీ–3 గని 69 శాతం సాధించాయన్నారు. గతేడాదిలో ఏరియాకు రూ.703 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించిన 46 లక్షల టన్నుల లక్ష్యాలను చేరుకోవాలంటే కార్మికులు సమష్టిగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఐఈడీ జ్యోతి పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి
ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గోవిందారావుపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల వ్యవసాయశాఖ అధికారులకు, కేంద్రాల ఇన్చార్జ్లకు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రానికి ఆయన హాజరై మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ధాన్యంలో తేమశాతం 17 వచ్చిన తర్వాత మాత్రమే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు. హార్వెస్టర్ యజమానులు ధాన్యం కోత సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. న్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీసీఎస్ఓ ఫైసల్ హుస్సేన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అవినాష్ వర్మ, డీపీఎం శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీటీ విజయ్కుమార్, తహసీల్దార్ సురేష్బాబు, పాల్గొన్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారులతో అదనపు కలెక్టర్ మహేందర్జీ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలు అంశాలపై వివరించారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
కాంగ్రెస్లో ‘సంస్థాగత’ సందడి!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో ‘సంస్థాగత’ సందడి కొనసాగుతోంది. ప్రభుత్వం, ప్రజలకు వారధిగా ఉండేలా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పాత కమిటీలను రదు చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులు.. వార్డు, డివిజన్ కమిటీలనుంచి పూర్తిస్థాయి జిల్లా కమిటీలను వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. హనుమకొండ జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ మాసాంతానికల్లా అన్ని స్థాయిల్లో సంస్థాగత కమిటీలు వేయాలన్న హైకమాండ్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను సంప్రదించి కమిటీలను రూపొందిస్తున్నారు. జిల్లా కమిటీల్లో 31 నుంచి 51 మందికి ప్రాతినిధ్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కమిటీ కార్యవర్గం ఈ నెలాఖరుకు ఖరారు కానుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తవగా... పూర్తిస్థాయి కమిటీలను వేయలేదు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 14 జిల్లాల్లో పూర్తి స్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృత స్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో పెండింగ్లో ఉండగా.. ఇటీవల కసరత్తు మొదలైంది. ఈ క్రమంలోనే వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు మొదలు పూర్తి స్థాయి జిల్లా కమిటీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన జరుగుతోంది. చాల్లా జిల్లాల్లో జిల్లా కమిటీలు జెంబోజెట్లుగా నియామకాలు చేశారన్న ఆరోపణలు ఉండగా.. ఉమ్మడి జి ల్లాలో మాత్రం చిన్న జిల్లాలుంటే 31.. పెద్ద జిల్లాలైతే 51 మందికి మించకుండ ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించా రు. ఇందుకోసం డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లను సంప్రదించి జాబి తాలు రూపొందించే పనిలో ఉండగా.. ఈ నెల 8న కీలక సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేలా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పారదర్శకంగా జరుగుతోంది. అన్ని స్థాయిల కమిటీల్లో సామాజిక ప్రాతినిధ్యం ఉంటుంది. మహిళలకు 30 శాతం అవకాశాలు తప్పనిసరి చేశాం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం మార్గదర్శకాల మేరకు కమిటీలు పని చేస్తాయి. పార్టీ సిద్ధాంతాల పునశ్చరణ, గాంధీజీ ఆశయాల సాధన, క్రమశిక్షణ కలిగిన నాయకత్వ నిర్మాణం కోసం వారం వారం ‘సర్వోదయ చరక అభ్యాస్’ ప్రత్యేక శిక్షణ అన్ని స్థాయిల నాయకులకు ఉంటుంది. – ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, హనుమకొండ జిల్లావార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీల తర్వాత జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలో నియమించనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత దక్కేలా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండేలా, పార్టీ బలోపేతం దృష్ట్యా మండల స్థాయి కార్యవర్గాల్లో 35 సంవత్సరాల పైబడిన వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కనీసం మూడేళ్లపాటు పార్టీకి చురుకై న సేవలు అందించిన వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వనున్నారు. జిల్లా పరిధిలోని రెండేళ్లు పూర్తి చేసుకున్న మండల, మునిసిపల్, కార్పోరేషన్ డివిజన్ అధ్యక్షులను ఈసారి తప్పనిసరిగా మార్చాలని నిబంధన పెట్టుకున్నారు. ఈ మేరకు వార్డు, డివిజన్, గ్రామ, మండల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇదివరకున్న కమిటీలను రద్దు చేసిన డీసీసీలు గ్రామస్థాయి నుంచి కమిటీలు.. మండలాల వారీగా పరిశీలకులు జిల్లా కమిటీలో 31 నుంచి 51 మందికి ప్రాతినిధ్యం పల్లెల్లో మొదలైన కాంగ్రెస్ కమిటీల సందడి ఏప్రిల్ మాసాంతానికల్లా పూర్తిస్థాయి కమిటీలు? -
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి
ములుగు/ములుగు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకరతో కలిసి తాగు, సాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. ఏజెన్సీలోని గొత్తికోయ గూడేల్లో చేతి పంపులు, ట్రాక్టర్ ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. ప్రతీ పంచాయతీలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇప్పటి వరకు గ్రౌండింగ్ చేయకపోతే లబ్ధిదారులు మహిళ సంఘంలో ఉంటే వారికి వెంటనే రూ.లక్ష రుణం అందేవిధంగా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.200 కోట్లతో గోదావరి జలాలను జిల్లాకు మళ్లించడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే మల్లంపల్లిని ఆదర్శ పంచాయతీగా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లిలో సీఆర్ఆర్ నిధులు రూ.72.50 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులను, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10లక్షల నిధులతో గ్రామైఖ్య భవన నిర్మాణ పనులను కలెక్టర్ దివాకరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పాదయాత్రలో భాగంగా మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తామని హామీనిచ్చి నేరవేర్చారని తెలిపారు. మల్లంపల్లి మండలంలో పరిపాలన సౌలభ్యం కోసం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
ప్రజాపాలనపై కళాజాతా
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికపై మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో బుధవారం కళాజాతా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలంగాణ సాంస్కృతిక సారథి టీమ్ కోఆర్డినేటర్ రాగుల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, మత్తు పదార్థాల నివారణకు, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెల్లడించారు. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, నేటి నుంచి నిర్వహించబోయే గ్రామ సభల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కళాకారులు వివరించారు. కార్యక్రమంలో కళాకారులు రహీముద్దీన్, విజయ్, కిషన్, భాస్కర్ పాల్గొన్నారు. -
ఇప్పపువ్వుతో ఆదాయం
గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వ్యాపారులు తమ వద్దకు వచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అడవిలో లభించే ఇప్పపూలకు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. అయినా తాము మార్కెటింగ్కు చేయలేకపోతున్నాం. తక్షణమే ప్రభుత్వం జీసీసీ ద్వారా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటుపడాలి. – బరసి ఉంగయ్య, మామిడిగూడెం, ఏటూరునాగారం ఇప్పపువ్వుతో పౌష్టికాహారం ఇప్పపూలను వండుకొని తింటే పౌష్టికాహారం వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు తింటాం. చుట్టాలు వస్తే అందులో ఎండు చేపలు వేసి వారికి వండిపెడుతాం. అంతేకాకుండా లడ్డూలు, సారా కూడా తయారు చేసి విక్రయిస్తాం. ఇళ్లలో నిల్వ చేసుకునేందుకు డ్రమ్ములు, గుమ్ములను ఉపయోగిస్తాం. – వేకో సోని, గంటలకుంట, ఏటూరునాగారంమామిడిగూడెంలో ఆరబెట్టిన ఇప్పపువ్వు●ఏటూరునాగారం: ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో ఇప్పపువ్వు సేకరణ జాతర నెలకొంది. వేసవిలో విరివిరిగా లభించే పూలను సేకరించే పనుల్లో గిరిజనులు నిమగ్నమయ్యారు. వాటిని సేకరించి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, ఎస్ఎస్ తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని 51 గూడేల్లోని గిరిజనులు అత్యధికంగా ఇప్పపూలు సేకరించి నిల్వ చేస్తున్నారు. ఇలా నిల్వ చేసిన అనంతరం వాటిని లడ్డూలు, సారాయి తయారు చేసి విక్రయిస్తున్నారు. అలాగే సేకరించిన ఇప్పపువ్వును భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలి.. గిరిజన సహకార సంఘం (జీసీసీ) అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. కాని సదరు అధికారులు దృష్టి సారించడం లేదు. గతంలో జీసీసీ అధికారులు గూడేల్లోకి వచ్చి ఇప్పపువ్వు కొనుగోలు చేసి ఆర్థికాభివృద్ధి సాధించేలా తోడ్పాటు అందించేవారు. ఇప్పటికై నా జీసీసీ అధికారులు గొత్తికోయగూడేల్లో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.అడవిలో ఇప్పపువ్వు ఏరుతున్న మహిళ అటవీ ప్రాంతాల్లో విరివిగా ఇప్పపువ్వు లభిస్తుండడంతో గిరిజనులు ఎక్కువగా సేకరణపై దృష్టి పెట్టారు. ఒక్కో కుటుంబం రోజుకు 20 నుంచి 30 కిలోల వరకు సేకరించి ఎండబెడుతున్నారు. అలా 30 రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత డ్రమ్ములు, గుమ్మిల్లో నిల్వ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా బంధువులు వస్తే వారికి వండిపెడుతామని చెబుతున్నారు. ఇదే కాకుండా సారా కూడా తయారు చేసి బయటకు పంపించి లీటర్కు రూ.100ల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అఆగే ఇప్పపువ్వును కిలోకు రూ.10 నుంచి 30 వరకు విక్రయిస్తూ మధ్యంతర ఆదాయం పొందుతున్నారు. అలా వచ్చిన ఆదాయంతో ఇంటికి కావాల్సిన సరుకులు, బట్టలు, ఆహార ధాన్యాలను వంటివి కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ
ములుగు: రేషన్ కార్డు లబ్ధిదారులకు వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా ఫైసల్ హుస్సైని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. జిల్లాలో దాదాపు లక్షా 2 వేలకు పైగా కార్డులు ఉన్నాయని వివరించారు ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. దీనికి తోడు సర్వర్ సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి
● డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగు రూరల్: 14 సంవత్సరాలు నిండిన బాలికలు తప్పనిసరిగా హెచ్పీవీ(హ్యుమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్) వేసుకోవాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగ అన్వేష్తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, సూపర్వైజర్లతో మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో బుధవారం నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలు 14 ఏళ్లు నిండిన బాలికల జాబితాను తయారు చేసుకుని ప్రణాళికతో బాలికలకు వ్యాక్సినేషన్ చేయించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి సంపత్, డీడీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: అక్రమ అరెస్టులతో ఆదివాసీ ఉద్యమాన్ని ఆపలేరని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్రావు అన్నారు. మండల కేంద్రంలో కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ ప్రజా సంఘాలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లా గూడూరు వైపునకు వెళ్తున్న తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్, దారం రమేశ్, ముక్తి రాజును బయ్యారం పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆదివాసీల హక్కులను అణచివేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్ట్లను వెంటనే రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, నారాయణ, నరేశ్ పాల్గొన్నారు.


