breaking news
Mulugu District Latest News
-
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందుండాలి
ములుగు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందుండాలని అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇళ్లు మంజూరై గ్రౌండింగ్ కాని ఇళ్లను వారం రోజుల్లో గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తే త్వరగా బిల్లులు చెల్లిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. మండలాల వారీగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం, లబ్ధిదారులు నిర్ధారణ, మంజూరులు తెలిపి ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకబడిన మండలాలను గుర్తించి లక్ష్యసాధనకు అధికారులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. పంచాయితీ కార్యదర్శులు లబ్ధిదారులను నేరుగా కలిసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఇంటి నిర్మాణాలకు నిధుల సమస్య లేదని తెలిపారు. ఇంటి నిర్మాణ పనులను దశల వారీగా ఫొటోలను వెబ్సైట్లో అందుబాటు ఉంచాలన్నారు. ఇంటి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లాలో ఏర్పాటు చేయనున్న క్రేచ్ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మొబైల్ క్రేచ్ సంస్థ సహకారంతో అంగన్వాడీలకు పాలన స్కీంలో 8 రోజుల పాటు శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ క్రేచ్ సంస్థ ట్రైనర్స్ నీలం శ్రీవాత్సవ, విజయలక్ష్మీ మణికప్పలు. 14మంది అంగన్వాడీ టీచర్లకు శిక్షణ అందించగా వారిని అభినందించి ప్రసంసా పత్రాలు అందించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తీవ్రం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు పరిష్కరించకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్, సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట సోమవారం మహాధర్నా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముందుగా ఏటూరునాగారం ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. మంత్రి సీతక్క ఉన్న ప్రాంతాల్లో కూడా గిరిజనులపై నిర్బంధాలు ఎక్కువ అయ్యాయన్నారు. ఈ ధర్నాకు రాకుండా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకోవడం హేమమైన చర్య అన్నారు. ఆదివాసీ గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీ సాగుదారులపై అటవీశాఖ దాడులు ఆపాలని, అర్హులైన ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాడ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అందజేశారు. ఈ దర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్లు బారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి, దామోదర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రవికుమార్, పుల్లయ్య ఐటీడీఏ ఎదుట మహాధర్నా, పోలీసుల బందోబస్తు -
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
ములుగు రూరల్: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితం గడపాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. ఈ సందర్భంగా సోమవారం ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ మాట్లాడారు. జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి సంయుక్తంగా పోరుకన్న ఊరు మిన్న.. ఊరికి తిరిగి రండి అంటూ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఇదే క్రమంలో నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలలో పని చేస్తున్న ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 73మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎంఎస్ 3, ఏసీఎంఎస్ 10, పీఎంఎస్ 22, మిలిషియా సభ్యులు 29మంది, ఆర్పీసీ సభ్యులు 1, డీఏకేఎంఎస్ 2, సీఎన్ఎంలు ఆరుగురు లొంగిపోయారని వివరించారు. లొంగిపోయినవారికి పునరావాస పథకానికి అనుగుణంగా సదుపాయాలు కల్పించామన్నారు. ఆదివాసీలు మావోయిస్టులకు సహకరించకపోవడంతో ఆరోగ్యం క్షిణించి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నడవలేని స్థితికి దిగజారిపోయారని వెల్లడించారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కర్రెగుట్టల అటవి ప్రాంతాల్లోని సంపదను స్వేచ్ఛగా అనుభవించేందుకు పోలీస్శాఖ, కేంద్ర బలగాలు క్యాంపులను ఏర్పాటు చేయనున్నాయన్నారు. అనంతరం లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులకు తక్షణ సాయం కింది ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున అందించారు. మిగిలిన మొత్తం బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో సుక్మా జిల్లాకు చెందిన శ్యామల రాజేష్, కడతిల్ దుమ, బీజాపూర్ జిల్లాకు చెందిన ఊకె జోగి, బాడిషె భియా అలియాస్ మహేష్, ముచ్చకి జోగిలు ఉన్నట్లు ఎస్పీ వివరించారు.ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్
హసన్పర్తి: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్స్టా, ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్లోని వైద్యవర్గాల్లో చర్చనీయాంశమైంది. అత్తామామలకు చెప్పినప్పటికీ.. డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. ఆమె వెంటనే ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా.. డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్లో తాను గుండె ఆపరేషన్ లైవ్గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతుంది. సృజన్ కారును కూడా పూర్తిగా యువతి వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండవ కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు తెలిపారు.‘రీల్స్ గర్ల్’ మోజులో గుండైవెద్య నిపుణుడు భార్యకు శారీరక, మానసిక వేధింపులు.. దంత వైద్యురాలి మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు పోలీసుల అదుపులో డాక్టర్.. విచారణ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు. -
తాగునీటి కోసం రాస్తారోకో
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోదా పురం పంచాయతీ పరిధిలోని గుట్టబోరు గ్రామస్తులు తాగునీటి కోసం సోమవారం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి పథకం మోటర్ మరమ్మతులకు గురైందని రిపేర్ చేయించాలని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకుకెళ్లగా పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు.ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ప్రజావాణి, గిరిజన దర్బార్లో వినతుల వెల్లువ ● కలెక్టరేట్, గిరిజన దర్బార్లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా ● పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశంములుగు రూరల్/ ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజ లు తమ సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ వినతులు అందజేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్వర్లుతో కలిసి వివిధ సమస్యలపై వచ్చిన 75 దరఖాస్తులను స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా 40 వినతులు స్వీకరించారు. మొ త్తంగా వచ్చిన 115 వినతులు తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని ఆ యా శాఖల అధికారులను వారు ఆదేశించారు. గిరిజన దర్బార్లో వినతులు ఇలా.. వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళా స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ములుగు మండలంలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన నిరుద్యోగురాలు అవుట్ సోర్సింగ్లో అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. గోవిందరావుపేట మండలం మచ్చాపురం గ్రామానికి చెందిన ఓ రైతు తన తండ్రి పేరుపై ఉన్న పట్టాదారు పాసుపుస్తకం తన పేరుపై మార్చాలని పీఓకు విన్నవించారు. మంగపేట మండంలోని అటవీశాఖ ద్వారా ఓ కార్పొరేషన్ సంస్థలో వేసిన జామాయిల్ కటింగ్, కొనుగోళ్లను పెసా గ్రామ సభల ద్వారా తీర్మాణం చేసి ఆదివాసీ రైతులకు జీవనోపాద్ధి కల్పించాలని రైతులు మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగురాలు అంగన్వాడీ టీచర్ పోస్టు ఇప్పించాలని కోరారు. ములుగు మండలంలోని గిరిజన ఆశ్రమ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ ఉద్యోగ అవకాశం కల్పించాలని ఓ గిరిజనుడు కోరారు. ఉమ్మడి జిల్లాలోని సీఆర్టీలను రెన్యువల్ చేయాలని సీఆర్టీలు కోరారు. ఏటూరునాగారం మండలం మల్యాలకు చెందిన ఓ గిరిజనుడు తనకు ఒకేషనల్ ట్రైనింగ్ ఇప్పించాలని కోరారు. గోవిందరావుపేట మండలంలోని 127 మంది గిరిజనులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కావాలని, 36 మంది ఇందిరమ్మ ఇళ్లు కావాలని పీఓకు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి నుంచి 297 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కావాలని దరఖాస్తులు అందజేశారు. ఇలా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు పాల్గొన్నారు. -
కల్తీ కల్లుకు మేం పూర్తిగా వ్యతిరేకం
గోవిందరావుపేట: కల్తీ కల్లుకు మేం పూర్తిగా వ్యతిరేకం అని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండల పరిధి పస్రాలో జక్కు రాజుగౌడ్ అధ్యక్షతన హైదరాబాద్లో కల్తీ కల్లు మరణాల దృష్ట్యా జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ రాజసమ్మయ్య కల్లు శాంపిల్ తీసుకున్నారు. ఈసందర్భంగా బుర్ర శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధ కల్లులో అనేక పోషకాలున్నాయని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. ప్రభుత్వమే ప్రకృతి సిద్ధమైన కల్లు సేవించాలని ప్రచారం చేయాలని, శీతల పానీయాలు తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో పస్రా సొసైటీ కల్లు గీత కార్మికులు జక్కు మొగిళిగౌడ్, మేర్గు సుధాకర్గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, జక్కు భిక్షపతిగౌడ్, దామోదర్ గౌడ్, ఎకై ్సజ్ సిబ్బంది హెడ్ కానిస్టెబుల్ శ్రీకాంత్, సునీల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్గౌడ్ -
వనాల జిల్లాకు వన్నె తెచ్చేలా..
ములుగు జిల్లాలోని 171 గ్రామ పంచాయతీ నర్సరీల్లో 11,59,193 మొక్కలు పెంచుతున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నర్సరీలో 6 వేల మొక్కల చొప్పున పెంచారు. దీంతో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు నర్సరీల్లో 2.15 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇందులో 1,00,793 మొక్కలను గతంలో నాటిన వాటి స్థానంలో నాటనున్నారు. నర్సరీల్లో నీడనిచ్చె చెట్లతో పాటు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను పెంచుతున్నారు. నీడనిచ్చే మొక్కలు కానుగ, ఎర్రతొగరు, నారేప, రావి, మర్రి, జువ్వి, ఇప్ప, వెదురు చెట్టు, పండ్ల మొక్కలు జామ, మామిడి, నిమ్మ, పనస, పూల మొక్కలు మందార, మల్లె, గులాబీ మొక్కలను పెంచుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పండ్ల, పూల మొక్కల్ని పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అడవుల ఖిల్లా.. ములుగు జిల్లాకు మరింత వన్నె తెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వన మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 14.16 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు టార్గెట్ విధించారు. ఆయా నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వర్షాలు కురవగానే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – ములుగు రూరల్ విస్తారంగా అడవులున్పటికీ ములుగు జిల్లాలో అదే స్థాయిలో చెట్ల నరికివేత ఉందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న అడవుల్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మరికొద్ది రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు నాటిన మొక్కలు ములుగు జిల్లాలో 2022 నుంచి 2024–25 వరకు మొత్తం 14,39,967 మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఇందులో 14,00,967 మొక్కలు సమృద్ధిగా పెరిగాయని డీఆర్డీఏ అధికారులు తెలిపారు. మొక్కల సంరక్షణకు 10.17 కోట్లు వెచ్చించారు. ఈఏడాది వివిధ శాఖల ద్వారా జిల్లాలో టార్గెట్ 14,00,165 మొక్కలు నాటనున్నారు.జిల్లాలోని మండలాలు 10జనాభా 2,94,671 జిల్లా విస్తీర్ణం 3,881 స్క్వేర్ కిలోమీటర్లు జిల్లాలో అటవీ విస్తీర్ణం 2,00,835 హెక్టార్లు మల్లంపల్లి పరిధి అటవీశాఖ నర్సరీలో మొక్కలు -
మందు పాతర ఘటనలో గాయపడిన వ్యక్తి మృతి
వెంకటాపురం(కె): మందు పాతర పేలిన ఘటనలో గాయపడిన సోయం కామయ్య (45) ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల పరిధి ముకునూరు పాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య.. వెదురు తెచ్చుకోవడానికి ఈ నెల 4న కర్రె గుట్టల ప్రాంతంలోని అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు పడడంతో అది పేలింది. దాంతో తీవ్రంగా గాయపడిన సోమయ్యను చికిత్స నిమిత్తం వరంగల్, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో వైద్యం పొందుతూ గురువారం మృతిచెందాడు. -
బీసీలకు రిజర్వేషన్ పెంపుపై హర్షం
ములుగు రూరల్: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వంగ రవియాదవ్ అన్నారు. ఈమేరకు శుక్రవారం జాతీయ రహదారిపై బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల రాజకీయ ఎదుగుదలకు సహకరించి మంత్రి వర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పౌడాల ఓంప్రకాశ్, గొర్రె అంకూష్, ఒజ్జల కుమార్, బొంత వేణు, జయపాల్రెడ్డి, ఒజ్జల లింగన్న, నిరంజన్, ఓడ రాజు కుక్కల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న గోదావరి ఉధృతి
వాజేడు మండలం పేరూరు వద్ద బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరువరద నీరు ఉధృతంగా వస్తుండడంతో గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో వాజేడు మండలంలో గోదావరి ఉప్పొంగుతోంది. పలు చోట్ల రహదారులు ముంపునకు గురయ్యాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై పలు చోట్ల వంతెనలు మూసివేశారు. ప్రజలెవ్వరూ నీటిలోకి వెళ్లకుండా రహదారులపై ట్రాక్టర్లను అడ్డుపెట్టారు. – మరిన్ని వార్తలు 8లోu -
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ఏటూరునాగారం: ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు బి.రాజు ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నాగరాజు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల జీపీఎఫ్, సరెండర్, లీవుల బిల్లులు ఏళ్లు గడిచినా విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విధంగా 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం చెల్లించి వారికీ పేస్కేల్ వర్తింపజేయాలన్నారు. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూక్యా సారంగపాణి, మండలం నాయకులు కానుగంటి సతీశ్, తాళ్లపల్లి మాధవి, సీహెచ్ పద్మ శ్రీ పాల్గొన్నారు.టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
ములుగు రూరల్: సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం మున్సిపాలిటీ పరిధి గడిగడ్డ ప్రాంతంలో వైద్యశాఖ, ఆశాలతో కలిసి ఇంటింటి సర్వే చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వల కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడతారన్నారు. నీటి నిల్వలు ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్, యాంటీ లార్వా మందులు పిచికారీ చేయించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల ప్రభుత్వ పాటించాలని సూచించారు. మున్సిపాలిటీ నుంచి నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిసెంట్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి ములుగు రూరల్: దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన పొంది సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉపాధి, పునరావాస పథకం ప్రవేశపెట్టినట్లు జిల్లా సంక్షేమాధికారి తుల రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 శాతం వైకల్యం కలిగి ఉండి 21 సంవత్సరాల నుంచి 55 వయస్సులోపు వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఆదాయ పరిమితి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉండాలని పేర్కొన్నారు. డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.టీఎస్బీఎంఎంఎస్.సీజీజీ.జీఓవీ వెబ్సైట్లో ఈనెల 14 నుంచి 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్గా బాధ్యతల స్వీకరణ ములుగు రూరల్: ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్గా చంద్రశేఖర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు డాక్టర్ మోహన్లాల్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈనెల 7న జనరల్ మెడిసిన్ విభాగంలో ములుగు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా విదులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్కు పదోన్నతి కల్పిస్తూ సూపరింటెండెంట్గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన సూపరిండెంట్ను పలువురు వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు భిక్షపతిరావు, తైలం గౌతమ్ తదితరులు ఉన్నారు. వ్యాస రచన పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలి ములుగు రూరల్: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించే వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని లీడ్ ఇండియా గ్లోబల్ సమన్వయకర్త డాక్టర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ‘నివాస యోగ్యమైన భూగోళ పరిరక్షణ’ అంశంపై వ్యా స రచన పోటీలుంటాయని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి ములుగు రూరల్: విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని ఏటీడీఓ దేశీరాం, జీసీడీఓ సుగణ అన్నారు. ఈమేరకు శుక్రవారం జగ్గన్నపేట ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ఆమె వెంట పాఠశాల హెచ్ం విజయలక్ష్మీ, వార్డెన్ బారోత్ అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒకరిపై కేసు భూపాలపల్లి అర్బన్: డీడబ్ల్యూఓపై అసత్యపు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పట్టణానికి చెందిన మాచర్ల సంతోష్పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేశ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
‘కు.ని’పై అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: యువతకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈమేరకు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా విస్పోటనం వల్ల నిరుద్యోగం, పోషకాహార లోపం, జీవన ప్రమాణాల తగ్గుదల ఏర్పడుతుందన్నారు. జనాభా వృద్ధి వల్ల కలిగే సవాళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం జిల్లాలో మాతా శిశు సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేసి 102 అంబులెన్స్ సేవలు అందిస్తుందన్నారు. ఈసేవలతో తల్లీబిడ్డ క్షేమంగా ఉంటున్నట్లు తెలిపారు. శాశ్వత కుటుంబ నియంత్రణ పాటించే వారి జాబితాను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వారీగా కేంద్ర కార్యాలయానికి పంపి నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, పవన్కుమార్, నాగగణేశ్, సంపత్, సాంబయ్య, స్వరూపరాణి, సూపర్వైజర్లు సురేశ్, దేవేందర్, నిర్మల, దేవమ్మ, వినోద్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. క్షయ వ్యాధిని అంతమొందించాలి జిల్లాలో క్షయ వ్యాదిని అంతమొందించాలని జిల్లా వైధ్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో టీబీ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ పౌరుడు క్షయ నియంత్రణలో భాగస్వామ్యం కావాలన్నారు. క్షయ వ్యాధి గాలిలో తుంపర్ల ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. క్షయ వ్యాది నివారణకు ప్రభుత్వం మందులు పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి గోపాల్రావు -
గూడేల్లో మెరుగైన విద్యనందిస్తాం
ఏటూరునాగారం: గొత్తికోయ ఆదివాసీ చిన్నారులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధి చింతలమోరి ఆదివాసీ గ్రామాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ సంపత్ రావు సందర్శించారు. రాండ్ స్టాండ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన యూనిఫాంలు, పుస్తకాలు, విద్యా సామగ్రిని మంత్రితో పాటు కలెక్టర్ అదనపు కలెక్టర్లు పంపిణీ చేశారు. రాండ్ స్టాండ్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు తొమ్మిది పాఠశాలల్లోని 150 మంది పిల్లలకు అన్ని వస్తువులను అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం మంత్రి సీతక్క విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణ ప్రాంతాల్లో మంత్రి కలెక్టర్ అధికారులు మొక్కలు నాటారు. కొండాయి గ్రామం వద్ద జరుగుతున్న హైలెవెల్ బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి పరిశీలించారు. వాగు దాటి.. పాఠశాలను ప్రారంభించి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి ట్రాక్టర్పై జంపన్నవాగు దాటి ఎలిశెట్టిపల్లికి వెళ్లారు. ప్రభుత్వ నిధులు రూ.15లక్షలతో నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కాగా.. మండల కేంద్రంలోని ఎండి. వలీబాబా తండ్రి ఇటీవల మరణించడంతో మంత్రి సీతక్క బాదిత కుటుంబాన్ని పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన పెండ్యాల సంతోశ్తోపాటు పలువురు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడారంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవిచందర్తో కలిసి మంత్రి సీతక్క శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్కు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం సీతక్క విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే మహా జాతర కోసం రూ.112 కోట్లతో ప్రాథమిక అంచనాలతో కలెక్టర్.. ట్రైబల్ వెల్పేర్ శాఖకు పంపించారని తెలిపారు. ప్లేట్స్ తయారీ యూనిట్ ప్రారంభం గోవిందరావుపేట: మండలంలోని మోట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో రాండ్స్టాండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ వారి సహకారంతో సమ్మక్క సారలమ్మ అడవి ఆదివాసీ సహకార సమాఖ్య అడ్డాకుల ప్లేట్ తయారీ యూనిట్ను మంత్రి సీతక్క, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రవిచందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్, మేడారం ఆలయ ఈఓ వీరస్వామి, ఇన్చార్జ్ తహసీల్దార్ సురేశ్బాబు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ఎన్జీఓ సంతోశ్, నాయకులు బొల్లు దేవేందర్, ఇర్ప సునీల్, వెంకన్న, రఘు, మనోజ్, రవి, రాము, రాండ్ స్టాండ్ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క ట్రాక్టర్లో వాగుదాటి పాఠశాల భవనం ప్రారంభం -
సమాజ బాధ్యతగా తీసుకోవాలి..
మొక్కల సంరక్షణను పౌరులంతా బాధ్యతగా తీసుకోవాలని ములుగు ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ సూచిస్తున్నారు. వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనతో మినీ ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే.. వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖలకు టార్గెట్లు విధించింది. మొక్కల సంరక్షణకు ప్రధానంగా ట్రీగార్డులను వినియోగించాలి. నేలకు అనువైన మొక్కలు నాటడంతో పాటు న్యూట్రీషన్ అందించేలా చూడాలి. మొక్కలకు చెదలు రాకుండా గుళికలను వినియోగించాలి. నీడనిచ్చే చెట్ల ఎదుగుదలలో క్రూనింగ్ చేస్తే ఏపుగా పెరుగుతాయి. దీంతో పాటు మొక్కలకు కాంపోస్ట్ ఎరువుల్ని వినియోగిస్తే ఎదుగుదల బాగుంటుంది. -
సఖి సేవలు వినియోగించుకోవాలి
ములుగు రూరల్: గృహ హింస బాధితులు సఖి సేవలు వినియోగించుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సఖి కేంద్రంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేధింపులకు గురవుతున్న మహిళలు న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు సఖి సిబ్బంది సత్వర సహాకారాలు అందించాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, లీగల్ సర్వీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాదికారి తుల రవి, డీసీపీఓ ఓంకార్, లావణ్య, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu1. మీరు ఎంత మంది పిల్లలను కనాలనిఅనుకుంటున్నారు?3. పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనే ప్లాన్ ఎలా చేస్తారు? 2. ఉమ్మడి కుటుంబమా.. ఒంటరిగా ఉండడం ఇష్టమా? ఉమ్మడి కుటుంబం భార్యాభర్తలు విడిగా ఉండడంభార్యాభర్తలు జాబ్ చేయడం వల్ల పిల్లలను చూసుకునే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని..4. ఈ తరంలో ఒక్కరు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు ఎందుకు? 401510051624263620‘ఒక్కరు.. లేదా ఇద్దరు పిల్లలు చాలు. అంతకంటే ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవు. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని అంటున్నారు యువజంటలు. దీంతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మారిన జీవన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఈ తరం ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ వచ్చే ఇరవై ఏళ్లలో యువజనుల జనాభా తగ్గి, సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురికి పైగా.. బిడ్డల్ని కనాలన్న సూచనలు వస్తున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనే విషయంలో యువజంటలు ఏమంటున్నాయి.. వీరితో పాటు 25 ఏళ్ల పైబడి వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారి మనోగతంపై ‘సాక్షి’ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అంశాలపై సర్వే నిర్వహించింది. అంతకంటే ఎక్కువ కనలేమంటున్న యువ జంటలుఉమ్మడి కుటుంబంలో ఉంటేనే సంతోషం ● ‘సాక్షి’ సర్వేలో స్పష్టీకరణ – సాక్షి నెట్వర్క్ న్యూస్రీల్ -
వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో గురువారం ఉదయం సాయిబాబా, దత్తాత్రేయుడు, వినాయకుడి విగ్రహాలకు పంచామృత అభిషేకాలను, పుష్పార్చనలను అర్చకులు యల్లాప్రగడ భానుప్రకాశ్ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏఎస్పీ శివం ఉపాధ్యాయ దంపతులతో ఆలయానికి చేరుకొని పుష్పార్చనలను చేశారు. అలాగే భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా ఏఎస్పీ దంపతులు స్వయంగా వడ్దించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆయన వెంట స్థానిక ఎస్సై రాజ్కుమార్, ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్తో పాటు జగదీశ్, సతీష్, రమేష్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
జనం.. కుటుంబ బలం!
చిన్న కుటుంబమే మంచిది..ఏటూరునాగారం: 1992లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు నవ్య, సౌమ్యలు జన్మిచండంతో చాలు అనుకున్నాం. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపించాము. పిల్లలు వెళ్లిపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాం. ప్రస్తుత కాలంలో మారిన ఆర్థిక పరిస్థితుల దృష్యా ఇద్దరు పిల్లలే ముద్దు. ముగ్గురు ఉంటే ఖర్చులు భరించడం ఇబ్బందిగా ఉంటుంది. చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. – గడ్డం సదానందం, శారదఒక్కరే చాలు అనుకున్నాం..ఏటూరునాగారం: మండలంలోని 7వ వార్డుకు చెందిన చిటమట గంగాధర వసంతలకు 2005 ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. వీరికి కుమారుడు సాయి నిషాంత్ ఉన్నారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక్కరే మంచిదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం కుమారుడు ఐఏఎస్ కోచింగ్ పొందుతున్నాడు. ఇద్దరం చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. – చిటమట గంగాధర, వసంత ఒకప్పుడు ప్రతీ ఇంట్లో పిల్లల సైన్యం ఉండేది. రేషన్ కార్డులోనైతే వారి పేర్లకు జాగా సరిపోయేది కాదు. అలాంటిది కుటుంబ నియంత్రణ శాఖ అవగాహన. పెరుగుతున్న ఆర్థిక భారం తదితర కారణాలతో ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటూ ‘మేమిద్దరం.. మాకిద్దరు’ అంటూ ఇద్దరితో సరిపెట్టుకున్నారు. ఆధునికతతో పరుగులు పెడుతున్న యువత, , భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతో ప్రస్తుతం ‘ఒక్కరు చాలు’ అంటున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్లో యువజనులు తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువమంది పిల్లల్ని కన్న కుటుంబాలు ఎలా సంతోషంగా ఉండగలిగారు? జీవితాలకు ఉమ్మడి కుటుంబాలు ఎలా మేలు చేస్తాయి? తదితర అంశాలపై జిల్లావాసులేమంటున్నారనేది నేడు(శుక్రవారం) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఎక్కువమంది పిల్లలున్నా ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు ప్రస్తుతం ఒక సంతానానికే ప్రాధాన్యమిస్తున్న యువజంటలు మారుతున్న కాలానికనుగుణంగా ఫ్యామిలీ ప్లానింగ్ పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్లో యువజనాభా తగ్గుతుందంటున్న పరిశీలకులు నేడు ప్రపంచ జనాభా దినోత్సవ -
ఇద్దరితో సంతోషంగా ఉన్నాం..
వెంకటాపురం(ఎం): ప్రస్తుత కాలంలో రోజురోజుకూ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాం. అంతకంటే ఎక్కువ ఉంటే ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇద్దరు పిల్లలను చదివించడానికి చాలా కష్టపడుతున్నాం. పిల్లల చదువుకోసం జిరాక్స్ సెంటర్, కిరాణం షాపు నడుపుతూ పిల్లల్ని చదివిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని ఉంటే ఎంత కష్టపడినా వారిని ఉన్నతంగా చదివించలేము. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – మోడెం శ్రీనివాస్, అనిత దంపతులు -
బీఎల్ఓల పాత్ర కీలకం
వాజేడు: ఓటరు నమోదు, తొలగింపు ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర కీలకమని భద్రాచలం ఆర్డీఓ కె.దామోదర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాల బీఎల్ఓలకు గురువారం మాస్టర్ ట్రైనర్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ దామోదర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి దరఖాస్తులను తీసుకోవడం, ఓటరు లీస్టులోని సవరణలకు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి ప్రక్షాళన చేసే విషయంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. గతంలో నిర్వహించిన ఎన్నికల సమయంలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదని తెలిపారు. ఈ దఫా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. స్థానిక అధికారుల సలహాలు, సూచనలను తీసుకోవాలని తెలిపారు. శిక్షణ తీసుకోవడంతో కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవచ్చని వివరించారు. గత ఐదేళ్లుగా తమకు డబ్బులు చెల్లించడం లేదని బీఎల్ఓలు ఆర్డీఓకు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే పరిశీలన చేశామని త్వరలోనే డబ్బులు అందేలా చూస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఆర్డీఓ దామోదర్ -
సంతోషంతో సమానంగా ఇబ్బందులు..
భూపాలపల్లి: మాకు ముగ్గురు పిల్లలు. పాఠశాలకు పంపేందుకు పిల్లలను తయారు చేయడంతో పాటు ఫీజులు తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయినప్పటికీ కష్టంతో కూడిన సంతోషాన్ని అనుభవిస్తున్నాం. గతంలో మా తల్లితండ్రులతో ఉన్నప్పుడు పిల్లలను చూసుకోవడం పెద్దగా ఇబ్బంది అయ్యేది కాదు. ఉద్యోగ రీత్యా తల్లితండ్రులకు దూరంగా ఉండి పిల్లలను చూసుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయినా కష్టాలను ఓర్చుకుంటూ ఎవరికీ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాం. ఒకరికి మాత్రమే జన్మనిస్తే చిన్నారులు తోడబుట్టిన వారు లేక కుంగిపోయే అవకాశం ఉంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే చిన్నతనంలో కొంత కష్టమైనా పెద్ద పెరిగాక కష్టసుఖాల్లో ఒకరినొకరు పాలుపంచుకుంటారు అనేది మా ఉద్ధేశం. ముగ్గురు పిల్లలు ఉండటం వలన ఒకరినొకరు ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ, బంధాల మధ్య పెరుగుతున్నారు. – పసునూటి శ్రీనివాస్, భూపాలపల్లి -
వైభవంగా సీతారాముల కల్యాణం
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం దమ్మక్క ఉత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవ తంతును వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల రామనామస్మరణల నడువ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వరస్వామి కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ అజయ్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలి వెంకటాపురం(కె): మండలంలోని ఇసుక ర్యాంపులకు వచ్చే ఇసుక లారీలకు ఇసుక సొసైటీలు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని యాకన్నగూడెం బ్రిడ్జి వద్ద ఇసుక లారీలతో గురువారం ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్ చేశారని తెలిపారు. ఇసుక క్వారీ నిర్వహకులు, సొసైటీ సభ్యులు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసుకోవాలని, రోడ్ల పై వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 30 లారీలకు జరిమానా వాజేడు: నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై నిలిపిన 30 ఇసుక లారీల యజమానులకు జరిమానా విధించినట్లు పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ధర్మారం నుంచి చెరుకూరు వరకు రహదారిపై రాంగ్ పార్కింగ్లో నిలిపిన లారీలకు జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఇసుక క్వారీ నిర్వహకులు లారీలను నిలపడానికి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 17న గుండె ఆపరేషన్లు ములుగు రూరల్: జిల్లాలోని రాష్ట్రీయ బాలల సస్త్య కార్యక్రమంలో గుర్తించిన పది మంది పిల్లలకు ఈ నెల 17న సిద్ధిపేటలో గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ పది మంది పిల్లలకు సాయి సంజీవని ట్రస్ట్ సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో ఉచిత ఆపరేషన్ తో పాటు ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిసంజీవని ట్రస్టు వాలంటీర్లు దామోదర్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం కోఆర్డినేటర్ నరహరి, శ్రీనివాస్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి వెంకటాపురం(కె): ఏజెన్సీలో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు అధిక ఫీజలు వసూలు చేస్తున్నాయని, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని విద్యా సంస్థల్లో క్రీడా మైదానాలు కూడా లేకపోవడంతో పాటు మౌలిక వసతులు లేవని వివరించారు. -
పెరుగుతున్న గోదావరి
ఏటూరునాగారం/వాజేడు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది వరద క్రమక్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం నాటికి రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటిమట్టం 13 మీటర్లకు చేరింది. అయితే వరద క్రమంగా పెరుగుతోందని కేంద్ర జలవనరుల అధికారులు తెలిపారు. సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. పేరూరు వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరుకుంది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ కనిపిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13మీటర్లకు చేరిన నీటిమట్టం -
ప్రభుత్వానికి రూ. 6.89లక్షల ఆదాయం
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఎకై ్సజ్ కార్యాలయం పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను గురువారం ఎకై ్సజ్ సూపరింటెండెండ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు వాహనాల వేలం పాటను స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించినట్లు ఎకై ్సజ్ సీఐ కిశోర్ తెలిపారు. ఈ వేలం పాటకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ లింగాచారి హాజరై నిర్వహించగా 24 వాహనాలకు రూ. 6.89 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి మలుగు రూరల్: ఈ నెల 16న హనుమకొండలో నిర్వహించనున్న బ్యాండ్ వాయిజ్య కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు అంకూస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో వాయిజ్య కళాకారుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ తేదీ ఉదయం హనుమకొండలోని లష్కర్ ఫంక్షన్హాల్లో ఉదయం 11గంటలకు రాష్ట్ర సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సదస్సుకు కళాకారులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రవీందర్, సాంబయ్య, ఐలయ్య పాల్గొన్నారు. -
మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ములుగు రూరల్: ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ అధికారి కనకశేఖర్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యవర్గ నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ 7 సంవత్సరాలుగా కమిటీ లేకుండా నిర్వాహణ సాగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా, రాష్ట్ర టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మహిళా కోఆపరేటీవ్ కార్పొరేషన్ చైర్మన్ శోభ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, చాంద్పాషా, మాడుగుల రమేష్, చిక్కుల రాములు, దేవ్సింగ్, పాలకుర్తి సమ్మయ్య, రేవంత్యాదవ్ పాల్గొన్నారు. -
మేడారం జాతర విశిష్టతను కాపాడుకోవాలి
● సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర విశిష్టతను కాపాడుకోవాలని సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్ అన్నారు. మండల పరిధిలోని ఐటీడీఏ అతిథి గృహంలో వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ సంస్కృతి పరిరక్షణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాటాల్డారు. మేడారం మహాజాతర ప్రకృతితో మమేకమై సాగుతుందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాకొద్ది జాతరను వారికి అనుగుణంగా మార్చుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. గద్దెల విశిష్టత తగ్గకుండా పనులు చేయాలన్నారు. మార్పుల విషయంలో స్థానిక పూజారుల, ఆదివాసీల అభిప్రాయాలు స్వీకరించాలన్నారు. అనంతరం సమ్మక్క జాతర పుస్తక రచయిత సూరయ్య మాట్లాడుతూ మేడారం జాతర ఎంతో పవిత్రమైందన్నారు. జాతర ఆసియా ఖండలోనే అతిపెద్ద గిరిజన జాతర కనుక అంతర్జాతీయ స్థాయిలో గిరిజన సంస్కృతి జాతర ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆంగ్లంలో పుస్తకం తీసుకువచ్చామన్నారు. అనంతరం వనవాసీ సంఘ సభ్యులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఆదివాసీ గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. జాతర పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అనంతరం సమ్మక్క – సారలమ్మ జాతర విశిష్టతపై దుర్గం సూర్య రచించిన పుస్తకాన్ని వారు ఆవిష్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ కుర్సం రవికుమార్, వనవాసీ కల్యాణ పరిషత్ కార్యదర్శి మైపతి సంతోష్కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మ ణ్, నాయకులు హనుమంతరావు పాల్గొన్నారు. -
‘చేపల వేటకు వెళ్లొద్దు’
ములుగు రూరల్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మాన్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం ఉత్తర్వుల నంబర్ 186, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ 25/11/1995 ప్రకారం జూలై, ఆగస్టు మాసాలలో చేపలు గుడ్లు పెట్టే దశను దృష్టిలో ఉంచుకుని చేపల వేట నిషేధించినట్లు తెలిపారు. వర్షాల సమయంలో మత్స్యకారులు చెరువులు, కుంటలు, జలాశయాలకు చేపల వేటకు, ఈతకు వెళ్లకూడదని వివరించారు. చెరువులు మత్తడి పోసే సమయంలో మత్తడి వద్ద సిమెంట్ దిమ్మెలు, జాలీలను ఏర్పాటు చేయకూడదని సూచించారు. అలా చేస్తే చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం గోవిందరావుపేట: జిల్లా పరిధిలోని వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని జవహర్నగర్ మోడల్ స్కూల్, గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కంప్యూటర్ ల్యాబ్లను అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్జీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీ పాఠశాలకు 10కంప్యూటర్లు, ఒక ప్రింటర్ను దాతలు వరంగల్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంబటి శ్రీజన్, ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీధర్రాజులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఇరు పాఠశాలల ఉపాధ్యాయులు కంప్యూటర్ల దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెండర్ అండ్ ఈక్వీటీ కో ఆర్డినేటర్ గ్యాదరి రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, మోడల్ స్కూల్ జవహర్ నగర్ ప్రిన్సిపాల్ కృష్ణ, చల్వాయి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తుల వివరాల నమోదు పూర్తి ములుగు రూరల్: జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలాన్ని ప్రభుత్వం భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను భూ భారతి పోర్టల్లో నమోదు పూర్తి చేసినట్లు ములుగు ఆర్డీఓ వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటాపురం(ఎం) మండలంలో 9 రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి 4,555 దరఖాస్తులను స్వీకరించగా క్షేత్రస్థాయి రికార్డుల పరిశీలించి 1841 దరఖాస్తులు ఆమోదించినట్లు తెలిపారు. 513 పీఓటీ దరఖాస్తులు, 143 నూతన అసైన్డ్మెంట్ దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆమోదింపబడిన దరఖాస్తుల వివరాలు భూభారతి పోర్టల్లో నమోదు అయ్యాయని దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకునేందుకు ఉదయం 10.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెల్ నంబర్ 9985839187లలో సంప్రదించాలని లేదా వెంకటాపురం(ఎం) తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. అప్రెంటిస్షిప్ మేళా భూపాలపల్లి అర్బన్: ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా(పీఎంఎన్ఏఎం)ను ఈ నెల 14వ తేదీన స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని విని యోగించుకోవాలని కోరారు. ఐటీఐ ఉత్తీర్ణులైనవారు www. apprenticeshipindia. gov. in పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని సూ చించారు. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటిస్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. భూపాలపల్లిలో జరిగే ఈ మేళాకు హైదరాబా ద్కు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. బాలకార్మికుడి గుర్తింపు కాటారం: బాల కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్న వారిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. కాటారం మండలం గంగారం గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న బాలకార్మికుడిని బుధవారం అధికారులు గుర్తించారు. ‘ఆపరేషన్ ముస్కాన్’లో భాగంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద, బాలల సంరక్షణ అధికారులు సాయిరాంగౌడ్, లింగారావు, పోలీసుల బృందం కలిసి గంగారంలో తనిఖీలు చేపట్టారు. -
లేబర్ కోడ్లు రద్దుచేయాలి
మలుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేసి నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్లు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. 8 గంటల పని విధానానికి బదులు 10 గంటల పని విధానాన్ని నిర్ణయించే జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, ఐల్లయ్య, కృష్ణ, నారాయణ సింగ్, రవి, ప్రవీణ్, మహేష్, నీలాదేవి, మంజూల, సరిత, సరోజీని పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా -
ముందుకు సాగట్లే..!
ఉమ్మడి వరంగల్లో 2025–2026 వానాకాలం సాగు అంచనా, సాగు లెక్క ఇదీ..సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై రెండు మాసాలు నడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చేరక.. పెరిగిన భూగర్భజలాలు కూడా అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా..ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల ఈసారి ఆశించిన మేరకు సాగు పెరగలేదని, అయితే ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా లోటు వర్షపాతమే... వరి సాగు 6.39 శాతమే.. జనగామ జిల్లాల్లో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షాపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది.మొత్తం సాగు అంచనా 15,82,755 ఎకరాలుఇప్పటి వరకు సాగైన విస్తీర్ణం 5,46,138 ఎకరాలు మొత్తం సాగు శాతం 34.50 శాతంఉమ్మడి వరంగల్ జిల్లాకు కలిసిరాని వానాకాలం గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు లోటు వర్షపాతం ఖాతాలో ఆరు జిల్లాలు కష్టకాలంలో పత్తి సాగువైపే మొగ్గు... వరి సాగుపై వేచి చూసే ధోరణి -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ములుగు రూరల్: విద్యార్థులు లక్ష్యంతో చదవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇన్ఫోసిస్ వారి సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఉంటు ఇదే పాఠశాలలో 4 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించానని తెలిపారు. చదువుపై ఆసక్తితో పీహెచ్డీ పూర్తి చేశానని వెల్లడించారు. లక్ష్యంతో చదివితే చదువుకు పేదరికం అడ్డుకాదని వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నా భోజనం అందించడంతో పాటు పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో రూ. 6లక్షల నిధులతో మూడు టాయిలెట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్కకు పాఠశాల విద్యార్థులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశా ఫౌండేషన్, ఈఎల్ఎఫ్ ఇంగ్లిష్ వారి సహకారంతో జిల్లాలో రెండోదశ లర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని సీతక్క ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్పై పట్టు సాధించాలని సూచించారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో దివ్యాంగులకు మోటర్ వెహికిల్స్ మంత్రి సీతక్క అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు వాహనాలు అందించినట్లు వెల్లడించారు. కొడిశలకుంటకు చెందిన బానోత్ యాకూబ్, నర్సాపూర్ గ్రామానికి చెందిన గుర్రం శ్రీహరిలు వాహనాలు అందుకున్నట్లు తెలిపారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
టెక్స్టైల్ క్లాత్ వేసింది.. వంద మీటర్లే..
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuగోదావరి ఒడ్డుకు వేసిన టైక్స్టైల్ క్లాత్ఏటూరునాగారం: వర్షాకాలం వచ్చిందంటే ఇరిగేషన్ అధికారులు నామమాత్రంగా గోదావరి కరకట్ట, ఒడ్డుకు మరమ్మతులు చేపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో గోదావరి ఉధృతికి విలువైన భూములను రైతులు కోల్పోతున్నారు. మళ్లీ వర్షాకాలం ముగిసే వరకు ఆ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న గోదావరి కరకట్ట నిత్యం కోతకు గురవుతూ వస్తుంది. ఈ ఏడాది కోతకు గురికాకుండా ఉండేందుకు నూతన సాంకేతిక పద్ధతితో టెక్స్టైల్ క్లాత్ను వంద మీటర్ల వరకు అమర్చి కోతకు గురికాకుండా తగు జాగ్రత్తలను చేశారు. కానీ మరోచోటు నుంచి ఒడ్డు కోతకు గురవుతూ వస్తుంది. దీంతో ఏం చేయాలో అర్ధంకాక ఇసుక బస్తాలను ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. గేట్ల మూసివేతలో నిమ్మకు నీరెత్తినట్లుగా.. ఈ ఏడాది వర్షాలు భారీగా లేకపోవడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చడం లేదు. దీంతో మరమ్మతులు చేసుకునే వెసులుబాటును కల్పించినప్పటికీ ఇరిగేషన్శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కరకట్టకు ఉన్న గేట్లను మూసివేడయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జంపన్నవాగు వద్ద మూడో గేటు తెరిచి ఉడడం గమనార్హం. ఇరిగేషన్ శాఖ అధికారులకు వరద అంతా గ్రామంలోకి వచ్చే వరకు పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా గేట్లను మరమ్మతులు చేయించి వెంటనే మూసివేసి నీరు గ్రామంలోకి రాకుండా చేయాలని రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యూస్రీల్కోతకు గురవుతున్న గోదావరి ఒడ్డు అరకొరగా గేట్లు మూసివేత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్శాఖ -
వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా స్వర్ణకుమారి
ఆస్పత్రి సూపరింటెండెంట్గా చంద్రశేఖర్ ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా స్వర్ణకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్గా చంద్రశేఖర్లను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట మెడికల్ కళాశాల చర్మవ్యాధి విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ మోహన్లాల్ను డిప్యుటేషన్పై జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా, ఆస్పత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహించారు. వరంగల్ ఎంజీఎంలో చర్మ వ్యాధి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్వర్ణకుమారిని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పదోన్నతి కల్పించి నియమించారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలో ములుగు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్కు పదోన్నతి కల్పించి ఆస్పత్రి సూపరింటెండెంట్గా నియమించారు. వరదల సమయంలో అప్రమత్తంములుగు రూరల్: వరదల సమయంలో ముంపు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. మండల పరిధిలోని రాయినిగూడెం వైద్యశాలలో వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల్లోని గర్భిణులు వర్షాకాలం వరదల సమయంలో ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్ యాక్షన్ టీం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చినప్పుడు తక్షణమే గ్రామాలను సందర్శించి దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. నీటి నిల్వలపై దృష్టి సారించి తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు అన్వేష్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ పవన్ కుమార్, శ్రీకాంత్, రణధీర్, సంపత్, సురేష్ పాల్గొన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ములుగు రూరల్: గీత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్రి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా, తాడి కార్పొరేషన్ చెక్కులు తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ సంబంధం లేకుండా గీత కార్మికులకు పింఛన్ ఇవ్వాలని సూచించారు. ఏజెన్సీలో రద్దు చేసిన గీత కార్మిక సొసైటీలను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 14న నిర్వహించనున్న నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఏటూరునాగారం: మహిళలు ఆర్థికంగా ఎదగాలని సెర్ప్ జిల్లా ఏపీడీ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమాన్ని డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సాధికారత సాధించే దిశగా అవగాహన కల్పించామన్నారు. గ్రూపులో లేని సభ్యులను సంఘాలలో చేర్పించాలని సూచించారు. వృద్ధులు, కిశోర బాలికలతో సంఘాలు ఏర్పాటు చేసి గతేడాది, ఈ ఏడాది సాధించిన ఆర్థిక ప్రగతి, లక్ష్యాలపై సభ్యులకు, సిబ్బందికి వివరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఎం సతీష్, మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సీసీలు, వీఏఓలు పాల్గొన్నారు. -
అభివృద్ధిని చూసి తట్టుకోలేక అవాక్కులు
ములుగు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాధితులు మాట్లాడారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లాలో జరుగతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బరదచల్లె ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్కు రెండు గదుల రేకుల షెడ్ ఉందని అందుకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎంపిక కాలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆస్పత్రుల్లో ఫొటోలకు పోజులు బీఆర్ఎస్ నాయకులు రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ తన మిడతల దండుతో నియోజకవర్గంలో డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. 70 ఏళ్ల చరిత్రలో గిరిజన మహిళకు సీఎం రేవంత్రెడ్డి, రాహుల్గాంధీలు మంత్రి వదవి ఇచ్చారని పదవి దక్కితే ఓర్చుకోలేక అస్యతపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో అభివృద్ది పనులు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దందాలు, ఇసుక, ఎర్రమట్టిక్వారీలు, దోపిడీకి పాల్పడుతున్నారని తదితర వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు 60 వేల దరఖాస్తులు వస్తే అరుమలైన 20 వేల మందిని ఎంపిక చేశామని అందులో మొదటి విడతలో 5 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను విడుతల వారిగా కేటాయిస్తామని అన్నారు. అమాయక ప్రజలను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు మంత్రి సీతక్క -
కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోం
ములుగు రూరల్: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేశ్ మృతికి మంత్రి సీతక్క కారణమని ఏ–1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని, బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోమని పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కేటాయించారని, సీతక్క చల్వాయి గ్రామానికి ఏం చేసిందని వాట్సప్ గ్రూప్లో ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకుల బెదింపులకు రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. కాంగ్రెస్ నాయకుల అవినీతి, అక్రమాలు నిలదీస్తూ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపితే పోలీస్ యాక్ట్ అమలు చేశారన్నారు. అదే విధంగా చల్వాయిలో నిరసన చేపడుతుంటే కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి సీతక్కకు అబద్ధాలు చెప్పడం, రీల్స్ చేయడం తప్ప పనిచేయడం తెలియదన్నారు. శనిగకుంట, బంధాల గ్రామాల్లో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, కొండాయి ప్రజలకు బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ శివారులో రామారం, బీమారం, ఉనికిచర్ల, దేవన్నపేట ప్రాంతాల్లో భూదందాలు చేపట్టారని ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు.బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి -
గొత్తికోయలు గొడవలు పెట్టుకోవద్దు
ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి– పస్రా మార్గ మధ్యలోని తోగు గొత్తికోయగూడెంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని తగాదాలు పెట్టుకోవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలని డీఎస్పీ రవీందర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన గొత్తికోయగూడెంలోని సమస్యల గురించి గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ గొత్తికోయలతో మాట్లాడారు. ఆయన వెంట పస్రా సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డిలు ఉన్నారు, అనంతరం ఎస్సై శ్రీకాంత్రెడ్డి కాటాపూర్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాల పెండింగ్ చలాన్లను కట్టించారు. -
ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలను పూర్తిచేయాలి
ములుగు రూరల్/ఎస్ఎస్తాడ్వాయి: ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అసరమైన డాక్యుమెంట్లు, అననుమతులు, మౌలిక వసతుల కల్పన, కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ హార్టికల్చర్ సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని వివరించారు. పంట మార్పిడి ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే జిల్లా విద్యాశాఖ, దిశా ఫౌండేషన్, ఈఎల్ఎఫ్వారి సౌజన్యంతో జిల్లాలో విద్యార్థులకు ఇంగ్లిష్పై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు, స్టోర్ గదిని పరిశీలన చేశారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్లకు స్థల పరిశీలన ఏటూరునాగారం: ఏజెన్సీలోని ప్రజల అవసరాల నిమిత్తం వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని బూటారం గ్రామంలోని ముంపు బాధితులకు ఇళ్ల స్థలాల కోసం ఎక్కెల సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్జీతో కలిసి మంగళవారం పరిశీలించారు. అలాగే ఏటూరునాగారంలోని అటవీశాఖ నర్సరీ ఉన్న ప్రాంతంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి చిన్నబోయినపల్లిలోని సర్వే నంబర్ 98 అటవీ శాఖలోని భూమి సాగుదారులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం వీలు కాదన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
చేపల వేట నిషేధం
వెంకటాపురం(ఎం): జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటలలో జూలై, ఆగస్టు మాసాల్లో మత్స్య కార్మికులు చేపలు పట్టకుండా మత్స్యశాఖ నిషేధాజ్ఞలు జారీ చేసింది. శాఖ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా చేపలు పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జూలై, ఆగస్టు నెలల్లో చేపల పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని రామప్ప సరస్సు, లక్నవరం జలాశయం, తుపాకులగూడెం ప్రాజెక్టు, నర్సింహసాగర్ ప్రాజెక్టు, పాలెం ప్రాజెక్టు లాంటి జలాశయాలపై పూర్తిస్థాయి మానిటరింగ్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రెండు కిలోల నుంచి.. రూ. రెండు లక్షల పిల్లలు ఒక రెండు కిలోల చేప నుంచి రెండు లక్షల రూపాయలకు పైగా పిల్లలు పునరుత్పత్తి జరుగుతాయని మత్య్సశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందులో 10 శాతం బతికినా 20 వేల చేపలు ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు నెలల్లో ఒక్క చేపను కోల్పోయినా దాని నుంచి వచ్చే లక్షల చేప పిల్లలను కోల్పోయినట్లేనని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు జలాశయాల్లో చేప పిల్లల సంఖ్యను పెంచేందుకు మత్స్యశాఖ స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీస్తే సహించేది లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. 400 టన్నుల చేపల ఉత్పత్తి జిల్లాలో నెలకు సుమారు 400 టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన జలాశయాలతో పాటు 493 చెరువులు, కుంటలు ఉండగా వాటి పరిధిలో 14,204 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి ఉంది. జిల్లాలో 66 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా 4,853 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులు, కుంట ల్లోని చేపలను పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. చెరువుల్లోని చేపలతోనే ఉత్పత్తి గత కొన్నేళ్లుగా జిల్లాలోని ప్రధాన జలాశయాలతో పాటు చెరువుల్లో 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదులుతున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 79.83 లక్షల చేప పిల్లలను సబ్సిడీపై చెరువుల్లో విడుదల చేశారు. చేప పిల్లలను చెరువుల్లో వదిలే సమయం సరిగా లేకపోవడంతో చిన్న చేప పిల్లలను పెద్దవి తినడంతో పాటు వాతావరణం సహకరించక చేపపిల్లలు మృతిచెందుతూ వస్తుండడంతో ఈ పథకంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న చేపలను రెండు నెలల పాటు వేటాడకుండా అలాగే వదిలేస్తే ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలు అవసరం లేకుండా, చెరువుల్లోని చేపలతోనే లక్షలు, కోట్ల చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. రెండు నెలలు నిషేధం జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని జలాశయాల్లో, చెరువులు, కుంటలలో చేపల వేటను నిషేధించడమైంది. ఈ రెండు నెలల్లో ఒక్కచేపను పట్టినా లక్షల చేపలను పుట్టకుండా చేసినట్లే. జూలై, ఆగస్టు నెలల్లోనే చేపలు పునరుత్పత్తి చేస్తుంటాయి. కాబట్టి జలాశయాల్లోని చేపలకు ఇబ్బంది కలగకుండా మత్స్యకారులు సహకరించాలి. ఎవరైనా చేపలు పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి. – సల్మాన్ రాజ్, జిల్లా మత్స్యశాఖాధికారిపునరుత్పత్తి దశ కావడంతో మత్స్యశాఖ నిర్ణయం జూలై, ఆగస్టు మాసంలో చెరువుల్లో చేపలు పడితే చర్యలు ప్రతినెలా 400 టన్నుల చేపల ఉత్పత్తి జిల్లా వ్యాప్తంగా 4,853 మంది మత్య్సకార్మికులకు ఉపాధినిషేధం ఎందుకంటే.. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఈ సమయంలో చేపల్లో పునరుత్పత్తి హార్మోన్ బలంగా అభివృద్ధి చెందుతుంది. జూలై, ఆగస్టులో చేపలు తమ పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. ఆడ చేపలు ఎగ్ రిలీజ్ చేస్తే, మగ చేపలు స్పెర్మ్ను రిలీజ్ చేస్తాయి. దీంతో చేప పిల్లలు బయటకు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జలాశయాల్లోకి కొత్త నీరు వస్తుండటంతో పాటు చెత్తాచెదారం కొట్టుకుని వచ్చి నీళ్లపై తేలుతూ ఉంటుంది. ఈ సమయంలో చెత్తాచెదారం కింది భాగంలో ఆడ చేపలు గుడ్లపై పొదుగుతుంటాయి. వాటిపై సూర్యరశ్మి పడి రెండు మూడు రోజుల్లోనే గుడ్ల నుంచి చేప పిల్లలు బయటకు వస్తాయి. ఈ ప్రక్రియంతా జూలై, ఆగస్టు నెలల్లో 3 నుంచి 5 సార్లు సాగుతుంది. -
వైఎస్సార్ సేవలు మరువలేనివి
ములుగు రూరల్: జనహృదయ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ 76వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ ఎనలేని సేవలందించిన మహోన్నత వ్యక్తి అన్నారు. సీఎంగా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దిక్చూచిగా మారాయని తెలిపారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత ఆయనదే అన్నారు. 104, 108 అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిర జలప్రభ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని పెంచి దేశ మొత్తం గర్విచదగ్గ నాయకుడిగా మన్ననలు పొందారన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించి పేదల పెన్నిధిగా వైఎస్సార్ నిలిచారని ఆయన సేవలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.మంత్రి ధనసరి సీతక్క -
అభివృద్ధి పథం..
● మానుకోట జిల్లా సోమ్లాతండా, కేసముద్రంలో రూ.400కోట్ల పనులకు శంకుస్థాపనలు ● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబా బాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. రూ.400కోట్ల పనులకు శంకుస్థాపన మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. కార్యకర్తల్లో జోష్.. బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు, ట్రైకార్ చైర్మన్ బెల్ల య్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు ఏమన్నారంటే...– వివరాలు 8లోu -
అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్బంధ పాలన
ములుగు రూరల్: జిల్లాలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు నిర్బంధాన్ని కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట సోమవారం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ సతీష్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతితో కలిసి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతునొక్కుతుందని విమర్శించారు. ఇటీవల గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ అర్హుడైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బెదిరింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రమేష్ది ప్రభుత్వ హత్యేగా అభివర్ణించారు. రమేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. రమేష్ మరణంపై శాంతియుత నిరసన చేపడతామని పోలీసుల అనుమతి కోరితే అనుమతి నిరాకరించడమే కాక పోలీస్ యాక్ట్ను అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెళ్తున్న నాయకులను హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్తున్న క్రమంలో పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం మంత్రి సీతక్క కాన్వాయ్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరగగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం రెడ్కో చైర్మన్ సతీష్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మంత్రుల పర్యటనకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రి సీతక్క ఎమర్జెన్సీని కొనసాగిస్తుందని ఆరోపించారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అరాచకాలను ప్రశ్నించిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సకినాల భవాని, భూక్య జంపన్న, మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి, చెన్న విజయ్, విజయ్రాంనాయక్, మాషిపెద్ది సత్యనారాయణరావు, మాలోత్ రవీందర్, కోగిల మహేష్, భిక్షపతి, ఆకుతోట చంద్రమౌళి, సమ్మయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి -
ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం
వాజేడు: ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వమని, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముందుకు సాగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కలు అన్నారు. మండల పరిధిలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, సీతక్కలు ముఖ్య అతిథులుగా హాజరై బాండ్ మొక్కజొన్న సాగు చేసి నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో 1,521 ఎకరాల్లో బాండ్ మొక్కజొన్న సాగు చేసిన 671మందికి రూ,3,80,97,264 నష్ట పరిహారం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు నష్ట పోవడం మంచిది కాదని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. బాండ్ మొక్కజొన్న వల్ల నష్టపోయిన వారి వివరాలు సేకరించి సదరు కంపెనీలనుంచి పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు కలిసి నడిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుంటే ప్రతిపక్షం తట్టుకోలేకపోతుందన్నారు. ఇసుక పాలసీలో మార్పులను తీసుకురావడం మూలంగా దోపిడీ వ్యవస్థలను పూర్తిగా రూపుమాపామని, దానిని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వాజేడులో మంత్రుల పర్యటన ఉండగా, దానికి అంతరాయం కల్పించడం కోసం ములుగులో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని అడ్డు తగిలే ప్రయత్నం చేశారన్నారు. మొక్క జొన్న రైతులకు పరిహారం రావడానికి ఎంతో కృషి చేశారని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ను అభినందించారు. ములుగు, భద్రాచలం, బొగత జలపాతాలను కలుపుతూ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కలెక్టర్ దివాకర, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ ఉన్నారు. వనాలను కాపాడుకోవడం అందరి బాధ్యత ఏటూరునాగారం: వనాలను కాపాడుకోవడం అందరి బాధ్యతని మంత్రి సీతక్క అన్నారు. చిన్నబోయినపల్లిలో ఈజీఎస్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించి మొక్కలను నాటారు. అలాగే చిన్నబోయినపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.55లక్షలు, వెంకటాపురం బీటీ రోడ్డుకు రూ.1.60కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. రమేశ్ కుటుంబానికి మంత్రి పరామర్శ గోవిందరావుపేట: మండల పరిదిలోని చల్వాయికి చెందిన చుక్క రమేష్ ఇటీవల వాట్సప్ గ్రూప్లో ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు ఇస్తున్నారంటూ జరిగిన చర్చల విషయంలో తప్పుడు కేసు నమోదు చేశారనే భయంతో ఇటీవల ఆత్మహత్యకు పాల్ప డిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో రాజ కీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మంత్రి సీతక్క బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు అందించారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్క మొక్కజొన్న బాండ్ నష్ట పరిహారం చెక్కుల పంపిణీ -
మంత్రులకు ఘనస్వాగతం
ములుగు రూరల్: జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్కలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టమ్మ ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. తొలుత మంత్రులు గట్టమ్మ ఆలయం వద్ద సోమవారం పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు చాంద్పాషా, వంగ రవియాదవ్, ఎల్లావుల అశోక్, ఒజ్జల కుమార్, ఓంప్రకాష్, భిక్షపతి, రేవంత్యాదవ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సర్కారు బడులను సద్వినియోగం చేసుకోవాలి ఏటూరునాగారం: సర్కారు బడులను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ దురిశెట్టి చంద్రకళ అన్నారు. మండల పరిధిలోని కొమురం భీమ్ నగర్లో నూతనంగా ప్రభుత్వం పాఠశాల మంజూరు చేయడంతో ఆ పాఠశాలను డీఈఓ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ముందుగా సావిత్రిభాయిపూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాంనగర్ పంచాయతీలోని కొమురం భీమ్నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం వల్ల గిరిజనులకు విద్య చేరువులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నూతన పాఠశాలలను గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వి ద్యార్థులందరినీ ప్రతిరోజూ పాఠశాలకు పంపాలని, విద్య ద్వారా మాత్రమే జీవితాలు మా రుతాయని సూచించారు. మిగతా రెండు పాఠశాలలైన రాయబంధం, గుండెంగవాయి పాఠశాలలను ఎంఈఓ మల్లయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ అర్షం రాజు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వి.సాంబశివరావు, సీఆర్పీలు బి.శ్రీధర్, సత్యారావు, గ్రామ పెద్దలు కృష్ణ, రమేష్, సంధ్య పాల్గొన్నారు. పంటరుణాలు రీషెడ్యూల్ చేయాలని ధర్నా ములుగు రూరల్: పంట రుణాలు రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ సోమవారం మండల పరిధిలోని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజద్ పాషా మాట్లాడారు. బ్యాంక్ అధికారులు రైతుల పంటరుణాలు రీ షెడ్యూల్ చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ ఇన్చార్జ్గా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, వరంగల్: సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి పర్యటన తర్వాత ఆ పార్టీ హైకమాండ్ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన అధిష్టానం.. సోమవారం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్కు పార్టీ ఇన్చార్జ్గా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నియమించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్కుమార్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖను కేటాయించారు. నల్లగొండ ఇన్చార్జ్ మంత్రిగా కూడా ఉన్న లక్ష్మణ్కు ఉమ్మడి వరంగల్ పార్టీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్లో నెలకొన్న ఇటీవల నెలకొన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ సోమవారం లక్ష్మణ్కుమార్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలవనుండగా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సంస్థాగత కమిటీలు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించిన అధిష్టానం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేసే బాధ్యతలను అప్పగించినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి వీరి ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు! -
‘బెస్ట్ అవైలబుల్’ డబ్బులేవి?
ములుగు రూరల్: నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అందిస్తుంది. స్కీంలో ఎంపికై న విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు డే స్కాలర్, 5నుంచి విద్యార్థులకు హాస్టల్ వసతితో కూడిన విద్యను అందిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీంకు చెందిన నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యజమానులు విద్యార్థుల తల్లితండ్రులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఏడాది బెస్ట్ అవైలబుల్ స్కీంకు ప్రైవేట్ యాజమాన్యాలు సుముఖత చూపడం లేదు. మూడేళ్లుగా డబ్బులు పెండింగ్ జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు స్కీం ద్వారా 1వ తరగతి విద్యార్థులకు రూ.28 వేలు, 5వ తరగతి విద్యార్థికి రూ. 42 వేలను చెల్లిస్తుంది. ఇందులో ఎస్సీ విద్యార్థులు ఒకటవ తరగతిలో 74 మంది విద్యార్థులు, 5వ తరగతిలో 102 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎస్టీ విద్యార్థులు 203 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు చెల్లించాల్సి న డబ్బులు గడిచిన మూడు సంవత్సరాలకు గాను రూ. 3కోట్ల 25లక్షల 92వేలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఎస్సీ విద్యార్థులకు రూ.కోటి 90లక్షల 68వేలు చెల్లించాలి. ఎస్టీ విద్యార్థులకు రూ.కోటి 35 లక్షల 24వేలు చెల్లించాలి స్కీంపై అనాసక్తి బెస్ట్ అవైలబుల్ స్కీం పథకం ద్వారా ఎంపికై న ఎస్టీ విద్యార్థులను జిల్లా కేంద్రంలోని సాధన హై స్కూల్, అరవింద హైస్కూల్, బ్రిలియంట్ హై స్కూల్లు కేటాయించారు. ఎస్సీ విద్యార్థులకు మంగపేట మండలం కమలాపూర్ ఆదర్శ పాఠశాల, జిల్లా కేంద్రంలోని అరవింద హై స్కూల్, సాధన హై స్కూల్కు ఎంపిక అయ్యారు. ఒక్కో పాఠశాలకు ఎంపికై న విద్యార్థుల ప్రకారం లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో విద్యాసంస్థలు నడపడం భారంగా మారుతుందని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో రూ.3.92 కోట్లు పెండింగ్ స్కీంపై ప్రైవేట్ పాఠశాలల అనాసక్తి ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లితండ్రులు -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి పీఓ 40 వినతి పత్రాలను స్వీకరించారు. ఈ మేరకు ములుగు మండలం పత్తిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి జంగాలపల్లి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 6వ తరగతి ఆడ్మిషన్ కావాలని విన్నవించారు. తాడ్వాయి మండలం గంగారం గ్రామానికి చెందిన 17 మంది రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. మహాముత్తారం మండలం కోనంపేటకు చెందిన గిరిజన మహిళా పీఎంహెచ్ హాస్టల్లో ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అలాగే పంబాపూర్ నుంచి గిరిజనుడు లివర్ సర్జరీ అయినందున ట్రైబల్ రిలీఫ్ ఫండ్ కింద సహాయం చేయాలని పీఓను వేడుకున్నారు. నర్సంపేట మండలం అశోక్నగర్లో ఆర్ఓఎఫ్ఆర్ భూమిపై సోలార్ పవర్ ప్లాంట్ ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం ముళ్లకట్టకు చెందిన ఓ గిరిజనుడు ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: మహిళల ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జనని మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహకారం అందించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదన్నారు. త్వరలో నూతన మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం బాలయ్యపల్లి గ్రామంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఎం వేణుగోపాల్, ఏపీఎం తిరుమల్ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వర్ణలత, కార్యదర్శి సుమలత, కోశాధికారి మమత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్.. కొత్తపల్లిగోరిలో మొహర్రం వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సత్యనారాయణరావును శాయంపేట మండలం కొప్పులకు చెందిన చిన్నారి మామిడి మీనాక్షి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి సార్ అంటూ అడిగింది. చలించిన ఎమ్మెల్యే పేరు నమోదు చేసుకుని మంజూరు పత్రాలను స్వయంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. -
బీరన్నకు బోనాలు
మంగపేట: మండల పరిధిలోని కమలాపురంలో బీరలిగేశ్వరస్వామి(బీరన్న)కి కురమలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివారం సాయంత్రం బోనాలు సమర్పించారు. ప్రతిఏటా తొలి ఏకాదశి రోజు కమలాపురంలోని బీరన్న ఆలయంలో బోనాలు సమర్పించి యాటపోతులను బలివ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే గ్రామ కురమ పెద్దల ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీరన్నకు బోనం వండి కుటుంబ సభ్యులతో కలిసి మహిళలు బోనాలు ఎత్తుకుని డోలు వాయిద్యాలతో బీరన్న ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు పోతురాజు రమేష్, మల్లిఖార్జున్, యాకన్న, ఇండ్ల లక్ష్మ ణ్, యార సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
మల్బరీ సాగుతో ఆదాయం
ఏటూరునాగారం: పట్టుపరిశ్రమ శాఖ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందేలా పలు ప్రోత్సాహక పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో మల్బరీ తోటల సాగు, పట్టు పురుగులను పెంచడానికి ముందుకొచ్చే రైతులకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. తోట పెంపకం ప్రారంభ దశ నుంచి విక్రయించే వరకు రైతులకు అధిక లాభాలు చేకూరేలా పథకాన్ని రూపొందించింది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న భూములు మల్బరీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. రెండు ఎకరాల్లో మల్బరీ తోట సాగు చేస్తే సదరు రైతుకు సాగు చేసినందుకు ఏడాదికి రూ.4 నుంచి 6లక్షల వరకు నికర ఆదాయం కల్పించడంతో పాటు ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది. మల్బరీ తోట బహువార్షిక పంట కావడంతో తక్కువ నీటితో పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి మల్బరీ మొక్కలు నాటితే 15 నుంచి 20 ఏళ్ల వరకు ప్రతీ ఏడాది పట్టు పురుగుల మేతకోసం ఆకుల పంట దిగుబడి వస్తుంది. ఈ తోట అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకొని పంట దిగుబడి ఘననీయంగా వస్తుంది. గతంలో ఏటూరునాగారంలోనే పరిశ్రమ గతంలో పట్టుపరుగుల పరిశ్రమ ఏటూరునాగారంలో ఉండేది. 2004లో మావోయిస్టులు పట్టుపరిశ్రమకు చెందిన భవనాలను కూల్చివేశారు. దీంతో అందులోని సామగ్రి దొంగల పాలు కాగా భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో పట్టు పురుగుల పెంపకం పరిశ్రమను మూసివేశారు. ఇప్పుడు మల్బరీ తోటలు వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో ఎక్కువగా సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బీసీ, ఓసీలకు రాయితీ ఇలా.. బీసీ, ఓబీసీలకు మల్బరీ తోటల పెంపకానికి రెండు ఎకరాలకు రూ.60 వేల సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోంది. అదే విధంగా మల్బరీ పట్టు పురుగుల పెంపకం గది నిర్మాణానికి రూ.2.25లక్షలు, స్టాండ్లు, ఇతర పరికరాలకు రూ. 37,500, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారక మందుల కోసం రూ. 2,500లు, నీటి పారుదల కోసం రూ.50వేలు అందజేస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు.. మల్బరీ తోట పెంపకం, నిర్వహణకు రూ.78వేలు సబ్సిడీ ఇస్తోంది. పట్టు పురుగుల పెంపకం గది నిర్మాణానికి రూ.2,92,500, రేరింగు పరికరాలకు రూ.26,610, రేరింగు స్టాండ్స్కు రూ.24,140, రోగ నిరోధక చర్యలకు రూ.3,250, నీటి పారుదలకు రూ.65 వేలను కేంద్ర ప్రభుత్వం రాయితీగా రైతులకు అందజేస్తుంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన రైతులు జిల్లాలోని పట్టు పరిశ్రమ శాఖ అధికారులను సంప్రదించి పథకాన్ని పొందవచ్చు. రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు వేర్వేరుగా పథకాలను అందజేయనున్నారు. రైతులకు సొంతంగా రెండు ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది. వార్షిక ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. అన్ని వర్గాల రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 9441770795, 8977714616 లలో సంప్రదించాలి. – మాచర్ల నరేందర్, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి రైతులకు భారీగా సబ్సిడీ ఇస్తున్న కేంద్రం జిల్లాల వారీగా సాగుకు ప్రత్యేక కార్యాచరణ -
స్నాతకోత్సవానికి వేళాయె
షెడ్యూల్ ఇలా... ● గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్కు చేరుకుంటారు. ● ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కాకతీయ యూనివర్సిటీకి ఉదయం 11:25 గంటలకు చేరుకుంటారు. ● ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనెట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనెట్ సభ్యులు గవర్నర్తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది. ● ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం ఉంటుంది. అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది. ● మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుంది.కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387 మంది అభ్యర్థులు పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్లో 10 మంది పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్లో 60, సైన్స్లో 161, ఫార్మసీలో 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 66, సోషల్ సైన్సెస్లో 88, ఎడ్యుకేషన్లో 25, లా 72, ఇంజనీరింగ్లో 44 మందికి గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. కళాశాలలకు గోల్డ్మెడల్స్ అభ్యర్థుల జాబితాలు.. పీహెచ్డీ పట్టాలు పొందే అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్కు కూడా ఎంట్రీపాస్లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా అభ్యర్థులకు అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్మెడల్స్ పొందే అభ్యర్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది. ముందుగానే గోల్డ్మెడల్స్ ప్రదానం.. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు అభ్యర్థులకు గోల్డ్మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. అభ్యర్థులు గోల్డ్మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మంది అభ్యర్థులను 19 బ్యాచ్లుగా చేశారు. అయితే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొందరు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. పేరెంట్స్కు ఆడిటోరియం బయట స్క్రీన్ ఏర్పాటు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందే అభ్యర్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరి కోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవాన్ని వీరు వీక్షించనున్నారు.గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. అలాగే, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందేవారు వైట్ డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. కేటాయించిన సీట్లలో వీరు కూర్చోవాల్సి ఉంటుంది. నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి 387 మందికి పీహెచ్డీ పట్టాలు.. 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్ల పంపిణీ -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
● భారీగా తరలివచ్చిన భక్తులుమంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో స్వయంభు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, భీమవరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూలు పండ్లు, నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల శేఖర్శర్మ, రాజీవ్ నాగఫణిశర్మ, స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదం అందించారు. బంగారు నేత్రాల బహూకరణ ఆలయంలో స్వయంభుగా వెలిసిన స్వామివారిని ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన భక్తుడు కె.లీలాశివనాగ ధనరాజు(నాని) ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి రూ.76,050 విలువైన బంగారు నేత్రాలను బహూకరించారు. -
ప్రశ్నించే గొంతుకలను నొక్కడం సరికాదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ములుగు రూరల్: ప్రశ్నించే గొంతుకలను నొక్కడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా జిల్లాలో పోలీస్ యాక్ట్ను అమలు చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హుడైన రమేష్ ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్పై వస్తున్న అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు యాక్ట్ను అమలు చేసినట్లు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, కొత్త సురేందర్, భూక్య జవహర్లాల్, రవీంద్రచారి, కృష్ణాకర్, వాసుదేవరెడ్డి, విశ్వనాథ్, ఇమ్మడి రాకేష్యాదవ్, నాగరాజు, హరీశ్, బాబు, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
శ్యామాప్రసాద్ ముఖర్జీ సేవలు ఆదర్శం
ఏటూరునాగారం: శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశానికి అందించిన సేవలు ఆదర్శమని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్ తెలిపారు. మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శ్యామాప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలు వీధుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహాయంతో ఆయన 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నె సంపత్, ఈక మహాలక్ష్మీ, గాడిచర్ల రాజశేఖర్, పలక గంగా, పెయ్యల రాకేష్, ఎర్రల్ల ఎల్లయ్య, పడిదల శ్రీను తదితరులు పాల్గొన్నారు. బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు జనార్దన్ -
లారీ డ్రైవర్ల రాస్తారోకో
వాజేడు: మండల పరిధిలోని టేకులగూడెం ఇసుక క్వారీ వద్ద ఆదివారం లారీ డ్రైవర్లు రహదారిపై రాస్తారోకోకు దిగారు. నాలుగు రోజుల క్రితం డీడీలను తీసి ఇసుక తీసుకెళ్లడానికి వస్తే ఇసుకు నింపడం లేదని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పేరూరు పోలీసులు అక్కడికి వెళ్లి లారీ డ్రైవర్ల నుంచి వివరాలను సేకరించారు. నాలుగు రోజుల క్రితం డీడీలను తీశామని ఇసుక తీసుకెళ్లడానికి వస్తే ఇంత వరకు లారీల్లో లోడు చేయడం లేదని తెలిపారు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలని అడగడంతో పోలీసులు టీఎస్ఎండీసీ అధికారులకు విషయాన్ని వివరించారు. స్పందించిన అధికారులు వెంటనే ఆ లారీలను మంగపేట మండలంలోని మల్లూరు క్వారీకి పంపించడంతో రాస్తారోకో విరమించారు. -
రామప్ప దేవాలయంలో ..
రామప్పలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది. ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు భక్తులకు తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద అద్భుతమని పర్యాటకులు కొనియాడారు. తొలి ఏకాదశి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కుటుంబ సమేతంగా రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామి పూజలు నిర్వహించారు. -
విద్యుత్శాఖలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భద్రత కరువు
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు 1,388 మందిహన్మకొండ: విద్యుత్శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వీరు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదరణకు నోచుకోవడం లేదు. వీరికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా యాజమాన్యంనుంచి అందే సహాయం కూడా లేదు. వినియోగదారులకు విద్యుత్ సంబంద సమస్యలు తలెత్తితే ముందుగా వీరినే సంప్రదిస్తారు. వీరి సమస్యలు వివరించి బాగు చేయించుకుంటారు. ఇంతటి కీలక భూమిక పోషిస్తున్న వీరికి ఆర్థిక భరోసా అందడం లేదు. ఇటీవల బీమా సౌకర్యం.. తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తుండడంతో చలించిన టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 1,388 మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి గత నెలనుంచి బీమా సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు 1300మందికి బీమా సౌకర్యం కల్పించారు. ఇందులో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెండు విభాగాలుగా విభజించారు. ఐటీఐ అర్హత కలిగిన వారికి నెలకు రూ.20 వేల వేతనం, ఐటీఐ అర్హత లేని వారికి నెలకు రూ.17 వేల వేతనం అందిస్తున్నారు. ఈ మేరకు ఐటీఐ అర్హత కలిగిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల బీమా, ఐటీఐ అర్హత లేని వారికి రూ.17 లక్షల పరిహారం అందేలా బీమా సౌకర్యం కల్పించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా వీరికి బీమా చేయించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో మృతిచెందిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్కు ఈ బీమా వర్తించే అవకాశముందని విద్యుత్ అధికార వర్గాలు తెలిపాయి. దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రామరాజు కొన్నేళ్లుగా విద్యుత్శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో గత మే 9న రైతుల వ్యవసాయ బావుల వద్ద ఓ ట్రాన్స్ఫార్మర్కు ఎగ్జ్ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ తీగ తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ చెయ్యిని పూర్తిగా మరో చేయిని సగం వరకు తీసి వేశారు. రెండు నెలలుగా వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.19 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. గ్రామస్తులు దాదాపు రూ.16 లక్షల వరకు విరాళాలు అందించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు అంటున్నారని బాధితుడి భార్య రజిత తెలిపింది. పెద్ద కుమార్తె అఖిల ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలని మదనపడుతోంది. చిన్న కుమార్తె అక్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాల్సి ఉంది. ఊరు అండగా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రజిత, పిల్లలు కన్నీటిపర్యంతమవుతున్నారు.పోరాడి తనువు చాలించిన రమేశ్ లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన జాగిళ్లపురం రమేశ్ 2020 జూన్లో కొత్తపల్లిలో లైన్మెన్ ఆదేశాలతో ట్రాన్స్ఫార్మర్ తీగలను సరి చేస్తుండగా విద్యుత్ షాక్తో కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. డిపార్ట్మెంట్ నుంచి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రి బిల్లులు చెల్లించారు. రమేశ్ మాత్రం కోలుకోలేదు. మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో తన తండ్రి ఉప్పలయ్య లేదా చెల్లెలు రజితకు ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పోరాడాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయం చేస్తామన్నారే కానీ, ఎవరూ ఏమీ చేయలేదు. చివరికి లోకాయుక్తాలో కేసు వేసి పోరాడి 2024, అక్టోబర్ 3న చనిపోయాడు. కేసు ఇంకా లోకాయుక్త్తాలోనే కొనసాగుతోంది. కన్నకొడుకు చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు ఉప్పలయ్య, ఆండాలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. న్యూస్రీల్చేతులు కోల్పోయి రెండు నెలలుగా ఆస్పత్రిలో.. క్షేత్రస్థాయిలో కీలక విధులు.. తరచూ ప్రమాదాలు ఇంటి పెద్ద చనిపోవడంతో రోడ్డున పడుతున్న కుటుంబం గాయాలపాలై మంచానికే పరిమితమైన మరికొందరు.. మొన్నటిదాకా వినియోగదారులకు ఇస్తున్న ఎక్స్గ్రేషియానే దిక్కు ఇటీవల బీమా సౌకర్యం కల్పించిన టీజీ ఎన్పీడీసీఎల్ ఐటీఐ అర్హత కలిగిన వర్కర్కు రూ.20 లక్షలు ఐటీఐ లేని వారికి రూ.17 లక్షల బీమా ఆర్టిజన్లుగా గుర్తించని టీజీ ఎన్పీడీసీఎల్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 2016లో విద్యుత్ సంస్థల్లోకి ఆర్టిజన్లుగా అబ్జర్వ్ చేసుకున్న క్రమంలో తెలంగాణ సౌథర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న కట్టర్లను (ఇక్కడ అన్మ్యాన్ వర్కర్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను అక్కడ కట్టర్లుగా పిలిచేవారు) ఆర్టిజన్లుగా తీసుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్లో మాత్రం అప్పటి యాజమాన్యం అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించలేదు. దీంతో వీరు ప్రమాదవశాత్తు మృతిచెందితే వినియోగదారులకు ఎక్స్గ్రేషియా చెల్లించినట్లుగానే రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై గాయాలపాలైతే చికిత్స ఖర్చులు మాత్రం యాజమాన్యం భరిస్తుంది. కానీ, ఇది సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
భూ భారతి సమస్యలు త్వరగా పరిష్కరించాలి
వాజేడు: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ములుగు ఆర్డీఓ వెంకటేష్ అన్నారు. శుక్రవారం వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో చేపట్టిన భూభారతి తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలను చేయడంతోపాటు వారసత్వ, సాదాబైనామా, మిస్సింగ్ సర్వే నంబర్లపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ కుమారస్వామి, డీటీ చంద్ర శేఖర్, సీనియర్ అసిస్టెంట్ నగేష్, సిబ్బంది ఉన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలి ములుగు రూరల్: రోడ్డు భద్రత నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని ఆర్టీఓ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాతీయ రహదారిపై త రచూ రోడ్డు ప్రమాదం జరిగే ప్రాంతాలను ఆ యన పరిశీలించారు. రోడ్డు ప్రమాద చర్యల్లో భాగంగా పోలీస్, ఆర్ అండ్ బీ, ఎన్హెచ్ అధి కారులతో కలిసి గట్టమ్మ, మల్లంపల్లి, ప్రాంతాలను పరిశీలించారు. ప్రమాద నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్రావు, ఆర్అండ్బీ ఏఈ రాకేష్, ఎన్హెచ్ అధికారులు పాల్గొన్నారు. బాస్కెట్బాల్ జిల్లా జట్టు ఎంపికములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సన్రైజర్స్ హైస్కూల్లో శుక్రవారం జిల్లా అండర్ 18 బాస్కెట్ బాల్ జట్టును ఎంపిక చేసినట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకృష్ణ తెలిపారు. జిల్లా జట్టు ఎంపికకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 30 మంది హాజరైయ్యారన్నారు. వారికి పోటీలు నిర్వహించి జట్టును ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న బాలబాలికలు ఈ నెల 11 నుంచి 13 వరకు ఉత్తనూర్, గద్వాల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ధనసరి సూర్యం, సన్రైసర్స్ హైస్కూల్ కరస్పాండెంట్ వట్టెం రాజు పీఈటీలు శ్రీకాంత్ మహిపాల్, కోచ్ వంశీ తదితరులు ఉన్నారు. కేవీపీహెచ్ జిల్లా కమిటీ.. ములుగు రూరల్: కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి జిల్లా కమిటీని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్నుకున్నారు. కేవీపీహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్బాబు సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిలా అధ్యక్షుడిగా అంబాల మురళి, ప్రధాన కార్యదర్శిగా రత్నం ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా దేవ య్య, మాణిఖ్యం, యాసం రమేశ్, సహాయ కా ర్యదర్శులుగా దేవేందర్, నరేష్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలిములుగు రూరల్: విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జోనల్ అధికారి అరుణకుమారి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. జనవరి నెలలో కాళేశ్వరం జోనల్ లెవల్ డ్రాయింగ్ అర్హత పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారని, వారందరికీ పతకాలు, సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నర్మదాబాయి, డ్రాయింగ్ ఉపాధ్యాయురాలు స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
ఏటూరునాగారం: ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటగదులను పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని, సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపాద్యాయులు నాణ్యమైన బోధన చేయాలన్నారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఏ క్షేత్రయ్య, తహసీల్దార్ జగదీష్, ఎంపీడీఓ కుమార్, హెచ్ఎం ఈసం రమేశ్, ఉపాద్యాయులు పాల్గొన్నారు. అనంతరం సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూపరింటెండెంట్ సురేశ్కుమార్కు తెలిపారు. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. ఏటూరునాగారం/మంగపేట:గోదావరి నీటి మట్టం పెరుగుతుందని, ఏజెన్సీలోని కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం మండలంలోని రామన్నగూడెం కరకట్ట, మంగపేట కరకట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వరద మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని, వరద ప్రమాద స్థాయిలో పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంపై ప్రజ లకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టరేట్ కా ర్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ జగదీశ్, తహసీల్దార్ జగదీష్, అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి వెంకటాపురం(కె): ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని మలాపురం, రాచపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులను త్వరగా పొందాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు రూమ్ను పరిశీలించి, భూభారతి చట్టంపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ఏజెన్సీ గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ దివాకర టీఎస్పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యములుగు రూరల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో దొడ్డి కొమురయ్య 79వ వర్థంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సర్ధార్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై డీకే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, విముక్తి ఉద్యమ పోరాటంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నరిగె రాజ్కుమార్, సాంబయ్య, మల్లయ్య, సంపత్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంజీవ, ఎస్సీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఉద్యోగులు సరిత, మానస, రేణుక, కుమారస్వామి, ప్రతాప్, గోపాల్చారి తదితరులు పాల్గొన్నారు. -
అస్తవ్యస్తం!
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని ఎండోమెంట్ ఆవరణలోని మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులకు మెయింటనెన్స్ చర్యలు లేకపోవడంతో అస్తవ్యస్తంగా దర్శన మిస్తున్నాయి. నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరుగుదొడ్ల తలుపు ఊడిపోయాయి. బేసిన్ల లోపల చెత్తాచెదారంతో నిండిపోయాయి. బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శన సమయంలో ఒకటిరెండింటికి ఇబ్బందులు పడుతున్నారు. గద్దెలకు సుమారుగా 20 మీటర్ల దూరంలో మరుగుదొడ్లు ఉన్నా.. భక్తులకు ఫలితం లేదు. అమ్మవార్ల దర్శనం పూర్తయేంత వరకు భక్తులు కడుపు బిగపట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తుంది. దేవాదాయశాఖ అధికారులు ప్రతీ రెండేళ్లకోసారి జాతర సమయంలో మరుగుదొడ్లకు నిధులు కేటాయించి మమ అని మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే తప్ప శాశ్వతంగా భక్తులకు ఉపయోగ పడేలా చర్యలు తీసుకోవడం లేదు. ఈఓలు మారినా మరుగుదొడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదు. మేడారం దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జాతర నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనకు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు వస్తున్న సమయంలో మాత్రమే మేడారానికి వస్తున్నారే తప్ప మిగతా రోజుల్లో దేవాదాయశాఖ తరఫున భక్తుల సౌకర్యాలపై దృష్టిసారించిన వారే లేరని భక్తులు ఆరోపిస్తున్నారు. హనుమకొండలోని ఆఫీసుకే పరిమితమై మేడారానికి చుట్టుపు చూపుగా వచ్చి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని మిగతా పుణ్యక్షేత్రల్లోని మరుగుదొడ్లను చూసిన భక్తులు మేడారంలోని దేవాదాయశాఖ మరుగుదొడ్లను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కాటేజీల పరిస్థితి అంతే.. మేడారంలోని కాటేజీలు కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి. కాటేజీల గదుల్లో ఫ్యాన్లు, తాగునీటి వసతి సౌకర్యాలు కరువయ్యాయి గదులను అద్దెకు తీసుకున్న భక్తులు బయట నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. భక్తులు కాటేజీలను అద్దెకు తీసుకునేందుకు వెనుకడుతున్నారు. ప్రైవేట్ అద్దె గదులను ఆశ్రయిస్తే గదుల కిరాయి ధరలు భక్తుల జేబులను గుల్ల చేస్తున్నాయి. కాటేజీల్లో వసతులు లేవు, ప్రైవేటు అద్దె గదుల కిరాయి ధరలు మండిపోవడంతో ఆర్థిక స్థోమత లేని భక్తులు మేడారం పరిసరాల ప్రాంతంలోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. అమ్మవార్ల హుండీ కానుకల ద్వారా కొట్లాది ఆదాయం వస్తున్న దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. భక్తుల వసతుల కోసం నిధులను ఖర్చు చేయకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపే పనులను చేస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరమ్మతు చేయాలి మేడారం ఎండోమెంటో కార్యాలయం ఆవరణలోని మరుగుదొడ్లకు మరమ్మతు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఎండోమెంట్ కార్యాలయంలోని గదుల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుంటున్నారు. ఒకటిరెండింటికి ఇ బ్బందులు పడుతున్నది వాస్తమే. దేవాదాయశాఖ అధికారులు చొరవ తీసుకుని మరుగుదొడ్లను విని యోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి. – ఆరెం లచ్చుపటేల్, మేడారం జాతర మాజీ చైర్మన్అధ్వానంగా మేడారం మరుగుదొడ్లు కాటేజీల్లో వసతులు కరువు ఇబ్బందులు పడుతున్న భక్తులు పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు -
నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి
● మున్సిపల్ కమిషనర్ సంపత్ ములుగు రూరల్: నివాస ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ ప రిధిలోని వీవర్స్కాలనీ, సుభాష్నగర్, శ్రీనివాసకా లనీ, ఆజీద్నగర్, తదితర ప్రాంతాలను పర్యవేక్షించారు. ఖాళీ ప్లాట్లలో నీటి నిల్వలు చేరి దోమలు వృద్ధి చెందడంతో మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. నీటి నిల్వలను గుర్తించి త గిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అనంతరం నీటి నిల్వ ప్రాంతాల్లో బ్లీ చింగ్, ఆయిల్ బాల్స్ వేయించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీపీఓ దేవరాజు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రత సాధారణ పరిస్థితి ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.కమ్యూనిజం శక్తుల ఐక్యం అనివార్యం కమ్యూనిజం భావజాల శక్తులు ఐక్యం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.– 8లోuజీవనాధారాన్ని కోల్పోయారు.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ము న్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అన్మ్యాన్ హెల్పర్ గట్ల కరుణాకర్రెడ్డి గత గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి విద్యుత్ మోటా రు స్టార్టర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా సర్వీస్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సుమా రు 25ఏళ్లనుంచి ఆయన ఈదులపూసపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సేవలు అందిస్తున్నారు. కరుణాకర్ రెడ్డికి భార్య ప్రియాంక, కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సుశాంత్ రెడ్డి ఉన్నారు. కుమార్తె హైదరాబాద్లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, కుమారుడు మానుకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పెద్ద కరుణాకర్ రెడ్డి అకాల మరణంతో ఆ బాధ్యతలన్నీ భార్య ప్రియాంక మీదనే పడ్డాయి. ఈ క్రమంలో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారనుందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
ఒంటేరు వాగుపై కల్వర్టు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక పంచాయతీ పరిధిలోని ముత్తారం గిరిజనులు తమ సొంత ఖర్చులతో ఒంటేరు వాగుపై కల్వర్టును గురువారం నిర్మించుకున్నారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటంతో పాటు వాగుపై వంతెన లేకపోవటంతో ముత్తారం గ్రామస్తులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామ పెద్దల నిర్ణయంతో గ్రామంలోని 120 కుటుంబాల వారు ఒకో కుటుంబానికి రూ.4వేల చొప్పున వసూలు చేసుకుని కల్వర్టు నిర్మాణంతో పాటు రోడ్డు పనులను శ్రమదానం చేసి నిర్మించుకున్నారు. కల్వర్టు, రోడ్డు సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుంజా సూరిబాబు, బొగ్గుల లక్ష్మయ్య, బాడిశ కన్నయ్య, సోడి గోపి తదితరులు పాల్గొన్నారు.సొంత డబ్బులతో నిర్మించుకున్న గిరిజనులు -
వైద్యాధికారులు అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని లక్ష్మినగరం బాలుర ఆశ్రమ పాఠశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వండి పెడుతున్న ఆహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జ్యోతి ఆశ్రమ పాఠశాలలోని 310 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వారి వద్ద నుంచి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటామని వివరించారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పవన్, మనోహర్, స్నేహ, సిబ్బంది సత్యనారాయణ, యాకమ్మ, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాజేడు: వర్షాకాలంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని ఏడ్జెర్లపల్లి, ముత్తారం గ్రామాల్లో గురువారం వైద్య శిబిరాలను ప్రగళ్లపల్లి పల్లె దావఖానా వైద్యాధికారి గ్యానస ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్య క్రమానికి క్రాంతికుమార్ హాజరై మాట్లాడారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. గ్రామాల్లో మురికి గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 94 మంది రోగులను పరీక్షించి మందులను అందించడంతో పాటు కణతితో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఏటూరునాగారం సివిల్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు గర్భిణులను నేడు 102 అంబులెన్స్ వాహనంలో ఏటూరునాగారం లోని ఆస్పత్రికి తరలించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆశ కార్యకర్తలు, జీపీ సిబ్బంది గ్రామంలో ఉన్న మురుగు గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు తీమో పాస్ మందును చల్లారు. ఈ వైద్య శిబిరంలో కోటిరెడ్డి, శ్రీను, పంచాయతీ కార్యదర్శి కార్తీక్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ -
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు
ఏటూరునాగారం: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయవసలే వ్యాఖ్యానించడం దేశ ప్రజలందరినీ అవమానించినట్లేనని తెలిపారు. రాజ్యాంగం మార్పుననకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఇద్దరు దళిత యువకులు ఆవు దూడలను తీసుకెళ్తుండగా గోరక్షక దళాల పేరుతో దాడులు చేయడం దారుణమన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 19 వేల మంది దళిత విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.154 కోట్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 9వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు ఎండీ.దావుద్ నాయకులు మురళి, రత్నం, దేవయ్య, రమేష్, యశోద, ప్రసాద్, సమ్మయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు -
నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి
వెంకటాపురం(ఎం): నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని రామప్ప ఆలయ కార్యనిర్వహణ అధికారి బిల్లా శ్రీనివాస్ తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం రామప్ప గార్డెన్లో వేప, ఉసిరి, మందార మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు కోమల్లపల్లి హరీశ్ శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది సంతోష్, అవినాష్రెడ్డి, పురావస్తుశాఖ అధికారి కుమార్ పాల్గొన్నారు. డీసీసీ బ్యాంకు మార్కెట్ రోడ్డుకు తరలింపు ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని పాత చేపల మార్కెట్ రోడ్డులో ఉన్న డీసీసీ బ్యాంకు ను ములుగు కూరగాయల మార్కెట్ రోడ్డు (ఎకై ్సజ్ ఆఫీస్) పక్కకు తరలిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ తిరుపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు నూతన భవనంలో రేపటి(5వ తేదీ) నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఖాతాదారులు సహకరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి పొలంబాట ములుగు రూరల్: రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి సర్కిల్ సేఫ్టీ ఆఫీసర్, డివిజనల్ టెక్నికల్ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా వంగిన పోల్స్ 351, లూజ్లైన్స్ 134, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు 36 మార్చినట్లు వివరించారు. రైతులకు మెరుగైన విద్యుత్ను సరఫరా చేస్తామని తెలిపారు. పొలంబాట కార్యక్రమంలో రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు మోటార్ల వద్ద ఎర్తింగ్ చేసుకోవడంతో పాటు మోటార్లకు కెపాసిటర్లు ఉపయోకరంగా ఉంటాయని వివరించారు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే రైతులు 1912 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన 48 గంటల వ్యవధిలో విద్యుత్ సరఫరా అందించలేని పక్షంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని వివరించారు. ‘ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం’ ములుగు రూరల్: ఎన్నికల సమయంలో బండారుపల్లి గ్రామంలోని బుడగజంగాల కాలనీ వాసులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని జిల్లా గరంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. ఈ మేరకు గురువారం కాలనీవాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. బుడుగజంగాల కాలనీ వాసులకు ఎన్నికల సమయంలో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింత నిప్పుల భిక్షపతి, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్ కుమార్, నాయకులు అశోక్, రాజన్న, నాగరాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. చిన్న కాళేశ్వరం పనుల అడ్డగింత కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కేంద్రంలోని ఎర్రచెరువు మీదుగా సర్వే చేస్తున్న మెయిన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను స్థానికులు గురువారం అడ్డుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే జరుపుతుండగా రైతులు, ప్రజలు అడ్డుకొని కెనాల్ నిర్మాణం వద్దని అధికారులతో తేల్చిచెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. తహీసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ, ఏఈ భరత్ తదితరులు ఉన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
ఏటూరునాగారం: ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి సీతక్క అనుచరులు ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని పుర వీధుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ప్రశ్నించినందుకు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా అతనిని బెదిరించి సెల్ఫోన్ లాక్కోవడం జరిగిందన్నారు. తర్వాత బెదిరింపులకు దిగడంతో మనస్తాపానికి గురైన చుక్కా రమేష్ గురువారం వారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రశ్నిస్తున్న వారిపై భౌతికదాడులు, బెదిరింపులకు దిగి మానసికంగా ఇబ్బందులకు గురిచేసి చంపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వీటికి మంత్రి సీతక్కను బాధ్యులను చేస్తూ మంత్రి పదవి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా విషయం తెలుసుకున్న ఎస్సై రాజ్కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నాగజ్యోతితో పాటు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్కుమార్, తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, ఎండి ఖాజా పాషా, దన్నపునేని కిరణ్, సప్పిడి రాంనరసయ్య, గండేపల్లి నర్సయ్య, కుమ్మరి చంద్రబాబు, జాడి బోజారావు, తురం పద్మ, వావిలాల ముత్తయ్య, దేపాక శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి -
విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
ములుగు రూరల్: వర్షాల కారణంగా సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూలై, ఆగస్టు నెలలో జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు, సలహాలను పాటించాలన్నారు. జిల్లాలో 61 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, 970 శిథిలావస్థలో ఇళ్లు ఉన్నాయని వారంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. ప్రమాద స్థలాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 800 చెరువులు ఉండగా 13 పెద్ద చెరువులు ఉన్నాయని తెలిపారు. వర్షాలకు నిండిన చెరువులను ముందస్తుగా గమనించాలని వివరించారు. లోతట్టు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరుకులను ముందస్తుగా తరలించాలని సూచించారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే ప్రజలు సురక్షత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో ఫ్లడ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో ప్రమాద పరిస్థితిలో ఉన్న 30 గ్రామాల ప్రజలకు రిస్క్ జాకెట్లను అందించామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు నీటి ప్రవాహంలో దిగకూడదన్నారు. వర్షం విపత్తును ఎదుర్కొనేందుకు పోలీస్, అగ్ని మాపక, విద్యుత్, వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో 58 పునరావాస కేంద్రాలలో 15 వేల మందికి ఆశ్రయం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అధికారి రఫీక్, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
బూత్లెవల్ ఆఫీసర్లకు శిక్షణ
శిక్షణ తరగతులకు హాజరైన బూత్లెవల్ ఆఫీసర్లుములుగు రూరల్: జాతీయ స్థాయి ఎన్నికల బూత్ లెవల్ ఆఫీసర్లకు జిల్లా కేంద్రంలోని కాన్ఫరెన్స్హాల్లో గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మేరకు ములుగు మండలంలోని 59 బూత్ లెవల్ అధికారులు ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరైనట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఓటర్ జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్భాస్కర్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ నితీష్, మాస్టర్ ట్రైనర్ తిరుపతి, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ మనోహర్, శివసాయిరాం, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లోuములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఫేస్ రికగ్నేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాలలో పారదర్శకతను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బాలామృతం, గుడ్లు, పాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సమస్యను అధిగమించి లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు మహిళ శిశు సంక్షేమశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐసీడీఎస్ అధికారులు సిద్ధమయ్యారు. నిత్యం చిన్నారుల ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు.. ఫేస్ రికగ్నేషన్ విధానం ఉపయోగించి ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులకు బాలామృతం, గుడ్లు వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా చిన్నారి తల్లి ఫొటోను ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఫొటోలను తీసుకొని పోషన్ ట్రాకర్ యాప్లో నమోదు చేసి సరుకులు అందిస్తున్నారు. జూలై నుంచి అందరికీ.. అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన బాలింతలకు, గర్భిణులు, చిన్నారులు జూలై నుంచి ఫేస్ రికగ్నేషన్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్ల మొబైల్ ఫోన్లో పోషన్ ట్రాకర్ యాప్ను అప్డేట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూప్లో ఫొటోలు నమోదు కావడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ రికగ్నేషన్ ఫొటోలు అప్లోడ్ చేసే క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో సాంకేతిక సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు పౌష్టికాహారం అందించే క్రమంలో తప్పనిసరిగా ఫొటో అప్లోడ్ చేయాల్సి రావడంతో సరుకుల పంపిణీ సమస్యగా మారుతుందని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నెట్వర్క్ సమస్యలపై అంగన్వాడీ టీచర్లు సమాచారం అందించినట్లు తెలుస్తుంది. 640 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలోని పది మండలాల్లో నాలుగు ప్రాజెక్టులు ఏటూరునాగారం, ములుగు, ఎస్ఎస్ తాడ్వాయి, వెంకటాపురం(కె)లో ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తంగా 640 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు 8,722 మంది ఉన్నారు. గర్భిణులు 1,864, బాలింతలు 1,800, 3నుంచి ఆరేళ్ల వయస్సు కలిగిన వారు 6,424 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు.ఏజెన్సీలో నెట్వర్క్ సమస్య ఉంది.. జిల్లాలోని 24 ఏజెన్సీ గ్రామాలలో నెట్వర్క్ సమస్య కారణంగా చిన్నారుల ఫేస్ రికగ్నేషన్ నమోదు ప్రక్రియ ఇబ్బంది అవుతుంది. మిగితా కేంద్రాలలో తప్పని సరిగా పోషన్ ట్రాకర్లో నమోదు చేస్తున్నారు. యాప్ ద్వారా ఫౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులకు చేరుతుంది. – తుల రవి, జిల్లా సంక్షేమాధికారిన్యూస్రీల్అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ పారదర్శకత పెంచేలా చర్యలు జిల్లాలో 4 ప్రాజెక్టులు 640 కేంద్రాలు ఇంటర్నెట్ సమస్యతో ఇబ్బందులు -
పాఠశాలల బలోపేతానికి కృషి
వెంకటాపురం(ఎం): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు పాఠశాలలోని రికార్డులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, మధ్యాహ్న భోజన రిజిస్టర్, బియ్యం స్టాక్ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి నిర్వహించిన ఎల్ఐపీ ప్రోగ్రాం, ఎఫ్ఎల్ఎన్కు సంబంధించిన మూల్యాంకనం పేపర్లను తక్షణమే ఆన్లైన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు, హెచ్ఎం రాధిక, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, రాజయ్య, వేణు, సీఆర్పీ కుమార్పాడ్య తదితరులు పాల్గొన్నారు.విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ -
సాయిబాబా ఆలయంలో చోరీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని బయటకు ఎత్తుకెళ్లి పగులగొట్టి సొత్తును ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రాజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జీవీవీ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలనుకునే నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే వారు టీసీ, స్టడీ, కులం సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు, పాస్ఫొటో తీసుకుని రావాలని కోరారు. ఇంటర్మీడియట్లో చేరేందుకు టెన్త్ మెమో, స్టడీ, కులం, ఆధార్, టీసీతో పాటు పాస్ఫొటోలతో రావాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ములుగు రూరల్: ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కాటాపురంలో పట్టాలిచ్చిన నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2023లో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 108 మందికి ఇళ్ల పట్టాలను అందించిందని తెలిపారు. ఒక్కొక్కరికి 75 గజాల ఇంటి స్థలానికి పట్టాలు అందించారని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ఇంటి స్థలాలు కేటాయించలేదని పేర్కొన్నారు. మంత్రి సీతక్క, కలెక్టర్ చొరవ తీసుకుని పట్టాలిచ్చిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. టెక్నాలజీ నైపుణ్యాలు పెంచుకోవాలి వెంకటాపురం(కె): రానున్న కాలంలో టెక్నాలజీకి అనుగుణంగా ఫొటోగ్రఫీలో ఫొటో గ్రాఫర్స్ తమ నైపుణ్యాలను పెంచుకోవాలని ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాలెంవాగు ప్రాజెక్టు సమీపంలో మండల ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకంలో ప్రతిఒక్కరూ చేరి వాటి ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫొటో గ్రాఫర్స్ అధ్యక్షులు లింమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్, వెంకటాపురం, వాజేడు మండలాల అధ్యక్షులు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
గోవిందరావుపేట: ఎయిడ్స్పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం సంస్థ సూపర్వైజర్ రజిని అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంప్ నిర్వహించి స్థానికులకు ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులతో బాధపడకుండా అన్ని టెస్ట్లతో పాటు హెచ్ఐవీ టెస్ట్ కూడా చేయించుకోవాలన్నారు. హెచ్ఐవీ నాలుగు విధాలుగా సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలతో, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవీ సోకుతుందని వివరించారు. హెచ్ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు సైతం వస్తుందన్నారు. గర్భిణులు తప్పకుండా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకవేళ గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే బిడ్డకి రాకుండా మందులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శకుంతల, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.వైఆర్జీ కేర్ లింక్ సంస్థ సూపర్వైజర్ రజిని -
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
ములుగు రూరల్: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. విద్యాశాఖ కార్యకలాపాలు సకాలంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాల్లో తరగతులను నిర్వహించకూడదని సూచించారు. మోడల్ కళాశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, సమగ్ర శిక్షా కోఆర్డినేటర్లు అర్షం రాజు, రమాదేవి, సూపరింటెండెంట్ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.డీఈఓ చంద్రకళ -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ములుగు రూరల్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న స్కావెంజర్లకు ప్రభుత్వం ఏడు నెలల నుంచి వేతనాలు అందించడం లేదన్నారు. స్కావెంజర్ల వేతనాలు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా కాకుండా ప్రభుత్వం నేరుగా చెల్లించాలని కోరారు. స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనాలు వేతనాలు నేరుగా ఖాతాలలో జమ చేయాలని కోరారు. ఈ నెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి నర్సయ్య, ముత్యాల రాజు, సామల రమ, మునెమ్మ, కమలక్క, రాజమ్మ, రమాదేవి, పద్మ, నిర్మల, కమల తదితరులు పాల్గొన్నారు.ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ -
బీరన్నకు బోనాలు
ములుగు రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదవ కులస్తులు బీరన్న స్వామికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం మహిళలు బోనాల ఆలయానికి బయలుదేరి వెళ్లి నైవేద్యం సమర్పించి యాటపోతులను బలిచ్చారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు గొర్రె అంకూస్, ఇమ్మడి భిక్షపతి, కొనుపుల కుమార్, బైకాని ప్రకాశ్, బొంతల వేణు, గోపు చంద్రమల్లు, బైకాని సారయ్య, ఇమ్మడి శ్రీనివాస్, ఇమ్మడి రమేష్, మహిళలు పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థి మొక్కలు నాటాలి భూపాలపల్లి అర్బన్: పర్యావరణ సమతుల్యతలను కాపాడేందుకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవరణంలో సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటి, విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు కొమల, సరోత్తంరెడ్డి, రామకృష్ణ, రాజయ్య, సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాళ్లవాగు.. రాకపోకలకు తిప్పలు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని రాళ్లవాగుపై వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాళ్లవాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షాల కారణంగా బురదమయంగా మారిపోయింది. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఆర్టీసీ అధికారులు సైతం భద్రాచలం డిపోకు చెందిన బస్సులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మీదుగా వెంకటాపురం రావాల్సిన బస్సులను మణుగూరు టు ఏటూరునాగారం మీదుగా తిప్పుతున్నారు. దీంతో మండల పరిఽధిలోని ఎదిర గ్రామం నుంచి వెంకటాపురం వరకు ఉన్న గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సులు రాకపోవటంతో ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు వాగుపై వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
దారి ఇలా.. వెళ్లేదెలా?
ఏటూరునాగారం: ఏజెన్సీలోని కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు బురదమయంగా మారింది. ప్రతిరోజూ తమ అవసరాల నిమిత్తం ప్రజలు వచ్చి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇక బైక్పై వెళ్లాలనుకుంటే నరకయాతన పడాల్సిందే. ఇటీవల కురుస్తున్న వర్షాలతో మట్టిరోడ్డు అంతా దిగబడిపోతుందని.. ఈ దారిపై నుంచి ఎలా వెళ్లాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి 2023 జూలై 27న కొండాయి బ్రిడ్జి అకాల వర్షాలతో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. ఆ ఘటనలో 8 మంది జలసమాధి అయ్యారు. అప్పటి నుంచి ఎలాంటి దారిలేకపోయినా ఆయా గ్రామాల ప్రజలు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలికంగా మట్టి రోడ్డును ఓ ఇసుక కాంట్రాక్టర్ నిర్మించాడు. దాంతో కొంత మేర ప్రజలు రవాణా సాగించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దొడ్ల– కొండాయి గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై ఉన్న మట్టిరోడ్డు బురదమయంగా మారిపోయింది. వాహనాలపై వెళ్తుంటే అందులో చిక్కుకుపోతున్న పరిస్థితి ఉంది. అలాగే కాలినడకన వెళ్తే కాలు తీసి కాలు వేయలేని దుస్థితి. ఒక పక్క వాగు నీరు ఉండడంతో ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. 40 కిలోమీటర్లు తిరిగి రావాలి.. కేవలం ఈ బురదరోడ్డు పైనే కొండాయి, గోవిందరాజుల కాలనీ, మల్యాల, ఐలాపురం గ్రామాల ప్రజలు రవాణా సాగించాల్సి ఉంది. ఈ రోడ్డు వల్ల వాహనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఊరట్టం, మేడారం, తాడ్వాయి మీదుగా ఏటూరునాగారం మీదుగా 40 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బురదమయంగా కొండాయి రోడ్డు అవస్థలు పడుతున్న నాలుగు గ్రామాల ప్రజలుముందుకు సాగని బ్రిడ్జి పనులు రూ.16.50 కోట్లతో బ్రిడ్జి పనులు మొదలు పెట్టి నెలకావస్తోంది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో వర్షాలు కూడా తోడు అయ్యాయి. ఇక అంతే ఈ ఏడాది ఏ బ్రిడ్జిలేనట్లే.. మళ్లీ బురదరోడ్లే శరణ్యంగా మారాయి. పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.బురదలో నుంచి నడిచిపోవాలి.. ఏ కష్టం వచ్చినా ఎలాంటి వాహనాలు రావు. నడుచుకుంటూ పోవాలి. ట్రాక్టర్లు తప్ప వేరే బండ్లు వచ్చే పరిస్థితి లేదు. మోకాలు లోతు బురద దిగబడిపోతుంది. కొండాయి నుంచి దొడ్ల వరకు 4 కిలోమీటర్లు నడవాలి. ఏ అవసరం వచ్చినా ఏటూరునాగారం పోవాలి అంటే నడుచుకుంటూ పోవడం తప్పా వేరే మార్గం లేదు. – రాము, మల్యాల -
మాటల మంటలు!
స్వపక్షంతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి కార్నరైన కొండా మురళి వ్యాఖ్యలు ● మాజీ ఎమ్మెల్సీ తీరుతో కాంగ్రెస్ కేడర్లో అయోమయం ● ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ● స్థానిక ఎన్నికల ముందు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిసాక్షి, వరంగల్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాటలు అధికార పార్టీ కాంగ్రెస్లో కల్లోలం రేపుతున్నాయి. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీకి కూడా అస్త్రశస్త్రాలు దొరకడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేసిన కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా చెలామణి అవుతున్న కొండా మురళి మాటలతో అందరికీ కార్నర్ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరిపై పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎర్రబల్లులేనని విమర్శించడంతో మాటల మంటలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి బదులుగా కొండా మురళిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు.. నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడు రేవంత్రెడ్డి సహకారంతో పదవులు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలు, సొంత పార్టీ నేతలు, వరంగల్ తూర్పు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా కొన్నిరోజుల నుంచే వరంగల్ రాజకీయం అంతా కొండా చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం. ఇంకోవైపు పరకాల ఎమ్మెల్యేగా కొండా సుష్మితాపటేల్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులవడం, సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. -
విపత్తుల సమయంలో సహాయక చర్యలు
ములుగు రూరల్: విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ తన చాంబర్లో అదనపు కలెక్టర్ మహేందర్జీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామప్ప, లక్నవరం సరస్సు, గోదావరి నది, జంపన్న వాగు నీటిప్రవాహం, గతంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 28 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వర్షాకాలం ముగిసే వరకు జిల్లాలో ఉంటుందని తెలిపారు. గోదావరి నది, జంపన్న వాగు పరిసర ప్రాంతాలతో పాటు ఊరట్టం, నార్లాపూర్, మేడారం నీటి ప్రవాహ ప్రాంతాలను పరిశీలించి వరదలు వచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బృందా నికి కావాల్సిన ఏర్పాట్లను సమకూర్చాల్సిందిగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, కలెక్టరేట్ సెక్షన్ పర్యవేక్షకులు శివకుమార్, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి గోవిందరావుపేట: బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజులు పోలీస్శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, కార్మికశాఖ చైల్డ్ హెల్ప్లైన్, మహిళా సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులను గుర్తించి బాలలను రక్షించాలన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎంహెచ్ఓ గోపాల్ రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవ రావు, సర్వశిక్షా అభియాన్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజు, అగ్రికల్చర్ ఆఫీసర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
రూ. 19 లక్షలు రావాల్సి ఉంది
వెంకటాపురం(ఎం) సర్పంచ్గా ఉన్న సమయంలో రూ.19లక్షలు ఖర్చుపెట్టి అభివృద్ధి పనులు చేశాను. పంచాయతీకి ప్రహరీ నిర్మాణం, సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా వీధి దీపాల ఏర్పాటు, గ్రావెల్ పనులు చేసినప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. చేసిన పనులకు గాను ఎంబీ రికార్డులు సైతం ఉన్నాయి. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. – మేడబోయిన అశోక్, సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు వెంకటాపురం(ఎం) -
వైద్యవృత్తికి ఎంతో గౌరవం
ములుగు రూరల్: సమాజంలో వైద్య వృత్తికి ఎంతో గౌరవం ఉందని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ కేక్ కట్ చేసిన అనంతరం ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలన్నారు. వైద్యాధికారులందరూ వైద్య వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ నియంత్రణకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాధులను అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్, పవన్కుమార్, చంద్రకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
పల్లెల్లో పడకేసిన ప్రత్యేక పాలన
ఏటూరునాగారంలో రోడ్డు పక్కన పడేసిన చెత్తకనిపించని ప్రత్యేకాధికారులు జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 174 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల ములుగు మున్సిపాలిటీలో మూడు పంచాయతీలు విలీనం కావడంతో పంచాయతీల సంఖ్య 171కి చేరింది. 2024 ఫిబ్రవరి 1న పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో మరుసటి రోజున ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. మండలానికి జిల్లా స్థాయి అధికారి, గ్రామాలకు సీనియర్ అసిస్టెంట్ నుంచి పైస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించడంతో వారు బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీల్లో ప్రత్యేక పాలన సుమారుగా 18 నెలలుగా కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేకాధికారులు పంచాయతీలకు వచ్చి విధులు నిర్వహించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు తప్పా ఇతర రోజుల్లో పంచాయతీ విధులకు హాజరుకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వెంకటాపురం(ఎం): పంచాయతీల్లో ప్రత్యేక పాలన పడకేసింది. జీపీల్లో విధులు నిర్వర్తించాల్సిన ప్రత్యేకాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో గ్రామాలాభివృద్ధి, ప్రజల సంక్షేమం గాలిలో దీపంలా మారి పల్లెలన్నీ మసకబారిపోతున్నాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరవేస్తూ, గ్రామాల్లో సమస్యలు పరిష్కారించాల్సిన ప్రత్యేకాధికారులు జీపీలను పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే అన్నీ తామై గ్రామ పంచాయతీలను నెట్టుకొస్తున్నారు. కనిపించని అభివృద్ధి పంచాయతీల పాలకవర్గం గడువు ముగియడంతో ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు లేకపోవడంతో గ్రామాలాభివృద్ధి కుంటుపడుతోంది. గత పాలకవర్గాలు చేసిన పనులకే ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్క గ్రామపంచాయతీకి సుమారు రూ.2 లక్షల నుంచి 20 లక్షలకు పైగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లాలోని 174 గ్రామపంచాయతీలకు సుమారుగా రూ.20 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు మాజీ సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. 2023 సెప్టెంబర్ నుంచి చేసిన పనులకు బిల్లులు రాలేదని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు సైతం అప్పులు చేసి గ్రామాల నిర్వహణ కొనసాగిస్తున్నారు. తాగునీటి పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, గ్రామాల్లోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్కు చేరవేయడం లాంటి పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేస్తున్నారు. ఖర్చు చేసిన డబ్బులకు బిల్లులు పెట్టి ఎస్టీఓలకు చెక్కులు పంపుతున్నప్పటికీ చెక్కులు పాస్ కావడం లేదని కొంతమంది కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారుల పాలనలో లక్షలు వెచ్చించి గ్రామాల నిర్వహణ కొనసాగిస్తుండడంతో పాటు విధుల నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. నెలసరి వచ్చే వేతనం కూడా పంచాయతీ అభివృద్ధికే ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి నెలకొందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. పంచాయతీల వైపు కన్నెత్తి చూడని ప్రత్యేకాధికారులు పంచాయతీ కార్యదర్శులే నెట్టుకొస్తున్న వైనం నిధుల్లేక కుంటుపడుతున్న గ్రామాల అభివృద్ధి -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025బొగతకు రావాలంటూ పిలుపు తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికారులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికి మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు. -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
● జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు ఎస్ఎస్తాడ్వాయి: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవరావు అన్నారు. మండల కేంద్రంతో పాటు నార్లాపూర్లోని రైతు వేదికల్లో ఉద్యాన శాఖ, కేఎన్ బయోసైన్స్ ఆయిల్పామ్ కంపెనీ వారి అనుబంధంతో రైతులకు మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సరిపడా నూనె ఉత్పత్తి లేదని తెలిపారు. దేశంలో 259 లక్షల టన్నుల ఆయిల్పామ్ వినియోగం అవసరం కాగా 97లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దీంతో ఇతర దేశాల నుంచి నూనె దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఇతర దేశాల నుంచి దిగుమతి తగ్గించి మన రైతులు ఆయిల్పామ్ పంటల సాగుపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. అదే విధంగా రైతులు పండ్లు, కూరగాయలు సాగుచేయాలని సూచించారు. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి శ్రీకాంత్, ఆయిల్ పామ్ కంపెనీ ఏరియా మేనేజర్ హేమంత్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనిరుద్, ఏఈఓలు రాజ్కుమార్, దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తుల వివరాలు
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్కు వినతులు వెల్లువలా వచ్చాయి. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 121అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి 85 దరఖాస్తులు స్వీకరించగా ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా 36 వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కరించిన దరఖాస్తుదాడుడికి ఫోన్ సమాచారం అందించాలని సూచించారు.గిరిజన దర్బార్లో వినతులు ఇలా..మంగపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలకు సీసీ రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు విన్నవించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గిరిజనులు వేడుకున్నారు. మహబూబాబాద్ మండలం మిర్యాలపేట గ్రామానికి చెందిన పలువురు రైతులు రైతుభరోసా తమ ఖాతాల్లో పడడం లేదని, పడే విధంగా చేయాలని పీఓను వేడుకున్నారు. ఏటూరునాగారం మండలంలోని చింతలమోరి గొత్తికోయగూడెంలో చిన్న పిల్ల లు చదువుకునేందుకు ఒక రేకుల షెడ్డు ఏర్పాటు చేయాలని గిరిజనులు పీఓను వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్లోని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని విన్నవించారు. భూపాలపల్లి మండలం వెలిశాలపల్లిలో పీఎంహెచ్ హాస్టల్లో ఏఎన్ఎంగా నియమించాలని కోరారు. గంగారంలో రెవెన్యూ అసైన్డ్ భూములకు పట్టాలు చేయాలని గిరిజనులు పీఓను వేడుకున్నారు. మంగపేట మండలం పేరుకులకుంట గిరిజన సంక్షేమశాఖలో అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. తొండ్యాల గ్రామానికి చెందిన గిరిజనులు 49వ జీఓను రద్దు చేయాలని పీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు.పింఛన్ అందించి ఆదుకోవాలి..నా కుమారుడు డేవిడ్ పట్టుకతోనే దివ్యాంగుడు. ప్రస్తుతం 6 సంవత్సరాలుగా మంచానికి పరిమితమై ఉంటున్నాడు. తాము నిరుపేద కుటుంబానికి చెందినా.. సాధ్యమైనంత వరకు ఆస్పత్రుల్లో డబ్బులు ఖర్చు చేసి చికిత్స చేయించాం. అయినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారులు దయతలిచి నా కుమారుడికి పింఛన్ అందించి ఆదుకోవాలి.– అర్షం రజిత, మల్లూరు, మంగపేటభూ సమస్యలు 39గృహ నిర్మాణం 16ఉపాధి కల్పన 03పింఛన్లు 06ఇతర సమస్యలు 21 -
వడ్డీ చెల్లిస్తే రెన్యువల్ చేయాలి
ములుగు రూరల్: జిల్లాలో పంట రుణాలు పొందిన రైతులు వడ్డీ చెల్లిస్తే రుణాలను రెన్యువల్ చేయాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పహాణీ నకల్ ఆధారంగా పొందిన పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుకు రూ. 2లక్షల మేరకు రుణమాఫీ చేయాలన్నారు. యాసంగి సాగులో సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. ఏజెన్సీలో ఉన్న రైతులకు 30శాతం మందికి మాత్రమే పట్టాదార్ పాస్పుస్తకాలు ఉన్నాయని పహాణీ నకల్ ఆధారంగా రుణాలు అందించాలన్నారు. అటవీహక్కు పత్రాలు పొందిన రైతులకు రైతుభరోసా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, బండి నర్సయ్య, నటరాజ్, నారాయణసింగ్, కృష్ణయ్య, సమ్మయ్య, పరంసింగ్, జనార్ధన్, రమేష్, లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు.రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్పాషా -
ఉద్యోగ విరమణ సహజం
ములుగు రూరల్: ఉద్యోగ విరమణ సహజమని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ఉద్యోగ విరమణ పొందిన బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి చిట్టిరెడ్డి రవీందర్రెడ్డిని అదనపు కలెక్టర్ మహేందర్జీతో కలిసి శాలువాలతో సోమవారం సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నప్పుడు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. తమ శేషజీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, తహసీల్దార్లు, ఎంపిడీఓలు, మండల అధికారులు పాల్గొన్నారు.ట్రాఫిక్లో చిక్కుకున్న 108 వాహనంవాజేడు: మండల పరిధిలోని మండపాక వద్ద 163 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం సుమారు అర్ధగంట పాటు 108 అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది. అక్కడ రహదారికి ఇరువైపులా ఇసుక లారీలను నిలిపి వేయడంతో ముందుకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. దీంతో ఏటురునాగారం వైపు నుంచి వెంకటాపురం(కె) వైపునకు వస్తున్న 108 అంబులెన్స్ లారీల వెనుక నిలిపి ఉంచాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్లో రోగులు ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. కాని ఒక వేళ రోగులు ఉంటే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.పోక్సో కేసులో ఇద్దరికి జైలుములుగు రూరల్: జిల్లాలో ఇద్దరు నిందితులకు పోక్సో కేసులో నేరం నిరూపణ కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్పీ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపురం(ఎం)పోలీస్స్టేషన్లో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మేడిపల్లి భాస్కర్కు ఇరవై ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.6వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చినట్లు వివరించారు. అదే విధంగా వెంకటాపురం(కె)పోలీస్స్టేషన్లో 2018లో మాచర్ల హరిబాబుపై నమోదైన కేసులో అతనికి ఇరవై ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.11 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని జడ్జీ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. ఈ కేసుల్లో శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
ఉపాధ్యాయులు లేక కుంటుపడుతున్న విద్య
ఏటూరునాగారం: వాజేడు, వెంకటాపురం మండలాల్లోని ప్రభుత్వ, గిరిజన విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు లేక విద్య కుంటుపడుతుందని, వెంటనే ఖాళీగా ఉన్న చోట ఉపాధ్యాయులను నియమించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహామూర్తి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రెండు మండలాలను ములుగు జిల్లాలో కలపడం వల్లనే విద్యావ్యవస్థ కుంటుపడుతోందని తెలిపారు. ఏజెన్సీలోని చిరుతపల్లి –2 ఆశ్రమ పాఠశాలలో పలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జీపీఎస్ చిరుతపల్లిలో 54 మంది, బోదాపూర్లో 55మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరే ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. అలాగే కలిపాక, ముత్తారం పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరని, వాజేడు మండలంలోని పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల, జంగాలపల్లి, కాసారం పాఠశాలల్లో ఏకో ఉపాధ్యాయులతో పాఠశాలలను నడుపుతున్నట్లు పీఓకు వివరించామన్నారు. గుడిసెవాసులకు హక్కు పత్రాలివ్వాలి జీఓ నంబర్ 49ని రద్దు చేసి, గుడిసెవాసులకు హక్కుపత్రాలివ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జజ్జరి దామోదర్, జిల్లా అధ్యక్షుడు దుర్గి చిరంజీవి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
గోవిందరావుపేట: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని పస్రా పీహెచ్సీని డీఎంహెచ్ఓ గోపాల్రావు ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. పీహెచ్సీకి వైద్యం కోసం వచ్చిన రోగులకు బీపీ, షుగర్ లాంటి పరీక్షలతో పాటు జ్వరంతో వచ్చిన వారికి మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఓపీ రిజిస్టర్ను పరిశీలించగా 45మంది రోగులు వచ్చారని తెలిపారు. అనంతరం డ్రగ్ స్టోర్ను, ల్యాబ్ టెక్నీషియన్, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించారు. కుక్క, పాము కాటుకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ మందులను మూడు నెలల వరకు సరిపోయే విధంగా రోగులకు ఇవ్వాలన్నారు. గ్రామాలలో మెడికల్ క్యాంప్లను నిర్వహించి రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ సుచిత, ఫార్మసీ ఆఫీసర్ శారద, ఎన్సీడీ స్టాఫ్నర్స్ సంధ్య, రమాదేవి, ల్యాబ్, టెక్నీషియన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో స్వరాష్ట్ర సాధన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మురహరి భిక్షపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరవదిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డు, 25 వేల పింఛన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిక అనంతరం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్నారు. హామీలను అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్నాయక్, జంపాల రవీందర్, చంటి భద్రయ్య, ముంజాల భిక్షపతి, సర్ధార్పాషా, గోపాల్రెడ్డి, రాజేశ్వర్రావు, సదయ్య, శ్రీధర్, శ్రీనివాస్, మల్లయ్య, సమ్మక్క, లక్ష్మీ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షపతి -
బ్యాంకు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు
మా నాన్నమ్మ లాలమ్మ 2023లో మరిణించింది. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును విడిపించి ఇవ్వాలని పలుమార్లు బ్యాంకు అధికారులను కలిసి దరఖాస్తులు అందించినా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును విత్ డ్రా చేసి ఇవ్వాలని సంబంధిత పత్రాలు అందజేసినా బ్యాంక్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. – పూనెం రాంకుమార్, అంకన్నగూడెం, మంగపేట -
స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లుగా పనిచేస్తున్న వర్కర్లకు 8 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో స్కావెంజర్లను 2024 అక్టోబర్లో నియమించినట్లు తెలిపారు. 8 నెలలుగా పనిచేస్తున్నా వీరికి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబం గడవటమే కష్టంగా మారిందని తెలిపారు. స్కావెంజర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కావెంజర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు యన్నమల్ల ప్రవీణ్కుమార్. జనగాం రమేష్, నవీన్, మల్లికార్జున్, ఉమా, సమ్మయ్య, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
పర్యాటకులకు ఇబ్బంది కలగొద్దు
వాజేడు : బొగత జలపాతం వద్ద పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని వెంకటాపురం(కె) ఎఫ్డీఓ ద్వాలియా సిబ్బందిని సూచించారు. శనివారం మండల పరిధిలోని చెరుకూరు వద్ద ప్లాంటేషన్లో చేపట్టిన పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం బొగత జలపాతానికి వచ్చిన ద్వాలియా అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. జలపాతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది జలపాతాలకు పర్యాటకులను వెళ్లకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్ఎస్ఓ నారాయణ, సిబ్బంది ఉన్నారు.పోలీస్ ఔట్పోస్ట్ సేవలు ప్రారంభంములుగు రూరల్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీస్ ఔట్ పోస్టు సేవలను మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్లాల్, సీఐ సురేష్తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ ఔట్ పోస్టులో 24గంటలు పోలీసులు విధుల్లో ఉంటారని ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్రావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.రాజీవ్ యువవికాసం అమలు చేయాలిములుగు రూరల్ : రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని దరఖాస్తులు స్వీకరించి అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి పథకం నిలిపివేయడం నిరుద్యోగ యువత అసహనానికి గురవుతున్నారని వెల్లడించారు. రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేసి యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.రేపు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుములుగు రూరల్ : జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈ నెల 30న(సోమవారం) నిర్వహిస్తున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10, 12, 14 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులను ఏ,బీ,సీ విభాగాలుగా బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో 60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, కిడ్స్ జావిలిన్ త్రో అంశాల్లో ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు, పోటీల్లో పాల్గొనే బాలబాలికలు తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలలో హాజరు కావాలని తెలిపారు. పాఠశాల పీఈటీ రాజ్కుమార్కు జనన ధ్రువీకరణ పత్రం అందించి పోటీల్లో పాల్గొనాలని సూచించారు.సాగు భూములు తీసుకోవద్దువెంకటాపురం(కె) : పాలెం ప్రాజెక్టు కాల్వ పనుల్లో భాగంగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తే సహించేది లేదని ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్సా నర్సింహామూర్తి పేర్కొన్నారు. తమ భూములు తీసుకోవద్దని తహసీల్దార్ వేణుగోపాల్కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలెం ప్రాజెక్టు నుంచి కాల్వ నిర్మాణానికి ముకునూరు పాలెం, కమ్మరిగూడెంలో భూములు తీసుకోవడానికి ఆదివాసీ రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రైతులకు తెలియకుండా అధికారులు సర్వే చేయడం సరికాదన్నారు. ఆదివాసీ చట్టాలను విస్మరించి సాగు భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. నాయకులు కుంజా మహేష్, రాము, సమ్మయ్య, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్ : కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు.. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీరా బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ నెల 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
పింఛన్ పైసలు ఇస్తలేదని గుడిసెకు నిప్పు
● ప్రాణాలతో బయటపడిన వృద్ధురాలు ఏటూరునాగారం : పింఛన్ పైసలు అడిగితే ఇస్తలేదనే కోపంతో సమీప బంధువు వృద్ధురాలి గుడిసెకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన మండలకేంద్రంలోని ఆకులవారిఘణపురంలో శనివారం చోటుచేసుకుంది. సమ్మక్క గుడిసెలో నివాసం ఉంటూ ఆసరా పింఛన్తో పూటగడుపుకుంటుంది. సమీప బంధువైన పలక నాగరాజు పింఛన్ డబ్బులు ఇవ్వాలని సమ్మక్క దగ్గరకు వెళ్లి అడిగాడు. ఎంతకూ ఇవ్వనని చెప్పడంతో.. బెదిరించి గుడిసెకు నిప్పుపెట్టాడు. దీంతో సమ్మక్క ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీసింది. విషయాన్ని గమనించిన స్థానికులు గుడిసెకు అంటుకున్న మంటలను ఆర్పేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఒంటిమీద ఉన్న బట్టలతో వృద్ధురాలు నిరాశ్రయురాలిగా మిగిలిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పదిహేను రోజుల క్రితమే చేయూత సమ్మక్క దీన పరిస్థితిని గుర్తించిన బ్లడ్ డోనర్స్ సభ్యులు దాతల సహకారంతో ఆమెకు విద్యుత్ సరఫరా, ఫ్యాన్, ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని అందజేశారు. వాటితో కొంత ఉపశమనంగా బతుకుతున్న తరుణంలో నాగరాజు చర్యతో ఆమె మళ్లీ రోడ్డుపై పడింది. -
విషజ్వరంతో ఒకరి మృతి
మంగపేట: విషజ్వరంతో ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని మల్లూరు గ్రామ పంచాయతీ పరిధి కేసీఆర్ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి భార్య కందుల నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కందుల నాగరాజు(53) మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యులకు చూపించుకున్నాడు. వారి సూచన మేరకు చుంచుపల్లి పీహెచ్సీకి వెళ్లగా గ్లూకోజ్ పెట్టి మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. శనివారం తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లి మృతిచెందాడు. కాలనీలో వైద్యశిబిరం నిర్వహించి 24 గంటలు గడవక ముందే సబ్సెంటర్ ఎదురుగా ఉన్న ఇంటి యజమాని విషజ్వరంతో మృతి చెందడంతో జ్వరాలతో బాధపడుతున్న వారు ఆందోళన చెందుతున్నారు. విషయంపై చుంచుపల్లి వైద్యాధికారి యమునను వివరణ కోరగా.. నాగరాజు వైద్యశిబిరానికి వచ్చినపుడు జ్వరం లేదని.. అతిగా మద్యం తాగి ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురైనట్లు గుర్తించామన్నారు. పీహెచ్సీలో ఫ్లూయిడ్ పెట్టి మందులు ఇచ్చామని, మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మకు బోనాలు
ఏటూరునాగారం : మండల కేంద్రంలోని రామాలయం వీధిలో గల ముత్యాలమ్మకు స్థానికులు శనివారం భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ముత్యాలమ్మ ఆలయం నిర్మించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పండితులు అమ్మవారికి వార్షికోత్సవ పూజలు చేశారు. గ్రామంలోని బొడ్రాయివద్ద ప్రత్యేక పూజలు చేసి డప్పుచప్పుళ్ల ఊరేగింపుగా బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సునార్కని శ్రీనివాస్, జాడి భోజారావు, కుమ్మరి చంద్రబాబుతోపాటు రాజ్కుమార్, సమ్మయ్య, లక్ష్మయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
బ్యూటిఫుల్.. రామప్ప టెంపుల్
వెంకటాపురం(ఎం) : బ్యూటిఫుల్..రామప్ప టెంపుల్ అంటూ స్వీడన్ దేశానికి చెందిన ప్రొఫెసర్ లూయిస్ స్టేవా పేర్కొన్నారు. శనివారం మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఆయన సందర్శించి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా, టూరిజం గైడ్ విజయ్కుమార్ ఆలయ విశిష్టతను వివరించారు. కాగా రామప్ప శిల్పకళా సంపద బాగుందని స్టేవా కొనియాడారు. మురుగు కాల్వలో మొసలి పిల్ల వెంకటాపురం(కె): పాత్రపురం గ్రామంలోని మురుగు నీటికాల్వలో శనివారం మొసలి పిల్ల ప్రత్యక్షం కాగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో గ్రామస్తులు పంచాయతీ అధికారులకు సమాచారం అందించగా వారు అటవీశాఖ అధికారులకు విషయం చెప్పారు. అనంతరం అధికారులు మొసలి పిల్లను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలిలేశారు. ఇంకెన్ని మొసలి పిల్లలు గ్రామంలోకి వచ్చి ఉంటాయోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
ఏజెన్సీలో చెరువులపై హక్కు కల్పించాలి
వాజేడు : ఏజెన్సీలో నివసిస్తున్న ఓడబలిజలకు చెరువులపై పూర్తిస్థాయిలో హక్కు కల్పించాలని ఓడబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. దామోదర్తో పాటు ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు గగ్గురి రమణయ్య హైదరాబాద్లో సాయికుమార్ను కలిసి ఓడ బలిజలు, బీసీలు ఏజెన్సీలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఓడ బలిజలకు మత్స్యకార సభ్యత్వాలు ఇవ్వాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో మత్స్యకారుల సభ్యత్వాల్లో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మెట్టు ధనరాజ్, తోట ప్రశాంత్, బొల్లె విజయబాబు తదితరులు ఉన్నారు. -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి.. ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి.. ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
సమస్యలు పరిష్కరించడంలో విఫలం
● మాజీ ఎంపీ మిడియం బాబురావు ఏటూరునాగారం : వలస ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదివాసీ హక్కులపై శనివారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించగా బాబురావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల గూడేలకు కనీస వసతులు కల్పించకుండా, వారిని వలసవాదులుగా ముద్రించి, కుల ధ్రువీకరణ పత్రాలు, కనీస వసతులు కల్పించకుండా ఆదివాసీ హక్కులను కాలరాస్తోందన్నారు. వారిని అడవి నుంచి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆదివాసీలు దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందని, వారికి అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని సూచించారు. అటవీ సంరక్షణ, జంతు, జీవజాతుల రక్షణ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి పంపేందుకు జీఓ 49 తీసుకువచ్చి 339 ఆదివాసీల గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు. జీఓ 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జెజ్జరీ దామోదర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు అలెం అశోక్, కుర్సం శాంతకుమారి, కోరం చిరంజీవి, తోలెం కృష్ణయ్య, కుర్సం చిరంజీవి, పూనెం నగేష్, ఊకే ప్రభాకర్, కొట్టెం కృష్ణారావు పాల్గొన్నారు. -
ప్రజలకు సేవ చేస్తేనే గుర్తింపు
● జెడ్పీ సీఈఓ సంపత్రావు ఏటూరునాగారం : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తేనే తగిన గుర్తింపు వస్తోందని జెడ్పీ సీఈఓ సంపత్రావు పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన తక్కలపల్లి రాజ్యలక్ష్మి శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సంపత్రావు, మండల ప్రత్యేక అధికారి రాంపతితోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు సన్మానించారు. అనంతరం నల్లగుంటకు చెందిన శ్రీనివాసాచార్యులు రచించిన కవిత్వం షీల్డ్ను రాజ్యలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్, స్థానిక ఎంపీఓ కుమార్తోపాటు పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో కొత్త పనులు
ఏటూరునాగారం: ఉపాధి హామీలో వర్షాకాలంలో కూలీలతో పనులు చేయించే విధంగా ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు శ్రీకారం చుట్టారు. జాబ్కార్డు ఉన్న ప్రతీ కుటుంబం వందరోజుల పనులను సద్వినియోగం చేసుకునేలా అధికారులు, సిబ్బంది ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. కొత్త పనులకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు ఇవ్వాలని రైతులను కోరారు. అయితే కూలీలు ఎంతగా పెరిగితే అంతా నిధులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. మ్యాన్డేస్ పెరిగితేనే ఇతర నిర్మాణాలకు నిధులు ఇచ్చే విధంగా ఈ పథకం రూపకల్పన చేశారు. ఈజీఎస్లో చేసే పనుల వివరాలు పంటకాల్వలు, చేపల చెరువు, ఇంకుడు గుంతలు, కంపోస్ట్ ఎరువు, పంట పొలాలకు రోడ్ల నిర్మాణం, మొక్కలు పెంచడంతోపాటు పండ్లతోటలు, కొబ్బరి మొక్కలు, పామాయిల్ పెంపకం, మునగ, జామ, బత్తాయి, మామిడి, సపోట, వెదురువనం పెంచడం, మేకలు, గొర్రెల షెడ్డు, కోళ్ల ఫారం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇవేకాకుండా మరో 18 రకాల పథకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పనులు రైతులకు అనుసంధానం చేయడం వల్ల రైతులకు వ్యవసాయంలో మేలు జరుగుతుంది. భూమి చదునుతోపాటు పథకాలను వర్తింప చేసేందుకు ఈజీఎస్ అధికారులు పల్లెబాట పడుతున్నారు. పంట కాల్వలతో చెరువుల నుంచి నీటిని పొలాలకు పంపించడం, చెరువుల పూడికతీతతో నీటి నిల్వలు, పాంపాండుతో పొలాల చదును, ఇంకుడుగుంతలో భూగర్భజలాలు పెరుగుదల, నాడపు కంపోస్ట్తో పంట పొలాలకు సేంద్రియ ఎరువు లభిస్తుంది. మేకలు, గొర్రెల, గేదెల పెంపకానికి షెడ్ల నిర్మాణాలు ఈ పథకంలో చేపట్టనున్నారు. కూలీలకు ఆర్థిక లాభాలు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో కుటుంబం వంద రోజుల పాటు పనులు చేసుకుంటే సుమారు రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. దీంతో కుటుంబాలు ఆర్థిక అభివృద్ధితోపాటు సామాజికంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. క్యూబిక్మీటర్ చొప్పున లెక్క గట్టి ఉపాధి కూలీలకు వేతనాన్ని (కూలీ)ని అందజేస్తారు. దీంతో వారి ఇంటిల్లిపాది పూటగడవడంతోపాటు అవసరాలను తీర్చుకుంటున్నారు. జిల్లాలో జాబ్కార్డులు 55,410 కూలీలు 43,961 పూర్తి చేసిన పనిదినాలు 6,56,688 కూలీలకు మరింత ఉపాధి ఉపాధి కూలీలకు మరింత ఉపాధిని ఇచ్చేవిధంగా చర్యలు చేపడుతున్నాం. ఈజీఎస్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రజలను, రైతులను భాగస్వాములను చేస్తున్నాం. దీంతో రైతులకు ఉపయోగపడే పథకాలతో వారికి ఆర్థిక అభివృద్ధి దోహదపడుతుంది. – వెంకటనారాయణ, ఏపీడీ, ములుగు వ్యవసాయ రైతులకు ఉపయోగపడేలా రూపకల్పన వర్షాకాలంలో సైతం పనులు చేసుకునే అవకాశం ఎన్ఆర్ఈజీఎస్తో పేదలకు ఆర్థిక లాభాలుమండలం జాబ్ కూలీలు పని కార్డులు దినాలుఏటూరునాగారం 5,560 2,773 28,190 గోవిందరావుపేట 5,793 3,492 45,173 కన్నాయిగూడెం 3,468 2,576 28,820 మంగపేట 6,874 3,620 42,626 ములుగు 10,708 10,618 1,94,550 తాడ్వాయి 4,248 3,106 35,045 వెంకటాపురం(ఎం) 6,830 4,141 58,454 వెంకటాపురం(కె) 6,291 6,903 1,25,891 వాజేడు 5,638 6,782 97,399 -
వన మహోత్సవానికి వేళాయె
గవర్నర్ దత్తత గ్రామంలో సంబురాలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తిలో గ్రామస్తులు సంబురాలు చేసుకున్నారు. శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025వెంకటాపురం(ఎం): పచ్చదనం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. గతంలో హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టగా ప్రస్తుతం వన మహోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల పరిధిలో అధికారులు నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. వర్షాల ఆధారంగా జూలై మొదటి వారం లేదా రెండోవారంలో మొక్కలు నాటేందుకు డీఆర్డీఏతో పాటు అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. మొక్కలు నాటేందుకు ఈనెలఖారులోగా గుంతలు తీసే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 14.16 లక్షల మొక్కలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 174 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసి ప్రతీ నర్సరీలో సుమారు 6 వేల మొక్కలను పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ, వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, ఉద్యానవన, నీటిపారుదల, విద్య, వైద్యం, విద్యుత్, పశు సంవర్థక, ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 14.16 లక్షల మొక్కలను జూలై మాసంలో నాటేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే మొక్కలు నాటేందుకోసం గుంతలను తీయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పూలు, పండ్ల మొక్కలతో పాటు రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. నర్సరీల్లో గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఊసిరి, అల్లనేరేడు, మునగ, తులసీ, దానిమ్మ, బొప్పాయి, ఈత, అడవి తంగేడు, వేప, గుల్మోహర్, కానుగ మొక్కలతో పాటు ఇతర ఔషధ మొక్కలను పెంచుతున్నారు. న్యూస్రీల్జూలైలో మొక్కలు నాటేలా కార్యాచరణ ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యం కేటాయింపు నర్సరీల్లో పూలు, పండ్లు, ఔషధ మొక్కలు సిద్ధం జిల్లాలోని 174 జీపీల పరిధిలో 14.16లక్షల మొక్కలు నాటేందుకు శ్రీకారం -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
మంగపేట: సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. మండంలోని మల్లూరు పంచాయతీ పరిధిలోని కేసీఆర్కాలనీలో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి గోపాల్రావు ఆదేశాల మేరకు చుంచుపల్లి పీహెచ్సీ వైద్యాధికారి యమున ఆధ్వర్యంలో శుక్రవారం మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీతో పాటు గ్రామంలోని 175 మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. 25 మంది జ్వర పీడితులను గుర్తించి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా జనావాసాల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, మురుగు నీరు, వర్షపునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్ ఐటీడీఏ ఏటూరునాగరం డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, ఎన్వీబీడీసీపీ వైద్యాధికారి చంద్రకాంత్, ఎంసీహెచ్ మంగపేట వైద్యాధికారి ప్రశాంత్, నాగరాజు, తరుణ్, ఏఎన్ఎం సీతమ్మ, ఆశవర్కర్లు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ములుగు రూరల్: ములుగు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు మండలకేంద్రం నుంచి జీవింతరావు పల్లి గ్రామం మీదుగా గణేష్పల్లి వరకు మూడు రూ.3.50కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులకు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు పార్లమెంట్ సభ్యుడు బలరాంనాయక్, కలెక్టర్ దివాకర, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అర్లులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి ఐదు వేల ఇళ్లు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇచ్చిన హామీ మేరకు మల్లంపల్లి మండలాన్ని జెడీ మల్లంపల్లి మండలంగా పేరు మార్చామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీ రాజ్ ఈఈ అజయ్కుమార్ తదితరులు ఉన్నారు. ఉచిత వరి విత్తనాల పంపిణీ మంగపేట: మండలంలోని మల్లూరు, బ్రాహ్మణపల్లి, అకినేపల్లిమల్లారంలో మంత్రి సీతక్క ఎంపీ బలరాంనాయక్తో కలిసి శుక్రవారం పర్యటించారు. మల్లూరులోని కేసీఆర్కాలనీలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు ఆదేశాల మేరకు చుంచుపల్లి పీహెచ్సీ వైద్యాధికారి యమున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో నిత్యం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యులను ఆదేశించారు. అకినేపల్లిమల్లారంలో రూ.15 లక్షల ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకరతో కలిసి ప్రారంభించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ, సీసీ రోడ్లకు శంకుస్థాపన, మినరల్ వాటర్ ప్లాంట్, బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అకినేపల్లిమల్లారంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం, వికాస్ అగ్రీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వరి విత్తనాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ప్రారంబించారు. సుమారు 500 మంది గిరిజన రైతులకు విత్తన కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమి అభివృద్ధి చేశారో, ఎవరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోతు రవిచందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు జయరాంరెడ్డి, అధికారులు అజయ్కుమార్, నరేష్బాబు, బద్రు, చేరాలు, కృష్ణారావు, నాయకులు ఆక రాధాకృష్ణ, చంద్రపాటి శ్రీనివాస్, చౌళం వెంకటేశ్వర్లు, వెంగళ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రో జు శుక్రవారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశ మహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కపాలినిగా, షోఢశీక్రమాన్ని అనుసరించి భోగబేరాన్ని భగమాలినిగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. సినీ నటులు కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆల య ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
అర్హతకు మించి వైద్యం చేయొద్దు
మంగపేట: మండలంలోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, ప్రైవేట్గా వైద్యం నిర్వహించేవారు అర్హతకు మించి వైద్యం చేయొద్దని జిల్లా ఉప వైద్యాధికారి విపిన్కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీ సమావేశ మందిరంలో వైద్యాధికారి స్వప్నిత అధ్యక్షతన మండలంలోని ఆర్ఎంపీ, పీఎంపీ, ప్రైవేట్ ప్రాక్టీషనర్గా వైద్యం చేస్తున్న వారితో పాటు పీహెచ్సీ వైద్యసిబ్బందితో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ కొందరు అర్హతకు మించి వైద్యం చేస్తూ జ్వరంతో బాధపడే వారికి హయ్యర్ ఆంటీబయాటిక్స్ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరుకూడా అర్హతకు మించి వైద్యం చేయొద్దని, ఎక్కువ మోతాదు కలిగిన ఆంటీబయటిక్, స్టిరాయిడ్ మందులను వాడొద్దన్నారు. జ్వరంతో ఉన్నవారికి ఒక్క రోజుకు మించి వైద్యం చేయొద్దని, జ్వరం తగ్గకుండా ఉంటే పీహెచ్సీకి పంపించాలని సూచించారు. గర్భిణులు, రెండేళ్ల వయసు పిల్లలకు ఎలాంటి వైద్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రికి పంపించాలన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు సరిపడ మందులు, ల్యాబ్ రీజన్స్లను సమకూర్చుకోవాలని, లేదంటే జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని పీహెచ్సీ వైద్యాధికారిణికి సూచించారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పూర్ణ, సంపత్రావు, శారద, పీహెచ్సీ వైద్య సిబ్బంది, ఆర్ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్ -
జిల్లా ఉత్తమ ఎస్సైగా శ్రీకాంత్రెడ్డి
ఎస్ఎస్తాడ్వాయి: జిల్లా ఉత్తమ ఎస్సైగా ననిగంటి శ్రీకాంత్రెడ్డి ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ శబరీశ్ చేతుల మీదుగా గురువారం రెండోసారి ఉత్తమ ప్రశంస పత్రం అందుకున్నారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్రెడ్డి సమయపాలన, విధుల పట్ల అంకితభావంతో పనిచేసిన తీరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఆయన చూపిన ప్రతిభను గుర్తించి ఎస్పీ ఆయనకు ప్రశంస పత్రం అందజేశారు. ఈ ఏడాది మే నెలలో సైతం ఆయన ఉత్తమ ఎస్సైగా ప్రశంసపత్రం అందుకున్నారు. తనతో పాటు, పీఎస్ సిబ్బంది, ట్రైనీ ఎస్సైలు సతీష్, మధుకర్, సిబ్బంది సమష్టిగా పని చేయడంతోనే జిల్లా ఉత్తమ ఎస్సైగా ప్రశంస పత్రం అందుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి వివరించారు. ఎస్పీ శబరీశ్, డీఎస్పీ రవీందర్లకు ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
అందరి సహకారంతోనే..
ఈ సంవత్సరం పాఠశాలకు కొత్తగా 25 వరకు అడ్మిషన్లు వచ్చాయి. ఇందులో 16మంది అడ్మిషన్లు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు చెందినవి. ఉపాధ్యాయులందరి కృషితో ఇంగ్లిష్ మీడియంలో సమర్థవంతంగా బోధించడం ద్వారా ప్రతీ సంవత్సరం కూడా ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ అడ్మిషన్లు పొందుతున్నారు. డిజిటల్ తరగతులు, విద్యార్థులు ఇంగ్లిష్ మాట్లాడే విధంగా ప్రోత్సహించడం, గురుకుల, నవోదయ పరీక్షలకు కోచింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అభినందిస్తూ గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారి పిల్లలను ఈ పాఠశాలలో జాయిన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. – రాజశేఖర్, ప్రధానోపాధ్యాయుడు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు.. ప్రభుత్వ పాఠశాలలోనే ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా. ఇక్కడ చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ఇంగ్లిష్ మీడియంలో మెరుగైన విద్యను బోధిస్తున్నాం. ఐఎఫ్పీ ప్యానల్ ద్వారా డిజిటల్ క్లాస్లు నడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు 3వ తరగతి చదుతోంది. తమ చిన్నారులందరినీ బడిలో చేర్పించి రూ సర్కారు బడిలో చేర్పించి విద్యను బలోపేతం చేయగలరు. – పొడెం సమ్మయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయుడు● -
భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం
శాకంబరీ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలంకరణహన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం శోభాయమానంగా జరిగింది. కుడా చెర్మన్ ఇనుగాల వెంక్రటామిరెడ్డి, దేవాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సహస్ర కళశాభిషేకం మధ్యాహ్నం ప్రారంభమైంది. భద్రకాళి పంచమూర్తులకు, శ్రీచక్రానికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు. రాత్రి కామేశ్వరీనిత్యాక్రమంలో ఆవరణార్చనలు జరిపారు. భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. భద్రకాళి శరణంమమ అంటూ జయజయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషు భారతి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శుక్రవారం ఉదయం కపాలినీ క్రమంలో, సాయంత్రం భగమాలినిక్రమంలో పూజలు జరపనున్నారు. వైభవంగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం -
రుణమాఫీ ఫ్లెక్సీల ఏర్పాటు
ములుగు రూరల్: జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రుణమాఫీ నిధులను జమ చేసిందని, ఈమేరకు గురువారం పంచాయతీ కార్యాలయంలో రైతు రుణమాఫీ ఫ్లెక్సీలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఏఓ సురేశ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 26,454 మంది రైతులకు రూ.219 కోట్ల నిధులను జమ చేసినట్లు వివరించారు. లబ్ధిదారుల వివరాలను ఆయా పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. 108 అంబులెన్స్ తనిఖీ వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గురువారం 108 అంబులెన్స్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఆడిటింగ్ అధికారి కిశోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన 108కు చెందిన రికార్డులు, మందులు, మెడికల్ ఇండెంట్ స్టాక్ వివరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ రాజ్యలక్ష్మి, పైలెట్ రాధస్వామి తదితరులు ఉన్నారు. క్రెచ్ సెంటర్లపై స్పష్టత ఇవ్వాలని వినతి ములుగు రూరల్: క్రెచ్ సెంటర్లపై స్పస్టత ఇవ్వాలని, నిర్వహణ బాధ్యత అంగన్ వాడీ టీచర్లకు ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు గురువారం వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ సెంటర్లకు, టీచర్లకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ఐదేళ్లలోపు పిల్లలకు ఫ్రీ స్కూల్ చెబుతున్నారని తెలిపారు. అలాగే అంగన్వాడీ సెంటర్లలో మూడేళ్ల లోపు పల్లిలకు ఆలనాపాలనా పేరుతో క్రచ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వీటి ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మక్క, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, అలివేలు తదితరులు పాల్గొన్నారు. పంటరుణాలు ఇవ్వకపోవడం సరికాదుమంగపేట: మండల పరిధిలోని గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పూనెం నగేశ్ ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సంఘం అత్యవసర సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మండల పరిధిలోని కమలాపురం ఎస్బీఐ, మంగపేట యూనియన్ బ్యాంక్, మల్లూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, రాజుపేటలోని కెనరాబ్యాంక్ పరిధిలో గల గిరిజన రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్తే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై పంటరుణాలు ఇచ్చే విషయంలో ఉన్నతాధికారుల నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతూ బ్యాంకు అధికారులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంటల సాగు పెట్టుబడికి బ్యాంకుల్లో రుణాలు లభించక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు నిరుపేద గిరిజన రైతులు ఇప్పటికే వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి బ్యాంకు అధికారులతో మాట్లాడి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై రుణాలు ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పంట రుణాలు ఇచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసంఘం మండల నాయకులు కుర్సం చిరంజీవి, కోరం అంజయ్య, మద్దెల సమ్మయ్య, కుర్సం సంతోష్, మాడవి విజయ్కుమార్, బసవయ్య పాల్గొన్నారు. -
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
గోవిందరావుపేట: జిల్లాలో వరదలు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సిద్ధంగా ఉన్నాయని చల్వాయిలో గల 5వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసిస్టెంట్ కమాండెంట్ వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందం రామప్ప చెరువులో గురువారం మాక్డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు వచ్చి ముంపునకు గురయ్యే సమయంలో ఈ బృందాలు ప్రజలను కాపాడుతాయన్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టర్ పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఆర్ఐలు శోభన్బాబు, రాజ్కుమార్, ఆర్సీఐలు జీవన్, రఘుపతి, 70మంది సిబ్బంది పాల్గొన్నారు. 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం -
రాజీవ్ యువ వికాస పథకం అమలులో జాప్యం
ములుగు రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశపెట్టింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కానీ పథకం అమలు చేయడంలో జాప్యం చేస్తుంది. జూన్ 2వ తేదీన పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో హడావుడిగా నిరుద్యోగ యువత నుంచి అధికారులు దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్లో స్వీకరించారు. నిరుద్యోగులు వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు అందించారు. ఈ క్రమంలో ఎంపీడీఓలు లబ్ధిదారులకు బ్యాంకుల ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూలు నిర్వహించారు. యూనిట్లు త్వరలోనే మంజూరు అవుతాయని ఎదురుచూస్తున్న క్రమంలో ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడంతో యువత నిరాశకు గురువుతుంది.2,980 మంది దరఖాస్తులుజిల్లాలోని పది మండలాల్లో మొత్తం 2,980 మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్కు 608 మంది, ఎస్టీ కార్పొరేషన్కు 1200, మైనార్టీ కార్పొరేషన్కు 96, క్రిస్టియన్ మైనార్టీ 1, బీసీ కార్పొరేషన్కు 817, ఈబీసీ వెల్పేర్కు 67, వాషర్మ్యాన్ కార్పొరేషన్ సొసైటీకి 11, నాయీబ్రాహ్మణ కో ఆపరేటీవ్సొసైటీకి 3 దరఖాస్తులు అందాయి. అలాగే వడ్డెర కో ఆపరేటీవ్ సొసైటీకి 1, సగర కో ఆపరేటీవ్ సొసైటీకి 1, క్రిష్ణబాలాజీ కో ఆపరేటీవ్ సొసైటీకి 2, కమ్మరి శాలివాహన కో ఆపరేటీవ్ సొసైటీకి 7, విశ్వబ్రాహ్మణ కో ఆపరేటీవ్ సొసైటీకి 24, మేదర కో ఆపరేటీవ్ సొసైటీకి 2, టాడి సొసైటీకి 15, గంగపుత్ర కో ఆపరేటీవ్ సొసైటీకి 40, పెరిక సొసైటీకి 32, ముదిరాజ్ కో ఆపరేటీవ్ సొసైటీకి 21, మున్నురుకాపు కో ఆపరేటీవ్ సొసైటీకి 28, గొల్ల కురుమ కో ఆపరేటీవ్ సొసైటీకి 29 దరఖాస్తులను నిరుద్యోగులు అందించారు.ఉపాధి కల్పించాలి..ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. బీసీ కార్పొరేషన్ నుంచి రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నా. వెల్డింగ్ దుకాణం ఏర్పాటుకు రూ.4 లక్షల యూనిట్ ఎంపిక చేసుకున్నా. ప్రభుత్వం సబ్సిడీ రుణం అందిస్తే స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషించుకుంటాను. ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ మంజూరు పత్రాలను తక్షణమే అందించాలి.– బైకాని మహేందర్, శ్రీనగర్, మల్లంపల్లి మండలంతక్షణమే అమలు చేయాలి..డిగ్రీ వరకు చదువుకున్నాను. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. స్వయం ఉపాధి పథకంలో పెళ్లి డెకరేషన్ వేసేందుకు రూ. 4 లక్షల యూనిట్కు దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూకు హాజరయ్యాను. బ్యాంక్ సిబిల్ స్కోర్ పరిశీలించి అర్హత ఉందని గుర్తించారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నాను. రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేసి ఆదుకోవాలి.– బల్లూరి ప్రభాకర్, మదనపల్లియూనిట్ల విభజన ఇలా..రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని కేటగిరీల వారీగా విభజించి విడతల వారీగా యూనిట్లు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేటగిరి 1లో రూ.50 వేలు, కేటగిరి 2లో రూ.1లక్ష వరకు ఉన్న యూనిట్లను ఎంపిక చేసి మొదటి విడతలో అందించాలి. కేటగిరి 3లో రెండు లక్షలు, కేటగిరి 4లో రూ.4లక్షలు, కేటగిరి 5లో రూ.5లక్షల కంటే పైబడిన యూనిట్లను విభజించారు. -
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి
ములుగు రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేఖ దినోత్సవాన్ని పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సీతక్క హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో డ్రగ్స్ మహమ్మారి భూతంలా పట్టి పీడిస్తుందన్నారు. అక్రమార్కులు చాకెట్లు, బిస్కెట్ల రూపంలో మార్కెట్లో అమ్మకాలు చేపడుతూ సమాజాన్ని నాశనం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మత్తుకు అలవాటు అయిన యువత భవిష్యత్ నాశనం చేసుకోకూడదని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకుంటూ ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అని సూచించారు. యువత కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. యువతే దేశ భవిష్యత్కు పునాది అన్నారు. తల్లిదండ్రుల ఆశలను కొనసాగిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ డాక్టర్ శబరీశ్ మాట్లాడుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ పోరాడాలన్నారు. మత్తు పదార్థాల అమ్మకాలు, రవాణా, వినియోగంపై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందించడంతో పాటు వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. మత్తుకు అలవాటైన వారికి రియాబిలిటేషన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇప్పించి మార్చేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ప్రదర్శన చేపట్టారు. ఇంచర్ల గురుకుల పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలపై నాటికను ప్రదర్శించారు. అనంతరం తంగేడు స్టేడియం నుంచి డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, అదనపు ఎస్పీ సదానందం, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి తదితరులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
ఆదర్శ పాఠశాల
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఉపాధ్యాయులు ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాల అనగానే గతంలో కొంతమేర చిన్నచూపు ఉండేది.. కానీ రానురాను కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల(నార్త్)ను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీర్చిదిద్దారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాము అన్నట్లుగా తీర్చిదిద్దారు.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ బడికి ఏ విద్యార్థి రాకున్నా ఇంటికి వెళ్లి బండిమీద ఎక్కించుకొని బడిలో దింపుతాడు. ఇలా ఒకటి నుంచి 5వ తరగతి వరకు బడీడు పిల్లలను బడిలో తప్ప బయట ఎక్కడ కూడా కనిపించకుండా చేశారు. వారం వారం క్విజ్ పోటీలు మండల కేంద్రంలోని ప్రభుత్వ నార్త్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల మేధాశక్తి పెంచడానికి ప్రతీ వారం పాఠశాలలో క్విజ్ కార్యక్రమాలు, స్పెల్ బి పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తున్నారు. దానివల్ల వారిలో ఉన్న మేధాశక్తి పెంచడంతో పాటు చురుకుదనం, స్టేజ్ ఫియర్ పొయే అవకాశాలు ఉన్నాయి. పాఠశాలలో చేరిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఒకే రోజు 16మందికి అడ్మిషన్లు -
వ్యాధుల నియంత్రణకు కృషి
ములుగు రూరల్: క్షయ వ్యాధి నిర్మూలన, కీటక జనిత వ్యాధుల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ టిఎస్. దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ప్రతీ గ్రామంలో వనరబుల్ గ్రూప్స్ వ్యక్తులను గుర్తించి వారంలో రెండు రోజులు క్యాంపు మోడ్ మొబిలైజేషన్ ద్వారా ఆర్బీఎస్కే వాహనాలు తీసుకొచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏటూరునాగారం, ములుగు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఎక్స్రేతో పాటు సిబినాట్ పరీక్షలు చేయించాలన్నారు. క్షయవ్యాధి గ్రస్తులకు పోషకాహారం అందించే దిశగా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆశ కార్యకర్తలు ఫీవర్ సర్వే, డ్రై డే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, డీపీఓ దేవరాజ్ పాల్గొన్నారు. పర్యావరణ క్విజ్ పోటీలు నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీలు(ఎన్ఎస్పీసీ)–2025 కు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్ఎస్పీసీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలి, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ, వ్యర్థాలు వేరు చేసే అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. హరిత్–ధీవే ఆఫ్ లైఫ్ అనే థీమ్పై దేశ వ్యాప్తంగా పోటీని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పోటీలను కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖ సహాయ సహకారంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్విజ్ నిర్వహించనున్నట్లు వివరించారు. 1వ తరగతి నుంచి 5, 6, 8, 9వరకు, 12వ తరగత నుంచి డిగ్రీ, పీజీ పరిశోధన విద్యార్థులను ఐదు విభా గాలుగా విభజించవచ్చని వివరించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ సెల్ నంబర్లో 9912342270 సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కో ఆర్డినేటర్ మల్లారెడ్డి, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, ఈడీ రవి పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
బాలాజీ.. పీఎఫ్ బోలోజీ
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో జీతంలో కోత పెట్టింది. కానీ ఆ సొమ్మును పీఎఫ్ ఖాతాలో జమ చేయలేదు. మూడు నెలల పాటు జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ తప్పుకున్న తర్వాత సిస్కాన్ ప్రస్తుతం రెండు నెలలకు పైగా డ్రైవర్లను సమకూరుస్తోంది. ఈ రెండు సంస్థలు గత ఐదు నెలలకుపైగా పీఎఫ్ ఖాతాలు ప్రారంభించలేదని, కానీ, జీతాల్లో కోత పెడుతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు. ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పటివరకు ఐదు నెలల కాలానికి ఒక్కో డ్రైవర్నుంచి నెలకు రూ.3వేల చొప్పున కట్ చేశారు. 287మంది డ్రైవర్లు జేబీఎం బస్సులు నడుపుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ.8.61 లక్షలు వసూలు చేశారు. ఐదు నెలలకు 287మందినుంచి రూ.43.05లక్షలు కోత పెట్టారు. ఈ సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందని జేబీఎం డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు.. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. వీటిలో 19 సూపర్ లగ్జరీ, 18 డీలక్స్, 75 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. జేబీఎం సంస్థ నిర్వహణలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంది. వీటిని జనవరి 6న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. కన్సల్టెన్సీ ప్రతినిధి ఏమంటున్నారంటే.. ఈ విషయమై గతంలో శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ ప్రతినిధిగా, ప్రస్తుతం సిస్కాన్ బాధ్యుడిగా పని చేస్తున్న వేణుమాధవ్ను వివరణ కోరగా త్వరలో డ్రైవర్లకు పీఎఫ్ ఖాతాలు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో వసూలు చేసిన సొమ్మును తిరిగి డ్రైవర్లకు జీతాలతో కలిపి చెల్లించనున్నట్లు చెప్పారు.జీతాలు ఓకే.. పీఎఫ్, ఈఎస్ఐ కోతలు ఎక్కడికెళ్లాయి..? జేబీఎం సంస్థకు శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ డ్రైవర్లను సమకూర్చింది. మొదటి మూడు నెలలు డ్రైవర్లను అందించిన ఈ సంస్థ ఆ తరువాత తప్పుకుంది. ఈ స్థానంలో గత రెండు నెలలకు పైగా (జూన్తో 3 నెలలు) సిస్కాన్ డ్రైవర్లను సమకూరుస్తోంది. డ్రైవర్లను సమకూరుస్తున్నందుకు జేబీఎం.. ఆ సంస్థలకు చెల్లింపులు చేస్తోంది. శ్రీ బాలాజీ మూడు నెలలపాటు డ్రైవర్లకు జీతాలు చెల్లించింది. ఈ క్రమంలో పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో నెలకు రూ.3 వేల చొప్పున జీతంలో కోత పెట్టిందని జేబీఎం డ్రైవర్లు తెలిపారు. గత రెండు నెలలు జీతం చెల్లించిన సిస్కాన్ కూడా నెలకు రూ.3 వేల చొప్పున కోత పెట్టిందని డ్రైవర్లు చెప్పారు. ఈ లెక్కన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ 287 మంది డ్రైవర్ల నుంచి మూడు నెలలకుగాను రూ.25.83 లక్షలు వసూలు చేసింది. అదే విధంగా సిస్కాన్ రెండు నెలలకు రూ.17.22లక్షలు వసూలు చేసిందని డ్రైవర్లు వివరించారు. అయినా ఐదు నెలలకుపైగా తమకు పీఎఫ్ ఖాతాలు ప్రారంభించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వద్ద వసూలు చేసిన సొమ్ము ఏమైందని ప్రశ్నిస్తున్నారు. వసూలు చేసిన సొమ్మును పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా... నేరుగా తమకే తిరిగి చెల్లిస్తారా అని నిలదీస్తున్నారు. తమ జీతంలో కోత పెట్టి వసూలు చేసిన సొమ్మును కన్సల్టెన్సీ సంస్థలు సొంతానికి వాడుకుంటే ఊరుకునేది లేదని జేబీఎం డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల పీఎఫ్ సొమ్ము కాజేస్తున్న కన్సల్టెన్సీలు.. మొదటి మూడు నెలలు జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ ఆ తరువాత తప్పుకుని సిస్కాన్కు అప్పగింత 287మంది డ్రైవర్ల వద్ద పీఎఫ్ కోసం రూ.3 వేల చొప్పున కోత ఐదు నెలలైనా పీఎఫ్ ఖాతాలు ప్రారంభించని శ్రీ బాలాజీ, సిస్కాన్ తమ సొమ్ము కాజేతపై ఆందోళన చెందుతున్న డ్రైవర్లు -
పకడ్బందీగా ‘అభయ మిత్ర భరోసా’
ఏటూరునాగారం: దేశంలో యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటుందని పలు సర్వేల్లో తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కువగా పొగాకు వంటి పదార్థాలకు బానిసలై కేన్సర్ బారిన పడుతున్నారు. ఇదే కాకుండా మత్తులో ఉండి ప్రాణాంతకమైన చర్యలకు పాల్పడుతూ యువత నిండు నూరేళ్ల జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే జి ల్లాలోని యువత డ్రగ్స్కు బానిసలు కావొద్దని పోలీ సుశాఖ పిలుపు నిచ్చింది. ఈ మేరకు జిల్లాలో స్పెష ల్ డ్రైవ్స్ చేపట్టారు. ఎస్పీ శబరీశ్ పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు మండలాల వారీగా మత్తు పదార్థాలపై అవగాహన సదస్సులతో పాటు వ్యాసరచన పోటీలు, యువతకు ప్రత్యేకమైన దిశా నిర్ధేశాలు చేశారు. వారిలో చైతన్యం నింపడానికి క్షేత్రస్థాయిలో పోలీసులు పర్యటనలు చేస్తున్నారు. గుట్కాలు నిషేధం జిల్లాలో విద్యాలయాలకు సంస్థల ఆవరణలకు వంద గజాల వరకు సిగరేట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులను పోలీసులు నిషేధించారు. విరుద్దంగా పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే 2003 చట్టం ప్రకారం జువైనెల్ జస్టిస్(కేర్ ఆండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ 2015 ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీస్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కువగా మద్యం, సిగరెట్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రకటనలు చేయడంతో పాటు సమీపంలోని షాపులకు నోటీసులను జారీ చేసి ఖాళీ చేయించే పనిలో పడ్డారు. అంతే కాకుండా నూతనంగా క్యూఆర్ కోడ్లతో పలు సోషల్ మీడియా యాప్స్ను లింక్ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి డ్రగ్స్ రాకెట్ ఉందని, ఎక్కడ విక్రయాలు జరుగుతున్నాయనే విషయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలోని యువతను పోలీసులు అప్రమత్తం చేసే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను రూపొందించింది. వాటిని జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నారు. ముగింపు వేడుకలు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంతో పాటు ర్యాలీ నిర్వహించనున్నారు. దీనిద్వారా ప్రజలు, యువత, విద్యార్థుల్లో డ్రగ్స్తో కలిగే నష్టాలు, భావితరాలతో భవిష్యత్ ఏ విధంగా క్షీణించిపోతుందని వివరించనున్నారు. నేటితో ముగియనున్న వారోత్సవాలు ఊరువాడ ఏకం చేసిన పోలీసులు -
ఇందిరాగాంధీ నియంతృత్వానికి యాభై ఏళ్లు
ములుగు రూరల్: ఇందిరా గాంధీ నియంతృత్వానికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడికి 50 ఏళ్లు’ సెమినార్కు నిర్వహించగా ఖమ్మం ఎంపీ తాండ్ర వినోద్రావు, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి భారత ప్రజాస్వామ్యంపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, శ్యామ్ప్రసాద్, భూక్య జవహర్లాల్, రాజునాయక్, రవీందర్రెడ్డి, రమణారెడ్డి, రవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
15 మంది విద్యార్థులకు అడ్మిషన్
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ నార్త్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు 15 మంది బుధవారం అడ్మిషన్లు పొందారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు పోతు రాజశేఖర్ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా నార్త్ పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్య బోధిస్తున్నారని, విషయం తెలుసుకొని పిల్లలను చేర్పించినట్లు చెప్పారు. ప్రధాన రహదారి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో బడి ఉన్నప్పటికీ ఆటో అద్దెకు మాట్లాడుకుని బడికి పంపించడం అభినందనీయమన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడం గమనార్హం. కార్యక్రమంలో రమాదేవి, వరలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
వెంకటాపురం(కె): విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జీసీడీవో జి.రమాదేవి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, టీచర్స్ ఇయర్ ప్లాన్ను విద్యార్ధుల తరగతి గదులను పరిసరాలను పరిశీలిచారు. ఆనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్తులకు మెరుగైన విద్యను అందిచాలని, విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శిరీష తదితరులు ఉన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య బోధించాలి కన్నాయిగూడెం: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, మెనూ ప్రకారం భోజనం అందించాలని జీసీడీఓ రమాదేవి అన్నారు. మండల పరిధిలోని ముప్పనపల్లి వద్ద ఉన్న కేజీబీవీని జీసీడీఓ రమాదేవి ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న ఆహర పదార్ధాలను క్షణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో వారికి అందిస్తున్న విద్యా బోధన, మెనూ ప్రకారం అందిస్తున్నారా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమాదేవి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. పాఠశాల ప్రత్యేక అధికారి అశ్విణికి సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. జీసీడీఓ రమాదేవి -
మార్పు వచ్చింది..
సాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే.. గడిచిన విద్యాసంవత్సరంలో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరు అంశాల్లో 74 సూచికలకు 600 మార్కులు కేటాయించారు. ప్రతీ పాఠశాల నుంచి యూడైస్లో పొందుపర్చిన అంశాలను పరిశీలించి, సేకరించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో జిల్లాల వారీగా మార్కులు కేటాయించారు. ఆరు అంశాలుగా పరిశీలన.. ప్రభుత్వ పాఠశాల పనితీరుకు అద్దం పట్టే ప్రధాన అంశాలను పరిశీలించారు. ఇందులో ఆరు అంశాల్లో 74 సూచికలను పేర్కొని మార్కులు వేశారు. మొదటి అంశంగా.. అభ్యసన ఫలితాలు, సామర్థ్యాలు, సంబంధాలు, ఉపాధ్యాయుల లక్ష్యాలు, నైపుణ్యాలు, రెండో అంశం.. బోధన నిర్వహణ, పిల్లల ప్రతిస్పందన, మూడో అంశం.. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను పరిశీలించారు. అలాగే పాఠశాలల భద్రత, పిల్లల రక్షణ, డిజిటల్ లర్నింగ్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, పాఠశాలల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాలను పరిశీలించారు. మొదటి రెండు అంశాల్లో గతం కంటే మెరుగైన మార్కులు సాధించగా.. మౌలిక వసతుల కల్పన, డిజిటల్ లర్నింగ్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 విద్యా సంవత్సరంలో వెనకబడినట్లు తేలింది. అయితే గత విదా సంవత్సరం 2024–25లో మాత్రం అన్ని అంశాల్లో మెరుగుపడ్డామని, ఇందుకు ఈ ఏడాది పదో తరగతిలో సాధించిన ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతం కన్నా మెరుగు.. ఆరు అంశాల్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగు పడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా అభ్యసన ఫలితాలు, సమన్వయం, ఉపాధ్యాయుల పనితీరుపై మొత్తం 24 సూచికలకు 290 మార్కులు కేటాయించగా 2022–23 సంవత్సరంలో హనుమకొండ జిల్లా 109 మార్కులు సాధించింది. అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాకు 79 మార్కులు వచ్చాయి. అయితే 2023–24లో హనుమకొండ జిల్లాకు 122 మార్కులు రాగా మహబూబాబాద్కు 95 మార్కులొచ్చాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై 12 సూచికల్లో 51 మార్కులకు 2022–23లో మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు 29 మార్కుల చొప్పున వచ్చాయి. అదే మరుసటి సంవత్సరం హనుమకొండకు 29 మార్కులు రాగా మహబూబాబాద్ జిల్లాకు 27 మార్కులు వచ్చాయి. పాఠశాలల్లో పిల్ల ల భద్రతపై 31 మార్కులకు జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాలకు 10 మార్కులకు పైగా రాగా మిగిలిన జిల్లాల్లో తక్కువగా వచ్చాయి.జిల్లాల వారీగా ఆరు అంశాల్లో సాధించిన మార్కుల వివరాలు జిల్లా మొత్తం 2022–23 2023–24 మార్కులు వరంగల్ 600 226 245 హనుమకొండ 600 250 275 మహబూబాబాద్ 600 210 229 జనగామ 600 235 271 భూపాలపల్లి 600 220 253 ములుగు 600 214 231ప్రభుత్వ పాఠశాలలపై ఆరు అంశాలతో పీజీఐ సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 కన్నా 2023–24 మెరుగ్గా ఫలితాలు శుభ సూచికం అంటున్న విద్యావేత్తలు -
రైతులతో సీఎం ముఖాముఖి
గోవిందరావుపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో రైతులతో సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం రైతు భరోసా సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోవిందరావుపేట మండల రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్, మండల ప్రత్యేక అధికారి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలి
ఏటూరునాగారం: డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఏఎస్పీ కార్యాలయంలో డ్రగ్స్ నియంత్రణపై పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ములుగును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా యువతను, ప్రజలను మమేకం చేస్తూ మత్తు, మాదక ద్రవ్యాలపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
గాజర్ల కుటుంబానికి నకిరేకల్ ఎమ్మెల్యే పరామర్శ
టేకుమట్ల: మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్, ఏవైఎస్, దళిత సంఘాల నాయకులు కూడా పరామర్శించారు. పరామర్శించిన వారిలో అరకొండ రాజయ్య, తిరుమలేష్, ఎలకటి రాజయ్య, సాంబయ్య, రాములు, కిరణ్, కుమార్, రమేష్, భద్రయ్య, ప్రకాశ్, క్రాంతి ఉన్నారు. -
‘తల్లి పేరుతో మొక్క నాటండి’
ములుగు రూరల్: డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవాన్ని పరస్కరించుకుని జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు మంగళవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో తల్లి పేరుతో మొక్కను నాటండి కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు మాధవి, రమ, జయ, సుభద్ర, తిరుమల, బీజేపీ నాయకులు రాజ్కుమార్, కుమార్, రవిరెడ్డి, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
ములుగు రూరల్: ఎస్ఎస్జీ సర్వేకు సంబంధించి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందేందుకు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు వందశాతం మరుగుదొడ్లు వినియోగించుకునేలా కృషి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ముందుగా స్వచ్ఛ సర్వేక్షన్ –2025 వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్ఎస్జీలో 1000 మార్కులకు 540 మార్కులు సాధించడానికి ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు మరుగుదొడ్ల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. గ్రామాలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజలు సంచరించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంకుడుగుంతల ఏర్పాటు పై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఎస్ఎస్జీ –2025 సర్వేతో జిల్లాకు ర్యాకింగ్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి అవార్డు పొందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, డిప్యూటీ సీఈఓ రాజు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర ప్రత్యేక టూర్ పోస్టర్ను వరంగల్ –2 డిపో మేనేజర్ జ్యోత్స్నతో కలిసి కలెక్టరేట్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూట్ –1లో రామప్ప, బొగత జలపాతం, మల్లూరును ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్లి సందర్శించేందుకు ఒక్కొక్కరికి రూ.530, రూట్ –2 ప్రసిద్ధి శివక్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట సందర్శనకు ఒక్కొక్కరికి రూ.2,300లతో రెండు రోజులు భక్తుల సౌకర్యాలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 27వ తేదీన హనుమకొండ నుంచి పంచరామాల యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ అధికారి రాజ్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమృద్ధిగా ఎరువుల అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. 1.25లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటసాగు విస్తీర్ణం లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కారం చూపాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలోని 9మండలాల్లో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి మొదటి విడతలో 754, రెండో విడతలో 3,827 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 400 మంది లబ్ధిదారులకు రూ.1లక్ష చొప్పున ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టినట్లు వివరించారు. పారిశుద్ధ్య నివారణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, డీఏఓ సురేష్, డీసీఎస్ఓ ఫైజల్ హుస్సేనీ, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీఎంహెచ్ఓ గోపాల్రావు, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్ దివాకర -
ములుగు మున్సిపాలిటీ కమిషనర్గా సంపత్
ములుగు రూరల్: ములుగు మున్సిపాలిటీ కమిషనర్గా జె.సంపత్ మంగళ వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి టీకె.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మున్సిపల్ కమిషన్ కార్యాలయంలో సానిటరీ ఇన్ స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సంపత్ను పదోన్నతిపై ములుగు మున్సిపాలిటీ కమిషనర్ గ్రేడ్ –3 ఆఫీసర్గా బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. రైతుల ఖాతాల్లో రూ.96.63 కోట్లు జమ ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులను ఇటీవల విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలోని 78,347 మంది రైతులకు గాను రూ.96.63 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు భరోసా నిధులను పంటలకు అవసరమ య్యే విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. చిరు జల్లులకే చిత్తడైన రహదారి వాజేడు: మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో చిరు జల్లులకే ప్రధాన రహదారి చి త్తడిగా మారింది. వాజేడు నుంచి భద్రాచలం వెళ్లడానికి ఇది ప్రధాన రహదారి. ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటా యి. జగన్నాథపురం ఊరు మధ్యలో రహదారి గుంతలు పడి వర్షం నీరు నిలిచింది. నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో రహదారిపై నీరు నిలిచిందని గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షాలు పడితే రహదారిపై ఇంకా గుంతలు పడే ప్రమాదం ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టి వర్షం నీరు నిల్వకుండా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. తీర్థయాత్రలకు రైల్వే సేవలు వినియోగించుకోవాలి ములుగు రూరల్ : తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని ఐఆర్టీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 05 నుంచి జూలై 13వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఉజ్జయిని (మహకాళేశ్వర్–ఓంకారేశ్వర్), త్రయంబకేశ్వర్–భీమశంకర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ యాత్రలో ఎల్లోరా, మోవ్, నాగ్పూర్ ప్రాంతాలను సందర్శించొచ్చని వివరించారు. సాధారణ టికెట్ ధర రూ. 14,700, 3–ఏసీ రూ.22,900, 2–ఏసీ రూ. 29,900 ఉంటుందని తెలిపారు. ఈ యాత్ర రైలు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, ముద్ఖడ్, పూర్ణ మీదుగా వెళ్తుందని తెలిపారు. టికెట్ బుక్ చేసుకునే వారు సెల్ 9701360701, 9281495843,9281030750, 9281030749 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కేటీకే 1వ గనిలో సమస్యలు పరిష్కరించాలిభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. కేటీకే 1వ గనిలో ఫిట్ సెక్రటరీ సదయ్య ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన గేట్ మీటింగ్కు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాన్రైడింగ్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల కాప్లైట్స్, ఎక్స్ప్లోడర్స్, ఫిల్టర్ బెడ్ రిపేర్, తాగునీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. బైక్ పార్కింగ్ షెడ్స్లలో సిమెంట్ రేకులు తొలగించి ఐరన్ రేకులు ఏర్పాటు చేయాలన్నారు. 3సీమ్లో ఖాళీ టబ్బులు సరిపడా పెంచాలని, మాన్వేలో వర్షం వల్ల స్లాపు పగుళ్లు ఏర్పడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రిపేర్ చేయాలని కోరారు. కేటీకే ఓసీ 2 నుంచి కేటీకే 1వ గని వరకు వీధి దీపాలు ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సమస్యలపై గని మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సదయ్య, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
‘బీసీ కుల జనగణన చేపట్టాలి’
ములుగు రూరల్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తక్షణమే బీసీ కుల జనగణన చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రావ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బీసీ సాధన సమితి మహాసభలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వారు చేసిన జన కులగణన తప్పా స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఏ ప్రభుత్వం బీసీ కులజన గణన చేపట్టలేదన్నారు. నూటికి 60 శాతంగా ఉన్న బీసీలకు ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ అమలు చేయటం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, బండి నర్సయ్య, జక్కుల ఐలయ్య, కొక్కుల రాజేందర్, జంపాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్పై దాడి
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలోని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్పై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈఘటనపై అటు కాంట్రాక్ట్ యాజమాన్యం, ఇటు ఆస్పత్రి అధికారులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స కోసం వచ్చిన ఓ యువకుడు అత్యవసర విభాగంలో రక్తం మరకలు తుడుస్తున్న ఓ స్వీపర్పై అసభ్య పదజాలంతో దూషించడంతో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో అక్కడున్న ఓ వార్డు బాయ్ వచ్చి సదరు వ్యక్తిని సముదాయించి పంపించేశాడు. సదరు యువకుడు మళ్లీ తిరిగి వచ్చి విధుల్లో ఉన్న పీఆర్ఓకు ఫోన్ చేయించి సెక్యూరిటీ సిబ్బందిని మరోసారి దుర్భాషలాడాడు. ఈఘటనలో అక్కడికి చేరుకున్న పీఆర్ఓ ‘అతను ఓ వీఐపీ.. అతడితో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు పోతాయ్’ అని సెక్యూరిటీ గార్డు, స్వీపర్లపై రుసరుసలాడాడు. బెదిరించి దాడి చేసిన సదరు యువకుడికి దగ్గరుండి చికిత్స అందించి పంపించారు. కాగా, ఈఘటనతో ఖంగుతిన్న సెక్యూరిటీ గార్డులు మంగళవారం ఉదయం తమ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టర్.. ఎంజీఎం పరిపాలనాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎంజీఎం పరిపాలనాధికారులు చెప్పడం కొసమెరుపు. మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయని ఎంజీఎం అధికారులు ఎవరు ఆ వీఐపీ?మద్యం మత్తులో వచ్చి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి పీఆర్ఓకు ఫోన్ చేయించి చికిత్స పొందిన ఆ వీఐపీ ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దాడికి గురైన మహేశ్ అనే సెక్యూరిటీ గార్డు ఎంజీఎంలో వైద్యుల వద్ద చికిత్స పొందాడు. ఇంత జరిగినా ఆ వీఐపీ రోగిపై చర్యలు తీసుకునేందుకు సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయకపోవడం, ఎంజీఎం పరిపాలనాధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని దాటవేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఏదైనా పెద్ద ఘటన జరిగితే తమ పరిస్థితి ఏంటని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
ములుగు రూరల్: పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ హెడ్ క్వాటర్స్లో డ్యూటీమీట్ను ప్రారంభించి మాట్లాడారు. అధికారులు, సిబ్బంది నైపుణ్య అభివృద్ధి, ప్రదర్శనకు సరైన వేదిక డ్యూటీ మీట్ అన్నారు. నేర పరిశోధన, నేర స్థల పరిశోధన, ఫొటోగ్రఫీ, వీఐపీ మూమెంట్, డాగ్ స్క్వాడ్ పనితనం, ఫింగర్ ప్రింట్ తీసే విధానం, బాంబు డిస్పోజల్, వీడియోగ్రఫీ ద్వారా నేరస్తులను కనుగొనుట, కంప్యూటర్ పరిజ్ఞానం, అంశాలపై రాత పరీక్ష, మౌకిక పరీక్షలు ఉంటాయని వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రివార్డులు సాధించాలని తెలిపారు. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లకు కొన్ని అంశాలు, ఏఎస్సై, కానిస్టేబుళ్లకు కొన్ని అంశాలపై పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేరం జరిగిన పద్ధతులను పరిశోధనను విధులకు అనుకూలంగా మార్చుకోవాలన్నారు. సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను, అనుభవం ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐలు సురేశ్ కుమార్, రవీందర్, రిజర్వు ఇన్స్పెక్టర్లు స్వామి, సంతోష్కుమార్, తిరుపతి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఫింగర్ ప్రింట్, డీసీఆర్బీ, బీడీ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు రూరల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఎదుగుదలకు గొడ్డలిపెట్టు లాంటిదని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాల సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 112కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఇన్చార్జ్ డిడబ్ల్యూఓ తుల రవి, వైద్యారోగ్యశాఖ, యాంటి నార్కోటిక్ విభాగం అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వైద్యకళాశాలను కలెక్టర్ దివాకర సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత విద్యాసంవత్సరంలో అందుతున్న వసతులు, వచ్చే విద్యా సంవత్సరంలో కావాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. కళాశాల ప్రహరీకి ఔషధ గిడ్డంగులను, సీసీ రోడ్డు కొరకు స్థలాన్ని పరిశీలించారు. ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ వరకు రెండేళ్లు కావాల్సిన అనుమతి కోసం, సదుపాయాలపై టీజీఎంఐడీసీ ఇంజనీర్లతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ లాల్, డీసీహెచ్ఎస్ జగదీశ్వర్, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, నరేందర్ రెడ్డి, డీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
పింఛన్ ఇప్పించండి.. ఐదు సంవత్సరాల క్రితం పెరాలసిస్తో కాలు, చేయి పడిపోయింది. అప్పటి నుంచి భార్య కూలీ పనులు చేసి సాదుతుంది. పింఛన్ కోసం ఐదు సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నా పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. – సమ్మయ్య, సర్వాపూర్, ములుగు మండలం నిరుపేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించొద్దు ములుగు మండలం మదనపల్లి గ్రామంలో 49 నిరుపేద కుటుంబాలకు గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం 75 గజాల చొప్పున కేటాయించి పట్టాలు అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇంటి పట్టాలను రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కేటాయిస్తుందని తెలుస్తుంది. నిరుపేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయొద్దు. – పసుల ప్రభాకర్, మదనపల్లి గిరిజన మహిళల సమస్యలు తెలుసుకుంటున్న పీఓ చిత్రామిశ్రా గ్రీవెన్స్లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ దివాకర ●పోడు పట్టాలు ఇవ్వాలి ఏటూరునాగారం మండలంలోని ఆకులవారిఘణపురం పరిధిలో ఉన్న రైతులు 2006 నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి పోడు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వాలు మారుతున్నా పోడు పట్టాలు మాత్రం రావడం లేదు. రెవెన్యూ, ఐటీడీఏ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని 15 మంది రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశాం. – ఆలం రమేష్, రైతు, ఏటూరునాగారం ప్రజావాణిలో వచ్చిన వినతుల వివరాలు.. భూ సమస్యలు 23 గృహ నిర్మాణశాఖ 15 ఉపాధి కల్పన 01 పింఛన్లు 02 ఇతర సమస్యలు 15 -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
వెంకటాపురం(ఎం): జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు జాతీయ క్వాలిటీ సర్టిఫికెట్ పొందడంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని డీఎంహెచ్ఓ గోపాల్రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని నల్లగుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆయన సోమవారం సందర్శించారు. రిజిస్టర్, మందుల నిల్వలు, ఐఈసీ మెటీరియల్, మందిర్ ప్రాంతంలో నాటిన హెర్బల్ మొక్కలను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. జిల్లాలో 9 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో క్వాలిటీ కంట్రోల్ వర్చువల్ అసెస్మెంట్ కార్యక్రమాలు నిర్వహించగా 7 కేంద్రాలు క్వాలిటీ సర్టిఫికెట్ సాధించాయన్నారు. మిగిలిన రెండు కేంద్రాలు సైతం క్వాలిటీ సర్టిఫికెట్లు పొందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో నీటినిల్వలు లేకుండా చూడాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వారంలో ఒక ఇంటిని రెండుసార్లు సందర్శించాలన్నారు. జ్వరం వచ్చిన ప్రతీ వ్యక్తికి పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని సూచించారు. అవసరమైన గ్రామాలలో వైద్యశిబిరాలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీకాంత్, వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రాం అధికారి రణధీర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల వైద్యులు పార్వతి, అనిత, సంఘమిత్ర, శ్రీనివాస్, డెమో సంపత్, సీహెచ్ఓ సంపత్రావు, డీపీఎం సంజీవరావు, సాంబయ్య, క్వాలిటీ మేనేజర్ శరత్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ములుగు రూరల్: లేబర్ కోడ్లను రద్దు చేయాలని జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా వచ్చే నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆశ కార్యకర్తలతో కలిసి కలెక్టర్ టీఎస్.దివాకర, పంచాయతీ కార్మికులతో కలిసి డీపీఓ దేవరాజుకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చి న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు. ఐసీడీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ స్కీములను ప్రభుత్వ శాఖలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహచారి, నీలాదేవి, చంచు మంజూల, శ్రీను తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
కాటారం: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి అన్నారు. నషాముక్త్త్ భారత్ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో సామూహికంగా మొక్కలు నాటారు. నషాముక్త్ భారత్ లక్ష్యాలపై సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు మత్తుపదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై వివరించారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, కేజీబీవీ ప్రిన్సిపల్ చల్ల సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి -
పొగాకు ఉత్పత్తులు విక్రయించొద్దు
ములుగు రూరల్: విద్యా సంస్థల పరిధిలో 100 గజాల వరకు పొగాకు ఉత్పత్తులు సిగరేట్, గుట్కా, తంబాకు వంటివి విక్రయించొద్దని ఎస్పీ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిగరేట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం–2003, జువైనెల్ జస్టిస్ యాక్ట్–2015 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా యువత, ప్రజలు పాటుపడాలని సూచించారు. సీఎంతో ముఖాముఖిలో పాల్గొనాలి ములుగు రూరల్: రైతు భరోసా లబ్ధిదారులతో సీఎం రేవంత్రెడ్డితో నేడు(మంగళవారం) ముఖాముఖి చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని వివరించారు. రైతులు అందుబాటులో ఉన్న రైతు వేదికల్లో సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లలోనే ఉంటున్నారు’ వాజేడు: గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లల్లోనే దివ్యాంగులు ఉంటున్నట్లు ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు తెలిపారు. మండల పరిధిలోని చీకుపల్లి గ్రామనికి చెందిన ముగ్గురు దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరూ.. శీర్షికతో సోమవారం సాక్షిలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆయన దివ్యాంగులు పొడెం విజయ తమ తండ్రికి వచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటుండగా, గొంది పాపారావు, గొంది సుజాతలు తమ సోదరులకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్లల్లోనే వారితోనే కలిసి ఉంటున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు సర్వే సమయంలోనూ వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఆ ముగ్గురు దివ్యాంగులకు పెళ్లిళ్లు కాలేదని వారు ఒంటరి వారని వివరించారు. మావోయిస్టులకు సహకరించొద్దు పలిమెల: మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని పలిమెల ఎస్సై రమేష్ సూచించారు. మండలంలోని అయా గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ (మావోయిస్టు) దళాలు జిల్లాలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మావోయిస్టు సాయుధ దళాలు, దళ సభ్యులు, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఆదివాసీ గుంపుల దగ్గరలో సంచరించినట్లయితే వెంటనే డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చి తగిన పారితోషకం పొందాలని పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘనంగా ఒలింపిక్ డేభూపాలపల్లి అర్బన్: ఒలింపిక్ డేను పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో రన్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఒలింపిక్ టార్చ్తో రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, డీపీఓ వీరభద్రయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికిరణ్, సీఐ నరేష్, ఎస్ఐ సాంబమూర్తి, క్రీడాసంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాలని వేడుకోలు..
మంగపేట: భర్త అనారోగ్యంతో మరణించగా ఇద్దరు కూతుళ్లతో ఉన్న తనకు అండగా నిలవాల్సిన బంధువులు, ఓ బీఆర్ఎస్ నాయకుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ మహిళ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.. న్యాయం కోసం అధికారుల ఆశ్రయిస్తే తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విలేకర్లకు బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన కోరుకొప్పుల సత్యం, రాణి దంపతులు నివాసం ఉంటున్నారు.. ఈ క్రమంలో భర్త అనారోగ్యానికి గురై మృతువాత పడ్డాడు.. ఈ క్రమంలో ఉమ్మడి కుటుంబంలోని తన వాటాకు రావాల్సిన భూమిని తాను ఇంటివద్ద లేని సమయంలో చిన్న పిల్లలైన కూతుళ్లను బెదిరించి సంతకాలు పెట్టించి అమ్మారని వాపోయింది. అంతేకాకుండా తన భర్త వైద్యం కోసం దాతలు అందించిన రూ.10 లక్షల్లో నుంచి రూ.6 లక్షల నగదును వారే తీసుకున్నారని ఆరోపించింది. న్యాయం కోసం తాను ఎస్పీ, సీఐ, ఎస్సై, తహసీల్దార్ను ఆశ్రయించానని వివరించింది. స్పందించిన అధికారులు తమ భూమిని తమకు ఇవ్వాలని సూచించడంతో తమపై ఫిర్యాదు చేస్తారా అనే కోపంతో అంతుచూస్తామంటూ కమలాపురంకు చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడి అండతో తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని వాపోయింది. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది. -
పంట రుణాలను రెన్యూవల్ చేయాలి
ములుగు రూరల్: రైతులు తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. జిల్లాలో 30 శాతం మంది రైతులకు మాత్రమే పట్టాలు ఉన్నాయన్నారు. గతంలో మాదిరిగా పహాణీ నకల్ ఆధారంగా రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంకిడి కృష్ణయ్య, భిక్షపతి, ఐలయ్య, అబ్ధుల్, నబి, శాంతమ్మ, నారాయణ, లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు.రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్పాషా -
గ్రీవెన్స్కు 56, గిరిజన దర్బార్కు 27 అర్జీలు
ములుగురూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరు తూ వివిధ సమస్యలపై 83 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్.దివాకర, ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో 56 ఫిర్యాదులు రాగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 27 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆ యా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. పరిశీ లించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజన దర్బార్కు వచ్చిన వినతులు కన్నాయిగూడెం మండలం కంతనపల్లి సీఎంఏ 2013లో వచ్చిన జడ్జిమెంట్ కాపీని సర్టిఫై చేసి ఇవ్వాలని కోరారు. గోవిందరావుపేట మండలం మొద్దలగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ఏజెన్సీ సర్టిఫికెట్ కావాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లిలో భూ భారతి సదస్సు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించాలని గిరిజనులు పీఓకు విన్నవించారు. మహబూబాబాద్ మండలం గంగారం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగుడు ఉద్యోగం ఇప్పించాలని పీఓను కోరారు. పోడు పట్టాలు ఇప్పించాలని గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ప్రాంతంలో ఉన్న గిరిజనులు 2006 నుంచి పోడు చేసుకుంటున్నామని, తమకు పట్టాలు ఇప్పించాలని కోరారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు కోరారు. ఏటూరునాగారం మండలం వీరాపురం ప్రాంతానికి చెందిన నిరుద్యోగురాలు ఉద్యోగ అవకాశం ఇప్పించాలని కోరారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం కామారంలోని హర్టికల్చర్ భూములకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు పీఓను కోరారు. కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లికి చెందిన గిరిజనుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలో భూమి బోరు నిర్మించుటకు అనుమతి ఇవ్వాలని పీఓకు మొరపెట్టుకున్నారు. మహాముత్తారం గ్రామంలోని నల్లగుంట, మీనాజీపేట గ్రామస్తులు గిరివికాసం పథకాలు అందడం లేదని పీఓకు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన వినతుల వివరాలు.. భూ సమస్యలు 23 గృహ నిర్మాణశాఖ 15 ఉపాధి కల్పన 01 పింఛన్లు 02 ఇతర సమస్యలు 15 స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలుఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమి ఆన్లైన్ చేయాలి 3.30 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమి ఆన్లైన్లో లేదు. దీంతో బ్యాంక్లు క్రాప్ లోన్లు ఇవ్వడం లేదు. పెట్టుబడి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు ఇలాంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆన్లైన్ చేయాలి. – కాపుల సమ్మయ్య, రైతు, అల్లంవారిఘణపురం -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
వెంకటాపురం(కె): విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో అభయ మిత్ర కార్యక్రమంపై విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ను తరిమి కోడదాం, యువతను కాపాడుకుందామని వివరించారు. విద్యార్థులకు డ్రగ్స్పై, పొక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతి రావు, ట్రైనీ ఎస్సై తిరుపతి రెడ్డి. మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ఉపాధ్యాయులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
హేమాచల క్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై నెలకొన్న హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ గా తరలివచ్చారు. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజ మండ్రి, విశాఖ పట్టణం తదితర సుదూర ప్రాంతా ల నుంచి కార్లు, ఆటోలు, డీసీఎం, ప్రైవేట్ వాహనాల్లో ఉదయాన్నే భక్తులు గుట్టపైకి చేరకున్నారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని పూలు పండ్లు, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. నాభిచందన ప్రసాదం సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా మారింది.లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు -
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరూ..!
వాజేడు: వారంతా దివ్యాంగులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో వారి పేర్లు ఉన్నాయి. కాని మంజూరు లీస్టులో పేర్లు లేకపోవడంతో వారికి ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. తమకు కూడా ఇళ్లు ఇప్పించాలని పలువురు దివ్యాంగులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని చీకుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు గొంది సుజాత. ఇల్లు లేకపోవడంతో కోడళ్ల వద్ద ఉంటూ కాలం వెళ్లదీస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చినప్పటికీ ఈమెకు మంజూరు పత్రం రాలేదు. అధికారులు స్పందించి తన సమస్య పరిష్కరించాలని వేడుకుంటోంది. చీకుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు గొంది పాపారావు. మూడు చక్రాల సైకిల్పై తిరుగుతుంటాడు. ఇతని పేరు అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ ఇళ్లు మాత్రం రాలేదు. అదే గ్రామానికి చెందిన పొడెమ విజయలక్ష్మి పుట్టు మూగ, ఒంటరి మహిళ. అర్హుల జాబితాలో పేరు ఉన్నా ఇళ్లు మంజూరు చేయలేదని సైగలతో ఆరోపిస్తుంది. తక్షణమే ఉన్నతాధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్పందించి ఇళ్లు మంజూరు చేయాలని బాధిత దివ్యాంగులు కోరుతున్నారు.దివ్యాంగుల వేడుకోలు -
‘ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి క్షమాపణ చెప్పాలి’
ములుగు రూరల్: సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌశిక్రెడ్డి ఎన్నికల్లో గెలిపించకపోతే కుటుంబంతో సహ ఆత్మహత్య చేసుకుంటామని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి సీతక్క గురించి మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్పాషా, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
శరవేగంగా గ్యారేజ్
రూ.7 కోట్లతో ఆర్టీసీ డిపో పనులు ప్రారంభంఏటూరునాగారం: ఏటూరునాగారంలో ఆర్టీసీ బస్డిపో నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఆర్టీసీ బస్సులను మరమ్మతులు చేసే గ్యారేజ్ పనులును అధికారులు షురూ చేశారు. రూ.7 కోట్లతో ఆర్టీసీ డిపోను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఈనెల 12వ తేదీన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ డిపోతో పాటు డీఎం కార్యాలయం, బస్సు నిలుపు స్థలం, గ్యారేజ్, ఇతర సిబ్బంది కార్యాలయాలతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించేందుకు తగిన ఇంజనీరింగ్ ప్లాన్ను రూపొందించారు. ఈ మేరకు గ్యారేజ్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించి శరవేగంగా పూర్తి అయ్యేలా చూస్తున్నారు. పలు రాష్ట్రాలకు రవాణా ఏటూరునాగారం బస్డిపో నిర్మాణం పూర్తి అయితే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్తోపాటు తెలంగాణలోని పలు దూర ప్రాంతాలకు ఇక్కడ డిపో బస్సులను వినియోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు కావాల్సిన నిర్మాణ పనులను ముందుగా చేపట్టారు. గతంలో డిపో స్థలంలో ఉన్న పాత భవనాలను కూల్చివేసి అక్కడే నూతన భవనాన్ని నిర్మించడానికి పూనుకున్నారు.కొనసాగుతున్న పిల్లర్ల పనులు ప్రస్తుతం బస్సులను మరమ్మతులు చేసేందుకు గ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ల పనులు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఏటూరునాగారం ఏజెన్సీలో ప్రజలు గత 30 సంవత్సరాలుగా బస్సు డిపో కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి మరో మణిహారంగా డిపో ఏర్పాటు మారనుంది. పనులు నడుస్తున్నాయి.. ఆర్టీసీ డిపో ఏర్పాటు పనులు సాగుతున్నాయి. సుమారుగా తొలుత 30 బస్సులతో ఏర్పాటు చేయనున్నాం. అందుకు కావాల్సిన చర్యలు, ఏర్పాట్లను చేస్తున్నారు. ముందుగా గ్యారేజ్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత బస్సుల మరమ్మతులతో పాటు నిలుపు స్థలం, డిపో మేనేజర్ ఇలా అనేక భవనాలను నిర్మించనున్నారు. – విజయ్భాను, ఆర్టీసీ ఆర్ఎం ● ఇంజనీరింగ్ ప్లాన్తో మిగతా కార్యాలయాల నిర్మాణం తొలుత 30 బస్సులతో డిపో ఏర్పాటు -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని బృందం వివరించింది. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకుల బృందం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధుల బృందం వెనుతిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్తో ‘కొండా’ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన..