Mulugu District Latest News
-
సకాలంలో రుణాలు అందించాలి
ములుగు: పంటల సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పేద, మధ్యతరగతి కుటుంబాలు వ్యవసాయం, తదితర రంగాలపై ఆధారపడి ఆదాయం సమకూర్చుకుంటారని, అలాంటి వారికి రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట రుణాలతో పాటు రాజీవ్ యువ వికాసం పథకం అమలులో బ్యాంకుల సహకారం ఎంతో అవసరమన్నారు. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి బ్యాంకర్ల ద్వారా దరఖాస్తు వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే ఎంపికై న లబ్ధిదారులకు వెంటనే యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ చేయడానికి బ్యాంక్ శాఖలు విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలు తెరవాలని, డెబిట్ కార్డులు జారీ చేయాలన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ -
అవతరణ వేడుకల ముఖ్యఅతిథిగా సీతక్క
ములుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లాలో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా పాల్గొనే ప్రజా ప్రతినిధుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ ముఖ్యఅతిథిగా మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క జెండా ఆవిష్కారణ చేయనున్నా రు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం తరఫున తంగేడు స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్గా బాధ్యతల స్వీకరణములుగు: ములుగు మున్సిపాలిటీ తొలి కమిషనర్గా సంపత్ శుక్రవారం విధుల్లో చేరారు. ఇంతకుమందు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన సంపత్ మున్సిపాలిటీ కమిషనర్గా బదిలీ అయ్యారు. కాగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ దివాకర టీఎస్ను తన చాంబర్లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లుములుగు: జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్జీ సూచించారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 74 మంది సప్లిమెంటరీకి హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఇవ్వకూడదన్నారు. పోలీస్ శాఖ తరఫున 144 సెక్షన్ విధించాలని, కేంద్రాల చుట్టూ జిరాక్స్ సెంటర్లను మూసిఉంచాలన్నారు. వైద్యశాఖ తరఫున ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో వైద్య శబిరం నిర్వహించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఈఓ పాణిని, డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఆర్టీసీ డిపో మేనేజర్ జ్యోత్స్న, ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి అప్పని జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి క్వార్టర్స్లో చోరీ గణపురం: మండలంలోని చెల్పూర్ శివారులోని సింగరేణి థౌసండ్స్ క్వార్టర్స్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి క్వార్టర్స్లో 12, 17, 21, 31 బ్లాక్లలో మించాల మధు, తిరుపతి, నరేష్, పవన్, శ్రీకాంత్, వినోద్ ఇళ్లలో చోరీ జరిగినట్లు తెలిపారు. -
బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలి
ములుగు: వ్యక్తిగత సమస్యలతో సఖీ కేంద్రానికి వచ్చే మహిళలు, బాలికలకు న్యాయ, వైద్య పరమైన సూచనలు ఇస్తూ వారిలో మనోధైర్యాన్ని కల్పించాలని చీఫ్ లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రంలో శుక్రవారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ మాట్లాడుతూ ఫోక్సో చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయం ఎలా పొందాలనేదానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ బాలుగు చంద్రయ్య, డీసీపీఓ ఓంకార్, సైకాలజిస్ట్ కిరణ్కుమార్, డాక్టర్ నమ్రత, కృష్ణవేణి, సంధ్య, నరేష్, సంజీవ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తకం లేకుండా పాఠం!
రెండో సెమిస్టర్కు పుస్తకాలే లేవు.. డిగ్రీ, పీజీ కోర్సుల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు రావాల్సింది. పీజీ కోర్సుల్లో ఎమ్మెస్సీ బాటనీ, ఫిజిక్స్ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేశారు. మిగతా సైన్స్ కోర్సుల సబ్జెక్టుల పరీక్షల ఫలితాలు రావాల్సింది. 2023–24లో మొదటి సెమిస్టర్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ప్రస్తుతం మూడో సెమిస్టర్లో ఉండాలి కానీ, ఇప్పటివరకు వారికి సెకండ్ సెమిస్టర్ తరగతులకు నిర్వహించకపోగా.. పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. ప్రధానంగా ఇయర్ వైజ్ పద్ధతి నుంచి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టాక సెమిస్టర్ సిస్టమ్లో పుస్తకాలు రాయించాల్సి ఉంటుంది. కానీ, అలా చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య కేంద్రంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) డిగ్రీ, పీజీ తదితర కోర్సులకు ఒకప్పుడు బాగా డిమాండ్ ఉండేది. కానీ, కొన్నేళ్లుగా వీటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించకపోవడం, తరగతులు, పరీక్షలు నిర్ణీతసమయంలో ఉండకపోవటం, పరీక్షలు రాశాక ఫలితాలు ఎప్పుడు వస్తాయో నిరీక్షించాల్సిన పరిస్థితులతో అసలెందుకు చేరామోనని విద్యార్థులు ఆవేదన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొత్తగా చేరేవారి సంఖ్య సైతం తగ్గిపోతోంది. యూనివర్సిటీ యూజీసీ డెక్ నిబంధనల ప్రకారం ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలోని విద్యార్థులకు దూరవిద్య కేంద్రంలో అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2023– 24 విద్యాసంవత్సరంనుంచి సెమిస్టర్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. అన్ని కోర్సులు కలిపి 5,518మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించలేకపోయారు. ఆలస్యంగా అరకొరగానే పుస్తకాలు ఇచ్చారు. ముద్రించని మెటీరియల్.. పీజీ సైన్స్ కోర్సుల్లో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులు ఒక సెమిస్టర్కు మొత్తంగా 21 పాఠ్యపుస్తకాలు ఉంటాయి. వివిధ సబ్జెక్టులకు సంబంధించి 10 పుస్తకాలను సంబంధిత అధ్యాపకులతో రాయించారు. ఈ ప్రక్రియ కూడా ఆలస్యమవడంతో పరీక్షలకు కొన్నిరోజులముందు ముద్రించి ఇచ్చారు. మిగతా 11 పాఠ్యపుస్తకాల్లో 8 పుస్తకాలు రాయించారు. కానీ, పుస్తకరూపంలో ముద్రించడం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జనవరిలో పీజీ సైన్స్కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. కొన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ను పీడీఎఫ్లో విద్యార్థుల మొబైల్స్కు పంపారు. పీజీ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో కూడా మొదటి సెమిస్టర్కు పాఠ్యపుస్తకాలు కొన్నింటిని మాత్రమే ఇచ్చి, మిగతావి పీడీఎఫ్ రూపంలో అందించారు. సెన్స్ పరీక్షలు నిర్వహించిన నెలరోజుల తరువాత ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రతీ ఆరునెలలకో సెమిస్టర్ పూర్తి.. ప్రతి ఆరునెలలకో సెమిస్టర్ పూర్తికావాల్సి ఉండగా.. ఏడాది దాటిపోయాకే మొదటి సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు రెండో సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది.. పుస్తకాలు ఎప్పడిస్తారనే సమాచారం కోసం దూరవిద్యకేంద్రంలోగానీ, ఫోన్ ద్వారా కోరితే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానంగా ఉద్యోగస్తులు ఎక్కువగా ప్రమోషన్లు, తదితర అవసరాల నిమిత్తం దూరవిద్య కోర్సుల్లో చేరుతారు. కానీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ఆలస్యంతో తాము నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మొదటి సెమిస్టర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో 2024–25 విద్యాసంవత్సరంలో మొదటి సెమిస్టర్లకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఒక బ్యాచ్కి గత ఏడాది సెప్టెంబర్– అక్టోబర్లో, మరో బ్యాచ్కు ఈఏ డాది జనవరి –మార్చి వరకు అడ్మిషన్లు కల్పించారు. ఈరెండు బ్యాచ్లను ఒకే విద్యాసంవత్స రం కిందికే పరిగణిస్తారు. అన్నికోర్సులు కలిపి 4,498 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరిలో కొందరికి మాత్రమే పుస్తకాలు ఇచ్చారు. ముద్రణకు టెండర్ ప్రక్రియలో జాప్యం.. పాఠ్యపుస్తకాలు రాయించడం.. వాటిని ముద్రించడంలో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నినెలల క్రితమే యూనివర్సిటీ అధికారులు పాఠ్యపుస్తకాల ముద్రణకు టెండర్ నిర్వహించగా.. హనుమకొండకు చెందిన ఓ ప్రింటర్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పుస్తకాల ముద్రణకు ఆర్డర్ ఇవ్వలేదు. కేయూ పాలకమండలి సమావేశంలో ఫైనాన్సియల్ అప్రూవల్ కోసం పెట్టాకే పుస్తకాలను ముద్రణకు ఇస్తారని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది.కేయూ దూరవిద్య కోర్సుల్లో ముద్రణకు నోచని పుస్తకాలు అరకొరగా అందజేత.. మిగతావి పీడీఎఫ్ రూపంలో విద్యార్థులకు.. అస్తవ్యస్తంగా సెమిస్టర్ విధానం. ఆలస్యంగా పరీక్షల నిర్వహణ.. రోజురోజుకూ తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య -
మేడారంలో శాశ్వత పనులు
మంత్రి సీతక్క చొరవతో అభివృద్ధి పనులు షురూనిర్మాణం పూర్తయిన పూజారుల భవనంఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో శాశ్వత నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణ పనులపై అధికారులు దృష్టిసారించారు. వచ్చే మహాజాతర నాటికి ముందస్తుగా శాశ్వత అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వానికి ప్రణాళికలు నివేదించిన అనంతరం మంత్రి సీతక్క అభివృద్ధి పనులకు నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. రూ. 8 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం ఊరట్టం నుంచి కాల్వపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులను మంజూరు చేసింది. పీఆర్శాఖ ఆధ్వర్యంలో ఊరట్టం నుంచి కాల్వపల్లి వరకు ఆరు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతం రోడ్డు ఫార్మేషన్ పనులు సాగుతున్నాయి. బీటీ రోడ్డు నిర్మాణంతో మహాజాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థంగా ఉంటుంది. అలాగే మేడారంలో రూ.2 కోట్లతో వనం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ప్రతీ ఏటా మహాజాతర సమయంలో పూజారులు ఎల్బాక అటవీ ప్రాంతం నుంచి కంకవనాన్ని గద్దైపెకి తీసుకువస్తారు. ఈ రోడ్డు పైనుంచి సమ్మక్క పూజారులతోపాటు వందల సంఖ్యలో ఆదివాసీ యువత వనం తీసుకువస్తారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణంతో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. చకచకా క్యూలైన్ షెడ్ల నిర్మాణ పనులు భక్తుల క్యూలైన్లపై రూ.3.80 కోట్లతో షెడ్ల నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. క్యూలైన్ల్లో జాతర సమయంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడకుండా శాశ్వతంగా ఉండేలా జీఐ షీట్స్తో షెడ్లు నిర్మించనున్నారు. మహాజాతరకు ముందుగానే పనులు పూర్తయ్యేలా అధికారులు ఆదేశాల మేరకు ప్రణాళిక బద్ధంగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. క్యూలైన్లపై షెడ్ల నిర్మాణంతోపాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిధుల మంజూరుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది.పూజారుల భవనం పూర్తి మేడారంలో పూజారుల భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పూజారుల కోసం అన్ని హంగులతో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భవనాన్ని నిర్మించారు. రెండు అంతస్తుల భవనంలో 16 రూంల నిర్మాణంతోపాటు సమావేశాలు నిర్వహించేందుకు మీటింగ్ హాల్ కూడా నిర్మించారు. ఈనెల 29న మంత్రి సీతక్క చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయగా వాయిదా పడింది. త్వరలో భవనాన్ని ప్రారంభించి పూజారులకు కేటాయించనున్నారు. భవన నిర్మాణంతో పూజారులు విశ్రాంతి తీసుకునే సమస్య కూడా తీరింది. మరికొన్ని పనులకు ప్రతిపాదనలు సిద్ధం మహాజాతరకు ముందుగానే నిర్మాణాల పూర్తికి కసరత్తుమంత్రి సీతక్క చొరవతో.. మంత్రి సీతక్క చొరవతో ఎన్నడూ లేని విధంగా శాశ్వత నిర్మాణ పనులు చేపడుతున్నారు. అన్ని మార్గాల నుంచి భక్తులు మేడారానికి చేరుకునేలా రోడ్ల నిర్మాణ పనులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే రూ.12కోట్లతో రోడ్ల నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. మహాజాతరకు ఇంకా 8 నెలల సమయం మాత్రమే ఉంది. ఈసారి జాతరలో హడావుడిగా పనులు చేయకుండా ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. శాఖల వారీగా త్వరలో నిధులు మంజూరు కాగానే మరిన్ని శాశ్వత నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మేడారంలో శాశ్వత తాగునీటి కోసం ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. నిధులు మంజూరు చేయగానే ఆ పనులు కూడా చేపడుతామని ఉన్నతాధికారులు తెలిపారు. -
పైన టమాట పెట్టెలు..లోపల పశువులు
ఏటూరునాగారం: పైన ఖాళీ టమాట పెట్టెలు పెట్టుకొని పుష్ప సినిమాను తలదన్నె విధంగా అక్రమార్కులు మూగజీవాలను తరలిస్తూ పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పశువులను పరిశీలించి రవాణాదారులను చట్టపరంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతానికి చెందిన అక్రమార్కులు 17 మూగజీవాలను డీసీఎం వ్యాన్లో ఊపిరాడకుండా దాచిపెట్టి హైదరాబాద్కు రవాణా చేస్తున్నారు. శుక్రవారం పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు తనిఖీ చేసి పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తి పశువులు బయటకు కనిపించకుండా టమాట పెట్టెలతో అమర్చడంతో పశువులకు శ్వాస ఆడకుండా పోయిందని పశువైద్యాధికారి పవన్ పోలీసులకు తెలిపారు. దీంతో వెంటనే భూపాలపల్లి జిల్లా రాంపూర్ గోశాలకు ఆవులు, ఎద్దులను తరలించాలని ఏఎస్పీ ఆదేశించడంతో సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్, ట్రైనీ ఎస్సై రచిత్రలు డీసీఎంలో పశువులను గోశాలకు తరలించారు. డ్రైవర్ పెరుమాండ్ల లక్ష్మణ్, డీసీఎం యజమాని రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు 256 పశువులను పట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది వీరబాబు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. చెక్పోస్టు తనిఖీ ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి ఇసుక అక్రమ రవాణా నివారణ కోసం రెవెన్యూ, పోలీసుశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టును శుక్రవారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తనిఖీ చేశారు. ఇసుక లారీల్లో కెపాసిటీ తగ్గట్టు రవాణా జరుగుతుందా లేదా అని ఆరా తీశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే లారీ యజమానులపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్ ఉన్నారు.పట్టుకున్న పోలీసులు -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏటూరునాగారం: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు అథ్లెటిక్స్ కు ఎంపిక కావడంతో చిన్నారులను అభినందించారు. మండలంలోని రొ య్యూర్కు చెందిన గుండెల మణితేజ, తాండ్ర అజయ్, తాండ్ర గౌతమ్, లక్ష్మీప్రసన్నలు జూన్ 1న హైదరాబాద్లోని జింఖాన గ్రౌండ్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. వీరిని రొయ్యూర్ గ్రామస్తులు చంటి, గుండెల కుమార్, తాండ్ర రామ్మూర్తి అభినందించారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
కాటారం: రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. కాటారం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్, విత్తన విక్రయ దుకాణాల్లో వ్యవసాయశాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో విక్రయిస్తున్న పత్తి విత్తనాల కంపెనీ వివరాలు, నిల్వ ఉన్న స్టాక్, రిజిస్టర్లు పరి శీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పర్యావరణానికి హానిచేసే హెచ్టీ కాటన్, బీజీ–3 విత్తనాలను విక్రయించవద్దని సూచించారు. నాన్లేబుల్డ్ సంచులలో ఉన్న విత్తనాలను అమ్మితే కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయించవద్దని, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో విక్రయిస్తే ఊరుకోబోమని పేర్కొన్నారు. రైతులు అడిగిన విత్తనాలు మాత్రమే ఇవ్వాలని నాసిరకం విత్తనాలు వారికి అంటగంటవద్దన్నారు. తప్పనిసరిగా కొనుగోలు రశీదు ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ వెంట ఏఓ పూర్ణిమ, ఎస్సై మ్యాక అభినవ్ ఉన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు చూసుకోవాలని డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి సూచించారు. పీఏ సీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గారెపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం డీఎస్పీ పరిశీలించారు. కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి -
పడవ ప్రయాణం.. ఇంకెన్నాళ్లు?
శుక్రవారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2025– 8లోuపడవలో ప్రజలను వాగు దాటిస్తున్న సిబ్బంది(ఫైల్)2023 జూలైలో వరదలకు కొట్టుకుపోయిన కొండాయి బ్రిడ్జిఏటూరునాగారం: ఏజెన్సీలోని పలు గ్రామాలకు రవాణా మార్గం లేక ప్రతీ వర్షాకాలంలో పడవ ప్రయాణం తప్పడం లేదు. అందులో వర్షాకాలం వచ్చిందంటే గిరిజనుల గుండెల్లో భయాందోళన నెలకొంటుంది. 2023జూలైలో కురిసిన భారీ వర్షాలకు కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగు ఉప్పొంగి కొండాయి హైలెవల్ బ్రిడ్జి కుంగిపోయి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో 8మంది జల సమాది అయ్యారు. ఈ విషాధ ఘటనను మరిచిపోలేని ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. కొట్టుకుపోయిన మట్టిరోడ్డు నాలుగు నెలల క్రితం జంపన్నవాగులో ఇసుక కాంట్రాక్టర్ తన లారీలు నడిచేందుకు తాత్కాలిక మట్టి రోడ్డు వేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు బుధవారం కొట్టుకుపోయింది. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజులకాలనీ, ఐలాపురం గ్రామాలకు వెళ్లేందుకు రవాణా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటు గ్రామాల్లోనే మగ్గిపోతున్నారు. రబ్బరు బోటు ఏర్పాటు మట్టి రోడ్డు తెగిపోవడంతో ప్రజల రవాణా కోసం జంపన్నవాగు వద్ద ఫైర్ శాఖకు చెందిన ఎయిర్ రబ్బర్ బోటును ఏర్పాటు చేసి ప్రజలను జంపన్నవాగు దాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఫైర్ సిబ్బంది అక్కడే ప్రత్యేక క్యాంప్ను ఏర్పాటు చేసుకొని ఆపదలో ఉన్న వారిని బోట్లో వాగు దాటిస్తున్నారు. ప్రజల అవసరం మేరకు పడవను నడిపిస్తున్నారు. మొదలైన డ్రిల్లింగ్ కొండాయి బ్రిడ్జికి మంత్రి సీతక్క ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.16.50 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిని మంజూరు చేశారు. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ పనులు చేపట్టిన మరుసటి రోజు వాగు రావడంతో పనులు వెనుకంజ వేశాయి. ఈ బ్రిడ్జి పనులు పూర్తి కావాలంటే ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అప్పటి వరకు గిరిజనులు జంపన్నవాగును పడవలో దాటడం లేదా ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.న్యూస్రీల్ వంతెన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు మొదలైన డ్రిల్లింగ్ పనులు అకాల వర్షాలతో వెనకడుగుఎలిశెట్టిపల్లి వద్ద పడవ ఏర్పాటు మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి వాగు వద్ద మోటారు పడవను ఏర్పాటు చేశారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండడంతో జంపన్నవాగు ఉధృతి పెరగడంతో ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అత్యవసర సేవల కోసం కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు పడవను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐ కిరణ్కుమార్ తెలిపారు. ఆయన వెంట నగేష్, కృష్ణతో పాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచుతా..
భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని 8, 27 వార్డులైన జవహర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బీమ్, జై బాపూ, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా కాలనీలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ నిధులు రూ.2 లక్షల వ్యయంతో వేసిన మంచి నీటి బోరు మోటారును ప్రారంభించారు. అదే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొడ్డు బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు ప్రజా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, టీపీసీ సభ్యులు మధు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
‘నకిలీ’పై ఉక్కుపాదం
హన్మకొండ అర్బన్: నాసిరకం విత్తనాలు, ఎరువుల్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకం విత్తనాలు, ఎరువులను ఉక్కుపాదంతో అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విక్రయించకుండా నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో అంచనాలకుమించి 160 శాతం ధాన్యం అధికంగా వచ్చిందని, దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతీస్థాయి వరకు పర్యవేక్షిస్తున్న పనులు ముందుకు సాగకపోవడంతో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం కోసం అధికారులు పనిచేయాలన్నారు. ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులను అర్హుల ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, రవాణా ఖర్చులు మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కమిటీలో రైతులకు చోటు: మంత్రి సురేఖ నాసిరకం విత్తనాలు, ఎరువుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులతో పాటు రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు, రవాణా, చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా షేక్, టీఎస్ దివాకర, అద్వైత్ కుమార్ సింగ్, రాహుల్ శర్మ, ఎస్పీలు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస పాల్గొన్నారు.ఎరువులు, విత్తనాలపై నిఘా ఉంచాలి ధాన్యం సేకరణలో దేశంలోనే మొదటి స్థానం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాపై సమీక్ష పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు2వ తేదీన జీపీఓలకు నియామక పత్రాలు గ్రామపాలన ఆఫీసర్లుగా ఉత్తీర్ణులైన వారికి జూన్ 2వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులు, భూమి ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని, రైతులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. -
బ్లాస్టింగ్లతో భయాందోళన
మల్హర్: తాడిచర్ల ఓసీపీలోని బ్లాస్టింగ్లో రోజురోజుకు భయందోళనల మధ్య జీవనం సాగిస్తున్నామని పెద్దతాడిచర్ల గ్రామానికి చెందిన అనుమాల లక్ష్మ య్య, దేవాక్క దంపతులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓసీ ప్రాజెక్టు దగ్గరగా ఉండడంతో పాటు స్థాయికి మించి బ్లాస్టింగ్ చేయడం ద్వారా తమ ఇళ్ల పైకప్పులు పగలడంతో పాటు, గోడలకు బీటలు వారి కూలి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ సమయంలో ఇంట్లోని పక్క గది రేకులు కింద పడడంతో పరగులు తీశామని వాపోయారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగపోయిన మున్ముందు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని భయంగా ఉందని వారు తెలుపుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి నాయ్యం చేయడంతో పాటు డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లు సేకరించాలని కోరారు. -
పది రోజుల్లో రైతులకు నష్టపరిహారం
ములుగు/ వాజేడు: బాండ్ మొక్కజొన్న సాగు చేసి పంట నష్టపోయిన రైతులకు పది రోజుల్లో నష్ట పరిహారం డబ్బులు అందిస్తామని సీడ్ కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో హైటెక్ కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లు రైతులతో కలిసి వ్యవసాయ శాఖాధికారులు నష్టపరిహారం చెల్లింపు ఒప్పంద సమావేశాన్ని నిర్వహించారు. వెంకటాపురం(కె) మండలం నుంచి 116 మంది, వాజేడు మండలం నుంచి 95 మంది , కన్నాయిగూడెం మండలం నుంచి ముగ్గురు రైతులకు పంటకాలంలో చేపట్టిన ఫీల్డ్ రిపోర్ట్ ఆధారంగా రూ.65 వేల నుంచి 85 వేల వరకు నష్ట పరిహారం కింద ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడు మండలాల్లో మరింత మంది రైతులు నష్ట పోయినప్పటికీ ఆర్గనైజర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారిని పరిగణలోకి తీసుకోలేదు. పంట నష్టపోయినట్లు అధికారులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా సదరు రైతుల నష్ట పరిహారం విషయంపై వ్యవసాయ అధికారులు, రైతులు, సదరు కంపెనీ ప్రతి నిధులతో ఏకీభవించారు. దీంతో పది రోజుల్లో డబ్బులను సదరు రైతులకు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రతినిధులు అంగీకరించడంతో ఒప్పంద పత్రాలపై రైతులు సంతకాలు చేశారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ డీఏఓ అవినాష్ వర్మ, వాజేడు, కన్నాయిగూడెం ఏఓ ముంజ మహేష్, వెంకటాపురం(కె) ఏఓ నవీన్, ఆర్గనైజర్ సురేష్బాబు, కంపెనీ ఉద్యోగి అబుబాకర్ రైతు సంఘాల నాయకులు కొర్స నర్సింహమూర్తి, నాగరాజు, రాంబాబు, రైతులు పాల్గొన్నారు.హైటెక్ కంపెనీ ప్రతినిధుల ఒప్పందం -
పోలీసుల అదుపులో ఇద్దరు మావోయిస్టులు?
ఏటూరునాగారం: ఏటూరునాగారం పోలీసుల అదుపులో ఇద్దరు మావోయిస్టులు ఉండగా మరో ఇద్దరి కోసం పోలీసులు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యులు కొండాయి ప్రాంతం మీదుగా వచ్చినట్లు తెలుస్తోంది. వారిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి కోసం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి, రాయబంధం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడ ఇంటింటి సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఇటీవల మావోయిస్టు సభ్యులు వరుస అరెస్టులు, లొంగుబాట్ల జరుగుతుండడంతో కొంత మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకు వారి బంధువుల సాయంతో పోలీసులకు లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.టేకు కలప స్వాధీనంవెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గురువారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి వంశీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వెంకటాపురం మండల మీదుగా అక్రమంగా రెండు వాహనాల్లో టేకు దిమ్మలను తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆలుబాక గ్రామ సమీపంలో రెండు బొలెరో వాహనాల్లో తరలిస్తున్న 17 టేకు దిమ్మలను పట్టుకున్నట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.6.5లక్షలు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో ఆలుబాక సెక్షన్ అధికారి చంద్రమోహన్, ఎదిర సెక్షన్ ఆఫీసర్ జయసింగ్, సిబ్బంది ప్రణవి, లాలు, బెస్ క్యాంప్ సిబ్బంది తదితరులు ఉన్నారు.ఐఐటీలో రేవంత్ ప్రతిభములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని లాలాయిగూడెం గ్రామానికి చెందిన జాడి రేవంత్ ఐఐటీలో ప్రతిభ కనబర్చి ఐఐటీ మద్రాస్లో ఎరోనాటికల్ ఇంజనీరింగ్లో సీటు సాధించాడు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ల్యాప్టాప్, మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నారు. జాడి రేవంత్ టీజీడబ్ల్యూఆర్జేసీ గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి మొదటి ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రేవంత్ ఐఐటీ సీటు సాధించడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు.ఏర్పాట్లు చేయాలిభూపాలపల్లి అర్బన్: జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జీఎం ఏరియా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సింగరేణి ఆధ్వర్యంలో జూన్ 2న మిలీనియం క్వార్టర్స్లో కాకతీయ క్రీడా మైదానంలో వేడుకలను నిర్వహించున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా స్టాల్స్, ఫొటో గ్యాలరీ, తెలంగాణ రన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్వోటుజీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన, జోతి, రవికుమార్, మారుతి, మురళిమోహన్, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.పని గంటలు పెంచాలిభూగర్భ గనుల్లో ఎస్డీఎల్ యంత్రాల పని గంటలను పెంచాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై గురువారం ఏరియాలోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సంస్థ నిర్దేశించిన ప్రకారం లక్ష్యాలను సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని కోరారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని అధికారులు, ఉద్యోగులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, భిక్షమయ్య, వెంకటరమణ, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
‘చలో వరంగల్ను జయప్రదం చేయాలి’
వాజేడు: మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి ఈనెల 31న వరంగల్కు వస్తున్నందున స్వాగతం పలికేందుకు నిర్వహించ తలపెట్టిన చలో వరంగల్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ములుగు జిల్లా ఇన్చార్జ్ దుడ్డు రామకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ అవార్డు అందుకుని వరంగల్కు వస్తున్న మంద కృష్ణకు స్వాగతం పలకడంతో పాటు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాదిగ, మాదిగ ఉపకుల సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు, పుల్లూరి కరుణాకర్, చెన్నం స్వామి, సమ్మయ్య, ప్రశాంత్, సర్వేశ్, నాని, రాము తదితరులు పాల్గొన్నారు.పోస్టర్ ఆవిష్కరణములుగు: ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్(టీడబ్ల్యూజేఏ) రెండో రాష్ట్ర మహాసభ పోస్టర్ను బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఎలాంటి సమస్యలు లేకుండా సభను విజయవంతం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సీతక్కకు ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, టీడబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షుడు వెంకన్న, గౌరవ అధ్యక్షుడు భూక్య సునీల్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ షఫీ అహ్మద్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.బొగ్గు ఉత్పత్తిని పెంచాలిభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో ఓపెన్కాస్టులో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే ఓసీ–2లో నూతనంగా కొనుగొలు చేసిన షావల్ వాహనాన్ని బుధవారం జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రూ.1.71కోట్లతో కొనుగోలు చేసిన వాహనానికి సరస్వతి అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ షావల్ యంత్రం లేకపోవడంతో గంటకు రూ.7వేల నష్టం సింగరేణికి వాటిల్లుతుందన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తి చేసి ముందంజలో ఉండాలని సూచించారు. ఉద్యోగులకు కేటాయించిన 8 గంటల పనిని తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, ఏర్రన్న, ప్రసాద్, వెంకటరమణ, భిక్షమయ్య, రాజరావు, కిష్టయ్య, నజీర్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కోటను సందర్శించిన మాల్దీవ్స్ దేశస్తులుఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను బుధవారం మాల్దీవ్స్ దేశస్తులు సందర్శించారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నళ్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన శిల్పకళ సంపదను తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలు, ఖుష్మహల్ను సందర్శించి కాకతీయుల కళాఖండాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాలలో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను కోట గైడ్ రవి వివరించారు. వారివెంట కేంద్రపురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీఎస్టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు.క్రైం ఏసీపీగా సదయ్యహసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం ఏసీపీగా సదయ్య నియమితులయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేసిన సదయ్య బదిలీపై ఇక్కడికిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలోని ఆత్మకూర్లో ఎస్సైగా, కేయూసీ, సుబేదారి పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. -
తెగిన మట్టి రోడ్డు.. నిలిచిన రవాణా
ఏటూరునాగారం: కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని కొండాయి హైలెవ్ బ్రిడ్జి వద్ద తాత్కాలి కంగా వేసిన మట్టి రోడ్డు మంగళవారం కురిసిన భా రీ వర్షానికి తెగిపోయింది. దీంతో గిరిజన గ్రా మాలైన కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజు ల కాలనీ, ఐలాపురం గ్రామాలకు రవాణా ని లిచి పోయింది. ఆయా గ్రామాలకు చేరుకోవాలంటే జంపన్నవాగులో ఈతపడి రావాలి. లేదంటే 40 కి లోమీటర్లు ఊరట్టం, మేడారం, తాడ్వాయి మీదుగా ఏటూరునాగారం చేరుకోవాల్సి ఉంటుంది. రబ్బర్ బోటు ఏర్పాటు ఈ విషయం తెలుసుకున్న అధికారులు మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఫైర్ స్టేషన్కు సంబంధించిన రబ్బర్ బోటును జంపన్న వాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మండల ప్రత్యేకాధికారి రాంపతి, ఎంపీడీఓ రాజ్యలక్ష్మీ, ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘు రబ్బర్ బోటును పరిశీలించారు. ప్రజలను గ్రామాల్లో నుంచి అవసరాల నిమిత్తం వాగు దాటించే విధంగా బోటు సిబ్బందికి సూచనలు చేశారు. విద్యార్థులు, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా కొండాయి వద్ద మట్టి రోడ్డు తెగిపోయిందని, ఎవరు కూడా వాగులో దిగరాదని హెచ్చరిక బోర్డును గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ ఏర్పాటు చేశారు. కొండాయి నుంచి గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ జంపన్నవాగు దాటేందుకు తాత్కాలికంగా రబ్బర్ బోటు హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అధికారులు -
విషజ్వరాలపై అప్రమత్తం
ములుగు: వర్షాకాలంలో ప్రజలు ఎదర్కొనే విషజ్వరాలు మలేరియా, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు వంటి కీటకజనిత వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వైద్య సిబ్బందితో ముందస్తు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కీటకజనిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీల వారీగా ర్యాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. యాంటీ లార్వా, యాంటీ అడల్స్పై సమగ్ర కార్యాచరణ తయారు చేసుకోవాలన్నారు. హైరిస్క్ గ్రామాలను గుర్తించి దోమతెరల పంపిణీ, మలేరియా వ్యాధి నిర్ధారణ ఆర్డీటీ కిట్లు, డెంగీ నిర్ధారణ కిట్లను నిల్వ ఉంచుకోవాలన్నారు. వరదముంపు ప్రాంతాల్లోని ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గర్భిణుల జాబితాను ములుగు ఏరియా, ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు అందించాలన్నారు. పీహెచ్సీలలో మూడు నెలలకు సరిపడా అన్ని రకాల మందులను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వాంతులు, విరేచనాలు, డయేరియా, జాండీస్పై ముందుచూపుతో మెదలాలని వివరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, జిల్లా ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్ జగదీశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్, ప్రోగ్రాం అధికారులు పవన్కుమార్, వైద్యులు శ్రీకాంత్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
జూన్ 2న యువ వికాసం ప్రొసీడింగ్స్
ములుగు: రాజీవ్ యువవికాసం లబ్ధిదారులకు జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ఈ మేరకు హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ప్రభుత్వం కార్పోరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. 29, 30వ తేదీలలో ఇన్చార్జ్ మంత్రులు తుది జాబితాను ఆమోదించాలని తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యువ వికాసం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా తరఫున కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.వీసీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క -
సమన్వయంతో పుష్కరాలు విజయవంతం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయ్యాయని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతంపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని, ఏర్పాట్లపై నిరంతరం ప్రభుత్వ మార్గదర్శనం మేరకు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశామన్నారు. సరస్వతీ మాతా విగ్రహం ఏర్పాటు చేసి, ప్రతీ రోజు కాశీపండితులచే నవరత్న మాల హారతి నిర్వహించామన్నారు. టెంట్ సిటీ ఏర్పాటు ద్వారా 40 రూములు, 200 డార్మెటరీ, ఫుడ్ కోర్టు, కిడ్స్ ప్లే జోన్, వాహన పార్కింగ్ ఏర్పాట్లతో సౌకర్యాలు కల్పించామన్నారు. వర్షంతో అవాంతరాలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామన్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేయడంతో పాటు క్యూలో ఉన్న భక్తుల సౌకర్యార్థం కూలర్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల నిర్వహణ సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు. ఇదొక మంచి అనుభవం.. సరస్వతీ నది పుష్కరాలు మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని ఎస్పీ కిరణ్ఖరే తెలిపారు. కాళేశ్వరానికి లక్షల్లో భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
పేదలకు భూమి పట్టాలు అందించాలి
ములుగు రూరల్: కాస్తులో ఉన్న పేద రైతులకు భూమి పట్టాలు అందించాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ మహేందర్జీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండలం జవహర్నగర్ శివారులో ప్రభుత్వం ఒక కుటుంబానికి 26.34ఎకరాల భూమిని 1995లో పట్టా చేసింది కానీ పట్టాదారులకు భూమి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. సర్వే నంబర్ 1873లో నాలుగు ఎకరాల పట్టా భూమిని పట్టుకొని హైకోర్టును ఆశ్రయించి మిగతా భూమిని కాజేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులచే సర్వే నిర్వహించి పేద రైతులకు పట్టాలు అందించాలని కోరారు. అక్రమ అసైన్డ్ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగవెల్లి సత్యనారాయణ, రవీందర్, సదాశివరెడ్డి, రైతులు పాల్గొన్నారు.తెలంగాణ రైతుసంఘం నాయకుడు వెంకట్రెడ్డి -
ప్రజలను చైతన్య పర్చాలి
భూపాలపల్లి అర్బన్: మానవ అక్రమ రవాణా అరికట్టడానికి ఉపాధ్యాయులు ప్రజలను చైతన్య పరచాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో భూపాలపల్లి, ములుగు జిల్లాల కస్తూర్బాగాంధీ, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు మానవ అక్రమ రవాణాపై రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సమాజ భాగస్వాములై మానవ అక్రమ రవాణా అరికట్టడంలో తమ వంతు పాత్ర వహించాలన్నారు. మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామి అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చన్నారు. మానవ అక్రమ రవాణా జరిగినప్పుడు టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100, 181, 1930 సైబర్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని రాజేందర్ తెలిపారు. -
కేసుల దర్యాప్తుల్లో వేగం పెంచాలి
ములుగు: పోలీస్స్టేషన్ల వారీగా నమోదైన కేసుల పరిష్కారానికి చేపట్టే దర్యాప్తులో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రతీకేసును ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. దొంగతనాలు, ఆర్థిక నేరాల్లో ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పోగొట్టుకున్న నగదు, ఇతర విలువైన వస్తువులు బాధితులకు అందేలా కృషి చేయాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఇన్చార్జి ఓఎస్డీ, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్, సీఐలు శ్రీనివాస్, కుమార్, రవీందర్, ఎస్సైలు వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
‘చలో వరంగల్ విజయవంతం చేయాలి’
ఎస్ఎస్తాడ్వాయి: మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి ఈనెల 31 న వరగంల్కు వస్తున్నందున్న ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి కరుణాకర్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి శ్యాంబాబులు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు దుర్గారావు అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల నాయకులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. మంద కృష్ణకు ఘనస్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ ఘన స్వాగతం అనంతరం అదే రోజున వరంగల్లో ఎమ్మారీఎస్, అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లూరి లక్ష్మణ్, నరేశ్, పురుషోత్తం సాంబయ్య, నాగరాజు, కరుణాకర్, నవీన్, అనిల్, సురేష్ పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు ఏటూరునాగారం: మండల కేంద్రంలోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రైనీ ఎస్సై రచిత్ర మంగళవారం తెలిపారు. పక్కా సమాచారం మేరకు సోమవారం రాత్రి పేకాట ఆడుతున్న నాగరాజు, వెంకటేశ్వర్లు, వెంకన్న, సూర్యనారాయణ, బాలరాజులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.9,980లు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఘనంగా మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి ములుగు: మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య ముఖ్యఅతిథిగా హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ఖాన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్రెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు మురుకుట్ల నరేందర్, నేపాల్రావు, సందీప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగును పెంచాలి
ఏటూరునాగారం: జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి సంజీవరావు అన్నారు. జిల్లాలో 27వేల ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తీర్ణం ఉందని, మిర్చి 24,239 ఎకరాలు, పంట్ల తోటలు 673 ఎకరాలు, ఆయిల్పామ్ 2,658 ఎకరాల్లో సాగు అవుతుందన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని ఎక్కెల హెచ్ఎన్టీసీ, చిన్నబోయినపల్లి, పెద్ద వెంకటాపురంలోని టిఫ్యూకల్చర్, ఆయిల్ పామ్ తోటల్లో ఆదివారం మంగళవారం తనిఖీలు చేశారు. హర్టికల్చర్ పంటల్లో తక్కువ నీటితో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. ఆయిల్పామ్ పంటలు, పండ్ల తోటల సాగు, డ్రిప్ సేద్యం, వెదురు మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాలను ఉద్యానశాఖ సబ్సిడీలు అందిస్తుందని వివరించారు. ఈ ఏడాది పండ్ల తోటలు 152, మామిడి 7, అరటి 77 ఎకరాలు, నిమ్మ 5, జామ 2.5 ఎకరాలు, దానిమ్మ 5 ఎకరాలు, ఆయిల్పామ్ 3వేల ఎరాల్లో సాగు చేయాల ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారులు, కంపెనీ ప్రతి నిధులు, డ్రిప్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సంజీవరావు -
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ములుగు: ములుగును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుకోవాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) చీమలపాటి మహేందర్జీ అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరె న్స్ హాల్ మంగళవారం నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్, ఎకై ్సజ్ అధికారులు సమన్వయంతో ఉంటూ డ్రగ్స్ మూలాలను పెకిలించి వే యాలన్నారు. కళాశాలలు, వసతిగృహాలను తరుచుగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించా లని అన్నారు. విద్యార్థులు పెడదోవ పట్టకుండా అవగాహాన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూ డాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. డ్రగ్స్ నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్, నా ర్కోటిక్ ఎస్సై సురేష్, డీఎంహెచ్ఓ గోపాల్రావు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ జగదీశ్వర్, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్నాయక్, ఎస్సీ డెవలప్ మెంట్ అధికారి రవి తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్ -
10 మండలాలు.. 5,151 మెట్రిక్ టన్నుల బియ్యం
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 222 రేషన్ షాపులు ఉన్నాయి. ఆయా మండలాల్లో 94,628 రేషన్ కార్డుదారులు ఉండగా 2,76,349 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికి జూన్, జూలై, ఆగస్టు కోటా సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు 5,151 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ నెల 30లోగా రేషన్ షాపులకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం నిల్వ చేయడానికి స్థలం లేకపోవడంతో అధికారులు జూన్ 7 వరకు బియ్యాన్ని ఆయా రేషన్ షాపులకు సరఫరా చేయనున్నారు. జూన్ 1 నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్లకు ఇప్పటికే అధి కారులు ఆదేశాలు జారీ చేశారు.వెంకటాపురం(ఎం): రాబోయే వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పేద ప్రజలకు బియ్యం సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందస్తుగానే మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను జూన్ 1 నుంచి 30 వరకు పేదలకు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎంఎల్ఎస్ (మండల లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలకు ముందస్తుగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందనున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వాగులు పొంగి రవాణా స్తంభించే ఏజెన్సీ గ్రామాలకు ముందస్తుగానే బియ్యం అందనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జీసీసీ సేల్స్మెన్లతో సమావేశం ఏటూరునాగారం: మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయం వద్ద మంగపేట, ఏటూరునాగారం, వెంకటాపురం(కె) మండలాల్లోని జీసీసీ సేల్స్మెన్లతో మంగళవారం బియ్యం పంపిణీపై జీసీసీ డీఎం కుంజ వాణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్లో మూడు నెలల సన్నబియ్యాన్ని రేషన్కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. రాబోయే వర్షాకాలంలో సన్నబియ్యం కోసం ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు బియ్యాన్ని ఇవ్వాలన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. ముందస్తుగా లబ్ధిదారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమయపాలన పాటిస్తూ రేషన్ బియ్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ సయ్యద్ షా ఫైజల్ హుస్సేన్, వెంకటాపురం(కె) జీపీసీఎంఎస్ మేనేజర్ స్వామి, డీటీ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు చేశాం రేషన్ కార్డుదారులకు ఒకే సారి మూడు మాసాలకు సంబంధించిన బియ్యం కోటాను అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం రవాణా చేస్తున్నాం. జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. ఏ ఒక్క కార్డుదారుడు ఇబ్బంది పడకుండా డీలర్లు బియ్యం పంపిణీ చేస్తారు. లబ్ధిదారులు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం కోసం మూడుసార్లు వేలిముద్రలు వేసి బియ్యం తీసుకోవాలి. – షా ఫైజల్ హుస్సేన్, జిల్లా పౌరసరఫరాల అధికారి●జూన్ 1 నుంచి 30 వరకు పంపిణీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు చేరుతున్న బియ్యం జిల్లా వ్యాప్తంగా 94,628 రేషన్ కార్డులు -
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
ములుగు: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్లో మంగళవారం నిర్వహించిన లైసెన్స్ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీలనకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. జులై 26వ తేదీ వరకు ఇచ్చే శిక్షణ తరగతులను సర్వేయర్లు సద్వినియోగం చేసకోవాలన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల భూ సేకరణ సర్వేలపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలన్నారు. రెవెన్యూ గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, వివాదాల పరిష్కారానికి చేపట్టే సర్వే ఎలాంటి అంతరాలకు గురికాకుండా ఉండాలన్నారు. అనంతరం లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడించాలి ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు వెల్లడించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మంత్రులతో కలిసి మంగళవారం ఆయన కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా తరఫున కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, సివిల్ సప్లయీస్ అధికారి షా ఫైజల్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ వీసీలో సీఎం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. ఆయా మండలాల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా జరుపుకోవాలన్నారు. భూ భారతి చట్టాలను ప్రజలకు చేరువ చేయాలని, 3వ తేదీ నుంచి 20 వరకు మూడోదశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్
కన్నాయిగూడెం: నూతన తహసీల్దార్గా సర్వర్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పని తహసీల్దార్గా పనిచేసిన వేణుగోపాల్ బదిలీపై వెంకటపురం (కె) మండలానికి వెళ్లగా కన్నాయిగూడెం తహసీల్దాగా సోమవారం సర్వర్ బాధ్యతలు చేపట్టారు. అయోడిన్పై అవగాహన వాజేడు : మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో సోమవారం పేరూరు వైద్య సిబ్బంది అయోడిన్ వలన కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్ఈ ఓ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ మనిషి శరీరంలో ఉప్పుశాతం తగ్గితే ఆరోగ్య పరంగా ఎలాంటి రుగ్మతలు వస్తాయో తెలిపారు. అదే సమయంలో తక్కువగా ఉంటే కలిగే నష్టాలను వివరించారు. మనిషికి ఉప్పు ఎంత అవసరమో వివరంగా తెలిపారు. ఆర్థికసాయం ఏటూరునాగారం : మండలంలో బాస రాములు, వావిలాల రాధిక, దబ్బగట్ల భాస్కర్ ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు వారి నాయకులతో ఒక్కో కుటుంబానికి సోమవారం రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలి పారు. ఆయన వెంట గడదాసు సునీల్కుమార్, తుమ్మ మల్లారెడ్డి, ప్రదీప్రావు, గోవింద్నాయక్ ఖాజాపాషా, తాడూరి రఘు, కాకులమర్రి భాస్కర్రావు, వావిలాల పోశయ్య, నాగరాజు, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఎన్నిక టేకుమట్ల: మండలంలోని మందలోరిపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీని సోమవారం మండల అధ్యక్షుడు కోటగిరి సతీశ్గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జెల్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా బూర్గుల కొమురయ్య, ఉపాధ్యక్షుడి బండి రాజారాంను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాంపెల్లి వీరేశం, తదితరులు ఉన్నారు. కొత్తపల్లి(ఎస్ఎం)లో.. భూపాలపల్లి రూరల్: మండలంలోని కొత్తపల్లి(ఎస్ఎం) కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు పార్టీ గ్రామ ఇన్చార్జ్లు రఘునాథరె డ్డి, సంపత్రావు తెలిపారు. అధ్యక్షుడిగా అజ య్, ఉపాధ్యక్షుడిగా విష్ణు, నదీం, ప్ర ధాన కార్యదర్శిగా పాలిత రాజును ఎన్నుకున్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఆరుగురిపై కేసు నమోదు ములుగు : ములుగు మార్కెట్ రోడ్డులోని పైడిమల్ల మొగిలి ఇంటి పక్కన కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు ఎస్సై వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న దొంతి రవి, వలపదాసు శ్రీధర్, ఎండీ పాషా, శ్రీరాం రవి, రాయల ప్రకాశ్, పైడిమల్ల మొగిలిలను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 92 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని అన్నారు. అభినందన భూపాలపల్లి రూరల్: ఏయిమ్స్ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పీజీ ఎంట్రెన్స్ 2025 ఫలితాలలో పట్టణానికి చెందిన ఎంపటి కుశ్వంత్ ఆల్ ఇండియా తొ మ్మిదో ర్యాంకు సాధించాడు. సోమవారం బీసీ సంఘం నాయకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో కుష్వంత్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి చిన్నప్పుడే మృతి చెందిన తల్లి అనిత మిషన్ కుట్టుకుంటూ ఇద్దరి బాబులను చదివించారన్నారు. 2019లో ఎంబీబీఎస్ సీటు సాధించినప్పుడు సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం కుష్వంత్కు ఆర్థిక సాయం చేసి ఎంబీబీఎస్ పూర్తయ్యేందుకు సహకరించినట్లు తెలిపారు. -
అన్నదానం చేయడం అభినందనీయం
భూపాలపల్లి రూరల్: కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం అన్నదాన శిబిరంలో పాల్గొన్ని భక్తులకు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నదానానికి సహకరించిన దాతలకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పట్ణణ పరిధిలోని వేశాలపల్లిలో ఏర్పాటు చేసిన జైబాపు,జైభీం, జైసంవిధాన్ కార్యక్రమంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, ఆకుల మహేందర్, రాంనేని రవీందర్. తోట రంజిత్, ముంజాల రవీందర్, గురిజాల రవి పాల్గొన్నారు. -
వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి
ఏటూరునాగారం : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 31న హైదరాబాద్ జలవిహార్లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని అరుణ కన్వెన్షన్ హాల్లో టీయూడబ్ల్యూజే –హెచ్ 143 ములుగు జిల్లా కన్వీనర్ దూడబోయిన రాకేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను ఆ విష్కరించారు. అనంతరం లెనిన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా ములుగు జిల్లా వర్కింగ్ జర్నలిస్టులు పనిచేశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్రిడిటేషన్ కార్డులను గతంలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా పెంచుకున్నామన్నారు. మనమంతా ఐక్యంగా ఉండాలని కోరారు. సమన్వయ కమిటీ ఎన్నిక ఏటూరునాగారం సబ్ డివిజన్ సమన్వయ క మిటీని ప్రకటించారు. ములుగు జిల్లా కో కన్వీనర్లుగా ఎండీ.అఫ్జల్, నూక ప్రభాకర్, బాచినేని ప్రవీణ్, వసంత రమేష్, సభ్యులుగా అలువాల శ్రీనివాస్, జూపాక కృష్ణ, వేమ సురేష్, ఎండీ ఇషాక్, పసుపులేటి సతీష్, పాషా, కలకోట సంతోష్, బేతంచర్ల అ శోక్, పర్వతాల లాలయ్య, గంట సర్వేశ్వరరావు, ఠా కూర్ ప్రతాప్, చల్లగొండ శ్రీకాంత్ రెడ్డి లను నియమించారు. కార్యక్రమంలో బోడ సత్యం, గోపి, సుధాకర్, మహేష్, మల్లేష్, షాయక్, తిరుమల్, రమేష్, సాయి, సురేష్, దామోదర్, వేణు, తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ -
ఆర్వైవీఎస్ సర్టిఫికెట్ల సంయుక్త పరిశీలన
గోవిందరావుపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి మండల వ్యాప్తంగా 2188 దరఖాస్తులు వచ్చాయి. రాజీవ్ యువవికాసం పథకం కోసం ధరఖాస్తులు చేసుకున్న వారి సర్టిఫికెట్లను సోమవారం ఎంపీడీఓ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్ స్వామి, బీసీ కార్పొరేషన్ ఈడీ రవీందర్ రెడ్డి లు సంయుక్త పరిశీలన (జాయింట్ స్క్రీనింగ్) నిర్వహించారు. మండలంలో రెండు బ్యాంకులు ఎస్ బీఐ గోవిందరావుపేట శాఖ, టీజీబీ పస్రా శాఖ ఖా తాదారులు మొత్తం 2188 దరఖాస్తులు చేసుకోగా సోమవారం ఎస్బీఐ శాఖ కింద వచ్చిన 1101 మంది దరఖాస్తులదారులకి సంయుక్త పరిశీలన చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కింద వచ్చిన మరో 1087 మంది దరఖాస్తులను మంగళవారం పరిశీలించనున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సృజన్ కుమార్, ఎంపీఓ మమత, సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్, పంచాచతీ కార్యదర్శులు డేగల శంకర్, అశోక్, చుంచు భారతి పాల్గొన్నారు. -
‘రాజీవ్ యువ వికాసం’ ఇంటర్వ్యూలు
ఏటూరునాగారం: రాజీవ్ యువ వికాసం స్కీంకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్థానిక ప్రజాపరిషత్ కార్యాయంలో ఎంపీడీఓ రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా మండలంలోని ఏటూరునాగారం, అల్లంవారిఘణపురం, చెల్పాక, రొయ్యూర్, ముళ్లకట్ట, శంకరాజుపల్లి గ్రామాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎస్బీఐ అధికారులు సిబ్బంది స్క్రీనింగ్ టెస్ట్ ను ప్రక్రియ నిర్వహించా రు. అయితే, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ ఈ ప్రక్రియను పరిశీలించారు. యువత సద్వినియోగం చేసుకోవాలి వెంకటాపురం(ఎం): ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ రాజు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువవికాసం పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూ లు ని ర్వహించారు. ములుగు తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలో 301 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ, ఈబీసీ అభ్యర్థులకు, ఇంచర్ల ఎస్బీఐ పరిఽ దిలో 372 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలి పారు. మంగళవారం ఎస్బీఐ గణపురం, వెంకటా పురం టీజీబీ పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వాజేడు: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించారు. మండల వ్యాప్తంగా 1700 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1100 మందిని అర్హులుగా నిర్ధారించారు. వెంకటాపురం(కె): ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్లో రాజీవ్ యువశక్తి పథకం లోన్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. బ్యాంక్లో ఎస్టీ అభ్యర్థులు 309 మంది దరఖాస్తు చేసుకోగా 188 మంది, ఎస్సీ 187 మంది దరఖాస్తు చేసుకోగా 129 మంది, బీసీలు 229 దరఖాస్తు చేసుకోగా 166 మంది, ఈబీసీ, మైనారీటి అభ్యర్థులు 9 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. నేడు, రేపు రాజీవ్ యువవికాసం ఇంటర్వ్యూలు ములుగు : రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాలకు దరాఖాస్తులు చేసుకున్న అ భ్యర్థులకు నేడు(మంగళవారం) జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. 27న కెనరాబ్యాంకు, 28న యూబీఐ, ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు ఉంటాయని అన్నారు. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కాటారం: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో నెల రోజులుగా అథ్లెటిక్ శిబిరం నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందుతున్న జూనియర్, సబ్ జూనియర్ స్థాయి క్రీడాకారులకు సోమవారం అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ పులిహోర, వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ చేశారు. ప్రతీ క్రీడాకారుడు క్రీడా నైపుణ్యతను పెంపొందిచుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. -
మొరం తవ్వకాలు నిలిపేయాలి
రేగొండ: మండలంలోని రావులపల్లిలో లంబాడి కుంటలో మొరం అక్రమ తవ్వకాలను నిలిపేయాలని రావులపల్లి ఎస్సీ కాలనీవాసులు తహసీల్దార్ శ్వేతకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా కొంత మంది వ్యక్తులు మొరాన్ని అక్రమంగా అమ్ముకుంటూ చెరువు ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. చెరువులో భారీ గుంతలు తీయడంతో ప్రమాదాలు సంభవించే అవకాశముందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెండెల రవి, రత్న మల్లయ్య, మేకల పోషాలు, పెండెల చిరంజీవి, మేకల రాజు, రత్న మధు, మేకల శివ, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపైనే వారాంతపు సంతలు
వాజేడు : మండలంలో వార సంతలు (అంగళ్లు) రహదారులపైనే నిర్వహిస్తున్నారు. ప్రజలు కూరగాయలు, నిత్యావసర వస్తువులను వారానికి సరిపడే అన్ని సరుకులు సంతలోనే కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకుంటారు. అలాంటి సంతల నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో రహదారులపైనే కొనసాగుతున్నాయి. మండలంలోని వాజేడు, పెద్దగొళ్లగూడెం, జగన్నాథపురం, గుమ్మడిదొడ్డి, పేరూరు గ్రామాల్లో వార సంతలను నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో ఊరిలో ఈ సంతలు నిర్వహిస్తుండడంతో ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు సంతకు వచ్చి సరుకులను కొనుగోలు చేసుకొని వెళ్తారు. తప్పని తిప్పలు వారం వారం నిర్వహించే సంతకు వ్యాపారం చేసుకోవడానికి వచ్చే చిరు వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. సంత నిర్వహణకు సరైన స్థలం లేకపోవడంతో రహదారులకు ఇరువైపులా సరుకులను విక్రయిస్తున్నారు. సంత నిర్వహించే సమయంలో ప్రజలు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు ఇ బ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే వారు తెచ్చిన సరుకులు తడువకుండా భద్రపర్చలేక నష్టపోతున్నారు. గాలులు వీచిన సమయంలో వస్తువులు చె ల్లాచెదురు కాకుండా రక్షించుకోవడం తలకుమించిన భారం అవుతోంది. తమకు ప్రత్యేకంగా ఒక స్థ లం కేటాయించి వ్యాపార సముదాయాలను నిర్మించి ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. లైట్ల వెలుతురులోనే వ్యాపారం మండలం ఏజెన్సీ ప్రాంతం కావడంతో సంతల్లో వ్యాపారం సాయంత్రం సమయంలో నిర్వహిస్తా రు. చాలా మంది కూలీ పనులకు వెళ్లి వచ్చిన త ర్వాత సంతకు వస్తుంటారు. మండలంలోని సంతల్లో సాయంత్రం 5 గంటల తర్వాత వ్యాపారాల నిర్వహణ కొనసాగుతోంది. రాత్రి 8 గంటలు దాటే వరకు కూడా ప్రజలు కూరగాయలు, సామగ్రిని కొ నుగోలు చేస్తారు. ఆ సమయంలో వీధిలైట్ల వెలుతురులో వ్యాపార నిర్వహణ కొనసాగుతుంది. ఒక వేళ విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడితే సెల్ లైట్ల వెలుతురులో వ్యాపారాలు సాగుతాయి. అధికారులు స్పందించి సంతల నిర్వహణకు స్థలాలు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు పట్టించుకోని అధికారులు -
‘చలో వరంగల్’ను విజయవంతం చేయండి
గోవిందరావుపేట: ఈ నెల 31న వరంగల్ నగరా నికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ వస్తున్నందున హ లో మాదిగ చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డి.రామకృష్ణ అన్నారు. మండలంలోని పస్రా గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు పసుల భఽద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ హజరై మాట్లాడుతూ పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని ఈ నెల 31న వరంగల్ నగరానికి ఢిల్లీ నుంచి వస్తున్న మంద కృష్ణ మాదిగకి ఘన స్వాగతం పలకడానికి ఎమ్మార్పీ స్, అనుబంధ సంఘాల శ్రేణులు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్కు తరలిరావాలని అన్నారు. కార్యక్రమంలో ఇరుగు పైడి, శ్యాంబాబు, నరసయ్య, కరణాకర్,బలరాం, రమేష్, రాంబాబు, మొగిలి, సాంబయ్య, రంజీత్, సురేష్ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ -
వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి
వెంకటాపురం(ఎం): రాబోయే వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ చీర్ల శ్రీకాంత్ గొత్తికోయలకు సూచించారు. సోమవారం మండలంలోని తొర్రిచింతలపా డు, రోలుబండ గోత్తికోయగూడేల్లో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. 62 మంది గొత్తికోయలకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. గర్భిణులకు, పిల్లలకు టీకాలు వేశారు. అనంతరం గొత్తికోయలతో డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, వాటి ద్వారా మలేరియా, డెంగీ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. వర్షాకాలంలో కాచి వడబోసిన నీటిని తాగాలని సూచించారు. ఎవరైనా ఆనారోగ్యానికి గురైతే స్థానిక వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ నవీన్కుమార్, హెల్త్ ఆసిస్టెంట్ మోతీలాల్, ఏఎన్ఎంలు అనురాధ, స్వప్న, ఆశా కార్యకర్తలు సరోజన, మాధవి, సౌజన్య, ఇందిర, కవిత, సంపూర్ణ, శోభ పాల్గొన్నారు. పీహెచ్సీ వైద్యాధికారి చీర్ల శ్రీకాంత్ -
– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu
పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు పునీతులయ్యారు. కాళేశ్వరం సందర్శనలో జ్ఞాపకాల్ని మూటగట్టుకెళ్లారు. ఎండ, వాన.. గాలి దుమారం.. ఇవేవీ వారిని అడ్డుకోలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్.. నదీ పరిసరాల్లో బురద.. వారి సంతోషానికి అడ్డు కాలేదు. కిక్కిరిసిన భక్తులతో ఆర్టీసీ బస్సులు. దారి పొడవునా ప్రైవేట్ వాహనాలు. ఇలా.. లక్షలాది మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చారు. నదీ మాతకు పూజలు చేశారు. తర్పణాలు వదిలారు. పిండ ప్రదానాలు చేశారు. నదిలో దీపాలు వదిలారు. చీరెసారె సమర్పించారు. 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. నదీమాతకు నవరత్న మాల హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సోమవారంతో సరస్వతీ నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు లక్ష మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. -
‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలి
ములుగు: ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ దివాకరకు అందించారు. అనంతరం నిర్వహించిన సభలో విమలక్క మాట్లాడుతూ బీజాపూర్, నారాయణపూర్, కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ మావోయిస్టు నాయకులు నంబాల కేశవరావుతో పాటు మరో 26 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ యుగేంధర్, రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెల్తూరి సదానందం, ఉపాధ్యక్షుడు మోకాళ్ల సమ్మన్న, ఏఐ ఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్, అరుణోదయ ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.● అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క -
పంచామృత అభిషేకాలు.. పడిపూజ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయం గత నెల 16న ప్రతిష్టించగా సోమవారానికి 41వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆలయంలో పంచామృత అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అయ్యప్పస్వామి, గణ పతి, సుబ్రమణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, హోమం వేదపండితులు రామకృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి శివలింగానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి పడిపూజ నిర్వహించి జ్యోతులు వెలిగించారు. కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ చైర్మన్ గౌరీశంకర్, శ్రీనివాస్, గోపి, లక్ష్మణ్, సత్యం పాల్గొన్నారు. -
వినతులు పరిష్కరించండి..
ములుగు/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై బాధితులు వినతులు విన్నవించి పరిష్కరించాలని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 40 ఫిర్యాదులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 15 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు. మొత్తంగా వచ్చిన 55 వినతులను పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. వాటిని తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజన దర్బార్లో.. వాజేడు మండల పరిధిలోని పెద్దగొల్లగూడెం ప్రాంతానికి చెందిన గిరిజనులు బోరు మంజూరు చేయాలని కోరారు. ములుగు మండలం బంజరుపల్లిలో సమ్మక్క– సారక్క గాల్ఫర్ మిషన్ వెల్ఫేర్ సొసైటీకి ఐటీడీఏ పరిధిలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పారిశుద్ధ్యం, క్లీనింగ్కు కల్ఫార్ మిషన్ ద్వారా సెప్టిక్ ట్యాంకులను క్లీనింగ్ చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. గూడూరు మండలం ఏపూర్ గ్రామానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వాంకుడోతు శరత్కు నేర చరిత్ర ఉందని, అతనిని ఉద్యోగం నుంచి తొలగించాలని విన్నవించారు. జిల్లాలోని పలువురు గిరిజన విద్యార్థులు ఆర్డీ జూనియర్ కళాశాలలో చదువుతున్నామని దానిని తొలగిస్తున్నారని, వేరే కళాశాలలో చేరే ఆర్థిక స్థోమత తమకు లేదని అందుకని కాజేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో సీటు ఇప్పించాలని కోరారు. 2017–2018లో బెస్ట్ అవైలబుల్ స్కీంలో సీట్లు పొందామని, 2023 – 2025 వరకు బిల్లులు రాలేదని ఫీజు చెల్లిస్తేనే పై తరగతులకు పంపిస్తామని అంటున్నారని బాధితులు గోడువెల్లబోసుకున్నారు. రెండు సంవత్సరాల ఫీజును ప్రైవేట్ స్కూళ్లకు చెల్లించా లని పీఓను కోరారు. మండలంలోని బూటారంకు చెందిన గిరిజనుడు జీఎంసీ ములుగులో మెస్ఫీజు చెల్లించాలని కోరారు. ఇలా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఓకు వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, జీసీసీ డీఎం ప్రకాశ్ పాల్గొన్నారు. ప్రజావాణిలో 40, గిరిజనదర్బార్లో 15 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలుప్రజావాణి వినతులు ఇలా.. భూ సమస్యలు: 13 గృహ నిర్మాణ శాఖ: 15 పింఛన్లు: 2 ఇతర శాఖలు: 10 -
అడవుల్లో ప్లాస్టిక్ పడేయొద్దు
● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ ఏటూరునాగారం: అడవుల్లో ఎక్కడ కూడా వ్యర్థాలు, ప్లాస్టిక్ను పడవేయద్దని అటవీశాఖ సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లకు ఆయన సోమవారం అవగాహన కల్పించి మాట్లాడారు. అడవుల్లో ఉండే వన్యప్రాణులకు ప్లాస్టిక్ వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్ చల్లా శ్రీనివాస్తో పాటు డ్రైవర్లు పాల్గొన్నారు. -
మూడు నెలల బియ్యం పంపిణీ
ములుగు: జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి జూన్లోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా చేయకూడదని రవాణా కాంట్రాక్టర్లకు సూచించారు. డీలర్లు కూడా మూడు నెలల బియ్యం తీసుకోవడానికి వచ్చిన ప్రతీ లబ్ధిదారుడి వేలిముద్ర మూడుసార్లు నమోదు చేయించి పంపిణీ చేయాలని ఆదేశించారు. మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఇన్చార్జ్లు హమాలీలను సరిపడా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలందరూ మూడు నెలల సన్నబియ్యాన్ని తప్పకుండా తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్లు, సివిల్ సప్లయీస్ డీటీలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నిరంతరం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేన్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాంపతి, ఏటూరునాగారం డివిజనల్ మేనేజర్ వాని ఠాగూర్, వెంకటాపురం జీసీసీ మేనేజర్ స్వామి, ములుగు, ఏటూరునాగారం డిప్యూటీ తహసీల్దార్లు, మండల లెవల్ స్టాక్ పాయింట్, గోదాం ఇన్చార్జ్లు, మండలాల డీలర్ల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
రవాణా శాఖలో ఇన్చార్జ్ల పాలన!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రవాణా శాఖలో ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. కోర్టు స్టే కారణంగా కొద్ది రోజులుగా ఆ శాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) జాబితాకు బ్రేక్ పడింది. దీంతో పదోన్నతులు, నియామకాలు నిలిచాయన్న సాకుతో చాలాచోట్ల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)లనే ఇన్చార్జ్ జిల్లా రవాణా శాఖాధికారులు(డీటీఓ)గా నియమించారు. మరికొందరు ఎంవీఐలకు.. ఎంవీఐతో పాటు ఇన్చార్జ్ డీటీఓలుగా ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించారు. కాగా కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ పోస్టును పోటీపడి తెచ్చుకున్న సందర్భాలుంటే.. మరికొన్నిచోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి సీనియర్లు తెరవెనుక చక్రం తిప్పుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇష్టారాజ్యం.. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో డీటీసీ, డీటీఓ పోస్టుల్లో ఇన్చార్జ్లే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదోన్నతులు నిలిపివేసి ఒక్కో సీనియర్ ఎంవీఐకి రెండు నుంచి నాలుగు జిల్లాల్లో ‘ఆన్ డిప్యూటేషన్ పోస్టింగ్’లు ఇచ్చి పెద్ద ఎత్తున దండుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిగింది. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న ఓ అధికారి ప్రభుత్వం మారాక స్వచ్ఛంద పదవీ విరమణ పెట్టుకోవడం కొసమెరుపు కాగా.. అతడికి అండగా నిలిచిన కొందరు ఏసీబీ కేసుల్లో ఇరుక్కొని సస్పెండయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఇన్చార్జ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని కొందరు పెద్దల ఆశీస్సులతో పలువురు పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓలు, డీటీసీలుగా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు చేయడంపై చర్చ జరుగుతోంది. పాతుకుపోయారు.. ఉమ్మడి వరంగల్లో ఏళ్లతరబడి పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. భూపాలపల్లి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ అధికారి నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశారు. వివిధ పోస్టుల్లో అక్కడే పాతుకుపోవడంతో పాలన గాడి తప్పి అవినీతి పెరిగిందన్న ఆరోపణలున్నాయి. హనుమకొండ డీటీఓ ఆఫీసులో తెరవెనుక చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి సుమారు పదేళ్లుగా ఉమ్మడి వరంగల్లో వివిధ చోట్ల పనిచేసి పాతుకుపోయారన్న చర్చ ఉంది. ఏడాది క్రితం హనుమకొండకు బదిలీ కాగా.. కొద్ది రోజులకే ఏసీబీ దాడులు జరిగాయి. ఈ కేసులో డీటీసీ పుప్పాల శ్రీనివాస్ సస్పెండ్ కావడం కలకలం రేపింది. ఎంవీఐలే డీటీఓలు.. పలుచోట్ల ఇదే పరిస్థితి హనుమకొండ డీటీఓగా జూనియర్కు బాధ్యతలు తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు విచారణలు, ఆరోపణలున్నా.. కుర్చీలు వదలని అధికారులు ఆదాయం ఉన్న పోస్టింగ్ల కోసం ఇంకా పైరవీలు కీలక పోస్టుల్లో ఇన్చార్జ్లు.. హనుమకొండ డీటీఓ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ)గా ఉన్న పుప్పాల శ్రీనివాస్పై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేయగా సస్పెండయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కరీంనగర్ డీటీసీ పురుషోత్తంకు ఇన్చార్జ్ డీటీసీ బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ డీటీఓ పోస్టు ఖాళీ కావడంతో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన రమేశ్రాథోడ్కు ఇన్చార్జ్ డీటీఓగా ఇవ్వాల్సి ఉంది. అయితే కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక ఆతను ఆసక్తి చూపకపోవడంతో 2012 బ్యాచ్కు చెందిన వేణుగోపాల్కు ఇన్చార్జ్ డీటీఓగా నియమించినట్లు ప్రచారంలో ఉంది. మహబూబాబాద్ గౌసుపాషా ఏసీబీకి చిక్కడంతో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆయన స్థానంలో వరంగల్ ఎంవీఐ జైపాల్రెడ్డిని ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ములుగు డీటీఓ సిరాజ్ రెహమాన్ ఉద్యోగ విరమణ చేశాడు. అక్కడ ఎంవీఐ, డీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆయన స్థానంలో పెద్దపల్లి ఎంవీఐ బి.శ్రీనివాస్ను ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ప్రస్తుతం ములుగు ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా కూడా శ్రీనివాసే వ్యవహరిస్తున్నారు. జేఎస్ భూపాలపల్లి ఇన్చార్జ్ డీటీఓ వేణు బదిలీ తర్వాత ఎవరినీ నియమించ లేదు. అక్కడ ఎంవీఐగా ఉన్న సంధానికే ఇన్చార్జ్ డీటీఓ బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లి ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా సంధానీ పని చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ వేటు పడింది. డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై ఏసీబీ దాడులు జరిగిన మరుసటి రోజే లక్ష్మిని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె స్థానంలో ఎంవీఐ శోభన్బాబు ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి గాను హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీచేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఉదయం సెషన్లో 58.80శాతం.. మధ్యాహ్నం సెషన్లో 58.49శాతం హాజరు -
సౌధామిని.. పుష్కర మణి!
ప్రాణహితలో మునకలు.. పుష్కరిణికి పూజలు.. పారే నదికి దీపదానాలు.. ప్రవహించే తల్లికి చీరెసారెలు. పితృదేవతలకు పిండ ప్రదానాలు.. అండగా నిలవమని గోదావరికి నవరత్న మాల హారతులు. చదువుల తల్లి నిలువెత్తు రూపానికి భక్తుల నీరాజనాలు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి శత కోటి ప్రణామాలు. ఆదివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో నదీ పరిసరాలు కిక్కిరిశాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తనికెళ్ల భరణి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● ఇన్చార్జ్ ఓఎస్డీ, డీఎస్పీ రవీందర్ ములుగు: ప్రజలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, బలవన్మరణాలకు పాల్పడవద్దని జిల్లా ఇన్చార్జ్ ఓఎస్డీ, డీఎస్పీ నలువాల రవీందర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం తన కార్యాలయంలో ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ పరికిపండ్ల అశోక్ సమక్షంలో ఆత్మహత్యలపై రూపొందించిన కరపత్రాన్ని డీఎస్పీ ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఇరవై ఏళ్లుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటి వరకు 28 మంది జీవితాలను కాపాడడం అభినందనీయమన్నారు. ఇటీవల పోలీస్ శాఖలో ఎక్కువగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటుండడం బాధాకరం అన్నారు. త్వరలో డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో ఆత్మహత్యల నివారణ సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు రవీందర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, చిందం మొగిలి, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నం మోహన్కుమార్, ఆరోగ్యమిత్ర ప్రతినిధులు సహజ, శుభ, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. -
వాగులో డ్రిల్లింగ్ పనులు షురూ..
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి బ్రిడ్జి వద్ద నిర్మించబోయే హైలెవల్ బ్రిడ్జి పనుల నిమిత్తం వాగులో పిల్లర్ల కోసం డ్రిల్లింగ్ పనులు ఆదివారం ప్రారంభించారు. ఈ పనులు సకాలంలో పూర్తి కావాలని కోరుతూ కొండాయి, మల్యాల గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద మీనయ్య మాట్లాడుతూ జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ప్రజల కోరుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ పనులు వేగంగా, నాణ్యతగా పూర్తిచేయాలని కోరారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి ఏటూరునాగారం: కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదివాసీ గిరిజన మహిళా జిల్లా నాయకురాలు సరిత ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కర్రెగుట్టల్లో కాల్పులు జరుపుతున్న పోలీసులు అమాయకులైన గిరిజనులను హతమార్చడం సరికాదని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అత్యంత ఖనిజ నిల్వలు ఉండడంతో వాటిని తవ్వడానికి మావోయిస్టులు అడ్డు తగులుతారని ఉద్దేశంతో వారిని మట్టుపెడుతున్నారని వివరించారు. ఓడ బలిజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ఓడ బలిజలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సంఘం రాష్ట్ర కోశాధికారి బోట రమణయ్య, మండల అధ్యక్షుడు వీరన్న, కుల పెద్ద పోశాలు కోరారు. మండల కేంద్రంలోని ఓడవాడలో ఓడబలిజ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆదివారం ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఓడ బలిజలకు చేపలు పట్టేందుకు వలలు, బోట్లు, బైక్లు ఇవ్వాలని తెలిపారు. అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పానెం సాంబశివరావు, కర్ల శ్రీనివాస్, బోట తిరుపతమ్మ, గార మల్లయ్య, రమేష్, వంశీ, చందు, సంతోష్, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న పుష్కరాలుకాళేశ్వరం: మే 15నుంచి 26వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సరస్వతీ నది పుష్కరాలు (నేడు) సోమవారంతో ముగియనున్నాయి. సోమవారం ముగింపు కార్యక్రమాలను సాయంత్రం 6గంటల నుంచి నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తుంది. సుమారు వందకుపైగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణలు, భారీగా క్రాకర్స్ పేల్చి సంబురాలు జరుపనున్నట్లు తెలిసింది. ఇప్పటికే అవతలి తీరం వైపునకు బోటులో జనరేటర్, తదితర సామగ్రి తరలి వెళ్లినట్లు తెలిసింది. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు గణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఆది వారం స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రేగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని రూపిరెడ్డిపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన కొండ్ల వేణు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వ్యక్తిగత పనుల నిమిత్తం పరకాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జూకల్ నుంచి పరకాలకు వెళ్తున్న ఆటో రూపిరెడ్డిపల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో వేణుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న బొల్లికొండ శివవర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి సీతక్క తన కాన్వాయ్ను ఆపి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మేడారంలో భక్తుల సందడి
సమ్మక్కకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు● వనదేవతలకు మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో మేడారంలో జాతర కళ సంతరించుకుంది. మేడారానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల వద్ద భక్తులు స్నానాలు ఆచరించి వనదేవతల గద్దెల వద్దకు చేరుకున్నారు. చీరసారె, పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలను, కోళ్లను, మేకలను అమ్మవార్లకు మొక్కుగా చెల్లించారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ మధు, బాలకృష్ణలు భక్తులకు సేవలందించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గద్దెల ప్రాంగణంలో ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. సహపంక్తి భోజనాలు చేసి సందడి చేశారు. అమ్మవార్లకు బంగారం బాసింగాలు హైదరాబాద్లోని అబిడ్స్కు చెందిన వెంకటేశ్ కుమార్తె ప్రియాంకకు వివాహం జరగడంతో అమ్మవార్లకు బంగారం బాసింగాలు కానుకగా సమర్పిస్తామని మొక్కుకున్నారు. ప్రియాంక యూఎస్లో ఉండడంతో ఆమె తల్లిదండ్రులు 2.5 గ్రాముల బంగారం బాసింగాలను తయారీ చేయించి అమ్మవార్ల హుండీలో కానుకగా సమర్పించినట్లు వారు తెలిపారు. అమ్మవార్లకు ఒడిబియ్యం, చీరసారె, ఎత్తు బంగారం సైతం సమర్పించినట్లు వెల్లడించారు. -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ నియామకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కండక్టర్ల కొరత.. వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేట్ సంస్థ జేబీఎం ఆపరేట్ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమించేందుకు డ్రైవర్లకు టిమ్లు ఇచ్చి టికెట్ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రయివేట్ బస్సుల డ్రైవర్లకు టికెట్ జారీ చేసేందుకు టిమ్లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రయివేట్ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్ సోర్సింగ్ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్ సోర్సింగ్లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా.. ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేలు జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్ల నియామకం మరో 70 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్ల అవసరం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు, కండక్టర్లకు రూ.17,969 -
రహదారులకు మరమ్మతు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారులకు శనివారం అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు, సరస్వతి ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారులు బురదమయంగా మారిపోయాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అధికారులు హుటాహుటిన మరమ్మతు చర్యలకు పూనుకున్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా స్టోన్ డస్ట్ వేసి రహదారులను బాగుచేశారు. -
పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్య
ఎస్ఎస్తాడ్వాయి: రెండు సార్లు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఇందిరానగర్ గ్రామానికి చెందిన పెద్ది శృతి(19) చిన్నతనంలో తండ్రి నాగభూషణం మృతి చెందాడు. దీంతో ఆమె మేనమామ బండి శ్రీను మేనకోడలైన శృతిని సాదుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు ఇంటర్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఈనెల 23న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. ఈ విషయం గమనించి చికిత్స నిమిత్తం పీహెచ్సీకి తరలించగా పరిశీలించిన సిబ్బంది ములుగు ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యాధికారులు పరీక్షించి మృతి చెందినట్లు నిరార్థించారు. శనివారం బండి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ అక్కడకు చేరుకుని శృతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదని తెలిపారు. యువత క్షిణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి, సింగారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో భారీ వర్షం
ఏటూరునాగారంలో కురుస్తున్న వర్షంబురదమయంగా రోడ్లు ఏటూరునాగారం: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లు బురదమయంగా మారాయి. రోడ్లు సమాతరంగా లేకపోవడంతో పాటు సైడ్ డ్రైయినేజీలు సరిగా లేకపోవడం వల్ల పడిన వర్షం నీరు ఎటు వెళ్లలేక రోడ్లపైనే నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణికులు, బాటసారులు, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐలాపురం వెళ్లే రోడ్డు మట్టిరోడ్డు కావడంతో వాహనాలు దిగబడుతుండడంతో ట్రాక్టర్పైనే ప్రయాణించాల్సి వస్తోంది. ద్విచక్రవాహనాలు, ఫోర్ వీలర్స్ కూడా బురదలో దిగబడుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. -
చాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..
చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మనిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యామిలీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. మేం పాడే పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు. – సౌరపు యాకాంబరం, దీక్షకుంట, గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండ మండలం -
అభివృద్ధి పనులకు అటవీశాఖ సహకరించాలి
ములుగు: అభివృద్ధి కార్యక్రమాలకు అటవీశాఖ అడ్డుతగలకుండా సహకరించాలని మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణతో కలిసి అన్నారు. ఈ మేరకు శనివారం అటవీ శాఖ సమస్యలు, పర్యావరణం అడవులు, శాస్త్ర సాంకేతిక విధానం విభాగంపై ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఆర్అండ్బీ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అటవీ అభయారణ్య చట్టాల కారణంగా ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ రోడ్లు సైతం మంజురు కావడం లేదన్నారు. రహదారి సదుపాయం లేక ఆయా ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అడిగారు. ఏజెన్సీ ప్రజల సౌకర్యార్ధం బైక్ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. వన్య ప్రాణులకు ప్రమాదం జరుగుందని రోడ్లకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. వన్య ప్రాణుల కోసం ప్రత్యేక బ్రిడ్జిలను వేయడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చన్నారు. పక్క రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆ నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు. ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలలో రోడ్ల సదుపాయం అత్యవసరమని వివరించారు. మేడారం జాతర కోసం చేపడుతున్న ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. ఈ వీసీలో ములుగు జిల్లా తరఫున కలెక్టర్ టీఎస్.దివాకర హాజరయ్యారు. అదే విధంగా నేటి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్న గ్రామ పాలనాధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ఈ మేరకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా తరఫున కలెక్టర్ దివాకర హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు జవాబు పత్రాలను 9.20 గంటలకు ప్రశ్నా పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతులు లేదని, కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. మేడారం జాతరకు ప్రత్యామ్నాయ రోడ్లకు అనుమతివ్వాలి వీసీలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క -
పోచాపూర్ రోడ్డు విస్తరించాలి
ఎస్ఎస్తాడ్వాయి: కొడిశాల నుంచి పోచాపూర్ వరకు నిర్మిస్తున్న రోడ్డును నాలుగు మీటర్ల వెడల్పు విస్తరించాలని పోచాపూర్, బంధాల గ్రామాల్లోని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రోడ్డును పరిశీలించిన గ్రామస్తులు విలేకర్లతో మాట్లాడారు. కొడిశాల నుంచి పోచాపూర్ వరకు మూడు మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయడంతో ఎదురెదురుగా వచ్చే రెండు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. రోడ్డు మూడు మీటర్లు నిర్మించడంతో ఇరుకుగా ఉందన్నారు. అదే రోడ్డును నాలుగు మీటర్ల వెడల్పు చేయాలని మంత్రి సీతక్క దృష్టికి గతంలో తీసుకెళ్లినట్లు తెలిపారు. నాలుగు మీటర్ల రోడ్డు వేయడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నా అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మూడు మీటర్లకే పరిమితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోలెం ఆశోక్, నర్సయ్య, అలెం పెద్ద బాలయ్య, కొమురం మహేశ్, లక్ష్మయ్య, యాప శ్రీకాంత్, ఈసం స్వామి, నాలి శ్రావణ్, కోరం లక్ష్మయ్య, రంజిత్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
చకచకా ధాన్యం రవాణా
ములుగు: మండు వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో 15 రోజుల నుంచి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికి అందిన పంటను కోతకోసి కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకునే సమయంలో అనూహ్యంగా కురుస్తున్న వర్షాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో రైతన్నలు రోడ్డు కెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం రైతులకు అండగా నిలవడానికి కంకణం కట్టుకుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్కతో మాట్లాడి రైతులకు, మిల్లర్లకు నష్టం జరగకుండా చూసేలా అదనపు కలెక్టర్(రెవెన్యూ) చీమలపా టి మహేందర్జీ, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, జిల్లా అధికారి షా ఫైజల్హుస్సేన్ తగిన చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు చేరేలా చూస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాల కారణంగా వడ్లు తడిసినా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోంది. 55,995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జిల్లాలోని 10 మండలాల్లో ఈ ఏడాది 56,100 ఎకరాల్లో వరిపంటను రైతులు సాగు చేశారు. సివిల్ సప్లయీస్ శాఖ తరఫున ఐకేపీ, జీసీసీ, పీఏసీఎస్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టి 64వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకుంది. అయితే కేంద్రాలు ప్రారంభమైన తర్వాత అధికారులకు, మిల్లర్లకు సఖ్యత కుదరకపోవడం, అదే సమయంలో అనూహ్యంగా అకాల వర్షాలు పడుతుండడంతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. చివరికి జిల్లాకు చెందిన మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడానికి ముందుకు రావడంతో కొలిక్కివచ్చింది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక అగమ్యగోచరంగా ఉన్న రైతన్నలను చూసి మంత్రి సీతక్క తగిన నిర్ణయం తీసుకున్నారు. తాలు, తేమ పేరుతో ఇబ్బంది పెట్టకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని మిల్లర్లను ఆదేశించారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి చకచక మిల్లులకు ధాన్యం చేరుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి వరకు 4,537 మంది రైతుల నుంచి 55,995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ మేరకు రూ.77.30 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారు. గతేడాది ఇదే సమయం వరకు 18,308 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం మేరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేశాం. మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ దివాకర పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఆదేశాలిస్తున్నారు. ఇప్పటి వరకు రైతులు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని మిల్లర్లను సముదాయిస్తూ ముందుకు సాగుతున్నాం. తేమ ఎక్కువగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మినహాయింపు చేస్తున్నాం. గతేడాది కంటే ఈసారి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం. – రాంపతి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్రెండేళ్లలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు2023–24లో.. కొనుగోలు చేసిన ధాన్యం 18,308 మెట్రిక్ టన్నులు రైతుల సంఖ్య 2,670 చెల్లింపులు రూ.40.33 కోట్లు 2024–25లో(గురువారం వరకు) కొనుగోలు చేసిన ధాన్యం 55,995 మెట్రిక్ టన్నులు రైతుల సంఖ్య 7,638 చెల్లింపులు రూ.77.30 కోట్లు అకాల వర్షాలతో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే 55,995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో రూ.77.30 కోట్ల నగదు జమ -
స్లాట్ బుకింగ్పై అవగాహన తప్పనిసరి
ములుగు: రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టే స్లాట్ బుకింగ్పై ప్రతీ ఒక్క దస్తావేజులేఖరులు అవగాహన తప్పనిసరి కలిగి ఉండాలని జిల్లా రిజిస్ట్రార్ ఫణిందర్ అన్నారు. ఈ మేరకు దస్తావేజులేఖరులకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయనకు వారు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫణిందర్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 48 స్లాట్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతీస్లాట్ 10నిమిషాల్లో ఆన్లైన్లో పూర్తి చేయబడుతుందన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు సబ్ రిజిస్ట్రార్ దిలీప్చంద్రగోపాల్, దస్తావేజులేఖరులు సూర్యదేవర విశ్వనాధ్, సాదు రఘు, ప్రవీణ్, రామకృష్ణ, భాస్కర్, హరినాధ్, రాజేశ్, సుజాత పాల్గొన్నారు.జిల్లా రిజిస్ట్రార్ ఫణిందర్ -
జీవ నది.. ఉప్పొంగిన మది
నదిని చూసిన మది ఉప్పొంగింది. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది. చల్లని తల్లికి నమస్కరించాక భయం పటాపంచలైంది. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది. అని కాళేశ్వరానికి వచ్చిన వారు భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు. ‘సల్లంగ సూడు సరస్వతమ్మా’ అంటూ నీటిలో దీపాలు వదిలారు. గోదావరి మాతకు చీరసారె సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని రాష్ట్ర పరిశీలకులు, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. జిల్లాలో 20వ తేదీ నుంచి రెండో దశ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు జవహర్నగర్ మోడల్ స్కూల్, చల్వాయి మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సోమిరెడ్డి శిక్షణ శిబిరాలను పరిశీలించి మాట్లాడారు. ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని 2025–26 విద్యా సంవత్సరంలో బడి బాట ద్వారా విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు, సమాజానికి నమ్మకం పెంచాలన్నారు. ఈ మేరకు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పాణిని, కోర్స్ కో ఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి, సెంటర్ ఇన్చార్జ్లు సూర్యనారాయణ, అర్షం రాజు, గుల్లపల్లి సాంబయ్య, అప్పని జయదేవ్, మండల విద్యాశాఖ అధికారులు దివాకర్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పరిశీలకులు, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి -
బదిలీల కుదుపు
కొద్దిరోజులుగా పోలీస్శాఖలో హాట్టాపిక్త్వరలోనే ఎస్హెచ్ఓల వంతు.. ఇప్పటికే ఠాణాల్లో ఖర్చీఫ్లు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పలువురికి త్వరలోనే స్థానచలనం కలగనుంది. వాస్తవానికి ఇరవై రోజుల కిందటే జరుగుతాయన్న ప్రచారం జరిగింది. అయితే ఏసీపీ, డీఎస్పీల బదిలీ తర్వాత ఎస్హెచ్ఓలపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పలువురు సీఐలు ఎస్హెచ్ఓలుగా ఠాణాల్లో ఖర్చీఫ్లు వేసుకుని పోస్టింగ్లు పదిలం చేసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పని చేస్తున్న వారు గ్రేటర్ వరంగల్ ఠాణాలపై గురి పెట్టారన్న ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా మిల్స్కాలనీ పీఎస్లో సస్పెండైన ఎస్హెచ్ఓ వెంకటరత్నం స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పలువురు ఎస్హెచ్ఓలను బదిలీ చేస్తారన్న చర్చ పోలీసువర్గాల్లో సాగుతోంది. హనుమకొండ, హసన్పర్తి, సుబేదారి, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, ఏనుమాములలతో పాటు కమిషనరేట్ పరిధిలోని పన్నెండు ఠాణాల్లో ఎస్హెచ్ఓల మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఠాణాల్లో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధులనుంచి హామీలు పొందిన ఇన్స్పెక్టర్ల పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. సెలవులో వెళ్లిన వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తిరిగి విధుల్లో చేరాక ఈ ప్రక్రియ జరుగుతుందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో బదిలీల కుదుపు మొదలైంది. చాలా రోజుల తర్వాత ఉమ్మడి వరంగల్లో పలువురు డీఎస్పీ/ఏసీపీలకు స్థానచలనం కలిగింది. నార్త్జోన్–1 పరిధిలో పలువురు ఎస్హెచ్ఓలు బదిలీ కాగా, అడిషనల్ ఎస్పీలు కూడా మారారు. పది రోజుల వ్యవధిలో రేంజ్ పరిధిలో ఐదారు ఉత్తర్వుల ద్వారా 29మంది ఎస్హెచ్ఓల బదిలీలు అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్హెచ్ఓలు మారారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మరో ఇద్దరు డీఎస్పీలు, భారీ సంఖ్యలో సీఐ/ఎస్హెచ్ఓల ట్రాన్స్ఫర్లు ఉంటాయన్న ప్రచారం పోలీస్శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బదిలీల కలకలం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన డీఎస్పీ/ఏసీపీల మూకుమ్మడి బదిలీలు కలకలంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 77మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేయగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురికి స్థానచలనం కలిగింది. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్కుమార్ డీజీపీ ఆఫీస్కు బదిలీ కాగా, ఆ స్థానంలో ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా పనిచేసిన పున్నం రవీందర్ రెడ్డిని నియమించారు. కాజీపేట ఏసీపీ తిరుమల్ హైదరాబాద్ ‘హైడ్రా’స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమితులు కాగా, సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా ఉన్న పింగిళి ప్రశాంత్రెడ్డిని తీసుకువచ్చారు. మామునూరు ఏసీపీ బి.తిరుపతిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసి ఆయన స్థానంలో ఖమ్మం ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ను, రాచకొండ ’షీ’టీమ్ ఏసీపీగా పనిచేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అదే విధంగా సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్యను వరంగల్ సీసీఎస్ ఏసీపీగా నియమించగా.. త్వరలో మరో ఇద్దరినుంచి ముగ్గురు డీఎస్పీలకు స్థానచలనం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఖమ్మం అడిషనల్ డీసీపీగా ఉన్న ఎ.నరేష్కుమార్ భూపాలపల్లి ఏఎస్పీగా నియమించిన డీజీపీ, భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న బోనాల కిషన్ వరంగల్ ఏఎస్పీగా, కొమురంభీం ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఉన్న ఆర్.ప్రభాకర్రావును వరంగల్ కమిషనరేట్కు అదనపు డీసీపీగా నియమించారు. కమిషనరేట్పై పట్టు బిగిస్తున్న సీపీ.. వరంగల్ పోలీస్ కమిషనర్గా మార్చి 10న బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్.. కమిషనరేట్పై పట్టు బిగించారు. సీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోపే సుమారు 18 పోలీస్స్టేషన్లను విజిట్ చేసి పోలీసులు, అధికారులతో మాట్లాడి యోగక్షేమాలు, శాంతిభద్రతల గురించి ఆరా తీశారు. సబ్డివిజన్లు, పోలీసుస్టేషన్ల వారీగా నేరాల నమోదు, పరిశోధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఆయన నేరుగా బాధితులతో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులపై పనితీరుపైనా గ్రేడింగ్ చేస్తున్నారు. ఓ కేసులో వివాదాస్పదంగా మారిన మిల్స్కాలనీ సీఐ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు వేసిన సీపీ.. కట్టుదాటితే ఎవరిౖపైనెనా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే 8 మంది డీఎస్పీ/ఏసీపీల బదిలీ ముగ్గురు అడిషనల్ ఎస్పీలకు పోస్టింగ్ త్వరలో మరికొందరు డీఎస్పీలు.. సీఐలకు కూడా స్థానచలనం? పోస్టింగ్లకు హామీలు పొందిన ఎస్హెచ్ఓలు సెలవులో పోలీసు కమిషనర్.. వచ్చాక ప్రక్రియ మొదలు -
స్పెషల్ సర్వీస్లు నిరంతరం నడిపించాలి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఫుష్కరఘాట్ వరకు ఏర్పాటు చేసిన స్పెషల్ సర్వీస్లను నిరంతరం నడిపించాలని భూపాలపల్లి ఆర్డీఓ రవి ఆదేశించారు. బస్టాండ్ ఆవరణలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు స్పెషల్ సర్వీస్ బస్సుల నిర్వహణను ఆర్డీఓ శుక్రవారం పరిశీలించారు. బస్సులు నడపకుండా బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉంచడంతో డ్రైవర్లపై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి అధికారులతో మాట్లాడి సర్వీస్లను నిరంతరం నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులను ఆదేశించారు. -
భాగ్యరెడ్డి వర్మ సేవలు మరువలేనివి..
ములుగు: దళితుల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం భాగ్యరెడ్డి వర్మ అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్పీ శబరీశ్ అన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త, ఆది ఆంధ్రసభ వ్యవస్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ అధికారి లక్ష్మణ్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ దివాకర ముఖ్య అతిథిగా హాజరై భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శబరీశ్ ముఖ్యఅతిథిగా హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి నివాళులర్పించి భాగ్యరెడ్డి వర్మ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఐలు స్వామి, సంతోష్, వెంకటనారాయణ, ఎస్సై జగదీశ్, ఆర్ఎస్సై సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నారం బరాజ్ను పరిశీలించిన ఈఎన్సీ జనరల్
మహదేవపూర్ మండలం అన్నారం బరాజ్ను ఇరిగేషన్శాఖ ఈఎన్సీ జనరల్ అనిల్కుమార్ గురువారం పరిశీలించారు. జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా..శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025హనుమకొండ 2,898వరంగల్ 3,197 జేఎస్ భూపాలపల్లి 7,111 జనగామ 1,068 ములుగు 4,555 మహబూబాబాద్ 826సాక్షిప్రతినిధి, వరంగల్: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. తర్వాత జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు సంబంధించి.. నడికూడ (హనుమకొండ జిల్లా), వర్ధన్నపేట (వరంగల్), వెంకటాపురం (ములుగు), దంతాలపల్లి (మహబూబాబాద్), స్టేషన్ఘన్పూర్ (జనగామ), రేగొండ (జేఎస్ భూపాలపల్లి) మండలాలను ‘పైలట్’గా ఎంచుకున్నారు. ఆరు మండలాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. భూభారతి సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలనలపై ‘గ్రౌండ్రిపోర్ట్’. పైలట్ మండలాల వారీగా ఇదీ పరిస్థితి.. ● హనుమకొండ జిల్లా నడికూడలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 2,695 అర్జీలు రాగా, సదస్సులు ముగిశాక 203 అర్జీలు తహసీల్దారు కార్యాలయంలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 2,898 అర్జీల్లో అత్యధికంగా 1,456 సాదాబైనామా, 481 అసైన్డ్ సవరణ, 331 డీఎస్ పెండింగ్, 223 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడా తదితర అంశాలపై అర్జీలు అందగా.. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. ● వరంగల్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న వర్ధన్నపేట మండలంలో 3,197 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో 2,917 దరఖాస్తులు రాగా.. తహసీల్దార్ కార్యాలయంలో 280 దరఖాస్తులు రైతులు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా 1,415 సాదాబైనామాలు రాగా.. ఆతర్వాత అసైన్డ్ భూములకు సంబంధించి 746 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వ భూమార్పిడి కోసం ఏకంగా 192 దరఖాస్తులు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ నమోదైనవారు 155 మంది ఉన్నారు. ● జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలో సదస్సులు ముగిసినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. మొత్తం 1,068 దరఖాస్తులు వచ్చినట్లు అఽధికారులు చెబుతున్నారు. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 40శాతానికి పైగా.. సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారంలో సత్ఫలితాలు వస్తున్నాయని అఽధికారులు, రైతులు చెబుతున్నారు. ● ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,555 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో పలువురు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని పట్టా భూముల్లో ఉన్న సమస్యలను 40 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ● జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 7,111 దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు.అంశాలు, జిల్లాల వారీగా అర్జీల వివరాలు..అంశాలు హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగామ ములుగు మహబూబాబాద్ సాదాబైనామా 1,456 1,415 1,999 422 2,801 246 అసైన్డ్ 481 746 1,362 35 732 60 వారసత్వ మార్పిడి 223 192 290 140 430 56 భూ విస్తీర్ణంలో తేడాలు 134 155 338 84 101 101 డీఎస్ పెండింగ్ 331 45 247 29 100 20 మ్యుటేషన్ పెండింగ్ 16 33 06 41 20 23 మిస్సింగ్ సర్వే నంబర్లు 08 30 23 05 100 37 ఇనామ్–ఓఆర్సీ జారీ 119 28 00 07 01 07 భూ వివరణ 00 22 01 11 203 02 భూ సేకరణ 14 05 08 23 03 29 పేరు సరిచేయుట 21 04 19 11 21 22 నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 07 01 03 19 24 10 38 –ఈ ధ్రువపత్రం 00 01 00 00 19 00 ఇతర దరఖాస్తులు 88 520 2815 241 00 213ఆరు పైలట్ మండలాల నుంచి 19,655 దరఖాస్తులు సదస్సుల ద్వారా అర్జీల స్వీకరణ.. సాదాబైనామాలకే ఎక్కువ ప్రాధాన్యం ఆతర్వాత అసైన్డ్, వారసత్వ మార్పిడిలు ప్రధానంగా 12 అంశాలపై అర్జీలు ఆన్లైన్ పోర్టల్కూ దరఖాస్తులు.. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు -
ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!
మేఘం నీళ్లను కుమ్మరించినా.. ఈదురుగాలి చల్లగా పలకరించినా.. నేల చిత్తడిగా మారినా.. భక్తుల నిష్ట చెక్కు చెదరలేదు. రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కొందరైతే.. గంటలకు గంటలు ప్రయాణించి వచ్చిన వారు ఇంకొందరు. భక్తజనులతో కాళేశ్వరాలలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి. పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరముక్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. – మరిన్ని ఫొటోలు 8లోu -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం పలుచోట్ల ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.డిజిటల్ భూముల రీసర్వేపై అవగాహన సదస్సు వెంకటాపురం(కె): మండల పరిధిలోని బీసీ మర్రిగూడెం పంచాయతీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ డిజిటల్ భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్ జీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల పరిధిలోని డిజిటల్ భూ సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా నూగూరు(జీ) గ్రామం ఎంపికై ందని తెలిపారు. అనంతరం రైతులకు డిజిటల్ భూముల రీ సర్వే వివరాలపై అవగాహన కల్పించారు. పలువురు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూ.300 కూలి వచ్చేలా పని చేయించాలి ● ఏపీఓ రాజు వాజేడు: ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలకు రోజుకు రూ.300 కూలి వచ్చేలా పనులు చేయించాలని ఏపీఓ రాజు కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలు క్షేత్ర స్థాయిలో రూ.300 సరిపోను పని చేయకపోవడం వల్లే డబ్బులు తక్కువగా వస్తున్నాయని తెలిపారు. కూలీలకు ఈ విషయం వివరించి డబ్బులు ఎక్కువ వచ్చేలా పనులను చేయించాలన్నారు. అందుకు తగిన విధంగా మార్క్ చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ విజయ తదితరులు ఉన్నారు. ‘కేశవరావుది బూటకపు ఎన్కౌంటర్’ భూపాలపల్లి అర్బన్: మావోయిస్టు నేత నంబాల కేశవరావుది బూటకపు ఎన్కౌంటర్ అని.. పట్టుకొని కాల్చి చంపారని ఎమ్మెల్సీ కోందడరాం మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని ఓ వివాహానికి కోదండరాం గురువారం హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ అనేక మందిని ఇలాగే ఎన్కౌంటర్ చేసి చంపారన్నారు. ఈ ఎన్కౌంటర్పై చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. ఎన్కౌంటర్పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. -
మూడు నెలల ముందే అభివృద్ధి పనులు పూర్తి
ఏటూరునాగారం: 2026లో రాబోయే మేడారం మహాజాతరకు మూడు నెలల ముందుగానే అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో మేడారం జాతర అభివృద్ధి పనులు, పూజా విధానం, తదితర అంశాలపై కలెక్టర్ బుధవారం పూజారులతో సమీక్షించారు. 2026 మేడారం జాతర అభివృద్ధి పనులపై పూజారుల సూచనలు, సలహాలను కలెక్టర్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారంలో పూజారులు సమస్యలను ముందస్తుగా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. రోడ్ల సమస్యలు ఉంటే తెలపాలని కలెక్టర్ పూజారులను కోరగా కన్నెపల్లి నుంచి కాల్వపల్లి వరకు ఉన్న ఎడ్లబండ్ల రోడ్లను అభివృద్ధి చేస్తే వాహనాలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అలాగే కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మను తెచ్చే దారిలో షాపులను రోడ్డుకు దూరంగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు. వ్యాపారులు తాగునీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయించడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందుకు పూజారులతో ఓ కమిటీని వేసి ధరల నియంత్రణ చేపడుదామని వివరించారు. కొబ్బరి, బెల్లం లైసెన్సుల జారీ ప్రక్రియను జాతరకు నెల రోజుల ముందే పూర్తి చేయాలన్నారు. అధికారులు గుర్తించి అభివృద్ధి పనులకు అనుమతులు ముందస్తుగా ఇవ్వాలని పూజారులు సూచించారు. గుడి ఆవరణలో పూజా విధానాన్ని సమర్థవంతంగా పూజారులు నిర్వహించుకోవాలని, జాతర విజయవంతానికి అధికారులు పూర్తి బాధ్యత వహిస్తారని కలెక్టర్ తెలిపారు. పూజారులు గద్దెల నుంచి బయటకు, లోనికి వెళ్లే క్రమంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే పోలీసులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇందు కోసం పోలీసులు, పూజారులు, అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి ఐడీ కార్డులను జారీ చేయాలన్నారు. రాబోయే మేడారం జాతర విజయవంతానికి గతంలో జరిగిన లోటుపాట్లను పూజారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎండోమెంట్ అధికారులు క్రాంతి, రాజేందర్, రాజేశ్వర్రావు, ఏఓ రాజ్కుమార్లతోపాటు పూజారులు సిద్దబోయిన మునేందర్, కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, చందా రఘుపతి, దబ్బగట్ల గోవర్ధన్, పెనక ప్రబాకర్, పెనక రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర 2026 మేడారం మహాజాతర పనులపై పూజారులతో కలెక్టర్ సమీక్ష -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
తాడ్వాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలో బుధవారం పలుచోట్ల కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడి పరదాలు కప్పినా తడిసిపోయిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. చేతికి వచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అలాగే వర్షానికి మేడారం, ఎస్ఎస్ తాడ్వాయి మధ్యలో రోడ్డుపై చెట్టు అడ్డుగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వాహనాదారులు రోడ్డుపై చెట్టును కొంతమేర పక్కకు తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. -
రైతుల ఖాతాల్లోనే పంటనష్ట పరిహారం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని వివిధ కంపెనీల బాండ్ మొక్కజొన్న పంటసాగు చేసి నష్టపోయిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే నష్టపరిహారం ఆయా కంపెనీల బాధ్యులు చెల్లించేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ దివాకర అన్నారు. మండల పరిధిలోని యోగితానగర్లో బుధవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో బాండ్ మొక్కజొన్న పంట సాగు చేసి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. కంపెనీ నిర్వాహకులతో కలిసి రైతులకు కంపెనీ నుంచి ఎంత పెట్టుబడి పెట్టారు.. ఎంత పంటనష్టపోయారనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కంపెనీ నుంచి రైతులకు పెట్టుబడి పెడితే పెట్టుబడి పోను మిగిలిన మొత్తం నష్టపరిహారం రైతులకు కంపెనీ చెల్లిస్తుందని వెల్లడించారు. -
సరిహద్దుల సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: భూభారతి పైలట్ ప్రాజెక్ట్లో సరిహద్దుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ముత్యాల రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్జీకి బుధవారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ వెంకటాపురం(ఎం) మండలాన్ని భూభారతి పైలట్ ప్రాజెక్ట్గా ప్రకటించడం హర్షనీయమన్నారు. కానీ సరిహద్దు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. వెంటనే అధికారులు స్పందించి లింగాపూర్ వద్ద గల భూములపై ఉమ్మడి సర్వే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కంకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రహదారి నిర్మాణ పనులపై ఎమ్మెల్యేకు వినతి వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు, ధర్మవరం గ్రామాల మధ్యన నిలిచిపోయిన రహదారి పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆయా గ్రామాల ప్రజలు భద్రాచలం వెళ్లి వినతిపత్రం అందజేశారు. అటవీశాఖ అనుమతులు రావాలని చెబుతూ అధికారులు కాలయాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఆయన ములుగు కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకుని రహదారి పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో గౌరారపు సర్వేశ్వరరావు, నల్లగాసి రమేష్, బంధం కృష్ణ, నూకల రవి ఉన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారిగా సంజీవ్రావు ములుగు: జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా సంజీవ్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టరేట్లో కలెక్టర్ దివాకరకు ఆయన పూల మొక్కను అందించి మర్యాద పూర్వకంగా కలిశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సంజీవ్రావుకు కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ జిల్లా అధికారిగా విధులు నిర్వహించిన అనసూయ హనుమకొండకు బదిలీ అయ్యారు. బోర్వెల్ వాహనం సీజ్ కన్నాయిగూడెం: మండల పరిధిలోని గంగూడెం గ్రామ పరిధిలోని పోడు భూమిలో బోరు వేస్తున్న బోర్వెల్ వాహనాన్ని సీజ్ చేసినట్లు సౌత్ జోన్ రేంజ్ అధికారి అప్సర్ నిషా తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..గంగూడెంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా బోరు వేస్తున్నారనే సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని ఏటూరునాగారం రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు. ‘సదస్సును విజయవంతం చేయాలి’ ములుగు: ఈ నెల 24న కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నేత, ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్ మంద కుమార్మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అనుబంధ సంఘాల భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో ఎంఎస్పీ జాతీయ నాయకుడు పైడిమాదిగ, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కార్తీక్ పాల్గొన్నారు. -
పుష్కరిణీ.. ప్రణామం!
ఆకాశం అక్షింతలేసినట్లుగా చిరు చినుకులు.. నిశ్శబ్దంగా నది పరుగులు.. కాళేశ్వరం వైపు భక్తుల అడుగులు. వెరసి త్రివేణి సంగమం భక్త జన సందోహమైంది. ఏడో రోజు బుధవారం సైతం భక్తుల ప్రవాహం కొనసాగింది. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అంతర్వాహిని సరస్వతి నదికి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుమారు లక్షమందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు.– మరిన్ని వివరాలు, ఫొటోలు 8లోu● ఏడో రోజు కాళేశ్వరానికి తరలివచ్చిన భక్తజనం ● సరస్వతి ఘాట్లో స్నానాలు, ముక్తీశ్వరుడి దర్శనం -
మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక చొరవ
● ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఏటూరునాగారం: గిరిజన మత్స్యకారుల అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల పరిధిలోని ఐటీడీఏ కార్యాలయంలో దర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా బుధవారం మత్స్యకార అభివృద్ధిపై జిల్లాలోని 16 మంది గిరిజన మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, 33 ఆదివాసీ గ్రామ పంచాయతీల్లోని పెసా మొబిలైజర్లు, గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు 14 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందులో సభ్యులు సంఘంగా ఏర్పడి దరఖాస్తు చేసుకునే 6 రకాల పథకాలపై పీఓ వివరించారు. 14 రకాల పథకాల్లో ఏ పథకంపై ఆసక్తి ఉందనేది దరఖాస్తు ద్వారా మత్స్యశాఖకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సల్మాన్రాజ్, పాలేరు మత్స్యపరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త శ్యామ్ప్రసాద్, ఐటీడీఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, గిరిజనులు పాల్గొన్నారు. -
కీటకజనిత వ్యాధులపై అప్రమత్తం
డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగు: వర్షాకాలంలో ఎదురయ్యే మలేరియా, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు వంటి కీటకజనిత వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, మానిటరింగ్ సూపర్వైజర్లతో వచ్చే వర్షాకాల వ్యాధుల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు సూచనలు చేస్తూ దోమలు వ్యాప్తి చెందకుండా యాంటీ లార్వాలను నీటి నిల్వ ప్రాంతాల్లో వదలాలన్నారు. పీహెచ్సీల వారీగా హైరిస్క్ గ్రామాలను గుర్తించి దోమతెరల పంపిణీ చేపట్టాలన్నారు. ఆర్డీటీ, డెంగీ కిట్లను నిల్వ ఉంచుకోవాలన్నారు. టీమోపాజ్, మలాథియాన్ పైరిత్రిన్ రసాయనాలను సమకూర్చుకొని దోమల నివారణకు కార్యచరణ రూపొందిచుకోవాలన్నారు. ప్రతీ సబ్ సెంటర్ పరిధిలో శుక్రవారం డ్రైడే నిర్వహించాలన్నారు. వచ్చే మూడు నెలలకు సరిపడా మందులను ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, చంద్రకాంత్, రణధీర్, ఎస్ఓ స్వరూపరాణి, హెల్త్ ఎడ్యుకేటర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర గిరాకీ అంతంతే..
కాటారం: పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిన, ఏ పండుగ రోజు అయిన చిరు వ్యాపారుల ఉపాధికి కొదవ ఉండదు. కాళేశ్వరంలో జరిగే వేడుకలు ఉంటే చాలు జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, హైదరాబాద్, మహారాష్ట్రాల నుంచి చిరు వ్యాపారులు ముందుగానే ఇక్కడకు చేరుకొని చిరు వ్యాపారాలు ప్రారంభిస్తారు. పూజాసామాగ్రి, పూసలు, దండల దుకాణాలు, కిచెన్ సామగ్రి, వంట పాత్రలు, చిన్న పిల్లల బొమ్మలు, ఆకర్షించే వస్తువులు, ఇంటి అలంకరణ సామగ్రి, కూల్డ్రింక్స్, టిఫిన్ హోటల్స్ లాంటివి ఏర్పాటు చేసి భక్తులకు విక్రయిస్తుంటారు. త్రివేణి సంఘమ స్నానం, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు, మహిళలు, చిన్నారులు చిరు వ్యాపారుల వద్ద తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంతో వారికి ఉపాధి లభించేది. గతంలో నిర్వహించిన గోదావరి, ప్రాణహిత పుష్కరాల్లో సైతం పలు ప్రాంతాల నుంచి వచ్చిన చిరువ్యాపారులు తాము తీసుకొచ్చిన వస్తువులను విక్రయించి నాలుగు పైసలు సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుతం సరస్వతీ నదికి కొనసాగుతున్న పుష్కరాల్లో చిరు వ్యాపారాలు ఢీలా పడ్డాయి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని.. చిరు వ్యాపారులు ఆశించిన స్థాయిలో వ్యాపారాలు కొనసాగడం లేదు. ఈ నెల 15న సరస్వతీ పుష్కరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కావడంతో పాటు వేసవి సెలవు రోజులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించిన చిరు వ్యాపారులు ముందుగానే కాళేశ్వరం చేరుకొని తమ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆలయ పరిసరాలతో పాటు గోదావరి ఘాట్కు వెళ్లే రహదారి, సరస్వతీ ఘాట్కు వెళ్లే దారి, ప్రధాన ప్రాంతాల్లో పలు రకాల చిరు సామగ్రి విక్రయ దుకా ణాలను వ్యాపారులు పెట్టుకున్నారు. కానీ ఏడు రోజులుగా వారు ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగడం లేదు. మొదటి మూడు రోజులు భక్తుల రాక అంతంత మాత్రంగానే ఉండగా వ్యాపారులకు కనీసం బోణీ కూడా కాలేదు. ఆలయ పరిసరాల్లో భక్తులను ఎక్కువ సమయం ఉండనివ్వకపోవడం, భక్తుల రాకపోకల దారులను మారుస్తుండటంతో వ్యాపారాలు సరిగా జరగడం లేదని చిరు వ్యాపారులు తెలిపారు. కాగా ఇప్పటికే పలువురు చిరు వ్యాపారులు గిరాఖీలు లేకపోవడంతో తమ దుకాణాలను ఎత్తేసి వెళ్లిపోయారు. కనీసం తమ పెట్టుబడి అయిన చేతికి వస్తుందో లేదో అని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలు మరో ఐదు రోజులు మిగిలి ఉండటంతో గిరాఖీలు ఎలా ఉంటాయో అని వారు దిగులు చెందుతున్నారు. అనుకున్నంత గిరాకీ లేదు.. మాది ఆలయం ఎదుట కూల్డ్రింక్స్, వాటర్ బాటిల్స్ దుకాణం. ఏ పండుగ వచ్చిన, ఏ ఉత్సవం జరిగిన మాకు గిరాఖీ చాలా ఉండేది. కానీ ఈ పుష్కరాల్లో గిరాఖీ అనుకున్నంత లేదు. – సురేశ్, చిరువ్యాపారిఆశించిన స్థాయిలో జరగని వ్యాపారం ఏడు రోజులుగా విక్రయాలు కొద్ది మొత్తంలోనే.. పెట్టుబడి చేతికి వస్తుందో లేదో అని చిరు వ్యాపారుల ఆవేదన -
ఫ్రెండ్లీ పోలీసింగ్లో పస్రా పీఎస్ బెస్ట్
గోవిందరావుపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను పస్రా పీఎస్ బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఎంపికై ంది. ఈ మేరకు బుధవారం డీజీపీ జితేందర్ నుంచి పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ బుధవారం ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల అత్యుత్తమ సేవలు కనబర్చిన ఎస్హెచ్ఓలపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టగా రాష్ట్రంలోనే టాప్ 10 పోలీస్ స్టేషన్గా జిల్లా నుంచి పస్రా ఎస్సై కమలాకర్ ఒకరుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్సై కమలాకర్కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ తనకు ఎల్లవేళలా అండగా ఉన్న ఉన్నతాధికారులకు, తనకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపారు. ఈ సందర్భంగా పస్రా ఎస్సై కమలాకర్ను ఎస్పీ శబరీశ్ అభినందించారు. పోలీస్ సేవలపై క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణలో జిల్లా నుంచి పస్రా ఎస్సై కమలాకర్ ఒకరిగా నిలవడం అభినందనీయమని ఎస్పీ ప్రశంసించారు. -
మహిళలు, బాలికలకు అండగా సఖి కేంద్రం
● సఖి కేంద్రం అధికారి రాధ వాజేడు: మహిళలు, బాలికలకు సఖి కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సఖి కేంద్రం అధికారి వి.రాధ తెలిపారు. మండల పరిధిలోని చింతూరు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి మంగళవారం అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా సఖి కేంద్రం ఉంటుందని సూచించారు. గృహ హింసలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు మొదలైన హింసల నుంచి రక్షణ కల్పించనున్నట్లు వారికి వెల్లడించారు. సమాజంలో మహిళలు, బాలికలకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. అవసరమైతే సలహాలు, కౌన్సెలింగ్, రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏదైనా సమస్య వస్తే మహిళా హెల్ప్లైన్ నంబర్ 181కి ఫోన్ చేయాలని సూచించారు. ఆమె వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉన్నారు. -
లండన్లో చదువుకున్నా..మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డెపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృదద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజి, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేష్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
● డీపీఓ దేవరాజ్ ములుగు: గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు పాటుపడాలని జిల్లా పంచాయతీ అధికారి ఒంటేరు దేవరాజ్ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నిర్వహిస్తున్న భారత ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు, ఫిర్యాదుల విభాగం, పంచాయతీ రాజ్ గ్రామీణ ఆభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో మంగళవారం నిర్వహించిన శిక్షణ శిబిరానికి డీపీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, గ్రామసభల పాత్ర, ప్రజల భాగస్వామ్యం, సమాచార హక్కు చట్టం, పారదర్శకత వివిధ శాఖల సమన్వయం, మహిళా సాధికారత, బాలల హక్కులు అంశాలపై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా తిరంగా ర్యాలీ
ములుగు: ఆపరేషన్ సిందూర్లో భారత విజయానికి గుర్తుగా త్రివిధ దళాలకు మద్దతుగా వ్యాపారులు, ఆయా పార్టీల నాయకులు, వివిధ సంఘాల సభ్యులు ములుగులో మంగళవారం సాయంత్రం మూడు రంగుల జెండాలతో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పహల్గం ఉగ్ర దాడిలో మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్ నుంచి డీఎల్ఆర్ పంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. భారత్ వైపు చూస్తే ఎదుర్కొనేందుకు ఆర్మీ, వైమానిక, నౌక దళాలతో పాటు సామాన్య ప్రజలు సైతం సిద్ధంగా ఉంటారనేది పాకిస్తాన్ గ్రహించాలని హెచ్చరించారు. భారత్ సైన్యం చూపెట్టిన పరాక్రమం, ధైర్య సాహసాలను కొనియాడారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది సామాన్య ప్రజలు, యుద్ధంలో వీరమరణం పొందిన మురళీనాయక్ ప్రాణత్యాగం మరిచిపోలేనిదని నినదించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి ధ్వంసం చేసిన ఘనత భారత బలగాలదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మాజీ ఎంపీ సీతారాం నాయక్, విజయచందర్ రెడ్డి, గోవింద్ నాయక్, భాస్కర్ రెడ్డి, కుమార్, నాగరాజు, స్వరూప, సమ్మక్క, రమేష్ రెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు. -
హేమాచలుడి హుండీ ఆదాయం రూ.10.26 లక్షలు
మంగపేట: మండల పరిధిలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయ అధికారి శేఖర్, ఆలయ పరిశీలకుల పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా రూ.10,26,410 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన 8 హుండీలతో పాటు ఈ నెల 8 నుంచి 17 వరకు జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 7హుండీలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను స్వామివారి కల్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలతో పాటు కొంత బంగారం, వెండి మిశ్రమ వస్తువులు రాగా వాటిని ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలలో భద్రపరిచినట్లు ఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్కుమార్, రాజీవ్ నాగఫణిశర్మ, ఈశ్వర్చంద్, సిబ్బంది, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది నూతుల కంటి అజయ్, నవీన్, గొర్లపెల్లి గణేశ్, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరుకు చెందిన శ్రీవారి సేవా బృందం భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యార్థినులు క్రీడల్లోనూ రాణించాలి
వెంకటాపురం(ఎం): విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈఓ పాణిని సూచించారు. మండల పరిధిలోని జవహర్నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. ఈ ముగింపు శిక్షణ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి శిక్షణ తరగతుల్లో చదువులో నేర్చుకున్న మెలకువలతో పాటు క్రీడల్లోనూ దృష్టి సారించి ప్రతిభ చూపాలన్నారు. అనంతరం సమ్మర్ క్యాంపులో నైపుణ్యం చూపిన బాలికలకు డీఈఓ బహుమతులు అందజేశారు. అదే విధంగా సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థినులందరికీ సర్టిఫికెట్లను అందజేశారు. సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి వాజేడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేయాలని హౌజింగ్ ఏఈ ఎండీ.ఇషాక్ హుస్సేన్ కోరారు. మండల పరిధిలోని జంగాలపల్లిలో మంగళవారం బిల్లం సుధాకర్ ఇంటికి ఆయన ముగ్గు పోశారు. అనంతరం నాగారం గ్రామ పంచాయతీలో 64 ఇళ్లు మంజూరు ఓ ఇంటి నిర్మాణ పనులకు ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసే కొద్ది డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతాయని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 22అడుగుల వెడల్పు, 18 అడుగుల అడ్డంతో ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. ‘ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి’ కన్నాయిగూడెం: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపి వేసి మావోస్టులతో చర్చలు జరపాలని అసైన్డ్ భూమి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది కలకోట మహేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి మండల పరిధిలోని ఏటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు సాధనపల్లి చందు(అలియాస్ రవి) ఇటీవల కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులను చర్చలకు పిలవాలన్నారు. యువత, మేధావులు, విద్యావంతులు మావోయిజం వైపు కాకుండా అంబేద్కరిజం వైపు పయనించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు భిక్షపతిగౌడ్, జనార్ధన్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు వెంకట్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సమ్మన్న పాల్గొన్నారు. -
భక్తులకు ఆహ్లాదం..
మెరుగులు దిద్దుకున్న ముక్తివనం పార్కు కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరానికి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో ఆహ్లాదంతో పాటు.. సేదదీరేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరంలోని ముక్తివనం పార్కును మెరుగులు దిద్దారు. ఇందుకోసం సీసీఎఫ్ ప్రభాకర్, కలెక్టర్ రాహుల్శర్మ, డీఎఫ్ఓ నవీన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పార్కు ప్రత్యేకత ఏంటంటే.. కాళేశ్వరంలోని ముక్తివనం పార్కులో నాలుగు ఏసీ ట్రీహౌస్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఏసీ గదులను రోజుకు రూ.2,500 చొప్పున అద్దెకు ఇస్తున్నారు. గదులు అద్దెకు ‘మీ టికెట్’ యాప్లో ఆన్లైన్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అడవిలో సేదదీరొచ్చు. రాశివనం, పంచవటి వనం, నక్షత్ర వనం, సప్తరుషి వనం, సైకిలింగ్ పాత్వే, వాకింగ్పాత్వేలు ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు, ప్రీ వెడ్డింగ్, బర్త్డే, షూట్స్ కూడా జరుగుతున్నాయి. వీటికి టిక్కెట్టు రూ. 1000 వరకు ఉంది. వాటర్ ఫాండ్, ఇతర ఆహ్లాదాన్ని పంచేవిధంగా పార్కును సిద్ధం చేశారు. పెద్దలకు రూ.20, చిన్నలకు రూ. 10 ప్రవేశ టికె ట్ ధర తీసు కుంటున్నారు. పుష్కర స్నానాలు, శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో సేదదీరడానికి చాలా మంచి ప్రాంతంగా చెప్పవచ్చు. వీటిని ఎఫ్ఆర్ఓ రవికుమార్, ఎఫ్ఎస్ఓలు ఆనంద్, తిరుపతి, ఎఫ్బీఓ శ్రీలత పర్యవేక్షిస్తున్నారు. పుష్కర భక్తులు సేదదీరేందుకు సిద్ధం చూడముచ్చటగా ఏసీ ట్రీహైస్లు బుకింగ్ కోసం ‘మీ టికెట్’ యాప్ -
పనుల్లో వేగం పెంచాలి
ములుగు: జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అవసరమైతే అదనపు కూలీలతో షిఫ్ట్ల వారీగా పనులు చేయించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్అండ్బీ ఈఈ రఘువీర్, డీఈ రాంమూర్తి, జేఈ రాకేశ్ తదితరులు ఉన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశాం..
ములుగు : గతంలో కంటే ఈ ఏడాది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చీమలపాటి మహేందర్జీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం రవాణా, గన్నీ సంచుల సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను నేరుగా తెలియజేయడానికి పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్రూంతో పాటు టోల్ఫ్రీ నంబర్ 93474 16178ను ఏర్పాటు చేశామని తెలిపారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ అందించే వాతావరణ రిపోర్ట్ ఆధారంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. అలాగే 2022–23 యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యం–12,882 మెట్రిక్ టన్నులు కాగా, 2023–24లో కొనుగోలు చేసిన ధాన్యం–15,699 మెట్రిక్ టన్నులు. 2,024 మొత్తం రైతులకు, 16.27 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.2024–25లో కొనుగోలు చేసిన ధాన్యం47,449 మెట్రిక్ టన్నులు చెల్లించిన నగదు రూ.61.48 కోట్లు మొత్తం రైతుల సంఖ్య 6,599 చెల్లింపు అయిన రైతుల సంఖ్య 3,444సుందరయ్య జీవితం ఆదర్శం భూపాలపల్లి రూరల్: పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రమేశ్ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్ధంతిని జిల్లా కమిటీ సభ్యుడు ఆకుదారి రమేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు సుందరయ్య అని అన్నారు. గ్రామాన్ని అర్థం చేసుకోవడం అంటే దేశాన్ని అర్థం చేసుకోవడం అనే వారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజన్న, వంగల విజయలక్ష్మి, గడప శేఖర్, నాయకులు సమ్మక్క, జ్ఞానేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
చిన్న కాళేశ్వరం పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కాటారం శివారులోని 501లో కొనసాగుతున్న కాల్వ నిర్మాణ సర్వే పనులను భూ నిర్వాసిత రైతులు సోమవారం అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే ఊరుకునేది లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. రికార్డుల్లో నష్టపరిహారం అందినట్లు ఉందని నిబంధనల ప్రకారం తాము పనులు చేపడుతామని సర్వే, ఇరిగేషన్ అధికారులు రైతులకు తేల్చిచెప్పారు. తమకు ఎలాంటి పరిహారం అందలేదని, పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు నిర్వాసిత రైతులకు స్పష్టం చేశారు. పనులు అడ్డుకున్న వారిలో రైతులు దుర్గం తిరుపతి, సాంబమూర్తి, తదితరులు ఉన్నారు. -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్తజన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని నదిమాతల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు.. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరుడిని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలో వేచి చూశారు.– మరిన్ని వివరాలు, ఫొటోలు 8లోu -
రెండో దఫా శిక్షణకు హాజరుకావాలి
గోవిందరావుపేట : రెండో దఫా శిక్షణకు ఉపాధ్యాయులు తప్పనిసరి హాజరు కావా లని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటినుంచి నాలుగు రోజుల పాటు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. 20వ తేదీ నుంచి తెలుగు, హిందీ, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు మండలంలోని చల్వాయి మోడల్ స్కూల్లో, బయోసైన్స్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు చల్వాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు మోడల్ స్కూల్ జవహార్నగర్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజే డు, వెంకటాపురం(కె), మంగపేట మండలాల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఏటూరునాగారంలోని జెడ్పీఎస్ఎస్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారని వివరించారు. ప్రతి ఉపాధ్యాయుడు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు విధిగా హాజరు కావాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని -
నేడు ములుగులో తిరంగా ర్యాలీ
ఏటూరునాగారం : దేశభక్తిని చాటేందుకు నేడు(మంగళవారం) ములుగు జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశాన్ని రక్షించిన సైనికులకు మద్దతుగా జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు, పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో గండెపల్లి సత్యం, జనార్దన్, గడ్డం శ్రీధర్, యానాల చంద్రారెడ్డి, శ్రీను, నాగేశ్వర్రావు, దుర్గారావు, అజిత్ పాల్గొన్నారు. పెండింగ్ రోడ్ టాక్స్ చెల్లించాలిములుగు : వాహనదారులు పెండింగ్లో ఉన్న త్రైమాసిక రోడ్డు టాక్స్లను చెల్లించాలని, విధిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ములుగు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో సీట్ బెల్టు వేసుకోకుండా ప్రయాణిస్తే తగిన చర్యలు ఉంటాయన్నారు. గడువులోగా రుసుం చెల్లించని వాహనం తనిఖీల్లో పట్టుబడితే 200 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు తమ వెంట ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, రోడ్ టాక్స్, హెల్మెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాల గడువు మరో 5 సంవత్సరాలు పెంచడానికి పునరుద్ధరణ చేసుకోవాలన్నారు. ఐరన్ పోల్స్ ఏర్పాటు వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప ఆలయ పరిధిలో గల శివాలయానికి సోమవా రం పురావస్తు శాఖ అధికారులు ఐరన్ పోల్స్ ఏర్పాటు చేశారు. శివగుడిగా పిలవబడే ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకొని కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలో భాగంగా ఆలయం చుట్టూ ఐరన్ పోల్స్ (స్క్రప్ హోల్డింగ్) ఏర్పాటు చేశారు. ఆలయానికి చెందిన శిల్పాలు ధ్వంసం కాకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు ఐరన్ పోల్స్ ఏర్పాటు చేసినట్లు పురావస్తుశాఖ జిల్లా అధికారి నవీన్కుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన ములుగు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాజాతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మల్లంపల్లి మండలంలోని రాంచంద్రాపురంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలపై కళాకారులు స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం, గృహజ్యోతి, భూభారతి, రైతు భరోసా పథకాలతో పాటు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కళాకారులు తమ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు రహీమొద్దిన్, మార్త రవి, రాగుల శంకర్, రేలా విజయ్, గోల్కొండ భిక్షపతి, అమ్మపాట తిరుపతి, కిషన్, రాజేందర్, సురేష్, భాస్కర్, నరేష్, దీపక్, శ్రీలత, శోభా, రాము తదితరులు పాల్గొన్నారు. కాటారం డీఎస్పీ బదిలీ కాటారం: కాటారం సబ్ డివిజన్ డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ సాధారణ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కాటారం డీఎస్పీగా పని చేస్తున్న రామ్మోహన్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ భూపాలపల్లి జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న బి.నారాయణను కాటారం నూతన డీఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
ములుగు : మా బాధలు వినండి.. సమస్యలు పరిష్కరించండంటూ జిల్లాలోని ఆయా గ్రామాల ప్రజలు ప్రజావాణిలో విన్నవించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంపత్రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందులో భాగంగా 37 దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు అందించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న వినతుల విషయంలో అలసత్వం వద్దని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా భూ సమస్యలు పరిష్కరించాలని 10, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తొమ్మిది, పెన్షన్ కోసం ఇద్దరు, ఉద్యోగావకాశం కల్పించాలని ఒకరు, ఇతర సమస్యలపై 15 అర్జీలు వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, సివిల్ సప్లయ్ జిల్లా అధికారి ఫైజల్ హుస్సేన్, జిల్లా మేనేజర్ రాంపతి, డీఎస్సీఓ లక్ష్మణ్నాయక్, డీసీఓ సర్దార్సింగ్, డీడబ్ల్యూఓ శిరీష, డీపీఓ దేవరాజ్, విద్యుత్ డీఈ నాగేశ్వర్రావు, లీడ్బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్ ఉన్నారు. గిరిజన దర్బార్కు 12 వినతులు ● అర్జీలు స్వీకరించిన పీఓ చిత్రామిశ్రా ఏటూరునాగారం : గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరి ష్కరించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సెక్టార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజల నుంచి 12 వినతులు స్వీకరించారు. వెంకటాపురం(కె) మండలంలోని సూరవీడులో ఎదిర ఏరియా ఆస్పత్రిలో స్వీపర్ పోస్టు ఇప్పించాలని గిరిజన మహిళ కోరారు. ఏటూరునాగారం మండలం శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఐటీడీఏ ద్వారా జీసీసీ నుంచి ఇప్పించాలని నిర్వాహకులు విన్నవించారు. ఐటీడీఏ ఎదుట ఉన్న రెండు షట్టర్లలో హోటల్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన పలువురు జ్యూట్ బ్యాగ్ మిషన్స్, రా మెటీరియల్ సెంటర్ ఏర్పాటుకు గది ఇప్పించాలని మహిళలు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను కోరారు. గోవిందరావుపేట మండలం ఇప్పలగడ్డకు చెందిన ఓ గిరిజన మహిళా జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో పీఈటీ ఉద్యోగం ఇప్పించాలి విన్నవించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి పీఎంహెచ్బీ ఆఫీస్ సబార్డినేట్ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని బాధితుడు కోరారు. కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, డీడీ పోచం, మేనేజర్ శ్రీనివాస్, ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, ఏఈ ప్రభాకర్ పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయండి ఆశ్రమ పాఠశాల్లోని ఎస్టీ హాస్టళ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాగటి రవితేజ, రవి కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఏడు నెలల నుంచి హాస్టళ్ల బిల్లులు విడుదల కాకపోవడంతో వార్డెన్లు అప్పులు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బాలేశ్వర్, నర్సింగరావు పాల్గొన్నారు. – రవితేజ, రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులునా కొడుకును ఆదుకోండి నా కుమారుడు బొజ్జ మహేశ్ ఎనిమిది నెలలుగా అంతుచిక్కని చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పటికే అనేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించాం. అయినా నయం కావడం లేదు. ఆర్థిక స్థోమత లేక ప్రస్తుతం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా డు. మెరుగైన వైద్యం కోసం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, వైద్య విభాగం తరఫున ఆర్థికంగా ఆదుకోవాలి. నా కుమారుడిని కాపాడుకోవడానికి సహకరించాలి. – బొజ్జ సుగుణ, గోవిందరావుపేట కొడుకు,కోడలి నుంచి రక్షణ కల్పించండి నా పెద్ద కుమారుడు వల్స మధు, కోడలు సంధ్య నుంచి మాకు ప్రాణహాని ఉంది. వారి నుంచి రక్షణ కల్పించండి. నాకు ఇద్దరు కుమారులు, కూతురు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడికి ఎకరం 20 గుంటల భూమిని, ఇంటిని పంపకాలు చేశాను. తాళ్లగడ్డలోని రెండు గుంటల ఖాళీ స్థలాన్ని పెద్ద కుమారుడికి ఇచ్చాను. అయినా సరిపోనట్టు చిన్న కుమారుడి రెండు గదులను ఆక్రమించుకొని తాళం వేసుకున్నాడు. ఏంటని అడిగితే తీవ్ర పదజాలంతో తిడుతూ మెడపట్టి మమ్ములను బయటికి గెంటేశాడు. ఈ విషయంపై విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కోరారు. – వల్స సడాలయ్య, ఏటూరునాగారం ఎస్సీ కార్పొరేషన్ రుణం ఇప్పించండి నాకు ముగ్గురు ఆడపిల్లలు. దంపతులిద్దరం కూలీ చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రస్తుత కుటుంబ పోషణ భారంగా మారింది. పట్టణాలకు వెళ్లి ఉద్యోగం చూసుకుందామంటే పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సిమెంట్ బ్రిక్స్ యూనిట్ మంజూరు చేయిస్తే కుటుంబాన్ని కాపాడుకుంటాం. – సంగి శిరీష, గోవిందరావుపేట ●నష్ట పరిహారం ఇప్పించండి వాజేడు : బాండ్ వరి సాగు చేయగా దిగుబడి తగ్గి నష్టాలు వచ్చాయని తమకు పరిహారం ఇప్పించాలని కోరుతూ మండల పరిధిలోని పూసూరు రైతులు కలెక్టర్ కార్యాయంలో ఫిర్యాదు చేశారు. మంగపేట మండలానికి చెందిన వేణు తమ గ్రామంలో 82 ఎకరాల బాండ్ వరి సాగు చేయించాడని తెలిపారు. ఎకరానికి రూ.42వేల పెట్టుబడి ఇచ్చి, 8 క్వింటాల దిగుబడి వస్తుందని నమ్మించినట్లు వివరించారు. దిగుబడి తగ్గితే రూ.60 వేలు నష్ట పరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఎకరాకు కేవలం 2 క్వింటాల దిగుబడి మాత్రమే వచ్చిందని, పరిహారం ఇవ్వాలని ఫోన్ చేస్తే ఎటువంటి సమాచారం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఎంపీడీఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. రైతులు పూనెం ప్రసాద్, బడే షణ్ముక రావు, నల్లెబోయిన పాపారావు, వాసం పెంటయ్య, బడే చిన్నన్న తదితరులు ఉన్నారు. – కలెక్టర్లో ఫిర్యాదు చేస్తున్న వాజేడు రైతులు అదనపు కలెక్టర్ సంపత్రావు ప్రజావాణిలో 37 దరఖాస్తులు -
హేమాచలానికి పుష్కర భక్తుల తాకిడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రానికి సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల సందర్శనతో రెండ్రోజుల నుంచి భక్తుల తాకిడి అధికమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వచ్చి, వెళ్లే భక్తులు హేమాచల క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. సోమవారం మూడు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు శేఖర్ శర్మ, పవన్కుమార్, రాజీవ్ నాగఫణి శర్మ ఈశ్వర్ చంద్ భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించి తీర్థప్రసాదాలను అందజేశారు. -
పుష్కరాల్లో పోలీసు జులుం!
కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల తీరు మారడం లేదు. భక్తుల పట్ల మర్యాదను మరిచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చాం.. మాకు ఏమి కాదనే భావనతో విధులు నిర్వర్తిస్తూ భక్తులకు శాపంగా మారారనే విమర్శలను పోలీసులు మూటకట్టుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారులతో వచ్చిన ఓ ట్రావెల్ను కాళేశ్వరంలోని గుండం చెరువు వద్ద విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ నిలిపి వారిని దేవస్థానం ఆవరణకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. వారితో వాగ్వాదానికి దిగాడు. ‘కరీంనగర్ కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తాను.. నాకు ఏమి కాదు..వీడియో కూడా తీసుకొండి’ అంటూ ప్రస్తుత ప్రభుత్వంపై దుర్భాషలాడినట్లు తెలిసింది. సోమవారం దేవస్థానంలోకి వెళ్లడానికి వస్తున్న దేవాదాయశాఖ ఏడీసీ కేడర్ అధికారినితో అక్కడున్న ఎస్సై స్థాయి అధికారులు అడ్డుకొని అనుమతివ్వలేదు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. పైగా పోలీసు, దేవాదాయ, ఉత్సవ కమిటీ, విలేకరుల సిఫారసులపై వచ్చిన వారిని కూడా ఇబ్బందులకు గురిస్తున్నారు. నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా.. కాళేశ్వరం గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు వారి కుటుంబ సభ్యులతో పుష్కర స్నానానికి సరస్వతీఘాట్కు బైక్పై వెళుతుండగా ములుగు జిల్లాకు చెందిన ఓ ఎస్సై వారిని అడ్డుకున్నారు. పాస్లు ఉంటే పంపిస్తామన్నారు. కాళేశ్వరం గ్రామస్తులకు పాస్లు ఎక్కడ తీసుకురావాలనగా బైక్ కీ తీసుకున్నాడు. దీంతో అతని వదినతో మహిళ అని చూడకుండా ‘నిన్ను పోలీస్స్టేషన్లో కూర్చోబెడతా’ అంటూ పోలీసు జులుం ప్రదర్శించాడు. దీంతో వారు అక్కడే కాసేపు పోలీసు తీరుపై బైఠాయించడం వ్యతిరేకంగా నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఓ ఎమ్మెల్యే కాన్వాయ్ రావడంతో ఆయన వాహనానికి అడ్డువెళ్లగా ఏంటని ప్రశ్నించాడు. దీంతో జరిగిన విషయం తెలపడంతో ఆ ఎస్సైతో వాహనం తాళం చెవి ఇప్పించి వెళ్లాడు. కాగా, అతనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. దేవస్థానం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్, ఘాట్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్, ఎస్సైల స్థాయి వారితో ఆ శాఖకు అప్రతిష్ట జరుగుతుందని, ఐపీఎస్ స్థాయి అధికారులు ఎంత చెప్పిన వారి పోలిసింగ్ చూపెడుతున్నారని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్న భక్తులు కాళేశ్వరం వాసులకు తప్పనితిప్పలు -
సొంతింటి కలసాకారం చేయడమే లక్ష్యం
ములుగు రూరల్: పేదల సొంతింటి కలసాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్తో కలిసి మండలంలోని జగ్గన్నపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరుపేదల కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అందిస్తుందని తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారులు సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దళారులను నమ్మి మోసపోకూడదని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రూ.5లక్షలు అందించడం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఎంపీడీఓ రామకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కోలాహలంగా మారింది. మేడారం పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. మేడారానికి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, గాజులు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలు, కోళ్లతో మొక్కు సమర్పించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహాపంక్తి భోజనాలు చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచన వేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్ గద్దెల ప్రాంగణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా మైకు అనౌన్స్మెంట్ ద్వారా భక్తులను అప్రమత్తం చేశారు. కాళేశ్వరం టు మేడారం మేడారానికి వచ్చిన భక్తులు.. కాళేశ్వరానికి వెళ్లడం.. అక్కడకు వెళ్లిన భక్తులు ఇక్కడకు వస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. మేడారానికి వచ్చిన భక్తులను పలకరించగా అమ్మవార్లను దర్శించుకుని కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తామని చెప్పారు. కొందరు భక్తులు కాళేశ్వరం సరస్వతి నదిలో పుష్కర స్నానాలు అచరించి పూజలు నిర్వహించి మేడారానికి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చినట్లు సాక్షి కి తెలిపారు. కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఆదివారం మేడారంలో మినీ జాతర కళ సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన భక్తులు సరస్వతి పుష్కరాల నేపథ్యంలో పెరిగిన భక్తుల సంఖ్య -
హెచ్ఐవీ బాధితులకు అండగా ఉందాం
ములుగు: హెచ్ఐవీ బాధితులకు అండగా ఉండాలని రాయిని గూడెం పీహెచ్సీ వైద్యుడు నాగ అన్వేష్ అన్నారు. ఆదివారం తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ములుగు సహకారంతో దిశ ములుగు ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేను జిల్లా ఆస్పత్రిలో నిర్వహించారు. హెచ్ఐవీతో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. వైద్యులు నాగ అన్వేష్, ప్రేమ్ సింగ్, ప్రదీప్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం మే మూడో ఆదివారం క్యాండిల్ లైట్ మెమోరియల్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవీపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏరియా ఆస్పత్రి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. హెచ్ఐవీతో మృతి చెందిన వారి ఆత్మ శాంతికి మౌనం పాటించారు. కార్య క్రమంలో దిశ సీపీఎం జ్యోతి, ఐసీడీపీ కౌన్సిలర్లు కుమార్ సింగ్, వెంకటేశ్వర్లు, ములుగు, బండారు పల్లి, జంగాలపల్లి, జాకారం, ఏఎన్ఎమ్లు, ఆశ కార్య కర్తలు, లింక్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. తునికాకు కూలీకి పాముకాటు వాజేడు: తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్లిన కూలీ పాము కాటుకు గురైంది. స్థానికులు, ఆమె భర్త లోహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన పూనెం శ్రీలత తునికాకు సేకరణ కోసం సమీపంలోని ములుకనపల్లి గ్రామం అవతల ఉన్న అడవిలోకి వెళ్లింది. తునికాకు సేకరిస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. వాజేడు వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి ఏటూరునాగారం అక్కడి నుంచి ములుగు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు లోహమూర్తి తెలిపాడు. ప్రజలు సుభిక్షంగా ఉండాలి కాటారం: కాళేశ్వర ముక్తీశ్వరుడి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తీన్మార్ మల్లన్న ఆదివారం కుటుంబ సమేతంగా సరస్వతి ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మహేశ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రంకు ఎనలేని చరిత్ర ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తుందన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మల్లన్న తెలిపారు. మల్లన్న వెంట తీన్మార్ మల్లన్న టీం జిల్లా అద్యక్షుడు రవిపటేల్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ హరిశంకర్, తదితరులు ఉన్నారు. ‘చెన్నయ్య ఆరోపణలు సరికాదు’ కాళేశ్వరం: మంత్రి శ్రీధర్బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నారని అవగాహన రాహిత్యంతో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపణలు చేయడం సరికాదని నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సెగ్గం రాజేష్ అన్నారు. ఆదివారం మహదేవపూర్ మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ మాట్లాడారు. సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కూడా అందించారని, ప్రొటోకాల్కు దేవాదాయ శాఖ కమిషనర్కు సంబంధం ఉండదని, అది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) చూ సుకుంటుందని సూచించారు. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో అనేక దళితుల హత్యలు జరిగినప్పుడు స్పందించని చెన్నయ్య మంత్రి శ్రీధర్బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నాడని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో నేతకాని సంఘం మహదేవపూర్ మండల యూత్ అధ్యక్షు డు కొండగొర్ల సంతోష్, పూతల శ్యామ్ సుందర్, జాడి రాజసడవల్లి, దుర్గయ్య, నరేష్, రాజ బాపు, జనార్దన్, బానేష్, నవీన్ పాల్గొన్నారు. -
హేమాచలుడి సన్నిధిలో భక్తుల రద్దీ
● జాతర ముగిసినా తరలివస్తున్న భక్తులు మంగపేట: మండలదలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) ముగిసినా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఆదివారం సైతం యథావిధిగానే కొనసాగింది. ఈనెల 8వ తేదీన అంకురార్పనతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం వసంతోత్సవంతో ముగిసిన విషయం తెలిసిందే. జాతర సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు రాలేకపోయిన వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతోపాటు ప్రతి ఆదివారం ఆలయంలో నిర్వహించే స్వామివారి తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని సంతానం ప్రాప్తి కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. హనుమాన్ మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 08 గంటల నుంచి సాయంత్రం 06 గంటలవరకు ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్కుమార్, రాజీవ్ నాగఫణిశర్మ ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట ఆలయ పూజారులు గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, డీసీ ఎంలలో కుటుంబ సబ్యులతో వచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లోని ఽదైత(వనదేవత) ప్రాగణం, చెట్ల కింద వంటలు చేసుకుని సాయంత్రం వర కు స్వామివారి సన్నిధిలో సంతోషంగా గడిపారు. 20న హుండీల్లోని కానుకల లెక్కింపు మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో 10 రోజులపాటు నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) ముగిశా యి. దీంతో బ్రహ్మోత్సవా సందర్భంగా ఆలయ క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు వేసిన కానుకల లెక్కిపు ఈనెల 20న కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ వెల్లడించారు. -
రోగులకు నాణ్యమైన భోజనం అందించాలి
ములుగు: ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ సూచించారు. శనివారం వెంకటాపురం(ఎం) మండలం గుర్రంపేటకు చెందిన గర్భిణి ఝాన్సీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ తరఫున ఆస్పత్రి సిబ్బంది రోగులకు భోజనం వడ్డిస్తున్నారు. కూరలు నాణ్యతగా లేకపోవడంతో నిర్వాహకుడితో మాట్లాడి మరోసారి ఇలాంటి తప్పిదం జరిగితే విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. అనంతరం ఝాన్సీకి ఉమ్మ నీటి సమస్య ఉందని తెలుసుకుని డ్యూటీలో ఉన్న వైద్యురాలితో మాట్లాడారు. గతంలో బండారుపల్లికి చెందిన గర్భిణీ విషయంలో జరిగిన తప్పిదం కారణంగా ప్రభుత్వం, మంత్రి సీతక్క ఇబ్బందులు పడ్డారన్నారు. పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఓపీలో నిర్దిష్ట సమయం వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులను సూచించారు. ఆయన వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్, జక్కుల రేవంత్, పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు తదితరులు ఉన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఏరియా ఆస్పత్రి పరిశీలన -
ముగిసిన హేమాచలుడి బ్రహ్మోత్సవాలు
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈనెల 8 నుంచి ప్రారంభమైన లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు (జాతర) గత పది రోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రావణం సత్యనారాయణ ఆధ్వర్యంలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా జరిపించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు నృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక గజవాహన పల్లకీ సేవపై ఉంచి వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని యాగశాల నుంచి మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పల్లకిపై ఆలయ పురవీధుల్లో వసంతోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా యాగ్నిక పూజారులు సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ భక్తులపై రంగులను చిలకరిస్తూ ఆనందం నడుమ వసంతోత్సవాన్ని నిర్వహించారు. అనంత రం ఆలయ ప్రాంగణంలోని ర మాసమేత సత్యనారాయణస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతర చివరిరోజు భక్తులకు పలువురు దాతలు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు శేఖర్ శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్ చందు శర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డ్ అసిస్టెంట్ గోనె లక్ష్మీనారాయణ, సిబ్బంది శివరాజు శేషు, నూతల కంటి అజయ్, నవీన్, గొల్లపల్లి గణేశ్, బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు సురేశ్, వేమ రవి, దామెర సారయ్య, చందర్లపాటి శ్రీనివాస్, అనిత ఉన్నారు. -
టోల్ వసూళ్ల నిలిపివేత
కాటారం: కాళేశ్వరం వచ్చే వాహనాలకు గ్రామపంచాయతీ టెండర్ ద్వారా వసూలు చేస్తున్న టోల్ ఫీజును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ శనివారం తెలిపారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో శనివారం నుంచి భక్తుల వాహనాల రాక విపరీతంగా పెరిగిపోయింది. కాళేశ్వరం ప్రారంభంలోని ముక్తివనం వద్ద టెండర్దారులు వాహనాలను నిలిపి టోల్ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ వాహనాలను నిలిపి టోల్ఫీజు వసూలు చేయవద్దని టెండర్దారులను ఆదేశించారు. టోల్ఫీజు చెల్లించవద్దని వాహనదా రులకు సూచించారు. అటువైపుగా వచ్చే వాహనా లకు టెండర్దారులు టోల్వసూలు నిలిపివేశారు. సర్టిఫికెట్ల ప్రదానం భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అందించారు. సోలార్ 24మంది, డ్రోన్ 29మంది శిక్షణ తీసుకున్నారు. వృత్తి శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించి జీఎం మాట్లాడారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్కు బాటలువేసేలా ఉంటుందన్నారు. స్వయంగా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. -
జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలి
వాజేడు: జీఓ నంబర్–3ను పునరుద్ధరించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలోని ఆదివాసీ యువతకు ఉపయోగపడే జీఓను 2020లో రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా.. గత ప్రభుత్వం ఒక్క రివ్యూ పిటిషన్ వేయకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆదివాసీ సమాజం పక్షాన రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జీఓ పునరుద్ధరణ కోసం ఆదివాసీ సంఘాలు ఐక్యంగా ప్రభుత్వంపై ఆందోళనల రూపంలో ఒత్తిడి తీసుకొచ్చేలా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. దీనిలో భాగంగా.. మే 31న భద్రాచలం ఐటీడీఏను ముట్టడిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 108లో ప్రసవంవాజేడు: మండల పరిధి బొల్లారం గ్రామానికి చెందిన సీహెచ్.రమాదేవి 108 అంబులెన్స్లో శనివారం ఉదయం బిడ్డకు జన్మనిచ్చింది. బొల్లారం గ్రామానికి చెందిన రమాదేవికి పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్లో వెంకటాపురం(కె)కు తరలించారు. మొదటి కాన్పు కావడంతో ప్రసవం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వైద్యుల సూచన మేరకు ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. ఈఎంటీ రాజ్యలక్ష్మి, పైలెట్ కుమారస్వామి 108 ఆంబులెన్స్లో తీసుకెళ్తుండగా.. ఏటూరునాగారం సమీపంలో రమాదేవి ప్రసవించింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. విద్యుత్ షాక్తో యువకుడి మృతివెంకటాపురం(కె): మండల పరిధి బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన బొల్లె ప్రశాంత్(29) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు బయట నిద్రించేందుకు ఫ్యాన్ వైర్లను స్విచ్ బోర్డులో పెడుతున్న సమయంలో ప్రశాంత్కు విద్యుత్ షాక్ తగిలింది. బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందిస్తుండగా అతడు మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరించారు. మూడో రోజు అన్నదానం భూపాలపల్లి రూరల్: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వచ్చే భక్తులకు భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ వద్ద జాతీయ రహదారి పక్కన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో మూడోరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే భక్తులకు భోజనం వడ్డించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భోజనం చేశారు. కార్యక్రమంలో కమలాపూర్ మాజీ సర్పంచ్ తోట సంతోశ్, భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ సిరుప అనిల్, అప్పం కిషన్, తోట రంజిత్, మహేందర్, చరణ్, కోటి, హఫీజ్, సాయితేజ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో 10వేల మంది తరలింపు భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాల్లో భాగంగా మూడో రోజు శనివారం వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి 183 ఆర్టీసీ బస్సుల్లో 10,500 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం నుంచి సాయంత్రం 6గంటలకు 170 బస్సులో 7,500 మంది తిరిగి వెళ్లినట్లు తెలిపారు. పూనెం ప్రతాప్ -
తిరంగా యాత్రను విజయవంతం చేయాలి
ములుగు రూరల్: దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న సైనికులకు, విధి నిర్వహణలో వీరమరణం పొందిన సైనికుల గౌరవార్థం చేపడుతున్న తిరంగా యాత్రను విజయవంతం చేయాలని తిరంగ యాత్ర జిల్లా కన్వీనర్ భూక్య జవహర్లాల్ అన్నారు. ఈమేరకు శనివారం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్ నుంచి జాతీయ రహదారిపై తిరంగ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ సైనికులకు మద్దతుగా ఆపరేషన్ సిందూర్ వీర విజయాన్ని స్మరించుకుంటూ ర్యాలీ కొనసాగుతుందని, ర్యాలీలో విద్యార్థులు, కుల సంఘాలు, ఉద్యోగులు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సిరికొండ బలరాం, భాస్కర్రెడ్డి, ిపింగిళి నాగరాజు, దుభాషి రమేశ్, గోవింద్నాయక్, మధు, కుమార్, రాహుల్, రవీంద్రచారి, శ్రీను, రాజన్న, నాగరాజు, కృష్ణాకర్, రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలి
● అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ ఏటూరునాగారం: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. శుక్రవారం మండలంలోని జీసీసీ కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని రెండు రోజుల్లో ఖాళీ చేసి మిల్లర్లకు పంపిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తడిసి ధా న్యం కూడా పంపిస్తామన్నారు. మొలకలు వచ్చిన ధాన్యం ఏ సమయంలో కొనుగోలు కేంద్రానికి వ చ్చారని రైతులను ఆరా తీశారు. మొలక రావడం బాధాకరమని, వాటిని కూడా తీసుకుంటామన్నా రు. 17 శాతం తేమ కంటే ఎక్కువ ఉంటే క్వింటాకు కిలో తరుగు కింద ధాన్యం కోత విధిస్తామన్నారు. వచ్చే ఏడాది సురక్షిత ప్రాంతాల్లోనే.. వచ్చే ఏడాది నుంచి వర్షాలతో బురద, జలమయం కాకుండా ఉండే మెట్ట ప్రాంతాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ఎంపిక చేసుకోవాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. రైతులు సొంతంగా వాహనం మాట్లాడుకొని ధాన్యం బస్తాలను మిల్లులకు తీసుకొస్తే కిరాయి చెల్లిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయఅధికారి ఫజల్, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీటీ రాహుల్, జీసీసీ మేనేజర్ వాణి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు ● సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ ● కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం ● పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వీఐపీలుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలతో పాటు పసుపు, కుంకుమ, చీరె, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవరత్నమాల హారతి ఇచ్చారు. గోదావరి, ఆలయ పరిసరాల్లో కిటకిట.. శుక్రవారం తెల్లవారుజామునుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లనుంచి తరలివచ్చిన భక్తజనంతో గోదావరి తీరం, ఆలయం కిక్కిరిసింది. ఉదయంనుంచి 10గంటలలోపు భక్తులు పలుచగా ఉండగా, మధ్యాహ్నం వరకు రద్దీ పెరిగింది. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిట లాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల వైపునుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షెటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడినుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీకెండ్స్లో పెరగనున్న భక్తుల తాకిడి.. శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి రెట్టింపుస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు శుక్రవారం వచ్చిన భక్తులతోనే నిండాయి. శని, ఆదివారాల్లో లక్షమందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవని, లేనిపక్షంలో ఎండకు మాడిపోవాల్సిందేనని భక్తులు అంటున్నారు. వీఐపీల రాక.. రెండవ రోజు శుక్రవారం సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాంలు పుష్కర స్నానాలు చేసి, శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. పుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు IIలో.. -
చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు
● వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ములుగు: చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు చే యాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కమిషనర్ డీఎస్ చౌహాన్తో కలిసి ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లా తరఫున కలెక్టర్ టీఎస్ దివాకర, అడిషనరల్ కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. హమాలీలు, వాహనాల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. భారీగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నప్పటికీ, ధాన్యం కొనుగోలు లేదనే తప్పుడు వార్తలను తిప్పికొట్టాలన్నారు. సమస్యలు ఏమైన ఉంటే పరిష్కరించాలని సూచించారు. వాతావరణంలో మార్పుల దృష్ట్యా కేంద్రాల వద్ద గన్నీబ్యాగులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కాన్ఫరెన్స్లో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, జిల్లా అధికారి సయ్యద్షా ఫైజల్ హుస్సేనీ, అధికారులు పాల్గొన్నారు. ‘ఉపాధి’లో ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలి ఉపాధి హామీ పనుల్లో ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాజీవ్ యువవికాసం స్కీం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా కాన్సెంట్ ఇప్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సురెన్స్ ఉండేలా చూడాలని, జూన్ 2న హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్రావు, డీపీఓ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నయనానందకరంగా నాగవెల్లి
మంగపేట: ఈనెల 8వ తేదీ నుంచి జరుగుతున్న మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా (జాతర) 9వ రోజు శుక్రవారం లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ ఉత్సవమూర్తులకు నాగవెల్లి కార్యక్రమాన్ని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందంచే నయనానందకరంగా నిర్వహించారు. స్థాని క అర్చకులతో కలిసి ఉదయం 8గంటలకు ఉత్సవమూర్తులకు చతుస్నానార్చన, 9 గంటలకు అభిషేకం, 10 గంటలకు చక్రస్నానం నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద చక్రస్నానం తిలకించేందుకు యాత్రికులు పోటెత్తారు. అనంతరం ఆలయంలో సుదర్శన నరసింహ భవనంలో హోమ కార్యక్రమాలను కొనసాగించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఆలయంలో మహా పూర్ణాహుతి నాగవెల్లి బాదశ ఆరాధనలతో పాటు పుష్పయాగం నివేదన మహా కుంభ ప్రోక్షణ తీర్థ గోష్టి ప్రసాద వినియోగం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి యాత్రికులు విశేషంగా హాజరై వేడుకలను తిలకించారు. నేటి (శనివారం) వసంతోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగి యనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ సురేష్, పవన్ కుమారాచార్యులు పాల్గొన్నారు. పోటెత్తిన యాత్రికులు నేటితో ముగియనున్న మల్లూరు బ్రహ్మోత్సవాలు -
స్టాళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్బాబు
కాళేశ్వరం: సరస్వతినది పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అందుబాటులో ఉండే సదుపాయాలను, సేవలను సమీక్షించేందుకు మంత్రి శ్రీధర్బాబు విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు, భక్తులకు సరఫరా చేసే తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్వచ్ఛత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కన్ సింగ్ రాజ్ఠాకూర్, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ, డీఆర్డీఓ నరేష్ పాల్గొన్నారు.మేడారంలో భక్తుల మొక్కులుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛతీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనల్లో మేడారానికి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఓడిబియ్యం, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్ భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. దోమల నివారణ సామాజిక బాధ్యతములుగు: దోమల నివారణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే డెంగీ వంటి ప్రాణాంతక జ్వరాలను అరికట్టగలమని డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్రావు అన్నారు. ఈ మేరకు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్ఓ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులతో సమన్వయంగా ఉంటూ గ్రామాల్లో నీటినిల్వలు లేకుండా, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపై ఉందన్నారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో కీటకజనిత వ్యాధుల నియంత్రణ అధికారి ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, కమ్యునిటీ హెల్త్ అధికారి సంపత్రావు, సబ్ యూనిట్ అధికారులు వెంకట్రెడ్డి, భూపాల్రెడ్డి, నరసింహారావు, సాంబయ్య, సురేష్బాబు, అరుణ, దేవేందర్, ల్యాబ్ టెక్నీషిన్లు, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. కొనసాగుతున్న తునికాకు కోతలు ఏటూరునాగారం: మండలంలోని దొడ్ల, కొండాయి, ఐలాపురం తదితర ప్రాంతాలు రిజర్వు ఫారెస్టు అయినప్పటికీ అటవీశాఖ, కల్లేదారులు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి తునికాకు కోయిస్తున్నారు. అక్కడ అధికారిక కల్లాలు లేనప్పటికీ కాంట్రాక్టర్ కావాలనే తునికాకు కోయించి అక్రమమార్గంలో తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఆకుకోసే కూలీల పేర్లు జాబితాల్లో రాకపోవడంతో కూలీతోపాటు బోనస్ను కోల్పోయే ప్రమాదం ఉంది. వెంటనే రిజర్వు ఫారెస్టులో తునికాకు సేకరణను నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్రెడ్డి
మంత్రి శ్రీధర్బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్బాబును, అధికారులను అభినందించారు. మంత్రులు ఏమన్నారంటే.. ● మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. ● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు. – మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8లోu -
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. -
వైభవంగా హేమాచలుడి ‘తెప్పోత్సవం’
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం మల్లూరు క్షేత్రంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే ఎద్దు ముక్కు ఆంజనేయస్వామికి ఉదయం 8గంటలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమాన్ని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, యాజ్ఞకులు అమరవాది రామ నరసింహాచార్యులు, శ్రీపెరంబుదూరు మదన మోహనాచార్యులు, మణిదీపాచార్యులు, శ్రీమాన్ రామచంద్రాచార్యులు, అభిరామాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెప్పోత్సవం తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు సాయంత్రం 6 గంటలకు స్వామివారి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవ, దీపోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తెప్పోత్సవ, దీపోత్సవ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రవణం సత్యనారాయణ, ఆలయ బ్రహ్మోత్సవ ఉత్సవ కమిటీ చైర్మన్ యరంగారి సురేశ్, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు కారంపూడి పవన కుమారాచార్యులు, ఏడునూతల ఈశ్వరచంద్, రామానుజన్ శర్మ, ముక్కామల వెంకటనారాయణ శర్మ, రాజీవ్ శర్మ, ఆలయ సిబ్బంది నేతానీ సీతారాములు, లక్ష్మీనారాయణ, శేషు, అజయ్, గణేశ్, నవీన్, నాగార్జున్, మహేష్, పుల్లయ్యలు పాల్గొన్నారు. మహా అన్నదానం శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం గుట్టపై వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో, కమలాపురం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5వేల మంది భక్తులకు అన్నదానం చేశారు.ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకంఅశ్వవాహనంపై ఊరేగింపు హేమాచల క్షేత్రంలోని నర్సింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించడంతో సందడి వాతావరణం నెలకొంది. -
ఆయిల్పామ్.. అధిక లాభాలు
వాజేడు: జిల్లాలో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రాకపోగా ప్రతీ ఏడాది నష్టాలను చవి చూస్తున్నారు. ఈ క్రమంలో లాభసాటి పంటల వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సా గుపై రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ పంట సాగు చేసిన రైతులకు ప్రభుత్వం రాయితీలు అధికంగా కల్పిస్తోంది. దీంతో జిల్లాలోని 9మండలాల పరిధిలో 763మంది రైతులు 2,648ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేశా రు. అదే విధంగా అంతర్ పంటగా మరో పంటను సాగుచేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. రాయితీ ఇలా.. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ముందుగా అధికారులు పంట సాగుపై అవగాహన కల్పించడంతో పాటు రాయితీ వివరాలను వెల్లడిస్తున్నారు. మొక్కల కొనుగోలులో సైతం కొంత రాయితీ కల్పించగా డ్రిప్కు సైతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీంతో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. టన్నుకు రూ.21 వేలు.. ఆయిల్పామ్ మొక్కలను మూడేళ్లపాటు జాగ్రత్తగా పెంచాలి. తర్వాత పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. దిగుబడి వచ్చే నాటికి టన్నుకు రూ.21 వేల మద్దతు ధర లభిస్తుంది. దీంతో రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. అదే విధంగా ఈ మూడేళ్లలో ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర్ పంటలను సైతం సాగు చేసుకునే వీలుంది. మూడేళ్ల తర్వాత దిగుబడి ప్రారంభం కావడంతో రైతులకు ఆదాయం సమకూరుతుంది. ఇలా 30ఏళ్ల పాటు ఆదాయం పొందే అవకాశం ఉండడంతో రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.మండలాల వారీగా రైతులు సాగుచేసిన పంట వివరాలుమండలం రైతులు ఎకరాలు ములుగు 144 467.82 ఏటూరునాగారం 64 165.34 కన్నాయిగూడెం 18 40.92 గోవిందరావుపేట 139 442.64 మంగపేట 118 432.19 ఎస్ఎస్ తాడ్వాయి 102 264.04 వెంకటాపురం(ఎం) 80 285.65 వాజేడు 48 291.47 వెంకటాపురం(కె) 50 257.92 ప్రభుత్వం నుంచి రాయితీలు టన్నుకు రూ.21వేల ధర 30ఏళ్ల పాటు దిగుబడిరైతులకు అవగాహన కల్పిస్తున్నాం.. మండలాల వారీగా స్థానిక అధికారులతో కలిసి ఆయిల్పామ్ సాగు, సబ్సిడీ గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మొక్కల కొనుగోలులో ఒక్కో మొక్కకు రూ.232కాగా అందులో రైతు రూ.20చెల్లిస్తే మొక్కలను అందిస్తారు. డ్రిప్కు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీ కాగా బీసీలకు 90శాతం, ఓసీ రైతులకు 80శాతం మేర రాయితీ లభిస్తుంది. ఒక రైతుకు 12ఎకరాలకు మాత్రమే డ్రిప్ సబ్సిడీ వస్తుంది. దీంతో ఆయిల్పామ్ సాగును రైతులు ఇష్టపడి సాగుచేస్తున్నారు. – అనసూయ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి
ములుగు: దివ్యాంగులు అత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో దివ్యాంగులకు వాహనాల పంపిణీని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగత్వం అంటే కేవలం ఒక విభాగానికి పరిమితమని, దాన్ని మనస్సు దాక రానివద్దని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను వినియోగించుకుంటూ లక్ష్యాల సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. దివ్యాంగులకు విద్యాపరమైన అంశాల్లో 4 శాతం, సంక్షేమ పథకాల్లో 5శాతం రిజర్వేషన్ కల్పి స్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎంపీడీఓ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలి గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను బుధవారం మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన చేయడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీఈఓ పాణిని, కోర్సు కో ఆర్డీనేటర్ మల్లారెడ్డి, సెంటర్ ఇన్చార్జ్లు జయదేవ్, రాజు, సాంబయ్య పాల్గొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు.. ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణులకు ప్రత్యేక బహుమతుల అందజేతసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(ఎం) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, సీపీ సన్ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హోటల్లో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. ముందుగా తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. చారిత్రక ఆలయాన్ని చూసి మురిసిపోయారు.నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్తో సందడి చేసి, ఆలయం చుట్టూ ప్ర దక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరీమణులకు సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండ్ క్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించడంతో ఆసక్తిగా విన్నారు. కాకతీయుల నాలుగు కీర్తితోరణాల నడు మ నళ్ల రాతిలోని శిల్ప కళ సంపదను అందాల భా మలు మరింత ఆసక్తిగా తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్లో ప్రదర్శించగా... ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్తో కూడిన బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేష్ వారికి వివరించగా శిల్పకళ సంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ముఖ్య అతి థిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆల య ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. -
న్యాయ విజ్ఞాన సదస్సు
ములుగు: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ములుగులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వాహన చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ సీనియర్ జడ్జి కన్నయ్యలాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాధాన్యతను వివరించారు. బీమా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్ట విరుద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీనివాస్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో విద్యములుగు రూరల్: చిన్నారులు ఒత్తిడికి గురికాకుండా ఆటపాటలతో విద్యను నేర్పించేందుకు అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగపడుతాయని జిల్లా సంక్షేమ అధికారి శిరీష అన్నారు. ఈ మేరకు బుధవారం వ్రతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లంపల్లి, బండారుపల్లి అంగన్వాడీ కేంద్రాలలో ఫ్రీస్కూల్ సంసిద్ధత మేళా నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల్లో శారీరక, మానసిక, సామాజిక, భాష, పూర్వగణిత సంసిద్ధతపై చిన్నారుల తల్లిదండ్రులను అవగాహన కల్పించామని తెలిపారు. చిన్నారులు చిన్నతనంలో నేర్చుకున్న అంశాలు జీవితకాలం గుర్తుంటాయని వివరించారు. చిన్నారుల ప్రవర్తనపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కమరున్నీసబేగం, వ్రతం కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.భక్తుల సందడిమంగపేట: మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు బుధవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చింతామణి జలపాతం వద్ద నీటిని తాగి ఆహ్లాదంగా గడిపారు. కొబ్బరికాయలను కొట్టి పూజలు చేశారు. శిఖాంజనేయస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం, షాపుల వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.వ్యాపార అభివృద్ధిపై అవగాహనములుగు రూరల్: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని గిరిజన సహకార సంఘాల సభ్యులకు వ్యాపార అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఐసీఎం డైరెక్టర్ జారీసన్ అభివృద్ధి ప్రణాళికపై సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సహకార సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎం డిప్యూటీ డైరెక్టర్ శ్యాంకుమార్, రిటైర్డ్ డీసీఓ జనార్ధన్రెడ్డి, జిల్లా సహకార సంఘం కార్యాలయ ఉద్యోగులు రాజేష్, చంద్రశేఖర్, సహకార సంఘాల సీఈఓలు పాల్గొన్నారు.నూతన భవనాల ఆవిష్కరణగోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్లో బుధవారం నూతనంగా నిర్మించిన వివిధ భవనాలను రాష్ట్ర ప్రత్యేక పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, ఆర్ఐలు శోభన్ బాబు, కార్తీక్, సాల్మన్ రాజు, శ్రీనివాస చారి, రాంప్రసాద్, స్వామి, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక ● సరస్వతిఘాట్లో పుణ్యస్నానం ఆచరించనున్న సీఎం రేవంత్రెడ్డి దంపతులు ● లక్షలాదిగా తరలిరానున్న భక్తజనంజయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉద యం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్లో పుణ్య స్నానం ఆచ రించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ముఖ్యులు పాల్గొననున్నారు. – కాళేశ్వరం – వివరాలు 8లోu -
సీడ్ ధాన్యమంతా కొట్టుకుపోయింది
ఆడమగ సీడ్ ధాన్యం మొత్తం తడిసిపోయింది. అకాల వర్షానికి గింజ పనికి రాకుండా పోతుంది. తడిసిన సీడ్ ధాన్యాన్ని కంపెనీ వారు సైతం కొనుగోలు చేయమని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆర్థికంగా రైతులను ఆదుకోవాలి. – వట్టం అమృత, సీడ్ ధాన్యం రైతు, గోగుపల్లి, ఏటూరునాగారం 90బస్తాల వడ్లు కొట్టుకుపోయాయి గోగుపల్లిలో కురిసిన అకాల వర్షంతో 90బస్తాల వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. వారం రోజులుగా కాంటా వేయకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం చేశారు. తరుగు తీస్తామని, తేమ ఉందని జాప్యం చేశారు. – ఈసం నారాయణ, రైతు, గోగుపల్లి, ఏటూరునాగారం ఐదెకరాల ధాన్యం తడిసిపోయింది ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. మూడు రోజుల క్రితం మిషన్తో వరి కోయించాను. ధాన్యాన్ని అమ్ముకునేందుకు కల్లంలో ఆరబోశాను. అకాల వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయింది. కష్టపడి పండించి చేతికి వచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – ఈసం వెంకన్న, గంగారం, ఎస్ఎస్తాడ్వాయి● -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
మల్లూరులో ఘనంగా రథోత్సవం
మంగపేట: మండల పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని అమరవాది కృష్ణమాచార్యుల బృందం ఆగమనశాస్త్రం ప్రకారం పండితులు, రుత్వీకులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు చతుస్త్రావార్చన, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, శిఖాంజనేయస్వామికి పంచామృతాలతో ఘనంగా అభిషేకాన్ని నిర్వహించారు. దేవతామూర్తులను పూలతో అలంకరించి రాత్రి 7 గంటలకు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకి మోసేందుకు భక్తులు బారులుదీరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన కుమారాచార్యులు, ఈశ్వర్చంద్, భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవాలయం పండితులు రుత్వీకులు, అమరవాది రామనర్సింహాచార్యులు, పెరుంబూదూర్ మధనమోహన్చార్యులు, మణిదీపాచార్యులు, అభిరామచార్యులు, రాచంద్రచార్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎర్రంగారి నరేశ్, నాసిరెడ్డి నాగిరెడ్డి, పల్నాటి సత్యం, దామెర సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సీతక్కను విమర్శించే హక్కు కవితకు లేదు’
ములుగు: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ను కవిత చదివారన్నారు. రామప్పను దర్శించుకోవడానికి వచ్చిన ఆమె రామప్ప ప్రతిష్ట గురించి మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. వర్షాల సమయంలో రైతులకు అండగా సీతక్క నిలిచి అండగా నిలిచారన్నారు. వర్షాలు పడినప్పుడు కనిపించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ సమావేశంలో ఎండీ చాంద్ పాషా, నల్లెల భరత్ కుమార్, మర్రి రాజు యాదవ్, మావిరపు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. -
అందాల భామలకు ఆహ్వానం.. రామప్ప ఆలయంలో ఇలా..
● వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన● రామప్పలో సందడి చేయనున్న అందాలభామలు● అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు● మూడంచెల భద్రత.. సీనియర్ అధికారుల పర్యవేక్షణ● 4 గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్లో పాల్గొంటారు.● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు.● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు.● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు.● రాత్రి 7.20 గంటలకు ఇంటర్ప్రిటిషన్ సెంటర్కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్కు ప్రయాణమవుతారు.● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు.● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది.● సుమారు గంటపాటు హోటల్లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు.ఏయే దేశాల సుందరీమణులంటే..ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు.● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్కు చేరుకుంటారు.● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతారు.డిన్నర్లో ఇవే..సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్గా నాన్ వెజిటేరియన్గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్గా చాక్లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు. -
కనులపండువగా.. హేమాచలుడి కల్యాణం
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాన్ని యాగ్నికులు సోమవారం కనులపండువగా జరిపించారు. ఉదయం 7 నుంచి 9 గంటలకు ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణం జరిపించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శిష్యబృదం ఉదయం 10 గంటలకు ఉత్సవ మూర్తులను కల్యాణ మండపానికి చేర్చారు. మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల కల్యాణ మహోత్సవ క్రతువును వేదమంత్రోచ్ఛరణల నడుమ జిలకర బెల్లం, మంగళ సూత్రధారణ, ముత్యాల తలంబ్రాలతో ఆలయ సాంప్రదాయ ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు భక్తులు సుమారు 35వేలకు పైగా తరలివచ్చి కల్యాణం తిలకించి దర్శించుకున్నారు. ధృవమూర్తులకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి కల్యాణం తిలకించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఆమె తనయుడు సూర్య కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తిలకించారు. ఈ సందర్బంగా స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు సీతక్క పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అదే విదంగా కంచర్ల గోపన్న 10వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాస్ ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం జాతర సందర్భంగా ఆయలంలో రూ.17లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు, డ్రెయినేజీ, కిచెన్ షెడ్ ప్లోరింగ్ పనులను కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దాతల సాయంతో స్వామివారి కల్యాణ మహోత్సవానికి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి సీతక్క భారీగా తరలివచ్చిన భక్తులు -
ఇచ్చిన మాట తప్పేదే లేదు..
● మంత్రి సీతక్క మంగపేట: ప్రజలకు ఇచ్చిన మాట తప్పేదే లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలో గల శనిగకుంటలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరు చేసిన కలెక్టర్ దివాకరతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమాశేంలో సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా పాలన ప్రభుత్వం ప్రతీ పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని తెలిపారు. 2023లో శనిగకుంటలో జరిగిన అగ్నిప్రమాదంలో కొన్ని కుటుంబాలు సరస్వం కోల్పోవడంతో బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా సహకారం అందించామన్నారు. గతంలో తాను ఇచ్చన హామీ మేరకు నేడు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ,తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రుతదితరులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్కు వచ్చిన వినతుల వివరాలు..
ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన గిరిజనులు ఉపాధి కల్పించాలని విన్నవించారు. బ్యాంకు సబ్సిడీ ఇవ్వాలని పలువురు అర్జి పెట్టుకున్నారు. అలాగే పలువురు గిరిజనులు సబ్సిడీ రుణం మంజూరు చేయాలని కోరారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో సమ్మక్క–సారలమ్మ ప్రాంతంలో రంగులు వేసిన పెయింటింగ్ జీఎస్టీ బిల్లులు ఇప్పించాలని సదరు కాంట్రాక్టర్ పీఓను కోరారు. మంగపేట మండలం తొండ్యాల లక్ష్మీపురం ప్రాంతంలో ఎంఎస్ఏఈ పెయింటింగ్ యూనిట్ మంజూరు చేయాలని గిరిజనులు పీఓకు విన్నవించారు. కన్నాయిగూడెం మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే బహుళ అంతస్తులు కడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిని తొలగించాలని గిరిజనులు విన్నవించారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లా నుంచి ఏజెన్సీ సర్టిఫికెట్లపై డీఎల్ఎస్సీ నిర్వహించి జెన్యూనిటీ ఇప్పించాలని కోరారు. జనగామ జిల్లాలో 2017–18లో సీఆర్టీలుగా పనిచేసిన వేతనాలు ఇప్పించాలని సీఆర్టీలు విన్నవించారు. సాగులో ఉన్న పోడు భూములకు బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, దామోదర్ కోరారు. సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం నాయకులు కోరారు. కార్యక్రమంలో డీడీ పోచం, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రామప్పలో పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు/వెంకటాపురం(ఎం): మిస్ వరల్డ్–2025 పోటీలలో పాల్గొడానికి వచ్చిన సుందరీమణు రాక సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ పరిసరాల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎస్పీ డాక్టర్ శబరీశ్తో కలిసి ఈ నెల 14వ తేదీ సుమారు 35 మంది సుందరీమణులు హైదరాబాద్ నుంచి తెలంగాణ జరూర్ ఆనా అనే టైటిల్తో రూపొందించిన ఏసీ బస్సులో నేరుగా రామప్పకు చేరుకుంటారని తెలిపారు. రామప్పను సందర్శించే సమయంలో ఎక్కడా ఏ చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందన్నారు. రామప్పలోని ఏర్పాట్లు అబ్బురపరిచేలా చూడాలన్నారు. రామప్ప జ్ఞాపకాలు మరిచిపోకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్.మహేందర్జీ, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి మందితో బందోబస్తు రామప్పకు ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో వెయ్యిమంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా ప్రవేశంలో ఉన్న మహ్మద్గౌస్పల్లి నుంచి రామప్ప ఆలయం, రామప్ప కట్ట, హరిత హోటల్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా నిర్వహించనున్నారు. సుమారు 35 మంది సుందరీమణులు ప్రత్యేక ఏసీ బస్సులో రామప్పకు రానున్నారు. వీరికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని తెలిపారు. బందోబస్తులో ఎస్పీ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ, ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 43 మంది ఎస్సైలు, 127 మంది ఏఎస్ఐ, హోంగార్డులు 360 మంది కానిస్టేబుళ్లు, 54 మంది హోంగార్డులు, 113 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, 125 మంది స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.సుందరీమణులు అంతా యువతులే కావడంతో వారి చుట్టూ వలయంలా ఉండి భద్రత చర్యలు చేపట్టేందుకు 160 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లోనికి ఎవరికీ అనుమతి ఉండదు. ఈ మేరకు సోమవారం సిబ్బందికి విధులు కేటాయించిన అనంతరం ఎస్పీ శబరీశ్ రామప్ప ఆలయం, హరిత్ హోటల్, చెరువు కట్ట ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వెయ్యి మందితో భారీ బందోబస్తు కలెక్టర్ టీఎస్.దివాకరలేజర్ షోకు ఏర్పాట్లు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం రామప్ప గార్డెన్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లేజర్షో ను నిర్వహించనున్నట్లు సమాచారం. సుమా రు 15 నిమిషాల పాటు సౌండ్ లైటింగ్ షో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది. అందుకోసం సోమవారం రాత్రి 9:45 గంటలకు లేజర్షోకు సంబంధించి ఏర్పాట్లు, లైటింగ్ను నిర్వాహకులు పరిశీలించారు. -
క్రాప్లోన్ ఉందని రైతుభరోసా డబ్బులు ఇవ్వడం లేదు..
ములుగు మండలం జంగాలపల్లి యూనియన్ బ్యాంక్లో రూ. రెండు లక్షల క్రాప్లోన్ ఉంది. ప్రభుత్వం అందించిన రైతు భరోసా డబ్బులు రూ.27 వేలు ఖాతాలో జమ అయ్యాయి. వాటిని డ్రా చేసుకోవడానికి వెళ్తే లోన్ అమౌంట్ ఉందని ఆపివేస్తున్నారు. రెండు నెలల నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. నాకు నాలుగు నెలల క్రితం పక్షవాతం వచ్చింది. రెండు నెలల క్రితం కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖర్చులకు డబ్బులు లేక నానా తంటాలు పడుతున్నాం. అధికారులు స్పందించి రైతుభరోసా డబ్బులు ఇప్పించాలి. – ఇస్లావత్ సక్రు, కాశిందేవిపేట ప్రభుత్వ సాయం అందలేదు.. మాది రైతు కుటుంబం. నా తండ్రి మేరుగు దేవేందర్ 2014లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమస్యతో 2017లో తల్లి అచల ఆత్మహత్యకు పాల్పడింది. నేను, నా తమ్ముడు లోకేష్ ఇద్దరం బరిగలానిపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందలేదు. తహసీల్దార్ వద్ద పెండింగ్లో ఉండడంతో గత ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించాను. ప్రస్తుతం రెండోసారి వినతిపత్రం అందించడానికి వచ్చాను. – మేరుగు సౌమ్య, మల్లంపల్లి -
ఎరుకలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెంకటాపురం(ఎం): ఎరుకలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మాజీ సీఎం కేసీఆర్ ఎరుకల ఎంటర్ ప్రిన్యూర్ షిప్ పథకాన్ని తీసుకొచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల పరిధిలోని రామాంజాపూర్ పరిధిలో గల ఎరుకల నాంచారమ్మ జాతరకు ఆమె సోమవారం హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 800 ఏళ్ల క్రితమే ఇక్కడ నాంచారమ్మ ఆలయం ఉన్నట్లుగా గుర్తులున్నాయన్నారు. నాంచారమ్మ ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఆమె ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, మాజీ జెడ్పీటీసీ రుద్రమదేవి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు, జిల్లా నాయకులు మల్క రమేష్, పోరిక గోవింద్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప గార్డెన్లో కవిత విలేకర్లతో మాట్లాడారు. ఈ క్రమంలో పర్యాటకులు కవితతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. -
కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ
ములుగు: జిల్లా కేంద్రంలో ఆదివారం లంబాడ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత్, పాకిస్థాన్కు జరి గిన యుద్ధంలో వీరమరణం పొందిన మూడవత్ మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మా ట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు చెందిన మురళీనాయక్ గురువారం అర్ధరాత్రి కశ్మీర్ సరిహద్దుల్లో దేశ రక్షణలో భాగంగా శత్రువులతో వీరోచితంగా పోరాడి ఐదుగురు శత్రు సైనికులను హతమార్చి వీరమరణం పొందిన తొలి జవాన్ అన్నారు. మురళీనా యక్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. అనంతరం మురళీనాయక్ ఆ త్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్ నాయక్, జరుపుల బాలునాయక్, పోరిక రాహుల్, కుమార్ పాడ్యా, భూక్యా జంపన్న, హట్కర్ సమ్మయ్య, శంకర్, దేవ్సింగ్, సోమ, వినాయక్ పాల్గొన్నారు. -
ధాన్యం దిగుమతి చేసుకోం..
గోవిందరావుపేట: ధాన్యం దిగుమతి చేసుకోలేము.. నూకశాతం ఎక్కువగా వస్తుందంటూ ఓ రైస్మిల్లు యజమాని ధాన్యం లారీలను వాపస్ పంపించారు. ఈ ఘటన చల్వాయిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని చల్వాయిలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి మూడు ధాన్యం లారీలను అదే గ్రామంలో ఉన్న మహాలక్ష్మీ రైస్మిల్లుకు పంపించారు. సరుకు చూసిన మిల్లు యజమాని ధాన్యం కటింగ్ ఎక్కువగా అవుతుంది.. దిగుమతి చేసుకోం అంటూ సంబంధిత రైతులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో రైతులు కలెక్టర్కు తెలిసిన నాయకులతో ఫోన్ చేయించగా సివిల్ సప్లయీస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మిల్లు యజమానితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ లారీలను జిల్లాలోని వేరే మిల్లులకు దిగుమతి కోసం పంపించారు. మాటమార్చిన మిల్లు యజమాని క్వింటాకు 6 కిలోల కటింగ్ చేసుకుని దిగుమతి చేసుకుంటామని రైతులకు తొలుత చెప్పిన సదరు మిల్లు యజమాని అధికారులు మిల్లుకు చేరుకోగానే మాట మార్చారు. ధాన్యం 40శాతం మాత్రమే రైస్ అవుతుంది. 60శాతం నూక అవుతుంది. 67శాతం రైస్ వస్తేనే దిగుమతి చేసుకుంటామని మాట మార్చి సివిల్ సప్లయీస్ అధికారులకు వెల్లడించారు. ఈ విషయంపై అధికారులు రైస్మిల్లు యజమానితో మాట్లాడగా ఒప్పుకోలేదు. దీంతో ఆ అధికారులు వేరే మిల్లులకు తరలించడం విస్మయానికి గురిచేసింది. ధాన్యం కొనుగోళ్ల విషయంపై మంత్రి సీతక్క ఎన్ని సార్లు మిల్లర్లతో మాట్లాడినా మంత్రి మాట కూడా పెడచెవిన పెట్టి వారు ఇష్టానుసారంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటనేది అర్ధం కాని పరిస్థితి నెలకొంది. 6 కేజీలు తరుగు కింద ఇస్తే.. ఎంతో కష్టపడి ధాన్యం పండించి పంటను మిల్లు దగ్గరికి తీసుకొస్తే క్వింటాకు 6 కిలోల తరుగు తీస్తాం అంటున్నారు. మేము 4 కిలోలకు ఒప్పుకున్నాం.. 6 కిలోలు ఇస్తేనే దిగుమతి చేసుకుంటాం అన్నారు. అధికారులు రాగానే నూక శాతం ఎక్కువగా ఉంది, బాయిల్డ్ మిల్లుకి పంపించండి మాకు రా రైస్ అయితే తీసుకుంటామని మాట మార్చారు. ఇప్పటికే వర్షాలు పడి తీవ్రంగా నష్ట పోయాం. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అధికారులు మిల్లర్ల ఆగడాలను అరికట్టి రైతులకు న్యాయం చేయాలి. – చాపల నరేందర్ రెడ్డి, రైతు, చల్వాయినూక ఎక్కువగా అవుతుందంటూ వాపస్ మహాలక్ష్మీ రైస్మిల్లు యజమాని కొర్రీలు దగ్గరుండి వేరే మిల్లులకు పంపించిన సివిల్ సప్లయీస్ అధికారులు -
రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ములుగు: రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం అవుతుందని డీఈఓ పాణిని తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ ఆదివారం శిక్షణ వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే శిక్షణకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. వివిధ సబ్జెక్టులకు కేటాయించిన షెడ్యూల్ను అనుసరించి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆయా తేదీల్లో సదరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. 13వ తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్ గణితం, సోషల్, ప్రాథమిక పాఠశాల ఎమ్మార్పీలకు, తెలంగాణ మోడల్ స్కూల్ చల్వాయి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయిలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే వారికి భోజన సౌకర్యం కల్పించడంతో పాటు ప్రతిరోజూ అటెండెన్స్ ఉంటుందని తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఇన్, అవుట్ టైమ్ నమోదు చేస్తామని వివరించారు. 13 నుంచి 17 వరకు శిక్షణ పొందిన ఎమ్మార్పీలు 20 నుంచి 24 వరకు ఆయా మండలాల్లోని మిగతా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. మిగితా సబ్జెక్టులైన తెలుగు, హిందీ, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రంలపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 26 నుంచి 30 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.డీఈఓ పాణిని -
పీఆర్ రోడ్లకు మహర్దశ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ● వరంగల్ జిల్లా గీసుకొండ నుంచి మొగిలిచర్ల ఎక్స్రోడ్డు వరకు రోడ్డు స్పెషల్ రిపేర్స్ కోసం రూ.1.57 కోట్లతో అంచనా వేశారు. రూ.1,22,93,509లకు ఆన్లైన్ టెండర్ పిలువగా ఈనెల 17న గడువు ముగుస్తుంది. ● హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం జెడ్పీ రోడ్డు నుంచి అలియాబాద్ ద్వారా కామారెడ్డిపల్లి వరకు రోడ్డు ప్రత్యేక మరమ్మతులకు రూ.2 కోట్లతో అంచనాలు పంపారు. ప్రభుత్వం రూ.158,09,702లకు పరిపాలన అనుమతి ఇవ్వగా ఆన్లైన్ టెండర్ ద్వారా ఈనెల 17 తర్వాత పనులు ఖరారు చేయనున్నారు. ● మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ నుంచి బేరువాడ పీఆర్ రోడ్డు (మంచతండా) వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.1,25,48,271లతో టెండర్లు పిలువగా, ఈనెల 15 వరకు ఆన్లైన్లో దాఖలుకు అవకాశం ఉంది. .. ఇలా ఉమ్మడి వరంగల్లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఐదు జిల్లాల్లో పాత రోడ్లకు స్పెషల్ రిపేర్స్, అత్యవసర మరమ్మతులు, మట్టి రోడ్లపై తారు వేయడంతో పాటు రోడ్డులేని గ్రామం లేకుండా కొత్తరోడ్లు నిర్మించేందుకు ఈ నిధులు మంజూరు చేసింది. మొదటి విడతగా హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.69.33 కోట్లతో 62 రోడ్లకు గత నెలాఖరులో నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు పంచాయతీరాజ్ శాఖ వరంగల్ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం నుంచి టెండర్లు పిలిచారు. ఈనెల 8 నుంచి 17 తేదీ వరకు టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చారు. మానుకోటకు పెద్దపీట గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు పలు ప్రాంతాల్లో మరమ్మతులకు నోచుకోకపోగా.. మళ్లీ వర్షాకాలం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు స్పిల్ఓవర్ పనులకు ఎమ్మెల్యేలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపారు. 62 రోడ్లపై సుమారు రూ.75 కోట్ల మేరకు అవసరం ఉంటుందని ఎస్టిమేట్స్ రూపొందించగా, రూ.69.33 కోట్లు విడుదలయ్యాయి. హనుమకొండ జిల్లాలో 15 రోడ్లకు రూ.5.92 కోట్లు కేటాయించగా, ములుగు 11 రోడ్లకు రూ.17.10 కోట్లు, జయశంకర్ భూపాలపల్లికి ఐదు రోడ్లకు రూ.7.61 కోట్లు, వరంగల్ 10 రోడ్లకు రూ.9.20 కోట్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 21 రోడ్లకు రూ.27.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. మొత్తంగా విడుదలైన సుమారు రూ.69.33 కోట్లలో మానుకోటకు పెద్దపీట లభించింది. స్పెషల్ రిపేర్స్, బీటీ, నిర్మాణాలకు పెద్దపీట మరమ్మతులు, కొత్త రోడ్లపై తారుకు నిధులు ఐదు జిల్లాల్లో 62 రోడ్లకు రూ.69.33 కోట్లు... ఆన్లైన్లో టెండర్లు పిలిచిన పంచాయతీరాజ్ శాఖ ఈనెల 17తో ముగియనున్న ప్రక్రియ -
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎస్సీలకు అన్యాయం
వాజేడు: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, కేటాయింపుల్లో ఎస్సీలకు అన్యాయం జరిగిందని దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్ద పిచ్చయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్నాథపురంలో 300 ఎస్సీ కుటుంబాలు ఉండగా అందులో 53 మందినే లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. వారిలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని వివరించారు. ఒక్కో కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇతే తరహాలో ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు. అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు.మల్లూరుకు అంజన్న స్వాముల పాదయాత్రఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయం ఆలయానికి చెందిన ఆంజన్నస్వామి మాలధారులు ఆదివారం సాయంత్రం రామాలయం గుడి నుంచి మల్లూరు గుట్టకు పాదయాత్రతో బయలుదేరారు. గురుస్వాములు నకిరబోయిన రమేష్, గాడిచర్ల సాంబయ్య, ఇర్సవడ్ల సంతోష్, మండల నాగరాజు ఆధ్వర్యంలో స్వాములు ఆంజనేయుడి జెండాలను పట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు. మల్లూరు గుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేడు జరగబోయే కల్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల వెంకటేశ్వర్లు, లక్క మహేశ్, మాదరి నరేష్, సిద్ధు, విజయ్, లవన్ తదితరులు పాల్గొన్నారు.లక్ష్మీనరసింహస్వామి కల్యాణంరేగొండ: మండలంలోని కోటంచ ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం ఆది వారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. ఆది వారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంత రం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనా ధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.సింగరేణి సీఎండీ పూజలుకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని సింగరేణి సంస్థ సీఎండీ బలరాంనాయక్, రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అభిషేకం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీసంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపోయి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం ప లుకుతారు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరి స్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తర్వాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అందాలభామలనుఅబ్బురపర్చేలా ప్రదర్శనలు రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
ఆర్మీలో ఉద్యోగం నా కల
మహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్, ఆర్మీలో చేరాలన్నది నా కల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకశ్మీ ర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్లో రాపిడ్యాక్షన్ ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్నాను. – ఎడ్ల ఝాన్సీ, మానుకోట -
ఆశయానికి ‘అమ్మ’ అండ..
జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శుత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్ల య్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సింధూర్–2 యుద్ధంలో సేవలు అందిస్తున్నాడు. ఆడపిల్లల నొదుటి బొట్టు తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించే విధుల్లో తన కొడుకు భాగస్వామిగా ఉండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తల్లి అన్నపూర్ణ గర్వంగా చెబుతున్నారు. -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి.. ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒ ప్పుకుంది.. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్గౌడ్కు సూచించింది. మొదటి ప్రయత్నంలో రాకపోవడంతో కొంత నిరుత్సాహ పడ్డాడు. మళ్లీ ఎలేందర్గౌడ్ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్థాన్తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది. దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు●● భర్త మిలటరీలో మరణించినా.. బిడ్డలను కూడా పంపిన మరికొందరు.. ● సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లా యువత ● గర్వంగా ఫీలవుతున్న మాతృమూర్తులు నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవంన్యూస్రీల్ -
యునెస్కో ఆదేశాలు బేఖాతర్ !
● రామప్ప ఆలయానికి సిమెంట్ కాంక్రీట్తో మరమ్మతులు వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయానికి గుర్తింపు వచ్చినప్పటికీ పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. కాకతీయుల కట్టడమైన రామప్ప ఆలయాన్ని కేవలం ఇసుకనే పునాదిగా చేసి రాళ్లను పేర్చి ఆలయాన్ని నిర్మించారు. రామప్ప ఆలయ గోపురాన్ని సైతం నీటిలో తేలాడే ఇటుకలతో నిర్మించారు. యునెస్కో గుర్తింపు ఇచ్చే సమయంలో సాండ్ బాక్స్ టెక్నాలజీ, ఒకే రాతిలో రెండు రంగులు, పురాతన కట్టడాన్ని పరిగణలోకి తీసుకొని యునెస్కో గుర్తింపు ప్రకటించింది. యునెస్కో గుర్తింపు వచ్చాక సిమెంటు కాంక్రీట్తో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆలయానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టాలన్నా సున్నం, ఇటుక పొడి, కరక్కాయ, బెల్లం, ఇసుకను ఉపయోగించి మిశ్రమంగా తయారు చేసి మరమ్మతులు చేపట్టాలి. రామప్ప ఆలయం వర్షానికి కురిసినపుడు పైకప్పుకు సైతం ఇదే విధంగా మిశ్రమాన్ని తయారు చేసి మరమ్మతులు చేపట్టారు. రామప్ప ఆలయం చుట్టూ ఏర్పడిన సందులను (గ్యాప్ను) రెండు రోజులుగా సిమెంట్ కాంక్రీటుతో పనులు చేపడుతున్నారు. పురావస్తుశాఖ చేపట్టే పనులతో గుర్తింపునకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. -
పాలిసెట్ ఎంట్రెన్స్కు ఏర్పాట్లు
ములుగు: డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్–2025 ఎంట్రెన్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కో ఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జాకారం కళాశాలలో రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 720 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రలోకి అనుమతి ఉండదని వివరించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్తో హాజరుకావాలని సూచించారు. హెచ్బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్నర్కు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు? వాజేడు: మండల పరిధిలోని ఓ గ్రామంలో తలదాచుకున్న మిలీషియా సభ్యులను శని వారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిలీషియా సభ్యులు తలదాచుకున్న విషయం తెలియడంతో అక్కడికి వెళ్లి పోలీసులు మొదట ఇద్దరిని, ఆ తర్వాత ఏడుగురిని మొత్తంగా 9 మందిని అదుపులోకి తీసుకుని ములుగుకు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం వాజేడు: గురుకులంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరడానికి దరఖాస్తులు చేసుకోవాలని టీయూటీడబ్ల్యూఆర్జేసీ వాజేడు ప్రిన్సిపాల్ కేబీ కిరణ్మయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి రీజియన్లలోని గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కోరారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరడానికి ఈ నెల 16న ఏటూరునాగారంలోని ఆర్జేసీ కళాశాలలో ఈ మేరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఎస్ఎస్సీ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదాయం, లోకల్ ఏరియా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ రెండు సెట్లు, నాలుగు పాస్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ‘న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి’ వాజేడు: భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి కోరారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని చట్టాలు, జీవోలు ప్రతీ ఆదివాసీ యువతీయువకులు తెలుసుకోవాలంటే న్యాయ కళాశాల ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు. చట్టాలపై అవగాహన పెంచుకొని రిజర్వేషన్లను పొందే విధంగా అవగాహన పెరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి గోవిందరావుపేట: కార్మిక చట్టాలను నర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 దేశ వ్యాప్తంగా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మిక చట్టాలను సవరణ చేస్తూ 12గంటల పని దినాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రైతుల చట్టాలను రద్దు చేశామని చెప్పి దొడ్డిదారిన మరోసారి రైతులపై భారం మోపడానికి కుట్రపన్నుతుందని ఆరోపించారు. అసంఘటిత రంగంలో కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేదన్నారు. కార్మికులకు కనీస భద్రత లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి చేపట్టిన బంద్తో పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. -
వైభవంగా ధ్వజారోహణం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు మురళీకృష్ణమాచార్యుల బృందం ధ్వజా రోహణం కార్యక్రమాన్ని వైభవంగా శనివారం నిర్వహించారు. హేమాచలక్షేత్రంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు ఉదయం 9గంటల నుంచి యాగశాలలో యాగ్నికుల బృందం అగ్నిప్రతిష్టాపన, సుదర్శన హోమం పూజా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణ నడుమ నిర్వహించారు. అలాగే 10గంటలకు యాగశాలలోని ధ్వజపఠాన్ని మంగళవాద్యాలతో వేదపండితులు ప్రధానాలయంలోని స్వయంభూ స్వామి వారి ఆలయానికి చేర్చి ధ్వజస్తంభం వద్ద వేదమంత్రోచ్ఛరణ నడుమ పూజలు నిర్వహించి ధ్వజా రోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో 6నుంచి 8 గంటల వరకు భేరీపూజా, దేవతాహ్వానం, నివేదన తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గరుడప్రసాదం పంపిణీ బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అనంతరం దంపతులకు సంతానార్థం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయంలో స్వయంభు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీనిలో భాగంగానే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దీంతో గరుడ ప్రసాదం కోసం దంపతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధ్వజారోహనం కార్యక్రమంలో భక్తిశద్ధలతో పాల్గొని గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు మధనమోహన్, రామనర్సింహా, మణిదీప్, వెంకటాచార్యులు, భరద్వాజ్, అభిరామ్, విరంచి ఆలయ పూజా రులు శేఖర్శర్మ, పవన్కుమార్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ, అజయ్, గణేశ్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు దంపతులకు సంతానార్థం గరుడ ప్రసాదం పంపిణీ -
ఆధార్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ములుగు: పీహెచ్సీలకు వచ్చే వ్యాధిగ్రస్తులు ఆధార్ కార్డుతో రావాలని, వారి వివరాలను నూతన పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వైద్యాధికారిని సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరా వు తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్సీల వైద్యాధికారులతో నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్స్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈహెచ్ఎంఐఎస్ అనే కొత్త పోర్టల్ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. పీహెచ్సీ లకు వైద్యం కోసం వచ్చే వ్యాధిగ్రస్తులు మొదట రి జిస్ట్రేషన్ నమోదు చేసుకుని వైద్యాధికారిని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. వైద్యాధికారులు పీహెచ్సీకి వచ్చే వ్యాధిగ్రస్తులకు ఆధార్కార్డులతో వచ్చేవిధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం డాటా ఎంట్రీ ఆపరేటర్స్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ అదే పరిస్థితి
మంగపేట: మండలంలోని చుంచుపల్లి, వాడగూడెం గ్రామాల మధ్య ఏటూరునాగారం –బూర్గం పాడు ప్రధాన రోడ్డుపై శుక్రవారం రాత్రి 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రధా న రోడ్డుపై వచ్చి పోయే వందలాది ఇసుకలారీలు, బస్సులు, కార్లు, ఆటోలు గంటన్నర పాటు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. పాలాయిగూడెం వద్ద గోదావరి నుంచి టిప్పర్లతో ఇసుకను తీసుకువచ్చి ప్రధాన రోడ్డుకు ఇరువైపుల స్టాక్ చేస్తున్నారు. పట్టా ల్యాండ్ నుంచి వచ్చే ఇసుకలారీలు సైతం రోడ్డు దాటే క్ర మంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. సమస్యను పట్టించుకునే వారు లేకపోవడంతో ఇసుక క్వారీల నిర్వాహకులు స్వలాభం కోసం ప్రజలు, ప్రయాణికులు వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. మంగపేట, మల్లూరు, వాడగూడెం ఇసుకక్వారీల నుంచి వెళ్లే లారీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చే ఇసుకలారీలు వేబ్రిడ్జిల వద్ద నిలపడంతో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యంగా తయారైంది. అయిన ఏ ఒక్క అధికారి సమస్యను పట్టించుకోక పోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. చుంచుపల్లిలో ట్రాఫిక్ జామ్ గంటన్నర పాటు ప్రయాణికుల ఇబ్బందులు -
రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
వెంకటాపురం(ఎం): పాకిస్తాన్పై తలపెట్టిన ఆపరేషన్ సిందూర్ యుద్ధం విజయవంతంగా పూర్తి కావాలని, భారత సైనికులు సురక్షితంగా ఉండాలని కోరుతూ శుక్రవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో దేవాదాయ ధర్మదా య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండోమెంట్ పరిశీలకులు కవిత, ఈఓ బిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారులు హరీష్శర్మ, ఉమాశంకర్లు రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని ఎల్లారెడ్డిపల్లెలో బేతి సతీష్ ఆధ్వర్యంలో, నల్లగుంటలో నాగుల రవి, రామగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులు పూజలు నిర్వహించారు. రామప్ప భూముల కౌలు ఆదాయం రూ. 2.38 లక్షలు రామప్ప ఆలయానికి చెందిన భూములను 2025–26 సంవత్సరానికి గాను కౌలుకు ఇచ్చేందుకు శుక్రవారం రామప్పలో వేలం పాటలు నిర్వహించగా రూ.2.38 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. లక్ష్మీదేవిపేట పరిధిలోని 9 ఎకరాలకు రూ. 1.10.000 వేలు, పాలంపేట పరిధిలోని గార్లగడ్డ మూడు ఎకరాల భూమికి రూ.97 వేలు, వెంకటాపూర్ పరిధిలోని రెండు ఎకరాల భూమికి రూ.31 వేల ఆదాయం కౌలు వేలం పాటల ద్వారా వచ్చినట్లు తెలిపారు. -
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురుబొంగులతో ప్ర త్యేక అందాలను ఇచ్చేవిధంగా బొమ్మలను త యారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా.. స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణఇచ్చాం. వారు తయారుచేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. కచ్చితంగా అందరిని ఆకర్షిస్తాయని భావిస్తున్నాం. – రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ● -
రామప్పను సందర్శించిన హనుమకొండ జిల్లా జడ్జి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని హనుమకొండ జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి జస్టిస్ పట్టాభి రామారావు, ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్తో కలిసి శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్కుమార్, వెంకటేష్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జక్కుల సతీష్ ఉన్నారు. ములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లిని ములుగు జిల్లా ఇన్చార్జ్ జడ్జి పట్టాభి రామారావు, జిల్లా జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్నలు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి కొత్త సదయ్య, కొత్త సురేందర్లు జడ్జిలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలి వెంకటాపురం(ఎం): మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మే 14న రామప్ప ఆలయానికి వస్తున్న నేపథ్యంలో రామప్పలో తలపెట్టిన పనులు రేపటి (ఆదివారం)లోగా పూర్తి చేయాలని అదనపు క లెక్టర్ మహేందర్ జీ సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం రామప్ప సరస్సుకట్టపై కాటేజీల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గురుకుల కళాశాలలో ప్రవేశానికి కౌన్సెలింగ్ ములుగు రూరల్: ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆసక్తి కలిగిన గిరిజన బాలురు, బాలికలు కౌన్సెలింగ్కు హాజరు కావాలని ఆర్సీఓ హరిసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన బాలురకు ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్, 16న బాలికలకు ఏటూరునాగారం ఈజేసీ కళాశాలలో కౌన్సెలింగ్ ఉదయం 10 గంటలకు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు పదో తరగతి మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదా యం, నివాసం రిజినల్ సర్టిఫికెట్లు, నాలుగు పాస్ ఫొటోలు, 2 సెట్ల జిరాక్స్లను తీసుకురా వాలన్నారు. బాలుర కళాశాల వివరాలు కా టారంలో ఎంపీసీ, బీపీసీ, ఏటూరునాగారంలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, ములుగు ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, దామరవంచలో ఎంపీసీ, బీపీసీ, మహబూబాబాద్లో ఎంపీసీ, బీపీసీ, మరి పెడలో ఎంపీసీ, బీపీసీ, రెడ్యాలలో సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో అవకాశం ఉందని, బాలి కల కళాశాల కాటారంలో ఎంపీసీ, బీపీసీ, పీటీ, ఏటూరునాగారంలో ఎంపీసీ, బీపీసీ, సీ ఈసీ, ఏటీ, ఐఎం, వెంకటాపురంలో ఎంపీసీ, బీపీసీ, కొత్తగూడలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, కేసముద్రంలో సీఈసీ, హెచ్ఈసీ, మహబూబాబాద్లో ఎంపీసీ, బీపీసీలో అవకాశం ఉందన్నారు. -
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
● దైత అమ్మవారికి తిరుమంజనం మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో (జాతర) రెండోరోజు గరుడాదివాసం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం ఆలయ ప్రాంగణంలోని దైత అమ్మవారికి తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రోచ్ఛారణతో కుంకుమ, చందనం, జలం, పాలతో అభిషేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సాయంత్రం యాగశాలలో గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 నుంచి గరుడపఠ లేకనం లిఖించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై టీవీఆర్ సూరి, ఆలయ బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్, అర్చకులు ముక్కామల శేఖర్శర్మ, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఈ శ్వర్చంద్రామానుజం, యాగ్నికుల బృందం అమరవాది రామనర్సింహచార్యులు, పి. మధన మోహనాచార్యులు, మణిదీపాచార్యులు, అభిరామాచా ర్యులు, శ్రీమాన్ రామచంద్రాచార్యులు, ఆలయ సీ నియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది అజయ్, నవీన్, గణేష్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రం పరిశీలన
వాజేడు: మండల పరిధిలో చెరుకూరు అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని గురువారం ములుగు డీసీఎస్ఓ ఫైజ్ హుస్సేన్, సివిల్ సప్లయీస్ డీటీ రామచందర్లతో కలిసి విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రి కార్డులను చూసిన వారు పలు సూచనలు చే శా రు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి లోడ్తో వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ధ్రు వీకరణ పత్రాలను తప్పని సరిగా పరిశీలించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.నాన్ మైనార్టీ విద్యార్థినుల ఎంపిక పూర్తిములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాలకు నాన్ మైనార్టీ విద్యార్థినులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా మైనార్టీ శాఖ అధికారి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ మైనారిటీ గురుకుల పాఠశాలలో 20 సీట్లకు గాను బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2 సీట్లను డ్రా పద్ధతిన భర్తీ చేసినట్లు తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నామని వివరించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రూ. 20 లక్షల వైద్య పరికరాల అందజేతములుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఎముకల విభాగానికి గురువారం ఈసీఐఎల్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో రూ.20లక్షల విలువ చేసే ఆపరేషన్ సీఆర్మ్ మెషిన్, ఓట్లైట్ ప్రాచ్చర్ టేబుల్ పరికరాలను కలెక్టర్ దివాకర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈసీఐఎల్ హైదరాబాద్ సంస్థ చేసిన సేవలను ఆయన అభినందించారు. భవిష్యత్లో ఆస్పత్రికి ఉపయోగ పడేలా మంచి పనులు చేయటానికి ముందుకు రావాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్, ఈసీఐఎల్ ప్రతినిధులు సి.మురళిధర్, ఈడీ సుదర్శన్ కుమార్, ఎడ్(పైనాన్స్) రంజన్ శ్రీవాస్తవ, ఏజీఎం (ఫైనాన్స్) పి.వేణుబాబు, సీఎంఓ, ఎస్డీజీఎం ఎ.రామకృష్ణ, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎ.సాంబమూర్తి, కార్పొరేట్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి● ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచంఏటూరునాగారం: గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గోల్డ్మెడల్ సాధించిన లావణ్యను డీడీ పోచం గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా సూర్య తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో కొమురం లావణ్య మాస్టర్ పర్యవేక్షణలో శిక్షణ పొందిందని తెలిపారు. మార్చిలో నిర్వహించిన ఇండియా, నేపాల్ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో 49 కిలోల కేటగిరిలో స్వారింగ్లో పాల్గొని గోల్డ్మెడల్ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు స్వీయ రక్షణకు కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ క్షేత్రయ్య, పీసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ పాల్గొన్నారు. -
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.– 10లోuయాగశాలలో అంకురార్పణ, తిరుమంజనం పూజలు నిర్వహిస్తున్న యాగ్నిక పూజారులుబ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ 2–డిపో మేనేజర్ వి.జోత్స్న ఆదేశాల మేరకు గుట్ట పైనుంచి ఏటూరునాగారం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఏటూరునాగారం ఆర్టీసీ కంట్రోలర్ చల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు సురక్షితంగా గుట్టపైకి చేరుకునేందుకు మొదటి రోజు రెండు బస్సుల ద్వారా 12ట్రిప్పుల సర్వీసులను నడిపినట్లు వెల్లడించారు. 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 17 వరకు భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు గుట్టపైకి బస్సుల సంఖ్య కూడా పెంచుతామని తెలిపారు. బస్సు సర్వీసులు ప్రారంభం -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల అకాల వర్షం కురిసే అవకాశం ఉంది.మహిళల ఆర్థికాభివృద్ధికి అధికారుల కృషి ● మంత్రి ధనసరి సీతక్క ములుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సెర్ప్ అధికారులు ఎనలేని కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క కొనియాడారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలించడానికి ఏర్పాటు చేసిన సొసైటీల్లో ఉత్తమ పనితీరును కనబర్చిన జిల్లా సెర్ప్ అధికారులకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించగా మంత్రి సీతక్క గురువారం హైదారాబాద్లో సంబంధిత అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.226 కోట్లకు గాను రూ.235 కోట్లను అందించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య, డీఆర్డీఓ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పోస్టుమార్టం అంతా గోప్యం!
ఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారు జామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కళ్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు రాష్ట్రమంత్రి ధనుసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. కాగా, ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డికి ప్రాంతానికి చెందిన వారు. బుల్లెట్ గాయాలతోనే మృతి.. బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు డీజీపీ వచ్చాక సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల ప్రత్యేక బందోబస్తుతో హెడ్క్వార్టర్స్కు మృతదేహాల తరలింపు మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు.. సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీసు హెడ్క్వార్టర్స్కు తరలించారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తే పతనం తప్పదు
ములుగు: పత్రికా స్వేచ్ఛను హరిస్తే పసుపు రంగు ప్రభుత్వానికి పతనం తప్పదని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ అన్నారు. ఏపీలోని విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో గురువారం పోలీసులు సోదాలు చేసి భయభ్రాంతులకు గురిచేసినందుకు నిరసనగా ములుగు సాక్షి ఆర్సీ ఇన్చార్జ్ భూక్య సునిల్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ములుగు జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు షఫీ అహ్మద్, రామిడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ పేరుతో సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ‘సాక్షి’పై కక్షపూరితంగానే ఎడిటర్ ఇంటికి వెళ్లి పోలీసులచే ఏపీ ప్రభుత్వం డ్రామా ప్లే చేయించిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎడిటర్లు, జర్నలిస్టులను నియంత్రించాలనుకోవడం అవివేకమన్నారు. పత్రిక స్వేచ్ఛను అడ్డుకున్న ప్రతీ రాజకీయ పార్టీకి తగిన గుణపాఠం తప్పదవి వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు చేస్తున్న నిరసనకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజ్మహ్మద్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు గుర్రం శ్రీధర్, గాదం దేవేందర్, బైకాని నటరాజ్, బానోతు వెంకన్న, మాట్ల సంపత్, చుంచు రమేష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ.షఫీ అహ్మద్ -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఏటూరునాగారం/మంగపేట: జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏటూరునాగారంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని జీసీసీ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు గానీ సరైన రక్షణ, టార్పాలిన్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు కాక రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక ధాన్యం రాశుల వద్దనే నిరీక్షించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అదే విధంగా మంగపేట మండలంలో గురువారం ఉదయం, రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగి చల్లబడింది. పలుచోట్ల రైతులు కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. హేమాచలక్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు వచ్చిన చిరువ్యాపారుల పరిస్థితి భారీ వర్షంతో అత్యంత దయనీయంగా మారింది. జాతరకు వచ్చే భక్తులకు విక్రయించి ఉపాధి పొందేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చిరువ్యాపారులు స్వీట్లు, గాజులు, బొమ్మలు తదితర షాపులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో భారీ వర్షం రావడంతో సామగ్రిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. -
‘విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి’
ములుగు: విధి నిర్వహణలో ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్పీడీసీఎల్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల డీఈలు పులుసం నాగేశ్వరరావు, వెంకటేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బందితో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎల్సీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. నిబంధనలు పాటించాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
ఉగ్రవాద స్థావరాలపై దాడి భారత ఆర్మీ ఘనత
ములుగు రూరల్: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత భారతదేశ ఆర్మీదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై మూడు రంగుల జెండాలతో బుధవారం ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్లోని పహల్గాం దాడికి ప్రతీ దాడిగా ఇండియన్ ఆర్మీ సిందూర్ పేరున ఉగ్రవాదులపై దాడి చేశారని తెలిపారు. కశ్మీర్ అక్రమిత ప్రాంతంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మంది ఉగ్రవాదులను అంతం చేశారని తెలిపారు. భారత త్రివిధ దళాల సమన్వయంతో ఉగ్రవాద స్థావరాలపై దాడిలో భారత ఆర్మీ విజయం సాధించిందని వివరించారు. అక్రమంగా దేశంలో ఉంటున్న పాకిస్తానీయులు వెంటనే దేశం వదిలి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, కృష్ణాకర్, ఇమ్మడి రాకేశ్యాదవ్, నగరపు రమేష్, వాసుదేవరెడ్డి, కుమార్, శ్రీనివాస్, రవీందర్, హేమాద్రి, పాపిరెడ్డి, శ్రీహరి, ప్రవీణ్, సతీష్, రాజేందర్, నాగరాజు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం