స్నేహపూర్వక వాతావరణం.. | - | Sakshi
Sakshi News home page

స్నేహపూర్వక వాతావరణం..

Jul 12 2026 12:59 AM | Updated on Jul 12 2026 12:59 AM

పాఠశాల దశలోనే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల పెంపుపై ఫోకస్‌

చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్‌ ఫియర్‌ వల్ల క్లాస్‌రూమ్‌లో టీచర్‌ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్‌షిప్‌లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్‌ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్‌ లెవెల్‌ నాలెడ్జ్‌ ఇంప్రూవ్‌ అవుతుందని అంచనా.

సాంకేతిక విద్యనందించాలని..

ప్రభుత్వ యూపీఎస్‌, హైస్కూల్‌ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్‌షిప్‌, టీచింగ్‌ ఇంటర్న్‌షిప్‌’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ లెర్నింగ్‌, కంప్యూటింగ్‌, కోడింగ్‌, ఫైథాన్‌, జావా, గేమ్‌ డిజైన్‌ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.

డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్‌

డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్‌మిత్ర పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సర్టిఫికెట్‌ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్‌, టీచింగ్‌ స్కిల్స్‌ ఇంప్రూవ్‌తోపాటు మెంటార్‌షిప్‌ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్‌ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్‌ పాయింట్స్‌ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు.

డిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన

మెంటార్లు, స్కూళ్లు ఇలా..

మెంటార్లు స్కూళ్లు

హనుమకొండ

మహబూబాబాద్‌

ప్రభుత్వ

జనగామ ఏబీవీ

పరకాల

ప్రభుత్వ

నర్సంపేట ప్రభుత్వ

పింగిళి

మహిళా

కాకతీయ

మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ

అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్‌, హైస్కూళ్ల పిల్లలు

కృత్రిమ మేథ, డిజిటల్‌ లెర్నింగ్‌,

కోడింగ్‌ అంశాలపై అవగాహన

పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం

పెంపొందించేలా చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement