breaking news
Mulugu District News
-
వైభవంగా నాగులమ్మ పగిడిద్దరాజు కల్యాణం
మంగపేట: మండలంలోని లక్ష్మినర్సాపురంలో కొలువుదీరిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ, పగిడిద్దరాజు కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ఈనెల 3 నుంచి ప్రారంభమైన జాతర మూడవరోజు కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి నాగులమ్మ, వనదేవతకు ఎదుర్కోలు మహోత్సవం అనంతరం ఆలయ ప్రధాన పూజారి (నాగులమ్మ ఉపాసకుడు) బాడిష రామకృష్ణ స్వామి ఆధ్వర్యంలో రాత్రి ఒంటి గంట నుంచి వేద పండితులు గాదె నరేష్ ఆచార్యులు, మహేష్, రాకేష్ల బృందం నాగులమ్మ అమ్మవారు, పగిడిద్దరాజు కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. నాగులమ్మ ఉపాసకుడు (దేవరబాల) రామకృష్ణ స్వామి లోకకల్యాణం కోసం సుమారు రెండున్నర గంటల పాటు అగ్నిగుండంలో నడిచారు. భక్తులు జై నాగులమ్మ తల్లీ అంటూ భక్తితో చేసిన నినాదాలు జాతర ప్రాంతం మార్మోగింది. అంతకుముందు రామకృష్ణ స్వామి ఆదివాసీ గిరిజన పూజారులు, వడ్డెలతో కలిసి రహస్యపూజలు నిర్వహించి అగ్నిగండాన్ని వెలిగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు నాగులమ్మ, సడాలమ్మ, వనదేవత వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఏటూరునాగారం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, చర్ల, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. -
ఎండైనా.. నింపాల్సిందే
వాజేడు: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటను రైతులు అమ్ముకోవాలంటే బస్తాల్లో నింపాల్సిందే. దీని కోసం కొందరు యువకులు ఒక జట్టుగా ఏర్పడి బస్తాల్లో మిర్చిని నింపుతారు. రైతులు ఒక్కొక్కరికి రూ.500 చెల్లించి బస్తాల్లో కాయలను తొక్కిస్తుంటారు. ఒక్క బస్తాలో 30 కేజీల నుంచి 50 కేజీలు ఉండేలా చూసి తొక్కిస్తారు. వాటిని మార్కెట్లో విక్రయించడానికి అనుకూలంగా ఉండటంతో పాటు ఎండిన మిర్చి పాడు కాకుండా ఉంటుంది. ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి వరకు ఈ పనిని చేస్తుంటారు. ఎంత ఎండ ఉన్నా యువకులు మిర్చి బస్తాల్లో నింపుతారు. -
కార్పొరేట్ తరహాలో
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026ఏటూరునాగారం: కార్పొరేట్ తరహాలో ప్రీ ప్రైమరీ పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలివిడతలో జిల్లాకు ఒకటి చొప్పున నిర్మించనుంది. ఒక్కొక్క దానికి రూ.30 లక్షలు వెచ్చించనుంది. ఈ మేరకు ఇప్పటికే శిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే జిల్లాలోని 564 అంగన్వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.2లక్షలు ఒక్కో సెంటర్కు ఇవ్వనుంది. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆరోగ్యలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ పోషణ పథం పేరిట చిన్నారులు, బాలికలు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించనుంది. రక్తహీనత నివారించేందుకు.. కౌమార బాలికల్లో (14–18 ఏళ్లు) పోషకాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ఏడాదిలో వందరోజుల ప్రణాళిక అమలు చేయనుంది. ప్రత్యేక న్యూట్రీషియన్ ప్యాకేజీ కింద మల్టీమిల్లెట్ చిక్కి, ఇన్స్టంట్ మిక్స్ (ఉప్మా, కిచిడి) అందిస్తారు. బాలామృతం, బాలామృతం ప్లస్, ఫార్ములేషన్లో మరిన్ని మైక్రో న్యూట్రియేంట్లు ఉండేలా చర్యలు తీసుకుంది. ప్రీ ప్రైమరీ టీచర్లకు ఇంటర్తోపాటు రెండేళ్ల డిప్లొమా అర్హత, ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లకు నూతన విద్యావిధానం కింద సర్టిఫికేషన్ కోర్సు నిర్వాహణ చేపట్టనుంది. ప్రీస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బెల్ట్, బూట్లు, సాక్సులు అందించాలని, ఏడాదికి 300 రోజులు 100 మిల్లీలీటర్ల పాలు, 25 గ్రాముల అల్పాహారం అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాల్సి ఉంది. అద్దె భవనాల్లోని అంగన్వాడీలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంది. ఏజెన్సీలో తక్కువ బరువు పిల్లలే ఎక్కువ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే నూతన పథకాలను ఏజెన్సీలో అమలు చేయనుంది. తక్కువ, అతి తక్కువ బరువు ఉన్న పిల్లలకు మంచి పౌష్టికాహారం అందజేసి వారి బరువు, ఎత్తు పెరిగేందుకు ఆరోగ్య లక్ష్మీని మరింత పటిష్టంగా అమలు చేయనున్నారు. జిల్లాలో 30 కొత్త అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు అయ్యాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు రూ.2 లక్షలు కేటాయించగా వాటితో పనులు చేపట్టడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగుపర్చుతాం. – ప్రేమలత, డీడబ్ల్యూఓ, ములుగు ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ అంగన్వాడీ కేంద్రాల మరమ్మతుకు రూ.2లక్షలు కేటాయింపు జిల్లాలో 664 అంగన్వాడీ కేంద్రాలుజిల్లాలో 664 అంగన్వాడీ కేంద్రాలకు గాను 564 కేంద్రాలకు శాశ్వత భవనాలు ఉండగా 100 కేంద్రాలకు పక్కా భవనాలు లేకుండా ఉన్నాయి. వీటిని పూర్తిస్తాయిలో నిర్మించడానికి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయించే దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో శాశ్వత అంగన్వాడీ కేంద్రాలు నెలకొల్పనున్నారు. -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కన్నాయిగూడెం: మండలంలోని కన్నాయిగూడెం, ఏటూరు సబ్స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుందని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటూరునాగారం నుంచి ఉన్న 33కేవీ లైన్లో తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపుతో పాటు మండల పరిధిలోని విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. పనులు త్వరగా పూర్తి చేయండివాజేడు: జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పుర్తి చేయాలని నేషనల్ హైవే ఈఈ మనోహర్ అన్నారు. వాజేడు మండలంలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు 10 కిలో మీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. శుక్రవారం వాజేడుకు వచ్చిన ఆయన రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. మండల పరిధిలోని చీకుపల్లి, పెద్ద గొళ్లగూడెం గ్రామాల మధ్యన ఇసుక వాగుపై పాత బ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇప్పటికే డైవెర్షన్ రహదారి వేసి బ్రిడ్జి తొలగింపు పనులను చేపట్టారు. ఈ పనులను పరిశీలించిన ఈఈ మనోహర్ వర్షాకాలం రాక ముందే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట నేషనల్ హైవే ఏఈ రామ్ముర్తి తదితరులు ఉన్నారు. ములుగు: ములుగు మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి సీతక్క ప్రత్యేక నిధులు కేటాయించారని, కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు అవగాహన లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు మన్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క సహకారంతో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే రూ.15 కోట్ల పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. అప్పటివరకు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగలేదని, కాబట్టి అప్పటి టెండర్ల ప్రక్రియపై ఇటీవల ఎన్నికై న కౌన్సిలర్లు అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో ప్రారంభమైన టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లు వేయాలని కలెక్టర్ను కోరడం వారి అవివేకాన్ని సూచిస్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పనులకు వచ్చిన నిధులు అదే పరిధిలో వినియోగించబడతాయని, అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. -
‘వేప’కు విపత్తు!
ములుగు: వేయి లాభాల చెట్టు వేపకే విపత్తు సంభవిస్తోంది. వేపచెట్టు నుంచి లభించే ఆకు, బెరడు, కాయలు, పిండి, చెక్క, నూనె తదితర ఉత్పత్తులు సర్వరోగ నివారిణిగా పేరున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో కీటకనాశినిగా, వివిధ రకాల ఔషధాలు, చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో వేపకు అత్యంత ప్రాధాన్యం ఉందని చెబుతారు. ఉగాది పండుగ రోజు వేపపూవు తయారు చేసే పచ్చడిని పవిత్రంగా భావిస్తారు. ఇన్ని సుగుణాలు ఉన్న వేపచెట్టును ఐక్య రాజ్యసమితి 21వ శతాబ్ధపు చెట్టుగా గుర్తించి చరిత్రలో స్థానం కల్పించింది. దీన్ని హెర్బల్ ఇండియన్ డాక్టర్గా పిలుస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన వేపచెట్టుకు ఇప్పుడు విపత్తు రావడం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వందలాది వేపచెట్లు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన విషయం తెలిసిందే. ఫంగస్ కారణమే.. ‘ఫోమాప్సిస్ అజాడిరక్టె’ అనే శిలీంద్రం (ఫంగస్) ఆశించడంతోనే వేప చెట్లు ఎండుతున్నట్లు వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనినే కొమ్మ ఎండు తెగులు అని అంటున్నారు. దీంతో చెట్టు కొమ్మలు పూర్తిగా గోధుమరంగులోకి మారి ఎండిపోయి రాలిపోతాయి. శిలీంద్ర సిద్ద బీజాలు గాలి ద్వారా ఒకచెట్టు నుంచి మరో చెట్టుకు వ్యాప్తి చెంది ఫలితంగా గాలివీచే దిశలో ఉన్న చెట్లు అన్ని వ్యాధిసోకి ఎండిపోతాయి. వేప చెట్లపై ‘ఫోమాప్సిస్ అజాడిరక్టె’ అనే వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదు. వ్యాధి సంక్రమించిన కొమ్మలను కత్తిరించాలి. లేదా కార్బండిజమ్, క్లోరోథలోనిల్, మాంకోజెమ్ వంటి శిలీంధ్రనాశకాలను నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. లేదా వేరు దగ్గర పోయాలి. తెగులు తీవ్రమైతే పూర్తిగా ఎండిపోయి, చెట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సహజంగానే వేప చెట్టుకు వ్యాధిని తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. – సుతారి సతీష్, వృక్ష శాస్త్ర వేత్త, వరంగల్ రసం పీల్చుతున్న ‘డైబ్యాక్ వ్యాధి’ జిల్లాలో వందలాది చెట్లపై ప్రభావం -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
గోల్ సాధించారు..● సివిల్స్ ఫలితాల్లో మెరిసిన జిల్లా అభ్యర్థులు ● ఉత్తమ ర్యాంకులతో కలసాకారం చేసుకున్న యువకులుసమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, చిత్రంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సమావేశానికి హాజరైన కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్బాజ్పాయ్, సందీప్కుమార్ ఝా, దివాకర టీఎస్, అధికారులుసాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నా రు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
క్రీడలతో శారీరక దారుఢ్యం
భూపాలపల్లి: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో అంబేడ్కర్ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం, ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అనంతరం ఎస్పీ సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ ఆడారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల యువతతో 13 జట్లను తీసుకొని వారికి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐ డి.నరేష్కుమార్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏటూరునాగారం/మంగపేట: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగపేట మండల పరిధిలోని చుంచుపల్లి, పొదుమూరు, ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, ముళ్లకట్ట ప్రాంతాల్లోని పుష్కరఘాట్లను ఏఎస్పీ మనన్భట్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సూరి, మహేశ్లతో కలిసి ట్రాఫిక్ రూట్లు, పార్కింగ్ స్థలాలు, వన్వే ప్రాంతాలను గురువారం పరిశీలించారు. స్నాన ఘట్టాల ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుష్కరఘాట్లకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని పుష్కరాలను విజయవంతం చేస్తామన్నారు. గోదావరిలో వరద నీరు, ఉధృతి, అందులోని గోతులు, ప్రమాద ఘటికలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు, నది వద్ద భద్రతా చర్యలు, భక్తుల రద్దీ నియంత్రణ వంటి అంశాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతీ ఘాట్ వద్ద గజ ఈతగాళ్లు, పడవలు, రెస్క్యూ టీం, మర బోట్లు, రబ్బర్ ట్యూబ్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
మున్సిపల్ కమిషనర్పై కౌన్సిలర్ల ఆగ్రహం
ములుగు: ములుగు మున్సిపల్ కమిషనర్ రమేష్పై నూతనంగా ఎన్నికై న సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశాన్ని ఆర్అండ్బీ గెస్ట్హౌజ్లో గురువారం కమిషనర్ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ హాజరయ్యారు. మున్సిపాలిటీ సాధారణ సమావేశంలోని ఎజెండా అంశాలను సమావేశంలో చదివి వినిపించారు. విపక్ష సభ్యుల పట్ల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎజెండా తయారీలోనే తీర్మాణం ఆమోదించినట్లుగా రాశారని సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభ్యులకు ఎజెండాను అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కొన్ని తప్పులు చోటు చేసుకున్న మాటవాస్తవమేనని, ఇక నుంచి మూడు రోజుల ముందుగానే సభ్యులకు సమాచారం ఇస్తామని కమిషనర్ హామీనిచ్చారు. కొత్తగా పన్నులు పెంచవద్దని, రానున్న వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనుల్లో వివక్ష చూపవద్దని కౌన్సిలర్ సురేందర్ విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కలిసి పని చేయాలని నాలుగో వార్డు కౌన్సిలర్ పావని ప్రస్తావించారు. అనంతరం దేవగిరిపట్నం రోడ్డు 60 ఫీట్లకు విస్తరణ, మాస్టర్ ప్లాన్ తయారీ, వీధిలైట్ల కొనుగోలు వంటి ఐదు అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటీ చైర్పర్సన్ ఆసియా షాహీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యుల ఆరోపణ -
హెచ్పీవీతో హెల్త్
ములుగు రూరల్: మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కిశోర బాలికల(14–15 ఏళ్లు) ఆరోగ్యమే లక్ష్యంగా క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ(హుమర్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు గాను విద్య, వైద్య ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆద్వర్యంలో వైద్యాధికారులకు, సిబ్బందికి హెచ్పీవీ టీకాపై శిక్షణ ఇచ్చారు. ఇందులో 28 మంది వైద్యాధికారులు, 51 మంది పీహెచ్సీ వైద్యులు, 487 మంది ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాలికలు టీకాలు తీసుకునేందుకు సంసిద్దం చేయాలని సూచించారు. బాలికల వివరాలు నమోదు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకునే బాలికలు తప్పనిసరిగా ఆధార్కార్డు తీసుకు రావాలి. ఆధార్కు లింకు అయిన ఫోన్కు వచ్చే ఓటీపీతో వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత వారికి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ములుగు జిల్లాకేంద్రంలో జనరల్ ఆస్పత్రి, ఏటూరునాగారంలోని సీసీహెచ్సీ, వెంకటాపురం(కె)లోని సీహెచ్సీ సెంటర్లలో వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. 3,127 మందికి టీకాలు జిల్లాలోని పది మండలాల పరిధిలో 3,127 మంది కిశోర బాలికలు ఉన్నట్లు విద్యాశాఖ రికార్డుల్లో నమోదై ఉంది. వైద్యశాఖ అధికారులు అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్ వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బాలికకు సింగిల్ డోస్ మాత్రమే ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్నర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు విధుల్లో ఉంటారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అధికారులు 3,127 మంది.. మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఈ నెల 8 నుంచి ప్రారంభంఆడబిడ్డలకు హెచ్పీవీ టీకా రక్షణ కవచం లాంటిదని కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 8న వ్యాక్సినేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వ్యాక్సినేషన్కు వచ్చే వారు ఐడీ ప్రూఫ్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్, ఆపార్ ఐడీ తీసుకురావాలని సూచించారు. టీకాకు వచ్చే క్రమంలో అల్పాహారం తీసుకొని రావాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేకర్, ఏటూరునాగారం సూపరింటెండెంట్ సురేశ్కుమార్, జిల్లా వైద్యాధికారి గోపాల్రావు, జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, రాయినిగూడెం మెడికల్ ఆఫీసర్ నాగఅన్వేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ను కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 8న హెచ్పీవీ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా బాలికల సంఖ్యను గుర్తించాం. అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ ఇండెంట్ తయారు చేసి నివేధించాం. – గోపాల్రావు, డీఎంహెచ్ఓ -
యాసంగి పంటలకు దేవాదుల నీరు
ములుగు రూరల్: యాసంగి పంటలకు దేవాదుల నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్కు నీరు చేరుకుంందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తెలిపారు. యాసంగికి నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, మల్లంపల్లి సర్పంచ్ ల్యాదె శ్యాంరావు, రాజు, రాకేష్ పాల్గొన్నారు. గిరిజన కళాశాలలో అధికారుల విచారణఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 10 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందడంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు మహబూబాబాద్, ములుగు జిల్లాల గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డిలు గురువారం గురుకుల కళాశాలను సందర్శించి విచారణ చేపట్టారు. కలుషితమైన ఆహారం తినడంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారా అన్న కోణంలో ఆరా తీశారు. అదేవిధంగా పరీక్షల సమయం కావడంతో ఒత్తిడికిలోనై ఉంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల ఒత్తిడికి గురయ్యారని, ఎండ తీవ్రతతో అలా జరిగిందని విద్యార్థులు తెలిపినట్లు ఆర్సీఓ వెల్లడించారు. ఆహారంలో ఎలాంటి లోపాలు, కల్తీ జరగలేదన్నారు. ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలివెంకటాపురం(కె): డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్భట్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరీవ్–ఆలీవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో, కారు డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో ఆస్పత్రికి చేర్చడం గోల్డెన్ ఆవర్గా పరిగణిస్తారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గుడ్ సమారిటన్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన వ్యక్తికి రూ.25 వేలు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. అనంతరం విలేకరులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ముత్యం రమేశ్, ఎస్సై తిరుపతిరావు, వాజేడు ఎస్సై సతీశ్, పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సెకండ్ ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో గొంది హనుమంత్ గోల్డ్ మెడల్ సాధించగా ఏఎస్పీ అభినందించారు. సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ములుగు/ములుగు రూరల్:వైద్యాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్.దివాకర హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర పరీక్ష గది, వృద్ధులు, పెడియాట్రిక్ వార్డులతో పాటు ల్యాబోరేటరీ, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలోని విభాగాలు, వైద్యుల వివరాలపై ఆరా తీశారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ల వివరాలను తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, సదుపాయాలను పరిశీలించారు. పేషెంట్లకు ఇచ్చే మందులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గ ర్భిణులకు వివిధ రకాల టెస్టులను ఆస్పత్రిలోనే చే యాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇంచర్ల శివారు ఎర్రిగట్టమ్మ పరిధిలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణంలో ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేపట్టడానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. దీనిలో భాగంగా అన్నిశాఖల అధికారులు శ్రద్ధతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
‘మద్దతు’ ఇవ్వని మార్క్ఫెడ్!
దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులుసాక్షి ప్రతినిధి, వరంగల్: మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్ఫెడ్ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్గా మారిన ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్లో ఎలా గోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూ పెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 2.11 లక్షల ఎకరాల్లో సాగు.. ఎంఎస్పీ బహుజాగు 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొ చ్చని భావించి ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువసగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ తమ పెట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.2025–26లో జిల్లాల వారీగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం.. మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్’.. క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400.. ‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు ఉమ్మడి వరంగల్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు 7.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక అన్నదాతల ఆందోళనజిల్లా సాగు విస్తీర్ణం ( ఎకరాల్లో...)హనుమకొండ 58,000 వరంగల్ 46,000 జనగామ 30,150 మహబూబాబాద్ 40,230 ములుగు 20,125 జేఎస్ భూపాలపల్లి 16,995 మొత్తం 2,11,500ఖర్చు అంశం సుమారు ఖర్చు రూ.లు)భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000 విత్తనాలు (హైబ్రిడ్) 3,000 – 4,000 ఎరువులు 5,000 – 7,000 మందులు (కీటక నివారణ) 3,000 – 5,000 కూలీల ఖర్చు 6,000 – 8,000 నీటి ఖర్చు 3,000 – 5,000 కోత – రవాణా 4,000 – 6,000 మొత్తం ఖర్చు 28,000 – 40,000 -
దళారులు ఇబ్బంది పెడుతున్నారు..
మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి – రామారపు సాంబయ్య, రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లిరైతులను ఆదుకోవాలి..టీజీ మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి. – టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి -
ఆన్లైన్లోనే పౌరసేవల దరఖాస్తుల విచారణ
ములుగు: రాష్ట్రంలో పౌరసేవలను పారదర్శకంగా వేగంగా అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ తెలిపారు. కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ అఽధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. ఇకపై పౌరసేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ తదితర ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతుందన్నారు. కాగిత రహిత విధానం అమల్లోకి రావడంతో సమయానికి సేవలు అందడం, పారదర్శకత పెరగడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఆదాయ ధ్రువీకరణ పత్రం సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. దశలవారీగా కులం, నివాసం వంటి ఇతర ధ్రువపత్రాలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఆనంతరం ఈ మొబైల్ యాప్ వినియోగంపైన కలెక్టరేట్ కార్యాలయంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ శిక్షణ ఇచ్చారు. మీసేవ ద్వారా అప్లై చేస్తే దరఖాస్తు తొలుత జీపీవో లాగిలోకి వస్తుందన్నారు. అనంతరం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఎంఆర్ఐ)కి, తదనంతరం ఆర్ఐ నుంచి నేరుగా డిప్యూటీ తహసీల్దార్(డీటీ) లాగిన్ కి చేరుతుందని వివరించారు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తుంటారని వివరించారు. ములుగు ఆర్డీఓ వెంకటేశ్ -
‘పాత భూమినే సాగు చేస్తున్నాం’
ఎస్ఎస్తాడ్వాయి: కొత్తగా పోడుభూమిని సాగుచేయలేదు.. పాత భూములనే సాగు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు కందకాలు తీయడం నిలిపివేయాలని కాల్వపల్లికి చెందిన రైతులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం బాధిత రైతులు విలేకర్లతో మాట్లాడారు. కాల్వపల్లిలో 40 ఆదివాసీ కుటుంబాలకు చెందిన తాము ముప్పై ఏళ్లుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. 2001లో పోడు చేసి 2004 నుంచి సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నామని వివరించారు. ఇన్నేళ్లుగా ఎన్నాడూ జేసీబీలతో రాని అధికారులు ఆకస్మాత్తుగా కందకాలు తీయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో మంత్రి సీతక్క కూడా పట్టాలిప్పిస్తామని చెప్పారని, కొత్తగా పోడు చేయొద్దని చెప్పిన మాటను గౌరవించి పోడు చేయలేదని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి తమకు పట్టాలు ఇప్పించాలని వేడుకున్నారు. -
విద్యుత్ సరఫరాలో లైన్మెన్ల పాత్ర కీలకం
గోవిందరావుపేట: విద్యుత్ సరఫరాలో లైన్మెన్ల పాత్ర కీలకమైందని డీఈ నాగేశ్వరరావు, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ దేవ్సింగ్, సబ్ ఇంజినీర్ అఖిల అన్నారు. పస్రా సెక్షన్లో లైన్మెన్ దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఓ అండ్ ఎం(ఆపరేటర్ అండ్ మెంటెనెన్స్) సిబ్బందిని బుధవారం శాలువాలతో సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు, గాలులు, ప్రమాదకర పరిస్థితులు ఎదురై విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు వాటిని సరిచేసి లైన్మెన్లు నిరంతర విద్యుత్ను అందిస్తున్నారని తెలిపారు. వారి సేవలు అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు రామచంద్రయ్య, సమ్మిరెడ్డి, లైన్మెన్లు తిరుపతి, వేణు, అసిస్టెంట్ లైన్మెన్లు భిక్షపతి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లు
మంగపేట: మండల పరిధిలోని లక్ష్మీనర్సాపురంలో గల నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లు గద్దెలపై బుధవారం కొలువుదీరారు. జాతర రెండో రోజు బుధవారం నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిష రామకృష్ణ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం సమీపంలో సడాలమ్మ, నాగులమ్మ అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవాన్ని సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. నాగులమ్మ పూజారి బాడిష నాగరమేశ్, గిరిజన పూజారులు, వడ్డెలు ఆలయ సమీపంలోని గండొర్రెగుట్ట వద్ద నాగులమ్మ, ఝెర్రట్టలగుట్ట వద్ద సడాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి డోలి వాయిద్యాల నడుమ తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు నృత్యాలు చేస్తూ భారీగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పూజారులు, వడ్డెలు అమ్మవార్లను గద్దైపె ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని పెరకలకుంట లక్ష్మీదేవర ఆలయం నుంచి ఆలయానికి వచ్చిన లక్ష్మీదేవరకు ఆలయ పూజారులు, వడ్డెలు కంకణాలు కట్టి స్వాగతం పలికారు. రాత్రి సమయంలో అమ్మవార్లకు రమణక్కపేట సమీపంలోని పవిత్ర గోదావరిలో ఏడు చెలిమల నీటితో పాటు వివిధ దళాలతో పుణ్యస్నానాలు, అభిషేక పూజలు నిర్వహించారు. చుంచుపల్లి నుంచి అమ్మవారికి చెందిన అవిరేణి కుండలను ఆదివాసీ మహిళలు తీసుకొచ్చి ఆలయానికి సమర్పించారు. నేడు గురువారం గద్దెలపై కొలువైన అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇంకా భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ ప్రధాన పూజారి బా డిష రామకృష్ణ, నాగరమేశ్ ఆధ్వర్యంలో ఆలయంలో తగిన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాని, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, శివ, చిన్నాబ్బాయి, కారం రాజేశ్, కుల పెద్ధలు విష్ణుమూర్తి, మడకం రాజేశ్వర్రావు, చౌళం వెంకటేశ్వర్లు, కొమరం మాధవరావు తదితరులు పాల్గొన్నారు. నాగులమ్మ, సడాలమ్మకు పూజలు భారీగా తరలివచ్చిన భక్తజనం -
నీటి వృథాకు చెక్
ఏటూరునాగారం: వర్షాలు, వరదల సమయంలో నీరు వృథాగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిని ఒడిసిపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక్కో గ్రామానికి రెండు చెక్ డ్యామ్లను నిర్మించాలని రూపకల్పన చేశాయి. నీటి సంరక్షణ పథకం కింద ఒక్కో చెక్ డ్యామ్కు రూ.5లక్షల బడ్జెట్ను సైతం అధికారులు కేటాయించారు. జిల్లాలో అత్యధికంగా నీటి వనరులు ఉన్నా విద్యుత్ మోటార్లు, బోర్ల మీద ఆధారపడి రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీలోని చెరువులు, వాగులు, వంకలు, తోగులు ఇలా నీటి సౌకర్యం, సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో చెక్డ్యామ్లు నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్కు అందాయి. ఈ మేరకు కలెక్టర్ దివాకర మండలాల్లోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు గ్రామ పంచాయతీకి రెండు చొప్పున సులభతరమైన, పూర్తి స్థాయిలో ఉపయోగించే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశాలు అందాయి. దీంతో ఈజీఎస్ అధికారులు గ్రామాల్లోని రైతులు, స్థానికులతో చర్చించి వాగులు, వంకలు, తోగులు, చెరువు సమీపంలో నిర్మాణాలకు ప్రణాళికలను సిద్ధం చేశారు. పెరగనున్న భూగర్భ జలాలు నీటిని చెక్డ్యామ్లు నిర్మించి నిల్వచేస్తే భూగర్భజలాలు కూడా అధికంగా పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో మిర్చి, వరి, పత్తి, ఇతర పంటలకు కావాల్సినంత నీటిని ఈ చెక్డ్యామ్ల్లో నిల్వచేసి పంటల అవసరాలకు అనుగుణంగా నీటిని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు వ్యవసాయదారులకు విద్యుత్ ఖర్చులు, మోటార్లు, బోర్లు వేయడం లాంటి ఖర్చులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 348 చెక్డ్యామ్లు జిల్లా వ్యాప్తంగా 348 చెక్డ్యామ్లు నిర్మించే అవకాశాలున్నాయి. వీటికి తోడు ఇంకా రైతులకు అవసరమైన చోట మరిన్ని అదనంగా నిర్మించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలో నీటి సౌకర్యం ఎక్కువగా ఉన్న ఏజెన్సీ మండలాల్లో మరిన్ని అదనంగా చెక్డ్యామ్లు మంజూరయ్యే అవకాశాలు ఉండడంతో రైతులకు మరింత లాభం చేకూరనుంది. నీటి సంరక్షణలో సర్పంచ్ల పాత్ర కీలకంగా మారింది. గ్రామంలోని సర్పంచ్, గ్రామం పేరు, హబిటేషన్, లోకేషన్, సర్వే నంబర్, ప్రభుత్వం, ఫారెస్టు, రెవెన్యూ, ప్రైవేటు అనే వివరాలు అందించాల్సి ఉంది. జీపీకి రెండు చొప్పున తీసుకోవచ్చు. లేదంటే ఎక్కువగా కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. పంచాయతీ కార్యదర్శులు కూడా గ్రామంలో ఎక్కడి చెక్డ్యామ్లు అక్కడే నిర్మించాలని నిర్ణయించి గ్రామ పంచాయతీల తీర్మాణం ఈజీఎస్ అధికారులకు అందించాలి. – చరణ్రాజ్, ఏపీఓ ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఏటూరునాగారం 16 మీటర్ల పొడువుతో ఒక్కో చెక్డ్యామ్ను నిర్మించేందుకు రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో నిబంధనల ప్రకారం నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు అధికంగా ఉన్నప్పటికీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీటిని నిల్వచేసే ప్రాంత్రాలను గుర్తించి చెక్డ్యామ్లు నిర్మిస్తే రైతులకు 365ల రోజుల పాటు రెండు పంటలు సులభంగా పండుతాయి. ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గ్రామానికి రెండు చొప్పున మంజూరు ఒక్కోదానికి రూ.5 లక్షల బడ్జెట్ -
ప్రగతి ప్రణాళికను అమలు చేయాలి
ఏటూరునాగారం: రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికల కార్యాచరణ అమలుపై బుధవారం రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, హోం, రవాణా, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిదు దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అన్నారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రతా చర్యలు, వివిధ వర్గాల వారి సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
నీటి ఎద్దడి నివారణకు బోరు ఏర్పాటు
ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు రంగారావుపల్లిలో నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించారు. ఈ మేరకు బుధవారం 4వ వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని భూమి పూజ చేసి బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క ఎన్నికల సమయంలో రంగారావుపల్లి ప్రజలకిచ్చిన హామీ నేరవేర్చారని తెలిపారు. అదే విధంగా కాలనీలో నె లకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని పావని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శివ, రవి, రూప్సింగ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: ములుగు ఎస్సైగా ఉపేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. మహిళా ఉద్యోగులు క్రీడా పోటీల్లో పాల్గొనాలి ములుగు రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో మ హిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడాపోటీలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, కార్యదర్శి మేడిపల్లి చైతన్యలు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. సీ్త్ర–శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో టీజీవో, టీఎస్జీవో సహకారంతో నేడు, రేపు బండారుపల్లి రోడ్డులోని గిరిజన భవన్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘కాల్వపల్లి రైతులపై దాడి జరగలేదు’ ఏటూరునాగారం: కాల్వపల్లికి చెందిన రైతులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయలేదని అటవీశాఖ జిల్లా అధికారి రాహుల్ కిషన్ జాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని ఛానల్స్, పత్రికలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వివరించారు. వార్తలు రాసే విషయంలో సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని రాహుల్ కిషన్ జాదవ్ వెల్లడించారు. -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవకాశంఈ నెల 31 వరకు గడువు.. విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు యువికా–26 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుకుందాం రండి. – మహబూబాబాద్ అర్బన్అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈవిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు 48,941 ఉన్నారు.అన్నీ ఉచితంగానే..ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేయనుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 12 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్త గ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. విద్యార్థులు వినియోగించుకోవాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వి.రాజేశ్వర్. డీఈఓ, మహబూబాబాద్●జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు శాస్త్రవేత్తలతో మాట్లాడే చాన్స్ ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువు ఎంపికైతే ప్రత్యేక శిక్షణ -
పెద్దల సభకు వేం నరేందర్రెడ్డి
సాక్షి, మహబూబాబాద్: రాజ్యసభ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరేందర్రెడ్డి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మనుసింఘ్వీకి మరోమారు అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో వేం నరేందర్రెడ్డికి చాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇరువురు నేడు(గురువారం) అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నాయకుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నేడు నామినేషన్ దాఖలుపేరు: వేం నరేందర్రెడ్డి తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, రత్నమ్మ భార్య: విజయ కుమారులు: కృష్ణభార్గవ్, కృష్ణచైతన్య గ్రామం: అర్పనపల్లి, మండలం కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా రాజకీయ అనుభవం: 2004 – 2009 వరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు -
రేపు మెగా జాబ్మేళా
ములుగు రూరల్: రేపు(శుక్రవారం) జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సంపత్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం డిగ్రీ కళాశాలలో జాబ్మేళా కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు నిర్వహించే జాబ్మేళాకు జిల్లా వాసులే కాకుండా భూపాలపల్లి, నర్సంపేట, పరకాల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వివరించారు. గూగుల్ ఫామ్ ద్వారా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బాలయ్య, కవిత, అనిల్ కుమార్, ఉదయశ్రీ, విజేత, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ ప్లాంటేషన్
ఏటూరునాగారం: ఏజెన్సీలోని రైతులకు ఆయిల్పామ్ మొక్కల పెంపకం, వచ్చే ఆదాయం, ఉపయోగాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మోడల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఐటీడీఏ హర్టికల్చర్ ద్వారా 3 మే 2023న 9.12 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటేందుకు అప్పటి పీఓ అంకిత్, ఐటీడీఏ ప్రాజెక్టు హర్టికల్చర్ అధికారి రమణ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణకు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.24 లక్షలు మంజూరు చేశారు. మొక్కలు నాటించారు. నీరు పట్టేందుకు సైతం డ్రిప్, మోటార్లను అమర్చారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఆ మొక్కల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆయిల్పామ్ తోట పెంపకం పేరుతో నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేసి రూ.24 లక్షలు డ్రా చేయడం గమనార్హం. మొక్కల పెంపకంపై పర్యవేక్షణ కొరవడడంతో గడ్డి, పిచ్చి మొక్కులు పెరగడంతో పాటు ఆయిల్పామ్ మొక్కలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టు పూర్తైందని అధికారులు, సిబ్బంది కలిసి విందులు కూడా చేసుకోవడం గమనార్హం. ఎండిపోతున్నా పట్టించుకోని అధికారులు రూ.24 లక్షల నిధులు వృథాఐటీడీఏ ప్రాజెక్టు హర్టికల్చర్ అధికారి రమణ మోడల్ ప్లాంటేషన్కు శ్రీకారం చుట్టారు. ఆయన బదిలీ కావడంతో పాటు ఆశాఖకు సంబంధించిన అధికారుల పోస్టులు స్థానికంగా ఖాళీగా ఉండడంతో ప్లాంటేషన్ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఉద్యానశాఖకు సంబంధించిన అధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయిల్పామ్ మొక్కలకు నీటి సౌకర్యం, కంచె సైతం లేకపోవడంతో పశువులు, మేకలు మేస్తుండడంతో ఆయిల్పామ్ మొక్కలు ఎండితున్నాయి. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోడల్ ప్లాంటేషన్ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైభవంగా మండమెలిగె పండుగ
మంగపేట: మండల పరిధిలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురం నాగులమ్మ ఆలయంలో మండమెలిగె పండుగ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతర కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన పూజారి, నాగులమ్మ ఉపాసకుడు (ఆలయ ట్రస్టి) బాడిష రామకృష్ణ స్వామి ఉదయం ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ఎదుట తోరణ స్తంభాలను నిలిపారు. పసుపు, కుంకుమలతో అలంకరించి గడపను ప్రతిష్ఠించారు. మండమెలిగె పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి డోలి వాయిద్యాల నడుమ వడ్డెలు, గిరిజన పూజారులు, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని మామిడి తోరణాలతో అలంకరించారు. అనంతరం గోదావరి నదీ జలాలతో శుద్ధి చేసిన అమ్మవారి ఆభరణాలు, గజ్జెలు, అడారాల(కుండలు)తో అలంకరించి దూపంతో రహస్య పూజలు నిర్వహించారు. అలాగే పూజారులు, వడ్డెలు, కులపెద్దలు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఘడికామరాజు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, ఎర్రమ్మ, పోతురాజు, నాగులమ్మ నాగులమ్మ గద్దెలను పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకించారు. అమ్మవారి ప్రతి రూపాలైన జెండా కర్రలతో డోలి వాయిద్యాలతో భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోని ఆయా గద్ధెలపై ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. గద్దెలపై జెండాలను ప్రతిష్ఠించారు. నేడు మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన పూజారి రామకృష్ణ స్వామి తెలిపారు. నేడు నాగులమ్మ, సడాలమ్మ రాక నేడు గండొర్రెగుట్ట నుంచి నాగులమ్మ, యర్రెట్టలగుట్ట నుంచి వచ్చే సడాలమ్మ అమ్మవార్లు ఆలయంలో కొలువుదీరనున్నారు. అమ్మవార్లకు పవిత్ర గోదావరి జలాలతో పుణ్యస్నానం చేయించిన అనంతరం డోలు వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయానికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నట్లు నాగులమ్మ పూజారి రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులమ్మ పూజారి బాడిష నాగరమేష్, సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాణి, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, శివ, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రారంభమైన నాగులమ్మ జాతర గద్దెలపై జెండా కర్రల ప్రతిష్ఠాపన -
పోడుభూముల్లో కందకాలు
ఎస్ఎస్తాడ్వాయి: పోడు భూముల్లో కందకాలు తీస్తున్న అటవీశాఖ అధికారులను మంగళవారం కాల్వపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు పోడు రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వపలి రైతులు భూపాలపల్లి జిల్లాలోని దూదేకులపల్లి రేంజ్ పరిధి సంగారం బీట్ పరిధిలో 25 ఏళ్లుగా సుమారుగా 162 ఎకరాల్లో 47 కుటుంబాలు పోడు భూములను సాగుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అటవీశాఖ అధికారులు రైతుల పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు భూముల చుట్టూ జేసీబీతో కందకాలు తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకుని తవ్వకాల పనులను అడ్డుకోవడంతో అటవీశాఖ అధికారులు, రైతులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములే తమకు జీవనాధారమని వాటిని వదిలే ప్రసక్తే లేదని బాధిత రైతులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. రైతుల సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలి. సింగారం బీట్లోని కాల్వపల్లి రైతులు పోడు భూములను సాగు చేస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల జారీకి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అధికారులు దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. – కొప్పుల రవికుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కాల్వపల్లి అటవీశాఖ అధికారులను అడ్డుకున్న రైతులు -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ ఏటూరునాగారం: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం బైక్ ర్యాలీ చేపట్టారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ అడవులను సంరక్షించడంతో పాటు వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. ప్రకృతి ప్రసాధించిన ఔషధ మొక్కలు మానవాళికి అమూల్యమైనవన్నారు. వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వన్యప్రాణుల వేట, చెట్ల నరికివేత వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు అటవీశాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు వేణుమాధవరావు
వాజేడు: ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి గిరిజన కళా ఉత్సవానికి తరలివెళ్లారు. మండల పరిధిలోని పేరూరుకు చెందిన తొర్రెం వేణు మాధవరావు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కళా ఉత్సవంలో తన చిత్రకళలతో ఆకట్టుకుని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన గిరిజన కళా ఉత్సవంలో పాల్గొని తన చిత్రకళల గురించి వివరించారు. దీంతో పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా రాములవారి తలంబ్రాలు భూపాలపల్లి అర్బన్: శ్రీ రామనవమి సందర్భంగా ఈనెల 27న భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సంబంధించిన పవిత్ర ‘కల్యాణ తలంబ్రాలు’ పోస్టాఫీస్ ద్వారా భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు సమీప పోస్టాఫీసులో రుసుం చెల్లించి తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చన్నారు. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలు (1 ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు) రూ.450, ముత్యాల తలంబ్రాలు (1 ముత్యం) రూ. 151 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు స్పీడ్ పోస్టు ద్వారా భక్తులకు పంపించనున్నట్లు తెలిపారు. శ్రీ రామనవమి మహోత్సవాలకు హాజరుకాలేని భక్తులకు ఈ సేవ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఎర్రగట్టు వెంకన్న కల్యాణం రద్దు హసన్పర్తి: చంద్రగ్రహణంతో ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని రద్దు చేశారు. జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం హసన్పర్తి–భీమారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత స్వామి వారిని రథంపై ఎర్రగట్టుగుట్టకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటలలోపే స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆతర్వాత ఆయాన్ని ద్వారబంధనం చేశారు. చంద్రగ్రహణంతో ఈసారి స్వామివారి శోభాయాత్ర నిరాడంబరంగా సాగింది. బుధవారం మహా సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. కాక్లియర్ ఇంప్లాంట్తో అంగవైకల్యం దూరం ఎంజీఎం : కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చిన చెవుడు, మూగ అంగవైకల్యాన్ని పూర్తిగా నయం చేయొచ్చని ఎంజీఎం ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ శ్రమలత తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్రావు, ఆడియాలజిస్ట్ డాక్టర్ రతన్సింగ్, డాక్టర్ జెన్నీఫర్, డాక్టర్ ప్రత్యూష, సీనియర్ రెసిడెంట్స్, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. గణపురం హోలీ సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో గణపేశ్వరుడిని మోదుగు పూలతో మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతీ సంవత్సరం హోలీ సందర్భంగా ఆలయ ఆవరణలో పూసే మోదుగు పోలతో స్వామి వారిని అలంకరిస్తామని ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు. -
వినతులిచ్చాం.. పరిష్కరించండి
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు అధికారులకు అర్జీలను సమర్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 59 వినతులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 10 వినతులు రాగా ఐటీడీఏ డిప్యూటీ డీడీ దబ్బగట్ల జనార్ధన్ స్వీకరించారు. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు 14పింఛన్లు 14ఇందిరమ్మ ఇళ్లు 14ఇతర శాఖలకు సంబంధించి 17 ప్రజావాణిలో 59, గిరిజన దర్బార్లో 10 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ డిప్యూటీ డీడీ జనార్దన్ -
గిరిజన దర్బార్లో వచ్చిన వినతుల వివరాలు..
ఎస్ఎస్తాడ్వాయి మండలం గోనెపల్లికి చెందిన రైతు రైతు భరోసా వచ్చేలా చూడాలని విన్నవించారు. అలాగే కొండపర్తికి చెందిన అభయహస్తం ఫౌండేషన్ ద్వారా ఆదివాసీ గిరిజన పిల్లల కోసం నిర్మించిన లెర్నింగ్ సెంటర్ ప్రారంభించామని, ఐటీడీఏ ద్వారా మరింత సహకారం అందించాలని కోరారు. కాటాపురం సమీపంలోని శ్రీరామ్నగర్లో లెర్నింగ్ సెంటర్ నిర్మాణం, అవసరమైన సామగ్రి అందించాలని కోరారు. సంగెం మండలం పోచమ్మతండాకు చెందిన ఒకే కుటుంబానికి కుమారుడికి ఎంబీబీఎస్, కుమార్తెకు ఐఐటీ సీటు వచ్చిందని, ఆర్థిక సాయం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం లో ఐటీడీఏ గెస్ట్హౌజ్లో కాంటిజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఉద్యోగి రెగ్యులర్ చేయాలని డీడీకి విన్నవించారు. మంగపేట మండలం రమణక్కపేటకు చెందిన ఓ గిరిజన విద్యార్థిని జీఎన్ఎంగా కోర్సు చేసి ఎంజీఎంలో స్టాఫ్నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నానని ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవించారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. వెంకటాపురం(కె) ఆలుబాకకు చెందిన ఓ గిరిజనుడు, వాజేడుకు మండలం పూసూరుకు చెందిన గిరిజనులు ఇందిర సౌర గిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్బాబు, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్రావు, ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
వాజేడు: రక్తదానం ప్రాణదానంతో సమానమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని ప్రగళ్లపల్లిలో సోమవారం చేయూత స్వచ్ఛంద సంస్థ, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్టు, దూలాపురం అటవీ రేంజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడటం అనేది మాటలకు అందనిదని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తాన్ని దానం చేయాలని సూచించారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన 25 యూనిట్ల రక్తాన్ని రెడ్క్రాస్ సొసైటీ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడకం సుభద్ర, మాజీ సర్పంచ్ నరే శ్, దూలాపురం రేంజర్ బాలకృష్ణ, మురళి, లలిత, ఆదిలక్ష్మి, జగదీశ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.జెడ్పీ మాజీ చైర్పర్సన్ నాగజ్యోతి -
కరాటేలో విద్యార్థుల ప్రతిభ
గోవిందరావుపేట/వాజేడు: తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నభవన్లో ఆదివారం నిర్వహించిన 8వ స్టేట్ లెవల్ షోటోఖాన్ కరాటే చాంపియన్ షిప్ 2026లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గోవిందరాపేట మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన గొంది విగ్నేందర్ ప్రస్తుతం మండల కేంద్రంలోని మెరిట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ కరాటే పోటీల్లో విగ్నేందర్ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించాడు. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్ రవికిరణ్ విద్యార్థిని సోమవారం అభినందించారు. భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే వాజేడుకు చెందిన పెనుమళ్లు సీతారామ చంద్రారెడ్డి మండల కేంద్రంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కరాటేలోని స్వారింగ పోటీలో ద్వితీయ, కటాలో మూడో స్థానంలో విజయం సాధించగా ప్రశంసపత్రంతో పాటు మెడల్ అందించారు. -
మహిళలు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో రాణించాలి
ములుగు రూరల్: మహిళలు సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో రాణించినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ అకాడమీ అఫ్ సైన్స్ రీజినల్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సోమవారం సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక విజయాలు సాధించామన్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, ఎకో క్లబ్ కన్వీనర్ సరిత, అధ్యక్షులు బాలయ్య, సరిత, అనిల్ కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వేగం కన్నా ప్రాణం మిన్న
ఏటూరునాగారం: వేగం కన్నా ప్రాణం మిన్న అని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్ అన్నారు. మండల కేంద్రంలోని వైజంక్షన్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం అరైవ్ అలైన్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించి ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ ధరించి నిబంధనలను పాటించాలని, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం చేయవద్దన్నారు. మీ ప్రాణం మీ కుటుంబానికి అమూల్యమన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. హెల్మెట్ ధరించి నిబంధనలను పాటిస్తున్న వారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.ఏఎస్పీ మనన్ బట్ -
ప్రవేశ పరీక్ష గడువు పొడిగింపు
గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గండు కుమార్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్ల డించారు. అర్హులైన విద్యార్థులు గడువు లోపు తమ దరఖాస్తులను సమార్పించాలని కోరారు. వివరాలకు ఫోన్ నంబర్లో 8096350115 సంప్రదించాలని సూచించారు. సీతారాముల తలంబ్రాలు ఊరేగింపు వాజేడు: మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామంలో సీతారాముల తలంబ్రాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. త్వరలో జరుగనున్న సీతారాముల కల్యాణానికి చేతులతో ఒలిచి తలంబ్రాలను సిద్ధం చేశారు. ఆ తలంబ్రాలను సోమవారం ఊరేగించారు. రామప్పలో ఫారెస్ట్ అధికారులు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం అటవీశాఖ ఎంఓఈఎఫ్సీసీ ఐజీఎఫ్ డాక్టర్ త్రినాధ్ కుమార్, సీపీఎఫ్ ప్రభాకర్ సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్లు వారికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించగా రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. వారి వెంట ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, భూపాలపల్లి డీఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఎఫ్డీఓ సత్యయ్య, ఎఫ్బీవో కిషన్ తదితరులు ఉన్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచాలిభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. గడిచిన నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 4.21 లక్షల టన్నులు కాగా, 3.45 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 82 శాతంలో నిలిచినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 12,327 టన్నులు నమోదైందన్నారు. ఓపెన్కాస్టుల్లో మట్టి వెలికితీత పనుల్లో ఓసీ–2లో 13.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 10.14 లక్షల క్యూబిక్ మీటర్లు 75శాతం సాధించగా, ఓసీ–3లో 30.00 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 23.45 లక్షల క్యూబిక్ మీటర్లు 78శాతం సాధించినట్లు తెలిపారు. మొత్తంగా 43.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 33.59 లక్షల క్యూబిక్ మీటర్లు 77శాతం మట్టి వెలికితీత పనులు చేయడం జరిగిందన్నారు. ఈ నెల ఉత్పత్తి లక్ష్యం 4.54 లక్షల టన్నులు చేయాల్సి ఉందన్నారు. ఉత్పత్తి పెంపు కోసం ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని, పనిగంటలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంపునకు అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా వర్కింగ్ పర్మిషన్ తదితర నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి కొనసాగించాలని తెలిపారు. రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తెలిపారు. -
దేవునిగుట్టపై పూర్ణాహుతి
ములుగు రూరల్: కొత్తూరు దేవునిగుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భాగంగా స్వామి కల్యాణ మహోత్సవంలో ఎడ్లబండ్లు తిరుగు కార్యకక్రమం నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
విద్యుత్ వ్యవస్థ రక్షణకు చర్యలు
హన్మకొండ: విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్ సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి సబ్స్టేషన్లో నిర్మాణ సమయంలోనే లైటర్నింగ్ అరెస్టర్లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు రక్షణ ఉంటుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పొడవాటి విద్యుత్ లైన్లలో మొత్తం 2,337 లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్లో 95, వరంగల్ సర్కిల్లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్లో 52, మహబూబాబాద్ సర్కిల్లో 38, ఖమ్మం సర్కిల్లో 248, భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్లో 182, కరీంనగర్ సర్కిల్లో 281, జగిత్యాలలో 161, పెద్దపల్లిలో 211, నిజామాబాద్లో 328, కామారెడ్డిలో 59, అదిలాబాద్లో 89, నిర్మల్లో 84, మంచిర్యాలలో 218, ఆసిఫాబాద్ సర్కిల్లో 159 లైటర్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. ఎలా పనిచేస్తుందంటే.. లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, స్విచ్గేర్ పరికరాలు, ఇతర విద్యుత్ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. మెరుపు కారణంగా కలిగే బ్రేక్డౌన్లు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. విద్యుత్ వ్యవస్థ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే సుదూరంగా ఉండే విద్యుత్లైన్లలో లైటర్నింగ్ అరెస్టర్లు చేశాం. విని యోగదారులు కూడా వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలి. మెరు పు సమయంలో అనవసరంగా విద్యుత్ పరికరాల ను తాకకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. –టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఉరుములు, మెరుపులనుంచి రక్షణకు నిరోధకాల బిగింపు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,337 లైటర్నింగ్ అరెస్టర్ల ఏర్పాటు -
విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
ములుగు: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికతో చదవాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనపై విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను విశ్లేషించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి ప్రధాన సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో రోజువారీగా, వారాంత మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షలు అంటే భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా రాసేలా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ధైర్యం నింపాలని సూచించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. టెన్త్ ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు సమష్టిగా పాటుపడాలని సూచించారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పలు సూచనలు చేసి ఆల్ ది బెస్ట్ తెలిపి విజయపథ సందేశ లేఖలను అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి ఈ నెల 14నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ జీ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే అధికారులకు సైతం సెల్ఫోన్ అనుమతి లేదన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రం పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లేటప్పుడు, పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను పోస్టాఫీస్లో డిపాజిట్ చేసే సమయంలో తప్పకుండా పోలీస్ సిబ్బంది సమక్షంలోనే జరగాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. పరీక్ష సమయంలో తహసీల్దార్లు పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తారని డీటీ స్థాయి అధికారులు సిట్టింగ్ స్క్వాడ్గా ఉంటారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంతో పాటుగా మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు విధిగా సమయానుగుణంగా నడపాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీపీఓ వెంకయ్య, వివిధ శాఖల అధికారులతో పాటు ఏసీజీఈ వినోద్ కుమార్, కోఆర్డినేటర్లు రాజు, శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
సెంట్రల్ డ్రగ్ స్టోర్ రికార్డుల పరిశీలన
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విజిలెన్స్ డ్రగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ స్టోర్, మెడికల్ కళాశాల సెంట్రల్ స్టోర్ను విజిలెన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జన్ను కిరణ్కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన 50 ఇంజక్షన్లు లభ్యం కావడంతో విచారణ చేపట్టారు. ప్రభుత్వం నుంచి పునిస్కా కంపెనీకి చెందిన 0217 బ్యాచ్ నంబర్ కలిగిన 1,700 మెట్రోనైడోజనల్ ఇంజక్షన్లు సెంట్రల్ మెడిసిన్ స్టోర్కు సరఫరా కాగా ములుగు ఆస్పత్రికి 1,286 ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని తెలిపారు. మిగిలిన 414 నిల్వ ఉన్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజ్ చేయాల్సిన మందులను ఇష్టానుసారంగా నిల్వ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొడుకు పట్టించుకోవడం లేదు
నాకు ఒక్క కొడుకు. హైదరాబాద్లో ఉంటున్నాడు. బాగోగులు పట్టించుకోవడం లేదు. జీవనం సాగించడం ఇబ్బందిగా ఉంది. ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఉన్న ఎకరం భూమి అమ్ముకుందామనుకుంటే అడ్డు తగులుతున్నాడు. – కొల్లు వెంకట్రెడ్డి, గోవిందరావుపేట ములుగు మున్సిపాలిటీ పరి ధిలోని పాల్సాబ్పల్లికి చెందిన నిరుపేదలకు ఇళ్లు కేటా యించాలి. తన వార్డులో సు మారుగా 25 కుటుంబాలు సొంత ఇళ్లు లేక దుర్భరజీవి తాలు గడుపుతున్నారు. దీంతో పాటు కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను సైతం మెరుగుపర్చాలి. – కొయిల లక్ష్మి, కౌన్సిలర్ రెండో వార్డు, ములుగు వెంకటాపురం(ఎం) శివారులో తనకు వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. దానికి సంబంధించి పట్టా అందించాలి. సర్వే నంబర్ 1710/సి/2 లో 20 గుంటల భూమి మా తాత చింతిరెడ్డి బాల్రెడ్డి పేరున పట్టా ఉంది. నా తండ్రి మరణించాడు. కావున తన పేరున పట్టా అందించాలి. – చింతిరెడ్డి దిలీప్రెడ్డి, వెంకటాపురం(ఎం)● -
నారసింహుడికి సింహవాహనసేవ
● కోటంచలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలురేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆది వారం నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సింహవాహన సేవలో మాడవీధుల గుండా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళల చప్పుళ్లతో ఊరేగించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి గరుడోత్సవం, సదస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, ధర్మకర్తలు, గ్రామపెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేడు హనుమంతవాహన సేవ నేడు(సోమవారం) స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చమచార్యులు తెలిపారు. రాత్రి చిన్న రథసేవ, దోపోత్సవం కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేస్తున్న మంత్రి సీతక్క సర్పంచ్ను సన్మానిస్తున్న మంత్రులు సీతక్క, పొంగులేటిఏటూరునాగారం: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ దివాకరతో కలిసి కొండాయి గ్రామానికి చెందిన 90మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటే ఇంటి నిర్మాణానికి తక్షణమే లక్ష రూపాయల రుణం అందుతుందని వివరించారు. అలాగే కొండాయి గ్రామానికి వెళ్లే దారిలోని జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జిని రూ.16 కోట్లతో మంజూరు చేయించి నిర్మాణం పనులు చేపట్టామన్నారు. కొండాయి గ్రామం జంపన్నవాగు పరీవాహక ప్రాంతంలో ఉన్నందున మంజూరైన ఇళ్లను సురక్షిత ప్రాంతంలో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సీతక్క సూచించారు. పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన 38 చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే నూతనంగా ఏర్పడిన ఆత్మకమిటీతో మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) కమిటీ పారదర్శంగా పనిచేయాలని సూచించారు. అనంతరం చైర్మన్, డైరెక్టర్లను మంత్రి సన్మానించారు. అనంతరం ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో సుమారు కోటి రూపాయలతో చేపట్టిన ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశంచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, రవాణా శాఖ స్టేట్ డైరెక్టర్ వసంతశ్రీనివాస్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, వావిలాల ఎల్లయ్య, ఎండీ అప్సర్పాషా, గౌస్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. నూతన సర్పంచ్లకు సన్మానం వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో ఆదివారం నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలెంవాగు ప్రాజెక్టు మంజూరు చేశారని తెలిపారు. ఆ ప్రాజెక్టు అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు కాల్వల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి 15వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేశామని వెల్లడించారు. వాజేడు మండల పరిధిలోని పూసూరు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కొత్తగా ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యె తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీను, నాయకులు చిడెం మోహనరావు, మన్నెం సునీల్ పాల్గొన్నారు. కొండాయి బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
జీపీ కార్మికుల వేతనాలు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ వెంకటాపురం(ఎం): గ్రామపంచాయతీ కార్మికుల 6 నెలల పెండింగ్ వేతనాలతో పాటు, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని పాలకుర్తి సురేశ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీపీ కార్మికులకు వ్యతిరేకమైన జీవో నంబర్ 51 సవరించడంతో పాటు మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. అనంతరం యూనియన్ మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా సురేశ్, ప్రధాన కార్యదర్శిగా ఓదెలు, కోశాధికారిగా స్వామి, ఉపాధ్యక్షుడిగా సాంబయ్య, సత్యపాల్ రెడ్డి, రమేశ్, సహాయ కార్యదర్శులుగా నవాబు, కవిత, రాజయ్య తదితరులను ఎన్నుకున్నారు. -
సండే సందడి
రామలింగేశ్వరస్వామికి పూజలు వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించారు. గోవిందరావుపేట: మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరంలో ఆదివారం పర్యాటకులు సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో లక్నవరం సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను చూసి ఆనందంగా గడిపారు. తేలాడే వంతెనపై నడుస్తూ.. సరస్సులో బోటు షికారు చేస్తూ సందడిగా గడిపారు. -
ముందుచూపేది?
రామన్నగూడెం వద్ద చుక్క నీరు లేకుండా ఉన్న పుష్కరఘాట్ రాంనగర్ వద్ద ఒడ్డుకు దగ్గరలో ఉన్న గోదావరి నీరు ఏటూరునాగారం: వచ్చే ఏడాది జూన్ 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులు పుణ్యస్నానాలు చేసే విధంగా ఘాట్ల నిర్మాణంతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి అవసరం ఉంది. 2015లో చోటుచేసుకున్న తప్పిదాలు పునరావృతం కాకుండా ఇప్పటికై నా ముందుచూపుతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఏజెన్సీలోని వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ప్రవహిస్తోంది. 2027 జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో 2015లో వచ్చిన గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 6 కోట్ల నిధులతో ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట, రామన్నగూడెం వద్ద పుష్కరఘాట్లను ఇరిగేషన్ అధికారులు నిర్మించారు. అలాగే మంగపేట మండల కేంద్రంలో మరో ఘాట్ నిర్మించారు. అధికారులు ఎస్టిమేట్ వేసి నిర్మించిన ఘాట్ల వద్ద గోదావరి ప్రవాహం లేక పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో జల్లుస్నానాలు చేశారు. గోదావరి పుష్కరాలకు పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి జల్లు స్నానాలు చేసిన భక్తులు బీఆర్ఎస్ మంత్రులు, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక రైతులు, వ్యవసాయ దారులు ట్రాక్టర్ల ద్వారా కిలో మీటర్ దూరంలో ప్రవహించే గోదావరికి భక్తులను తరలించి పుణ్యస్నానాలు చేసేలా సహకరించారు. గోదావరి ఒడ్డున ఇన్ఫిల్టర్ బావులు నిర్మించి మోటార్ల ద్వారా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేసినా కొంతమంది ట్రాక్టర్లలో గోదావరికి వెళ్లి స్నానాలు చేశారు. ఈ ప్రాంతాల్లో ఘాట్లు నిర్మిస్తే ఉపయోగం ఇటీవల కలెక్టర్ టీఎస్.దివాకరతో పాటు అధికారులు జిల్లాలోని పుష్కరఘాట్ల నిర్మాణాలకు స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కానీ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం చేపట్టాలనే ఆలోచన చేయలేదని స్థానికుల ద్వారా తెలుస్తుంది. వాజేడు మండలం పూసూరు రేవు, ఎడ్జర్లపల్లి రేవు వద్ద నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఘాట్లను నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ముళ్లకట్టకు కిలోమీటర్న్నర దూరంలో మరో ఘాట్, రాంనగర్ వద్ద పాత పడవ రేవు వైపునకు నిర్మిస్తే భక్తులకు ఇబ్బంది ఉండదు. మంగపేట వద్ద ఇప్పుడున్న దానికి ఆనుకుని మరో ఘాట్ నిర్మిస్తే భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు సులువుగా ఉంటుంది. 2015 నాటి పాఠాలు నేర్వని అధికారులు నీరులేక జల్లు స్నానాలు చేసిన భక్తులు 2027 పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విన్నపం నీరు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఘాట్లు నిర్మించాలని వేడుకోలు వచ్చే ఏడాదిలో జరగబోయే పుష్కరాలకు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు రూ.4 కోట్లతో 50మీటర్ల పుష్కరఘాట్ కాంక్రీట్తో నిర్మించేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతి పాదనలు సిద్ధం చేసింది. గోదావరి వరద ఘా ట్కు దూరంగా ఉంటే పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమా దం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గోదా వరి ప్రవహించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఘాట్లను నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు అధికారులు, నాయకులను కోరుతున్నారు. -
రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద అద్భుతంగా ఛత్తీస్ఘడ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జు వెంకటేశ్వర్ కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని కొనియాడారు. అదేవిధంగా అమెరికాకు చెందిన క్రిస్ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. నేడు పదహారు పండుగ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం జరిగి (నేడు)సోమవారం 16 రోజులు అవుతున్న సందర్భంగా పదహారు రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన ఉత్సవ మూర్తుల కల్యాణం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. కాళేశ్వరాలయంలో భక్తుల సందడి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సందడి నెలకొంది. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతీ అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. శని, కాలసర్పనివారణ పూజలు భక్తులు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తులు కోలాహలం కనిపించింది. -
పుచ్చకాయలకు భలే గిరాకీ
వాజేడు: వేసవికాలం వచ్చిందంటే చాలు పుచ్చ కాయలకు భలే గిరాకీ ఉంటుంది. మండల కేంద్రంలోని జగన్నాథపురం జంక్షన్ వద్ద ఆలుబాక గ్రామానికి చెందిన పలువురు రైతులు పుచ్చకాయలను తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో జగన్నాథపురం, మండపాక, చెరుకూరు, ధర్మవరం తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సీపీఆర్, డెఫిబ్రిలేషన్పై శిక్షణ ఎంజీఎం: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన కీలక నైపుణ్యాలపై 33 మంది వైద్యులకు కాకతీయ వైద్య కళాశాలలో సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్ తెలిపారు. శని, ఆదివారాల్లో డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ జ్ఞాపిక సమక్షంలో హృదయం ఆగడం (కార్డియాక్ అరెస్టు), సీపీఆర్, డిఫిబ్రిలేషన్ వినియోగం వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ శిక్షణ పొందిన వైద్యులు భవిష్యత్లో మరికొంత మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా అత్యవసర వైద్యసేవల నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రేపు భద్రకాళి దేవాలయం మూసివేత హన్మకొండ కల్చరల్: చంద్రగ్రహణం సందర్భంగా భద్రకాళి దేవాలయాన్ని మంగళవారం మూసివేయనున్నట్లు ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, వేదపాఠశాల అధ్యాపకుడు తాతాభట్ల నరసింహశర్మ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల వరకు పూజలు నిర్వహించిన అనంతరం 7.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేస్తామని, బుధవారం సంప్రోక్షణపూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తామని వారు తెలిపారు. -
పుష్కరఘాట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు
మేడారంలో రాతి కట్టడాలు● అదనపు కలెక్టర్ సంపత్ రావు ● జంపన్నవాగులో నిరంతరం గోదావరి నీరు ● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డివాజేడు: మండలంలో పుష్కర ఘాట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని అదనపు కలెక్టర్ సంపత్రావు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వాజేడు, పేరూరు గ్రామాల వద్ద పుష్కర ఘాట్లకు అనువైన ప్రదేశాలను అధికారులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. మండలంలో రెండు పుష్కర ఘాట్లు కొత్తగా నిర్మించాల్సి ఉండగా పనులు చేపట్టాలన్నారు. అందుకు సంబంధించి తాగునీరు, మరుగు దొడ్లు, విద్యుత్ లైన్, పార్కింగ్ ప్రదేశం తదితర పనుల ప్రారంభంపై ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణాలకు ఖర్చు అంచనా విలువలతో నివేదికలను అందజేయాలని కోరారు. అలాగే చండ్రుపట్ల గ్రామంలో పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలని పరిశీలించగా అనువైన ప్రదేశం లేకపోవడంతో పేరూరులో పరిశీలించి ప్రతిపాదనలను వెంటనే అందజేయాలన్నారు. ఆయన వెంట నాగారం సర్పంచ్ స్వరూప, ఎంపీడీఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్ఐ కుమార స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
విజ్ఞానాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి ములుగు: శాస్త, సాంకేతిక విజ్ఞానాభివృద్ధిలో పరిశోధనలను ఆసరాగా చేసుకుని నేటి విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను డీఈఓ ప్రారంభించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు గందె రమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి డీఈఓ సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ప్రతిరోజూ నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందులోని విషయాలను విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలని సూచించారు. నిత్యజీవితంలో పరిశోధనాత్మ దృక్పథాన్ని అలవర్చుకుని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదుగాలన్నారు. పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిట్లను పరిశీలించిన ఆయన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేసిన సైన్స్ ఉపాధ్యాయులు సతీశ్ కుమార్, క్యాతం రాజేందర్ లను ఆయన అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకంగా తయారుచేసిన ఎగ్జిబిట్లు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. వీటిని స్ఫూర్తిగా తీసుకొని సైన్స్ పట్ల అభిరుచిని పెంచుకొని సైన్స్ కోర్సులు చదివి విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోవాలని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ లో ప్రదర్శింపబడుతున్న మోడల్ రాకెట్ లాంచింగ్ కార్యక్రమానికి విద్యార్థులను తీసుకెళ్తున్న ఉపాధ్యాయ బృందాన్ని డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిట్టల మల్లయ్య, తోట చంద్రమౌళి, మహమ్మద్ జాఫర్ అలీ, కేశబోయిన మదన్ మోహన్, గైని సతీష్, వజ్జ లక్ష్మినారాయణ, దొంతి సత్యం, చల్లా భాస్కర్ రెడ్డి, బైకాని రజిత, విద్యార్థులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు మరింత భరోసా ఇవ్వాలి
● ఎన్హెచ్సీ డీపీఎం కమల ఏటూరునాగారం: మండలంలోని దివ్యాంగులకు ఎన్హెచ్సీ సెంటర్ మరింత భరోసా ఇవ్వాలని ఎన్హెచ్సీ డీపీఎం(జిల్లా ప్రాజెక్టు మేనేజర్) కమల అన్నారు. మండల కేంద్రంలోని ఎన్హెచ్సీ సెంటర్ను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లోని పిల్లలకు సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్హెచ్సీ సెంటర్ లేకపోవడం వల్ల దివ్యాంగుల్లో మార్పులేకుండా ఉండేదని, ఇప్పుడు మానసిక, శరీర మార్పులు, ఎదుగుదల కనిపిస్తుందని తెలిపారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు రెన్యూవల్స్ త్వరగా చేయించుకోవాలని సూచించారు. అలాగే మండలంలోని దివ్యాంగుల పొదుపు సంఘంతో అధికారులు సమావేశమై పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం పీడబ్ల్యూడీ కృష్ణవేణి, ఏపీఎం కొప్పుల శ్రీధర్రెడ్డి, ఎన్హెచ్సీ సెంటర్ సీసీ నర్సింహరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి
● టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉప్పస్వామి, నాగరాజుఏటూరునాగారం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల ఉప్పస్వామి, పల్లె నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం మండల కేంద్రంలోని ఐటీడీఏ ఏపీఓ వసంతరావుకు ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం చెల్లించాలన్నారు. వీటితో పాటు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలను 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయాలన్నారు. జీవో నంబర్ 317 ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. వసతి గృహాలకు వసతి ప్రత్యేకంగా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్లను మంజూరు చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల సమస్యల పరిష్కారానికి 10వ తేదీన హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు బడుగు రాజు, భూక్య సారంగపాణి పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
● చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ములుగు రూరల్: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు శనివారం బండారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు, బాల కార్మిక, ర్యాగింగ్, బాల్య వివాహాలు, మోటర్ వెహికిల్ చట్టాల గురించి వివరించారు. న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, ప్రధానోపాధ్యాయుడు నర్సింహమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
త్రీఫేజ్ విద్యుత్ అందేనా?
● ఏళ్ల తరబడి గిరిజన రైతుల నిరీక్షణ ● జిల్లాలో 321 కనెక్షన్ల కోసం దరఖాస్తులు ● ఐటీడీఏలో 17 డీడీలు మాయంఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని పలువురు గిరిజన రైతులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలోని గిరిజన గ్రామాల నుంచి 321 మంది రైతులు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయినా అధికారులు మూడేళ్లుగా ఒక కనెక్షన్కు కూడా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదు. ప్రతీసారి గిరిజన దర్బార్లో పలుమార్లు గిరిజనులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాపై అధికారులకు వినతులు ఇస్తూ పోతున్నారు. కానీ పట్టించుకునే వారే కరువయ్యారని బాధితులు వాపోతున్నారు. దీంతో విసిగివేజారిన గిరిజనులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా రాదని వ్యవసాయాన్ని మానివేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. రైతులు డీడీలు తీసినా.. ఏటూరునాగారం మండలంలోని అల్లంవారిఘణపురం, బన్నాజీబంధంకు చెందిన 17 మంది రైతులు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు ఒక్కో రైతు రూ.5,500ల చొప్పున డీడీలు తీసి ఇచ్చారు. కానీ ఇంత వరకు విద్యుత్ సరఫరా చేయడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు లేవు, లైన్ లేదు, డీడీలు కూడా మాయమైన పరిస్థితి ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఐటీడీఏలో ఉండాల్సి న డీడీలు కనిపించకుండా పోయాయని రైతులు వా పోతున్నారు. సిబ్బంది మాయం చేశారా లేక వాటి ని డ్రా చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. డీడీలు ఇచ్చి మూడేళ్లు.. అల్లంవారిఘణపురంలో 12 మంది రైతులు, బన్నాజీబంధంకు చెందిన ఐదుగురు రైతులు ఒక్కొక్కరూ రూ.5,500ల చొప్పున డీడీలు తీశారు. మూడేళ్లు అయినా విద్యుత్ సరఫరా చేయడం లేదు. విద్యుత్శాఖ, ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం మూలంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కావడం లేదు. వ్యవసాయ బోర్లు వేసుకొని నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని ఏజెన్సీలోని రైతులు కోరుతున్నారు. -
నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని మంత్రులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నేడు(ఆదివారం) దర్శించుకోనున్నారు. నేటి ఉదయం మేడారం నుంచి హేమాచలక్షేత్రానికి ఉదయం 8 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇద్దరు మంత్రులు హేమాచల క్షేత్రానికి రానుండటంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, మంగపేట ఎస్సై ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్న చేయనున్నారు. ఉద్యోగ విరమణ సహజం ములుగు రూరల్: ప్రతీ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. వెంకటాపురం(ఎం) పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై రాంసింగ్ను జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శనివారం శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 35 ఏళ్ల పాటు పోలీస్శాఖకు తన సేవలు అందించారని తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని వివరించారు. ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఐ వెంకటనారాయణ, వెంకటాపురం(ఎం)ఎస్హెచ్ఓ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి వెంకటాపురం(కె): ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక క్వారీల్లో పెసా చట్టం నియమ నిబంధనలు పాటించాలన్నారు. కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఇసుకను డంపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కృష్ణబాబు, తాటి రాంబాబు, నవదీప్, నాగరాజు, మల్లయ్య పాల్గొన్నారు. చంద్రవాహన సేవలో.. ● కోటంచలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలురేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్యనిధి, హోమం నిర్వహించిన అనంతరం స్వామి వారిని గజవాహన సేవలో మాడవీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం బలిహరణ సేవ నిర్వహించిన అనంతరం స్వామి వారిని చంద్రవాహన సేవలో డప్పువాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ఊరేగించారు. అనంతరం తీర్థప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, రవిందర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
84 మంది గైర్హాజరు
● కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ఏటూరునాగారం: జిల్లాలో పది మండలాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయని, ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి నాయిని విరేందర్ తెలిపారు. శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష కావడంతో జిల్లాలోని 2,006 మందికి 1,922 మంది హాజరు కాగా 84 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష గదిలోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నేడు (శనివారం) ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ఉందని, విద్యార్థులు సకాలంలో హాజరు కావాలన్నారు. -
రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రం
ఏటూరునాగారం/మంగపేట: ప్రజలకు రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఈ–జిల్లా మేనేజర్ (ఈడీఎం) దేవేందర్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మీసేవా, ఆధార్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. మీసేవలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ తప్పులు లేకుండా నమోదు చేయాలని, ఫార్మర్ రిజిస్ట్రేషన్ సర్వీసును రైతులుందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్ణీత రు సుం కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. యూనివర్సల్ క్లైంట్ సాఫ్ట్వేర్ ద్వారా ఆ ధార్ సేవలు సులభతరం అయ్యాయన్నారు. మీసే వ నిర్వాహకులు ఈఎస్డీ గైడ్లైన్స్ ప్రకారం నడిపించాలన్నారు. మీసేవ లోగో, తహసీల్దార్ ఇతర అధికారుల నంబర్లు ప్రజలకు కనిపించేలా ఉండాలన్నారు. కల్యాణలక్ష్మీ, బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. ఈ కా ర్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజ య్, రాకేష్, సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈడీఎం దేవేందర్ మీసేవ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు -
కల్చర్ఫుల్ ఫెస్ట్..
● నిట్లో ఉత్సాహంగా స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలు ● ఆకట్టుకున్న స్వయంభు సినిమా యూనిట్ ● సందడి చేసిన హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్ ● ప్రత్యేక ఆకర్షణగా హీరో నిఖిల్ సిద్ధార్థ, డైరెక్టర్ శైలేష్ ● ఉర్రూతలూగించిన ప్రోషో వేడుకలను తిలకిస్తున్న విద్యార్థులుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం (కల్చరల్ఫెస్ట్) కలర్ఫుల్గా సాగింది. ఈ ఫెస్ట్లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీసంప్రదాయాలను పంచుకున్నారు. తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు. ఫ్లాష్ షూట్ సీఈఓ స్టార్టప్ రంగాలపై అవగాహన కల్పించారు. చివరి రోజు శనివారం ప్రోషోలో రానినారెడ్డి పాప్ సాంగ్స్తో అలరించనుంది. ‘వారెవ్వ ఏమీ ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్ పెయింటింగ్లో కలర్ఫుల్ లుక్ ఇచ్చారు. తమ ముఖాలలపై డైనోసార్, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
ఏటూరునాగారం: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని సీజీఎం రాజీవ్ చౌహన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలను నాటి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, ప్రజలకు నాణ్యతమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు నూతనంగా సబ్స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. రైతులకు త్రీఫేజ్ సరఫరా ఉంటుందని వెళ్లడించారు. విని యోగదారులు విద్యుత్ను వృథా చేయకుండా పవర్ను సేవ్ చేయాలన్నారు. నిర్లక్ష్యంగా విద్యుత్ వైర్ల ను నిర్మించకుండా శాశ్వతంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే అధికారులు, సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఆనందం, డీఈఈ నాగేశ్వర్రావు, డీఈఈ పురుషోత్తం, టీఆర్ఈ డీఈఈ సదానందం, టీఆర్ ఏడీ మధుసూదన్, ఏఈ స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ కొండా స మ్మయ్య, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు. సీజీఎం రాజీవ్ చౌహన్ -
పోలీస్ క్రీడా పోటీల్లో ‘బెటాలియన్’కు పతకాలు
గోవిందరావుపేట: తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో 5వ బెటాలియన్ సిబ్బంది ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. వివిధ విభాగాల్లో మొత్తం 40 పతకాలతో ముందంజలో ఉన్నారు. బెటాలి యన్కు చెందిన పిసి–1,440 డి.కల్యాణ్ ఈత (స్విమ్మింగ్) పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి 5 బంగా రు పతకాలు సాధించగా మరో పి.సి1,268 బి.హనుమంతు కరాటే విభాగంలో వ్యక్తిగతంగా 5 పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. విజయాన్ని పురస్కరించుకొని బెటాలియన్ అదనపు కమాండెంట్ బి. సీతారాం శుక్రవారం సిబ్బందిని అభినందించారు. వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణ ప్రశంసనీయమన్నారు. క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, భవిష్యత్లో కూడా ఇలాగే ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు అనిల్ కుమార్, శ్రీనివాస్ రావు, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, సాయి బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. -
పుష్కరఘాట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
మంగపేట/ఏటూరునాగారం: గోదావరి పుష్కరఘాట్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగపేట మండలంలో నూతనంగా పుష్కరఘాట్ నిర్మాణం చేపట్టేందుకు మల్లూరు, చుంచుపల్లి, మంగపేటలోని పొదుమూరు, గంపోనిగూడెం సమీపంలోని సండ్రోనిఒర్రె ప్రాంతంలో గోదావరి తీర ప్రాంతాన్ని కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీ (రెవెన్యూ)తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, ముల్లెకట్టలో 2015లో నిర్మించిన పుష్కరఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంగపేట మండలంలో నూతన పుష్కరఘాట్ నిర్మాణంపై ఇరిగేషన్ డీఈ రవికుమార్, ప్రవీణ్కుమార్తో చర్చించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించారు. జూలై 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ముఖ్యంగా ప్రతీ ఘాట్ వద్ద భక్తులకు తాగునీరు, లైటింగ్, మరుగుదొడ్లు, రవాణామార్గం, పార్కింగ్ స్థలాలు, ప్రత్యేక వైద్యశిబిరాలు కల్పించడానికి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ తోట రవీందర్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి, ఎంపీడీఓ బద్రునాయక్, ఇరిగేషన్ డీఈ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్రావు, ఆర్ఐ శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, రూప్సింగ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ టీఎస్ దివాకర -
పంచాయతీలకు నిధులు
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్రం● జిల్లాలో 171 జీపీలకు కేటాయింపు ● పంచాయతీ ఖాతాల్లో రూ.5.49 కోట్లు జమములుగు: రెండేళ్లకు పైగా ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖాజానాలకు కేంద్రం నిధులు జమ చేయడంతో కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరితో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అభివృద్ధి కుంటుపడింది. పారిశుద్ధ్య పనుల నిర్వహణ, వీధిదీపాల ఏర్పాటు, చెత్తాచెదారాన్ని తరలించే ట్రాక్టర్లకు సైతం డీజిల్ పోసేందుకు అప్పులు చేసి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీల భారాన్ని తమ మీద వేసుకొని కొంతమేర నెట్టుకువచ్చినప్పటికీ పంచాయతీల అభివృద్ధిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలోని 171 గ్రామపంచాయతీ ఖాతాల్లో రూ.5.49.73.162 లను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థికసంఘం నిధులను జమచేసింది. ఒక వ్యక్తికి సంవత్సరానికి రూ.150ల చొప్పున కేటాయిస్తుండగా ఎస్సీ, ఎస్టీ జనాభాకు 10 నుంచి 20 శాతం అదనంగా నిధులను కేటాయిస్తుంది. రేండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎస్డీఎఫ్ గ్రాంట్ ఇప్పటివరకు మంజూరు కాలేదు. కేంద్రం 2023–24 సంవత్సరానికి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసినప్పటికీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధులను మంజూరు చేయాల్సి ఉంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను తాగునీరు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం కల్పిస్తారు. ఈ నిధులతో తాగునీరు, పైపులైన్ ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం, డ్రెయినేజీ వ్యవస్థ, చెత్తాచెదారాన్ని తరలింపు, నిర్వహణ కేంద్రాలకు 60 శాతం నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా, సీసీ రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు, పంచాయతీ భవనాల మరమ్మతు, శ్మశాన వాటికల సదుపాయాలకు 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు మంజూరైన నిధులను పాలకవర్గాలు ఖర్చు చేస్తేనే మిగిలిన నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఏటూరునాగారం 61,64,495 గోవిందరావుపేట 58,54,016 కన్నాయిగూడెం 24,14,646 మంగపేట 90,29,476 ములుగు 85,68,649 తాడ్వాయి 48,87,273 వెంకటాపురం(ఎం) 63,79,108 వెంకటాపురం(కె) 66,03,853 వాజేడు 54,36,416 మొత్తం 5,49,73,162 గ్రామ పంచాయతీకి మంజూరైన నిధులతో ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామంలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ద్య నిర్వహణకు ప్రాధాన్యం కల్పిస్తాం, మిగిలిన నిధులతో ప్రజల అవసరాన్ని బట్టి వినియోగిస్తాం. – మామిడిశెట్టి సుగుణ, సర్పంచ్, వెంకటాపురం -
కల్యాణం.. కమనీయం..
మంగపేట: మండలంలోని కమలాపురం బిల్ట్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తుల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పూజారి ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు వేదమంత్రోశ్ఛరణ నడుమ దేవతామూర్తుల విగ్రహాలను మంగళవాయిధ్యాలతో కల్యాణ వేదికపై ప్రతిష్ఠించారు. భక్తులు స్వామివారికి, అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు పూజారులు వేద మంత్రోశ్ఛరణ నడుమ వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం -
‘ఉద్యమ్’తో సబ్సిడీ రుణాలు
ములుగు: ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై అందరికీ అవగాహన ఉండాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. యువత వ్యాపార రంగాలపై ఆసక్తి ఉన్న వారు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునేవారు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా స బ్సిడీ రుణాలు పొందాలంటే ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకుని ఉండాలన్నారు. సదస్సులో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యత, ఎలిజిబిలిటీ ప్రమాణాలు, ఆన్లైన్ అప్లై చేసే విధానం, లాభాలు (లోన్లు, సబ్సిడీలు, ప్రాధాన్యత టెండర్లు మొదలైనవి) వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రభుత్వం నుంచి సమగ్ర సాయం పొందడం, బ్యాంకు లోన్లు, సబ్సిడీలు, టెండర్లో ప్రాధాన్యం వంటి ప్రయోజనాల కోసం సరైన దశలో ఉద్యమ్ రి జిస్ట్రేషన్ సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఈడీసీ మేనేజర్ విక్రమ్, అసిస్టెంట్ మేనేజర్ భుక్య శ్రీకాంత్, ఆర్పీ వెంకన్న, రామేందర్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థరెడ్డి -
లోపభూయిష్టంగా విద్యాకమిషన్ సిఫారసులు
ఏటూరునాగారం: తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు లోపభూయిష్టంగా, విద్యారంగానికి ఉపాధ్యాయులకు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ వీరభద్రం అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన సంఘ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ సొంత అభిప్రాయాలను విద్యారంగం ఉపాధ్యాయులపై రుద్దడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని సిఫారసులు ఇవ్వడం అర్ధరహితమన్నారు. రాష్ట్రంలోని విద్యావవస్థపై సమగ్ర అధ్యయనం చేసి పాఠశాలల పరిస్థితులు, విద్యా ప్రమాణాల పెంపు, విద్యా రంగ పురోగతిపై ప్రభుత్వానికి మంచి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వం సమగ్రంగా సర్వేలు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అడప రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాంబాబు, కందుకూరి రాజు, రాజేంద్రప్రసాద్, నాయుడు, విష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు మేడారానికి పొంగులేటి రాక
ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి నేడు (శనివారం) రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రానున్నారు. మంత్రి సీతక్కతో కలిసి ఆయన అమ్మవార్ల గద్దెల ప్రాంగణం నిర్మించిన ఆల య పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి, మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెండింగ్ మిల్లింగ్ చార్జీలు విడుదల చేయాలి ములుగు రూరల్: పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జీలను విడుదల చేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా సివిల్ సప్లయీస్ డీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కృష్ణవేణిని అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జిలను విడుదల చేయాలన్నారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని డీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాడబలిజలు అన్నిరంగాల్లో రాణించాలివాజేడు: వాడబలిజ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గురి రమణయ్య అన్నారు. మండలంలోని ధర్మవరంలో శుక్రవారం ధర్మవరం, బీసీ మర్రిగూడెం గ్రామాలకు చెందిన వాడబలిజ కూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలకు విద్య ఎంతో ముఖ్యమైందన్నారు. ప్రతీ విద్యార్థికి తమ తల్లిదండ్రులు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధను చూపాలన్నారు. రానున్న రోజుల్లో వాడబలిజలు అన్ని రంగాల్లో రాణించాలని దానికి సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఆదినారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు నాగార్జున, రఘుబాబు, సమ్మయ్య, శ్రీధర్ తదితరులున్నారు. బడిలో మట్టి కుండల వర్క్షాప్ కాళేశ్వరం: జిల్లాస్థాయి జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలను మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మట్టి కుండల తయారీ వర్క్ షాప్తో ప్రారంభించారు. కుమ్మరివారితో కుండల తయారీ విధానాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి స్వామి మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైనటువంటి మట్టిపాత్రలు వాడాలని తెలిపారు. ప్రాచీన కాలంలో ఇంట్లో ప్రతీ వస్తువు మట్టితో తయారుచేసిన వంట పాత్రలు, నీటిని నిలువ చేసే పాత్రలు, ధాన్యం నిల్వచేసే కాగులు పేర్పులు మొదలగు మట్టిపాత్రలు ఉపయోగించేవారని తెలిపారు. దీంతో ప్రజలందరికీ మంచి ఆరోగ్యంతో పాటు కుటీర పరిశ్రమలు బలపడేవని తెలిపారు. నేటి సమాజంలో మట్టి పాత్రలన్నీ కనుమరుగైపోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం, బయోసైన్స్ జిల్లా ఫోరమ్ అధ్యక్షుడు బి.ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ హసీనభాను, ఉపసర్పంచ్ శ్రీజ, బాలికల పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం సరిత, పి.కల్యాణి, ఉర్దూ పాఠశాల హెచ్ఎం యాస్మిన్, వివిధ పాఠశాలల సైన్స్ టీచర్లు పాల్గొన్నారు. -
ఐఏఎస్ల ఆకస్మిక బదిలీ
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్ కలెక్టర్గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి హోదా కల్పించన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా నియమించారు. ఎవరు ఎక్కడికంటే.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్పాయ్ హనుమకొండ కలెక్టర్గా నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మహబూబాబాద్కు బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జోగులాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా ఉన్న సందీప్ కుమార్ ఝాను నియమించారు. మరో ఐఏఎస్ అధికారి, జనగామ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్ (ఎస్సీఎస్) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్కు వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి ఏడుగురికి స్థానచలనం హనుమకొండ కలెక్టర్గా చాహత్.. ‘గ్రేటర్’కమిషనర్గా అదనపు బాధ్యతలు మహబూబాబాద్కు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్సింగ్ జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్ ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝా నియామకం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బదిలీ -
పుష్కరాలకు పార్కింగ్ స్థలాల గుర్తింపు
ఏటూరునాగారం: వచ్చే ఏడాలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను నిలిపించేదుకు ప్రత్యేకంగా నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలను అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఐటీడీఏ ఇంజనీరింగ్శాఖ ద్వారా పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేసేందుకు, లెవలింగ్, విద్యుత్ దీపాలు ఇతర పనుల కోసం ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ అధికారులు రూ. 5.21 కోట్లతో ప్రతిపాదలను కలెక్టర్ దివాకరకు గురువారం అందజేశారు. నిధులు మంజూరు చేస్తే వాటితో పార్కింగ్ స్థలాలకు కావాల్సిన పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే గానీ ఇక్కడ పనులు మొదలయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా పార్కింగ్ స్థలాలను ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, మంగపేట పుష్కరఘాట్లు, వెంకటాపురం(కె) వైపు ఒకటి, ముళ్లకట్ట వద్ద మరొకటి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఏటూరునాగారం: ఉన్నత విద్యా పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం కింద బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఏడాదిగా చెల్లించకున్నా వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. స్కావెంజర్లలకు సరైన వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు చాంద్పాషా, ఉపాధ్యక్షుడు కొమురయ్య, ప్రమీల, కార్మికులు పాల్గొన్నారు. రేగొండ: భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం అభిషేకంతో మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. ఈ సేవలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో దేదీప్యమానంగా వెలుగొందేందుకు అధికారులు ఆలయాన్ని దీపాలంకరణ చేశారు. నిత్య అన్నసత్రం ప్రారంభం వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్య అన్న సత్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు కాసం నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, సభ్యులు పాల్గొన్నారు. రేగొండ: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయీస్ అధికారులు గురువారం ఉదయం పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా అంబాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు మండలంలోని భాగిర్థిపేట జంక్షన్ వద్ద టాస్క్ఫోర్స్ ఏసీపీ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. టాటా ఏస్ వాహనంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయి ఆర్ఐ రాజు ఫిర్యాదు మేరకు డ్రైవర్ కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బీమాతో ధీమా
మహిళా సంఘం సభ్యురాలు అయి ఉండి సహజ మరణం చెందితే వారు తీసుకున్న రుణమాఫీ కానుంది. అదే సీ్త్ర నిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళ సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ. 10 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమ అవుతుంది. దీంతో పాటు రుణం మాఫీ చేస్తారు. 50 శాతం మించి అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం పరిశీలించి రూ. 5 లక్షలు అందించనున్నారు.ములుగు రూరల్: మహిళలు ఆర్ధికాభివృద్ది సాధించడంతో పాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మహిళా సంఘాల సభ్యులకు భరోసా కల్పిస్తూ ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల బీమా పరిహారం పొందే విధంగా సౌలభ్యం కల్పించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు పొందిన రుణం సైతం మాఫీ చేయనుంది. దీంతో మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు జిల్లాలో వివిధ సమాఖ్యల్లో 69,149వ మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు సీ్త్ర నిధి రుణాలతో పాటు బ్యాంకు రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ, పర్యాటక ప్రాంతాల్లో ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు ఉపాధి అవకాశాలు అందేలా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. బీమాకు అర్హులు వీరే.. గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు వారు స్వయం సహాయక సంఘాల సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తిస్తుంది. ప్రభుత్వం మహిళా సంఘాల నుంచి రుణాలు అందించి ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. రుణం పొంది ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమాతో పాటు రుణమాఫీ చేస్తుంది. మహిళా సంఘాల సభ్యులకు సెర్ప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. మహిళా సంఘాల సభ్యులకు భరోసాగా ఉంటుంది. – శ్రీనివాస్, అదనపు డీఆర్డీఏ, ఐకేపీ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు, రుణమాఫీ జిల్లాలో 69,149 మందికి బీమా -
మొక్కజొన్న, మిర్చి పంటల పరిశీలన
ములుగు రూరల్: మండల పరిధిలోని అబ్బాపూర్, అన్నంపల్లి గ్రామాల్లోని మొక్కజొన్న, మిర్చి తోటలను గురువారం వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణ్ కుమార్, వీరన్న, మానస సౌందర్య, మాధవిలు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో యాసంగి వరి పంటలకు కాండం తొలిచే పురుగు, జింక్ లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కాండం తొలిచే పురుగు నివారణకు నాటు పెట్టిన 15–20 రోజుల్లోపు కార్బోప్యూరన్ 3జీ ఎకరాకు 10 కిలోలు,, కార్టాప్ హ్రెడ్రోక్లోరిక్ 4జీ ఎకరాకు 8 కిలోలతో పాటు అదనంగా లింగాకర్షణ బుట్టలు వాడాలని సూచించారు. చౌడు సమస్య ఉన్న భూముల్లో రెండో దఫా యూరియాతో పాటు 100 గ్రాముల కార్బెండాజిం, మాంకోజెబ్ మిశ్రమాన్ని చల్లి పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. అధిక మోతాదులో యూరియా వాడటం నీరు నిల్వ ఉండటం వల్ల వేరు కుళ్లు, కింద ఆకులు ఎండిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. వాటి నివారణకు 10 కిలోల యూరియా 150 గ్రాముల స్పింట్ కలిపి చల్లాలని సూచించారు. జింక్ లోపం నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల జింక్ కలిపి చల్లాలని సూచించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు క్లోరాన్ ట్రానిప్రోల్, లాంబ్డా సైహలోత్రిన్ మందు లీటర్ నీటికి 0.5 మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పరమేశ్, ఏఈవో జ్యోతి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
రుణ లక్ష్యాలను అధిగమించాలి
ములుగు: బ్యాంకులకు నిర్ధేశించిన రుణ లక్ష్యాలను అధికారులు అధిగమించాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తూ బ్యాంకర్లు ముందుకు సాగాలన్నారు. గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకర్లకు సూచించారు. నూతనంగా ఏర్పడే మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను అందించడానికి నూతన ఖాతాలను తెరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా 60 ఏళ్లు నిండిన మహిళ వయోవృద్ధులతో ఏర్పాటు చేస్తున్న సంఘాలకు నూతన ఖాతాలు అందించడంతో పాటు రుణ సహాయం అందించడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నియమ నిబంధనల ప్రకారం రుణాలు అందించే విధంగా చూడాలని పేర్కొన్నారు.అనంతరం లీడ్ బ్యాంకు మేనేజర్ జయప్రకాశ్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ సాయి, యూనియన్ బ్యాంక్ డీజీఎం కమలాకర్లతో కలిసి వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సర ప్రొటెక్షన్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ బుక్లను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కొమురయ్య, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ధర్మ నాయక్, మత్స్య సంవర్థక శాఖ అధికారి సాల్మన్ రాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, హర్టికల్చర్ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
చెక్డ్యాం నిర్మాణాలపై సర్వే చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని జంపన్నవాగులో నీటి ప్రవాహం కొనసాగేలా చెక్డ్యాం నిర్మాణాలపై సర్వే నిర్వహించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరితహోటల్లో కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్లతో కలిసి గురువారం జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మేడారం మాస్టర్ ప్లాన్, జంపన్నవాగు అభివృద్ధి పనులు, వేసవి కాలంలో తాగునీటి సమస్యకు చర్యలు, 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సీఎం అదేశాల మేరకు మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, పూజారులతో సమావేశాలు నిర్వహించి వారి సూచన, సలహాల మేరకు పటిష్టమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. మేడారం రోడ్ల డివైడర్ మధ్యలో ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని అధికారులను అదేశించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తదితర పనులపై సూచనలు చేశారు. అలాగే వచ్చే ఏడాదిలో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఘాట్ల వద్ద కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్ఈజీఎస్లో కూలీల సంఖ్య పెరిగే విధంగా చూడాలన్నారు. ఈసమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్జీ, అదనపు కలెక్టర్( స్థానిక సంస్థలు ) సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, ఎండోమెంట్ కమిషనర్ సునిత, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను ప్రభుత్వం కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క చిత్రామిశ్రాను శాలువాతో సత్కరించి అభినందించారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్లపై ఉందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతుల వేదికలో నిర్వహించిన నూతన సర్పంచ్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను తక్షణం పరిష్కరించే దిశగా పని చేయాలన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత గోవిందరావుపేట: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వయో వృద్ధులకు భరోసా కల్పించడానికి 60ఏళ్లు నిండిన వారికి ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మండల పరిధిలోని పస్రాలో గురువారం మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.10 లక్షల నిధులతో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా గ్రామ సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాల ఉన్నతికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి జిల్లాకు దాదాపు 42 శాశ్వత భవనాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా వారికి రెట్టింపు ఆదాయం లభించిందని, మహిళలు స్వశక్తితో ఎదగడానికి వారికి సకాలంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి ఆర్థికాభివృద్ధికి పాటుపడడం జరుగుతుందని వివరించారు. మేడారంలో అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ సిద్ధంచేయాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు షురూ..
ఏటూరునాగారం: జిల్లాలోని పది మండలాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యారు. ఈ మేరకు ఆయా కళాశాలల సిబ్బంది విద్యార్థులను పరిశీలించి సెంటర్లోకి అనుమతించగా తెలుగు, సంస్కృతం, అరబిక్వంటి భాషా పరీక్షను ప్రశాంతంగా పరీక్ష రాసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నాయిని వీరేందర్ తెలిపారు. జిల్లాలోని పది కేంద్రాల్లో 1,832 మందిని అలాట్ చేయగా 1,787 మంది పరీక్షకు హాజరు కాగా 45 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే జాకారం, ములుగు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చిన అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతూ పరీక్షల కేంద్రాలకు చేరుకునే సమయంలో ఆలస్యమై పరీక్షలకు దూరమైన సందర్భాలున్నాయని వారు వాపోయారు. ఈ ఏడాది నుంచి 5 నిమిషాల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయగా..విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బెంగళూరులో తెలంగాణ ఉపాధ్యాయుల ప్రదర్శన
మంగపేట: దక్షిన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బెంగళూరు జ్ఞానభారతి క్యాంపస్లోని ఆర్ఐఈఎస్టీ వేదికగా తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు మిన్నంటాయి. 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న 30 రోజుల సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లిష్(సీఈఎల్టీ)శిక్షణలో భాగంగా గురువారం నిర్వహించిన రీజినల్ కాంట్రీబ్యూషనల్ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయులు తమ ప్రతిభను చాటారు. శిక్షణలో భాగంగా ఐదు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు తమ ప్రాంతీయ కళలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం తరఫున వివిధ జిల్లాల నుంచి హాజరైన ఉపాధ్యాయులు రాష్ట్ర సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ, వీరనారి రాణిరుద్రమాదేవి ఏకపాత్రాభినయం, వనదేవతల పండుగ, సమ్మక్క–సారక్క జాతరపై నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో సమ్మక్క–సారక్క పాత్రలో జిల్లాకు చెందిన మంగపేట మండంలోని తొండ్యాల లక్ష్మిపురం, ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు ఎం.కావ్య, మంగపేట ఎంపీపీఎస్ పాఠశాల సెకండ్ గ్రేడ్ ఉపాధ్యారాలు ఆర్. వందన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తన సత్తా చాటారు. ఉపాధ్యాయుల ప్రదర్శనను డైరెక్టర్ సిప్రయన్ మంథారో, తెలంగాణ ఇన్చార్జ్ రవినారాయణ, డైరెక్టర్ హిలేష్సిభగత్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంగ్లిష్ బోధనలో శిక్షణ పొందుతూనే తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటిన ఉపాధ్యాయులను అభినందించారు. -
బంజారాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ములుగు: బంజారాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ గుడి శివారులో సేవాలాల్ మహరాజ్ ఆల య నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సేవాలాల్ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. బంజారాల కులస్తులు భ వన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం బంజారాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క సేవా లాల్ జయంతి వేడుకల్లో మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మా ట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ కనబర్చాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్, పూజారులు రమేష్గిరి, కిషన్, ఐటీడీఏ అధికారి జనార్ధన్, రాహుల్, బంజారా కులస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలి ములుగు రూరల్: కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రి బుధవారం పరిశీలించి మాట్లాడారు. భవనాన్ని నాణ్యతతో సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కను టీఎన్జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసి శాలువా కప్పి సన్మానించి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చైతన్య, లాల్నాయక్, ఉదయ్ కుమార్రెడ్డి, ప్రదీప్, భాస్కర్, శ్రీకాంత్, రవీందర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఎస్ఎస్తాడ్వాయి: గ్రామీణ యువత క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. బాలకుమారస్వామి జాతరను పురస్కరించుకుని కొడిశాల (బిట్టుపల్లి)లో నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలు బుధవారం ముగిశాయి. సర్పంచ్ మొగిలిపల్లి రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు మంచి స్పందన రావడం హర్షనీయమన్నారు. ఈ పోటీల్లో కొత్తగూడెం– రంగాపూర్ జట్టు మొదటి స్థానంలో నిలిచి బహుమతి రూ.15,016లను కై వసం చేసుకోగా రెండో స్థానంలో నిలిచిన చింతకుంట జట్టుకు రూ. 12,016, మూడో స్థానంలో నిలిచిన ముళ్లకట్టరాంపూర్ జట్టుకు రూ. 8,016, నాలుగో స్థానంలో నిలిచిన కొడిశాల జట్టుకు రూ.5,016లను అందజేశారు. అలాగే షీల్డులను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్, పస్రా సీఐ దయాకర్, ఎస్సైలు కమలాకర్, తాజోద్దీన్, మధుకర్, నిర్వహకులు మొగిలిపల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షల నిర్వహణలో అప్రమత్తం
ములుగు: వచ్చే నెల 14వ తేదీ నుంచి పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థరెడ్డి మాట్లాడారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందస్తుగా సందర్శించి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. పదో తరగతి పరీక్షలకు మొదటిసారిగా క్లాక్ రూమ్ నిర్వహణ ప్రవేశపెట్టినందున విద్యార్థుల వస్తువులు బ్యాగులు ఏమైనా ఉంటే క్లాక్ రూమ్ వద్ద భద్రపరచుటకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎసీజీఈ కన్నం వినోద్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి -
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
మంగపేట: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారిగా తాగునీటి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్య ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలన్నారు. ఒకరిద్దరు కార్యదర్శులు పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మందలించారు. సమావేశంలో ఎంపీడీఓ భద్రు, ఎంపీఓ మహేందర్, ఈజీఎస్ ఏపీఓ అంకూస్, కార్యదర్శులు పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య -
ఫైళ్లు రెడీ.. పైసల్లేవ్
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన ట్రైకార్, గిరివికాస్, సోలార్, స్వయం ఉపాధి పథకాలకు నిధులు కరువయ్యాయి. ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాల వారీగా అర్హులైన గిరిజనులు గిరివికాసం కింద 324 మంది, ట్రైకార్ ద్వారా రాజీవ్ యువవికాసం కింద 613, సోలార్ పథకం కింద 521 మంది అర్హులను గుర్తించి ఫైల్ రెడీ చేసి ఉంచారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐటీడీఏకు సరైన బడ్జెట్ రాకపోవడంతో పైళ్లు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా యి. ఐటీడీఏ పీఓకు సూపర్ పవర్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడంతో ప థకాలు అమలుకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. బడ్జెట్ కేటాయింపులో అలసత్వం గతంలో ఐటీడీఏకు నేరుగా నిధులు వచ్చేవి. కానీ మూడేళ్ల నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. పథకానికి కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసి ఐటీడీఏ పీఓ పరిశీలించి కలెక్టర్కు ఫైల్ పుటప్ చేయగా అక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేసిన అనంతరం హైదరాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్కు ఫైల్ వెళ్తుంది. కానీ అర్హుల జాబితాకు కావాల్సిన బడ్జెట్ను ప్రభుత్వ ఆర్థిక కమిషన్ నుంచి మంజూరును ట్రైబల్ వెల్ఫేర్కు జీఓ జారీ చేయాల్సి ఉంది. కానీ ఫైనాన్స్ కమిషన్ ట్రైబల్ వెల్ఫేర్కు ఈ పథకాలకు కావాల్సిన డబ్బులను ఇవ్వడం లేదు. దీంతో అ లబ్ధిదారుల ఫైళ్లను అలాగే హోల్డ్ చేసి పెట్టారు. నిర్మాణాలకే పెద్దపీట ఐటీడీఏ ద్వారా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద రూ.39.5 కోట్లు మంజూరు కాగా వాటి ద్వారా ఆశ్రమ పాఠశాలల్లో నూతన భవనాల నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ పనులు ఈ ఏడాది మార్చి 31 వరకు పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నాయి. దీంతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్ శాఖ ద్వారా గిరిజన విద్యాలయాలు, ప్రహరీలు, ఇతర భవన నిర్మాణాల మరమ్మతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏకు నిధులు కేటాయిస్తూ వస్తుంది. దానివల్ల కేవలం మరమ్మతులు, నిర్మాణాల పనులు మాత్రమే సాగుతున్నాయి. గిరిజన రైతులకు అందించాల్సిన పథకాలను మాత్రం పక్కన పెట్టడంతో రైతులు నిరాశ పడుతున్నారు.మంగపేట : ములుగు నియోజక వర్గంలోని అర్హులైన గిరిజనులందరికీ ఏటూరునాగారం ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలను మంజూరు చేయాలని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ను తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టీఎస్ఈజీసీ)సభ్యుడు గుమ్మడి సోమయ్య కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని ట్రైకార్ కార్యాలయంలో చైర్మన్ బెల్లయ్యనాయక్ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో ఎక్కువగా నిరుపేద గిరిజన కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. వారిలో అర్హులైన వారందరికీ ట్రైకార్ ద్వారా రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరినట్లు సోమయ్య తెలిపారు. ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల అమలుకు నిధులు కేటాయించాలి. సోలార్, గిరివికాసం, రాజీవ్ యువవికాసం, ఇతర పథకాలకు బడ్జెట్ను కేటాయించి అర్హులైన వారికి నేరుగా నిధులు అందించేలా చూడాలి. నిధులు రాకపోవడంతో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయి. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి నిధులు మంజూరు చేయాలి. – చందా మహేశ్, ఏటూరునాగారం. ఆదివాసీ నాయకుడు● మూడేళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులు మరమ్మతులు, నిర్మాణ పనులకే బడ్జెట్ -
క్రీడాకారులను అభినందించిన ఎస్పీ
ములుగు రూరల్: ఇటీవల సైబరాబాద్లో నిర్వహించిన తెలంగాణ పోలీసుల క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించగా ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వారిని బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన పోలీసులు పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన అమిత్కుమార్ సింగ్, మేకల నాగరాజులను ఆయన అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని కోరారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్పీ తిప్పనబోయిన రామకృష్ణ ప్రకృతిని గౌరవిస్తూ వృక్షపూజ నిర్వహించారు. బుధవారం పాఠశాలలో సాంఘికశాస్త్ర పాఠ్యబోధనలో భాగంగా విద్యార్థులకు ప్రకృతిలో చెట్ల గొప్పతనాన్ని వివరించారు. పర్యావరణానికి హాని తలపెట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. మానవాళికి, పక్షులకు, జంతువులకు, జీవరాసులకు కేంద్రమైన చెట్లు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరం అధ్యక్షుడు కమలాకర్, ఆర్పీలు ఏడుకొండలు, నాగేశ్వర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని హనుమకొండలో గల ఫ్రీ ఎగ్జామ్నేషన్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్గా సారయ్యదొరను నియమిస్తూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పీజీ హెడ్మాస్టర్ అయిన సారయ్య దొరను నియమించడంతో పాటు పీఈటీసీలో శిక్షణ ఇచ్చి పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా చూడాలని సూచించారు. గతంలో పనిచేసిన శ్రీరాములు ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో సారయ్యదొరను నియమించారు. ములుగు: ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత, భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రెండు కొత్త పథకాల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను హరిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రభుత్వ ఉద్యోగులు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం, కుటుంబ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పింస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ చైర్మన్ మడుగూరి నాగేశ్వరరావు, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్, ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జనగాం బాబురావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నవరం రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
అకాలవర్షం.. రైతుల ఆగమాగం
మంగపేట/వెంకటాపురం(కె): అకాలవర్షంతో మిర్చి రైతులు ఆగమాగం అవుతున్నారు. మంగపేట, వెంకటాపురం(కె) మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సంతో పాటు మోస్తరుగా వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆయా మండలాల పరిధిలో వందల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేసి కోతలు కోసి మిర్చి పంటను కల్లాల్లో ఆరబెట్టారు. ఈ క్రమంలో అకాల వర్షం కారణంగా పంటను కాపాడుకునేందుకు రైతులు టార్ఫాలిన్లతో పరుగులు తీసి పంటపై కప్పి కాపాడుకున్నారు. పలుచోట్ల గాలి దుమారానికి పరదాలు లేచిపోవడంతో కొంతమేర పంట తడిసిపోయింది. తెల్లవారుజాము వరకు చిరుజల్లులు పడిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
అర్జీలు పరిష్కరించండి..
● గ్రీవెన్స్, గిరిజన దర్బార్లో అధికారులను వేడుకున్న బాధితులు ● ప్రజావాణిలో 51, గిరిజన దర్బార్లో 14 వినతులు ● స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా ● పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశంములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు అర్జీలు అందజేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 51 వినతులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించిన ఆయన సత్వరమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి 14 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు ఇతర శాఖలకు సంబంధించి 16భూ సమస్యలు 15 ఇందిరమ్మ ఇళ్లు 7ములుగు మండలం మదనపల్లికి చెందిన ఓ గిరిజనుడు తన తండ్రి ఉద్యోగం కారుణ్య నియామక కింద ఇప్పించాలని విన్నవించారు. జిల్లా కేంద్రంలో గిరిజనేతరులు ఆక్రమించుకున్న ములుగు గ్రామకంఠం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు విన్నవించారు. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంలో పనిచేస్తున్న సీఆర్టీల వేతనాలు ఇవ్వాలని కోరారు. గంగారం మండలం మడగూడెంలో విద్యుదాఘాతానికి కాలిపోయిన బాధితుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పీఓను కోరారు. ఏటూరునాగారం మండలం రాంపూర్ ఆగ్రహార్లో గిరిజనులకు పట్టాలు ఉన్నాయని కానీ రైతు భరోసా రావడం లేదని రైతులు మొరపెట్టుకున్నారు. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆర్ఓఎఫ్ఆర్ భూములను ఆన్లైన్ చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు విన్నవించారు. వెంకటాపురం(కె) మండలం బోదాపురం పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, భవనం మంజూరు చేయాలని కోరారు. ములుగు మండలంలోని పొట్లాపురంలో ఉన్న పోడు భూములకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కోరారు. 2026 మేడారం జాతరలో 834 మంది వలంటీర్లకు భోజన వసతి కల్పించిన బిల్లు ఇప్పించాలని ఆదివాసీ నంఘం నాయకులు పీఓకు విన్నవించారు. ములుగు మండలం పొట్లాపురంలో సబ్సిడీపై ట్రాక్టర్ ఇప్పించాలని రైతులు పీఓను కోరారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ జనార్ధన్, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, మేనేజర్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
● వీసీలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ములుగు: గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గోదావరి నది తీరం ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి నది తీరంలో జరగనున్న పుష్కరాల ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేసి సమర్పించాలన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యశిబిరాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, బందోబస్తుతో పాటు ఇతర పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో మంగపేట, ముళ్లకట్ట, రామన్నగూడెం, కన్నాయిగూడెంలో పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతీ పుష్కర ఘాట్ వద్ద భక్తులకు తాగునీరు మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుద్దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, అధికారులు పాల్గొన్నారు. -
కమ్ముకుంటున్న మబ్బులు
ఆందోళనలో రైతులు సమస్యలు పరిష్కరించాలి విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు.వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. మిర్చి పంటపై పరదాలు కప్పుతున్న రైతులువెంకటాపురం(కె): ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో మబ్బులు ఒక్కసారిగా కమ్ముకోవటంతో మిర్చి రైతులు భయాందోళనకు గురయ్యారు. రెండేళ్లుగా దిగుబడి లేక, మిర్చికి గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ ఏడాది పంటకు మంచి ధర ఉండడంతో అప్పుల ఊబిలోంచి బయట పడతామని ఆశ పడుతున్న రైతులకు ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో కల్లాల్లో ఆరబోసిన పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. మిర్చి పంట తడవకుండా కాపాడుకునేందుకు పరదాలు కప్పారు. -
‘ఆంగ్లంపై పట్టు సాధించేలా బోధించాలి’
వాజేడు: ఆంగ్ల భాషపై విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించాలని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ సాంబయ్య, ఉల్లాస్ కోఆర్డినేటర్ కృష్ణ బాబులు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వాజేడు, నాగారం ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాన్ని సోమవారం ఎంఈఓ తేజావత్ వెంకటేశ్వరరావు, హెచ్ఎం ఆనందరావులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఫౌండేషన్ లిటరసి. న్యూమరసి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు జయేందర్, సయ్యద్ అలీముద్దీన్ ఖాద్రీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు ములుగు రూరల్: వేసవిలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం 33కు పెంచినట్లు తెలిపారు. అదనంగా 49 నూతన ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసినట్లు వివరించారు. గతేడాది మార్చిలో 5, 816 మెగావాట్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 5,904 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 7 నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. విద్యుత్ నాణ్యత మెరుగుపరిచేందుకు 27.35 కేఎం, 33/11 కేవీ ఇంటర్ లింక్ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందిస్తామని తెలిపారు. శంకుస్థాపన సరే.. పనులేవి? చిట్యాల: చిట్యాల, టేకుమట్ల మండలాల ప్రధాన రహదారిపై మూడు చోట్ల కల్వర్టుల నిర్మాణాలకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. చిట్యాల మండలంలోని నవాబుపేట, సీఆర్పల్లి శివారులోని ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం కోసం ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిసెంబరు 2024లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి 14 నెలలు పూర్తయినా సంబంధిత కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాంతినగర్ సమీపంలో కల్వర్టు పక్కన తాత్కాలిక రోడ్డు కోసం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో గుట్టల ప్రాంతం నుంచి వర్షపునీరు వస్తుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కల్వర్టుల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయించాలని కోరుతున్నారు. 108 ఉద్యోగులకు స్టార్ అవార్డులు హన్మకొండ అర్బన్/ఎంజీఎం: ఆపద సమయంలో 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మెరుగైన వైద్య సేవలందించి ప్రాణాలు కాపాడిన హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు 108 సిబ్బందికి 108 సర్వీస్ వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టార్ అవార్డులు అందించారు. ఐనవోలుకు చెందిన ఈఎంటీ ఏనుగుల రాజు, పరకాల టీం సభ్యులు పాముల రాజు, పుట్ట విజయభాస్కర్, ధర్మసాగర్ మండలానికి చెందిన మాచర్ల వెంకటేశ్, వరంగల్ జిల్లాకు చెందిన ఈఎంటీలు కె.నాగరాజు, శ్యాంసుందర్, పైలట్ వై.రాజన్న, కుమారస్వామి అవార్డులు అందుకున్నారు. వీరిని 108 సర్వీస్ అధికారులు, సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో వరంగల్ మేనేజర్ భరత్ కుమార్, భూపాలపల్లి మేనేజర్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ ప్రథమ, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ● జిల్లావ్యాప్తంగా పది సెంటర్ల ఏర్పాటుఏటూరునాగారం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు పది కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 3,841 విద్యార్థులు రేపటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు పరీక్ష కేంద్రాల్లో సర్వం సిద్ధం చేశారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, టేబుల్స్, చెత్తాచెదారం తొలగింపుతో పాటు ప్రశాంతమైన వాతావరణం కలిగేలా కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. పరీక్ష కేంద్రానికి ప్రతీ విద్యార్థి 30 నిమిషాల ముందు చేరుకోవాల్సి ఉంటుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు మార్చి 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 10 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కో డిపార్ట్మెంట్ ఆఫీసర్కు అలాట్ చేశారు. ఇన్విజిలేటర్లను మాత్రం పరీక్ష కేంద్రానికి, నిర్వహణ బాధ్యతలను చేపట్టే చీఫ్ సూపరింటెండెంట్ను నిర్ణయించి విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను కేటాయిస్తారు. అలాగే జిల్లా పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీంతో పాటు ఒక సిట్టింగ్ స్క్వాడ్ టీం బృంధం, మరో టీం కస్టోరియల్ టీం ఈ పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నియమించారు. నియమాలు పాటించాలి పరీక్ష కేంద్రానికి వచ్చే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, డిటిజల్ వాచ్లు, సెల్ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని అధికారులు తెలిపారు. నిర్ధిష్టమైన ఆదేశాలను ఇప్పటికే అధికారులు జారీ చేశారు. అంతేకాకుండా 200 మీటర్ల వరకు జిరాక్స్ షాపులను కూడా మూసివేయనున్నారు. ప్రశ్నపత్రాలు బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు, 144 సెక్షన్ను సైతం అమలు చేయనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం..జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, స్క్వాడ్లను కూడా కేటాయించాం. పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేయడానికి పోలీసుశాఖకు సమాచారం అందించాం. – నాయిని వీరేందర్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారిపరీక్ష రాయనున్న విద్యార్థుల వివరాలు.. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,773 మంది, ఒకేషనల్ విద్యార్థులు 208 మంది ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,632 కాగా ఒకేషనల్కు చెందిన విద్యార్థులు 228 మంది ఉన్నారు. మొత్తంగా 3,841 మంది పరీక్షలు రాయనున్నారు. -
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పింఛన్ ఇప్పించండి.. బోధకాలతో ఎలాంటి పని చేసుకోలేకపోతున్నాను. అధికారులు తన పరిస్థితిని గమనించి పింఛన్ ఇప్పించాలి. బోధకాలు కారణంగా పనులు కూడా చేసుకోలేక పోతున్నాను. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాను. పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. – అర్కావత్ భీముడు, ఇంచెన్చెరుపల్లి, వెంకటాపురం(ఎం) మండలంఅక్రమ పట్టాను రద్దు చేయాలితనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని అక్రమంగా వేరే వారి పేరున పట్టా జారీ చేశారు. వెంకటాపురం(ఎం) మండలం పాలంపేట శివారులో 2.13ఎకరాల భూమి ఉంది. తనకు సంబంధం లేకుండా అధికారులు వేరే వ్యక్తికి పట్టా చేశారు. – ఏలూరి రాజయ్య, పస్రా, గోవిందరావుపేట మండలం దారి కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారు.. తన ఇంటికి వెళ్లే దారిని కబ్జా చేశారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి ఇంటి నిర్మాణ పనులు నిలిపివేయాలి. సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలి. – అజ్మీర భావుసింగ్, రాంచంద్రాపురం, ములుగు మండలం -
సీఎం పర్యటనలతో ప్రజాధనం వృథా
● బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ములుగు: ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్రెడ్డి మూడుసార్లు దేవాదుల ప్రాజెక్టును సందర్శించినా స్థానికులకు ఒరిగిందేమిలేదని, పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధుల కోసమే తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామన్నారు. కేసీఆర్ పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్నారు. రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి సీటు కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్రెడ్డి సీఎం ఎలా అయ్యేవారని విమర్శించారు. తెలంగాణ సాధకుడైన కేసీఆర్ను విమర్శించే అర్హత రేవంత్రెడ్డికి లేదన్నారు. జిల్లాలోని గంగారం, కొత్తగూడెం మండలాలకు పాఖాలలో లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు తుపాకుల గూడెంలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కాల్వల ద్వారా సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఉన్న ప్రాజెక్టు అంచనాలను రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. సమ్మక్క బ్యారేజీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బైకాని ఓదెలు, కోగిల మహేశ్, పోరిక విజయరాం నాయక్, కుడుముల లక్ష్మినారాయణ, లకావత్ నర్సింహనాయక్, చెన్న విజయ్, ఆకుతోట చంద్రమౌళి, గోనెల భారత్, బైకని సాగర్, అనుముల సురేష్, గండి కుమార్, ముంజాల భిక్షపతి, మాచర్ల ప్రభాకర్, గొర్రె సమ్మయ్య, కాకి పురుశోత్తం, గరిగె రఘు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకోవాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి ములుగు: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు శిరుప సతీష్కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలల్లో వివిధ స్థాయిల్లో నిర్వహిస్తున్న అనేక పోటీ పరీక్షల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో స్టీల్ప్లేట్లను విద్యార్థులకు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులందరూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా సైనన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ సైన్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధం కలిగి ఉంటుందన్నారు. విద్యార్థులు అవగాహనతో చదివి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్లో ప్రథమ స్థానంలో బండారుపల్లి ఆదర్శ పాఠశాల చెందిన శివ ప్రసాద్, ద్వితీయ స్థానంలో ఇదే పాఠశాలకు చెందిన హర్షితతో పాటు మంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మహమ్మద్ ఆఫ్సియాలు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు నిర్వహకులు తెలిపారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు, సైన్స్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవరపు శ్రీధర్, కోశాధికారి బోదెబోయిన జయరాం, స్థానిక పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రాజేందర్, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హేమాచల క్షేత్రం అభివృద్ధిపై మంత్రికి నివేదిక
మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు సోమవారం నివేదికను అందజేసినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రెవెల్లి మహేశ్ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో సీతక్కను కలిసి ఆలయ పూజారులు ఆశీర్వచనం ఇచ్చారు. మకర సంక్రాంతి రోజున స్వామివారి వరపూజ మహోత్సవానికి ఆలయానికి వచ్చిన మంత్రి స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు ఏప్రిల్లో జరగనున్న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముందుగా ఆలయంలో భక్తుల సౌకర్యానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రికి వివరించి నివేదికను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా 2027 జూన్లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మల్లూరులో పుష్కరఘాట్ నిర్మాణం చేపడితే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. వీటిపై స్పందించిన మంత్రి త్వరలోనే హేమాచలక్షేత్రంలో చేపట్టాల్సిన పనులతో పాటు మల్లూరులో పుష్కరఘాట్ నిర్మాణానికి హామీ ఇచ్చారని పూజారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఈశ్వర్చంద్ రామానుజం దాస్, నాగరాజీవ్ శర్మ, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ ఉన్నారు. -
మారేడుగొండ చెరువులోకి దేవాదుల జలాలు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని మారేడు గొండ చెరువులోకి ఆదివారం దేవాదుల లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు. లక్ష్మీదేవిపేట, బూర్గుపేట, నర్సింగాపూర్, లక్ష్మిపురం, చక్రవర్తిపల్లి గ్రామాలకు చెందిన రైతులు మారేడు గొండ చెరువు కింద రబీలో వరి పంట సాగు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలకు సరస్సు కట్ట తెగిపోగా ఇటీవల మరమ్మతులు చేపట్టారు. చెరువులో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో రైతులు, నాయకులు సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడిన మంత్రి దేవాదుల పైపులైన్ ద్వారా మారేడుగొండ చెరువులోకి నీటిని విడుదల చేయాలని ఆదేశించడంతో అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో రబీ వరి పంట సాగుకు నీటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకుంటామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
మేడారంలో భక్తుల రద్దీ
● జంపన్నవాగులో పుణ్యస్నానాలు ● వనదేవతలకు మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చ్ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూ ర్ పోలీస్స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకు ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదా యంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, సిబ్బంది ఉన్నారు. -
‘ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’
వెంకటాపుం(కె): మౌలిక వసతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలను ఎస్ఎఫ్ఐ బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మరుగుదొడ్లు, విదద్యుత్ సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వద్ద నుంచి వేల రూపాయల ఫీజలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రజకులపై దాడి అమానుషం భూపాలపల్లి రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మండలంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రజకులపై జరిగిన దాడి అమానుషమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి పాల్గొన్నారు. కోటగుళ్లను సందర్శించిన ఇంగ్లండ్ దేశస్తులు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను ఆదివారం ఇంగ్లండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరి సందర్శించారు. రామప్ప గైడ్ గోరంట్ల విజయ్కుమార్ ఆలయ విశిష్టతను వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ఆలయ శిల్పసంపద అద్భుతంగా ఉందన్నారు. వారి కెమెరాలలో శిల్ప సంపదను బంధించుకున్నారు. మెడల్స్ సాధించడంపై హర్షం మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెడల్స్ సాధించడం పట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య హర్షం వ్యక్తంచేశారు. హనుమకొండ జవహర్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–16 షాట్ఫుట్లో జిల్లాకు చెందిన సమన్విత గోల్డ్ మెడల్స్, అన్విత 18 లాంగ్జంప్లో సిల్వర్ మెడల్, పలు విభాగాల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు వారు ఆదివారం మెమొంటోలు, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. స్టేట్ సెక్రటరీ సారంగపాణి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. -
హేమాచలక్షేత్రంపై నిర్లక్ష్యం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ ధర్మాదాయశాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వందల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తుంది. ఈ దేవాలయం 35 ఏళ్ల క్రితం నుంచే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ప్రతి ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తుండడంతో 2018లో దేవస్థానానికి 6 ఏ టెంపుల్గా గుర్తింపు పొందింది. ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకు గ్రేడ్వన్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ఆలయంపై దేవాదా యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో 2016 నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఆలయంలో కొందరు సిబ్బంది మధ్య అంతర్యుద్ధం సోషల్ మీడియా వేదికగా చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడి పోస్టు భర్తీలో భాగంగా కొందరు పూజారుల మధ్య విబేధాలు బయటపడిన పలు సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. అదే విధంగా కొందరు సిబ్బంది ఒకరంటే ఒకరికి గిట్టక రెండు వర్గాలుగా విడిపోయారు. పలు విషయాలపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల సిబ్బందిలో గణేశ్ అనే వ్యక్తిని విధుల నుంచి తప్పించి పక్కన పెట్టారు. దీంతో తాను మేడారం మహాజాతర డ్యూటీలో ఉండగా తానంటే గిట్టనివారు ఆకాశ రామన్న పేరిట ఉత్తరం రాసి తనపై కుట్రచేశారని అసహనం వ్యక్తం చేస్తూ వాట్సాప్ గ్రూపులో పోస్టుచేశారు. పూజారులు, సిబ్బంది విషయంలో కొందరు రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడంతో పవిత్ర పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించాల్సిన పూజారులు, విధులు నిర్వహించాల్సిన సిబ్బంది మధ్య ఏమి జరుగుతుందోననే ఆసక్తికర చర్చ సాగుతోంది. విషయంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి గుట్టపై రాజకీయ వివాదాలకు తావులేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. హేమాచలక్షేత్రాన్ని 2016 నుంచి రాజకీయ గ్రహణం పట్టి పీడిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్వం నుంచి స్థానికులకు ఒకరికి ఆలయ చైర్మన్గా మరో 13 మంది సభ్యులుగా 2016 వరకు ఆలయ పాలకమండలి కొనసాగింది. ఆలయ చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నంలో కొందరు రాజకీయ నాయకుల స్వార్ధం ఆలయ అభివృద్ధికి శాపంగా తయారైంది. ఏజెన్సీ ప్రాంత పరిధిలో ఉన్న ఆలయానికి పాలక మండలిలో చైర్మన్, సభ్యులుగా తమకు అవకాశం కల్పించాలని స్థానిక ఆదివాసీ గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. పాలకమండలి ఏర్పాటుకు హైకోర్టు స్టే ఇవ్వడంతో 2017 ఆలయ పాలక మండలి ఏర్పాటు నిలిచిపోయింది. దీంతో ఆలయ ప్రాంగణంలో ప్రసాదం, కొబ్బరికాయల విక్రయాలు, కొబ్బరి ముక్కలు, పుట్టు వెంట్రుకలు, ఆలయ ప్రాంగణంలో షాపుల నిర్వహణకు బహిరంగ వేలం పాటలు నిలిచిపోవడంతో ఆదాయానికి గండి పడుతుంది. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల కల్పనపై దృష్టి సారించని అధికారులు పదేళ్లుగా ఏర్పాటు చేయని పాలకమండలి సోషల్ మీడియా వేదికగా సిబ్బంది అంతర్యుద్ధం -
ప్రతీ ఎకరాకు నీరు
ములుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్వెల్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం.. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు. జూన్ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు గోదావరి, కృష్ణా జలాల వాటా, నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ పరిశీలన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
ఏటూరునాగారం: గిరిజన, సాంఘిక, మైనార్టీ, బీసీ సంక్షేమశాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏటూరునాగారం మండలంలోని రెండు సెంటర్లలో మొత్తం 601 మంది పరీక్షలు రాసేందుకు హాజరుకావాల్సి ఉండగా 23 మంది గైర్హాజరైనట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. ఆకులవారి ఘనపురం క్రాస్రోడ్లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 231 మంది, స్పోర్ట్స్ స్కూల్ కేంద్రంలో 347 మంది పరీక్షలు రాసేందుకు హాజరైనట్లు తెలిపారు. -
పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం యాపలగడ్డలో మార్చి 4నుంచి 7వ తేదీ వరకు అర్రెం వంశస్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలని మేడారం జాతర మాజీ చైర్మన్ అర్రెం లచ్చుపటేల్ కోరారు. మేడారం జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, సర్పంచ్ కల్తి కృష్ణవేణి, అర్రెం వంశీయులతో కలిసి పగిడిద్దరాజు జాతర పోస్టర్ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతరను నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్కను, పలువురు ప్రజాప్రతినిధులను జాతరకు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. భక్తుల భారీగా తరలివచ్చి జాతరను విజవయంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్రెం వంశస్తులు అప్పయ్య, లక్ష్మినర్సు, నాగయ్య, బుచ్చయ్య, సమ్మయ్య, కాంతారావు, తాడ్వాయి మాజీ సర్పంచ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మల్హర్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని తాడిచర్ల రైతు వేదికలో 99 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో ఎంపికై న వారికి పథకం మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. పేదల సంక్షేమం కోసం ఎల్ల ప్పుడూ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బండి స్వామి, గడ్డం క్రాంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు దండు రమేశ్, ఉప సర్పంచ్ బబ్బలి రాజు, మాజీ ఎంపీపీ మల్హల్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి -
సంగీతం శ్వాసకు వ్యాయామం
నేను కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందుతున్నా. సంగీతం శ్వాసకు వ్యాయామం వంటిది. ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం సంగీతం క్లాస్కు వెళ్తాను. సంగీతం మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. పనిఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో కుటుంబ బంధాలు మెరుగుపడుతాయి. విశ్వాసం, శాంతి పెరుగుతుంది. – డాక్టర్ జ్యోతి హరికీర్తి, మెడికల్ ఆఫీసర్ అనంతలక్ష్మి వైద్య కళాశాల, వరంగల్ అలసటను పారదోలే మార్గం.. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అలసట నివారణకు సంగీతం సహాయపడుతుంది. ప్రశాంత సంగీతం కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆధ్మాత్మికత, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది. కచేరీలు, ప్రదర్శనల ద్వారా సమాజం పరిచయమవుతుంది. – గాట్ల భార్గవి, మెడికో, కాకతీయ వైద్య కళాశాల ● -
ఇష్టంగా నేర్చుకోవాలి..
యువతకు, పెద్దవారికి సంగీతం, నృత్య కళలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు చేస్తూ.. సాయంత్రం వేళలో హాజరవుతున్నారు. కళల్లో రాణించాలంటే ఇష్టంగా నేర్చుకోవాలి. మా నాన్న నౌడ్గడ హనుమంతరావు ఇక్కడ అధ్యాపకులుగా బోధించారు. నేను ఇక్కడే వయోలిన్ వాయిద్యం కోర్సులో శిక్షణ పొందాను. ప్రస్తుతం నేను కళాశాలకు 11వ ప్రిన్సిపాల్ని కావడం సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది విదేశాల్లో ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. మరికొందరు గురుకులాల్లో ఉద్యోగాలు పొందారు. – నౌడ్గడ సుధీర్కుమార్, విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని రామాంజాపూర్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాహక్కు, బాల కార్మికుల, ర్యాగింగ్, బాల్య వివాహాల చట్టాల గురించి మహేందర్ వివరించారు. ఉచిత న్యాయం పొందడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోతు స్వామిదాస్, హెచ్ఎం గోదాదేవి, ఉపాధ్యాయులు సమ్మయ్య, రాధ తదితరులు పాల్గొన్నారు. గందరగోళంగా భూ సర్వే ములుగు రూరల్: భూ సర్వే విషయంలో రైతులను అధికారులు గందరగోళానికి గురిచేస్తున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సర్వే అధికారులు భూమి హద్దులను నిర్ణయించే క్రమంలో ప్రతీసారి హద్దులు మారుతున్నాయని వివరించారు. అధికారులు ల్యాండ్ మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారారని పేర్కొన్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని లింగాపూర్ శివారులో జరుగుతున్న తతంగమే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. 30 ఏళ్లుగా సాగులో ఉన్న రైతుల భూముల హద్దులను చెరిపేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి సరిహద్దులు నిర్ణయించి సమస్యలు లేకుండా చూడాలని కోరారు. -
మంగళసూత్రాలు అందజేత
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామికి ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ సాయి విజయ్ చౌహాన్ బహుకరించిన 30.876 గ్రాముల బంగారు మంగళ సూత్రాలు, 60 గ్రాముల వెండి గొలుసులను రిటైర్డ్ ఆలయ అర్చకులు కై కర్యం రాఘవాచార్యులు శనివారం ఆలయ కార్యనిర్వహణ అధికారి మహేశ్కు అందజేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4,75,775 ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ముక్కాముల రాజశేఖర్శర్మ, అర్చకులు ఈశ్వర్చంద్ రామానుజమ్ దాస్, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ సురేశ్, భక్తులు సిబ్బంది పాల్గొన్నారు. -
దేవాదుల ప్రాజెక్టు
ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026హాట్టాపిక్గా విహారయాత్రకు ముఖ్యమంత్రి, మంత్రులు..● దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్రెడ్డి ● మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటనతో నిద్రలేచిన ప్రభుత్వం ● బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిసాక్షిప్రతినిధి, వరంగల్ : జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి వరంగల్ ఆయకట్టుకు కీలకమైన ప్రాజెక్టులో దేవాదుల పంపుహౌస్ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు దేవన్నపేట పంపుహౌస్ను హుటాహుటీన సందర్శించారు. మోటార్లు రన్ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా ఆ వెంటనే మోటార్లు ఆన్ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటిని ఆన్చేయగా యాసంగి సీజన్ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్లోనూ దేవన్నపేట పంపుహౌస్లో మోటార్లు ఆన్ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్రావు బృందం... కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి, గోదావరిలో సరిపడా నీళ్లున్నా దేవాదుల ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌజ్లో నీటిపారుదలశాఖ అధికారులు శనివారం మోటార్ను ఆన్చేశారు. అక్కడి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేందుకు పంపు ఆన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇదీ సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్... ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2.15 గంటలకు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయలుదేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి హెలికాప్టర్లో తిరుగు పయనమై హైదరాబాద్ చేరుకుంటారు. శనివారం రాత్రి నుంచి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రుల పర్యటనతో ఒరిగేదేమి లేదు సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రుల పర్యటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒరిగేదేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రెండు సంవత్సరాల్లో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు పర్యటన తర్వాత నిద్రలేచిన ప్రభుత్వం హుటాహుటిన పంపుహౌస్లో మోటార్ను ఆన్ చేశారని అన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ప్రాజెక్టు పంపుహౌస్లకు నేతల తాకిడి నిన్న బీఆర్ఎస్ నేత హరీశ్, మాజీ ఎమ్మెల్యేల బృందం నేడు సీఎం రేవంత్రెడ్డి రాక.. గంగారం వద్ద పనుల పరిశీలన అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష ఎట్టకేలకు ఒక మోటార్ను ఆన్ చేసిన అధికారులుఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులుములుగు/ఏటూరునాగారం: నేటి సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు శనివారం అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులు, జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలన పర్యటన సందర్భంగా ప్రాజెక్ట్ ఆవరణలో అధికారుల సమావేశ ప్రాంతంతో పాటు హెలిపాడ్, గోదావరి నది వ్యూ పాయింట్ను పరిశీలించారు. పనులపై ఆరా దేవాదుల మొదటి దశ పనులను 2008 మార్చి 14న యూపీఏ చైర్ర్సన్ సోనియాగాంధీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో తుపాకులగూడెం బ్యారేజ్ను 59 గేట్లతో నిర్మించింది. అలాగే ప్రాంతాల్లోని రిజ ర్వాయర్లకు నీటిని సరఫరా చేసేందుకు పైపులైన్లను అధికారులు నిర్మించారు. ఇలా దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు మొదటి, రెండో, మూడో దశ పనులు చేపట్టారు. మూడో దశలోని పనులు పూర్తి కాకపోవడంతో సీఎం రేవంత్రెడ్డి పర్యటించి వివరాలపై ఆరా తీయనున్నారు. స్థానికులకు దక్కని చుక్కనీరు జిల్లాలో 110 కిలోమీటర్ల గోదావరి ప్రవహించినప్పటికీ స్థానికులకు తాగు, సాగునీరు అందడం లేదు. బ్యారేజ్లు, ఇన్టెక్ వెల్ ఉన్నా రైతులకు ఒరిగింది ఏమిలేదని మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సాగు, తాగునీరు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
– హన్మకొండ కల్చరల్
సంగీతంలో మత్తు ఉంది. అంతు చిక్కని మహత్తు ఉంది. వ్యాధులను నయం చేసే గుణం ఉంది. మనసును తేలిక చేసే మహత్యం ఉంది. చరిత్రలో ఆ మహిమతో కొందరు జీవిత సారం తెలుసుకున్నారు. సరిగమలతో మరికొందరు భవ సాగరం దాటారు. అంతటి ప్రాధాన్యమున్న కళలో రాణించేందుకు బాల్యంలో ఆసక్తి ఉండి నేర్చుకోనివారు.. నేర్చుకుందామన్నా.. అవకాశాలు రాని వారు.. జిజ్ఞాసను నెరవేర్చుకునేందుకు విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల బాటపడుతున్నారు. వృత్తి రీత్యా ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తి కోసం విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి సంగీత పిపాసుల నేపథ్యమే ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..వరంగల్లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సితార్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు‘నాకు సంగీతమంటే ఇష్టం. సివిల్స్కి సన్నద్ధమయ్యే ముందు కర్నాటక వయోలిన్ నేర్చుకున్నా. తర్వాత విధుల్లో బిజీగా ఉంటుండడం వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ సాధన చేస్తున్నా. ఇలా విద్యార్థులతో ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది. – ఇటీవల హనుమకొండలో జరిగిన సంగీతోత్సవంలో కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా వయోలిన్ ప్రదర్శన ఇచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలు. వారంతా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. పలు హోదాల్లో ఉన్నారు. ఐదారంకెల జీతం తీసుకుంటున్నారు. చుట్టూ సకల సౌకర్యాలున్నాయి.. కానీ, వారిని ఓ వెలితి వెంటాడుతోంది. ఆ జిజ్ఞాసే వారిని కఠోర సాధనకు ఉపక్రమించింది. వీరందరి కళలకు జీవం పోస్తోంది భద్రకాళి ఆలయ ప్రధాన ఆర్చ్ సమీపంలోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల. ఇక్కడ శాసీ్త్రయ కూచిపూడి, పేరిణి, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం, కర్ణాటక వయోలిన్, సితార్, తబలావంటి శిక్షణ ఇస్తున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడం.. విద్యార్థుల్లో కళలపై ఆసక్తి పెంచడం.. వివిధ కళల్లో శిక్షణ ఇచ్చి విశిష్టతను చాటి చెప్పడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడ శిక్షణ పొంది శాసీ్త్రయ కళల్లో రాణిస్తున్నారు. ఈ కళాశాలలో 10 ఏళ్ల బాలల నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో సంగీత, నృత్య అధ్యాపకులు ప్రిన్సిపాల్ యన్.సుధీర్కుమార్.. ఇదే కాలేజీలో సరిగమలు పలికిన విద్యార్థి కావడం విశేషం. సంగీతంలో జిజ్ఞాసను ప్రదర్శిస్తున్న ఉద్యోగులు వివిధ రకాల వాయిద్యాల్లో శిక్షణ మానసిక ప్రశాంతత కోసం ‘కళల’ బాట విధి నిర్వహణ ముగిశాక సమయం కేటాయింపు నేర్పుతున్న విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల -
గోదావరి ఇన్టెక్వెల్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి
దేవాదుల ప్రాజెక్టు అంశం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆ ప్రాజెక్టు ఇన్టెక్ వెల్ను సందర్శించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇన్టెక్ వెల్ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండటంతో ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మంగపేట : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని వాడగూడెం, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, బ్రాహ్మణపల్లితో పాటు తదితర గ్రామాల్లో శనివారం రాత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా వాగొడ్డుగూడెం నుంచి పూరేడుపల్లి వరకు రూ.4 కోట్లతో చేపట్టనున్న 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం రామచంద్రునిపేట(సంఘంపల్లి), బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందుగా మంగపేట ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ తోట రమేశ్ ఇంటివద్ధ ఆయన సమక్షంలో తిమ్మంపేట, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, మంగపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి సీతక్క పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పార్టీలో ప్రతిఒక్కరూ ఐకమత్యంగా ఉండాలన్నారు. జిల్లాలో మంగపేట పెద్ద మండలం అయినప్పటికీ 15 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటు పడిందన్నారు. ప్రతిఒక్కరూ మండల అభివృద్ధికి పనిచేయాలని, అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని వివరించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ రెండోవిడత ఇళ్ల మంజూరులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మాణం పనులు జరిగాయని లేని గ్రామాల్లో సైతం సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపడుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టీఎస్ఈజీసీ)సభ్యుడు గుమ్మడి సోమయ్య, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, జిల్లా ప్రచార కార్యదర్శి నాయకులు పూజారి సురేందర్, అధికార ప్రతినిధి యానయ్య, మండల మహిళా అధ్యక్షురాలు నిర్మల, మండల నాయకులు నర్సయ్యగౌడ్, శేషగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మావోల అలజడి!
● ఛత్తీస్గఢ్ నుంచి జిల్లాకు వచ్చారని ఇంటెలిజెన్స్ సమాచారం ● తాడ్వాయి, కన్నాయిగూడెం అటవీ ప్రాంతాల్లో పోలీసుల ముమ్మరంగా తనిఖీలు ● భయాందోళనలో ఏజెన్సీ ప్రజలుఏటూరునాగారం: ఆపరేషన్ కగార్–2లో భాగంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులను తుడిచిపెట్టేందుకు కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. కర్రెగుట్టతోపాటు జిల్లాలోని తాడ్వాయి, కన్నాయిగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి తలదాచుకున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో గ్రేహ్సౌండ్ దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. 2024 డిసెంబర్ 1న ఏటూరునాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతాల్లో ఏడుగురు మావోయిస్టులు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందడంతో అప్పటి పీపుల్స్వార్కు కంచుకోటలా ఉన్న ఏటూరునాగారం అభయారణ్యం వైపు మళ్లీ మావోయిస్టులు అడుగులు వేశారనే విషయాన్ని పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు బలపర్చుతున్నాయి. దీంతో ఎస్ఐబీ, స్పెషల్ పార్టీ దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకొని పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే తాడ్వాయి, కన్నాయిగూడెం, తుపాకులగూడెం అటవీ ప్రాంతాల్లోనే తలదాచుకున్నట్లు పక్కా సమాచారం ఉంది. దీంతో పోలీసులు ఆ దిశగా కూంబింగ్ను మరింత వేగవంతం చేశారు. వరుస ఘటనలు గతంలో పోలీసులను టార్గెట్ పెట్టుకొని మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మెన్లు పేలి నలుగురు సాధారణ వ్యక్తులు మృతి చెందగా ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మావోయిస్టు ఏరివేతలో భాగంగా కర్రెగుట్టలో కూంబింగ్ చేస్తున్న కేంద్ర బలగాల్లోని జవాన్కు ఐఈడీ ల్యాండ్మెన్ పేలి నవదీప్ పాఠక్కు తీవ్ర గాయాలు అయ్యాయి. హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతేకాకుండా అక్కడ పాతిపెట్టిన మరో 9 ల్యాండ్మెన్లు పోలీసు బలగాలు నిర్వీర్యం చేశాయి. అయితే ఏటూరునాగారం దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా ల్యాండ్మెన్స్ ఉన్నాయనే అనుమానంతో పోలీసులు ముందస్తుగా జాగీలతో తనిఖీలు చేసి కూంబింగ్ను చేపట్టారు. -
మేడారం జాతరపై పుస్తకం ఆవిష్కరణ
ములుగు రూరల్: మేడారం మహాజాతర సమ్మక్క–సారలమ్మపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకం ప్రచురించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో అరుదైన చాయాచిత్రాలను సంకలం చేసి పుస్తకంగా రూపొందించిన ప్రముఖ చిత్ర నిర్మాత నర్సింగరావు, ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, బీపీ పాపారావు, రిటైర్డ్ ఎన్ఐటీ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్, రిటైర్డ్ డీజీపీ రతన్ జె పూలెలను మంత్రి ప్రశంసించారు. సమ్మక్క–సారలమ్మ జాతరను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. -
తాగునీటి ఎద్దటి తలెత్తకుండా చర్యలు
వెంకటాపురం(కె): రానున్న వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంపత్రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పాత్రాపురం గ్రామంలోని రైతువేదికలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సర్పంచ్లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనందున వాటిని గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపటాలన్నారు. ఈనెల 21 నుంచి వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల సర్పంచ్లకు తాడ్వాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ శిక్షణ తరగతులకు సర్పంచ్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి వెంకయ్య, ఎంపీడీఓ జుమ్మిలాల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. పుష్కరఘాట్ పరిశీలన మండల పరిధిలోని అంకన్నగూడెం గ్రామ సమీపంలోని గోదావరి ఒడ్డున ఉన్న పుష్కరఘాట్ ను అదనపు కలెక్టర్ సంపత్రావు శుక్రవారం పరిశీలించారు. వచ్చేఏడాది జూన్లో వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ జుమ్మిలాల్, సీఐ ముత్యం రమేష్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు ఉన్నారు.అదనపు కలెక్టర్ సంపత్రావు -
క్షేత్రపర్యటనలు విద్యావికాసానికి దోహదం
ములుగు రూరల్: క్షేత్రపర్యటన విద్యార్థుల విద్యావికాసానికి దోహదపడతాయని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేషం అన్నారు. శుక్రవారం వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఇకో క్లబ్ ఆధ్వర్యంలో కళాశాల బాటనీ, జువాలజీ విద్యార్థులు ప ర్యటించారు. వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ ఉమారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త శకుంతల విద్యార్థులకు వ్యవసాయ పరిశోధన ప్రాధాన్యం, ఆధునిక సాంకేతిక పద్ధతులపై వివరించారు. వర్మీ కంపోస్టు వినియోగం, తయారీ విధానాలపై అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం, నేల సారవంతంగా తయారు చేయడం, అధిక దిగుబడులు సాధించడంపై విద్యార్థులతో చర్చించారు. ఇకో క్లబ్ కన్వీనర్, బాటనీ ఇన్చార్జ్ సరిత, జువాలజీ ఇన్చార్జ్ అనికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం
ములుగు రూరల్: ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి నాయిని వీరేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షలపై చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 13వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో పది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో 1,981 మంది ప్రథమ, 1,860 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు ఇద్దరు డీఈసీ మెంబర్లు, ఒకరు ఫ్లయింగ్ స్వ్కాడ్, ఒకరు సిట్టింగ్ స్వ్కాడ్ పని చేస్తారన్నారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని, పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈసీ సభ్యులు రాంపాక అవిలయ్య, రజిత, బాదావత్ అశోక్ తదితరులు ఉన్నారు. -
జోహెర్ మిల్ పునఃప్రారంభం
ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులకు పోషకాహారం అందించడానికి మండల కేంద్రంలోని క్రాస్రోడ్డులో పడావు పడిన జోహెర్ మిల్ కుటీర పరిశ్రమను ఎట్టకేలకు ఐటీడీఏ అధికారులు మహిళా సంఘం సభ్యుల ద్వారా పునఃప్రారంభించారు. మూడేళ్ల నుంచి మూలకు పడిన కుటీర పరిశ్రమపై ఇటీవల ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ మేరకు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా స్పందించి కుటీర పరిశ్రమను వెంటనే ప్రారంభించి గిరిజన విద్యార్థులకు పోషకాలతో కూడిన జోహెర్ మిల్ పౌడర్ను తయారు చేసి వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐటీడీఏ యంత్రాంగం కుటీర పరిశ్రమ నిర్వాహకులు స్వయం కృషి గిరిజన మహిళా సంఘం సభ్యులు పరిశ్రమను ప్రారంభించి ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టారు. 2,883 కిలోల ఉత్పత్తికి కసరత్తు మండలకేంద్రంలోని క్రాస్రోడ్డులో స్వయం కృషి జోహెర్ మిల్ కుటీర పరిశ్రమలో రాగులు, జొన్నలు, సజ్జలతో పౌష్టికాహారం 2,883 కిలోల ఉత్పత్తిని తయారు చేయడానికి మహిళా సంఘం సభ్యులు కసరత్తు చేస్తున్నారు. 2,840 కిలోల పౌడర్ కావాలని ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ (విద్యాశాఖ) విభాగం డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ వర్క్ ఆర్డర్ ఇవ్వడంతో మూడు రోజుల నుంచి 500ల కిలోల పౌడర్ను తయారు చేశారు. మిగతాది కూడా తయారు చేసి జోహెర్ మిల్ ప్యాకెట్లుగా రూపొందించి దానిని జీసీసీ ద్వారా గిరిజన విద్యాసంస్థలకు సరఫరా చేస్తారు. దీంతో గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం, తయారీదారులకు ఆర్థిక ఫలాలను అందనున్నాయి. 44 విద్యాసంస్థలకు లబ్ధి జిల్లాలోని 44 గిరిజన విద్యాసంస్థల్లో చదువుకుంటున్న 7,311 మంది బాలబాలికలకు జోహెర్ మిల్ పౌడర్ను అందించనున్నారు. ఇప్పటికే పౌడర్ ప్యాకెట్లు సిద్ధం కాగా వాటిని వంతుల వారీగా విద్యాసంస్థలకు సరఫరా చేయనున్నారు. దీంతో గిరిజన విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మిగతా న్యూట్రిన్ పోషకాలతో పాటు జోహెర్ మిల్ పౌడర్ను పాలల్లో కలిసి ఇవ్వనున్నారు. దీంతో చురుకుదనం, జ్ఞాపకశక్తి, విజ్ఞానం పెంపొందే అవకాశాలున్నాయి. ఇప్పటికే 2,883 కిలోల వరకు వర్క్ ఆర్డర్ ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా కొనుగోలు -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ములుగు రూరల్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవించదర్ అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని పత్తిపల్లి, దేవగిరిపట్నం, అనంపల్లి గ్రామస్తులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం జంగాలపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్పాషా, కూనూరు అశోక్గౌడ్, జగన్నాధచారి, కార్యకర్తలు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
ఎదురుచూపులు
ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి మోక్షమెప్పుడో? ఏటూరునాగారం: గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏటూరునాగారం మండల కేంద్రంలో 1986లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) స్థాపించారు. అయితే గిరిజనులకు ఏ పథకాలు అమలు చేయాలి, ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించాలనే ముందు చూపు చర్చలు చేపట్టేందుకు ప్రతీ మూడు నెలలకోసారి ఐటీడీఏ పాలకమండలి సమావేశాన్ని నిర్వహించేవారు. ఇలా ప్రతీ మూడు నెలలకు ఒకసారి పాలకమండలి సమావేశం నిర్వహిస్తూ గిరిజనుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఇతరత్రా సంక్షేమ ఫలాలను అందించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఐటీడీఏ పాలకమండలి సమావేశం మాత్రం ఆరేళ్లుగా నిర్వహించడం లేదు. దీంతో ఎప్పుడు నిర్వహిస్తారోనని గిరిజనులు ఎదురు చూస్తున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏలో 2019 డిసెంబర్ 19న ఐటీడీఏ పాలకమండలి సమావేశం నిర్వహించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి సత్యవతిరాథోడ్, పీఓ చక్రధర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. ఐటీడీఏ పీఓ చక్రధర్రావు తర్వాత హనుమంత్ జెండగే, అంకిత్, ప్రస్తుతం చిత్రామిశ్రా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ పాలకమండలి సమావేశంపై దృష్టి సారించడం లేదు. ఇదే కాకుండా స్థానికంగా మంత్రి సీతక్క ఉన్నప్పటికీ ఐటీడీఏ పాలకమండలి, గిరిజనాభివృద్ధిపై ఇప్పటి వరకు సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం లేదని గిరిజనులు వాపోతున్నారు. లక్షలాది రూపాయలు వృథా ప్రతీ ఏడాది పాలకమండలి సమావేశం నిర్వహించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక బుక్లెట్లను వేసేవారు. అందులో ఐటీడీఏ బడ్జెట్, ఖర్చులు, బడ్జెట్ కేటాయింపు వివరాలను అందులో ప్రచురించి పాలకమండలి సమావేశానికి వచ్చే సభ్యులకు అందజేయాల్సి ఉంటుంది. కానీ పాలకమండలి సమావేశం నిర్వహించకపోవడంతో ఇలా రెండేళ్ల పాటు పుస్తకాలను అచ్చువేశారు. సమావేశం నిర్వహించకపోవడంతో ఆ పుస్తకాలు సైతం మూలకు పడేశారు. బడ్జెట్ కేటాయింపులో అలసత్వం ఐటీడీఏ స్వయం ప్రతిపత్తిని కలిగి ఐటీడీఏ కింద ఉన్న 13 ఏజెన్సీ మండలాల్లో గిరిజాభివృద్ధికి కోట్లాది రూపాయలను కేటాయించి ఖర్చు చేసి అ భివృద్ధి చేసేవారు. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులో ప్రభుత్వం అలసత్యం చూపిస్తుండడంతో ఎలాంటి పథకాలను అమలు చేయలేని దుస్థితి నెలకొంది. బడ్జెట్ను పలు పద్ధతుల్లో ఇచ్చేవారు. ఆర్టికల్ 275, ఎస్టీ సబ్ప్లాన్, ట్రైకార్ నిధులు రాకపోవడంతో పథకాల గురించి ఊసెత్తేవారే కరువయ్యారు. ఐటీడీఏ పాలకమండలి సమావేశం మూడు నెలలకోమారు నిర్వహించాలి. నిర్వహించకపోవడంతో పరిపాలన సక్రమంగా సాగడం లేదు. పథకాలు సైతం పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. కేవలం నామమాత్రపు పథకాలు ఇవ్వడం తప్పా గిరిజనులకు ఒరిగింది ఏమిలేదు. –కబ్బాక శ్రావణ్, ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు, ఏటూరునాగారం ఐటీడీఏ ద్వారా గతంలో ఎకనామికల్ సపోర్ట్ స్కీం, డ్రైవర్ కమ్ ఓనర్, కుటీర పరిశ్రమలు, గిరిజనులకు ఉచిత శిక్షణ, ఉపాధి, ఉద్యాన పంటల సాగు, పనిముట్లు, గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పథకాలు అమలు చేయని పరిస్థితి నెలకొంది. 2020–21లో ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్) బడ్జెట్ మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఫలాలను అందించలేదు. దీనివల్ల ఈఎస్ఎస్కు ఎంపికై న లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలను చేస్తున్నారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 19న నిర్వహణ గిరిజనులకు అందని సంక్షేమ ఫలాలు -
రామప్పలో అటవీశాఖ అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 41 మంది అటవీశాఖ అధికారులు డీసీఎఫ్వో గంగారెడ్డి ఆధ్వర్యంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువుతో పాటు పాలంపేట గ్రామ శివారులోని కేన్ మొక్కలను సందర్శించారు. -
సమన్వయంతో పట్టణాభివృద్ధి
ములుగు: పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్తామని ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ తెలిపారు. ములుగు మున్సిపాలిటీ నూతన పాలకవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఆసియా షాహీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ -
తుప్పు పడుతున్నాయ్..
ఏటూరునాగారం: చిన్నపిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్క్ లక్షల రూపాయలు పెట్టి నిర్మించి నిర్లక్ష్యంగా వదిలేయడంతో సామగ్రి తుప్పుపట్టిపోతుంది. 2023 ఫిబ్రవరి 23లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీల్యాండ్స్ నిధుల నుంచి మాజీ ఎంపీ సీతారాంనాయక్ రూ.5 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని గ్రామానికి చెందిన అటవీశాఖ సెంట్రల్ నర్సరీ ప్రాంతంలో చిల్డ్రన్ పార్క్ను నిర్మించారు. ఈ పార్క్ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. దీంతో జారుడు బల్లా, సీసా, రింగ్ బల్లా, ఉయ్యాలలు, ఇతర సామగ్రి పాడైపోతున్నాయి. చిన్నారులు సాయంత్రం వేళలో ఆహ్లాదకరంగా ఆడుకునేలా అభివృద్ధి చేయాల్సిన గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో ఆ సామగ్రి అంతా తుప్పుపట్టి పోతున్న పరిస్థితి నెలకొంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా.. చిల్డ్రన్ పార్కింగ్ నిరుపయోగంగా మారడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇదిలా ఉండగా గతంలో ఉన్న భూమి కాస్తా క్రమక్రమంగా కబ్జాకు గురవుతోంది. గతంలో నిర్మించుకున్న ఇళ్లలోని కొంత మంది చెత్తాచెదారం, వ్యర్థాలను ఈ ఖాళీ స్థలంలోనే పడవేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతుంది. లక్షలు పెట్టారు.. లక్షణంగా వదిలేశారు.. ఎంపీ ల్యాండ్స్ కింద రూ. 5 లక్షలు వెచ్చించి నిర్మించిన చిల్డ్రన్ పార్క్ను లక్షణంగా వదిలేశారు. నిధులు కేటాయించారే గానీ దాని నిర్వహణను పట్టించుకోవడం లేదు. అప్పట్లో గ్రామ పంచాయతీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాంతో ఎలాంటి ఆదాయం లేకపోవడంతో జీపీ సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో సామగ్రి అంతా తుప్పుపట్టి పోతుందని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రూ.5లక్షలతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్ పట్టించుకోని అధికారులుగ్రామంలోని చిన్నారులకు ఎంతో ఉపయోగపడే చిల్డ్ర న్ పార్క్ను వెంటనే పునరుద్ధరించాలి. ఎంతో విలువైన సామగ్రి తుప్పుపట్టిపోతుంది. అటవీశాఖ, ఇటు గ్రామకంఠం భూమి విషయంలో లెక్క తేలడం లేదు. దీంతో ఆ పార్క్ను ఎవరు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. – బట్టు రమేష్, ఏటూరునాగారం సెల్ ఫోన్స్, టీవీలకు పరిమితం అవుతున్నా ఈనాటి చిన్నారులకు ఆటవిడుపు ఉండాలి. సాయంత్రం వేళలో చిన్నారులు పార్క్కు వెళ్లి ఆడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో ఉండి సెల్కు పరిమితమై అనారోగ్యాల బారిన పడుతున్నారు. వెంటనే పార్క్ను ఓపెన్ చేయాలి. – చామర్తి కిశోర్, ఏటూరునాగారం -
ఆలయ అభివృద్ధికి కృషి
రేగొండ: కొడవటంచ ఆలయ అభివృద్ధి కోసం నూతనంగా ఏర్పాటైన ఉత్సవ కమిటీ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని కొడవటంచ ఆలయ ప్రాంగణంలో 14 మంది ధర్మకర్తల ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ చైర్మన్గా నాయినేని సంపత్రావును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేవా లయాలు ఆధ్యాత్మికతకు నిలయాలే కాకుండా సమాజానికి సాంస్కృతిక కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధ ంగా నూతన కమిటీ కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రముఖుల హాజరు.. కొడవటంచ ఆలయంలో పున:ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు వేద పండితులు పతిష్టాయాగారంభం, జలధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఉమ్మడి వరంగల్ మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, ఆలయ ఈఓ మహేష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు. -
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి
శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఆరె కులస్తులుములుగు రూరల్: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్గౌస్పల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆరె కులస్తులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పసుల కార్తీక్ మాట్లాడుతూ శివాజీ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘు, సంఘం నాయకులు తిప్పారపు కిషన్రావు, యువరాజు, కుడుతల రమేష్, సుధాకర్, ఆగయ్య, వంశీ, శశీ, రఘు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరఘాట్ల నిర్మాణానికి చర్యలు
ఏటూరునాగారం: వచ్చే ఏడాది జూన్లో వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆర్డీఓ వెంకటేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పుష్కరఘాట్లు, పార్కింగ్ స్థలాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ముళ్లకట్ట, రామన్నగూడెం పుష్కరఘాట్లను ఆర్డీఓ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ముళ్లకట్ట, రామన్నగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎక్కడ అయితే గోదావరి లోతు తక్కువగా ఉంటుందో అక్కడ ఘాట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఘాట్ సమీపంలో గోదావరి లోతు 20 ఫీట్లు ఉండగా ఆ లోతు మరింత తగ్గించి భక్తులు పుణ్యస్నానాలను ఆచరించే విధంగా చూడాలని సూచించారు. అలాగే ఘాట్కు వచ్చే వాహనాల మళ్లింపు, వన్ వే వంటి విషయాలపై సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సీఐ శ్రీనివాస్ పార్కింగ్ స్థలాలు, వాహనాల రాకపోకలు , పార్కింగ్ విషయాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. గ్రామంలోని ప్రజలు వారి అభిప్రాయాలను తీసుకొని గతంలో దానికంటే భిన్నంగా సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దీనిపై స్థానికులు అధికారులకు సహకరించి పుష్కరాలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఈఈ వీరభద్ర, ఇరిగేషన్ ఈఈ శంకరయ్య, మిషన్ భగీరథ డీఈ సతీష్, స్థానిక సర్పంచ్ నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇర్సవడ్ల వెంకన్న, రఘు, లక్కి, తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ వెంకటేశ్ -
రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
గోవిందరావుపేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గల సీపీఎం కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఎండీ గఫూర్ పాషా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో రైతులు 14 నెలల పాటు పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే చర్యలను చేపట్టిందన్నారు. దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు 500 బిలియన్ డాలర్ల విలువ చేసే రూ. 45 లక్షల కోట్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు తలుపులు తెరిచి సుంకాలను తగ్గించారని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలకు రూపకల్పన చేశారని వివరించారు. వీటికి వ్యతిరేకంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళనలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, ఆదిరెడ్డి, యాకుబ్, చంద్రశేఖర్, సూర్యనారాయణ, సదానందం, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు -
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఘాట్లు
మంగపేట: వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాలకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఘాట్లతో పాటు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రైతువేదికలో అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్జీ(రెవెన్యూ) వివిధ శాఖల అధికారులు, స్థానికులతో సమీక్షాసమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015లో మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలో రూ.5.64 కోట్లతో 170 మీటర్ల మేర నిర్మించిన పుష్కరఘాట్ గోదావరి వరదల కారణంగా ధ్వంసమైందన్నారు. ఘాట్ వరకు ఏర్పాటు చేసిన బీటీ రోడ్డుతో పాటు భక్తులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ పైపులైన్, సిస్టర్న్లు గోదావరిలో కలిసిపోయాయన్నారు. గోదావరి వరదల కారణంగా దెబ్బతినకుండా ఘాట్ను నిర్మించేందుకు ఇటీవల ఇరిగేషన్ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించారన్నారు. దీనిపై అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇరిగేషన్ ఈఈ శంకరయ్య ఇటీవల గోదావరి తీరం వెంట పరిశీలించగా మార్కెట్ గోడౌన్ సమీపంలోని దొంగల ఒర్రె వద్ద ఘాట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు చెప్పినట్లుగా ఘాట్ నిర్మిస్తే గోదావరి వరదలతో మంగపేటకు ముప్పు ఏర్పడుతుందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం గోదావరి వరకు రోడ్డు ఉన్న చోటనే ఘాట్ నిర్మిస్తే బాగుంటుందని, పుష్కరాలకు వచ్చే భక్తులు ముందుగా దర్శించుకునేందుకు శివాలయం సైతం ఉందని వివరించారు. ఘట్వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే మండల కేంద్రం అభివృద్ధి చెందడంతో పాటు గ్రామస్తులు, వ్యాపారులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదే విధంగా మల్లూరులో శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, శంభులింగేశ్వరస్వామి, రామాలయంతో పాటు తదితర ఆలయాలు ఉన్నాయని వివరించారు. అధికారులు పరిశీలించి మల్లూరులో సైతం పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలని వివరించారు. అదేవిధంగా రాజుపేట, బూర్గుంపాడులో పుష్కరఘాట్లు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు అదనపు కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. ప్రముఖుల అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వానికి, సంబంధిత ఉన్నతాధికారులకు నివేదికలను పంపిస్తామని అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. అనంతరం ఆయన ధ్వంసమైన పుష్కరఘాట్తో పాటు నూతన పుష్కరఘాట్ల ప్రతిపాదిత గోదావరి ఒడ్డు ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రవికుమార్, ఏఈ వలీమ్మహ్మద్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ నరేష్బాబు, ఎన్పీడీసీఎల్ డీఈ పురుశోత్తం, ఎంపీడీఓ భద్రు, ఏఓ చేరాలు, ఎస్సై టీవీఆర్ సూరి, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్రావు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
పెళ్లి పండుగ మొదలు..
జనగామ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లికళ సంతరించుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత నేటి (గురువారం) నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో కుటుంబాలు పండుగ జోరులో ఉన్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కార్యాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. జోరుగా వ్యాపారం.. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారు, వెండివ్యాపార సంస్థలు, పూల దుకాణాలు, బ్యాండ్ బాజా, సన్నాయి మేళా బృందాలు, మేకప్ ఆర్టిస్టులు, పెళ్లిలతో సంబంధం ఉన్న చిన్నా, చిన్న వ్యాపారాల వరకు గిరాకీ బాగా పెరిగింది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు ముందుగానే బుక్ అయిపోవడంతో చివరి నిమిషంలో ముహూర్తాలు పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు పట్టణ పరిధిలో హాళ్లు దొరకకపోవడంతో దూర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లను ఆశ్రయిస్తున్నారు. బడ్జెట్ ఖర్చుపై ఆలోచనలు.. ఈసారి పెళ్లిళ్లకు బడ్జెట్ మాత్రం కుటుంబాలను బాగా ఆలోచింపజేస్తోంది. బంగారం, వెండి ధరలు అంచనాలకు మించి పెరగడంతో సాధారణ, పేద, మధ్యతరగతి కుటుంబాలు గత ఏడాది వేసుకున్న అంచనాలు పెరిగి పోయాయి. దీంతో ఆభరణాల కొనుగోళ్లు సగానికి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటినుంచి శుభముహూర్తాలు రెండు నెలల్లో ముహూర్తాలు లిమిటెడ్ -
ఇంటర్నల్ మార్కుల తనిఖీకి 22 టీంలు
ములుగు: జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల తనిఖీకి 22 టీంలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ సిద్ధార్థ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ టీంకు ఒక జీహెచ్ఎం లీడర్గా, లాంగ్వేజ్ టీచర్, నాన్ లాంగ్వేజ్ టీచర్ సభ్యులుగా ఉంటారని వివరించారు. జిల్లాలోని 9 మండలాల పరిధిలో 102 స్కూళ్లలో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఈ సభ్యులు సరిచూస్తారని వెల్లడించారు. ఫిబ్రవరి 19 నుంచి 21వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఖచ్చితమైన మార్కులు ఆన్లైన్లో ఆప్లోడ్ చేస్తారని వివరించారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 80 మార్కులకు పరీక్ష రాస్తే మిగిలిన 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రాజెక్టు వర్క్, ల్యాబ్ యాక్టివిటీ, ఎఫ్ఏ 1,2,3,4 లలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్నల్ మార్కులు వేశారో లేదో బృందాలు క్షుణ్ణంగా పరిశీలించి మార్కులను సరిచూసుకోవాలని డీఈఓ ఆదేశించారు. గోవిందరావుపేట: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి వీరేంద్ర అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ రాంపాక ఐలయ్య ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు వీడ్కోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరేంద్ర హాజరుకాగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలు సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని సూచించారు. విద్యతోనే పెనుమార్పులు సాధ్యమని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఆశోక్, గోవిందరావుపేట, నార్లాపూర్, చల్వాయి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
క్రీడాపోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
ఏటూరునాగారం: జిల్లాలోని భవిత కేంద్రంలో చదువుకుంటున్న దివ్యాంగులు క్రీడాపోటీల్లో సత్తా చాటారు. హైదరాబాద్లోని దోమలగూడలో గల వ్యాయామ విద్య కళాశాలలో దివ్యాంగ చిన్నారులకు మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఏడు పతకాలను కై సవం చేసుకున్నారు. ఇది ఎంతో గర్వకారణమని భవిత సెంటర్ల జిల్లా కోఆర్డినేటర్ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటూరునాగారంలోని భవిత సెంటర్కు చెందిన దివ్యాంగ బుద్ధిమాద్యుడు మైకల్ అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి పరుగుపందెం, లాంగ్జంప్, డిస్కస్ త్రోలో మొదటి బహుమతిగా గోల్డ్మెడల్ సాధించారని తెలిపారు. అలాగే షాట్పుట్లో మైకల్కు తృతీయ బహుమతిగా సిల్వర్ మెడల్ సాధించాడని వివరించారు. అలాగే మరో విద్యార్థి చెవిటి మూగ విభాగంలో మెట్టు శివకృష్ణ పరుగు పందెం, లాంగ్ జంప్లో మొదటి బహుమతిగా గోల్డ్మెడల్ సాధించగా, షాట్పుట్లో తృతీయ బహుమతిగా సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అలాగే చెవిటి మూగ విభాగంలో డ్యాగల భానుప్రసాద్కు ప్రోత్సాహక బహుమతులు సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు స్వరూపరాణి, గొర్రె రమేష్, పులి సుమ, కంకల రమేశ్ పాల్గొన్నారు. -
రామప్ప టెంపుల్ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ అద్భుతంగా ఉందని అమెరికాకు చెందిన డేవిడ్ అబాట్ కొనియాడారు. రామప్ప ఆలయాన్ని ఆయన బుధవారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని అబాట్ కొనియాడారు. రేపటి వరకు సీసీఐ కొనుగోళ్లు ములుగు రూరల్: ములుగు వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోళ్లు రేపటి(శుక్రవారం) వరకు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రైతులు పత్తి అమ్మకాలు సీసీఐకి చేపట్టాలని వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు పత్తి విక్రయాలను గడవు లోపు చేపట్టి అధికారులకు సహకరించాలని కోరారు. ములుగు: ప్రధానమంత్రి ముద్రయోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సిద్ధార్థ్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈడీసీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారంటీ పత్రాలు లేకుండానే కనిష్టంగా రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లా పరిశ్రమ కేంద్రంలో సంప్రదించాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునేవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశ్వర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకన్న, ఈడీసీ మేనేజర్ విక్రమ్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ రాఘవేందర్, రాధిక పాల్గొన్నారు. భూపాలపల్లిరూరల్: ఆజంనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు సక్రమంగా లేవని, వైద్యులు సమయపాలన పాటించడం లేదంటూ గ్రామస్తులు బుధవారం ఆస్పత్రికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయం 10 గంటలు దాటినా కూడా వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆస్పత్రికి హాజరుకావడం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఆస్పత్రి బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు చిన్నారులతో వచ్చిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రంలో క్రమం తప్పకుండా వైద్యులు, నర్సులు హాజరు కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు వచ్చి మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలపడంతో గ్రామస్తులు తాళం తీశారు. కాగా ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదుగురి ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలు కాగా వైద్యం కోసం ఆజంనగర్ ఆస్పత్రికి రాగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. -
మున్సిపాలిటీలో సమస్యల తిష్ట
కొలువుదీరిన నూతన పాలకవర్గానికి సవాల్ములుగు: మున్సిపాలిటీగా ఏర్పడిన ములుగు పట్టణంలో సమస్యలు తిష్ట వేశాయి. ప్రత్యేక అధికారుల పాలనలో పట్టణంలో సమస్యలన్నీ పేరుకుపోయాయి. అభివృద్ధికి నోచుకోక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ములుగు పట్టణం నూతన పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణంలో ప్రధానంగా డ్రెయినేజీ, రోడ్లు, తాగునీటి సమస్య నెలకొంది. అన్ని కాలనీల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో పాటు మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. అంతర్గత రహదారులు, తాగునీటి సమస్య, వీధి దీపాల నిర్వహణ సరిగా లేక పట్టణం పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కొత్త పాలకవర్గంపైనే ఆశలు కొత్త పాలకవర్గంపై పట్టణంలోని 20 వార్డులకు చెందిన 13,963 మంది ఓటర్లు కోటి ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా ప్రకటించి ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రామప్ప చెరువులోకి మురుగునీరు పట్టణానికి చెందిన మురుగునీరంతా రామప్ప సరస్సులోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయి. వర్షపునీటితో మురుగునీరంతా రామప్ప చెరువులోకి వెళ్తుండడంతో రామప్ప సరస్సు నీరు కలుషితమవుతోంది. జిల్లాలోని 4 మండలాల పరిధిలో గల 175 శివారు గ్రామాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందిస్తున్న సరస్సులోకి మురుగునీరు వెళ్తున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది. పట్టణమంతా పైపులైన్ లీకేజీలే.. పట్టణంలోని అనేక కాలనీల్లో పైపులైన్ లీకేజీలు ఏర్పడి తాగునీరంతా వృథాగా పోతోంది. మున్సి పల్ ఎన్నికల ముందు తాగునీటిని సరఫరా చేసే బోర్లు సైతం మరమ్మతులకు రావడంతో వారం రోజుల పాటు కొన్ని కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ప్రాధాన్యం కల్పించి పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టి తాగునీటి సమస్య ను రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. తీవ్రంగా కోతులు, కుక్కల బెడద ములుగు పట్టణ కేంద్రంలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రజలు గడపదాటి రావాలంటే వానరాలను చూసి భయంతో వణికిపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై సైతం కోతులు దాడులు చేస్తున్నాయి. కోతుల బెడదతో పాటు కుక్కల బెడద ఉండడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో అంతర్గత రహదారులు ఆధ్వానంగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలతో దర్శనమిస్తున్నాయి. కల్వర్టులు సైతం ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్న రహదారులు ఇరుకుగా ఉండడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. కొన్ని రహదారులు 15 ఫీట్లు ఉండడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితితో వాహనదారుల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంటుంది. రోడ్లను విస్తరించేందుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులు మరో 5 ఫీట్ల దారి ఇవ్వాలని అడిగితే ససేమిరా ఇవ్వమని అంటుండడంతో రోడ్ల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. పట్టణాన్ని పీడిస్తున్న డ్రెయినేజీ సమస్య రామప్ప చెరువులోకి మురుగునీరు అధ్వానంగా అంతర్గత రహదారులు పైపులైన్ల లీకేజీలు.. తాగునీటి సమస్య కోతులు, కుక్కల బెడద -
పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధి
ప్రజలకు సేవకురాలిగా పనిచేసి చూపిస్తా ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళములుగు: రాజకీయాలు ఎన్నికలు ముగిసేవరకు మాత్రమే.. మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి గెలిపించిన ప్రజలకు సేవకురాలిగా పనిచేస్తూ, పార్టీలకతీతంగా ములుగు పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతినిప్పుల చంద్రకళ వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి చైర్పర్సన్గా ఎన్నికై న ఆమె మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మిస్తా..ములుగు పట్టణంలో ప్రధానంగా రోడ్లు, డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. చిన్నపాటి వర్షానికే మురుగు, వర్షపునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతుంది. మంత్రి సీతక్క సహకారంతో డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు ఏజెన్సీ వాళ్లతో డిజైన్ చేయించి మాస్టర్ప్లాన్తో ముందుకెళ్తా. అభివృద్ధిలో ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లకు భాగస్వామ్యం..రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే. పట్టణాభివృద్ధిలో ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లను భాగస్వాములు చేస్తాం. మాది, మీది అనే తేడా లేకుండా అన్ని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో మమేకం అవుతాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తా. తాగునీటి వసతికి తొలి ప్రాధాన్యం.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సహకారంతో ములుగు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. మున్సిపల్, పీఆర్ శాఖ పరిధిలో రూ.49 కోట్ల నిధులు మంజూరై ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి వసతికి తొలి ప్రాధాన్యత ఇస్తా. అర్హులందరికీ సంక్షేమ పథకాలు..కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించేలా కృషి చేస్తా. ప్రభుత్వానికి, పేద ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయడమే లక్ష్యం. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందేలా చూస్తా. సమస్యల పరిష్కారానికి మాస్టర్ప్లాన్ ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళకూడళ్లను సుందరీకరిస్తాం.. ములుగు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటా. అంతర్గత రోడ్లను విస్తరిస్తూ ప్రధాన కూడళ్లల్లో సుందరీకరణ పనులు చేపడతాను. మాపై విశ్వాసంతో గెలిపించిన పట్టణవాసుల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా. -
గ్రామాలాభివృద్ధిలో సర్పంచ్లదే కీలకపాత్ర
ములుగు: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే కీలకపాత్ర అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నూతనంగా ఎన్నికై న ములుగు, వెంకటాపురం(ఎం), మల్లంపల్లి, గోవిందరావుపేట మండలాల పరిధిలోని సర్పంచ్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీపీల నిర్వహణకు ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచుల పాత్ర కీలకమన్నారు. నూతన సర్పంచులకు పంచాయతీ రాజ్ చట్టంపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని, పాలకులుగా ఉంటూ సేవకులుగా ప్రజలకు సేవ చేయాలన్నారు. గ్రామాల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులు ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని సూచించారు, గ్రామాల అభివృద్ధిపై పాలక మండలి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించాలని, ఉపాధి హామీ పథకంలో కార్మికుల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జీపీల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే అంశాలపై ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ తయారీ, తడి, పొడి చెత్త నిర్వహణ స్టాల్ను మంత్రి సీతక్క పరిశీలించారు. అనంతరం ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు మంత్రి సీతక్క కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, డీపీఓ వెంకయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలో మంత్రి సీతక్క మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. జాతర ముగిసినా అమ్మవార్ల దర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు పడకుండా చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. అనంతరం ఆలయం వద్ద ఇప్పపూల లడ్డూలు విక్రయిస్తున్న మహిళలతో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వనదేవతలను దర్శించుకుని సీతక్క పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు అశోక్, మేడారం సర్పంచ్ భారతి తదితరులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు 4 మండలాల సర్పంచ్లకు 5 రోజుల పాటు శిక్షణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పురపాలన అంతా మహిళల చేతుల్లోకి వెళ్లిపోయింది. సోమవారం, మంగళవారం.. జరిగిన ఎన్నికల్లో వారికే పెద్దపీట దక్కింది. వాస్తవానికి అన్నిచోట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉంది. కోరం లేని కారణంగా డోర్నకల్.. సరిసమానమైన మెజారిటీ, గొడవలు, ఉద్రిక్తతతో జనగామ, తొర్రూరు ఎన్నికలను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ రెండు రోజుల్లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో సగానికి పైగా పదవులను మహిళలు సాధించారు. 12 చైర్పర్సన్ స్థానాల్లో 7 స్థానాలను మహిళలు గెలుచుకున్నారు. వైస్ చైర్మన్ స్థానాల్లో 8 మంది మహిళలే దక్కించుకున్నారు. వారంతా కూడా సోమ, మంగళవారాల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలకు 12 కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోగా.. ఇందులో అత్యధికంగా మహిళలే కావడంపై చర్చ జరుగుతోంది. జనరల్ స్థానాల్లోనూ సమీకరణల్లో భాగంగా అనూహ్యంగా చైర్పర్సన్ పదవులు ‘ఆమె’ను వరించాయి. ములుగు మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వు కాగా అక్కడ చింతనిప్పుల చంద్రకళ చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు. మహబూబాబాద్ ఎస్టీ జనరల్ అయినప్పటికీ ఇక్కడ ఎస్టీ మహిళ గుగులోత్ జ్యోతికి పురపీఠం వరించింది. మరిపెడలో వీసారపు ప్రగతి, కేసముద్రంలో బానోత్ సునీత, నర్సంపేటలో పెండెం శ్రీలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్నికలు జరిగిన జనగామ బీసీ జనరల్కు రిజర్వు కాగా, ఇక్కడ లాటరీ ద్వారా 22వ వార్డు కౌన్సిలర్ కడకంచి బాలమణిని చైర్పర్సన్గా అదృష్టం వరించింది. డోర్నకల్ ఎస్సీ జనరల్ కాగా ఇక్కడా మహిళకు అవకాశం ఇవ్వడంతో కుండేటి రాజకుమారి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా వైస్ చైర్పర్సన్లుగా లావణ్య (డోర్నకల్), నీలా రాజమ్మ (స్టేషన్ఘన్పూర్), నేనావత్ షీభారాణి (వర్ధన్నపేట), హతియా షాహీన్ (ములుగు), దివ్య (పరకాల), సునీత (మరిపెడ), అల్లం రమ (కేసముద్రం)కు చాన్స్ దక్కింది. బీఆర్ఎస్ గెలుస్తుందనుకున్న తొర్రూరు మున్సిపాలిటీ కూడా లాటరీలో కాంగ్రెస్కే దక్కగా, అక్కడ 14వ వార్డు కౌన్సిలర్ సోమ రజిని వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. జ్యోతి మహబూబాబాద్బాలమణి జనగామబానోత్ సునీత కేసముద్రంరాజకుమారి డోర్నకల్ వీసారపు ప్రగతి మరిపెడపెండెం శ్రీలక్ష్మి నర్సంపేట– సాక్షిప్రతినిధి, వరంగల్చంద్రకళ ములుగుగెలిపించింది, గెలిచింది ‘ఆమె’నేగ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన నారీమణులు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎన్నికల నిర్ణేతలుగా నిలిచారు. ఇదే సమయంలో అత్యధిక మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ పీఠాలను అధిష్టించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17.. మూడు తేదీల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పురుషులకంటే 1.09 లక్షల మంది మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగాప్రచురించిన ఓటర్ల జాబితాలో నూ భూపాలపల్లి మినహా అంతటా వారిదే ఆధిక్యం ఉంది. మొత్తం 12 బల్దియాలలో 3,35,244 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 1,72,087 కాగా, పురుషులు 1,63,088. ఇందులో 1,27,004 మంది పురుషులు ఓట్లేయగా, మహిళలు 1,35,238 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. నీల రాజమ్మ స్టేషన్ఘన్పూర్సునీతారెడ్డి మరిపెడజనగామ ఎమ్మెల్యే పల్లా ఎంపీ కిరణ్కుమార్రెడ్డి ఎంపీ వద్దిరాజు రవిచంద్రఅల్లం రమ కేసముద్రంషీభారాణి వర్ధన్నపేటఏకు దివ్య పరకాలలావణ్య డోర్నకల్ రజిని తొర్రూరు ఆసియాషాహీన్ ములుగుచైర్ పర్సన్లుఓరుగల్లు మున్సిపల్ పీఠాలపై మహిళలదే పై‘చేయి’.. మున్సిపల్ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశం 12 మున్సిపాలిటీలకు ఏడు చోట్ల మహిళలే చైర్పర్సన్లు 8 మున్సిపాలిటీల్లో వారే వైస్ చైర్పర్సన్లు.. ‘ఆమె’కు కలిసొచ్చిన ‘లక్కీ’ వైస్ చైర్ పర్సన్లు ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్.. మహిళలకు దక్కిందెక్కడ.. -
కాంగ్రెస్ ‘తీన్మార్’
● జనగామ, తొర్రూరు, డోర్నకల్ సైతం కాంగ్రెస్ కైవసం ● లాటరీ పద్ధతిలో జనగామ, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జనగామ/తొర్రూరు/డోర్నకల్: జనగామ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటకీయంగా సాగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపిరామ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం హాలులో ప్రారంభమైన ప్రక్రియలో మొదట చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ సభ్యుల ఓటింగ్లో ఆ పార్టీకి చెందిన 12 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓటుగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి చేతులు ఎత్తడంతో మొత్తం 16 ఓట్లు వచ్చాయి. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు రాగా 13 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి వారికి కూడా 16 ఓట్లు రావడంతో టెన్షన్ నెలకొంది. ఇరుపక్షాలకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి గోపిరామ్ లాటరీ విధానాన్ని అమలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, పోలీసుల సమక్షంలో మొదట తీసిన చీటీలో బాలమణి పేరు రావడంతో ఆమె లక్కీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతు దారుడు 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎన్నికై న ఇద్దరికీ ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అదేవిధంగా తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు గెలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు వేశారు. దీంతో ఓట్లు సమానం కావడంతో ఇరు పార్టీలు సూచించిన వార్డు సభ్యులపేర్లతో చీటలు వేసి లాటరీ తీయగా వచ్చిన పేర్లను ప్రకటించారు. ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తూనం శ్రావణ్ కుమార్ చైర్మన్గా, సోమ రజినీ వైస్ చైర్పర్సన్గా ఎంపికై నట్లు ఆర్డీఓ ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డోర్నకల్లో మొత్తం 15 వార్డుల్లో 11మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, నలుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండగా మంగళవారం అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండేటి రాజకుమారిని, వైస్ చైర్పర్సన్గా మాదా లావణ్య పేర్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ నుంచి ఎవరినీ ప్రతిపాదించక పోవడంతో వారిద్దరిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. -
పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం
ములుగు: కుటుంబ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగులోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం జరి గిన మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతీ కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి మున్సిపల్ చైర్పర్సన్గా చింతనిప్పుల చంద్రకళను ఎన్నుకున్నామని చెప్పారు. ప్రతీ ఒక్కరికి చైర్పర్సన్ కావాలనే ఆశ ఉంటుంది. కానీ అవకాశం ఒక్కరికి మాత్రమే దక్కుతుందని అన్నారు. అనుభవం కలిగిన నాయకుడిగా, ములుగు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న చింతనిప్పుల భిక్షపతి కుటుంబానికి అవకాశం కల్పించామని తెలిపారు. గతంలో ఎన్నో ఒత్తిడిలు వచ్చినప్పటికీ పార్టీ మారకుండా నిబద్ధతతో పనిచేశారని ఆమె కొనియాడారు. ములుగు మున్సిపాలిటీ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడని, చంద్రకళ భిక్షపతిలో చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉన్నాయని, పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నా రు. అవకాశం రానివారు నిరుత్సాహపడాల్సిన అవస రం లేదని, భవిష్యత్లో మంచి అవకాశాలు అందరికీ వస్తాయని భరోసా ఇచ్చారు. తనకు పార్టీలో అందరూ సమానమని మంత్రి స్పష్టం చేశారు. ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరమని, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారో తమకు తెలుసని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దివంగత నల్లెల కుమార్ తనకు అన్నలాంటివారని పేర్కొంటూ, ఆయన కుమారుడు నల్లెల భరత్కు ఇంకా వయసు ఉందని, భవిష్యత్లో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. ము లుగు మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా ఎన్నికై న చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, వైస్ ఛైర్మన్ ఆసియా షాహీన్తోపాటు కౌన్సిలర్లను మంత్రి సీతక్క శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు రాజకీయాలు సహించం రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క -
కాంగ్రెస్లో చేరిన ముప్పనపల్లి సర్పంచ్
కన్నాయిగూడెం: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా, బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. ముప్పనపల్లి సర్పంచ్(బీఆర్ఎస్) తిప్పనపల్లి లక్ష్మయ్య, లక్ష్మీపురం మాజీ సర్పంచ్ కొట్టె ఉమామహేశ్వరి తదితరులు కార్యకర్తలతో కలిసి సోమవారం కాంగ్రెస్లో చేరారు. ములుగులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సీతక్క వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరితోపాటు తిప్పనపల్లి ఎర్ర సమ్మయ్య, మహేందర్, మహేష్, వెంకటేష్, లక్ష్మయ్య, సంతోష్, ప్రవీణ్, సోదండి రాజు, జిలకర మహంకాళి, తదితరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. సేవాలాల్ సేవలు మరువలేనివి ఏటూరునాగారం: సేవాలాల్ సేవలు మరువలేనివని మహబూబాబాద్, ములుగు జిల్లాల గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గురుకులం పాఠశాలలో సేవాలాల్ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి హరి సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం వారం రోజులపాటు సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ప్రిన్సి పాల్ శ్రీరాములు, అధ్యాపకులు వీరన్న, జైపా ల్, కుమారస్వామి, పృథ్వీరాజ్, గోపాల్రావు, నర్సయ్య, కృష్ణయ్య, శంకర్ పాల్గొన్నారు. మంత్రి సీతక్కను సత్కరించిన నాయకులు గోవిందరావుపేట: ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం నూతన చైర్మన్, వైస్ చైర్మ న్ ఎన్నిక అనంతరం చల్వాయి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ విజయంలో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో చల్వాయి సర్పంచ్ మేకల రాధసుదర్శన్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నాగలక్ష్మి, అనిల్ యాదవ్, సుధాకర్, శ్రీను పాల్గొన్నారు. గోవిందరావుపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భూమాత నిరుపయోగంగా మారిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వెంకట్ రెడ్డి అన్నారు. మండలంలోని పస్రా పార్టీ కార్యాలయంలో గుండు రామస్వామి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల మంది పట్టా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ ఒక్క రైతుకు న్యా యం జరగలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించి రెండు సంవత్సరాలైనా న్యాయం చేయలేదన్నారు. పహాణిలో పట్టాదారు కాలంలో యజమాని ఒప్పుకుంటే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. ఈ నిబంధనల వల్ల ఏ రైతుకి పాసుబుక్ రాలేదని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెబుతూ రైతులకు తీరని నష్టం చేసిందని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేస్తుందని అన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క జోక్యం చేసుకోని ఏజేన్సీలోని రైతులకు న్యాయం చే యాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, తీగల ఆగిరెడ్డి, కోటేశ్వరరావు, సదానందం, సాంబయ్య, సూర్యనారాయణ, ధర్మారెడ్డి, ఆది రెడ్డి, నాగరాజు, లెనిన్, నగేష్ పాల్గొన్నారు. -
మామయ్యా.. నీ ఆశయం నెరవేరలేదు
‘మామయ్యా.. నీ ఆశయం నెరవేరలేదు. నాకు ఆన్యాయం జరిగింది మామయ్య..’ అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ నల్లెల్ల స్వాతి రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక అనంతరం ఇంటికి వెళ్లిన స్వాతి తన మామయ్య జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దివంగత నల్లెల్ల కుమారస్వామి చిత్రపటం ఎదుట తీవ్రంగా రోదించారు. ములుగు మున్సిపాలిటీ తొలి చైర్ పర్సన్గా నల్లెల్ల కుటుంబానికి చెందిన స్వాతికి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించారు. అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి సతీమణి చంద్రకళకు అవకాశం దక్కడంతో ములుగులో చర్చనీయాంశంగా మారింది. -
తొలి చైర్పర్సన్ చంద్రకళ
కొలువుదీరిన ములుగు మున్సిపల్ కార్యవర్గం ములుగు: నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ తొలి పాలకవర్గం కొలువుదీరింది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ ఎన్నికలో తొలి చైర్పర్సన్గా చింతనిప్పుల చంద్రకళభిక్షపతిని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక చివరవరకు ఉత్కంఠగా కొనసాగింది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి సీతక్క చైర్ పర్సన్గా చంద్రకళ, వైస్ చైర్పర్సన్గా ఆసియా షాహిన్ను ఎంపిక చేశారు. చైర్పర్సన్ పదవి కోసం నల్లెల్ల స్వాతి, చింతనిప్పుల చంద్రకళ మధ్య తీవ్రంగా పోటీ నెలకొనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు చంద్రకళను ఎంపిక చేసినట్లు సీతక్క వెల్లడించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మంత్రి సీతక్క సూచించిన అభ్యర్థులనే చైర్పర్సన్, వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం ములుగు మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 11 గంటలకు తొలుత ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఇద్దరు, తర్వాత బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఐదుగురు, బీజేపీ కౌన్సిలర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్కు చేరుకున్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు 11:55 గంటలకు కలెక్టరేట్కు వచ్చారు. 20 మంది కౌన్సిలర్లను తెలుగు అక్షరమాల ప్రకారం అభ్యర్థులను పిలిపిస్తూ కౌన్సిలర్లుగా ములుగు ఆర్డీఓ వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్వతంత్రుల మౌనం..చైర్పర్సన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చింతనిప్పుల చంద్రకళను కౌన్సిలర్లు సిలువేరు సాంబయ్య, ఓం ప్రకాశ్, కుతుబుద్దీన్ ప్రతిపాదించగా మిగిలిన 9మంది బలపరచడంతో చైర్ పర్సన్గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి వెంకటేష్ ప్రకటించారు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆసియా షాహీన్ను గుంటో జు పావని, ఓంప్రకాశ్ ప్రతిపాదించగా 10 మంది బలపరచడంతో ఆసియా షాహిన్ ఎన్నికై నట్లు ప్రకటించారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించకుండా, ఓటింగ్లో పాల్గొనకుండా మౌనంగా ఉన్నారు. నూతన చైర్పర్సన్ చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహీన్, కౌన్సిలర్లు కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి సీతక్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం నామినేషన్లు(దరఖాస్తు) వేయాలని అధికారులు ప్రకటించారు. ఇందు కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్ తాము దరఖాస్తు చేసుకునేందుకు ఫాంలు ఇవ్వాలని కోరారు. కానీ రెండు రోజుల క్రితమే ఫాంలు పంపిణీ చేశామని ఇప్పుడు ఫాంలు ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో బీఆర్ఎస్కు చెందిన రేసోజు పద్మ, బైకాని సునిత, బైకాని అనూష, గోనెల భరత్కుమార్, కొగిల లక్ష్మి, బీజేపీకి చెందిన కొత్త సురేందర్ సమావేశాన్ని బహిష్కరించి ఓటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు గంగాధర్, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పాల్గొన్నారు. వైస్ చైర్పర్సన్గా ఆసియా షాహీన్ ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు -
ములుగు జిల్లాకు ఏడేళ్లు
ములుగు జిల్లా కేంద్రం వ్యూ ములుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో నాటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ల పునర్విభజన చేపట్టింది. ఆ సమయంలో ము లుగు, భూపాలపల్లిని ఒకే జిల్లాగా ఏర్పాటు చేశా రు. దీంతో ములుగు ప్రజలు ములుగు జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించడంతో 2019 ఫిబ్రవరి 16న జిల్లా ఏర్పాటు చేస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. 17వ తేదీ నుంచి కొత్తగా ములుగు జిల్లా పాలన అమలులోకి వచ్చింది. 1956లో తాలుకాగా 1985లో గ్రామ పంచాయతీగా ఏర్పడిన ములుగు 2011లో మేజర్ పంచాయతీగా అభివృద్ధి చెందింది. 33వ జిల్లాగా ఏర్పాటు 2016లోనే ములుగు జిల్లా ఏర్పడుతుందని ఆశించిన ఇక్కడి ప్రజలకు నిరాశ ఎదురుకావడంతో ఉద్యమబాట పట్టారు. ప్రజల ఆకాంక్షను గుర్తించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు, భద్రాద్రి కొత్తగూడెం సెగ్మెంట్ పరిధిలోని రెండు మండలాలు కలిపి జిల్లాగా ప్రకటించింది. 9 మండలా లు 174 గ్రామపంచాయతీలతో ఏర్పడిన ములు గు జిల్లా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ములుగు పరిధిలోని మల్లంపల్లి గ్రామపంచాయతీని జేడీ మల్లంపల్లి మండలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జిల్లాలో మండలాల సంఖ్య 10కి చేరింది. ములుగు జిల్లా 3,881 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రాష్ట్రంలోనే 11వ అతిపెద్ద జిల్లాగా (వైశాల్యంలో) గుర్తింపు పొందింది. ఇందులో 2,945.45 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉండడం, 90 కిలోమీటర్ల విశాలమైన, సుందరమైన గోదావరి తీరం కలిగి ఉండటం విశేషం. రామప్పకు యునెస్కో గుర్తింపు.. జిల్లాలో రామప్ప, లక్నవరం, మేడారం సమ్మ క్క– సారలమ్మ, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి , బొగత, ముత్యంధార జలపాతం, బ్లాక్బెర్రీ తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు పొందిన ఏకై క ఆలయం రామప్ప ఈ జిల్లాలో ఉంది. రామప్ప ఆలయానికి 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. గత నెలలో జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రూ.101 కోట్లతో తల్లుల గద్దెలను ప్రభుత్వం విస్తరించింది. అంతేకాకుండా రాష్ట్ర కెబినేట్ సమావేశాన్ని సీఎం రేవంత్రెడ్డి మేడారంలో ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు రూ.150 కోట్ల నిధులు కేటాయించారు. విద్యారంగంలో ముందడుగు డిగ్రీ కళాశాల కోసం ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నుంచి దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల ఏర్పాటు జిల్లాకు శుభపరిణామంగా భావించవచ్చు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించి న సమ్మక్క, సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు జిల్లాలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించగా కేంద్రం రూ.830 కోట్లను కేటాయించింది. 287 ఎకరాలను అప్పగించగా పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రేమనగర్ వద్ద జిల్లా ఆస్పత్రి కోసం నిర్మించిన భవనంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. 50 మెడికల్ సీట్లు కేటాయించగా తరగతులు కొనసాగుతోన్నాయి. ఇక్కడే నర్సింగ్ కళాశాల కూడా కొనసాగుతోంది. మేజర్ గ్రామపంచాయతీ హోదాతోనే జిల్లా కేంద్రంగా ఏర్పాటైన ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు 2022 సెప్టెంబర్ 12న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి ధనసరి సీతక్క ప్రత్యేక చొరవతో బండారుపల్లి, జీవింతరావుపల్లి జీపీలను కలుపుకొని 2024 లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు ప్రభుత్వం, గవర్నర్ ఆమోదించారు. దీంతో 2025 ఏప్రిల్ 5న ములుగు మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. నూతనంగా ఏర్పాటైన ములుగు మున్సిపాలిటీకి ఈనెల 11 ఎన్నికలు జరగగా 20 వార్డుల్లో 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, రెండు ఇండిపెండెంట్లు, ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి. ములుగు మున్సిప ల్ తొలి చైర్పర్సన్గా కాంగ్రెస్కు చెందిన చింతనిప్పుల చంద్రకళ ఎన్నికయ్యారు. నేడు 8వ వసంతంలోకి అడుగు జీపీ నుంచి మున్సిపాలిటీగా.. -
రామప్పలో కొనసాగిన శివరాత్రి ఉత్సవాలు
వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా రామప్ప దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణానికి హాజరైన మంత్రి ధనసరి సీతక్క రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఆలయంలో గణపతి పూజ, రుద్రాభిషేకం, విగ్రహారాధన, వీరభద్ర పళ్లెరము, భద్రకాళి పూజ, సహస్రనామార్చన, బలిహారణ పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమళ్లపల్లి హరీశ్శర్మ, ఉమాశంకర్ తెలిపారు. తగ్గిన భక్తుల రద్దీ ఆదివారం అర్ధరాత్రి వరకు కిక్కిరిసిపోయిన రామప్ప దేవాలయం సోమవారం భక్తులు లేక వెలవెలబోయింది. ఆదివారం శివపార్వతుల కల్యాణం ముగియడంతోపాటు మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం ఉండడంతో సోమవారం రామప్ప ఆలయానికి రావడానికి భక్తులు ఆసక్తి చూపలేదు. నేడు అగ్నిగుండాల మహోత్సవం మంగళవారం తెల్లవారుజామున 4గంటలకు అగ్నిగుండాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు రామప్ప ఆలయ చైర్మన్ మిల్కూరి అయిలయ్య, ఆలయ ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమానికి సోమవారం రాత్రి 8గంటల నుంచి భక్తులు రామప్ప ఆలయానికి వస్తారని వారు తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవం సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వెంకటాపురం ఎస్సై చల్ల రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 839 మందికి వైద్య సేవలు మహాశివరాత్రి సందర్భంగా రామప్పలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరం ద్వారా 839 మందికి వైద్యసేవలు అందించినట్లు వెంకటాపురం పీహెచ్సీ వైద్యాధికారి శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం 456 మందికి, సోమవారం 383 మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. భక్తులకు అందు బాటులో ఉండి సేవ చేయడం ఆనందంగా ఉందని వైద్యసిబ్బంది తెలిపారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మహాశివరాత్రి సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రామప్పలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి 9 గంటలకు నవ్యజ బృందంచే చేసిన పేరిణి నృత్యం, 10 గంటలకు చైతన్య బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం, 11 గంటలకు మోతె రమేశ్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించారు. 12గంటలకు మోతె శంకర్ ఆధ్వర్యంలో చెక్కబొమ్మలాట, అర్ధరాత్రి ఒంటిగంటకు మనుల స్వప్న బృందంచే భక్తి గీతాలు భక్తులను అలరించాయి. జాగరణ చేపట్టిన భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. -
నిరంతరం విద్యుత్ సరఫరా
ములుగు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు సర్కిల్ పరిధిలో నిరంతరం విద్యుత్ సరఫరా అందించామని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) ఆనందం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ములుగు సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ వెలుగులతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయని వివరించారు. లోడ్ అంచనాలకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామని వెల్లడించారు. 24 గంటలు పర్యవేక్షణ చేసేలా అదనపు సిబ్బందిని నియమించామన్నారు. రామప్ప వద్ద 25 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వివరించారు. సమావేశంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రమేష్, సబ్ ఇంజనీర్లు సాంబరాజు, శివ పాల్గొన్నారు.ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం -
చెలిమనీరే.. తాగునీరు
ఏజెన్సీలోని గొత్తికోయలకు తప్పని తిప్పలుఏటూరునాగారం: ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గిరిజనుల కష్టాలు తీరడం లేదు. ఏజెన్సీలో ఆవాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న గొత్తికోయలకు స్వచ్ఛమైన తాగునీరు కరువైంది. కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి వాగుల్లో చెలిమలు తోడి నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 51 గొత్తికోయగూడేలు ఉన్నాయి. వీటిల్లో 3,548 మంది గొత్తికోయలు జీవనం సాగిస్తున్నారు. ఇందులో రాయబంధం, రేగులగూడెంతో పాటు మరో నాలుగు గూడేలకు రోడ్లు, తాగునీటి వసతి కల్పించారు. కానీ మిగతా 45 గూడేల్లో మాత్రం తాగునీటి కోసం గొత్తికోయలు వాగుల్లోని చెలిమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అడవిలో కిలో మీటర్ల మేర బిందెలను చేతపట్టుకుని వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అలాగే తాగునీటితో పాటు రోజువారి అవసరాలకు సైతం వాగునీటినే తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి సమస్య మరింత జఠిలంగా ఉంటుందని గొత్తికోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితం అవుతున్న వాగునీరు ఏజెన్సీలో ప్రవహించే వాగుల్లోని నీరు గతంలో చెట్ల మధ్య నుంచి ఊటలు వచ్చేవి. ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు వాగుల్లోకి వ్యర్థాలు, ప్లాస్టిక్, పశువుల కళేబరాలు వచ్చి చేరుతుండడంతో నీరు కలుషితం అవుతుంది. దీంతో వాగుల్లోని నీటిని వాడే గిరిజనులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని అవగాహన సదస్సులు పెట్టి చైతన్య పరుస్తున్నారు. అటవీశాఖ అడ్డంకులు తాగునీటి వసతి కల్పించేందుకు జీపీలకు అటవీశాఖ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుంది. కమీషన్లకు కక్కుర్తి పడి ఆటోమెటిక్ బోర్లు, హెవీ వాటర్ బోర్లను నిర్మించడానికి సంబంధిత బోర్వెల్స్కు వత్తాసు పలుకుతూ బోర్లు వేయిస్తున్నారు. కానీ గిరిజనులు గొంతు తడుపుకునేందుకు తాగునీటి కోసం బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. గతంలో మిషన్ భగీరథ పైపులైన్ అడవి మార్గం నుంచి వేసేందుకు అధికారులు నిరాకరించడంతో పైపులైన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో గొత్తికోయగూడేలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.ఏటూరునాగారం 8కన్నాయిగూడెం 6వాజేడు 3వెంకటాపురం(కె) 4ఎస్ఎస్తాడ్వాయి 8మంగపేట 7గోవిందరావుపేట 5ములుగు 2వెంకటాపురం(ఎం) 2 కిలోమీటర్ల మేర అడవిలో కాలినడకన ప్రయాణం వాగుల్లో చెలిమలు తోడి తెచ్చుకుంటున్న నీరు -
బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్
ములుగు రూరల్: బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ అని, బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు కుల దైవాల చరిత్రను భావితరాలకు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని దేవగిరిపట్నంలో సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి సేవాలాల్ మహరాజ్ ఆలయ పూజారి కిషన్ మహరాజ్ స్వామి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, స్థానిక సర్పంచ్ పూలమ్మ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ ఆదర్శప్రాయుడు గోవిందరావుపేట: సేవాలాల్ మహరాజ్ ఆదర్శప్రాయుడని, ఆయన చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలని టీఎస్టీఈఏ(తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు భూక్య సక్రునాయక్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గ్రామ సర్పంచ్ భూక్య సుమలత నివాసంలో ఎల్హెచ్పీఎస్, బంజారా రైతుమిత్ర సంఘం, బంజారా కుల పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహరాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంజారాలు సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతూ నీతి నిజాయతీతో ముందుకు సాగాలన్నారు. ఎల్హెచ్పీఎస్ మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసే నిధులు జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా మండలాల వారీగా కేటాయించాలని కోరారు. ప్రతీ బంజారా తండాలో జయంతిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్య సుమలత, జోగా, భద్రమ్మ, పీరమ్మ, మున్నా, రఘురామ్, దేవా తదితరులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
నేడు కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
● చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ములుగు: ములుగు మున్సిపాలిటీకి ఎన్నికై న కౌన్సిలర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20 వార్డులకు 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 స్వతంత్రులు గెలుపొందారు. సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12:30గంటలకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు ఎత్తే పద్ధతిలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ను ఎన్నుకోనున్నారు. చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.నేటి ప్రజావాణి రద్దు ములుగు: నేటి ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండడంతో పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నేడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి సందర్భంగా రామప్ప గార్డెన్లో గంగిశెట్టి సరస్వతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్ మహేందర్జీ ప్రారంభించారు. 15 ఏళ్లుగా ప్రతీ శివరాత్రికి రామప్పకు వచ్చే భక్తులకు ఉచిత మినరల్ వాటర్ను అందిస్తున్న గంగిశెట్టి శ్రీనివాస్ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామప్ప ఆలయ చైర్మన్ మిల్కూరి అయిలయ్య, ఈఓ శ్రీనివాస్, తహసీల్దార్ గిరిబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు పింగిలి నాగరాజు, చుంచు రమేష్, గొల్లపెల్లి రాజేందర్, మామిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు. రేగొండ: మండలంలోని కోటంచలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పున:ప్రతిష్ట మహోత్సవం, స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయన్నారు. స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. అనంతరం గడిపల్లి శివాలయంలో నిర్వహించిన శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, నాయకులు ఉమేష్ గౌడ్, భిక్షపతి, రవీందర్ రావు, శ్రీనివాస్, సాంబయ్య పాల్గొన్నారు. -
శంభో శంకరా..
వెంకటాపురం(ఎం): జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలు హరహర మహాదేవా.. శంభో శంకరా.. అంటూ శివనామస్మరణతో మార్మోగాయి. ఆదివారం ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణ వేడుకలను తిలకించారు. ములుగులోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఆలయ ఆవరణలోని నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. శివలింగం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు మారేడు చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ఛైర్మన్ మిల్కూరి అయిలయ్య, ఈఓ బిల్ల శ్రీనివాస్, ఆలయ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో సిబ్బంది కందగడ్డ, అరటిపండ్లను ప్రసాదంగా అందించారు. రామప్పలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో 546 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించినట్లు వైద్యాధికారి శ్రీకాంత్, డాక్టర్ రిషిత తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు డీఎస్పీ కిశోర్కుమార్, సీఐ సురేశ్, ఎస్సై చల్ల రాజు తెలిపారు. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు భక్తులతో కిటకిటలాడిన రామప్ప ఆలయం కనులపండువగా శివపార్వతుల కల్యాణం -
ఎలిశెట్టిపల్లి బ్రిడ్జిపై సర్వే
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందంతో పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఆదివారం గ్రామానికి వెళ్లేదారిలో సర్వే చేపట్టారు. చెల్పాక నుంచి ఎలిశెట్టిపల్లికి వెళ్లాలంటే జంపన్నవాగు దాటితేనే ఆ గ్రామానికి చేరుకునే పరిస్థితి ఉంది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఎలిశెట్టిపల్లి జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖ ద్వారా రూ. 21 కోట్లతో వాగుపై 200 మీటర్ల పొడవులో బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు డిజైన్ చేశారు. అయితే అక్కడ ఉన్న భూమి, పరిస్థితిని హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందంతో పాటు పీఆర్ డీఈ నరేశ్ క్షుణ్ణంగా పరిశీలించారు. గిరిజనుల డిమాండ్ మేరకు జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు డీపీఆర్ను చేపట్టారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం, ఉధృతి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జంపన్నవాగు ఉప్పొంగితే ఎలిశెట్టిపల్లి, కొత్తూరు, గిరిజనగూడేలకు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయేదని స్థానికులు ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణంపై సర్వే వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్న మంత్రి సీతక్కకు రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, వావిలాల ఎల్లయ్య, రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్, సర్పంచ్లు పలక మహాలక్ష్మీ, అట్టం రాంబాబు, దేవులపల్లి విజయ్కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డొంగిరి మధుబాబు, మాజీ సర్పంచ్ చింత సుమలత, రమేష్, హరీష్, కుదురుపాక శ్రీనివాస్, సత్యం, రాంబాబు, సారయ్య, చెన్నెం ఎల్లయ్య పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రొఫెసర్ శంకర్ బృందం, పంచాయతీరాజ్ అధికారుల పర్యటన రూ.21 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్ -
తీరని నష్టం..!
కొద్దితేడా.. ‘బల్దియా’ఎన్నికల్లో పోరాడి ఓడిన బీఆర్ఎస్బీఆర్ఎస్కాంగ్రెస్ 39.21 శాతం 41.82 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లులో రసవత్తరంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోరులో బీఆర్ఎస్కు కొద్ది తేడాతో తీరనినష్టం జరిగింది. అధికార పార్టీకి ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు అడ్వాంటేజ్గా ఉంటాయన్న చర్చ ఉన్నప్పటికీ.. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఓట్లను విశ్లేషిస్తే బీఆర్ఎస్ గట్టిపోటీనే ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో ఓటింగ్ సరళిని ఈ విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన కొన్నిచోట్ల ఓటుశాతం ఎక్కువగా ఉన్నా వార్డులను గెలిచేలా పనిచేయలేదు. అయితే తొర్రూరు మున్సిపాలిటీలో ఓటుశాతం తగ్గినా, వార్డులు పెరిగాయి. స్వల్ప వ్యత్యాసమే... ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ మొత్తానికి మొత్తం గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి ఒక్క స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,278 ఓట్లకు 2,62,283 ఓట్లే పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పోలైన ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం తేడా ఉండగా, ఈ తేడాలో 140 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంటే, బీఆర్ఎస్ 88లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా మెజార్టీ మున్సిపాలిటీలు చేజారిపోయాయి. చెదిరిన బీఆర్ఎస్ కంచుకోటలు... మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటలు చెదిరిపోయాయి. స్టేషన్న్ఘన్పూర్, నర్సంపేట, డోర్నకల్, భూపాలపల్లి తదితర మున్సిపాలిటీలలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఆయాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్లకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఈ మున్సిపాలిటీల్లో 10 నుంచి 14 శాతం వరకు బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరిపెడ, ములుగులలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు దరిదాపుల్లో లేకుండా పోయారు. నర్సంపేటలో 40,968 ఓట్లకు 34,908 కోట్లు పోల్ కాగా అందులో బీఆర్ఎస్కు 13,756 (39.39 శాతం) ఓట్లు వస్తే కాంగ్రెస్కు 17,358 (49.72 శాతం) ఓట్లు వచ్చాయి. స్టేషన్ఘన్పూర్లో కాంగ్రెస్కు 48.57 శాతం ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 31.39 శాతం, డోర్నకల్లో కాంగ్రెస్కు 49.19 శాతం, బీఆర్ఎస్కు 37,79 శాతమే వచ్చాయి. భూపాలపల్లిలో పోలైన 34,367 ఓట్లలో కాంగ్రెస్కు 14,638 (42.59 శాతం) ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 13,949 (40.59 శాతం), ములుగులో కాంగ్రెస్కు 44.53 శాతం వస్తే బీఆర్ఎస్కు 30.44 శాతమే ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య 2.61 శాతమే ఓట్లతేడా చాలాచోట్ల అధికంగా వచ్చినా ఆ మేరకు దక్కని సీట్లు పరకాల, నర్సంపేట, ములుగులలో దరిచేరనీయని హస్తం మున్సిపల్ ఎన్నికలపై నేతల పోస్టుమార్టం.. పార్టీలో సాగుతున్న అంతర్మథనం -
చైర్పర్సన్ ఎవరో?
● రేసులో స్వాతి, చంద్రకళ ● ఇరువురి మధ్య నెలకొన్న పోటీ ● 16న చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ములుగు: ములుగు మున్సిపాలిటీ తొలి పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకునేందుకు సన్నద్ధమైనప్పటికీ చైర్పర్సన్ పదవి ఎవరికి దక్కనుందో చూడాలి. ప్రధానంగా నల్లెల్ల స్వాతి, చింతనిప్పుల చంద్రకళ మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ విధేయుడిగా పేరొందిన మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి కోడలు స్వాతి పదవిని ఆశిస్తున్నారు. గత 20 ఏళ్లుగా పార్టీలో ఉంటూ సీతక్క అనుచురుడిగా గుర్తింపు పొందిన చింతనిప్పుల భిక్షపతి సతీమణి చంద్రకళ సైతం చైర్పర్సన్ రేసులో ఉండడంతో ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికను మంత్రి సీతక్కనే ఫైనల్ చేస్తుందని, సీతక్క మాటకు, పార్టీకి కట్టుబడి ఉన్నామ ని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు చెబుతున్నారు. క్యాంపునకు తరలివెళ్లిన కౌన్సిలర్లు ములుగు మున్పిపాలిటీ చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాతి, చంద్రకళతో పాటు మాజీ సర్పంచ్ బండారి నిర్మల, మాజీ ఉప సర్పంచ్ వంగ సుమలత కూడా ఆశించారు. మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల, సుమలత ఓటమి చెందడంతో స్వాతి, చంద్రకళ మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 12 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 16న చైర్పర్సన్, వైస్ చైర్మన్కు ఎన్నిక జరగనుంది. నల్లెల్ల స్వాతిచింతనిప్పుల చంద్రకళ -
ఎదుర్కోలు మహోత్సవం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శివాలయంలో శనివారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు. శివ పార్వతుల కల్యాణం ముందు రోజు ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అర్చకులు రాజ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడు, పార్వతి ఇరు పక్షాల గ్రామ పెద్దలు ఎదర్కోలు నిర్వహించి తాంబూలాలను ఇచ్చి పుచ్చుకున్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక ములుగు రూరల్: సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలు ఇటీవల జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో షాట్పుట్లో అండర్–16 విభాగంలో ఆకాంక్ష, రెజ్లింగ్ అండర్–14 విభాగంలో పూజిత, రెజ్లింగ్ అండర్–16 విభాగంలో రేష్మ, వాల్బాల్లో రిజ్వాన, శ్రీవేణి, కబడ్డీలో శ్రావ్య, 600 మీటర్ల పరుగు పందెంలో సన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ విద్యార్థినులు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. కాజీపేటలో రైల్వేట్రాక్ మరమ్మతు పనులు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో శనివారం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు రైల్వేట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. కాజీపేట రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాంలో రైల్వేట్రాక్ కాలపరిమితి పూర్తి అయ్యింది. ఆ స్థానంలో కొత్త రైల్వేట్రాక్ (ట్రాక్ రెల్ రిప్లస్) పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఒక రైలు పట్టా 13 మీటర్ల వరకు ఉండేదని, ప్రస్తుతం ఎలాంటి జాయింట్ లేకుండా 200 మీటర్ల వరకు రైలు పట్టా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక రైళ్ల వేగాన్ని తట్టుకునేందుకు ఈ ట్రాక్ వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల నుంచి ఇంజనీరింగ్ స్టాఫ్, యంత్రాలతో ట్రాక్ రెన్యువల్ పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. కంప్యూటర్ సైన్స్ బీఓఎస్గా రమేశ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. -
ధ్వంసమైన పుష్కరఘాట్ పరిశీలన
మంగపేట: మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలో గోదావరి ఒడ్డున 2015లో పుష్కరఘాట్ నిర్మించారు. గోదావరి వరదలకు ధ్వంసమైన ఈ ప్రాంతాన్ని ఇరిగేషన్ ఈఈ శంకరయ్య రెవెన్యూ పంచాయతీ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 జూన్లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. 2015లో పుష్కరాల సందర్భంగా రూ.5.64 కోట్లతో 170 మీటర్ల మేర నిర్మించిన పుష్కరఘాట్ను పరిశీలించినట్లు తెలిపారు. మండలంలో 2027 జూన్లో జరిగే పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ఈ నెల 18న ఉన్నతాధికారులు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించేందుకు మండలానికి రానున్నట్లు వివరించారు. ముందస్తుగా అనుకూలమైన స్థలాన్ని గుర్తించేందుకు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరి కరకట్ట నిర్మాణం జరుగుతున్నా దొంగల ఒర్రె ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రవికుమార్, ఏఈ వలీమ్మహ్మద్, జీపీఓ రాములు, నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా..
మున్సిపాలిటీ మొత్తం పోలైనవి బీఆర్ఎస్ శాతం కాంగ్రెస్ శాతం బీజేపీ శాతం స్వతంత్రులు/ శాతం ఇతరులు పరకాల 26,818 21,533 8,467 39.32 8,267 38.39 3735 17.35 1,064 4.71 నర్సంపేట 40,968 34,908 13,753 39.39 17,358 49.72 1645 4.71 2,152 6.16 వర్ధన్నపేట 10,526 9,077 3,978 43.82 3,709 40.86 740 8.15 650 7.16 జనగామ 44,045 34,821 13,341 38.31 12,057 34.63 2416 6.94 7007 20.12 స్టేషన్ఘన్పూర్ 18,550 15,670 4,919 31.39 7612 48.57 728 4.64 2411 15.38 మహబూబాబాద్ 65,712 49,681 18,483 37.20 17070 34.36 1,270 2.56 12,858 25.88 తొర్రూరు 21,451 16,611 7,718 46.46 7,992 48.11 713 4.29 188 1.31 మరిపెడ 13,687 11,738 4,723 40.24 5,449 46.42 198 1.69 1,368 11.65 డోర్నకల్ 10,869 8,900 3,363 37.79 4,378 49.19 251 2.82 908 8.18 కేసముద్రం 15,963 13,750 6,743 48.97 6,149 44.65 436 3.16 422 2.92 భూపాలపల్లి 52,726 34,367 13,949 40.59 14,638 42.59 2789 8.11 2,991 8.70 ములుగు 13,963 11,227 3,418 30.44 4999 44.53 1669 14.86 1,141 8.99 -
ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఇసుక లారీ
● ఆరుగురికి గాయాలు ఏటూరునాగారం: ఓ ట్రాక్టర్ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడగా ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మండల పరిధిలోని రొయ్యూర్ సమీపంలో గల 163వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మిర్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీలోని నలుగురు, ఇంజిన్పై కూర్చున్న ఇద్దరు ఎగిరిపడ్డారు. ఏటూరునాగారానికి చెందిన కూలీలు ట్రాక్టర్ యజమాని పూజారి బుచ్చయ్యతో కలిసి మిర్చి తోట నుంచి ఏటూరునాగారం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఆరుగురిని 108లో సామాజిక ఆస్పత్రికి తరలింలించారు. క్షతగాత్రులు గాయాలతో బయపడినట్లు వైద్యులు తెలిపారు. ఢీ కొట్టిన లారీ వివరాలపై స్థానికులు ఆరా తీస్తున్నారు.


