breaking news
Mulugu District News
-
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఎస్ఎస్తాడ్వాయి/వెంకటాపురం(కె): ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ శనివారం తాడ్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లయ్య, తాడ్వాయి సర్పంచ్ గంట ప్రవళికల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహరదారిపై నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లక్ష్మణ్బాబు, నాగజ్యోతి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు పలు హామీలు ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే వంటావార్పు వంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, జిల్లా నాయకుడు భూక్య జంపన్న, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దిడ్డి మోహన్రావు, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ శైలజ, మేడారం జాతర మాజీ చైర్మన్ రేగ నర్సయ్య, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నాయకుల బైక్ ర్యాలీ అదే విధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్బాబు హాజరై బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులను అనేక హామీలిచ్చి అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడవర్తి నర్సింహామూర్తి, గంపా రాంబాబు, రామకృష్ణ కృష్ణారెడ్డి, ముడుంబా శ్రీనివాస్, కాకులమర్రి ప్రదీప్రావు, సర్పంచ్లు రమ్య, ఆదిలక్ష్మి, మురళి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ నాగజ్యోతి వెయ్యి రోజుల పాలనకు నిరసనగా వంటావార్పు, బైక్ ర్యాలీ -
భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. పూజారులు పవన్కుమార్, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్ రామనుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. -
అరచేతిలో సమగ్ర సమాచారం
జిల్లా జనాభా 2,94,671రెవెన్యూ మండలాలు 10గ్రామ పంచాయతీలు 174మున్సిపాలిటీలు 1ఏటూరునాగారం: చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకోవడంతో పాటు.. ఇతర అంశాలపై సమాచారం కావాలన్నా గ్రామ పంచాయతీ పరిధిలోని వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక క్లిక్తో అరచేతిలో జీపీల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్లోనే అన్నీ.. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు గ్రామ పంచాయతీలకు ఈ ఏడాది నుంచే ఫైండ్ యువర్ జీపీ వెబ్సైట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. రెండు నెలల క్రితం ఈ వెబ్సైట్ను ప్రారంభించి.. గత నెల 21 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్)లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పోర్టల్తో పాటు వెబ్సైట్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా, మండలం, గ్రామం పేరును ఎంచుకొని ఆయా పంచాయతీల వివరాలను చూసే విధంగా తీర్చిదిద్దారు. ఫైండ్ యువర్ జీపీలో వివరాలు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. గ్రామ పంచాయతీకి కేటాయించిన లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ(ఎల్జీడీ) కోడ్ నంబర్ నుంచి పలు అంశాలను పొందవచ్చు. గ్రామ ప్రస్తుత జనాభా, వైశాల్యం, గృహాలు, శివారు గ్రామాలు, వార్డు సంఖ్యను పొందుపర్చారు. గ్రామ ముఖ్య చరిత్రతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను నమోదు చేశారు. ప్రధాన కూడళ్లు, ఎస్హెచ్జీ మహిళా వివరాలు, రేషన్న్ కార్డులు, ఆధార్ కార్డులు, ఆలయాలు అన్ని రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల వారీగా అభివృద్ధి వివరాలు, నిధుల అంచనాను పొందవచ్చు. గ్రామ పంచాయతీ భవనం, గదుల సంఖ్య, రహదారులు, వ్యవసాయ ఆధారిత వనరులు(చెరువులు, కుంటలు), మిషన్ భగీరథ కుళాయిలు, పైపులైన్, పార్కులు, చెత్త సేకరణ వాహనాలు, పాఠశాలల వివరాలను వీక్షించవచ్చు. మీ గ్రామ సమాచారాన్ని వీక్షించాలంటే ఫైండ్ యువర్ గ్రామ పంచాయతీ అంటూ కింద వివరాలను పొందుపర్చారు.జిల్లాలోని జనాభా.. గ్రామాలు అందుబాటులోకి ఫైండ్ యువర్ జీపీ వెబ్సైట్ ఆన్లైన్లో 171 పంచాయతీల వివరాలు విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా పోర్టల్ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రాలుమేడారం – సమ్మక్క–సారలమ్మ రామప్ప – రామలింగేశ్వరస్వామి హేమాచలక్షేత్రం – లక్ష్మీనర్సింహస్వామి లక్నవరం సరస్సు రామప్ప సరస్సు బొగత జలపాతం -
జపాన్కు హెడ్మాస్టర్ మల్లయ్య
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాంలో భాగంగా జపాన్ దేశంలో విద్యావ్యవస్థను అధ్యయనం చేయడానికి మండల పరిధిలోని రామన్నగూడెం జెడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ కొయ్యడ మల్లయ్య నేడు జపాన్కు బయలుదేరి వెళ్లనున్నారు. నేటి నుంచి 12వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించి అక్కడ పాఠశాల విద్యా వ్యవస్థను పరిశీలించి, పరిశోధన చేసి రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది సభ్యుల బృందంతో జపాన్ బయలుదేరుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా నుంచి రామన్నగూడెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొయ్యడ మల్లయ్య ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్నికోలస్, అసిస్టెంట్ డైరెక్టర్ లింగయ్య, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్, ఎస్సీఈఆర్టీ హైదరాబాద్లో ఈనెల 2వ తేదీన వీరందరికీ వీసాలు అందజేశారు. ఈ క్రమంలో జపాన్ వెళ్తున్న మల్లయ్యకు డీఈఓ సిద్ధార్థరెడ్డి అభినందనలు తెలిపారు. రామప్పలో జియోలాజికల్ అధికారులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీవీ ముఘల్, డిప్యూటీ డైరెక్టర్ శేషాసాయిలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. వారి వెంట జీఎస్ఐ అధికారులు, సిబ్బంది, ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, శ్రీకాంత్, భద్రు ఉన్నారు. పౌష్టికాహారం అందించాలి గణపురం: గర్భిణులు, బాలింతలకు ప్రతీ రోజు సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి ముధుసూదన్ అన్నారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించిన పౌషకాహార వారోత్సవాల్లో ఆయన పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ గర్భదారణ సమయంలో పౌషకాహారం తీసుకోవడం వలన తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఐటీఐ ప్రవేశాలకు చివరి అవకాశం భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 7వ తేదీతో చివరి గడువు ముగియనున్నట్లు స్థానిక ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జూమ్లానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాక్ ఇన్ అడ్మిషన్ పద్ధతిలో తక్షణ అడ్మిషన్ కల్పిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను మూడో విడత భర్తీచేయనున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని కళాశాలలో అడ్మిషన్కు హాజరుకావాలని సూచించారు. నిర్మాణ పనుల పరిశీలన కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం ఆలయ నిర్మాణ పనులను ఈఓ మహేశ్, క్షేత్ర కన్సల్టెన్సీ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, పాలవవర్గం డైరెక్టర్ మంచినీళ్లు దుర్గయ్య, దొడ్ల అశోక్ శనివారం పరిశీలించారు. -
ఐటీడీఏల ముట్టడిని విజయవంతం చేయాలి
వాజేడు: ఆదివాసీల ఉద్యోగాల కల్ప నకు చేపట్టిన రాష్ట్రంలోని ఐటీడీఏల ముట్టడిని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పలు ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన కొమరంభీమ్ విగ్రహానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పి ంచారు. అనంతరం ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లుగా లంబాడాలు ఆదివాసీల హక్కులను పొందుతున్నారన్నారు. ఉద్యోగాలు, నిధులు నియామకాలలో నిత్యం ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కులను కాపాడుకోవడానికి రేపు(సోమవారం) ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా 16న ఊట్నూరు, 21న భద్రాచలం, 28న మన్ననూరు ఐటీడీఏల ముట్టడి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి కోటేశ్వర్లు, జానకి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జీఎస్పీ మండల అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ములుగు: సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ ఇటీవల పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి ఉపాధ్యాయుల కృషే కారణమన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందించారు. రానున్న రోజుల్లో విద్యారంగంలో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన ప్రశంసపత్రాలు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
ఢీ అంటే ఢీ
భూపాలపల్లి: జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఒకే చౌరస్తాలో దాదాపుగా ఒకే సమయంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు నినాదాలు చేసుకుంటూ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపడంతో ఇబ్బంది తలెత్తలేదు. కాసేపు హై టెన్షన్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వేయి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్థానిక నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్కు చేరుకున్నాక ఎమ్మెల్యే.. విలేకరులతో మాట్లాడారు. అప్పటికే సినిమా థియేటర్లో వేచి ఉన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అదే సమయంలో సెంటర్కు చేరుకున్నారు. విషయాన్ని గమనించిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను కాసేపు ఆపారు. ఇరుపార్టీల నాయకుల మధ్య అడ్డుగా నిలిచారు. అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నినాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడటం పూర్తయ్యాక వెళ్లిపోయారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించాక అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. శనివారం జిల్లాకేంద్రంలో ఇరు పార్టీల కార్యక్రమాలు ఉండటంతో పోలీసులు ముందే భారీఎత్తున అక్కడకు చేరుకున్నారు. -
సాగు పద్ధతులపై రైతులకు అవగాహన
మంగపేట : మండల పరిధిలోని కమలాపురం, బోరునర్సాపురంలో తెలంగాణ రైతు విజ్ఞానకేంద్రం(ఈఆర్వీకే) శాస్త్రవేత్తలు వెంకన్న, విశ్వతేజ ప్రశాంత్ రైతులకు పంటల సాగు పద్ధతులు, డ్రోన్ల వినియోగం, ఎరువుల వాడకంపై శనివారం అవగాహన కల్పించారు. మండల ఇన్చార్జ్ ఏఓ మహేశ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న వరి, ఇతర పంటలను శాస్త్రవేత్తల బృందం ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. వరి, ఇతర ప్రధాన పంటల్లో వచ్చే తెగుళ్లు, పురుగులను గుర్తించారు. తగిన సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎం) ఆధ్వర్యంలో పంటలలో నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల ప్రాముఖ్యతపై ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించారు. వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యతపై డెమో నిర్వహించి అవగాహన కల్పించారు. కమలాపురంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ వరి రకాలను ఉత్పత్తి చేస్తున్న రైతు రాజేశ్వర్రావు ఆర్గానిక్ ఫామ్ను సందర్శించారు. రైతులు రాజేశ్వర్రావును ఆదర్శంగా తీసుకుని పంటలు పండించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అగ్రికల్చర్ ఆర్డబ్ల్యూఈపీ విద్యార్థులు రోషన్, సౌమిత్ సర్కార్, భానుప్రసాద్, గణేశ్, ఏఈఓ మహేశ్, భావన, గాయత్రి, రైతులు నవీన్రెడ్డి, శ్రీనివాస్, రవి, హన్మంతరావు, శ్రీను, యాదగిరి, సమ్మిరెడ్డి, కనకం, సురేశ్ పాల్గొన్నారు. -
కాళేశ్వరం దేవస్థానం నిర్మాణాల వేగిరం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణలో భాగంగా విజయగణపతి ఆలయం నైరుతి మూలన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.198కోట్లతో ఆలయ నిర్మాణాలు చేపట్టారు. శుక్రవారం స్టోన్తో బేస్మెంట్ 12ఫీట్ల నుంచి నిర్మాణం చేపట్టారు. వెనుకాల ప్రాకారం నిర్మిస్తున్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఘనంగా అభిషేకం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారికి వైభవంగా అభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ప్రతీ శుక్రవారం అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సంపత్రావు, సర్పంచ్ మొగిళి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆట’ ఆరంభం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణిలు పట్టు బిగిస్తుండటం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది. కాంగ్రెస్లోనే.. సురేఖ స్పష్టత.. పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? స్థానికంగా తన వర్గాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పెరుగుతున్న వ్యతిరేక స్వరం వరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని బసవరాజు సారయ్య సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కటవుతున్న ‘కొండా’ వ్యతిరేక వర్గీయులు సైలెంట్ మోడ్లో సురేఖ అనుచరవర్గం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోనని స్పష్టత ‘తూర్పు’ రాజకీయాల్లో వేగం పెరిగిన పరిణామాలు కొండా దంపతుల భవిష్యత్ వ్యూహం ఏమిటి?‘కొండా’ అనుచరవర్గంలో మౌనం తాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవిష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలుస్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. దీంతోపాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దష్టికి తీసుకెళ్లడమా? వరంగల్ తూర్పులో తన కేడర్ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది. -
నడక నేర్పే నాన్న.. నడవడిక నేర్పే చదువు.. పలుకు నేర్పే అమ్మ. పలుకుబడినిచ్చే సమాజం. అజ్ఞానంనుంచి అందరూ కీర్తించేలా మార్చే దిక్సూచి.. నాలుగు గోడల నడుమ భవిష్యత్ను తీర్చిదిద్దే నిర్మాత.. చాక్పీస్ ముక్కలతో తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ.. అన్నీ ఉపాధ్యాయుడే. ఉమ
విద్యార్థులతో ప్రయోగం చేయిస్తున్న ఉపాధ్యాయుడు రామ సంతోశ్ కుమార్ విద్యార్థులు తయారు చేసిన కృత్యాధార చిత్రాలతో ఉపాధ్యాయుడు రవి కృత్యాధార బోధన.. సామర్థ్యాల సాధనమహబూబాబాద్ రూరల్: విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పాఠ్యాంశంలోని విషయాలను అర్థం చేసుకుని సామర్థ్యాలను సాధించేలా విద్యా బోధన చేస్తున్నారు మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవునూరి రవి. 14 ఏళ్లుగా ప్రయోగాత్మక కృత్యాధార బోధన చేస్తున్నారు. కృత్యాధార బోధనతో విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఇష్టం పెంచుతున్నారు. నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం జెడ్పీఎస్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రామ సంతోశ్ కుమార్ బోధనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఆయన నిత్యం ఉదయం 5 గంటలకే జూమ్ తరగతులు నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 50 పాఠ్యంశాల వీడియోలు అప్లోడ్ చేశారు. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్, సైన్స్ఫేర్ గైడ్ టీచర్గా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలతో అతిథి ఉపన్యాసాలు నిర్వహించారు. ఎన్సీఈఆర్టీ నిర్వహించే ఆన్లైన్ పోర్టల్ కోసం ఈ–కంటెంట్ రూపొందించి 40కి పైగా వీడియోలు అందించారు. మన టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాఠ్యాంశాలు బోధించారు.ఏటూరునాగారం: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్కు చెందిన పోతు రాజశేఖర్ ఏటూరునాగారం నార్త్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆ పాఠశాలలో చేరినప్పుడు విద్యార్థుల సంఖ్య 90 మాత్రమే. ప్రస్తుతం 170 మందికి చేరింది. దాతల సహకారంతో పాఠశాలలో నూతనంగా కంప్యూటర్ ల్యాబ్, రేకుల షెడ్డు, ప్రొజెక్టర్, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తక పఠనంపై మక్కువ పెంచుతున్నారు. ఇప్పటికీ ఏ విద్యార్థి బడికి రాకపోయినా ఇంటికి వెళ్లి బండిమీద పాఠశాలకు తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు ఉపాధ్యాయుల అంకితభావం విద్యార్థుల నమోదు పెంపు.. అకుంఠిత దీక్షతో విధులు ఆదర్శంగా నిలుస్తూ బడులను కాపాడుతున్న టీచర్లు నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
● టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో ప్రదానం ములుగు: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినో త్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(టీఆర్ఎస్ఎంఏ) జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదా నోత్సవం ఇంచర్లలోని బ్రాహ్మణి విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ఎంఏ జిల్లా అధ్యక్షుడు పోశాల వీరమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని 23 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 46 మంది ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ఎంఏ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగరి శ్రీనివాసరావు, ట్రెజరర్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ఉత్తమ పాఠశాలగా ఎంపిక ఎస్ఎస్తాడ్వాయి: మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ.. ఆటపాటల్లోనూ తమ ప్రతిభను చాటుతున్న ఊరట్టం గిరిజన బాలికల పాఠశాల జిల్లాస్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఉత్తమ పాఠశాలగా ఊరట్టం పాఠశాలకు ఈ గుర్తింపు దక్కింది. గురువారం మంత్రి సీతక్క చేతుల మీదుగా హెచ్ఎం శ్రీనివాస్ అవార్డును స్వీకరించారు. పోడుకొట్టేందుకు ఛత్తీస్గఢ్ గిరిజనుల యత్నం వెంకటాపురం(కె): మండల పరిధిలోని సుడిబాక గ్రామ సమీపంలోని పిట్ట తోగు సమీపంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా గ్రామానికి చెందిన గిరిజనులు శుక్రవారం పోడు కొట్టి గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా గ్రామానికి చెందిన 35 మంది గిరిజనులు పిట్టతోగు సమీపంలో అటవీలో పోడు కొట్టి గుడిసెలు వేసుకునేందుకు యత్నించారని తెలిసి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారరు. గిరిజనులను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పీఎస్లో గిరిజనులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కాగా సుక్మాకు చెందిన గిరిజనులు గతంలో రెండు సార్లు కూడా ఇదే ప్రాంతంలో పోడు కొట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకుని పంపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కృష్ణాలంకరణలో భద్రకాళి అమ్మవారు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్వేత అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారికి కృష్ణాలంకారం జరిపారు. అనంతరం రాత్రి 10గంటల నుం– భక్తులను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజాము వరకు భక్తులు జాగరణ చేశారు. -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
వెంకటాపురం(కె): పంటల సాగు వివరాలు పక్కాగా లెక్కగట్టేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ చివరి వరకు సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది. కాగా జిల్లా పరిధిలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున జిల్లా వ్యాప్తంగా 269 మందిని నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పంటల వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సెల్ ఫోన్ యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 1.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా.. వలంటీర్లు వివరాల నమోదులో బిజీగా మారారు. 269 మంది వలంటీర్లు జిల్లాలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక్కరు చొప్పున 269 మంది వలంటీర్లను నియమించారు. ములుగు మండలంలో 16 మంది, మల్లంపల్లిలో 2, గోవిందరావు పేటలో 11 మంది, తాడ్వాయిలో 46 మంది, ఏటూరునాగారంలో 26 మంది, మంగపేటలో 22, వెంకటాపురం(ఎం) 9 మంది, కన్నాయిగూడెంలో 23 మంది, వాజేడులో 57 మంది, వెంకటాపురం(కె)లో 57 మంది వలంటీర్లను నియమించారు. కాగా వారు తమకు కేటాయించిన గ్రామాలో గత ఐదు రోజులుగా సర్వే చేస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో శిక్షణ యాప్ వినియోగం, పంటల సాగు నమోదు విషయాలపై వలంటీర్లకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. వలంటీర్లు గ్రామాల్లో సర్వే చేసి ప్రభుత్వం నిర్దేశించిన 45 రోజుల్లో తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ప్రతీరోజు యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 269 మంది వలంటీర్ల నియామకం ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒకరు పంట విస్తీర్ణం నమోదు జిల్లాలో 1.45 లక్షల ఎకరాల సాగు -
అవినీతికి కేరాఫ్.. కాంగ్రెస్ ప్రభుత్వం
ఏటూరునాగారం: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓడవాడ నుంచి వైజంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వంటావార్పు, మహిళలతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, నాయకులు పోరిక గోవింద్ నాయక్, కృష్ణ, జంపన్న, సునీల్ కుమార్, శ్రీలత, ఖాజా పాషా, సర్దార్ పాషా, ప్రదీప్ రావు, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, విజయ నాగరాజు, పద్మ, స్వరూప, సరితశ్రీనివాస్, రామ్మూర్తి, రామయ్య, రవీందర్, రఘు, చంద్రబాబు పాల్గొన్నారు. ఫ్లెక్సీలను చింపడం సరికాదు వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను పోలీసులు చించివేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఆరోపించారు. శుక్రవారం పోలీసులు, లక్ష్మీనర్సింహరావు మధ్య వాగ్వాదం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు -
ఖమ్మం డిపో బస్సులపై ఆర్ఎం ఆరా
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బ స్టాండ్కు ఖమ్మం రీజియన్ నుంచి వచ్చే ఆర్టీసీ షటిల్ బస్సుల కండక్టర్, డ్రైవర్ల పనితీరును ఖమ్మం ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సరిరామ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగూడెం బస్సు డ్రైవర్, కండక్టర్తో మాట్లాడి ఎస్ఆర్ను పరిశీలించారు. బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారని తెలుసుకున్నారు. టికెట్లు నిబంధనల ప్రకారం అందించాలని, హెచ్చుతగ్గులు లేకుండా సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో ఆపరేషన్ మేనేజర్ మల్లయ్యతో పాటు ఏటూరునాగారం కంట్రోలర్ శంకర్ పాల్గొన్నారు. ‘అంగన్వాడీ పోస్టులన్నీ భర్తీ చేయాలి’ ములుగు: ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం డీడబ్ల్యూఓ ప్రేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, అంగన్వాడీ యూని యన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క మాట్లాడుతూ ఏజెన్సీ పోస్టులు భర్తీ కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త గ్యాస్ కనెక్షన్లతో పాటు వంట పాత్రలు, ఫ్యాన్లు అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న గ్యాస్, ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మరాణి, భాగ్యలక్ష్మి, సరిత, నాగలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ధర్నా ములుగు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం అమానుషమన్నారు. దాడులతో బీజేపీని భయపెట్టలేరని, దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా కృష్ణవేణి నాయక్, భూక్యా జవహర్ లాల్, నాయకులు గుగులోత్ స్వరూప, జినుకల కృష్ణాకర్ రావు, అల్లె శోభన్, నగరపు రమేశ్, కొర్ర సుమలత, జనార్దన్, గాదం కుమార్, ఎల్కతుర్తి శ్రీహరి పాల్గొన్నారు. సమష్టి కృషితో లక్ష్యాన్ని చేరుకోవాలి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నిర్దేశిత లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆగస్టు నెల ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించిన ఆయన.. సెప్టెంబర్ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆగస్టులో ఏరియాకు 3.73 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం ఉండగా 1.60 లక్షల టన్నులు సాధించినట్లు తెలిపారు. లక్ష్యంలో 43 శాతం సాధించి రవాణా చేసినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 5,157 టన్నులుగా నమోదైందన్నారు. సెప్టెంబర్ నెలకు 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉత్పత్తి పెంపునకు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఆదేశించారు. -
సమస్యల తిష్ట
ములుగు పట్టణాన్ని పీడిస్తున్న డ్రెయినేజీ సమస్య ● ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు ● ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు● రామప్ప చెరువులో చేరుతున్న మురుగునీరు ● పైపులైన్ లీకేజీలతో తాగునీటి సమస్య డ్రెయినేజీలో నిలిచిన మురుగునీరుఅంతర్గత రహదారులు ఆధ్వానం పట్టణంలో అంతర్గత రహదారులు ఆధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంతలతో దర్శనమిస్తున్నాయి. కల్వర్టులు సైతం ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్న రహదారులు ఇరుకుగా ఉండడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని రహదారులు 15 ఫీట్లు ఉండడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేకపోతుండడంతో వాహనదారుల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంటుంది. విస్తరించేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులు కలిసి మరో 5 ఫీట్లు దారికి ఇవ్వాలని అడిగితే ససేమిరా ఇవ్వమని అంటుండడంతో అంతర్గత రోడ్ల విస్తరణ ఇబ్బందిగా మారింది.మురుగునీరంతా రామప్ప చెరువులోకి.. పట్టణానికి చెందిన మురుగునీరంతా బండారుపల్లి చెరువు ద్వారా రామప్ప సరస్సులోకి వెళ్తోంది. పట్టణంలో డ్రెయినేజీ సిస్టం సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయి. వర్షపునీటితో మురుగునీరంతా రామప్ప చెరువులోకి వెళ్తుండడంతో రామప్ప సరస్సు నీరు కలుషితమవుతుంది. జిల్లాలోని 4 మండలాల పరిధిలో గల 175 శివారు గ్రామాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందిస్తున్న రామప్ప సరస్సులోకి ములుగు పట్టణం మురుగునీరంతా చేరి తాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రామప్ప సరస్సులోకి మురుగునీరు వెళ్లకుండా అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుసుకోవాల్సిన అవసరం ఉంది. 5,540 నల్లా కనెక్షన్లు మున్సిపాలిటీ పరిధిలో చాలా కాలనీల్లో పైపులైన్ లీకేజీల కారణంగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు పట్టణంలో 14 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా 110కిలో మీటర్ల మేర పైపులైన్ విస్తీర్ణం ఉంది. 5,540 నల్లా కనెక్షన్లు ఉండగా నల్లానీరు సరిగా రావడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన పైపులైన్ కావడంతో తరచూ లీకేజీలు అవుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని పలుచోట్ల ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు చెత్తాచెదారం పడేస్తుండడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 20 వార్డుల పరిధిలో 17,580 మంది జనాభా 13,963 మంది ఓటర్లు ఉన్నారు. 1985లో పంచాయతీగా ఆవిర్భవించిన ములుగు 17 ఫిబ్రవరి 2019న జిల్లాగా ఏర్పాటైంది. ములుగు పట్టణాన్ని 5 ఏప్రిల్ 2025న మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గత ఎనిమిది నెలల క్రితం తొలిసారిగా ములుగు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గం ఏర్పాటైనా నిధుల కొరతతో సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ఓరుగల్లులో హీటెక్కిన రాజకీయాలు
సురేఖకు ఢిల్లీ పిలుపు రావడంతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు. సురేఖకు ఏం జరుగుతుంది? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మంత్రి పదవిలో కొనసాగుతారా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. కొండా కుటుంబానికి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధిష్టానం తీసుకునే నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ నుంచి వెలువడే నిర్ణయంతోనే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది. -
అర్హులందరికీ స్మార్ట్ రేషన్కార్డులు
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు: అర్హులైన పేదలందరికీ స్మార్ట్ రేషన్కార్డులు అందుతాయని, వారి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క ములుగు, మల్లంపల్లి మండలాల లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. ములుగు మండలానికి 1,809, మల్లంపల్లి మండలానికి 621 స్మార్ట్ రేషన్కార్డులు మంజూరు కాగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రేషన్ కార్డులు లేని కారణంగా అర్హులైన పేదలు సన్నబియ్యం పథకానికి దూరం కావద్దనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నూతన కార్డులను మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ సంవత్సరంలో 12,802 మందికి నూతన రేషన్ కార్డుల ద్వారా 36,405 మంది కుటుంబ సభ్యులకు సన్నబియ్యం పథకం ప్రయోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్లో సన్నబియ్యం కొనుగోలు చేయడం పేద కుటుంబాలకు భారంగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందించడంతో ఆ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గిందన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పింఛన్ల దరఖాస్తుల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించినట్లు వెల్లడించారు. ములుగు నియోజకవర్గానికి ఇప్పటివరకు 5 వేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు. ఇంకా అనేక పేద కుటుంబాలకు ఇళ్ల అవసరం ఉందని తెలిపారు. సర్వేలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలు ములుగులో అధికంగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. రెండో విడతలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, డీసీఎస్ఓ ఫైజల్ హుస్సేని, డీఎం కృష్ణవేణి, తహసీల్దార్లు, ప్రజలు పాల్గొన్నారు. భువన్ సర్వే పరిశీలన ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న భువన్ సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జె.సంపత్ క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. సర్వే సిబ్బందితో మాట్లాడి పట్టణంలోని ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న భవనాలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని బిల్ కలెక్టర్లు పరిశీలించాలన్నారు. అనుమతులు లేని నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే పట్టణంలోని వ్యాపార సంస్థలను సందర్శించి ట్రేడ్ లైస్సెన్స్ పరిశీలించారు. ప్రతీ వ్యాపారీకి తప్పనిసరిగా ఉండాలన్నారు. లేదంటే చర్యలు తప్పవన్నారు. -
నల్లబ్యాడ్జీలతో నిరసన
ములుగు: పెన్షన్ విద్రోహదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా చైర్మన్ పోలురాజు నేతృత్వంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్జీకి వినతిపత్రం అందజేశారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవికాంత్, డిప్యూటీ కన్వీనర్ చైతన్య, డీటీఎఫ్ ఆదిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ సమ్మారావు, ఉదయ్ కుమార్ రెడ్డి, టీఎన్జీవోస్ కోశాధికారి కుమారస్వామి, ఎస్టీయూ నాయకులు మధుసూదన్, అహ్మద్, కో–చైర్మన్ యశ్వంత్, హెచ్డబ్ల్యూఓల అధ్యక్షురాలు సరిత, ఇరిగేషన్ ఫోరం అధ్యక్షుడు ప్రదీప్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల రవి, జిల్లా కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పాలనలో మోసపోయిన ప్రజలు
● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ములుగు: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక హామీలిచ్చి అమలు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని, పేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చి అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి, మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల హామీలను సైతం బీఆర్ఎస్ నెరవేర్చలేదని ఆరోపించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అశోక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ చిటమట రఘు, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, రవాణా శాఖ స్టేట్ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
డ్రెయినేజీ నిర్మించి సీసీ రోడ్లు వేయాలి
డ్రెయినేజీలు నిర్మించిన తర్వాత సీసీ రోడ్లు వేయాలి. పట్టణంలో నూతనంగా సీసీ రోడ్లు వేస్తుండడంతో డ్రెయినేజీల్లో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పట్టణంలోని అంతర్గత రహదారులను విస్తరించి సీసీ రోడ్లు నిర్మించాలి. ఇరుకై న రహదారులతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కొరతను నివారించేందుకు అదనంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నూతనంగా నిర్మించాలి. – భూక్య జవహర్లాల్, 20వ వార్డుపట్టణంలో ప్రధానంగా డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పట్టణానికి చెందిన మురుగునీరంతా బండారుపల్లి చెరువులోకి చేరి అక్కడి నుంచి రామప్ప సరస్సులోకి వెళ్తోంది. మురుగునీటిి యంత్రాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తే ఆ నీటిని పొలాలకు తరలించి సాగునీటిగా వాడుకోవచ్చు. మున్సిపాలిటీ పరిధిలో 130 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నప్పటికీ తక్కువ వేతనం కారణంగా సుమారు 80 మంది మాత్రమే విధులకు హాజరవుతుండడంతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్య నెలకొంటుంది. – గండ్రకోట వాణికుమార్, 9వ వార్డు కౌన్సిలర్ -
విద్యార్థుల భవిష్యత్కు భరోసా
గోవిందరావుపేట: విద్యార్థుల భవిష్యత్కు విద్యాశాఖ భరోసా కల్పిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సమ్మిళిత విద్యపై ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మండలంలో భవిత కేంద్రాలతో పాటు ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పిల్లల్లోని వైకల్యాలను గుర్తించేందుకు వారి సేవలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సాంబయ్య మాట్లాడారు. ఈ నెల 8న మరోసారి ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు సైకం శ్రీనివాసరెడ్డి, బి.శ్యాంసుందర్రెడ్డి, ఉల్లాస్ కోఆర్డినేటర్ పీర్ల కృష్ణబాబు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి -
భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, అధికారులు బాధ్యతాయుతంగా సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో మంగళవారం భూ రీసర్వే, భూభారతి, తదితర రెవెన్యూ అంశాలపై ఐడీఓసీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీసర్వే పనులను ప్రణాళికతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తూ, కొలతలు, భూ వివరాల నమోదులో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రామచంద్రపురం గ్రామంలో రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రైతులకు శాశ్వత భూ హక్కులు కల్పించేందుకు రూపొందించిన పట్టా పాస్పుస్తకాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సంబంధిత రికార్డులు, రైతుల వివరాలను పరిశీలించి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. భూ భారతి, సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
కాంగ్రెస్ది అసమర్థ పాలన
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావుములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్రావుల పిలుపు మేరకు కాంగ్రెస్ అసమర్థ పాలనను ఎండగడుతూ ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఆడబిడ్డలకు రూ.660 కోట్లు బాకీ ఉన్నారని, మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ములుగులోని 80 వేల మంది మహిళలకు రూ.660 కోట్లు బాకీ పడ్డారని వివరించారు. ఉచిత బస్సు పేరుతో వరంగల్, ములుగు, ఏటూరునాగారం, భద్రాచలం రూట్లలో బస్సులు తగ్గించి చార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. ఏజెన్సీలో పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే వారం రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గోవిందనాయక్, మల్లారెడ్డి, కృష్ణ, జంపన్న, మాజీ ఎంపీపీ వినయ్ కుమార్, మల్కా రమేశ్, తాడూరి రఘు, డయ్య అశోక్, రమేష్ రెడ్డి, రమణారెడ్డి, నరసింహ నాయక్, విజయ్, ఎండి ఖాజా పాషా పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల కష్టాలు
గోవిందరావుపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలు కష్టాలు పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కాకులమర్రి లక్ష్మణ్బాబు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఆరోపించారు. రైతు సమస్యలు, సాగునీరు, విద్యుత్, యూరియా కొరత, రైతు బీమా, రుణమాఫీ తదితర అంశాలపై గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుభరోసా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎడ్లబండిపై ప్రారంభమైన ర్యాలీ పీఎస్ఆర్ గార్డెన్ వరకు కొనసాగింది. అనంతరం వారు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. మండలంలో లక్నవరం సరస్సు ఉన్నప్పటికీ రైతులు పంటలు సాగు చేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు. 2024లో వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్ట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లు వంటి పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్నాయక్, జంపన్న, వినయ్, పృథ్వీరాజ్, రవీందర్, రఘు, కృష్ణ, ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ బాబు, బడే నాగజ్యోతి -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఏటూరునాగారం: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఽసీతక్క అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుస్తులు, జూట్ బ్యాగుల తయారీ యూనిట్ను గురువారం పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి మంత్రి ప్రారంభించారు. కుట్టుమిషన్ల ద్వారా ఆర్థికంగా ఆదాయం పొందాలన్నారు. రూ.10 లక్షలతో ఆధునిక మిషనరీలతో యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. అనంతరం ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని క్రాస్రోడ్డులో ఐటీడీఏ భవనానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. భవన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఐటీడీఏ సమావేశపు గదిలో మండల పరిధిలో 1,219 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను మంత్రి అందజేశారు. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలో తొలిసారిగా ఎంపిక చేసిన 11 ఉత్తమ పాఠశాలలకు అవార్డులు, పది మందికి ల్యాప్టాప్లు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జనార్దన్, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఎస్డీసీ ప్రతాప్ పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ములుగు: నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాలు సాధించేలా ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందనున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను సీతక్క గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రాథమిక శారీరక కొలతల పరీక్షలకు 300 మంది హాజరు కాగా 250 మంది శిక్షణకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతీజ్ ఉత్సవాల్లో మంత్రి నృత్యం..ములుగు పట్టణంలో బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క స్థానిక మహిళలు, యువతులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ బంజారా ఆలయానికి రూ. 50 లక్షలు కేటా యించినట్లు తెలిపారు. బంజారా సోదర, సోదరీ మణులకు మంత్రి తీజ్ శుభాకాంక్షలు తెలిపారు. -
టీకాల వివరాల నమోదు తప్పనిసరి
ములుగు: వ్యాధి నిరోధక టీకాల వివరాలను యు–విన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆరోగ్య కార్యకర్తలకు యు–విన్ పోర్టల్పై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ గోపాల్రావు హాజరై మాట్లాడారు. టీకాల వివరాలను యు–విన్ యాప్లో నమోదు చేయాలన్నారు. తద్వారా తదుపరి టీకా డ్యూ డేట్, టీకా కేంద్రం బుకింగ్తో పాటు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చని వివరించారు. జాతీయ టీకాల షెడ్యూల్ ప్రకారం పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వరకు పిల్లలకు అన్ని టీకాలు వేయించాలని వెల్లడించారు. దీంతో వ్యాధుల నుంచి పిల్లలు రక్షణ పొందుతారని డీఎంహెచ్ఓ వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఫణీంద్ర, నాగ అన్వేష్, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
మేయర్ తర్వాత.. ‘కుడా’ చైర్!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పదవులు రావడం.. పోవడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరిని మాత్రం అదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణి పరిస్థితి ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ మేయర్ పదవినుంచి మాజీ అయిన ఆమెకు.. కొద్ది రోజుల వ్యవధిలోనే మరో కీలక పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ‘కుడా’ (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవి ఆమెను వరించింది. టీడీపీలో రాజ్యసభ సభ్యురాలిగా, బీఆర్ఎస్ హయాంలో మేయర్గా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇప్పుడు ‘కుడా’ చైర్పర్సన్ పదవి వరించింది. కాగా, ప్రస్తుతం ఈ పదవిలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి సుధారాణికి బాధ్యతలు అప్పగించారు. సురేఖ బర్తరఫ్.. సమీకరణాల్లో మార్పు కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గంనుంచి తప్పించడంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి కుడా చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న గుండు సుధారాణికి రాజకీయంగా కీలక పదవులు కొత్తేమీ కాదు. గ్రేటర్ వరంగల్ మేయర్గా పనిచేసిన ఆమె.. ఇటీవల మేయర్ పదవీకాలం ముగియడంతో ఆ పదవికి వీడ్కోలు పలికారు. దీంతో ఇక ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ జరుగుతున్న సమయంలోనే మరో కీలక బాధ్యత దక్కడం విశేషం. వరంగల్ రాజకీయాల్లో గుండు సుధారాణికి ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చిన’ పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆమెకు ‘అదృష్టం మరోసారి వరించింది’ అన్న చర్చ సాగుతోంది. ఇంటివద్ద సంబురాలు వరంగల్ చౌరస్తా : కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. గురువారం సాయంత్రం రామన్నపేటలోని సుధారాణి ఇంటి ఎదుట బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. గుండు సుధారాణికి మరో కీలక పదవి.. ‘కుడా’ చైర్పర్సన్గా నియామకం సురేఖ బర్తరఫ్తో మారిన సామాజిక సమీకరణలు పద్మశాలి వర్గానికి మళ్లీ ప్రాధాన్యం.. సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా పదవి ఇచ్చి నాపై సీఎం రేవంత్రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. ఆయనకు కృతజ్ఞతలు. బీసీల అభ్యున్నతి, మహిళా సాధికారతకు కృషి చేస్తా. నా నియామకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఏఐసీసీ, టీపీసీసీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు. – గుండు సుధారాణి -
కొండా సురేఖ ఎపిసోడ్కు బర్తరఫ్తో ఎండ్ కార్డు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి పదవినుంచి బర్తరఫ్తో సుమారు 18 రోజుల కొండా సురేఖ ఎపిసోడ్కు గురువారం ఎండ్ కార్డు పడింది. పరకాల వేదికగా మొదలైన రాజకీయ వివాదం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను దాటి ఢిల్లీకి చేరింది. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో జరిగిన చర్చలు.. మంత్రివర్గం నుంచి బయటకు పంపే స్థాయికి చేరాయి. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. ఆ తర్వాత వరుస ఫిర్యాదులు, ఎమ్మెల్యేల నివేదికలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం.. హైకమాండ్ను ఆగ్రహానికి గురి చేశాయి. చివరకు సురేఖను కేబినెట్ నుంచి తప్పించారు. ఆగస్టు 16 తర్వాత మొదలైన పరిణామాలు గురువారం నాటి కొండా సురేఖ బర్తరఫ్ వరకు జరిగిన తంతు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూతురు మాటలనుంచి కేబినెట్ వేటు దాకా.. ఆగస్టు 16న సీఎం రేవంత్రెడ్డి పరకాల పర్యటన తర్వాత చోటుచేసుకున్న పలు ఘటనలు కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపునకు నాంది పలికాయి. సురేఖ జన్మదినం సందర్భంగా ఆగస్టు 19న ఆమె కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అధిష్టానం సీరియస్గా తీసుకుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ వర్గాల్లో మాత్రం సురేఖ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సురేఖపై ఈ ఒక్క అంశమే కాకుండా.. మరికొన్నింటితో కూడిన ఫిర్యాదుల ఫైల్ అధిష్టానం ముందుకు వెళ్లినట్లు ప్రచారం. కూతురు చేసిన వ్యాఖ్యల వివాదంపై రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సైతం సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన కేసు, అందులో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సురేఖ స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితి లేదని భావించి బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇప్పటికై తే ఇంతే.. ఎమ్మెల్యేగా సురేఖ మంత్రి పదవి పోయినా.. సురేఖ రాజకీయ ప్రస్థానం ముగి సినట్లు కాదు. ఇప్పటికే ఈ విషయమై మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తానేమీ తప్పు చేయలేదని, పదవిపోతే బాధ పడాల్సిన అవసరం లేదన్న ఆమె.. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నా రు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినప్పటికీ సోనియా, రాహు ల్, ప్రియాంకా గాంధీలంటే ఇష్టమన్న ఆమె.. ఎమ్మెల్యేగా తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమనడం ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై ఈ పరిణామాలు భవిష్యత్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ‘పరకాల’నుంచి మొదలైన మాటల దాడి.. ఎమ్మెల్యేల నివేదికలతో ముదిరిన పంచాయితీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో కీలక మలుపు ఉత్కంఠ రేపిన ఢిల్లీ మంతనాలు.. చివరకు కేబినెట్నుంచి వేటు 18రోజులపాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు -
ఈవీఎంల గోదాం తనిఖీ
ములుగు: జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్ర త, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా రిజిస్టర్లను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ఉండరాదని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎండీ. సలీం, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంటేషన్ పరిశీలించిన సీసీఎఫ్ ప్రభాకర్ వాజేడు : మండల పరిధిలోని పేరూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ను కాళేశ్వరం సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ గురువారం పరిశీలించారు. గ్రామ సమీపంలో 35 హెక్టార్లలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు పెంచుతుండగా మొక్కల ఎదుగుదల, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఎదగడానికి చేపట్టాల్సిన చర్యలతో పాటు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఆయన వెంట ములుగు డీఎఫ్ఓ వికాస్ మీనా, వెంకటాపుర(కె) ఎఫ్డీఓ ద్వాలియా, వాజేడు రేంజర్ నరేందర్, సెక్షన్ ఆఫీసర్ నారాయణ, ఎఫ్బీఓ పద్మ తదితరులు ఉన్నారు. ‘ఆరుతడి పంటలు సాగుచేయాలి’ ములుగు: నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే రైతులు ఆయిల్పామ్, పండ్ల తోటలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆత్మ చైర్మన్ కొండం రవీందర్రెడ్డి సూచించారు. మండల పరిధిలోని భూపాల్నగర్లో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో గురువారం ఆయిల్పామ్ సాగుపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుకు అవసరమైన నీటి వసతిపై రైతులు ముందుగానే దృష్టి సారించాలన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టేందుకు రైతులు చిన్న నీటికుంటలను నిర్మించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించుకోవడం ద్వారా పంటలకు అవసరమైన నీటి లభ్యతను పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు, సర్పంచ్ నాగిడి రమణారెడ్డి, మండల వ్యవసాయ అధికారి నల్లెల్ల శ్రీధర్, ఏఈఓ కావ్య, ఆత్మ సభ్యులు, ఆయిల్పామ్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. సాంకేతికతతో పరిశ్రమలకు లాభాలు ములుగు: పరిశ్రమలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టి సౌరవిద్యుత్, ఇతర హరిత సాంకేతికతలను వినియోగించుకుని నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన అభివృద్ధిని సాధించవచ్చని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్కుమార్ అన్నారు. రీచ్ ఆధ్వర్యంలో ములుగులో గురువారం నిర్వహించిన ర్యాంప్, గ్రీనింగ్, ఎంఎస్ఎంఈఎస్ అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. రైస్ మిల్లులతో పాటు అన్ని ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే సాంకేతికతలను అవలంభించాలని సూచించారు. సౌర విద్యుత్ వినియోగంతో ఖర్చును తగ్గించుకోవచ్చని, తద్వారా పరిశ్రమల పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి, రీచ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ చరణ్, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
వుులుగు: విద్యార్థులకు అత్యుత్తమ విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్ అన్నారు. ఐఐటీ–హైదరాబాద్, టీఎస్–హైదరాబాద్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థులకు మెరుగైన విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీలో గురువారం 2026–27 విద్యా సంవత్సర ఇండక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఐటీ–హైదరాబాద్ అధ్యాపకులు బీటెక్ విద్యార్థులకు నేరుగా బోధించనున్నారని, టీఎస్–హైదరాబాద్ నిపుణులు ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సు నిర్వహించనున్నారని తెలిపారు. విద్యార్థులు డిగ్రీ పూర్తిచేసే నాటికి ఉద్యోగాలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. రానున్న అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఏడాదిలో క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఐఐటీ–హైదరాబాద్ స్టార్టప్, ఇన్నోవేషన్ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుతూ పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ప్రకాశ్, బీఎస్ మూర్తి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్ -
పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు
ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2026–2027 సీజన్కు సంబంధించిన పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు జిన్నింగ్ మిల్లుల్లో బేళ్ల కోసం టెండర్లు పిలిచి పూర్తి చేసింది. గతంలోని ధరలతోపాటు ఇతర నిబంధనలతో ఒకే టెండర్ ప్రకటన ఇచ్చే వారు. ఈ సీజనల్లో తొలివిడత ధరల ప్రస్తావన లేకుండా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని టెండర్ ప్రకటన వచ్చింది. మరో రెండు నెలల్లో పత్తి పంట చేతికొచ్చి క్రయవిక్రయాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో వ్యాపారులతోపాటు సీసీఐ పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది 7.24 లక్షల ఎకరాల్లో పత్తిసాగు.. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో పత్తి సాగు సుమారు 7.24 లక్షలకు పైగా ఎకరాలకు చేరుకుంది. 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసే సీసీఐ.. పత్తిలో గింజలు తీసి బేళ్లుగా మార్చి ఎగుమతి చేయడానికి ఏటా టెండర్లు ఆహ్వానిస్తుంది. అదే తరహాలో టెండర్లను పిలిచింది. గత ఏడాది 6.53 లక్షల బేళ్లను సిద్ధం చేసి ఎగుమతి చేసింది. ఈ సీజనల్లో పత్తి క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెండర్లు పూర్తిచేసిన సీసీఐ 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 కేంద్రాలు ఏర్పాటు 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారుల అంచనాఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ములుగు, కేసముద్రం–ఏ, బీ, తొర్రూరు, మహబూబాబాద్, కాటారం, చిట్యాల, భూపాలపల్లి, కొడకండ్ల, నర్సంపేట, జనగామ–ఏ,బీ, ఘన్పూర్, ఆత్మకూరు, రాంపూర్, పరకాల, ఎల్కతుర్తి, వరంగల్–ఏ,బీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఈసారి కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రాల వారీగా కొనుగోలు చేసే పత్తిని బేళ్లుగా మార్చేందుకు ఏటా జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంటున్నారు. జిన్నింగ్ మిల్లులు, గిడ్డంగులు, బేళ్ల రవాణాకు వాహనాలు, తాత్కాలిక ఉద్యోగులు తదితర వాటికి కూడా టెండర్లను ఆహ్వానించినట్లు మార్కెటింగ్ శాఽఖ అధికారులు తెలిపారు. పత్తిని బేళ్లుగా మార్చేందుకు జిన్నింగ్ మిల్లులు అద్దెకు.. -
పూజా కార్యక్రమాలకు ఇబ్బంది పడుతున్నాం..
సమ్మక్క గుడి, సారలమ్మ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్నాం. ఆలయాలు చిన్నవిగా ఉండటంతో పూజలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతర సమయంలో భక్తుల రద్దీతో సమస్య మరింత పెరుగుతుంది. నూతన ఆలయాలను త్వరగా నిర్మించి 2028 జాతర నాటికి పూర్తి చేయాలి. మంత్రి సీతక్క చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలి. నూతన ఆలయాలు అందుబాటులోకి వస్తే పూజారుల ఇబ్బందులు తొలగడంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. –కొక్కెర కృష్ణయ్య, సమ్మక్క పూజారి● -
‘ఓవర్’ లోడ్.. భారీ మూల్యం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇసుక లారీల్లో ఓవర్లోడ్కు ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇసుక రవాణాలో నిర్ణీత సామర్థ్యానికి మించి తరలించే ప్రతీ మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఒకే వాహనం రెండు సార్లకు మించి ఓవర్లోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఆ వాహనాన్ని తదుపరి బుకింగ్లకు బ్లాక్ చేయనున్నారు. మైన్స్ సర్వేలెన్స్ సిస్టం ద్వారా ఓవర్లోడ్ను గుర్తించి జరిమానాను ఆన్లైన్లో వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 28లో స్పష్టం చేసింది.ఈ నిబంధనలతో ఉమ్మడి జిల్లాలోని రీచ్లనుంచి అదనపు ఇసుక తరలించే వందలాది లారీలకు చెక్పడనుంది. కొన్ని రీచ్ల్లో నేరుగా భారీ వాహనాల్లో ఇసుక లోడ్ కాకుండా రీచ్ నుంచి స్టాక్యార్డుకు ట్రాక్టర్లు/చిన్న వాహనాల ద్వారా తరలించి, అక్కడినుంచి లారీల్లోకి రీలోడ్ చేసే విధానం ఉంది. తాడిచెర్ల తాజా టెండర్లలోనూ రీచ్ నుంచి స్టాక్యార్డుకు ఇసుక తరలించి, తిరిగి లారీల్లోకి లోడ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అందువల్ల కొత్త నిబంధన కేవలం లారీ డ్రైవర్పైనే కాకుండా రీచ్–స్టాక్యార్డు–లోడింగ్–రవాణా మొత్తం వ్యవస్థపై జాగ్రత్త పెంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఓవర్లోడ్ పూర్తిగా నియంత్రితమైతే ఒక్క ట్రిప్పులో తరలించే ఇసుక పరిమాణం తగ్గుతుంది. మరోవైపు రోడ్లపై ఒత్తిడి, రోడ్డు నష్టం, ప్రమాదాల ముప్పు తగ్గే అవకాశం ఉంది. కొత్త జీఓతో అసలు సమస్య ఓవర్లోడ్ చేసే లారీలకే. ఒక లారీలో నిర్ణీత పరిమితికి మించి టన్ను ఇసుక ఉంటే రూ.2వేల జరిమానా. 3 టన్నులు అదనంగా ఉంటే రూ.6వేలు, ఐదు టన్నులు అయితే రూ.10వేలు.. అంటే ఒక్క ట్రిప్పులో ఎక్కువ ఇసుక వేసుకుని అదనపు ఆదాయం పొందాలనుకునే ప్రయత్నం జరిమానాతో పోలిస్తే నష్టదాయకంగా మారే అవకాశం ఉంది. జీఓ ప్రకారం జరిమానా అదనంగా తరలించిన ఇసుక పరిమాణంపై విధించనున్నారు. లారీ యజమానులకు ఇది మరింత కీలకమైన నిబంధన. రెండుకంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉల్లంఘనలు గుర్తించిన వాహనాన్ని సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో తదుపరి బుకింగ్ల నుంచి బ్లాక్ చేయనున్నారు. రెండు కంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉల్లంఘనలు నమోదైతే ఆ వాహనంతో టీజీఎండీసీ ఇసుకను బుక్ చేసుకునే అవకాశమే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఉమ్మడి వరంగల్లోని ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు సాగుతున్నాయి. టీజీఎండీసీ వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలో టీజీఎండీసీ రికార్డుల్లో మారికాల, సూరవీడు, ముత్తారం, కొండాపురం, కొరకల్లు వంటి ఇసుక రీచ్ల వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు మారికాల రీచ్కు1,59,680 మెట్రిక్ టన్నులు, కొరకల్లు రీచ్కు 99,948 క్యూబిక్ మీటర్ల పరిమాణం కేటాయించారు. సూరవీడు రీచ్కు 70 వేల క్యూబిక్ మీటర్లు, ముత్తారం రీచ్కు 99,400 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. జేఎస్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఇసుక డీ–సిల్టేషన్ పనులకు టీజీఎండీసీ టెండర్లు పిలిచింది. తాడిచెర్ల–1, తాడిచెర్ల–2 రీచ్లలో సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డీ–సిల్టేషన్కు సంబంధించిన టెండర్ అయ్యింది. ఆయా రీచ్ల నుంచి ఇసుక తరలించే లారీలకు శ్రీఓవర్లోడ్శ్రీ నిబంధన ప్రభావం పడనుంది. దీంతో ఇసుక వ్యాపారుల, లారీ ఓనర్ల లెక్కలు తారుమారు కానున్నాయి. రెండుసార్లు ఓవర్.. మూడోసారికి బుకింగ్ కట్ రీచ్ నుంచి స్టాక్యార్డు.. అక్కడినుంచి లారీ వరకు నిఘా కొత్త నిబంధనలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం తారుమారు కానున్న వ్యాపారుల లెక్కలు -
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ జిల్లా కేంద్రంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో కాంగ్రెస్ ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు శివారులోని డీఎల్ఆర్ ఫంక్షన్హాల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వరకు కొనసాగింది. అనంతరం ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు ఆరోపించారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి.. 1000 రోజులు దాటినా అమలు చేయలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి, జిల్లా నాయకులు గోవింద్ నాయక్, మల్కా రమేశ్, భూక్య జంపన్న, మహేశ్, విజయ్, మల్లారెడ్డి, వలిబాబా, ఖాజాపాషా, తాడూరి రఘు తదితరులు పాల్గొన్నారు. 420 అడుగుల ఫ్లెక్సీతో భారీ ర్యాలీ -
2028 జాతర నాటికి పూర్తయ్యేనా?
మేడారం మహాజాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ సమయంలో సమ్మక్క గుడి, సారలమ్మ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో జాతరకు ముందే నూతన ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం కొత్త ఎస్టిమేషన్ రూపొందించి ఆమోదం కోసం పంపిన నేపథ్యంలో ప్రక్రియ పూర్తయి పనులు త్వరగా ప్రారంభిస్తే 2028 మేడారం జాతర నాటికి నిర్మాణాలను పూర్తి చేసే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి(ఫైల్)ఎస్ఎస్తాడ్వాయి: వనదేవతల నూతన ఆలయాల నిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది. మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. కోటి నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్ కోట్ చేసిన రేట్లు, ప్రస్తుత అంచనా వ్యయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో టెండర్ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కొత్త రేట్లతో ఎస్టిమేషన్ రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి సమర్పించినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. సంబంధిత అధికారులు పరిశీలించి ఆమోదించిన అనంతరం సీఎం కార్యాలయం నుంచి ఫైల్ రాగానే మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెబుతున్నారు. వనదేవతలకు నిత్యం పూజలు మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో జాతర సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వనదేవతలకు సంబంధించిన పూజలు, ఇతర ఆచార కార్యక్రమాలు ఇక్కడే కొనసాగుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయాలు చిన్నవిగా ఉండటంతో పూజా కార్యక్రమాల నిర్వహణలో పూజారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. మహాజాతర సమయంలో జాతరకు రెండు వారాల ముందు నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఆలయాల్లో పూజలు నిర్వహించిన తర్వాతనే కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెలకు తీసుకురావడం ఆనవాయితీ. ఇంత ప్రాధాన్యత ఉన్న అమ్మవార్ల ఆలయాల నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యమెందుకని పూజారులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ గుడులకు రూ.కోటి మంజూరు టెండర్ రద్దుతో నిలిచిపోయిన పనులు ఇరుకై న ఆలయాల్లో పూజలు ఇబ్బంది పడుతున్న పూజారులు -
వైఎస్సార్ సంక్షేమ పథకాలు మరువలేనివి
ములుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో వైఎస్సార్ వర్ధంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంక్షేమ స్వర్ణయుగంగా నిలిచిపోయిందన్నారు. 2004 నుంచి 2009 వరకు ఆయన పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అత్యవసర సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, రూ.2లకే కిలో బియ్యం, వృద్ధాప్య పింఛన్లు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవానన్రెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
12న జాతీయ లోక్అదాలత్
ములుగు: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12న శనివారం జిల్లాలోని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.చండీశ్వరి దేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్లో రాజీపడదగిన క్రిమినల్, సివిల్, ప్రీ–లిటిగేషన్ కేసులతో పాటు బ్యాంకు, విద్యుత్, భూ తగాదాలు, వివాహం–కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, చిట్ఫండ్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ నెల 12న లోక్ అదాలత్కు హాజరై తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి
మంగపేట: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి బోధనా విధానాన్ని పరిశీలించారు. పాఠశాలలో అందుతున్న విద్యా సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం, ప్రయోగాత్మక బోధన తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు పాఠశాల యూనిఫాం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ ఎంఈఓ పొదెం మేనక, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకటస్వామి, ఉల్లాస్ కోఆర్డినేటర్ కృష్ణబాబు, జీసీడీఓ రజిత పాల్గొన్నారు. 18 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ములుగు: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, బండారుపల్లిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, బాలికల వసతిగృహంలో ఖాళీగా ఉన్న 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు జిల్లా వాసులై ఉండాలని తెలిపారు. ఏఎన్ఎం పోస్టుకు ఇంటర్తో పాటు ఏఎన్ఎం శిక్షణ, ప్రధాన వంటమనిషికి పదో తరగతితో వంట అనుభవం, వాచ్మెన్ పోస్టులకు పదో తరగతి, సహాయ వంటమనిషి, పారిశుద్ధ్య సిబ్బందికి ఏడో తరగతి ఉత్తీర్ణత ఉండాలని వెల్లడించారు. దరఖాస్తులను సంబంధిత ఎంఈఓ కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని వివరించారు. పూర్తి వివరాలకు బాలికల విద్యాభివృద్ధి అధికారి బి. రజితను సెల్ నంబర్ 9666294715లో సంప్రదించాలని డీఈఓ సూచించారు. డీఈఓ సిద్ధార్థరెడ్డి -
పోచమ్మకు బోనాలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలో పోచమ్మతల్లి బోనాల పండుగను ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఇంటి వద్ద నుంచి బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తుల నృత్యాలతో మహిళలు పోచమ్మ తల్లి గుడికి చేరుకుని మొక్కులు సమర్పించారు. ముందుగా బొడ్రాయికి తొలి మొక్కులు చెల్లించి, కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలను సమర్పించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నేడు మంత్రి పర్యటన ఏటూరునాగారం: నేడు(గురువారం) మండల కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు దేవులపల్లి విజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాళేశ్వరం(మల్హర్): మల్హర్ మండలం నాచారం గ్రామపంచాయతీని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్సన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఫాంపాండ్ పనులను సందర్శించి కూలీలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ రజినీకాంత్, ఎంపీఓ మల్లికార్జున్, ఏపీఓ గిరి హరీశ్ పాల్గొన్నారు. మలేషియాలో ఉద్యోగాలకు అవకాశం భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ, తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మలేషియాలో వివిధ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియాలో అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో హౌస్ వర్కర్, పైప్ ఫిట్టర్, స్వీపర్, కుక్, ఎక్స్కవేటర్–బ్యాక్హో ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు అర్హులని అన్నారు. అభ్యర్థుల వయస్సు 20నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు. నైపుణ్యం కలిగిన వారికి నెలకు రూ.40వేల నుంచి రూ.47వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు వసతి, ఇతర సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉంటాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం టీఓఎంసీఓఎం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని లేదా 080 35524946 నంబర్లో వివరాలు తెలుసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు. నిబంధనల మేరకు షాపులు నిర్వహించాలి గణపురం: ప్రభుత్వ నిబంధనల మేరకు మెడికల్ షాపులు నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని ఆదేశించారు. బుధవారం గణపురం మండలకేంద్రంలో పలు మెడికల్ షాపులను ఆమె తనిఖీ చేశారు. షాపులలో మందులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్హత కలిగిన ఫార్మసిస్టులు మెడికల్ దుకాణాలలో ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే మందుల విక్రయాలు చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నారన్నా విషయం తెలుసుకున్న పలువురు మందుల షాపులను మూసివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ఐటీడీఏలో అర్జీలు స్వీకరిస్తున్న పీఓ ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న డీఆర్ఓ ● డీఆర్ఓ రవికుమార్ ములుగు: ప్రజావాణిలో సమర్పించిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సత్వరం పరిష్కరించాలని డీఆర్ఓ రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తంగా 33 దరఖాస్తులు రాగా వాటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్లు 4, పింఛన్లపై 2, ఇతర శాఖలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్ఓ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గిరిజన దర్బార్లో 8 వినతులు ఏటూరునాగారం: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన 8 వినతులు రాగా పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు. వినతుల్లో ప్రధానంగా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరులో పట్టాలో వారసత్వం మార్పిడి చేయాలని గిరిజనుడు విన్నవించారు. వెంకటాపురం(కె) ముత్తారంలోని గిరిజన పాఠశాలల్లో ఏఎన్ఎంగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఓ గిరిజన మహిళ కోరారు. తాడ్వాయి మండలం బయ్కక్కపేట గ్రామానికి చెందిన ఓ క్రీడాకారుడు పారా నేషనల్ గేమ్స్లో పాల్గొనేందుకు ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. అలాగే వివిధ సమస్యలపై వచ్చిన వినతులు పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు. -
ప్రయాణికుల కష్టాలు
● బస్సులు లేక గంటల తరబడి ఇక్కట్లు ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. ఏటూరునాగారం బస్టాండ్లో వందలాది మంది ప్రయాణికులు బస్సులులేక ఎండలో గంటల తరబడి వేచి చూశారు. రాఖీ పౌర్ణమితో పాటు వరుస సెలవులు రావడంతో హనుమకొండ, హైదరాబాద్తో పాటు తదితర పట్టణాల్లో ఉండే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు స్వగ్రామాలకు చేరుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో ఏటూరునాగారం బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. చుట్టు పక్కల మండలాల నుంచి వచ్చే ప్రయాణికులు సైతం ఏటూరునాగారం బస్టాండ్ చేరుకునే సరికి అక్కడ ఒక్క బస్సు కూడా లేదు. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు● డీఈఓ సిద్ధార్థరెడ్డి ములుగు: విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకునేలా ఇన్స్పెక్షన్ టీమ్స్ సూచనలు చేయాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ సందర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ప్యానల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ సభ్యులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలను సందర్శించిన సమయంలో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు. జాతీయ విద్యావిధానం–2020కు అనుగుణంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్)ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. టీమ్ సభ్యులు పాఠశాలలను సందర్శించినప్పుడు ఉపాధ్యాయులు పూర్తి సహకారం అందించాలని డీఈఓ కోరారు. -
వడివడిగా భూ సర్వే
సాక్షి, మహబూబాబాద్ : ‘ఏ గ్రామంలో చూసినా భూ సమస్య కనిపిస్తోంది. భూమి ఒకరికి, హక్కు మరొకరికి అన్నట్లు ఉంది. వీటన్నింటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన భూ సర్వేను వడివడిగా చేయాలి. ఈ ప్రక్రియను తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారిపై వేటు తప్పదు’ అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెవెన్యూ, రీ–సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం ఆయన మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. భూ సర్వేలో నిర్లక్ష్యం వద్దు.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను లక్ష్యంగా ఎంపిక చేసి మొదటి విడత భూ సర్వేను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ అంగుళం భూమిని వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ ఆస్తుల వారీగా శాసీ్త్రయంగా సర్వే చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 31 నాన్–కెడస్ట్రల్ గ్రామాలకుగాను 18 గ్రామాల్లో రీ–సర్వే పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 13 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన 13 గ్రామాల్లో, భూపాలపల్లి జిల్లాలో 8, జనగామ జిల్లాలో 5 గ్రామాల్లో సర్వే పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. సర్వే గ్రామాలను తహసీల్దార్లు ప్రతీరోజు, నెలలో ఐదు రోజులు ఆర్డీఓలు, మూడు సార్లు కలెక్టర్లు పరిశీలించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను ఏమాత్రమూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల నిర్మాణాలు పూర్తిచేయాలి జూలై 7న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నర్సంపేట, పరకాల, ములుగు, జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో ఐదు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలు, వరంగల్లో ఒక డీఐజీ కార్యాలయం మంజూరైనట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా పలివేల్పులలో డీఐజీ కార్యాలయం కోసం ఎకరం 20 గుంటల ఎస్సారెస్పీ స్థలాన్ని కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పరకాలలో నూతన భవన నిర్మాణం 7 శాతం పూర్తయిందని తెలిపారు. భీమదేవరపల్లి, పరకాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హౌసింగ్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం వద్దు జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లాలో 4,600 ఇళ్లు మంజూరు కాగా 3,946 ఇళ్లకు ప్రాసెస్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు 854 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ములుగు జిల్లాలో కూడా ఇళ్ల పూర్తిశాతం 50 శాతానికిలోపే ఉందని పేర్కొన్నారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ 15నాటికి గరిష్ట సంఖ్యలో పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్లు శ్రీకాంత్ రెడ్డి, ప్రకాశ్, లాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్గాంధీ హన్మంతు, భూ భారతి డైరెక్టర్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతమ్, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్ బాజ్పాయ్, సందీప్కుమార్ ఝా, భోర్ఖడే హేమంత్ సహదేవరావు, రాహుల్ శర్మ పాల్గొన్నారు. ప్రతీ అంగుళం శాసీ్త్రయంగా ఉండాలి నిర్లక్ష్యం చేసే అధికారులపై వేటు తప్పదు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం ఉమ్మడి జిల్లా సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరైన మంత్రి సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలుతహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలిపట్టా తె చ్చిన సంబురం..22–ఏ భూముల విషయంలో జాగ్రత్త.. ప్రతీ జిల్లాలో 22–ఏ కింద ఉన్న భూములు ఏవీ? వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఎన్ని? ఇతర వివరాలు ఏమిటి అనే అంశాలను నాలుగు కాలమ్స్తో కూడిన సమగ్ర నివేదికగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేనంబర్ల వారీగా పూర్తి వివరాలను రెండు రోజుల్లో అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు. 22–ఏ జాబితాలో పొరపాటున చేరిన రైతుల భూముల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివా దాలను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై, శాసీ్త్రయ పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి సరిహద్దులు నిర్ధారించాలని సూచించారు. -
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా చండీశ్వరి దేవి
ములుగు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.చండీశ్వరి దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆమె ములుగు న్యాయ సేవాధికార సంస్థకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. లోక్ అదాలత్లు, న్యాయ అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న వివిధ న్యాయ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు అందేలా అధికారులు, సిబ్బంది, ప్యానెల్ న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మై భారత్ వలంటీర్గా మమన్యాదవ్ములుగు: మండల పరిధిలోని కాసిందేవిపేట గ్రామానికి చెందిన మేడుదుల మమన్యాదవ్ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ యూత్ వలంటీర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మమన్యాదవ్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ, యువత అభ్యున్నతికి పాటు పడుతానని వివరించారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేస్తానని వెల్లడించారు. 36 వాహనాలకు వేలం ములుగు: జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వేర్వేరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 36 వాహనాలకు సోమవారం జిల్లా ప్రొహిబిషన్న్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆవరణలో వేలం నిర్వహించారు. ఇందులో 27 వాహనాలను తుక్కుగా, మరో 9 వాహనాలను రోడ్డు వర్తిగా వేలం నిర్వహించారు. తుక్కు వాహనాల ద్వారా రూ.1.30 లక్షలు, రోడ్ వర్తి వాహనాల ద్వారా రూ.1.98 లక్షలు కలిపి మొత్తం రూ.3.28 లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు ములుగు ఎకై ్సజ్ సీఐ ఎం.సుధీర్ కుమార్ తెలిపారు. అదే విధంగా జీఎస్టీ రూపంలో రూ.59,040 వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు సీఐ వెల్లడించారు. సంచార జాతుల అభ్యున్నతికి కృషిములుగు: సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రామ్మోహన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల విమోచన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతులు, విముక్తి జాతుల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని తెలిపారు. సంచార జాతుల ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా విద్యావంతులను చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ఈ కార్యక్రమంలో సంచార జాతుల జిల్లా అధ్యక్షుడు బాణాల రాజుకుమార్ , పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు ముదురుకోళ్ల సదానందం, వీరభద్రీయ కుల సంఘం ములుగు మండల అధ్యక్షుడు బాణాల శంకర్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
హనుమకొండ uవరంగల్ uజనగామ uములుగు uమహబూబాబాద్ uభూపాలపల్లి uఆరు జిల్లాల్లోని పాఠశాలలకు రూ.643.20 లక్షల నిధులు ● జీరో నుంచి 10 మంది విద్యార్థులుంటే కేటాయింపుల్లేవువిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు 2026–27 సంవత్సరానికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు, పీఎంశ్రీ పాఠశాలలకు, జీరో నుంచి 10 మధ్య విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలకు ఈ నిధులు మంజూరు చేయలేదు. పాఠశాలల వారీగా నిధులు ఒకటినుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేల చొప్పున, 31 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది విద్యార్థులుంటే రూ.75 వేలు, 1,000పైన విద్యార్థులుంటే రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు మొత్తం రూ.643.20 లక్షలు గ్రాంటు నిధులు మంజూరు చేశారు. ఈనిధులు వీటికి వినియోగించుకోవాలి.. ● పాఠశాలలకు అవసరమైన స్టేషనరీ చాక్పీస్లు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు తదితరాలు సమకూర్చుకోవడం, పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవడం. ● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల నిర్వహణకు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలలో ఇంటర్నెట్ చార్జీలకు వినియోగించుకోవాలి.. ● కంప్యూటర్లు, ప్రొజెక్టర్ కే–యాన్ టీవీ, తదితర పరికరాల మరమ్మతులకు వినియోగించుకోవాలి. ● తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ వంటి చిన్న చిన్న మరమ్మతులకు వినియోగించుకోవచ్చు. ● తాగునీటి సదుపాయం కల్పించుకునేందుకు కూడా ఈగ్రాంట్లో 10 శాతం మొత్తాన్ని స్వచ్ఛత, యాక్షన్ప్లాన్లో భాగంగా చేతులు కడుక్కునేందుకు లిక్విడ్ సోప్, టాయిలెట్ శుభ్రపర్చే సామగ్రి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ● దివ్యాంగ విద్యార్థులున్న పాఠశాలల్లో, పాఠశాల ఆవరణలో సురక్షితమైన అవరోధాలు లేని ప్రవేశం కోసం రెయిలింగ్ ఇతర చిన్న సదుపాయాల కోసం గ్రాంటు నుంచి నిధులు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలల్లో ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రపర్చాలి. శానిటైజ్ చేయాలి. తగిన వెంటిలేషన్లో డిస్ ఇన్స్పెక్ట్ చేయాలి. ● సబ్బు, హ్యాండ్ శానిటైజర్, క్లోరిన్ సొల్యూషన్ ఇతర శుభ్రపర్చే సామగ్రిని ఎల్లప్పుడూ నిల్వ ఉంచాలి. ● గ్రాంట్ వినియోగానికి సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) తీర్మానం చేసి రికార్డుల్లో పేర్కొనాలి. ● గ్రాంటును మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా వినియోగించే బాధ్యత హెచ్ఎం/ప్రిన్సిపాళ్లదే.. మొత్తం పాఠశాలలుమొత్తం గ్రాంటు (లక్షల్లో) -
స్మార్ట్గా రేషన్కార్డు
మహిళల పేరిట కార్డుల ముద్రణములుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్లో లబ్ధిదారులందరికీ పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల పలువురికి కొత్త కార్డులు సైతం మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం 222 రేషన్ షాపుల పరిధిలో 1,02,378 రేషన్ కార్డులు ఉండగా వారందరికీ స్మార్టు కార్డులు అందనున్నాయి. పౌర సరఫరాల శాఖ కార్డులను ముద్రించి రెవెన్యూ శాఖకు అందజేసింది. మండలాల వారీగా వేరు చేసి తహసీల్దార్లకు ఇచ్చారు. త్వరలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీలోపు లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపు పదహారేళ్లుగా నిరుపేదలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా నూతన కార్డులు అందలేదు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పేదలందరికి రేషన్కార్డులు అందాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు లబ్ధిదారులను ఎంపిక చేయటం తప్ప పేదలకు కార్డులు పంపిణీ చేయలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక పలు దఫాలుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ కార్డులు మాత్రం ఇవ్వలేదు. 2013లో కూపన్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత వాటిని కూడా ఆపేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేసినా తెల్లరేషన్ కార్డును తప్పనిసరి చేసింది. దీంతో కార్డు అవసరమైన ప్రతీసారి లబ్ధిదారులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించింది. సాధారణ కార్డులు కాకుండా స్మార్టు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏటీఎం కార్డు తరహాలో.. ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్గా రేషన్కార్డు ఉంది. కుటుంబ యజమానురాలు ఫొటోను కార్డుపై ముద్రించి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కార్డుపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల పేర్లు వచ్చేలా తయారు చేశారు. ఎంత మంది సభ్యులు ఉన్నారు. ఏయే నెలలో ఎంత రేషన్ తీసుకున్నారు. తదితర వివరాలన్నీ తెలుస్తాయి. భవిష్యత్లో అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డులనే ప్రామాణికం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 10 మండలాలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలో 222 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,02,378 కార్డులు ఉండగా 2,92,180 యూనిట్లు ఉన్నాయి. ప్రతినెలా 5,259 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ క్వింటాల్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా చార్జీలతో కలిపి కిలోకు రూ.57 వరకు ఖర్చు చేస్తోంది. అయితే కేవైసీ పూర్తి చేసిన వారికే మొదటి విడతలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. మిగతా వారికి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాతే ఇచ్చే అవకాశం ఉంది. మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీవారం రోజుల్లోగా మంత్రి సీతక్క చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ చేసేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం. స్మార్ట్ కార్డులు మండలాల వారీగా సంబంధిత అధికారులకు అందించాం. మహిళల పేరుపై వచ్చిన స్మార్ట్కార్డులు లబ్దిదారులందరికి అందజేస్తాం. – సయ్యద్ షా ఫైజల్ హుస్సేనీ, డీసీఎస్ఓ ● జిల్లాకు చేరిక.. పంపిణీకి కసరత్తు మంత్రి సీతక్క చేతుల మీదుగా అందజేసేందుకు ఏర్పాట్లు -
అంతరపంటలతో.. అదనపు ఆదాయం
ఏటూరునాగారం: ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఆయిల్ పామ్ పంట దిగుబడి నాలుగేళ్లకు మొదలవుతుంది. అప్పటి వరకు తోటల్లో భూమిని ఖాళీగా వదిలేయకుండా అదనపు ఆదాయం కోసం అంతర పంటలను సాగు చేస్తున్నారు. మొదటి మూడేళ్లలో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండడంతో రైతులు సాగుపై మొగ్గు చూపుతున్నారు. దీంతో మిర్చి, కూరగాయలు, బొప్పాయి, అరటి, పసుపు, పైనాపిల్, వరి, పొగాకు, అల్లం, మొక్కజొన్న మొదలగు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో 4,183 ఎకరాల్లో సాగు జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఆయిల్పామ్ తోటలు 2025–26లో 3,733 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే 2026–27లో మరో 450 ఎకరాల్లో మొక్కలను నాటారు. మొత్తంగా 4,183 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలను రైతులు సాగు చేశారు. ఈ క్రమంలో అదనపు ఆదాయం కోసం సుమారు 2,403 ఎకరాల్లో అంతర పంటలు సాగు అవుతుందని వివరించారు. దీనివల్ల జిల్లాలో ఆహార పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఇలా అంతర పంటలను సాగు చేయడం వల్ల రైతులకు ఆదాయం, కూలీలకు పనులు, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. 6వ సంవత్సరంలో.. ఆయిల్పామ్ తోటల్లో 6వ సంవత్సరం నుంచి వక్క, మిరియాలు, దాల్చన చెక్క, లవంగాలు, జాజికాయ జాపత్రి వంటి ఆహార పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉందని హార్టికల్చర్ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఈ పంటలే కాకుండా పెరటి కోళ్లు, తేనే టీగలు, గొర్రెలు, పశువుల గడ్డిని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. అంతర పంటల వల్ల అదనపు ఆదాయంతో పాటు నీరు సైతం ఆదా అవుతుంది. కూలీలకు ఈ పంటల వల్ల 365 రోజులు పని దొరికే అవకాశం ఉంటుంది. అలాగే భూమికి మరింత విలువ పెరుగుతుంది. జిల్లాలో 4,183 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు 2,403 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తున్న రైతులు రైతులు ముందుకు రావాలంటున్న హార్టికల్చర్ అధికారులు -
ప్రమాదకరంగా మూలమలుపులు
ఎస్ఎస్తాడ్వాయి: జిల్లా పర్యాటక ప్రాంతాలకు నెలవు. నిత్యం పర్యాటకులు వివిధ వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటింది పస్రా నుంచి ఎస్ఎస్తాడ్వాయి వరకు గల 163 జాతీయ రహదారిపై మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. పస్రా నుంచి తాడ్వాయి వరకు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. పస్రా నుంచి తాడ్వాయి వరకు ఉన్న సుమారు 17 కిలోమీటర్ల రహదారిలో ప్రమాదకరంగా ఐదు మలుపులు ఉండడంతో ఇరుకై న రహదారి, భారీ వాహనాల రాకపోకలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జలగలంచ బ్రిడ్జి సమీపంలోని మూలమలుపులు మృత్యు మలుపులుగా మారాయి. రాత్రివేళల్లో దారుణం.. రాత్రి వేళల్లో మూలమలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో ఒక్కసారిగా బ్రేకులు వేసే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రాత్రివేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని వాహనదారులు చెబుతున్నారు. వేగంగా వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలతో చిన్నపాటి పొరపాటు జరిగినా ప్రాణాల మీదకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలగలంచ బ్రిడ్జి సమీపంలోని ప్రమాదకర మలుపుల వద్ద గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు వాహనదారులు మృత్యువాతపడిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ కారును ఇసుక లారీ ఢీ కొట్టడంతో సురేఖతో పాటు కారు డ్రైవర్ విజయబాబు మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా ఇటీవలన అదే మూలమలుపు వద్ద మొక్కలతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బొల్తా పడింది. దీంతో ఈ రహదారి ప్రమాదకర పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. భయంభయంగా.. నేషనల్ హైవే హనుమకొండ నుంచి పస్రా వరకు ప్రయాణం సాఫీగా సాగినా పస్రా దాటిన తర్వాత తాడ్వాయి వరకు 17 కిలోమీటర్ల ప్రయాణం వాహనదారులకు పరీక్షగా మారుతోంది. ఎక్కడ ఏ వాహనం ఎదురవుతుందో, ఏ మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉందోనన్న భయంతో నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు సైతం రహదారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా చర్యలేవీ? ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రహదారి మలుపుల వద్ద రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం, రక్షణ గోడలు నిర్మించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అవసరమైన చోట రహదారిని విస్తరించడంతో పాటు భారీ వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. పస్రా నుంచి తాడ్వాయి వరకు ప్రమాదకరం 17 కిలోమీటర్లు.. ప్రతిక్షణం భయమే ఇబ్బందులు పడుతున్న వాహనదారులు పట్టించుకోని ఉన్నతాధికారులు -
‘బొగత’ అదుర్స్
సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026‘రామప్ప’ చరిత్ర గొప్పది..వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం అందాలను వీక్షించి సమీపంలోని చిలుకల పార్కులో పిల్లలతో కలిసి సందడి చేశారు. బొగత జలపాతం అందాలను సెల్ కెమెరాల్లో బంధించడంతో పాటు వీడియోలను తీసుకుంటూ ఆనందంగా గడిపారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా జంపన్నవాగుకు చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం(బెల్లం), చీర సారె, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శనం అనంతరం భక్తులు అటవీ ప్రాంతంలో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప ఆలయం చరిత్ర ఎంతో గొప్పదని పలువురు పర్యాటకులు కొనియాడారు. ఈ మేరకు ఆదివారం దేవాలయాన్ని జర్మనీ దేశస్తులు కేబ్లిజ్ యంగ్, యులిస్టేయింబ్, చీకో స్టాన్లు సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంట ప్రతాప్ కుటుంబ సమేతంగా రామప్పను సందర్శించారు. వారికి అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్రను గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించారు.హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీమంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిలతైలాభిశేకం పూజలను జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. మూడు గంటల పాటు వేచి ఉండి భక్తులు స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు.వనదేవతలకు మొక్కులు -
ఏఐటీయూసీ పోరాట ఫలితమే
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల 24 డిమాండ్లపై యాజమాన్యంతో సానుకూల ఒప్పందాలు కుదరడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. ఏరియాలోని కొమురయ్య భవన్లో అదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 నుంచి పెండింగ్లో ఉన్న పెర్క్స్పై ఆదాయపు పన్ను రీఫండ్ సాధించామని, దీనివల్ల ఒక్కో కార్మికుడికి ఏడాదికి సుమారు రూ.35వేల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 2027 ఏప్రిల్లో ఈ మొత్తం ఖాతాల్లో జమ అవుతుందన్నారు. సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు అదనంగా రూ.20 లక్షలు అందించేలా అంగీకారం కుదిరిందన్నారు. మృతుల పిల్లలకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్, 2012 నుంచి పెండింగ్లో ఉన్న ఎన్ఓసీ పరిష్కారం, కట్ అయిన ఇంక్రిమెంట్ల పునరుద్ధరణ, క్యాడర్ స్కీమ్ల అమలు, క్లర్క్, సెక్యూరిటీ పోస్టుల పరీక్షలను రెండు నెలల్లో నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. -
జలం.. జర పదిలం
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటితో కళకళలాడాల్సిన చెరువులు, కుంటలు విషాదాలు నింపుతున్నాయి. ఈత రాకపోవడం, నీటి లోతు తెలియకపోవడం, చెరువుల చుట్టూ రక్షణ చర్యలు లేకపోవడం.. కారణం ఏదైనా నిండు ప్రాణాలను నీటిగుంతలు బలితీసుకుంటున్నాయి. తాజాగా ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇద్దరు అన్నదమ్ములు కుంటలో పడి మృతి చెందడం ఉమ్మడి వరంగల్లో చెరువులు, కుంటల వద్ద భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. చిన్నగురిజాలలో ఘటన విషాదకరం.. 2022 మార్చి 13న నర్సంపేట మండలం చిన్నగురిజాలలో జరిగిన ఘటన మరింత విషాదకరం. పొలం పనులు ముగించుకుని కాళ్లు, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన కృష్ణమూర్తి (65) ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మనవడు దీపక్ అలియాస్ లక్కీ (12) నీటిలోకి వెళ్లాడు. ఇద్దరూ మునిగిపోతుండడాన్ని చూసిన నాగరాజు (35) వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. చివరకు ముగ్గురూ నీటిలో మునిగి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన తాత, కొడుకు, మనవడు ఒకేసారి మృత్యువాత పడడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చేపల వేటకు వెళ్లి.. ముగ్గురు చిన్నారులు 2020 జనవరి 30న వరంగల్ జిల్లా గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. బరిగెల రుచిత (7), ప్రణయ్పాల్ (9), రణధీర్ (11) మృతి చెందారు. కోటచెరువులో.. 2023 మార్చి 31న వరంగల్ నగరంలోని ఏనుమాముల ప్రాంతం కోటచెరువు వద్ద మరో విషాదం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన కిరణ్సింగ్ (12), దీపక్సింగ్ (9) ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. స్థానికులు వారిని బయటకు తీసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దశదినకర్మకు వచ్చి.. 2022 డిసెంబర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బంధువు దశదినకర్మకు వచ్చిన వర్షిత్ (7), మరో 11 ఏళ్ల బాలుడు ఇంటి సమీపంలోని కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరూ మృతి చెందారు. పశువులను కాపాడబోయి.. కాపరి మృతి 2024 సెప్టెంబర్ 5న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి పరిధిలోని మర్రిపల్లిలో ననుబోతుల రాజు (25) బర్రెలను చెరువులో నుంచి బయటకు పంపించే క్రమంలో నీటిలో పడిపోయి మృతి చెందాడు. పశువులను కాపాడే ప్రయత్నమే అతడి ప్రాణాలను బలిగొంది. తల్లీకొడుకును మింగిన రెడ్డికుంట ఈ నెల 14న మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పిల్లిగుండ్ల తండాలోని మొగిలిచెర్ల రెడ్డికుంటలో విషాదం చోటుచేసుకుంది. కుంటలో పడి భూక్యా నవ్య (26), ఆమె కుమారుడు అన్వేష్ (9) మృతి చెందారు. హెచ్చరికల బోర్డులెక్కడ? ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నీటి గుంతలు విస్తారంగా ఉన్నాయి. వర్షాకాలంలో నీరు చేరితే ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా బహిర్భూమికి వెళ్లే సమయంలో, చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు, పశువులను నీటిలో నుంచి బయటకు తీసే క్రమంలో, స్నానానికి వెళ్లినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చెరువులు, కుంటల వద్ద హెచ్చరిక బోర్డులు, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, రక్షణ కంచెలు, అవసరమైన చోట్ల గస్తీ వంటి చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈత రాక.. లోతు తెలియక చిన్నారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవడానికి కారణం ఈత రాకపోవడం, నీటి లోతుపై అవగాహన లేకపోవడం. ఒకరు నీటిలో పడితే వారిని రక్షించే క్రమంలో మరొకరు కూడా మునిగిపోయిన ఘటనలు అనేకం.చెరువులు, కుంటల వద్ద ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, లోతైన ప్రాంతాల వద్ద కంచెలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలు కలిసి చిన్నారులు చెరువుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నీరు జీవనాధారం.. కానీ, అప్రమత్తత లేకుంటే అదే నీరు ప్రాణాంతకంగా మారుతోంది. ఉమ్మడి వరంగల్లో వరుసగా చోటుచేసుకుంటున్న జల ప్రమాదాలు దీనికి నిదర్శనం.అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంతలోకాలకు..చెరువులు, కుంటల్లో పలువురి జలసమాధి! పిల్లలు, రైతులు, కాపరులు.. ఒకరిని కాపాడబోయి మరొకరు ఒకే కుటుంబంలో మూడు తరాల వారు మృత్యువాత ఉమ్మడి వరంగల్లో విషాదం నింపిన పలు ఘటనలు -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మల్హర్: రైతు సంక్షేమ ధ్యేయమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం జయశంకర్భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఐదు మండలాలకు కేంద్రంగా కాటారంలో మాత్రమే మరమ్మతు కేంద్రం ఉండేదని, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులో జాప్యం జరగడంతో రైతులకు సకాలంలో సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని గుర్తించి కొయ్యూరులో మరో మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామని, అదేవిధంగా నాగులమ్మ నుంచి తాడిచర్ల వరకు, తాడిచర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ స్కీం కింద నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మల్లారం క్రాస్ రోడ్ నుంచి పెద్దతూండ్ల వరకు, పెద్దతుండ్ల నుంచి చిన్నతుండ్ల వయా మల్లారం వరకు రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జెన్కో ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ 500 మీటర్ల పరిధిలో ఉన్న తాడిచర్ల భూ నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కొయ్యూరులో ఏర్పాటు చేసిన నయారా పెట్రోల్ పంపును ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, ఈజీఎస్ చైర్మన్ దండు రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, తాడిచర్ల సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య, స్థానిక సర్పంచ్ కొండ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో బోధిస్తేనే ఉత్తమ ఫలితాలు
● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: ప్రణాళికతో బోధించి విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల, కళాశాలలోని నిఘా కెమెరాల పనితీరు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం తరగతి గదులను సందర్శించి బోధన తీరును పరిశీలించారు. జూనియర్ కళాశాల విద్యార్థినులకు నిర్వహిస్తున్న యూనిట్ పరీక్షల తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. భోజనం తయారీలో నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యాభ్యాసం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, రికార్డు అసిస్టెంట్ రాజు, సంబంధిత అధికారులు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి
● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ములుగు: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నోటీసుల జారీ, పరిష్కార చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆర్డీఓ కృష్ణవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్ధిష్ట గడువులోపు విచారణ చేపట్టాలన్నారు. సంబంధిత రికార్డుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. నోటీసులు అందజేసిన రోజు నుంచి 7 రోజుల గడువు పూర్తయిన అనంతరం విచారణ నిర్వహించాలని సూచించారు. అనామలిస్, నో మ్యాపింగ్ జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని తదితర అంశాలపై వివరించారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో అనామలిస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు సర్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘కాళేశ్వరం’ పనుల్లో రాతి స్తంభాలు వెలుగులోకి..
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా పునర్నిర్మాణ పనుల్లో పాత ఆలయాల కూల్చివేతలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శని వారం ఈఓ మహేశ్, క్షేత్ర కన్సల్టెన్సీ అసిస్టెంట్ స్థ పతి గణేషన్, ఇంజనీర్లు, ఆర్అండ్బీశాఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో గర్భగుడిని వారం క్రితం తొలగించగా మిగతా నాలుగు స్తంభాలను ప్రొక్లైయినర్తో ద్విలింగాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా తీశా రు. ద్విలింగాలు( జోడులింగాలు) ఇప్పటికే ఇనుప కంచెలాగా ఓ బాక్స్ చేసి పదిలంగా అమర్చారు. రాతి స్తంభాలు వెలుగులోకి.. గర్భగుడికి ఆనుకుని ఉన్న నాలుగు రాతి స్తంభాలు కాకతీయుల కాలం నాటివని తెలిసింది. ఆ రాతి స్తంభాలకు 1978–82 మధ్య కాలంలో జీర్ణోద్ధరణ సమయంలో సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి గర్భగుడిని పైనుంచి నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఆ రాతి స్తంభాలు ప్రస్తుతం వెలుగులోకి రావడంతో భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పురాతన రాతి నిర్మాణాలు బయటపడడంతో ఆలయ చరిత్రపై ఆసక్తి నెలకొంది. దేవస్థాన అధికారులు స్తంభాలపై సిమెంట్ తొలగింపు పనులు ముమ్మరం చేసి ఆరా తీస్తున్నారు. ఎలాంటి శాసనాలైనా ఉన్నాయా? మరేదైనా ఆనవాళ్లు లభిస్తాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. కాగా, ఇప్పటికే శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయం కింద కూడా రాళ్లు బయటపడిన విషయం విధితమే.ప్రధాన గర్భగుడికి మార్కింగ్ చేసి పునాది తవ్వకాలు విజయగణపతి ఆలయానికి కాంక్రీట్ పనులు 21.5 ఫీట్ల పొడవు, వెడల్పుతో గర్భాలయం21.5 ఫీట్ల పొడవు, వెడల్పుతో గర్భగుడి నిర్మాణం.. గర్భగుడి పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ, కాంట్రాక్టర్లు, ఆర్అండ్బీశాఖ, క్షేత్ర కన్సల్టెన్సీల ఆధ్వర్యంలో మార్కింగ్ ఇచ్చి పునాది తవ్వకాల పనులు ప్రారంభించారు. మట్టిని 12 ఫీట్ల మేర తీస్తున్నారు. 21.5 ఫీట్ల పొడవు, 21.5 ఫీట్ల వెడల్పుతో గర్భాలయ నిర్మాణం జరగనుందని తెలిసింది. అదేవిధంగా విజయ గణపతి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆలోచన దిశగా వచ్చే గోదావరి నది పుష్కరాల వరకు పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. -
భక్తుల కోలాహలం
మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్ రామనుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
ఈ సస్పెన్స్ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..
సీఎంతో భేటీ ఆధారంగా పార్టీ వివాదం సమసిపోయిందని చెప్పలేని పరిస్థితి. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మంత్రి సురేఖ పేర్కొనగా.. కొండా మురళీధర్రావు ‘సుస్మితకు ప్లాన్–ఎ అది.. ప్లాన్–బీ ఏముందో చెప్పలేం కదా’ అని చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వ్యతిరేకవర్గంలో చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తిరిగొచ్చిన తర్వాతే హైకమాండ్ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుంది? సురేఖపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్టాపిక్గా మారింది. -
ఆర్టీసీకి గిరాఖీ
హన్మకొండ: రాఖీ పండుగతో టీజీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. వరంగల్ రీజియన్లో రెగ్యులర్ బస్సులతో పాటు వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రీజియన్ పరిధిలో రెగ్యులర్ బస్సులకు తోడు 386 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బస్సులు మొత్తం 12,52,897 కిలోమీటర్లు తిరిగి, 15,44,158 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.8,62,41,648 ఆదాయం రాబట్టుకుంది. వరంగల్ ఆర్ఎం భవాని ప్రసాద్ నేతృత్వంలో డిప్యూటీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు, ప్రత్యేక బస్సులు సమకూర్చి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. అధికారులు బస్టాండ్లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వరంగల్ రీజియన్ పరిధిలో మూడు రోజుల్లో ప్రయాణికుల చేరవేత, ఆదాయం (రూ.లలో)తేదీ కిలోమీటర్లు ప్రయాణికులు ఆదాయం 26 3,91,916 4,27,281 2,28,75,620 27 4,16,861 5,16,877 2,83,14,190, 28 4,44,120 6,00,000 3,50,51,838 మూడు రోజులపాటు ప్రత్యేక సర్వీసులు ఆర్టీసీ ఆదాయం రూ.8,62,41,648 తిరిగిన కిలోమీటర్లు 12,52,897 చేరవేసిన ప్రయాణికులు 15,44,158 -
ఎన్హెచ్పై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
ములుగు: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన రోడ్డు భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో తన ఛాంబర్లో ఆయన శనివారం రోడ్డు భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై మల్లంపల్లి, పందికుంట, యువజన శిక్షణ కేంద్రం, జాకారం, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంతాల్లో అవసరమైన ప్రాంతాల్లో వేగ నియంత్రణ పట్టీలు, సూచిక బోర్డులు, రేడియం స్టికర్లు, ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారికి అనుసంధానమయ్యే రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయా అనుసంధాన ప్రాంతాల వద్ద వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా సూచిక, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఈశ్వర్ సింగ్ ఠాగూర్, ఎకై ్సజ్ సీఐ సుధీర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్, నేషనల్ హైవే, ఆర్అండ్బీ, పీఆర్, ఇంజనీరింగ్ అధికారులు, ఆర్టీసీ, పోలీస్, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
రామప్పలో సౌత్ జోన్ సెంట్రల్ రైల్వే జీఎం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సౌత్జోన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈవో ఉమ్మడి భాస్కర్ వారిని శాలువాలతో సత్కరించారు. రామప్ప శిల్పకళ సంపద గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వివరించారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు ములుగు: క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు, శిక్షణ సౌకర్యాలు కల్పించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా యువజన, క్రీడల అధికారి రామ్మోహన్ తెలిపారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్మోహన్ మాట్లాడారు. జిల్లాలో స్టేడియం, అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానిరి సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ వెంకట్రెడ్డి, ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ జగదీశ్, కోచ్లు సతీష్, శ్రీరామ్, హుస్సేన్, వ్యాయామ ఉపాధ్యాయులు మదన్మోహన్, లావణిక, రాజు, ఉపాధ్యాయులు, జూనియర్ అసిస్టెంట్ లావణ్య కుమారి, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసనలుఏటూరునాగారం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్లో పార్టీ ములుగు నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ సమావేశంలో ఖరారు చేసిన వెయ్యి రోజుల విఫల పాలన నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 హామీలలో ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చలేదని వెల్లడించారు. ప్రజలకు బాకీ ఉన్న హామీలపై సెప్టెంబర్లో చేపట్టే వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని కోరారు. నాగజ్యోతితో తనకు ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. ములుగు గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడమే లక్ష్యమని వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు యువకులు, కార్యకర్తలు మరింతగా శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), మంగపేట, ఎస్ఎస్తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ మహాముత్తారం: ఒడిషా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి సీసీఎస్, మహాముత్తారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో కాటారం గ్రామానికి చెందిన దానం శివకృష్ణ పట్టుపడ్డాడు. ఒడిషా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా శివకృష్ణను అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని 1.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
‘మినరల్స్’ ఎక్కడో.. పోస్టింగ్ అక్కడే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మైనింగ్ అంటేనే కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద. ఇసుక, క్వారీలు, గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్.. ఇలా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టేవి. వీటికి అనుమతులు ఇవ్వడం, లీజులను పర్యవేక్షించడం, రాయల్టీ వసూలు చేయడం, అక్రమ మైనింగ్, అక్రమ రవాణాను అడ్డుకోవడం మైన్స్ అండ్ జియాలజీ శాఖ పరిధిలోని కీలక బాధ్యతలు. అలాంటి శాఖలో జిల్లాస్థాయి అధికారుల పోస్టింగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వనరులు, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పైరవీలు, రాజకీయ పలుకుబడి, లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ బొజ్జ జయరాజ్కు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ సోదాలు జరగడం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్.. 12 జిల్లాల పర్యవేక్షణకు ఇన్చార్జ్.. భూపాలపల్లి మైన్స్ ఏడీగా పనిచేసి గురువారం ఏసీబీ దాడులకు గురైన బొజ్జ జయరాజు ములుగు జిల్లా మైన్స్ బాధ్యతల్లోనూ కొద్ది రోజులు ఇన్చార్జ్గా ఉన్నారు. 2024 మార్చి 15న భూపాలపల్లి ఏడీగా వచ్చిన ఆయన 2025 అక్టోబర్ 8న వరంగల్ రీజియన్ (ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం)కు డిప్యూటీ డైరెక్టర్గా ఇన్చార్జ్ బాధ్యతల్లోకి వచ్చారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ అదనపు బాధ్యతలు దక్కాయన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీంతో ఏడీతోపాటు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మంలకు చెందిన 12 జిల్లాల మైనింగ్ పర్యవేక్షణ బాధ్యతలు కూడా డీడీగా ఈయనకే. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్లో ఏడీలకు వరంగల్, హనుమకొండలకు చాలాకాలం ఒక్కరే ఏడీగా బాధ్యతలు నిర్వహించారు. భూపాలపల్లి, ములుగులకు కూడా ఒక్కరే ఉన్నారు. ఇటీవల హనుమకొండకు పూర్తి కాలపు ఏడీ రాగా, మిగతా చోట్ల హెడ్ ఆఫీసు కనుసన్నల్లో ఉండే ఏజీలను ఏడీలుగా నియమించారంటే గనులశాఖలో పోస్టింగ్ల తీరును అర్థం చేసుకోవచ్చు. ‘మినరల్స్’ ఉన్న చోటే ఎందుకీ ఆసక్తి? ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో ఖనిజ వనరులు ఒకే రకంగా లేవు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఇసుక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండగా.. ఇతర జిల్లాల్లో గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, లేటరైట్, ఇతర ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి. మహబూబాబాద్లో ఇనుప ఖనిజం, లేటరైట్తోపాటు బ్లాక్, కలర్ గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, ఎర్త్, గ్రావెల్ వంటి ఖనిజాలు ఉన్నట్లు అధికారిక మైన్స్ శాఖ వివరాలు చెబుతున్నాయి. అక్కడ 168 బ్లాక్ గ్రానైట్ మైనర్ మినరల్ లీజులు నమోదై ఉండగా.. 66 పనిచేస్తున్నట్లు జిల్లా శాఖ వివరాలు పేర్కొంటోంది. అందుకే ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మైన్స్ అధికారుల పోస్టింగులు సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ నేపథ్యంలోనే మినరల్స్ బాగా ఉన్న ‘మంచి పోస్టింగ్’ల కోసం పైరవీలు చేసుకుని వస్తున్నట్లు ప్రచారం ఉంది. వారికి రాజకీయ పలుకుబడి, ఉన్నతస్థాయి అండదండలు పుష్కలంగా ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మీడియాకు కూడా శాఖాపరమైన సమాచారం ఇవ్వకుండా ‘టూర్’ల పేరిట తప్పుకున్న సంధర్భాలు పలుసార్లు విమర్శలకు దారి తీశాయి. కాగా ఇటీవల ఏసీబీ దాడులు, అక్రమాస్తుల కేసులు వెలుగులోకి వస్తుండటంతో మైనింగ్ శాఖలో అధికారుల పోస్టింగులు, వారి పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది. ఆరు జిల్లాల్లో.. మూడుచోట్ల ఇన్చార్జ్లే.. ఆగస్టు 2026లో ఆయా జిల్లాల అధికారిక వెబ్సైట్లలో కనిపిస్తున్న వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మూడు చోట్ల ఇన్చార్జ్ వ్యవస్థ కనిపిస్తోంది. హనుమకొండలో ఏడీ బాధ్యతలు ఇన్చార్జ్కి ఉండగా ఇటీవల రెగ్యులర్ ఏడీని నియమించారు. వరంగల్లో రెగ్యులర్ ఏడీ ఉన్నట్లు జిల్లా వెబ్సైట్ పేర్కొంటోంది. జనగామలో జిల్లా వెబ్సైట్, కేంద్ర మైన్స్ శాఖ డేటాలో అధికారి హోదాకు సంబంధించి వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక్కడ కూడా అసిస్టెంట్ జియోలజిస్టు(ఏజీ)నే ఇన్చార్జ్ ఏడీగా నియమించినట్లు తెలిసింది. మహబూబాబాద్లో రెగ్యులర్ ఏడీ ఉన్నారు. భూపాలపల్లిలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జి ఏడీగా ఉన్నారు. ఆయన (బి.జయరాజు) గురువారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఇందులో కొన్ని చోట్ల అసిస్టెంట్ జియాలజిస్ట్లు ఇన్చార్జ్ అసిస్టెంట్ డైరక్టర్లుగా పోస్టింగ్లు తెచ్చుకున్నారు. ములుగులో ఇన్చార్జ్ ఏడీగా ఉన్న అసిస్టెంట్ జియోలజిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్చార్జ్ ఏడీగా కూడా వ్యవహరిస్తున్నారు. గనులశాఖలో కొందరు అధికారుల తీరిది పొలిటికల్ అండ, ఉన్నతాధికారుల సపోర్టు ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలు.. ఏడీలకు డీడీ బాధ్యతలు ఆదాయానికి మించిన ఆస్తులు.. అక్రమ వ్యాపారులతో చెట్టాపట్టాల్ ఏసీబీ సోదాలతో మళ్లీ చర్చకు వచ్చిన పోస్టింగ్ల దందా -
శ్రీభద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాయంలో శ్రావణపౌర్ణమి అమ్మవారికి పవిత్రోత్సవం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించారు ప్రధానార్చకులు భద్రకాళి శేషు అధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తికి అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు రక్షాకంకణాలు అందించారు. తాతయ్య ఫొటోకు రాఖీ వాజేడు: తాత ఫొటోకు రాఖీ కట్టి ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటుంది ఓ మనుమరాలు. మండల కేంద్రానికి చెందిన నిశ్విత తాత విరాట్ మూర్తి ఆరేళ్ల క్రితం మృతిచెందారు. ఆయనపై ఉన్న అభిమానంతో మనుమరాలు శ్రీజ అతని ఫొటోకు రాఖీ కట్టేది. అయితే గత ఏడాది శ్రీజ వివాహం కావడంతో ఈసారి శ్రీజ సోదరి నిశ్విత విరాట్ మూర్తి ఫొటోకు రాఖీ కట్టి సంప్రదాయాన్ని కొనసాగించింది.వాహనాల బహిరంగ వేలం ములుగు: ములుగు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం ఆగస్టు 31న స్టేషన్ ఆవరణలో నిర్వహించనున్నట్లు ములుగు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు వాహనాల ధరలో 50 శాతం మొత్తాన్ని దరావత్తుగా చెల్లించాలని తెలిపారు. వేలంలో వాహనం దక్కించుకున్న వారు అదే రోజు మిగిలిన మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని తెలిపారు. స్క్రాప్ వాహనాలను కట్ చేసి మాత్రమే తరలించాలని, వేలంలో వాహనం పొందిన వారు నిబంధనల ప్రకారం జీఎస్టీని చెల్లించాలని స్పష్టం చేశారు. వాహనాల వేలం ఆగస్టు 31న ఉదయం 10.30లకు భూపాలపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సమక్షంలో నిర్వహించనున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కొడుకుతో గొడవపడి తండ్రి ఆత్మహత్య ఏటూరునాగారం: కుమారుడితో గొడవపడి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏటూరునాగారంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తుమ్మ రమేష్ (50) భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. స్థానిక బస్టాండ్లోని ఓ హోటల్లో పనిచేస్తుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన రమేష్.. ఈనెల 27న తన కుమారు డు మహేష్తో గొడవ పడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. శుక్రవారం వరకు ఇంటికి రాకపోవడంతో జంపన్నవాగు సమీపంలో వెతకగా చెట్టుకు ఉరివేసుకొని మృతిచెంది కనిపించాడు. మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విచారణ చేపట్టి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికుల చేరవేత హన్మకొండ: రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడిపినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులు సమకూర్చి వారిని గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. ఈ నెల 26న 84 ప్రత్యేక బస్సులు నడుపడం ద్వారా దాదాపు 4,27,281 మంది ప్రయాణికులను, 27న 152 ప్రత్యేక బస్సుల ద్వారా 5,16,877 మంది, 28న 150 ప్రత్యేక బస్సుల ద్వారా 6 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. రాఖీ వేడుకలు ముగించుకుని తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తగినన్ని బస్సులను తిప్పనున్నామని పేర్కొన్నారు. -
బిందు ‘సేద్యానికి రాయితీ’
● రూ.36 లక్షలు మంజూరు ● ఆయిల్పామ్, మిర్చి, కూరగాయల సాగుకు ప్రోత్సాహకంఏటూరునాగారం: ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో జిల్లాలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి రావడానికి, పంటలను కాపాడుకోవడానికి స్ప్రింక్లర్ పరికరాలతోపాటు మల్చింగ్ కవర్లు, చిన్ననీటి కుంటలను రైతులు వినియోగించుకునేందుకు ప్రభుత్వం రాయితీ విధానం ప్రవేశపెట్టింది. మిర్చి, ఆయిల్ పామ్, కూరగాయలు, మల్బరి, పండ్ల తోటలకు డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్ పరికరాలను రాయితీపై అందిస్తుంది. 8,417 మందికి అందజేత హార్టీకల్చర్ సాగుకు రైతులకు ప్రభుత్వం రాయితీ అందజేస్తుంది. 2026 జనవరి వరకు జిల్లాలో 8,417 మంది రైతులకు 7,930 హెక్టార్లలో రూ.56.13 కోట్లతో బిందు సేద్యం, తుంపర్ల సేద్యం పరికరాలను రాయితీపై అందించింది. దీంతో తక్కువ నీటితో ఎక్కువ పంటలు దిగుబడి సాగు అవుతున్నాయని ప్రభుత్వం వచ్చే ఏడాదికి కూడా మరిన్ని యూనిట్లకు నిధులు కేటాయించింది. 2026–27 సంవత్సరానికిగాను 212 ఎకరాల్లో రూ.36 లక్షల విలువైన బిందు సేద్యం పరికరాలకు కలెక్టర్ మంజూరు ఇచ్చారు. దీనిద్వారా మరికొంత మందికి డ్రిప్ పరికరాలు అందనున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం రాయితీ ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం రాయితీతో డ్రిప్ యూనిట్ను మంజూరు చేయనున్నారు. 5 ఎకరాలలోపు సన్న, చిన్న కారు రైతులకు, ఇతర రైతులకు 80 శాతం రాయితీ అందించనుంది. 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు 70 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలను అందించడానికి ప్రభుత్వం ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులు కోరింది. స్ప్రింకర్లు(తుంపర సేద్యం) పరికరాలపై అన్ని వర్గాల రైతులకు 65 శాతం రాయితీ ఉంది. ఆసక్తిగల రైతులు సమీప ఉద్యాన అధికారి, లేదా జిల్లా ఉద్యాన అధికారి కార్యాలయంలో సంప్రదించాని ఇతర వివరాల కోసం 77801 32284, ఉద్యానవన అధికారి ఏటూరునాగారం 77023 83263, జిల్లా కార్యాలయం 89777 14067 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఆయకట్టు కాల్వల మరమ్మతులకు నిధులు
● ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ ధర్మగణపురం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి పెద్ద చెరువుల్లో ఒక్కటైన గణపసముద్రం చెరువు ఆయకట్టు కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం రూ.31 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఐబీ ఇరిగేషన్శాఖ సీఈ ధర్మ తెలిపారు. శుక్రవారం గణపసముద్రం ఆయకట్టు కాల్వలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తడి కాల్వ, పైడి కాల్వ, కోట కాల్వ, కొత్త కాల్వల అభివృద్ధికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపసముద్రం చెరువు ఆయకట్టు కాల్వల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతాంగానికి సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందేందుకు కాల్వల మరమ్మతు పనులు ప్రారంభిస్తామన్నారు. మరో పదిరోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాము, ఎస్సీ మోహన్ రావు, ఏఈలు సమ్మారావు, శ్రీనివాస్, సర్పంచ్ కట్కూరి రాధికశ్రీనివాస్, రైతులు ఉన్నారు. -
బాలికల విద్య దేశ సాధికారతకు పునాది
ములుగు: బాలికలు విద్య దేశసాధికారతకు పునాది అని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలిసదన్ బాలికలు కలెక్టర్కు రాఖీ కట్టారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికను చదివిద్దాం– దేశాన్ని సాధికారత వైపు నడిపిద్దామనే నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. రక్షాబంధన్ పర్వదినా న్ని పురస్కరించుకొని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలసదనంలోని బాలికలు రాఖీ కట్టడం ఆనందంగా ఉందన్నారు. బాలికలను ఆప్యాయంగా పలకరించి అశీర్వదించారు. అనంతరం బాలికలకు మిఠాయిలు అందజేశారు. క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాల ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెల్లి ప్రేమలత, బాలల సహాయవాణి జిల్లా సమన్వయక కర్త నరేష్, బాలసదనం సిబ్బంది అరుణ, రాణి, సఖి కేంద్రం సిబ్బంది లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు -
రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
ఏటూరునాగారం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇటీవల మరణించిన సారంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వాణిజ్య విధానం పేరుతో దేశంలోకి విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 36వ అఖిల భారత మహాసభలు నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18వ రకు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభల జయప్రదానికి రైతులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకుడు సూడి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు, తుమ్మల వెంకట్రెడ్డి, దావూద్, తీగల ఆదిరెడ్డి, చిట్టెం ఆదినారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు -
అధికారులు బాధ్యతతో పనిచేయాలి
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కములుగు: జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. మండల పరిధిలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సీతక్క గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి సంబంధిత ప్రాజెక్టులకు సమగ్ర అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన వివరాలను శాఖలవారీగా నమోదు చేయాలని సూచించారు. పనులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నిరంతరం రామప్ప సరస్సుకు తరలించే సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలించాలని సూచించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. రూ.8.50 కోట్ల పనులకు శంకుస్థాపన ములుగు పురపాలక సంఘం నిధులతో మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో రూ.8.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. బండారుపల్లిలో రూ.5.50 కోట్లతో, జీవింతరావుపల్లిలో రూ.3 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. అదే విధంగా ములుగు మండలంలో నూతనంగా ఏర్పాటైన బంజారుపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆనంతరం జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్, ఉద్యానశాఖ కార్యాలయాలను మంత్రి సీతక్క తనిఖీ చేసి విధుల్లో లేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధారాలు చూపాల్సిందే..
ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి తుది దశ ప్రక్రియ మొదలైంది. మ్యాపింగ్ కాని వారితో పాటు అనామలిస్ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) జాబితాలో చేరిన ఓటర్లకు బీఎల్వోలు గురువారం నుంచి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులు అందుకుంటున్న వారు నిర్ణీత గడువులోగా తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మ్యాపింగ్ కాని, ఆధారాలు సరిగ్గాలేని ఓటర్లకు ఇళ్ల వద్దకే వచ్చి బీఎల్వోలు నోటీసులు అందజేస్తున్నారు. 1 జూలై 1987లోపు జన్మించిన వారు నోటీసులు అందుకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. 1987 నుంచి 2004 మధ్యలో జన్మించిన వారు నోటీసు ఆందుకున్న వ్యక్తితో పాటు తల్లి లేదా తండ్రికి చెందిన గుర్తింపు కార్డు అందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సవరణలు, ఆధారాల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 20న ముగుస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అక్టోబరు 19న తుది ఓటరు జాబితా విడుదల కానుంది. 12 రకాల గుర్తింపు కార్డులు ఇవే.. నోటీసులు పొందిన ఓటర్లు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని బీఎల్వోకి లేదా తహసీల్దార్ కార్యాలయంలో చూపించి తమ ఓటును సరిచేసుకోవాలి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్బుక్, ఉపాధిహామీ జాబ్ కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సురెన్స్ కార్డు, పింఛన్ బుక్, రైతు పాస్బుక్, ఎన్పీఆర్ స్మార్ట్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి. 8,028 మందికి నోటీసులు ములుగు నియోజకవర్గంలోని 10 మండలాల పరిధిలో 303 పోలింగ్ బూత్లు ఉండగా 2,09,128 మంది ఓటర్లు ఉన్నట్లు ఈ నెల 17వ తేదీన అధికారులు ఓటర్ల మసాయిదాను విడుదల చేశారు. జిల్లాలో నో మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లు 41,900 మంది ఉన్నట్లు గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో గురువారం సాయంత్రం వరకు 8,028 మందికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు తీసుకున్నవారు నిర్ణీత గడువులోపు ఆధారాలు చూపకుంటే ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. లేదంటే ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం రేపటి నుంచి ఆధారాల స్వీకరణ జిల్లాలో 41,900 మందికి జారీ కానున్న నోటీసులు ఇప్పటి వరకు 8,028 మందికి జారీనియోజకవర్గంలో మండలాల వారీగా జారీ చేసిన నోటీసులుమండలం మొత్తం జారీ నోటీసులు చేసినవి మంగపేట 9,589 1,362 ఏటూరునాగారం 3,703 932 ములుగు 6,742 632 గోవిందరావుపేట 2,227 950 కొత్తగూడ 5,342 291 మల్లంపల్లి 648 90 వెంకటాపురం(ఎం) 5,207 1,288 ఎస్ఎస్తాడ్వాయి 3,772 712 కన్నాయిగూడెం 3,056 1,260 గంగారం 1,614 511 -
తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న
కష్టమే రానివ్వనని ఒకరు. ఆపదొస్తే అండగా నిలుస్తానని మరొకరు. నీకు నేనున్నానంటూ ఇంకొకరు.. తోబుట్టువుకు సగం ఆస్తి రాసిచ్చిన అన్న ఒకరు. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తమ్ముడొకరు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. రాఖీ పండుగకు అసలైన అర్థం చెబుతున్న వీరందరి గురించి రక్షాబంధన్ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. కాశిబుగ్గ: కొత్తవాడకు చెందిన దువ్వ సాంబమూర్తి–రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా, ఒక కుమారుడు రాజ్కుమార్, కుమార్తె శీరిష ఉన్నారు. వికలాంగుడైన తండ్రి సాంబమూర్తి కుమార్తె పెళ్లి చేసిన తర్వాత మరణించాడు. చెల్లెలిపై ప్రేమతో అన్న రాజ్కుమార్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) చెల్లి, బావకు కొత్తవాడలోని ఇంట్లోనే నివాసం కల్పించాడు. చెల్లెలిపై ప్రేమతో ఆరునెలల క్రితం పుర ప్రముఖుల సమక్షంలో 180 గజాల ఇల్లు స్థలంలో సగం 90 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి, కాగితాలు అప్పగించాడు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్కుమార్ను అందరూ అభినందిస్తున్నారు. తండ్రి ప్రేమను పంచిన పలువురు అన్నలు ఆస్తి కాదు.. అనుబంధమే ముఖ్యమంటున్న ఓ సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తున్న సోదరులు రాఖీ కట్టి రక్షగా నిలుస్తామంటున్న సోదరీమణులు నేడు రాఖీ పౌర్ణమి -
తల్లీతండ్రి అన్నీ.. అన్నే!
ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన దుబ్బాక శ్రీనివాస్కు ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, రవళి. శ్రీనివాస్ 17 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిపి ఉన్నత చదువులు చదివించాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి తన వంతుగా బాధ్యత నెరవేర్చాడు. తమ కోసం అన్న పడిన కష్టాలను మరచిపోని స్వప్న, రవళి ప్రతీ ఏడాది ఎక్కడున్నా.. రాఖీ పండుగకు వచ్చి అన్నకు రాఖీ కడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా.. మేమున్నాం అని చెల్లెళ్లకు భరోసా ఇచ్చిన అన్నకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చెబుతున్నారు. -
మండలాల వారీగా గ్రామసభల్లో వచ్చిన సమస్యలు..
● లింగాల గ్రామానికి చెందిన చెన్యూరి కన్నయ్యకు మూడేళ్లుగా ఓటరు జాబితాలో పేరు లేదు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ అందించిన ఎన్యూమరేషన్ ఫారం కూడా అందలేదు. ఈ క్రమంలో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తన పేరు ఓటరు జాబితాలో లేదని అధికారుల దృష్టికి కన్నయ్య తీసుకెళ్లారు. దీంతో పేరు చేర్చుకునేందుకు ఫారం–6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయించారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో కన్నయ్యకు తిరిగి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం లభించింది.మంగపేట: మండల పరిధిలో 25 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. బుచ్చంపేటలో 222వ పోలింగ్ కేంద్రం పరిధిలో 850 మందికి ఓటర్లు ఉండగా 145 మంది ఓటర్ల వివరాల్లో వివిధ రకాల సవరణలపై వివరాలను కోరుతూ బీఎల్ఓ లక్ష్మణ్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్తాడ్వాయి: మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన గాలిబు తరమ్మకు ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారం అందలేదు. దీంతో ఓటరు జాబితాలో పేరు సైతం రాలేదు. తన భర్త వెంకమల్లుకు సైతం ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారం రాకపోవడంతో ఓటరు లీస్ట్లో పేరు లేదు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఇద్దరికి ఓటు హక్కు వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను వేడుకుంది. -
విధులకు సకాలంలో హాజరు కావాలి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోఎస్ఎస్తాడ్వాయి: వైద్యాధికారులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. మండల పరిధిలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇన్పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. రోగుల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రోగుల సహాయకులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దోమల నివారణకు నివాస ప్రాంతాల్లో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ (ఐఆర్ఎస్) చేపడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని నివాస ప్రాంతాల్లో ఐఆర్ఎస్ కవరేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మందుల నిల్వ గదిని తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పంపిణీ చేసే మందుల వివరాలను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసిన ఆయన రోగులకు మందులు పంపిణీ చేసే తీరును పరిశీలించారు. -
సోదరభావానికి ప్రతీక రాఖీ పండుగ
ములుగు: సోదరభావానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులకు గురువారం మంత్రి సీతక్కకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీతక్కకు చీర బహుకరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి సీతక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు నిర్వహించి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి సీతక్క రాఖీలు కట్టారు. బెటాలియన్ కమాండెంట్గా లక్ష్మీకాంతరావు గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ బెటాలియన్ (టీజీఎస్పీ) నూతన కమాండెంట్గా సీవీ.లక్ష్మీకాంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో విధులు నిర్వహించిన ఆయన అంకితభావం, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశమైన మాట్లాడారు. బెటాలియన్లో క్రమశిక్షణ, సమన్వయం, విఽధి నిర్వహణతో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బెటాలియన్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. నూతన కమాండెంట్కు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో సహాయక కమాండెంట్లు పీకే ప్రసాద్, ధర్మారావు, ఆర్ఐలు కిరణ్ కుమార్, భాస్కర్, స్వామి, వెంకటేశ్వర్లు, సాయిబాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ పోటీలకు బాచి ఎంపిక ములుగు: మండల పరిధిలోని బండారుపల్లిలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థి గుడెల్లి బాచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. దక్షిణ జోనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు –2026 అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాచి 60 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం అందుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ సింగారం దేవకి తెలిపారు. ఈ మేరకు గురువారం అధ్యాపకులు బాచిని అభినందించారు. హిందూ సంప్రదాయ దుస్తుల్లో జర్మనీ దేశస్తులు వెంకటాపురం(ఎం): భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతూ జర్మనీ దేశానికి చెందిన సాండ్రో కోట్, స్టెపానీ ఎంజిల్మెన్ హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి రామప్ప దేవాలయాన్ని గురువారం సందర్శించారు. భారతీయ సంస్కృతిలో పురుషులు ధోతి, కుర్తా మహిళలు చీరవంటి సంప్రదాయ వస్త్రాలను ధరించడం ద్వారా మన ఆచార వ్యవహారాలకు గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. టూరిజం గైడ్ విజయ్ కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా వారు రామప్ప శిల్పకళను ఆసక్తిగా తిలకించారు. రామప్ప ఆలయం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. రేషన్ షాపు తనిఖీమహాముత్తారం: మండల పరిధిలోని కొర్లకుంటలో గల రేషన్ షాపును గురువారం జిల్లా తూనికల కొలతల అధికారి శ్రీలత తనిఖీ చేశారు. దుకాణంలోని కాంటాను పరిశీలించారు. లబ్ధిదారులకు బియ్యం తూకం వేసేటప్పుడు తట్టు సంచిని ఉపయోగించి వేసినట్లు విచారణలో తేలిందన్నారు. -
విజయగణపతితో మొదలు..
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం రాతి కట్టడాలకు ఒక్కో అడుగు పడుతోంది. ఆలయ జీర్ణోద్దరణలో భాగంగా పాత ఆలయాల తొలగింపు పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. డ్రాయింగ్, డిజైన్లలో స్వల్ప మార్పులు, చేర్పుల తర్వాత మార్కింగ్లు మొదలు పెట్టారు. పడమర, దక్షిణ గోపురాల మధ్య నైరుతి మూలన పూర్వం నుంచి ఉన్న విజయగణపతి ఆలయం స్థలంలోనే గురువారం మళ్లీ రాతి నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చి ముగ్గుపోశారు. ప్రాకారానికి ముగ్గుపోసి మార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 12 ఫీట్ల మేర లోతు తవ్వకాలు జరిపి దిగువన భూమి నుంచి పైకి కాంక్రీట్, ఇనుముతో బేస్మెంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. క్రషర్ పనులు చేపట్టడానికి పక్కనే నీటి ట్యాంకు కూడా నిర్మించారు. ఇప్పటికే గ్రానైట్ స్టోన్, ఇనుము, సిమెంట్, ఇసుకను కాంట్రాక్టర్లు తెప్పించారు. పడమర వైపున నైరుతి నుంచి ఉత్తరం వైపున వాయువ్యం మూల వరకు 12 ఫీట్ల లోతు వరకు ప్రొక్లైయిన్తో తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 360 ఫీట్ల పొడవుతో 280 ఫీట్ల వెడల్పుతో ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రధాన ఆలయానికి ఆంధ్రప్రదేశ్లోని గురజపల్లిలో కృష్ణశిలకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. చురుగ్గా కాళేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు -
ఏటా ఒకచోట వేడుకలు
డోర్నకల్: డోర్నకల్లోని బ్యాంక్ స్ట్రీట్కు చెందిన కాలా యశోధర్ జైన్కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెళ్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్జైన్కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు. -
నిట్తో ఎంఓయూ..
కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
లబ్ధిదారుడికి పింఛన్ మంజూరు పత్రం అందజేస్తున్న మంత్రి సీతక్కమార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి సీతక్కఎస్ఎస్తాడ్వాయి/మంగపేట: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో రూ.4.46 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏటూరునాగారం మండలం శివాపూర్లో రూ.80లక్షలతో చేపట్టిన పనులను ప్రారంభించారు. గోగుపల్లిలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటూరునాగారం మార్కెట్ యార్డులో రూ.2.28 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రహదారులు, మురుగు కాల్వలతో పాటు మార్కెట్ యార్డుల్లో అవసరమైన సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మంగపేట మండలంలో బుధవారం సాయంత్రం మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీఓ భద్రునాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందచేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటీవల హేమాచల క్షేత్రం అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేయగా మరింత అభివృద్ధికి సీఎం ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అలాగే మామిడిగూడెంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నరసింహస్వామి, వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
హక్కుల సాధనకు ఉద్యమాలు ఉధృతం
● తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఆదివాసీ మార్చ్కు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను తుడుందెబ్బ నాయకులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీల మనుగడ దినదినగండంగా మారుతోందన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేదని విమర్శించారు. ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏల ద్వారానే ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి మార్చ్లు సెప్టెంబర్ 7న ఏటూరునాగారం, 16న ఉట్నూర్, 21న భద్రాచలం, 28న మన్ననూరులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆదివాసీలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు, రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్, ఏఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గణేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ‘లేఖల’ లొల్లి?
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారికంగా పరిపాలనా కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. కొందరు ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో కీలక మార్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్బీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చెన్నూరి శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి ఎస్హెచ్ఓగా నియమించారు. అక్కడ చిట్యాల సర్కిల్లో పనిచేస్తున్న దగ్గు మల్లేశ్ను మల్టీజోన్–1, హైదరాబాద్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో యడ్లపల్లి సతీష్ చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఇదే జోన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. వరంగల్కు ముగ్గురు.. ఒకరు బయటకు.. వరంగల్ కమిషనరేట్కు తాజా బదిలీల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు వచ్చారు. రామగుండం కమిషనరేట్ టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, రామగుండం కమిషనరేట్ లీగల్ సెల్లో పనిచేస్తూ మల్టీజోన్–1 కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉన్న అనుముల శ్రీనివాస్ను కూడా వరంగల్ కమిషనరేట్కు పంపారు. హైదరాబాద్ టీజీఐసీసీసీ ఇన్స్పెక్టర్ భరత్ సుమన్ను కూడా కమిషనరేట్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు వరంగల్ కమిషనరేట్ సీఎస్బీలో పనిచేస్తున్న యడ్లపల్లి సతీష్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్కు బదిలీ చేశారు. ‘లేఖ’ ఎవరిది.. పోస్టింగ్ ఎక్కడ? ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగిన ప్రతీసారి రాజకీయ సిఫారసుల అంశం తెరపైకి వస్తుండటం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా తమకు అనుకూలమైన సర్కిల్, కమిషనరేట్ లేదా కీలక విభాగంలో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తాజాగా మల్టీజోన్–1 పరిధిలోని 9 మందికి బదిలీ కాగా.. తమకు అనుకూలమైన పోస్టింగ్ల కోసం మరికొందరు ఇన్స్పెక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. త్వరలోనే వరంగల్ కమిషనరేట్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన కొందరికి బదిలీలు ఉంటాయంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్ల నుంచి కొందరు వరంగల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. అధికారికంగా మాత్రం ‘అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’... మల్టీజోన్–1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ తొమ్మిది మంది బదిలీలను ‘ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’గా పేర్కొంది. దీంతో అధికారిక ఉత్తర్వుల్లో పరిపాలనా కారణాలే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ సిఫారసులపై చర్చ సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎవరి సిఫారసు పనిచేసింది? ఎవరి పోస్టింగ్ మారింది? అన్నదానిపై పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. భవిష్యత్లో జరగనున్న బదిలీలు, పోస్టింగ్ల ఉత్తర్వులు వెలువడితే గాని మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పోలీస్ పోస్టింగుల్లో తీవ్ర చర్చ మల్టీజోన్–1లో 9 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ వరంగల్ కమిషనరేట్కు ముగ్గురు.. ఇక్కడినుంచి ఒకరు బయటకు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పోస్టింగులంటూ ఆరోపణలు.. గతంలోనూ ఇదే తరహా వివాదాలు -
భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సూచించారు. ఏరియా జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏరియా సేఫ్టీ అధికారి మాటూరి రవీందర్ సమావేశానికి అధ్యక్షత ఏర్పాటు చేసిన సమీక్షలో ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో అమలవుతున్న భద్రతా చర్యలు, సేఫ్టీ నిబంధనల అమలు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఉద్యోగుల భద్రత, తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల్లో భద్రతకు సంబంధించిన సమస్యలను జీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వాటిపై చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. భద్రతే ప్రధానం అనే భావనతో ప్రతీ అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జీఎం రాజేశ్వర్రెడ్డి తెలిపారు. -
ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగం
నిట్ వరంగల్లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్ ● -
నేటి నుంచి గ్రామసభలు
ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నేటి నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభల్లో అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని వివరించారు. పేరు లేకపోయినా, కొత్త ఓటరు కావాల్సిన వారికి ఫామ్ 6తో దరఖాస్తు చేయాలని, ఫామ్ 7 సవరణలు, ఫామ్ 8 ద్వారా బదిలీ చేపట్టాలని వెల్లడించారు. ఏదైనా సలహా కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవాలని కోరారు.రామప్పలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని బుధవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయ్యంగార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళకు తలమానికం రామప్ప దేవాలయమని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల అధికారులు ఉన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి ములుగు: జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్శాఖ ఏఈకి వినతి పత్రాన్ని కాలనీ వాసులు బుధవారం విద్యుత్శాఖ కార్యాలయం వద్ద బుధవారం అందజేశారు. కృష్ణకాలనీలోని 15వ వార్డులో లోవోల్టేజీ సమస్యతో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయని వార్డు కౌన్సిలర్ వాణికుమార్ ఏఈకి వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సంపత్, గండ్రకోట కుమార్, చుంచు రమేశ్, నాగేశ్వర్రావు, సుధాకర్, శంకర్, కుమార్, సంపత్, ఇక్బాల్ పాల్గొన్నారు. రాఖీ మహోత్సవం ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయిపల్లికి చెందిన సంతోష్, రాజేందర్, సమ్మయ్య తదితరుల ఆధ్వర్యంలో బుధవారం రాఖీ మహోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు 1200 మందికి కట్టించి రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్లు విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్కుమార్ తెలిపారు. పాఠశాలల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలను చేపట్టినట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు. మేడిగడ్డకు ప్రాణహిత వరద కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది వరద మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తింది. బుధవారం ఉదయం 1.51 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ నుంచి తరలిరాగా, సాయంత్రానికి 1.29 లక్షల క్యూసెక్కులకు తగ్గి మేడిగడ్డకు చేరుతోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఔట్ఫ్లో రూపంలో తరలిస్తున్నారు. కాగా, మంగళవారం 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిపోయింది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పడుతున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. -
చెక్డ్యామ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
● టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు: చెక్డ్యామ్లు, పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతీ గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య, ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సీతక్క జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన పంటకుంటల పనులను వెంటనే ప్రారంభించి, ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో చెక్డ్యామ్లు, పంటకుంటలు, ఇతర నీటి సంరక్షణ పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, జీవనోపాధికి ఉపయోగపడే ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. అలాగే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 5.32 కోట్ల మొక్కలు నాటి 86 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్రావు, డీఆర్డీఓ రవీందర్, డీపీఓ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
మండలాల వారీగా వితంతువులు, ఒంటరి మహిళలు
● బీసీ మహిళలకు ఉచితంగా రూ.12వేల విలువైన ఆటోమేటిక్ మిషన్లు ● 18 నుంచి 55ఏళ్లలోపు మహిళలు అర్హులు ● వితంతు, ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ● సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు గడువు కనీస విద్యార్హత ఉండాలి.. ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ లబ్ధి పొందాలంటే మహిళలకు కనీస విద్యార్హత ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, అర్హత పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయిస్తారు. ఆన్లైన్ చేసిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుదారులు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.ములుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు, వడ్డీలేని రుణాలు, రుణ బీమా పథకం, ఆరోగ్యలక్ష్మి. స్వయం ఉపాధి పథకాలను అందిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకం ద్వారా మరింత ప్రయోజనం కలుగనుంది. ప్రభుత్వం తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాకు రెండు వేల కుట్టుమిషన్లు ప్రభుత్వం తొలి విడతగా ప్రతీ జిల్లాకు రెండు వేల కుట్టు మిషన్లు వందశాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. జిల్లాలో ములుగు, వెంకటాపురం(ఎం), మంగపేట, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మల్లంపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే కుట్టుమిషన్ తీసుకోవడానికి మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేల వరకు ఉంటుంది. జిల్లాకు 2 వేల వరకు ఆటోమేటిక్ కుట్టుమిషన్లు మహిళలకు అందించనుండడంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. వచ్చేనెల 15 వరకు గడువు జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన 18 నుంచి 55 ఏళ్ల వరకు ఉన్న మహిళలు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని వర్తింపజేస్తారు. దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 16,337 మంది వితంతువులు, 1,511 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. అదే విధంగా మేర, మేరు సామాజిక వర్గానికి చెందిన వారికి సైతం ప్రాధాన్యం ఉంటుంది.మండలం వితంతువులు ఒంటరి మహిళలు ఏటూరునాగారం 1,557 173 గోవిందరావుపేట 1,858 100 కన్నాయిగూడెం 551 61 మల్లంపల్లి 852 54 మంగపేట 2,573 258 ములుగు 1,915 126 ములుగు మున్సిపాలిటీ 816 60 ఎస్ఎస్తాడ్వాయి 1,189 132 వెంకటాపురం(ఎం) 2,064 106 వెంకటాపురం(కె) 1,659 262 వాజేడు 1,303 179 -
పోలీస్స్టేషన్ ఆకస్మిక తనిఖీ
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్, క్రైమ్ ఫైల్స్, పీఎస్ పరిసరాలు, ఆయుధాల పనితీరు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్స్, సీసీటీఎస్ఎస్, రోడ్డు ప్రమాదాల పోర్టల్, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీల గురించి సమీక్ష నిర్వహించి సిబ్బంది పలు సూచనలు చేశారు. ఆ తర్వాత పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ ముత్యం రమేశ్, ఎస్సైలు తిరుపతిరావు, తిరుపతి రెడ్డి, సాయి కృష్ణలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని, ప్రతీ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాభావ పరిస్థితులు, నీట్–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, చారిత్రక, వారసత్వ, ఎకో టూరిజం, హస్తకళలు, జల పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అనుసందానిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ వీసీలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఐఓ వీరేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డకు 1,44,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది వరద ప్రవాహం పెరిగి మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి మేడిగడ్డకు చేరుతోంది. మంగళవారం మేడిగడ్డ వద్ద 1,44,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిరావడంతో మొత్తం గేట్లు ఎత్తి నీటి ని దిగువకు తరలిస్తున్నారు. రాత్రి వరకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. సీఈఆర్ క్లబ్ అభివృద్ధికి చర్యలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి సీఈఆర్ క్లబ్ను అభివృద్ధి చేసి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఏరియా జీఎం కార్యాలయంలో సీఆర్ క్లబ్ కమిటీ సభ్యులతో జీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్లోని మౌలిక సదుపాయాల మెరుగుదల, అవసరమైన మరమ్మతులు, కొత్త సౌకర్యాల కల్పన, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. క్లబ్ను మరింత ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. అనంతరం సీఆర్ క్లబ్ కమిటీ సభ్యులు జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డిని సన్మానించారు. ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయి కృష్ణ, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి రమేష్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బేతేల్లి మధుకర్రెడ్డి, సీఈఆర్ క్లబ్ సంయుక్త కార్యదర్శి కాపు చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
టీపీసీసీ చీఫ్కు చేరిన క్రమశిక్షణ సంఘం నివేదిక మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ చుట్టూ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని చుట్టుముట్టిన పరిణా మాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో క్రమశిక్షణ సంఘం నివేదిక పీసీసీ చీఫ్కు చేరడం.. మరోవైపు మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన హత్యాయత్నం కేసులో వరుస అరెస్టులు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ సస్పెన్షన్.. ఇలా ఒకదాని వెంట ఒకటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ‘ఇక కొండాపై ఏం తేల్చనున్నారు?’ అన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది. టీపీసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక.. ‘కొండా’ శిబిరంలో కలకలం.. కొండా సుస్మిత వ్యాఖ్యలు, తదుపరి పరిణామాలపై విచారణ పూర్తి చేసి నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అందించినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్ల డించారు. మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేయడం, ఆమె వివరణ ఇవ్వడం, అనంతరం కమిటీ తన అభిప్రాయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి సమర్పించడం వరకూ వ్యవహారం చేరింది. క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలని కోరినట్లు మల్లు రవి ప్రకటించడంతో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది. రెండు పరిణామాలు ఒకే సమయంలో.. రాజకీయంగా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం.. పరిపాలనా, పోలీసు కోణంలో నార్ల సుమంత్ కేసు.. రెండూ ఒకే సమయంలో తెరపైకి రావడంతో కొండా కుటుంబంపై రాజకీయ ఒత్తిడి పెరిగిందన్న చర్చ సాగుతోంది. ఆయన గతంలో మంత్రి సురేఖకు ఓఎస్డీగా పనిచేసినందునే ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి, ‘హత్యాయత్నం’ ఆరోపణలతో నమోదైన కేసులో సుమంత్ డ్రైవర్ నవీన్తోపాటు మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదులో జాప్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.అసలు టార్గెట్ ఎవరు? ఓరుగల్లులో ఉత్కంఠ ఇప్పటి వరకు కుమార్తె వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి సురేఖను బాధ్యురాలిని చేయాలా? లేదా అది సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్య లుగానే పరిగణించాలా? అన్నది కాంగ్రెస్లో చర్చ జరిగినా..చివరకు క్రమశిక్షణ సంఘం నివేదికలో సురేఖ వ్యవహారంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మూడు పర్యాయాలు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని కమిటీ ప్రస్తావించడం.. ఈసారి కఠిన చర్యలకు సిఫారసు చేశామనడం.. కొండా శిబిరంలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సుమంత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ రెండు పరిణామాల మధ్య పార్టీ అధిష్టానం ఎలాంటి రాజకీయ సమీకరణాన్ని ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులను హైదరాబాద్కు పిలిపించడం.. క్రమశిక్షణ సంఘం నివేదిక తీవ్రత.. పీసీసీ స్థాయిలో తదుపరి కసరత్తుపై జరుగుతున్న ప్రచారం.. ఇవన్నీ కలిపి చూస్తే త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశముందన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవిపై ప్రభావమా? పార్టీ పరంగా చర్యా? వివాదానికి ఫుల్స్టాపా? లేక సర్దుబాటా? కాంగ్రెస్ అధిష్టానం ఏం తేల్చబోతోందన్నదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.సాక్షి, వరంగల్ : వన మహోత్సవంలో పాల్గొనేందుకు వరంగల్కు మంగళవారంవచ్చిన మంత్రి కొండా సురేఖను సుస్మిత వ్యాఖ్యలు, సీఎంతో వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆమె స్పందించకుండా మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజకీయ అంశాలపై ఘాటుగా స్పందించే మంత్రి ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో పార్టీ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, అధిష్టానం కదలికలను బట్టే కొండా ఆలోచనలుంటాయని అనుచరులు అంటున్నారు. డ్రైవర్ సహా నలుగురు అరెస్టు.. నిర్లక్ష్యం చేసిన సీఐపై వేటు ఒకేసారి రాజకీయ రచ్చ.. పోలీసు కేసు.. హైదరాబాద్కు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు -
సమస్యలు పరిష్కరించాలి
ములుగు: రాష్ట్రంలో భూసేకరణ, పునరావాసం –పునరావాస పునరుద్ధరణ (ఆర్అండ్ఆర్), అటవీ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూసేకరణ, పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ చెల్లింపులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.● వీసీలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
కేవీ మంజూరు గర్వకారణం: బీజేపీ
వెంకటాపురం(ఎం): జిల్లాకు కేంద్రీయ విద్యాలయం(కేవీ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. మండల పరిధిలోని జవహర్నగర్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని బీజేపీ నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భగా బలరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 54 కొత్త కేవీల్లో తెలంగాణకు నాలుగు మంజూరయ్యాయని తెలిపారు. వాటిల్లో ఒకటి జిల్లాకు కేటాయించడం ప్రధాని నరేంద్రమోదీ ఘనత అని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన ప్రధాని మోదీ, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
గోవిందరావుపేట: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని పస్రా పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా ఎస్పీ మంగళవారం సందర్శించారు. స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాఫ్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలపై ఎస్పీ సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. విధుల్లో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాల రికార్డులను పరిశీలించారు. అలాగే రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలను గమనించాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ సిబ్బందిని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఎస్సై తాజొద్దీన్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
ములుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్డీఓ సత్తయ్య, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చిత్తడి నేలల పరిరక్షణకు చర్యలు జిల్లాలోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థాయిలో పక్కాగా గుర్తించాలని కలెక్టర్, జిల్లా చిత్తడి నేలల కమిటీ చైర్మన్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చిత్తడి నేలల గుర్తింపు, సర్వే, హద్దుల నిర్ధారణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని జలవనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్, డీపీఓ వెంకయ్య, డీఏఓ సురేశ్కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
పెరుగుతున్న గోదావరి
● సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి 4,96,300క్యూసెక్కుల నీరు కన్నాయిగూడెం: గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో మండల పరిధిలోని తుపాకులగూడెం గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 4,96,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సోమవారం వరకు 1,20,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా మంగళవారం ఒక్కరోజే సుమారుగా 3,76,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి 4,90,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి -
అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు
ఏటూరునాగారం: మండల పరిధిలోని మీసేవ, ఆథార్ కేంద్రాల్లో అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని మీసేవ, ఆథార్ కేంద్రాలను తహసీల్దార్ జగదీశ్వర్తో కలిసి ఆయన మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా దరఖాస్తుదారుల నుంచి అధిక రుసుము వసూలు చేస్తే నిర్వాహకుల సస్పెన్షన్తో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పలు మీసేవ, ఆధార్ కేంద్రాల్లో అధిక రసుము వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తరుచుగా వస్తున్నాయని నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు అందుబాటులో ఉంటూ దరఖాస్తుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ ఈఎస్డీ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్, సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
ములుగు: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు అందించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్ జీ, ఎం.సంపత్ రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 44 దరఖాస్తులు రాగా భూమికి సంబంధించినవి 15, ఇందిరమ్మ ఇళ్లు 4, పింఛన్లు 7, ఇతర శాఖలకు సంబంధించినవి 18 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రవి కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రజావాణిలో కలెక్టర్, గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ వినతుల స్వీకరణ -
సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్గా కుమార్గౌడ్
ములుగు: సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్గా ముసినపల్లి కుమార్గౌడ్ను నియమించినట్లు తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులను సమన్వయం చేస్తూ వారి సమస్యలను తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. కాగా కుమార్ గౌడ్ నియామకంపై జిల్లాలోని పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రేరణ’కు మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపికములుగు రూరల్: భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమానికి పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ బండారుపల్లి విద్యార్థిని హర్షిత ఎంపికై నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సింగారం దేవకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత యువతకు స్ఫూర్తినిచ్చే ప్రేరణ కార్యక్రమానికి విద్యార్థిని ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షితను అభినందించారు. నిషేధిత భూముల జాబితాపై విచారణ జరపాలిములుగురూరల్: 22ఏ నిషేధిత భూముల జాబితాపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిప్రతం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరామ్ మాట్లాడుతూ 2014కు ముందు 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏలో కొత్తగా చేర్చిన భూములు, తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవహర్ లాల్, కృష్ణాకృపాకర్, రవీంద్రచారి, రాజ్ కుమార్, సుమలత, జనార్దన్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రతీ గదిని సందర్శించిన ఎమ్మెల్యే పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. సుమారు 242 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఈ హాస్టల్ నిర్మాణాన్ని వేగవంతం చేసి సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నిర్మాణం పూర్తయిన అనంతరం హాస్టల్ చుట్టూ ప్రహరీతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించి విద్యార్థులకు మెరుగైన వసతి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలి
● వీసీలో మంత్రి కొండా సురేఖ ములుగు: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాస్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి, జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27న పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు ఆగస్టు 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్న్హాల్ నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆర్డీఓ కృష్ణవేణితో కలిసి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పూర్తి చేస్తున్నామన్నారు. 27న గ్రామసభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వీసీలో సూపరింటెండెంట్, ఎలక్షన్ వింగ్ ఎండీ. సలీం ఉద్దీన్, నాయబ్ తహసీల్దార్ (ఎలక్షన్) ఎం. నితీష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఏటూరునాగారం: మండలకేంద్రంలోని స్థానిక ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈనెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ ప్రదర్శన పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రేణుక తెలిపారు. సోమవారం మండలకేంద్రంలోని కళాశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరిత్ర, తెలుగు, కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిజ్ఞాస కోఆర్డినేటర్ జీవవేణి, విభాగాల అధిపతులు వెంకటయ్య, సంపత్, శ్రీధర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నామిలేట్ పదవులు!
47 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై నాన్చివేత ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరోసారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆపదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలి రాజకీయ పరి ణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీని యర్లు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రామిరెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి లభించాయి. మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్కు ట్రైబల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. మా పేర్లు పరిశీలించండి.. ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. మరింత సమయం పట్టే అవకాశం రెన్యూవల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం ఎటూ తేల్చని అధిష్టానం.. తాజా మాజీల్లో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులుసీఎం, పీసీసీ చీఫ్, మంత్రులదే తుది నిర్ణయం ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో అధి ష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కూడా కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరికొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్తో పాటు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ల సిఫార్సులే కీలకంగా మారనున్నాయన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. -
ప్రత్యేక నిఘా
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026గంజాయి రవాణాపైజిల్లాలో మత్తు పదార్థాల నివారణే లక్ష్యం పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు యువత మత్తుకు దూరంగా ఉండాలి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమానికి విశేష స్పందనప్రశ్న: యువత గంజాయి మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – శ్రీనివాస్, ఏటూరునాగారంజవాబు: డ్రంకెన్ డైవ్ నిర్వహిస్తాం. మత్తు పదార్థాలు సేవిస్తే చర్యలు తీసుకుంటాం. రాత్రి సమయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పైట్రోలింగ్తో పాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ములుగు రూరల్: జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా పోలీస్శాఖ పని చేస్తుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు సాక్షి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలువురు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానం ఇచ్చారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగం, దుష్పలితాలు, నిర్మూలనకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు. మత్తుకు బానిసైన వారిని తిరిగి మాములుగా మార్చేందుకు కౌన్సెలింగ్తో పాటు రియాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్న: గంజాయికి అలవాటుపడిన వారిని మాన్పించేందుకు రియాబిటేషన్ సెంటర్ ఎక్కడఉంది. – జెట్టి శ్రీను, వెంకటాపురం(కె)జవాబు: మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని మాన్పించేందుకు జిల్లా కేంద్రంలో రియాబిటేషన్ కేంద్రం ఉంది. ములుగు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొనసాగుతోంది. మీ ప్రాంతంలో ఎరైన ఉన్నట్లయితే వారికి సమాచారం అందించండి. ప్రశ్న: జిల్లాకేంద్రంలో యువత మత్తు పదార్థాల వినియోగం రాత్రి సమయంలో ఎక్కువగా ఉంది. – ముంజాల భిక్షపతి, ములుగుజవాబు: రాత్రి సమయంలో యువత గుంపులుగా కలిసి సిగరెట్లు, మద్యం, గంజాయి వంటివి సేవించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ పెట్రోలింగ్ పెంచుతాం. ప్రశ్న: మేడారం వచ్చే టూరిస్టులు ఇక్కడి యువతకు మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నారు. – ఎనగంటి నరేష్, నార్లాపూర్జవాబు: మేడారం వచ్చే ఇతర రాష్ట్రాలు, పట్టణ ప్రాంతాల టూరిస్టులపై లోకల్ పోలీస్లతో స్పెషల్ ఫోకస్ పెట్టిస్తాం. యువత మత్తుకు దూరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రశ్న: గ్రామాల్లో విచ్చిలవిడిగా గుడుంబా తయారీ అమ్మకాలు చేపడుతున్నారు. – సావర్తి ధర్మేందర్, వెంకటాపురం(ఎం), భిక్షపతి, కన్నాయిగూడెంజవాబు: గ్రామాల్లో గుడుంబా తయారీ, నిర్మూలనకు చర్యలు తీసుకుంటాం. పోలీస్శాఖ, ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి గుడుంబా నియంత్రణ చేపడతాం. ప్రశ్న: ఇసుక లారీలు అధికలోడ్తో వెళ్లడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. చర్యలు తీసుకోవాలి. –నరేష్, మంగపేటజవాబు: అధిక లోడ్తో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం. ప్రశ్న: ప్రభుత్వ పాఠశాలల ఆవరణాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. చర్యలు తీసుకోవాలి. – హరీష్, వెంకటాపురం(ఎం)జవాబు: ప్రభుత్వ పాఠశాల వద్ద మద్యం సేవించకుండా రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తాం. అలాగే పాఠశాల పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తాం. -
గిరిజన దర్బార్లో..
ఏటూరునాగారం: గిరిజనులు సమర్పించిన వినతులు తక్షణమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఐటీడీఏ సమావేశంలో గిరిజనుల నుంచి 13 వినతులను స్వీకరించారు. గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామం అభివృద్ధికి ఎస్సీసీఎల్ సీఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి పనులు చేయించాలని సింగరేణి కాలారీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికులు కోరారు. గూడూరు మండలం గుండెంగ గ్రామంలో బోరు ఇప్పించాలని గిరిజన రైతు కోరారు. తాడ్వాయి మండలం గంగారం గ్రామంలో అన్నారం శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురవుతుందని, పరిరక్షించాలని కోరారు. అలాగే వివిధ మండలాల నుంచి గిరిజనులు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వచ్చిన సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపుతామని పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జేడీఎం కొండల్రావు, ఈఈ ప్రవీణ, జీసీసీ డీఎం వాణి, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
27న ఉద్యోగుల మహాధర్నా
ములుగు: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. సోమవారం జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీపోలు రాజు ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్లకు ధర్నా నోటీసు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, హెల్త్ కార్డుల అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వి.యాకూబ్రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి కందుల జీవనన్కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి మేడి చైతన్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రామ్మూర్తి, సారయ్య, శ్యామ్నాయక్, ప్రభాకర్రావు, ప్రకాష్రెడ్డి, అప్పలనాయుడు, ధర్మానాయక్, డాక్టర్ కొమురయ్య, సిద్ధార్థరెడ్డి, ప్రేమలత, పిట్టల రవి, కుమారస్వామి, ఎండీ రఫీక్, చంద్రశేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనులో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్–1, 2 ప్రాజెక్ట్లలో పని స్థలాల వద్ద వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు పూర్తిగా బురదమయమయ్యాయి. దీంతో బొగ్గు, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రోజుల్లో కలిసి సుమారు 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనిలోకి చేరిన వరద నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటికి పంపిస్తున్నారు. -
చట్టాలను యథావిధిగా కొనసాగించాలి
ములుగు రూరల్ : కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ఏఐటీయూసీ జిల్లా మూడో మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థ కోసం నాలుగు చట్టాలుగా కుదించిందని వివరించారు. దీంతో కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. కార్మికుల హక్కును రక్షించుకోవటం కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముత్యాల రాజు, ప్రధాన కార్యదర్శిగా బండి నర్సయ్యతో పాటు 15మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు పోలం కొండయ్య, పోతిరెడ్డి ప్రమీల, గడ్డం భారతి, కుడుముల సమ్మక్క, రాజకుమారి, రమ, శ్రీనివాస్, రాజేందర్, దేవేందర్, సతీష్ తదితరులు ఉన్నారు. -
నేడు ఎస్పీతో ఫోన్ ఇన్
ములుగు రూరల్ : Ýë„ìS B«§ýlÓ-Æý‡Å…ÌZ ¯ólyýl$ (ÝùÐ]l$ÐéÆý‡…)-Ð]l¬Ë$VýS$ Gïܵ çÜ$«©ÆŠḥ Æ>…¯é£Š కేకన్ తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగం, నియంత్రణపై ఎస్పీ సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై నేరుగా వివరణ ఇవ్వనున్నారు. ఫోన్ చేయదలిచిన వారు కింది పేర్కొన్న ఫోన్ నంబర్కు కాల్ చేయగలరు. -
పత్తిదే పైచేయి
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. లోటు వర్షపాతం, వరి కంటే తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరగగా.. వరి 66.88 శాతానికే పరిమితమైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన వానాకాలం–2026 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. మొత్తం 85.78 శాతం సాగు పూర్తయ్యింది. అంచనాలు మించిన పత్తి సాగు.. ఉమ్మడి వరంగల్లో సాధారణంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఈసారి ఇప్పటికే 5,61,578 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ అంచనాలో 101.30 శాతం మేర సాగు నమోదైంది. ముఖ్యంగా భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పత్తి సాగు సాధారణ అంచనాలను మించింది. భూపాలపల్లిలో 98,764 ఎకరాల సాధారణ సాగుకు 1,09,442 ఎకరాల్లో పత్తి వేశారు. జనగామలో 1,37,145 ఎకరాల అంచనాకు 1,38,325 ఎకరాల్లో సాగు చేశారు. పెరిగిన పప్పుధాన్యాల సాగు.. పప్పుధాన్యాల సాగు భారీగా పెరగడం ఈసారి మరో ఆసక్తికర పరిణామం. సాధారణంగా 15,715 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే 60,863 ఎకరాల్లో సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే 387.29 శాతం ఎక్కువగా సాగైంది. మహబూబాబాద్లో సాధారణ అంచనా 4,696 ఎకరాలు కాగా.. 23,815 ఎకరాల్లో సాగు చేశారు. వరంగల్లో 1,355 ఎకరాల అంచనాకు 11,742 ఎకరాల్లో, భూపాలపల్లిలో 352 ఎకరాల అంచనాకు గాను 9,670 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగయ్యాయి. జనగామలో 7,777 ఎకరాల అంచనాకు 11,059 ఎకరాల్లో సాగు నమోదైంది. తక్కువ నీటితో సాగు, వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటను కొనసాగించే అవకాశం ఉండడంతో రైతులు పప్పుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వరిసాగు 66.88 శాతం మాత్రమే సాధారణంగా 9,21,445 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా కాగా 6,16,267 ఎకరాల్లో మాత్రమే సాగైంది. దీంతో సాధారణ సాగు విస్తీర్ణంలో 66.88 శాతం మాత్రమే నమోదైంది. అధిక నీటి అవసరం ఉండే వరి సాగు.. వర్షపాతం లోటు నెలకొన్న ప్రాంతాల్లో కొంత మందగించింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాగులో మానుకోట ముందంజ.. భూపాలపల్లి టాప్ మొత్తం సాగు విస్తీర్ణం పరంగా మహబూబాబాద్ ముందు ఉంది. జిల్లాలో 3,71,318 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,30,176 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే సాగు ప్రగతిలో భూపాలపల్లి 94 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జనగామ 91 శాతం, మహబూబాబాద్ 89 శాతం, హనుమకొండ 85 శాతం, ములుగు 80 శాతం, వరంగల్లో 72 శాతం చొప్పున సాగు నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,61,578 ఎకరాల్లో కాటన్ క్రాప్ వరి 6,16,267, పప్పుధాన్యాలు 60,863 ఎకరాల్లో సాగు ఈసారి 15.93 లక్షలకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు వర్షాభావ పరిస్థితులతో పంటమార్పిడికి రైతుల మొగ్గునాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం.. భూపాలపల్లిలో 11.98 మీటర్లకు భూగర్భజలాలు.. వర్షాభావం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ 1 నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 430.1 మిల్లీమీటర్లు కాగా.. నాలుగు జిల్లాల్లో తీవ్ర లోటు నమోదైంది. హనుమకొండలో సాధారణ వర్షపాతం 547.8 మిల్లీమీటర్లకు 298.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 45.5 శాతం లోటు నమోదైంది. వరంగల్లో 43.1 శాతం, జనగామలో 43.2 శాతం, మహబూబాబాద్లో 30.8 శాతం లోటు ఉంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వరుసగా 8.5, 7.9 శాతం స్వల్ప లోటు ఉన్నా.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం పరిధిలోనే ఉన్నాయి. మహబూబాబాద్లో 6.02 మీటర్లు, వరంగల్లో 6.65, ములుగులో 7.11, హనుమకొండలో 7.71, జనగామలో 9.14 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. భూపాలపల్లిలో మాత్రం భూగర్భజల మట్టం 11.98 మీటర్ల లోతున చేరడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది.అవగాహనతో పంటల మార్పువర్షపాతం లోటు, తక్కువ నీటి లభ్యత, ఎల్నినో ప్రభావంపై వ్యవసాయశాఖ చేపట్టిన అవగాహన సదస్సులు ఫలించాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు కంటే తక్కువ నీటితో సాగయ్యే పత్తి, పప్పుధాన్యాల వైపు రైతుల మొగ్గు చూపారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్సీడ్స్, పప్పుధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం. – దోమ ఆదిరెడ్డి, ఏడీఏ, హనుమకొండ -
సాగునీరేది?
గోవిందరావుపేట: ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదు. దీంతో జిల్లాలోని ప్రధాన సరస్సులు, చెరువుల్లో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో లక్నవరం సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 33.6అడుగులు కాగా ప్రస్తుతం 22.1 అడుగుల మేర నీరు ఉంది. నీటినిల్వ క్రమంగా తగ్గుతుండగా పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆయకట్టు కింద ఇప్పటికే 5వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. సాగుచేసిన రైతులు నీటి విడుదల కోసం చూస్తున్నారు. అనాధికారికంగా మరో 15వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది నీటితో కళకళ గతేడాది ఇదే సమయానికి లక్నవరం సరస్సులో 33.6 అడుగుల నీటితో కళకళలాడుతూ నిండుకుండలా ఉంది. ఈ ఏడాది మాత్రం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే నాట్లు వేసిన పొలాల్లో నీరులేక తేమశాతం తగ్గిపోయింది. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉండడంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి నీటి విడుదలపై ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గతంలోనే నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు నీటి విడుదలపై ఆలోచనలో పడ్డారు. నీటి విడుదలపై ఉత్కంఠ అధికారిక లెక్కల ప్రకారం లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాల ఆయకట్టు ఉంది. స్థానికంగా అనాధికారికంగా మరో 15 వేల ఎకరాలకు పైగా సాగు అవుతున్నట్లు అంచనా. సాధారణంగా ఈ సమయానికి ఆయకట్టు పరిధిలో వరినాట్లు పూర్తై రెండో దశ ఎరువులు, పురుగు మందులు పిచికారీ కూడా పూర్తయ్యేది. కానీ ఈసారి వర్షాభావంతో ఇప్పటివరకు సుమారు 5 వేల ఎకరాల్లోనే మాత్రమే నాట్లు పడగా.. వేలాది ఎకరాల్లో నారుమడులు ముదిరిపోవడం, ఎండిపోవడం వంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాట్లు వేసిన పంటలను కాపాడేందుకు అవసరమైన మేరకు ఒక విడత నీటిని అందించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరిమితంగా ఉన్న లక్నవరం నీటిని ఇప్పటికే నాట్లు వేసిన పంటలను కాపాడేందుకు వినియోగించాలా.. లేక ఇంకా నాట్లు వేయాల్సిన ప్రాంతాలకు కూడా అందించాలా.. అన్నది అధికారులకు సవాలుగా మారింది. నరసింహుల, కోటగడ్డ, రంగాపురం, శ్రీరాంపతి కాల్వల పరిదిలోని రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా సరస్సులోకి ఇన్ఫ్లో లేకపోవడం, నీటి నిల్వ క్రమంగా తగ్గుతుండటంతో నీటి విడుదల విషయంలో అధికారులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. లక్నవరం సరస్సులో ప్రస్తుత నీటిమట్టం 22.1 అడుగులు రోజురోజుకూ తగ్గుతున్న నీరు ఆయకట్టు కింద 5వేల ఎకరాల్లో నాట్లు సాగునీటిపై రైతుల్లో ఆందోళన నీటి విడుదలపై అధికారులు ఆచితూచి అడుగులు -
విభజన హామీలు అమలుచేయాలి
ములుగు రూరల్: తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను సమ్మక్క–సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్చార్జ్ రెహమాన్ అన్నారు. ఈ మేరకు శనివారం ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గిరిజన యూనివర్సిటీ వద్ద సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న గిరిజన యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారిందన్నారు. కళాశాలలో పూర్తిస్థాయిలో కోర్సులు అందుబాటులో లేవని తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో ప్రొఫెసర్లతో విద్యాబోధన చేపడుతున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్కుమార్, కుమ్మరి సాగర్, రాజ్కుమార్, ప్రవీణ్, నవీన్, రమేశ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ సేవలు వినియోగించుకోవాలి ములుగు రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు వాట్సాప్ చాట్బాట్ సేవలను టీజీ ఎన్పీడీసీఎల్ అందుబాటులోకి తీసుకొచ్చిందని సర్కిల్ సూపరింటెండెంట్ భిక్షపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినియోగదారులు కార్యాలయాలకు వెళ్లకుండా అవసరమైన సేవలు పొందే విధంగా డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వినియోగదారులు నంబర్కు 8712481489 వాట్సాప్లో హాయి అని పంపితే అందుబాటులో ఉన్న సేవలు వినియోగించుకోవచ్చని వివరించారు. ఫిర్యాదుల నమోదు, బిల్డింగ్, సర్విస్ కనెక్షన్, సోలార్కు సంబంధించిన సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించవచ్చని తెలిపారు. వినియోగదారులు డిజిటల్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. 25 నుంచి దరఖాస్తుల పరిశీలన ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలోని తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 25 నుంచి పరిశీలించనున్నట్లు డీడబ్ల్యూఓ, తాడ్వాయి సీడీపీఓ ప్రేమలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మాత్రమే నిర్ధేశిత తేదీల్లో ఉదయం 10.30 గంటలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో స్వయంగా హాజరుకావాలని సూచించారు. గోవిందరావుపేట మండలంలోని అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఈనెల 25న, హెల్పర్ పోస్టులకు వచ్చే నెల 2న, తాడ్వాయి మండలంలోని టీచర్ పోస్టులకు 27న, సెప్టెంబర్ 3న దరఖాస్తుల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్, ఇంటర్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, స్థానికత, కులం వంటి తదితర ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సీడీపీఓ ప్రేమలత కోరారు. -
ప్రజారోగ్య పరిరక్షణకు సహకరించాలి
ములుగు: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని ములుగు పురపాలక సంఘం కమిషనర్ సంపత్, చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ శనివారం విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఖాళీ, నివాస స్థలాల్లో చెత్త, వ్యర్థాలు, మురుగునీరు నిల్వ ఉండకుండా యజమానులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెత్త, మురుగునీరు నిల్వతో దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. పురపాలక సంఘం నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 7 రోజుల్లోగా స్థలాన్ని శుభ్రం చేయాలని పేర్కొన్నారు. గడువులోగా శుభ్రం చేయకపోతే పురపాలక సంఘమే శుభ్రపరిచి అయ్యే ఖర్చును సంబంధిత యజమాని నుంచి రూ.10 వేల వరకు వసూలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●సాక్షి, మహబూబాబాద్: బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది. తొమ్మిది రోజుల తంతు పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి గోధుమ నారు పెంచి.. కోరుకున్న వరుడి కోసం పూజలు ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం నూతన అలంకరణలతో ఉత్సవం -
రేపు ఎస్పీతో ఫోన్ ఇన్
ములుగు రూరల్ : Ýë„ìS B«§ýlÓ-Æý‡Å…ÌZ Æó‡ç³#-(ÝùÐ]l$ÐéÆý‡…)-Ð]l¬Ë$VýS$ Gïܵ çÜ$«©ÆŠḥ Æ>…¯é£Š కేకన్ తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగం, నియంత్రణపై ఎస్పీ సలహాలు, సూచనలు అందించనున్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై నేరుగా వివరణ ఇవ్వనున్నారు. ఫోన్ చేయదలిచిన వారు కింది పేర్కొన్న ఫోన్ నంబర్కు కాల్ చేయగలరు. -
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
ములుగు: ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, సహాయ ఎన్నికల నమోదు అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని ఈసీఐ సెక్రటరీ నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన శనివారం జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని పాలంపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు గోవిందరావుపేట మండలం చల్వాయి పోలింగ్ కేంద్రాలను నవీన్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిస్థితి, ఓటర్లకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బీఎల్ఓల పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం చల్వాయి గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాల పరిశీలన, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నవీన్కుమార్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ–2026 పురోగతిపై ఏఈఆర్ఓలు, సంబంధిత ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అర్హత కలిగిన ఓటర్లు జాబితాలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్లు, ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు సలీం, డీటీ నితీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈసీఐ సెక్రటరీ నవీన్కుమార్ -
90మంది కండక్టర్లు ఔట్ !
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్లో ఒక్కసారిగా 90మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి 90మందిని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండానే అన్యాయంగా తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద తొలగించిన ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ధర్నా చేశారు. ఏడాది కాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మరునాడు విధులకు రమ్మని డ్యూటీ చార్టు వేసి రాత్రికి రాత్రే తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కు రూ.లక్షనుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి విధుల్లో చేరామని ఆరోపించారు. నెలకు ఇచ్చే రూ.18వేలలో ఒక్కరోజు గైరాజర్కు రూ.600లకు బదులుగా రూ.1200 కోత విధించినా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉద్యోగ భద్రత ఉంటుందని సహిస్తూ వచ్చామన్నారు. తమ కుటుంబాల పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ షెడ్యూల్స్ తగ్గించడంతో కండక్టర్లు మిగులుబాటులో ఉన్నారని, అందుకే తాత్కాలికంగా తొలగించామని తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ఆర్ఎం కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట
తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేధ్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.భోగ్ వద్ద తీజ్ బుట్టలతో యువతులు -
రైతు బీమా ప్రీమియం చెల్లింపులు నిలిపివేత
ములుగు: అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన రైతు బీమా పథకంపై అయోమయం నెలకొంది. ఈనెల 13వ తేదీ వరకు బీమా గడువు తీరిపోయిన రెన్యూవల్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అకాల మరణంతో పెద్ద దిక్కు దూరమైన కుటుంబానికి భరోసాగా నిలిచిన ఈ పథకానికి బ్రేక్ పడనుందనే సందేహం నెలకొంది. కాగా రైతులతోపాటు సామాన్య కుటుంబాలకు బీమా వర్తించేలా ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి.. రైతులు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమా అందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 నుంచి 59 ఏళ్లలోపు రైతులు ప్రమాదవశాత్తు లేదా సాధారణ మరణం సంభవించినా పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ప్రతీ రైతుకు ఆరంభంలో రూ.2,271లు ప్రీమియం చెల్లించగా, ప్రస్తుతం ప్రీమియం రేట్లు పెరగడంతో ఒక్కో రైతుకు రూ.3,556 చొప్పున బీమా కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతీ ఏటా ఆగస్టు 13వ తేదీలోగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రెన్యూవల్ చేస్తుంది. ఈనెల 13వ తేదీ వరకు బీమా గడువు తీరినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడంతో రైతు బీమాపై సందేహం నెలకొంది. జిల్లాలో 41,013 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా రైతు బీమా పథకంలో 41,013 మంది రైతులు ఉన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు 1,874 మంది రైతులు మృతిచెందగా 1,853 మందికి రూ.5 లక్షల చొప్పున రూ.92.65 కోట్లను రైతు కుటుంబాలకు చెల్లించారు. ఇంకా 21 మంది రైతులకు రూ.1.05 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ప్రీమియం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో ఆగస్టు 13వ తేదీలోపు మరణించిన రైతు కుటుంబాలకు మాత్రమే పాత విధానం ప్రకారం బీమా డబ్బులు అందనున్నాయి. అయితే ఆగస్టు 13 తర్వాత మరణించిన రైతుల కుటుంబాల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అందరికీ వర్తించేలా ఇందిరమ్మ బీమా! రైతు బీమా స్థానంలో సామాన్య ప్రజలు, రైతులకు వర్తించేలా ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని నవంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త పథకం అమలు తీరుతెన్నులపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం ద్వారా ఇంటి పెద్ద మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతోంది. సమాచారం లేదురైతు బీమా రెన్యూవల్పై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు మృతిచెందిన 1,853 రైతులకు రైతు బీమా పథకం ద్వారా పరిహారం బాధిత కుటుంబ ఖాతాల్లో జమ చేశాం. ఇంకా 21 మంది రైతులకు బీమా డబ్బులు అందించాల్సి ఉంది. ఇందిరమ్మ బీమా పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. –సురేష్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎనిమిదేళ్ల క్రితం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఈ నెల 13వ తేదీ వరకే తీరిపోయిన గడువు జిల్లాలో 41,013 మంది అన్నదాతలుజిల్లాలో మృతిచెందిన రైతుల వివరాలు మరణించిన రైతులు : 1,874చెల్లించిన డబ్బులు : రూ. 9.65 కోట్లు చెల్లించాల్సినవి : రూ.1.05కోట్లు -
వయోవృద్ధులను గౌరవించాలి
భూపాలపల్లి రూరల్: కుటుంబాలకు పునాది పెద్దవారేనని, వారిని గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఓల్డేజ్ హోమ్లో వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. జీవన్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దవారిపట్ల గౌరవ మర్యాదలు పాటించాలన్నారు. వారిని ఇబ్బంది పెడితే చట్టాలు కఠినంగా శిక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోమ్ నిర్వాహకులు శ్యామ్ ప్రసాద్, శైలజ, కోర్డు సూపరింటెండెంట్ రఘురాం,సీనియర్ అసిస్టెంట్ సురేందర్, సిబ్బంది అంబాల దేవేందర్, గోపాల్, రమేశ్ పాల్గొన్నారు. -
రామప్పను సందర్శించిన శిక్షణ అధికారులు
వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హైదరాబా ద్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు భారత్ దర్శన్లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్లు తీర్థ ప్రసాదాలు అందించారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, ఎంసీహెచ్ఆర్డీ అధికారులు శంకర్, నందకిషోర్, రవి, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
వరలక్ష్మీ..నమోస్తుతే..
ములుగు: శ్రావణమాసంలో సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఆచరించే వాటిలో ప్రధానమైన వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయాన్నే తలంటు స్నానమాచరించి ఇంటి ముందు గుమ్మాలకు మామిడాకులతో అలంకరించారు. వారి వారి ఇళ్లల్లో ఇష్టదైవమెన లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమను బంగారు ఆభరణాలు, నగదు, పూలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి వద్ద పవిత్ర కళశాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు హరీష్శర్మ, ఉమాశంకర్లు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించగా మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. -
క్షయ వ్యాధి నివారణలో పోషకాహారం ముఖ్యం
ములుగు రూరల్: క్షయ వ్యాధి నివారణలో పోషకాహారం ముఖ్య పాత్ర పో షిస్తుందని జిల్లా టీబీ నియంత్రణ అధికారి రవితేజ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో క్షయ వ్యాధి నియంత్రణపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్, డైరెక్టరీ బెనిఫిషరి స్కీమ్ కింద నెలకు రూ.1000 చొప్పున అందరికీ అందించాలన్నారు. న్యూట్రిషన్ కిట్లో నూనె, ప్రోటీన్పౌడర్, గుడ్లు, పప్పు మొదలైనవి ఉంటాయన్నారు. క్షయ వ్యాధి నియంత్రణలో సిబ్బంది నిబద్ధతతో పని చేయాలన్నారు. క్షయ కేసులను గుర్తించడంలో నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకారం స్క్రీనింగ్ నిర్వహించాలని, క్షయ వ్యాధి నివారణలో భాగంగా ఇంట్లో ఉన్న వారికి సైతం ప్రెసెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా 90 శాతం క్షయ రాకుండా ఆపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గరావు తదితరులు ఉన్నారు. -
ఓవర్ టు ఢిల్లీ..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది. మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం. హైకమాండ్ వద్దకు ‘హస్తం’ పేచీ.. ఇప్పటికే షోకాజ్ నోటీసు, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. త్వరలో మీడియా ముందుకు సురేఖ? ఇదిలా ఉండగా.. శుక్రవారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి.ఏఐసీసీకి చేరిన ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ సురేఖ వివరణపై సంతృప్తి చెందని పీసీసీ.. ఏఐసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక సీఎల్పీలో అత్యవసరంగా భేటీ అయిన ఉమ్మడి వరంగల్ నేతలు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్ అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ -
తమ్ముడిని చంపిన అన్న అరెస్ట్
వాజేడు: మండలపరిధిలోని ముత్తారం కాలనీకి చెందిన జాడి రాంబాబు (46) ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం వాజేడు పోలీస్స్టేషన్లో వెంకటాపురం (కె) సీఐ ముత్యం రమేశ్, ఎస్సై జక్కుల సతీశ్ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈనెల 15 (శనివారం)న జాడి రాంబాబు రంపంతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో హత్య చేసినట్లు అనుమానం కలగడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జాడి రాంబాబుకు అన్న, ముగ్గురు అక్కలు ఉన్నారు. ఇందులో ఒక అక్క, అన్నకు వివాహం కాగా మిగతా ఇద్దరు అక్కలు రాంబాబుతోనే ఉంటున్నారు. రాంబాబు నిత్యం ఇద్దరి భార్యలతో గొడవ పడుతుండటంతో వారిద్దరు పుట్టింటికి వెళ్లిపోయారు. వారిని తీసుకురావాలని ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కలతో గొడవపడుతుండటంతో వారు కూడా మండపాల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాంబాబు కూతురు రమ్య కొడుకు పుట్టు వెంట్రుకల కోసం మేనమామ వరుస అయిన ప్రవీణ్ను పంపించాలని పదిరోజుల క్రితం రజిత (రాంబాబు భార్య) జానకిరావుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో జానకిరావు ప్రవీణ్ను రజిత ఇంటికి పంపించాడు. తన కొడుకును ఎందుకు పంపించావు, వెంటనే తీసుకురావాలని రాంబాబు తన అన్న జానకిరావుతో గొడవ పెట్టుకోవడంతో పాటు తీవ్రంగా గాయపరిచాడు. ఇది మనుసులో పెట్టుకున్న జానకిరావు రాంబాబును హత్య చేయాలని భావించి ఈనెల 15న శనివారం రాత్రి మద్యం సేవించి వచ్చి రాంబాబు పడుకున్న సమయంలో గడ్డి కోసే కొడవలితో తల, గొంతుపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఏమి తెలియనట్లుగా అతని (రాంబాబు) చేతిలో రంపం ఉంచి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలడంతో పోలీసులు విచారణ చేపట్టి జానకిరావును అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. దీంతో జానకిరావును శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు -
అవయవదానంపై అవగాహన
ములుగు: అవయవదానంతో ఆరిపోతున్న జీవితా లకు వెలుగునివ్వాలని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక ఉద్యమాల దళపతి ముంజాల భిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ అశోక్ మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపునివ్వవచ్చని, పార్థివదేహాన్ని వైద్య కళాశాలకు దానం చేయడం ద్వారా భవిష్యత్ వైద్యులకు గురువుగా నిలవవచ్చన్నారు. చనిపోయిన తర్వాత కూడా అవయవదానం ద్వారా చిరంజీవులుగా జీవించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కె. న రసయ్య, ఎం.గోపాల్రెడ్డి, కుమ్మరి వెంకట్, స్థానికులు పాల్గొని అవయవదాన ప్రతిజ్ఞ చేశారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది నియామకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని భూపాలపల్లి, ములుగు జిల్లా రిజనల్ కోఆర్డినేటర్ పద్మిని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్హతల సంబంధిత సబ్జెక్టులో బీఈడీ పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయి ఉండాలని, డిగ్రీ, పీజీ పరీక్షల్లో 55 శాతం మార్కులు సాధించి ఉన్నవారు అర్హులన్నారు. పీజీటీ హిందీ, గణీతం, జూనియర్ లెక్చరర్ ఇంగ్లిష్, జువాలజీలో ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీన ఏటూరునాగారం స్పోర్ట్స్ పాఠశాలలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. డెమో, మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9959072997, 8309452015 నంబర్లను సంప్రదించాలన్నారు. మలేరియా నివారణపై అవగాహన కల్పించాలి వెంకటాపురం(కె): మలేరియా నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా సెంట్రల్ టీమ్ సభ్యులు లక్ష్మణ్, అశోక్, సురేశ్లు తెలిపారు. మండలంలో శుక్రవారం మలేరియా నివారణ నియంత్రణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వైద్యశాలలో ఉన్న మలేరియా వ్యాధిగ్రస్తుల రికార్డును పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామాల్లో మలేరియా అనుమానిత కేసులను సకాలంలో గుర్తించి రక్తపూత సేకరణ పరీక్షలను నిర్వహించాలన్నారు. పాజిటివ్ తక్షణమే చికిత్స నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి యుధిస్టర్, సబ్ యూనిట్ అధికారి నర్సింహారావు, హెఈఓ కోటిరెడ్డి, సిబ్బంది గణేష్, రాఘవులు, భాస్కర్ తదితరులు ఉన్నారు. వివాదరహిత జీవితం గడపాలి భూపాలపల్లి అర్బన్: పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృథా కావడంతో పాటు తీవ్రంగా నష్టపోతారని ప్రతి ఒక్కరూ వివాద రహిత జీవితాలను గడపాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ద్వారా మున్సిపాలిటీ పరిఽధిలోని మంజూర్నగర్, మహిబూబ్పల్లిలో శుక్రవారం న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు, ప్రామిసరీ నోట్, కుటుంబ, సివిల్ తదితర వివాదాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ.. కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. వివాదాలకు దూరంగా జీవించాలని కోరారు. న్యాయ సహాయం కోసం నల్సా టోల్ఫ్రీ నంబర్ 15100ను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, మహిత, వెంకటేష్, రాజ్కుమార్, గౌతమి, కార్తీక్ పాల్గొన్నారు. -
నూతన కలెక్టరేట్లోనే ప్రజావాణి
ములుగు: ఈ నెల 24వ తేదీ నుంచి ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనే నిర్వహించనున్నట్లు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎడమ వైపున ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గట్టమ్మ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన అత్యాధునిక సౌకర్యాలతో నూతన కలెక్టరేట్ నిర్మించినట్లు పేర్కొన్నారు. విశాలమైన కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, ప్రజలకు అనుకూలమైన వసతులతో కలెక్టరేట్ ఉందని వివరించారు. సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తమ దరఖాస్తులను అందజేయవచ్చని కలెక్టర్ వివరించారు.కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్నగర్ మోడల్ స్కూల్ క్యాంపస్లో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి నూతన ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రీయ విద్యాలయం ములుగు ప్రిన్సిపాల్ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ నుంచి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల కోసం నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 10న లాటరీ పద్ధతిలో ఎంపిక, 12న ప్రవేశ జాబితా ప్రచురణ, 15 నుంచి 21 వరకు ప్రవేశాలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 23 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు వివరించారు. విద్యార్థుల వయస్సు, రిజర్వేషన్ తదితర ప్రవేశ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు నిర్ణీత గడువులోగా తమ పిల్లల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. కేంద్ర బృందం ప్రతినిధుల పర్యటన వాజేడు: మలేరియా నివారణపై కేంద్ర బృందం ప్రతినిధులు లక్ష్మణ్, అశోక్, సురేశ్ మండల పరిధిలోని పేరూరు పీహెచ్సీని గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ల్యాబోరేటరీ పరిశీలనతో పాటు కృష్ణాపురం, కడేకల్ గ్రామాల్లో పర్యటించారు. మలేరియా నిర్ధారణ, రక్త నమూనాల సేకరణ, పరీక్షలు, కేసుల గుర్తింపుతో పాటు అనుమానిత జ్వర కేసులపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మలేరియా జ్వరాల నివారణకు దోమల నివారణతో పాటు పరిసరాల పరిశుభ్రత, దోమ తెరలను వినియోగించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప పీహెచ్సీలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు వైద్యాధికారి భాస్కర్, సిబ్బంది దుర్గారావు, నరసింహరావు, వెంకటరెడ్డి, వేణుగోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
ములుగు రూరల్: యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలతో గద్దెనెక్కిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువత శ్రమ దోపిడీకి గురయ్యే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేరుకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని తెలిపారు. రాష్ట్రంలో 20 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 9వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, రాజేందర్, చిట్టిబాబు, మల్లారెడ్డి, ప్రవీన్, కవిత, రజిత, రాజు, రవీందర్, అరుణ్, దేవేందర్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ -
రక్త పరీక్షల రిపోర్టులు సకాలంలో అందించాలి
ములుగు రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు సకాలంలో నిర్వహించి రిపోర్టులను సకాలంలో అందించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీ హబ్ను ఆయన గురువారం సందర్శించి మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన రక్త నమూనాల పరీక్షలు త్వరగా నిర్వహించి రిపోర్టులను అందిస్తే ఆరోగ్య కార్యకర్తలు జ్వరపీడితుల ఆరోగ్య పరిస్థితి, వైద్యం అందించేందుకు వీలుంటుందని తెలిపారు. అనంతరం జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బంది పని తీరును పరిశీలించారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణ క్లినిక్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. మధుమేహం, హైపర్ టెన్షన్ రోగుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్, మాస్ మీడియా అధికారి సంపత్, ప్రోగ్రాం విస్తరణ అధికారి సురేశ్బాబు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
అక్షరాస్యతలో జిల్లాను అగ్రభాగాన నిలపాలి
ములుగు: అక్షరాస్యతలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని అదనపు కలెక్టర్ సంపత్రావు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్) పోస్టర్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే టాస్, ఉల్లాస్ కార్యక్రమాలకు సంబంధించిన సమన్వయ సమీక్ష సమావేశం డీఈఓ సిద్ధార్థరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. టాస్, ఉల్లాస్ కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా తీసుకొని లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టాస్ అడ్మిషన్ల పెంపుపై ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. ఎంఈఓలు, ఏపీఎంలు, ఏఐ కోఆర్డినేటర్లు తప్పనిసరిగా ప్రతిరోజూ అడ్మిషన్ల పెంపునకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ తుమ్మ రమేశ్రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పుల్లూరు వేణుగోపాల్, డీఆర్డీఏ ఏపీడీ గొట్టే శ్రీనివాస్, టాస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం, ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ పీర్ల కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంపత్రావు -
చదువుతోనే గుర్తింపు
ఏటూరునాగారం: విద్యార్థులకు చదువుతోనే తగిన గుర్తింపు వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బానోత్ ధర్మ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విభాగానికి సంబంధించిన పోస్టర్ను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే నిలిపివేయకుండా ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఓపెన్ యూనివర్సిటీ విధానం అమలులో ఉందని తెలిపారు. 2026–27 అడ్మిషన్లకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు సమయం ఉన్నట్లు తెలిపారు. ఒకేసారి రెండు డిగ్రీలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. విద్యార్థులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధి కల్పించేందుకు వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అంబేడ్కర్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని తెలిపారు. చదువుకోవాలనే లక్ష్యం ఉన్న వారు ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సి పాల్ నవీన్, అధ్యాపకులు భాస్కర్, రమేశ్, రాజశేఖర్, శ్రీకాంత్, శ్రీనివాస్, నాగలక్ష్మి పాల్గొన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ధర్మ -
ముగిసిన పొట్ట పండుగ
ఎస్ఎస్తాడ్వాయి: వనదేవతల క్షేత్రమైన మేడారంలో సమ్మక్క పూజారులు రెండు రోజుల పాటు నిర్వహించిన పొట్ట పండుగ పూజా కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. బుధవారం ప్రారంభమైన పూజలు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పూజారులు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడి నుంచి పసుపు, కుంకుమ, అమ్మవారి పూజా సామగ్రితో గద్దెలకు వెళ్లిన పూజారులు రాత్రంతా సంబురాలు చేసుకుని గురువారం ఉదయం గద్దెల నుంచి ఊత కొమ్ముల శబ్ధం, డోలివాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకున్నారు. పూజారులు గుడికి వస్తున్న దారిలో ఆదివాసీ ఆడపడుచులు ఎదురెల్లి పూజారుల కాళ్లకు పవిత్రమైన జలాలను ఆరగించారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క గద్దె నుంచి పూజారులు బయలుదేరిన సమయంలో భక్తులు, స్థానిక ఆదివాసీ యువతీయువకులు దారి పొడవునా పడుకోవడంతో పూజారులు వారి పైనుంచి దాటి వెళ్లారు. అనంతరం సమ్మక్క గుడిలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి గుడిలో పొట్టకు వచ్చిన మొక్కజొన్న కంకులు, వరి పొట్టను అమ్మవారికి పూజారులు నైవేద్యంగా సమర్పించారు. యాటను బలిచ్చారు. అమ్మవారికి కొత్త ధాన్యాన్ని సమర్పించిన తర్వాత స్వీకరిస్తామని పూజారులు తెలిపారు. రెండు రోజుల పాటు పొట్ట పండుగ పూజా కార్యక్రమాలతో మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సిద్ధబోయిన ముణింధర్, మహేశ్, కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన రాణా రమేశ్, భోజారావు, సిద్ధబోయిన స్వామి, జనార్దన్ పాల్గొన్నారు. వనదేవతల గద్దెల నుంచి సమ్మక్క గుడికి చేరుకున్న పూజారులు అమ్మవారికి నైవేద్యంగా వరిపొట్ట, మొక్కజొన్న కంకులు -
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
ములుగు రూరల్: ప్రపంచ ఫొటోగ్రాపర్స్ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో రామప్ప ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఫొటోగ్రఫీ పితామహుడు డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రను భద్రపరిచే సాధన కెమెరా అన్నారు. ఒక్కఫొటో వెయ్యి మాటలకు సమానమని తెలిపారు. ఫొటోగ్రఫీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న ఫొటోగ్రాఫర్ల సేవలను కొనియాడారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్స్ కందుల రవీందర్, జక్కుల సదానందం, శ్రీనివాస్, వెంకట్, మాట్ల భద్రి, దేవేందర్, రమేశ్, రాజు, సంపత్, అరవింద్, బాబురావు, సునీల్ పాల్గొన్నారు. -
మందుల కొరత లేకుండా చూడాలి
ములుగు రూరల్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా వార్షిక ఇండెంట్లను పంపించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి స్పెషలిస్ట్ విభాగాధిపతులు, ఫార్మసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైద్య, మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీ)సెంట్రల్ మెడిసిన్ స్టోర్ అధికారుల సమన్వయంతో అవసరమయ్యే మందులు, సర్జికల్ మెటీరియల్ నివేదికలు అందించాలన్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు అవసరమయ్యే మందులను కొరత లేకుండా తెప్పించుకోవాలని సూచించారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నుంచి 628 రకాల మందులు, 536 సర్జికల్కు సంబంధించిన బకెట్లను పంపిణీ చేస్తుందని వివరించారు. ఈ మేరకు సీఎంఎస్ పుస్తకాలను వైద్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ సీఎంఎస్ ఇన్చార్జ్ ఫార్మసీ ఆఫీసర్ భాస్కర్రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ భిక్షపతిరావు, రామ్మోహన్, ఉషారాణి, శ్రీకళ, లక్పతి, సుప్రియ, అనూష, ఫార్మసీ ఆఫీసర్ సుస్మిత, జిల్లా సీఎంఎస్ ఫార్మసీ అధికారి సమ్ములు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీఐని బలోపేతం చేయాలని వినతి ఏటూరునాగారం: ఆర్టీఐని బలోపేతం చేయాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నపుండ్రా ప్రసాద్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు తోట రమేశ్లు బుధవారం ములుగు కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీఐ యాక్ట్–2005 చట్టం అమలు పరిరక్షణకు జిల్లా కమిటీలతో పాటు మాని టరింగ్ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. ప్రతీ కార్యాలయంలో ఆర్టీఐకి సంబంధించి సమాచారం ఇచ్చేందుకు కేటాయించిన అధి కారి పేరు, ఫోన్ నంబర్లు బోర్డుపై ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఏటూరునాగారం మండల అధ్యక్షుడు బైరెడ్డి మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్కుమార్, భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దేవేందర్, భూపాలపల్లి మండల అధ్యక్షుడు శివప్రసాద్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి కన్నాయిగూడెం: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ అన్నారు. మండల పరిధిలోని పీహెచ్సీని డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలో పేదలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి ఓపీ, పరీక్షలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. డ్రగ్ రూమ్లో మందుల నిల్వల వివరాలను, సిబ్బంది రిజిస్టర్ను పరిశీలించారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు భాస్కర్రావు, ఓం ప్రకాశ్, డాక్టర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. పాముకాటుతో యువతి మృతి వాజేడు: మండల పరిధిలోని ఆర్లగూడేంకు చెందిన పాయం శిరీష(25) కట్లపాము కాటు వేయడంతో మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం.. ఆర్లగూడేంకు చెందిన పాయం కృష్ణారావు, జానకీలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందులో శిరీష పెద్ద కూతురు. చిన్నకూతురుకు పెళ్లి అయింది. చిన్నకూతురుకు కుమారుడు జన్మించగా 21 రోజుల వేడుకను తల్లిదండ్రుల ఇంట్లో నిర్వహించారు. మంగళవారం రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. ఈ క్రమంలో శిరీషను కట్లపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏటూరునాగారం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగుకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని వైద్యులు తెలుపడంతో బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. -
మహిళలు, బాలికల సంరక్షణే ధ్యేయం
● కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావుములుగు: మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడంతో పాటు వారి సంరక్షణే ధ్యేయమని కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయంలో జిల్లా నిర్భయ ఫండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ నిర్భయ ఫండ్ ద్వారా పైలట్ ప్రాజెక్ట్(మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు)గా జిల్లా ఎంపికై ందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో మహిళలు, బాలికలు సురక్షితంగా చదువుకోవడానికి, ప్రయాణించడానికి, రోజువారీగా పలు కార్యక్రమాల్లో స్వేచ్ఛగా పాల్గొనడానికి వీలు కల్పించేలా మహిళా–స్నేహపూర్వక పట్టణ ప్రదేశాలను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అన్నారు. మహిళలు, బాలికలు భద్రత, రవాణా, ప్రజా ప్రదేశాలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి అంశాలకు సంబంధించి ఎదుర్కొనే సవాళ్లను కమిటీ గుర్తిస్తుందని తెలిపారు. మహిళలు, బాలికలకు సురక్షితమైన నగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా స్థానిక సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, పౌర సంఘాలు సమన్వయంతో పనిచేసి మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహిళలు, బా లికల సురక్షిత అవసరాలను గుర్తించి ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేసినట్లు వివరించారు. వీటిని ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వ అనుమతితో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత, డీఎస్పీ కిశోర్కుమార్, జిల్లా రవా ణాశాఖ అధికారి ఠాకూర్ ఈశ్వర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, టూరిజం అసిస్టెంట్ మేనేజర్ సూర్య కిరణ్, డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ రమాదేవి, సఖి కేంద్రం సెంటర్ అడ్మిన్ లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ పాల్గొన్నారు. -
హేమాచల క్షేత్రానికి మహర్దశ
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఈ నెల 16న జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శిచుకున్న సీఎం హెలికాప్టర్లో ములుగుకు వెళ్లే క్రమంలో హేమాచలక్షేత్రం విశిష్టత, స్వామివారి చరిత్రను ఎంతో ఆసక్తిగా మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. హేమాచలక్షేత్రానిది 16 శతాబ్ధాల చరిత్ర, 60 ఏళ్ల క్రితమే దేవాదాయ ధర్మాదాయ శాఖలో గుర్తింపు పొంది ఉంది. 6 ఏ టెంపుల్గా రికార్డుల్లో ఉన్నా గత ప్రభుత్వాలు, పాలకులు, దేవాదాయశాఖ నిర్లక్ష్యం కారణంగా అభివృది నోచుకోని హేమాచలక్షేత్రం అభివృద్ధికి స్వయంగా సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంతో ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిపై మంత్రుల ప్రత్యేక దృష్టి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పురాతనమైన హేమాచలక్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మార్చి 1న మంత్రులు సీతక్క, శ్రీనివాస్రెడ్డి ఆలయాన్ని సందర్శించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సందర్భంగా హేమాచలక్షేత్ర అభివృద్ధి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మేడారం తరహాలో అభివృద్ధి చేయిస్తామని హామీనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధి పనులకు మాస్టర్ప్లాన్ నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్, దేవాదాయశాఖ, వివిధ శాఖల అధికారులను ఆదేశించడంతో సుమారు రూ.18 కోట్ల అంచనాతో నివేదికలను రూపొందించారు. తొలి విడతలో రూ. 3కోట్లు మంజూరు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ముఖ మండపం, వివిధ ప్రతిపాదిత పనులపై ఆర్కిటెక్చర్ల బృందం రూపొందించిన పలు రకాల డిజైనింగ్ మ్యాపులను సీతక్క గత నెల 16న పరిశీలించారు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందే అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించిన విషయం విధితమే. దీంతో పాటు స్వయంగా సీఎం ఆలయ అభివృద్ధికి అవసరమైన మేరకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించడంతో ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ, వివిధ శాఖల అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ములుగు పర్యనటలో మంత్రులతో చర్చించిన సీఎం చిగురిస్తున్న భక్తుల ఆశలు -
గంజాయి స్వాధీనం విలువ (రూ. కోట్లలో)
2024 2,97,19,7172025 5,76,39,3532026 1,29,94,670●వరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో నమోదైన కేసులు, స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు)విద్యార్థులకు అవగాహన, విక్రేతలపై కఠినచర్యలు పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. విక్రయాలు, సరఫరాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంజాయికి బానిసలైన యువతను గుర్తించి వారిపై చట్టపరమైన ప్రక్రియతోపాటు డీ–అడిక్షన్ సెంటర్లకు తరలించి, కౌన్సెలింగ్, చికిత్స మార్పు తెచ్చే చర్యలు చేపడుతున్నాం. – పి. రమేశ్కుమార్, డీఎస్పీ, నార్కొటిక్స్ ఈగల్ ఫోర్స్ మాదక ద్రవ్యాల అనుకూల పంటల సాగు వద్దు యువత దేశ భవిష్యత్కు వెన్నెముక. వారు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, మాదక ద్రవ్యాల తయారీకి అనుకూలమైన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయకుండా చూడాలి. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం, ఆచార్యులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. – డా. గాదె సమ్మయ్య, ప్రముఖ విద్యావేత్తసాక్షిప్రతినిధి, వరంగల్: చదువుకోవాల్సిన వయసులో కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా మొదలుపెట్టి.. ఆపై అలవాటుగా.. చివరకు వ్యసనంగా మార్చుకుంటున్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి చిన్నచిన్న గొడవలనుంచి తీవ్రమైన నేరాల వరకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మైనర్లు, స్కూల్, కాలేజీ విద్యార్థులే గంజాయి ముఠాల టార్గెట్గా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో గంజాయి మత్తులో మైనర్లు ప్రిన్సిపాల్ను హత్య చేసిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలికిపాటు నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో గంజాయి సరఫరా, వినియోగం, యువత ప్రమేయంపై మరోసారి చర్చ మొదలైంది. స్కూల్ వెనుక నుంచి, హాస్టళ్ల వరకు.. వరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో 134 గంజాయి కేసులు నమోదవగా, 369మందిని అరెస్ట్ చేశారు. 2,571 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వరంగల్ నగర శివార్లకే పరిమితమైన గంజాయి వినియోగం క్రమంగా కొన్ని విద్యాసంస్థల పరిసరాలకూ చేరిందన్న ఆందోళన ఉంది. స్కూల్ వెనుక ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలు, చెరువు కట్టలు, రైల్వే పరిసరాలు, కాలేజీ హాస్టళ్లు, అద్దె గదులు.. ఇలా నిర్మానుష్య ప్రాంతాలను కొందరు మత్తు సేవించేందుకు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా వరంగల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసిన గంజాయి కేసు మరింత ఆందోళన కలిగించింది. బీటెక్, ఇంటర్ విద్యార్థులతో కూడిన ముఠా 36 కిలోలకు పైగా గంజాయితో పట్టుబడింది. ఎనిమిది మంది విద్యార్థులు డబ్బులు పోగేసి గంజాయి కొనుగోలు చేసినట్లు ‘ఈగల్’దర్యాప్తులో వెల్లడైంది. ఈ విద్యార్థులు ఇదే తరహా కేసులో నాలుగోసారి పట్టుబడడం ఆందోళనకరం. వినియోగంతో మొదలు.. విక్రయంతో ముగింపు గంజాయి ముఠాలు ముందుగా కొందరు విద్యార్థులను వినియోగదారులుగా మార్చి.. ఆ తర్వాత వా రినే చిన్నస్థాయి క్యారియర్లు, విక్రేతలుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆందోళన ఉంది. మొదట స్నేహితుడి ద్వారా పరిచయం.. ఆపై ఉచితంగా లే దా తక్కువ ధరకు సరఫరా.. అలవాటు పడిన తర్వాత డబ్బుల కోసం ఇతరులకు సరఫరా చేయించడం.. ఇలా మత్తు వల విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన కేసులు చెబుతున్నాయి. స్కూల్ దశనుంచే గంజాయి కిక్కుకు బానిసలు.. కళాశాలలే లక్ష్యంగా సరఫరా.. మత్తులో పెరుగుతున్న నేరాలు.. విద్యార్థులే ‘క్యారియర్లు’ నల్లగొండ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపాటు మేల్కోకపోతే మరిన్ని ఘోరాలు.. నేరాలు -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ములుగు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో నిబద్ధతతో, పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేకూరేలా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసుల్లో ముద్దాయిలను, సాక్షులను తప్పని సరిగా కోర్టుకు హాజరుపర్చాలన్నారు. నేరస్తులకు శిక్షపడేలా కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చూసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, సస్పెక్టులపై నిఘా ఉంచాలని సూచించారు. నమోదైన కేసుల వివరాలను ఆన్లైన్ చేయాలన్నారు. దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణపై నిఘా పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మమన్ భట్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్, డీఎస్పీ రవీందర్, సీఐలు సురేశ్, దయాకర్, రమేశ్, ఆర్ఐలు స్వామి, వెంకటనారాయణ, శ్రీకాంత్, తిరుపతి, ఎస్సైలు వెంకటేశ్, చల్లా రాజు, తాజుద్దీన్, కమలాకర్, జగదీశ్, మహేశ్, సూరి, వెంకటేశ్, సతీష్, కృష్ణప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
ములుగు రూరల్: రైతులు వరిసాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఉద్యానవనశాఖ అధికారి సంజీవరావు అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండలంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్నినో ప్రభావంతో వర్షాలు సంమృద్ధిగా కురవని కారణంగా రైతులు నీటి సాంద్రత తక్కువ వినియోగం ఉన్న పంటలు కూరగాయలు, పుప్పుదినుసులు, ఆయిల్ సీడ్స్, పండ్ల తోటలు సాగు చేయాలన్నారు. రైతులు సాగు చేస్తున్న కూరగాయ తోటలు, మిర్చి నారు మడులను, బంతితోటలను సందర్శించి రైతులకు సూచనలు చేశారు. ఉద్యానవనశాఖ రైతులకు డ్రిప్, తుంపర్ల పరికరాలు సబ్సిడీపై అందింస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పంటల సాగు విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విశ్వతేజ, ఆత్మ చైర్మన్ రవీందర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేశ్కుమార్, హెచ్ఓ శ్రీకాంత్, ఏఓ శ్రీధర్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి
ములుగు: నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో మంగళవారం సంయుక్త సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, సాగునీటి లభ్యత, పంటల సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖల అధికారులు ఒకే వేదికపై చర్చించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను గుర్తించవచ్చన్నారు. అలాగే మే నెల నుంచి ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులపై రైతులకు రైతు వేదికలు, ప్రచార మాద్యమాల ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా పంటలు సాగు చేసి రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 218 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 83 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను రైతులు గమనించి నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు పూర్తిగా వరి పంటపైనే ఆధారపడకుండా వేరే పంటలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉద్యానవన పంటల సాగుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి రైతులకు తగిన సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సైతం తమ పరిధిలోని రైతులకు నీటి పొదుపు అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, సమ్మయ్య, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ రఘు, డివిజన్ చైర్మన్లు రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ఎస్ఎస్తాడ్వాయి: కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ములుగు డీఎస్పీ రవీందర్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని మేడారంలో గల నార్లాపూర్ పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లు, కేడీ నేరస్తుల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగంతో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీఎస్పీ, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పస్రా సీఐ దయాకర్, ఎస్సై కమలాకర్ ఉన్నారు. డీఎస్పీ రవీందర్ -
‘రోగులకు మెరుగైన వైద్యం అందించాలి’
కన్నాయిగూడెం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంతీయ కార్యాలయం (ఆర్ఓహెచ్ఎఫ్డబ్ల్యూ)హైదరాబాద్ బృందం ప్రోగ్రాం అధికారి రవితేజ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమ బృందం సభ్యులతో కలిసి మంగళవారం సందర్శించారు. మారుమూల గ్రామాల్లో పేదలకు అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని రోగుల, అధికారుల రిజిస్టర్లను తనిఖీ చేశారు. వాటి నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం చింతగూడెంలో పర్యటించి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం ప్రోగ్రామ్ ఆధికారి రవితేజ మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధులపై జాగ్రతగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. వర్షాకాలంలో వేడి చేసిన నీటిని తాగాలని వెల్లడించారు. అలాగే ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వకుండా చూసుకోవాలని ప్రోగ్రాం అధికారి రవితేజ సూచించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు లక్ష్మణ్, శ్రీనివాస్, అశోక్, వెంకటేశ్వర్లు, సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, భాస్కర్రావు, ఏఎన్ఎం ఊర్మిల తదితరులు పాల్గొన్నారు. -
రామప్ప టెంపుల్ బాగుంది
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని జర్మనీ దేశానికి చెందిన డేనియల్ గ్రాస్, కెవిన్ పౌలుస్ కొనియాడారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆహ్వానం ములుగు: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి 2026 విద్యా సంవత్సరానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డుకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు తమ దరఖాస్తుతో పాటు పాఠశాలలో చేపట్టిన వినూత్న కార్యక్రమాల వివరాలను జత చేసి రెండు కాపీలను ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు దరఖాస్తులను పరిశీలించి ప్రతీ మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులను సిఫారసు చేయాలని పేర్కొన్నారు. ఎంపిక చేసిన వారి పూర్తి దరఖాస్తులను ఈ నెల 29 ఉదయం 11 గంటలోగా డీఈఓ కార్యాలయంలో అప్పగించాలని డీఈఓ పేర్కొన్నారు. ఓబీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా బుచ్చయ్య ఏటూరునాగారం: కన్నాయిగూడెం మండలం గూర్రేవుల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పల్లా బుచ్చయ్యను బీజేపీ రాష్ట్ర ఓబీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం బుచ్చయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ బలోపేతానికి నిరంతరం పాటుపడుతానని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి ఏటూరునాగారం: కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టాలని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు రాంనర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గొప్ప ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తీరని లోటన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప ఉద్యమ నాయకుడు పెద్ది విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించకపోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్ది విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సర్ధార్ పాషా, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కూనూరు అశోక్ గౌడ్, తాడూరి రఘు, మాదరి రామయ్య, మాదరి చంద్రమౌళి, గడదాసు సునీల్ కుమార్, కాళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. 21న అథ్లెటిక్స్ ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగేంధర్రెడ్డి మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్ఎస్లో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9866564422, 9000354465 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
సీతక్కపై ఆరోపణలు సరికాదు
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ములుగు: మంత్రి సీతక్కపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కుమార్గౌడ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సాధన ఉద్యమంలో నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి కలిసికట్టుగా పోరాడి జిల్లా సాధించుకున్నామన్నారు. ఉద్యమంతో సంబంధం లేని వారు ఇప్పుడు మంత్రి సీతక్క, కుమారస్వామిపై ఆరోపణలు చేయడం సబబుకాదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజేందర్గౌడ్, రవి యాదవ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణోత్సవం భవిష్యత్కు బలమైన పునాది
కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టుకింద రూ.60కోట్ల నిధులు రాగా, రూ.35కోట్లతో 42పరిశోధన ప్రాజెక్టులు, రూ.15కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి అండర్గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయింది. అకడమిక్ బ్లాక్లు, వర్క్షాప్లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400లకోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి -
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు బ్యాటరీ టెస్టులు
ఏటూరునాగారం: మండల పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల క్రీడా పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు పొందటానికి అర్హులైన విద్యార్థులకు మంగళవారం పాఠశాల ఆవరణలో బ్యాటరీ టెస్టులను నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రాజునాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ తరగతిలో ప్రవేశానికి 4వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోగా బ్యాటరీ టెస్టులకు 105 మంది హాజరయ్యారని తెలిపారు. వారికి వివిధ రకాల టెస్టులను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే 6 నుంచి 9వ తరగతిలో కూడా సీటు పొందేందుకు దేహదారుఢ్య, నైపుణ్య పరీక్షలను నిర్వహించి గెలుపొందిన వారికి సీటును ఇస్తామని వివరించారు. రెండు రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడలపై ఆసక్తి, చదువుపై శ్రద్ధ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. తొలిరోజు 105 మంది హాజరు ప్రిన్సిపాల్ రాజునాయక్ -
కలెక్టర్కు సన్మానం
ములుగు: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావును తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీఎన్జీవోస్)ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం, రాష్ట్ర పంచాయతీరాజ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసినందుకు కలెక్టర్కు టీఎన్జీవోస్ జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు కలెక్టర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల జీవన్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ కొమరయ్య, ఉపాధ్యక్షులు కె.శిరీష, విజయభాస్కర్, రాజ్కుమార్, యశ్వంత్, జాయింట్ సెక్రెటరీలు రఫిక్, శైలజ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
మండలస్థాయి ప్రజావాణి ప్రారంభం
గోవిందరావుపేట : ప్రజావాణికి వచ్చే ప్రతీ దరఖాస్తును స్వీకరించి, స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం గోవిందరావుపేటలో శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించి, వాటి పురోగతిని దరఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. ప్రతీ దరఖాస్తుకి ఫోన్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ఒంటరి మహిళలు, వితంతువు పింఛను దరఖాస్తులు ఈ నెల 31లోగా స్వీకరించాలని ఆదేశించారు. పస్రా, గోవిందరావుపేట, చల్వాయి ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, తండాలు, గూడేల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ చిలువేరు వరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మండల ప్రజావాణికి మొత్తం 14 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, తహసీల్దార్ సృజన్కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరిస్తాం
ఏటూరునాగారం : గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని ఐటీడీఏ పీఓ లెనిన్వత్సల్ టొప్పో పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో పీఓ గిరిజనుల నుంచి 25 వినతులు స్వీకరించారు. వెంకటాపురం(కె) మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో మూడేళ్లుగా ఆఫీస్ సబార్డినేట్గా (అటెండర్) పనిచేస్తున్నామని, క్యాటరింగ్, శానిటేషన్ డబ్బులు సగం జీతం వస్తుందని, వేతనం ఇప్పించాలని గిరిజనుడు కోరారు. మహబూబాబాద్ జిల్లా నుంచి కాంటింజెంట్ వర్కర్గా పనిచేస్తున్న తనకు కాలు విరిగిందని, తన పోస్టును కోడలికి ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురంలో తుడుందెబ్బ స్టడీ సెంటర్ బుక్స్, కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. ఐటీడీఏ పాఠశాలలోని స్కావెంజర్లకు వేతనాలు ఇప్పించాలని గిరిజనులు ఏఐటీయూసీ నాయకుడు జంపాల రవీందర్ కోరారు. వినతులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జేడీఎం కొండల్రావు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ లెనిన్వత్సల్ టొప్పొ గిరిజన దర్బార్లో 25 వినతుల స్వీకరణ -
26,77,498
17.08.26 నాటికి ఓటర్లుసాక్షిప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో ఉమ్మడి వరంగల్లో రాజకీయ సమీకరణాల కంటే ముందే ఓటర్ల లెక్కల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. జూన్ 10న ఉన్న ఓటర్లతో పోలిస్తే సోమవారం నాటి ముసాయిదా ప్రకారం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాలు మారాయి. 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. తాజా జాబితాలో 26,77,498 మంది నమోదయ్యారు. అంటే దాదాపు 12.31 శాతం తగ్గుదల కనిపించింది. 3,75,740 మంది ఓటర్లు తగ్గారు. 4,83,803 మంది ఏఎస్డీడీ (మరణించినవారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయినవారు, ఇప్పటికే మరోచోట నమోదైనవారు, ఇతర కేటగిరీ)లలో ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లకు మ్యాపింగ్ జరగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తూర్పులో భారీ మార్పు.. పశ్చిమలో పెద్ద కోత ఉమ్మడి వరంగల్లో అత్యంత ఆసక్తికరమైన గణాంకం వరంగల్ పశ్చిమది. జూన్ 10న 2,86,335 మంది ఓటర్లు ఉండగా.. సోమవారం నాటికి 2,03,719కు తగ్గారు. అంటే 82,616 మంది తగ్గారు. వరంగల్ తూర్పులోనూ దాదాపు ఇదే తరహా పరిస్థితి. 2,60,437 మంది నుంచి ఓటర్ల సంఖ్య 2,09,646కు తగ్గింది. అంటే 50,791 మంది తగ్గారు. ఏఎస్డీడీలో పాలకుర్తి రెండో స్థానం.. ఏఎస్డీడీని పరిశీలిస్తే పాలకుర్తి 23.68 శాతంతో ఉమ్మడి వరంగల్లో రెండో స్థానం, వరంగల్ తూర్పు 23.88 శాతంతో మొదటి స్థానంలో ఉంది. భూపాలపల్లిలో ఏఎస్డీడీ ఓటర్ల శాతం కేవలం 8.63 శాతం ఉంది. అంటే ఒకే ఉమ్మడి ప్రాంతంలో నియోజకవర్గాల మధ్య సవరణ ప్రభావంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. అక్టోబర్ 1న తుది జాబితా.. ఇక నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు, విచారణ, కొత్తగా చేరే ఓటర్లు, తిరిగి చేర్చే పేర్లతో జాబితా మారనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న వెలువడే తుది జాబితానే ఉమ్మడి వరంగల్లో అసలు ఓటర్ల బలాన్ని స్పష్టంగా చూపించనుంది. ఇప్పటివరకు కనిపిస్తున్న గణాంకాలు తుది జాబితా కాదన్నదే కీలకం. ప్రత్యేక సవరణలో ముసాయిదా జాబితా అనంతరం ఓటర్లకు తమ పేరు ఉందో లేదో చూసుకునే అవకాశం, అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలకు ఈ నెల 30 వరకు అవకాశం ఉండగా, వాటి పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న ప్రచురించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న తగ్గుదలలో ఎన్ని పేర్లు శాశ్వతంగా తొలగిపోతాయి? ఎన్ని తిరిగి చేరుతాయి? కొత్తగా ఎన్ని పేర్లు చేరతాయి? అనేది త్వరలో తేలనుంది. రంగంలోకి రాజకీయ పార్టీలు మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్డీడీలో ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తమ బూత్లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం, నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్లు తొలగిపోయాయా? అనేది ఇంటింటికీ పరిశీలించడం. అర్హులైన కొత్త ఓటర్లు, మిస్సైన పేర్లు, చిరునామా/పేరు తప్పులపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయడం. ఇది పార్టీలకు కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. ఎన్నికల బూత్ మేనేజ్మెంట్కు కీలకమైన ప్రక్రియగా మారనుంది. నియోజకవర్గం 10.06.26 17.08.26 ఏఎస్డీడీ ఏఎస్డీడీ నో తగ్గిన ఓటర్లు ఓటర్లు (డిజిటైజ్) శాతం మ్యాపింగ్ ఓటర్లువరంగల్ పశ్చిమ 2,86,335 2,03,719 43,892 21.55 46,238 82,616 పరకాల 2,22,679 2,03,598 37,376 18.36 4,568 19,081 వరంగల్ తూర్పు 2,60,437 2,09,646 50,058 23.88 25,685 50,791 నర్సంపేట 2,40,244 2,21,913 46,321 20.87 5,559 18,331 వర్ధన్నపేట 2,76,272 2,46,981 53,804 21.78 12,966 29,291 జనగామ 2,49,437 2,22,381 46,000 20.69 9,943 27,056 స్టేషన్ఘన్పూర్ 2,56,806 2,39,750 31,215 13.02 6,746 17,056 పాలకుర్తి 2,61,241 2,41,462 57,177 23.68 12,776 19,779 డోర్నకల్ 2,24,165 2,05,085 27,254 13.29 4,715 19,080 మహబూబాబాద్ 2,60,770 2,31,871 39,243 16.92 9,687 28,899 భూపాలపల్లి 2,77,882 2,41,964 20,877 8.63 11,739 35,918 ములుగు 2,36,970 2,09,128 30,586 14.63 11,313 27,842ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సవరణ ముసాయిదా ఇలా.. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
ములుగు : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ మహేందర్జీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో 28 దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు–3, ఇందిరమ్మ ఇళ్లు–5, పెన్షన్–7, ఇతర శాఖలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్రావు, డిప్యూటీ ట్రెయినింగ్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయి ప్రజావాణికి విశేష స్పందన జిల్లాలోని పది మండలాల్లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేవిధంగా ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 219 మంది అధికారులు పాల్గొనగా ప్రజల నుంచి 180 దరఖాస్తులు స్వీకరించారని పేర్కొన్నారు. ఏటూరునాగారంలో 24, గోవిందరావుపేట–14, కన్నాయిగూడెం–3, మల్లంపల్లి–32, మంగపేట–42, ములుగు–14, తాడ్వాయి–10, వెంకటాపురం(ఎం)–25, వెంకటాపురం(కె)–12, వాజేడులో 4 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు మండలస్థాయి ప్రజావాణిని వినియోగించుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ -
ఎన్ఎంఎంఎస్తో ఉపకారం
ములుగు రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)ను ప్రవేశ పెట్టింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగించేందుకు ఉపకార వేతనం ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ఉండేందుకు ఈ స్కాలర్షిప్ను తీసుకు వచ్చింది. అర్హతలు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దీంతో పాటు 7వ తరగతిలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో దరఖాస్తు పత్రాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి. ఆన్లైన్లో పరీక్ష రుసుం చెల్లింపు.. అర్హత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఓసీ, బీసీ వారు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50లు ఆన్లైన్లో చెల్లించాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు పూర్తిచేయాలి. ఈ నెల 24వ తేదీతో గడువు ముగియనుంది. నవంబర్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు. ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు.. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ఉపకారవేతనం అందిస్తారు. ప్రతీ ఏడాది రూ.12 వేలను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. విద్యార్థులు వినియోగించుకోవాలి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో అర్హత సాధిస్తే నాలుగేళ్ల పాటు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ అందుతుంది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి పరీక్షకు దరఖాస్తులు చేసుకునేలా చూడాలని ఆదేశించాం. – సిద్ధార్థ్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి దరఖాస్తుకు ఈనెల 24వరకు గడువు 8వ తరగతి విద్యార్థులు అర్హులు అర్హత సాధిస్తే ఏటా రూ.12వేలు అందజేత8వ తరగతి విద్యార్థులుములుగు 192 వెంకటాపురం(కె) 171 మంగపేట 168 గోవిందరావుపేట 155 ఏటూరునాగారం 134 వెంకటాపురం(ఎం) 90 తాడ్వాయి 69 వాజేడు 63 మల్లంపల్లి 43 కన్నాయిగూడెం 29 మొత్తం 1,114గతంలో అర్హత సాధించిన విద్యార్థులు 2022 18 2023 212024 18 2025 19 -
రామప్పలో శ్రావణ శోభ
వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప దేవాలయంలో సోమవారం శ్రావణ సందడి నెలకొంది. శ్రావణమాసంలో తొలి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ సోమవారం సందర్భంగా రామప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి ములుగు రూరల్ : చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని లీగల్ ఎయిడ్ ఛీప్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం, న్యాయసేవలు, ఉచిత న్యాయం, న్యాయ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందజేస్తున్న న్యాయ సేవలను వినియోగించుకోవాన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, అధ్యాపకులు శిరిష, రాధిక, శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు.మంగపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో గల రేషన్ షాపుల్లో కాంటాలను లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శ్రీలత సోమవారం తనిఖీ చేశారు. గిరిజన సహకార సంస్థ, ప్రైవేటు రేషన్ డీలర్లు, మహిళా పొదుపు సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రేషన్ షాపుల్లో ప్రతి నెలా బియ్యం పంపిణీలో కొందరు నిర్వాహకులు ఎలక్ట్రానిక్ కాంటాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారంతో టెక్నాలజీని ఉపయోగించి తూకంలో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కమలాపురం, బోరునర్సాపురంలోని నాలుగు రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లను పరిశీలించారు. కమలాపురంలోని ఓ రేషన్ షాపులో తూకంలో తేడా రావడంతో కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ములుగు : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ములుగు మండల మాజీ అధ్యక్షుడు సానికొమ్ము రమేష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్రెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, రైతు బీమా వెంటనే అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని వివరించారు. కార్యక్రమంలో చిన్న విజయ్, పోరిక గోవింద్ నాయక్, వెంకన్న, మహేష్, చంద్రమౌళి, ముంజాల భిక్షపతి పాల్గొన్నారు. అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న అందజేయనున్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, వలంటీర్ ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరారు. -
దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాంములుగు రూరల్ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియాగాంధీ అంతరాయం కలిగించినందుకు దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశభక్తి, జాతీయ గౌరవం, వందేమాతర గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. జాతీయ గీతం విషయంలో రాజకీయ భేదాలకు అతీతంగా గౌరవం, క్రమశిక్షణ పాటించవలసిన బాధ్యత దేశ పౌరులపై ఉందని తెలిపారు. జాతీయ జెండా విషయంలో బీజేపీపై ఆరోపణలు చేసిన మంత్రి సీతక్క కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ములుగు జిల్లా ఏర్పాటు ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీ కృషి కాదని సమష్టి ప్రజల కృషి ఫలితమని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్రెడ్డి, భూక్య జవహర్లాల్, దేవేందర్రావు, రవీంద్రాచారి, నగరపు రమేష్, కృష్ణాకర్, రామరాజు, సుమలత, నాగరాజు, రాకేష్యాదవ్, మహేందర్, సతీష్, నరేందర్, కుమార్, రవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


