-
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ కొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన ఇలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు.8లోu -
బహుముఖ ప్రజ్ఞాశాలి రామయ్య
ములుగు రూరల్: మండలంలోని అబ్బాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కందాల రామయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. ఈ మేరకు శుక్రవారం అబ్బాపూర్ పాఠశాలలో కందాల రామయ్య ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ(మనోవిజ్ఞాన శాస్త్రం) పట్టా పొందగా విద్యాశాఖ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాశాఖలో రామయ్య రిసోర్స్ పర్సన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రణాళికల రూపకల్పనలో సేవలు అందించారన్నారు. రామయ్య పీహెచ్డీ పట్టా పొందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ జయదేవ్, గణిత పోరం జిల్లా అధ్యక్షుడు ఎళ్ల మధుసూదన్, డీసీఈబీ సహాయ కార్యదర్శి విక్రమ్ రాజ్, ప్రధానోపాధ్యాయుడు గండా భాస్కర్, ఉపాధ్యాయులు హనుమాన్, పాపిరెడ్డి, సురేందర్, ప్రభావతి, పరిమళ, రవీందర్, స్వామి, శ్రీదేవి, రమేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
రామాలయంలో ఘనంగా పుష్పయాగం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం రాత్రి నాఖబలి (పుష్పయాగం) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ముక్కామల వెంకట నారాయణ శర్మ, ఎల్లాప్రగడ మణికంఠ శర్మ, ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మలు ఉదయం పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాన్ని ప్రత్యేక వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి.. ఐదురోజుల సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం రామాలయంలో నాఖబలి (పుష్పయాగం) కార్యక్రమాన్ని వేదపండితులు వెంకటనారాయణ, మణికంఠశర్మలు నిర్వహించారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి రంగులతో ముగ్గులు వేసి పూజలు చేశారు. 12 రకాల పూలతో శ్రీ సీతారామ దేవతమూర్తులకు పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. 12 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. నాఖబలి కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమం భక్తులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు.. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఉద యం 6.37 నిమిషాలకు స్వామి వారి అలంకరణ పూర్తయిన అనంతరం సూర్యకిరణాలు నేరుగా రాముడి నుదిటిపై పడడం కనిపించింది. ఈ అద్భుతాన్ని అర్చకుడు నాగేశ్వరరావు శర్మ గమనించాడు. అయోధ్యలో శ్రీ బాలరాముడు ప్రతిష్ఠాపన అనంతరం రామాలయాల్లో ఇలా జరగడం ఒక విశేషమన్నారు. పైగా శ్రీరాముడికి జరిగిన కల్యాణం అనంతరం ఈ విధంగా కనిపించడం మరో విశేషమన్నారు. -
విద్యుత్ సిబ్బందికి శిక్షణ
ఏటూరునాగారం: నాణ్యమైన విద్యుత్ సరఫరా, సమస్యల నివారణపై విద్యుత్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మన్సూర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేఎల్ఎం, ఏఎల్ఎం, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్మెన్, ఫోర్మెన్లకు శిక్షణ, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారులతో మర్యాదగా మట్లాడుతూ విధులు, బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ నాగేశ్వరరావు, ఏడీఈ సుధాకర్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అవసరమైతేనే బయటకు రావాలి
కన్నాయిగూడెం: అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎంసీహెచ్ వైద్యుడు ఎం.గిరి అన్నారు. మండలంలోని సర్వాయిలో శుక్రవారం డాక్టర్ గిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చల్లని తాగునీరు, ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజూవాణి, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఆశలు పాల్గొన్నారు. డీపీఓగా బాధ్యతల స్వీకరణములుగు: ములుగు జిల్లా పూర్తి అదనపు స్థాయి పంచాయతీ అధికారి (డీపీఓ)గా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శ్రీనివాస్కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ములుగు డీపీఓ కొండా వెంకయ్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ డీపీఓ జగదీశ్ నియమితులయ్యారు. వచ్చిరాగానే ఆయన ఆరోగ్యపరమైన కారణాలతో లాంగ్లీవ్పై వెళ్లారు. దీంతో డీఎల్పీఓగా ఉన్న స్వరూపను ఇన్చార్జ్ డీపీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మూడు నెలల వ్యవధిలో స్వరూపను అనివార్య కారణాలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి మూడు రోజుల క్రితం కమిషనరేట్కు సరేండర్ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్కుమార్ను కార్యాలయ సిబ్బంది, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది’ములుగు: ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు మంత్రి సీతక్కకు అప్పగించినప్పుడే బీజేపీ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల ఓటమిభయం పట్టుకుందని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ తరలివెళ్లే క్రమంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్లపై పాల్వాయి హరీష్బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశసంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. హరీష్ బాబు తనవాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసిందని, గడిచిన 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం నిరుపేదల కోసం ఏం చేసిందో చెప్పాలని అడిగారు. ఆయన వెంట పార్టీ ముఖ్య సంఘాల నాయకులు ఉన్నారు. కరెంట్ ఉచ్చులకు తగిలి పాడిగేదెల మృతి ఏటూరునాగారం: మండలంలోని ముళ్లకట్ట గ్రామ శివారులో పంట చేనును కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు ఉచ్చుకు తగిలి నాలుగు పాడిగేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ముళ్లకట్ట గ్రామానికి చెందిన ముడుత రా మయ్య, సత్యంకు చెందిన నాలుగు పాడిగేదెలు కరెంటు ఉచ్చులకు తగిలి మృతి చెందాయి. పశువులు రోజు వారిలాగానే పంట పొలాలు, అటవీ ప్రాంతాలకు మేతకు వెళ్లాయి. గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన గేదెలు రాకపోవడంతో వాటిని వెతుకుంటూ వెళ్లిన రైతులకు కరెంటు ఉచ్చులకు తగిలి మృతి చెందాయని బాధితులు బోరునావిలపించారు. సుమారు వాటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురి అరెస్ట్ అడవిలోని జంతువులను వేటాడేందుకు అక్రమంగా విద్యుత్ వైరును అమర్చి 4 గేదెల మృతి కారణమైన ముల్లకట్ట గ్రామానికి చెందిన గడ్డం రమేష్, కొరిసే నర్సింహులు, మంతెన చిట్టిబాబులను అరెస్టు చేసినట్లు ఎస్సై జి.కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో జంతువులను వేటాడేందుకు కరెంటు వైరును అమర్చగా వాటికి గేదెలు తగిలి మృతి చెందినట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మారేడుగొండ చెరువు పరిశీలన
వెంకటాపురం(ఎం): మండలంలోని లక్ష్మీదేవిపేట–బుర్గుపేట గ్రామాల మధ్యలో ఉన్న మారేడుగొండ చెరువును శుక్రవారం డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, ఏపీడీ వెంకటనారాయణ పరీశీలించారు. గత సంవత్సరం జూలై 27న కురిసిన భారీవర్షానికి చెరువుకు పలు చోట్ల గండ్లు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్ష్మీదేవిపేట–బుర్గుపేట మధ్య గల రోడ్డు తెగిపోవడంతో పాటు వరదల్లో ఒ కే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతై మృతిచెందారు. చెరువుకు పడిన గండ్లను పూడ్చివేయకపోవడంతో పాటు చెరువుకు ఎలాంటి మరమ్మతు చేపట్టకపోవడంతో రైతులు పంటలు పండించుకో ని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పలుమార్లు చెరువుకు మరమ్మతు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చెరువును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ అధికారులు కిషోర్, నారగోని సునీత, సు రేష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..!
ఎస్ఎస్ తాడ్వాయి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిసెంట్లు (టీఏ)గా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లోని కూలీలకు పనులు కల్పించి, బిల్లుల రికార్డు నమోదు చేయడంలో టీఏలు కీలకంగా వ్యవహరిస్తారు. మూడు నెలల నుంచి వేతనాలు రాక వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల పర్యవేక్షణ, పనుల ప్రదేశంలో కొలతలకు టెక్నికల్ అసిస్టెంట్లు నిత్యం వెళ్లాల్సి ఉంటుంది. వేతనాలు రాకపోవడంతో రవాణా ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. పెరిగిన పనిభారం.. జిల్లాలో 174 గ్రామ పంచాయతీలకు గాను 29 మంది టెక్నికల్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడటంతో ప్రస్తుతం పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు పనిభారం పెరిగింది. కొత్త జీపీలు ఏర్పాటైనా గత ప్రభుత్వం నూతనంగా టెక్నికల్ అసిస్టెంట్లను నియమించలేదు. ఉన్న టీఏలతోనే పనులు నెట్టుకొస్తున్నారు. వేసవికాలంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఎక్కువగా ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతారు. జీపీల వారీగా టీఏల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉన్న పని భారాన్ని వారిపై పడుతోంది. ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు పని ఒత్తిడిని అధిక మించినా.. సమయానికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మూడు నెలలుగా నిరీక్షణ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు మూడు నెలలుగా వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబ పోషణ చూసుకునే టీఏలు, మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అప్పుల పాలుకావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు నెలల పెండింగ్ వేతనాలతో పాటు ప్రతీ నెల వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతీ నెల వేతనాలు చెల్లిస్తే కుటుంబ పోషణ అ వసరాలకు ఉపయోగపడే వి. పనుల ప్రదేశానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా ఇబ్బందిగా మారా యి. టెక్నికల్ అసిస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పనిభారం పెరిగింది. వేతనాలు రాకపోవడంతో అప్పులు తెచ్చి అవసరాలు తీర్చుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలి. – రాజ్కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లకు అందని వేతనాలు కనీస అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇబ్బందులు పడుతున్న టీఏలు జిల్లాలో 29 మంది టెక్నికల్ ఉద్యోగులు మండలం జీపీల టీఏల సంఖ్య సంఖ్యములుగు 32 04 వెంకటాపురం (ఎం) 23 03 గోవిందరావుపేట 18 03 తాడ్వాయి 18 03 ఏటూరునాగారం 12 03 కన్నాయిగూడెం 11 03 మంగపేట 25 03 వాజేడు 17 04 వెంకటాపురం(కె) 18 03 మొత్తం 174 29 -
జనజీవన స్రవంతిలో కలవండి
ములుగు: మావోయిస్టు జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో సీఆర్సీ ఏ సెక్షన్ కమాండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్ సంజు, రెండో సీఆర్సీ పీపీసీఎం/ఏసీఎం భీమా భార్య సోనిలు పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా, వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ములుగు జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో డీడీ రూపంగా ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో చాలామంది లొంగిపోతున్నట్లుగా వాగ్మూలం ఇచ్చారన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలకు ఎవరూ ఆకర్షితులు కావొద్దని సూచించారు. ఎస్పీ వెంట 39వ బెటాలియన్ కమాండెంట్ రాజేష్ తివారి, ములుగు డీఎస్పీ రవీందర్ ఉన్నారు. ధైర్యంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ప్రజల్లో ఎన్నికలపై అవగాహాన కల్పిస్తూ సీఆర్పీఎఫ్ బలగాలతో జిల్లాకేంద్రంలో ప్రధాన రహదారి వెంబడి ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టుల నుంచి ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఓటు హక్కు అనేది ఎన్నికల ప్రక్రియపై సానుకూల సందేశం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, సీఐలు మేకల రంజిత్కుమార్, శంకర్, ఆర్ఐ ఆపరేషన్స్ సంతోష్, ఎస్సైలు రాజు, కమలాకర్, వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఖర్చులు పారదర్శకంగా చూపించాలి
ములుగు: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమర్పించే సమయంలో ఖర్చులను పారదర్శకంగా చూపించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్కుమార్ గోపాల్ అన్నారు. మహబూబాబాద్ పార్లమెంటరీ పరిధిలోని అభ్యర్థులు ములుగు అసెంబ్లీ నియోజకవర్గం సెగ్మెంట్ ఎన్నికల ప్రచార ఖర్చులు పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ కేటాయించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్కుమార్ గోపాల్ జిల్లాకు గురువారం చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి చాంబర్లో ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీఓ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పి.శ్రీజలతో రామ్కుమార్గోపాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ఖర్చుల నమోదుకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ బృందాలు, వాటి పనితీరు తదితర అంశాలను కలెక్టర్, ఎస్పీ ఎన్నికల పరిశీలకులకు వివరించారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికలలో వ్యయ లెక్కింపునకు ఏర్పాటు చేసిన కమిటీలు, బృందాలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న, అప్పగించిన నగదు, మద్యం తదితర వివరాలను ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలతో వ్యయ పరిశీలకులు సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ), డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ మహేందర్జీ, ఆర్డీఓ, ఈఆర్ఓ సత్యపాల్రెడ్డి, జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారి సర్దార్ సింగ్, ఎకై ్సజ్ అధికారులు లింగాచారి, సహాయ వ్యయ పర్యవేక్షకులు, అకౌంట్ అధికారులు పాల్గొన్నారు.ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్కుమార్ గోపాల్ -
ఫైర్ సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: అగ్నిమాపక సిబ్బంది సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఫైర్ ఆఫీసర్ ఎండి.అబ్దుల్ రహీం అన్నారు. అగ్నిమాపక వారోత్సావాల్లో భాగంగా గురువారం ములుగు పట్టణ కేంద్రంలోని లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీస్లో వంట గ్యాస్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అవగాహన కల్పించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రహీం మాట్లాడుతూ ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ములుగు అగ్నిమాపక కేంద్రం సెల్ నంబర్ 8712699210, 8712699211 లేదా 101కి సమాచారం అందించాలన్నారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి వస్తువులు కాలుతున్నాయో స్పష్టంగా తెలుపాలన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కంగారు పడకుండా అగ్ని ప్రమాదాన్ని నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ మహేశ్వర్, డీఓపీ రమేష్, సురేందర్, ధన్సింగ్, చంద్రప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి@ఎన్ఎల్ఎం
గొర్రెలు, కోళ్లు, పందుల పెంపకానికి కేంద్రం ప్రోత్సాహం ● పెంపకం దారులకు 50శాతం సబ్సిడీ ● యూనిట్ విలువ రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు ములుగు రూరల్: ఉపాధి, ఉత్పాదకతే లక్ష్యంగా జీవాల పెంపకందారులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో సబ్సిడీ రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం(ఎన్ఎల్ఎం)పేరుతో పెంపకందారులకు 50శాతం సబ్సిడీ అందించి జీవాల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. ఎన్ఎల్ఎం పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, పందుల పెంపకంతో పాటు దానా ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక్కో యూనిట్ విలువ రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందించాలని నిర్ణయించింది. గొల్ల కురుమలకు కాకుండా అన్ని సా మాజిక వర్గాల ప్రజలను అర్హులుగా గుర్తించింది. దీంతో పాటు పరపతి సంఘాలు, సొసైటీలకు రుణాలను మంజూరు చేయనుంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. యూనిట్ ఐదు విభాగాలుగా విభజన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. పథకం ప్రారంభంలో కేవలం యూనిట్ విలువ రూ.కోటి కేటాయించింది. బ్యాంకు రుణం రూ.40 లక్షలు, లబ్ధిదారుడి వాటా ధనం రూ.10 లక్షలు, ప్రభుత్వ సబ్సిడీ రూ.50 లక్షలుగా నిర్ణయించింది. యూనిట్ విలువలో బ్యాంకు రుణాలకు బ్యాంకర్లు నిరాకరించడంతో యూనిట్ విలువను తగ్గించింది. దీంతో యూనిట్ విలువను ఐదు విభాగాలుగా విభజించి రుణాలు అందజేయాలని సడలించింది. దీంతో 105 గొర్ల నుంచి 525 గొర్రెల వరకు రూ.10 లక్షల నుంచి కోటి వరకు రుణాలు ఇస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే విధానం లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న యూనిట్ను బట్టి రెండు ఎకరాల భూమి నుంచి 10ఎకరాల భూమి అవసరం ఉంటుంది. భూమిలేని లబ్ధిదారులు లీజుకు తీసుకొని రుణాలు పొందవచ్చు. లబ్ధిదారుడు యూనిట్ పెంచుకునే స్థలంలో పశుగ్రాసం పెంచి బ్యాంక్ కాన్సెంట్ తీసుకురావాలి. లబ్ధిదారుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు జత చేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీలను జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. చివరి తేదీ లేకుండా లబ్ధిదారుడు ఎప్పుడైన దరఖాస్తు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. యూనిట్ విలువలో 50 శాతం సబ్సిడీ ఇస్తుంది. పథకం పూర్తి స్థాయి సబ్సిడీ డబ్బులు రెండు సంవత్సరాల కాల పరిమితిలో చెల్లించబడుతాయి. ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తులు చేసుకోవాలి. – జిల్లా పశు పంవర్ధకశాఖ అధికారి రవికుమార్ఎంపిక విధానం ఎన్ఎల్ఎం పథకంలో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్న వారి ఎంపిక కోసం రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రెండు కమిటీలు ఉంటాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుడికి బ్యాంకు రుణం మంజూరైన తర్వాత 25 శాతం, యూనిట్ గ్రౌండింగ్ తర్వాత 25 శాతం సబ్సిడీ నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. బ్యాంకు రుణం అవసరం లేని వారు సొంతంగా పెట్టుబడి పెట్టి షెడ్లు, పశుగ్రాసం పెంపకం చేపట్టిన అనంతరం సబ్సిడీని పొందవచ్చు. -
సింగిల్ నామినేషన్..
మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ నియోజకవర్గ నామినేషన్ల స్వీకరణ కోసం స్థానిక కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. తొలిరోజు గురువారం ఒక్క నామినేషన్ దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామ శివారు గుర్రపు తండాకు చెందిన బానోత్ లింగ్యానాయక్ నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అద్వైత్కుమార్ సింగ్కు అందజేశారు. ఆ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టరేట్ ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్వో కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు నలుగురిని అనుమతించారు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్, ఆర్డీఓలు అలివేలు, నర్సింహారావు, తహసీల్దార్లు భగవాన్రెడ్డి, దామోదర్, శ్వేత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పవన్కుమార్ పాల్గొన్నారు. -
నేడు సీఎం రేవంత్రెడ్డి రాక
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి లోని ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ ఉదయం నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్ పట్టణ ంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. కాగా మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్ అధికారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్ను పరిశీలించారు. సవాల్గా జనసమీకరణ.. ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో బహిరంగ సభకు జనసమీకరణ సవాల్గా మారింది. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం భారీ ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ఇల్లెందు నియోజకవర్గాల నుంచి జనాలను తరలించే బాధ్యత ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు అప్పగించారు. లక్ష మందిని తరలించాలని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నాయకులు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ పెట్టారు. అయితే గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని పలువురు నాయకులు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జనాన్ని తరలించడం, వారికి తాగునీరు, మజ్జిగ, పెరుగన్నం మొదలైనవి సమకూర్చుకొనిసభకు రావాల్సి ఉంటుంది. అయి తే ‘అసెంబ్లీ ఎన్నికల్లో అప్పులు తెచ్చి ఖర్చుపెట్టాం.. ఇప్పుడు బలరాంనాయక్ ఎన్నిక మా చావుకు వచ్చింది.. పార్టీ ఆదేశాలు కఠినంగా ఉన్నా యి.. ఆర్థిక వనరులు మాత్రం లేవు అని’ ఓ ప్రజాప్రతి నిధి తమ అనుచరులతో వాపోయినట్లు ప్రచారం. ఉదయం నామినేషన్.. సాయంత్రం సభ.. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ఉదయం జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలతోపాటు, ప్రతి మండలం నుంచి కీలక నాయకులు హాజరుకావాలని ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. అయితే సాయంత్రం సీఎం సభకు జనసమీకరణ బాధ్యత ఉండటంతో ఉదయం వచ్చి మహబూబాబాద్లోనే ఉంటే జనాన్ని తరలించడం ఇబ్బందిగా ఉంటుందని, సాయంత్రం నేరుగా జనంతో సభకే వస్తామని పలువురు నాయకులు అంటున్నారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన.. మహబూబాబాద్ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని సభాస్థలి, హెలిపాడ్, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లాతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఐఎస్డబ్ల్యూ అధికారి వాసుదేవరెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కర్, డీఎస్పీ జితేందర్ రెడ్డి ప్రత్యేకంగా వచ్చి సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను ఎస్పీతో కలిసి పరిశీలించారు. ట్రైనీ ఐపీఎస్ చేతన్ పండరీ, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ దేవేందర్ ఉన్నారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగం భారీ జనసమీకరణకు కసరత్తు హెలిపాడ్ను పరిశీలించిన మంత్రి తుమ్మల -
గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని వివిధ గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు దాసరి జనార్దన్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 5వ గనిలో మ్యాన్రైడింగ్ సరిగా పని చేయడం లేదన్నారు. 150 కుర్చీలు ఉండాల్సి ఉండగా.. కేవలం 20 కుర్చీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. క్యాంటీన్లో సమయపాలన పాటించడం లేదని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఎండ తీవ్రత పెరిగినప్పటికీ చల్లటి తాగునీటికి అందించడం లేదని ఆరోపించారు. ప్రశ్నించిన కార్మికులను సస్పెండ్ చేస్తూ చార్జీిషీట్లు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాయకులు కాసర్ల ప్రసాద్రెడ్డి, శ్రీనివాస్, కలికొటి లింగయ్య, రాళ్లబండి బాబు, శ్రీధర్ పాల్గొన్నారు. -
రామాలయంలో నిత్యారాధన హోమం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ఉదయం నిత్యారాధన, హోమం, బలిహరణ కార్యక్రమాన్ని వేదపండితులు ముక్కాముల వెంకటనారాయణశర్మ, యల్లాప్రగడ మణికంటిశర్మ, నాగేశ్వర్రావుశర్మ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సదస్యము, ఆరగింపు, పల్లకిసేవ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం సీతారాములను దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. రామాలయంలో ఐదు రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు (శుక్రవారం) ఆలయంలో రాత్రి 9గంటలకు పుష్పయాగం(నాగబెల్లి) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు నాగేశ్వర్రావుశర్మ తెలిపారు. -
ఎన్నికల సందడి
శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024– 8లోuసాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. గురువారం నోటిఫికేషన్తో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11నుంచి సాయంత్రం 3గంటల వరకు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అభ్యర్థుల నుంచి మహబూబాబాద్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా మొదటి రోజు గురువారం ఒక్క నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ఫ్రీవెరిఫికేషన్ మొదలైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టరేట్ వద్ద ప్రత్యేక నిఘా, రక్షణ బృందాలను ఏర్పాటు చేశా రు. వీడియో, ఫొటోగ్రఫీతోపాటు రిటర్నింగ్ అధికా రి చాంబర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముహూర్తం చూసుకుంటున్న అభ్యర్థులు.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈమేరకు తెలిసిన పండితులతో తమ పేరు బలం, ముహూర్తం చూపించుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు బలరాంనాయక్, మాలోత్ కవిత, అజ్మీరా సీతారాంనాయక్లతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు తమకు అనుకూలమైన తేదీల్లో నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ హంగామాతో వేసేలా ఆపార్టీ నాయకులు వేం నరేందర్రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం 11:30గంటలకు బలరాంనాయక్ నామినేషన్ వేసేందుకు సర్వం సిద్ధం చేశారు. నామినేషన్ వేసిన తర్వాత సాయంత్రం 5గంటలకు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసభకు సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి కవిత, బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ కూడా తమదైన శైలిలో నామినేషన్ వేయనున్నారని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ఇలా.. నామినేషన్ల స్వీకరణ: ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు ..(ఆదివారం మినహా అన్ని పనిదినాల్లో ఉదయం 11నుంచి సాయంత్రం 3 గంటల వరకు) స్క్రూట్ని: ఏప్రిల్ 26న నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ : మే 13న మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే ములుగు, పినపాక, ఇల్లెందు , భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు: జూన్ 4వ తేదీనన్యూస్రీల్అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం డోర్నకల్ 1,09,150 1,13,455 07 2,22,612 మహబూబాబాద్ 1,26,611 1,31,794 46 2,58,451 నర్సంపేట 1,15,068 1,20,370 09 2,35,447 ములుగు 1,13,592 1,19,172 27 2,32,791 పినపాక 99,824 1,03,798 05 2,03,627 ఇల్లెందు 1,09,812 1,15,094 04 2,24,910 భద్రాచలం 72,925 79,597 07 1,52,529 మొత్తం 7,46,982 7,83,280 105 15,30,367 లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్తో నామినేషన్ల ప్రక్రియ షురూ.. మానుకోటలో తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు నేడు కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ నామినేషన్ కలెక్టరేట్లో తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు -
మోడికుంటను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు
వాజేడు: మోడికుంట ప్రాజెక్టును పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని పూసూరు రిసార్ట్స్లో పార్టీ నాయకులు దావూద్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాజేడు మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో మంజూరైన మోడికుంట ప్రాజెక్టును పూర్తి చేస్తే సాగు, తాగు నీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే సాగునీరు కీలకమన్నారు. 2006 నుంచి మోడికుంట ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేయించి అనుమతులు లేవని కాలయాపన చేసిందని ఆరోపించారు. 2016లో అనుమతులు వచ్చినప్పటికీ ప్రజల అభిప్రాయ సేకరణ చేసి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తలేదన్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే 36 గ్రామాలకు తాగునీరు, 25 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి రావు, భీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, వాసు, చిట్టిబాబు, శ్రీను, రాములు, ఆగిరెడ్డి, రాజేష్, చిరంజీవి, చిన్నా పాల్గొన్నారు. -
ఎన్హెచ్పై పోలీసుల తనిఖీ
గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా పోలీస్స్టేషన్ పరిధిలో ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పస్రా ఎన్హెచ్పై గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. వచ్చి వెళ్లే ప్రతీ వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వాహనదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకోవటానికి పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇద్దరి రిమాండ్ వాజేడు: విద్యుత్ తీగలు అమర్చి ఒకరి ప్రాణం పోవడానికి కారణమైన ఇద్దరిని రిమాండ్ చేసినట్లు వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు గురువారం కేసు వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని చింతూరు గ్రామానికి చెందిన కన్నెబోయిన సమ్మయ్య పూజారి సురేష్తో కలిసి తన మొక్కజొన్న పంటను రక్షించుకోవడానికి మార్చి 27న విద్యుత్ తీగలను అమర్చాడు. రాత్రి సమయంలో అటుగా మంచినీళ్ల కోసం వెళ్లిన అభినయ్ విద్యుత్ తీగలు తగిలి గాయపడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. అందుకు కారణమైన కన్నెబోయిన సమ్మయ్య, పూజారి సురేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. రైతులు, వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలివెంకటాపురం(కె): విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. మండల పరిధిలోని ఆలుబాక, వెంకటా పురం ఎస్టీ బాలుర వసతి గృహాలను, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహాల్లో ఉన్న బాత్ రూమ్లు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం వి ద్యార్థుల హాజరు పట్టిక, రికార్డులను తనిఖీ చేశా రు. స్టోర్ రూమ్లో ఉన్న స్టాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో మరమ్మతులకు గురైన బాత్రూమ్లు, విద్యుత్ మరమ్మతులు పనులు చేయించాలన్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసమే.. ● కాంగ్రెస్ నాయకుడు గుడాల శ్రీనివాస్ కాటారం (మహదేవపూర్): ప్రతీ ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశ్యంతో కొంత కాలంగా వ్యాయామం, యోగాపై తన వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నానని.. అందులో భాగంగానే పోలీసులకు సైతం అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు మహదేవపూర్ కాంగ్రెస్ నాయకుడు, జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 15న మహదేవపూర్ పోలీస్స్టేషన్లో శ్రీనివాస్ నృత్యం చేసిన ఘటన వైరల్ కాగా అదేరోజు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్రెడ్డి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకా జ్ నోటీస్ జారీ చేశారు. దీనిపై గురువారం గుడాల శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా సంజాయిషీ ఇచ్చారు. 30 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ మంచి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు. కరోనా బాధితులు గుండుపోటుతో మృతిచెందడం తనను బాధించిందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులను అడిగి పలు సలహాలు తీసుకున్నానని చెప్పారు. ఆ విషయాలను నలుగురికి చెపుతూ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 15న ఉదయం వాకింగ్కు వెళ్లి వస్తూ ఇంటి సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులు పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేసినట్లు వివరించారు. గిట్టని వారు కొందరు దురుద్దేశంతో అబద్ద పు మాటలు ప్రచారం చేస్తున్నారని ఆరో పించారు. తన సంజాయిషీతో సంతృప్తి చెందకపోతే పార్టీ జిల్లా బాధ్యులు తీసుకోబోయే చర్యలను గౌరవిస్తానని పేర్కొన్నారు. -
రోజుకు 9 గంటలు
కోచింగ్ లేకుండా సివిల్స్ ర్యాంకు సాధించిన కౌశిక్జనగామ పేరు నిలబెడతా.. – ‘సాక్షి’తో సివిల్ ర్యాంకర్ కౌశిక్ఉస్మానియా వర్సిటీలో సివిల్ ఇంజీనిరింగ్ పూర్తయిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో ఎంబీఏ చదివాను. తర్వాత కన్సట్టెంట్గా ఏడాదిపాటు ఉద్యోగం చేశాను. సివిల్స్కు ప్రిపేర్ కావడానికి ఉద్యోగం మానేశాను. 2022 నుంచి రెండు షిఫ్టుల్లో రోజుకు తొమ్మిది గంటల పాటు ప్రిపేర్ అయ్యాను. యూట్యూబ్లో వచ్చే స్టాండర్డ్ బుక్స్ను మల్టీపుల్గా చూసుకుంటూ.. సీని యర్ల సలహాలు, సూచనలు తీసుకున్నా. ఆన్స ర్ రేటింగ్ కోసం తరచూ టెస్ట్ సిరీస్ రాయడం, డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుని తప్పులను సరిచేసుకోవడం వల్ల ఈ ర్యాంకు సాధించగలిగా. మాక్ ఇంటర్వ్యూలు కలిసొచ్చాయి. గతంలో సివిల్స్ ఎంట్రెన్స్ల్లో వచ్చిన ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు రిమైండ్ చేసుకున్నా. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఐఏఎస్ సాధించగలిగా. పుట్టిన ఊరు ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని మరువలేను. జనగామ పేరు నిలబెడతా. జనగామ: రోజుకు తొమ్మిది గంటలు.. రెండేళ్ల కఠోర శ్రమ.. కోచింగ్ లేకుండా స్వశక్తితో ప్రిపరేషన్.. సీనియర్ల సలహాలు, సూచనలతో సివిల్స్లో ఆలిండియా 82వ ర్యాంకు సాధించిన మెరుగు కౌశిక్ నేటితరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జనగామ పట్టణానికి చెందిన కౌశిక్ ర్యాంకు సాధించిన తర్వాత మొదటిసారి బుధవారం జిల్లా కేంద్రానికి రాగా.. స్నేహితులు, బంధువులు అతడికి ఘన స్వాగతం పలికి అభినందనలతో ముంచెత్తారు. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, స్నేహితులు సత్కరించి ఆశీస్సులు అందించారు. పలువురి సత్కారం.. సివిల్స్ ర్యాంకర్ కౌశిక్ను జిల్లా ఆస్పతుల సమన్వయకర్త డాక్టర్ సుగుణాకర్రాజు, కౌన్సిలర్ సుధ త దితరులు సత్కరించారు. అలాగే బాలాజీనగర్ రే ణుక ఎల్లమ్మ ఆలయ కాలనీవాసులతోపాటు సురుగు సుధాకర్ గౌడ్, రాజు, ముస్త్యాల దయాకర్, ఉల్లుంగుల సందీప్, తిప్పారపు విజయ్, సతీష్, అఓపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్కుమార్, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బిజ్జల నవీన్కుమార్, వాసవీ క్లబ్ గ్రేటర్ పట్టణ అధ్యక్షుడు పడకంటి రవీందర్, రాజు అభినందించి సన్మానించారు. కౌశిక్ పట్టుదల స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే ‘పల్లా’ కోచింగ్ లేకుండా.. స్వశక్తితో సివిల్స్లో 82వ ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదు.. కౌశిక్ పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సతీమణి నీలిమ, మున్సిపల్ చైర్పర్సన్ పి.జమునతో కలిసి ఆయన కౌశిక్ను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో జనగామ పేరు ప్రతిష్టలను నిలబెట్టాలని ఆకాంక్షించారు. రెండేళ్ల కఠోర శ్రమకు ఫలితం.. 82వ ర్యాంక్ ఏడాది పాటు కన్సల్టెన్సీగా ఉద్యోగం అభినందనలతో ముంచెత్తిన స్నేహితులు, బంధువులు..అందుకే ఐఏఎస్ కావాలనుకున్నాయూపీఎస్సీ ర్యాంకర్ ప్రణయ్కుమార్ ‘పౌరులకు వైద్యం, విద్య, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతుల కల్పన, పేదరికం నిర్మూలన కోసం కృషి చేసేందుకే ఐఏఎస్ కావాలనుకున్నా’ అని యూపీఎస్సీ ఆల్ ఇండియా 554వ ర్యాంకర్ కొయ్యడ ప్రణయ్కుమార్ అన్నారు. బుధవారం స్వగ్రామమైన రఘునాథపల్లికి తన తల్లిదండ్రులు లక్ష్మి, ప్రభాకర్తో వచ్చిన ప్రణయ్కుమార్ను గ్రామపెద్దలు ఓపెన్టాప్ జీప్పై ఊరేగించి ఘన స్వాగతం పలికారు. – రఘునాథపల్లి– 8లోu -
ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
వెంకటాపురం(కె): ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వెంకటాపురం సీఐ బండారి కుమార్ సూచించారు. మండల పరిధిలోని ఆలుబాకలో బుధవారం సీఆర్పీఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సంఘ విద్రోహ శక్తులకు భయపడకుండా ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు కొప్పుల తిరుపతి రావు, అశోక్, వాజేడు ఎస్సై వెంకటేశ్వర్లు, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తం ములుగు రూరల్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి అబ్దుల్ రహీం అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం మండల పరిధిలోని మల్లంపల్లిలో గల బాలాజీ నర్సింగ్హోం వద్ద అగ్ని ప్రమాదాల నివారణ చర్యల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నగేష్, మధుసూధన్, భార్గవ్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్లో ప్రసవం గోవిందరావుపేట: అంబులెన్స్లో ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన మండల పరిధిలోని బుస్సాపూర్లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బస్సాపూర్కు చెందిన ధనసరి అంకిత పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అంకితను 108లో ములుగు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ యుగేందర్ పురుడు పోశారు. అనంతరం తల్లీబిడ్డను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ నాయకుడికి షోకాజ్ నోటీస్కాటారం(మహదేవపూర్): మహదేవపూర్ పోలీస్స్టేషన్లో నృత్యం చేసిన సంఘటనలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహదేవపూర్ జెడ్పీటీసీ గుడాల అరుణ భర్త గుడాల శ్రీనివాస్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఐత ప్రకాశ్రెడ్డి ఈ నెల 15న షోకాజ్ నోటీస్ జారీ చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ నెల 15న గుడాల శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ పాటకు నృత్యం చేయగా ఆ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. యోగా, వ్యాయామం ప్రాముఖ్యత పోలీసులకు తెలియజేయడంలో భాగంగా ఇలా నృత్యం చేసినట్లు శ్రీనివాస్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ కిరణ్ఖరే అదే రోజు విచారణ చేపట్టి ఎస్సైతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ఇదే క్రమంలో నృత్యం అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సైతం సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో వైరల్ కావడంతో స్పందించిన కాంగ్రెస్ జిల్లా కమిటీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శ్రీనివాస్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. బాధ్యతాయుతమైన కాంగ్రెస్ కార్యకర్తగా ఉండి ఇలాంటి వాటికి పాల్పడటం సరికాదని నోటీస్లో పేర్కొంది. నోటీస్ జారీ అంశం మండలంలో చర్చనీయంగా మారింది. కాళేశ్వర్యంలో మద్యం దుకాణాలు బంద్కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మొదటి విడతలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 19న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు సరిహద్దులోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని రెండు మద్యం దుకాణాలను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కాటారం సీఐ నరేందర్ ఆధ్వర్యంలో బంద్ చేసి సీల్ వేశారు. మళ్లీ 19న పోలింగ్ ముగిసిన తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. -
ఓటరు స్లిప్పులు అందించాలి
ములుగు: ప్రతిఒక్కరికీ ఓటరు స్లిప్పులను విధిగా అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై బుధవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా తరఫున కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ ఓటర్ స్లిప్పులు అందలేదనే విషయంపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోటీ చేయనున్న అభ్యర్థుల తరఫున ఏజెంట్లు పాల్గొనవచ్చని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -
No Headline
జిల్లా వ్యాప్తంగా సీతారామచంద్రస్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి గ్రామాల్లో పండుగ వాతావరణం నడుమ ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని పండితులు శాస్త్రోతంగా వేదమంత్రోచ్ఛరణల నడుమ జరిపించారు. జిల్లాకేంద్రంలోని సీతారామాంజనేయస్వామి దేవాలయం(శ్రీ క్షేత్రం)లో వేదపండితులు పొడిశెటి శేషాచార్యులు కల్యాణాన్ని జరిపించారు. సీతారామచంద్రస్వామి దేవాలయంలో వేదపండితులు సముద్రాల శ్రీనివాసులు శ్రీరాముడు–సీతమ్మల వివాహం జరిపించారు. దీంతో భక్తులు ఆలయాలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. – ములుగు – మరిన్ని ఫొటోలు 9లోu -
నిప్పుల కొలిమి..
మంగపేట/వెంకటాపురం(కె): ఉష్ణోగ్రతలు రోజురోజకూ పెరిగిపోతున్నాయి. జిల్లాలోని 9మండలాల్లో బుధవారం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఉదయం నుంచే తీవ్ర వడగాలులతో పాటు ఎండ తీవ్రత నిప్పుల కొలిమిని తలపించింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం 7 గంటల వరకు సైతం ఎండ వేడి తగ్గక పోవడంతో ప్రజలు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు అతుక్కుపోయారు. మంగపేట, వెంకటాపురం(కె), ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లో 44 డిగ్రీల సెల్సియస్పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావవడంతో రేకుల ఇళ్లలో ఉండే వారు చెట్ల కిందకు చేరి ఉపసమనం పొందారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.మండలాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్లలో)మండలం కనిష్టం గరిష్టం ములుగు 35.3 42.08 ఏటూరునాగారం 33.8 42.08 మంగపేట 37.0 44.05 ఎస్ఎస్ తాడ్వాయి 37.5 44.03 గోవిందరావుపేట 36.01 42.05 వెంకటాపురం(ఎం) 36.08 42.0 వాజేడు 34.09 41.07 వెంకటాపురం(కె) 35.7 44.05 కన్నాయిగూడెం 36.01 42.05 పలు మండలాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పైగా నమోదు ఇళ్ల నుంచి బయటకు రాని జనం -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
ములుగు రూరల్: మహిళలు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సఖి కేంద్ర కేస్ వర్కర్ సాధన అన్నారు. మండల పరిధిలోని జాకారం వద్ద బుధవారం ఉపాధి కూలీలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు గృహ హింసకు గురైనప్పుడు సఖి కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. బాలికలు అత్యాచారాలకు గురైన, బాల్య వివాహాలు, పోక్సో చట్టం, సైబర్ క్రైం తదితర అంశాలపై వివరించారు. మహిళలు, బాలికలు హింసకు గురైనప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 181, 100, 1098, 1930లను సంప్రదించాలని సూచించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. లింగ సమానత్వం, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సఖి కేంద్రం అందించే సేవలు కౌన్సెలింగ్, న్యాయ, పోలీస్ సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి కల్పించడం తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పారా మెడికల్ రాధ, చైల్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.70వేల విలువైన మద్యం స్వాధీనం
ఏటూరునాగారం/మంగపేట: ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ.70వేల విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం ఎక్సైజ్ స్టేషన్ సీఐ ఎల్.రామకృష్ణ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా బుధవారం మంగపేట మండలం మల్లూరు గ్రామపంచాయతీ శివారు ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో తరలిస్తున్న 66.96లీటర్ల లిక్కర్, 15.60లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న రమణక్కపేటకు చెందిన గుమ్మల రంజిత్, కున్నారపు చంటిలను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో వారు మణుగూరు నుంచి మద్యం తీసుకొచ్చి మంగపేట మండలంలో విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement