breaking news
Mulugu District News
-
అత్యవసర సేవలపై తక్షణమే స్పందించాలి
మంగపేట: అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు సమాచారం అందిన తక్షణమే స్పందించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజీర్ 108, 102 సిబ్బందికి సూచించారు. మండలంలోని మంగపేట, చుంచుపల్లి, 108, 102 అంబులెన్సులను ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స కోసం అందించే మందులు, పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయో.. లేదో.. తెలుసుకుని కాలం చెల్లిన మందులను ఉంచుకోవద్దని సూచించారు. ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత పరికరాలు, మందులు పనిచేసేలా చూసుకోవాలన్నారు. అనంతరం వాహనాల పనితీరు, సిబ్బంది హాజరు, మందుల వివరాల రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అత్యవసర వాహనాల కార్యనిర్వాహణ అధికారి రాజ్కుమార్, ఎడ్ల నరేష్, లోహిత, మంజుల, పైలెట్లు రాజేశ్వర్, భాస్కర్, రాజేష్, విగ్నేష్ ఉన్నారు. ములుగురూరల్: మలేరియా, డెంగీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపారావు అన్నారు. మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో డెంగీ నిర్ధారణ కావడంతో శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిల్వనీటిని తొలగించారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టి డెంగీ, మలేరియా వ్యాప్తిని అరికట్టాలని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కీటక జనితనియంత్రణ అధికారి చంద్రకాంత్, వైద్యాధికారి ప్రసాద్, ఏఎంఓ దర్గరావు, సబ్ యూనిట్ అఫీసర్ సాంబయ్య, తదితరులు ఉన్నారు. -
భారీగా పెరిగిన మద్యం టెండర్ల రుసుం
నవంబర్తో ముగియనున్న గడువు ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమై ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మద్యం షాపుల టెండర్లకు వీలుండదనే ఆలోచనతో ప్రభుత్వం ముందస్తుగా నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న మద్యం పాలసీ విధానాన్నే అమలు చేయనుంది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. గతంలో ఉన్న దరఖాస్తు ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచారు. ఒక వ్యక్తి ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లాటరీ పద్ధతిన ఎంపిక.. మద్యం దుకాణాలను గతంలో మాదిరిగానే ఈ సారి కూడా లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు తీసుకుని పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన దరఖాస్తులను ఫైనల్ చేస్తారు. ఆయా మద్యం దుకాణాల వారీగా నంబర్లతో డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తారు.వెంకటాపురం(ఎం): స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నూతన మద్యం పాలసీకి ముందుగానే టెండర్లు ఆహ్వానించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 నుంచి 2027 వరకు రెండేళ్ల కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. ఈ సారి మద్యం దుకాణం టెండర్ ఫాం ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ ఫీజు మాత్రమే పెంచిన ప్రభుత్వం.. మిగతా విధానాలు పాత పద్ధతుల్లోనే కొనసాగించేందుకు చర్యలు తీసుకుంది. జిల్లాలో 10 మండలాల పరిధిలో 25 మద్యం దుకాణాలు ఉన్నాయి. ములుగు సర్కిల్ పరిధిలో 16, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో 9 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతంలో జిల్లాలోని 25 షాపులకు గాను 874 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి దరఖాస్తుల ద్వారా రూ.17.48 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. రిజర్వేషన్ల ప్రకారం.. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈసారి రిజర్వేషన్లు 30 శాతంగా నిర్ణయించారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ఆధారంగా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఆయా దుకాణాలకు జనాభా ప్రాతిపదికన రెండేళ్ల కాలానికిగాను నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్లలో లైసెన్స్దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం 25 మద్యం షాపులు గతంలో 874 దరఖాస్తులు స్లాబ్ల వారీగా ఫీజు చెల్లింపు -
అంగన్వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలి
గోవిందరావుపేట: అంగన్వాడీలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. పస్రా పీఎస్ఆర్ గార్డెన్లో శుక్రవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ములుగు జిల్లా మహాసభలను సరోజన, రుద్రమదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయలక్ష్మి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఐసీడీఎస్తోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తెచ్చిందని అన్నారు. ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ సిఫార్సులను అమలు చేస్తుందని, ఐసీడీఎస్ను నిర్వీర్యపరచడానికి నిర్ణయం చేయడం దుర్మార్గమని అన్నారు. విద్యాబోధన బాధ్యతలను అంగన్వాడీ టీచర్స్కు, హెల్పర్లకు ఇవ్వాలని, వలంటీర్లకిచ్చే అదనపు వేతనం అంగన్వాడీ టీచర్లకి ఇవ్వాలని అన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్లర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఎండీ దావుద్, కొప్పుల రఘుపతి, సోమా మల్లారెడ్డి, గొంది రాజేష్, సమ్మక్క, పద్మారాణి, భాగ్యలక్ష్మి, పార్వతి, సూరమ్మ, సరిత, రమ, రుక్మిణి, ధనలక్ష్మి, మోక్షరాణి, దీప, వెంకటరమణ, విజయలక్ష్మి, మల్లికార్జున, శోభ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.జయలక్ష్మి -
నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే..
మంగపేట : పాఠశాలల నిర్వహణ, విద్యాబోధనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి వెళతారని కలెక్టర్ టీఎస్ దివాకర మంగపేట ప్రాథమికోన్నత పా ఠశాల ఉపాధ్యాయులను శుక్రవారం ఘాటుగా హె చ్చరించారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, ప్రాథమికోన్నత పాఠశాల, పీహెచ్సీని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూపీఎస్ ఉపాధ్యాయులు విద్యాబోధన సక్రమంగా చేయడంలేదని, పాఠశాల నిర్వహణ, రికార్డులు సక్రమంగా లేకపోవడంతో నెలరోజుల్లో పద్ధతి మా ర్చుకోవాలని లేకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జెడ్పీ హెచ్ఎస్, యూపీఎస్ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతీ రోజు భోజనం అందిస్తున్నారా రుచి గా ఉంటుందా.. లేదా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారంలో ఎన్ని రోజులు గ్రుడ్లు ఇస్తున్నారని అడగడంతో సరైన సమాధానం రాకపోవడంతో విద్యార్థులను ఇంగ్లిష్లో వారాలు స్పెల్లింగ్తో చెప్పమని అడగడంతో ఒక్కరుకూడా చెప్పకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి చెందారు. విద్యార్థులకు ఏం భోదిస్తున్నారు. అసలు ఏమి జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత, ఎందరు ఉపాధ్యాయులు ఉన్నారని విధులకు ఎంతమంది హాజరయ్యారని ఆరా తీశారు. విద్యార్థుల్లో కనీస పురోగతి కనిపించడం లేదని, విద్యార్థులకు హోంవర్క్ ఏమి ఇస్తున్నారని వాటిని చూపించాలని ఆదేశించారు. అయినప్పటికీ వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హెచ్ఎం ములకాల వెంకటస్వామి, ఉపాధ్యాయుడు సెలవు పెట్టారని ఎంఈఓ, జెడ్పీ హెచ్ఎస్ మేనక కలెక్టర్కు తెలిపారు. పాఠశాల నిర్వహణపై మీ పర్యవేక్షణ సక్రమంగా లేదని ఎంఈఓను సున్నితంగా హెచ్చరించారు. పాఠశాల రికార్డులు కూడా సక్రమంగా లేవని, నాలుగో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల తర్వాత సందర్శిస్తానని అప్పటి వరకు పాఠశాల నిర్వహణ, రికార్డులు సక్రమంగా ఉండాలని, విద్యార్థులల్లో మార్పు తీసుకురావాలని తెలిపారు. పీహెచ్సీలో తనిఖీ మండల కేంద్రంలోని పీహెచ్సీ నిర్వహణ, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. రోజువారీగా ఓపీ వివరాలు, డెంగీ, మలేరియా జ్వరాల నమోదు వివరాలను వైద్యాధికారి స్వప్నితను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో చికిత్స పొందుతున్నవారితో మాట్లాడారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సురేష్ ఉన్నారు. పనుల జాతర ప్రారంభం ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కూలీలంద రూ వినియోగించుకోవాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఉపాధి హామీ అభివృద్ధి పనుల జాతర కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సంపత్రావుతో కలి సి శుక్రవారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రా మంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివాకర మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మొత్తం 266 పనులు చేపట్టామని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుడు రోజుకు రూ.307 లబ్ధి పొందాలన్నారు. పనుల్లో భాగంగా చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు క్యాటిల్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన, ఇంకుడు గుంతల నిర్మా ణం, నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కొంతమంది ఉపాధి, పారిశుద్ధ్య కార్మికులు దివ్యాంగులు కలిసి కలెక్టన్ను సన్మానించారు. ఇదిలా ఉండగా. ఎక్కువ పనులు చేసిన హసీనాబేగం, అస్మత్, సరస్వతి, మల్టీపర్పస్ వర్కర్ మేకల కిష్టయ్యను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కుమార్, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజ్ ఉన్నారు. ఉద్యోగులకు కలెక్టర్ దివాకర హెచ్చరిక -
గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఏటూరునాగారం: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఈనెల 27 నుంచి తొమ్మిది రోజు పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ముందస్తు ముందస్తు చర్యల్లో భాగంగా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, ము స్లిం మైనార్టీ సభ్యులు, ఆలయ చైర్మన్లతో ఏఎస్పీ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక వి గ్రహాలు ప్రతిష్ఠించే ప్రతీ ఒకరు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ప్రతి మండపంలో సీసీ టీవీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని, మండలపాల దగ్గర విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతీరోజు రాత్రి ఇద్దరు మండపాల దగ్గర విధిగా ఉండాలన్నారు. గణేష్ విగ్రహ నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్డుపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను వెంటనే తొలగించాలని తెలిపారు. విద్యుత్ తీగలను సరిచేసే విధంగా విద్యుత్శాఖ వారితో సమన్వయం చేసుకోవా లని సూచించారు. భక్తి శ్రద్ధలతో నిమజ్జనం ఊరేగింపు జరుపుకునేందుకు అన్ని కమిటీల సభ్యులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. నిమజ్జ నం కోసం ముళ్లకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ట్లు తెలిపారు. సమావేశంలో సీఐ అనుముల శ్రీని వాస్, ఎస్సై రాజ్కుమార్, ట్రెయినీ ఎస్సైలు నరేష్, రచిత్ర రామాలయం కమిటీ చైర్మన్ అలువాల శ్రీని వాస్, సాయిబాబా కమిటీ చైర్మన్ ప్రభా కర్, హనుమాన్ అర్చకులు యల్లాప్రగడ సూర్యనారాయణశర్మ, గణపతి కమిటీ సభ్యులు, మజీద్ అధ్యక్షుడు అఫ్జల్పాషా, సర్కార్, అజ్మత్ఖాన్ పాల్గొన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
కంకవనాల నర్సరీకి సన్నాహాలు
ఏటూరునాగారం: జిల్లాలోని అన్ని వర్గాల రైతులకు కంకవనాలను పెంచేందుకు అనువైన స్థలాలను పరిశీలించినట్లు అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ సంపత్రావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఏటూరునాగారం నర్సరీని ఏపీఓ వసంతరావుతో కలిసి సంపత్రావు శుక్రవారం పరిశీలించారు. ఇండస్ట్రీ ఎన్జీఓ ద్వారా పది లక్షల కంకవనం మొక్కలను పెంచడానికి అనువైన స్థలం కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు వారు తెలిపారు. ఈ మొక్కలను ఇక్కడ పెంచి చుట్టూ పక్కల మండలాల్లోని రైతులకు ఈజీఎస్ ద్వారా ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. కంకవనాలను పెంచి వాటిని మార్కెటింగ్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తోందన్నారు. జిల్లాలోని ఆసక్తిగల వ్యక్తులకు కంకవనంతో వస్తువుల తయారీపై శిక్షణ ఇప్పించడానికి ట్రైనర్లను పిలిపిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటిన అధికారులు ప్రతీ ఒక్కరు మొక్కలను పెంచాలని అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు అన్నారు. పనుల జాతరలో భాగంగా ఐటీడీఏ నర్సరీ వద్ద వారు మొక్కలను నాటారు. ఉపాధి హామీలో భాగంగా ప్రతీ ఒక్కరికి మొక్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వ్యక్తులు ఈజీఎస్, జీపీ సిబ్బందిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కుమార్, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజ్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.ఐటీడీఏ స్థలాలను పరిశీలించిన అధికారులు -
శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపునకు (శనివారం) నుంచి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) (ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు)ను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు అధికారులు సెంటర్ బోర్డ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక సహకారంతో టీజీబీఐఈ – ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతీరోజు రెండు సార్లు (ఉదయం, మధ్యాహ్న భోజనం తర్వాత) హాజరు తీసుకుంటారు. ఈమేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. కళాశాలకు ఏ విద్యార్థి అయినా హాజరుకాకుంటే అతడి తల్లిదండ్రుల ఫోన్కు సందేశం వెళ్తుంది. ఈ హాజరును ఆ కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు కూడా పర్యవేక్షిస్తారు. ఎఫ్ఆర్ఎస్ అమలుపై గత గురువారం ఆయా జిల్లాల్లో డీఐఈఓలు.. కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహించి హాజరు అమలు విధానాన్ని తెలియజేశారు. హనుమకొండ, వరంగల్లో డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్సుమన్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, విద్యార్థుల వివరాలురోజుకు రెండుసార్లు హాజరు నమోదు ● గైర్హాజరైతే తల్లిదండ్రుల ఫోన్లకు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు2,9002,013ప్రతీ జిల్లాకు ఇద్దరికి ఏఐ చాంపియన్లుగా శిక్షణ ఇంటర్ విద్యలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర బోర్డు నిర్ణయించింది. విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాల అ భివృద్ధి, సరికొత్త సాంకేతికత పరిచయం కోసం ఏఐని విని యోగించుకోనున్నారు. దీనిపై పట్టున్న సిబ్బందిని గుర్తించి ఏఐ చాంపియన్లుగా ఎంపిక చేసింది. ప్రతీ జిల్లాలోని అకడమిక్ మానిటరింగ్ సెల్లోని ఇద్దరు లెక్చరర్లు, ఒక లైబ్రేరియన్, ప్రతీ జిల్లాకు ఏఐ చాంపియన్లుగా ఎంపికై న ఒక లెక్చరర్, నాన్టీచింగ్ సిబ్బందికి శుక్రవారం హైదరాబాద్లో సంబంధిత ఉన్నతాధికారులు ఏఐ ఎఫ్ఆర్ఎస్ అమలు, వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ● అధ్యాపకులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీజీబీఐ ఈ –ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో విద్యార్థుల ఫొటోతో సహా వివరాలు నమోదు చేయాలి. ● తరగతి ప్రారంభమయ్యాక స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ ద్వారా కెమెరా ఓపెన్ చేసి వీడియా మాదిరిగా కూర్చున్న విద్యార్థులను తీసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫొటో క్యాప్చర్ అయి హాజరు నమోదవుతుంది. ● ఈ విధానంతో 15నుంచి 20 సెకన్లలోనే 80మంది విద్యార్థుల వరకు హాజరు నమోదు చేయవచ్చని చెబుతున్నారు. ● ముఖ హాజరుకు శుక్రవారంనుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇంకా చేపట్టనివారు ఉంటే ఈనెల 23న చేపడతారు. ● కళాశాలల సమయం ఉదయం 9:30 గంటల నుంచి ప్రతీ తరగతి గదిలోని తొలి పీరియడ్ తీసుకునే అధ్యాపకుడు విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేస్తారు. ● మళ్లీ మధ్యాహ్నం లంచ్ తర్వాత 2గంటలకు మరోసారి నమోదు చేస్తారు. 1,2721,000విద్యార్థులకు రోజుకు రెండు సార్లు హాజరు మానుకోట1,3501,200734821520535యాప్ డౌన్లోడ్ విధానం తన మొబైల్ ద్వారా చూపిస్తున్న వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ జనగామ1,050950ఇంటర్లో హాజరుశాతాన్ని పెంచేందుకే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంటోంది. ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థుల్లో మధ్యాహ్నం భోజనం కోసం కొందరు ఇంటికి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. తిరిగి రావడం లేదు. ఇంటివద్ద కాలేజీకి అని చెప్పి డుమ్మా కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత తక్కువగా రావడానికి కూడా విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకాకపోవడమే అనేది ఇంటర్బోర్డు అధి కారులు భావిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారంగానే ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. నేటినుంచే అమలు.. రిజిస్ట్రేషన్ షురూ -
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో కూరగాయలు, మాంసం విక్రయాల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్, మాంసం, చేపలు, చికెన్ మార్కెట్లు ఒకే దగ్గర ఉండడంతో ఇబ్బందికర పరిస్థితి ఉన్నందున వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో గల పశుసంవర్థకశాఖ కార్యాలయం సమీపంలో నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్కుమార్ పాల్గొన్నారు.హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతా దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవా లని కలెక్టర్ కోరారు. మంగపేట: మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి(ఈఓ)గా రేవెల్లి మహేశ్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ హనుమకొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓగా బదిలీ అయ్యారు. భూపాలపలిలోని భక్తాంజనేయస్వామి దేవస్థానం ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్న మహేశ్కు లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సత్యనారాయణ నుంచి అదనపు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన మహేశ్కు అర్చకులు పవన్కుమార్, ఈశ్వర్చంద్, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య శుభాకాంక్షలు తెలిపారు. -
ఉపాధి జాతర
వెంకటాపురం(ఎం): గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. పంచాయతీల అభివృద్ధిలో ప్రజలను మరింత భాగస్వాములను చేసేందుకు పనుల జాతర–2025 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభించే పనులు.. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా కమ్యూనిటీ సముదాయాలు, పశువుల కొట్టాలు, కోళ్లు, మేకల షెడ్లు, వ్యవసాయ బావుల నిర్మాణాలు, చెక్డ్యాములు, తోటలు, ఉద్యానవనాలు, కంపోస్టు గుంతలు, అజోల్ల ఫిట్ల నిర్మాణం, పాఠశాల మరుగుదొడ్లు, భవనం పైకప్పు మరమ్మతులు, తాటి, ఈత చెట్లు నాటడం, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర పనులను ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ, శానిటరీ కాంప్లెక్స్ తదితర వాటికి భూమిపూజ చేయనున్నారు.ఈ మేరకు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో శుక్రవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళికలు ఖరారు చేసి జిల్లాలో 816 పనులను గుర్తించారు. వీటిని పూర్తి చేసేందుకు రూ.33.42 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఒకేసారి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నాం. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశానుసారం శుక్రవారం గ్రామాల్లో పనుల జాతర చేపడతాం. ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. – శ్రీనివాస్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ● 816 పనులకు.. రూ.33.42 కోట్లు కేటాయింపు పనుల జాతర 2025 పేరిట ప్రత్యేక కార్యక్రమం -
బంధాలలో నేలకూలిన ఇల్లు
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని బంధాల గ్రామానికి చెందిన కుర్సం కాంతారావు ఇల్లు నేలకూలింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కాంతారావు కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున ఒకసారిగా ఇల్లు కూలిపోతున్న శబ్ధం రాగానే మేల్కొని బయటకు పరిగెత్తగానే ఇల్లు నేలకూలింది. ఇంట్లోని వస్తువులు, వంట పాత్రలు ధ్వంసమయ్యాయని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు దెబ్బతిని కూలిపోయిందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నారు. -
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రా రంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పా ఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో స్కూల్కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సింటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల తరగతి గదికి కలర్, ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టు త్వరలోనే ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకంజిల్లా పాఠశాలలు నిధులు భూపాలపల్లి 54 78.60 హనుమకొండ 65 52.50 వరంగల్ 32 54.40 ములుగు 08 13.60 మహబూబాబాద్ 22 37.40 జనగామ 15 21.90 -
మేడారంలో ముగిసిన పొట్ట పండుగ
డోలివాయిద్యాలతో గుడికి వెళ్తున్న పూజారులుభక్తుల పైనుంచి దాటుకుంటూ వెళ్తున్న పూజారులుఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో సమ్మక్క పూజారులు రెండు రోజుల పాటు పొట్ట పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం మొదలైన పొట్ట పండుగ పూజా కార్యక్రమాలు గురువారంతో ముగిశా యి. బుధవారం రాత్రి సమ్మక్క గుడి నుంచి పసు పు, కుంకుమలు, పూజా సామగ్రి తీసుకుని గద్దెలకు వెళ్లిన పూజారులు రాత్రంతా సంబురాలు చేసుకుని గురువారం ఉదయం గద్దెల వద్ద నుంచి పూజా సామగ్రిని తీసుకుని బూర కొమ్ముల శబ్ధాలు, డోలి వాయిద్యాలతో గుడికి వెళ్లారు. సమ్మక్క గద్దె నుంచి పూజారులు బయల్దేరిన సమయంలో భక్తులు, స్థా నిక ఆదివాసీ యువతీయువకులు దారిపొడువునా పడుకోవడంతో పూజారులు వారిపైనుంచి దాటి వెళ్లారు. అనంతరం సమ్మక్క గుడిలో పూజారులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కజొన్న కంకులు.. వరి పొట్ట నైవేద్యం పొట్టకు వచ్చిన మొక్కజొన్న కంకులు, వరి పొట్టను అమ్మవారికి పూజారులు నైవేద్యంగా సమర్పించారు. యాటను బలి ఇచ్చారు. అమ్మవారికి కొత్త ధాన్యాన్ని సమర్పించిన తర్వాతే స్వీకరిస్తామని పూజారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు పొట్ట పండుగ పూజా కార్యక్రమాలతో మేడారంలో సందడి వాతావరణం నెలకొంది. గద్దెల నుంచి గుడికి వెళ్లిన పూజారులు పొట్టకు వచ్చిన ధాన్యం అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ -
వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
● డీఎంహెచ్ఓ గోపాల్రావు ములుగు రూరల్/వెంకటాపురం(ఎం): గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని, స్టోర్ రూం, కిచెన్ షెడ్లను పరిశీలించారు. అనంతరం వైద్యశిబిరంలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మంది జ్వరంతో బాధపడుతున్నారన్నారు. వారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ ప్రొవైడర్ నవ్య, డెమో సంపత్, పాఠశాల ప్రిన్సిపాల్ నర్మదాబాయి, వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, హెల్త్ సూపర్వైజర్ జయశ్రీ పాల్గొన్నారు. అలాగే వెంకటాపురం(ఎం) మండలంలోని ఇంచెంచెరువుపల్లిలోని వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నీటి నిల్వలపై మూతలు పెట్టుకోవాలన్నారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డెమో సంపత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ సంఘమిత్ర, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
శాంతించిన గోదావరి
ఏటూరునాగారం: గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి గురువారం ఉదయం నుంచి తగ్గుతుండడంతో జిల్లాలోని అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం వద్ద ఉదయం 9 గంటలకు 16.45 ఉండగా సాయంత్రం 6 గంటలకు 15.91 మీటర్లకు చేరింది. అయితే వరద తగ్గుతున్న క్రమంలో కరకట్ట కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా ఇరిగేషన్శాఖ అధికారులు మూడు వేల ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచారు. ఎక్కడ గండ్లు పడినా వెంటనే ఇసుక బస్తాలు వేసి కరకట్ట కోతకు గురికాకుండా చేసే ప్రయత్నం చేపట్టారు. ఓడవాడ, ఎస్సీ కాలనీ వైపు నుంచి వరద నీరు వెనుకకు వెళ్లడంతో భూములు తేలాయి. దీంతో గోదావరి సమీపంలోని ప్రజలు భయాందోళన నుంచి తేరుకున్నారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉన్న గంగాదేవి ఆలయాన్ని గోదావరి తాకుతూ ప్రవహిస్తోంది. పోటెత్తిన వరద గోదావరి తగ్గుతూ రాంనగర్ వైపు పోటెత్తడంతో రాంనగర్–రామన్నగూడెం గ్రామాల మధ్యలోని రహదారి మునిగిపోయింది. దీంతో కోయగూడ ఎల్లాపురం, రాంనగర్, లంబాడీతండా గ్రామాల ప్రజలు గోదావరి నీటిలో నుంచి నడుచుకుంటూ తమతమ పనులకు వెళ్లారు. విద్యార్థులు వరద దాటలేక పాఠశాలలకు వెళ్లలేక ఇంటివద్దే ఉండిపోయారు. రాంనగర్ వద్ద వరదలో ఎవరూ దిగకుండా పోలీసులు పహారా కాశారు. పంచాయతీ సిబ్బంది సైతం రాంనగర్ వైపు అడ్డుగా ట్రాక్టర్ను ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే కొండాయి, ఎలిశెట్టిపల్లి గ్రామాల ప్రజలు పడవల ద్వారానే రాకపోకలను సాగిస్తున్నారు. ముంపు గ్రామాల్లో క్లోరినేషన్ మండలంలోని రామన్నగూడెం, రాంనగర్, ఓడవాడ, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో క్లోరినేషన్ పనులను పంచాయతీ అధికారులు, సిబ్బంది ముమ్మరం చేశారు. ప్రజలు రోగాల భారిన పండకుండా ముందస్తుగా ఫాగింగ్, బ్లీచింగ్ చల్లించే పనులు చేపట్టారు. ప్రజలు దోమ తెరలు వాడాలని ఇంటింటికీ ఆశ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించారు. రాంనగర్ గ్రామానికి పోటెత్తిన వరద కరకట్ట కోతను అడ్డుకునేందుకు 3 వేల ఇసుక బస్తాలు సిద్ధం రామన్నగూడెం వద్ద నీటిమట్టం 15.91 మీటర్లు కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీకి బుధవారం సాయంత్రం వరకు 11,12,170 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా గురువారం సాయంత్రం వరకు 8,26,610 క్యూసెక్కులకు తగ్గింది. గోదావరి తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 84.20 మీటర్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతల వద్ద 87.20 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. -
అక్రమాలకు కేరాఫ్గా డీటీఓ కార్యాలయాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు అగడం లేదు. అన్ని పనులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు రూ.లక్షలకు పడగలెత్తుతుండగా.. అధికారుల ఆదాయం, అక్రమాస్తులకు హద్దూపద్దు లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధి కారులు జరిపిన దాడుల్లో వెల్లడవుతున్న ఆస్తుల వివరాలే ఇందుకు సాక్ష్యం. మే 7న ఏకంగా వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ.. ఆ తర్వాత ఈ జిల్లాలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగిత్యాల డీటీఓ భద్రునా యక్ రూ.22వేలు తీసుకుంటుండగా ఆగస్టు 6న పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండలలో ఎంవీఐగా పనిచేసిన జి.వివేకానంద రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. నెల రోజుల కిందట వివిధ పనుల కోసం ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. కొందరు సీనియర్ ఎంవీఐల ఆస్తులపై ఆరా తీస్తుండటం హాట్టాపిక్గా మారింది. ఏసీబీ దాడులకు వెరవని రవాణాశాఖ అధికారులు వసూళ్లకు ‘ప్రైవేట్’ వ్యక్తులు, ఏజెంట్లే మధ్యవర్తులు కాసుల కక్కుర్తితో అడ్డంగా దొరుకుతున్న అధికారులు ఆదాయాన్ని మించిన ఆస్తులు.. ఆ ఫిర్యాదులపైనే పలువురిపై దాడులు రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడీ పోస్టింగ్లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక అత నే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యా చ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియ ర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మా మూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉ న్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది.వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికా రి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్ఛార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారు ల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నా రు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. కాగా,రవాణాశాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అ ధికా రులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ కూడా ఆశాఖలో జరుగుతోంది. వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు,అధికారులపై ఉదా సీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఉగ్ర గోదావరి
గోదావరి ప్రమాద హెచ్చరికల వివరాలు.. ఏటూరునాగారం: గోదావరిలోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలోకి నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరడంతో బుధవారం సాయంత్రం 6 గంటలకు వరద నీరు రెండో ప్రమాద హెచ్చరికను దాటి 16.20 మీటర్ల వేగంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 17.33 మీటర్లకు చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఇంకా ఎత్తి ఉంచడంతో వరదనీరు భారీగా వచ్చి గోదావరిలో కలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి కూడా భారీగా వరద గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీ వద్ద 10.72 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఏటూరునాగారంలోని జంపన్నవాగు సంగపాయవద్ద గోదావరి, వాగు రెండు కలవడంతో గోదావరి ఉధృతి మరింత పెరిగింది. కరకట్టకు ఆనుకొని ప్రవహించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓడవాడ ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరడంతో దసరా, జమ్మి ప్రాంతాలు నీట మునిగాయి. పునరావాస కేంద్రాలకు తరలింపు గోదావరి వరద పోటు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో రెవెన్యూ పంచాయతీరాజ్, ఇరిగేషన్, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడ, దళితకాలనీ ప్రాంతాల్లోని ప్రజలను క్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన పునరావస కేంద్రమైన గిరిజన భవన్కు తరలిస్తున్నారు. మండలంలోని రామన్నగూడెం, రాంనగర్ ప్రాంతాల్లోని ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ప్రజలు ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని జాలర్లు చేపలు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు,గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ముఖ్యంగా ఏటూరునాగారంలోని ఓడవాడ, మానసపల్లి, రామన్నగూడెం పుష్కర ఘాట్, రాంనగర్ లోని ఆయా ప్రాంతాల్లో బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడానికి ఆయా శాఖల అధికారులు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్, తహసీల్దార్ జగదీశ్వర్ వరద ఉధృతిని అంచనా వేస్తూ ప్రజలను తరలించడానికి వాహనాలను సిద్ధం చేస్తున్నారు. మండల పరిధిలోని కొండాయి, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రెండు రోజులుగా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పడవలను నడపకుండా పక్కనబెట్టారు. వాగులోని వరద తగ్గుముఖం పట్టడంతో అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు సతీష్, వినోద్లు పడవల ద్వారా ప్రజలను జంపన్నవాగు దాటిస్తున్నారు. పడవలకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయడంతో వారి సాయంతో ప్రజలను క్షేమంగా ఒడ్డుకు చేర్చుతున్నారు. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలోకి.. అప్రమత్తమైన అధికారులు పునరావాస కేంద్రాలకు తరలింపునకు చర్యలు రెండు గ్రామాలకు పడవ ప్రయాణం మొదటి ప్రమాద హెచ్చరిక 14.83 మీటర్లు రెండో ప్రమాద హెచ్చరిక 15.83 మీటర్లు మూడో ప్రమాద హెచ్చరిక 17.33 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం 16.20 మీటర్లుఏటూరునాగారంగ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఓవైపు సూర్యుడు ప్రకాశిస్తుండగానే భారీ వర్షం కురిసింది. దీంతో ఒకేసారి అటు ఎండ, ఇటూ వర్షం రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. -
రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను బుధవారం జారీ చేసినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు, ఉదయం 11 గంటలకు గోదావరి వరద ఏటూరునాగారం మండలం రామన్నగూడెం లో 14.83 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక, 15.83 చేరడంతో రెండో ప్రమాదహెచ్చరికను జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం కన్నాయిగూడెం మండలంలో 33 కుటుంబాల వారిని, గోవిందరావుపేట మండలంలోని రెండు కుటుంబాల వారిని , ఏటూరునాగారం మండలంలో 50 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలలో 75 కుటుంబాలకు చెందిన 216 మందిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లాలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఇప్పటికే బృందాలను సిద్ధంగా ఉంచామని వారితోపాటు జిల్లా పోలీసు యంత్రాంగం అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వీయ రక్షణకు అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004257109 కు కాల్ చేయవచ్చని కలెక్టర్ వివరించారు. -
శాఖల వారీగా నిధుల కేటాయింపు వివరాలు (రూ.కోట్లలో)
ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ 8.57జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం 11.62అగ్నిమాపక 0.30పశుసంవర్థకం0.30మత్స్య0.23ఇరిగేషన్, సీఏడీడీ 5.90తాగునీరు, శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ 15.15రోడ్లు భవనాలు 9.95పంచాయతీరాజ్ 51.30 ఎన్పీడీసీఎల్ 5 టీజీ ఆర్టీసీ 5ఐఅండ్పీఆర్0.57గిరిజన సంక్షేమం(ఐటీడీఏ) 2.50అటవీ 0.50సీ్త్ర శిశు సంక్షేమ0.25వైద్య ఆరోగ్య 1.07పోలీస్14.50 రెవెన్యూశాఖ 14.38టూరిజం0.90ఎండోమెంట్ 1.75 -
ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏటూరునాగారం: వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీశ్ తెలిపారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజ్, ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్, కరకట్ట ప్రాంతాలను ఎస్పీ శబరీశ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగి ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ముంపు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ముంపునకు గురైన వెంకట్రావుపల్లి గ్రామస్తులను కలిసి పరామర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి తగ్గేవరకు బయటకు వెళ్లకూడదని సూచించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలన్నారు. డయల్ 100కు కాల్ చేయాలని, అత్యవసర సేవలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్, కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్ పాల్గొన్నారు.వాజేడు: గోదావరి వరద ఉధృతితో మండలంలోని పలు చోట్ల రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాడు. మండల పరిధిలోని టేకులగూడెం చివరన 163 నెంబర్ జాతీయ రహదారి ముంపునకు గురి అయిన విషయం తెలిసిందే. వరద ఇంకా పెరుగడంతో రెండు రాష్ట్రాల మధ్యరాక పోకలు నిలిచిపోయాయి. దీంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి వెళ్లే లారీలు రెండు వైపుల భారీ స్థాయిలో నిలిచి పోయాయి. ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం, జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం, వాజేడు– గుమ్మడి దొడ్డి, పెద్ద గొళ్లగుడెం– శ్రీరాంనగర్ గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచి పోయాయి. కృష్ణాపురంతో పాటు మరి కొన్ని గ్రామాల్లో గోదావరి వరదతో పొలాలు నీట మునిగాయి. అలాగే పేరూరు వద్ద బుధవారం సాయంత్రం 17.460 మీటర్ల నీటిమట్టం ఉంది.వెంకటాపురం(కె): వర్షాకాలంలో కాచి చలార్చిన నీటినే తాగాలని ఏటూరునాగారం డిప్యూటీ డీఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్ అన్నారు. మండలంలో ఆయన బుధవారం పర్యటించారు. చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు వండుతున్న కూరగాయలు, సామగ్రితో వంట గదిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. పొడిబట్టలనే ధరించాలని సూచించారు. భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వారి వద్ద నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బాబురావు, వైద్యాధికారులు అశీష్, పవన్, వైద్య సిబ్బంది కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస కేంద్రం ఏర్పాటు
మంగపేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని బుధవారం రాత్రి ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలోని గోదావరి బ్యాక్ వాటర్ గౌరారంవాగు, బోరునర్సాపురం బ్రిడ్జి వరకు పోటెత్తడంతో పాటు క్రమంగా వరదనీరు పొదుమూరులోని లోతట్టు ప్రాంతమైన ముస్లింవాడకు చేరుకునే అవకాశం ఉండంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 16 కుటుంబాలకు చెందిన 52 మంది బాధితులను జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. బాధితులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థ రెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్, ఎస్సై టీవీఆర్ సూరి, పంచాయతీ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. -
సమ్మక్కసాగర్లోకి 11,02,460 క్యూసెక్కుల నీరు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీకి గోదావరి వరద భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ఉదయం వరకు బ్యారేజీలోకి 9,40,290 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రాగ సాయంత్రం వరకు 11,02,460కు పెరిగింది. దీంతో బ్యారేజీ 59 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 83మీటర్లు కాగా సామర్థ్యం మించి 84.50 మీటర్లకు చేరింది. అలాగే ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి మండలంలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీతో పాటు, లోతట్టు గ్రామాలలో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడారు. భారీ వర్షాల దృష్య గోదావరిలోకి భారీగా నీరు చేరుతుందన్నారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లోతట్టు గ్రామాలు ముప్పునకు గురయ్యే అవకాశం ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం వస్తే 100కు డయల్ చేయాలన్నారు. -
గోదావరి పరవళ్లు.. అధికారులు అప్రమత్తం
మంగపేట : గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో మండల పరిధిలోని కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎర్రవాగు బ్రిడ్జి సమీపానికి గోదావరి బ్యాక్ వాటర్ చేరుకుంది. అదే విధంగా మండల కేంద్రం నుంచి బోరునర్సాపురం మధ్యలో గౌరారం వాగుపై నిర్మించిన బ్రిడ్జి సమీపంలోకి బ్యాక్ వాటర్ పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన తహసీల్దార్ రవీందర్, మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థరెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్, ఎస్సై టీవీఆర్ సూరి, సురేష్, శ్రీకాంత్, ఎంపీఓ శ్రీనివాస్ కమలాపురంలోని ముంపు ప్రాంతాలైన పాతూరు, గుడ్డేలుగులపల్లి, మండల కేంద్రంలోని పొదుమూరు, ముస్లింవాడ, వడ్డెరకాలనీ, కత్తిగూడెం, దేవనగరం, వాడగూడెం, అకినేపల్లిమల్లారం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుండడంతో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. -
మేడారంలో పొట్ట పండుగ
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో సమ్మక్క పూజారులు పొట్ట పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. మాఘ కార్తె సందర్భంగా అమ్మవార్లకు పొట్ట పండుగ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు బుధవారం నుంచి మేడారంలో పొట్ట పండుగ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉదయాన్నే సమ్మక్క గుడిని పూజారులు శుద్ధి చేశారు. అమ్మవార్ల శక్తి పీఠాన్ని మట్టితో అలకరించి ఆడపడుచులు ముగ్గులు వేశారు. మామిడి ఆకుల తోరణాలు కట్టారు. బుధవారం సాయంత్రం సమ్మక్క పూజారి సిద్ధబోయిన ముణింధర్ ఇంటి వద్ద నుంచి అమ్మవార్లకు కంకణాలు, పసుపు, కుంకుమలు తీసుకుని పూజారులు డోలి వాయిద్యాలతో సమ్మక్క గుడికి వెళ్లారు. గుడి నుంచి గద్దెల వద్దకు.. సమ్మక్క పూజారులు బుధవారం రాత్రి గుడిలో అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అర్థరాత్రి సమయంలో గుడి నుంచి పసుపు, కుంకుమ, పూజా సామగ్రిని తీసుకుని అమ్మవారి రూపంలో సమ్మక్క గద్దె వద్దకు డోలివాయిద్యాలతో పూజారులు వెళ్లారు. పూజారులు వెళ్తున్న దారిలో ఆదివాసీ అడపడుచులు ఎదురెళ్లి నీళ్లు ఆరగించారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. బూర కొమ్ములు, డోలివాయిద్యాలతో పూజారులు అట్టహాసంగా గద్దెల వద్దకు వెళ్లారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద తల్లులకు పూజా సామగ్రి ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు రాత్రంతా జాగారాలతో సంబురాలు నిర్వహించారు. నేడు పూజా సామగ్రితో గుడికి గురువారం ఉదయం పొద్దు పొడవక ముందే గద్దెల వద్ద నుంచి అమ్మవారి పూజా సామగ్రి తీసుకుని గుడికి చేరుకుంటారు. కొత్తగా పండిన ధాన్యాలను(మొక్కజొన్న కంకులను) అమ్మవారికి నైవేధ్యంగా సమర్పించి పూజలు చేస్తారు. సమ్మక్కతల్లికి యాటను బలిస్తారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు ముణిందర్, కొక్కెర కృష్ణయ్య, మల్లెల సత్యం, దూప వడ్డె నాగేశ్వర్రావు, సిద్ధబోయిన భోజరావు, రమేష్, నర్సింగరావు, వసంతరావు, సిద్ధు, ఆదివాసీ యువకులు పాల్గొన్నారు. సంప్రదాయంగా వనదేవతలకు పూజలు సమ్మక్క గుడి నుంచి గద్దెల వద్దకు రాత్రంతా జాగారంతో పూజారుల సంబురాలు -
మహాజాతరకు.. నిధుల వరద
కొనసాగుతున్న సైన్స్ కాంగ్రెస్ కేయూ స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ బుధవారం ఉత్సాహంగా కొనసాగింది. ‘మేడారం–2026’ నిర్వహణకు రూ.150 కోట్లు దక్షిణ మధ్య రైల్వే భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తుందని కన్స్రక్షన్ చీఫ్ ఇంజనీర్ సునీల్ కుమార్ వర్మ అన్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క, సారలమ్మల మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. భారీగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లకు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాలనుంచి భక్తుల రాక మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. గత ఏడాది రూ.110కోట్లు గత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. జాతరలో భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది. నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు గత ఏడాది రూ.110కోట్లే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు శాఖల వారీగా నిధులు కేటాయింపు 2026 జనవరిలో తెలంగాణ కుంభమేళా -
అమ్మవారికి కలెక్టర్ దంపతుల పూజలు
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి కలెక్టర్ దివాకర దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను ఈఓ ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు మహాదాశీర్వచనం అందజేశారు. అలాగే గంగుల శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీ దంపతులు దేవాలయంలో నిర్వహించే నిత్యాన్నదానం కోసం రూ.25 వేలు విరాళంగా అందజేశారు. రుసుముకు సంబంధించిన రశీదును దాతకు ఈఓ అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పర్యవేక్షకులు జి.క్రాంతికుమార్, ధర్మకర్తలు పాల్గొన్నారు.ఇంటెక్వెల్ వద్ద వరద ఉధృతి పరిశీలనమంగపేట: మండలంలో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో మండల కేంద్రంలోని పొదుమూరు, కమలాపురం ఇంటెక్ వెల్ వద్ద గోదావరి వరద ఉధృతిని మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థరెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాలైన పొదుమూరు, దేవనగరం, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా పంచాయతీల కార్యదర్శులను ఆదేశించారు.వైద్యశాలకు గర్భిణుల తరలింపువెంకటాపురం(కె): మండల పరిధిలోని టేకులబోరు, ముకునూరు పాలెం, వీరభద్రవరం గ్రామాలకు చెందిన గర్భిణులను మంగళవారం ఏటూరునాగారం వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. వర్షాలు, వరదల కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో డెలివరీకి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏటూరునాగారం వైద్యశాలకు గర్భిణులను తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఈవో కోటి రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.7,46,381 క్యూసెక్కుల నీరు రాకకన్నాయిగూడెం: గోదావరికి ఎగువన కురుస్తున్న వర్షాలతో మండలంలోని తుపాకులగూడెం గ్రామ పరిధిలోని సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతోంది. బ్యారేజీలోకి సోమవారం 4 లక్షల క్యూసెక్కుల నీరు రాగా ఎగువన ఉన్న సరస్వతీ, లక్ష్మీ బ్యారేజీతో పాటు ఎగువ నుంచి గోదావరిలోకి 7,46,380 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ నీటిమట్టం 83 మీటర్ల సామర్థ్యం కాగా ప్రస్తుతం 82.35 మీటర్ల నీటిమట్టం ఉంది.ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంములుగు రూరల్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జిల్లాకేంద్రంలో రామప్ప ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఫొటోగ్రాఫర్లను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దొంతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాస్ ఫొటో స్టూడియో టీం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రమేష్, రవీందర్రెడ్డి, భద్రి, రాజు, రవీందర్, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
వదలని వాన.. వీడని వరద
జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం ఏటూరునాగారం: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోని బ్యారేజీల నుంచి నీరు భారీగా వస్తుండడంతో గోదావరి నది ఉరకలేస్తోంది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతుండడంతో లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో జంపన్నవాగు, జీడివాగు, ఎర్రవాగు ఉప్పొంగి ఇళ్లలోకి నీరు చేరి ఆస్తినష్టం జరిగింది. మంగపేట మండల పరిధిలోని కమలాపురంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఏటూరునాగారంలోని ఎస్సీ కాలనీలో నిల్వ ఉన్న వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది జేసీబీతో గండ్లు కొట్టించి నీటిని బయటకు పంపించారు. పెరుగుతున్న గోదావరి ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం 13.90కి చేరింది. 14.83 మీటర్లకు వస్తే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసి లోతట్టు ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఎస్సారెస్పీ నుంచి నీటి ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని ఏటూరునాగారంలోని ఓడవాడ, ఎస్సీ కాలనీ ప్రజలను ముందస్తుగా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించడానికి జిల్లా, మండల అధికారులు సిద్ధమయ్యారు. రామన్నగూడెం గోదావరి వద్ద అధికారులు నిత్యం అందుబాటులో ఉండి వరద పరిస్థితిని గమనిస్తున్నారు. పొలాల్లో ఇసుక మేటలు ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో సుమారుగా 450 ఎకరాల మేర పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గోగుపల్లి, శివాపురం, చిన్నబోయినపల్లిలోని వట్టివాగు ఉప్పొంగి చిన్నబోయినపల్లికి చెందిన దుమ్మని రాజేశ్వరి సాగు చేస్తున్న 8 ఎకరాల వరిపంట మొత్తం కొట్టుకుపోయింది. విద్యుత్ మోటారు, స్టాటర్ సైతం నీటి పాలు అయ్యింది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేస్తే పంట కొట్టుకుపోయిందని రాజేశ్వరి, మరో రైతు శ్రీకాంత్లు బోరున విలపించారు. కొట్టుకుపోయిన రోడ్లు.. తేలిన కంకర మండలంలోని శివాపురం వెళ్లే ప్రధాన రోడ్డు కొట్టుకుపోయింది. వట్టివాగు, గోగుపల్లి వాగు వరద రోడ్డుపై నుంచి ప్రవహించడంతో బీటీ కొట్టుకుపోయి రాళ్లు తేలాయి. ఇవేకాకుండా జీడివాగు వద్ద గోతులు పడ్డాయి. మంగపేట మండలం బోరు నర్సాపురం, దొంగెల ఒర్రె, కమలాపురం ఎర్రవాగు సమీపంలో పలు రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో ఇళ్లలోని వస్తువులు, నిత్యావసర వస్తువులు సైతం కొట్టుకుపోయాయి. పాఠశాలలకు సెలవు ఏటూరునాగారం, మంగపేట ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో మంగళవారం విద్యాసంస్థలకు అధికారులు సెలవును ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు సైతం సెలవును యాజమాన్యాలు ప్రకటించాయి. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు పలు గ్రామాల్లో నేలకూలిన ఇళ్లు ధ్వంసమైన రహదారులు పునరావాస కేంద్రాలకు తరలింపు -
తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు బంద్
వాజేడు: మండల పరిధిలోని టేకులగూడెం గ్రామ సమీపంలో 163నంబర్ జాతీయ రహదారిపైకి మంగళవారం గోదావరి వరద వచ్చి చేరింది. దీంతో తెలంగాణ– ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్యన రాక పోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద క్రమేపీ పెరుగు తుండటంతో రేగుమాకు ఒర్రె నుంచి రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు వరదలోకి వెళ్లకూడదని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అధికారులు వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపునకు గురైన జాతీయ రహదారిని వెంకటాపురం(కె) సీఐ ముత్యం రమేష్, పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు పరిశీలించారు. వాహనదారులు నీటిలో నుంచి వెళ్లకుండా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. పలువురు గోదావరి వరద జాతీయ రహదారిని ముంచిన విషయం తెలియక అక్కడికి చేరుకున్న రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లగేజీ మోసుకుంటూ వరదలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఓ లారీ వరదలో నుంచి రావడంతో దాని పక్క నుంచి ద్విచక్రవాహనాలను దాటించారు. టేకులగూడెం వంతెన మూసివేతములుగు రూరల్: గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ– ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్న 163వ జాతీయ రహదారిపై టేకులగూడెం వంతెన మూసివేసినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా టేకులగూడెం శివారులో రేగుమాగువాగు పొంగి ప్రవహిస్తుండగా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్లు పలువురు తెలిపారు. వంతెన వద్ద పేరూరు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వంతెనను మూసివేశారు. వరద కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా ప్రయాణించాలని ఎస్పీ సూచించారు. -
నలుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
ఎస్ఎస్తాడ్వాయి: వరదలో చిక్కుకున్న నలుగురి ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ బృందం️ కాపాడింది. ఈ ఘటన మండల పరిధిలోని కాల్వపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వపలి్లకి చెందిన పశువుల కాపారి దుబారి రామయ్య పశువులను మేతకు తోలుకుని సోమవారం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లారు. అదే విధంగా గ్రామానికి చెందిన సాయికిరణ్, రాజబాబు, రాములు చేపల వేటకు వెళ్లారు. సోమవారం సాయంత్రం వరకు కూడా వారు ఇంటికి తిరిగి రాలేదు. ఇదే క్రమంలో తూముల వాగు వరద ప్రవాహం పెరగడంతో వారి కుటుంబ సభ్యులు అందోళకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తాడ్వాయి తహసీల్దార్ సురేష్బాబు కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు సోమవారం రాత్రి 11 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించడంతో ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం వాగు ప్రాంతానికి చేరుకుంది. వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పశువుల కాపరి రామయ్యను తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు. చేపల వేటకు వెళ్లిన మరో ముగ్గురి కోసం వాగులో కిలోమీటర్ మేర వెళ్లి గాలించగా ఆచూకీ లభించడంతో ఆ ముగ్గురిని సురక్షితంగా వరదలో నుంచి వాగు దాటించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించిన అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ బృందానికి బాధిత కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఏఎస్సైలు సుధీర్, సురేందర్, హెడ్ కానిస్టేబుళ్లు చంద్ర, రమేష్, కానిస్టేబుల్ ఆనంద్, రమణమూర్తి, విశాల్ పాల్గొన్నారు. -
పడవల రాకపోకలు నిలిపివేత
ఏటూరునాగారం మండలంలోని కొండాయి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో పడవలను నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గే వరకు పడవలను నడపొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పక్కన బెట్టారు. అలాగే ఎలిశెట్టిపల్లి వద్ద కూడా జంపన్నవాగు ఉధృతంగా ఉండడంతో పడవలను అత్యవసరం మేరకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఎలిశెట్టిపల్లి గ్రామంలో శానిటేషన్ పనులు చేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. క్లోరినేషన్, బ్లీచింగ్ చల్లించి ప్రజలు రోగాల బారిన పడకుండా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే గోదావరి ఉధృతికి రామన్నగూడెం వద్ద ఒడ్డు కోతకు గురై మట్టి తరలిపోతుంది. -
నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి
● మున్సిపల్ కమిషనర్ సంపత్ ములుగు రూరల్: భారీ వర్షాల కారణంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ సంపత్, రాయినిగూడెం మెడికల్ ఆఫీసర్ అన్వేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో డెంగీ పాజిటివ్ కేసు నమోదు కాగా పీహెచ్సీ వైద్యుడు అన్వేష్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటితొట్లు, పూల కుండీలు, పాత కూలర్లు, టైర్లలో నీటి నిల్వల కారణంగా దోమలు ల్వారా వృద్ది చెంది డెంగీ, మలేరియా వచ్చే ప్రమాదం ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని ఖాళీ స్థలాలు ఉన్నవారు చెట్లు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం కాలనీల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పారితోషికాలు వెంటనే విడుదల చేయాలి
ములుగు రూరల్: ఆశ వర్కర్లకు గతనెల పారితోషికాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని రాయినిగూడెం పీహెచ్సీ ఎదుట ఆశ వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ అన్వేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. జూలై పారితోషికాలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఆశ కార్యకర్తలకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఈశ్వరి, సారలక్ష్మి, స్వర్ణ, వజ్ర, కవిత, జ్యోత్స్న పాల్గొన్నారు. ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు రవిగౌడ్ -
మూడురోజులు అప్రమత్తంగా ఉండాలి
ఏటూరునాగారం: రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సూచించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాబోయే 3 రోజుల్లో ప్రత్యేక అధికారులు విద్యా సంస్థలను సందర్శించి నివేదికలు అందజేయాలని సూచించారు. ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఎస్ఓపీ మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉందని వివరించారు. జీసీసీతో సమన్వయం చేసుకొని స్టాక్ ప్రొవిజన్ లోటు పాట్లను సరిచేయాలన్నారు. ఐటీడీఏ డీడీ పోచం, గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్, డీటీడీఓలు ముందస్తు అనుమతి లేకుండా హెచ్ఎం, హెచ్డబ్ల్యూలు, ప్రిన్సిపాల్స్ పిల్లలతో చేయించే సాంస్కృతిక కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని సూచించారు. గైర్హాజర్ అయితే చర్యలు తప్పవు అధికారులు గిరిజన విద్యాసంస్థల్లో తనిఖీలు చేసే సమయంలో పాఠశాలల అధికారులు, సిబ్బంది అనధికారికంగా, తెలియకుండా గైర్హాజరైతే చర్యలు తీసుకోవాలని అధికారులకు పీఓ తెలిపారు. శిథిలమైన భవనంలో ఏదైనా పాఠశాల ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థుల భద్రతకు అవసరమైతే శిథిలమైన వాటిని తొలగించడానికి ఇంజనీరింగ్ విభాగానికి సమాచారం ఇవ్వాలని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం, స్తంభాలు పడిపోవడం, కరెంటు షాక్ సమస్యలు వంటివి ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి మరమ్మతులు చేయించుకోవాలని వెల్లడించారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన విద్యాసంస్థల కోసం డీడీలు, డీటీడీఓలు, ఆర్సీఓలు, హెచ్ఎం, హెచ్డబ్ల్యూఓలు, ప్రిన్సిపాల్స్ కోఆర్డినేషన్ కోసం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు పీఓ చిత్రామిశ్రా వివరించారు. వరద సమయంలో ఆపద, విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను ఆదుకునేందుకు హెల్ప్లైన్ నంబర్ 08717293246, ఐటీడీఏ హెల్త్ ఎమర్జెన్సీ నంబర్ 9912441123 కు సమాచారం ఇస్తే వైద్య సదుపాయలు వెంటనే అందుతాయని వివరించారు. అధికారులు రాబోయే 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, అన్ని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని పీఓ కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు అనుమతిలేకుండా గైర్హాజరైతే చర్యలు ‘సాక్షి’తో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
పలు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి/మంగపేట: ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉధృతిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క పరిశీలించారు. కరకట్టపై నడుచుకుంటూ కరకట్టను చూశారు. వరద పరిస్థితిని ఏటూరునాగారం తహసీల్దార్ జగదీశ్వర్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగు, ఊరట్టం తూముల వాగు వరదలను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ఊరట్టం రైతులు వాగుల వదరలతో పంటలు నీటమునిగిపోతున్నాయని కరకట్టలు నిర్మించాలని మంత్రి సీతక్కను కోరగా సానుకూలంగా స్పందించారు. మంగపేట మండల పరిధిలోని కమలాపురంలోని ఇందిరానగర్, భగత్సింగ్నగర్ ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పునరవాసా కేంద్రంలో ఉన్న బాధితులను పరామర్శించి పండ్లు, బెడ్షీట్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ క్లౌడ్ బరస్ట్ కారణంగా జిల్లాలోనే మంగపేటలోనే అత్యధికంగా వర్షం పడిందని తెలిపారు. భారీ వర్షం కారణంగా కమలాపురంలో 20 నుంచి 25 వరకు ఇళ్లు ముంపునకు గురికావడంతో కొంత మేర నష్టం జరిగిందని ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని భరోసా కల్పించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలిపారు. -
కుంగిన ప్రసాదశాల పునాది
కాళేశ్వరం: దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణ లేమి.. కాంట్రాక్టర్లకు వరంగా మారింది. ఆగమేఘాలపై చేసిన పనులకు ప్రసాదశాల భవన నిర్మాణం సాక్షంగా కనిపిస్తుంది. రూ.50లక్షల వ్యయంతో సరస్వతీనది పుష్కరాల సమయంలో నిర్మాణం చేసిన ప్రసాదశాల భవనం పునాది గోడ కిందికి కుంగింది. భూమి నుంచి పునాదిలో సిమెంట్ ఇటుకలతో నిర్మాణం చేసి కింద మట్టిపోయడంతో వర్షానికి కుంగింది. బీటలు వారి పిల్లర్ బీమ్ పొడవునా కింది వైపున క్రాక్ ఇచ్చింది. బీమ్పైన కట్టిన ఇటుకల గోడ అక్కడక్కడ వంగిపోయి, క్రాక్ వచ్చి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ విభాగం ఏమి చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతస్థాయి దేవాదాయశాఖ అధికారులు మౌనం పాటించడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ఈఓ మహేష్ను సంప్రదించగా తాత్కాలికంగా పుష్కరాల సమయంలో చేసిందని, మళ్లీ మట్టి ఇటుకలతో పునాది నిర్మాణం చేస్తామని తెలిపారు. పిల్లర్లకు హాని జరుగలేదని తెలిపారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. మూడు రోజుల పాటు వరుసగా సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 3 వేల మందికి పైగా భక్తుల తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. -
బొగతకు పంపించాలని ఆందోళన
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి తమను పంపించాలని కోరుతూ పర్యాటకులు ఆదివారం అందోళన చేశారు. హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల నుంచి సుమారుగా 300 మందికి పైగా పర్యాటకులు వాహనాల్లో తరలి వచ్చారు. బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశామని ప్రవేశం లేదని అక్కడ ఉన్న అటవీశాఖ సిబ్బంది తెలిపారు. సందర్శన నిలిపి వేసిన విషయం తమకు తెలియదని చాలా దూరం నుంచి వచ్చామని పర్యాటకులు సిబ్బందికి తెలిపారు. పర్యాటకులు, సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పర్యాటకులు జాతీయ రహదారిపై తమ వాహనాలను నిలిపి జలపాతం ప్రధాన ద్వారం వద్దకు వెళ్లారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో వాజేడు ఎస్సై జక్కుల సతీశ్కు సిబ్బంది సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పర్యాటకులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అధికారులకు సంబంధించిన ఒక వాహనం లోపలి నుంచి బయటకు రావడంతో పర్యాటకులు అక్కడ ఉన్న బొగత సిబ్బందిని నిల దీశారు. ఉన్నతాధికారుల సలహా మేరకు ఎస్సై, అటవీశాఖ సిబ్బంది పర్యాటకులను లోపలికి పంపించారు. పోలీసుల పహారా మధ్యన పర్యాటకులు బొగత జలపాతాన్ని వీక్షించారు. అటవీశాఖ సిబ్బందితో పర్యాటకుల వాగ్వాదం పోలీసుల రంగ ప్రవేశం.. ఉన్నతాధికారుల సలహా మేరకు అనుమతి -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ యువత అధిక సంఖ్యలో పోటీ చేసి సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. ముదిరాజ్లు ఐక్యమత్యంతో ఉండి రాజకీయంగా ఎదగాలన్నారు. బీసీ కులాలకు మెపా సంఘం మద్దతుగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్న రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు, భూమ నరేష్, రాజు, కౌశిక్, కిరణ్, వంశీ, రమేష్, సలేందర్ తదితరులు పాల్గొన్నారు.మెపా రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ -
పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి
ములుగు రూరల్: హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం(కేజీకేఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి గుండబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరును నామకరణం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాలలో రద్దు చేసిన గీత సొసైటీలను తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర శ్రీనివాస్, మధుకర్, సాగర్, కై రి మొగిలి, రమేష్, రఘుపతి, జనార్ధన్, గుండమీది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.కేజీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి -
ఇంకా ఇన్స్పైర్ కాలేదు!
● ‘ఇన్స్పైర్ మనక్’ అవార్డుల నామినేషన్లు వేయించేందుకు పెద్దగా ఆసక్తి చూపని హెచ్ఎంలు, టీచర్లు ● 789తో మహబూబాబాద్ రాష్ట్రంలోనే మొదటి స్థానం ● మిగిలిన జిల్లాల్లో తక్కువగా వేసిన విద్యార్థులువిద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో.. భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్టీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ద్వారా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డుల మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, వివిధ గురుకులాల్లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలల నుంచి ప్రాజెక్టుల రూపకల్పనకు ఐదు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు మహబూబాబాద్ జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మహబూబాబాద్ జిల్లా 789 నామినేషన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు ఉండడంతో ఇంకా నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది. సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తేనే.. ఉమ్మడి జిల్లాలోని డీఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు ఇప్పటికే అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించారు. ఇన్స్పై ర్ అవార్డులకు నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులతో విద్యార్థులతో నామినేషన్లు చేయించాలని ఆదేశించారు. నామినేషన్లు చేయించేందుకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటుచేశారు. పాఠశాలల్లో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే నామినేషన్లు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఎంలు, టీచర్లలో కొంత నిర్లిప్తత కూడా కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం డీఈఓ, సైన్స్ అధికారి ప్రత్యేక దృష్టిసారించడంతో నామినేషన్లు బాగా అయ్యాయని తెలుస్తోంది. ఎంపికై తే ఒక్కో విద్యార్థి నామినేషన్కు రూ.10 వేలు.. ఇన్స్పైర్ అవార్డుకు ప్రాజెక్టు రూపకల్పన చేసి వెబ్సైట్ ద్వారా పంపితే ఎంపికై న విద్యార్థికి రూ. 10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. విద్యార్థి వినూత్న ఆవిష్కరణలకు సంబంధించి నమూనా రూపొందించేందుకు, ప్రయాణ ఖర్చులకు ఈ డబ్బులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాస్ధాయిలో ఇన్స్పైర్ అవార్డుల ప్రాజెక్టులకు సంబంధించిన నమూనా ప్రదర్శనలు వచ్చే ఏడాది నవంబర్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి ఇన్స్పైర్, ఇందులో ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే జపాన్ వంటి దేశాల పర్యటనకు కూడా ఎంపిక చేస్తారు. అలా ఎంపికై న వారికి రూ.25వేల పారితోషికం కూడా అందజేస్తారు.ఇన్స్పైర్ అవార్డులకు నామమాత్రంగానే నామినేషన్లు పంపారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీసేందుకు ఒక చక్కటి వేదిక ఇన్స్పైర్ అవార్డు మనక్. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులను ప్రోత్సహించాల్సిఉంటుంది. అందుకు ఒక ఐడియాతో ప్రాజెక్టుకు సంబంధించి సంక్షిప్తంగా వివరాలు పంపించాలి. హెచ్ఎంలు, టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సెప్టెంబర్ 15లోగా విద్యార్థులతో నామినేషన్లు పంపాలి. – ఎస్.శ్రీనివాసస్వామి, హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి -
రామప్ప శిల్పకళ మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ సామ్ కోషి కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని శ్రీనివాస్రావు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి జస్టిస్ శ్రీనివాస్రావుకు గైడ్ విజయ్కుమార్, జస్టిస్ సామ్ కోషికి గైడ్ వెంకటేశ్ వివరించారు. వారి వెంట ములుగు జిల్లా జడ్జి సూర్య చంద్రకళ, భూపాలపల్లి జడ్జి దిలీప్కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై చల్ల రాజు ఉన్నారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ సామ్ కోషి -
ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు
ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో మేడారంలోని జంపన్నవాగుతో పాటు పలు ప్రాంతాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంపన్నవాగు పొంగిపొర్లడంతో మేడారం బ్రిడ్జిని ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మేడారంలోని చిరు వ్యాపారులను అధికారులు అప్రమత్తం చేశారు. మేడారానికి వచ్చే భక్తుల భద్రత కోసం పోలీసు అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వర్షాలు పడితే ఏక్షణంలోనైనా వరద పెరిగే ప్రమాదం ఉందని దుకాణాలను ఖాళీ చేయాలని చిరు వ్యాపారులకు సూచించారు. -
వైభవంగా కృష్ణాష్టమి
జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ములుగు, మంగపేట, తాడ్వా యితో పాటు చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించారు. ఏటూరునాగారం లోని 2వ వార్డు, శ్రీసీతారామచంద్రస్వామి ఆల యం, ఇస్కాన్, రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువకులు ఉట్టికొట్టి సంబురాలు జరుపుకున్నారు. – ఏటూరునాగారంఉట్టి కొట్టేందుకు వచ్చిన గ్రామస్తులు, చిన్నారులు -
ఒడంబడిక!
నిట్ వరంగల్లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏలతో పాటు పీహెచ్డీ విద్యను అభ్యసిస్తున్న సుమారు 6 వేల మంది విద్యార్థులకు ఇతర పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్షిప్, విద్యా పరస్పర బదిలీలకు, టెక్నాలజీ ఉపయోగానికి ల్యాబ్స్ సౌకర్యం, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎంఓయూలు తోడ్పాటునందిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులకు వివిధ సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం వీటి ద్వారా లభిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్నా.. నూతన సాంకేతికతలో రాటుదేలాలన్నా.. సరికొత్త ఆవిష్కరణల్ని రూపొందించాలన్నా.. జీవితంలో బాగా స్థిరపడాలన్నా విద్యార్థులకు కల్పతరువు నిట్ వరంగల్. ఇక్కడ సీటు వస్తే చాలు.. లైఫ్ సెట్ అనుకుంటారు. అలాంటి క్యాంపస్తో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఎంఓయూలు చేసుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు నిట్.. ఆఫ్లైన్లోనే కాదు.. వర్చువల్గా పరస్పర ఒప్పందాలు చేసుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. – కాజీపేట అర్బన్ఎంఓయూలో ‘వరంగల్ నిట్’ కొత్త ధోరణి అటు వర్చువల్గా, ఇటు నేరుగా ఒప్పందాలు సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉద్యోగావకాశాలకు తోడ్పాటు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, విస్తరించే దిశగా ప్రయత్నాలు ప్రత్యేకతను చాటుకుంటున్న సాంకేతిక సంస్థ -
జలదిగ్బంధంలో పడిగాపూర్, ఎల్బాక
ఎస్ఎస్తాడ్వాయి: నార్లాపూర్ చింతల్ క్రాస్ రోడ్డు నుంచి ఎల్బాకకు వెళ్లే దారిలో జంపన్నవాగు లోలెవల్కాజ్వే పైనుంచి వరద ప్రవహించడంతో ఎల్బాక, పడిగాపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు మేడారానికి వచ్చేందుకు ఉన్న మరో దారిలోని కొంగల మడుగు వరద రోడ్డుపైకి భారీగా వచ్చి చేరడంతో అటువైపు నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. అంతేకాకుండా ఊరట్టం తూముల వాగు వరద కూడా బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుండడంతో ఊరట్టం గ్రామానికి సైతం రాకపోకలు నిలిచిపోయాయి. -
ఇసుక మేటలు
మంగపేట: మండలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద తీవ్రతకు తిమ్మంపేట, మల్లూరు గ్రామాల మధ్యగల 10 తూముల మోరీ సమీపంలో గతంలో ఏర్పడిన గండిని పూడ్చకపోవడంతో సుమారు 15 మీటర్ల పైగా కోతకు గురై వరదనీరంతా పంట పొలాలను ముంచెత్తింది. సుమారు 10 ఎకరాలకు పైగా వరిపైరుపై ఇసుక మేట వేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అలాగే 50ఎకరాలకు పైగా వరిపొలాలు నీట మునిగిపోయాయి. అదే విదంగా బోరునర్సాపురం సమీపంలోని ఉప్పలనర్సయ్య చెరువు మత్తడి కింద పొలాలన్నీ నీటి మునిగి చెరువులను తలపిస్తున్నాయి. బాలన్నగూడెం శివారులోని మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు ఎడమ కాల్వ వరదతో తిమ్మంపేటకు చెందిన రైతులు సల్లూరు నర్సయ్య, సమ్మయ్య, కుమ్మరి వెంకన్నకు చెందిన సుమారు 10ఎకరాల్లోని వరినాటు కొట్టుకుపోయింది. -
అలుగు పోస్తున్న లక్నవరం, గుండ్లవాగు ప్రాజెక్టు
గోవిందరావుపేట: మండలంలోని లక్నవరం సరస్సు సామర్థ్యం 33 ఫీట్ల 6 ఇంచులు కాగా శనివారం సాయంత్రం వరకు చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. అదే విధంగా గుండ్లవాగు ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 25 ఫీట్లు కాగా పది రోజుల కిందటనే పూర్తిగా నిండి మత్తడి పోస్తుంది. లక్నవరం సరస్సు నీటి నిల్వ 1.945 టీఎంసీలు కాగా అధికారికంగా 8,794 ఎకరాల్లో వరి సాగు అవుతుండగా అనధికారికంగా 12 వేల ఎకరాలకు లక్నవరం చెరువు నీరు అందుతుంది. ప్రతిఏటా లక్నవరం చెరువు నీటితో రెండు పంటలు పండుతుంటాయి. అదే విధంగా గుండ్లవాగు ప్రాజెక్ట్ నీటితో 4,500 ఎకరాల్లో వరి పంట సాగు అవుతుంది. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఎస్ఎస్తాడ్వాయి: జంపన్నవాగు వరద ఉధృతి కారణంగా పంటలు నీటమునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మేడారంలో జంపన్నవాగు వరదతో మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి గ్రామాల్లో నీటమునిగిన వరి పంటలను ఆమె పార్టీ నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. జంపన్నవాగును సందర్శించి వరద పరిస్దితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ భారీ వర్షాలు కురియడంతో జంపన్నవాగు వరదతో పంట పొలాలు నీటమునిగి దెబ్బతిన్నాయన్నారు. నాట్లు వేసిన అనతికాలంలో వరదలతో పంట పొలాలు నీటమునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పంటలు నీటమునిగిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జంపన్న వాగుకు కరకట్ట ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వాగు వరదలతో ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని గెలిచిన మంత్రి సీతక్క ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలపాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లయ్య, జిల్లా నాయకులు ఎట్టి జగదీశ్, మాజీ సర్పంచ్ బాబురావు, మండల యూత్ అధ్యక్షుడు కోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతి -
రేపు సర్ధార్ పాపన్న జయంతి
ములుగు రూరల్: రేపు(సోమవారం) జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్ధార్ పాపన్న జయంతి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి సర్ధార్సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బీసీ సంఘాల సభ్యులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ములుగు రూరల్: భారీ వర్షాలతో మత్తడి పోస్తున్న చెరువులు, కుంటల మత్తళ్లకు అడ్డుగా నీటికి జాలీలు, కర్రలు అడ్డుగా ఏర్పాటు చేయొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్రాజు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు మత్స్యశాఖ పారిశ్రామిక సంఘాలు, గిరిజన మత్స్య పారిశ్రామిక సంఘాల సభ్యులు నిబంధనలు పాటించాలని సూచించారు. మత్తడి నీటికి వలలు, జాలీలు అడ్డుకట్టడం వల్ల తెగిపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్(ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం 2005) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గోదావరి, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. గోవిందరావుపేట: ఎయిడ్స్పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం సంస్థ సూపర్వైజర్ రజని అన్నారు. మండల పరిధిలోని బాలాజీ నగర్లో శనివారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఈసీ క్యాంపెనింగ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ వ్యాధులతో బాధపడకుండా అన్ని రకాల పరీక్షలు చేయడంతో పాటు హెచ్ఐవీ పరీక్ష కూడా చేయించాలన్నారు. హెచ్ఐవీ నాలుగు విధాలుగా సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి, హెచ్ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకి సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. గర్భిణులు తప్పకుండా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలన్నారు. గర్భిణులు తప్పకుండా ఆస్పత్రిలోనే డెలివరీ అయ్యేలా చూసుకోవాలని సూచించారు. -
ముంపు ప్రాంతాల పరిశీలన
ములుగు రూరల్/ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి మండల పరిధిలోని పడిగాపూర్ జంపన్నవాగు లోలెవల్ కాజ్ వే, నార్లాపూర్ కాజ్వే, ఊరట్టం వరద ముంపు ప్రాంతాలను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్, డీపీఓ దేవరాజు, తహసీల్దార్ సురేష్బాబు పరిశీలించారు. అలాగే మేడారం జంపన్నవాగును వరదను పరి శీలించి జంపన్నవాగు వద్ద అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అదే విధంగా జలగలంచ వాగు, ఎల్బాక జంపన్నవాగు, లోలేవల్ కాజ్ వే వరద, మేడారం జంపన్నవాగు వరదలను పార్టీ నాయకులతో కలిసి డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పరిశీలించారు.జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద కొబ్బరికాయ కొట్టి వరదలో పసుపు, కుంకుమ వదిలి వరద శాంతించాలని పూజాలు చేశా రు. నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. డీఎస్పీ రవీందర్ జంపన్నవాగు వరద ఉధృతితో పాటు మేడివాగు, రాళ్లవాగు వరద ఉధృతిని పరిశీలించారు. బండారుపల్లి ప్రాంతంలో రాళ్లవాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. సర్వాపూర్–జగ్గన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న బొగ్గుల వాగు లోలెవెల్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. -
రేపటి నుంచి మెస్లు రీఓపెన్
కేయూలోని వివిధ హాస్టళ్లు, మెస్లు రేపటి (సోమవారం) నుంచి రీఓపెన్ చేయనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ తెలిపారు.రోడ్డుపైకి చేరిన యాసంగితోగు వరదపస్రా నుంచి మేడారానికి వచ్చే దారిలోని ప్రాజెక్టునగర్– వెంగ్లాపూర్ మధ్య ఉన్న యాసంగి తోగు వరద రోడ్డును కమ్మేయడంతో పస్రా నుంచి మేడారానికి శనివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం నుంచి హనుమకొండకు వెళ్లే ఆర్టీసీ బస్సు కూడా రోడ్డుపైకి వరద రావడంతో తిరిగి మేడారం నుంచి తాడ్వాయి మీదుగా వెళ్లింది. హనుమకొండ నుంచి మేడారానికి వచ్చే భక్తుల వాహనాలను పస్రా నుంచి తాడ్వాయి మీదుగా మేడారానికి పోలీసులు దారి మళ్లించారు. యాసంగితోగు వరద తగ్గుముఖం పట్టేంత వరకు ఈమార్గన రాకపోకలు కొనసాగే పరిస్థితి లేదు. -
పవర్ లిఫ్టర్ వంశీకి మంత్రి ఆర్థిక సాయం
వాజేడు: మండల పరిధిలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన నేషనల్ పవర్ లిఫ్టర్ మొడెం వంశీకి పంచాయతీ రాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క శుక్రవారం ఆర్థిక సాయం చేశారు. అమెరికాలో జరిగే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.4లక్షలు కావాల్సి ఉండగా వంశీ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క రూ.40 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి రూ.లక్ష ఇవ్వాలని పీఓకు సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తొలి స్థానం సంపాదించి రాష్ట్రంతో పాటు జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తనకు వెన్ను దన్నుగా నిలిచిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పీర్ల కృష్ణబాబు, మంత్రి సీతక్కకు వంశీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. -
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్కజంగేడు స్టేడియంలో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవంములుగు రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జంగాలపల్లి క్రాస్లో రూ.2.16 కోట్లతో ఏర్పాటు చేసిన నంది విగ్రహం, ఢమరుకం, శిలాశాసన మండపాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు.. జిల్లాలో పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతను చాటుతూ ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనులు చేపడుతూ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.రూ.10లక్షల వరకు ఉచిత వైద్యంఅధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టామని మంత్రి సీతక్క చెప్పారు. అటవీప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించేందుకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నూతన ఆలోచనతో జిల్లాలో 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 4,182 మంది పేద గిరిజనులకు పరీక్షలు నిర్వహించామన్నారు. జిల్లా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఈనెల ఇద్దరికి రొమ్ము కణితి, ఒకరికి దవడ కణితి విజయవంతంగా తొలగించి మెరుగైన వైద్యసేవలు అందించినందుకుగాను వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు శాఖలకు చెందిన అధికారులకు ప్రశంసపత్రాలను సీతక్క అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు ఎస్పీ సదానందం, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యువతకు పెద్దపీట
వెంకటాపురం(ఎం)/ములుగు రూరల్: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని జంగేడు స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయజెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. స్వాతంత్య్ర సమరయోధులను శాలువాలతో సన్మానించారు. డీఆర్డీఏ ద్వారా 492 మహిళా సంఘాలకు 31.50కోట్లను అందించారు. పదో తరగతి, ఇంటర్ టాపర్లకు రూ.10వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించారు. మెప్మా కింద స్వయం సహాయక సంఘాలకు రూ.17.36 కోట్లను అందించారు. ఆనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 20నెలల కాలంలోనే దాదాపు 60వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. జిల్లాలో నూతన ఆయిల్పామ్ పరిశ్రమ నిర్మాణం, జిల్లాకేంద్రంలో మోడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో కొత్త బస్డిపో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కోసం శాశ్వత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ములుగు, బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలతో ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామన్నారు. మల్లంపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, జిల్లాలో మరో 15 సబ్సెంటర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. 2026లో జరగనున్న సమ్మక్క–సారలమ్మ మేడారం జాతరకు దాదాపు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతీ ప్రభుత్వ శాఖను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. -
ఏరియాను లాభాల్లోకి తీసుకురావాలి
భూపాలపల్లి అర్బన్: నష్టాల్లో ఉన్న భూపాలపల్లి ఏరియాను లాభాల్లోకి తీసుకురావాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి కోరారు. 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం సుభాష్కాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్లో వేడుకలను వైభవంగా నిర్వహించారు. సింగరేణి సెక్యూరిటి సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించి వేడుకలను జీఎం ప్రారంభించారు. ఏరియాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి కార్మికులకు ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వేడుకలను ఉద్దేశించి జీఎం మాట్లాడారు. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో అనేక దశల్లో నూతన సంస్కరణలు చేటుచేసుకున్నట్లు తెలిపారు. సింగరేణి సీఎండీ బలరాం నేతృత్యంలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కొత్త ప్రాజెక్ట్ల ప్రారంభం, సంక్షేమ కార్యక్రమాల అమలులో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 72 లక్షల టన్నుల సాధించాల్సి ఉందన్నారు. ఏరియాలో గడిచిన మూడు నెలల్లో 22.5 లక్షల టన్నులు వెలికితీయాల్సి ఉండగా 21.8లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. అధిక వర్షం కారణంగా ఓపెన్కాస్టు 2, 3 ప్రాజెక్టులలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తిని సాధించలేకపోయినట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రూ.331కోట్ల నష్టాల్లో ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, గుర్తింపు సంఘాల నాయకులు పాల్గొన్నారు.సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
గిరిజనులకు మంచిరోజులు
ఏటూరునాగారం: గిరిజనులకు మంచి రోజులు వచ్చాయని, స్థానికంగా మంత్రి సీతక్క ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిత్రామిశ్రా కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల్లో కెల్లా ఏటూరునాగారం ఐటీడీఏ అభివృద్ధిలో ముందజలో ఉందన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను పీఓ ఎగురవేశారు. ముందుగా స్కౌట్ అండ్ గైడ్స్ పీఓకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గిరిజనుల ఉద్దేశించి పీఓ మాట్లాడుతూ.. 2026లో జరిగే మేడారం జాతర కోసం 21 శాఖలకు గాను రూ.150కోట్లతో గిరిజన సంక్షేమశాఖ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశామన్నారు. ఇందులో రూ.10కోట్లు గిరిజన సంక్షేమశాఖ విభాగానికి మంజూరు కోసం ప్రతిపాదనలు చేశామన్నారు. 2024–25లో ఎన్ఐటీ, ఐఐటీలో సీటు వచ్చిన 38 మంది గిరిజన విద్యార్థులకు రూ.15.96లక్షలను అందించామన్నారు. 28 మందికి రూ.12.45లక్షల విలువ చేసే లాప్ట్యాప్లు ఇచ్చామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐటీడీఏ ద్వారా 8 బంజారా భవనాలు నిర్మించామన్నారు. జిల్లాలో గిరిజనుల లబ్ధి కోసం ట్రైకార్ పథకం ద్వారా 2020–21, 2021–22గాను 889 యూనిట్లకు రూ.778.13 లక్షలు మంజూరయ్యాయన్నారు. అందులో 208 మందికి సబ్సిడీ మంజూరు కాగా అందులో 125 యూనిట్లకు రూ.కోటి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గిరి వికాసంలో 2025–26 నుంచి 2029–30 వరకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల రైతులకు సోలార్ పంపు సెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 525 మందిని ఎంపిక చేసి వారికి సోలార్ పంపు సెట్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పోడు భూములకు పట్టాలు, రైతు భరోసా వంటివి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమంగా పనిచేసిన ఉద్యోగులకు ప్రశంసపత్రాలను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఎస్ఓ రాజ్కుమార్, జీసీసీ డీఎం వాణి, మేనేజర్ శ్రీనివాస్, ఎస్ఓ సురేశ్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, అకౌంట్స్ ఆఫీసర్ సంతోష్, ప్రోగ్రాం మేనేజర్ మహేందర్, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, జేడీఎం కొండల్ రావు, ఆర్సీఓ హరిసింగ్, ఏఎంఓ వాగ్యా, ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధిలో ఏటూరునాగారం ఐటీడీఏ ముందంజ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పీఓ చిత్రామిశ్రా -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ములుగు రూరల్ : తమ సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి సీతక్కకు క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బంద్ పెడతామని అన్నారు. ప్రభుత్వం మెనూ ధరను సవరించి ప్రతీ విద్యార్థికి రూ.25లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ముత్యాల రాజు, సాయల రమ, రాజకుమారి, ప్రమీల, సరోజన, లక్ష్మి, రామక్క, సవరూప, మల్లక్క రజిత, తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకుడు జంపాల రవీందర్ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేత -
శ్రమైక జీవన సౌందర్యం!
నేషనల్ లెవల్ ఫొటోగ్రఫీలో పాలంపేట వాసికి గోల్డ్మెడల్ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత ఆగస్టులో ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆన్లైన్లో 186వ వరల్డ్ ఫొటోగ్రఫీ డే కాంటెస్ట్ నిర్వహించారు. మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన తడాండ్ల శ్రావణ్కు మోనోక్రోమ్ విభాగంలో పల్లెటూరి జీవన విధానాన్ని చూపే ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈనెల 18న విజయవాడలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నుకసాని బాలాజీ చేతుల మీదుగా అవార్డుతో పాటు గోల్డ్మెడల్, నగదు పురస్కారాన్ని శ్రావణ్ అందుకోనున్నారు. – వెంకటాపురం(ఎం) -
సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ
అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకోనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది. – జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరం రాజకీయ నాయకులకు అక్రమ సంపాదనపై ఉన్న మక్కువ దేశాభివృద్ధిపై లేదు. స్వార్థపు ఆలోచనలతోనే బతుకుతున్నారు. ఎవరు ఎటుపోతే నాకేంటి? అనుకుంటున్నారు. తోటి మిత్రులకు, పేదలకు, ఇతరులకు సాయం అందించినప్పుడు దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. పదిమంది చేసే పనిని ఒక ఏఐ చేస్తే మిగతావారి పొట్టకొట్టినట్లే కదా. ఏఐలో మానవ మనుగడకు ముప్పే. – ఎస్కే అన్వర్, బీఏ, తృతీయ సంవత్సరం -
నవ చైతన్యానికి విద్య పునాది
ఆనాటి పోరాట యోధులు తెల్లదొరల తుపాకీ గుండ్లకు ఎదురు నిలబడి, ప్రాణత్యాగాలు చేసి భారత్కు స్వాతంత్య్రం తీసుకొచ్చారు. నవ చైతన్యానికి విద్య పునాది అని అంబేడ్కర్ చెప్పినట్లుగా యువకులు ఉన్నత చదువులు చదివి దేశానికి ఆదర్శంగా నిలవాలి. విద్య, వైద్యం విషయంలో ఇంకా దేశానికి స్వేచ్ఛ రాలేదు. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఆపేసి ఉచిత విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. – మహంకాళి వరుణ్, బీకాం తృతీయ సంవత్సరం దేశంలో ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా బాలికల, మహిళలు హక్కులు తెలుసుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం సాధించుకోవాలి. నేటికీ మహిళలు, చిన్నారులు, యువతులపై దాడులు కొనసాగుతున్నాయి. శిక్షలు కఠినంగా ఉంటేనే ప్రజలు క్రమశిక్షణతో జీవిస్తారు. నేటి విద్యార్థులు, యువతరం ప్రభుత్వాలను ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. – కె.చందన, బీఎస్సీ, తృతీయ సంవత్సరం -
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని అమెరికాకు చెందిన చాడ్విక్ కాలిన్స్ కొనియాడారు. గురువారం మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని కాలిన్స్ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టతను వివరించారు. ఇదిలా ఉండగా.. రామలింగేశ్వరస్వామి గురువారం చంద్రమౌళీశ్వరస్వామిగా పర్యాటకులు, భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీశ్శర్మ తెలిపారు. భక్తులు, పర్యాటకులు స్వామివారికి అర్చన, అభిషేకం నిర్వహించినట్లు వెల్లడించారు.రాష్ట్రపతి అవార్డుకు ఎంపికములుగు రూరల్: జిల్లా అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న తాళ్ల నగేష్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. 1987లో ఉద్యోగంలో చేరిన నగేష్ వరంగల్, మహబూబాబాద్, ములుగు అగ్నిమాపక కేంద్రాల్లో విధులు నిర్వర్తించారు. వరంగల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురై సమయంలో ప్రయాణికులను రక్షించడంలో సహసోపేతంగా వ్యవహరించారు. దీంతోపాటు వరదల సమయంలో ప్రజలను కాపాడారు. వరంగల్లో పత్తి, పసుపు గోదాములు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఉత్తమ సేవలు అందించారు. మహబూబాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పడిపోయిన వారిని కాపాడారు. ములుగు జిల్లాలో బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడి ప్రశంసలు పొందారు. తన ఉత్తమ సేవలకు గాను ఇప్పటి వరకు నాలుగు ప్రశంసా పత్రాలు, ఒక సేవా పథకం అందుకున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి సేవా పతకానికి ఎంపికవడంతో పలువురు నగష్ను అభినందించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూఏటూరునాగారం: ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం మెనూ పాటించాలని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు అన్నారు. మండల కేంద్రంలోని ఏటూరునాగారం, మండంలోని చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గది, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు తయారు చేసిన వంటలను రుచి చూసి మరింత రుచికరంగా వంట చేయాలని ఆదేశించారు. రాబోయే టెన్త్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలను బోధించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట హాస్టల్ వార్డెన్లు మనోజ్కుమార్, అధికారులు ఉన్నారు. -
వర్షాలతో నష్టం వాటిల్లకుండా చూడాలి
ములుగు రూరల్: భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఆయన గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్రావు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వరద సహాయక చర్యల నిమిత్తం జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రులు తెలిపారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని తెలిపారు. రోడ్లు, కావేజ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిబ్బందికి సెలవులు ఇవ్వకూడదని సెలవులపై వెళ్లిన వారిని రప్పించాలని తెలిపారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవాలని అన్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న వాగులు, చెరువుల సమీపంలో రోడ్లు, కల్వర్టులను, వంతెనలను మూసి వేయాలని మంత్రులు తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జిల్లాలో మంగళవారం 49 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని, వెంకటాపురం(కె), మంగపేట మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసినట్లు తెలిపారు. కమలాపురం కాలనీలో నీరు రావడంతో 45 నిమిషాల సమయంలో నీరును తొలగించామని అన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ కుమారస్వామి, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేష్కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో సహాయక చర్యలకు రూ.కోటి మంజూరు -
ఇక్కడే ఉంటారా... సురక్షిత ప్రాంతాలకు వెళ్తారా..
ఏటూరునాగారం: జంపన్నవాగు ఉధృతి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తారా... లేక ఇక్కడే ఉంటారా.. అని అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ కొండాయి గ్రామస్తులను అడిగారు. గురువారం ఆయ న అధికారులతో కలిసి కొండాయి గ్రామాన్ని సందర్శించారు. పడవలో ప్రయాణించి జంపన్నవాగు దాటి గ్రామానికి చేరుకున్న ఆయన ప్రజలతో మాట్లాడారు. గ్రామస్తులకు ప్రభుత్వం ఇళ్లు, ఇంటి స్థలాలు ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని, గ్రామస్తులు అభిప్రాయం చెప్పకపోవడంతో అది పెండింగ్లో ఉందని తెలిపారు. ముంపుప్రాంతాల వారికి దొడ్ల ప్రాంతంలోని 16 ఎకరాల రెవెన్యూ భూమి ఇవ్వడం జరుగుతుందని, అందుకు కావాల్సిన ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామస్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చి తమకు లేఖలను అందించాలని కోరారు. కొండాయిలో ఉన్న స్థితిగతులు, ప్రజల ఇబ్బందులను మాజీ సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు అడిషనల్ కలెక్టర్కు వివరించారు. ఇదిలా ఉండగా.. కొండాయి గ్రామస్తులకు దొడ్ల వద్ద ఎలాంటి భూమి ఇవ్వొద్దని దొడ్ల గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ కారును అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మా ఊరిలోని కొన్ని ఇళ్లు కూడా మునిగిపోయాయని, వాళ్లకు కూడా దొడ్లలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. అదేకాకుండా గోవిందరాజుల కాలనీ వద్ద ఉన్న అటవీశాఖకు చెందిన భూమి కావడంతో దానిని స్వాధీనం చేసుకొని ఇళ్లకు పంపిణీ చేయడం కుదరదని ప్రజలకు వివరించినట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలి వర్షాలు ముగిసే వరకు లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ అన్నారు. దొడ్ల, కొత్తూరు, మల్యాల, కొండాయి ప్రజలకు వర్షాలు, వరదలపై అవగాహన కల్పించారు. ఎలాంటి అవసరం ఉన్నా పడవలో వెళ్లాలని, నిత్యావసర వస్తువులతోపాటు వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని తహసీల్దార్ జగదీశ్వర్ను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు, చేల నవీన్, గ్రామస్తులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శి సతీష్ ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ను అడ్డుకున్న దొడ్ల గ్రామస్తులు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ -
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు పూర్తి
విద్యుత్దీపాల వెలుగుల్లో కలెక్టరేట్ములుగు రూరల్: నేడు నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానాన్ని సిద్ధం చేశారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ వేడుకలు, సభా ప్రాంగణాన్ని గురువారం పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హాజరు అవుతున్నట్లు తెలిపారు. వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిద శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు 289 మందికి అవార్డులు అందించనున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్ధార్ విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
హర్ఘర్ తిరంగా ర్యాలీ
ములుగు రూరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమై ములుగు ఏరియా వైద్యశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా ర్యాలీ ఒక కార్యక్రమం కాదని.. ఇది మన బాధ్యత అని తెలిపారు. స్వాతంత్య్ర యోధులకు మనమిచ్చే నివాళి అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, రమేష్, సురేందర్, రవీంద్రచారి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ములుగులో నిర్వహిస్తున్న ర్యాలీ -
పొడిగించేనా..?
నేటితో ముగియనున్న పీఏసీఎస్ల పాలకవర్గాల గడువువెంకటాపురం(ఎం): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు సర్కార్ పొడిగించిన ఆరు నెలల పదవీ కాలం గడువు నేటితో (గురువారం) ముగియనుంది. మరో ఆరు నెలలు పొడిగిస్తారా.. లేదా అనే విషయమై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. పీఏసీఎస్లకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 16న చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16తో ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలల పదవీ కాలాన్ని పొడిగించింది. పొడిగించిన పదవీ కాలం గురువారంతో ముగియనున్నప్పటికీ ఇప్పటివరకు పాలకవర్గాల కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అటు అధికారులు, ఇటు పాలకవర్గ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో ఆరు నెలల గడువు పొడిగించాలా లేదా పాలకవర్గాలను రద్దు చేసి పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలా అనే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పీఏసీఎస్ పాలకవర్గాల గడువు మరో ఆరు నెలలు పొడగించాలని పీఏసీఎస్ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 99 పీఎసీఎస్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 99 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 2.5 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వరంగల్ పరిధిలో 28, హనుమకొండ పరిధిలో 16, జనగామలో 14, మహబూబాబాద్ పరిధిలో 19, ములుగు పరిధిలో 12, జయశంకర్ భూపాలపల్లి పరిధిలో 10 పీఏసీఎస్ సంఘాలు ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసింది. పీఏసీఎస్ల ద్వారా రైతులకు పంట రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందుతున్నాయి. అంతేకాకుండా పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసి రైతాంగానికి ప్రభుత్వ మద్దతు ధర అందేలా చూస్తున్నారు. ప్రతీ ఐదేళ్లకోసారి పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పాలకవర్గాలను నియమిస్తారు. ప్రతీ సొసైటీకి సీఈఓతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు. పాలకవర్గాల గడువు గురువారంతో ముగియనుండడంతో ప్రత్యేక పాలన విఽధిస్తారా.. మరో ఆరు నెలలు పొడిగిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరో ఆరు నెలలు పొడిగించాలంటున్న పాలకవర్గాలు ప్రత్యేక పాలననా.. నామినేటెడ్తో భర్తీనా..? ప్రభుత్వ ఆదేశాల కోసం ఉత్కంఠనామినేటెడ్ పద్ధతిలో.. ప్రాథమిక సహకర సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతి అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలిచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాదిరిగానే సహకార సంఘాల్లోనూ నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాన్ని నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీఏసీఎస్ ఎన్నికల పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే నామినేటెడ్ పద్ధతిలో పీఏసీఎస్లకు పాలకవర్గాన్ని భర్తీ చేయనున్నట్లు తెలిసింది.ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు పీఏసీఎస్ పాలకవర్గాల గడువు గురువారంతో ముగియనుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత పాలకవర్గం కొనసాగుతుంది. గురువారం లోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. – సర్దార్సింగ్, డీసీఓ -
వంతెన పనులు త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: మల్లంపల్లి–ములుగు జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కుంగిపోవడంతో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్. దివాకర సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారిపై ఉన్న పాత బ్రిడ్జి కుంగిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగిందన్నారు. జాతీయ రహదారి అధికారులు తాత్కాలిక వంతెన నిర్మాణ పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వాహనాల రాకపోకలను దారి మళ్లించాలని తెలిపారు. వరంగల్ నుంచి ములుగు వచ్చే భారీ వాహనాలను గూడెప్పాడు నుంచి పరకాల.. రేగొండ.. జంగాపల్లి మీదుగా వెళ్లేలా చూడాలన్నారు. తిరుగు ప్రయాణంలో అబ్బాపూర్..గోరుకొత్తపల్లి..వరంగల్కు వెళ్లేలా చూడాలన్నారు. నర్సంపేట, ములుగు, వరంగల్ ఆర్టీసీ బస్సులు, కార్లు శ్రీనగర్–పందికుంట మీదుగా మళ్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎన్హెచ్ అధికారి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
రైతుల సంక్షేమమే ధ్యేయం
ములుగు రూరల్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరిస్తామని వెల్లడించారు. లైసెన్స్ లేని పత్తి కొనుగోలు దారుల అక్రమాలను నివారించి రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు సెద సారంగం, ఎల్లారెడ్డి, సీతరాం నాయక్, బాలయ్య, వెంకన్న, రామస్వామి, పగడయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కాంబోజ చెరువుకు బుంగ ఎస్ఎస్తాడ్వాయి: మండల కేంద్రంలోని నర్సింగాపూర్ గ్రామంలో కాంబోజ చెరువుకు బుంగ పడింది. మంగళవారం రాత్రి భారీవర్షం కురియడంతో చెరువులోకి భారీగా వరద వచ్చి చేరడంతో చెరువు కట్టకు బుంగ పడింది. కట్ట తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో నర్సింగాపూర్ గ్రామ రైతులు వాట్సాప్ గ్రూపులో పెట్టడంతో తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి స్పందించి ఇరిగేషన్శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పాటు గ్రామ రైతుల సహకారంతో బుంగను పూడ్చివేతకు చర్యలు తీసుకున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో బుంగ పూడ్చివేతకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి ములుగు రూరల్: ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ములుగు మండలం జగ్గన్నగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన దబ్బకట్ల శోభన్ (35) తన ట్రాక్టర్ తీసుకొని వ్యవసాయ పొలంలో దమ్ము చేసేందుకు వెళ్లాడు. దమ్ము చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగపడి శోభన్ బురదలో చిక్కుకుపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రైతులు ట్రాక్టర్ కింద నుంచి శోభన్ను బయటకు తీసేసరికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిలలు ఉన్నారు. రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలి ములుగు రూరల్: రైతులు సాగు చేస్తున్న పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రవణ్కుమార్ సూచించారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్గౌస్పల్లిలో పత్తి, వరి పంటలను ఆయన పరిశీలించి మాట్లాడారు. వరి నాట్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఉల్లికోడు నివారణకు కార్బోన్యూరాన్ 3సీజీ గుళికలను ఎకరానికి 10 కేజీల చొప్పున వాడాలని తెలిపారు. నాటిన 15 రోజుల్లో వినియోగించాలని సూచించారు. పత్తి పంటలో రసం పీల్చు పురుగు నివారణకు పసుపు, నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతర్గత మందులను ప్రిపోనిల్ 2 మిల్లీ లేదా ఏసీపేట్ 1.5 గ్రాము లేదా ప్లోనిమిడ్ 0.3 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకార బుట్టలను అమర్చి నివారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు హరి, మానస, సౌందర్య, మండల వ్యవసాయ అధికారి శ్రీధర్, రైతులు పాల్గొన్నారు. -
విద్యావనరుల కేంద్రంలోకి వరదనీరు
మంగపేట: మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం భవనంలోకి వరద నీరు వచ్చి చేరడంతో కార్యాలయ సిబ్బంది కస్తూర్బా విద్యాలయంలో బుధవారం విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డు నుంచి గంపోనిగూడెం తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు, బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై గల ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద లోతట్టు ప్రాంతంలోని విద్యావనరుల కేంద్రం భవనంలోకి చేరింది. దీంతో కార్యాలయంలో విధులు నిర్వర్తించే అవకాశం లేక పోవడంతో సిబ్బంది తాత్కాలికంగా కస్తూర్బా విద్యాలయంలో కొనసాగించారు. ప్రతీసారి సమస్య ఎదురవుతున్నా అధికారులు సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఉధృతంగా జంపన్నవాగు
ఏటూరునాగారం: మండలంలోని కొండాయి బ్రిడ్జివద్ద మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షానికి జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జంపన్నవాగు నూతన బ్రిడ్జి కోసం వాగులో దింపిన డయలు నీట మునిగాయి. దీంతో కొండాయి, మల్యాల, ఐలాపురం, గోవిందరాజుల కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వాగుదాటే పరిస్థితి లేకపోవడంతో అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. ఈ పడవల ద్వారానే రాకపోకలను సాగించాల్సి వస్తోంది. జంపన్నవాగు ఉధృతంగా రావడంతో బ్రిడ్జి పనులు ఆగిపోయాయి. వాగు అవతల ఉన్న గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలకులు, జిల్లా అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి వేళలలో వాగు దాటకుండా సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. కొండాయి వద్ద మునిగిన పిల్లర్ల డయలు పడవలు ఏర్పాటు చేసిన అధికారులు -
ఒక్కో క్వారీ నుంచి లారీ
సాక్షిప్రతినిధి, వరంగల్: ఇసుక అక్రమ దందా ఉమ్మడి వరంగల్లోని కొన్ని ఠాణాల పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పోస్టింగ్ కోసం ప్రయత్నం చేసేటప్పుడే చాలామంది ఎస్ఐలు, సీఐలు ఇసుక అక్రమ దందా సాగే ప్రాంతాలను ఎంచుకోవడమన్నది పరిపాటిగా మారింది. ఏ పోలీసు స్టేషన్ పరిధిలో ఎక్కువ వాగులు, ఇసుక, మొరం.. బెల్టుషాపుల దందా సాగుతుందో.. ఆ ఠాణాలే లక్ష్యం చేసుకుని చాలామంది పోస్టింగ్లు కొడుతున్నారు. ఆ తర్వాత నెలవారీ మామూళ్లు షరా మామూలుగా మారి... ఇసుక వ్యాపారులు తమ దందాను సాగించుకోవడం సర్వసాధారణం. కానీ కొందరు మామూళ్లతోపాటు టెండర్ల ద్వారా పొందిన క్వారీల నుంచి పుక్కిడికి లారీల్లో ఇసుక నింపి హైదరాబాద్కు పంపుతూ దందా నిర్వహిస్తున్నారు. అదనపు ఆదాయానికి రుచి మరిగిన ఇలాంటి వారు తమకు అనుకూలురైన నాయకులు, అధికారుల పేర్లు వాడుతూ వివాదాస్పదులు అవుతున్నారు. ఇదే తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత ఏజెన్సీ ఏరియా ఠాణాలో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఒకరు నెలవారీవి ‘మామూలు’గా తీసుకుంటూ ఇసుక దందాను నిర్వహిస్తుండటం ఇప్పుడు పోలీసుశాఖలోనే చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా 10 వరకు ఇసుక క్వారీలు .. గోదావరి పరీవాహక ప్రాంతంలో 10 వరకు ఇసుక క్వారీలు అధికారికంగా నడుస్తున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ముందే అప్రమత్తమైన కాంట్రాక్టర్లు వేల క్యూబిక్ మీటర్లను ఇసుకను గోదావరి ఒడ్డున నిల్వచేసి ఆన్లైన్ ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఓ ఠాణాలో పనిచేసే ఎస్ఐ.. ఆ ఠాణా పరిధితోపాటు చుట్టుపక్కల క్వారీల నిర్వాహకులనుంచి ఇసుకను ఉచితంగా నింపిస్తూ హైదరాబాద్కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కో క్వారీనుంచి నెలలో రెండు నుంచి మూడు.. నెలలో మొత్తం 15 నుంచి 20 లారీల ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఒక్కో లారీ యజమాని, డ్రైవర్లకు కిరాయి, డీజిల్ ఖర్చులు పోను రూ.5 వేలు మిగిలేలా చేస్తూ.. నెల మొత్తంలో సదరు ఎస్ఐ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరన్న క్వారీ, లారీ యజమానులు సహకరించకపోతే మైనింగ్, టీజీఎండీసీ, రవాణాశాఖ అధికారులతో బెదింరిపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.ఎస్ఐపై ఫిర్యాదులు.. మామూళ్లు ఇచ్చి దందా చేసుకోవడానికి అలవాటు పడిన ఇసుక వ్యాపారులు.. అదనంగా ఇసుక లారీలను నింపి పంపాలని ఇబ్బందులు పెడుతున్న సదరు ఏజెన్సీ ఠాణా ఎస్ఐపై ఇటీవల డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వ్యాపారులు.. ఆ ఉన్నతాధికారి సెలవులో ఉన్నట్లు తెలుసుకుని డీజీపీ, అడిషనల్ డీజీపీలకు పంపినట్లు చెబుతున్నారు. సదరు ఎస్ఐపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచిల ద్వారా విచారణ జరిపించి నిజమని తేలితేనే చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ఇసుక దందాపై ఓ సబ్ ఇన్స్పెక్టర్పై డీజీపీ స్థాయి అధికారికి ఆ ఏజెన్సీ జిల్లా నుంచి ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కావడంతో పోలీసుశాఖలో కలకలంగా మారింది.నెలలో కనీసం 15 ట్రిప్పులు.. రూ.3 లక్షలకుపైనే సంపాదన ఏజెన్సీ ప్రాంతంలో ఓ ఎస్ఐకి ఇది ఇసుకతో పెట్టిన విద్య ఇసుక క్వారీలనుంచి మామూళ్లతోపాటు ఇది అదనం డీజీపీ కార్యాలయానికి బాధితుల ఫిర్యాదులు -
ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ
సాక్షిప్రతినిధి, వరంగల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం పంద్రాగస్టు రోజున జిల్లాకేంద్రాల్లో ఉదయం 9.30 గంటలకే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా వేడుకలకు హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల జాబితాను బుధవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు విడుదల చేశారు. హనుమకొండ జిల్లా పోలీసు పరేడ్గ్రౌండ్స్లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వరంగల్లో రెవెన్యూశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా మహబూబాబాద్లో డిప్యూటీ స్పీకర్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం గార్డ్ ఆఫ్ ఆనర్లో గౌరవ వందనం స్వీకరిస్తారని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ఆ ఉత్తర్వులో జిల్లా కలెక్టర్లకు సూచించారు. పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వం ఉత్తర్వులు ములుగులో మంత్రి సీతక్క -
యువత డ్రగ్స్కు బానిస కావొద్దు
ములుగు రూరల్: యువత డ్రగ్స్కు బానిసలుగా మారి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి బారగాడి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం రవాణాశాఖ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా సమాచారా న్ని పోలీసులకు అందించాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణాపై అ ప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమ ంలో కార్యాలయ సిబ్బంది, యువత పాల్గొన్నారు.జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ -
తునికాకు బోనస్లో అవకతవకలు
ఏటూరునాగారం: మండలంలోని అటవీశాఖ కార్యాలయంలో తునికాకు బోనస్లో కూలీలకు డబ్బులు రాకుండా అవకతవకలు జరిగాయని సాక్షి ముందుగానే హెచ్చరించింది. ఇందులో అటవీశాఖ రేంజ్ అధికారి బాలరాజు శిక్షను అనుభవించారు. అదే విధంగా ఏటూరునాగారం సౌత్ రేంజ్ అటవీశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బందెల రాము అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆపరేటర్ తన భార్య బందెల స్వాతి, తల్లి సారమ్మ ఖాతాల్లో అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భార్య బ్యాంకు ఖాతాలో రూ. 4 లక్షలు, తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 2.89 లక్షలు అక్రమంగా జమ చేసి జేబులు నింపుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ ఏడాది మార్చిలో తునికాకు బోనస్లో చేతివాటం అంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. అందులో ఓ కంప్యూటర్ ఆపరేటర్ తన బంధువుల పేరుపై లక్షలాది రూపాయలు ఖాతాల్లో జమ చేసుకొని అక్రమాలకు పాల్పడినట్లు కూడా వెల్లడైంది. కానీ అధికారుల అలసత్వం వల్ల ఐదు నెలల తర్వాత ఆ విషయం తేటతెల్లమైందని స్థానికుల్లో చర్చ సాగుతోంది. తునికాకు బోనస్ విషయంలో పెద్ద పెద్ద వాళ్ల చేతివాటం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆ విషయంపై సీబీఐ విచారణ చేపడితే సుమారుగా రూ. 5 కోట్ల మేర అక్రమార్కుల జేబుల్లోకి డబ్బులు వెళ్లినట్లు తేలుతుందని తునికాకు కూలీలు చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు వచ్చిన తునికాకు బోనస్ డబ్బులు వారి ఇష్టారాజ్యంగా ఖాతాల్లో వేసుకున్నారని, తునికాకు బోనస్ను ఎవరూ పర్యవేక్షించకపోవడంతో అటవీశాఖలో పెద్ద ఎత్తున కుంభకోణం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ భార్య, తల్లి పేరుతో రూ.లక్షలు స్వాహా ముందే చెప్పిన సాక్షి -
ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తేనే చైతన్యవంతులు అవుతారని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో ఇంటర్ నేషనల్ యూత్డే సందర్భంగా ఇంటెన్ పైడ్, ఐఇసీ క్యాంపును ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణలో యువత పాత్ర ఎంతో ముఖ్యం అన్నారు. యూత్ డే సందర్భంగా ఇంటెన్స్ పైడ్ కార్యక్రమాలు 12 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎయిడ్స్ నియంత్రణపై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించాలి జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు చేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు సూచించారు. ములుగు జనరల్ ఆస్పత్రిలో ఆస్పత్రి జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న లవకుమార్ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించారు. ఈ సందర్భంగా లవకుమార్ను ఆయన అభినందిచారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీ చేయించడం వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలపై మరింత నమ్మకం కలుగుతుందన్నారు. అనంతరం ఆయన టీ హబ్ను సందర్శించారు. డెంగీ, మలేరియా రక్త పరీక్షల రిజిస్టర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, డెమో సంపత్ తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
బస్సు సౌకర్యం కల్పించాలని వినతి
వెంకటాపురం(కె): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి వెంకటాపురం మండలానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ తిరుపతికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సాధనపల్లి విజయ్ మాట్లాడుతూ రెండు నెలలుగా మండలానికి బస్సు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్ధులు స్కూల్కు వెళ్లేందుకు ఆటోలకు రోజకు రూ.100 ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్నాయుడు, ముత్యాల శ్రీనివాస్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. -
గెజిట్ విడుదల చేయాలని వినతి
ములుగు రూరల్ : ఐదో షెడ్యూల్ ప్రకారం పరిశ్రమల జీఓల గెజిట్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ నాయకులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు కనీస వేతన సవరణ మండలాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు తక్షణమే గెజిల్ విడుదల అయ్యేలా చూడాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు లక్ష్మయ్య, మొగిలి, రమేష్ రాజు, రవీందర్, శివకుమార్ తదితరులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు సరికాదు ములుగు రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూజలు చేయవద్దని, త్రివర్ణ పతాకం ఎగురవేయద్దంటూ అంక్షలు పెడుతుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆలయ కమిటీ ఎన్నిక భూపాలపల్లి రూరల్: శ్రీ సీతారామ తెలంగాణ సకల కళల కళాకారుల సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు పోల్సాని దేవేందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భౌతు లక్ష్మయ్య, కోశాధికారిగా ఎడ్ల రాము, సహాయ కార్యదర్శిగా తరాల సమ్మక్క, ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి శంకర్, గడ్డం లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులుగా రంగు రవీందర్ గౌడ్, లలిత, అట్కాపురం తిరుపతి, గువ్వ లక్ష్మి, చిలుక రమాదేవిలను ఎన్నుకున్నట్లు తెలిపారు. సైబర్ బాధితుడికి చెక్కు అందజేత భూపాలపల్లి అర్బన్: సైబర్ నేరంతో మోసపోయిన బాధితుడికి రూ.1.20లక్షల చెక్కును మంగళవారం భూపాలపల్లి పోలీసులు అందించారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్నగర్కు చెందిన బొప్పర్తి హరికృష్ణ సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.1,75లక్షలు మోసపోయాడు. బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా రూ.1,54,500 హోల్డ్ చేశారు. దర్యాప్తు జరిపి మొదటి విడతగా రూ.1,20లక్షల చెక్కును కోర్టు ద్వారా ఇప్పించి బాధితుడికి అందజేసినట్లు సీఐ తెలిపారు. బాధితుడికి సకాలంలో రిఫండ్ అందజేయడంలో కృషి చేసిన సైబర్ వారియర్ తిరుపతిని సీఐ అభినందించారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం భూపాలపల్లి అర్బన్: ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాకేంద్రంలోని కొమురయ్య భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోత్కు ప్రవీణ్కుమార్ హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ వరకు ఏఐఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రీడలు, సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల జోసఫ్, నాయకులు పోతుల పవన్, భగత్, రాజేష్, శరణ్య, లావణ్య, అజయ్, వినోద్, రాకేష్, సంపత్ పాల్గొన్నారు. -
ఉద్యోగిపై విచారణ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఉద్యోగిపై దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి విచారణ చేపట్టారు. ఉద్యోగిపై వస్తున్న ఆరోపణలపై మంగళవారం ఆరాతీశారు. దేవస్థానంలోని అర్చక, సిబ్బందితో ఆమె ప్రత్యేకంగా చర్చించి వారి వాంగ్మూలాన్ని సేకరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాలతో ఆరోపణలు వస్తున్న ఉద్యోగిపై విచారణ చేశామని, నివేదికలు సమర్పిస్తామని తెలిపారు. ఆమెతో వరంగల్ ఏసీ సునీత, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ తదితరులు ఉన్నారు. -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
భూపాలపల్లి అర్బన్: పని గంటలు పెంచుతూ సింగరేణి ఉద్యోగులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న మల్టీ డిపార్ట్మెంటల్ అవగాహన సమావేశాలలో భాగంగా మంగళళవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడానికి, పని గంటలు పెంచుతూ ఎస్డీఎల్ యంత్రాలను నడపాలని భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఎవరి స్థాయిలో వారు సాధ్యమైనంత వరకు వ్యయాన్ని తగ్గించుకోవాలని కోరారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, అంకితభావంతో పనిచేయాలన్నారు. భద్రత పట్ల అశ్రద్ధ వహించకుండా అధికారులు, సూపర్వైజర్లు సంబంధిత ఉద్యోగులకు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి సక్రమంగా పనిచేస్తూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం తేనెటీగల పెంపకం గురించి అవగాహన తరగతులను నిర్వహిస్తున్నామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు మూడు కోర్సులను విజయవంతంగా పూర్తిచేశామని తెలియజేశారు. ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి -
ఏజెన్సీలో భారీ వర్షం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో అధికారులు అప్రమత్తమై అన్ని శాఖల అధికారులు మండల కేంద్రాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మండల పరిధిలోని కొండాయి, ఎలిశెట్టిపల్లి జంపన్నవాగు వద్ద సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి రాత్రివేళల్లో వాగు దాటకుండా చర్యలు చేపట్టారు. మరో నాలుగు రోజులు వర్షాలు ఉండడంతో గోదావరి, జంపన్నవాగు, చెరువుల మత్తళ్లను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
రాబోయే నాలుగురోజులు భారీ వర్షాలు
రాబోయే నాలుగు రోజులు అతి భారీ వర్షాలు ఉండడంతో ఏజెన్సీలో గోదావరి, వాగులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాగులు దాటడం, చేపలు, పడవల్లో ప్రయాణం చేయడం మానుకోవాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాలు ముగిసే వరకు ప్రయాణాలను మానుకోవాలని తెలిపారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆహారం, నీరు, మందులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎవరికై నా ఏదైనా అవసరమైతే వెంటనే 100 డయల్ చేయడం లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శిథిలమైన ఇళ్లలో ఉండవద్దని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. -
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోuవిద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ఇంటర్నల్ మార్కుల విధానంతో విద్యార్థులు సొంతంగా ప్రాజెక్టులు తయారు చేయడం, స్లిప్ టెస్టులు, నోట్స్ రాయడం ద్వారా నైపుణ్యాలు పెరిగి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో ఇంటర్నల్ మార్కుల విధానం అమలులో ఉంది. ఇంటర్నల్ మార్కుల విధానం విద్యార్థుల ప్రగతికి దోహదపడుతుందని ఎన్సీఈఆర్టీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. – జనగాం బాబురావు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయంతో గందరగోళ పరిస్థితులు విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత విద్యాశాఖ ఇంటర్నల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్నల్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో 100 మార్కులకు విద్యార్థులను రెండు నెలలుగా సన్నద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంటర్నల్ విధానాన్ని రద్దు చేసి 100 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహించాలి. – ఏళ్ల మధుసూదన్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిపాత పద్ధతిలోనే పది పరీక్షలువెంకటాపురం(ఎం): పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ 20 మార్కులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచిన తర్వాత విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంపై మరికొంతమంది ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలపై ప్రభుత్వానికే స్పష్టత లేకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు 20 కి 20 ఇంటర్నల్ మార్కులు వేస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పడిపోతుందనే నెపంతో ప్రభుత్వం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేసి 2024–25 విద్యా సంవత్సరం నుంచే 100 మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని గతేడాది వెనక్కి తీసుకుంది. 2025–26 నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండు నెలలు గడిచిన తర్వాత పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీఈఆర్టీ అభిప్రాయం మేరకే.. పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులను రద్దు చేయడంపై జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. సీబీఎస్ఈ పదో తరగతిలో 20 శాతం ఇంటర్నల్స్, 80 శాతం వార్షిక పరీక్షలకు మార్కులు కేటాయిస్తే తెలంగాణలో ఎలా ఇంటర్నల్స్ను రద్దు చేస్తారని ఇటీవల నిర్వహించిన వర్క్షాప్లో రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు సమాచారం. దీంతో విద్యాశాఖ అధికారులు పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం అంగీకరించగా విద్యాశాఖ అధికారులు ఇంటర్నల్ విధానాన్ని యధావిధిగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 10 మండలాల్లో.. 4,186 మంది విద్యార్థులు జిల్లాలోని 10 మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో కలిపి 53 హైస్కూల్స్ ఉండగా 2025–26 విద్యాసంవత్సరానికి గాను 4,186 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది జూన్లో విద్యాశాఖ 100 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టత ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయులంతా విద్యార్థులను సబ్జెక్టుల వారీగా గత రెండు నెలలుగా 100 మార్కుల పేపరుకే సన్నద్ధం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం విద్యాశాఖ 80 మార్కులకు రాత పరీక్షలు, 20 ఇంటర్నల్ మార్కులు అని ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. విద్యాసంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వం వార్షిక పరీక్షలపై స్పష్టత ఇవ్వాలని, విద్యా సంవత్సరం ఆరంభమైన రెండు నెలల తర్వాత వార్షిక పరీక్షలు, ఇంటర్నల్ మార్కులపై ఆదేశాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని కొంతమంది ఉపాధ్యాయులు అభిప్రాయపడుతుండగా, మరికొంతమంది ఉపాధ్యాయులు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.న్యూస్రీల్ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ రాత పరీక్షకు 80, ఇంటర్నల్కు 20 మార్కులు జిల్లా వ్యాప్తంగా 4,186 మంది విద్యార్థులు -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
ఏటూరునాగారం: గిరిజన విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గిరిజన విద్యాసంస్థల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముట్టడించారు. అనంతరం 163 జాతీయ రహదారిపై ధర్నా చేపట్టగా పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ బిల్లులు విడుదల కాకపోవడంతో వార్డెన్లు బంగారం కుదవపెట్టి ఆశ్రమ పాఠశాలలను నడుపుతున్నారని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లలోని వార్డెన్లకు రోజురోజుకూ ఖర్చుల భారం పెరిగిపోతున్నా బిల్లులు మాత్రం రావడం లేదన్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో టీచర్లు లేరని, బాత్రూమ్స్, మరుగుదొడ్లు, హాస్టళ్లలో ఫ్యాన్లు పనిచేయడం లేదని తెలిపారు. పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలోనే పూర్తిస్థాయిలో బాత్రూమ్స్, మరుగుదొడ్లు, ఫ్యాన్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బాలికల హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో మహిళలే టీచర్లు, వర్కర్లుగా ఉండాలని నిబంధన ఉన్నా అందుకు భిన్నంగా పురుషులను నియమించడం ఏమిటని ప్రశ్నించారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లోని విద్యార్థులు ఏటూరునాగారంలో ఐటీఐ, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలకు వెళ్లివచ్చే సమయలో సరిగా బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెండింగ్లో ఉన్న అన్ని కళాశాలల ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నప్పటికీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, డీడీ పోచంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాగటి రవితేజ, టీఎల్ రవి, జిల్లా ఉపాధ్యక్షుడు కోకిల బాలు, జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి నర్సింగరావు, మండల నాయకులు రాకేష్, సాంబశివరావు, హేమంత్, జస్వంత్ సంతోష్ మహేష్ పాల్గొన్నారు. ఐటీడీఏను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకులు 163 జాతీయ రహదారిపై ధర్నా, విరమింపజేసిన పోలీసులు -
కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల సెమిస్టర్ పరీక్షల పలితాలు, దూరవిద్య కేంద్రం డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 31 శాతం, రెండో సెమిస్టర్లో 30 శాతం, మూడో సెమిస్టర్లో 35 శాతం, నాలుగో సెమిస్టర్లో 39 శాతం, దూరవిద్య మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24 శాతం ఉత్తీర్ణత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్కు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్లో చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం.తిరుమలాదేవి, జి.పద్మ, ఆసిం ఇక్బాల్, చిర్ర రాజు, వి.మహేందర్, పి.వెంకటయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.నేతాజీ, క్యాంపు ఆఫీసర్ ఎస్.సమ్మయ్య పాల్గొన్నారు. -
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఎస్ఎస్తాడ్వాయి: మండలకేంద్రంలో జాతీయ రహదారిపై నాయకులు మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మండల ఇన్చార్జ్ పల్లా బుచ్చయ్య హాజరై మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్లో మన సైనికుల వీరత్వానికి నిదర్శనంగా ప్రతీఇంటిపై జాతీయజెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలన్నారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో మేకింగ్ ఇండియాగా దేశం ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణాకర్రావు, మల్లెల రాంబాబు, జిల్లా కార్యదర్శి మెడిశెట్టి ఓంమ్రా, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జంగా హన్మంతరెడ్డి, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు -
బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
ములుగు రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు మైనారిటీలు పొందకూడదని బీజేపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. మాటల్లో బీసీ మంత్రం జపిస్తూ బిల్లు ఆమోదానికి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలైన గుజరాత్, యూపీ ఇతర రాష్ట్రాలలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ, తెలంగాణలో బీసీ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా బీసీలు తమ హక్కులను సాధించుకునేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తుమ్మల వెంకట్రెడ్డి, చిట్టిబాబు, సోమ మల్లారెడ్డి, ఆదిరెడ్డి, గొంది రాజేశ్, గుండబోయిన రవిగౌడ్, రత్నం, రాజేందర్, ప్రవీణ్, ఐలయ్య, రమేశ్, రాజు, కోటయ్య, రామస్వామి, దేవేందర్, సువర్ణ, భూక్య రాజు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా -
ఆదివాసీలను అంతంచేసే కుట్ర
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను అంతం చేసి అటవీ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర చేస్తుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను తతెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గట్టయ్య హాజరై మాట్లాడారు. సామ్రాజ్యవాదులు, బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలకు దేశంలోని అపారమైన ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. అడవిలో ఉన్న ఆదివాసీలను అంతం చేస్తూ హింస, నిర్బంధం కొనసాగిస్తుందన్నారు. కార్యక్రమంలో దుబాసి పార్వతి, సమ్మయ్య, దేవేందర్, బాపు, రాజమణి, శంకర్, సమ్మయ్య, రమేష్ పాల్గొన్నారు. -
మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ల ఏర్పాటు
భూపాలపల్లి అర్బన్: బొగ్గు ఉత్పత్తి పెంపు, యంత్రాల పనితీరు, కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను తెలియజేసేందుకు యాజమాన్యం మల్టీ డిపార్ట్మెంట్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం మల్లీడిపార్ట్మెంట్ టీమ్ల ఏర్పాటు కార్యక్రమాన్ని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఏరియాలో ఉద్యోగులందరికీ ప్రస్తుతం సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, యంత్రాల పనితీరు, ఉత్పత్తి వ్యయం విషయాలను గనులు, వివిధ శాఖల వారీగా తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మల్టీ డిపార్ట్మెంట్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ గనులు, విభాగాల నుంచి ఎంపికై న టీం సభ్యులకు అన్ని గనులు, విభాగాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు తెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జోతి, ఎర్రన్న, డాక్టర్ పద్మజ, ప్రసాద్, భిక్షమయ్య, రమాకాంత్, అరుణ్ప్రసాద్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్ పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ములుగు రూరల్: ములుగు ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి సీతక్క ఆదేశించారు. సోమవారం కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న రోగులను పలకరించి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల క్యాన్సర్ ఆపరేషన్ అయిన వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనరల్ విభాగంలో మైరుగైన వైద్యసేవలకు బిల్డింగ్ పైఅంతస్తు నిర్మాణం చేపడతామమని చెప్పారు. ఆస్పత్రిలో అన్ని రకాల ఆపరేషన్లు జరిగే విధంగా సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్ గఫర్, ఆర్ఎంఓ సంపత్, సిబ్బంది పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సీతక్క అన్ని రకాల ఆపరేషన్లు జరిగే విధంగా సదుపాయాలు కల్పిస్తామని హామీ -
వినతుల వెల్లువ
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో 15మంది గిరిజనుల నుంచి ఏపీఓ వసంతరావు, డీడీ పోచం వినతులు స్వీకరించారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు తలసేమియాతో బాధపడుతున్నాడని, ట్రైబల్ రిలీఫ్ ఫండ్, వికలాంగుల పింఛన్ ఇప్పించాలని వేడుకున్నారు. మంగపేట మండలం మల్లూరుకు చెందిన ఓ విద్యార్థి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి సీటు ఇప్పించాలని కోరారు. వాజేడు మండలం అయ్యవారిపేటకు చెందిన ఓ గిరిజన అభ్యర్థి ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో ఉపాధి కల్పించాలని వేడుకున్నారు. మహబూబాబాద్ మండలంలోని ఓ పేద మహిళ ఐటీడీఏ ద్వారా ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. గూడూరు మండలానికి చెందిన తన తండ్రి జీసీసీ సేల్స్మన్గా పనిచేస్తూ మరణించారని, ఆ ఉద్యోగం తనకు ఇప్పించాలని వేడుకున్నారు. కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో 52 సర్వే నంబర్లో సాగు చేసుకుంటున్నానని, ఆ భూమిని వేరే వారి పేరుమీద పట్టా చేసుకున్నారని, తనపై కబ్జాదారుడు దాడి చేసి గాయపర్చాడని న్యాయం చేయాలని ఓ బాధితుడు వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం చెందిన ఓ విద్యార్థికి జంగాలపల్లి ఎస్టీ గురుకులంలో 9వ తరగతి సీటు ఇప్పించాలని వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం బొల్లెపల్లికి చెందిన ఓ గిరిజన మహిళా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఏపీఓకు మొరపెట్టుకున్నారు. అలాగే ఇదే మండలం చల్వాయికి చెందిన గిరిజన నిరుద్యోగి జిరాక్స్ షాపు పెట్టుకునేందుకు రుణం మంజూరు చేయాలని విన్నవించారు. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన మాలతి నర్సు ట్రైనింగ్ పూర్తి చేశానని, ఏదైనా ఆస్పత్రిలో నర్సు పోస్టు ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం చెల్పాకకు చెందిన ఓ గిరిజన రైతు సోలార్ పంపుసెట్ కావాలని ఆర్జీ పెట్టుకున్నారు. ఏటూరునాగారం మండలం వీరాపురం గ్రామానికి చెందిన రైతు సోలార్ పంపుసెట్ కావాలని కోరారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో సైతు గుట్ట వద్ద కొత్త కరెంటు లైన్ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, జియాలజిస్ట్ అల్లెం కిషోర్, ఐటీఐ ప్రిన్సిపల్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడి -
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
విద్యారణ్యపురి: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర అప్పయ్య కోరారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని డీఈఓ వాసంతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలవిసర్జన తరువాత చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ గీత, ఎంఈఓ నెహ్రూనాయక్, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్మోహన్రావు, డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ హిమబిందు హెచ్ఎం ఉమ ల్గొన్నారు. మంచి పేరు తీసుకురావాలి కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్తోపాటు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. ఇనిస్టిట్యూట్లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం నూతన పీజీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్లో ఆయన మాట్లాడారు. నిట్లోని అత్యుత్తమ బోధనను అధ్యయనం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎమ్మెసీలో అందజేస్తున్న విద్యాబోధన, ల్యాబ్స్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. రుద్రతత్వమే విశ్వశక్తిహన్మకొండ కల్చరల్ : రుద్రతత్వమే విశ్వశక్తి అని, భగవంతుడి ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. శ్రావణమాసం మూడో సోమవారం ఉదయం రుద్రేశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. సాయంత్రం సహస్రనామార్చనలు ప్రదోషకాలపూజలు భజనలు జరిగాయి. ఈఓ ధరణికోట అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర విద్య ప్రవేశాల గడువు పొడిగింపు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూర విద్యాకేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ఓరియెంటేషన్ కోర్సుల్లో 2025–2026 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేశ్లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్ఐఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్ఐఎస్సీ కోర్సులతోపాటు మరో తొమ్మిది డిప్లొ మా, 14 సర్టిఫికెట్, ఏడు ఓరియంటేషన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో జత చేసి కోర్సు రుసుం ఆన్లైన్లోగానీ, దూరవిద్యాకేంద్రంలో క్యూఆర్ స్కాన్ద్వారా చెల్లించవచ్చని తెలిపా రు. కోర్సులు, ఫీజులు మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్సైట్లో చూడాలని సూచించారు. ఎన్జీఓతో ఆర్ట్స్కాలేజీ ఒప్పందంకేయూ క్యాంపస్: మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలు అన్నిరంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా లాంచ్ గర్ల్స్ ఎన్జీఓతో ఒప్పందం చేసుకున్నట్లు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి సోమవారం తెలిపారు. ఈ సంస్థ మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
హక్కుల సాధనకు ఉద్యమించాలి
ఎస్ఎస్తాడ్వాయి: గీత కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు పులి నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 18 వరకు చేపట్టిన అమరుల యాది కార్యక్రమం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై గీత కార్మికులు భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. వర్దెల్లి వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ మాట్లాడుతూ..ఏజెన్సీలో రద్దయిన సొసైటీలు పునరుద్ధరించి గీత కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అన్ని సొసైటీలకు చెట్ల పెంపకానికి భూమి కేటాయించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతీ గీత కార్మికుడికి ఎటువంటి షరతులు లేకుండా వృత్తి పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈసందర్భంగా ఇటీవల మృతి చెందిన తాడ్వాయి గ్రామానికి చెందిన గౌని అంజయ్య, తమ్మల సమ్మయ్యగౌడ్ స్ఫూర్తితో కల్లుగీత కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు గుండు శివశంకర్, పులి రవిగౌడ్, గడ్డం శ్రీధర్, బెల్లంకొండ రోశయ్య గౌడ్, మొక్క రాజు, కక్కర్ల వెంకటేశ్, మొక్క నరేశ్, చెవుగాని రఘు, గౌని మధు, పులి రాజు, పాలకుర్తి జగన్నాథం, బెల్లంకొండ రాజు, పాలకుర్తి ఉపేందర్, తీర్రి సంపత్, వడ్లకొండ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీలో గీత కార్మికుల సొసైటీలు పునరుద్ధరించాలి అమరుల యాది కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు -
పింఛన్లు తక్షణమే పెంచాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను తక్షణమే పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి చాతాళ్ల రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం మల్లంపల్లి మండలకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధులకు, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పింఛన్ల పెంపు కోసం సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మడిపెల్లి శ్యాంబాబు, కార్తిక్, సతీశ్, రాజేందర్, మొగిలి, నరేందర్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాతాళ్ల రమేశ్ -
రైతన్నకు రక్ష!
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025వెంకటాపురం(ఎం): రైతుబీమా పథకానికి దరఖాస్తు గడువు ఈనెల 13వ తేదీతో ముగియనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఆగస్టు 14న ఈ పథకాన్ని ప్రారంభించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. రైతుల పేరుపై ప్రభుత్వమే సంబంధిత కంపెనీకి బీమా ప్రీమియం డబ్బులు 100 శాతం చెల్లిస్తుంది. ప్రతీ ఏడాది పథకం కాలపరిమితి ఆగస్టు 14వ తేదీతో ముగుస్తుంది. వచ్చే ఏడాది (2025–26) కాలానికిగాను రైతుబీమా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న రైతుల జాబితాతోపాటు 2025 జూన్ 5వ తేదీ వరకు భూభారతి పోర్టల్ ద్వారా కొత్తగా పట్టాదార్ పాస్పుస్తకాలు పొందిన రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అర్హులైన రైతులు ఈ నెల 13వ తేదీలోగా తమ పూర్తి వివరాలతో సంబంధిత ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 86,736 మంది రైతులు జిల్లాలో 86,736 మంది రైతులు రైతుబీమా పథకంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూన్ 5 వరకు కొత్తగా పాస్బుక్కులు పొందిన రైతులతో పాటు గతంలో పాస్బుక్కులు పొంది బీమా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు కూడా ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతిఏటా ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.2,700ల చొప్పున ప్రీమియం చెల్లిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. రైతులు తమ ఆధార్కార్డు, పట్టాదారు పాస్బుక్కు, నామినీ ఆధార్కార్డుతో సంబంధిత ఏఈఓలను సంప్రదించాలి. గతంలో బీమాకు నమోదు చేసుకున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.అర్హులైన రైతులందరికీ వర్తింపు.. అర్హులైన ప్రతీ రైతుకు రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 86,736 మంది రైతులు బీమా పథకంలో కొనసాగుతున్నారు. 2024లోపు పట్టాదారు పాస్బుక్కు ఉన్ని 8,131 మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు. కొత్తగా పట్టాదారు పాస్బుక్కులు పొందిన 1,860 మంది రైతులతో పాటు గతంలో పాస్బుక్కులు ఉన్న 8,131 మంది రైతులు కూడా బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. – సురేశ్ కుమార్, ములుగు జిల్లా వ్యవసాయ అధికారిఅవగాహన కల్పిస్తున్నాం.. కొత్తగా పట్టాదారు పాస్బుక్కులు పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవడానికి అవగాహన కల్పిస్తున్నాం. దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్బుక్కు జిరాక్స్, పట్టాదారు, నామిని ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులను ఏఈఓలకు అందించి దరఖాస్తు చేసుకోవాలి. రైతుబీమాలో చేర్పులు, మార్పులు కూడా ఈనెల 12లోగా చేసుకోవాలి. – శైలజ, వ్యవసాయ అధికారి, వెంకటాపురం(ఎం)●న్యూస్రీల్రైతుబీమాతో కుటుంబానికి అండ రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 86,736 మంది రైతులు కొత్తగా 1,860 మందికి పట్టాదారు పాస్బుక్కులు దరఖాస్తు చేసుకోని పాత రైతులకూ అవకాశం జిల్లాలో కొత్తగా 1,860 మంది రైతులు ప్రతి సంవత్సరం రైతుబీమా కోసం వ్యవసాయ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అందులోభాగంగానే ఈ ఏడాది ఈనెల 11నుంచి 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2025 జూన్ 5 వరకు పట్టాదారు పాస్బుక్కులు పొందిన రైతులు 1,860 మంది ఉన్నారు. పట్టాదారు పాస్బుక్కులు పొందిన రైతులంతా బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో రైతుబీమా చేసుకున్న రైతులు ఏవైనా మార్పుల కోసం ఆధార్, నామినిలో మార్పులు చేసుకోవాలంటే ఈనెల 12లోగా సంబంధిత ఏఈఓలకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి మార్పులు చేసుకోవచ్చు. జిల్లాలో 2024–25 సంవత్సరంలో 218 మంది రైతులు మృతిచెందగా, రైతుబీమా కింద ఆయా కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ. 10.90కోట్లు పరిహారాన్ని కుటుంబసభ్యుల ఖాతాల్లో జమచేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. -
పూజారుల గదులను పట్టించుకోరూ?
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో నిర్మించిన పూజారుల గదులు మరమ్మతులకు చేరుకున్నాయి.గతంలో మహాజాతర సందర్భంగా సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల కోసం దేవాదాయ శాఖ ఆవరణంలో ప్రత్యేక గదులు నిర్మించారు. జాతర సమయాల్లో పూజారులు గదుల్లో ఉండి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గదులు మరమ్మతుకు రావడంతో పూజారులకు మళ్లీ పాత తొమ్మిది గదుల రేకుల షెడ్డు దికై ్కంది. కొన్ని గదుల కిటీకిలు, తలుపులు పగిలిపోయాయి.అలాగే టైల్స్ సైతం దెబ్బతిన్నాయి. దేవాదాయశాఖ అధికారులు పూజారుల గదులను పట్టించుకోకపోవడంతో మరమ్మతుకు చేరుకున్నాయి. అమ్మవార్లను కొలిచే పూజారుల గదులే ఇలా ఉంటే భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయో సంబంధిత అధికారులకే తెలియాల్సి ఉంది. ఇటీవల పూజారుల కోసం నూతన భవనం నిర్మించారు. కానీ మహాజాతర సమయంలో పూజారులకు గదులు చాలా అవసరం. జాతర సమయంలో భక్తుల రద్దీకి పూజారులు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. గద్దెల దగ్గర గదులు ఉండడంతో పూజా కార్యక్రమాలకు, అధికారులకు వారు అందుబాటులో ఉంటారు. దేవాదాయశాఖ అధికారులు స్పందించి గదులకు మరమ్మతులు చేపట్టాలని పూజారులు కోరుతున్నారు. -
దేశభక్తి కలిగి ఉండాలి
ములుగు రూరల్ : ప్రతీ పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్కుమార్ శ్రీవాత్సవ, సెకండ్ ఇన్ కమాండెంట్ జెగ్షేర్, డిప్యూటీ కమాండెంట్ ఎస్ిపీ రజిత పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బెటాలియన్ ఆధ్వర్యంలో ఆదివారం సీఆర్పీఫ్ అధికారులు డీఎల్ఆర్ నుంచి గాంధీ విగ్రహం వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దేశ సౌరభౌమత్వాన్ని కాపాడేందుకు దేశభక్తి కలిగి ఉండాలని వివరించారు. ఎందరో పోరాట యోధులు స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆ విష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమ ంలో 39 బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. నియామకం ఎస్ఎస్తాడ్వాయి : మండలంలోని మేడారం సమీపంలో గల రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దండుగుల మల్లయ్యను తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలుమల్లు ఆదేశాల మేరకు ఆదివారం హైదరాబాద్లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్.. మ ల్లయ్యకునియామక పత్రం అందజేశారు. మల్లయ్య మాట్లాడుతూ వడ్డెర కులస్తుల సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నా రు. రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన సంఘ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రేపటితో రైతుబీమా గడువు ముగింపుభూపాలపల్లి రూరల్ : అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం రెన్యూవల్ గడువు ఈ నెల 12వ తేదీతో ముగయనుంది. జిల్లాలోని రైతులంతా రైతుబీమాను రెన్యూవల్ చేసుకోవాలని, అదేవిధంగా కొత్త పట్టా పాస్బుక్ పొందిన రైతులు సైతం సంబంధిత రైతు వేదికల్లో ఏఈఓల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయశాఖ అధికారి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18నుంచి 59 ఏళ్ల వయసు గలవారు 2025, జూన్ వరకు భూభారతి ద్వారా పట్టా పాస్బుక్ పొందిన రైతులు అర్హులని పేర్కొన్నారు. రైతులు ఏదైనా ప్రమాదం, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల మరణించిన పక్షంలో నామినికి ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తారని వివరించారు. ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, ప్రతి ఏటా ఆగస్టు 15నుంచి తదుపరి ఆగస్టు 14 వరకు బీమా చెల్లుబాటులో ఉంటుందని వెల్ల డించారు. రెన్యువల్ లేదా కొత్తగా నమోదు కావాలనుకునే రైతులు సమీపంలోని ఏఈఓ లేదా రైతు వేదికలో గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని బాబు సూచించారు. 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ిసీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రానికి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. -
ఎండుతున్న పొలాలు
నీరులేక ఎండుతున్న వరిపొలంవెంకటాపురం(కె) : వానాకాలంలోనూ ఎండలు దంచికొడుతున్నాయి.. పాలెంవాగు ప్రాజెక్టు కింద సాగు చేసిన వరిపొలాలు నెర్రెలుబారి ఎండిపోతోంది. ఇంజిన్ల సాయంతో నీరు పారించేందుకు అన్నదాతలు నానాఅవస్థలు పడుతున్నారు. మండలంలో వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్న ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జూలైలో ఒక్కసారి భారీ వర్షం కురవడంతో అన్నదాతలు ముమ్మరంగా వరినాట్లు వేసుకున్నారు. ముందస్తుగా నాట్లు వేసుకున్న రైతులు సైతం వరుణుడి రాకకోసం ఎదురు చూస్తున్నారు. 20రోజులుగా వాన చినుకు జాడ లేకపోవడంతో వరి పొలాలు నీరులేక నెర్రెలుబారుతున్నాయి. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి వరిసాగు చేసిన అన్నదాతలు వాటిని కాపాడుకునేందుకు వాగులు, వంకల్లో ఇంజిన్ల పెట్టి వాటిసాయంతో నీటిని పారిస్తున్నారు. శిథిలావస్థలో కాల్వలు మండల పరిధిలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వఉన్న చివరి ఆయకట్టుకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. 10,125 ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రస్తుతం 2,000 ఎకరాలకు సాగు నీరు అందించలేక పోతోంది. ప్రాజ్టెకు పరిధిలోని కాల్వలు మరమ్మతుకు గురై శిథిలావస్థకు చేరుకున్నాయి. మల్లాపురం, రాచపల్లి, కర్రవానిగుంపు, ఒంటిమామిడి గ్రామ సమీపంలో ప్రాజెక్టు కాల్వలకు గండ్లు పడడంతో రైతులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రాజెక్టు కాల్వలకు మరమ్మతులు చేసి పూర్తిస్థాయి చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.పొలాల్లో చుక్కనీరు లేదు ఇరవై రోజులుగా వరి పొలానికి నీరు లేక ఎండిపోతుంది. వర్షం లేకపోవడంతో పొలాల్లో చుక్కనీరు లేదు. కిరాయికి ఇంజిన్ పెట్టి నీరు పెడదా మంటే, రోజుకు ఇంజిన్కు రూ.వెయ్యి, డీజిల్ కు మరో రూ.వెయ్యి ఖర్చవుతుంది. ప్రాజెక్టులో నీరు ఉన్న పంట పొలాలకు పూర్తిస్థాయిలో అందడం లేదు. – పోతురాజు, రైతు అప్పు చేసి సాగుచేసిన.. వరి పంట సాగుకు అప్పులు చేసిన. ప్రాజెక్టు ఉన్న పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేదు. మండలంలో 20రోజులుగా వాన చినుకు లేకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటినుంచి వరి పంటకు ఇంజిన్లతో నీరు పెట్టాలంటే కష్టంగా ఉంది. – కృష్ణ, రైతుకరుణించని వరుణుడు నెర్రెలుబారుతున్న పంటపొలాలు చినుకుజాడకు రైతుల ఎదురుచూపు పాలెం ప్రాజెక్టు ఉన్నా నిరుపయోగమే.. -
దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని, దేవాదుల పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనులు పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సందర్శించారు. తుపాలకుగూడేనికి హెలికాప్టర్లో చేరుకున్న మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వా నం పలికారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజీ వద్ద 59 గేట్లను పరిశీలించారు. నీటి నిల్వలు ఏ మేరకు ఉన్నాయని, గేట్లు ఎన్ని ఎత్తి, ఎన్ని మూశారని తెలు సుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయిలో దేవాదుల పంపుహౌస్ వద్ద ఉన్న గోదావరి నీటి నిల్వలను పరిశీలించి మోటార్ల ఎన్ని నడుస్తున్నాయని, ఎంత నీరు ఎత్తిపోశారని ఆరా తీశారు. ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు ప్రొజెక్టర్ ద్వారా మంత్రులకు దేవాదుల స్థితిగతులను వివరించారు. అనంతరం సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఈ హైలీ ప్రాజెక్టును టీడీపీ, బీఆర్ఎస్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అప్పుడు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్కు రూ.23వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే రూ.16 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందన్నారు. కావేరి, గోదావరికి అనుసంధానంగా 200 టీఎంసీల కెపాటీగల ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మంత్రులతో మాట్లాడి ఎన్ఓసీ కూడా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 6 లక్షల ఎకరాలకు సాగు నీరు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగాపెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు దీని అంచనాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 16.38 టీఎంసీల నుంచి 17.38 టీఎంసీలకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.16 కోట్లు దేవాదుల భూ నిర్వాసితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. 72 మీటర్ల నీటిని నిల్వ చేసుకొని మోటార్ల ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి అధికారుల పనితీరులో మార్పు రావాలి భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ పరిశీలనములుగు జిల్లాకు న్యాయం చేయాలి : మంత్రి సీతక్క ములుగు జిల్లాలో వంద కిలోమీటర్ల గోదావరి నీటి ప్రవాహం ఉందని మంత్రి సీతక్క అన్నారు. సమైక్య రాష్ట్రంలో ములుగుకు అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో న్యాయం చేయాలని ఆమె కోరారు. రామచంద్రపురం గ్రావిటీ కెనాల్ ద్వారా పాకాల, కొత్తగూడెం నీటి సరఫరా చేయాలి. పొట్లాపురం కెనాల్ కోసం సంబంధిత ఫైల్ను ప్రభుత్వం వద్ద ఉందని, దానిని పరిశీలించి బడ్జెట్ ఇవ్వాలి. గౌరారం, మల్లూరు, రామప్ప, లక్నవరం ప్రాంతాల్లోకి రైతులకు నీరు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసి పంటలకు నీళ్లివ్వాలని కోరారు. సమీక్షలో ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్పాటిల్, ఇరిగేషన్ ఈఈ జగదీశ్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, అప్సర్పాషా, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి
ఎస్ఎస్తాడ్వాయి : నిరక్షరాస్యతను అంతం చేసి, విద్యను అందించడం ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మండల తోగులో నిర్మించిన నూతన పాఠశాలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొత్తికోయ గూడెల్లో చిన్నారులకు విద్య అందించాలని, అందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అభయారణ్యంలోని పిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో పీపుల్ హెల్పింగ్ సెంటర్ ఎన్జీఓ సంతోష్ 2020 నుంచి తమ సేవలను అందిస్తున్నాడన్నారు. విద్య ప్రాథమిక హక్కు అని, గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క, కలెక్టర్, ఇతర అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి, చక్రవర్తి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మంత్రి ధనసరి సీతక్క -
రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ అద్భుతంగా ఉందని జపాన్ దేశానికి చెందిన టోమా సకా కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆమె ఆదివారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించారు. అదేవిధంగా ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సైతం అధికసంఖ్యలో రామప్పకు తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు.హేమాచలుడికి భక్తిశ్రద్ధలతో పూజలు మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల పేరిట పూజారులు గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. ముత్యాలమ్మకు బోనాలు వాజేడు: మండల పరిధిలోని పెద్దగొళ్లగూడెంకు చెందిన మహిళలు ముత్యాలమ్మకు ఆదివారం బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలంతా బోనాలతో గ్రామ సమీపంలో ఉన్న ముత్యాలమ్మ గుడికి ఊరేగింపుగా తరలివెళ్లారు. ముత్యాలమ్మ కొలువై ఉన్న చెట్టుచుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తమ కోర్కెలు నెరవేర్చాలని అమ్మవారికి బోనాలు సమర్పించారు. రైతులను, ప్రజలను చల్లంగా చూడుతల్లీ అంటూ వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. -
నులి పురుగులకు చెక్..
వెంకటాపురం(ఎం): ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ఎక్కువ మంది పిల్లలు బాధపడే సమస్యల్లో నులిపురుగులు ఒకటి. నులి పురుగులకు చెక్ పెట్టి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నప్పుడే చదువుతో పాటు జీవితంలో రాణిస్తారు. తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించి, శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పాటు అందించాలి. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నేడు (సోమవారం) మందుల పంపిణీకి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. అసలెందుకు వస్తాయి! అపరిశుభ్ర వాతావరణం, మురికి కాల్వలు, నీటి నిల్వ, జంతువుల మలం.. తదితర వాటితో నులి పురుగులు వ్యాప్తి చెందుతాయి. ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల ఈ సమస్య త్వరగా వ్యాప్తి చెందుతుంది. నిల్వ ఉన్న ఆహారంతో పాటు ఉడకని మాంసం, పులిసిన పదార్థాలు తీసుకోవడం వంటివి కూడా కారణమే. తీపి, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, మలబద్దకం ఉన్నా నులిపురుగులు తయారవుతాయి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోకపోవడం, చెప్పులు లేకుండా తిరగడం, పిల్లలు మట్టిలో ఆడుతూ ఆ చేతులను నోట్లో పెట్టుకోవడం కూడా ఈ సమస్యకు కారణమని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. నులిపురుగుల్లో బద్దె, నట్టలు, కొంకి, కొరడా, ఏలిక పాములు, దారపు, నీరుగడ్డ వంటి రకరకాల నులి పురుగుల రకాలు ఉన్నాయి. ఇవి ఎక్కువ శాతం చిన్నారుల పొట్టల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. లక్షణాలు ఇవే.. మలం వెళ్లే మార్గంలో దురద, అజీర్ణం, వాంతులు, విరేచనాలు, పొడి దగ్గు, నీరసం, కాలేయం పెరగడం, ఆడపిల్లల్లో తెల్లబట్ట కావడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన, బరువు తగ్గడం, పోషకాహారలోపం, కడుపు నొప్పి, చదువులో ఏకాగ్రత లేకపోవడం, ఎదుగుదల తగ్గడం, మలంలో రక్తం పడడం, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. జిల్లాలో 73,110 మంది పిల్లలు జిల్లా వ్యాప్తంగా 19 ఏళ్లలోపు పిల్లలు 73,110 ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. అంగన్వాడీ పరిధిలో 17,289 మంది, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 40,241 మంది పిల్లలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 15,580 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేడు(సోమవారం) 482 మంది ఆశ కార్యకర్తలు, 606 మంది అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఏఎన్ఎంలు సంబంధిత పాఠశాలలకు వెళ్లి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 11వ తేదీన గోలీలు వేసుకోలేని పిల్లలకు 18వ తేదీన మాప్ డేను పురస్కరించుకుని వేయనున్నారు.మాత్రలు వాడే విధానం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతనే పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి.అనారోగ్యంతో ఉన్న వారు పూర్తిగా కోలుకున్న తర్వాతనే మాత్రలు వేసుకోవాలి. ఏడాది వయస్సు ఉన్న వారికి, గర్భిణులు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులు, ఉదర సంబంధిత కేన్సర్ ఉన్న వారికి, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ఈ మాత్రలను ఇవ్వకూడదు. 1 నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారులకు సగం గోలి, 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకు ఒక టాబ్లెట్ను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 3 నుంచి 19 ఏళ్ల బాలురు మాత్రం గోలీని నమిలి మింగాలని చెబుతున్నారు. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ నేడు నులిపురుగుల నివారణ దినోత్సవం -
పొంచి ఉన్న ప్రమాదం
● రోడ్డు వెంట ఎండిపోయి శిథిలావస్థకు చేరుకున్న భారీ వృక్షాలుగోవిందరావుపేట: నిత్యం పర్యాటకులు, గ్రామస్తుల రాకపోకలతో రద్దీగా ఉండే బుస్సాపూర్– లక్నవరం రోడ్డు పై ఎండిపోయి ఉన్న భారీ వృక్షాలతో ప్రమాదం పొంచి ఉంది. కల్వరి, జాతీయత, రామవరం లాంటి వృక్షాలు పూర్తిగా ఎండిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎండిపోయిన చెట్ల కొమ్మలు రోడ్డు పై పడి ప్రమాదాలు తప్పిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అటవీ శాఖ, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులు ఎండిన చెట్లను తొలగించాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. -
సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు
ములుగు రూరల్: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నవీన్మిట్టల్, రెడ్ కో సీఎండీ, ఎన్పీడీసీఎల్ సీఎండి, సింగరేణి కాలరీస్ సీఎండీలతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పాదకతకు నివేదికలు తయారు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా వివరాలకు ఎనర్జీ డిపార్ట్మెంట్కు పంపించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో రూ.6.17లక్షల ఎకరాల్లో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు, కార్యాలయాలు, భవనాల వివరాలను అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. వీసీలో ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క -
యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించాలి
ములుగు రూరల్: సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ సహయ కార్యదర్శి అతిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం హెల్ప్లైన్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైబల్ యూనివర్సిటీ గత సంవత్సరమే ప్రారంభమైందని తెలిపారు. అయినా ప్రభుత్వం సొంత భవనం నిర్మించకుండా అద్దె భవనంలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. యూనివర్సిటీలో గిరిజనులకు 3 సీట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామెర కిరణ్, రవితేజ, తోకల రవి, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి అతిక్ -
సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం
భూపాలపల్లి రూరల్: సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం నడుస్తుందని.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గట్టయ్య మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నాయకులు నోరుమెదపడం లేదన్నారు. సంఘాలు కార్మికుల హక్కులను కాపాడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవి ములుగు రూరల్: నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఆదివాసీల ఐక్యత చాటుకోవాలన్నారు. ఆదివాసీ ఉద్యోగులు, యువత, మేధావులు హాజరుకావాలన్నారు. ఉదయం 11 గంటలకు డీఎల్ఆర్ ఫంక్షన్హాల్ నుంచి వైద్యారోగ్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం సమావేశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం రవికాంత్, నారాయణ, నాగేశ్వర్రావు, కుమారస్వామి, లక్ష్మీనారాయణ, బాబురావు, కృష్ణ భాస్కర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్ధనారీశ్వరుడిగా రామలింగేశ్వరస్వామి
వెంకటాపురం(ఎం): శ్రావణమాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామప్ప ఆలయంలోని రామలింగేశ్వరస్వామిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించినట్లు ఆలయ ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీశ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు, పర్యాటకులు రామప్ప ఆలయానికి తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేసినట్లు హరీశ్ శర్మ పేర్కొన్నారు. రేపు విద్యుత్ ఉపకేంద్రం పనులకు శంకుస్థాపన కన్నాయిగూడెం: మండలంలో ఏర్పాటు చేయనున్న 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన పనులకు రేపు(ఆదివారం) రాష్ట్ర మంత్రులు రానున్నట్లు ఎన్పీడీసీఎల్ విద్యుత్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలంలో పర్యటించి తుపాకులగూడెంలో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు కోసం విద్యుత్ అధికారులతో కలిసి రాజు చౌహన్ స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆదివారం మంత్రుల పర్యటన ఉన్నందున కావాల్సిన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ మల్సుర్ నాయక్, ములుగు, ఏటూరునాగారం డీఈ నాగేశ్వర్రావు, కన్నాయిగూడెం ఏఈ స్వామి పాల్గొన్నారు. నిట్తో నోయిడా మిస్టోటెక్స్ టెక్నాలజీ ఎంఓయూ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో నోయిడాకు చెందిన మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత, చలనం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపర్చే ఏఐ ఆధారిత పరిశోధన కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్కుమార్ మెహతా, ప్రొఫెసర్లు వెంకట్రెడ్డి, శంకర్, కె.వి.ఆర్ రవిశంకర్, అర్పణ్ మెహర్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, మిస్టోటెక్స్ సంస్థ తరఫున చేతన్కుమార్, మాజీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు పాల్గొన్నారు. ఓసీ–2ను అడ్డుకుంటాం.. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2లో వ్యవసాయ భూములు కోల్పోయిన ఫక్కీర్గడ్డ, ఆకుదారివాడలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పించాలని భూనిర్వాసితులు బుర్ర మనోజ్, రమేష్, రాజయ్య, రవి కోరారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎనిమిదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాయమాటలతో మభ్యపెడుతుందన్నారు. సింగరేణి సీఎండీ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. క్షుద్రపూజల కలకలం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆర్చిగేట్ దగ్గర ఆదిముక్తీశ్వర స్వామి ఆ లయానికి వెళ్లే రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నల్లకోడి, గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మద్యం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
సంక్షేమ పథకాల అమలు బీజేపీతోనే సాధ్యం
● పార్టీ జిల్లా కార్యదర్శి నరేష్ ఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి భర్తపురం నరేష్ అన్నారు. మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను శుక్రవారం ప్రజలకు వివరించారు. కరపత్రాల పంపిణీతో పాటు ఇంటింటికీ డోర్ స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామపంచాయతీ ట్రాక్టర్లు, పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులకు రూ.6 వేలు ఖాతాల్లో జమచేయడం వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి మోసం చేస్తుందన్నారు. 42శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు 10శాతం ఇచ్చేందుకు కుట్రపని బీసీలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొర్నెబెల్లి సేనాపతి, పిన్నింటి సంజీవరెడ్డి, అలెం రాకేష్, శ్రీకాంత్, వెంకన్న, సందీప్ పాల్గొన్నారు. -
ముందస్తు రాఖీ వేడుకలు
ములుగు రూరల్ : జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పోలు రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేడి చైతన్య, సరిత, శ్రీవాణి, సునీత, రమేష్, శంకర్, తేజస్వీనిదేవి, హర్ష, సునీల్, పద్మ తదితరులు పాల్గొన్నారు. మల్లంపల్లి బ్రిడ్జి పరిశీలన ములుగు రూరల్: జాతీయ రహదారిపై మల్లంపల్లి వద్ద ఉన్న పాత బ్రిడ్జి కుంగిపోవడంతో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అక్కడికి చేరుకుని పనులను పరిశీలించినట్లు తెలిపారు. వాహనదారులకు, ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్పాషా, చింతనిప్పుల భిక్షపతి, నల్లెల్ల భరత్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కారు.. ఆటో ఢీ
● ఎనిమిది మందికి గాయాలు ఏటూరునాగారం: ఓ కారు అదపుతప్పి కూలీ పనులకు వెళ్తున్న వారి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని ఏటూరునాగారంలో చోటుచేసుకుంది. ఈ క్రమంలో మొత్తంగా 8మంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కొండాయి వద్ద బ్రిడ్జి నిర్మాణం పనుల కోసం అస్సాం నుంచి కూలీలు వచ్చారు. బ్రిడ్జి వద్దకు పనులు చేసేందుకు వెళ్తుండగా హనుమకొండ నుంచి వెంకటాపురం మండలం ఆలుబాక వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను శుక్రవారం మండలం చిన్నబోయినపల్లి ప్రధాన రోడ్డుపై ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న అరుగురు కూలీలకు గాయాలు కాగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 8 మందిని హుటాహుటిన 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఇందులో కారులో ప్రయాణిస్తున్న ఆలుబాకకు చెందిన సాలురి యశ్వంత్కు తీవ్రగాయంకాగా కావడంతో అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్కు రెఫర్ చేశారు. మిగతా ఏడుగురికి గాయాలకు చికిత్సలు పొందారు. -
11న నులిపురుగుల నివారణ దినోత్సవం
ములుగు రూరల్: ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నులిపురుగుల నివారణపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. 11న అంగన్వాడీలు, ఆశ్రమ, గురుకుల, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు. దీంతో విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించడంతో పాటు శారీరక, మానసిక పెరుగుదల ఉంటుందని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు టీంలుగా ఏర్పడి విద్యార్థులకు మాత్రలు అందించాలని సూచించారు. పిలల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాలు ప్రోగ్రాం ఆఫీసర్ రణదీర్, జిల్లా తల్లి ఆరోగ్యము, పోషకాహార ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
నేడు రక్షా బంధన్
● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు ● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులుఅక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బంధాలకు విలువనివ్వాలి.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలుబచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతోంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతీ సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. -
మరోసారి పూజారుల సమావేశం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ అధికారులు, పూజారులు శుక్రవారం మేడారంలో మరోసారి సమావేశమయ్యారు. ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు పూజారులు సమావేశమయ్యారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేసే విషయంపై పూజారుల అభిప్రాయాలను దేవాదాయశాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై పూజారులు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరలకు వివరించిన తర్వాత తుది అభిప్రాయాలను ప్రకటిస్తామని పూజారులు సమావేశంలో తెలిపినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఈ నెల మేడారంలో 21న పొట్ట పండుగ నిర్వహించనున్నట్లు పూజారుల తెలిపారు. సంస్కృతి, సంప్రదాయంగా రెండు రోజుల పాటు పొట్ట పండుగ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పూజారులు సిద్ధబోయిన ముణిందర్, కొక్కర కృష్ణయ్య, చందా బాబురావు, చందా రఘుపతి, సారలమ్మ పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కాక కిరణ్, గోవిందరాజు పూజారి దబ్బగట్ల గోవర్ధన్, పూజారులు పాల్గొన్నారు. -
అడవుల్లో చెత్త వేయొద్దు
ఏటూరునాగారం: అడవుల్లో చెత్తాచెదారం వేయవద్దని, ప్లాస్టిక్ను నివారించాలని ఏటూరునాగారం ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. గురువారం మండలంలోని చిన్నబోయినపల్లి నుంచి ఏటూరునాగారం వరకు 163 జాతీయ రహదారికి ఇరువైపులా తన సిబ్బందితో కలిసి ప్లాస్టిక్, చెత్తాచెదారం సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తుందన్నారు. అడవులు, నీరు, భూమి, గాలిని కాలుష్యం చేయకుండా నివారించేందుకు మనవంతు సాయంగా ప్లాస్టిక్ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నారాయణ, సెక్షన్ ఆఫీసర్ బాలాజీ, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి చేపట్టాలిభూపాలపల్లి అర్బన్: సింగరేణిలో ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) సత్యనారాయణ కోరారు. భూపాలపల్లి ఏరియాలోని ఇల్లంద్ క్లబ్హౌజ్లో గురువారం 18వ రక్షణ ట్రైపాక్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గని ప్రమాదాల్లో మరణించిన వారికి మౌనం పాటించి, రక్షణ గురించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ భూగర్భ గనులలో వివిధ విభాగాలలో సీనియర్ ఉద్యోగులు కొత్త ఉద్యోగులకు మెళకువలు నేర్పించాలన్నారు. సింగరేణిలో జీరో ప్రమాదాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంఎస్ ఉమేష్, డీఎంఎస్ఎస్ ఆనంద్వెల్, డీడీఎంఎస్ సనత్ కుమార్, ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, రక్షణ జీఎం మధుసూదన్, వివిధ ఏరియాల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.సమస్యలు పరిష్కరించడంలో విఫలం : ఐఎన్టీయూసీభూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కేటీకే 5వ గనిలో జరిగిన నిరసన కార్యక్రమానికి జోగు బుచ్చయ్య మాట్లాడారు. జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్మెన్, ఈపి ఆపరేటర్లకు సర్ఫెస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి 14వ తేదీన ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు రాజు, సంపత్ రావు, రాజేష్ ఠాకూర్, రవి, కిరణ్, అశోక్, అజీమ్, శ్రీనివాస్, నవీన్, కుమార్, రాము, సమ్మయ్య పాల్గొన్నారు.యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలిభూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా కమిటీ సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదన్నారు. సమగ్రమైన వివరాలతో పూర్తి సమాచారంతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్, శ్రీకాంత్, దేవేందర్, సుజాత, కవిత, స్వర్ణ, స్వాతి పాల్గొన్నారు.నేడు కాళేశ్వరాలయంలో వరలక్ష్మీవ్రతాలుకాళేశ్వరం: శ్రావణమాసం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం శుక్రవారం సందర్భంగా (నేడు)సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ ఎస్.మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు. -
నాణ్యమైన విద్య అందించాలి
ములుగు రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర పరిశీలకుడు, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎంఈఓలు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6, 7 తేదీలలో ప్రాథమిక పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విద్యార్థులకు చేరేలా చూడాలని అన్నారు. ఉల్లాస్ రిసోర్స్ పర్సన్ల శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్ అప్పని జయదేవ్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గ్యాదరి రమాదేవి, సాంబయ్య, వయోజన విద్య నోడల్ ఆఫీసర్ వేణుగోపాల్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఉల్లాస్.. నిరక్షరాస్యత ఖల్లాస్!
ఉల్లాస్ ప్రారంభానికి సన్నాహాలు.. స్వయం సహాయక సంఘాల్లోని 15 ఏళ్లపైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఇన్ సొసైటీ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఆగస్టు–సెప్టెంబర్లో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వయోజన విద్య అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. 2025–2026 సంవత్సరానికి ప్రతి జిల్లాలో కొంతమందిని గుర్తించారు.విద్యారణ్యపురి: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేంద్దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉల్లాస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ‘అందరికి చదువు–అందరి బాధ్యత’ అనే నినాదంతో 1,61,613 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేఽశం. అక్షరాస్యత ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్ష్యరాస్యులైన మహిళలకు ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ (ప్రాథమిక అక్షరాస్యత అభ్యసన సామర్థ్యాలు), జీవన నైపుణ్యాలు, అలాగే సమాంతర విద్యను బోధిస్తారు. ఆ తర్వాత అర్హులకు 3, 5 తరగతులు, ఆపైన ఇప్పటికే చదువుకున్న వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్లో ప్రవేశాలు కల్పించేలా ప్రోత్సహిస్తారు. అవసరమైన వారికి వృత్తివిద్య, నిరంతర విద్యను అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను ఇటీవల అధికారులు గుర్తించారు. వీరిని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా వయోజన విద్య అధికారులు ముందుకు సాగుతున్నారు. వారిని ఉల్లాస్ యాప్లో నమోదు చేస్తారు. మిగిలిపోయిన నిరక్షరాస్యులు ఉంటే 2026–2027 వరకు వంద శాతం అక్షరాస్యులుగా తీర్దిదిద్దాలనేది ఉల్లాస్ కార్యకమ లక్ష్యంగా ఉంది. టీచర్లకు శిక్షణ ఉల్లాస్ కార్యక్రమం అమలులో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ముగ్గురు రెగ్యులర్ టీచర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 18 మంది టీచర్లు శిక్షణ పొందారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశానుసారం గురువారం భూపాలపల్లి జిల్లాతోపాటు వరంగల్ రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు అధికారి రమేశ్రెడ్డి, హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి ఉపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన మూడు జిల్లాల్లో వెసులుబాటును బట్టి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 12న మండల స్థాయిలో ఒక టీచర్, అలాగే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19న గ్రామస్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లకు శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. సామాజిక చైతన్య కేంద్రాల ఏర్పాటు నిర్లక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి 8 లేదా 10 మందికి ఒక వలంటీర్ విద్యాబోధన చేస్తారు. అంతేకాకుండా టీవీ చానల్స్, ఉల్లాస్ యాప్, ఎస్సీఆర్టీఈ రూపొందించిన దీక్ష పోర్టల్ ద్వారా వయోజనులకు బోధన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బోధనకు ముందుకు వచ్చే వలంటీర్తో బోధన చేయిస్తారు. ఇందుకోసం వలంటీర్ టీచర్లను కూడా ఎంపిక చేశారు. వలంటీర్లతో విద్యాబోధన మహిళా స్వయం సహాయక సంఘాలల్లోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించాం. ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లు వయోజనులకు బోధన చేస్తారు. ఒక్కో మహిళకు అక్షర వికాసం వాచకం అందజేస్తారు. అవి ఇప్పటికే జిల్లాలకు కొన్ని చేరుకున్నాయి. ప్రతీ ఏడాది మార్చి– సెప్టెంబర్ నెలలో జరిగే ఎన్ఐఓఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పరీక్ష నిర్వహిస్తాం. – టి.రమేశ్రెడ్డి, వయోజన విద్య ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్నిరక్షరాస్యులైన మహిళల వివరాలు..హనుమకొండ 28,904 వరంగల్ 29,739. ములుగు 7,581 జనగామ 24,137 భూపాలపల్లి 29,484నిరక్ష్యరాస్యులైన అతివలను అక్షరాస్యతవైపు స్వయం సహాయక సభ్యులందరికీ చదువు జిల్లాల్లో టీచర్లకు శిక్షణ కూడా షురూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,61,613మంది నిరక్ష్యరాస్యుల గుర్తింపు -
నిఘానీడలో..
ఏటూరునాగారం: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. నేరాలను నియంత్రించేందుకు మండల కేంద్రాలతోపాటు మారుమూల గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, మండల ప్రధాన రోడ్లు, కూడళ్లు, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తూ నేరగాళ్ల ఆటను కట్టిస్తున్నారు ములుగు జిల్లా పోలీసులు. విద్యుత్ సరఫరా, ఓఎఫ్సీ, సోలార్ కనెక్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉన్న లేకున్నా నిరంతరం నడిచే విధంగా కావాల్సిన బ్యాటరీ బ్యాకప్, మెమరిలను అమర్చి రికార్డు అయ్యేలా చూస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 380 కెమెరాలను పోలీస్స్టేషన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు.సీసీ కెమెరాలతో పోలీసులు ఛేదించిన కేసులు..● ములుగు మండలం దేవగిరిపట్నానికి చెందిన వ్యక్తిని ఓ ప్రేమ్నగర్ సమీపంలో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ కేసులో బండారుపల్లి క్రాస్రోడ్డులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను గుర్తించి ఆ వాహనాల డ్రైవర్లను పిలిచి విచారణ చేపట్టారు. ప్రమాదం చేసిన డ్రైవర్ నేరాన్ని అంగీకరించాడు.● గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని ఆంజనేయస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయ పరిధిలో ఇటీవల చోరీ జరిగింది. పస్రా పోలీసులు ఆలయాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఒక టీం ఏర్పడి ఆ నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు.● ఏటూరునాగారం సాయిబాబా దేవాలయంలో ఇటీవల చోరీ జరిగింది. సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దొంగలను ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.సీసీ కెమెరాల పనితీరు ఇలా..బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలను చూసి రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై వాహన చట్టం ద్వారా కేసులు నమోదు చేస్తున్నారు. హైస్పీడ్ డ్రైవింగ్ను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టారు. అలాగే, రామప్ప, మల్లూరు, లక్నవరం, బొగత, తుపాకులగూడెం బ్యారేజ్ దేవాదుల, మేడారం సమ్మక్క–సారలమ్మ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెద్ద మాల్స్, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గోవులు, ఇసుక అక్రమ రవాణా, వేబ్రిడ్జి వద్ద తూకంలో తేడాలను సైతం గుర్తించేలా కెమెరాలు ఏర్పాటు చేశారు.మత్తుపదార్థాల నియంత్రణ..రాత్రి వేళ మత్తుపదార్థాలు రవాణా జరుగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. మహిళలపై జరిగే నేరాలు, కళాశాలలు, బస్టాప్ల వద్ద ఆకతాయిల వెకిలి చేష్టలను నియంత్రిస్తున్నారు. నిందితులకు తగిన పద్ధతిలో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. గంజాయి, కొకై న్, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న కొన్ని బేకరీలను గుర్తించి కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి.మూడో కన్నుతో పర్యవేక్షణఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రధాన రోడ్ల వెంట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మూడో కన్నులాగా పర్యవేక్షణ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లే విధంగా సీసీ కెమెరాలను అనుసంధానం చేశాం. నిరంతరం పనిచేసేందుకు సోలార్ కెమెరాలను కూడా అమర్చాం. ఎలాంటి సంఘటనలు అయినా వెంటనే పసిగట్టేలా ఏర్పాట్లు చేశాం. ప్రజల రక్షణే మాకు ధ్యేయంగా పనిచేస్తాం.– శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ ఏటూరునాగారంనేరం చేస్తే తప్పించుకోలేరుములుగు జిల్లా మొదలు కొని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దు వరకు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నేరం చేస్తే తప్పించుకునే అవకాశం లేదు. ఒక ప్రదేశం కాకుండా మరో ప్రదేశంలోనైనా సీసీ కెమెరాలకు చిక్కాల్సిందే. నక్సల్స్ ప్రాంతం కావడంతో మరింత కట్టుదిట్టంగా పక్కా ప్రణాళికతో కెమెరాలను ఏర్పాటు చేయించాం. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాలు అయినా వెంటనే పసిగట్టి నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం జరుగుతుంది. – శబరీష్, ఎస్పీమండలాల వారీగా ఏర్పాటు చేసిన కెమెరాలుమండలాలు; కెమెరాలుఏటూరునాగారం; 42మంగపేట; 54తాడ్వాయి; 39కన్నాయిగూడెం; 31వాజేడు; 32వెంకటాపురం(కె); 38గోవిందరావుపేట; 39వెంకటాపురం(ఎం); 40ములుగు; 65మొత్తం; 380 -
జ్వరాలపై దృష్టి పెట్టాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం/మంగపేట: జ్వరాలపై వైద్యులు, సిబ్బంది దృష్టిపెట్టాలని ఆరోగ్యశాఖ కీటక జనిత నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఏటూరునాగారం సామాజిక ఆరోగ్య కేంద్రం, బ్లడ్ బ్యాంక్, మంగపేట, చుంచుపల్లి పీహెచ్సీలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమర్సింగ్ మాట్లాడుతూ ఏజెన్సీలో డెంగీ, మలేరియా వచ్చే హైరిస్క్ గ్రామాలు ఉన్నందున విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అలసత్వం ప్రదర్శించకుండా వైద్యసేవలు అందించాలని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్న వారికి డెంగీ, మలేరియా, ఆర్టిటీ, ఎలిషా పరీక్షలు చేయాలని అన్నారు. బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపులకు సంబంధించిన రక్త నిల్వలను ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విఫిన్కుమార్, జిల్లా కీటక జనిత నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్, సైదులు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అడిషనల్ డైరెక్టర్ గఫూర్, టీహబ్ నోడల్ ఆఫీసర్ ప్రవీణ్, ఏఎంఓ దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రసాద్ పాల్గొన్నారు.కీటక జనిత నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ములుగు రూరల్: విధి నిర్వహణలో వైద్యాధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట ఆస్పత్రుల వైద్యాధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ ల్యాబ్లు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు రక్త పరీక్షలకు అవసరమయ్యే పరీక్ష సామగ్రి వర్షాకాలమంతా సరిపడేలా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న ప్రతీ వ్యక్తికి డెంగీ, మలేరియా పరీక్షలు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ శాఖ అధికారుల సమన్వయంతో పరిసరాల పరిశుభ్రత చేయించాలని వెల్లడించారు. దోమల నివారణకు యాంటీ లార్వా స్పెయింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత జిల్లా పోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, మధు, నిఖిల్, నాగన్వేష్, దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బొడ్డు ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
పోచమ్మ బోనాలు
గోవిందరావుపేట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం పోచమ్మ తల్లికి బోనాలతో తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నుంచే బోనం తయారుచేసుకున్న మహిళలు ఆలయానికి తరలివెళ్లి అమ్మవారికి నైవేధ్యాన్ని సమర్పించారు. భక్తులంతా పోచమ్మ తల్లిని వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని మొక్కుకున్నారు.ప్రతిఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలికన్నాయిగూడెం: గ్రామంలోని ప్రతిఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని ఆర్బీఐ డీజీఎం జగదీశ్ అన్నారు. మండల కేంద్రంలో ఎస్ఎస్తాడ్వాయి సీఎఫ్ఎల్ ఆధ్వర్యంలో పీఎంజేజేబీవై పథకంపై బుధవారం క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. 18 నుంచి 70 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండడంతో పాటుగా ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన కింద సంవత్సరానికి రూ.20 కట్టుకోవాలన్నారు. 50ఏళ్ల లోపు వారు రూ.436 బ్యాంకు ఖాతాల్లో కట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఏపీఎం రెడ్డి, సీసీ సుదీష్ణ, టీజీఐపీపిల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.కేజీబీవీని తనిఖీ చేసిన డీఈఓములుగు రూరల్: ములుగు పరిధిలోని మాధవరావుపల్లి కేజీబీవీని డీఈఓ చంద్రకళ బుధవారం తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న భోజనం, మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి, విద్యార్థులకు బోధించడంతో పాటు పాఠ్యాంశాలపై వారికి ఉన్న మేధాశక్తిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ జీవనప్రియ, ఉపాధ్యాయులు ఉన్నారు.ముస్లిం రిజర్వేషన్ల అమలుకు కుట్రములుగు రూరల్: కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు సైతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద కుట్ర పూరితంగా ధర్నా చేపట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆరోపించారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 10 శాతం ముస్లింలకు కేటాయించాలని ప్రయత్నం చేస్తుందన్నారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, సురేందర్, స్వరూప, జవహర్ లాల్, రవీంద్రాచారి, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీలక్ష్మి, గార్ల -
జయశంకర్ సేవలు మరువలేనివి
ములుగు రూరల్: తెలంగాణరాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వరాష్ట్ర ఏర్పాటుకు చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. కలెక్టరేట్లో బుధవారం జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జయశంకర్ సార్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొని ఉద్యమానికి మార్గదర్శకుడిగా నిలిచారని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్, డీపీఆర్వో రఫిక్, కలక్టరేట్ ఏఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జెడ్పీ కార్యాలయంలో జయశంకర్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంపత్రావు సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అర్హులందరికీ పింఛన్లు ప్రతినెలా అర్హులందరికీ పింఛన్లు అందేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం అమలుపై ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్, పంచాయతీ కార్యదర్శులకు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పింఛన్ అర్హత ఉన్న వారికి ప్రతినెలా అందేలా కృషి చేయాలన్నారు. అనర్హులను గుర్తించి తొలగించాలని సూచించారు. ముఖచిత్రం ద్వారా పింఛన్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. టీజీ సెర్ప్ పెన్షన్ డైరెక్టర్ గోపాల్రావు, అదనపు కలెక్టర్ సంపత్రావు చేయూత పెన్షన్పై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవ్రాజ్, అదనపు డీఆర్డీఓ గొట్టె శ్రీనివాస్, ములుగు మున్సిపల్ కమిషనర్ సంపత్, టీజీ ఆన్లైన్ ప్రతినిధి రాజు అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును గమనించారు. ప్రతీ విద్యార్థి లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఉపాధ్యాయులకు, నిర్వాహకులను ఆదేశించారు. భోజనం మంచిగా ఉంటుందా లేదా అని విద్యార్థులను కలెక్టర్ ప్రశ్నించగా బాగానే ఉంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ కమిటీ చాలా కీలక పాత్ర పోషించాలని, తప్పనిసరిగా కమిటీ సభ్యులు భోజనం తిని మంచిగా ఉందని నిర్ధారణ చేసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని సూచించారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
వెంకటాపురం(ఎం): ఆయిల్పామ్ తోటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సంజీవరావు అన్నారు. మండల కేంద్రంలో కేఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ బుధవారం నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన నరెడ్ల శ్రీనివాస్ వ్యవసాయ భూమిలో ఐదెకరాల విస్తీర్ణంలో ప్లాంటేషన్ ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుకు రైతులు ఎకరానికి రూ.1140 లు చెల్లిస్తు రైతులకు 57 మొక్కలు అందిస్తామన్నారు. నాలుగేళ్ల వరకు ఎకరానికి రూ.4,200 చొప్పున అంతర పంటల సాగుకు ఇస్తారని తెలిపారు. జిల్లాలో 2022–23లో 820 ఎకరాలు, 2023–24లో 834 ఎకరాలు, 2024–25లో 909 ఎకరాల్లో ఆయిల్పామ్ పంటలు సాగు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 343 ఎకరాల్లో అయిల్పామ్ సాగు అయినట్లు వెల్లడించారు. నాలుగవ సంవత్సరంలో మొదటి కోత 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. 7వ సంవత్సరం నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు. ఎరువుల వాడకం, నీటి యాజమాన్య పద్ధతులను రైతులు అవలంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారి శ్రీకాంత్, ఉద్యాన విస్తీర్ణ అధికారి రమేష్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సంజీవరావు -
ఈఓ కార్యాలయంపై పట్టింపేది?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. అనుగుణంగా వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఐటీడీఏ కార్యాలయం మాత్రమే నిర్మించారు. ప్రస్తుతం రెవెన్యూ, అతిథిగృహం, పీఆర్ గెస్ట్హౌస్, పూజారుల భవనం నిర్మించారు.. ఇలా అన్ని వసతులు ఉన్నా ఈఓ కార్యాలయ భవన నిర్మాణం గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్లు గడస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏడాది పొడువునా భక్తులే.. మేడారంలో రెండేళ్లకోసారి ఏడాది మధ్యలో జరిగే చిన్న జాతర సమయంలోనూ కోటి మందికిపైగా భక్తులు హాజరవుతున్నారని అధికారుల అంచనా. మహాజాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా మేడారానికి భక్తులు తరలిస్తున్నారు. బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సుమారుగా ఐదు వేల మందికిపైగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కానుకల ద్వారా అదాయం వస్తున్నా దేవాదాయశాఖ అధికారులకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో కనీసం భక్తులకు తాగునీటి వసతి కూడా కల్పించకపోవడం గమనార్హం. మీడియా పాయింటే.. ఈఓ కార్యాలయం మేడారంలో మీడియా పాయింట్ మంచె ఈఓ కార్యాలయంగా మారింది. ప్రస్తుతం ఉన్న జాలి గదిని సైతం గత జాతరలో కూల్చివేశారు. ఆరు జాతరలకు రెగ్యులర్ ఈఓలను నియమించకుండా ఇన్చార్జ్లను నియమించడంతోనే ఆలయ అభివృద్ధి వెనుకబాటుకు కారణమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.మేడారంలో భవన నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని సర్కారు హనుమకొండలోని ధార్మిక భవనంలోనే మేడారం ఈఓ కార్యాలయం హనుమకొండలోని ధార్మిక భవనంలోనే.. భక్తుల సౌకర్యాలపై ధర్మాదాయ దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మేడారంలో ఈఓ కార్యాలయం నిర్మాణంపై ఏళ్లు గడుస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతర 2006లో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. స్వరాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఈఓ కార్యాలయం మాత్రం నిర్మాణానికి నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. హనుమకొండలో నిర్మించి న ధార్మిక భవనంలోనే మేడారం ఈఓ కార్యాల యం కొనసాగుతోంది. అక్కడి నుంచే జాతర నిర్వహణ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. జాతర పనుల నిమిత్తం మాత్రమే దేవాదాయశాఖ అధికా రులు మేడారానికి వస్తున్నారే తప్పా మిగితా రోజు లన్నీ కార్యాలయానికే పరిమిత మమవుతున్నారు. ఈఓ కార్యాలయం నిర్మించాలి.. మేడారంలో ఈఓ కార్యాలయం నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. మహాజాతర సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా మేడారానికి భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. ఎండోమెంట్ కార్యాలయం నిర్మించడం వల్ల భక్తులకు దేవాదాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సారి మహాజాతర నాటికి మేడారంలో ఈఓ కార్యాలయం ఏర్పాటు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – సిద్ధబోయిన స్వామి, సమ్మక్క పూజారి -
స్టోన్ క్రషర్లపై ‘మైనింగ్’ కత్తి
అక్రమాలకు ఇక అడ్డుకట్ట.. ఉమ్మడి వరంగల్లో సుమారు 360కి పైగా కంకర క్రషర్లు, 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 29 బ్లాక్, 33 కలర్ గ్రానైట్, 64 స్టోన్ మెటల్, క్వార్ట్జ్, గ్రావెల్ క్వారీలు రెండు కలిపి 128 ఉన్నాయి. ఇందులో సగం వరకు రాజకీయ నాయకులు, వారి అనుచరులవే ఉన్నాయి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తున్నా, అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాడ్ చేసినా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.ఐదు లక్షల జరిమానా విధించే చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. కొన్నేళ్లుగా రూ.కోట్ల విలువ చేసే రాతి ఖనిజం కంకర, గ్రానైట్ రూపేణా దోపిడీకి గురైంది. తవ్వి తరలించిన దానికి.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టే సమయంలో చూపించే లెక్కలకు పొంతన లేకపోగా.. 30 నుంచి 50 శాతం వరకే చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లీజు పరిమితి తీరినా.. ఇంకా గ్రానైట్, కంకర క్వారీలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్స్టిక్స్ను సరైన భద్రతా చర్యలు లేకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై సమీక్షలు చేసిన గనులశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్వారీల వారీగా లీజు అగ్రిమెంట్లు పరిశీలిస్తూ లీజు, రాయల్టీ బకాయిల లెక్కలు తీస్తోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్ల అక్రమ దందాను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని రూ.లక్షల్లో కాజేస్తున్న నిర్వాహకులపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలు, రోడ్, స్టోన్ మెటల్ (కంకర) క్రషర్ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు గనులశాఖ దృష్టి సారించింది. ఇందుకు ప్రభుత్వ భూముల్లో గుట్టలు, మైనింగ్కు అనువైన స్థలాలను గుర్తించి టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొదట ఏడు క్వారీలు.. ప్రభుత్వ స్థలాలు, గుట్టలను గుర్తించి గ్రానైట్, కంకర క్వారీలను టెండర్ల ద్వారా కేటాయించేందుకు శ్రీకారం చుట్టిన గనులశాఖ.. మొదట ఉమ్మడి జిల్లాలో ఏడు క్వారీల టెండర్లు ఈ నెల 12 ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఊరుగొండలో రెండు స్టోన్ మెటల్, రెండు కలర్ గ్రానైట్ క్వారీలు, ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఈ టెండర్లలో ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో కంకర క్వారీ, జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఒకటి, జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో ఒకటి చొప్పున రెండు క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. కాగా, గనుల శాఖ నోటిఫికేషన్ మేరకు జూలై 17న డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 6 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూముల్లో క్రషర్లు నడుపుతూ రాయల్టీ, లీజు డబ్బులు చెల్లించని 22 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, కంకర, గ్రానైట్ కోసం తీసిన రాయికి రాయల్టీ కట్టని వారు.. గనులశాఖకు సూచించిన క్యూబిక్ మీటర్లను మించి రాయి తీసి తనిఖీల్లో దొరికి పెనాల్టీ చెల్లించని వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 10–15 రోజుల్లో సదరు నిర్వాహకులు స్పందించకుంటే ఆ లీజులు సైతం రద్దు చేసి టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు.రాయల్టీ, లీజు తదితర బకాయిదారులపై దృష్టి లీజు రద్దు చేసి టెండర్ల ద్వారా కేటాయించే యోచన ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏడు గ్రానైట్ క్వారీలు, క్రషర్లు ముగిసిన టెండర్ల ప్రక్రియ.. త్వరలో అర్హులకు కేటాయింపు -
గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు
సాక్షి, మహబూబాబాద్ : గిరిజన(లంబాడ) కన్నెపిల్లలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. ఈ నెలలో పండుగను ప్రతీ గురువారం ఏదో ఒక తండాలో జరుపుకుంటారు. నేడు (గురువారం) ఉమ్మడిజిల్లాలోని పలు తండాలు తీజ్ పండుగకు ముస్తాబయ్యాయి. ప్రకృతి సిద్ధంగా శ్రావణంలో వర్షాలు కురవడంతో ఆకాశం నుంచి కిందికి వచ్చే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అంటారు. ఆ అందమైన పురుగులు దేవుడు మనకోసం కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు కన్నె పిల్లలు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. మా తాండేరో జోత్ తీజ్ (తండాల్లో వెలుగు తీజ్) అంటూ పండుగకు సిద్ధమయ్యారు. ● ఏడో రోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో(రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి నేవైద్యం పెడతారు.● ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటిని గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేస్తారు. ● తొమ్మిదో రోజున డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను ఇచ్చి ఆశీర్వాదం అందిస్తారు.● లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు.● తీజ్ (గోధు మ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు(ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగ లతో బుట్టలు అల్లుతారు.● పెండ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సి న పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలుపెడతారు.సంప్రదాయ పాటలు● లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. తీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలిస్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీనిని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత.మొదటి రోజు : లాంబి లాంబియే లాంబడీ ఏకెరీయో... తోన కుణ బొరాయో తీజ్.. సేవాభాయ బొరాయో తీజ్.. (గునుగుపూల వలె ఎదుగుతవమ్మా.. నిను కొలిచే వారెవరమ్మా.. సేవాలాల్ మహరాజ్ అలికి కొలుస్తారమ్మా తీజ్..) అని పాడుతూ తొలిరోజు వేడుకలు జరుపుకుంటారు.చివరి రోజు : తూ కతేతి ఆయోరే దుదియా తళవో.. మారో తీజేరో జోత్ లేయి చాలో.. డగేరేచాలో.. (ఎక్కడినుంచి వచ్చావో దుదియా చెరువు.. తొమ్మిది రోజులు పెంచుకున్న తీజ్ తండా వెలుగును తీసుకుని వెళ్తున్నావు) అంటూ పెళ్లికాని అమ్మాయిలు పాటలు పాడుతూ తీజ్ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. -
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ఏటూరునాగారం: విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలిసి మంగళవారం సందర్శించారు. వంటశాల, భోజనం నాణ్యత, స్టోర్ రూము, కూరగాయల నిల్వలు, హాజరు పట్టికపై విద్యార్థులు రాసిన ఫీడ్ బ్యాక్, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. ఉదయం చేసిన టిఫిన్ బాగుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో కలిసి వెళ్లి వైటీసీలో ఉన్న 25మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం పరికరాలను పరిశీలించారు. వాటి పనితీరును ఎన్డీఆర్ఎఫ్లు సీఎస్కు వివరించారు. ఆపదలో ఉన్న సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, మండల ప్రత్యేకాధికారి రాంపతి, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ -
డుమ్మాలకు చెక్ పడేనా!
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమలు– 10లోu337 స్కూళ్లలో 16,883 మంది విద్యార్థులు జిల్లాలోని 9 మండలాల పరిధిలో 337 పాఠశాలల్లో 16,883 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 1,557 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఇప్పటివరకు 1,510 మంది ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలులోకి వచ్చింది. సాంకేతిక సమస్యలతో మిగిలిన ఉపాధ్యాయులు ఇంకా ఎఫ్ఆర్ఎస్ పరిధిలోకి రాలేదు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే ఉదయం 9.15 గంటలకు ఒకసారి, సాయంత్రం 4.15 గంటలకు ఒకసారి యాప్లో వారి హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ ద్వారానే విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పక్కాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు గతేడాది నుంచి ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తుండగా ఉపాధ్యాయులకు ఈ నెల 1నుంచి అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్) యాప్ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్ఎంలు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల హాజరు అమలులోకి వచ్చింది. హెచ్ఎంలు తమ సెల్ఫోన్లోని డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లో టీచింగ్ మాడ్యుల్ టీచర్స్, నాన్ టీచింగ్ సిబ్బందిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సెల్ఫోన్లో సంబంధిత యాప్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ను వేయాల్సి ఉంటుంది. పాఠశాల ఆవరణలో ఉండి హాజరువేసేలా జియోట్యాగింగ్ చేశారు. సెలవు పెడితే తప్పనిసరిగా యాప్లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సెలవును మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన సమయానుగుణంగానే ఈ యాప్లో ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాలి.● జిల్లా వ్యాప్తంగా 337 పాఠశాలల్లో 16,883 మంది విద్యార్థులు ● గతేడాది నుంచే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ ● ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలువెంకటాపురం(ఎం): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గతేడాది నుంచి విద్యార్థుల హాజరును ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టగా తాజాగా టీచర్లకు సైతం ఆన్లైన్ విధానం ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషియన్ సిస్టమ్)ను ప్రవేశ పెట్టింది. దీని ద్వారా సమయానికి పాఠశాలకు ఉపాధ్యాయులు రావడంతో పాటు సమయం ముగిసే వరకు పాఠశాలలోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.● -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ములుగు రూరల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు సమస్యలపై చేస్తున్న ధర్నాకు ఆమె మంగళవారం మద్దతు ప్రకటించి మాట్లాడారు. జీవో నంబర్ 25ను సవరించాలన్నారు, ప్రతీ పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలన్నారు. సబ్జెక్టు వర్కులోడ్కు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకులమర్రి లక్ష్మణ్బాబు, గోవిందనాయక్, రమేష్ రెడ్డి, చంద్రమౌళి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఓర్వలేకనే కాళేశ్వరంపై కుట్రలు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో నిర్మించారని ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి హరీశ్రావు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వివరించిన పవర్పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని వీక్షించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచా రాన్ని తిప్పికొట్టాలన్నారు. కాళేశ్వరం కూలిందని అబద్ధపు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోరిక గోవింద్నాయక్, తాటి కృష్ణ, భిక్షపతి, రమేష్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతి -
పాలెంవాగు దాటుతూ ట్రాక్టర్ పల్టీ
వెంకటాపురం(కె): మండల పరిధిలోని పాత్రాపురం గ్రామ సమీపంలోని పాలెంవాగు దాటుతుండగా ట్రాక్టర్ పల్టీకొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాత్రాపురం గ్రామ సమీపంలోని గోదావరి లంకల్లో పాలెం, పాత్రాపురం, వీరభద్రవరం గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయం చేపట్టారు. ఈ క్రమంలో వీరభద్రవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ గోదావరి లంకలో దుక్కిదున్నే పనుల నిమిత్తం వెళ్లేందుకు పాలెంవాగు దాటుతుండగా వాగు ఉధృతికి ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు పైన కూర్చొని ఉన్న మరో ఇద్దరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
ఫాస్టాగ్ పేరుతో అక్రమ వసూళ్లు
గోవిందరావుపేట: అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ఫాస్టాగ్ పేరుతో వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్ప డుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పొదిళ్ల చిట్టిబాటు అన్నారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ చెక్పోస్ట్ ఎత్తివేయాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజూ జాతీయ రహదారిపై నడుస్తున్న వాహనాల నుంచి ఫారెస్ట్ అధికారులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం టూరిస్ట్ కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి బొగత, మల్లూరులోని హేమాచలక్షేత్రం, మేడారం జాతరకు పర్యాటకులు వస్తుంటారని వివరించారు. ఇదే అదునుగా భావించిన ఫారెస్ట్ అధికారులు దురాశతో అక్రమంగా చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ఒక్కో వాహనానికి రూ.100 నుంచి 200వరకు వసూలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా పస్రా, ఏటూరునాగారం లో ఉన్న రెండు చెక్పోస్ట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోమ మల్లారెడ్డి, కొప్పుల రఘుపతి, తీగల ఆదిరెడ్డి, రత్నం ప్రవీణ్, నరేష్, రవీందర్, నాగరాజు, అరుణ్, కవిత, ఉదయ్, జానీ, శ్రావణ్, ప్రదీప్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చిట్టిబాబు -
పౌష్టికాహారం అందించాలి
● జిల్లా సంక్షేమాధికారి తుల రవి ములుగు రూరల్: బాలసదనంలో ఆశ్రయం పొందిన బాలికలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలసదనంలోని బాలలకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు కల్పించాలని సూచించారు. బాలల నెలవారీ పరిశీలన పత్రాలను తప్పకుండా తయారు చేసుకోవాలన్నారు. అనంతరం బాలికలతో బాలసదనంలో అందుతున్న సౌకర్యాలు, భోజనం వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. బాలల ఎత్తు, బరువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శిరీష, సూపర్వైజర్ కావ్య, డీసీపీఓ ఓంకార్, ఐటీ కోఆర్డినేటర్ మహేశ్, సూపరింటెండెంట్ శ్యామల, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్య పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ఏటూరునాగారం: సీజనల్ వ్యాధులైన చికెన్గున్యా, డెంగీ జ్వరాలపై వైద్యులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో ఆయన సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజనల్లో చికెన్ గున్యా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. జ్వరాల బారిన పడిన రోగులు వెంటనే వైద్యులు, సిబ్బందిని సంప్రదించే విధంగా రోగులను చైతన్య పర్చాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎంసీహెచ్ టీమ్ డాక్టర్లు, ఎపిడమిక్ టీమ్ వైద్యులతో గ్రామాల్లో, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించాలన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. జ్వర బాధితులందరికీ రక్త పరీక్షలు చేసి సంబంధిత పీహెచ్సీలకు సమాచారం అందించాలన్నారు. రోజువారి రిపోర్టును జిల్లా కార్యాలయానికి పంపించాలని ల్యాబ్ టెక్నీషియన్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి చంద్రకాంత్, వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రాం అధికారి రణధీర్, వైద్యులు సుమలత, యమునా, అఖిల, గౌతం పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
కలెక్టర్ ఆకస్మిక పర్యటన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలో కలెక్టర్ దివాకర మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావాణిలో తమకు ఇంటిస్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేయాలని మండల కేంద్రానికి చెందిన వెంకటలక్ష్మి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. సాధ్యాసాధ్యాల మేరకు స్థలం కేటాయించి ఇల్లు నిర్మించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నూగూరు(జి)లో చేపట్టిన డ్రోన్ సర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను రెవెన్యూ అధికారులను ఆడిగి తెలుసు కున్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. అరవింద్కుమార్ను కలిసిన కలెక్టర్ దివాకర ములుగు రూరల్: జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను మంగళవారం కలెక్టర్ దివాకర మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. మాన్సూన్ అప్రమత్తత చర్యల నేపథ్యంలో జిల్లా పరిధిలో చేపడుతున్న విధానాలను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కోటకాల్వ పూడికతీత పనులు చేపట్టాలి గోవిందరావుపేట: లక్నవరం చెరువు పరిధిలోని కోటకాల్వ పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ఆదిరెడ్డి అన్నారు. తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కోట కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ కోటకాల్వ మొత్తం గడ్డి, చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. దీంతో రైతుల పొలాలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని వివరించారు. కోటకాల్వ కింద సుమారు 2500 ఎకరాలు కాస్తులో ఉందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. కాల్వలోని పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే పూడికతీత పనులను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం జిల్లా నాయకులు సోమ మల్లారెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, ఆదిరెడ్డి, ధర్మారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
లోవోల్టేజీ సమస్య పరిష్కారం
వాజేడు: మండలంలో లోవోల్టేజీ సమస్య పరిష్కారం అయినట్లు డీఈ సదానందం తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో సోమవారం 5 ఎంవీఏ ట్రాన్స్ ఫార్మర్ను చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు మొదలైన నేపథ్యంలో లోవోల్టేజీ సమస్య రాకుండా ఉండేందుకు అదనంగా 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు లోవోల్టేజీ సమస్య ఇక ఉండదన్నారు. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ ఉంటుందని వెల్లడించారు. 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మంగళవారం నుంచి విద్యుత్ సరఫరా అవుతుందని వివరించారు. ఆయన వెంట ఏడీఏలు ప్రశాంత్ రెడ్డి, స్వామిరెడ్డి, వాజేడు ఏఈ అర్షద్ అహ్మద్ ఉన్నారు. -
వ్యాధుల నియంత్రణకు కృషి
ములుగు రూరల్: జిల్లాలో కీటక జనిత వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ గోపాల్రావు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్ఓ సోమవారం జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, మానిటరింగ్ సూపర్వైజర్లు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ములుగులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, టీహబ్, ఏటూరునాగారంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వెంకటాపురం(ఎం)లలో చేపట్టిన నిర్ధారణ కేసుల వివరాలు రోజు వారీగా ఆయా ఆరోగ్య కేంద్రాలకు ఇవ్వాలన్నారు. వ్యాధుల నియంత్రణకు యాంటీ లార్వా స్పెయింగ్, ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని గర్భిణుల వివరాలు సేకరించి రెగ్యులర్గా వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అసంక్రమిత వ్యాధుల నాలుగో విడత స్క్రీనింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకాంత్, పవన్ కుమార్, శ్రీకాంత్, రణధీర్, డెమో సంపత్, ఏఎంవో దుర్గారావు, డీపీఎంవో సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి
వెంకటాపురం(కె): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏటూరునగారం ఏపీవో వసంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ పొంది వీరయ్య మాట్లాడారు. ఆదివాసీల చైతన్యమే లక్ష్యంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ పనిచేస్తుందన్నారు. భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయటం వల్ల ఆదివాసీలకు న్యాయం చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంవెంకటాపురం(కె): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీపీఎంవో సత్యనారాయణ అన్నారు. మండల పరిఽధిలోని రామాంజపురం గ్రామంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహంచి మందులను పంపిణీ చేశారు. గ్రామంలో నలుగురు జ్వరపీడితులను గుర్తించి వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు కృష్ణకుమారి, లక్ష్మి, రాంబాబు, ఆశ వర్కర్లు రజిని, గంగా భవాని, బీర భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. సర్క్యులర్ జారీ చేయాలి భూపాలపల్లి రూరల్: స్ట్రక్చర్ మీటింగ్లో జరిగిన ఒప్పందాలపై సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీచేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని కొమురయ్య భవన్లో సోమవారం సంఘం సమావేశం రాంచందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సంక్షేమం, ప్రయోజనాల కోసం ఏఐటీయూసీ నిరంతరం పాటుపడుతుందన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం బాగా పెరిగి పోయిందన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు శ్రీనివాస్, విజేందర్ పాల్గొన్నారు. -
తుల్డా వెదురు.. ఆదాయం ఫుల్
ఏటూరునాగారం: వ్యవసాయంలో మహిళా రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ మేరకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి జాబ్ కార్డు ఉండి 15 గుంటల స్థలం ఉన్న రైతులను గుర్తించి వారికి ఉచితంగా 60 వెదురు మొక్కలను అందజేసి సాగు చేయించనున్నాయి. దీంతో వారు నాలుగేళ్ల పాటు మొక్కలు పెంచినందుకు, ఆ తర్వాత ప్రతీ ఏడాది దిగుబడి కింద లక్షలాది రూపాయలు వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించాయి. జిల్లాలోని తుల్డా వెదురు మొక్కల పెంపకానికి ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైలట్ మండలాలుగా గుర్తించాయి. ప్రతీ మండలంలో 350 మంది రైతుల చొప్పున మొత్తం మూడు మండలాల్లో 1050 మంది రైతులకు ఈ వెదురు రకం మొక్కలను అధికారులు అందించనున్నారు. ఇప్పటికే ఈజీఎస్ ద్వారా మణిపూర్ నుంచి తుల్డా రకానికి చెందిన 60వేల మొక్కలను అధికారులు దిగుబడి చేసుకొని నిల్వ చేశారు. అంతేకాకుండా ఈ మొక్క దాదాపు వ్యాధులు, తెగులు లేని గడ్డి రకం, చావు అనేది కూడా లేని మొక్క. అటవీశాఖ అధికారులు సైతం వెదురు మొక్కల పెంపకానికి ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు. ఆ మొక్కలను ఎంతైనా ఎక్కడికై నా రవాణా చేసుకునే వెసులుబాటును రైతులకు కల్పించింది. ఉపయోగాలు.. వెదురు సాగు వల్ల అత్యధికంగా ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో పాటు అగర్బత్తులు, గృహ ఉపకార వస్తువులు, ఇస్తారాకులు, ప్లేట్లతో పాటు ఇతర ఆయుర్వేద మందుల్లో కూడా దీనిని ఉపయోగించనున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీలతో పాటు స్వచ్చంధ సంస్థలు సైతం రైతులను ఎంపిక చేసుకొని వారే స్వయంగా సాగు చేయించే పద్ధతిని కూడా అమలు చేస్తున్నాయి. పర్యవేక్షణ సెర్ప్ పరిధిలోని గ్రామైక్య సంఘాల సభ్యులకు ఈ వెదరు మొక్కల సాగు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. వీటికి తోడు గ్రూపు, బ్యాంకుల నుంచి రు ణ సదుపాయంతో పాటు పర్యవేక్షణ, మార్కెటింగ్, ఇతర సలహాలు, సూచనలతో పాటు సంఘ సభ్యులకు సెర్ప్ అధికారులు చేదోడు వాదోడుగా ఉంటారు. ఇటు ఈజీఎస్, అటు సెర్ప్ ఉండడం వల్ల మహిళా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.ఒక్కో మహిళా రైతుకు 60 మొక్కలు నెలనెలా ఆదాయం, నాలుగేళ్ల తర్వాత దిగుబడి జిల్లాలో మూడు పైలట్ మండలాలుగా గుర్తింపుఅమలు ఇలా.. ఒక్కో మహిళా రైతుకు గ్రామైక్య సంఘం ద్వారా ఈ మొక్కలను అందజేసి ఒక మొక్క నాటినందుకు నెలకు రూ.119లు, మొక్కకు నీరు పోసి కాపాడినందుకు రూ.12లు, ఇతర మెంటనెన్స్కు రూ. 1.50ల చొప్పున అందజేస్తారు. ఒక్కో రైతుకు 30 నెలల పాటు ఈ పై డబ్బులను క్రమం తప్పకుండా చెల్లిస్తారు. అలాగే ఒక మహిళా రైతుకు కేవలం వెదురు మొక్కలను పెంచినందుకు రూ.27 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత దిగుబడి వచ్చిన వెదురు కర్రను విక్రయిస్తే మార్కెట్లో టన్నుకు వచ్చి రూ.1.50లక్షల వరకు ఆదాయం రానుంది. ఈ ఆదాయం సుమారుగా 25 సంవత్సరాలు నిర్వీరామంగా రావడంతో పేద మహిళా రైతులు కేవలం నాలుగైదు సంవత్సరాల్లో లక్షాధికారి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.తుల్డా వెదురు సాగుతో అధిక లాభాలు.. తుల్డా వెదురు సాగుతో అధిక లాభాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వెదురు సాగుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో ఈజీఎస్, సెర్ప్తో పాటు స్వచ్చంధ సంస్థలను కూడా భాగస్వాములను చేస్తున్నాయి. ఆక్సిజన్తో పాటు మంచి దిగుబడిని ఇచ్చే పంట, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి. – చరణ్రాజ్, ఏపీఓ, ఏటూరునాగారం -
భక్తులు వర్సెస్ సిబ్బంది
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కొంతమంది భక్తులు, ఆలయ సిబ్బంది మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. గొడవకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రసీదు ఇవ్వాలిందే.. హైదరాబాద్(మెదక్)కు చెందిన భక్తులు సోమవారం సాయంత్రం లక్ష్మీనర్సిహస్వామిని దర్శించుకునేందుకు హేమాచలక్షేత్రానికి కారులో వచ్చారు. ఆలయానికి వచ్చిన వారి కారును మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆపి తాము ఆలయ సిబ్బందిమని కారు పార్కింగ్ రుసుము డబ్బులు ఇవ్వమని అడిగారు. రసీదు ఇస్తే తాము చెల్లిస్తామని చెప్పడంతో రసీదు ఇవ్వమని డబ్బులిస్తేనే కారును వెళ్లనిస్తామని దురుసుగా వ్యవహరించారు.. ఎదురు ప్రశ్నించిన తమపై దుర్బాషలాడి దాడి చేశారని తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహించారని ఆరోపించారు. ఈ క్రమంలో సిబ్బందికి, భక్తులకు మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకోవడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అర్చకులు గుట్టపైకి చేరుకుని భక్తులకు, సిబ్బందికి సర్ధిచెప్పి గొడవను నివారించి భక్తులను అక్కడి నుంచి పంపించారు. విచారణ జరిపి చర్య తీసుకుంటాం.. గుట్టపై సిబ్బంది, భక్తుల మధ్య జరిగిన గొడవ విషయం తెలిసిందే. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్చలు జరుగకుండా శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రావణం సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణ అధికారిహేమాచల క్షేత్రంలో మద్యంమత్తులో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలుభక్తులే దుర్భాషలాడారు.. గుట్టపైకి వచ్చి భక్తుల కారుకు సంబంధించిన పార్కింగ్ రుసుము అడిగితే రసీదు అడిగారని.. రసీదు బుక్కు తెప్పిస్తుండగానే ఎందుకు ఇవ్వాలంటూ మద్యం తాగి ఉన్న భక్తులే తమపై దుర్భాషలాడి దాడి చేశారని సిబ్బంది అజయ్ తెలిపారు. భక్తులు చేసిన ఆరోపణలు అవాస్తవమని వివరించారు. ఈ గొడవకు సంబంధించిన ఫొటోలు సో షల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టా రని వివరించారు. గొడవకు సంబంధించిన ఫొటోలు, సిబ్బందికి చెందిన వాహనం అంటు అందులో మద్యం, వాటర్ బాటిళ్లు ఉన్న ఫొటోలను సైతం పెట్టడంతో విషయం చర్చనీయాంశంగా మారింది. -
కాళేశ్వరాలయంలో శ్రావణ శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో శ్రావణశోభ నెలకొంది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్ల దేవాలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. సాయంత్రం గర్భగుడిలో భక్తులు లక్షపత్రి పూజలను ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలో ఆలయం మారుమోగింది. దీంతో భక్తులు సందడి కనిపించింది. -
సమష్టి కృషితోనే రాష్ట్రస్థాయి అవార్డు
ములుగు రూరల్: సమష్టి కృషితోనే సంపూర్ణతా అభియాన్లో రాష్ట్రస్థాయి అవార్డును సాధించినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. సెర్ప్ ఆధ్వర్యంలో శనివారం రాజ్భవన్లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర గవర్నర్ జిష్ణుదేవ్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమష్టి కృషి ఫలితంగానే జిల్లాకు అవార్డు దక్కిందన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. తంగేడు మైదానంలో పంద్రాగస్టు వేడుకలకు స్టేజీ ఏర్పాటు ప్రొటోకాల్ ప్రకారం కూర్చునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు. వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని సూపరింటెండెంట్తో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో రిజిస్టర్లు, ఓపీ రికార్డులను పరిశీలించి మాట్లాడారు. వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. నిత్యం ఓపీ 150 నుంచి 200 మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఆస్పత్రులో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నులిపురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలి
వెంకటాపురం(ఎం): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ బీజేపీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ఆరు గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. అధికారం కోసం మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్నాయని వివరించారు. కేవలం బీజేపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న గరీబ్ కల్యాణ్ యోజన, ఉజ్వల్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, కారుపోతుల యాదగిరి, కొత్త సురేందర్, భూక్య జవహర్లాల్, కృష్ణాకర్రావు, రవీంద్రాచారి, రవీందర్రెడ్డి, రమేష్, ఇమ్మడి రాకేష్, మల్లేష్, తిరుపతిరెడ్డి, విశ్వనాథ్, రెడ్డి శ్రీనివాస్, గంగుల రాజ్కుమార్ పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి -
సత్వరమే పరిష్కరించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణి, గిరిజన దర్బార్లో బాధితులు అందజేసిన దరఖా స్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో 65, గిరిజన దర్బార్లో 26 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. గిరిజనదర్బార్లో వచ్చిన వినతులు భూపాలపల్లి జిల్లా గుర్రంపేట గ్రామం నుంచి ములుగు జీసీసీలో గోదాం అసిస్టెంట్, డ్రైవర్గా విధులు నిర్వహిస్తుండగా నాలుగేళ్లుగా విధులు సక్రమంగా నిర్వహించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చి విధుల నుంచి తొలగించారని తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పీఓ చిత్రామిశ్రాకు గిరిజన దర్బార్లో విన్నవించారు. అలాగే కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామం నుంచి సీఆర్టీ ఉద్యోగం కోసం, మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ నుంచి కాంట్రాక్ట్ అటెండర్ను ఏటూరునాగారం, వాజేడు గురుకులాలకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం వీరాపురం నుంచి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇప్పించాలని విన్నవించారు. మంగపేట మండలం నుంచి వికలాంగుల పింఛన్, విద్యుత్ మోటరుకు కనెక్షన్ ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎస్ఎస్తాడ్వాయి మండలం నుంచి ఆదివాసీ హక్కుల పోరాట సమితికి జెండాలు మంజూరు చేసేందుకు ఆదివాసీ దినోత్సవాన్ని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఊరట్టంలో ట్రైబల్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. వెంకటాపురం(కె) మండలం పాత్రాపురం బీట్ లో సాగులో ఉన్న అటవి భూమికి హక్కుపత్రాలు ఇవ్వాలని, వాజేడు మండలం గుమ్మడి దొడ్డిలో అక్రమంగా భూ మి మీదకు వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేందర్ పాల్గొన్నారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల వివరాలుభూ సమస్యలు 20గృహ నిర్మాణశాఖ 15ఉపాధి కల్పన 07పింఛన్లు 09తదితర సమస్యలు 14ప్రజావాణి, గిరిజన దర్బార్లో వినతుల వెల్లువ స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా మొత్తంగా వచ్చిన దరఖాస్తులు 91 ఈ ఫొటోలోనిది గోవిందరావుపేట మండల పరిధిలోని మొద్దులగూడెంకు చెందిన జల్లెల్ల రమేశ్. నిరుపేద కుటుంబానికి చెందిన అతను రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై వెన్నెముక దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. తల్లితో పాటు నివసించేందుకు ఇల్లు కూడా లేదు. గతంలో కలెక్టర్ చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేయించారు. అది పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి భర్త అనార్యోగంతో ఉండగా భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాం. ఈ క్రమంలో తమ భూమిని కాజేశారని కోర్టును ఆశ్రయించాను. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి భూమి తిరిగి ఇప్పించాలి. – ఉప్పల లక్ష్మీ, వెంకటాపురం(కె) మండలం -
స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
● అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ వెంకటాపురం(కె): స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్కావెంజర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యన్నమల్ల ప్రవీణ్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం స్కావెంజర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కారించాలన్నారు. ఆనంతరం స్కావెంజర్ల మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూనెం నిర్మల, కార్యదర్శిగా ఆమని, ఉపాధ్యక్షురాలిగా కెక్కం నాగమణిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రమణ, లక్ష్మి, సమ్మక్క, సరోజిని తదితరులు ఉన్నారు. -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత ఆలయ చరిత్రను వివరించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. వారి స్తోమత మేరకు అన్నదాన నిర్వహణకు విరాళాలను అందజేశారు. -
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు
● ఎస్పీ శబరీశ్ ములుగు రూరల్: మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష తప్పదని ఎస్పీ శబరీశ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ప్రతిరోజూ ప్రమాదాల నివారణకు డ్రంక్అండ్డ్రైవ్ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. తరుచూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని వివరించారు. జూలై మాసంలో 456 డ్రంక్ అండ్ డ్త్రెవ్ కేసులు నమోదు చేసి నిందితులకు శిక్షపడేలా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో మద్యం సేవించి పట్టుబడిన వారిలో 17మందికి రెండు రోజులు జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే వారిపై కేసులు నమోదు చేస్తామని వివరించారు. జిల్లాలో ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహనాల తనిఖీలు నిర్వహించనున్నట్లు వివరించారు. మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తులకు కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టుకు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించి మొదటి, రెండోసారి పట్టుబడిన వారి మోతాదును బట్టి శిక్షలు విధించబడుతాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యులు అవుతారని ఎస్పీ శబరీశ్ హెచ్చరించారు. -
స్థానికం తర్వాతే..
పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పరిశీలనలో ఉన్న డీసీసీ అశావహుల పేర్లు ఇవే... వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మే నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.డీసీసీలకు కొత్త సారథులు!? బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం పునరాలోచనలో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం -
ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
కన్నాయిగూడెం: మావోయిస్టుల వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. దీంతో ఆదివారం చివరి రోజు మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు వెళ్లి వచ్చే రహదారులపై ప్రత్యేక నిఘా వేసి ఉంచారు. వచ్చి పోయే వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముత్యాలమ్మతల్లికి మొక్కులు వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని పెరిక వీధిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం ఆదివారం కావటంతో గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి తెల్లావారుజామునే భక్తిశ్రద్ధలతో బోనం వండుకుని ఆలయానికి తీసుకెళ్లి మొక్కును చెల్లించుకున్నారు. పాడిపంట బాగా పండాలని, పిల్లాపాపలతో సల్లంగా ఉండాలని కోరుకుని మొక్కులను చెల్లించుకున్నారు. యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా రమేష్ వాజేడు: యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన నల్లగాసి రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరాకుల నాగభూషయ్య ఆదివారం రమేష్కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గొల్ల కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని వెల్ల డించారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు. కళాశాలకు భవనం మంజూరు చేయాలి వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు భవనం మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చొక్కాల గ్రామంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. మండలంలో రోడ్లు గుంతలమయంగా మారాయని మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని కోరారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీపీఎం చేపట్టిన సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలు, హర్ష, అభిలాష్, హేమంతి, నిరంజన్, రామ్, చరణ్, నాగచైతన్య తదితరులు పాల్గొన్నారు. రాజబాబు గౌడ్కు సన్మానం కాళేశ్వరం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ను వారి స్వగహంలో కాళేశ్వరం గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు కొండ్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు పొన్నం లింగయ్య గౌడ్, గంట వెంకటస్వామి గౌడ్, బైరి రాజబాబు గౌడ్, దూది వెంకటస్వామి గౌడ్, సదాశివ్గౌడ్ పాల్గొన్నారు. -
రుద్రేశ్వరున్ని దర్శించుకున్న రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్లో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. -
మహాసభలను జయప్రదం చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు ములుగు రూరల్: రేపు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబోయే సీపీఐ 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులాలు మతాల పేరుతో గొడవలు సృష్టిస్తుందని వివరించారు. మతతత్వవాదులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపాల రవీందర్, అంజద్ పాషా, అచంటి ప్రసాద్, ముత్యాల రాజు, కొమురయ్య, రవి, గోపి తదితరులు పాల్గొన్నారు. -
టేకుకలప స్వాధీనం
వెంకటాపురం(కె): మండలం నుంచి రెండు వాహనాల్లో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న టేకుకలపను స్వాధీనం చేసుకున్నట్లు మండల అటవీశాఖ అధికారి వంశీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను వెల్లడించారు. రెండు పికప్ వాహనాల్లో అక్రమంగా టేకుకలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఒక వాహనాన్ని, వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో మరో వాహనాన్ని అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు వాహనాల్లో 16 టేకు మొద్దులు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారుగా రూ.4లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టేకు కలప, వాహనాలను అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు.