ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సాధారణంగా ప్రజలు జిల్లా కేంద్రానికి లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమస్యలు వినిపించే విధానానికి భిన్నంగా ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాలకు వెళ్తుంది. అక్కడ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంతో మారుమూల, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలు ప్రజాదర్బార్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి. – ధనసరి సీతక్క,
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి


