ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మల సన్నిధిలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు సమర్పించారు. ఎత్తు బంగారం, యాటలతో మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల రీజియన్ సంయుక్త అధికారి బొంగిని రాజేశ్గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేశ్లు కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.


