మంగపేట: పల్లె దవాఖానాల్లో ప్రజలకు కనీస వైద్యం అందడంలేదు. మంగపేట పీహెచ్సీ పరిధిలోని చెరుల్లి, బ్రాహ్మణపల్లి పీహెచ్సీ పరిధిలోని దోమెడ పల్లె దవాఖానలను గురువారం సాక్షి విజిట్ చేసింది. చెరుపల్లిలోని పల్లె దవాఖానాలో వైద్యాధికా రి, ఏఎన్ఎం హాజరుకాలేదు. ఆశాకార్యకర్త చంద్రవాణి మాత్రమే ఉన్నా రు. దోమెడ పల్లె దవాఖానకు తాళం వేసి ఉంది. దోమెడలో మూడేళ్లుగా వైద్యాధికారిని నియమించలేదని.. దీంతో వారంలో రెండు సార్లు ఏఎన్ఎం వస్తుందని, ఆశాకర్యకర్తలు తాళం తీస్తారని గ్రామస్తులు తెలిపారు.


