● బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం
గోవిందరావుపేట: క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం పెంపొందుతుందని చల్వాయి 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ మేరకు బెటాలియన్ ప్రాంగణంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన క్రీడాపోటీలకు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోటీల్లో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారాం, సహాయక కమాండెంట్లు కృష్ణప్రసాద్, ధర్మారావు, ఆర్ఐలు భాస్కర్, కిరణ్ కుమార్, శ్రీనివాసచారి, వెంకటేశ్వర్లు, సాయిబాబు, శ్రీధర్, స్వామితో పాటు అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


