కమ్ముకుంటున్న మబ్బులు
ఆందోళనలో రైతులు
సమస్యలు పరిష్కరించాలి
విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
మిర్చి పంటపై పరదాలు కప్పుతున్న రైతులు
వెంకటాపురం(కె): ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో మబ్బులు ఒక్కసారిగా కమ్ముకోవటంతో మిర్చి రైతులు భయాందోళనకు గురయ్యారు. రెండేళ్లుగా దిగుబడి లేక, మిర్చికి గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ ఏడాది పంటకు మంచి ధర ఉండడంతో అప్పుల ఊబిలోంచి బయట పడతామని ఆశ పడుతున్న రైతులకు ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో కల్లాల్లో ఆరబోసిన పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. మిర్చి పంట తడవకుండా కాపాడుకునేందుకు పరదాలు కప్పారు.
కమ్ముకుంటున్న మబ్బులు


