అకాలవర్షం.. రైతుల ఆగమాగం
మంగపేట/వెంకటాపురం(కె): అకాలవర్షంతో మిర్చి రైతులు ఆగమాగం అవుతున్నారు. మంగపేట, వెంకటాపురం(కె) మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సంతో పాటు మోస్తరుగా వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆయా మండలాల పరిధిలో వందల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేసి కోతలు కోసి మిర్చి పంటను కల్లాల్లో ఆరబెట్టారు. ఈ క్రమంలో అకాల వర్షం కారణంగా పంటను కాపాడుకునేందుకు రైతులు టార్ఫాలిన్లతో పరుగులు తీసి పంటపై కప్పి కాపాడుకున్నారు. పలుచోట్ల గాలి దుమారానికి పరదాలు లేచిపోవడంతో కొంతమేర పంట తడిసిపోయింది. తెల్లవారుజాము వరకు చిరుజల్లులు పడిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
అకాలవర్షం.. రైతుల ఆగమాగం


